IPL 2021 Second Phase
-
Hardik Pandya: అలా జరగనట్లయితే పెట్రోల్ పంపులో పనిచేసేవాడిని.. నిజం..
Otherwise I would be working at a petrol pump Says Hardik Pandya: ఆటగాడి జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. వృత్తిగతంగా ముందుకు వెళ్లేందుకు, ప్రేరణ పొందేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నాడు. డబ్బు కారణంగానే జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పుకొచ్చాడు. కాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా టీమిండియా, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్గా ఎదిగిన సంగతి తెలిసిందే. అతడి సోదరుడు కృనాల్ పాండ్యా సైతం క్రికెటర్గా మంచి గుర్తింపు పొందాడు. భారత జట్టుకు ఆడుతున్న ఈ అన్నదమ్ములు.. ఐపీఎల్లోనూ ఒకే టీమ్కు ప్రాతినిథ్యం వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా... ‘‘ఐపీఎల్ వేలంలో భారీ మొత్తంలో ఆఫర్ దక్కించుకునే ఆటగాళ్లు.. తాము ఆ ధరకు అమ్ముడుపోయేందుకు అర్హులమనే భావనలోకి వెళ్తారు కదా? ఇలాంటివి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసే, ఆలోచనలను పక్కదోవ పట్టించే అంశాలుగా పరిణమిస్తాయి కదా’’ అన్న ప్రశ్న హార్దిక్కు ఎదురైంది. అలా అయితే పెట్రోల్ పంపులో పనిచేసేవాడిని ఇందుకు బదులుగా... ‘‘అసలేం జరుగుతుందో అర్థం చేసుకోగలిగే శక్తి మనకు ఉండాలి. నేను, కృనాల్ దృఢచిత్తం కలిగిన వాళ్లం. ఐపీఎల్లో కచ్చితంగా డబ్బు దొరుకుతుందనే విషయం మాకు తెలుసు. అయితే, డబ్బు వచ్చినంత మాత్రాన ఆలోచనలు మారకూడదు. కాళ్లు నేల మీదే ఉండాలి. డబ్బు మంచిది సోదరా! ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ. నాకు ఇలాంటి అవకాశాలు రాకపోయినట్లయితే.. ఇప్పటికి ఏ పెట్రోల్ పంపులోనూ పనిచేస్తూ ఉండేవాడిని. నేనేమీ సరదాకి ఈ మాట చెప్పడం లేదు. నా వరకు కుటుంబమే నా మొదటి ప్రాధాన్యత. నా కుటుంబ సభ్యులకు మంచి జీవితం ఇవ్వడానికి నేను ఇలాంటి పనులు చేసేందుకు వెనుకాడను’’ అని పేర్కొన్నాడు. కాబట్టి ఆటతో పాటు డబ్బు కూడా ముఖ్యమే అని చెప్పుకొచ్చాడు. డబ్బు దండిగా దొరకనట్లయితే... ఎంత మంది క్రికెట్ ఆడతారో తనకైతే తెలీదంటూ హార్దిక్ పాండ్యా.. తనదైన స్టైల్లో పంచ్ వేశాడు. మరి మీరేమంటారు?! కాగా ఐపీఎల్-2021లో 11 మ్యాచ్లలో 127 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా... టీ20 వరల్డ్కప్ టోర్నీకి సిద్ధమవుతున్నాడు. చదవండి: Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న పృథ్వీ షా.. ధర ఎంతంటే! ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలం సందర్భంగా హార్దిక్ పాండ్యా షేర్ చేసిన వీడియో View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
Ruturaj Gaikwad: బ్రావో డాన్స్.. రుతుకు ఘన స్వాగతం... ఈ వీడియోలు చూశారా?
IPL 2021 Winner CSK Moments Goes Viral: ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ ముగిసినా సామాజిక మాధ్యమాల్లో ఆ సందడి ఇంకా తగ్గలేదు. క్యాష్ రిచ్ లీగ్కు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ విజేత చెన్నై సూపర్కింగ్స్ విజయోత్సాహానికి సంబంధించిన వీడియో అన్నింటికంటే హైలెట్గా నిలిచింది. మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్రోఫీ అందుకోగానే.. సీఎస్కే సంబరాలు అంబరాన్నంటాయి. దీపక్ చహర్ ధోనికి ఎదురెళ్లి ట్రోఫీని చేతుల్లోకి తీసుకోగా.. ‘ఛాంపియన్స్’ అంతా ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చారు. Courtesy: CSK Twitter/IPL ఈ సందర్భంగా క్రికెటర్ల కుటుంబాలు ఒక్కసారిగా మైదానంలోకి వచ్చాయి. ధోని కుమార్తె జీవా, రాబిన్ ఊతప్ప కొడుకు తండ్రులతో కలిసి సందడి చేశారు. ఇక డ్వేన్ బ్రావో, గౌతమ్ కిష్టప్ప కలిసి కాసేపు స్టెప్పులేశారు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ తర్వాత అంతా కలిసి సెల్ఫీలు దిగారు. ఇక రుతురాజ్కు ఇంటి వద్ద ఘన స్వాగతం లభించిన వీడియో కూడా సీఎస్కే ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి! 🦁 Vamsam!#SuperCham21ons #CSKvKKR #WhistlePodu #Yellove 💛 pic.twitter.com/iF3BflBFaY — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 17, 2021 Mersal Arasan 🔙 Home 💛#WhistlePodu #Yellove 🦁 @Ruutu1331 pic.twitter.com/SlOFnkvF9o — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 17, 2021 -
Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న పృథ్వీ షా.. ధర ఎంతంటే!
Prithvi Shaw Gifts Himself BMW Car: టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఖరీదైన కారు కొన్నాడు. దాదాపు 68.50 లక్షల విలువ గల(ఎక్స్ ఫోరూం ధర) బీఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టరిస్మోను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న 21 ఏళ్ల పృథ్వీ షా... కారు ముందు దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘‘అట్టడుగు స్థాయి నుంచి మొదలై.. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం’’ అంటూ ఉద్వేగభరిత కామెంట్ జత చేశాడు. కాగా మహారాష్ట్రలోని థానేలో సాధారణ కుటుంబంలో జన్మించిన పృథ్వీ షా... దేశవాళీ క్రికెట్లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో ఈ ముంబై ఓపెనర్ డబుల్ సెంచరీ సాధించాడు. 152 బంతుల్లో 227 పరుగులు చేసి సంజూ శాంసన్ (212) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు. అంతేగాక లిస్టు ఏ క్రికెట్ (పురుషులు)లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్(శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీ)గా కూడా నిలిచాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా 15 మ్యాచ్లలో 479 పరుగులు చేసి సత్తా చాటాడు. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ యువ ప్లేయర్ తనకు తాను బీఎండబ్ల్యూ కారును గిఫ్టుగా ఇచ్చుకున్నాడు. బీఎండబ్ల్యూ 6 సిరీస్ జీటీ స్పెసిఫికేషన్స్ ►పెట్రోల్, డీజిల్ వర్షన్లో లభ్యం ►ఇంజిన్: 1995- 2993సీసీ ►టాప్ స్పీడ్: 220- 250 కేఎమ్పీహెచ్ చదవండి: Yuvraj Singh Arrested: క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..! View this post on Instagram A post shared by PRITHVI SHAW (@prithvishaw) -
Venkatesh Iyer: మాటల్లో వర్ణించలేను.. అందుకే ఆయనను...
Venkatesh Iyer shares experiences of meeting MS Dhoni: యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సీజన్ రెండో అంచెలో అద్భుతంగా రాణించాడు కోల్కతా నైట్రైడర్స్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి... ఫైనల్ చేరడంలో తన వంతు సాయం చేశాడు. ఈ సీజన్లో మొత్తంగా 10 మ్యాచ్లు ఆడిన వెంకటేశ్.. 370 పరుగులతో సత్తా చాటాడు. ఈ క్రమంలో ఈ యువ ఆల్రౌండర్కు బంపర్ ఆఫర్ వచ్చింది. టీ20 వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా నెట్ బౌలర్గా అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఈ విషయంపై స్పందించిన వెంకటేశ్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని, తనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. శక్తిమేర రాణించి... భవిష్యత్తుకు బాటలు వేసుకుంటానని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ తనకు ఎప్పుడు, ఎలాంటి అవకాశం ఇచ్చినా అందిపుచ్చుకుంటానని పేర్కొన్నాడు. ఇక టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనితో మాట్లాడటం తన జీవితంలో గొప్ప విషయమని వెంకటేశ్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2021 సీఎస్కే- కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా... ధోనితో ముచ్చటించే అవకాశం వచ్చిందన్న వెంకటేశ్.. ఆయనను మిస్టర్ కూల్ అని ఎందుకు అంటారో అర్థమైందన్నాడు. ‘‘ఆయనను చూడగానే సంతోషంతో నాకు మాటలు రాలేదు. మైదానంలో ఆయన ఎలా ఉంటారు... ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూసే అవకాశం వచ్చింది. అందరూ ఆయన గురించి ఎలా అయితే మాట్లాడుకుంటారో అలానే ఉంటారు. చాలా కూల్గా.. కామ్గా... ఆయన నిజంగా ‘‘కెప్టెన్ కూల్’’’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ధోని కెప్టెన్సీలోని సీఎస్కే ... ఐపీఎల్-2021 ఫైనల్లో కేకేఆర్ను ఓడించి నాలుగోసారి ట్రోఫీని గెలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
నేను ఇంకా ఎక్కడికీ వెళ్లడం లేదు: ధోని
ప్రతీ ఫైనల్ ప్రత్యేకమే. ఫైనల్లో ఎక్కువసార్లు ఓడిన జట్టు కూడా మాదే. అయితే పడ్డ ప్రతీసారి కోలుకొని పైకి లేవడం అన్నింటికంటే ముఖ్యం. మేం ఆటగాళ్లను మారుస్తూ వచ్చాం. ప్రతీసారి ఒక మ్యాచ్ విన్నర్ బయటకు వచ్చి అద్భుతాలు చేశారు. నిజాయితీగా చెప్పాలంటే జట్టు సమావేశాల్లో మేం పెద్దగా మాట్లాడుకోం. ఏమైనా ఉంటే ఒక్కొక్కరితో విడిగా చెప్పడమే. మేం ఎక్కడ ఆడినా మాకు అండగా నిలిచే చెన్నై అభిమానులకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా చెన్నైలో ఆడుతున్నట్లే అనిపించింది. వచ్చేసారి రెండు కొత్త జట్లు వస్తున్నాయి కాబట్టి ఆటగాళ్లను కొనసాగించడం గురించి ఏమీ చెప్పలేను. నేను ఇదే జట్టుతో కొనసాగుతానా లేదా అనేది సమస్య కాదు. ఫ్రాంచైజీ కోసం ఒక పటిష్టమైన జట్టును తయారు చేయడం ముఖ్యం. సరిగ్గా చెప్పాలంటే వచ్చే 10 ఏళ్లు జట్టును నడిపించగల ప్రధాన బృందాన్ని ఎంచుకోవడం ముఖ్యం. నా వైపు నుంచి గొప్ప ఘనతలు ఇచ్చి వెళుతున్నానని అంటున్నారు. కానీ నేను ఇప్పుడే పోతే కదా. –ఎమ్మెస్ ధోని, (చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్) -
ధోని పక్కా వ్యూహం.. వారి వయసు 35 ఏళ్లకు పైనే..
సాక్షి క్రీడా విభాగం: ‘మేం వచ్చేసారి బలంగా తిరిగొస్తాం... అభిమానులకు ఇదే నా సందేశం’... గత ఏడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్య ఇది. జట్టుపై, తనపై ఎంత నమ్మకముంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు. ఎందుకంటే అతను ధోని కాబట్టి! చూస్తుంటే టీమ్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. వయసు పెరిగిపోయి, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్లతో ఈసారే కాలేదు, వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు. కానీ ఇలాంటి స్థితి నుంచి టీమ్ను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం. సీఎస్కేకు తొలి సీజన్ నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ ధోనినే. జట్టు గెలిచినా, ఓడినా, చాంపియన్షిప్లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే నమ్మింది. ఇన్నేళ్ల విజయాల్లో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. కానీ మారనిది ధోని, అతని వ్యూహ చతురతే! సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో 40 ఏళ్ల ధోని బ్యాటింగ్ చూస్తే సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లు, ఒక కెప్టెన్తో ఆడినట్లు ఉంది. కేవలం నాయకత్వం కారణంగానే అతను టీమ్లో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీమ్ ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం! చెన్నై టీమ్లో ఐదుగురు ఆటగాళ్లు 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. టి20లు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది. అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు. వీరంతా టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 37 ఏళ్ల డు ప్లెసిస్ ఏకంగా 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్గా శుభారంభాలు అందించాడు. 38 ఏళ్ల బ్రావో 14 కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు. 34 ఏళ్ల సీనియర్, అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేశ్ రైనా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో 35 ఏళ్ల రాబిన్ ఉతప్పను తుది జట్టులోకి తీసుకొని చేసిన వ్యూహం సూపర్గా పేలింది. తొలి క్వాలిఫయర్లో మెరుపు బ్యాటింగ్ చేసిన ఉతప్ప, ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళుతున్న సమయంలో 3 సిక్సర్లతో ఆట మార్చేశాడు. 36 ఏళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక ఐపీఎల్ గెలిచిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచిన 34 ఏళ్ల మొయిన్ అలీని కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్ జట్టుకు ఎంతో పనికొచ్చాయి. ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది. ఇక టీమ్ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు రుతురాజ్ గైక్వాడ్. గత ఏడాది ఐపీఎల్ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైనా... చివరి మ్యాచ్లలో సత్తా చాటాడు. ఈసారి తనలోని పూర్తి స్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా 635 పరుగులు సాధించడం చెన్నై టైటిల్ విజయంలో కీలకంగా మారింది. వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. చివరగా... వచ్చేసారి ఐపీఎల్లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే విజేతలుగా నిలిచిన ఈ టీమ్లోని సభ్యుల్లో కూడా ఎంత మంది మళ్లీ ఐపీఎల్లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే. ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్ఫుల్ టీమ్ ఒక్క చోటికి చేరడం సహజంగానే కష్టం. ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమీ కాదు. చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు, సగటు క్రికెట్ అభిమాని కూడా... ఏం ఆడిందిరా ఈ టీమ్ అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది. -
నాలుగోసారి ‘కింగ్స్’
ఐపీఎల్లో మళ్లీ ‘విజిల్ పొడు’... పసుపు మయమైన దుబాయ్ మైదానంలో తమ ఆరాధ్య ఆటగాడు మాహి మళ్లీ ఐపీఎల్ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తుంటే... దసరా రోజున చెన్నై క్రికెట్ అభిమానుల పండగ ఆనందం రెట్టింపైంది... అనుభవం, అద్భుత నాయకత్వం వెరసి చెన్నై మరోసారి ధనాధన్ లీగ్లో తమ విలువేంటో చూపించింది. తుది పోరులో అన్ని రంగాల్లో మెరిసి నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. మెరుపు బ్యాటింగ్తో మొదటి భాగంలోనే విజయానికి బాటలు వేసుకున్న జట్టు, బౌలింగ్లో కీలక సమయంలో సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టింది. ఫైనల్ పోరులో తమదైన పాత్ర పోషించిన ప్రతీ ప్లేయర్ హీరోలుగా నిలిచారు. అటు కోల్కతా నైట్రైడర్స్ ఆరంభంలోనే భారీగా పరుగులు సమరి్పంచుకొని పట్టు కోల్పోయింది. నమ్ముకున్న బౌలర్లంతా విఫలం కాగా... బ్యాటింగ్లో టోర్నీ ఆసాంతం వెంటాడిన మిడిలార్డర్ వైఫల్యం అసలు సమయంలో పెద్ద దెబ్బ కొట్టింది. ఫలితంగా తమ మూడో ఫైనల్ను ఓటమితో ముగించాల్సి వచి్చంది. దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నాలుగో టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మొయిన్ అలీ (20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 31; 3 సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు. అనంతరం కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శుబ్మన్ గిల్ (43 బంతుల్లో 51; 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఒకదశలో 91/0తో లక్ష్యం దిశగా సాగిన జట్టు... 34 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ కోల్కతా జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... సీజన్ మొత్తంలో ఆడిన తరహాలోనే చెన్నైకి మరోసారి ఓపెనర్లు రుతురాజ్, డు ప్లెసిస్ శుభారంభం అందించారు. షకీబ్ ఓవర్లో రుతురాజ్ వరుసగా 4, 6 కొట్టగా, అదృష్టం కలిసొచ్చిన డు ప్లెసిస్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. నరైన్ ఈ జోడీని విడదీసిన సమయంలో కోల్కతా స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది. అయితే మూడో స్థానంలో వచి్చన రాబిన్ ఉతప్ప ఉన్న కొద్దిసేపు మెరుపు బ్యాటింగ్తో ఆట గమనాన్ని మార్చేశాడు. మరోవైపు ఫెర్గూసన్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన 35 బంతుల్లోనే డు ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ బౌలింగ్లో ఉతప్ప వెనుదిరిగినా అలీ దూకుడుతో చెన్నై ఇన్నింగ్స్లో జోరు తగ్గలేదు. శివమ్ మావి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అలీ, వరుణ్ చక్రవర్తి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ కొట్టాడు. ఫెర్గూసన్ ఓవర్లో 19 పరుగులు రాబట్టి కింగ్స్ పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి బంతికి డు ప్లెసిస్ అవుటైనా... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల్లో (61, 63, 68) అతను తన పాత్రను సమర్థంగా పోషించాడు. ఓపెనర్లు మినహా... చెన్నైతో పోలిస్తే ఛేదనలో కోల్కతా మరింత దూకుడు కనబర్చింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వరుస బౌండరీలతో జోరును ప్రదర్శించగా, గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహర్, శార్దుల్ ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టాడు. పవర్ప్లేలో 55 పరుగులు రాగా, జడేజా ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. అయితే ఈ దశలో శార్దుల్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతని ఓవర్లో భారీ షాట్కు ప్రయతి్నంచిన వెంకటేశ్... జడేజా అద్భుత క్యాచ్కు వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడగా, అదే ఓవర్లో రాణా (0) అవుటయ్యాడు. నరైన్ (2), కార్తీక్ (9), షకీబ్ (0), గాయంతో బ్యాటింగ్కు దిగిన త్రిపాఠి (2), పేలవ ఫామ్లో ఉన్న కెపె్టన్ మోర్గాన్ (4) వరుసగా విఫలమయ్యారు. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్ వేగంగా పతనమైంది. చివర్లో 21 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన శివమ్ మావి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫెర్గూసన్ (18 నాటౌట్) కొన్ని మెరుపు షాట్లు ఆడి 39 పరుగులు జోడించినా అది వృథా ప్రయాసే అయింది. డు ప్లెసిస్కు అవకాశం ఇచి్చ... సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ చేసిన పెద్ద తప్పు చెన్నైకి ఊపిరి పోసింది. షకీబ్ బౌలింగ్లో డు ప్లెసిస్ ముందుకు దూసుకు రాగా, సునాయాస స్టంపింగ్ అవకాశాన్ని కార్తీక్ వదిలేశాడు. ఆ సమయంలో ప్లెసిస్ స్కోరు 4 మాత్రమే! ఆ తర్వాత అతనే భారీ స్కోరుకు కారణమయ్యాడు. కోల్కతా ఆటగాడు వెంకటేశ్ ‘0’ వచి్చన ఇచ్చిన క్యాచ్ను అనూహ్యంగా ధోని వదిలేసి అతని అర్ధ సెంచరీకి అవకాశం ఇచి్చనా... చివరకు అది నష్టం కలిగించలేదు. మరోవైపు 27 పరుగుల వద్ద గిల్ క్యాచ్ను రాయుడు అందుకున్నా... బంతి స్పైడర్ క్యామ్ వైర్కు తగిలి రావడంతో అంపైర్లు డెడ్బాల్గా ప్రకటించడం ధోనికి అసహనం తెప్పించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మావి (బి) నరైన్ 32; డు ప్లెసిస్ (సి) వెంకటేశ్ (బి) మావి 86; ఉతప్ప (ఎల్బీ) (బి) నరైన్ 31; మొయిన్ అలీ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–61, 2–124, 3–192. బౌలింగ్: షకీబ్ 3–0–33–0, మావి 4–0–32–1, ఫెర్గూసన్ 4–0–56–0, వరుణ్ 4–0–38–0, నరైన్ 4–0–26–2, వెంకటేశ్ 1–0–5–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 51; వెంకటేశ్ (సి) జడేజా (బి) శార్దుల్ 50; రాణా (సి) డు ప్లెసిస్ (బి) శార్దుల్ 0; నరైన్ (సి) జడేజా (బి) హేజల్వుడ్ 2; మోర్గాన్ (సి) చహర్ (బి) హేజల్వుడ్ 4; దినేశ్ కార్తీక్ (సి) రాయుడు (బి) జడేజా 9; షకీబ్ (ఎల్బీ) (బి) జడేజా 0; త్రిపాఠి (సి) అలీ (బి) శార్దుల్ 2; ఫెర్గూసన్ (నాటౌట్) 18; మావి (సి) చహర్ (బి) బ్రేవో 20; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–91, 2–93, 3–97, 4–108, 5–119, 6–120, 7–123, 8–125, 9–164. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–32–1, హేజల్వుడ్ 4–0–29–2, శార్దుల్ ఠాకూర్ 4–0–38–3, బ్రావో 4–0–29–1, జడేజా 4–0–37–2. ఐపీఎల్–2021 అవార్డులు ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ రుతురాజ్ గైక్వాడ్ –ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) హర్షల్ పటేల్–32 వికెట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హర్షల్ పటేల్ – ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ హర్షల్ పటేల్ – ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ రవి బిష్ణోయ్ (పంజాబ్ కింగ్స్) ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ హెట్మైర్ – ఢిల్లీ క్యాపిటల్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వెంకటేశ్ అయ్యర్ కోల్కతా నైట్రైడర్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ కేఎల్ రాహుల్ (30 సిక్స్లు) పంజాగ్ కింగ్స్ ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఫెయిర్ ప్లే టీమ్ ఆఫ్ ద సీజన్: రాజస్తాన్ రాయల్స్ -
IPL 2021 Prize Money: విజేతకు 20 కోట్లు.. మరి వాళ్లందరికీ ఎంతంటే!
IPL 2021 Prize Money: ఐపీఎల్-2021 విజేతగా చెన్నై సూపర్కింగ్స్ అవతరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్పై విజయం సాధించి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. మరి... టైటిల్ విన్నర్, రన్నరప్ గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత? ఎమర్జింగ్ ప్లేయర్, ఫెయిర్ ప్లే, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్ల వీరుడు ఎవరు.. వాళ్లు గెలుచుకున్న మొత్తం ఎంత? తదితర అంశాలను పరిశీలిద్దాం. అవార్డు ప్లేయర్ గెలుచుకున్న మొత్తం (రూపాయల్లో) ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు రుతురాజ్ గైక్వాడ్ 10 లక్షలు ఫెయిర్ ప్లే అవార్డు రాజస్తాన్ రాయల్స్ 10 లక్షలు గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ హర్షల్ పటేల్ 10 లక్షలు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ షిమ్రోన్ హెట్మెయిర్ 10 లక్షలు మాక్సిమమ్ సిక్సెస్ అవార్డు కేఎల్ రాహుల్ 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వెంకటేశ్ అయ్యర్ 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ రవి బిష్ణోయి 10 లక్షలు పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ 10 లక్షలు ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ గైక్వాడ్ 10 లక్షలు అత్యంత విలువైన ఆటగాడు హర్షల్ పటేల్ 10 లక్షలు విజేత చెన్నై సూపర్ కింగ్స్ 20 కోట్లు రన్నరప్ కోల్కతా నైట్రైడర్స్ 12.5 కోట్లు మూడోస్థానం ఢిల్లీ క్యాపిటల్స్ 8.75 కోట్లు నాలుగో స్థానం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8.75 కోట్లు చదవండి: IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్కు ఉంది: ధోని -
Faf Du Plessis: 100వ గేమ్... ప్రత్యేకం.. భారత క్రికెట్కు అదొక వరం!
IPL 2021 Final Faf Du Plessis Comments: ఐపీఎల్2021 సీజన్ ఆసాంతం అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్కింగ్స్ ఓపెనర్ ఫాప్ డుప్లెసిస్. 16 మ్యాచ్లు ఆడిన అతడు మొత్తంగా 633 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 95 నాటౌట్. దుబాయ్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మరోసారి విశ్వరూపం ప్రదర్శించిన డుప్లెసిస్... సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆఖరి బంతికి గనుక డుప్లెసిస్.. షాట్ ఆడి ఉంటే ఆరెంజ్ క్యాప్ అతడి సొంతమయ్యేది. కాగా డుప్లెసిస్కు ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో విజయానంతరం డుప్లెసిస్ మాట్లాడుతూ... ‘‘ఇది నిజంగా గొప్ప రోజు. 100వ ఐపీఎల్ గేమ్. నేను ఇక్కడకు వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. నాలుగోసారి ట్రోఫీ గెలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. రుతు(మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్) ప్రతిభావంతుడు. ఇలాంటి మెరికల్లాంటి ఆటగాళ్లు ఉండటం భారత క్రికెట్కు వరమనే చెప్పాలి. జట్టు బాధ్యతను భుజాల మీద మోశాడు. అతడికి గొప్ప భవిష్యత్తు ఉంది’’ అని ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్(635)పై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్లో రుతు 32 పరుగులు చేశాడు. చదవండి: IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్కు ఉంది: ధోని Partners #1331 💛#SuperCham21ons#CSKvKKR #WhistlePodu #Yellove🦁 @faf1307@Ruutu1331pic.twitter.com/yz3WE8VNvG — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021 -
MS Dhoni: టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్కు ఉంది.. మేమైతే..
IPL 2021 Winner CSK Captain MS Dhoni Commnets: ‘‘సీఎస్కే కంటే ముందు నేను కేకేఆర్ గురించి మాట్లాడాలి. సీజన్ తొలి దశలో ఎదురైన పరాభవాల నుంచి తేరుకుని... ఇక్కడి వరకు రావడం నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని. ఈసారి ఐపీఎల్ టైటిల్ విజేత అయ్యే అర్హత ఏ జట్టుకైనా ఉందంటే.. అది కేకేఆర్. వాళ్ల ఆట తీరు అమోఘం. నిజానికి... విరామం (ఐపీఎల్ వాయిదా)వాళ్లకు మేలే చేసింది’’ అంటూ చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని కోల్కతా నైట్రైడర్స్పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2021 రెండో అంచెలో మోర్గాన్ సేన అద్భుత ప్రద్శనతో ఆకట్టుకుందని కితాబిచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్లో సీఎస్కే.. కేకేఆర్ను 27 పరుగుల తేడాతో ఓడించి నాలుగోసారి (2010, 2011, 2018, 2021) చాంపియన్గా నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని స్పందిస్తూ... ‘‘గణాంకాలను బట్టి చూస్తే... నిలకడ జట్టుగా మాకు మంచి పేరు ఉంది. అదే సమయంలో మేం ఫైనల్లో ఓడిన సందర్భాలు అనేకం. అందుకే ఈసారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని అనుకున్నాం. బాగా ఇంప్రూవ్ అయ్యాం. జట్టు సమిష్టి విజయం ఇది. తొలుత కాస్త ఒత్తిడికి గురైన మాట వాస్తవం. అయితే, వ్యక్తిగతంగా.. గొప్పగా రాణించే ఆటగాళ్లు ఉండటం మాకు కలిసి వచ్చింది.’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా అభిమానులను ధన్యవాదాలు తెలిపిన ధోని... ‘‘ఇప్పుడు మేం దుబాయ్లో ఉన్నాం. ఒకవేళ సౌతాఫ్రికాలో ఉన్నా సరే.. ఫ్యాన్స్ మద్దతు మాకు ఇలాగే ఉంటుంది. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను చెన్నైలోని చెపాక్లోనే ఉన్నట్లుగా భావిస్తున్నా. చెన్నై అభిమానుల కోసం మేం మళ్లీ అక్కడ ఆడే అవకాశం వస్తుందని భావిస్తున్నా’’ అని ఫ్యాన్స్పై ప్రేమను కురిపించాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన కేకేఆర్ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫిదా Of the Fans, By the Fans, For the Fans 💛 #EverywhereWeGo#THA7A #SuperCham21ons#CSKvKKR #WhistlePodu #Yellove🦁pic.twitter.com/6OXgZUeOjA — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021 We are the Chennai boys… Making all the noise… Everywhere we Gooo…💛💛 For all of you #SuperFans.! 💛🦁#WhistlePodu #Yellove #SuperCham21ons 💛🦁 pic.twitter.com/6nQS9zWovf — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021 -
#iplfinal: సీఎస్కే విన్నింగ్ మూమెంట్.. వీడియో వైరల్
IPL 2021 Winner CSK Video Viral: గత సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి టైటిల్ విజేతగా నిలిచింది. కోల్కతా నైట్రైడర్స్పై 27 పరుగుల తేడాతో జయభేరి మోగించి విజయ దరహాసం చేసింది. నాలుగోసారి ట్రోఫీని గెలుచుకుని సత్తా చాటింది. ధోని సారథ్యంలో తమకు తిరుగులేదని నిరూపిస్తూ తుదిపోరులో ప్రత్యర్థిని మట్టికరిపించింది. దీంతో చెన్నై అభిమానుల ముఖాల్లో చిరునవ్వు విరిసింది. విజయ దశమినాడు విజిల్ పొడూ అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇక విజయానంతరం ధోని సేన చేసుకున్న సంబరాలకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. ఈ సీజన్ తర్వాత ధోని సీఎస్కే కెప్టెన్గా కొనసాగుతాడా లేదంటే, ఇతర బాధ్యతలు చేపడతాడా అన్న సందేహాల నేపథ్యంలో అనివార్యమైన ఈ విజయాన్ని అభిమానులు పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి!! స్కోర్లు: చెన్నై 192/3 (20) కేకేఆర్ 165/9 (20) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Fantastic FOUR! 🏆 🏆 🏆 🏆 The @msdhoni-led @ChennaiIPL beat #KKR by 27 runs in the #VIVOIPL #Final & clinch their 4⃣th IPL title. 👏 👏 #CSKvKKR A round of applause for @KKRiders, who are the runners-up of the season. 👍 👍 Scorecard 👉 https://t.co/JOEYUSwYSt pic.twitter.com/PQGanwi3H3 — IndianPremierLeague (@IPL) October 15, 2021 The winning moment.! Ft. Super Fam.!#WhistlePodu #Yellove #SuperCham21ons 💛🦁 pic.twitter.com/7uHH5fJ5N5 — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021 -
IPL 2021 Winner: కేకేఆర్పై ఘన విజయం.. చెన్నై ‘ఫోర్’ కొట్టేసింది!
IPL 2021 Winner CSK: చెన్నై సూపర్ కింగ్స్ ‘ఫోర్’ కొట్టేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ధోని సేన నాలుగోసారి(2010, 2011, 2018, 2021) క్యాష్ రిచ్ లీగ్ విజేతగా అవతరించింది. విజయ దశమి నాడు అభిమానులకు గొప్ప బహుమతి ఇచ్చింది. తొమ్మిదోసారి ఫైనల్ చేరిన చెన్నై... సగర్వంగా నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక తొలి అంచెలో తడబడినా.. యూఏఈలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న మోర్గాన్ బృందం రన్నరప్తోనే సరిపెట్టుకుంది. అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న ఫాఫ్ డుప్లెసిస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అదరగొట్టిన డుప్లెసిస్.. గైక్వాడ్ సైతం.. టాస్ గెలిచిన మోర్గాన్... ధోని సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో... ఈ సీజన్లో చక్కటి శుభారంభాలు అందించిన చెన్నై ఓపెనర్లు మరోసారి అదే ఫీట్ రిపీట్ చేశారు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుత్రాజ్ గైక్వాడ్(27 బంతుల్లో 32 పరుగులు, 3 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుగైన ఆట తీరు కనబరచగా... ఫాఫ్ డుప్లెసిస్(59 బంతుల్లో 86, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రాబిన్ ఊతప్ప మరోసారి మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. మొయిన్ అలీ సైతం 37 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 3 వికెట్లు కోల్పోయి... 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునిల్ నరైన్కు రెండు, శివం మావికి ఒక వికెట్ దక్కాయి. ఓపెనింగ్ జోడీ రాణించినా.. 193 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కేకేఆర్కు ఓపెనర్లు శుభ్మన్ గిల్(51), వెంకటేశ్ అయ్యర్(50) మంచి ఆరంభాన్ని అందించారు. కానీ శార్దూల్ ఠాకూర్ మాయాజాలం, జడేజా అద్భుత ఫీల్డింగ్.. అన్నింటికీ మించి ధోని వ్యూహాల ముందు చతికిలపడ్డ కేకేఆర్కు చివరికి ఓటమి తప్పలేదు. నితీశ్ రాణా(0), సునిల్ నరైన్(2), కెప్టెన్ మోర్గాన్(4), దినేశ్ కార్తిక్(9), షకీబ్ అల్ హసన్(0), రాహుల్ త్రిపాఠి(2), లాకీ ఫెర్గూసన్(3) వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. చివర్లో శివం మావి(20) వరుస షాట్లతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మూడోసారి టైటిల్ గెలవాలన్న కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 2012 నాటి ఫలితాన్ని పునరావృతం చేద్దామని భావించిన కోల్కతాకు 2021 ఫైనలో భంగపాటు తప్పలేదు. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ 1, జోష్ హాజిల్వుడ్ 2, శార్దూల్ ఠాకూర్ 3, జడేజా రెండు, బ్రావో ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చదవండి: గోల్డెన్ డక్ విషయంలో నితీష్ రాణా చెత్త రికార్డు Fantastic FOUR! 🏆 🏆 🏆 🏆 The @msdhoni-led @ChennaiIPL beat #KKR by 27 runs in the #VIVOIPL #Final & clinch their 4⃣th IPL title. 👏 👏 #CSKvKKR A round of applause for @KKRiders, who are the runners-up of the season. 👍 👍 Scorecard 👉 https://t.co/JOEYUSwYSt pic.twitter.com/PQGanwi3H3 — IndianPremierLeague (@IPL) October 15, 2021 -
IPL 2021 CSK Vs KKR: అప్పుడు టార్గెట్ 190/3, ఇప్పుడేమో.. 192/3!
IPL 2021 FInal: ఐపీఎల్-2021 విజేతగా నిలిచేందుకు చెన్నై సూపర్కింగ్స్- కోల్కతా నైట్రైడర్స్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఎప్పటిలాగే చెన్నై ఓపెనర్లు రుత్రాజ్ గైక్వాడ్(32), డుప్లెసిస్(86) శుభారంభం అందించగా... రాబిన్ ఊతప్ప తనకు దక్కిన అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకున్నాడు. 15 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. మొయిన్ అలీ సైతం 37 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ధోని సేన 3 వికెట్లు కోల్పోయి... 192 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతా.... 6 ఓవర్లు ముగిసేసరికి 55 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. ఇదిలా ఉండగా... ఐపీఎల్ విజేత ఎవరన్న అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. దుబాయ్ పిచ్ హిస్టరీ, అదే విధంగా గతంలో రెండుసార్లు చాంపియన్గా నిలిచిన సమయంలో కేకేఆర్ 180 కంటే ఎక్కువ టార్గెట్ ఛేజ్ చేసిన నేపథ్యంలో మోర్గాన్ బృందానికే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2012లో చెన్నైలో సీఎస్కేతో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ 192(19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) పరుగులు చేసి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా 2014లో బెంగళూరులో జరిగిన ఫైనల్లో పంజాబ్తో తలపడిన కోల్కతా 200(19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరుగులు సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడు కూడా 2012 నాటి ఫలితమే పునరావృతమవుతుందని కేకేఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తలా ధోని అభిమానులు సైతం... ‘‘ఇక్కడ ఉంది మిస్టర్ ధోని.. అది గుర్తుంచుకోండి’’ అంటూ ధీటుగా బదులిస్తున్నారు. 2012 ఫైనల్ స్కోర్లు చెన్నై... 190-3 (20 ఓవర్లు) కేకేఆర్.... 192-5 (19.4 ఓవర్లు) విజేత: కోల్కతా 2021 ఫైనల్ చెన్నై: 192-3 (20 ఓవర్లు) విజేత... ? -
ఫెర్గూసన్ చెత్త రికార్డు..
Lockie Ferguson.. సీఎస్కేతో జరుగుతున్న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్ లోకి ఫెర్గూసన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. సీఎస్కేతో మ్యాచ్లో ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఫెర్గూసన్ ఎక్కువ పరుగులు ఇచ్చుకోవడం ఇది రెండోసారి. ఇక్కడ విశేషమేమిటంటే.. ఫెర్గూసన్ గత సీజన్లోనూ దుబాయ్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనే ఫెర్గూసన్ 54 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్లో సీఎస్కే కేకేఆర్కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. -
CSK Vs KKR Final: ఐపీఎల్ 2021 టైటిల్ విజేత సీఎస్కే
ఐపీఎల్ 2021 టైటిల్ విజేత సీఎస్కే ఐపీఎల్లో సీఎస్కే నాలుగోసారి చాంపియన్గా నిలిచింది. కేకేఆర్తో జరిగిన ఫైనల్లో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఐపీఎల్ 2021 విజేతగా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆరంభంలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ దూకుడుతో ఇన్నింగ్స్ను ఘనంగానే ఆరంభించింది. అయితే అయ్యర్, గిల్ ఔటైన తర్వాత మ్యాచ్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ టర్న్ అయింది. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్ వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా అడుగులేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. ఎనిమిదో వికెట్ వికెట్ డౌన్.. ఓటమి దిశగా కేకేఆర్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. షకీబుల్ హసన్ జడేజా బౌలింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 15 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అంతకముందు9 పరుగులు చేసిన కార్తీక్ జడేజా బౌలింగ్లో రాయుడుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. 51 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ దీపక్ చహర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. . వెంకటేశ్ అయ్యర్ ఔట్.. కేకేఆర్ 93/2 సీఎస్కే జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. నితీష్ రాణా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అంతకముందు వెంకటేశ్ అయ్యర్(50) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దాటిగా ఆడుతున్న అయ్యార్ శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. గిల్ 40, నితీష్ రాణా పరుగులతో క్రీజులో ఉన్నారు. చుక్కలు చూపిస్తున్న వెంకటేశ్ అయ్యర్.. కేకేఆర్ 72/0 కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులతో ఆడుతున్న అయ్యర్కు మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(27) సహకరిస్తున్నాడు. ప్రస్తుతం కేకేఆర్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ధీటుగా బదులిస్తున్న కేకేఆర్ 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ధీటుగానే బదులిస్తుంది. కేకేఆర్ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్మన్ గిల్లు దాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 21, గిల్ 15 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL సీఎస్కే 192/3 .. కేకేఆర్ ముందు భారీ టార్గెట్ ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్లో సీఎస్కే కేకేఆర్కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. 17 ఓవర్లలో సీఎస్కే 153/2 17 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ 69 పరుగులతో ఆడుతుండగా.. మొయిన్ అలీ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 124/2 రాబిన్ ఊతప్ప(31) రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్లో ఊతప్ప ఎల్బీగా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. డుప్లెసిస్ 57 పరుగులతో ఆడుతున్నారు. 13 ఓవర్లలో సీఎస్కే స్కోరు 116/1 13 ఓవర్ల ఆట ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. డుప్లెసిస్ 56,రాబిన్ ఊతప్ప 25 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. రుతురాజ్(32) ఔట్ రుతురాజ్ గైక్వాడ్(32)రూపంలో సీఎస్కే తొలి వికెట్ను కోల్పోయింది. కేకేఆర్ స్పిన్నర్ నరైన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతిని రుతురాజ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. శివమ్ మావి క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం సీఎస్కే 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. 6 ఓవర్లలో సీఎస్కే 50/0 సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్లు ఇన్నింగ్స్ ధాటిగా ఆడుతున్నారు. కేకేఆర్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. రుతురాజ్ 26, డుప్లెసిస్ 23 పరుగులతో ఆడుతున్నారు. 3 ఓవర్లలో సీఎస్కే 22/0 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. రుతురాజ్ 18, డుప్లెసిస్ 3 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్ 2021లో భాగంగా సీఎస్కే, కేకేఆర్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక మ్యాచ్లో సీఎస్కే ఫెవరెట్గా కనిపిస్తుండగా.. కేకేఆర్ కూడా పటిష్టంగానే కనిపిస్తుంది. లీగ్ దశలో సీఎస్కే 14 మ్యాచ్ల్లో 9 విజయాలు.. 5 ఓటములతో రెండో స్థానంలో నిలిచింది. ఇక కేకేఆర్ 14 మ్యాచ్ల్లో 7 విజయాలు.. ఏడు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్ 1లో సీఎస్కే ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఆర్సీబీని ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడించిన కేకేఆర్ క్వాలిఫయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో రెండుసార్లు తలపడగా.. సీఎస్కేనే విజయం వరించింది. ముఖాముఖి పోరులో 24 సార్లు తలపడగా.. 16 మ్యాచ్ల్లో సీఎస్కే విజయం సాధించగా.. కేకేఆర్ 8సార్లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్వుడ్ కోల్కతా నైట్ రైడర్స్: శుబ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి -
బయోబబూల్లో మా పరిస్థితి ఇలాగే ఉంది..
Virat Kohli Shows Life In Bio Bubble.. ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి ఐపీఎల్ 2021 టైటిల్ అందుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. తనకు కెప్టెన్గా ఇదే చివరి సీజన్ అని విరాట్ కోహ్లి ఇప్పటికే ప్రకటించడంతో ఈసారి ఎలాగైనా ఆర్సీబీ కప్ కొడుతుందని అంతా భావించారు. కానీ కేకేఆర్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ అనూహ్యంగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక తర్వాతి సీజన్ నుంచి కోహ్లి ఆర్సీబీకి ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. చదవండి: Virat Kohli Crying: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా ఇక తాజాగా విరాట్ కోహ్లి టి20 ప్రపంచకప్ ఉండడంతో టీమిండియా బయోబబూల్లోకి వెళ్లిపోయాడు. అయితే కరోనా వైరస్ తర్వాత బయోబబూల్ ప్రతీ ఒక్కరికి సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో బయోబబూల్ అనేది ఎంత కష్టంగా ఉందో కోహ్లి ఒక్క ఫోటోతో చూపించాడు. తనను తాను కుర్చీకి కట్టేసుకొని.. బయోబబూల్లో మా పరిస్థితి అచ్చం ఇలాగే ఉందని పేర్కొన్నాడు. బయోబబూల్ వల్ల చాలా మంది ఆటగాళ్లు మానసిక ఒత్తిడి గురయ్యారు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు క్రిస్ గేల్ బయోబబూల్ కారణంగానే ఐపీఎల్ వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లి కూడా బయోబబూల్ అనేది నచ్చలేదంటే పరోక్షంగా ఒక్క ఫోటోలోనే చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కోహ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2021: టి20 కెప్టెన్గా ఎంఎస్ ధోని అరుదైన రికార్డు View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
టి20 కెప్టెన్గా ఎంఎస్ ధోని అరుదైన రికార్డు
MS Dhoni As First Captain As 300 T20 Matches.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముందు అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. కేకేఆర్తో జరగనున్న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ద్వారా 300 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన ఘనతను ధోని అందుకోనున్నాడు. కాగా ధోని సారధ్యంలోనే సీఎస్కే మూడుసార్లు(2010, 2011, 2018)లో చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇప్పటివరకు సీఎస్కే తరపున తొమ్మిదిసార్లు ఫైనల్ చేర్చిన ధోని.. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ను ఫైనల్ చేర్చాడు. దీంతోపాటు టి20ల్లో కెప్టెన్గా ఎక్కువ విజయాలు అందుకున్న కెప్టెన్గా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో 213 మ్యాచ్ల్లో నాయకత్వం వహించిన ధోని 130 విజయాలు అందుకున్నాడు. ధోని తర్వాత ఐపీఎల్లో కెప్టెన్గా ఎక్కువ విజయాలు అందుకున్న వారిలో రోహిత్ శర్మ 75 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ల పరంగా కోహ్లి 140 మ్యచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ కాగా వచ్చే ఐపీఎల్ సీజన్కు ధోని సీఎస్కేలో కొనసాగుతాడా లేదా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అనంతరం ధోని సీఎస్కేకు ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. తనను వచ్చే సీజన్లో ఎల్లో డ్రెస్లో కనిపిస్తానని.. అయితే జట్టులో ఆటగాడిగా.. లేక ఇతర స్థానంలో కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు. ఇక టి20 ప్రపంచకప్ సందర్భంగా ధోని టీమిండియాకు మెంటార్గా ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: అందరూ ధోనిలు కాలేరు.. పంత్కు కాస్త సమయం ఇవ్వండి -
IPL 2021 Final: అదే మనల్ని మరింత ప్రమాదకరంగా మార్చే అంశం!
Brendon McCullum Comments: ‘‘ఒక్కసారి అన్నీ గుర్తుకు తెచ్చుకోండి.. ఏడు మ్యాచ్లలో కేవలం రెండే విజయాలు. ఆ ప్రయాణాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు చెప్పబోయే స్ఫూర్తిదాయక కథల గురించి ఊహించుకోండి. మీ అనుభవాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన ముందున్న లక్ష్యం అదే. మనల్ని ఉత్తేజపరిచి... ఎగ్జైట్మెంట్కు గురిచేసేది అదే. మనం పెద్దగా కోల్పోయేదేం లేదు. అదే మనల్ని మరింత ప్రమాదకరంగా మార్చే అంశం’’- కోల్కతా నైట్రైడర్స్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్... జట్టును ఉద్దేశించి ఈ మేరకు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. తొలి అంచెలో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన సమయంలో జట్టులో జోష్ నింపేందుకు ప్రయత్నించాడు. ఆ మాటలను నిజం చేస్తూ... కేకేఆర్ ఆటగాళ్లు రెండో అంచెలో అద్భుత ప్రదర్శనను కనబరిచి... వరుస విజయాలతో ఫైనల్కు దూసుకువచ్చారు. ఇక అక్టోబరు 15న చెన్నై సూపర్కింగ్స్తో టైటిల్ పోరుకు సిద్ధమవుతున్న సమయంలో ఫ్రాంఛైజీ మెకల్లమ్ స్పీచ్ వీడియోను షేర్ చేసింది. అభిమానులను ఈ వీడియో విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా కోవిడ్ కారణంగా ఐపీఎల్-2021 సీజన్ వాయిదా పడే నాటికి ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం రెండింట మాత్రమే గెలుపొందిన కేకేఆర్.. పాయింట్ల పట్టికలో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా రెండో అంచె ప్రారంభమైన తర్వాత... కోల్కతా రాత మారింది. ఏడు మ్యాచ్లలో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: IPL 2021 Final Today: ఆ జట్టుదే పైచేయి... ముందు ఫీల్డింగ్ ఎంచుకుంటే గెలుపు ఖాయమా? Tonight's our 𝙩𝙧𝙮𝙨𝙩 𝙬𝙞𝙩𝙝 𝙙𝙚𝙨𝙩𝙞𝙣𝙮! 💜#KKR #CSKvKKR #AmiKKR #KorboLorboJeetbo #আমিKKR #IPL2021 pic.twitter.com/X0u50MHBR0 — KolkataKnightRiders (@KKRiders) October 15, 2021 -
IPL 2021 Final Today: ఆ జట్టుదే పైచేయి... టాస్ గెలిస్తే చాలా?!
IPL 2021, CSK vs KKR Today At Dubai International Cricket Stadium: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరులో చెన్నై సూపర్కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి. తొమ్మిదిసార్లు ఫైనల్ చేరిన సీఎస్కే నాలుగోసారి కప్ కొట్టాలని భావిస్తుండగా... ప్లే ఆఫ్స్ కూడా చేరుతుందా లేదా అన్న దశ నుంచి టేబుల్ టాపర్ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్ మూడోసారి చాంపియన్గా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది. నేటి మ్యాచ్ ప్రధానంగా చెన్నై బ్యాటింగ్కు, కోల్కతా బౌలింగ్కు మధ్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. Courtsey: IPL అదరగొడుతున్న ఓపెనర్లు... ఇంకో 23 పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్... సీఎస్కే ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్( ఇప్పటి వరకు 603 పరుగులు) సొంతమవుతుంది. మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ (547), ఆల్రౌండర్ జడేజా వంటి కీలక ప్లేయర్లు మెరుగ్గా రాణిస్తుండటం... అన్నింటికీ మించి కెప్టెన్ ధోని వ్యూహాలు... సీఎస్కేను ఫేవరెట్గా నిలుపుతాయనడంలో సందేహం లేదు. అయితే, రెండో అంచెలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ దాకా వచ్చిన మోర్గాన్ బృందాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. Courtsey: IPL చెన్నైదే పైచేయి! ఓపెనర్లు శుభ్మన్ గిల్(427), వెంకటేశ్ అయ్యర్(320)ఫాంలో ఉండటం... మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(18), సునిల్ నరైన్(14) రాణిస్తుండటం కేకేఆర్కు కలిసి వచ్చే అంశాలు. ఈ సీజన్లో చెన్నై- కేకేఆర్ రెండుసార్లు తలపడగా... రెండుసార్లు విజయం ధోని సేననే వరించింది. అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియం(సెప్టెంబరు 26), ముంబైలోని వాంఖడే స్టేడియంలో(ఏప్రిల్ 21) వరుసగా 2 వికెట్లు, 18 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. ఇక మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్లో సీఎస్కే- కేకేఆర్ 25సార్లు ముఖాముఖి తలపడగా... చెన్నై 16 సార్లు, కోల్కతా 8 సార్లు గెలిచింది. ఇక ఇప్పుడు ఇరు జట్లు తొలిసారిగా దుబాయ్ వేదికగా ఫైనల్లో తలపడబోతున్నాయి. మరి అక్కడి పిచ్పై టీ20 రికార్డు ఎలా ఉందో పరిశీలిద్దాం! ►స్టేడియం పేరు: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ►ఇప్పటి వరకు జరిగిన టీ20 మ్యాచ్లు: 105 ►తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు సాధించిన విజయాలు: 41 ►లక్ష్య ఛేదనకు దిగిన టీం సాధించిన విజయాలు: 63 ►మ్యాచ్ టై అయినవి: 1 ►నమోదైన అత్యధిక స్కోరు: 219/2- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్- 2020 ►అత్యల్ప స్కోరు: 59(లాహోర్ కాలాండర్స్ వర్సెస్ పెషావర్ జల్మీ-2017) ►ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 156 ►ఇక ఈ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై... ఢిల్లీ క్యాపిటల్స్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. స్కోర్లు: ఢిల్లీ- 172/5(20 ఓవర్లు) చెన్నై- 173/6(19.4 ఓవర్లు). ►ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్లోనూ టాస్ కీలకం కానుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టేడియం చరిత్ర ప్రకారం... ఒకవేళ ధోని టాస్ గెలిస్తే.. మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంటాడా.. లేదంటే అదృష్టం కేకేఆర్ను వరిస్తుందా.. లేదంటే సెంటిమెంట్ను తిరగరాస్తూ అద్భుతాలేమైనా జరుగుతాయా లేదా అన్నది చూడాలంటే సాయంత్రం వరకు(7.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం) వేచి చూడాల్సిందే! చదవండి: IPL 2021 Final: ‘కెప్టెన్’ డ్రాప్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు! -
IPL 2021 Final: ‘కెప్టెన్’ డ్రాప్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు!
Don’t be surprised if Morgan drops himself: మరికొన్ని గంటల్లో ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ తుదిపోరుకు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ కేకేఆర్ జట్టు కూర్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ జట్టుతో చేరే అవకాశాలున్న వాన్... షకీబ్ అల్ హసన్ స్థానాన్ని అతడు భర్తీ చేసే ఛాన్స్ ఉందన్నాడు. ఒకవేళ అది కుదరకపోతే కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. రస్సెల్ కోసం తనను తాను తుదిజట్టు నుంచి డ్రాప్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. కాగా ఐపీఎల్-2021 రెండో అంచెలో అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్న మోర్గాన్... బ్యాటర్గా మాత్రం పూర్తిగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 129 రన్స్ మాత్రమే చేసిన అతడు... కీలకమైన క్వాలిఫైయర్-2లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ... ‘‘షార్జాలో వాళ్లు బాగా ఆడారు. అక్కడి పిచ్పై పూర్తి అవగాహన ఉంది. అయితే, దుబాయ్లో పిచ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆండ్రీ రస్సెల్తో నాలుగు ఓవర్లు వేయిస్తే బాగుంటుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అవసరం లేదనుకుంటే... షకీబ్ స్థానంలో అతడు జట్టులోకి రావొచ్చు. ఇక మోర్గాన్ విషయానికొస్తే... జట్టు ప్రయోజనాల కోసం తను ఎంతటి తాగ్యానికైనా సిద్ధపడతాడు. తనను తాను తుది జట్టు నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తన పట్టుదల గురించి నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ -
IPL Final CSK Vs KKR: అతనే బలం... ‘సూపర్’ దళం!
పాత చాంపియన్ల మధ్య కొత్త చాంపియన్షిప్ చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఏకంగా తొమ్మిదిసార్లు ఫైనల్ చేరి లీగ్కే వన్నె తెచి్చన ఫేవరెట్ చెన్నై సూపర్కింగ్స్ నాలుగో టైటిల్పై కన్నేయగా... రెండు సార్లు ఫైనల్ చేరితే ఆ రెండుసార్లూ విజేతగా నిలిచిన కోల్కతా నైట్రైడర్స్ ఈ ఆనవాయితీని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మూడో ఐపీఎల్ టైటిల్తో దుబాయ్ నుంచి దిగి్వజయంగా తిరిగి రావాలని ఆశిస్తోంది. దుబాయ్: అవాంతరాలతో ఆగి, భారత్నుంచి విదేశం తరలి వెళ్లి మళ్లీ మొదలైన 2021 ఐపీఎల్కు ఇంకొన్ని గంటల్లో దుబాయ్లో శుభం కార్డు పడనుంది. 14వ సీజన్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ సై అంటే సై అంటున్నాయి. గత ఏడాది ప్లే ఆఫ్స్కే అర్హత సాధించని ఇరు జట్లను కెపె్టన్లు ధోని, మోర్గాన్ ఈ సీజన్లో సమర్థంగా నడిపించారు. ఇప్పుడు అసలు పోరులో వారి సారథ్యం, బ్యాటింగ్ సామర్థ్యం జట్టుకు గెలిపిస్తాయా అనేది ఆసక్తికరం. ధోని నాయకత్వంలోనే చెన్నై మూడు సార్లు చాంపియన్గా నిలవగా, ధోనిలాగే వరల్డ్ కప గెలిపించిన మోర్గాన్ సారథిగా తొలి ఐపీఎల్ టైటిల్పై కన్నేశాడు. అతనే బలం... ‘సూపర్’ దళం బ్యాటింగ్ మెరిసినా, మెరిపించకపోయినా ధోని ధోనినే! ఈ క్రికెట్ జ్ఞాని శిబిరంలో ఉంటే ఆ జట్టుకు వంద ఏనుగుల బలం. అందుకే భారత క్రికెట్ బోర్డు కూడా వచ్చే టి20 ప్రపంచకప్ వేటకు వెళ్లే కోహ్లి సేనకు ధోనిని మెంటార్గా నియమించింది. తొలి క్వాలిఫయర్లో ధోని మెరుపులు జట్టుని గెలుపుతీరానికి చేర్చాయి. ఈ ధనాధన్ టి20ల్లో అతని విశేషానుభవం, సారథ్య సామర్థ్యం జట్టుకు అదనపు బలం. అందుకే 12 సీజన్లు ఐపీఎల్ ఆడితే ఏకంగా 9 సార్లు ఫైనల్కు చేర్చిన ఘనత ధోనిదే! ఓపెనింగ్ రుతురాజ్ గైక్వాడ్ భీకర ఫామ్లో ఉన్నాడు. దీనికి డుప్లెసిస్ ధాటి కూడా తోడైతే సూపర్ కింగ్స్ భారీస్కోరు చేయడం ఖాయమవుతుంది. టాపార్డర్ నుంచి దీపక్ చహర్ దాకా పది మందికి పరుగులు చేసే సత్తా ఉండటం కూడా చెన్నైలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. దీంతోపాటు ఈ సీజన్లో అక్కడా... ఇక్కడా... రెండు సార్లు కోల్కతాపై గెలిచిన సానుకాలంశం చెన్నైని మురిపిస్తోంది. ముంబై, అబుదాబీలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లలో సూపర్కింగ్స్ జట్టే గెలిచింది. టాపార్డర్ కీలకం... మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ సీజన్ క్లైమాక్స్ దశలో రెచి్చపోతోంది. అయితే భారీ స్కోర్లతో, మెరిపించే బ్యాట్స్మెన్తో కాదు... తిప్పేసే స్పిన్ ద్వయంతో పాయింట్ల పట్టికలో తనకన్నా మెరుగైన బెంగళూరు, ఢిల్లీ జట్లను కంగుతినిపించింది. ఇప్పుడు ఫైనల్ మజిలీకొచి్చంది. ఇక్కడి దాకా వస్తే టైటిల్తోనే వెళ్లిన రికార్డూ ఊరిస్తోంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు తమ స్పిన్ మాయాజాలంతో సూపర్కింగ్స్ను కట్టిపడేస్తే... లీగ్లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవచ్చు. అయితే గత రెండు మ్యాచ్లు షార్జా పిచ్పై జరిగాయి. కానీ ఇది దుబాయ్ వికెట్. యూఏఈ అంచెలో మెరుగైన స్కోర్లు నమోదైన వేదిక కూడా ఇదే! టాపార్డర్ బ్యాట్స్మెన్ శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలతో పాటు అనుభవజు్ఞలైన కెపె్టన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్లు పరుగుల బాధ్యతను పంచుకోవాలి. చక్కని బ్యాటింగ్కు జతగా స్పిన్ మ్యాజిక్ పనిచేస్తే కోల్కతాకు ఫైనల్లో తిరుగుండదు. దుబాయ్లో మూడో స్పిన్నర్ అవసరం పెద్దగా ఉండకపోవడంతో పాటు రసెల్ ఫిట్గా ఉంటే షకీబ్ స్థానంలో అతనికి చోటు దక్కవచ్చు. తుది జట్లు (అంచనా) చెన్నై సూపర్కింగ్స్: ధోని (కెపె్టన్), రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, ఉతప్ప, రాయుడు, జడేజా, బ్రావో, శార్దుల్, దీపక్ చహర్, హాజల్వుడ్. కోల్కతా నైట్రైడర్స్: మోర్గాన్ (కెపె్టన్), గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, షకీబ్ / రసెల్, నరైన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ఫెర్గూసన్. -
IPL 2021: ఫైనల్కు ముందు కేకేఆర్కు బిగ్ షాక్!
DInesh Karthik Breach IPL Code Of Conduct.. ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. అయితే ఫైనల్లో అడుగుపెట్టిన కోల్కతాకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కేకేఆర్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేష్ కార్తీక్కు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది.ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 18 ఓవర్ వేసిన రబడా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిన కార్తీక్.. అసహనానికి లోనై స్టంప్స్ను కొట్టి పెవిలియన్కు వెళ్లాడు. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అఫెన్స్ 2.2 రూల్ ప్రకారం కార్తీక్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. అతడు నేరాన్ని అంగీకరించాడు. తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీపై ఆదారపడి ఉందని' ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే మ్యాచ్ రిఫరీ విధించే శిక్షకు కార్తీక్ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ ఒక్క మ్యాచ్ నిషేదం కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కార్తీక్ తప్పును రిఫరీ సీరియస్గా తీసుకుంటే, ఫైనల్ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. చదవండి: Rahul Tripathi: ' సిక్స్ కొడతానని ఊహించలేదు' -
అంపైర్ను ఫ్రాంక్ చేసిన రిషబ్ పంత్.. వీడియో వైరల్
Rishab Pant Prank On Umpire Anil Chaudary.. ఐపీఎల్ 2021లో కేకేఆర్తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్ అనిల్ చౌదరీని ఫ్రాంక్ చేయడం వైరల్గా మారింది. కేకేఆర్ బ్యాటింగ్ సమయంలో అశ్విన్ బంతిని పరిశీలిస్తుండగా.. అనిల్ చౌదరీ బాల్ బాక్స్ను పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పంత్ అనిల్ చౌదరీ వెనక్కి వెళ్లి.. అతనికి తెలియకుండా కుడి మోచేతిని టికిల్ చేశాడు. వెంటనే అనిల్ తిరిగి చూడగా అక్కడ ఎవరు కనిపించలేదు. దీంతో పంత్ నేనే అంటూ అంపైర్కు చెప్పడంతో మైదానంలో నవ్వులు విరపూశాయి. ఈ వీడియోపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. చదవండి: Rahul Tripathi: ' సిక్స్ కొడతానని ఊహించలేదు' ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. అనంతరం కోల్కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్మన్ గిల్ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు తొలి వికెట్కు 74 బంతుల్లో 96 పరుగులు జోడించారు. చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం 24 year old kiddopic.twitter.com/LFvvWBx3UA — Ryan (@RyanIke4) October 13, 2021 -
'సిక్స్ కొడతానని ఊహించలేదు'
Rahul Tripathi after the match-winning six: ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. అయితే చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరగిన ఈ మ్యాచ్లో అఖరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన నేపథ్యంలో సిక్స్ కొట్టి రాహుల్ త్రిపాఠి కోల్కతాను విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన త్రిపాఠి.. ఆ సమయంలో తనపై తనకు జట్టును గెలిపించగలనన్న నమ్మకం ఉందని తెలిపాడు. "జట్టు విజయం చాలా ముఖ్యం. ఒకటి లేదా రెండు కఠినమైన ఓవర్లు మా ఇన్నింగ్స్లో ఉన్నాయి. కానీ చివరికి టార్గెట్ అంత కష్టంగా మారుతుందని నేను అనుకోలేదు. అఖరికి మేము మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. 18 వ ఓవర్ రబాడా చాలా కఠినంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లో ఒకరని టార్గెట్ చేయాలని అనుకున్నాను. అదే పని నేను చేశాను. మేము ప్లాన్ చేసుకున్నాము. చివరి రెండు బంతులల్లో సాధ్యమైనంత వరకు పరగులు చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ రెండు బంతులే మిగిలి ఉండడంతో గెలుపు సాధ్యం కాదని అనుకున్నా.. ఆ సమయంలో ఒక పెద్ద హిట్ కావాలని భావించా.. అయితే సిక్స్తో ముగిస్తానని మాత్రం ఊహించలేదు' అని త్రిపాఠి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ ముందు ఉంచింది. అయితే 136 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్ 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత కేవలం 7పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అఖరి ఓవర్లో 7 పరుగుల కాల్సిన నేపథ్యంలో మెదటి 4 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు ఆశ్విన్ పడగొట్టాడు. ఇక ఢిల్లీ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో.. క్రీజులో ఉన్న రాహుల్ త్రిపాఠి ఐదో బంతికి సిక్స్ కొట్టి కేకేఆర్ను ఫైనల్కు చేర్చాడు. చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం -
ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం
Rishab Pant Emotional.. కేకేఆర్తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలై వరుసగా రెండో ఏడాది నిరాశనే మిగిల్చింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో త్రిపాఠి స్టన్నింగ్ సిక్స్తో కేకేఆర్ను ఫైనల్కు చేర్చాడు. మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ భావోద్వేగంగా స్పందించాడు. PC: IPL Twitter ''ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా. బాధతో నాకు మాటలు రావడం లేదు. కానీ మ్యాచ్ మా చేతుల్లో ఉండదు. మేము వీలైనంతసేపు ఆటలో గెలుపుకే ప్రయత్నించాం. ఆఖర్లో బౌలర్లు ఆటను మార్చినప్పటికి.. మ్యాచ్ గెలవలేకపోయాం. ఇక ముందు బ్యాటింగ్లో మాకు మంచి ఆరంభం వచ్చినప్పటికీ మిడిల్ ఓవర్లో కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ సమయంలో సరైన స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాం. కానీ సీజన్లో మా ప్రదర్శన బాగానే అనిపించింది. కచ్చితంగా వచ్చే సీజన్లో మరింత బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం'' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు. చదవండి: Venkatesh Iyer: ఫైనల్ చేరడం సంతోషం.. కప్ కొట్టడమే మిగిలింది -
KKR vs DC, IPL 2021: కోల్కతా ‘సిక్సర్’తో...
136 పరుగుల స్వల్ప లక్ష్యం...ఓపెనర్లే 96 పరుగులు జోడించి గెలుపు దిశగా నడిపించారు... ఒకదశలో చేతిలో 9 వికెట్లు ఉండగా 25 బంతుల్లో 13 పరుగులు చేస్తే చాలు... కానీ కోల్కతా ఒక్కసారిగా తడబడింది. 7 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడగా, 23 బంతుల్లో 7 పరుగులే వచ్చాయి. నలుగురు డకౌట్! ఢిల్లీ క్యాపిటల్స్లో విజయంపై ఆశలు... చివరి 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే త్రిపాఠి నైట్రైడర్స్ను గట్టెక్కించాడు. అశ్విన్ వేసిన ‘రసగుల్లా’లాంటి ఐదో బంతిని సిక్సర్గా మలచి ఏడేళ్ల విరామం తర్వాత మాజీ చాంపియన్ను మూడోసారి ఫైనల్కు చేర్చాడు. గత ఏడాది ఫైనల్లో ఓడిన ఢిల్లీ ఇప్పుడు నిరాశగా మూడో స్థానంతో ముగించింది. మూడుసార్లు చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్, గతంలో ఫైనల్ చేరిన రెండుసార్లూ (2012, 2014) విజేతగా నిలిచిన కోల్కతా మధ్య శుక్రవారం ఫైనల్ జరగనుండటంతో ఈ ఏడాదీ ఐపీఎల్లో కొత్త చాంపియన్ లేకపోవడం ఖాయమైంది. షార్జా: మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. అనంతరం కోల్కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్మన్ గిల్ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు తొలి వికెట్కు 74 బంతుల్లో 96 పరుగులు జోడించారు. సమష్టి వైఫల్యం... ఢిల్లీ ఇన్నింగ్స్లో 12 ఓవర్లలో 6 లేదా అంతకంటే తక్కువ పరుగులు చేసిన సందర్భాలున్నాయి. టి20 మ్యాచ్లో ఒక జట్టు ఓడిపోవడానికి ఇలాంటి పేలవ ప్రదర్శన చాలు! మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఇలాంటి ఆటతోనే ఓటమిని ఆహా్వనించింది. పిచ్ ఎంత నెమ్మదిగా ఉన్నా, స్పిన్కు కాస్త అనుకూలంగా కనిపిస్తున్నా కూడా ఒక్క బ్యాటర్ కూడా ఎదురుదాడికి దిగి ధాటిగా ఆడే ప్రయత్నం చేయకపోవడంతో ఇన్నింగ్స్లో 6 ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. తొలి 4 ఓవర్ల వరకు క్యాపిటల్స్ ప్రదర్శన మెరుగ్గా సాగింది. షకీబ్ ఓవర్లో పృథ్వీ వరుసగా 6, 4 కొట్టగా... నరైన్ వేసిన వరుస బంతుల్లో ధావన్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇది చూస్తే ఒక హోరాహోరీ పోరుకు తెర లేచినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాతే కేకేఆర్ బౌలర్ల ఆధిపత్యం ముందు ఢిల్లీ తేలిపోయింది. వరుణ్ తన తొలి బంతికే పృథ్వీ షాను అవుట్ చేసి పతనానికి శ్రీకారం చుట్టాడు. ఓపెనర్ల జోరు... ఢిల్లీ చేసిన తప్పును కోల్కతా చేయలేదు. పిచ్ స్వభావంపై దృష్టి పెట్టకుండా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి నుంచి దూకుడు కనబర్చింది. ముఖ్యంగా వెంకటేశ్ తన అద్భుత ఫామ్ను కొనసాగించాడు. అశ్విన్ ఓవర్లో ఫోర్తో జోరు ప్రారంభించిన అతను అక్షర్ బౌలింగ్లో రెండు, రబడ ఓవర్లో ఒక సిక్సర్ బాదాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 51 పరుగులకు చేరింది. మరో ఎండ్లో గిల్ ప్రశాంతంగా ఆడగా... 38 బంతుల్లోనే వెంకటేశ్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు వెంకటేశ్ను రబడ అవుట్ చేసి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీసినా కోల్కతా విజయం అప్పటికే దాదాపుగా ఖాయమైనట్లు అనిపించింది. అయితే అనూహ్య మలుపులతో డ్రామా సాగి చివరకు మరో బంతి మిగిలి ఉండగా నైట్రైడర్స్ గెలుపు తీరం చేరింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (ఎల్బీ) (బి) వరుణ్ 18; ధావన్ (సి) షకీబ్ (బి) వరుణ్ 36; స్టొయినిస్ (బి) మావి 18; శ్రేయస్ (నాటౌట్) 30; పంత్ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్ 6; హెట్మైర్ (రనౌట్) 17; అక్షర్ పటేల్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–32, 2–71, 3–83, 4–90, 5–117. బౌలింగ్: షకీబ్ 4–0–28–0, ఫెర్గూసన్ 4–0–26–1, నరైన్ 4–0–27–0, వరుణ్ 4–0–26–2, మావి 4–0–27–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) పంత్ (బి) అవేశ్ 46; వెంకటేశ్ (సి) (సబ్) స్మిత్ (బి) రబడ 55; రాణా (సి) హెట్మైర్ (బి) నోర్జే 13; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 12; కార్తీక్ (బి) రబడ 0; మోర్గాన్ (బి) నోర్జే 0; షకీబ్ (ఎల్బీ) (బి) అశి్వన్ 0; నరైన్ (సి) అక్షర్ (బి) అశి్వన్ 0; ఫెర్గూసన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 10, మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 136. వికెట్ల పతనం: 1–96, 2–123, 3–125, 4–126, 5–129, 6–130, 7–130. బౌలింగ్: నోర్జే 4–0–31–2, అశి్వన్ 3.5–0–27–2, అవేశ్ ఖాన్ 4–0–22–1, అక్షర్ పటేల్ 4–0–32–0, రబడ 4–0–23–2. -
'ఢిల్లీ తప్పనిసరిగా టైటిల్ గెలుస్తుంది'
Ricky Pontings Motivational Speech to DC players ahead of KKR clash: ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పనిసరిగా టైటిల్ నెగ్గుతుందని ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా నేడు క్వాలిఫయర్ - 2లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్.. కేకేఆర్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో చెన్నైతో ఢీకొట్టనుంది. ప్రస్తుత సీజన్లో 14 మ్యాచ్ల్లో 10 విజయాలు సాధించి పాయింట్ల ఢిల్లీ పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. అయితే క్వాలిఫయర్-1లో సీఎస్కే చేతిలో ఓటమి చెందిన తరువాత ఢిల్లీ కాస్త ఢీలా పడింది. ఈ క్రమంలో నేడు జరగబోయే క్వాలిఫయర్ - 2లో ఏ విధంగానైనా గెలిచి ఫైనల్కు చేరాలని ఢిల్లీ ఉర్రుతలూగుతుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రికీ పాంటింగ్ తన జట్టుకు భావోద్వేగంతో కూడిన ప్రసంగం ఇచ్చాడు. తమ జట్టు గత కొద్ది సీజన్ల నుంచి చాలా బాగా ఆడుతుందని, మా ఆటగాళ్ల మీద పూర్తి నమ్మకం ఉందని, తప్పని సరిగా ఢిల్లీ ఛాంపియన్గా నిలుస్తోందని పాటింగ్ తెలిపాడు. "నేను మూడు సంవత్సరాలుగా ఢిల్లీ జట్టులో ఉన్నాను .2018లో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచాము. 2019లో మా జట్టు మూడో స్ధానంలో నిలవగా, గత సంవత్సరంలో రన్నర్ప్గా నిలిచాము. మేము ఈ ఏడాది టైటిల్ గెలవగలమన్న నమ్మకముంది. రెండేళ్ల క్రితం ఉన్న ఢిల్లీ జట్టుకు.. ప్రస్తుతం ఉన్న ఢిల్లీ జట్టుకు చాలా తేడా ఉందంటూ' పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup 2021: కోల్కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్కు బంపర్ ఆఫర్.. -
DC Vs KKR: ఆ నలుగురి ముంగిట ఉన్న రికార్డులివే!
4 milestones to watch out for in Qualifier 2: ఐపీఎల్-2021 సీజన్లో బుధవారం ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్లో చెన్నైని ఢీకొట్టేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ సమాయత్తమవుతున్నాయి. క్యాష్ రిచ్ లీగ్లో ఇరు జట్లు 29 సార్లు ముఖాముఖి తలపడగా కోల్కతా 15 సార్లు గెలుపొంది పైచేయి సాధించింది. ఢిల్లీ 13 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. నేటి(అక్టోబరు 13) మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! పంత్(Rishabh Pant) 8 పరుగులు చేస్తే.. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. ఈ సీజన్లో తొలి అంచెలో ఢిల్లీ అద్భుతంగా రాణించడంతో.. శ్రేయస్ జట్టులోకి తిరిగి వచ్చినా.. ఫ్రాంఛైజీ అతడినే సారథిగా కొనసాగించింది. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగానే.. పంత్ జట్టును టేబుల్ టాపర్గా నిలిపాడు. బ్యాటర్గానూ తన వంతు సేవలు అందించాడు. ఐపీఎల్-2021లో 15 మ్యాచ్లలో పంత్ 413 పరుగులు సాధించాడు. ఇక క్వాలిఫైయర్-2 మ్యాచ్లో అతడు గనుక 8 పరుగులు చేస్తే.. ఐపీఎల్ కెరీర్లో 2500 రన్స్ మైలురాయిని చేరుకుంటాడు. అక్షర్ పటేల్(Axar Patel)... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో గేమ్ చేంజర్గా పలు కీలక మ్యాచ్ల విజయాల్లో భాగమయ్యాడు అక్షర్ పటేల్. బౌలర్గా, బ్యాటర్గా తన వంతు పాత్ర పోషించాడు. బుధవారం నాటి మ్యాచ్లో తుది జట్టులో గనుక అక్షర్ చోటు దక్కించుకుని... 5 వికెట్లు తీయగలిగితే ఐపీఎల్ 100 వికెట్ల క్లబ్లో చేరతాడు. ఇక ఈ సీజన్లో అతడు ఇప్పటి వరకు 15 వికెట్లు పడగొట్టాడు. మోర్గాన్(Eoin Morgan) పూర్తి చేస్తాడా? ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్-2021 రెండో అంచెలో అద్భుత విజయాలు సాధించింది. వరుస విజయాలతో టైటిల్కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అయితే, బ్యాటర్గా మాత్రం మోర్గాన్ ఇంతవరకు మరీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే.. నేటి మ్యాచ్లో మోర్గాన్ 9 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ కెరీర్లో వెయ్యి పరుగుల మార్కును చేరుకుంటాడు. డీకే(Dinesh Karthik) ముంగిట బౌండరీల రికార్డు కేకేఆర్ మాజీ కెప్టెన్ దినేశ్ కార్తిక్.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 214 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. నేటి మ్యాచ్లో డీకే ఒక్క బౌండరీ బాదితే చాలు.. ఐపీఎల్లో 400 ఫోర్లు తన పేరిట లిఖించుకోగలుగుతాడు. తద్వారా లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా నిలుస్తాడు. మరి వీళ్లందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా?! చదవండి: Aakash Chopra: ఈరోజు మీ కథ ముగుస్తుంది.. ఆ జట్టుదే విజయం -
DC Vs KKR: ఈరోజు మీ కథ ముగుస్తుంది.. అస్సలు గెలవలేరు!
Aakash Chopra Prediction On Winner Of KKR Vs DC Match: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్-2021 సీజన్ తుది అంకానికి చేరుకుంటోంది. క్వాలిఫైయర్-2కు అర్హత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య బుధవారం రసవత్తరపోరు జరుగనుంది. షార్జా వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో చెన్నై సూపర్కింగ్స్ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్లో విజేత గురించి టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన ఢిల్లీ కథ.. ఈసారి కనీసం ఫైనల్ చేరకుండానే ముగుస్తుందని జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా ఢిల్లీ ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడాడు. ‘‘ఈ మ్యాచ్లో కోల్కతా కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఢిల్లీ పోరాటం నేటితో ముగిసిపోతుందనే భావిస్తున్నా. మీరు.. ఈరోజు మ్యాచ్ గెలవలేరు. గతంలో మాదిరే తప్పులు పునరావృతం చేస్తే... నేడే వీడ్కోలు పలకడం ఖాయం. ఏ రోజైతే మీరు 180 పరుగులు చేయలేకపోయారో.. రబడ అందుబాటులో ఉన్న నాడు కూడా మెరుగైన స్కోరును నిలబెట్టుకోలేపోయారో... ఆరోజే ఈ విషయం అర్థమైంది. షార్జా మీకు సూట్ అవ్వదు’’ అని ఘాటుగా విమర్శించాడు. చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్లో ఢిల్లీ సారథి పంత్ కెప్టెన్సీ తీరును ఈ సందర్భంగా ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. ఇక నేటి(అక్టోబరు 13) మ్యాచ్లో స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తారని, ఇరు జట్ల నుంచి కనీసం ఐదు వికెట్లైనా పడగొడతారని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. అదే విధంగా... ఎడమచేతి వాటం గల బ్యాటర్లు అత్యధిక పరుగులు సాధించే అవకాశం ఉందని, ఢిల్లీ ప్లేయర్లు శిఖర్ ధావన్, వెంకటేశ్ అయ్యర్లు మెరుగ్గా రాణిస్తారని భావిస్తున్నట్లు తెలిపాడు. కాగా క్వాలిఫైయర్-1 మ్యాచ్లో టేబుల్ టాపర్ ఢిల్లీ.. చెన్నై చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఆఖరి ఓవర్ కగిసో రబడతో వేయిస్తే... ఫలితం మరోలా ఉండేదని పలువురు మాజీలు డీసీ కెప్టెన్ పంత్ తీరును విమర్శించారు. చదవండి: IPL 2021 Qualifier 2: మమ్మల్ని ఎవరైనా తేలికగా తీసుకుంటారా? -
యూఏఈలో ట్రాక్ రికార్డు: మమ్మల్ని ఎవరైనా తేలికగా తీసుకుంటారా?
Shakib Al Hasan on KKR’s confidence level: ఐపీఎల్-2021 సీజన్ కరోనా కారణంగా వాయిదా పడే నాటికి ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం రెండింట మాత్రమే విజయం.. పాయింట్ల పట్టికలో పట్టికలో ఏడో స్థానం... కానీ... సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా రెండో అంచె ప్రారంభమైన తర్వాత... సీన్ మారిపోయింది... వరుస విజయాలు.. ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఆరు గెలిచింది... ఎలిమినేటర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి మేటి జట్టును ఓడించి ఇంటి బాట పట్టించింది... ట్రోఫీని ముద్దాడటానికి ఇప్పుడు రెండడుగుల దూరంలో ఉంది.. ఇదీ తాజా సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ట్రాక్ రికార్డు... మరి అలాంటి అద్భుతమైన ఫామ్లో ఉన్న జట్టును ప్రత్యర్థి జట్టు తేలికగా తీసుకుంటుందా? అస్సలు కాదు కదా! కేకేఆర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఇదే మాట అంటున్నాడు. కాగా మాజీ చాంపియన్ బుధవారం షార్జా వేదికగా జరిగే క్వాలిఫైయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీపై గెలుపొంది క్వాలిఫైయర్-2కు అర్హత సాధించిన తర్వాత షకీబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటి వరకు ఏవిధంగానైతే ముందుకు దూసుకువచ్చామో.. ఇక ముందు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతాం. యూఏఈకి వచ్చిన తర్వాత మేము ఒక్కో సవాలును దాటుకుంటూ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాం. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నాం. ఏ జట్టు కూడా మమ్మల్ని ఇకపై తేలికగా తీసుకోలేదు’’అంటూ కేకేఆర్ వెబ్సైట్తో వ్యాఖ్యానించాడు. ఇక కీలక మ్యాచ్లో ఒత్తిడి సహజమన్న షకీబ్... ప్రొఫెషనల్ ప్లేయర్గా దానిని ఎలా అధిగమించాలో తమకు తెలుసునన్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సునిల్ నరైన్పై షకీబ్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ విజయంలో తన వంతు పాత్ర కూడా పోషించడం సంతోషంగా ఉందన్నాడు. కాగా ఈ మ్యాచ్లో 6 బంతుల్లో 9 పరుగులు చేసిన షకీబ్... కేకేఆర్ విజయంలో కీలకంగా మారాడు. చదవండి: Daniel Christian: ఆర్సీబీని ముంచేశారు కదరా; ప్లీజ్.. నా భార్యను వదిలేయండి! -
DC vs KKR, Qualifier 2: చెన్నైని ఢీ కొట్టేదెవరు?
షార్జా: వరుసగా ఈ సీజన్లో కూడా ఫైనల్ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్కు ఇదే ఆఖరి అవకాశం. ధోని సేనపై సాధించలేకపోయిన విజయాన్ని ఇప్పుడు మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్పై తప్పనిసరిగా సాధించాలి. అయితే లీగ్ చివరి దశ మ్యాచ్లతో పాటు ఎలిమినేటర్లో పుంజుకున్న కోల్కతా అంత ఆషామాషీ ప్రత్యర్థి కాదిపుడు. ఇంకా చెప్పాలంటే మరో సూపర్కింగ్స్లాంటి జట్టుతో మళ్లీ తలపడటమే ఈ రెండో క్వాలిఫయర్! ఇప్పుడు నైట్రైడర్స్ను ఓడిస్తేనే ఢిల్లీ టైటిల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంటుంది. లేదంటే 2019 సీజన్లాగే మూడో స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ సేన సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధమైంది. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న కోల్కతా మూడో టైటిల్పై కన్నేసింది. ఇప్పటికే రెండుసార్లు విజేత అయిన ఈ మాజీ చాంపియన్ ఈ సీజన్లో ఇంకో రెండు మ్యాచ్లు గెలిస్తే అనుకున్నది సాధిస్తుంది. టాపార్డర్దే బాధ్యత క్యాపిటల్స్ గత మ్యాచ్లో చేసిన స్కోరు పటిష్టమైందే. కానీ టాపార్డర్లో పృథ్వీ షా ఒక్కడే మెరిశాడు. అనుభవజ్ఞుడైన ధావన్ (7), శ్రేయస్ అయ్యర్ (1) ఇద్దరు కలిసి కనీసం 10 పరుగులైనా చేయలేకపోయారు. ఇప్పుడు రెండో క్వాలిఫయర్ రూపంలో ఇద్దరికీ మరో అవకాశం వచ్చింది. టాపార్డర్ బ్యాట్స్మెన్ బాధ్యతను పంచుకుంటే మిడిలార్డర్లో కెప్టెన్ రిషభ్ పంత్, హెట్మైర్ ధనాధన్ మెరుపులతో స్కోరు అమాంతం పెంచేయగలరు. గత మ్యాచ్లో తడబడిన టాపార్డర్కు చికిత్స చేసింది కూడా పంత్, హెట్మైర్లే! ప్రమాదకారిగా మారిన కోల్కతా స్పిన్నర్ సునీల్ నరైన్ను ఎదుర్కోవడంపై పాంటింగ్ కోచింగ్ బృందం కసరత్తు చేయాలి. లేదంటే బెంగళూరులాగే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్ విభాగంలో నోర్జే, రబడ చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. టామ్ కరన్, సీనియర్ స్పిన్నర్ అశ్విన్, అక్షర్ పటేల్లు కూడా కోల్కతాను కట్టడి చేస్తే ఢిల్లీ ఫైనల్ చేరుకోవచ్చు. జోరుమీదున్న కోల్కతా లీగ్లో తన కిందున్న ముంబైకి ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా ఎలిమినేటర్ చేరుకున్న నైట్రైడర్స్ అక్కడ తనకంటే మెరుగైన బెంగళూరును ఇంటిదారి పట్టించింది. ఇప్పుడు ఏకంగా లీగ్ టాపర్ను ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లలో శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ చక్కని ఆరంభాలిస్తున్నారు. నితీశ్ రాణా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అనుభవజ్ఞులైన దినేశ్ కార్తీక్, కెప్టెన్ మోర్గాన్, షకీబ్లు కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడితే నైట్రైడర్స్కు తిరుగుండదు. గత మ్యాచ్లో నరైన్ ఆల్రౌండ్ షో హైలైట్. మేటి హిట్టర్లను నిలదొక్కుకునే లోపే పడగొట్టేసిన నరైన్ బ్యాటింగ్లో ఒకే ఓవర్లో చేసిన విధ్వంసం కోల్కతాను గెలుపుబాట పట్టించింది. సీమర్ ఫెర్గూసన్ ఎప్పట్లాగే తన మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు కష్టాలు తప్పవు. యూఏఈ అంచె లీగ్లో ఐదు విజయాలు సాధించిన ఢిల్లీకి చెక్ పెట్టిన జట్టు కోల్కతానే! ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, ధావన్, శ్రేయస్, హెట్మైర్, అక్షర్ పటేల్, టామ్ కరన్, అశ్విన్, రబడ, అవేశ్ ఖాన్, నోర్జే. కోల్కతా నైట్రైడర్స్: మోర్గాన్ (కెప్టెన్), గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, నరైన్, షకీబ్, ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి. -
T20 World Cup 2021: టీమిండియా నెట్ బౌలర్గా ఆవేశ్ఖాన్
Avesh Khan As Net Bowelr For Team India T20 WC 2021.. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ ముగిసిన తర్వాత యూఏఈలో ఉండనున్నాడు. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి ఆవేశ్ ఖాన్ టీమిండియా నెట్బౌలర్గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఆవేశ్ఖాన్ను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా నెట్ బౌలర్గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆవేశ్ ఖాన్ కూడా నెట్బౌలర్గా రావడంతో ఆ సంఖ్య రెండుకు చేరింది. అయితే ఆవేశ్ ఖాన్ స్టాండ్ బై లిస్ట్ ప్లేయర్గా కూడా పరిగణిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: T20 World Cup 2021: మెంటార్గా ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు Courtesy: IPL Twitter మధ్యప్రదేశ్కు చెందిన ఆవేశ్ ఖాన్ ఫాస్ట్ బౌలింగ్కు పెట్టింది పేరు. 140 నుంచి 145 కిమీ వేగంతో వైవిధ్యమైన బంతులు విసరడం ఆవేశ్ ఖాన్ స్పెషాలిటీ. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్కు వెన్నుముకలా మారిన ఆవేశ్ ఖాన్ ఆ జట్టు తరపున ఐపీఎల్ 2021 సీజన్లో 15 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీశాడు. సీజన్లో అత్యధిక వికెట్ల పరంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండడంతో అత్యధిక వికెట్ల జాబితాలో తొలి స్థానానికి చేరే అవకాశం ఉంది. ఇక ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ 2021 తొలి అంచె పోటీల్లో అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మలతో సమానంగా మెరుగ్గా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ టూర్కు నెట్బౌలర్గా ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కౌంటీ సెలెక్ట్ లెవెన్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో దురదృష్టవశాత్తూ టూర్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని యూఏఈకి చేరిన ఆవేశ్ ఖాన్ సెకండ్ఫేజ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రధాన బౌలర్గా మారాడు. Courtesy: IPL Twitter -
'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు
Gautam Gambhir Lauds Sunil Narine.. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నరైన్ అందరు ఇంకా మిస్టరీ స్పిన్నర్గానే చూస్తున్నారని.. మరి ఇన్నేళ్లుగా క్వాలిటి బౌలింగ్ ఎలా చేస్తున్నాడంటూ ప్రశ్నించాడు. కాగా సోమవారం ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సునీల్ నరైన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ముందు బౌలింగ్లో 4 వికెట్లు తీసిన నరైన్.. ఆ తర్వాత బ్యాటింగ్లో కీలక దశలో 3 సిక్సర్లు బాది జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నరైన్ ప్లేఆఫ్స్ మెరిసిన రెండుసార్లు కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. చదవండి: David Warner: వచ్చే సీజన్లో ఎస్ఆర్హెచ్కే ఆడాలని ఉంది.. కానీ Courtesy: IPL Twitter ఈ సందర్భంగా గంభీర్ నరైన్ ఆటతీరుపై స్పందించాడు. '' సునీల్ నరైన్ విషయంలో మిస్టరీ అనే పదం ఇప్పటికి వినిపిస్తుండడం నన్ను ఆశ్చర్చపరిచింది. మిస్టరీ అనే పదం కంటే క్వాలిటీ అనే పదం నరైన్కు ఎందుకు ఉపయోగించరో అర్థం కాదు. నరైన్ బౌలింగ్ మిస్టరీగానే ఉంటే ఇన్నేళ్ల పాటు విండీస్ తరపున క్రికెట్ ఎలా ఆడుతున్నాడు. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్వెల్లు నరైన్ బౌలింగ్లో ఔట్ అయ్యారు. ఇన్నేళ్లు ఎలా అతని బౌలింగ్లో వెనుదిరిగారో ఇప్పుడు కూడా అలానే ఔట్ అయ్యారు. దీనిలో కొత్త విషయం ఎక్కడుంది. నరైన్ బౌలింగ్లో ఆ ముగ్గురు ఇప్పటికీ ఆడలేకపోతున్నారనేదానిపై మరోసారి క్లారిటీ వచ్చింది. టాప్క్లాస్ బ్యాట్స్మెన్ను వెనక్కి పంపగల సత్తా నరైన్కు ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. Courtesy: IPL Twitter ఇక కేకేఆర్ గంభీర్ కెప్టెన్సీలోనే రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2012, 2014లో టైటిల్ గెలిచిన గంభీర్ సేనలో సునీల్ నరైన్ కీలకపాత్ర పోషించాడు. 2012 సీజన్లో 24 వికెట్లు తీసిన నరైన్.. 2014 సీజన్లో 21 వికెట్లు తీశాడు. తాజా సీజన్లో(ఐపీఎల్ 2021) 14 వికెట్లతో వరుణ్ చక్రవర్తి తర్వాత కేకేఆర్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో స్పిన్నర్గా కొనసాగుతున్నాడు. ఇక కేకేఆర్ రేపు(అక్టోబర్ 13) ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫయర్ 2 ఆడనుంది. చదవండి: Sunil Narine: ఆ ముగ్గురిని ఔట్ చేయడం ఇది రెండోసారి మాత్రమే -
వచ్చే సీజన్లో ఎస్ఆర్హెచ్కే ఆడాలని ఉంది.. కానీ
David Warner Intrested Play For SRH IPL 2022.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు ఆడడంపై కన్సల్టింగ్ ఎడిటర్ బోరియా మజుందార్ స్పందించాడు. ఐపీఎల్ 2022లో వార్నర్కు ఎస్ఆర్హెచ్కే ఆడాలని ఉంది.. కానీ టైం ఎప్పుడు ఏం నిర్ణయిస్తుందో చెప్పలేమని తెలిపాడు. అయితే వచ్చే సీజన్లో ఏ జట్టుకు ఆడే దానిపై వార్నర్ చేతుల్లో ఏం ఉండదని.. అతని కోసం వచ్చే సీజన్లో రెండు కొత్త జట్లతో పాటు ఇప్పుడున్న జట్లు కూడా వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నాడు. కాగా వార్నర్ ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో తుది జట్టులో అవకాశం రాకపోవడంతో ఎస్ఆర్హెచ్ డగౌట్లో ఉండలేకపోయాడు. అయితే ఎస్ఆర్హెచ్ ఆడిన మ్యాచ్లకు ప్రేక్షకుడిగా హాజరై ఫ్లాగ్ను ఊపుతూ జట్టును ఉత్సాహపరిచాడు. చదవండి: IPL 2021: ఐపీఎల్ రేటింగ్స్.. బీసీసీఐకి బ్యాడ్న్యూస్ ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలి అంచె పోటీల్లో కెప్టెన్గా జట్టును నడిపించడంలో విఫలమయ్యాడన్న కారణంతో వార్నర్ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి కేన్ విలియమ్సన్కు కెప్టెన్సీ అప్పగించారు. అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ తలరాత మాత్రం మారలేదు. సీజన్ మొత్తం దారుణ ప్రదర్శన కనబరిచిన ఎస్ఆర్హెచ్ 14 మ్యాచ్ల్లో 3 విజయాలు.. 11 ఓటములతో ఆఖరిస్థానంలో నిలిచింది. ఇక 2014లో ఎస్ఆర్హెచ్ జట్టులోకి వచ్చిన వార్నర్ తన తొలి సీజన్లోనే ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆ తర్వాత సీజన్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వార్నర్ 2016 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ను చాంపియన్గా నిలిపాడు. ఇక వార్నర్ ఐపీఎల్లో 150 మ్యాచ్ల్లో 5449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు.. 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: 'ప్లీజ్ అన్న.. ఎస్ఆర్హెచ్లోనే ఉండవా'.. వార్నర్ ఫన్నీ రిప్లై -
ఐపీఎల్ రేటింగ్స్.. బీసీసీఐకి బ్యాడ్న్యూస్
IPL 2021 Viewership Ratings.. ఐపీఎల్ 2021 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. క్వాలిఫయర్ 2తో పాటు ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. అయితే క్యాష్రిచ్ లీగ్గా పేరున్న ఐపీఎల్లో ప్రతీసారి వీక్షకుల సంఖ్య రికార్డుస్థాయిలో నమోదవుతూ వస్తుంది. అయితే ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో మాత్రం రేటింగ్స్ పడిపోయినట్లు రిపోర్ట్స్లో తేలింది. రిపోర్ట్స్ ప్రకారం ఐపీఎల్ రేటింగ్స్ దాదాపు 15-20 శాతం పడిపోయినట్లు తెలిసింది. కాగా ఐపీఎల్ మ్యాచ్లన్నీ స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేస్తుంది. స్టార్స్పోర్ట్స్ ఇంగ్లీష్, హిందీ చానెళ్లతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో మ్యాచ్లు ప్రసారమవుతున్నాయి. చదవండి: ఐపీఎల్ 2021 సీజన్లో ఎవరి మ్యాచ్లు ఎక్కువగా చూశారంటే.. అయితే ప్రకటనదారులతో రేటింగ్లు తగ్గడం లేదని.. వీక్షకుల సంఖ్య పడిపోవడం వల్లే ఇలా జరిగిందని ఎంటర్టైన్మెంట్(ఈటీ)లో తేలింది. రేటింగ్ల పతనానికి సంబంధించిన ఖాతాలపై ప్రకటనదారులు పరిహారం కోసం వెతికే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇలా ఐపీఎల్ రేటింగ్స్ పడిపోవడం బీసీసీఐకి అంత సానుకూలాంశం కాదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రకటనదారుల నుంచి వేలకోట్లు నష్టపోయే అవకాశం ఉంది. కాగా అక్టోబర్ చివరి నాటికి కొత్త మీడియా హక్కుల టెండర్ను విడుదల చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. రాబోయే వారంలో రేటింగ్లు పెరగకపోతే మాత్రం బీసీసీఐకి భారీ నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. చదవండి: Ab De villiers: డివిలియర్స్ చెత్త రికార్డు.. కలిసి రాని యూఏఈ -
Virat Kohli: ఆశించిన ఫలితం దక్కలేదు.. కోహ్లి భావోద్వేగం
Virat Kohli Heartfelt Note Following RCB Exit In IPL 2021: ‘‘మనం ఆశించిన ఫలితం దక్కలేదు. అయితేనేం.. సీజన్ ఆసాంతం... మీరందరు పట్టుదలగా పోరాడిన తీరు పట్ల నేను గర్వపడుతున్నాను. కానీ... ఆఖరికి మనకు నిరాశ తప్పలేదు. అయినా మనం తలెత్తునే ఉండాలి. నాకు సహకరించిన యాజమాన్యం, సహాయక సిబ్బంది... మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’’ అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఉద్వేగభరిత ట్వీట్ చేశాడు. ఆర్సీబీ సారథిగా జట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్-2021 సీజన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగుతానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు ఇప్పటి వరకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ సాధించి ఘనంగా కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని కోహ్లి భావించాడు. అయితే, సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలవడంతో నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్టు షేర్ చేశాడు. ఇక ఈ సీజన్లో కోహ్లి... 15 మ్యాచ్లు ఆడి 405 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 72(నాటౌట్). కెప్టెన్గా తొమ్మిదింటిలో ఆర్సీబీని గెలిపించాడు. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమితో ఈసారి నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చదవండి: Daniel Christian: ఆర్సీబీని ముంచేశారు కదరా; ప్లీజ్.. నా భార్యను వదిలేయండి! Not the result we wanted but I am so proud of the character shown by the boys throughout the tournament. A disappointing end but we can hold our heads high. Thank you to all the fans, management & the support staff for your constant support. 🙏 @RCBTweets pic.twitter.com/VxZLc5NKAG — Virat Kohli (@imVkohli) October 12, 2021 -
డివిలియర్స్ చెత్త రికార్డు.. కలిసి రాని యూఏఈ
AB De Villiers Failure In IPl 2021 UAE.. ఐపీఎల్ 2021లో భాగంగా కేకేఆర్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కరోనా విరామం తర్వాత సెకండ్ఫేజ్లో ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో పడిక్కల్, కోహ్లి, మ్యాక్స్వెల్, కేఎస్ భరత్ కీలకపాత్ర పోషించారు. అయితే సీనియర్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్కు మాత్రం యూఏఈ గడ్డ ఏమాత్రం కలిసిరాలేదు. ప్లేఆఫ్స్తో కలిపి డివిలియర్స్ 8 మ్యాచ్ల్లో 17.66 సగటుతో 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 0,12,11,4, 23, 19, 26,11 ఇవి డివిలియర్స్ యూఏఈ గడ్డపై నమోదు చేసిన స్కోర్లు. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం విశేషం. చదవండి: Virat Kohli: కెప్టెన్గా ఇదే చివరిసారి.. అంపైర్తో కోహ్లి వాగ్వాదం ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటింగ్లో సునీల్ నరైన్ 26 పరుగులతో గేమ్ చేంజర్ కాగా.. గిల్ 29, వెంకటేశ్ అయ్యర్ 26, నితీష్ రాణా 23 పరుగులు చేశారు. అంతకముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్లో మెరవడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా ముగిసిన కథ pic.twitter.com/4duozs0Vnk — Cricsphere (@Cricsphere) October 11, 2021 -
Daniel Christian: ఆర్సీబీని ముంచేశారు కదరా; ప్లీజ్.. నా భార్యను వదిలేయండి!
Daniel Christian and his partner face flak on social media: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు డేనియల్ క్రిస్టియాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన భార్యను వేధించవద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు. దయచేసి ఆమెను వదిలేయమంటూ అర్థించాడు. ‘‘నా భాగస్వామి ఇన్స్టాగ్రామ్ పోస్టుకు సంబంధించిన ఆ కామెంట్లు చూడండి. నిన్నటి మ్యాచ్లో నేను బాగా ఆడలేదు. కానీ ఆటను ఆటలాగే చూడండి. దయచేసి తనను వదిలేయండి’’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2021లో ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా ఆర్సీబీ.. కోల్కతా నైట్రైడర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రిస్టియాన్ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్లతో కేకేఆర్ ఆటగాడు నరైన్ 22 పరుగులతో చెలరేగడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఫలితంగా కీలక మ్యాచ్లో ఆర్సీబీ పరాజయం పాలైంది. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు క్రిస్టియాన్, అతడి భార్య డియానా అట్సలాస్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డియానా డాన్ క్రిస్టియాన్కే.. అసలు ఏం చేశావమ్మా... ఆర్సీబీని పుట్టిముంచేశారు’’ అంటూ అభ్యంతరకర పదజాలంతో దూషించారు. అంతేగాకుండా.. ‘‘ఈ సీజన్లో మొదటిసారి క్రిస్టియన్ స్కోరు.. ఒకటి దాటిందిరోయ్. గ్రేట్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘క్రిస్టియాన్ భార్యతో ఈ మ్యాచ్కు సంబంధమే లేదు. అలాంటప్పుడు ఆమెను ఎందుకు విమర్శిస్తున్నారు. తను ప్రస్తుతం గర్భవతి అనుకుంటా. పాపం వాళ్లను మానసికంగా వేధించకండి’’అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా సోమవారం నాటి మ్యాచ్లో క్రిస్టియన్ 8 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేశాడు. 1.4 ఓవర్లలో.. 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక క్రిస్టియాన్పై జరుగుతున్న ట్రోలింగ్కు ఆర్సీబీ మరో ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ ఘాటుగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup: రషీద్ ఖాన్ టాప్-5 టీ20 క్రికెటర్ల లిస్టు.. ఎవరెవరంటే! And The Player Of The Match Award Goes To De Dana Dan Christian ;#RCBvsKKR pic.twitter.com/y2HO3whDOW — Akhandbarbaadi (@akhandbarbaadi) October 11, 2021 Low life people abusing Dan Christian's wife on her insta page !! (She is pregnant too) She is no where related to her man's performance ! For this sick attitude only their favourites are being lost Everytime !! Shovel up low life #RCB-ians👎 — Karthick Shivaraman (STAY SAFE😷) (@iskarthi_) October 11, 2021 -
హర్షల్ పటేల్ను అభినందనల్లో ముంచెత్తిన బ్రావో.. సూపర్ అంటూ..
Harshal Patel: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. దీంతో హర్షల్ పటేల్ 2013 సీజన్లో అత్యధిక వికెట్లు (32) తీసిన డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో తనతో సమంగా నిలిచిన హర్షల్ పటేల్ను అభినందించాడు. "అభినందనలు హర్షల్. నీవు ఖచ్చితంగా ఈ రికార్డును సాధిస్తావు !! నీ పోరాట పటిమ చూడటానికి చాలా బాగుంది!' అని బ్రావో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు. కాగా మొత్తం 15 మ్యాచ్లాడిన హర్షల్ పటేల్ 32 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టిన హర్షల్ ఈ ఘనత సాధించాడు. కాగా 17ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్లో సునీల్ నరైన్ క్యాచ్ పడక్కల్ వదిలివేయడంతో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డను తృటిలో చేజార్చుకున్నాడు. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా హర్షల్ పటేల్ నిలిచాడు. కాగా కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు అర్హత సాధించగా... కోహ్లి సేన ఇంటిముఖం పట్టింది. చదవండి: Glenn Maxwell: కొంచెం డీసెంట్గా ఉండండి.. చెత్తగా వాగొద్దు -
Glenn Maxwell: కొంచెం డీసెంట్గా ఉండండి.. చెత్తగా వాగొద్దు
Glenn Maxwell Blasts Online Trolls: ‘‘కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెత్తగా వాగుతున్నారు. ఇది నిజంగా హేయమైన విషయం. మేమూ మనుషులమే. ప్రతిరోజు మా అత్యుత్తమ స్థాయి కనబరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అసభ్యంగా ప్రవర్తించే బదులు కొంచెం డీసెంట్గా ఉండేందుకు ప్రయత్నించండి’’ అంటూ రాయల్ చాలెంజర్స్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సీరియస్ అయ్యాడు. సామాజిక మాధ్యమాల్లో తనను, తమ జట్టును విమర్శిస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా తమకు అండగా నిలబడ్డ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు అర్హత సాధించగా... కోహ్లి సేన నిరాశగా వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆర్సీబీ ఆటగాళ్లను ముఖ్యంగా మ్యాక్సీ, డేనియల్ క్రిస్టియాన్ను ట్రోల్ చేశారు. క్రిస్టియాన్ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్లతో నరైన్ 22 పరుగులు చేసిన నేపథ్యంలో అతడిని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయాలపై ట్విటర్ వేదికగా స్పందించిన మాక్స్వెల్... ‘‘ఆర్సీబీకి ఇదొక గొప్ప సీజన్. దురదృష్టవశాత్తూ అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాం. ఏదేమైనా ఇదొక అద్భుతమైన సీజన్. ప్రతీ సమయంలోనూ మాకు అండగా నిలిచి.. మమ్మల్ని ప్రశంసించిన నిజమైన అభిమానులకు ధన్యవాదాలు!! అయితే, దురదృష్టవశాత్తూ కొంత మంది భయంకర మనస్తత్వాలు గల వ్యక్తులు సోషల్ మీడియాలో చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు!! వాళ్లలా మాత్రం ఉండకండి’’ అని ట్రోల్స్కు ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా ఈ ఏడాది ఆర్సీబీ తరఫున బరిలో దిగిన మాక్సీ 513 పరుగులు చేశాడు. ఇక సోమవారం నాటి మ్యాచ్లో అతడు.. 18 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: అప్పటి వరకు ఆర్సీబీలోనే ఉంటా.. అదే నాకు ముఖ్యం pic.twitter.com/bOwSnswXp5 — Glenn Maxwell (@Gmaxi_32) October 11, 2021 -
Virat Kohli: అప్పటి వరకు ఆర్సీబీలోనే ఉంటా.. అదే నాకు ముఖ్యం
Virat Kohli Comments On Loss Against KKR: ‘‘మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. అదే మ్యాచ్ గమనాన్ని మార్చివేసింది. వారు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. వికెట్లు పడగొట్టారు. మాకు శుభారంభమే లభించింది. కానీ.. ఇది నాణ్యమైన బౌలింగ్కు సంబంధించిన విజయం. మేం చెత్తగా బ్యాటింగ్ చేశామని చెప్పలేం. కచ్చితంగా వాళ్లు విజయానికి అర్హులే. తదుపరి రౌండ్కు వెళ్లే అర్హత వారికుందని నిరూపించారు. ఆ ఓవర్(క్రిస్టియాన్ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్లతో 22 పరుగులు) మమ్మల్ని విజయానికి దూరం చేసిందని చెప్పవచ్చు. చివరి వరకు మేము శక్తిమేర పోరాడాము. ఇదొక అద్భుతమైన మ్యాచ్. మేం కనీసం మరో 15 పరుగులు చేసినా, ఆ రెండు ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసినా ఇంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చేది కాదు’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి అనంతరం ఈ మేరకు స్పందించాడు. ‘‘సునిల్ నరైన్ మేటి బౌలర్. ఈరోజు మరోసారి ఆ విషయాన్ని రుజువు చేశాడు. షకీబ్, వరుణ్, నరైన్ మాపై ఒత్తిడి పెంచి.. మా బ్యాటర్లపై పైచేయి సాధించారు’’ అని కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లను ప్రశంసించాడు. కాగా ఈ పరాజయంతో ఆర్సీబీ ఈసారి కూడా ఎలిమినేటర్ మ్యాచ్లోనే ఇంటిబాట పట్టడంతో టైటిల్ గెలవాలన్న ఆశలు ఆవిరయ్యాయి. దీంతో కెప్టెన్గా ఘనమైన వీడ్కోలు పలకాలనుకున్న కోహ్లికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్గా యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి.. వారు స్వేచ్ఛగా ఆడగలిగేలా చేశాను. టీమిండియా సారథిగా కూడా ఇదే పని చేశాను. నా బెస్ట్ ఇచ్చాను. ఇక ఆర్సీబీ ఫ్రాంఛైజీ కోసం వందకు 120 శాతం బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేశాను. ఇప్పుడు ఆటగాడిగా కూడా అదే స్థాయిలో కష్టపడతాను. కచ్చితంగా.. ఆర్సీబీలోనే ఉంటాను. వేరే జట్టులో ఆడటాన్ని నేను అస్సలు ఊహించలేను. ఇతర సంతోషాల కంటే... విశ్వాసపాత్రుడిగా ఉండటమే నాకు ముఖ్యం. నేను ఐపీఎల్ ఆడినంత వరకు.. ఈ టోర్నీలో నా చివరి రోజు వరకు ఆర్సీబీలోనే ఉంటాను’’ అని స్పష్టం చేశాడు. కాగా ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి.. 140 మ్యాచ్లలో 66 గెలిచాడు. 70 మ్యాచ్లలో ఓడిపోయాడు. నాలుగింటిలో ఫలితం తేలలేదు. సారథిగా 2016లో ఆర్సీబీని ఫైనల్ చేర్చిన కోహ్లి.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాడు. చదవండి: Virat Kohli: కెప్టెన్గా ఇదే చివరిసారి.. అంపైర్తో కోహ్లి వాగ్వాదం KORBO. LORBO. JEETBO. 💜💛pic.twitter.com/Y86nSGEs6F — KolkataKnightRiders (@KKRiders) October 11, 2021 -
RCB Vs KKR: బెంగళూరు బైబై... పాపం.. కోహ్లి.. ఇదే ఆఖరు!
ఐపీఎల్–14 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు నిష్క్రమించింది. విరాట్ కోహ్లి సారథ్యం కూడా నిరాశగానే ముగిసింది. కోల్కతా నైట్రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ (4 వికెట్లు, 15 బంతుల్లోనే 3 సిక్సర్లతో 26 పరుగులు) ఆల్రౌండ్ షోతో ఎలిమినేటర్లో బెంగళూరు పరాజయం పాలైంది. దాంతో ఐపీఎల్ టైటిల్ ఈ సీజన్లోనూ బెంగళూరుకు అందని ద్రాక్షే అయ్యింది. రేపు జరిగే రెండో క్వాలిఫయర్లో ఫైనల్ బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టేందుకు కోల్కతా నైట్రైడర్స్ సిద్ధమైంది. షార్జా: సునీల్ నరైన్ మంత్రం ముందు కోహ్లి రణతంత్రం గెలవలేకపోయింది. మొదట తన స్పిన్ మాయాజాలంతో బెంగళూరును కట్టిపడేసిన ఈ స్పిన్నర్ తర్వాత భారీ సిక్సర్లతో మ్యాచ్పై ప్రత్యర్థి పట్టు తప్పించాడు. దీంతో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి (33 బంతుల్లో 39; 5 ఫోర్లు), దేవ్దత్ పడిక్కల్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు) తర్వాత నరైన్ (4/21) మాయాజాలానికి ఇంకెవరూ 15 పరుగులను కూడా దాటలేకపోయారు. తర్వాత కోల్కతా నైట్రైడర్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. శుబ్మన్ గిల్ (18 బంతుల్లో 29; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. నరైన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. బౌండరీలతో వేగం పెరిగినా... బెంగళూరు ఓపెనర్లు పడిక్కల్, కోహ్లి మెరుపులు మెరిపించకపోయినా... బౌండరీ లతో స్కోరు బోర్డును పరిగెత్తించారు. అయితే ఫెర్గూసన్ ఆరో ఓవర్ తొలి బంతికి దేవ్దత్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు)ను బౌల్డ్ చేశాడు. దీంతో 49 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం చెదిరింది. గత ‘మ్యాచ్ విన్నర్’ శ్రీకర్ భరత్ (9)కు టాపా ర్డర్లో ప్రమోషన్ ఇచ్చారు. కానీ దీన్ని ఈ ఆంధ్ర ఆటగాడు సది్వనియోగం చేసుకోలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 70/2 స్కోరు చేయగలిగింది. నరైన్ 4–0–21–4 కట్టుదిట్టమైన బౌలింగ్తో కోల్కతా పట్టుబిగించింది. ఇది చాలదన్నట్లు నరైన్ ఓవర్కో కీలకమైన వికెట్ను పడగొట్టడంతో బెంగళూరుకు కష్టాలు తప్పలేదు. 13వ ఓవర్ వేసిన స్పిన్నర్ కెపె్టన్ కోహ్లిని బౌల్డ్ చేశాడు. తన తదుపరి ఓవర్లో (15వ) ‘మిస్టర్ 360’ డివిలియర్స్ (11)ను క్లీన్»ౌల్డ్ చేశాడు. 17వ ఓవర్ తొలి బంతికి షహబాజ్ వికెట్ కూడా చిక్కేది. కానీ బౌండరీ దగ్గర సునాయాసమైన క్యాచ్ను శుబ్మన్ గిల్ చేజార్చాడు. అయినా నిరాశచెందని నరైన్ ... మ్యాక్స్వెల్ (15)ను ఫెర్గూసన్ క్యాచ్తో పడేశాడు. తర్వాత కొట్టేవాళ్లు, చితగ్గొట్టేవాళ్లు కరువవడంతో... 14వ ఓవర్లో వంద పరుగులకు చేరుకున్న బెంగళూరు 20 ఓవర్లలో కనీసం 140 పరుగులైనా చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో పడుతూ లేస్తూ 30 పరుగులు మాత్రమే చేసింది. ఆశలు రేపిన సిరాజ్ ఆరంభ ఓవర్లలో కోల్కతా ఓపెనర్లు శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ (26) ధాటిగా ఆడారు. గార్టన్ నాలుగో ఓవర్లో గిల్ హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. కానీ అతని దూకుడుకు ఆరో ఓవర్లో హర్షల్ పటేల్ కళ్లెం వేశాడు. రాహుల్ త్రిపాఠి (6)ని చహల్ బోల్తాకొట్టించాడు. మరోవైపు అయ్యర్ నిలకడగా ఆడటంతో 10 ఓవర్లలో కోల్కతా 2 వికెట్లకు 74 పరుగులు చేసింది. అయ్యర్ ఔటయ్యాక మ్యాచ్లో పట్టు సాధించాలనుకున్న కోహ్లికి నరైన్ మళ్లీ కొరకరానికొయ్యగా మారాడు. క్రిస్టియాన్ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్లతో 22 పరుగులు రాబట్టుకోవడంతోనే బెంగళూరు ఆశలు ఆవిరయ్యాయి. ఆఖరి 18 బంతుల్లో 15 పరుగుల విజయ సమీకరణం కోల్కతాను సులువుగా ఊరిస్తుండగా... 18వ ఓవర్ వేసిన సిరాజ్ ఆశలు రేపాడు. 3 పరుగులే ఇచ్చి నరైన్, దినేశ్ కార్తీక్ (10)లను ఔట్ చేశాడు. 19వ ఓవర్లో గార్టన్ 5 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్లో కోల్కతా 7 పరుగులు చేయాల్సిన దశలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కానీ క్రిస్టియాన్ తొలి బంతికే షకీబ్ బౌండరీ బాదడం... ఆ తర్వాత మూడు బంతులకు మూడు సింగిల్స్ రావడంతో కోల్కతా మరో 2 బంతులుండగానే విజయం సాధించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవ్దత్ (బి) ఫెర్గూసన్ 21; కోహ్లి (బి) నరైన్ 39; భరత్ (సి) వెంకటేశ్ (బి) నరైన్ 9; మ్యాక్స్వెల్ (సి) ఫెర్గూసన్ (బి) నరైన్ 15; డివిలియర్స్ (బి) నరైన్ 11; షహబాజ్ (సి) శివమ్ మావి (బి) ఫెర్గూసన్ 13; క్రిస్టియాన్ (రనౌట్) 9; హర్షల్ పటేల్ (నాటౌట్) 8; గార్టన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1–49, 2–69, 3–88, 4–102, 5–112, 6–126, 7–134. బౌలింగ్: షకీబ్ 4–0–24–0, శివమ్ మావి 4–0–36–0, వరుణ్ 4–0–20–0, ఫెర్గూసన్ 4–0–30–2, నరైన్ 4–0–21–4. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 29; వెంకటేశ్ అయ్యర్ (సి) భరత్ (బి) హర్షల్ 26; రాహుల్ త్రిపాఠి (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 6; రాణా (సి) డివిలియర్స్ (బి) చహల్ 23; నరైన్ (బి) సిరాజ్ 26; దినేశ్ కార్తీక్ (సి) భరత్ (బి) సిరాజ్ 10; మోర్గాన్ (నాటౌట్) 5; షకీబ్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–41, 2–53, 3–79, 4–110, 5–125, 6–126. బౌలింగ్: సిరాజ్ 4–0–19–2, గార్టన్ 3–0–29–0, హర్షల్ 4–0–19–2, చహల్ 4–0–16–2, మ్యాక్స్వెల్ 3–0–25–0, క్రిస్టియాన్ 1.4–0–29–0. -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా ముగిసిన కథ
Virat Kohli RCB Captain As Last IPL 2021... ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి కథ ముగిసింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టి కెప్టెన్గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని కోహ్లి భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్గా వైదొలిగాడు. వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఇంటిబాట పట్టింది. గతేడాది సీజన్(ఐపీఎల్ 2020)లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిన ఆర్సీబీకీ ఈ సీజన్లో కేకేఆర్ షాక్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ టైటిల్ లేకుండానే ఒక జట్టుకు కెప్టెన్గా కోహ్లి గుడ్బై చెప్పాల్సి వచ్చింది. చదవండి: Virat Kohli: కెప్టెన్గా ఇదే చివరిసారి.. అంపైర్తో కోహ్లి వాగ్వాదం Courtesy: IPL Twitter 2013 ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి 140 మ్యాచ్ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్లు ఫలితం తేలలేదు. అతని కెప్టెన్గా పని చేసిన కాలంలో ఆర్సీబీ ఒకసారి రన్నరఫ్(2016 ఐపీఎల్ సీజన్), మరో మూడుసార్లు ప్లేఆఫ్స్(2015, 2020, 2021 )చేరింది. కెప్టెన్గా ఆర్సీబీకి టైటిల్ అందించడంలో విఫలమయ్యాడేమో కానీ బ్యాట్స్మన్గా మాత్రం ఎప్పుడు విఫలం కాలేదు. ఆర్సీబీ కెప్టెన్గా ఐపీఎల్ 2021 సీజన్ చివరిదని.. ఇకపై ఆ జట్టుకు ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని సెకండ్ఫేజ్ ఆరంభంలోనే ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ టీమ్ ఎలాగైనా కోహ్లికి కప్ అందించి ఘనమైన వీడ్కోలు పలకాలని భావించింది. అందుకు తగ్గట్టుగానే లీగ్ దశలో ఒకటి రెండు మ్యాచ్లు మినహా మంచి ప్రదర్శన కనబరిచి ప్లేఆఫ్స్కు చేరింది. అయితే ప్లేఆఫ్స్ దశలో తమకు అలవాటైన ఒత్తిడిని అధిగమించడంలో ఆర్సీబీ మరోసారి విఫలమైంది. Final post match presentation of Virat Kohli as a #RCB captain. pic.twitter.com/B5IBGkXsFa — Johns. (@CricCrazyJohns) October 11, 2021 Virat Kohli led RCB for the final time today. The end of an era ♥️#RCBvKKR | #IPL2021 pic.twitter.com/Eo88SqLrF7 — ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2021 -
ఐపీఎల్లో హర్షల్ పటేల్ నయా రికార్డు
Harshal Patel Most wickets In IPL Season.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 15 మ్యాచ్లాడిన హర్షల్ పటేల 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ ఉండడం విశేషం. తద్వారా హర్షల్ పటేల్ సీఎస్కే బౌలర్ డ్వేన్ బ్రావోతో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. 2013 ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆ సీజన్లో 32 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్, బ్రావోల తర్వాత రెండో స్థానంలో కగిసో రబడ( ఢిల్లీ క్యాపిటల్స్, 30 వికెట్లు, ఐపీఎల్ 2020) ఉన్నాడు. ఇక జేమ్స్ ఫాల్కనర్ (28వికెట్లు, 2013 ఐపీఎల్), లసిత్ మలింగ (28 వికెట్లు, 2011 ఐపీఎల్), బుమ్రా( 27 వికెట్లు, ఐపీఎల్ 2020) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. కాగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి ఇంకా 12 పరుగుల దూరంలో ఉంది. -
కెప్టెన్గా ఇదే చివరిసారి.. అంపైర్తో కోహ్లి వాగ్వాదం
Virat Kohli Argument With Umpire Virender Sharma.. ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లి తనకు ఇదే చివరి సీజన్ అని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా కప్ అందించి కోహ్లికి కెప్టెన్గా ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని ఆర్సీబీ భావిస్తోంది. కాగా కేకేఆర్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడితే ఆర్సీబీ ఇంటిబాట పడుతుంది. అందుకే ఈ మ్యాచ్ ఆర్సీబీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ కాపాడుకునే అవకాశం ఉండడంతో ఆర్సీబీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ బ్యాటర్ ఔట్ నిర్ణయంపై అంపైర్ తీరుపై కోహ్లి వాగ్వాదానికి దిగాడు. విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స్లో ఏడో ఓవర్ చహల్ వేశాడు. ఓవర్ ఆఖరి బంతిని త్రిపాఠి పుల్ చేయబోయి మిస్ అయ్యాడు. దీంతో బంతి ప్యాడ్లను తాకింది. చహల్ ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ వీరేందర్ శర్మ నాటౌట్ ఇచ్చాడు. చహల్ అప్పీల్తో కోహ్లి వెంటనే రివ్యూ కోరాడు. అల్ట్రాఎడ్జ్లో బంతి మొదట ప్యాడ్లను తాకి నేరుగా లెగ్స్టంప్ను ఎగరగొట్టినట్లు స్పష్టంగా కనిపించడంతో త్రిపాఠి అవుట్ అని తేలింది. దీంతో కోహ్లి ఓవర్ ముగిసిన తర్వాత అంపైర్ వీరేందర్ శర్మ వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాసేపు ఇద్దరి మధ్య సీరియస్ చర్య నడిచింది. అనంతరం కోహ్లి నవ్వుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. చదవండి: Glenn Maxwell: మ్యాక్స్వెల్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలిసారి pic.twitter.com/4tRKN5lSnB — pant shirt fc (@pant_fc) October 11, 2021 -
మ్యాక్స్వెల్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలిసారి
Glenn Maxwell Completes 500 Runs For RCB.. ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీ తరపున 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా కోహ్లి, గేల్, డివిలియర్స్ త్రయం కాకుండా ఆర్సీబీ తరపున ఐదు వందల మార్క్ను అందుకున్న రెండో ఆటగాడిగా మ్యాక్స్వెల్ నిలిచాడు. ఇంతకముందు జాక కలిస్ ఆర్సీబీ తరపున 2010 ఐపీఎల్ సీజన్లో 572 పరుగులు సాధించాడు. అంతేగాక ఆర్సీబీ తరపున తొలిసారి ఆడుతున్న మ్యాక్స్వెల్ 500 పరుగుల మార్క్ను అందుకొని కొత్త చరిత్ర సృష్టించాడు. ఇక కేకేఆర్తో జరుగుతున్న ఆర్సీబీ పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. 17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. చదవండి: Virat Kohli: ఆరు సార్లు ఔటయ్యాడు.. 145 పరుగులు చేశాడు -
ఆరు సార్లు ఔటయ్యాడు.. 145 పరుగులు చేశాడు
Virat Kohli Runs In 7-15 Overs IPL 2021.. మెషిన్ గన్ విరాట్ కోహ్లి ఫామ్లో ఉంటే పరుగులు వస్తూనే ఉంటాయి. కానీ ఈ ఆర్సీబీ కెప్టెన్కు ఐపీఎల్ 2021 సీజన్లో 7 నుంచి 15 ఓవర్ల మధ్యలో బ్యాడ్ రికార్డు నమోదు చేశాడు. మధ్య ఓవర్లలో ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాడు. 8 ఓవర్లలో(7 నుంచి 15 ఓవర్లు) చూసుకుంటే 8 ఇన్నింగ్స్ల్లో 145 పరుగులు చేసిన కోహ్లి ఏకంగా ఆరుసార్లు ఔట్ కావడం విశేషం. బ్యాటింగ్ యావరేజ్ 24.17 ఉండగా.. స్ట్రైక్రేట్ 110.70 గా ఉంది. కాగా మ్యాచ్లో కేఎస్ భరత్(9) రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతిని భరత్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ యత్నించినప్పటికీ బౌండరీ లైన్ వద్ద ఉన్న వెంకటేశ్ అయ్యర్ క్యాచ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. కోహ్లి 32, మ్యాక్స్వెల్ 1 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు 21 పరుగులతో మంచి టచ్లో కనిపించిన పడిక్కల్ ఫెర్గూసన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. చదవండి: IPL 2021: లాస్ట్ బాల్ సిక్స్ కొడితే ఆ మజా వేరు -
RCB Vs KKR : క్వాలిఫయర్ 2కు కేకేఆర్.. ఇంటిబాట పట్టిన ఆర్సీబీ
ఐపీఎల్ 2021లో భాగంగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటింగ్లో సునీల్ నరైన్ 26 పరుగులతో గేమ్ చేంజర్ కాగా.. గిల్ 29, వెంకటేశ్ అయ్యర్ 26, నితీష్ రాణా 23 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, హర్షల్, చహల్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో క్వాలిఫయర్ 2కు చేరుకున్న కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. మరోవైపు వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ ఇంటిబాట పట్టింది. ఇక కోహ్లి ఆర్సీబీ కెప్టెన్గా ఇదే చివరిదన్న సంగతి తెలిసిందే. అంతకముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్లో మెరవడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. మ్యాక్స్వెల్, డివిలియర్స్, భరత్లు నిరాశపరిచారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 4, శివమ్ మావి 2 వికెట్లు తీశాడు. నితీష్ రాణా ఔట్.. కేకేఆర్ 120/4 23 పరుగులు చేసిన నితీష్ రాణా చహల్ బౌలింగ్లో డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 120పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి ఇంకా 19 పరుగుల దూరంలో ఉంది. వెంకటేశ్ అయ్యర్(26) రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్లో కీపర్ భరత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వికెట్తో హర్షల్ పటేల్ 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో హర్షల్ పటేల్ బ్రావోతో కలిసి తొలి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. నరైన్ 19, రాణా 18 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. 7 ఓవర్లలో 53/2 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన త్రిపాఠి చహల్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు శుబ్మన్ గిల్(29) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ రెండో బంతిని గిల్ షాట్ ఆడే ప్రయత్నంలో డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ►139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. కేకేఆర్ టార్గెట్ 139 కేకేఆర్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్లో మెరవడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. మ్యాక్స్వెల్, డివిలియర్స్, భరత్లు నిరాశపరిచారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 4, శివమ్ మావి 2 వికెట్లు తీశాడు. మ్యాక్స్వెల్(15) రూపంలో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్లో ఫెర్గూసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 17 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 113/5 గా ఉంది. షాబాజ్ 9, క్రిస్టియన్(0) క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. 15 ఓవర్లలో 102/4 కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్లో సూపర్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి డివిలియర్స్(11)ను క్లీన్బౌల్డ్ చేశాడు. అంతకముందు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి(39) కూడా నరైన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ 13, షాబాజ్ అహ్మద్ 5పరుగులతో ఆడుతున్నారు. కేఎస్ భరత్ ఔట్.. ఆర్సీబీ 87/2 కేఎస్ భరత్(9) రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతిని భరత్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ యత్నించినప్పటికీ బౌండరీ లైన్ వద్ద ఉన్న వెంకటేశ్ అయ్యర్ క్యాచ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 87పరుగులు చేసింది. కోహ్లి 39, మ్యాక్స్వెల్ 9 పరుగుతో ఆడుతున్నారు. పడిక్కల్ క్లీన్బౌల్డ్.. ఆర్సీబీ 53/1 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ వేసిన 5వ ఓవర్ తొలి బంతికి 21 పరుగులు చేసిన పడిక్కల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. కోహ్లి 24, భరత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 36/0 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. పడిక్కల్ 19, విరాట్ కోహ్లి 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. షార్జా: ఐపీఎల్ 2021లో నేడు కేకేఆర్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్, ఆర్సీబీలు మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక లీగ్ మ్యాచ్ల్లో రెండుసార్లు తలపడగా.. ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేశాయి. ప్లేఆఫ్స్లో కేకేఆర్, ఆర్సీబీ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో 13 సార్లు ఆర్సీబీ నెగ్గగా.. 15 సార్లు కేకేఆర్ విజయాలు అందుకుంది. ఆర్సీబీ: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్ కేకేఆర్: శుబ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి -
IPL 2021: లాస్ట్ బాల్ సిక్స్ కొడితే ఆ మజా వేరు
Match Won By Last-ball Six IPL History.. క్రికెట్ మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపిస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎంఎస్ ధోని ఆఖరిబంతికి సిక్స్ కొట్టి టీమిండియాకు కప్ అందించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ ఒక్క సిక్స్ అభిమానుల్లో ధోని పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేసింది. అలా లాస్ట్బాల్ సిక్స్ కొట్టడం అంతకముందు జరిగాయి.. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కీలక మ్యాచ్లో ఆఖరి సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్లోనూ చాలానే చూశాం. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్లోనూ ఇలాంటివే పునరావృతమవుతున్నాయి. అందులో ఒక మూడు మాత్రం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోతాయి. అవేంటో చూద్దాం. కెఎస్ భరత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 2021 Courtesy: IPL Twitter తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో భరత్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి ఆర్సీబీకి ఉత్కంఠ విజయాన్ని కట్టబెట్టాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 6 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. అయితే భరత్ మొదట డివిలియర్స్, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి ఇన్నింగ్స్ నడిపించాడు. ఇక ఆఖరి ఓవర్లో ఆర్సీబీ గెలుపుకు 15 పరుగులు అవసరమయ్యాయి. మొదటి ఐదు బంతుల్లో ఆవేశ్ ఖాన్ 9 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఒత్తిడిలో ఆవేశ్ ఖాన్ వైడ్ వేయడంతో ఈక్వేషన్ ఒక బంతికి ఐదు పరుగులుగా మారింది. ఈ దశలో ఆవేశ్ ఖాన్ వేసిన లో ఫుల్టాస్ను భరత్ లాంగాన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టి ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్గా ఆర్సీబీ- డీసీ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్లో కేఎస్ భరత్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఎంఎస్ ధోని( రైజింగ్ పుణే సూపర్ జెయింట్, 2016) Courtesy: IPL Twitter ఎంఎస్ ధోని అంటే మొదటగా గుర్తుకు వచ్చే పదం మ్యాచ్ ఫినిషర్. అయితే ఎంఎస్ ధోని ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్పై ఆఖరిబంతికి సిక్స్ కొట్టి గెలిపించాడు. కానీ 2016లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తరపున పంజాబ్ కింగ్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆఖరి బంతికి ధోని సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఆ మ్యాచ్లో 173 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే జట్టు 19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. క్రీజులో ధోనితో పాటు అశ్విన్ ఉన్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో ధోని స్ట్రైక్ తీసుకున్నాడు. తొలి బంతికి పరుగు రాలేదు. ఐదు బంతుల్లో 23 పరుగులు. అక్షర్ వైడ్ వేశాడు. అయితే ఆ తర్వాత అక్షర్ వేసిన నాలుగు బంతులను ధోని వరుసగా ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే పుణే విజయానికి ఆఖరి బంతికి సిక్స్ కావాలి. అక్షర్ పటేల్ ఫుల్ డెలివరీ వేశాడు. అంతే ధోని ఫ్రంట్ఫుట్ వచ్చి మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టడంతో రైజింగ్ పుణే జట్టులో సంబరాలు షురూ అయ్యాయి. డ్వేన్ బ్రావో(చెన్నై సూపర్కింగ్స్, 2012) Courtesy: IPL Twitter ఐపీఎల్ చరిత్రలో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన తొలి బ్యాటర్గా డ్వేన్ బ్రావో నిలిచాడు. 2012లో లీగ్ దశలో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో బ్రావో ఈ ఫీట్ను నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం అయ్యాయి. ధోనితో పాటు బ్రావో క్రీజులో ఉన్నాడు. రజత్ బాటియా వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి బ్రావో సింగిల్ తీశాడు. రెండో బంతికి ధోని బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేయడంతో సీఎస్కేకు ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో బాటియా వేసిన ఫుల్టాస్ డెలివరీని లాంగాన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ బాదడంతో సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు జరుపుకుంది. -
అరుదైన రికార్డుకు చేరువలో హర్షల్ పటేల్..
Harshal Patel On The Brink Of Breaking This Huge IPL Record: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల తీసిన రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 30 వికెట్లు ఉన్నాయి. నేడు కోల్కతాతో జరగనున్న మ్యాచ్లో మరో రెండు వికెట్లు సాధిస్తే ఆ ఘనత అతడి సొంతమవుతుంది. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా హర్షల్ పటేల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా నేడు(సోమవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. చదవండి: Virat Kohli: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో బయట పెట్టిన కోహ్లి... -
IPL 2021: అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నా: విరాట్ కోహ్లి
Virat Kohli Reveals Why he Decided to Step Down as RCB Captain ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అభిమానులను విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. అయితే కెప్టెన్గా ఎందుకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడో కోహ్లి తాజాగా వెల్లడించాడు. నేడు( సోమవారం) కోల్కతా నైట్రైడర్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ తలపడనుంది. ఈ క్రమంలో అతడు, డివిలియర్స్తో కలిసి స్టార్ స్పోర్ట్స్ వర్చువల్ ఇంటర్వూలో పాల్గొన్నాడు. తన నిర్ణయం వెనుక పనిభారం అతిపెద్ద కారణమని కోహ్లి పేర్కొన్నాడు. ఇక బాధ్యతల విషయంలో తాను నిజాయతీ లేకుండా వ్యవహరించలేని విరాట్ తెలిపాడు. 'కెప్టెన్గా తప్పుకోవడానకి పనిభారం ప్రధాన కారణం. నా బాధ్యత పట్ల నేను నిజాయితీ లేకుండా వ్యవహరించలేను. నేను దేనినైనా వందకు 120% ఇవ్వలేకపోతే, దానిని పట్టుకొని వేలాడే వ్యక్తిని కాను. ఈ విషయంలో నేను క్లియర్గా ఉంటాను’ అని స్టార్ స్పోర్ట్స్లో మాట్లాడుతున్నప్పుడు కోహ్లి చెప్పాడు. కాగా 2013లో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోహ్లి ఆర్సీబీకి టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. ఇక టోర్నీ ఆరంభమైనప్పటి నుంచీ ఇంతవరకు బెంగళూరు ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలవలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్గా కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలకాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. చదవండి: CSK Vs DC: అతడితో 19వ ఓవర్ వేయించాల్సింది.. ఆ నిర్ణయం తప్పు: గంభీర్ Curious to know what prompted @imVkohli to step down from captaincy? 🤔 The #RCB skipper reveals the reason on #InsideRCB: Tomorrow, 8:30 AM & 12 PM | Star Sports 1/1HD/2/2HD pic.twitter.com/rqcIdonx5o — Star Sports (@StarSportsIndia) October 10, 2021 -
ఇద్దరు చిన్నారులకు బాల్ గిప్ట్గా ఇచ్చిన ధోని.. వీడియో వైరల్
Ms Dhoni Gifts The Match ball to Two Young Fans: మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ అనంతరం ధోనీ మ్యాచ్ బాల్పై సంతకం చేశాడు. అయితే ఆ బంతిని స్టాండ్స్లో ఉన్న ఇద్దరు చిన్నారులకు ధోని గిప్ట్గా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మ్యాచ్లో ధోని 6 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసి జట్టును తొమ్మిదోసారి ఫైనల్కు చేర్చాడు. చదవండి: Virat Kohli: సీట్లోంచి లేచి ఎగిరి గంతేశాను.. గ్రేటెస్ట్ ఫినిషర్.. ధోనిపై ప్రశంసల జల్లు Dhoni's gift to his littles big hearted Fans pic.twitter.com/zbxcPvb9aW — Ashok Rana (@AshokRa72671545) October 10, 2021 -
IPL 2021: ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు ఆర్సీబీ కీలక ప్రకటన
RCB releases Wanindu Hasaranga and Dushmantha Chameera: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక ప్రకటన చేసింది. శ్రీలంక ఆటగాళ్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాను బయో బబుల్ నుంచి విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. టీ20 వరల్డ్కప్ (T20 World Cup) జట్టులో భాగమైన వీరిద్దరు క్వాలిఫైయర్స్ నేపథ్యంలో... శ్రీలంక జట్టుతో కలవనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా హసరంగ, చమీరాకు ఆర్సీబీ ఆల్ ది బెస్ట్ చెప్పింది. కాగా ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా నేడు(అక్టోబరు 11) కోల్కతా నైట్రైడర్స్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఆర్సీబీ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. ఇక... కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2021 సీజన్ పునః ప్రారంభమయ్యే నాటికి ఆడం జంపా, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, ఫిన్ అలెన్, వాషింగ్టన్ సుందర్ వివిధ కారణాలతో బెంగళూరు జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. వనిందు హసరంగ, దుష్మంత చమీరా, జాన్జ్ గార్టన్, టిమ్ డేవిడ్, ఆకాశ్ దీప్ వంటి ఆటగాళ్లు ఆర్సీబీలో ఎంట్రీ ఇచ్చారు. ఇక శ్రీలంక క్రికెటర్లలో హసరంగ రెండు మ్యాచ్లు ఆడి ఒక్క వికెట్ కూడా తీయకపోగా... చమీరాకు అసలు ఆడే అవకాశమే రాలేదు. చదవండి: CSK Vs DC: అతడితో 19వ ఓవర్ వేయించాల్సింది.. ఆ నిర్ణయం తప్పు: గంభీర్ శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టు: దసున్ షనక(కెప్టెన్), ధనంజయ డి సిల్వా(వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, దినేశ్ చండిమాల్, భనుక రాజపక్స, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, పాథమ్ నిసాంక, వనిందు హసరంగ, మహేశ్ తీక్షణ, అకిల ధనుంజయ, చమిక కరుణరత్నే, లహిరు కుమార, దుష్మంత చమీరా, బిరున ఫెర్నాండో. OFFICIAL ANNOUNCEMENT Wanindu Hasaranga & Dushmantha Chameera have been released from the RCB bio bubble as they join up with the SL team for their #WT20 qualifiers. We wish both of them the best & thank them for their professionalism & hard work during #IPL2021. #PlayBold pic.twitter.com/m8U2p4YaiK — Royal Challengers Bangalore (@RCBTweets) October 11, 2021 -
CSK Vs DC: అతడితో 19వ ఓవర్ వేయించాల్సింది.. పంత్ చేసిన తప్పు ఇదే!
Gautam Gambhir Commnets On DC Loss to CSK in Qualifier 1: ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్.. చివరి రెండు ఓవర్లలో చెన్నైకి 24 పరుగులు అవసరం... పర్లేదు.. టార్గెట్ కొట్టేయచ్చు. కానీ.. అప్పటి వరకు అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్లు) ఔటవ్వడంతో చెన్నై శిబిరంలో ఆందోళన కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ధోని... కాస్త కుదురుకున్నాక భారీ సిక్సర్తో ఆవేశ్ ఖాన్కు గట్టి సమాధానమిచ్చాడు. ఇక చివరి ఓవర్కు ఢిల్లీ సారథి రిషభ్ పంత్(Rishabh Pant).. టామ్ కరన్ను రంగంలోకి దింపాడు. అతడు వచ్చీ రాగానే మొయిన్ అలీని పెవిలియన్కు పంపినా.. ధోని(MS Dhoni) వరుస బౌండరీలు బాదడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. 3 బంతుల్లో 5 పరుగులు అవసరమైన తరుణంలో వైడ్ రూపంలో ఒక పరుగు రావడం, త తర్వాత ధోని బౌండరీ బాదడంతో చెన్నై సగర్వంగా తొమ్మిదోసారి ఫైనల్కు చేరింది. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన ఢిల్లీ.. క్వాలియఫైయర్-2 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. Rishabh Pant(PC: IPL)- Gautam Gambhir ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ జట్టు మాజీ సారథి గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతి ముఖ్యమైన 19వ ఓవర్లో బంతిని కగిసో రబడ(Kagiso Rabada)కు ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘రుత్రాజ్ గైక్వాడ్ను ఆవేశ్ ఖాన్ పెవిలియన్కు పంపినప్పటికీ... అత్యుత్తమ డెత్ బౌలర్ రబడాతో 19వ ఓవర్ను వేయించాల్సింది. ఇతర ఆలోచనకు తావు లేకుండా అతడికే బౌలింగ్ ఇవ్వాల్సింది. ఆవేశ్ 17, నోర్ట్జే 18, రబడ 19, టామ్ కరన్ 20.. ఈ క్రమంలో బౌలింగ్ ఆర్డర్ ఉండాల్సింది. ఆవేశ్తో 17, 19 ఓవర్లు వేయించడం సరైన నిర్ణయం కాదు. రబడ.. అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. తను వరల్డ్కాస్ బౌలర్. తన సేవలను వినియోగించుకోవాల్సింది’’ అని గంభీర్.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కాగా చెన్నై 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొంది ఫైనల్ చేరగా.. ఎలిమినేటర్ విజేతతో పంత్ సేన క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. స్కోర్లు: ఢిల్లీ క్యాపిటల్స్: 172/5 (20) చెన్నై సూపర్కింగ్స్: 173/6 (19.4) చదవండి: Virat Kohli: సీట్లోంచి లేచి ఎగిరి గంతేశాను.. గ్రేటెస్ట్ ఫినిషర్.. ధోనిపై ప్రశంసల జల్లు What a game of cricket that was! #CSK, they are now in Friday's Final of #VIVOIPL pic.twitter.com/eiDV9Bwjm8 — IndianPremierLeague (@IPL) October 10, 2021 💯/💯 Entertainment Guaranteed. Always 💙🤝💛 https://t.co/Q9mccyvvLo — Delhi Capitals (@DelhiCapitals) October 10, 2021 -
Virat Kohli: కింగ్ ఈజ్ బ్యాక్.. సీట్లోంచి లేచి ఎగిరి గంతేశాను..!
Virat Kohli Hails MS Dhoni: ధోని... అద్భుతమైన షాట్తో ఇన్నింగ్స్ ముగించి.. జట్టు గెలుపును ఖరారు చేస్తే ఆ కిక్కే వేరు. ఫార్మాట్ ఏదైనా... సిక్సర్ లేదంటే.. బౌండరీ బాది తనదైన ఫినిషింగ్ టచ్ ఇస్తే అభిమానులకు కన్నుల పండుగే. ఇక ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా ఆదివారం ఇదే తరహాలో మిస్టర్ కూల్.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కీలకమైన క్వాలిఫైయర్-1(CSK Vs DC) మ్యాచ్లో బౌండరీ బాది.. చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కేవలం అభిమానులను మాత్రమే కాదు.. సెలబ్రిటీలను కూడా ఫిదా చేస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి విరాట్ కోహ్లి ధోనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘కింగ్ ఈజ్ బ్యాక్... గొప్ప ఫినిషర్... మరోసారి నిరూపించాడు. సీట్లో నుంచి లేచి ఎగిరి గంతేసేలా చేశాడు’’ అంటూ ధోని భాయ్పై ప్రేమను చాటుకున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా సైతం ధోని ఇన్నింగ్స్పై స్పందించారు. ‘‘వావ్.. సూపర్ మ్యాచ్. ధోని.. ఫినిషర్ మరోసారి జట్టును ముందుండి నడిపించాడు. ఎప్పటిలాగానే ఎంతో కూల్గా ఉంటూనే.. తమ జట్టులోని యువ ఆటగాళ్లకు మరోసారి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు’’ అని ప్రశంసించారు. కాగా ఈ మ్యాచ్లో ధోని 6 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు చేశాడు. ఇక పంత్సేన ఓటమి పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రీతి... తదుపరి మ్యాచ్లో మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించారు. కాగా ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సిద్దార్థ్ కౌల్ బౌలింగ్లో ధోని సిక్సర్ బాది చెన్నైని గెలిపించిన సంగతి తెలిసిందే. క్వాలిఫైయర్-1 విజేత చెన్నై.. తొమ్మిదోసారి ఫైనల్కు! స్కోర్లు: ఢిల్లీ క్యాపిటల్స్: 172/5 (20) చెన్నై సూపర్కింగ్స్: 173/6 (19.4) Anddddd the king is back ❤️the greatest finisher ever in the game. Made me jump Outta my seat once again tonight.@msdhoni — Virat Kohli (@imVkohli) October 10, 2021 Wow what a match. My heart goes out to the young #DC team. Hard luck boys & all the best for the next game. Tonight belonged to #CSK. #Dhoni the finisher leading from the front, inspiring his players to give their best & keeping his cool at all times 👍 #DCvsCSK @IPL #Finisher — Preity G Zinta (@realpreityzinta) October 10, 2021 I literary was in tears when he smashed that ball into the crowd ! We love you MsDhoni❤️ You were,are and will be the king👑💌🤴 #CSKvDC #Dhoni pic.twitter.com/bJjowFT4y6 — Ram / राम 🇮🇳 (@ramkumarjha) October 10, 2021 What a game of cricket that was! #CSK, they are now in Friday's Final of #VIVOIPL pic.twitter.com/eiDV9Bwjm8 — IndianPremierLeague (@IPL) October 10, 2021 -
MS Dhoni: అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాం.. ఇప్పుడు మాత్రం!
MS Dhoni Wife Sakshi Dhoni in Tears: గత సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్... ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన తొలి టీమ్గా నిలిచింది. తొమ్మిదవసారి తుది పోరుకు అర్హత సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కెప్టెన్ ధోని.. చివరి ఓవర్లో వరుస బౌండరీలు బాది... తన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టును విజయతీరాలకు తీర్చడంతో సీఎస్కే ఫ్యాన్స్ ఆనందంతో మునిగితేలుతున్నారు. ‘‘తల... ఈ గెలుపు చిరనస్మరణీయం. గతేడాది బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాం.. ఇప్పుడు నీ ఇన్నింగ్స్ చూసి ఆనందభాష్పాలు ఆగడం లేదు. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం’’అంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్గా మారాయి. ఇక వీటన్నింటిలో ధోని భార్య సాక్షి ధోని ఫొటో హైలెట్గా నిలిచింది. ధోని.. బౌండరీ బాది చెన్నై గెలుపును ఖరారు చేయడంతో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూనే... కరతాళ ధ్వనులతో భర్త విజయాన్ని హర్షించారు. ఈ ఫొటో సీఎస్కే అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘సాక్షి మేడమ్.. ఈ క్షణంలో మేము కూడా మీలాగే భావోద్వేగాలకు గురయ్యాం. మనందరికీ ఇది ఉద్వేగభరిత క్షణం. ధోనిని మనమంతా ప్రేమిస్తున్నామనడానికి నిదర్శనం’’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఐపీఎల్-2020 సీజన్లో చెన్నై ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించగానే సాక్షి.. భావోద్వేగ పోస్టు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఇది కేవలం ఆట మాత్రమే. అసలైన విజేతలు మీరే’’ అంటూ సూపర్కింగ్స్కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఈసారి ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలవడంతో ఇలా ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు. ఇక ఆదివారం జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్లో సీఎస్కే 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపొందింది. రుతురాజ్ గైక్వాడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. స్కోర్లు: ఢిల్లీ క్యాపిటల్స్: 172/5 (20) చెన్నై సూపర్కింగ్స్: 173/6 (19.4) What a game of cricket that was! #CSK, they are now in Friday's Final of #VIVOIPL pic.twitter.com/eiDV9Bwjm8 — IndianPremierLeague (@IPL) October 10, 2021 Sakshi mam... We too are crying on that moment.. It's a bit of little emotional moment for all of us. We all love #Dhoni #CSKvsDC #ipl #Yellove pic.twitter.com/nAiXN9smLT — Alok Sah (@ImAlokSah) October 10, 2021 MS #Dhoni Is Not Just A Name, It’s An Emotion. #WhistlePodu pic.twitter.com/CqoMM9r99B — Narendra Modi fan (@narendramodi177) October 10, 2021 I literary was in tears when he smashed that ball into the crowd ! We love you MsDhoni❤️ You were,are and will be the king👑💌🤴 #CSKvDC #Dhoni pic.twitter.com/bJjowFT4y6 — Ram / राम 🇮🇳 (@ramkumarjha) October 10, 2021 I literary was in tears when he smashed that ball into the crowd ! We love you MsDhoni❤️ You were,are and will be the king👑💌🤴 #CSKvDC #Dhoni pic.twitter.com/bJjowFT4y6 — Ram / राम 🇮🇳 (@ramkumarjha) October 10, 2021 -
CSK Vs DC: చెన్నై అడుగు టైటిల్ వైపు
ఐపీఎల్లో ఇది 14వ సీజన్. ఇందులో రెండు సీజన్లు నిషేధంతో చెన్నై బరిలోకే దిగలేదు. అంటే ఆడింది 12 సీజన్లే కానీ తొమ్మిదోసారి ఫైనల్ చేరింది. చెన్నై మళ్లీ సూపర్ కింగ్స్లా ఆడింది. ఆఖరి దశకు చేరేకొద్దీ శివాలెత్తే చెన్నై ఇప్పుడు కూడా అదే చేసింది. లీగ్ టాపర్ను కొట్టి మరీ తొలి క్వాలిఫయర్తోనే ఫైనల్ చేరింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లాగే తొలి క్వాలిఫయర్లో ఓడి ఫైనల్లో బెర్త్ కోసం రెండో క్వాలిఫయర్ ఆడేందుకు సిద్ధమైంది. దుబాయ్: గతేడాది యూఏఈలో చెత్తగా ఆడి లీగ్లోనే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఈసారి గొప్పగా ఆడి ఫైనల్ చేరింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన తొలి క్వాలిఫయర్లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రిషభ్ పంత్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్లు), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. కెపె్టన్ ధోని (6 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో చెన్నైను విజయతీరానికి చేర్చాడు. పృథ్వీ ‘షో’... పృథ్వీ షా దూకుడుతో ఢిల్లీ చకచకా పరుగులు సాధించింది. హాజల్వుడ్ రెండో ఓవర్లో 4, 6 కొట్టిన షా... దీపక్ చహర్ మూడో ఓవర్లో ఏకంగా 4 ఫోర్లు కొట్టాడు. కానీ ధావన్ (7) నిరాశపరిచాడు. మరోవైపు శార్దుల్ వేసిన ఐదో ఓవర్లో పృథ్వీ రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. 4.5 ఓవర్లలో జట్టు 50 పరుగులు పూర్తయ్యాయి. ఇందులో పృథ్వీ ఒక్కడివే 42 పరుగులు! తర్వాత ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ (1) చెత్తషాట్ ఆడి రుతురాజ్ చేతికి చిక్కాడు. ఈ రెండు వికెట్లు హాజల్వుడ్కే దక్కాయి. అక్షర్ పటేల్ రాగా... పృథ్వీ 27 బంతుల్లో ఫిఫ్టీ (6 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. కాసేపు ఓపిగ్గా ఆడిన అక్షర్ పటేల్ (10) మొయిన్ అలీ బౌలింగ్లో భారీ షాట్కు యతి్నంచి డగౌట్ చేరాడు. 10 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 79/3. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాతి ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జడేజా పృథ్వీ ‘షో’కు తెరదించాడు. అనంతరం పంత్, హెట్మైర్ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో ఢిల్లీ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఉతప్ప, రుతురాజ్ దూకుడు లక్ష్యఛేదనకు దిగిన చెన్నై తొలి ఓవర్లోనే ఓపెనర్ డుప్లెసిస్ (1) వికెట్ను కోల్పోయింది. నోర్జే అతన్ని బౌల్డ్ చేశాడు. కానీ ఢిల్లీకి ఈ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. మరో ఓపెనర్, సూపర్ ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్కు జతయిన వెటరన్ రాబిన్ ఉతప్ప చెలరేగాడు. అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో ఉతప్ప 6, 4, 0, 6, 4తో 20 పరుగులు పిండు కున్నాడు. పవర్ ప్లేలో చెన్నై 59/1 స్కోరు చేసింది. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో ఢిల్లీకి కష్టాలు తప్పలేదు. ఉతప్ప 35 బంతుల్లో అర్ధసెంచరీ (5 ఫోర్లు, 2 సిక్స్లు) పూర్తి చేసుకోగా... చెన్నై 12.1 ఓవర్లలో వంద పరుగులకు చేరుకుంది. 14వ ఓవర్ వేసిన టామ్ కరన్... ఉతప్పను బోల్తా కొట్టించి రెండో వికెట్కు 110 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. అదే ఓవర్లో శార్దుల్ ఠాకూర్ (0)ను డకౌట్ చేశాడు. మరుసటి ఓవర్లో రాయుడు (1) రనౌటయ్యాడు. 15 ఓవర్లకు చెన్నై స్కోరు 121/4. విజయానికి ఆఖరి 30 బంతుల్లో 52 పరుగులు చేయాలి. 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొన్న రుతురాజ్ జట్టును నడిపించాడు. 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో రుతురాజ్ ఔటవ్వడం చెన్నైని ఆందోళనలో పడేసింది. ఉత్కంఠ పెరిగిన ఈ దశలో ధోని తానే రంగంలోకి దిని లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఆఖరి ఓవర్లో మొయిన్ అలీ (16) ఔటైనా... ఇంకో రెండు బంతులు మిగిలుండగానే ధోని మూడు బౌండరీలతో ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డుప్లెసిస్ (బి) జడేజా 60; ధావన్ (సి) ధోని (బి) హాజల్వుడ్ 7; శ్రేయస్ (సి) రుతురాజ్ (బి) హాజల్వుడ్ 1; అక్షర్ (సి) సబ్–సాన్ట్నర్ (బి) అలీ 10; పంత్ (నాటౌట్) 51; హెట్మైర్ (సి) జడేజా (బి) బ్రావో 37; టామ్ కరన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–36, 2–50, 3–77, 4–80, 5–163. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–26–0, హాజల్వుడ్ 4–0–29–2, శార్దుల్ 3–0–36–0, జడేజా 3–0–23–1, మొయిన్ అలీ 4–0–27–1, బ్రావో 3–0–31–1. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) అక్షర్ (బి) అవేశ్ ఖాన్ 70; డుప్లెసిస్ (బి) నోర్జే 1; ఉతప్ప (సి) శ్రేయస్ (బి) టామ్ కరన్ 63; శార్దుల్ (సి) శ్రేయస్ (బి) టామ్ కరన్ 0; రాయుడు (రనౌట్) 1; మొయిన్ అలీ (సి) రబడ (బి) టామ్ కరన్ 16; ధోని (నాటౌట్) 18; జడేజా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–3. 2–113, 3–117, 4–119, 5–149, 6–160. బౌలింగ్: నోర్జే 4–0–31–1, అవేశ్ ఖాన్ 4–0– 47–1, రబడ 3–0–23–0, అక్షర్ 3–0–23–0, టామ్ కరన్ 3.4–0–29–3, అశ్విన్ 2–0–19–0. Pure joy of #Yellove 🥺💛#DCvCSK #WhistlePodupic.twitter.com/3esen8fPyz — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 10, 2021 -
CSK Vs DC Qualifier 1: ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్..ఫైనల్స్కు చేరిన చెన్నై..
ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్..ఫైనల్స్కు చేరిన చెన్నై.. ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి చెన్నై ఫైనల్లో అడుగు పెట్టింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే డుప్లిసిస్ వికెట్ కోల్పోయింది. ఆనంతరం బ్యాటింగ్ వచ్చిన రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఊతప్ప 44 బంతుల్లో 7 ఫోర్లు, 63 పరుగులు చేసి టామ్ కుర్రాన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అనంతరం 4పరుగుల వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. టామ్ కరన్ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్కు చేరగా, రబాడా బౌలింగ్లో అంబటి రాయుడు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో మొయిన్ ఆలీ ఓ ఫోర్, ధోనీ ఓ సిక్సర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. టామ్ కరన్ వేసిన అఖరి ఓవర్లో 13 పరుగుల కావల్సిన సమయంలో తొలి బంతికి మొయిన్ ఆలీ ఔట్ అవ్వగా, వరుసగా 3 ఫోర్లు బాది ధోని చెన్నైను విజయతీరాలకు చేర్చాడు. ధోని కేవలం 6 బంతుల్లో 3ఫోర్లు 1 సిక్స్తో 18 పరుగులు సాధించాడు. అంతక ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయినప్పటకీ పృథ్వీ షా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్లతో 60 పరుగులు సాధించాడు. పృథ్వీ ఔటయ్యాక రిషబ్ పంత్(50), షిమ్రాన్ హెట్మైర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో చెరో వికెట్ సాధించారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన చెన్నై.. 4పరుగుల వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. టామ్ కరన్ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్కు చేరగా, రబాడా బౌలింగ్లో అంబటి రాయుడు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 15 ముగిసే సరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(52),మొయిన్ అలీ(1) పరుగులతో ఉన్నారు. కాగా చెన్నై విజయానికి 30 బంతుల్లో 52 పరుగులు కావాలి. రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. ఊతప్ప(63) ఔట్ 113 పరుగుల వద్ద ఊతప్ప రూపంలో చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. టామ్ కరన్ బౌలింగ్లో ఊతప్ప(63) శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నిలకడగా ఆడుతున్న చెన్నై.. 10 ఓవర్లకు 94/1 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిలకడగా ఆడుతుంది. ఆదిలోనే డుప్లెసిస్ వికెట్ కోల్పోయినప్పటకీ రాబిన్ ఉతప్ప(51), రుతురాజ్ గైక్వాడ్(43) ఇద్దరూ నిలకడగా ఆడుతూ చెన్నై స్కోర్ బోర్డును చక్కదిద్దారు. 11.3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. చెన్నైకు బిగ్ షాక్.. డు ప్లెసిస్(1) ఔట్ 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ కేవలం 1 పరుగుకే నోర్జ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్కు చేరాడు. 2 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాబిన్ ఉతప్ప(10), రుతురాజ్ గైక్వాడ్(3) పరుగులతో ఉన్నారు. Photo Courtesy: IPL మెరిసిన పృథ్వీ షా.. చెన్నై టార్గెట్ 173 ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయినప్పటకీ పృథ్వీ షా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్లతో 60 పరుగులు సాధించాడు. పృథ్వీ ఔటయ్యాక రిషబ్ పంత్(50), షిమ్రాన్ హెట్మైర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో చెరో వికెట్ సాధించారు. నాలగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా (60) ఔట్ సీఎస్కే జరగుతున్న మ్యాచ్లో అర్ధసెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న పృథ్వీ షా వికెట్ను ఢిల్లీ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన పృథ్వీ షా, డు ప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కాగా పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్లతో 60 పరుగులు సాధించాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(7), షిమ్రాన్ హెట్మైర్(7) పరుగలుతో ఉన్నారు మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. అక్షర్ పటేల్ (10) ఔట్ 77 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.మొయిన్ అలీ బౌలింగ్లో అక్షర్ పటేల్ (10), సాంటినర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..అయ్యర్(1) ఔట్ 51 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ కేవలం (1) పరుగు మాత్రమే చేసి జోష్ హాజెల్వుడ్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 7 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 60 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42), అక్షర్ పటేల్(6) పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధావన్(7) ఔట్ ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్లో భాగంగా సీఎస్కే జరగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ధావన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ధావన్, హాజెల్వుడ్ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కాగా మరో ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. కేవలం 17 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 42 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42),శ్రేయస్ అయ్యర్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. Chennai Super Kings & Delhi Qualifier 1 Highlights: ఐపీఎల్ 2021లో భాగంగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ ఆసక్తికరమైన సమరానికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి అర్హత సాధించనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో రెండు జట్లు ఇప్పటి వరకూ 25 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడ్డాయి. 15మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా.. మిగిలిన 10 మ్యాచ్ల్లో ఢిల్లీ గెలిచింది. కాగా ప్రస్తుత సీజన్ లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్ల్లోను చెన్నైని ఢిల్లీ చిత్తుగా ఓడించింది. తుది జట్లు: చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్వుడ్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), టామ్ కరన్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్ చదవండి: 'ప్లీజ్ అన్న.. ఎస్ఆర్హెచ్లోనే ఉండవా'.. వార్నర్ ఫన్నీ రిప్లై -
'ప్లీజ్ అన్న.. ఎస్ఆర్హెచ్లోనే ఉండవా'.. వార్నర్ ఫన్నీ రిప్లై
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్కు గుడ్బై చెప్పనున్న సంగతి తెలిసిందే. అధికారికంగా వార్నర్ గుడ్బై చెప్పినట్లు ఎక్కడ వార్తలు రాకపోయినప్పటికీ.. సెకండ్ఫేజ్లో ఎస్ఆర్హెచ్ ఆడిన తొలి రెండు మ్యాచ్లు మినహా మిగతా ఏ మ్యాచ్లోనూ వార్నర్ ఆడలేదు. వార్నర్ స్థానంలో రాయ్ను ఆడించడం.. అతనికి జోడీగా సాహా, అభిషేక్ శర్మలు ఓపెనింగ్ చేశారు. ఈ విషయంతో వార్నర్ ఎస్ఆర్హెచ్కు ఇకపై ఆడడనేది మరింత క్లియర్గా తెలిసొచ్చేలా చేసింది. వచ్చే ఐపీఎల్ మెగా వేలంలో వార్నర్ కచ్చితంగా వేరే టీమ్కు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదవండి: నిజంగా గుండె పగిలింది.. కనీసం చివరి మ్యాచ్ అయినా ఆడనివ్వండి! ఇదే సమయంలో ఫ్యాన్స్ మాత్రం డేవిడ్ వార్నర్ను ఎస్ఆర్హెచ్ను వదిలిపెట్టి వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు వార్నర్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. '' వార్నర్ అన్నా.. ఎస్ఆర్హెచ్ వదిలివెళ్లకు.. మీకు మేమున్నాం'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి బదులుగా వార్నర్.. కేవలం లాఫింగ్ ఎమోజీని జత చేశాడు. అంతకముందు ఎస్ఆర్హెచ్తో తన బంధం ముగిసిదంటూ వార్నర్ తన ఇన్స్టాగ్రామ్లో ఉద్వేగభరిత పోస్ట్ షేర్ చేశాడు. ''ఇంతకాలం మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్. ఏడేళ్లలో మీరు నాకిచ్చిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మా జట్టు వంద శాతం ప్రదర్శన చేయడంలో మీరే డ్రైవింగ్ ఫోర్స్ . మీరిచ్చిన సపోర్ట్కు కృతజ్ఞతలు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున నా కెరీర్ అద్భుతంగా సాగింది. నేను-నా కుటుంబం మిమ్మల్ని మిస్ అవుతున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. వార్నర్ ఈ సీజన్లో మొత్తం 8 మ్యాచ్లు ఆడాడు. దాంట్లో 195 రన్స్ చేశాడు. వాటిల్లో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో వార్నర్ ముందున్నాడు. సన్రైజర్స్ తరపున 95 మ్యాచుల్లో 49.55 సగటుతో 4014 రన్స్ చేశాడు . 2016లో వార్నర్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup: కచ్చితంగా వార్నరే ఓపెనింగ్ చేస్తాడు: ఫించ్ David Warner: మైదానంలో వార్నర్.. ఏంటన్నా ఇదంతా.. వచ్చే సీజన్లో... -
'ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలనేది ఎన్నో ఏళ్ల కల'
KS Bharart... ఐపీఎల్ లీగ్ చివరి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ జట్టు తరఫున కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు విశాఖ కుర్రాడు శ్రీకర్ భరత్. కోహ్లీతో సహా మరో ఓపెనర్ ఆరుపరుగుల స్కోర్కే పెవిలియన్కు చేరిన దశలో టాప్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై మరుపురాని ఇన్నింగ్స్తో వికెట్ కీపర్ భరత్ చరిత్రలో నిలిచిపోయాడు. ఈ మ్యాచ్లో భరత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భరత్ షార్జా నుంచి ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడాడు. Courtesy: IPL Twitter ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఎన్నో ఏళ్ల నుంచి కల కంటున్నానని చెప్పాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరి బంతికి ఐదు పరుగులు కావల్సిన స్థితిలో లాంగ్ఆన్ మీదుగా భారీ సిక్సర్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాయల్స్పై 44, ముంబైపై 32, సన్రైజర్స్పై 12 పరుగులు చేసిన భరత్ లీగ్ చివరి మ్యాచ్లో(78నాటౌట్) మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది తానేంటో చూపించి విశాఖ కీర్తిని ఇనుమడింపజేశాడు. నాకవుట్లో 11న నైట్రైడర్స్తో షార్జాలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతున్నాడు. Courtesy: IPL Twitter చదవండి: KS Bharat: కప్ కొట్టి కోహ్లి చేతిలో పెట్టడమే లక్ష్యం Virat Kohli Celebration: సిక్స్తో గెలిపించిన శ్రీకర్ భరత్.. కోహ్లి రచ్చ రచ్చ -
DC vs CSK: ‘ఫైనల్’ వేటలో...
గత రెండేళ్లుగా పురోగతి సాధిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం ఈ సారి టైటిలే! 2019లో ప్లే ఆఫ్స్కు చేరి మూడో స్థానంలో నిలిచిన జట్టు గతేడాది ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇప్పుడూ ఫైనల్ చేరి ఆపై లక్ష్యాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చెన్నై ప్లే ఆఫ్స్ కొత్త కాదు. మూడు సార్లు చాంపియన్. అయితే గతేడాది లీగ్లోనే ని్రష్కమించిన చేదుఅనుభవాన్ని ఈసారి టైటిల్తో చెరిపేయాలని చూస్తోంది. ఈ క్రమంలో మొదటి అడుగు ఫైనల్పై దృష్టి పెట్టింది. దుబాయ్: ముందుగా ప్లే ఆఫ్స్ చేరుకున్న జట్ల మధ్య ముందుగా ఫైనల్ తేల్చుకునే మ్యాచ్ నేడు జరుగనుంది. ఆదివారం తొలి క్వాలిఫయర్లో ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై సూపర్కింగ్స్ జట్టు తలపడనుంది. లీగ్ దశలో ఢిల్లీనే టాపర్. ఏ జట్టూ గెలవనన్ని మ్యాచ్లు గెలిచింది. క్యాపిటల్స్ జట్టు ఆల్రౌండ్ సత్తాతో దూసుకొచి్చంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో నేరుగా ఫైనల్కు చేరాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు చెన్నై టాపార్డర్తోనే నెట్టుకొచి్చంది. అనుభవజ్ఞులకు కొదవలేకపోయినా... ఈ సీజన్లో ఆ ప్రభావం కనిపించలేదు. ఇప్పుడు అసలైన సమరం మొదలు కావడంతో తప్పకుండా ధోని సేన సిసలైన ఆటతీరును ప్రదర్శించడం ఖాయం. కాబట్టి చెన్నై కూడా మరో మ్యాచ్ దాకా వేచి చూడకుండా ఈ విజయంతోనే తుది పోరుకు చేరేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. అక్కడ... ఇక్కడ... ఢిల్లీదే పైచేయి ఈ సీజన్లో ఢిల్లీ దూసుకెళ్తోంది. కోచ్ రికీ పాంటింగ్ ప్రణాళికలు గత రెండు సీజన్లుగా మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. నిలకడైన బ్యాటింగ్, కట్టడి చేసే బౌలింగ్ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తొలి దశ పోటీలు జరిగిన భారత్లో, రెండో అంచె జరుగుతున్న యూఏఈలో చెన్నై సూపర్ కింగ్స్పై క్యాపిటల్స్దే పైచేయి. ముంబైలో చెన్నైని ఓడించిన పంత్ సేన ఇక్కడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఓపెనింగ్లో పృథ్వీ షా, శిఖర్ ధావన్ శుభారంభం అందిస్తే... ఆ తర్వాత ఇన్నింగ్స్ను మెరుపు వేగంతో చక్కబెట్టేందుకు కెపె్టన్ పంత్తో పాటు శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఆ తర్వాత స్లాగ్ ఓవర్లలో హెట్మైర్, స్టొయినిస్ మెరుపులు జట్టుకు భారీస్కోరును కట్టబెడతాయి. ఇక బౌలింగ్లో రబడ, నోర్జేలిద్దరూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు ప్రమాదకరంగా మారారు. కుర్రాడు అవేశ్ ఖాన్ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. స్పిన్నర్లలో అనుభవజు్ఞడైన అశ్విన్, అక్షర్ పటేల్లు అవసరమైనపుడు బ్యాట్లతోనూ ఇన్నింగ్స్ను నడిపించడం ఢిల్లీకి అదనపు బలం. ఓపెనర్లపైనే భారం మరోవైపు చెన్నై బ్యాటింగ్ బలంతో ముందడుగేసింది. సింహ భాగం మ్యాచ్ల్లో జట్టు భారమంతా రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ మోశారు. అడపాదడపా రాయుడు, మొయిన్ అలీ మెరిపిస్తున్నాడు. అనుభవజు్ఞడైన సురేశ్ రైనా వైఫల్యం వల్ల రాబిన్ ఉతప్పకు అవకాశమిచ్చారు. అయితే కీలకమైన ఈ మ్యాచ్లో మళ్లీ రైనాను తుది జట్టులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ధోని మార్క్ ఇన్నింగ్స్ ఈ సీజన్లో ఇంకా బాకీ ఉంది. ఈ మ్యాచ్లో అతని నుంచి ‘విజిల్ పొడు’చే ఇన్నింగ్స్ ఆవిష్కృతమైతే తప్పకుండా చెన్నై అభిమానులకు పండగే! బ్రావో ‘ఎక్స్ట్రా’ల బౌలింగ్ జట్టును కలవరపెడుతోంది. ముఖ్యంగా ఇటీవలి మ్యాచ్ల్లో బ్రావో ధారాళంగా పరుగులు సమరి్పంచుకోవడంతో పాటు ఎక్స్ట్రాల రూపంలో విరివిగా పరుగులు సమరి్పంచుకుంటున్నాడు. శార్దుల్ ఠాకూర్, హాజల్వుడ్లు ఆరంభ ఓవర్లలో కట్టడి చేయగలిగితే స్పిన్తో జడేజా మాయచేసేందుకు అవకాశముంటుంది. ఢిల్లీ ఎంత బలంగా ఉన్నా... మాజీ చాంపియన్ చెన్నై వీరంగం చేస్తే కష్టాలు తప్పవు. జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, హెట్మైర్, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబడ, నోర్జే, అవేశ్ ఖాన్. చెన్నై సూపర్కింగ్స్: ధోని (కెపె్టన్), రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప/సురేశ్ రైనా, జడేజా, బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, హాజల్వుడ్. -
కప్ కొట్టి కోహ్లి చేతిలో పెట్టడమే లక్ష్యం
Srikar Bharat Comments On Virat Kohli.. ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి కోన శ్రీకర్ భరత్ ఒక్కసారి హీరోగా మారిపోయాడు. అంతేగాక 52 బంతుల్లోనే 78 పరుగులు చేసిన భరత్ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా భరత్ ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కీలక సమయంలో ఒక మంచి ఇన్నింగ్స్తో మెరిసినందుకు సంతోషంగా ఉంది. యంగ్స్టర్స్ను ప్రోత్సహించడం కోహ్లికి ఉన్న గొప్ప అలవాటు. ఈసారి ఐపీఎల్ టైటిల్ కొట్టి కోహ్లి బాయ్కి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎల్ టైటిల్తో పాటు కేక్పై చెర్రీ పెట్టి సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఎందుకంటే ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లికి ఇదే ఆఖరి సీజన్. అందుకే కోహ్లికి గిఫ్ట్గా టైటిల్ను అందించాలనుకుంటున్నా.'' అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 10,11,13 తేదీల్లో క్వాలిఫయర్ మ్యాచ్లు జరగనుండగా.. అక్టోబర్ 15వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చదవండి: T20 World Cup 2021: రోహిత్ భయ్యా.. మాకు రెండు టికెట్స్ ఇప్పించవా శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
Team India head Coach: రవిశాస్త్రి స్థానంలో ఆయనా?!
Tom Moody eyeing to replace Ravi Shastri?: టీ20 వరల్డ్కప్ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పదవి నుంచి తప్పుకోనున్నారన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాబోయే కోచ్లుగా అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. తాజాగా... మరో కొత్త పేరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ డైరెక్టర్ టామ్ మూడీ భారత జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ దిశగా ఎస్ఆర్హెచ్ పెద్దలు పావులు కదుపుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ‘‘సన్రైజర్స్ వరుస వైఫల్యాల నేపథ్యంలో డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ప్లేయర్ల పట్ల కఠిన వైఖరి అవలంబించడం సహా.. యువ ఆటగాళ్లతో జట్టును నింపాలని గట్టిగా వాదించడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టామ్ మూడీ.. టీమిండియా కోచ్గా వస్తే మెరుగైన ఫలితాలు తీసుకురాగలడు’’అని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాలపై ప్రభావం చూపగల ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ పెద్దలు అధికారుల వద్ద ప్రస్తావించినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది బీసీసీఐ ప్రకటన తర్వాతే తేలుతుంది. కాగా తొలి టైటిల్(2016) సాధించిపెట్టిన వార్నర్ను కెప్టెన్సీ నుంచి తొలగించడం సహా తుది జట్టు నుంచి కూడా ఫ్రాంఛైజీ అతడిని తప్పించిన సంగతి తెలిసిందే. వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ను సారథిగా నియమించారు. ఈ నిర్ణయాల వెనుక టామ్ మూడీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పలు మార్పులు చేసినప్పటికీ హైదరాబాద్ ఈ సీజన్లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్లలో కేవలం 3 మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఇక గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ తదితర విదేశీ కోచ్లు టీమిండియాకు శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup: ఓపెనర్గా సెలక్ట్ అయ్యానని విరాట్ భాయ్ చెప్పాడు! -
ఐపీఎల్ 2021 సీజన్లో ఎవరి మ్యాచ్లు ఎక్కువగా చూశారంటే..
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో సీఎస్కే దుమ్మురేపింది. టోర్నీ ముగియకముందే అత్యధిక వీక్షకులను సంపాధించిన జట్టుగా సీఎస్కే చరిత్ర సృష్టించింది. సీఎస్కే తర్వాత ముంబై ఇండియన్స్ మ్యాచ్లను టీవీల్లో జనాలు ఎక్కువగా వీక్షించినట్లు బార్క్ (బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) తెలిపింది. ఐపీఎల్ 2020 సీజన్లో దారుణ ప్రదర్శనతో నిరాశపరిచిన సీఎస్కే ఈ సీజన్లో దుమ్మురేపడంతో పాటు.. భారీగా వీక్షకులను పెంచుకుంది సీఎస్కే ఆడిన ప్రతీ మ్యాచ్కు కనీసం 2-3 శాతం వీక్షకులు పెరగడం విశేషం. సీఎస్కే ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడులోని చెన్నై మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి సీఎస్కే మ్యాచ్లు ఎక్కువ మంది చూసినట్లు బార్క్ ప్రకటించింది. సీఎస్కే తర్వాతి స్థానంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. చదవండి: IPL 2021: ఈసారైనా వాళ్లు ట్రోఫీ సాధిస్తే చూడాలని ఉంది! Courtesy: IPL Twtitter కాగా ఐపీఎల్ మ్యాచ్లన్ని స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్స్పోర్ట్స్ హిందీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో మ్యాచ్లు ప్రసారమవుతున్నాయి. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 1 మధ్యబార్క్) నివేదిక ప్రకారం స్టార్స్పోర్ట్స్ హిందీ చానెల్ మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఐపీఎల్ 2021 ఫేజ్2 ప్రారంభమైన తర్వాత ఒక వారంలో స్టార్స్పోర్ట్స్ 1 హిందీ చానెల్ మూడోస్థానానికి పరిమితం కావడం ఇదే తొలిసారి. బార్క్ నివేదిక ప్రకారం తొలి రెండు స్థానాల్లో సన్టీవీ, స్టార్ప్లస్ ఉన్నాయి. కాగా ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 తొలిఫేజ్ మ్యాచ్లు జరిగిన అన్ని వారాలు స్టార్స్పోర్ట్స్ 1 హిందీ చానెల్ తొలి స్థానంలో కొనసాగడం విశేషం. కాగా ఐపీఎల్ సెకండ్ఫేజ్లో తొలివారం దాదాపు 400 మిలియన్ల మంది మ్యాచ్ను వీక్షించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలిదశలో 35 మ్యాచ్లు ముగిసేసరికి 380 మిలియన్ల మంది వీక్షకులను సంపాదించింది. ఐపీఎల్ 2020 కంటే 12 మిలియన్లు ఎక్కువగా ఉండడం విశేషం. చదవండి: Virat Kohli Celebration: సిక్స్తో గెలిపించిన శ్రీకర్ భరత్.. కోహ్లి రచ్చ రచ్చ -
IPL 2021: ఈసారైనా వాళ్లు ట్రోఫీ సాధిస్తే చూడాలని ఉంది!
Lance Klusener Comments On IPL Winner: ఐపీఎల్-2021 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నుంచి ప్లే ఆఫ్స్ షెడ్యూల్ మొదలుకానుంది. అక్టోబరు 10న క్వాలిఫయర్-1, అక్టోబరు 11న ఎలిమినేటర్, అక్టోబరు 13న క్వాలిఫయర్-2, అక్టోబరు 15న ఫైనల్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ విజేత గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూసెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలిస్తే చూడాలని ఉందన్నాడు. ఆర్సీబీ ట్రోఫీ సాధించాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘విరాట్, ఏబీ వంటి వంటి స్టార్ ప్లేయర్లు ఒకే జట్టులో ఉన్నప్పటికీ ఇంతవరకు ఆ జట్టు(ఆర్సీబీ) ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ విషయం మా మనసును కలిచివేస్తోంది. బెంగళూరు కప్ గెలిస్తే బాగుంటుంది. ఈసారి వాళ్లు కచ్చితంగా విజేతలుగా నిలుస్తారని భావిస్తున్నా. ఒక్కసారైనా వాళ్లు ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ప్లే ఆఫ్స్కు చేరిన మూడో జట్టుగా నిలిచిన ఆర్సీబీ... శుక్రవారం నాటి మ్యాచ్లో టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో వైజాగ్ బ్యాట్స్మన్ శ్రీకర్ భరత్.. చివరి బంతిని సిక్సర్గా మలిచి ఆర్సీబీ గెలుపును ఖరారు చేశాడు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలిచి చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక 9 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న కోహ్లి సేన అక్టోబరు 11న.. షార్జా వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిస్తే క్వాలియర్-1లో ఓడిన జట్టుతో ఆర్సీబీ.. క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడుతుంది. ఇక ఈ సీజన్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: IPL 2021: టీ20 వరల్డ్కప్ బాగా ఆడు.. కానీ గెలవకూడదు.. ఓకేనా! MI Vs SRH: ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ -
T20 World Cup: ఓపెనర్గా సెలక్ట్ అయ్యానని విరాట్ భాయ్ చెప్పాడు!
Ishan Kishan Reveals About Role In T20 World Cup Squad: సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టాడు ముంబై ఇండియన్స్ క్రికెటర్ ఇషాన్ కిషన్. 32 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి సత్తా చాటాడు. తద్వారా ముంబై ఘన విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్.. ఇటీవల రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఫామ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతడు.. శుక్రవారం నాటి మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు. ఈ క్రమంలో అక్టోబరు 17 నుంచి టీ20 వరల్డ్ కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం అతడు స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. తనను ఓపెనర్గా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండమని చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు..‘‘ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో విరాట్ భాయ్తో మాట్లాడాను. జస్ప్రీత్ భాయ్ కూడా నాకెంతో సాయం చేశాడు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కూడా.. నాకు మద్దతుగా నిలిచారు. ప్రతీ ఒక్కరు నాకు అండగా ఉన్నారు. నువ్వింకా నేర్చుకునే దశలో ఉన్నావని, తప్పుల నుంచి పాఠాలు చేర్చుకుని.. వరల్డ్కప్ టోర్నీలో వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ వెన్నుతట్టారు. వారి సలహాలు, సూచనలు పాటించాను. సమయం వచ్చినపుడు నన్ను నేను నిరూపించుకోగలిగాను. ‘‘జట్టులో ఓపెనర్గా నువ్వు సెలక్ట్ అయ్యావు. మేజర్ టోర్నీలో ఓపెనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండు’’ అని విరాట్ భాయ్ చెప్పాడు. నాకెంతో ఆనందంగా అనిపించింది. నిజానికి ఓపెనింగ్ చేయడమంటే నాకెంతో ఇష్టం’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2021: టీ20 వరల్డ్కప్ బాగా ఆడు.. కానీ గెలవకూడదు.. ఓకేనా! Courtesy: IPL Twitter ఇక ముంబై లీగ్ దశలోనే ఇంటిబాట పట్టినప్పటికీ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన కనబరిచామని ఇషాన్ కిషన్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘నాతో పాటు జట్టులోని మిగతా సభ్యులు కూడా రాణించడం సంతోషకరం. వరల్డ్కప్ టోర్నీకి ముందు ఫామ్లోకి రావడం గొప్ప విషయం. పూర్తి సానుకూల దృక్పథంతో ఆడాము. 250-260 పరుగులు చేయాలని భావించాం. ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఎప్పుడు పరిస్థితులు, ఎలా మారతాయో తెలియదు. ఏదేమైనా మన అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబరచడమే ముఖ్యం’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్(84), సూర్యకుమార్ యాదవ్(82) ఈ మ్యాచ్తో అద్బుతమైన ఫామ్లోకి రావడం ఐసీసీ ఈవెంట్లో టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించిందని చెప్పవచ్చు. చదవండి: MI Vs SRH: ముంబై 235 పరుగులు చేసినా... -
IPL 2021: టీ20 వరల్డ్కప్ బాగా ఆడు.. కానీ గెలవకూడదు.. ఓకేనా!
RR message To Proteas Spinner Tabraiz Shamsi Goes Viral: ఐపీఎల్-2021 లీగ్ స్టేజ్ ముగిసిన నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు చెందిన విదేశీ ఆటగాళ్లు క్యాంపును వీడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ ఫ్రాంఛైజీ వారికి ఆత్మీయ వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తబ్రేజ్ షంసీ(దక్షిణాఫ్రికా), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), ముస్తాఫిజుర్ రహ్మమాన్(బంగ్లాదేశ్) తదితరులను ఇందులో చూడవచ్చు. ఇక వీడ్కోలు పలికే సందర్భంగా.. ఆర్ఆర్ అధికారి ఒకరు షంసీతో సంభాషించిన తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఐపీఎల్ ముగిసిన రెండు రోజుల వ్యవధిలో టీ20 వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు అధికారి.. షంసీని ఉద్దేశించి.. ‘‘వరల్డ్కప్ బాగా ఆడు.. షంసీ.. కానీ గెలవకూడదు.. ఓకేనా? ఇండియా కప్ గెలుస్తుంది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన షంసీ.. ‘‘ఛాన్సే లేదు’’ అంటూ బదులిచ్చాడు. ఇక గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ.. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా... ఆండ్రూ టై స్థానంలో రాజస్తాన్ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్(ఢిల్లీ క్యాపిటల్స్తో) ఆడిన ఈ ప్రొటీస్ బౌలర్ ఖాతా తెరవలేకపోయాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్లలో కేవలం ఐదింట గెలిచిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో బౌలర్ల జాబితాలో 775 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న షంసీ.. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఆడబోయే దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టీ20 జట్టు: తెంబ బవుమా (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), పార్చూన్, హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్తేజ్, ప్రొటోరియస్, కగిసో రబాడ, షంషీ, దుస్సేన్. రిజర్వ్ ప్లేయర్లు: జార్జ్ లిండే, ఫెహ్లువాయో, విలియమ్స్. చదవండి: MI Vs SRH: ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ టీ20 వరల్డ్కప్కి ఐర్లాండ్ జట్టు ప్రకటన.. View this post on Instagram A post shared by Rajasthan Royals (@rajasthanroyals) -
RCB Vs DC: చివరి బంతికి సిక్సర్తో ఆర్సీబీని గెలిపించిన ఆంధ్ర బ్యాట్స్మెన్!
దుబాయ్: ఒకే ఒక్క ఇన్నింగ్స్తో ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ హీరోగా అవతరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో వైజాగ్కు చెందిన భరత్ సూపర్ షోతో అదరగొట్టాడు. ఆఖరి ఓవర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయానికి 15 పరుగులు అవసరం కాగా... తొలి మూడు బంతులకు 7 పరుగులు లభించాయి. దాంతో బెంగళూరు విజయ సమీకరణం చివరి మూడు బంతుల్లో 8 పరుగులుగా మారింది. స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న భరత్... అవేశ్ ఖాన్ వేసిన నాలుగో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. ఐదో బంతికి రెండు పరుగులు సాధించడంతో... ఆఖరి బంతికి 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే అవేశ్ ఖాన్ వైడ్ వేయడంతో... బెంగళూరు గెలుపు సమీకరణం చివరి బంతికి ఐదు పరుగులుగా మారింది. ఉత్కంఠ తారస్థాయికి చేరిన ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాని భరత్ ... లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. దాంతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై బెంగళూరు 7 వికెట్లతో గెలిచి లీగ్ను విజయంతో ముగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రీకర్ భరత్ (52 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు), మ్యాక్స్వెల్ (33 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు) అజేయమైన నాలుగో వికెట్కు 111 పరుగులు జోడించారు. అంతకుముందు ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (31 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శిఖర్ ధావన్ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్లు), హెట్మైర్ (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. సిరాజ్ (2/25) ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి గెలుపొందింది. సూపర్ ఛేజింగ్... ఛేదనలో బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. పడిక్కల్ (0), కెపె్టన్ కోహ్లి (4) వెంట వెంటనే అవుటవ్వగా... అశలు పెట్టుకున్న డివిలియర్స్ (26 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా నిరాశ పరిచాడు. అయితే ఈ సమయంలో క్రీజులో ఉన్న భరత్, మ్యాక్స్వెల్ జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. అదే సమయంలో ఢిల్లీ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. అక్షర్ వేసిన 14వ ఓవర్లో మ్యాక్స్వెల్ ఇచి్చన రెండు సులభమైన క్యాచ్లను శ్రేయస్ అయ్యర్, అశి్వన్ జారవిడిచారు. ఈ క్రమంలో భరత్ 37 బంతుల్లో... మ్యాక్స్వెల్ 32 బంతుల్లో అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఇక చివరి ఓవర్లో వీరిద్దరూ చెలరేగడంతో బెంగళూరుకు విజయం ఖాయమైంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) గార్టన్ (బి) చహల్ 48; ధావన్ (సి) క్రిస్టియాన్ (బి) హర్షల్ పటేల్ 43; పంత్ (సి) భరత్ (బి) క్రిస్టియాన్ 10; శ్రేయస్ అయ్యర్ (సి) క్రిస్టియాన్ (బి) సిరాజ్ 18; హెట్మైర్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 29; రిపల్ పటేల్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–88, 2–101, 3–108, 4–143, 5–164. బౌలింగ్: మ్యాక్స్వెల్ 3–0–29–0, సిరాజ్ 4–0–25–2, గార్టన్ 3–0–20–0, యజువేంద్ర చహల్ 4–0– 34–1, హర్షల్ పటేల్ 4–0–34–1, క్రిస్టియాన్ 2–0–19 –1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రబడ (బి) నోర్జే 4; దేవదత్ పడిక్కల్ (సి) అశ్విన్ (బి) నోర్జే 0; శ్రీకర్ భరత్ (నాటౌట్) 78; డివిలియర్స్ (సి) శ్రేయస్ అయ్యర్ (బి) అక్షర్ పటేల్ 26; మ్యాక్స్వెల్ (నాటౌట్) 51; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–3, 2–6, 3–55. బౌలింగ్: నోర్జే 4–0–24–2, అవేశ్ ఖాన్ 4–0– 31–0, అక్షర్ పటేల్ 4–0–39–1, కగిసో రబడ 4–0–37–0, అశ్విన్ 1–0–11–0, రిపల్ పటేల్ 3–0–22–0. -
MI Vs SRH: పాపం ముంబై... 235 పరుగులు చేసినా...
‘అంకెలు నన్ను భయపెడుతున్నాయి’... టాస్ సమయంలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. 171 పరుగులతో గెలవడం దాదాపు అసాధ్యమనే స్థితిలో అతను ఈ మాట అన్నా... మ్యాచ్ తొలి భాగంలో తాము చేయగలిగిన ప్రయత్నం ముంబై చేసింది. ఇషాన్, సూర్యకుమార్ రెచ్చిపోవడంతో ఏకంగా ఐపీఎల్ చరిత్రలోనే తమ అత్యధిక స్కోరు 235 పరుగులను నమోదు చేసింది. హైదరాబాద్ను 65 లేదా అంతకంటే తక్కువ స్కోరుకు ఆపితే ప్లే ఆఫ్స్ అవకాశం ఉండగా... 5.5 ఓవర్ వద్ద రైజర్స్ 66వ పరుగు తీయడంతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. చివరకు మ్యాచ్లో గెలుపు దక్కగా... సన్రైజర్స్ ఆఖరి స్థానంతో లీగ్ను ముగించింది. అబుదాబి: ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయినా... అద్భుత ఆటతో ముంబై ఇండియన్స్ అభిమానులను అలరించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ముంబై 42 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 84; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 82; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. హోల్డర్కు 4 వికెట్లు దక్కగా... నబీ 5 క్యాచ్లు అందుకొని ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఫీల్డర్గా నిలిచాడు. అనంతరం రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసి ఓడిపోయింది. కెపె్టన్ మనీశ్ పాండే (41 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... అభిషేక్ శర్మ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (21 బంతుల్లో 34; 6 ఫోర్లు) రాణించారు. ఇషాన్, సూర్య సూపర్... 72 బంతుల్లో (12 ఓవర్లు) ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కలిపి 230.56 స్ట్రయిక్రేట్తో 166 పరుగులు చేయగా, మిగతా ముంబై జట్టు 48 బంతుల్లో (8 ఓవర్లు) 120.83 స్ట్రయిక్రేట్తో 58 పరుగులు చేసింది... ఇదీ వీరిద్దరు ఎంత దూకుడుగా ఆడారో చూపిస్తోంది. కనీసం 250 పరుగులు చేయాలనే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబై దాదాపుగా ఆ స్కోరుకు చేరువగా వచ్చింది. రోహిత్ శర్మ (18)ను మరో ఎండ్లో నిలబెట్టి ఇషాన్ చెలరేగిపోయాడు. తొలి ఓవర్లో సిక్స్తో మొదలు పెట్టిన అతను కౌల్ వేసిన తర్వాతి ఓవర్లో 4 ఫోర్లు కొట్టాడు. నబీ వేసిన మూడో ఓవర్లో మళ్లీ మూడు ఫోర్లు బాదగా... హోల్డర్ ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్లతో ముంబై 22 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో 2021 సీజన్లో వేగవంతమైన అర్ధసెంచరీ (16 బంతుల్లో)ని ఇషాన్ నమోదు చేశాడు. పవర్ప్లే ముగిసేసరికే స్కోరు 83 పరుగులకు చేరింది. ఆ తర్వాత కూడా మరో 3 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టిన ఇషాన్ను ఎట్టకేలకు ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేయడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. అయితే ఆ తర్వాత సూర్యకుమార్ జోరు మొదలైంది. ఏ బౌలర్నూ వదిలి పెట్టకుండా అతను కూడా చెలరేగిపోయాడు. కౌల్ ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో 24 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. ఇంత విధ్వంసం తర్వాత హోల్డర్ వేసిన చివరి ఓవర్లో ముంబైకి ఐదు పరుగులే వచ్చాయి! రాణించిన పాండే... అనూహ్యంగా ఆసక్తి రేపిన పోరులో ఒక్కసారిగా ముంబై ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలకు తెర పడిన తర్వాత మిగిలింది లాంఛనమే అయిపోయింది. రాయ్, అభిõÙక్ కొన్ని చక్కటి షాట్లతో 32 బంతుల్లోనే 64 పరుగులు జోడించారు. ఆపై రైజర్స్ ఎప్పటిలాగే మిడిలార్డర్లో తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ఓపెనర్లు వెంటవెంటనే వెనుదిరగ్గా, మూడు పరుగుల వ్యవధిలో నబీ (3), సమద్ (2) కూడా అవుటయ్యారు. ఈ దశలో పాండే, గార్గ్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) 36 బంతుల్లోనే 56 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అయితే రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో మరో ఎండ్లో పాండే పోరాడినా ఫలితం లేకపోయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నబీ (బి) రషీద్ 18; ఇషాన్ కిషన్ (సి) సాహా (బి) ఉమ్రాన్ 84; హార్దిక్ (సి) రాయ్ (బి) హోల్డర్ 10; పొలార్డ్ (సి) రాయ్ (బి) అభిషేక్ 13; సూర్యకుమార్ (సి) నబీ (బి) హోల్డర్ 82; నీషమ్ (సి) నబీ (బి) అభిõÙక్ 0; కృనాల్ (సి) నబీ (బి) రషీద్ 9; కూల్టర్నైల్ (సి) నబీ (బి) హోల్డర్ 3; చావ్లా (సి) సమద్ (బి) హోల్డర్ 0; బుమ్రా (నాటౌట్) 5; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–80, 2–113, 3–124, 4–151, 5–151, 6–184, 7–206, 8–230, 9–230. బౌలింగ్: నబీ 3–0–33–0, కౌల్ 4–0–56–0, హోల్డర్ 4–0–52–4, ఉమ్రాన్ 4–0–48–1, రషీద్ 4–0–40–2, అభిõÙక్ 1–0–4–2. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: రాయ్ (సి) కృనాల్ (బి) బౌల్ట్ 34; అభిõÙక్ (సి) కూల్టర్ నైల్ (బి) నీషమ్ 33; పాండే (నాటౌట్) 69; నబీ (సి) పొలార్డ్ (బి) చావ్లా 3; సమద్ (సి) పొలార్డ్ (బి) చావ్లా 2; గార్గ్ (సి) హార్దిక్ (బి) బుమ్రా 29; హోల్డర్ (సి) బౌల్ట్ (బి) కూల్టర్ నైల్ 1; రషీద్ (సి అండ్ బి) బుమ్రా 9; సాహా (సి అండ్ బి) కూల్టర్నైల్ 2; కౌల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–64, 2–79, 3–97, 4–100, 5–156, 6–166, 7–177, 8–182. బౌలింగ్: బౌల్ట్ 4–0–30–1, బుమ్రా 4–0–39–2, చావ్లా 4–0–38–1, కూల్టర్ నైల్ 4–0–40–2, నీషమ్ 3–0–28–2, కృనాల్ 1–0–16–0. -
సిక్స్తో గెలిపించిన శ్రీకర్ భరత్.. కోహ్లి రచ్చ రచ్చ
Kohli Celebrations After Srikar Bharath Six Last ball.. ఐపీఎల్ 2021లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరిత మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన శ్రీకర్ భరత్ మ్యాచ్ హీరోగా మారిపోయాడు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 6 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన ఆర్సీబీని శ్రీకర్ భరత్ తన మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. డివిలియర్స్తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన భరత్.. ఆ తర్వాత మ్యాక్స్వెల్తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఓవరాల్గా 52 బంతుల్లో 78 పరుగులు చేసిన భరత్కు ఐపీఎల్లో ఇదే మొయిడెన్ ఫిఫ్టీ కావడం విశేషం. భరత్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో భరత్ లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టడంతో ఆర్సీబీ సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా కోహ్లి విజయద్వానాలు చేస్తూ మైదానంలోకి పరిగెత్తి మిగిలిన ఆటగాళ్లతో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. pic.twitter.com/wAdG4KlKo2 — Sardar Khan (@SardarK07004661) October 8, 2021 Finishes it offf with a SIXxxxx ! Ks bharat 👏#RCBvDC pic.twitter.com/ivaBCGEH3c — 🤙 (@imAkhi18_) October 8, 2021 -
MI Vs SRH: ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ
Mohammad Nabi Took 5 Catches New Record: ముంబై ఇండియన్స్తో అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఒకే మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు పట్టిన నాన్ వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో నబీ ఐదు క్యాచ్లు అందుకున్నాడు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (84) సూర్యకుమార్ యాదవ్(82) పరుగులతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి... 193 పరుగులు మాత్రమే చేసింది. తద్వారా మరోసారి ఓటమిని మూటగట్టుకుని... ఆఖరి స్థానంతో లీగ్ను ముగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ నిలిచాడు. స్కోర్లు: ముంబై: 235/9 (20) హైదరాబాద్: 93/8 (20) చదవండి: ఉమ్రాన్ మాలిక్ మరోసారి అత్యంత ఫాస్ట్బాల్; సూర్యకుమార్ విలవిల SRH Vs MI: ఇద్దరే 166 బాదారు.. ఒక్క మ్యాచ్తో విమర్శకుల నోళ్లు మూయించారు RCB Vs DC: భళా భరత్... చివరి బంతికి సిక్సర్తో గెలిపించిన ఆంధ్ర బ్యాట్స్మెన్! -
ఇద్దరే 166 బాదారు.. ఒక్క మ్యాచ్తో విమర్శకుల నోళ్లు మూయించారు
Ishan Kishan And Surya Kumar Yadav Stunning Batting.. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ముంబై ప్లేఆఫ్స్కు అర్హత సాధించకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ముంబై టోర్నీ నుంచి వెళ్లిపోతూ.. టి20 ప్రపంచకప్కు ముందు మాత్రం ఇద్దరికి తమకు ఇచ్చిన చాన్స్ను నిరూపించుకునేందుకు ఉపయోగపడింది. వారిద్దరే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లు. మరికొద్దిరోజుల్లో టి20 ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో ఈ ఇద్దరు టీమిండియా టి20 జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఐపీఎల్లో వీరిద్దరి దారుణ ఫామ్పై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఇద్దరు కళ్లు చెదిరే ఇన్నింగ్స్లతో మెరిశారు. మొదట ఇషాన్ కిషన్ 32 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసేందుకు బాటలు పరిచాడు. ఇషాన్ ఔటైన తర్వాత బాధ్యతను భుజానికెత్తుకున్న సూర్యకుమార్ ఎస్ఆర్హెచ్ బౌలర్లకు తన ఆటతీరును రుచి చూపించాడు. 40 బంతుల్లోనే 13 ఫోర్లు,3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే ముంబై చేసిన 235 పరుగుల్లో ఈ ఇద్దరు కలిసి 166 పరుగులు బాదడం విశేషం. మొత్తంగా 12 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరు 24 ఫోర్లు, 7 సిక్సర్లు బాదారు. ఇక మిగతా బ్యాటర్స్ కలిపి 8 ఓవర్లలో 58 పరుగులు చేసింది. Courtesy: IPL Twitter కాగా టి20 ప్రపంచకప్ 2021కి సంబంధించి టీమిండియా జట్టులో మార్పులకు సంబంధించి రేపు సెలెక్టర్ల సమావేశం జరగనుంది. ఫామ్లో లేని ఆటగాళ్లను జట్టులో నుంచి తప్పించి ఎవరికి అవకాశం ఇవ్వాలనేదానిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. తాజాగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ల రాణింపుతో సెలెక్టర్లు వీరిద్దరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. -
ఉమ్రాన్ మాలిక్ మరోసారి అత్యంత ఫాస్ట్బాల్; సూర్యకుమార్ విలవిల
Umran Malik Fastest Ball IPL 2021.. ఐపీఎల్ 2021లో ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ మరోసారి మెరిశాడు. ఇంతకముందు కేకేఆర్తో మ్యాచ్లో గంటకు 150 కిమీ బంతి విసిరి చరిత్ర సృష్టించిన ఉమ్రాన్ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ 19వ ఓవర్ మూడో బంతిని ఉమ్రాన్ మాలిక్ ఏకంగా గంటకు 152.95 వేగంతో విసిరి రికార్డు సృష్టించాడు. లోకీ ఫెర్గూసన్ రికార్డును బ్రేక్ చేస్తూ ఈ సీజన్లో కొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ విసిరిన బంతి వేగంగా వచ్చి సూర్యకుమార్ హెల్మెట్కు బలంగా తగలడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. దెబ్బకు హెల్మెట్ తీసి చెక్ చేసుకున్న సూర్య.. కాసేపటి తర్వాత బ్యాటింగ్ను కొనసాగించాడు. అప్పటికే మంచి టచ్లో కనిపించిన సూర్య ఆ తర్వాత మరో నాలుగు బంతులాడి పెవిలియన్ చేరాడు. కాగా ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (84) సూర్యకుమార్ యాదవ్(82) పరుగులతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 132 పరుగులు చేసిన ముంబై చివరి 10 ఓవర్లలో 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హోల్డర్ 4, రషీద్ ఖాన్ 2, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు. pic.twitter.com/DBATyE2fDA — Rishobpuant (@rishobpuant) October 8, 2021 -
Ishan Kishan: ఐపీఎల్ 2021లో ఇషాన్ కిషన్ రికార్డు.. ఇది రెండోసారి
Ishan Kishan Fastest Fifty IPL 2021.. ఐపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కొత్త రికార్డు సాధించాడు. ఈ సీజన్లో అత్యంత వేగంగా హాఫ్సెంచరీ మార్క్ను అందుకొని తొలి స్థానంలో నిలిచాడు. ఇషాన్ 16 బంతుల్లోనే 8 ఫోర్లు.. 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇంతకముందు ఇదే సీజన్లో పొలార్డ్(ముంబై ఇండియన్స్) 17 బంతుల్లో ఫిఫ్టీ సాధించి రెండో స్థానంలో.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా (18 బంతుల్లో 50 పరుగులు) మూడో స్థానంలో.. యశస్వి జైశ్వాల్(19 బంతుల్లో 50 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ ఫిప్టీ సాధించడం ఇషాన్కు ఇది రెండోసారి కావడం విశేషం. 2016లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 17 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ తాజా సీజన్లో 16 బంతుల్లోనే సాధించాడు. ఆ తర్వాత పొలార్డ్ ( 2016లో 17 బంతులు వర్సెస్ కేకేఆర్), హర్దిక్ పాండ్యా( 2019లో 17 బంతులు వర్సెస్ కేకేఆర్), పొలార్డ్(2021లో 17 బంతులు వర్సెస్ సీఎస్కే) ఉన్నారు. ఇక ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 75, హార్దిక్ పాండ్యా 2 పరుగులతో ఆడుతున్నారు. -
MI Vs SRH: ఎస్ఆర్హెచ్పై ముంబై ఇండియన్స్ విజయం
ఎస్ఆర్హెచ్పై ముంబై ఇండియన్స్ విజయం 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో మనీష్ పాండే 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జేసన్ రాయ్ 34, అభిషేక్ శర్మ 33 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా, కౌల్టర్ నీల్, నీషమ్ తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (84) సూర్యకుమార్ యాదవ్(82) పరుగులతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 132 పరుగులు చేసిన ముంబై చివరి 10 ఓవర్లలో 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హోల్డర్ 4, రషీద్ ఖాన్ 2, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు. రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 88/2 33 పరుగులు చేసిన అభిషేక్ శర్మ జిమ్మీ నీషమ్ బౌలింగ్లో కౌల్టర్ నీల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ స్కోరు 8 ఓవర్లలో 95/2గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 70/1 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 30, మనీష్ పాండే 1 పరుగుతో ఆడుతున్నారు. ముంబై ప్లేఆఫ్స్కు చేరాలంటే ఎస్ఆర్హెచ్ను 65 పరుగులకు ఆలౌట్ చేయాలి.. అయితే ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఐదో బంతికి ఎస్ఆర్హెచ్ సింగిల్ తీయడం ద్వారా 65 పరుగులు పూర్తి చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. కేకేఆర్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 236 ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (84) సూర్యకుమార్ యాదవ్(82) పరుగులతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 132 పరుగులు చేసిన ముంబై చివరి 10 ఓవర్లలో 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హోల్డర్ 4, రషీద్ ఖాన్ 2, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు. ఏడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్.. 18 ఓవర్లలో 217/7 ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన కౌల్టర్ నీల్ హోల్డర్ బౌలింగ్లో నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సూర్యకుమార్ 70, చావ్లా 0 పరుగులతో ఆడుతున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఇషాన్ కిషన్ 84 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇషాన్ ఉన్నంతసేపు సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 31 బంతుల్లో 84 పరుగులు చేసిన ఇషాన్ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు.. 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ముంబై 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. పొలార్డ్ 7, సూర్యకుమార్ 11 పరుగులతో ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా ఔట్.. 9 ఓవర్లలో ముంబై 124/2 10 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా హోల్డర్ బౌలింగ్లో రాయ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 84, పొలార్డ్ 5 పరుగులతో ఆడుతున్నారు. రోహిత్ శర్మ ఔట్.. 6 ఓవర్లలో ముంబై 83/1 ఓపెనర్ రోహిత్ శర్మ(18) రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో స్వేర్లెగ్ దిశలో భారీ షాట్కు యత్నించగా మహ్మద్ నబీ క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ముంబై 6 ఓవర్ల్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 63, హార్దిక్ 1 పరుగుతో ఆడుతున్నారు. చుక్కలు చూపిస్తున్న ఇషాన్ కిషన్.. 4 ఓవర్లలో 63/0 ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 16 బంతుల్లో 8 ఫోర్లు.. రెండు సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ముంబై స్కోరు 4 ఓవర్లలో 63 పరుగులుగా ఉంది.అతనికి రోహిత్ శర్మ 12 పరుగులతో సహకరిస్తున్నాడు. Photo Courtesy: IPL అబుదాబి: ఐపీఎల్ 2021లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ మధ్య కీలకమ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఎస్ఆర్హెచ్పై 171 పరుగుల తేడాతో విజయం సాధిస్తే ముంబై ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఇక ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్ల్లో 6 విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. తొలి అంచె పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబైనే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 137 పరుగులకే పరిమితమై 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 17సార్లు పోటీపడగా.. 9 సార్లు ముంబై.. 8సార్లు ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. కాగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా మనీష్ పాండే వ్యవహరించనున్నాడు. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, ట్రెంట్ బౌల్ట్ ఎస్ఆర్హెచ్: జేసన్ రాయ్, అభిషేక్ శర్మ, మనీష్ పాండే (కెప్టెన్), ప్రియం గార్గ్, అబ్దుల్ సమద్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్ -
RCB VS DC: ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం..
ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ఆర్సీబీ విజయం సాధించింది. చివరి బంతికి ఐదు పరుగులు కావల్సిన నేపథ్యంలో శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టి ఆర్సీబీనీ గెలిపించాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఆదిలోనే కోహ్లి, పడిక్కల్ వికెట్ను కోల్పోయింది. ఈ క్రమంలో శ్రీకర్ భరత్, డివిలియర్స్ ఆర్సీబీ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. డివిలియర్స్ ఔటయ్యాక వచ్చిన మాక్స్వెల్(51) తో కలిసి శ్రీకర్ భరత్ ఆర్సీబీను విజయతీరాలకు చేర్చాడు. కాగా ఐపీఎల్లో భరత్ తొలి అర్ధసెంచరీనీ నమోదు చేశాడు. అతడు 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీకు ఓపెనర్లు 88 పరుగుల శుభారంభం ఇచ్చారు. శిఖర్ ధావన్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43 పరుగులు చేయగా, పృథ్వీ షా 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48 పరుగులు సాధించాడు. కాగా ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, చహల్, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డివిలియర్స్(26) ఔట్ 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఛేజింగ్లో తడబడుతుంది. 55 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో డివిలియర్స్ (26) శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రీకర్ భరత్(39) , గ్లెన్ మాక్స్వెల్ (5) పరుగులతో ఉన్నారు. రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. 23/2 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి 4 పరుగులు చేసి ఔటవ్వగా.. పడిక్కల్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 4 ఓవర్లలో 23/2గా ఉంది ఆర్సీబీ టార్గెట్ 165.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీకు ఓపెనర్లు 88 పరుగుల శుభారంభం ఇచ్చారు. శిఖర్ ధావన్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43 పరుగులు చేయగా, పృథ్వీ షా 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48 పరుగులు సాధించాడు. కాగా ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, చహల్, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. నాలగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. శ్రేయస్ అయ్యర్(18) ఔట్ 143 పరుగుల వద్ద ఢిల్లీ నాలగో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్(18) క్రిస్టియన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షిమ్రాన్ హెట్మైర్(21), రిపల్ పటేల్ (1) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పంత్(10) ఔట్ 108 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. డేనియల్ క్రిస్టియన్ బౌలింగ్లో పంత్(10) వికెట్ కీపర్ శ్రీకర్ భరత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(4), షిమ్రాన్ హెట్మైర్(2) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. దూకుడగా ఆడుతున్న పృథ్వీ షా వికటె్ను ఢిల్లీ కోల్పోయింది. 48 పరుగలు చేసిన పృథ్వీ షా యజ్వేంద్ర చహల్ బౌలింగ్లో జార్జ్ గార్టన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధావన్(43) ఔట్ శిఖర్ ధావన్ రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకు ఓపెనర్లు 88 పరుగుల శుభారంభం ఇచ్చారు. 43 పరుగులు చేసిన ధావన్ హర్షల్ పటేల్ బౌలింగ్లో డేనియల్ క్రిస్టియన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42), రిషబ్ పంత్(5) పరుగులతో ఉన్నారు. Photo Courtesy: IPL నిలకడగా ఆడతున్న ఢిల్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగుతున్న మ్యాచ్లో ఢిల్లీ నిలకడగా ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(20), శిఖర్ ధావన్(22) పరుగులతో ఉన్నారు. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా 14ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే సమయంలో ఒకే రోజు రెండు మ్యాచ్లు తొలిసారి ప్రారంభం కానున్నాయి.ఈ క్యాష్ రిచ్ లీగ్లో రెండు జట్లు 26 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడగా.. ఆర్సీబీ 15 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ 10 మ్యాచ్ల్లో గెలుపొందింది. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 1పరుగు తేడాతో ఆర్సీబీ విజయం సాదించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), రిపల్ పటేల్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్ -
దీపక్ చాహర్ లవ్ ప్రపోజల్ సెలబ్రేషన్స్.. ధోని హంగామా చూడాల్సిందే..!
Deepak Chahar Love Proposal Celebrations: చెన్నై సూపర్కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్.. గురువారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అనంతరం తన నెచ్చెలి జయా భరద్వాజ్కు లైవ్లో ప్రేమను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. అనంతరం సీఎస్కే యాజమాన్యం ఈ లవ్ జంట కోసం అదిరిపోయే పార్టీని అరేంజ్ చేసింది. తొలుత వీరిరువురు కేక్ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోగా.. ఆ తర్వాత అసలు సిసలైన సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ధోని నేతృత్వంలో రైనా, జడేజా, శార్ధూల్ ఠాకూర్, రాబిన్ ఊతప్పలు చాహర్ను కేక్, డ్రింక్స్తో ముంచెత్తారు. ఈ వేడుకల్లో ధోని, రైనాల కూతుళ్లు తెగ సందడి చేయగా, ధోని భార్య సాక్షి.. జయా భరద్వాజ్ను హత్తుకుని విష్ చేసింది. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ అధికారిక ఇన్స్టాలో పోస్ట్ చేయగా వైరలవుతోంది. జోడి బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్కే జట్టు నిన్నటి మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసం ధాటికి సీఎస్కే 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే, చెన్నైకు ఇదివరకే ఫ్లే ఆఫ్స్ బెర్తు ఖరారు కావడంతో మ్యాచ్ నామమాత్రంగా సాగింది. 13 మ్యాచ్ల్లో 13 వికెట్లతో దీపక్ చాహర్ సీఎస్కే విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Deepak Chahar: మరదలు దొరికేసింది.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?! -
IPL 2021: టాస్ గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్ చేరినట్టేనా!
Mumbai Indians Need 171 Runs Win To Enter Playoffs.. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్లు ఒకే సమయంలో జరగనున్నాయి. ఒక మ్యాచ్కు ఎలాంటి ప్రాధాన్యత లేకపోగా.. మరొక మ్యాచ్ మాత్రం కీలకంగా మారింది. అదే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్లో ముంబై 171 పరుగుల తేడాతో గెలిస్తే ప్లేఆఫ్స్కు చేరుతుంది. అలా కానీ పక్షంలో కేకేఆర్ ప్లేఆఫ్స్లోకి అడుగుపెడుతుంది. దీంతో ముంబైకి టాస్ కీలకంగా మారనుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి వీరబాదుడే లక్ష్యంగా పెట్టుకొని భారీ స్కోరు నమోదు చేయాలి. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ను 171 పరుగుల తేడాతో ఓడిస్తే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు అడుగుపెడుతుంది. ఇది దాదాపు అసాధ్యం. కానీ ఇది టి20.. ఏ క్షణంలో ఏం జరిగేది ఎవరు చెప్పలేరు. పైగా ముంబై ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్. అయితే టాస్ ఓడిపోతే మాత్రం ఎస్ఆర్హెచ్ కచ్చితంగా బ్యాటింగ్ చేస్తుంది. అప్పుడు ముంబైకి ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉండదు. అందుకే ముంబై ఇండియన్స్ అభిమానులు మొదట టాస్ గెలవాలని.. ఆ తర్వాత బ్యాటింగ్లో మెరవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఫన్నీవేలో ట్రోల్ చేశాడు. ముంబైకి టాస్ ప్రాణసంకటంగా మారిందని.. టాస్ గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్ చేరినట్టే అంటూ బాలీవుడ్ సూపర్హిట్ ''అందాజ్ అప్నా అప్నా'' సినిమాలో అమీర్- సల్మాన్లు టాస్ వేస్తూ తంటాలు పడే సన్నివేశాన్ని షేర్ చేశాడు. ప్రస్తుతం జాఫర్ చేసిన ట్రోల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: MI Vs SRH: కేకేఆర్ కొట్టేసింది.. మరి.. ముంబై 171 పరుగులతో..! IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ -
IPL 2021: ముంబై ప్లే ఆఫ్స్ చేరకపోవడమే మంచిదైంది.. కాబట్టి..
Salman Butt Comments On Mumbai Indians: ఐపీఎల్-2021 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరకపోవడమే మంచిదైందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ లేదంటే, ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే కొత్త విజేతను చూడవచ్చని పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుర్తింపు పొందిన ఢిల్లీ క్యాపిటల్స్... 10 విజయాలతో ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై, బెంగళూరు ఉన్నాయి. ఇక బుధవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో భారీ విజయం ద్వారా కోల్కతా నైట్రైడర్స్ దాదాపు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకున్నట్లే. డిఫెండింగ్ చాంపియన్ ముంబై శుక్రవారం నాటి మ్యాచ్లో సన్రైజర్స్పై 171 పరుగుల తేడాతో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్కు చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, దాదాపు అది అసాధ్యమే. ఈ నేపథ్యంలో... సల్మాన్ భట్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘ముంబై ఇండియన్స్ ప్రమాదకరమైన జట్టు. ముందు ఓడినా సరే.. ఒక్కసారిగా వరుస విజయాలతో దూసుకువచ్చి... విజేతగా నిలవడం వారికి అలవాటు. కాబట్టి.. ఈసారి... వాళ్లు ప్లే ఆఫ్ చేరకపోవడమే మంచిదైంది. ఆర్సీబీ, డీసీ వంటి కొత్త జట్లను విన్నర్గా చూసే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా శుక్రవారం రెండు మ్యాచ్లు(ముంబై- హైదరాబాద్; బెంగళూరు- ఢిల్లీ) ఒకే సమయానికి(రాత్రి 7:30 గంటలకు) జరుగనున్న సంగతి తెలిసిందే. చదవండి: Deepak Chahar: చహర్ ప్రేమాయణం.. భాభీ దొరికేసింది.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?! -
Deepak Chahar: మరదలు దొరికేసింది.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?!
Deepak Chahar Girlfriend Name And Details: నచ్చిన నెచ్చెలికి మనసులోని ప్రేమను తెలియజేసి.. ఆమె వేలికి ఉంగరం తొడగటం.. ఆ వెంటనే ఆమె కూడా చిరునవ్వులతో ‘ఇష్టమే’ అని సమ్మతం తెలపడం... ‘ఇకపై నీతోనే నా జీవన పయనం’ అంటూ ఆత్మీయ ఆలింగనంలో అతడిని బంధీ చేయడం.. అక్కడిక్కడే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకోవడం.. ఓ ప్రేమికుడి జీవితంలో ఇంతకంటే మధుర క్షణాలు ఏముంటాయి! చెన్నై సూపర్కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్ ప్రస్తుతం ఇలాంటి ఆనందంలో మునిగితేలుతున్నాడు. మనసిచ్చిన అమ్మాయిని మనువాడబోయే మధుర క్షణాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా.. దీపక్ స్టేడియంలోనే తన ప్రేయసికి ప్రేమను వ్యక్తపరచడం, ఆమె కూడా అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను దీపక్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. అయితే, చాలా మంది ఆ అమ్మాయిని విదేశీయురాలిగా పొరబడుతున్నారు! ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది? విదేశీయురాలు కాదు.. దీపక్ చహర్ ప్రేమించిన అమ్మాయి పేరు జయా భరద్వాజ్. ఆమె ఢిల్లీకి చెందిన అమ్మాయి. మోడల్, వీజే, ఎమ్టీవీ రియాలిటీ షో స్ప్లిట్స్విల్లా సీజన్ 2 విజేత సిద్ధార్థ్ భరద్వాజ్(34) చెల్లెలు. ఈ విషయాలను దీపక్ చహర్ సోదరి మాలతీ చహర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరదలు దొరికేసింది.. ‘‘మొత్తానికి నా సోదరుడు చెప్పేశాడు. భాభీ దొరికేసింది. తన పేరు జయా భరద్వాజ్. విదేశీయురాలు కాదు.. ఢిల్లీ అమ్మాయి’’ అంటూ ఓ ఫొటోను మాలతీ షేర్ చేశారు. లవ్బర్డ్స్ అంటూ తమ్ముడూ, మరదలిపై ప్రేమను కురిపించారు. కాగా జయా భరద్వాజ్ ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నట్లు సమాచారం. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే... పంజాబ్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొందింది. ఈ మ్యాచ్లో చహర్ ఒక వికెట్ తీశాడు. స్కోర్లు: చెన్నై: 134/6 (20) పంజాబ్: 139/4 (13). సోదరితో దీపక్ చహర్ చదవండి: MI Vs SRH: కేకేఆర్ కొట్టేసింది.. మరి.. ముంబై 171 పరుగులతో..! View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) Showering lots of 💛 & 🎂 for the Cherry couple! 😍#SuperFam #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/t3a3bDIyzD — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 7, 2021 -
MI Vs SRH: కేకేఆర్ కొట్టేసింది.. మరి.. ముంబై 171 పరుగులతో..!
KKR Beats RR... MI "Chances" To Enter Play Offs Explained: గత రెండు సీజన్లలో రన్రేట్లో వెనుకబడి ఐదో స్థానానికే పరిమితమైన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఈసారి తప్పు దిద్దుకుంది. విజయాలతో పాటు రన్రేట్ను కూడా కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు నాలుగో జట్టుగా దాదాపుగా ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 86 పరుగులతో భారీ విజయం సాధించడం ఆ జట్టుకు మరింతగా కలిసొచ్చింది. షార్జాలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (35 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం రాజస్తాన్ 16.1 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ తెవాటియా (36 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ మావి (4/21), ఫెర్గూసన్ (3/18) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. చివర్లో జోరు... తొలి 10 ఓవర్లలో 69 పరుగులు... తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులు... కోల్కతా ఇన్నింగ్స్ ఇలా రెండు భిన్న పార్శ్వాలుగా సాగింది. నెమ్మదిగా ఆట ప్రారంభించిన గిల్, వెంకటేశ్... పవర్ప్లేలో కూడా మరీ దూకుడుగా వెళ్లకుండా వికెట్ను కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా 6 ఓవర్లలో జట్టు 34 పరుగులే చేయగలిగింది. ఎట్టకేలకు ఉనాద్కట్ వేసిన పదో ఓవర్లో వెంకటేశ్ రెండు భారీ సిక్సర్లు కొట్టి జోరు పెంచాడు. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరగడంతో 79 పరుగుల (65 బంతుల్లో) భాగస్వామ్యానికి తెర పడింది. అయితే అక్కడి నుంచి కేకేఆర్ స్కోరు వేగంగా దూసుకుపోయింది. తర్వాతి బ్యాట్స్మెన్ నితీశ్ రాణా (12), రాహుల్ త్రిపాఠి (21), దినేశ్ కార్తీక్ (14 నాటౌట్), మోర్గాన్ (13 నాటౌట్) తలా ఓ చేయి వేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సకారియా బౌలింగ్లో ఫోర్తో గిల్ 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోరిస్ వేసిన చివరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. రాజస్తాన్ 9 వైడ్లు సహా ఏకంగా 17 అదనపు పరుగులు ఇచ్చింది. టపటపా... సీజన్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన రాజస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్లోనూ దానిని కొనసాగించింది. ఒక్క తెవాటియా పోరాటం మినహా...మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేయడంతో జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. అవుటయ్యేందుకు ఒకరితో మరొకరు పోటీ పడటంతో తొలి ఓవర్ నుంచే జట్టు పతనం వేగంగా సాగింది. పవర్ప్లే ముగిసేసరికే జట్టు 4 వికెట్లు కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాతా అందరూ విఫలం కావడంతో కనీసం పోరాడేందుకు కూడా అవకాశం లేకపోయింది. ముంబై 171 పరుగులతో గెలిస్తేనే... ఇక కేకేఆర్ అనధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్నప్పటికీ... సాంకేతికంగా ముంబైకి ఇంకా అవకాశం ఉంది. అయితే, వాస్తవికంగా చూస్తే అది అసాధ్యమే. నేడు(శుక్రవారం) సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ముంబై ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 171 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఇక ఛేదన అయితే మాత్రం టాస్తోనే వారి ఆట ముగిసిపోతుంది. అంటే రెండోసారి బ్యాటింగ్ చేస్తే అంకెలకు అందని విధంగా ముంబై జట్టుకు ఏమాత్రం అవకాశం లేదు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) యశస్వి (బి) మోరిస్ 56; వెంకటేశ్ (బి) తెవాటియా 38; రాణా (సి) లివింగ్స్టోన్ (బి) ఫిలిప్స్ 12; త్రిపాఠి (బి) సకారియా 21; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 14; మోర్గాన్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 17, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–79, 2–92, 3–133, 4–145. బౌలింగ్: ఉనాద్కట్ 4–0–35–0, మోరిస్ 4–0–28–1, సకారియా 4–0–23–1, ముస్తఫిజుర్ 4–0–31–0, దూబే 2–0–18–0, తెవాటియా 1–0–11–1, ఫిలిప్స్ 1–0–17–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) షకీబ్ 0; లివింగ్స్టోన్ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్ 6; సామ్సన్ (సి) మోర్గాన్ (బి) మావి 1; దూబే (బి) మావి 18; రావత్ (ఎల్బీ) (బి) ఫెర్గూసన్ 0; ఫిలిప్స్ (బి) మావి 8; తెవాటియా (బి) మావి 44; మోరిస్ (ఎల్బీ) (బి) వరుణ్ 0; ఉనాద్కట్ (సి) షకీబ్ (బి) ఫెర్గూసన్ 6; సకారియా (రనౌట్) 1; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1, మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 85. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–12, 4–13, 5–33, 6–34, 7–35, 8–62, 9–85, 10–85. బౌలింగ్: షకీబ్ 1–0–1–1, శివమ్ మావి 3.1–0–21–4, నరైన్ 4–0–30–0, ఫెర్గూసన్ 4–0–18–3, వరుణ్ 4–0–14–1. చదవండి: Anshu Malik: భారత తొలి మహిళా రెజ్లర్గా సరికొత్త చరిత్ర! THAT. WINNING. FEELING! 👏 👏 The @Eoin16-led @KKRiders put up a clinical performance & seal a 86-run win over #RR. 💪 💪 #VIVOIPL #KKRvRR Scorecard 👉 https://t.co/oqG5Yj3afs pic.twitter.com/p5gz03uMbJ — IndianPremierLeague (@IPL) October 7, 2021 -
CSK Vs PBKS: లైవ్లో లవ్ ప్రపోజ్ చేసిన దీపక్ చాహర్..
Deepak Chahar Proposes To His Girl Friend During Match: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం సీఎస్కే ఆల్రౌండర్ దీపక్ చాహర్ అందరూ చూస్తుండగా లైవ్లో తన గర్ల్ఫ్రెండ్కు రింగ్ తొడిగి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు ఆమ్మాయి తరపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. చాహర్, అతని ప్రేయసి ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంలో మునిగితేలారు. View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) స్టాండ్స్లో ఇరువురి సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ తంతుని మొత్తం క్రీడా జగత్తు వీక్షించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియా తెగ వైరలవుతోంది. టీమిండియా ఆటగాళ్లు సహా మొత్తం క్రికెట్ ప్రపంచం ఈ ప్రేమ పావురాలకు విషెస్ తెలిపింది. అయితే కొందరు మాత్రం చాహర్ చేసిన పనిని తప్పుబడుతున్నారు. మ్యాచ్పై కాన్సంట్రేట్ చేయకుండా లైవ్లో ఇలాంటి పని ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ చాహర్, అతని ప్రేయసికి ఈ రోజు జీవితకాలం గుర్తుండిపోతుంది. కాగా, చాహర్ ప్రపోజ్ చేసిన అమ్మాయి విదేశీయురాలిగా తెలుస్తోంది. చదవండి: ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. చారిత్రక సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ దూరం -
KKR VS RR: ప్లే ఆఫ్స్కు చేరిన కేకేఆర్!.... 86 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘోర పరాజయం
86 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘోర పరాజయం తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్తాన్ను చిత్తు చేసి కోల్కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్లోకి అడుగు దాదాపుగా అడుగుపెట్టినట్లే. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ కేవలం 85 పరగులకే కూప్పకూలిపోయింది. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్తాన్ పతనాన్ని శాసించాడు. లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు. ఒకనొక దశలో 35 పరుగులకే 7వికెట్లు కోల్పోయి రాజస్తాన్.. రాహుల్ తెవాటియా(44) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్కతా నీర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (56) అయ్యర్ (38) పరుగులతో కేకేఆర్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కోల్కతా బౌలర్లు ధాటికి రాజస్తాన్ విలవిల.... 35 పరుగులకే 7వికెట్లు కోల్కతా బౌలర్లు ధాటికి రాజస్తాన్ విలవిలడుతుంది. కేవలం 35 పరుగులకే 7వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. కోల్కతా బౌలర్లు లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి రాజస్తాన్ పతనాన్ని శాసించారు. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి మూడు వికెట్లు సాధించగా, లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు. పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్.... 13 పరుగులకే 4వికెట్లు 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ నాలగో ఓవర్లో లివింగ్స్టోన్, అనూజ్ రావత్ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్కు పంపాడు. 5 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. క్రీజ్లో గ్లెన్ ఫిలిప్స్, శివమ్ దూబే(10) పరుగులతో ఉన్నారు రాజస్తాన్కు బిగ్ షాక్.. 1 పరుగుకే రెండు వికెట్లు 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ కాగా, శివమ్ మావి బౌలింగ్లో సంజు శాంసన్(1) ఇయాన్ మోర్గాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.క్రీజ్లో లియామ్ లివింగ్స్టోన్(6) , శివమ్ దూబే(5)ఉన్నారు రాణించిన శుభ్మన్ గిల్(56).. రాజస్తాన్ టార్గెట్ 172 రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో కోల్కతా నీర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్కతాకు ఓపెనర్లు 79 పరుగుల శుభారంభం అందించారు. శుభ్మన్ గిల్ (56) అయ్యర్ (38) పరుగులతో కేకేఆర్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, చేతన్ సకారియా చెరో వికెట్ సాధించారు. రాహుల్ త్రిపాఠి (21) క్లీన్ బౌల్డ్.. కేకేఆర్ 145/4 చేతన్ సకారియా వేసిన 18వ ఓవర్ తొలి బంతికి రాహుల్ త్రిపాఠి (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 145 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ను కోల్పోయింది. క్రీజ్లో దినేశ్ కార్తీక్(10), ఇయాన్ మోర్గాన్ ఉన్నారు. గిల్(56) ఔట్.. కేకేఆర్ 133/3 ధాటిగా ఆడుతున్న కేకేఆర్ ఓపెనర్ శుభ్మన్ గిల్(44 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ను క్రిస్ మోరిస్ బోల్తా కొట్టించాడు. యశస్వి జైస్వాల్ క్యాచ్ అందుకోవడంతో గిల్ వెనుదిరిగాడు. 15.4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 133/3. క్రీజ్లో రాహుల్ త్రిపాఠి(19), దినేశ్ కార్తీక్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్... నితీష్ రాణా(12) ఔట్ 92 పరుగలు వద్ద కేకేఆర్ నితీష్ రాణా రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి రాణా పెవిలియన్కు చేరాడు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్లు నష్టానికి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(46), రాహుల్ త్రిపాఠి(16) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్... వెంకటేశ్ అయ్యర్(38) ఔట్ రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ తెవాటియా బౌలింగ్లో వెంకటేశ్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా కోల్కతాకు ఓపెనర్లు 79 పరుగుల శుభారంభం అందించారు. 11 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(35), నితీష్ రాణా(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న కేకేఆర్ రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నిలకడగా ఆడుతుంది. 7 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(22), వెంకటేశ్ అయ్యర్(19) పరుగులతో క్రీజులో ఉన్నారు. షార్జా: ఐపీఎల్ 2021 సెకెండ్ పేజ్లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్ ,కోల్కతా నైట్ రైడర్స్ మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కి కలకత్తా జట్టు అర్హత సాధించే అవకాశం ఉండటంతో పాటు రాజస్తాన్ రాయల్స్ గెలుపుపై ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్లో రెండు జట్లు 23 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడగా.. కోల్కతా 12 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. రాజస్తాన్ 11 మ్యాచ్ల్లో గెలుపొందింది. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాదించింది. తుది జట్లు: కోల్కతా నైట్ రైడర్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా,షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి రాజస్తాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, జయదేవ్ ఉనద్కట్, అనూజ్ రావత్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్ చదవండి: IPl 2021: రేపు ఒకే సమయానికి రెండు మ్యాచ్లు.. ప్రసారమయ్యే ఛానళ్లు ఇవే -
రేపు ఒకే సమయానికి రెండు మ్యాచ్లు.. ప్రసారమయ్యే ఛానళ్లు ఇవే
Where to Watch Final Two Matches of Indian Premier League: ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్ లీగ్ మ్యాచ్లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోగా.. మిగిలిఉన్న ఒక్కస్థానానికి ఎవరు క్వాలిఫై అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు కేకేఆర్తో పాటు ముంబై ఇండియన్స్కు ఉంది. కాగా ఐపీఎల్ చరిత్రలో రెండు మ్యాచ్లు రేపు (శనివారం) ఒకే సమయానికి ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్తో మధ్యాహ్నం 3:30 కి తలపడాల్సి ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సాయంత్రం 7:30 కి జరగాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఈ రెండు మ్యాచ్లు సాయంత్రం 7:30 కి జరుగుతాయి. మ్యాచ్ లు ప్రసారమయ్యే ఛానళ్లు ఇవే.. RCB Vs DC : స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ - 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ -1, స్టార్ స్పోర్ట్స్ - 1 తెలుగు/ తమిళ్/ కన్నడ. MI Vs SRH : స్టార్ స్పోర్ట్స్ -2, స్టార్ స్పోర్ట్స్ -3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ గోల్డ్ -2 చదవండి: RCB Vs SRH : ఆర్సీబీ బౌలర్ ఖాతాలో అరుదైన రికార్డు.. బుమ్రా రికార్డు బద్దలు -
చరిత్ర తిరగరాసిన ఆర్సీబీ బౌలర్.. బుమ్రా రికార్డు బద్దలు
Harshal Patel Breaks Bumrah IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ చరిత్రను తిరగరాసాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డు(27 వికెట్లు)ను బద్దలు కొట్టి.. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా నిలిచాడు. బుధవారం సన్రైజర్స్తో మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన హర్షల్.. అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ కనీసం మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండడంతో అతను ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా, లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Umran Malik: పళ్లు, కూరగాయలు అమ్ముతాం.. మమ్మల్ని గర్వపడేలా చేశాడు -
CSK Vs PBKS: కేఎల్ రాహుల్(98 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్.. పంజాబ్ సూపర్ విక్టరీ
కేఎల్ రాహుల్(98 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్.. పంజాబ్ సూపర్ విక్టరీ 135 పరుగుల స్వల్స లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు అదరగొట్టింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ జట్టు కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. రాహుల్ వరుస సిక్సర్లతో చెన్నై బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడడంతో మరో 42 బంతులు మిగిలుండగానే పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. సీఎస్కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్కు ఓ వికెట్ దక్కింది. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్.. షారుఖ్ ఖాన్(8) ఔట్ దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ ఆఖరి బంతికి షారుఖ్ ఖాన్(10 బంతుల్లో 8; సిక్స్) ఔటయ్యాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బ్రావో చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 9 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 80/3. క్రీజ్లో రాహుల్(59), మార్క్రమ్ ఉన్నారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్.. పంజాబ్ కింగ్స్ ఒకే ఓవర్లో రెండు రెండు వికెట్లు కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో మయాంక్ అగర్వాల్(12) ఎల్బీగా వెనుదిరగగా, సర్ఫరాజ్ ఖాన్(0) డుప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా పెవిలియన్కు చేరాడు. 7 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 62/2. క్రీజులో కేఎల్ రాహుల్(49), షారుఖ్ ఖాన్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. మయాంక్ అగర్వాల్( 12) ఔట్ 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ అగర్వాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అగర్వాల్ ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా 4.3 ఓవర్లలో పంజాబ్ వికెట్ నష్టానికి 46 పరగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(50) ,సర్ఫరాజ్ ఖాన్(2) ఉన్నారు. డుప్లెసిస్(76) ఒంటరి పోరాటం.. పంజాబ్ టార్గెట్ 135 ఓపెనర్ డుప్లెసిస్ (55 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో సీఎస్కే జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. షమీ వేసిన ఆఖరి ఓవర్లో 16 పరుగులు రావడంతో సీఎస్కే ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, క్రిస్ జోర్డన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయి, మహ్మద్ షమీ తలో వికెట్ దక్కించుకున్నారు. ధోని (12) మరోసారి విఫలం.. చెన్నై 61/5 సీఎస్కే సారధి ఎంఎస్ ధోని.. తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నాడు. నేటి మ్యాచ్లోనూ 12 పరుగలకే ఔటై అభిమానులను నిరాశపరిచాడు. 12వ ఓవర్ ఆఖరి బంతికి రవి బిష్ణోయి బౌలింగ్లో ధోని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సీఎస్కే 61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో డుప్లెసిస్(26), జడేజా ఉన్నారు. రాయుడు (4) ఔట్.. 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై క్రిస్ జోర్డాన్ తన స్పెల్ రెండో ఓవర్లోనూ సీఎస్కేను దెబ్బకొట్టాడు. అంతకుముందు ఓవర్లో ఉతప్పను బోల్తా కొట్టించిన జోర్డాన్.. ఇన్నింగ్స్ 8.3వ ఓవర్లో రాయుడు(5 బంతుల్లో 4)ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. రాయుడు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అర్ష్దీప్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో సీఎస్కే 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్లో డుప్లెసిస్(21), ధోని ఉన్నారు. ఉతప్ప(2) ఔట్.. చెన్నై 32/3 క్రిస్ జోర్డాన్ వేసిన 6వ ఓవర్ ఐదో బంతికి రాబిన్ ఉతప్ప(6 బంతుల్లో 2) ఔటయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ చేతికి క్యాచ్ ఇచ్చి అతను పెవిలియన్కు చేరాడు. దీంతో సీఎస్కే 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో డుప్లెసిస్(16), అంబటి రాయుడు ఉన్నారు. మొయిన్ అలీ డకౌట్.. రెండో వికెట్ కోల్పోయిన చెన్నై పంజాబ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్.. చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి.. సీఎస్కేకు గట్టి షాకిచ్చాడు. నాలుగో ఓవర్లో ఇన్ ఫామ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ను పెవిలియన్కు పంపిన అతను.. ఆరో ఓవర్ 4వ బంతికి మొయిన్ అలీ(0)ని ఔట్ చేశాడు. మొయిన్ అలీ వికెట్కీపర్ కేఎల్ రాహుల్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగాడు. క్రీజ్లో డెప్లెసిస్(15), రాబిన్ ఉతప్ప ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన చెన్నై.. రుతురాజ్(12) ఔట్ టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్(14 బంతుల్లో 12; ఫోర్).. అర్ష్దీప్ బౌలింగ్లో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 3.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 18/1. క్రీజ్లో డెప్లెసిస్(4), మొయిన్ అలీ ఉన్నారు. దుబాయ్: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానున్న డబుల్ హెడర్ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఇరు జట్లు 25 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా సీఎస్కే 16 .. పంజాబ్ 9 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో ధోని సేన 6 వికెట్ల తేడాతో పంజాబ్ను మట్టికరిపించింది. ఇక ప్రస్తుత సీజన్లో ఇరు జట్ల పాయింట్ల విషయానికొస్తే.. సీఎస్కే 13 మ్యాచ్ల్లో 9 విజయాలతో రెండో స్థానంలో ఉండగా, పంజాబ్ 13 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. తుది జట్లు: చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్వుడ్ పంజాబ్ కింగ్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మర్క్రమ్, షారుఖ్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డన్, హర్ప్రీత్ బ్రార్, మోసస్ హెన్రిక్స్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ చదవండి: Michael Vaughan: ఆర్సీబీ ఓడిపోవడమే మంచిదైంది.. అసలు.. -
Michael Vaughan: ఆర్సీబీ ఓడిపోవడమే మంచిదైంది.. అసలు..
Michael Vaughan Lashes Out At RCB Management: సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ జట్టు తీసుకున్న నిర్ణయాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పెదవి విరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని, అయితే ఈ మ్యాచ్లో ఓటమి వారికి ఒక విధంగా మంచే చేసిందన్నాడు. ఇప్పటికైనా... లోపాలు సరిదిద్దుకోవాలని సూచించాడు. కాగా ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన ఆర్సీబీ, ఈ సీజన్లో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకొన్న తొలి జట్టు సన్రైజర్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో విలియమ్సన్ సేన 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. దీంతో... పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకుని పటిష్ట స్థితిలో ఉండాలనుకున్న కోహ్లి సేనకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ స్పందిస్తూ... ఆర్సీబీ తీరును తప్పుబట్టాడు. ముఖ్యంగా హిట్టర్ డివిల్లియర్స్ను ఆరో స్థానంలో బ్యాటింగ్కు పంపడమేంటని విమర్శించాడు. ఈ మేరకు... ‘‘ఓడిపోవడం ఆర్సీబీకి మంచిదైంది. ఇప్పటికైనా వారి బ్యాటింగ్ ఆర్డర్ మరీ అంత గొప్పగా ఏమీ లేదని తెలిసి వచ్చింది. డాన్ క్రిస్టియన్(డానియల్ క్రిస్టియన్)ను మూడో స్థానంలో అస్సలు బ్యాటింగ్కు పంపకూడదు. 35 బంతులు మిగిలి ఉన్న సమయంలో ఏబీ డివిల్లియర్స్ బ్యాటింగ్కు వచ్చాడు. అది అస్సలు సరికాదు. 60 బంతుల్లో సెంచరీ చేయగల సమర్థుడు తను. తనను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్కు పంపితే.. మ్యాచ్ను గెలిపించేవాడు. గ్లెన్ మాక్స్వెల్ మూడో స్థానంలో, డివిల్లియర్స్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావాలి’’ అని అభిప్రాయపడ్డాడు. స్కోర్లు: హైదరాబాద్: 141/7 (20) బెంగళూరు: 137/6 (20) చదవండి: Umran Malik: అతడు ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడతాడు... -
Umran Malik: పళ్లు, కూరగాయలు అమ్ముతాం.. మమ్మల్ని గర్వపడేలా చేశాడు
SRH Umran Malik Father Gets Emotional: తమ కుమారుడు ఏదో ఒకరోజు తప్పకుండా టీమిండియా తరఫున ఆడతాడని సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ మాలిక్ అన్నారు. మూడేళ్ల నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న తమ కొడుకు.. ఇప్పుడు ఐపీఎల్లో ఆడటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. టీవీలో తన ఆట చూసుకుంటూ మురిసిపోతున్నామని పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా ఎస్ఆర్హెచ్ బౌలర్ నటరాజన్కు కరోనా సోకడంతో.. ఉమ్రాన్ మాలిక్కు జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్-2021 రెండో అంచెలో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే అత్యంత వేగంగా బంతిని(సుమారు 153 కి.మీ. వేగం) విసిరిన ఉమ్రాన్ మాలిక్... ఇక బుధవారం నాడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ కెరీర్లో తన తొలి వికెట్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న అతడి తండ్రి అబ్దుల్ మాలిక్ ఇండియా టుడేతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల వయసు నుంచే నా కుమారుడికి క్రికెట్ అంటే బాగా ఇష్టం. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలన్నది తన కల. సన్రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో తను చోటు దక్కించుకోవడం మాకు అమితానందాన్ని ఇచ్చింది. మేమంతా టీవీకే అతుక్కుపోయాం. తెరపై ఉమ్రాన్ను చూసి నా భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మా కొడుకు చాలా కష్టపడ్డాడు. తను ఏదో ఒకరోజు కచ్చితంగా టీమిండియాకు ఆడతాడనే నమ్మకం ఉంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద కుటుంబం మాది.. ‘‘నేను పళ్లు, కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మాది చాలా పేద కుటుంబం. అలాంటిది మా కొడుకు ఐపీఎల్లో ఆడటం నిజంగా మాకెంతో గొప్ప విషయం. ఉమ్రాన్ మమ్మల్ని గర్వపడేలా చేశాడు. ఇప్పుడు మా సంతోషానికి హద్దులు లేవు. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా మాకు అభినందనలు తెలిపారు. ఆ భగవంతుడి దయతో ఉమ్రాన్ తన కెరీర్లో దూసుకుపోవాలి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. చదవండి: Jason Holder: నయా సంచలనం ఉమ్రాన్పై హోల్డర్ ప్రశంసలు -
IPL 2021: సామ్ కరన్ స్థానంలో కరేబియన్ క్రికెటర్.. ప్రకటించిన సీఎస్కే
Sam Curran Replaced With Dominic Drakes: సామ్ కరన్ స్థానంలో కరేబియన్ క్రికెటర్ డొమినిక్ డ్రేక్స్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు చెన్నై సూపర్కింగ్స్ ప్రకటించింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుతంగా రాణించిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్కు స్వాగతం పలికింది. కాగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా వెన్నునొప్పితో బాధపడిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానాన్ని డొమినిక్తో భర్తీ చేశారు. కాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వెస్బెర్ట్ తనయుడైన డొమినిక్.. ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయలేదు. అయితే, ఇటీవల ముగిసిన కరేబియన్ లీగ్లో మాత్రం అదరగొట్టాడు. సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు... టోర్నీలో మొత్తంగా 16 వికెట్లు తీశాడు. ముఖ్యంగా.. ఫైనల్లో ... 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు తొలి టైటిల్ అందించడంలో డొమినిక్ కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’గా నిలిచాడు. ఇక నెట్ బౌలర్గా యూఏఈకి వచ్చి ఐపీఎల్ బబుల్లో ఉన్న 23 ఏళ్ల డొమినిక్.. ఇప్పుడు సీఎస్కేలో సామ్ కరన్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. కాగా చెన్నై సూపర్కింగ్స్ గురువారం పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్లో డొమినిక్ తుది జట్టులో చోటు దక్కించచుకుంటాడా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్-2021 సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో తొమ్మిదింట గెలిచిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: నిజంగా గుండె పగిలింది.. కనీసం చివరి మ్యాచ్ అయినా ఆడనివ్వండి! -
Jason Holder: ఉమ్రాన్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు..!
Jason Holder Comments On Umran Malik: ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ కోవిడ్ బారిన పడటంతో జట్టులోకి వచ్చాడు ఉమ్రాన్ మాలిక్. ఇటీవల కోల్కతా నైట్రైడర్స్తో అరంగేట్ర మ్యాచ్ ఆడిన ఈ జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్... ఈ సీజన్లోనే అత్యంత వేగవంతంగా(సుమారు గంటకు 153 కి.మీ.) బంతిని విసిరాడు. ఐపీఎల్-2021లో ఇప్పటి వరకు భారత్ తరఫున ఫాస్టెస్ట్ డెలివరీ చేసిన బౌలర్గా నిలిచి.. క్రీడా పండితుల దృష్టిని ఆకర్షించాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్లో శ్రీకర్ భరత్(12)ను అవుట్ చేయడం ద్వారా.. క్యాష్ రిచ్ లీగ్లో తన తొలి వికెట్ నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఉమ్రాన్ రాకతో తమ జట్టులో పేస్ విభాగం మరింత బలపడిందని.. నెట్స్లో పదునైన బంతులతో తమను బాగా ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నాడు. ‘‘ప్రాక్టీసులో మాకు సవాలుగా నిలిచాడు. వేగంగా బంతులు విసరగలడు. ఎక్స్ట్రా పేస్ అనేది ఏ బౌలర్కైనా అదనపు బలం. అంతేకాదు.. ఎంత వేగంగా బంతిని విసిరినా అతడు నియంత్రణ కోల్పోడు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది పేసర్లు వచ్చారు. కానీ... వారిలో చాలా మంది నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఉమ్రాన్ మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తున్నాడు. తను కచ్చితంగా మెరుగ్గా రాణించగలడు’’ అని సహచర ఆటగాడిపై హోల్డర్ ప్రశంసలు కురిపించాడు. ఇక ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 4 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక జేసన్ హోల్డర్ విషయానికొస్తే... ఈ మ్యాచ్లో 16 పరుగులు చేయడం సహా.. ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్కోర్లు: హైదరాబాద్: 141/7 (20) బెంగళూరు: 137/6 (20) చదవండి: IPL 2021: నిజంగా గుండె పగిలింది.. కనీసం చివరి మ్యాచ్ అయినా ఆడనివ్వండి! There are fast bowlers, and then there is Umran Malik 🔥#OrangeArmy #OrangeOrNothing #IPL2021 pic.twitter.com/7J0w6yhlIW — SunRisers Hyderabad (@SunRisers) October 6, 2021 Still not over that win last night? Relive it all over again with our Matchday recap! ⏮#RCBvSRH #OrangeArmy #OrangeOrNothing #IPL2021 pic.twitter.com/lfDZdhbe6C — SunRisers Hyderabad (@SunRisers) October 7, 2021 -
RCB Vs SRH: ‘సన్’తోషించాల్సిన విజయం!
అబుదాబి: టోర్నీలో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానుల కోసం ఒక చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 4 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. తక్కువ స్కోరు చేసి కూడా... ఫామ్లో ఉన్న ఆర్సీబీని హైదరాబాద్ నిలువరించడం విశేషం. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విలియమ్సన్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ (52 బంతుల్లో 41; 4 ఫోర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివరి 2 ఓవర్లలో బెంగళూరు గెలుపు కోసం 18 పరుగులు చేయాల్సి ఉండగా, 19వ ఓవర్లో హోల్డర్ 5 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్ వేసిన భువనేశ్వర్... డివిలియర్స్ క్రీజ్లో ఉన్నా సరే, ఒత్తిడిని అధిగమించి 8 పరుగులే ఇవ్వడంతో గెలుపు హైదరాబాద్ సొంతమైంది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టాల్సి ఉండగా ఒక పరుగే వచి్చంది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి అండ్ బి) క్రిస్టియాన్ 44; అభిõÙక్ (సి) మ్యాక్స్వెల్ (బి) గార్టన్ 13; విలియమ్సన్ (బి) హర్షల్ పటేల్ 31; ప్రియమ్ గార్గ్ (సి) డివిలియర్స్ (బి) క్రిస్టియాన్ 15; అబ్దుల్ సమద్ (ఎల్బీ) (బి) చహల్ 1; వృద్ధిమాన్ సాహా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 10; హోల్డర్ (సి) క్రిస్టియాన్ (బి) హర్షల్ పటేల్ 16; రషీద్ ఖాన్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–14, 2–84, 3–105, 4–107, 5–107, 6–124, 7–141. బౌలింగ్: మొహమ్మద్ సిరాజ్ 3–0–17–0, గార్టన్ 2–0–29–1, షహబాజ్ 4–0–21–0, హర్షల్ పటేల్ 4–0–33–3, యజువేంద్ర చహల్ 4–0–27–1, క్రిస్టియాన్ 3–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 5; పడిక్కల్ (సి) సమద్ (బి) రషీద్ 41; క్రిస్టియాన్ (సి) విలియమ్సన్ (బి) కౌల్ 1; భరత్ (సి) సాహా (బి) ఉమ్రాన్ 12; మ్యాక్స్వెల్ (రనౌట్) 40; డివిలియర్స్ (నాటౌట్) 19; షహబాజ్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 14; గార్టన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–38, 4–92, 5–109, 6–128. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–25–1, హోల్డర్ 4–0–27–1, సిద్ధార్థ్ కౌల్ 4–1–24–1, ఉమ్రాన్ మాలిక్ 4–0–21–1, రషీద్ ఖాన్ 4–0–39–1. -
ఐపీఎల్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అక్షర్ పటేల్..
Axar Patel: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021సెకెండ్ ఫేజ్ లో రెండు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే వారి చివరి రెండు విజయాల్లో ఆ జట్టు స్పిన్నర్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఈ లెఫ్టార్ట్ స్పిన్నర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో గత రెండు మ్యాచులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఐపీఎల్లో ఒక స్పిన్నర్ ఇలా వరుసగా రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు గెలుచుకోవడం 2011 తర్వాత ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్విట్టర్ లో పంచుకుంది. కాగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో అక్షర్ పటేల్ రెండు కీలకమైన వికెట్లను పడగొట్టాడు. చదవండి: T20 World Cup: ఒమన్లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్లపై ప్రభావం..! That feeling of becoming the first spinner to win consecutive MOTM awards in IPL, since 2011 😏#YehHaiNayiDilli #IPL2021 #DCvCSK pic.twitter.com/PQYn7f34AQ — Delhi Capitals (@DelhiCapitals) October 5, 2021 -
నిజంగా గుండె పగిలింది.. కనీసం చివరి మ్యాచ్ అయినా ఆడనివ్వండి!
Lisa Sthalekar Comments on David Warner: డేవిడ్ వార్నర్ పట్ల సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ వ్యవహరిస్తున్న తీరును ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత లీసా స్తాలేకర్ తప్పుబట్టింది. జట్టుకు అతడు అందించిన సేవలను అసమానవైనవని, అలాంటి వార్నర్ విషయంలో అవనమానకరంగా ప్రవర్తించడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు క్రిక్బజ్ లైవ్లో ఆమె మాట్లాడుతూ.. ‘‘డేవిడ్ వార్నర్ విషయంలో ఎస్ఆర్హెచ్ ప్రవర్తించిన తీరు చూసి గుండె పగిలింది. ఫ్రాంఛైజీ కోసం అతడు చాలా చేశాడు. జట్టును ముందుండి నడిపించాడు. 2016లో టైటిల్ సాధించిపెట్టాడు. అలాంటి కెప్టెన్ పట్ల ఈవిధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. తను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదు. నిజంగా ఫ్రాంఛైజీ తీరు అస్సలు నచ్చడం లేదు. నాకు తెలిసి.. వచ్చే ఏడాది వాళ్లు తనను రీటైన్ చేసుకోరేమో! కాబట్టి తనను చివరి మ్యాచ్ ఆడనిస్తే బాగుంటుంది. హైదరాబాద్ అభిమానులు తన ఆట కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది’’ అని పేర్కొంది. కాగా ఐపీఎల్-2021 సీజన్ తొలి అంచెలో ఆరెంజ్ ఆర్మీ వరుస వైఫల్యాల నేపథ్యంలో వార్నర్ను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. ఆ తర్వాత తుది జట్టులో కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో అంచెలో ఈ ఆసీస్ బ్యాటర్ విఫలం కావడంతో... పూర్తిగా పక్కన పెట్టేసింది. కొన్ని మ్యాచ్లలో కనీసం మైదానంలో కూడా అతడు కనిపించలేదు. అయితే, ఇటీవలి కేకేఆర్ మ్యాచ్లో డగౌట్లో వార్నర్ కనిపించడంతో అభిమానులు కాస్త సంతోషించారు. ఇక హైదరాబాద్ తరఫున తనకు ఇదే చివరి సీజన్ కాబోతుందంటూ వార్నర్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో... లీసా వలె ఫ్యాన్స్ సైతం అతడిని చివరి మ్యాచ్ ఆడనివ్వాలని కోరుతున్నారు. ఇక బుధవారం హైదరాబాద్ జట్టు, ఆర్సీబీతో తలపడనున్న సంగతి తెలిసిందే. మరి ఈరోజు వార్నర్ మైదానంలోనైనా కనిపిస్తాడో లేదో చూడాలి!.. ఇక ఇప్పటికే విలియమ్సన్ సేన ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. చదవండి: T20 World Cup: పొలార్డ్ టాప్-5 ఫేవరెట్ లిస్టు.. ఆశ్చర్యకరంగా తను కూడా! -
నాలో ఆత్మవిశ్వాసానికి ఆ నలుగురు కారణం: ఇషాన్ కిషన్
షార్జా: ముంబై ఇండియన్స్ యువ సంచలనం ఇషాన్ కిషన్ రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. 25 బంతుల్లోనే 50 పరుగులు చేసిన ఇషాన్.. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ముంబై విజయంలో కీలకపాత్ర పోషించింది. వరుసగా విఫలమవుతున్న సందర్భంలో కొన్ని మ్యాచ్ల్లో కిషన్ చోటు కూడా దక్కించుకోలేదు. ఈ క్రమంలో బాధతో కుంగిపోయిన తనలో నలుగురు సీనియర్ ఆటగాళ్లు, మద్దతుగా నిలిచారని అతడు తెలిపాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ లు తనకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి తనలో ఆత్మవిశ్వాసం పెంచారని కిషన్ పేర్కొన్నాడు.. "తిరిగి మళ్లీ ఓపెనింగ్కు రావడం, జట్టు కోసం పరుగులు సాధించడం, జట్టు విజయంలో భారీ తేడాతో గెలవడానికి సహాయపడటం సంతోషంగా ఉంది. ఇది నిజంగా ఒక మంచి అనుభూతి. ఇది మా టీమ్ వేగంగా పుంజుకోవడానకి చాలా సహయపడుతుంది. ఏ ఆటలోనైనా క్రీడాకారుడిలో హెచ్చు తగ్గులు సహజం అని నేను భావిస్తున్నాను. నేను కూడా మంచి ఫామ్లో లేను. గత సీజన్లలో లాగా చాలా మంది బ్యాటర్లు పరుగులు చేయలేదు. మాకు గొప్ప సహాయక సిబ్బంది ఉన్నారు. నేను మా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ భాయ్, హార్దిక్ భాయ్తో చాట్ చేసాను .. అందరూ నాకు మద్దతుగా నిలిచారాని "అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ఇషాన్ వెల్లడించాడు. చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ -
RCB VS SRH: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ విజయం..
ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ విజయం.. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్రైజర్స్ హైదరాబాద్ 4పరుగుల తేడాతో విజయం సాధించింది. 142 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నీర్ణీత 20 ఓవర్లలో 137 పరుగలకే పరిమితమైంది. చివర వరకు డివిలియర్స్ క్రీజులో ఉన్న బెంగళూరును గెలిపించ లేకపోయాడు. ఆర్సీబీ బ్యాట్సమన్లో మాక్స్వెల్(40), పడిక్కల్ (41) ఆద్బుతంగా రాణించారు. అఖరి ఓవర్లో 13 పరుగుల కావల్సిన నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ 9 పరుగులే ఇచ్చి హైదరాబాద్కు విజయాన్ని అందించాడు. అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ నీర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానకి 141 పరుగులు చేసింది. ఆరంభం ఆదిరినా మిడిలార్డర్ చేతలు ఎత్తేయడంతో 141 పరుగులకే సన్రైజర్స్ పరిమితమైంది. ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికి కెప్టెన్ విలియమ్సన్(31) జాసన్ రాయ్(44) ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. విలియమ్సన్ ఔటయ్యక హైదరాబాద్ వికెట్ల పతనం మొదలైంది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, డేనియల్ క్రిస్టియన్ రెండు వికెట్లు, యజ్వేంద్ర చహల్, జార్జ్ గార్టన్ చెరో వికెట్ సాధించారు ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. పడిక్కల్ (41) ఔట్ కీలక సమయంలో ఆర్సీబీ పడిక్కల్ వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో పడిక్కల్ (41) సమద్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం ఆర్సీబీ 18ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్(10), డివిలియర్స్(12) ఉన్నారు. నాలగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. మాక్స్వెల్(40) ఔట్ స్కోర్ 92 పరుగుల వద్ద మంచి ఊపు మీద ఉన్న మాక్స్వెల్ , రషీద్ ఖాన్ బౌలింగ్లో విలియమ్సన్ సూపర్ త్రో కు రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. 25 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్స్లతో 40 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం ఆర్సీబీ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో దేవదత్ పడిక్కల్(38), ఎబి డివిలియర్స్(5) ఉన్నారు. కాగా విజయానికి 23 బంతుల్లో 37 పరుగలు కావాలి మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. శ్రీకర్ భరత్(12)ఔట్ 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తడబడతుంది. కేవలం 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో శ్రీకర్ భరత్(12) వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు సిద్దార్థ్ కౌల్ బౌలింగ్లో క్రిస్టియన్(1) పరుగుకే విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కాగా ప్రస్తుతం 8 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దేవదత్ పడిక్కల్(23), గ్లెన్ మాక్స్వెల్(7) ఉన్నారు. ఆర్సీబీకు బిగ్ షాక్.. కోహ్లి(5) ఔట్ 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆదిలోనే కెప్టెన్ కోహ్లి వికెట్ కోల్పోయింది. కేవలం 5 పరుగులు చేసి కోహ్లి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 2 ఓవర్లలో ఆర్సీబీ వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజులో దేవదత్ పడిక్కల్ (7), డేనియల్ క్రిస్టియన్(0) ఉన్నారు ఆర్సీబీ టార్గెట్ 142 పరుగులు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నీర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానకి 141 పరుగులు చేసింది. ఆరంభం ఆదిరినా మిడిలార్డర్ చేతలు ఎత్తేయడంతో 141 పరుగులకే సన్రైజర్స్ పరిమితమైంది. ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికి కెప్టెన్ విలియమ్సన్(31) జాసన్ రాయ్(44) ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. విలియమ్సన్ ఔటయ్యక హైదరాబాద్ వికెట్ల పతనం మొదలైంది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, డేనియల్ క్రిస్టియన్ రెండు వికెట్లు, యజ్వేంద్ర చహల్, జార్జ్ గార్టన్ చెరో వికెట్ సాధించారు. 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు.. అబ్దుల్ సమద్(1) ఔట్, ఎస్ఆర్హెచ్ 107/5 ఎస్ఆర్హెచ్ జట్టు 2 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. డేనియల్ క్రిస్టియన్ వేసిన 15వ ఓవర్లో ప్రియం గార్గ్, జేసన్ రాయ్ వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. చహల్ వేసిన మరుసటి ఓవర్ తొలి బంతికే(15.1 ఓవర్) అబ్దుల్ సమద్(1) వికెట్ కూడా సమర్పించుకుంది. 15.1 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 107/5. క్రీజ్లో సాహా, హోల్డర్ ఉన్నారు. ఒకే ఓవర్లో 2 వికెట్లు.. జేసన్ రాయ్(44) ఔట్, ఎస్ఆర్హెచ్ 107/4 డేనియల్ క్రిస్టియన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. 14వ ఓవర్ తొలి బంతికి ప్రియం గార్గ్ను అవుట్ చేసిన క్రిస్టియన్.. అదే ఓవర్ ఆఖరి బంతికి జేసన్ రాయ్(38 బంతుల్లో 44; 5 ఫోర్లు)ని కూడా పెవిలియన్కు పంపాడు. 15 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 107/4. క్రీజ్లో అబ్దుల్ సమద్(1), సాహా ఉన్నారు. ప్రియం గార్గ్(15) ఔట్.. ఎస్ఆర్హెచ్ 105/3 డేనియల్ క్రిస్టియన్ వేసిన 14 ఓవర్లో ప్రియం గార్గ్(11 బంతుల్లో 15; సిక్సర్) ఔటయ్యాడు. ఏబీ డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14.1 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 105/3. క్రీజ్లో జేసన్ రాయ్(43), అబ్దుల్ సమద్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. విలియమ్సన్(31) ఔట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్లో కెప్టెన్ విలియమ్సన్(31) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జాసన్ రాయ్(22), ప్రియం గార్గ్(3) పరుగులతో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్.. ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికి ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి ఎస్ఆర్హెచ్ 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్(20), జాసన్ రాయ్(22) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. అభిషేక్ శర్మ(13) ఔట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో అభిషేక్ శర్మ రూపంలో సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ సెకెండ్ ఓవర్ వేసిన జార్జ్ గార్టన్ బౌలింగ్లో.. ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ(13) మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(8), జాసన్ రాయ్(1) పరుగులతో ఉన్నారు. అబుదాబి: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి ఐపీఎల్లో తమ 100 వ విజయాన్ని నమోదు చేసుకోవడానకి బెంగళూరు తహ తహ లాడుతుంటే.. హైదరాబాద్ మాత్రం ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో రెండు జట్లు 19 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడగా.. హైదరాబాద్ 12 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. బెంగళూరు 11 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాదించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్ సన్రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్ -
IPL 2021: మస్తుగా ఎంజాయ్ చేస్తున్న పంత్ సేన.. ఫొటోలు వైరల్!
Delhi Capitals Players Enjoying In Beach: చెన్నై సూపర్కింగ్స్పై గెలుపుతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ ఒడ్డున వాలీబాల్ ఆడుతూ... కుటుంబంతో సరదాగా గడుపుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. Photo Credit: Delhi Capitals Twitter కెప్టెన్ రిషభ్ పంత్ సహా... శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, స్టీవ్స్మిత్ సాగర తీరంలో ఉల్లాసంగా గడుపుతున్నారు. తమ క్రికెటర్ల ఔటింగ్కు సంబంధించిన ఫొటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. Photo Credit: Delhi Capitals Twitter ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘గతంలోనే టైటిల్ చేజారింది. ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఫైనల్ చేరి కప్ గెలవాలి. ఆల్ ది బెస్ట్’’అంటూ డీసీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా.. ‘‘బయో బబుల్ నిబంధనలు ఏమయ్యాయి’’ అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా చెన్నై సూపర్కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో గెలుపొంది... పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. Photo Credit: Delhi Capitals Twitter చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు Off-Day Goals be like 👉🏼 Beach Volleyball, Stand-Up Paddling & Unlimited Fun 🏄🏐 📸 | Snapshots from a memorable outing for our DC stars 🏖️#YehHaiNayiDilli #IPL2021 @SofitelDXBPalm pic.twitter.com/YFbx9ESadL — Delhi Capitals (@DelhiCapitals) October 6, 2021 -
టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..!
Varun Chakravarthy Dodgy Knees Became Biggest Head Ache For Team India: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు ఓ షాకింగ్ వార్త పెద్ద తలనొప్పిగా మారింది. యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మెగా టోర్నీలో ఆడటం అనుమానంగా ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్..మోకాళ్ల నొప్పులతో సతమతమవుతున్నాడు. పెయిన్ కిల్లర్ లేకుండా అతను బరిలోకి దిగే పరిస్థితి లేదు. దీంతో పొట్టి ప్రపంచకప్కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో వరుణ్ స్థానంలో చహల్ను జట్టులోకి తీసుకునే అంశం బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అక్టోబరు 10 వరకు తుది జట్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వరుణ్.. ప్రస్తుత ఐపీఎల్లో కేకేఆర్ తరఫున 13 మ్యాచ్ల్లో 15 వికెట్లతో సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. 30 ఏళ్ల ఈ మిస్టరీ స్పిన్నర్ టీమిండియా తరఫున 3 టీ20ల్లో 2 వికెట్లు, 27 ఐపీఎల్ మ్యాచ్ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
ముందు యశస్వి.. ఇప్పుడు లామ్రోర్
Mahipal Lamror.. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రాజస్తాన్పై ముంబై ఇండియన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్ అనంతరం రాజస్తాన్ యువ ఆటగాడు మహిపాల్ లామ్రోర్ దిగ్గజ ఆటగాడు.. ముంబై ఇండియన్స్ మెంటార్ సచిన్ టెండూల్కర్ను కలిశాడు. ఈ సందర్భంగా లామ్రోర్ తన ఆరాధ్య ఆటగాడి నుంచి సలహాలు, సూచనలు అందుకున్నాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్యాట్పై సచిన్ ఆటోగ్రాఫ్ను తీసుకొని మురిసిపోయాడు. నా దైవం నుంచి ఏ గిఫ్ట్ వచ్చినా నాకు సమ్మతమే అనే రీతిలో ఫోటోను షేర్ చేశాడు. చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ కాగా అంతకముందు యశస్వి జైశ్వాల్ సచిన్ను కలిశాడు. ఆ తర్వాత సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ సందర్భంగా సచిన్ చేతిలో ఏదో మాయ ఉందని.. అతను తన ఆటోగ్రాఫ్ను గిఫ్ట్గా ఇవ్వగానే యశస్వి ఫిప్టీ కొట్టాడు. ఇప్పుడు మహిపాల్ కలిశాడు.. మరి తర్వాతి ఏం జరుగుతుందో చూడాలి. చదవండి: Virat Kohli: కోహ్లిపై ఆఫ్రిది ప్రశంసలు.. కన్నుల పండువగా ఉంది! Mahipal is going to treasure that bat. 🤗#RoyalsFamily | #IPL2021 pic.twitter.com/s8iUkHkGgJ — Rajasthan Royals (@rajasthanroyals) October 6, 2021 -
Virat Kohli: కోహ్లిపై ఆఫ్రిది ప్రశంసలు.. కన్నుల పండువగా ఉంది!
Shahid Afridi Praises Virat Kohli: ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన కోహ్లి సేన.. హైదరాబాద్పై నెగ్గి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలని పట్టుదలగా ఉంది. అంతేగాక.. గత సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో తమను ఓడించి టైటిల్ గెలిచే అవకాశాలకు గండికొట్టిన ఆరెంజ్ ఆర్మీని ఎలాగైనా చిత్తు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లు నెట్స్లో బాగానే శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రాక్టీసు సెషన్కు సంబంధించిన వీడియోను కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హైదరాబాద్ మ్యాచ్కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ‘‘గొప్ప ఆటగాళ్లు ప్రాక్టీసులో కూడా వందకు వంద శాతం నిబద్ధతతో ఆడతారు. కన్నుల పండుగగా ఉంది’’ అని కోహ్లిని కొనియాడాడు. కాగా ఐపీఎల్ 2021లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లలో కోహ్లి 357 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 72(నాటౌట్). చదవండి: పాక్ కోచ్గా చచ్చినా చేయను: వసీం అక్రమ్ Aakash Chopra: వీరిలో ఎవరైనా ఆర్సీబీ కెప్టెన్ కావొచ్చు..? Treat to watch - A great player always gives 100% in practice!! 👏👏 https://t.co/5sxxVaqXYw — Shahid Afridi (@SAfridiOfficial) October 5, 2021 -
IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్
IPL 2021 Playoff Race.. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్ లీగ్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోగా.. మిగిలిఉన్న ఒక్కస్థానానికి ఎవరు క్వాలిఫై అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు కేకేఆర్తో పాటు ముంబై ఇండియన్స్కు ఉంది. పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికి అదృష్టంతో వెళ్లే చాన్స్ ఉంటుంది. కానీ ఆ అవకాశం ముంబై, కేకేఆర్లు ఇవ్వకపోవచ్చు. కేకేఆర్: Courtesy: IPL Twitter కేకేఆర్ ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 6 విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. కేకేఆర్ నెట్రన్రేట్ +0.294గా ఉంది. ఇక ఆ జట్టు తన చివరి మ్యాచ్ను రాజస్తాన్ రాయల్స్తో ఆడుతోంది. ఈ మ్యాచ్ను కేకేఆర్ గెలిస్తే చాలు. 14 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ఒకవేళ రాజస్తాన్తో ఓడినప్పటికి కేకేఆర్కు మరో అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తప్పకుండా ఓడిపోవాలి. అలా కాకుండా ముంబై గెలిస్తే కేకేఆర్ అవకాశం కోల్పోయినట్లవుతుంది. ఇటు రాజస్తాన్ చేతిలో కేకేఆర్.. అటు ఎస్ఆర్హెచ్ చేతిలో ముంబై ఓడితే మాత్రం నెట్రన్రేట్ ఆధారంగా కేకేఆర్ ప్లే ఆఫ్స్కు చేరుతుంది. చదవండి: MS Dhoni: సాక్షి సింగ్ సమక్షంలోనే ధోనికి లవ్ ప్రపోజ్ ముంబై ఇండియన్స్: Courtesy: IPL Twitter రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బారీ తేడాతో గెలిచి ఒక్కసారిగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. 13 మ్యాచ్లాడిన ముంబై 6 విజయాలు.. 7 ఓటములతో ఐదో స్థానంలో ఉంది. ముంబై నెట్రన్రేట్ -0.048గా ఉంది. ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్ను ఎస్ఆర్హెచ్తో ఆడనుంది. ఆ మ్యాచ్లో ముంబై 120 పరుగులకంటే ఎక్కువ బారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ముంబై ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికి ప్లే ఆఫ్స్ అవకాశాలు అంతంత మాత్రమే. అది వీలు కాని పక్షంలో రాజస్తాన్తో జరిగే మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి. పంజాబ్ కింగ్స్: Courtesy: IPL Twitter ఇప్పటికైతే పంజాబ్ కింగ్స్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనట్లే. పంజాబ్ 13 మ్యాచ్ల్లో 5 విజయాలు.. 8 ఓటములతో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పంజాబ్ తన చివరి మ్యాచ్ను సీఎస్కేతో ఆడనుంది. సీఎస్కేపై గెలిస్తే పంజాబ్ ఖాతాలో 12 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో కేకేఆర్ రాజస్తాన్ చేతిలో.. ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ చేతిలో బారీ తేడాతో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు నెట్రన్రేట్ ఆధారంగా పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం సీఎస్కే లాంటి పటిష్టమైన జట్టును పంజాబ్ ఓడించడం అసాధ్యం. కానీ టి20 అంటేనే సంచలనాలకు వేదిక. మరి పంజాబ్ అదృష్టం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చదవండి: IPL 2021: ధోని భయ్యా.. నాకు బర్త్డే గిఫ్ట్ ఏం లేదా రాజస్తాన్ రాయల్స్: Courtesy: IPL Twitter పంజాబ్ కింగ్స్ విషయంలో ఏదైతే జరగాలో అదే రాజస్తాన్ రాయల్స్కు వర్తిస్తుంది. అయితే కేకేఆర్తో జరిగే మ్యాచ్లో రాజస్తాన్ బారీ తేడాతో గెలవడమే గాక.. ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ను బారీ తేడాతో చిత్తు చేయాలి. అప్పుడు కూడా రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు అంతంత మాత్రమే. ముంబై ఇండియన్స్ చేతిలో దారుణ పరాజయం రాజస్తాన్ అవకాశాలపై బారీ గండి పడింది. 13 మ్యాచ్లాడిన రాజస్తాన్ 5 విజయాలు.. 8 ఓటములతో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. రాజస్తాన్ నెట్రన్రేట్ -0.737గా ఉంది. చదవండి: Ishan Kishan: రికార్డుతో పాటు ఫామ్లోకి వచ్చాడు.. సంతోషం -
MS Dhoni: సాక్షి సింగ్ సమక్షంలోనే ధోనికి లవ్ ప్రపోజ్
Love Proposal To MS Dhoni 2018 IPL.. టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆట నుంచి దూరమైన తర్వాత కూడా అతని క్రేజ్ ఇసుమంతైన తగ్గలేదనడానికి తాజా ఐపీఎల్ సీజనే ఉదాహరణ. ధోని ఆడకపోయినా పర్లేదు.. జట్టును విజేతగా నిలిపితే చూడాలని చాలామంది అనుకుంటారు. అలాంటి ధోనికి అమ్మాయిల్లోనూ యమ క్రేజ్ ఉంటుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సమయంలో తన జులపాల జట్టును ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. ధోని హెయిర్స్టైల్ చూసే చాలామంది అమ్మాయిలు బహిరంగంగానే లవ్ప్రపొజల్ చేసిన ఘటనలు కోకొల్లలు. అయితే అవి అభిమానం వరకు మాత్రమే పరిమితమయ్యేవి. ఇక ధోనికి 2010లో తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి సింగ్ను వివాహమాడాడు. చదవండి: Viral Video: భార్యను భయపెట్టిన రోహిత్ శర్మ.. ఈ సంగతి అలా ఉంచితే.. ఐసీసీ తన ట్విటర్లో 2018 ఐపీఎల్ సీజన్లో ధోనికి లవ్ ప్రపోజ్ చేసిన ఒక అమ్మాయి త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేసింది. కాగా సాక్షి సమక్షంలోనే ఆ అమ్మాయి ధోనికి లవ్ ప్రపోజ్ చేయడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. '' ధోని నీకు పెళ్లి అయి ఉండొచ్చు.. కానీ నా ఫస్ట్ లవ్ ఎప్పటికీ నువ్వే.. ఐ లవ్ యూ మహీ'' అంటూ ఆ యువతి ఫ్లకార్డు చేతపట్టుకొని తన లవ్ను ప్రపోజ్ చేసింది. ఇక 2018 సీజన్లో సీఎస్కే చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి మూడోసారి ఐపీఎల్ టైటిల్ను కొల్లగొట్టింది. ఇక తాజాగా ఐపీఎల్ 2021 సీజన్లోనూ సీఎస్కే దుమ్మురేపుతుంది. గతేడాది దారుణ ప్రదర్శనను మైమరిపిస్తూ దూకుడైన ఆటతీరు కనబరిచిన సీఎస్కే ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరింది. ఇక తన చివరి లీగ్ మ్యాచ్ను సీఎస్కే పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. చదవండి: Ishan Kishan: రికార్డుతో పాటు ఫామ్లోకి వచ్చాడు.. సంతోషం 💕 @msdhoni 😍#CSKvRR #IPL2018 pic.twitter.com/j2t5Scuwzs — ICC (@ICC) April 20, 2018 -
రికార్డుతో పాటు ఫామ్లోకి వచ్చాడు.. సంతోషం
Ishan Kishan Gains Form Vs Rajastan Royals Match.. ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఫామ్లోకి వచ్చాడు. రాజస్తాన్ ఇచ్చింది స్వల్ప లక్ష్యమే అయినా.. ముంబై చకచకా చేధించడంలో ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ కీలకపాత్ర పోషించింది. 25 బంతుల్లోనే 50 పరుగులు చేసిన ఇషాన్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్ ఆరంభమైనప్పటి నుంచి ఇషాన్ కిషన్ వరుసగా నిరాశపరుస్తూ వచ్చాడు. ఒక మ్యాచ్లో చోటు కూడా దక్కించుకోలేకపోయాడు. చదవండి: IPL 2021: ధోని భయ్యా.. నాకు బర్త్డే గిఫ్ట్ ఏం లేదా Courtesy: IPL Twitter ఇదే సమయంలో టి20 ప్రపంచకప్కు సమయం దగ్గర పడడం.. ఇషాన్ కిషన్ ఫామ్ సెలక్టర్లను ఆందోళన కలిగించింది. దీంతోపాటు అతని ఆటతీరుపై అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజా ప్రదర్శనతో ఇషాన్ విమర్శకులు నోళ్లు మూయించాడు. దీంతోపాటు ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ తరపున ఒక రికార్డు సాధించాడు. ఐపీఎల్లో ముంబై తరపున ఇషాన్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసిన ఇషాన్ ఈ రికార్డు సాధించాడు. కాగా ఇషాన్ ప్రదర్శనపై కొందరు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ''ఇషాన్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు.. సంతోషం.. ఇదే కొనసాగించు'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Rohit Sharma: టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. -
టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ..
Rohit Sharma Completed 400 Sixes In T20s: హిట్మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. టీ20ల్లో 400 సిక్స్లు కొట్టిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ తర్వాత 325 సిక్సర్లతో సురేశ్ రైనా, 320 సిక్సర్లతో విరాట్ కోహ్లి, 304 సిక్సర్లతో, ఎంఎస్ ధోని, 261 సిక్సర్లతో తర్వాత స్ధానంలో ఉన్నారు. రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించాడు. కాగా ఓవరల్గా చూస్తే 1042 సిక్సర్లతో క్రిస్ గేల్ ప్రథమ స్ధానంలో ఉన్నాడు కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిపిండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాజస్తాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో చేలరేగడంతో ముంబై సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్తాన్ ముంబై బౌలర్ల ధాటికి నీర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడగా ఆడారు. 22 పరుగులు చేసిన రోహిత్, చేతన్ సకారియా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. చివరకీ ఇషాన్ కిషన్ సిక్సర్ల మోత మోగించడంతో ముంబై కేవలం 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ను చేధించింది. దీంతో ముంబై ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా ఈ ఓటమితో రాజస్తాన్ ప్లేఆప్ రేసు నుంచి నిష్క్రమించింది. చదవండి: MI Vs RR: రాజస్తాన్పై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం -
ప్రాంక్ చేసి భార్యను బెదరగొట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ..
Rohit Sharma Pranks Wife Ritika: టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో సరదాగా గడుపుతాడన్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్.. తన భార్య రితిక సజ్దేను ప్రాంక్ చేసి భయపెట్టిన వీడియో ఒకటి సోషల్మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను రోహిత్ స్వయంగా చిత్రీకరించి తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో రోహిత్.. అద్దం ముందు నిల్చోని తన పిడికిలిలో ఓ చాక్లెట్ను ఉంచుకుంటాడు. అక్కడి నుంచి మరో రూంలో ఉన్న భార్య రితిక వద్దకు వెళ్తాడు. పిడికిలిలో ఏముందో చూడాలంటూ భార్యను కోరతాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) అందులో ఏదో భయపెట్టే వస్తువు ఉంటుందని భావించిన రితిక.. పిడికిలిని ఓపెన్ చేసేందుకు భయపడింది. రోహిత్ ఎంత అడిగినా రితిక పిడికిలిని ఓపెన్ చేయకపోవడంతో.. హిట్మ్యాన్ సస్పెన్స్ను తెరదించుతాడు. అందులో చాక్లెట్ను చూసిన రితిక.. తెగ నవ్వుకుంటుంది. ఈ సరదా వీడియోను రోహిత్.. అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2021 కోసం రోహిత్.. ఫ్యామిలీతో కలిసి యూఏఈలో ఉన్నాడు. రోహిత్ సారధ్యంలో ముంబై జట్టు ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 5 మాత్రమే నెగ్గి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. నేడు ముంబై జట్టు కీలకమైన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో తలపడుతుంది. చదవండి: Sushil Kumar Bail Petetion: క్రూరంగా హింసించి చంపారు.. బెయిల్ ఇవ్వకండి -
స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న కేకేఆర్ ఆటగాళ్లు.. వీడియో వైరల్
KKR players in the Swimming pool: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్లో సన్రైజర్స్పై విజయం సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ క్రమం లో కేకేఆర్ ఆటగాళ్లు తమ హోటల్ స్విమ్మింగ్ పూల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ను కేకేఆర్ షేర్ చేసింది. ఈ వీడియోలో ఆ జట్టు స్పిన్నర్ అకేల్ హుస్సేన్ ఏరోబిక్స్( డ్యాన్స్ ఎక్సర్ సైజ్) చేస్తుండగా సహచర ఆటగాళ్లు పూల్లో తనను అనుకరించారు. దీంట్లో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు 13మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో కోలకతా నాల్గవ స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల్లో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ , స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, గిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా కేకేఆర్ తన చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. చదవండి: క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్ 𝙅𝙪𝙨𝙩 𝙙𝙤 𝙩𝙝𝙖𝙩 𝙋𝙖𝙖𝙣𝙞 𝙒𝙖𝙡𝙖 𝘿𝙖𝙣𝙘𝙚 😂🎶 Recovery session done quite right ✅#KKR #AmiKKR #KorboLorboJeetbo #আমিKKR #IPL2021 pic.twitter.com/O4iU9SDyio — KolkataKnightRiders (@KKRiders) October 5, 2021 -
MI Vs RR: రాజస్తాన్పై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం
రాజస్తాన్పై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్తాన్పై ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో చేలరేగడంతో ముంబై సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్తాన్ ముంబై బౌలర్ల ధాటికి నీర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడగా ఆడారు. 22 పరుగులు చేసిన రోహిత్, చేతన్ సకారియా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. చివరకీ ఇషాన్ కిషన్ సిక్సర్ల మోత మోగించడంతో ముంబై కేవలం 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ను చేధించింది. దీంతో ముంబై ప్లే ఆప్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా ఈ ఓటమితో రాజస్తాన్ ప్లేఆప్ రేసు నుంచి నిష్క్రమించింది. రెండో వికెట్ కోల్పోయిన ముంబై .. సూర్యకుమార్ యాదవ్ (13) ఔట్ 91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ముస్తఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ (13) లామార్రోర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై .. రోహిత్ శర్మ (22) ఔట్ 91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై దూకడుగా ఆడుతున్న రోహిత్ శర్మ(22) వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్(8), సూర్యకుమార్ యాదవ్(5) పరుగులతో ఉన్నారు. చేతులెత్తేసిన రాజస్తాన్ బ్యాట్స్మెన్స్.. ముంబై టార్గెట్ 91 టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ ముంబై బౌలర్ల ధాటికి విలవిలాడింది. నీర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్తాన్ పతనాన్ని శాసించాడు. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. రాజస్తాన్ బ్యాట్స్మెన్లో ఎవిన్ లూయిస్ 24 పరుగులు చేసి అత్యధిక స్కోరర్గా నిలిచాడు. Photo Courtesy: IPL పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్.. ముంబై బౌలర్ల ధాటికి రాజస్తాన్ విలవిలడుతుంది. కేవలం 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నీషమ్ బౌలింగ్లో శివమ్ దూబే(3) క్లీన్ బౌల్డ్ కాగా, నాథన్ కౌల్టర్-నైల్ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్(4)కూడా బౌల్డ్ రూపంలో పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ ఐదు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్(4), రాహుల్ తెవాటియా(2)పరుగులతో క్రీజులో ఉన్నారు Photo Courtesy: IPL సామ్సన్(3) ఔట్.. రాజస్తాన్ 41/3 6వ ఓవర్ తొలి బంతికి నీషమ్ బౌలింగ్లో జయంత్ యాదవ్ క్యాచ్ పట్టడంతో సంజూ సామ్సన్(6 బంతుల్లో 3) ఔటయ్యాడు. దీంతో రాజస్తాన్ జట్టు 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్ ఉన్నారు. రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. లూయిస్(24) ఔట్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో రాజస్తాన్ జట్టు రెండో వికెట్ను కోల్పోయింది. డాషింగ్ బ్యాటర్ ఎవిన్ లూయిస్(19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్)ను బుమ్రా ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. 5.3 ఓవర్ల తర్వాత ఆర్ఆర్ స్కోర్ 41/2. క్రీజ్లో సంజూ సామ్సన్(3), శివమ్ దూబే ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. జైశ్వాల్(12) ఔట్ ఓపెనర్ జైశ్వాల్(12) రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ను కోల్పోయింది. నాథన్ కౌల్టర్-నైల్ బౌలింగ్లో జైశ్వాల్.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 4 ఓవర్లో వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. లూయిస్ 18, సంజు శాంసన్ (1) పరుగులతో ఆడుతున్నారు. షార్జా: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య నేడు కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈరోజు షార్జాలో జరిగే పోరులో రాజస్తాన్ లేదా ముంబై ఓడిపోతే ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోవాల్సిందే. ఈ క్యాష్ రిచ్ లీగ్లో రెండు జట్లు 24 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడగా.. ముంబై 12 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. రాజస్థాన్ 11 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో విజయం సాదించింది. తుది జట్లు: రాజస్తాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్),ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్ ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ చదవండి: T20 World Cup 2021: టీమిండియా క్యాప్ పెట్టుకున్నారు.. ఇంకెందుకు ఆడుతారు -
విజయానందంలో ఆ ఢిల్లీ ఆటగాడు ఏం చేశాడో చూడండి..!
Shimron Hetmyer Jumps On Dwayne Bravo Back After DC Win Over CSK: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో డీసీ జట్టును విజయం వరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. మ్యాచ్ గెలిపించానోచ్ అంటూ ఢిల్లీ ఆటగాడు షిమ్రోన్ హెట్మైర్.. ప్రత్యర్ధి ఆటగాడు డ్వేన్ బ్రావో భుజాలపైకి ఎక్కి తన సంతోషాన్ని పంచుకున్నాడు. బ్రావో సైతం హెట్మైర్ను భుజాలపై మోస్తూ కాసేపు సందడి చేశాడు. ప్రత్యర్ధి జట్టు ఆటగాడితో విజయానందాన్ని షేర్ చేసుకోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. Nail-biting finish! 👌 👌@DelhiCapitals hold their nerve & beat #CSK by 3⃣ wickets in a last-over thriller. 👍 👍 #VIVOIPL #DCvCSKScorecard 👉 https://t.co/zT4bLrDCcl pic.twitter.com/ZJ4mPDaIAh— IndianPremierLeague (@IPL) October 4, 2021 కాగా, ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఐపీఎల్లో తమ 100వ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి తొలత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఢిల్లీ జట్టు సైతం తడబడినప్పటికీ .. ఆఖర్లో హెట్మైర్(18 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ఢిల్లీ ఖాతాలో 20 పాయింట్లు చేరాయి. చదవండి: యాషెస్ సిరీస్ డౌటే.. మెలిక పెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు -
ధోని భయ్యా.. నాకు బర్త్డే గిఫ్ట్ ఏం లేదా
Rishab Pant And MS Dhoni Conversation Before Toss.. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ సోమవారం 24వ బర్త్డే జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ వికెట్ కీపర్గా మారిన పంత్ ధోనికి వీరాభిమాని అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోనిని పంత్ తన గురువుగా భావిస్తాడని అభిమానులు చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే మధ్య మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో ధోని, పంత్ల మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్కు ముందు ఇద్దరికి ఫన్నీ సంభాషణ జరిగింది. చదవండి: అసలైన టీ20 క్రికెటర్ అతడే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. బహుశా పంత్ పుట్టినరోజు కావడంతో ధోనిని సరదాగా ఆటపట్టించే ప్రయత్నం చేసుంటాడని అభిమానులు పేర్కొన్నారు. అభిమానుల మాటల్లో వారి సంభాషణ ఈ విధంగా ఉంది. తనకు బర్త్డే గిఫ్ట్ ఏం లేదా అంటూ ధోనిని అడగ్గా.. అందుకు ధోని ఏం లేదని నవ్వాడు. దీంతో పంత్ ధోని చేతికున్న వాచ్ను చూపిస్తూ ఇది నాకు గిఫ్ట్గా ఇవ్వొచ్చుగా అని అడిగాడు. దానికి ధోని ఏం చెప్పకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. ఇక మ్యాచ్లో మొదట చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (43 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (2/18) చెన్నైని దెబ్బ తీశాడు. అనంతరం ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు), హెట్మైర్ (18 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించే ఆట ఆడారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియా క్యాప్ పెట్టుకున్నారు.. ఇంకెందుకు ఆడుతారు Pure bliss 😍@msdhoni @RishabhPant17 #CSKvsDC 💛💙 pic.twitter.com/dHpe6FIY3F — Vardhan🔔🦁💛 (@me_vardhan9) October 4, 2021 -
అసలైన టీ20 క్రికెటర్ అతడే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Michael Vaughan comments on Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. జడేజా అసలు సిసలైన టీ20 ఆటగాడని అతడు కితాబు ఇచ్చాడు. "రవీంద్ర జడేజా అత్యుత్తమమైన ఆటగాడు. మూడు విభాగాల్లో రాణించే సత్తాఉంది.అతడు అద్భుతమైన ఫీల్డర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌల్ చేయగలడు. ఎటువంటి పిచ్పై అయిన బాల్తో మ్యాచ్ తిప్పగలడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో జట్టు వికెట్లు కోల్పోయినట్లయితే అతడు కీలక పాత్రను పోషించగలడు. అందుకే అతడు టీ20 క్రికెటర్లలో అధ్బుతమైన ఆటగాడు. మీరు ఒక టీ 20 క్రికెటర్ని తయారు చేస్తే.. క్రిస్ గేల్ను, విరాట్ కోహ్లిలను ఆదర్శంగా చూపిస్తారు. కానీ ఇప్పటినుంచి రవీంద్ర జడేజాను ఆదర్శంగా తీసుకోవాలి" అని మైఖల్ వాన్ క్రిక్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రవీంద్ర జడేజా అధ్బుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2021 లో జడేజా ఇప్పటి వరకు 212 పరుగులు,10 వికెట్లు సాధించాడు. జడేజా అనేక సందర్భాల్లో బంతితోనే కాకుండా బ్యాట్తో కూడా చెన్నైకు విజయాలను అందించాడు. టోర్నమెంట్ తొలి దశలో హర్షల్ పటేల్ ఓవర్లో జడేజా ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. సెకెండ్ఫేజ్లో కెకెఆర్తో జరిగిన మ్యాచ్లో జడేజా కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 22 పరుగులు చేసి మ్యాచ్ ఫినిషర్గా నిలిచాడు. చదవండి: Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్ గెలుస్తాడులే! -
టీమిండియా క్యాప్ పెట్టుకున్నారు.. ఇంకెందుకు ఆడుతారు
Sunil Gavaskar Slams Surya Kumar Yadav And Ishan Kishan.. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లు ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ఫేజ్లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. గత ఐదు ఇన్నింగ్స్లో సూర్యకుమార్ వరుసగా 3,5,8,0,33 పరుగులు చేసి నిరాశపరిచాడు. మరో పక్క ఇషాన్ కిషన్ ప్రదర్శన కూడా దారుణంగా ఉంది. తన చివరి మూడు ఇన్నింగ్స్ల్లో 11,14, 9 పరుగులు చేశాడు. కాగా టి20 ప్రపంచకప్కు టీమిండియాలో ఈ ఇద్దరు చోటు దక్కించుకున్నారు. కాగా వీరు ఫామ్లో లేకపోవడం సెలక్టర్లకు ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 10 వరకు సమయం ఉండడంతో టీమిండియా జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్.. దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్ సెలబ్రేషన్స్లో 'క్రిస్టియానో రొనాల్డొ' ''టీమిండియా జట్టులోకి ఎంపికైన తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్లు ఎందుకో రిలాక్స్ మోడ్లో ఉన్నట్లు అనిపిస్తుంది. వారి ఆటతీరులో ఇది స్ఫష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో ఏదో మొక్కుబడికి ఆడినట్లుగా వారి షాట్ సెలక్షన్లో కనిపిస్తుంది. బహుశా టీమిండియా క్యాప్ ధరించినందుకు అలా ఆడుతున్నట్లున్నారు. షాట్ సెలక్షన్ ఎంపికలో కొంచెం టైమ్ తీసుకొని ఆడితే బాగుంటుంది. కానీ వీరిద్దరు అదేం పట్టనట్టుగా తమకు నచ్చినరీతిలో ఇన్నింగ్స్లు ఆడుతున్నారు. అందుకే ఐపీఎల్లో అనవసరంగా భారీ షాట్లకు పోయి వికెట్లు ఇచ్చేసుకుంటున్నారు. ఇదే రీతిలో ఆటను కొనసాగిస్తే త్వరలోనే టీమిండియా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంటుంది. చదవండి: T20 World Cup: కోహ్లి సేనకు అంత సీన్ లేదు.. మాకు అసలు పోటీనే కాదు: పాక్ మాజీ ప్లేయర్ ఇక హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో బౌలింగ్ చేయకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. టి20 ప్రపంచకప్లో అతను ఎంపికైంది ఆల్రౌండర్ కోటాలో.. జట్టులో ఆరు లేదా ఏడు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చే పాండ్యా బౌలింగ్లోనూ ఎంతో కొంత ఉపయోగపడాలి. ఒకవేళ అతను టి20 ప్రపంచకప్లో బౌలింగ్ చేయనంటే క్యాప్టెన్కు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. హర్దిక్ విషయంలో టీమిండియా సెలక్టర్లు ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలి'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: MI Vs RR: ఒక్క మ్యాచ్.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం -
ఢిల్లీ క్యాపిటల్స్ సెలబ్రేషన్స్లో 'క్రిస్టియానో రొనాల్డొ'
Cristiano Ronaldo In Delhi Capitals Celebrations.. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా సోమవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పాయింట్లతో టాప్ స్థానానికి చేరుకుంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముఖ్యంగా రిపల్ పటేల్ రొనాల్డొ తరహాలో చేసిన సెలబ్రేషన్స్ హైలెట్ అయ్యాయి. కాగా రిపల్ పటేల్కు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఇదే డెబ్యూ మ్యాచ్. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: Cristiano Ronaldo: డ్రా అనుకున్న దశలో సూపర్ గోల్.. షర్ట్ విప్పి రచ్చరచ్చ ఇక మ్యాచ్లో మొదట చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (43 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (2/18) చెన్నైని దెబ్బ తీశాడు. అనంతరం ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు), హెట్మైర్ (18 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించే ఆట ఆడారు. చదవండి: MI Vs RR: ఒక్క మ్యాచ్.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం Ecstatic players and #CR7 celebrations as DC occupied the 🔝 of the table last night 😍 🎥 | Let us take you straight into the dressing room 💙#YehHaiNayiDilli #IPL2021 #DCvCSK pic.twitter.com/SsTR2gaupt— Delhi Capitals (@DelhiCapitals) October 5, 2021 -
ఐపీఎల్లో యాంకర్గా రాణిస్తున్న తమన్నా వాహి
-
మిడిలార్డర్ ఇలా ఉంటే కష్టం.. అది మాత్రం తెలియదు
Brad Hogg Reveals About CSK Winning IPL Title.. ఐపీఎల్ 2021లో సీఎస్కే ఫైనల్ చేరడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన సీఎస్కే క్వాలిఫయర్1 లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడగొట్టి ఫైనల్లో అడుగుపెడుతుందని తెలిపాడు. అయితే ఢిల్లీతోనే ఫైనల్ ఆడుతుందని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి సీఎస్కే జట్టులో ఓపెనింగ్ అద్భుతంగా ఉంది. రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్లు సూపర్ఫామ్ను కనబరుస్తూ జట్టుకు అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నారు. అయితే వీరిద్దరు విఫలమైనచోట అసలు సమస్య మొదలవుతుంది. మిడిలార్డర్లో వస్తున్న రాయుడు, మొయిన్ అలీ, రైనా, ధోనిలు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. చదవండి: MS Dhoni: బంతులన్నీ వృథా చేశావు.. అవుటైనా బాగుండేది.. కనీసం.. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఇన్నింగ్స్లో ఇదే కనబడింది. గైక్వాడ్, డుప్లెసిస్లు త్వరగా ఔట్ కావడంతో సీఎస్కే తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాయుడు అర్థసెంచరీతో మెరవడంతో 130 పరుగులు మార్క్ను అందుకోగలిగింది. ఇదే విషయమై బ్రాడ్ హగ్ను.. ''మిడిలార్డర్ ఇలా ఉంటే సీఎస్కే కప్ కొడుతుందా..'' అంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి హగ్.. సీఎస్కే వర్సెస్ ఢిల్లీ ఫైనల్ మాత్రమే చూస్తా.. కప్ కొట్టే విషయం నాకు తెలియదు అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో అభిమాని ప్లే ఆఫ్స్కు చేరే నాలుగో జట్టు ఎవరు అని అడగ్గా.. ''కేకేఆర్ చేరుతుంది.. కానీ రాజస్తాన్, ముంబైల నుంచి గట్టిపోటి ఉండే అవకాశం ఉంటుంది.'' అని కామెంట్ చేశాడు. చదవండి: MI Vs RR: ఒక్క మ్యాచ్.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం I'm backing a #DCvCSK final. https://t.co/ARLuR1YLST — Brad Hogg (@Brad_Hogg) October 5, 2021 @KKRiders are in the box seat, but with all competitions a twist is always around the corner!. I'm not confident yet.#IPL2021 https://t.co/xeB2ltNXiY — Brad Hogg (@Brad_Hogg) October 5, 2021 -
ఒక్క మ్యాచ్.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం
ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లకు వ్యక్తిగత రికార్డులు అందుకునే అవకాశం ఉంది. ఆ ఆటగాళ్లు ఎవరు.. వారు అందుకునే రికార్డులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. రోహిత్ శర్మ: Courtesy: IPL Twitter ముంబై ఇండియన్స్కు విజయవంతమైన కెప్టెన్గా పేరున్న రోహిత్ శర్మ 400 సిక్సర్ల మైలురాయిని అందుకోవడానికి కేవలం రెండు సిక్సర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాజస్తాన్తో జరిగే మ్యాచ్లో మరో రెండు సిక్సర్లు కొడితే రోహిత్ ఆ రికార్డును అందుకునే అవకాశం ఉంది. భారీ సిక్సర్లను అలవోకగా బాదే రోహిత్కు ఇదేం పెద్దలెక్క కాదు. ఇక 211 ఐపీఎల్ మ్యాచ్ల్లో 5,571 పరుగులు చేసిన రోహిత్ ముంబై ఇండియన్స్ తరపునే 4,300 పరుగులు సాధించడం విశేషం. చదవండి: Virat Kohli: తగ్గేదే లే.. గుర్తుపెట్టుకొని మరీ కౌంటర్ ఇచ్చాడు ఇషాన్ కిషన్: Courtesy: IPL Twitter ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. ఫామ్ కోల్పోయి పరుగులు సాధించడానికి కష్టాలు పడుతున్నాడు. అయితే అతను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున 1000 పరుగుల అందుకోవడానికి కేవలం ఒక్క పరుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఫామ్లో లేకపోయినప్పటికి ఒక్క పరుగు చేయడం ద్వారా ఇషాన్ కిషన్ వెయ్యి పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. ఇక ముంబై తరపున 39 మ్యాచ్ల్లో 999 పరుగులు సాధించాడు. డేవిడ్ మిల్లర్: Courtesy: IPL Twitter రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న డేవిడ్ మిల్లర్ 2వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 41 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన మిల్లర్ 109 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ 88 మ్యాచ్ల్లో 1959 పరుగులు చేశాడు. చదవండి: Sehwag- SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా' ముస్తాఫిజుర్ రెహమాన్: Courtesy: IPL Twitter ఐపీఎల్లో 50వికెట్ల మైలురాయిని అందుకోవడానికి ముస్తాఫిజుర్ కేవలం రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ దృశ్యా ముస్తాఫిజుర్కు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ 12 మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఇప్పటికే ప్లేఆఫ్స్కు సంబంధించి తొలి మూడుస్థానాలు ఖరారు కావడంతో నాలుగో స్థానానికి మూడుజట్లు పోటీ పడుతున్నాయి. 12 మ్యాచ్ల్లో 5 విజయాలు.. ఏడు ఓటములతో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న రాజస్తాన్, ముంబైలకు ఈ మ్యాచ్ కీలకం. ఇక ఐదో స్థానంలో ఉన్న కేకేఆర్ ఒక్క మ్యాచ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్కు చేరనుంది. చదవండి: Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్ గెలుస్తాడులే! -
Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్ గెలుస్తాడులే!
Ziva Singh Dhoni Praying For CSK Win Against DC Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్కింగ్స్ సారథి ఎంఎస్ ధోని కుమార్తె జీవా ధోని సింగ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవా స్టేడియంలో కనిపిస్తే చాలు కెమెరాలన్నీ తన వైపే తిరుగుతాయి. తన చిలిపి చేష్టలు, మైదానంలో ఉన్న తండ్రిని ఉత్సాహపరుస్తున్న దృశ్యాలను ఒడిసిపడతాయి. ప్రస్తుతం జీవా ధోనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా... చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తండ్రి ఆటను చూడటానికి తల్లి సాక్షితో కలిసి జీవా స్టేడియానికి వచ్చింది. చెన్నై విజిల్ పొడూ అంటూ ఉత్సాహపరిచేందుకు వీలుగా విజిల్ కూడా వెంట తెచ్చుకుంది. కానీ, ఈ మ్యాచ్లో సీఎస్కే ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధోని స్లో బ్యాటింగ్ అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో రెండు చేతులు జోడించి కళ్లు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా ఉన్న జీవా ఫొటో వైరల్ అవుతోంది. ‘‘అయ్యో పాపం జీవా... డాడీ జట్టు ఓడిపోయింది. మరేం పర్లేదు.. నీ ప్రార్థనలు ఫలించి... ఫైనల్ మ్యాచ్లో గెలుస్తారులే’’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో ధోని సేన 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్కోర్లు: చెన్నై సూపర్కింగ్స్- 136/5 (20) ఢిల్లీ క్యాపిటల్స్- 139/7 (19.4) Cute, Ziva Praying for CSK win ❤️#IPL2021 #DCvCSK pic.twitter.com/P5ZwB1al6M — Thyview (@Thyview) October 4, 2021 View this post on Instagram A post shared by MS Dhoni FC 🔵 (@bleed.dhonism) -
MS Dhoni: పుజారాతో పోటీ పడ్డావా ఏంటి.. అసలేం చేశావ్ భాయ్!
Fans Trolls MS Dhoni Innings Against DC: మిస్టర్ కూల్ ధోని ఆట తీరుపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. ‘‘నీ బదులు జడేజాను పంపించినా బాగుండేది కదా’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్గా ధోని జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ.. ఈ సీజన్లో బ్యాటర్గా మాత్రం పూర్తిగా నిరాశపరుస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్లలో 9 ఇన్నింగ్స్ ఆడిన ధోని.. మొత్తంగా కేవలం 84 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 18. ఇక గురువారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో తనదైన శైలిలో సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించడం మినహా.. ఏ ఇతర మ్యాచ్లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా... సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 27 బంతులు ఎదుర్కొన్న ధోని.. కేవలం 18 పరుగులు చేసి.. ఆవేశ్ఖాన్ బౌలింగ్లో రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో అంబటి రాయుడు హాఫ్ సెంచరీ(55- నాటౌట్)తో మెరవడంతో చెన్నై కనీసం 136 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంత్ సేన మూడు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని ఆడిన తీరుపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జడేజా, బ్రావో, ఠాకూర్ ఇంత మంది బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.. హిట్టింగ్ ఆడకుండా బంతులు వృథా చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ధోని బ్యాటింగ్ ఎలా చేయాలో మర్చిపోయాడు. తన స్థానంలో జడేజా ఉంటే 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేసేవాడేమో! అసలు ధోని భాయ్.. ఏం చేశాడో అర్థమవుతోందా? 27 బంతులు.. ఒక్క బౌండరీ లేదు... 18 పరుగులు మాత్రమే.. నీ కంటే పుజారానే నయం అనిపించింది. నిజంగా నీ నుంచి ఇది ఊహించలేదు. అసలు రన్స్ తీద్దామన్న ఆలోచనే ఉన్నట్లు కనిపించలేదు. ఎవరేమనుకున్నా ధోని భయ్యా చేసింది ఏమాత్రం బాగాలేదు. భవిష్యత్తులో కష్టమే’’ అంటూ కామెంట్లు చేశారు. ఇక మరికొంత మంది మాత్రం... పిచ్ బాగా లేనపుడు ఏ బ్యాటర్ కూడా ఏమీ చేయలేడు అంటూ ధోనికి మద్దతుగా నిలిచారు. చదవండి: Ravi Shastri: పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని ఏం సాధించలేదో చెప్పండి?! Dhoni has seriously forgot how to bat. Give 25 balls to Jadeja and he would've gone past 50.#DCvCSK — 𝙴𝚍𝙺. (@edmondkirsch) October 4, 2021 Mentor saab missed his well deserved twentury by 2 runs 🤧😭#CSKvsDC #DCvCSK pic.twitter.com/JX4Pjs9htr — ᧁꪖꪊ᥅ꪖꪜ (@ImGS_08) October 4, 2021 Mentor saab missed his well deserved twentury by 2 runs 🤧😭#CSKvsDC #DCvCSK pic.twitter.com/JX4Pjs9htr — ᧁꪖꪊ᥅ꪖꪜ (@ImGS_08) October 4, 2021 MS Dhoni today. Same vibes.. #IPL2021 #DCvCSK pic.twitter.com/SQNs3YSWgY — Alankrith Shankar (@AlanzArena) October 4, 2021 -
వార్నర్ను పక్కకు పెట్టడానికి క్రికెటేతర కారణాలు ఉన్నాయి..!
Dropping David Warner Has Non Cricketing Reasons Says Sanjay Manjrekar: సన్రైజర్స్ యాజమాన్యం డేవిడ్ వార్నర్ను పక్కకు పెట్టడంపై వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్ చేశాడు. వార్నర్ను జట్టు నుంచి తప్పించడానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వద్ద క్రికెటేతర కారణాలు ఉన్నాయని ఆరోపించాడు. వార్నర్పై వేటు వేయడానికి ఫామ్ లేమి ఒక్కటే కారణం కాదని.. ఒకవేళ అదే కారణంగా చూపడానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వద్ద సరైన ఆధారాల్లేవని అన్నాడు. వార్నర్ పేలవమైన ఫామ్ చాలాకాలంగా కొనసాగలేదన్న విషయాన్ని గట్టిగా ప్రస్తావించిన ఆయన.. వేటుకు కారణాలు అంతుచిక్కడంలేదని అన్నాడు. కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని చెప్పుకొచ్చాడు. కాగా, సెప్టెంబర్ 27న రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్కు ముందు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వార్నర్ను జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వార్నర్ కనీసం డగౌట్లో కూడా కనిపించలేదు. హోటల్ రూమ్కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ మధ్యలో అతను ఇన్స్టా వేదికగా సంచలన మెసేజ్ను షేర్ చేశాడు. తాను ఎస్ఆర్హెచ్ తరఫున మరో మ్యాచ్ను ఆడలేనని, తన చివరి మ్యాచ్ను ఆడేశానని పెద్ద బాంబు పేల్చాడు. అయితే అనూహ్యంగా నిన్న కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇదిలా ఉంటే, 2013 సీజన్ నుంచి వరుసగా ప్రతి సీజన్లో 500 పరుగుల మార్కును క్రాస్ చేస్తూ వస్తున్న వార్నర్.. ప్రస్తుత సీజన్లో పేలవ ప్రదర్శనను కనబర్చాడు. 8 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. 2016లో సన్రైజర్స్ను ఛాంపియన్గా నిలిపిన ఈ ఆసీస్ స్టార్ ఆటగాడు.. ప్రస్తుత సీజన్ తొలి దశలో ఎస్ఆర్హెచ్ సారధ్య బాధ్యతల నుంచి తప్పించబడ్డాడు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వార్నర్ పట్ల అమర్యాదగా వ్యవహరించి.. కేన్ విలియమ్సన్ను కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. చదవండి: టీ20ల్లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. గేల్, కోహ్లి రికార్డులు బద్దలు -
DC Vs CSK: చెన్నైకు మరో షాక్.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం
చెన్నైకు మరో షాక్.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 137 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ తడబడుతూ లక్ష్యాన్ని చేధించింది. చివర్లో హెట్మైర్(28) కీలక ఇన్నింగ్స్తో గెలిపించాడు. అంతకముందు శిఖర్ ధావన్ 39 పరుగులతో రాణించాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, జడేజా రెండు వికెట్లు సాధించగా, హాజెల్వుడ్ , దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో చెరో వికెట్ పడగొట్టారు. అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.కేవలం 64 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు జట్టును ఆదుకున్నాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ చేసి చెన్నైకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఢిల్లీకు బిగ్ షాక్.. ధావన్ (39) ఔట్ 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తడబడుతుంది. కేవలం 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి ఊపు మీద ధావన్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో మొయిన్ అలీకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఢిల్లీ విజయానికి ఇంకా 28 బంతుల్లో 36 పరుగులు కావాలి. ప్రస్తుతం 15.4 ఓవర్లులో 6 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. కెప్టెన్ పంత్ (15)ఔట్ కెప్టెన్ పంత్ (15) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో మొయిన్ అలీకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో ఢిల్లీ 84 పరుగులు చేసింది. ధావన్(32) రిపల్ పటేల్(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. శ్రేయస్ అయ్యర్ (2)ఔట్ స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. జోష్ హాజెల్వుడ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్(2) రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మరో వైపు ధావన్ మాత్రం ఫోర్లు, సిక్స్రలతో చెన్నై బౌలర్లపైన విరుచుకు పడుతున్నాడు. ప్రస్తుతం 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఢిల్లీ 64 పరుగులు చేసింది. ధావన్(32), పంత్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా(18)ఔట్ 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్లో పృథ్వీ షా(18), డు ప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 4 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. ధావన్(6), అయ్యర్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. అర్దసెంచరీతో మెరిసిన రాయుడు.. సీఎస్కే 20 ఓవర్లలో 136/5 ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే పవర్ ప్లేలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. కేవలం 64 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు జట్టును ఆదుకున్నాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ చేసి చెన్నైకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు Photo Courtesy: IPL వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన చెన్నై ఢిల్లీ బౌలర్ల ధాటికి చెన్నై బ్యాట్సమన్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. కేవలం 62 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి సీఎస్కే పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస క్రమంలో ఉతప్ప (19), మొయిన్ అలీ(5) వికెట్లును కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. రాయుడు (2), ధోని (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్ చెరో వికెట్ సాధించారు. రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. గైక్వాడ్ (13) ఔట్ గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్ కేవలం 13పరుగులే చేసి పెవిలియన్కు చేరాడు. అన్రిచ్ నోర్జ్ బౌలింగ్లో ఆశ్విన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే 5 ఓవర్లలో 2 వికెట్లు సష్టపోయి 41 పరుగులు చేసింది. ఉతప్ప (1), మొయిన్ అలీ(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 35/1 ఓపెనర్ డుప్లెసిస్(10) రూపంలో సీఎస్కే తొలి వికెట్ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో డుప్లెసిస్, అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 4ఓవర్లో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రుతురాజ్ (13), ఉతప్ప (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. దుబాయ్: ఐపీఎల్ 2021లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా లీగ్లో ఇరు జట్లు 24 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా చెన్నై 15 .. ఢిల్లీ 9 మ్యాచ్ల్లో గెలుపొందాయి. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో సీఎస్కేపై ఘనవిజయం సాధించింది . పాయింట్ల పట్టికలో తొలి, రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్లు.. నేటి మ్యాచ్ లో గెలిచి ఆధిక్యాన్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్వుడ్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), రిపల్ పటేల్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్ -
తగ్గేదే లే.. గుర్తుపెట్టుకొని మరీ కౌంటర్ ఇచ్చాడు
Virat Kohli Counter To Punjab Kings.. విరాట్ కోహ్లి ఎంత అగ్రెసివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనను ఎవరైనా టార్గెట్ చేస్తే వారికి తిరిగి కౌంటర్ ఇచ్చేవరకు వదలడు. మరి అలాంటి కోహ్లి తన ఆర్సీబీ జట్టును ట్రోల్ చేస్తే ఊరుకుంటాడా? తగ్గేదే లే.. అన్నట్లుగా గుర్తుపెట్టుకొని మరీ పంజాబ్ కింగ్స్కు కౌంటర్ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 2021 సీజన్ తొలి అంచె పోటీల్లో ఆర్సీబీతో మ్యాచ్లో విజయం తర్వాత పంజాబ్ కింగ్స్ ఆ జట్టును ట్రోల్ చేస్తూ కామెంట్ చేసింది. ఆర్సీబీ డగౌట్ను షేర్ చేస్తూ.. ''మేము మ్యాచ్ గెలిచాం.. ఇక్కడ అంత ప్రశాంతంగానే ఉందా'' అంటూ హిందీలో ట్వీట్ చేసింది. ఆ తర్వాత పంజాబ్ తమ ట్వీట్ను డిలీట్ చేసింది. Courtesy: RCB Twitter చదవండి: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా' తాజాగా ఆదివారం ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్పై విజయం సాధించి ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంది. ఈ సందర్భంగా ఆర్సీబీ డ్రెస్సింగ్రూమ్లో జరిగిన రూమ్ చాట్ను ట్విట్ర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో కోహ్లి.. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది.. అంటూ కామెంట్ చేశాడు. దీన్నిబట్టి పంజాబ్ కింగ్స్పై విజయాన్ని ఉద్దేశించే కోహ్లి అలా అన్నాడని.. గుర్తుపెట్టుకొని మరి కౌంటర్ ఇచ్చాడని ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఇక ఈ సీజన్లోనూ సత్తా చాటిన ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఆడిన 12 మ్యాచ్ల్లో 8 విజయాలు.. 4 ఓటములతో మూడో స్థానంలో నిలిచిన ఆర్సీబీ మూడో జట్టుగా ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయింది. చదవండి: IPL 2021: హర్షల్ పటేల్ సూపర్ త్రో.. మ్యాచ్కు టర్నింగ్ పాయింట్; కోహ్లి గెంతులు Virat Kohli took a dig at #PunjabKings ‘dug-out’ tweet which was tweeted earlier this year in #IPL2021 during their match against #RCB. pic.twitter.com/DFzoxAlF4P — Neelabh (@CricNeelabh) October 4, 2021 -
వీరిలో ఎవరైనా ఆర్సీబీ కెప్టెన్ కావొచ్చు..?
Aakash Chopra Lists Options RCB Captain: 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అభిమానులును విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. అయితే కోహ్లి బాధ్యతలను ఎవరు స్వీకరిస్తున్నది ఇప్పడు ప్రశ్నగా మారింది. ఆర్సీబీకి కెప్టెన్సీ నియామకంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్న క్రమంలో కోహ్లీ నుంచి నాయకత్వం స్వీకరించగలరని భావించే కొంత మంది ఆటగాళ్ల జాబితాను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. అతడి జాబితాలో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రవి అశ్విన్ మరియు శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. “ఒక వేళ శ్రేయస్ అయ్యర్ని ఢిల్లీ వదిలివేస్తుందా? అతడు కెప్టెన్ కావచ్చు. కేఎల్ రాహుల్ పంజాబ్లో కొనసాగుతారా? అతడిని వదులుకుంటే, అతడే కావచ్చు. మయాంక్ అగర్వాల్ బయటకు వస్తే , అతడు కావచ్చు. రవిచంద్రన్ అశ్విన్ విడుదలైతే, అతను కావచ్చు అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది జరగనున్న మెగా వేలం ముందు ఆర్సీబీ ఎబి డివిలియర్స్, కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, యుజ్వేంద్ర చాహల్లను నిలుపుకుంటుందని కూడా అతడు అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్ మరొక అభ్యర్థి అని పుకార్లు వస్తుందున.. తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారో చూడటం చాలా ఆసక్తికరంగా ఉందని అతడు తెలిపాడు. కాగా పంజాబ్పై విజయంతో ఆర్సీబీప్లేఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉన్నందున బెంగళూరు గెలవాలని కోరుకుంటున్నాని చోప్రా చెప్పాడు. చదవండి: Sehwag Vs SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా' -
'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా'
Sehwag Trolls SRH Batting.. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎస్ఆర్హెచ్ ఆటతీరును వినూత్న రీతిలో ట్రోల్ చేశాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పేలవ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుడికి కూడా టెస్టు మ్యాచ్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగించింది. 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. అందునా చివరి ఐదు ఓవర్లలో వేగంగా ఆడాల్సింది పోయి జిడ్డుగా ఆడి 36 పరుగులు మాత్రమే చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకొని సెహ్వాగ్ ఎస్ఆర్హెచ్ ఆటతీరును ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ చేశాడు. చదవండి: IPL 2021: సూపర్ త్రో.. విలియమ్సన్ రనౌట్; సీజన్లో ఎస్ఆర్హెచ్ చెత్త రికార్డు ''రాయ్, సాహాలతో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆరంభమైంది. అయితే వారిద్దరు తర్వగానే పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన విలియమ్సన్, గార్గ్లు కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుందని భావించా. ఇంతలో విలియమ్సన్ రనౌట్.. 21 పరుగులు చేసి గార్గ్ కూడా ఔటయ్యాడు. ఇక అబ్దుల్ సమద్ వచ్చి రావడంతోనే మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. మ్యాచ్ కాస్త మజాగా అనిపిస్తుందని అనుకుంటున్న తరుణంలోనే అతను ఔటయ్యాడు. ఇక ఎస్ఆర్హెచ్కు మిగిలింది ఐదు ఓవర్లు. కనీసం ఇప్పుడైనా మెరుపులు మెరిపిస్తారనుకున్నా. ఒక ఓవర్ ముగిసాక ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ నాకు నిద్రమాత్రల్లా కనిపించారు. ఇంకేముందు చివరి నాలుగు ఓవర్లు ఆదమరిచి నిద్రపోయా. లేచి చూసేసరికి ఎస్ఆర్హెచ్ స్కోరు 115/8 గా ఉంది. నాలుగు ఓవర్లు చూడకపోవడమే మంచిదైంది'' అంటూ ఫేస్బుక్ వీడియోలో కామెంట్ చేశాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్లో ఇంటిబాట పట్టింది. ఆడిన 12 మ్యాచ్ల్లో రెండు విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. కాగా సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. చదవండి: ఐపీఎల్ 2021 సీజన్లో అత్యంత ఫాస్ట్బాల్.. డెబ్యూ మ్యాచ్లోనే -
రిషబ్ పంత్కు శుభాకాంక్షల వెల్లువ..
Happy Birth Day Rishabh Pant: నేడు(అక్టోబర్ 4) 24వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, టీమిండియా డాషింగ్ ప్లేయర్ రిషభ్ పంత్కు సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్-2021లో భాగంగా ప్రస్తుతం యూఏఈలో ఉన్న పంత్.. తన ఐపీఎల్ జట్టుతో పాటు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, ఐపీఎల్ సహచరులతో పాటు టీమిండియా ఆటగాళ్లు, బీసీసీఐ, ఐసీసీ పంత్కు శుభాకాంక్షలు తెలిపారు. పంత్ మున్ముందు క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. Happy birthday to @BCCI's Rishabh Pant 🎉 What is your favourite moment from the wicketkeeper-batter? 🧤 pic.twitter.com/6BblHgtaCv — ICC (@ICC) October 4, 2021 ఈ సీజన్ ఆరంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ సారధ్య బాధ్యతలను చేపట్టిన పంత్.. జట్టును సమర్ధవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలో డీసీ.. ఇప్పవరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. పంత్ సేన నేడు టేబుల్ టాపర్ సీఎస్కేతో తలపడనుంది. ఇదిలా ఉంటే, 2017లో టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పంత్.. మెల్లగా అన్నీ ఫార్మాట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సహచర ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు గాయం కావడంతో అతను ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ సారధిగా కూడా నియమించబడ్డాడు. Audacious batsman 💪 Solid wicketkeeper 👌 Livewire on the field ⚡️ Here's wishing @RishabhPant17 a very happy birthday. 👏 🎂 #TeamIndia Let's relive his stroke-filled ton against England 🎥 🔽 — BCCI (@BCCI) October 4, 2021 కాగా, పంత్ ఈ స్థాయికి చేరుకునేందుకు అందరు సాధారణ క్రికెటర్లలానే ఎన్నో కష్టాలు పడ్డాడు. కెరీర్ ఆరంభం రోజుల్లో తన స్వస్థలం(ఉత్తరాఖండ్) నుంచి ఢిల్లీకి రోజు ప్రయాణించే వాడు. కొన్ని సందర్భాల్లో ఇంటి వెళ్లలేని పరిస్థితుల్లో ఢిల్లీలోని గురుద్వారాలో నిద్రించాడు. 2016 అండర్-19 ప్రపంచకప్ నుంచి అతని దశ తిరిగింది. ఆ టోర్నీలో నేపాల్పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, నమీబియాపై సెంచరీ ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు. 2016-17 రంజీ సీజన్లో పంత్ కెరీర్ కీలకమలుపు తిరిగింది. ఆ సీజన్లో అతను మహారాష్ట్రపై ట్రిపుల్ హండ్రెడ్, ఝార్ఖండ్పై 48 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. Birthday + Matchday = Double the fun for #RP17 🤩 We hope you have a 'Pantastic' birthday and get to top it off with a win 💙🤞🏼#YehHaiNayiDilli #IPL2021 #DCvCSK #HappyBirthdayRishabhPant pic.twitter.com/WYSvgTE43G — Delhi Capitals (@DelhiCapitals) October 3, 2021 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రెండు ఐపీఎల్ రికార్డులపై కన్నేసిన చెన్నై ఓపెనర్.. -
రెండు ఐపీఎల్ రికార్డులపై కన్నేసిన చెన్నై ఓపెనర్..
Ruturaj Gaikwad On Verge Of KL Rahul Record: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెండు ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేరిట ఉన్న అత్యధిక పరుగులు(528 పరుగులు), అత్యధిక సిక్సర్ల(22) రికార్డులకు రుతురాజ్ అతి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం అతని పేరిట 508 పరుగులు, 20 సిక్సర్లు ఉన్నాయి. నేటి మ్యాచ్లో మరో 21 పరుగులు, 3 సిక్సర్లు బాదితే కేఎల్ రాహుల్ నుంచి ఆరెంజ్ క్యాప్తో పాటు అత్యధిక సిక్సర్ల రికార్డును రుతురాజ్ లాగేసుకుంటాడు. ప్రస్తుతం ఉన్న గణాంకాలను ఈ ఇద్దరు క్రికెటర్లు 12 మ్యాచ్ల్లోనే సాధించారు. ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్లో తలపడుతున్న ఢిల్లీ, సీఎస్కే జట్ల గణాంకాలు ఇప్పటివరకు సమానంగా ఉన్నాయి. ఇరు జట్లు చెరో 12 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించి తలో 18 పాయింట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. అయితే రన్రేట్ పరంగా చూస్తే మాత్రం సీఎస్కే జట్టుదే కాస్త పైచేయిగా ఉంది. ఈ జట్టుకు 0.829 నెట్ రన్రేట్ ఉండగా.. ఢిల్లీకి 0.551 రన్రేట్ ఉంది. ఇక ఇరు జట్ల మధ్య హెడ్ టూ హెడ్ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 24 మ్యాచ్లు జరగ్గా సీఎస్కే 15, ఢిల్లీ 9 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఈ సీజన్ తొలిదశలో జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఐపీఎల్లో 100వ విజయాన్ని నమోదు చేస్తుంది. చదవండి: మ్యాక్స్వెల్ టీ20 ప్రపంచకప్ జట్టు.. అనూహ్యంగా ఆ ఇద్దరికి చోటు -
KL Rahul: నాయకుడి లక్షణాలు లేవు.. టీమిండియా కెప్టెన్ అయితే మాత్రం..
Ajay Jadeja Comments On KL Rahul: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు సర్దుకుపోయే మనస్తత్వం ఉందని, నాయకుడి లక్షణాలు మాత్రం లేవని టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. పంజాబ్ సారథిగా తనదైన ముద్ర వేయలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. అయితే, టీమిండియా కెప్టెన్ అయితే మాత్రం సుదీర్ఘకాలం పాటు సారథిగా కొనసాగగలడని వ్యాఖ్యానించాడు. కాగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన కేఎల్ రాహుల్... బ్యాటర్గా రాణిస్తున్నా.. కెప్టెన్గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అతడి సారథ్యంలో ఇప్పటి వరకు 25 మ్యాచ్లు ఆడిన పంజాబ్.. పద్నాలుగింటిలో గెలిచింది. ఇక గత సీజన్లో లీగ్ దశలోనే వెనుదిరిగిన రాహుల్ సేన.. ఆదివారం నాటి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓటమితో దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే! ఈ నేపథ్యంలో అజయ్ జడేజా క్రిక్బజ్తో మాట్లాడుతూ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత రెండేళ్లుగా అతడు కెప్టెన్గా ఉన్నాడు. కానీ.. ఒక్కసారి కూడా అతడిలో నాకు నాయకుడి లక్షణాలు కనిపించలేదు. జట్టు ఓడినా, గెలిచినా.. మన దృష్టి రాహుల్పై ఉండదు. అసలు తుదిజట్టులో ఎవరు ఆడుతున్నారు? మార్పులు, చేర్పులు ఏం ఉన్నాయి. అసలు ఈ విషయాల గురించి రాహుల్కు అవగాహన ఉందా అని అనిపిస్తుంది. టీమిండియా కెప్టెన్గా ఎంపిక చేసే వ్యక్తిలో లీడర్ లక్షణాలు ఉన్నాయా అని చూస్తారు. కానీ, కేఎల్ రాహుల్లో ఇలాంటివేమీ నాకు కనిపించడం లేదు. తను చాలా నెమ్మదస్తుడు. ప్రతీ విషయానికి సర్దుకుపోతాడు. ఒకవేళ అతడు గనుక భారత జట్టు కెప్టెన్ అయితే... సుదీర్ఘకాలం పాటు సారథిగా కొనసాగగలడు. ఎందుకంటే.. ప్రతీ విషయానికి సర్దుకుపోతూ... తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ జట్టుకు, టీమిండియాకు సారథ్యం వహించడంలో చాలా తేడా ఉంటుందని, కాస్త దూకుడుగా ఉంటూనే కెప్టెన్గా విజయవంతమవుతారని చెప్పుకొచ్చాడు. ఇక ధోని వలె కేఎల్ రాహుల్ సైతం సైలెంట్గా ఉంటాడని, కానీ నాయకుడంటే గెలుపోటముల బాధ్యతలు మోయగల శక్తి కలిగి ఉండాలని చెప్పుకొచ్చాడు. కాగా ఈనెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లి.. పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకు ప్రమోషన్ వస్తుందనే వార్తలు వినిపిస్తుండగా... పలువురు మాజీలు కేఎల్ రాహుల్ పేరును సూచిస్తున్నారు. ఈ క్రమంలో అజయ్ జడేజా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బ్యాటర్గా కేఎల్ రాహుల్ తాజా ఐపీఎల్ సీజన్లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఆడిన 12 మ్యాచ్లలో అతడు 528 పరుగులు(అత్యధిక స్కోరు- 91 నాటౌట్) చేసి.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ పాండ్యాపై విశ్వాసం ఎక్కువ.. అతన్ని తొలగించరు! -
సీఎస్కే ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఆ ప్లేయర్కు ఏం కాలేదు
Faf Du Plessis Is Alright Collision With Mustafizur Rahman.. ఐపీఎల్ 2021లో సీఎస్కే దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన సీఎస్కేకు మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సీఎస్కే విజయాలలో ఓపెనర్ల పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్లు ప్రతీ మ్యాచ్లోనూ ఘనమైన ఆరంభానిస్తూ జట్టను పటిష్ట స్థితిలో నిలుపుతున్నారు. రుతురాజ్ ఈ సీజన్లో ఇప్పటికే 500 పరుగుల మార్క్ను దాటగా.. డుప్లెసిస్460 పరుగులతో టాప్ 5లో కొనసాగుతున్నాడు. అయితే తాజాగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ అనుకోకుండా గాయపడిన సంగతి తెలిసిందే. చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే Courtesy: IPL Twitter సీఎస్కే బ్యాటింగ్ సమయంలో ముస్తాఫిజుర్ బౌలింగ్లో షాట్ ఆడిన డివిలియర్స్ పరుగు కోసం వచ్చాడు. అదే సమయంలో ముస్తాఫిజుర్ అక్కడే ఉండడం.. అతని కాళ్లకు డుప్లెసిస్ మెడ బలంగా తగలడంతో ఇద్దరు అక్కడే కూలబడ్డారు. అయితే డుప్లెసిస్ మెడకు గట్టిగా తగలడంతో కాసేపు అలానే కూర్చొండిపోయాడు. కాసేపటికి ఫిజియోథెరపీ వచ్చి అతని మెడకు మర్ధన చేశాడు. అయితే ఆ తర్వాత డుప్లెసిస్ తన ఇన్నింగ్స్కు కొనసాగించాడు. డుప్లెసిస్ గాయం తీవ్రత ఎంతనేది సీఎస్కే ఎక్కడ వెల్లడించలేదు. దీంతో డుప్లెసిస్ ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం అభిమానులకు గుడ్న్యూస్ తెలిపింది. ''డుప్లెసిస్కు ఏం కాలేదని.. అతనిప్పుడు బాగానే ఉన్నాడని.. మెడనొప్పిపై తమకు ఏం చెప్పలేదని.. అతను నెట్స్లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉత్సాహంగా కనిపించాడు.'' అంటూ సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా డుప్లెసిస్ ఫోటోను షేర్ చేస్తూ .. ''డుప్లెసిస్ కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు..'' అంటూ ట్విటర్లో తెలిపింది. Courtesy: IPL Twitter] కాగా పీఎస్ఎల్ 2021లో డుప్లెసిస్ ఇదే తరహాలో కంకషన్కు గురయ్యాడు. మ్యాచ్ సందర్భంగా బంతిని అందుకునే ప్రయత్నంలో తోటి ఫీల్డర్తో జరిగిన కొలిషన్లో డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు. 72 గంటల తర్వాత సీరియస్ ఇంజ్యురీ అని తేలడంతో డుప్లెసిస్ ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నప్పటికి మసక కంటిచూపుతో ఇబ్బంది పడడంతో హండ్రెడ్ టోర్నీకి పూర్తిగా దూరమవ్వాల్సి వచ్చింది. తాజాగా అదే తరహాలో డుప్లెసిస్ మరోసారి గాయపడడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డుప్లెసిస్కు ఏం కాలేదంటూ.. మిగతా మ్యాచ్లు ఆడుతాడని యాజమాన్యం స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: IPL 2021: వార్నర్కు పట్టిన గతే ఆ సీఎస్కే ఆటగాడికి కూడా పడుతుంది..! pic.twitter.com/YBKESsGzrv — Maqbool (@im_maqbool) October 2, 2021 -
David Warner: చాలా రోజుల తర్వాత కనిపించిన వార్నర్.. ఏంటన్నా ఇది!
David Warner in Stadium Viral Video: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు భారత్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్లో సన్రైజర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. తనదైన ఆటతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టాడు. 2016లో హైదరాబాద్ను ఐపీఎల్ విజేతగా నిలిపి తొలి టైటిల్ అందించిన కెప్టెన్గా గుర్తింపు పొందిన ‘వార్నర్ అన్న’.. కనిపిస్తే చాలు ఆరెంజ్ ఆర్మీలో జోష్ వస్తుంది. కానీ, ఈ సీజన్లో మాత్రం వార్నర్ మెరుపులు లేవు. కెప్టెన్సీ కాదు కదా తుదిజట్టులో కూడా అతడికి చోటు దక్కడం లేదు. ముఖ్యంగా యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో అంచెలో గత రెండు మ్యాచ్లలో కనీసం అతడు మైదానంలో కూడా కనిపించలేదు. దీంతో.. చాంపియన్ను ఇలా పెట్టడం సరికాదంటూ అభిమానులు ఇప్పటికే ఫ్రాంఛైజీ తీరును తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో వార్నర్ను స్టేడియంలో చూసి ఫ్యాన్స్ సంబరపడిపోయారు. సిబ్బందితో కలిసి ఎస్ఆర్హెచ్ జెండా ఊపుతూ... జట్టును ఉత్సాహపరుస్తూ కనిపించాడు వార్నర్. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో... ‘‘వార్నర్ భాయ్ నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది. అదే సమయంలో బాధగా ఉంది. నీలాంటి చాంపియన్ ఇలా డగౌట్లో కూర్చోవడం ఏంటన్నా. టాప్క్లాస్ బ్యాట్స్మెన్కు ఇది నిజంగా ఎంతో బాధాకరమైన పరిస్థితి’’ అని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు.. ‘‘వచ్చే సీజన్లో వార్నర్ చెన్నై లేదంటే ఆర్సీబీకి ఆడటం ఖాయం’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మళ్లీ ఆరెంజ్ జెర్సీలో కనిపించకపోవచ్చంటూ వార్నర్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే! చదవండి: Glenn Maxwell: నేను అన్నది ఐపీఎల్లో కాదు.. విఫలమయ్యానని తెలుసు! ICYMI: Hi 👋🏻@SunRisers 🧡 fans here's @davidwarner31 sending you a wave 😊#VIVOIPL | #KKRvSRH pic.twitter.com/mFej5lRiz7 — IndianPremierLeague (@IPL) October 3, 2021 -
నితీష్ దెబ్బకు కెమెరా పగిలింది.. రషీద్ ఏం చేస్తున్నాడు
ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం రాత్రి ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాసన్ హోల్డర్ బౌలింగ్లో నితీష్ రాణా బౌండరీ కొట్టాడు. అయితే బంతి బౌండరీ దాటి పక్కనే ఉన్న కెమెరాకు తాకి లెన్స్ పగిలిపోయాయి. అదే సమయంలో బంతిని అందుకోవడంలో విఫలమైన రషీద్ పగిలిన కెమెరాలో వేలు పెట్టి చూశాడు. ఆ తర్వాత ఏంటో ఇది.. అంటూ ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను చూస్తూ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ ఇక మ్యాచ్లో కేకేఆర్ విజయాన్ని అందుకుంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. శుబ్మన్ గిల్ హాఫ్సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే. రాజస్తాన్ రాయల్స్తో జరగనున్న చివరి మ్యాచ్లో కేకేఆర్ విజయం అందుకుంటే ఎలాంటి సమీకరణాలు లేకుండానే నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్కు చేరనుంది. చదవండి: ఐపీఎల్ 2021 సీజన్లో అత్యంత ఫాస్ట్బాల్.. డెబ్యూ మ్యాచ్లోనే Nitish Rana breaks Camera lens😍#KKRvSRH #IPL2021 #NitishRana pic.twitter.com/7ItIPsK6rb — Subuhi S (@sportsgeek090) October 3, 2021 -
Glenn Maxwell: గత సీజన్లో విఫలమయ్యా.. కానీ.. మాక్సీ కౌంటర్ అదిరిందిగా!
Glenn Maxwell tweet goes viral: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్-2021 సీజన్లో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆర్సీబీ తరఫున 12 మ్యాచ్లు ఆడిన అతడు 407 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 78. ఇక ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన మాక్సీ.. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 33 బంతులు ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసి... మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావడం అన్ని వేళలా అంత సులభమేమీ కాదు. ప్రొఫెషనల్ క్రికెట్తో పాటు గత ఐపీఎల్ సీజన్లలో బాగా ఆడాను. అయితే, నేటి మ్యాచ్లో మాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. దానిని సద్వినియోగం చేసుకోవాలని భావించాను. వికెట్పై ఒక అంచనా వచ్చింది. గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియా తరఫున ఇదే విధంగా ఆడుతున్నా. అక్కడ నేను విజయవంతమయ్యాను. ఇక ఆర్సీబీ విషయానికొస్తే... వాళ్లు కూడా నన్ను ఇక్కడ ఇదే తరహా పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. డ్రెస్సింగ్రూంలో వాతావరణం ఎంతో బాగుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 2019, గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్వెల్ను రూ.10 కోట్లు వెచ్చించి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(ఇప్పటి పంజాబ్ కింగ్స్) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్- 13వ సీజన్లో మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యాడు. 2020 సీజన్లో పంజాబ్ తరఫున 13 మ్యాచ్లాడిన ఈ ఆసీస్ క్రికెటర్ మొత్తంగా 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంజాబ్ ఫ్రాంఛైజీ అతడిని వదులుకుంది. ఈక్రమంలో.. ఐపీఎల్-2021 మినీ వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకోగా.. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. మాక్సీ చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతోంది. ఆర్సీబీ ట్వీట్ను రీట్వీట్ చేసిన అతడు.. ‘‘గత రెండేళ్లుగా నేను ప్రొఫెషనల్ క్రికెట్ బాగా ఆడుతున్నాను. ఐపీఎల్లో కాదు. గత సీజన్లో నేను విఫలమయ్యాయని నాకు తెలుసు’’ అని పేర్కొన్నాడు. పోస్ట్ మ్యాచ్ అనంతరం తాను మాట్లాడుతూ... బాగా ఆడాను అన్నది ప్రొఫెషనల్ క్రికెట్లో అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఒక ఆటగాడి గురించి రాసేటపుడు ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారంటూ తనను విమర్శిస్తూ కథనాలు రాసిన మీడియాకు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చాడు. I played well in the last 2 years in professional cricket (not IPL)… makes a difference in quotes doesn’t it? #iknowistruggledlastyearinIPL https://t.co/LvZTzUla3L — Glenn Maxwell (@Gmaxi_32) October 3, 2021 -
RCB Vs PBKS: బెంగళూరు బహు బాగు... ‘ప్లే ఆఫ్స్’లోకి!
ఐపీఎల్–2021 రెండో దశ (యూఈఏ)లో తొలి మ్యాచ్లో 92 ఆలౌట్తో చిత్తు... ఆపై తర్వాతి మ్యాచ్లోనూ పరాజయం... పరిస్థితి చూస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాత జట్టులా మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లి నిష్క్రమించేలా కనిపించింది. అయితే ఒక్కసారిగా చెలరేగిన ఆర్సీబీ ‘హ్యాట్రిక్’ విజయాలతో సత్తా చాటింది. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే వరుసగా రెండో సీజన్లో ‘ప్లే ఆఫ్స్’లోకి ప్రవేశించింది. ఉత్కంఠగా సాగిన పోరులో పంజాబ్ కింగ్స్ను ఓడించి కోహ్లి సేన ముందంజ వేసింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎప్పటిలాగే ఒత్తిడికి లోనై చివర్లో విజయం చేజార్చుకున్న కింగ్స్ ఆట ఈ ఏడాదికి ముగిసినట్లే! షార్జా: చెన్నై, ఢిల్లీ తర్వాత మూడో జట్టు బెంగళూరు తమ ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్వెల్ (33 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, దేవదత్ పడిక్కల్ (38 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (42 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... కోహ్లి (24 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), పడిక్కల్ మరోసారి బెంగళూరుకు అర్ధ సెంచరీ భాగస్వామ్యం అందించారు. 9 పరుగుల వద్ద కోహ్లిని స్టంపౌట్ చేసే అవకాశం వదిలేసిన రాహుల్... అదే ఓవర్లో పడిక్కల్ ఇచి్చన క్యాచ్ను కూడా వదిలేశాడు. 10 పరుగుల వద్ద సర్ఫరాజ్ క్యాచ్ వదిలేయడంతో కోహ్లి మళ్లీ బతికిపోయాడు. అర్ష్దీప్ ఓవర్లో పడిక్కల్ సిక్స్, ఫోర్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు 55 పరుగులకు చేరింది. కొద్దిసేపటికి హెన్రిక్స్ తన తొలి ఓవర్లోనే కోహ్లిని అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా, తర్వాతి బంతికే క్రిస్టియాన్ (0) కూడా అవుటయ్యాడు. హెన్రిక్స్ తన తర్వాతి ఓవర్లోనే పడిక్కల్ను కూడా వెనక్కి పంపించాడు. అయితే ఈ దశలో మ్యాక్స్వెల్ దూకుడైన బ్యాటింగ్ ఆర్సీబీ ఇన్నింగ్స్ను నిలబెట్టింది. హర్ప్రీత్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన మ్యాక్స్వెల్, ఆ తర్వాత రవి బిష్ణోయ్ ఓవర్లోనూ మరో రెండు సిక్స్లు బాదాడు. ఆ తర్వాత డివిలియర్స్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) జోరుతో షమీ ఓవర్లో చాలెంజర్స్ 17 పరుగులు రాబట్టింది. 29 బంతుల్లో మ్యాక్స్వెల్ అర్ధసెంచరీ పూర్తయింది. సర్ఫరాజ్ డైరెక్ట్ హిట్తో డివిలియర్స్ రనౌట్ కావడంతో 73 పరుగుల (39 బంతుల్లో) మెరుపు భాగస్వామ్యానికి తెర పడింది. ఓపెనర్లు మినహా... ఓపెనర్ల మధ్య మరో భారీ భాగస్వామ్యం పంజాబ్కు శుభారంభాన్ని అందించినా... చివరకు అది విజయానికి మాత్రం పనికి రాలేదు. రాహుల్, మయాంక్ కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో ఆరు ఓవర్లో ముగిసేసరికి కింగ్స్ 49 పరుగులు సాధించింది. రాహుల్తో పోలిస్తే మయాంక్ కాస్త ధాటిగా ఆడాడు. క్రిస్టియాన్, చహల్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను షహబాజ్ బౌలింగ్లో భారీ సిక్స్ బాదాడు. రాహుల్ను షహబాజ్ అవుట్ చేసిన తర్వాత ఒక్కసారిగా పంజాబ్ ఛేదన కష్టంగా మారిపోయింది. స్కోరు వివరాలు ఆర్సీబీ ఇన్నింగ్స్: కోహ్లి (బి) హెన్రిక్స్ 25; పడిక్కల్ (సి) రాహుల్ (బి) హెన్రిక్స్ 40; క్రిస్టియాన్ (సి) సర్ఫరాజ్ (బి) హెన్రిక్స్ 0; మ్యాక్స్వెల్ (సి) సర్ఫరాజ్ (బి) షమీ 57; డివిలియర్స్ (రనౌట్) 23; షహబాజ్ (బి) షమీ 8; శ్రీకర్ భరత్ (నాటౌట్) 0; గార్టన్ (బి) షమీ 0; హర్షల్ పటేల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–68, 2–68, 3–73, 4–146, 5–157, 6–163, 7–163. బౌలింగ్: మార్క్రమ్ 1–0–5–0, షమీ 4–0–39–3, అర్ష్దీప్ 3–0–42–0, బిష్ణోయ్ 4–0–35–0, హర్ప్రీత్ 4–0–26–0, హెన్రిక్స్ 4–0–12–3. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) హర్షల్ (బి) షహబాజ్ 39; మయాంక్ (సి) సిరాజ్ (బి) చహల్ 57; పూరన్ (సి) పడిక్కల్ (బి) చహల్ 3; మార్క్రమ్ (సి) క్రిస్టియాన్ (బి) గార్టన్ 20; సర్ఫరాజ్ (బి) చహల్ 0; షారుఖ్ (రనౌట్) 16; హెన్రిక్స్ (నాటౌట్) 12; హర్ప్రీత్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–91, 2–99, 3–114, 4–121, 5–127, 6–146. బౌలింగ్: 4–0–33–0, గార్టన్ 4–0–27–1, షహబాజ్ 3–0–29–1, హర్షల్ 4–0–27–0, చహల్ 4–0–29–3, క్రిస్టియాన్ 1–0–11–0. -
ఐపీఎల్ 2021 సీజన్లో అత్యంత ఫాస్ట్బాల్.. డెబ్యూ మ్యాచ్లోనే
కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2021 సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఓవర్ మూడో బంతిని ఉమ్రాన్ గంటకు 150 కిమీ వేగంతో విసిరాడు. బంతిని టచ్ చేసిన శుబ్మన్ గిల్ బ్యాట్ పక్కకు తిరిగిదంటేనే అర్థం చేసుకోవచ్చు.. బంతి ఎంత వేగంగా వచ్చిందనేది. ఇక ఉమ్రాన్ మాలిక్కు ఐపీఎల్లో ఇదే డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం. భారత్ తరపున ఈ సీజన్లో అత్యంత ఫాస్ట్ డెలివరీ వేసిన జాబితాలో ఉమ్రాన్ తొలి స్థానంలో నిలవగా.. మహ్మద్ సిరాజ్- ఆర్సీబీ (గంటకు 147.68కిమీ, 147.67కిమీ) రెండోస్థానంలో.. ఖలీల్ అహ్మద్( గంటకు 147.38కిమీ) మూడో స్థానంలో ఉన్నాడు. చదవండి: IPL 2021: హర్షల్ పటేల్ సూపర్ త్రో.. మ్యాచ్కు టర్నింగ్ పాయింట్; కోహ్లి గెంతులు ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ విజయం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. గిల్ 57, నితీష్ రాణా 18 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 44 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. చదవండి: కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర.. వరుసగా నాలుగోసారి WATCH: Umran Malik bowled a 1️⃣5️⃣0️⃣ KMPH delivery 🔥⚡🤯 On #VIVOIPL debut and he showcases his FULL PACE 🔝💪🏻 #KKRvSRH @SunRisers 🎥 👇https://t.co/fg8HrKrwnI — IndianPremierLeague (@IPL) October 3, 2021 -
సూపర్ త్రో.. విలియమ్సన్ రనౌట్; సీజన్లో ఎస్ఆర్హెచ్ చెత్త రికార్డు
SRH Makes Worst Record After Kane Williamson Run Out.. కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ విలియమ్సన్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. షకీబ్ డైరెక్ట్ త్రోకు విలియమ్సన్ వెనుదిరగాల్సి వచ్చింది. 26 పరుగులతో మంచి టచ్లో కనిపించిన విలియమ్సన్ ఇన్నింగ్స్ 7వ ఓవర్లో షకీబ్ వేసిన ఐదో బంతి మిడ్ వికెట్ దిశగా ఆడాడు. పరుగు తీయడం రిస్క్తో కూడుకున్నదని తెలిసినప్పటికి అనవసరంగా పరిగెత్తి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2021 సీజన్లో రనౌట్ విషయంలో ఎస్ఆర్హెచ్ ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్లు మూడుసార్లు రనౌట్ కావడం విశేషం. రెండుసార్లు డేవిడ్ వార్నర్.. తాజాగా విలియమ్సన్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నాడు. ఈ సీజన్లో పంత్ రెండుసార్లు రనౌట్ అయ్యాడు. ఇక సీఎస్కే, రాజస్తాన్ మినహా మిగిలిన టీమ్ల కెప్టెన్లు ఒక్కసారి రనౌట్గా వెనుదిరిగారు. Courtesy: IPL Twitter ఇక కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అబ్దుల్ సమద్ 25, ప్రియమ్ గార్గ్ 21 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ మెరుపులు మెరిపించలేకపోయింది. దీనికి తోడూ మిగతా బ్యాట్స్మెన్ కూడా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. షకీబ్ ఒక వికెట్ తీశాడు. చదవండి: IPL 2021: హర్షల్ పటేల్ సూపర్ త్రో.. మ్యాచ్కు టర్నింగ్ పాయింట్; కోహ్లి గెంతులు pic.twitter.com/H7prWRNSq0 — Cricsphere (@Cricsphere) October 3, 2021 -
హర్షల్ పటేల్ సూపర్ త్రో.. మ్యాచ్కు టర్నింగ్ పాయింట్
Harshal Patel Super Throw Turning Point For RCB.. ఐపీఎల్ 2021 సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. అయితే 19వ ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబుచులాడింది. ఇక ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. కాగా 20వ ఓవర్ను హర్షల్ పటేల్ వేశాడు. కాగా హర్షల్ తన తొలి బంతికే షారుక్ ఖాన్ను అద్భుత త్రోతో రనౌట్గా పెవిలియన్కు చేర్చాడు. మ్యాచ్కు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకముందు ఒక ఫోర్.. ఒక సిక్స్తో షారుక్ మంచి టచ్లో ఉన్నాడు. అతను స్ట్రైక్ తీసుకోవాలని భావించాడు. అందుకే హర్షల్ వేసిన తొలి బంతిని హెన్రిక్స్ ఢిఫెన్స్ ఆడినప్పటికి షారుక్ అనవసరంగా పరుగుకు కాల్ ఇచ్చాడు. ఇంకేముంది అప్పటికే సగం క్రీజులో ఉన్న హర్షల్ మెరుపువేగంతో బంతిని త్రో విసరగా.. నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో షారుక్ రనౌట్గా వెనుదిరిగాడు. ఇక షారుక్ అవుటయ్యాడని తెలియగానే కోహ్లి సంబరాలు మాములుగా లేవు. మైదానంలో నే గెంతులు వేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మ్యాక్స్వెల్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు నష్టపోయి 158 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చదవండి: కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర.. వరుసగా నాలుగోసారి Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ -
KKR Vs SRH: ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ ఘన విజయం
ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ విజయం.. ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖరారు ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 6 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్ శుబ్మన్ గిల్ 57 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నితీష్ రాణా 25 పరుగులతో రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హూల్డర్ 2, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇక చివరి మ్యాచ్ను కేకేఆర్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. అంతకముందు ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అబ్దుల్ సమద్ 25, ప్రియమ్ గార్గ్ 21 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ మెరుపులు మెరిపించలేకపోయింది. దీనికి తోడూ మిగతా బ్యాట్స్మెన్ కూడా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. షకీబ్ ఒక వికెట్ తీశాడు విజయానికి 24 పరుగుల దూరంలో కేకేఆర్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ విజయం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. గిల్ 57, నితీష్ రాణా 18 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 44 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. 9 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 42/2 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. గిల్ 24, నితీష్ రాణా 1 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు వెంకటేశ్ అయ్యర్ (8), రాహుల్ త్రిపాఠి(7) తక్కువ స్కోర్లకే ఔటై పెవిలియన్ చేరారు. కేకేఆర్ టార్గెట్ 116 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అబ్దుల్ సమద్ 25, ప్రియమ్ గార్గ్ 21 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ మెరుపులు మెరిపించలేకపోయింది. దీనికి తోడూ మిగతా బ్యాట్స్మెన్ కూడా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. షకీబ్ ఒక వికెట్ తీశాడు. హోల్డర్(2) ఔట్.. ఎస్ఆర్హెచ్ 80/6 కేకేఆర్తో మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు తమ చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హోల్డర్(9 బంతుల్లో 2) వెంకటేశ్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 80 పరుగుల వద్ద ఆరో వికెట్ను కోల్పోయింది. క్రీజ్లో అబ్ధుల్ సమద్(12), రషీద్ ఖాన్ ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. ప్రియం గార్గ్(21) ఔట్ వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలానికి ఎస్ఆర్హెచ్ ఆటగాడు ప్రియం గార్గ్(31 బంతుల్లో 21; సిక్స్) బోల్తా పడ్డాడు. ఇన్నింగ్స్ 14.2 ఓవర్లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 79/5. క్రీజ్లో అబ్ధుల్ సమద్(12), హోల్డర్(1) ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 53/4 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఫేలవ ఆటతీరు కొనసాగిస్తుంది. తాజాగా షకీబ్ బౌలింగ్లో 6 పరుగులు చేసిన అభిషేక్ శర్మ స్టంప్ అవుట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. గార్గ్ 18, అబ్దుల్ సమద్ 5 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL షకీబ్ స్టన్నింగ్ త్రో.. విలియమ్సన్ రనౌట్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ షకీబ్ స్టన్నింగ్ త్రోకు రనౌట్ అయ్యాడు. 26 పరుగులతో మంచి టచ్లో కనిపించిన విలియమ్సన్ అనవసర పరుగుకు యత్నించి ఔటయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 38 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ప్రియమ్ గార్గ్ 8, అభిషేక్ శర్మ 6 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 35/2 జేసన్ రాయ్(10) రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ నాలుగో బంతికి సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. విలియమ్సన్ 24, ప్రియమ్ గార్గ్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL సాహా గోల్డెన్ డక్.. ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్ కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. సౌథీ వేసిన ఓవర్ రెండో బంతికే సాహా ఎల్బీగా వెనుదిరిగాడు. సాహా రివ్యూ కోరకుండానే పెవిలియన్కు చేరాడు. అయితే రిప్లేలో బంతి వికెట్లపై నుంచి వెళ్లడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం 1 ఓవర్లో ఎస్ఆర్హెచ్ స్కోరు 4/1గా ఉంది. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్ సెకండ్ఫేజ్లో భాగంగా కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే లీగ్ నుంచి ఇంటిబాట పట్టిన ఎస్ఆర్హెచ్కు ఈ మ్యాచ్ గెలవడం వల్ల పెద్దగా ఒరిగేదేం లేదు.. ప్రత్యర్థి అవకావాలు దెబ్బతీయడం తప్ప. అయితే కేకేఆర్కు మాత్రం ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఎస్ఆర్హెచ్పై గెలిస్తే ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశం ఉంది. ఇక తొలి అంచె పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ను విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 177 పరుగులకే పరిమితమైంది. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 20 సార్లు తలపడగా.. 13సార్లు కేకేఆర్.. ఏడుసార్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. కోల్కతా నైట్ రైడర్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా,షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి సన్రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్ -
కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర.. వరుసగా నాలుగోసారి
KL Rahul 4th Consecutive 500+ Runs IPL.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫుల్ జోష్లో ఉన్నాడు. కొంతకాలంగా అద్భతు ఫామ్తో అదరగొడుతున్న రాహుల్ ఐపీఎల్లోనూ అదరగొట్టే ప్రదర్శన నమోదు చేస్తున్నాడు. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్లో రాహుల్ 500 పరుగులు మార్క్ను అధిగమించాడు. ఈ సీజన్లో 500 పరుగులు సాధించిన రెండో బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ శనివారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 500 పరుగుల మార్క్ను అందుకున్నాడు. కాగా రాహుల్ ఐపీఎల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 4 వరుస సీజన్లలో 500 పరుగులు మార్క్ను అందుకొని రాహుల్ కొత్త రికార్డును నెలకొల్పాడు. 2018లో 659 పరుగులు, 2019లో 593 పరుగులు, 2020లో 670 పరుగులు సాధించిన రాహుల్ తాజాగా మరోసారి ఆ ఫీట్ను నమోదు చేశాడు. ప్రస్తుతం 12 మ్యాచ్లాడిన రాహుల్ 527 పరుగులతో ఆడుతున్నాడు. ఇందులో 5 అర్థ శతకాలు ఉన్నాయి. కాగా గత రెండు సీజన్లలో సెంచరీలు సాధించిన రాహుల్ ఈసారి శతకాన్ని నమోదు చేయలేదు. ఓవరాల్గా ఐపీఎల్లో ఇప్పటివరకు 93 మ్యాచ్లాడిన కేఎల్ రాహుల్ 3174 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు.. 26 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిలకడగా ఆడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 47, పూరన్ 1 పరుగులతో ఆడుతున్నారు. -
ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ
Maxwell Power Hitting Sixes.. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ప్రస్తుతం 37 పరుగులతో ఆడుతున్న మ్యాక్సీ ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు ఉన్నాయి. ఇందులో మ్యాక్సీ కొట్టిన రెండు సిక్సర్లు స్టేడియం అవతల పడ్డాయి. షార్జా స్టేడియం చిన్నదైనప్పటికి మ్యాక్సీ భారీ సిక్సర్లతో తన పవరేంటో చూపించాడు. మొదట హర్ప్రీత్ బార్ బౌలింగ్లో ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతిని మ్యాక్స్వెల్ డీప్స్వ్కేర్ లెగ్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. అతని పవర్ దాటికి బంతి స్టేడియం అవతల ఉన్న రోడ్డుపై పడింది. ఆ తర్వాత రవి బిష్ణోయి బౌలింగ్లో మరో భారీ సిక్స్తో మెరిశాడు. ఈసారి డీప్మిడ్వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టగా.. ఈసారి కూడా బంతి రోడ్డుపై పడింది. ప్రస్తుతం మ్యాక్సీ కొట్టిన రెండు సిక్సర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి అంటే సరే.. మళ్లీ మళ్లీనా అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉత్సాహంతో కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆర్సీబీ 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ 43, డివిలియర్స్ 11 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: ఔట్ కాదా.. అంపైర్పై కేఎల్ రాహుల్ అసహనం -
ఔట్ కాదా.. అంపైర్పై కేఎల్ రాహుల్ అసహనం
KL Rahul Frustration On Field Umpire.. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డ్ అంపైర్పై అసహనం వ్యక్తం చేశాడు. బ్యాటర్ క్లియర్ అవుట్ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అంపైర్ ఔటివ్వకపోవడంతో కెఎల్ రాహుల్ వాదనకు దిగాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ రవి బిష్ణోయి వేశాడు. కాగా ఓవర్ మూడో బంతిని దేవదత్ పడిక్కల్ ఫ్లిక్ చేసే ప్రయత్నంలో అతని చేతిని తాకి బంతి కీపర్ రాహుల్ చేతిలో పడింది. అయితే అంపైర్ నాటౌట్ అని చెప్పడంతో రాహుల్ రివ్యూ కోరాడు. అయితే అల్ట్రాఎడ్జ్లో పడిక్కల్ గ్లౌజ్ను తాకినట్లు స్పైక్ స్పష్టంగా కనిపించింది. అయినప్పటికి థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఫీల్డ్ అంపైర్కు వదిలేశాడు. చదవండి: ముంబై ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది: షేన్ బాండ్ Courtesy: IPL Twitter ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పడిక్కల్ నాటౌట్ అని ఇచ్చాడు. ఇది చూసి షాకైన రాహుల్.. ''ఇదేం నిర్ణయం.. బంతి బ్యాటర్ గ్లౌజ్కు క్లియర్గా తగిలినట్లు అల్ట్రాఎడ్జ్లో క్లియర్గా కనిపిస్తున్నప్పటికి ఔట్ ఇవ్వకపోవడం ఏంటని'' అసహనం వ్యక్తం చేశాడు. దీంతో పడిక్కల్ బతికిపోగా.. పంజాబ్ రివ్యూ వృధా అయింది. అయితే అంపైర్ నిర్ణయంపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. '' అంత క్లియర్గా ఔట్ అని కనిపిస్తున్నా అంపైర్ అలా ఎందుకు చేశాడు.. ఈ అంపైర్కు డీఆర్ఎస్పై స్పెషల్ క్లాసులు పెట్టాల్సిందే'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే pic.twitter.com/rSpc51vmxM — Maqbool (@im_maqbool) October 3, 2021 -
PBKS Vs RCB: పంజాబ్పై విజయం.. ప్లే ఆఫ్స్కు ఆర్సీబీ
పంజాబ్పై విజయం.. ప్లే ఆఫ్స్కు ఆర్సీబీ ఆర్సీబీ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్తు ఖారారు చేసుకుంది. పంజాబ్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, హర్షల్ పటేల్ అద్భుతంగా బౌల్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆర్సీబీ బౌలర్లలో చహల్ 3 వికెట్లు, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్.. మర్క్రమ్(20) ఔట్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ ప్లేయర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. గార్టన్ వేసిన 16.5వ ఓవర్లో మర్క్రమ్(14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) క్రిస్టియన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 128/5. క్రీజ్లో షారుఖ్ ఖాన్(2), హెన్రిక్స్ ఉన్నారు. చహల్ మాయాజాలం.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఆర్సీబీ బౌలర్ చహల్ తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో పంజాబ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో మయాంక్ అగర్వాల్(42 బంతుల్లో 57), సర్ఫరాజ్ ఖాన్(0)లను ఔట్ చేశాడు. 16 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 121/4. క్రీజ్లో మర్క్రమ్(15), షారుఖ్ ఖాన్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.. పూరన్(3) ఔట్ చహల్ వేసిన 13వ ఓవర్లో పంజాబ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వన్ డౌన్ బ్యాటర్ పూరన్(7 బంతుల్లో 3) పడిక్కల్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12.5 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 99/2. క్రీజ్లో మయాంక్ అగర్వాల్(36 బంతుల్లో 50), మర్క్రమ్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. రాహుల్(39) ఔట్ ఆర్సీబీ బౌలర్లకు ఎట్టకేలకు 11వ ఓవర్లో వికెట్ దక్కింది. షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో హర్షల్ పటేల్ క్యాచ్ అందుకోవడంతో కేఎల్ రాహుల్(35 బంతుల్లో 39; ఫోర్, 2 సిక్సర్లు) తొలి వికెట్గా వెనుదిరిగాడు. 10.5 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 91/1. క్రీజ్లో మయాంక్ అగర్వాల్(31 బంతుల్లో 47), పూరన్ ఉన్నారు. Photo Courtesy: IPL ఆచితూచి ఆడుతున్న పంజాబ్.. 6 ఓవర్ల తర్వాత 49/0 165 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(19 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్(18 బంతుల్లో 19; ఫోర్చ సిక్స్) చెత్త బంతులను బౌండరీలను తరలిస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 49/0గా ఉంది. ఆఖర్లో తడబడ్డ ఆర్సీబీ.. పంజాబ్ టార్గెట్ 165 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీసీకి శుభారంభం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తొలుత హెన్రిక్స్(3/12), ఆఖరి ఓవర్లో షమీ(3/39) ఆర్సీబీని కట్టడి చేశారు. చివరి ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చిన షమీ 3 వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి మ్యాక్స్వెల్(33 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) క్యాచ్ అవుట్గా వెనుదిరగగా.. నాలుగో బంతికి షాబాజ్ అహ్మద్(4 బంతుల్లో 8; సిక్స్), జార్జ్ గార్టన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యారు. సర్ఫరాజ్ సూపర్ త్రో.. డివిలియర్స్(23) రనౌట్ సర్ఫరాజ్ ఖాన్ సూపర్ త్రో కారణంగా ఏబీ డివిలియర్స్(18 బంతుల్లో 23; ఫోర్, 2 సిక్సర్లు) రనౌటయ్యాడు. 18.2 ఓవర్ల ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 146/4. క్రీజ్లో మ్యాక్స్వెల్(50), షాబాజ్ అహ్మద్ ఉన్నారు. Photo Courtesy: IPL హెన్రిక్స్ ఆన్ ఫైర్.. వరుస ఓవర్లలో 3 వికెట్లు పంజాబ్ బౌలర్ మోసస్ హెన్రిక్స్ చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. వరుస ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టాడు. 10వ ఓవర్లో కోహ్లి(25), డేనియల్ క్రిస్టియన్(0)లను ఔట్ చేసిన అతను.. 12వ ఓవర్లో దేవ్దత్ పడిక్కల్(3 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ను పెవిలియన్కు సాగనంపాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 73/3. క్రీజ్లో మ్యాక్స్వెల్(3), ఏబీ డివిలియర్స్ ఉన్నారు. Photo Courtesy: IPL వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో పంజాబ్ బౌలర్ మోసస్ హెన్రిక్స్ ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టాడు. తొలుత విరాట్ కోహ్లి(24 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్)ని క్లీన్ బౌల్డ్ చేసిన అతను.. ఆ మరుసటి బంతికే డేనియల్ క్రిస్టియన్ను డకౌట్గా వెనక్కు పంపాడు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 69/2. క్రీజ్లో పడిక్కల్(38), మ్యాక్స్వెల్(1) ఉన్నారు. ఆర్సీబీ దూకుడు..6 ఓవర్ల తర్వాత 55/0 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ దూకుడుగా ఆడుతుంది. ఓపెనర్లు దేవ్దత్ పడిక్కల్(23 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి(13 బంతుల్లో 18; 2 ఫోర్లు) చెలరేగి ఆడడంతో 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. Photo Courtesy: IPL షార్జా: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానున్న డబుల్ హెడర్ తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఇరు జట్లు 27 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా ఆర్సీబీ 12 .. పంజాబ్ 15 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో రాహుల్ సేన 34 పరుగుల తేడాతో ఆర్సీబీని మట్టికరిపించింది. ఇక ప్రస్తుత సీజన్లో ఇరు జట్ల పాయింట్ల విషయానికొస్తే.. ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో 7 విజయాలతో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ 12 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. తుది జట్లు: పంజాబ్ కింగ్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మర్క్రమ్, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, మోసస్ హెన్రిక్స్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్ -
బ్యాట్పై ధోనీ ఆటోగ్రాఫ్.. జైస్వాల్ ఆనందానికి అవధులు లేవు
Yashasvi Jaiswal Happy After MS Dhoni Autographed His Bat: రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆనందానికి అవధులు లేవు. దానికీ ఓ కారణం ఉంది... ఎందుకంటే తన బ్యాట్పైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ చేయడమే. కాగా అబుదాబి వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే జైస్వాల్ అర్థ సెంచరీ సాధించి జట్టు విజయానికి బాటలు వేశాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి ఒక అన్క్యాపడ్ ప్లేయర్ వేగవంతంగా హాఫ్ సెంచరీ చేయడం ఇది ఐదోసారి. కాగా జైశ్వాల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన జైశ్వాల్ ధోనీ ఆటోగ్రాఫ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. "నేను మొదట బ్యాటింగ్కు పిచ్ ఎలా అనుకూలిస్తుందని ఆలోచిస్తాను, కానీ మేము 190 పరుగులు చేజ్ చేయాలి, వికెట్ బ్యాటింగ్కు తప్పక బాగుంటుందని నాకు తెలుసు. నేను పవర్ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవడం, మా జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడం ద్వారా 190 పరుగులను చేధించగలిగాము, ”అని జైస్వాల్ శివమ్ దుబే, అనూజ్ రావత్ ఐపీఎల్ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాడు. "మ్యాచ్ తర్వాత నా బ్యాట్పై ఎంఎస్ ధోని సంతకం తీసుకున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని జైశ్వాల్ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ అనంతరం జైస్వాల్పై రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. చదవండి: ఐపీఎల్లో రుతురాజ్ డెబ్యూ సెంచరీ.. రికార్డుల మోత -
ముంబై ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది: షేన్ బాండ్
Shane Bond Commnets On Mumbai Indians: ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ముఖ్యంగా సెకెండ్ ఫేజ్లో ఆడిన 5 మ్యాచుల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి చెందింది. ఫలితంగా డిఫెండింగ్ ఛాంపియన్ ప్లేఆఫ్ ఛాన్స్లు సంక్లిష్టంగా మారాయి. ఈ క్రమంలో జట్టు ఆటతీరుపై ముంబై బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పందించాడు. ఐపీఎల్ 2021లో ముంబైకు ఇంకా ప్లేఆఫ్కు ఆర్హత సాధించే అవకాశం ఉందని బాండ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ సెకెండ్ ఫేజ్లో ముంబై ఇండియన్స్ అత్యుత్తమంగా ఆడలేదని బాండ్ అంగీకరించాడు. "మేము ఐపీఎల్ మెదటి దశలో బాగా ఆడాము. మేము ప్రస్తుతం బాగా ఆడడంలేదని తెలుసు, కానీ మేము ఇంకా పోటీలో ఉన్నాము. ఏమి జరుగుతుందో మేము చూస్తాము. మేము ఐదు విజయాలు మాత్రమే సాధించాము, కానీ మా జట్టు రెండు విజయాలు సాధించగలిగితే ఫలితాలు మారవచ్చు అని మ్యాచ్ అనంతరం విలేఖేరల సమావేశంలో షేన్ బాండ్ పేర్కొన్నాడు. 145 పరుగులు సాధించింటే ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై విజయం సాధించేదని అని బాండ్ చెప్పాడు. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 10 పాయింట్లతో 7 వ స్థానంలో ఉంది. చదవండి: CSK VS RR: ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’’ -
ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’
Glenn Phillips: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్కు రాజస్తాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. అబుదాబి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేయడానికి వచ్చిన సామ్ కరన్.. తన రెండో డెలివరీ వేసే క్రమంలో అతడి చేతి బంతి నుంచి జారిపోయి వైడ్ దిశగా పైకి వెళ్లింది. అయితే స్ట్రైక్ లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ఆ బంతిని ఎదుర్కోవడానకి క్రీజు వదిలి చాలా దూరం వెళ్లాడు. అయినప్పటికీ బంతిని అందుకోలేక చతికల పడ్డాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను నవ్వులు పూయిస్తుంది. ఫిలిప్స్ ‘ఫీట్’పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పరుగుల కోసం ఎంత దూరమైనా సిద్ధమా అని కొందరు.. ఏంటి ఫిలిప్స్ అంత దూరం వెళ్తున్న బంతిని కూడా వదలవా? అని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఫిలిప్స్ ఆత్రం చూసి సామ్ నోరెళ్లబెట్టాడు అని ఒక నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ సాధించాడు. రుతురాజ్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ కేవలం 17.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి టార్గెట్ను సాధించింది. యశస్వీ జైస్వాల్ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్లు) శివమ్ దూబే (42 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ రాజస్తాన్ రాయల్స్ను గెలిపించాయి. దీంతో ప్లేఆఫ్ ఆశలను రాయల్స్ సజీవంగా నిలుపుకుంది. చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే pic.twitter.com/I4heCusEzr — Jabjabavas (@jabjabavas) October 2, 2021 -
ముంబై మళ్లీ ఓడింది
షార్జా: పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్తో గెలుపు బాట పట్టిందనుకున్న ముంబై ఇండియన్స్ మళ్లీ పేలవ ప్రదర్శన కనబర్చింది. శనివారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రోహిత్ శర్మ బృందం నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. ఫలితంగా ఫ్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలను ముంబై క్లిష్టం చేసుకుంది. తొలుత ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. అవేశ్ ఖాన్ (3/15), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ పటేల్ (3/21) ముంబైని కట్టడి చేశారు. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించాడు. ఛేదనలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు), రవిచంద్రన్ అశి్వన్ (21 బంతుల్లో 20 నాటౌట్; 1 సిక్స్) జట్టుకు విజయాన్ని అందించారు. రిషభ్ పంత్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ మరోసారి సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ మరోసారి ఢిల్లీని ఆదుకున్నాడు. ఓపెనర్లు ధావన్ (8), పృథ్వీ షా (6), స్మిత్ (9) నిరాశ పరిచారు. ఈ దశలో అయ్యర్, పంత్ జట్టును ఆదుకున్నారు. ఒక ఎండ్ లో అయ్యర్ ఓపికగా ఆడితే... మరో ఎండ్లో పంత్ దూకుడుగా ఆడాడు. అయితే ఐదు ఓవర్ల వ్యవధిలో పంత్, అక్షర్ (9), హెట్మైర్ (15)లను అవుట్ చేసిన ముంబై... ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టింది. అయితే అశ్విన్, అయ్యర్లు జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. చివరి ఓవర్లో గెలుపునకు నాలుగు పరుగులు అవసరం కాగా... తొలి బంతిని సిక్సర్గా మలిచిన అశి్వన్ మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రబడ (బి) అవేశ్ 7; డికాక్ (సి) నోర్జే (బి) అక్షర్ 19; సూర్యకుమార్ (సి) రబడ (బి) అక్షర్ 33; సౌరభ్ తివారీ (సి) పంత్ (బి) అక్షర్ 15; పొలార్డ్ (బి) నోర్జే 6; హార్దిక్ (బి) అవేశ్ 17; కృనాల్ (నాటౌట్) 13; కూల్టర్ నైల్ (బి) అవేశ్ 1; జయంత్ (సి) స్మిత్ (బి) అశ్విన్ 11; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1–8, 2–37, 3–68, 4–80, 5–87, 6–109, 7–111, 8–122. బౌలింగ్: నోర్జే 4–1–19–1, అవేశ్ ఖాన్ 4–0–15–3, అశ్విన్ 4–0–41–1, రబడ 4–0– 33–0, అక్షర్ పటేల్ 4–0–21–3. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (ఎల్బీ) (బి) కృనాల్ 6; ధావన్ (రనౌట్) 8; స్మిత్ (బి) కూల్టర్ నైల్ 9; పంత్ (సి) హార్దిక్ (బి) జయంత్ 26; శ్రేయస్ (నాటౌట్) 33; అక్షర్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 9; హెట్మైర్ (సి) రోహిత్ (బి) బుమ్రా 15; అశి్వన్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–14, 2–15, 3–30, 4–57, 5–77, 6–93. బౌలింగ్: బౌల్ట్ 4–0–24–1, జయంత్ 4–0–31–1, కృనాల్ 2.1–0–18–1, బుమ్రా 4–0–29–1, కూల్టర్ నైల్ 4–0–19–1, పొలార్డ్ 1–0–9–0. -
జైశ్వాల్ కొత్త చరిత్ర.. అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు
Yashasvi Jaiswal Record Fastest 50 As Uncapped Player.. సీఎస్కేతో జరుగుతున్న మ్యచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 19 బంతుల్లోనే అర్థ సెంచరీ మార్క్ను అందుకున్న జైశ్వాల్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి ఒక అన్క్యాపడ్ ప్లేయర్ వేగవంతంగా హాఫ్ సెంచరీ చేయడం ఇది ఐదోసారి. కాగా జైశ్వాల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఇషాన్ కిషన్(2018లో కేకేఆర్పై) 17 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. ఇక మూడో స్థానంలో దీపక్ హుడా(20 బంతుల్లో, రాజస్తాన్ రాయల్స్పై, 2021); దీపక్ హుడా(22 బంతుల్లో, 2015లో ఢిల్లీ డేర్డెవిల్స్పై); కృనాల్ పాండ్యా 2016లో ఢిల్లీ డేర్డెవిల్స్పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకొని ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ సంచలన విజయం దిశగా సాగుతుంది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రాజస్తాన్ విజయానికి ఇంకా 20 పరుగుల దూరంలో ఉంది. -
ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే
Ravindra Jadeja Stunning Performance Lat Over.. సీఎస్కే ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ అంటే బాగా ఇష్టమనుకుంటా. కాకపోతే చెప్పండి.. ఎందుకంటే ఐపీఎల్ 2021 సీజన్లో జడేజా ఆఖరి ఓవర్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో జడేజా చివరి ఓవర్లో 4,4,6తో 14 పరుగులు పిండుకున్నాడు. ఇక ఇప్పటివరకు జడేజా ఈ సీజన్లో తాను ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఆఖరి ఓవర్లో 19 బంతులెదుర్కొని 64 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండడం విశేషం. ముఖ్యంగా ఈ సీజన్ తొలి అంచె పోటీల్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో జడేజా ఆఖరి ఓవర్లో నోబాల్ సహా మొత్తం 37 పరుగులు పిండుకోవడం సీజన్కే హైలెట్గా నిలిచింది. ఇదే జోరును జడేజా రానున్న టి20 ప్రపంచకప్లోనూ కనబరిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇక రాజస్తాన్ రాయల్స్తో జరగుతున్న మ్యాచ్లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 101, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో దుమ్మురేపగా.. ఆఖర్లో జడేజా 14 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్స్తో 32 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. -
ఐపీఎల్లో రుతురాజ్ డెబ్యూ సెంచరీ.. రికార్డుల మోత
Ruturaj Gaikwad Debue Century In IPL.. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో తొలి సెంచరీతో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి సెంచరీ మోత మోగించాడు. 60 బంతుల్లో 101 పరుగులు సాధించిన రుతురాజ్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు.. 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రుతురాజ్ తాను ఆడుతున్న సీఎస్కే జట్టుతో పాటు వ్యక్తిగతంగా పలు రికార్డులు సాధించాడు. ►రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ ►సీఎస్కే తరపున ఐపీఎల్లో తొమ్మిదో సెంచరీ చేసిన ఆటగాడిగా గైక్వాడ్ రికార్డు ►సీఎస్కే తరపున పిన్న వయసులో(24 ఏళ్ల 244 రోజులు) సెంచరీ కొట్టిన గైక్వాడ్ ►ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్పై ఒక ఆటగాడు సెంచరీ కొట్టడం ఇది ఏడోసారి ►ఇక సీఎస్కే తరపున సెంచరీ కొట్టిన మూడో ఆటగాడిగా గైక్వాడ్. ఇంతకముందు 2010లో మురళి విజయ్, 2018లో షేన్ వాట్సన్ సెంచరీలు సాధించారు. Courtesy: Youtube -
పొలార్డ్ కళ్లు చెదిరే త్రో.. ధావన్ పేరిట చెత్త రికార్డు
Shikar Dhawan Run Out By Pollard Stunning Throw.. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ కళ్లు చెదిరే త్రోతో మెరిశాడు. దీంతో శిఖర్ ధావన్ రనౌట్ కావడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశాడు. జయంత్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఆఖరి బంతిని ధావన్ మిడాన్ దిశగా షాట్ ఆడాడు. అయితే రిస్క్ అని తెలిసినా ధవన్ అనవసర సింగిల్కు ప్రయత్నించాడు. ఇంకేముంది అక్కడే ఉన్న పొలార్డ్ బంతిని అందుకొని డైరెక్ట్ త్రో విసిరాడు. ధవన్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు. కాగా ధవన్ రనౌట్ల విషయంలో ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 16 సార్లు రనౌట్ అయిన ధావన్.. గంభీర్తో సమానంగా తొలిస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సురేశ్ రైనా 15 సార్లు రనౌట్తో రెండో స్థానంలో.. అంబటి రాయుడు, డివిలియర్స్లు 13 సార్లు రనౌట్ అయి మూడవ స్థానంలో నిలిచారు. ఇక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. That was an Amazing Direct hit from Polly🔥#MIvsDC #MI #IPL2021 pic.twitter.com/BCFbwbSsou — MaHi 💔 (@MaHi_Shreyasian) October 2, 2021 -
వచ్చే ఏడాది ఆ కేకేఆర్ ఆటగాడు 12-14 కోట్ల ధర పలుకుతాడు..!
Venkatesh Iyer Will Fetch 12 To 14 Crores In Next Year IPL Auction: వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. ప్రస్తుత సీజన్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న అయ్యర్.. మరుసటి సీజన్ మెగా ఆక్షన్లో 12 నుంచి 14 కోట్ల ధర పలుకుతాడని అంచనా వేశాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్ అయ్యర్ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవలే వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ గణాంకాలు చూశానని.. ఫస్ట్క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్లో అతని రికార్డు అద్భుతంగా ఉందని.. 47 సగటు, 92 స్ట్రైక్రేట్తో అత్యుత్తమంగా రాణించాడని కొనియాడాడు. ఈ గణాంకాలను కొలమానంగా తీసుకుంటే అతని ఏ స్థాయి ఆటగాడో స్పష్టమవుతుందని పేర్కొన్నాడు. ఓపెనర్గా బరిలోకి దిగుతున్న అయ్యర్.. సుడిగాలి ఇన్నింగ్స్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సమర్ధుడని, కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్ చేయగల సామర్ధ్యం అతని సొంతమని ఆకాశానికెత్తాడు. బ్యాక్ ఫుట్పై అతను ఆడే పుల్ షాట్లు, కట్ షాట్లు అత్యద్భుతమని.. ఈ నైపుణ్యం అతన్ని ప్రపంచ స్థాయి బ్యాటర్ల జాబితాలో చేరుస్తుందని పేర్కొన్నాడు. మొత్తంగా అయ్యర్ తన ఆల్రౌండ్ సామర్ధ్యంతో కేకేఆర్కు తరుపు ముక్కలా మారాడని పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా, యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2021 రెండో దశలో కేకేఆర్ జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. అరంగేట్రం మ్యాచ్(27 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్)లోనే అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచాడు. ఆ తర్వాత ముంబై(30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంజాబ్(49 బంతుల్లో 67; 9 ఫోర్లు, సిక్స్) జట్లపై హాఫ్ సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. బ్యాట్తోనే కాకుండా బంతితోనూ మాయ చేసిన అతను.. ఢిల్లీ(2/29), పంజాబ్(1/30) జట్లపై వికెట్లు సాధించాడు. చదవండి: వార్నర్కు పట్టిన గతే ఆ సీఎస్కే ఆటగాడికి కూడా పడుతుంది..! -
Ravi Shastri: పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని ఏం సాధించలేదో చెప్పండి?!
Ravi Shastri Comments On MS Dhoni: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనిపై భారత జట్టు హెడ్కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్గా మిస్టర్ కూల్కు ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. ఐసీసీ ఈవెంట్లు, మేటి లీగ్ మ్యాచ్లు.. ఇలా ఎక్కడ చూసినా తనకు అద్భుత రికార్డు ఉందని కొనియాడాడు. ధోనిని కింగ్ కాంగ్గా అభివర్ణిస్తూ ఆకాశానికెత్తేశాడు. కాగా టీమిండియా కెప్టెన్గా ధోని ఖాతాలో అద్భుత విజయాలు ఉన్న సంగతి తెలిసిందే. భారత జట్టుకు ఐసీసీ టీ20 వరల్డ్కప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 అందించాడు. ఇక ఐపీఎల్లోనూ చెన్నై సూపర్కింగ్స్ సారథిగా జట్టును మూడు సార్లు విజేతగా నిలిపాడు. ఈ సీజన్లోనూ మరోసారి టైటిల్ సాధించే దిశగా ధోని సేన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన చెన్నై... తొమ్మిదింటిలో విజయం సాధించి ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్కోడ్తో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని అత్యంత గొప్ప కెప్టెన్. ఐసీసీ టోర్నమెంట్లలో అతడి రికార్డు చూడండి. అతడు ఏం గెలవలేదో చెప్పండి? ఐపీఎల్, చాంపియన్స్ లీగ్, ఐసీసీ టోర్నమెంట్లు, రెండు వరల్డ్కప్లు. ఈ ఫార్మాట్లో తన రికార్డులకు ఎవరూ చేరువగా వెళ్లలేరు. తను గ్రేటెస్ట్ కెప్టెన్. ఆట పట్ల అతడికి ఉన్న నిబద్ధతను చూసి ది కింగ్ కాంగ్ అనొచ్చు’’ అని ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్కప్ టోర్నీ నేపథ్యంలో టీమిండియాకు ధోని మెంటార్గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ధోని విలువైన సలహాలు, అనుభవం ఉపయోగించుకునేందుకు బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత హెడ్కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కళ్లు చెదిరే షాట్.. ఏంటి పృథ్వీ బంతి కనపడలేదా -
CSK Vs RR: సీఎస్కేపై రాజస్తాన్ సంచలన విజయం
సీఎస్కేపై రాజస్తాన్ సంచలన విజయం సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శివమ్ దూబే (42 బంతుల్లో 64 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ పిలిప్స్ 14 పరుగులతో సహకరించాడు. అంతకముందు జైశ్వాల్ 21 బంతుల్లోనే 50 పరుగులతో రాజస్తాన్ ఇన్నింగ్స్కు మంచి పునాది వేశాడు. శాంసన్ 28, లూయిస్ 27 పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో శార్దల్ ఠాకూర్ 2 వికెట్లు, కెఎమ్ ఆసిఫ్ ఒక వికెట్ తీశారు. సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ విజయం దిశగా సాగుతుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. జైశ్వాల్, లూయిస్ వెనుదిరిగిన తర్వాత శాంసన్తో కలిసి శివమ్ దూబే ఇన్నింగ్స్ను నడిపిస్తున్నాడు. దూబే 48, శాంసన్ 26 పరుగులతో ఆడుతున్నారు. రాజస్తాన్ విజయానికి 34 పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. 89/2 భారీ ఇన్నింగ్స్తో మెరుపులు మెరిపించిన యశస్వి జైశ్వాల్ 50 పరుగులు చేసి కెమ్ ఆసిఫ్ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. శాంసన్ 14, శివమ్ దూబే 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. 81/1 ఎవిన్ లూయిస్(27) రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన లూయిస్ హేజిల్వుడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. జైశ్వాల్ 50, శాంసన్ 4పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సీఎస్కే బౌలర్లను ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో 6,6,4,6తో 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో ఐపీఎల్లో డెబ్యూ అర్థ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ధీటుగా బదులిస్తున్న రాజస్తాన్.. 4 ఓవర్లలో 53/0 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ధీటుగా బదులిస్తుంది. ఓపెనర్లు లూయిస్, జైశ్వాల్లు ఒకరిని మించి ఒకరు ఫోర్లు, సిక్సర్లు బాదుతు స్కోరుబోర్డును పరిగెత్తిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. జైశ్వాల్ 28, లూయిస్ 25 పరుగులతో ఆడుతున్నారు. రుతురాజ్ సెంచరీ.. సీఎస్కే 20 ఓవర్లలో 189/4 రాజస్తాన్ రాయల్స్తో జరగుతున్న మ్యాచ్లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 101, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో దుమ్మురేపగా.. ఆఖర్లో జడేజా 14 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్స్తో 32 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరి దాటికి సీఎస్కే భారీ స్కోరు నమోదు చేసింది. డుప్లెసిస్ 25, మొయిన్ అలీ 21 పరుగులు చేశారు. రాజస్తాన్ బౌలర్లలో తెవాటియా 3, చేతన్ సకారియా ఒక వికెట్ తీశాడు. Photo Courtesy: IPL మొయిన్ అలీ(21) ఔట్.. సీఎస్కే 114/3 అనవసర షాట్ కోసం క్రీజ్ వదిలి ముందుకు వచ్చిన మొయిన్ అలీ(17 బంతుల్లో 21; ఫోర్, సిక్స్) స్టంప్ అవుటయ్యాడు. తెవాతియా చాకచక్యంగా బౌల్ చేసి మొయిన్ అలీని బోల్తా కొట్టించాడు. ఇప్పటివరకు చెన్నై కోల్పోయిన మూడు వికెట్లు తెవాతియా ఖాతాలోనే పడ్డాయి. 14.4 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 114/3. క్రీజ్లో రుతురాజ్ గైక్వాడ్(46 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు ఉన్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 63 పరగులు చేసింది. రుతురాజ్ 31, మొయిన్ అలీ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు డుప్లెసిస్, రైనా రూపంలో సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయింది. Photo Courtesy: IPL నిరాశపరిచిన రైనా.. సీఎస్కే 59/2 సీఎస్కే ఆటగాడు సురేశ్ రైనా మరోసారి నిరాశపరిచాడు. 3 పరుగులు చేసిన రైనా తెవాటియా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్కే 57 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లలో సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 52/1 ఓపెనర్ డుప్లెసిస్(25) రూపంలో సీఎస్కే తొలి వికెట్ను కోల్పోయింది. రాహుల్ తెవాటియా బౌలింగ్లో డుప్లెసిస్ స్టంప్ అవుట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 8 ఓవర్లో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. రుతురాజ్ 23, రైనా 3 పరుగులతో ఆడుతున్నారు. నిలకడగా ఆడుతున్న సీఎస్కే.. 6 ఓవర్లలో 44/0 రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే నిలకడైన ఆటతీరు కనబరుస్తుంది. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. రుతురాజ్ 20, డుప్లెసిస్ 24 పరుగులతో ఆడుతున్నారు. 4 ఓవర్లలో సీఎస్కే 25/0 రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. రుతురాజ్ 18, డెప్లెసిస్ 7 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఇప్పటికే సీఎస్కే 11 మ్యాచ్ల్లో 9 విజయాలు.. 2 ఓటములతో ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాగా.. రాజస్తాన్ 11 మ్యాచ్ల్లో 4 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. కాగా తొలి అంచె పోటీల్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సీఎస్కేను విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 143 పరుగులకే పరిమితమై 45 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 24సార్లు తలపడగా.. 15 సార్లు సీఎస్కే.. 9 సార్లు రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ : ఎంఎస్ ధోని (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, శార్దుల్ ఠాకూర్, కెఎమ్ ఆసిఫ్, జోష్ హాజెల్వుడ్ రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్),ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాష్ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్ -
కళ్లు చెదిరే షాట్.. ఏంటి పృథ్వీ బంతి కనపడలేదా
Prithwi Shaw Confused Didnt Find Ball.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇన్నింగ్స్ సమయంలో ఆసక్తికర ఘటన జరిగింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ రబడ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని కృనాల్ పాండ్యా మిడ్వికెట్ దిశగా కళ్లు చెదిరే షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న పృథ్వీ షాకు బంతి కనపడక దిక్కులు చూశాడు. కృనాల్ కొట్టిన వేగవంతమైన షాట్ అతనికి కాస్త దూరంగా వెళ్లినప్పటికీ అతను బంతిని మాత్రం గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత రబడ, పంత్ పృథ్వీ షావైపు చూస్తూ.. ఏంటి పృథ్వీ.. బంతి కనపడలేదా అని చెప్పగానే నవ్వులు పూశాయి. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు ముంబై బ్యాటర్స్ ఏ దశలోనూ రాణించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. చదవండి: Rohit And Pant: టాస్ సమయంలో పంత్, రోహిత్ల మధ్య ఏం జరిగింది! -
మూడుసార్లు లోస్కోరింగ్.. ముంబైకి కలిసొచ్చింది.. ఈసారి
Mumbai Indians Best Record Low Scoring Matches.. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ ఢిల్లీకి 130 పరుగుల టార్గెట్ను విధించింది. కాగా తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో ముంబైకి మంచి రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడుసార్లు లోస్కోరింగ్ మ్యాచ్లను కాపాడుకోగలిగింది. 2012లో పుణే వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 120 పరుగులు మాత్రమే చేసిన ముంబై ఆ మ్యాచ్ను గెలుచుకుంది. ఆ తర్వాత 2017లో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా రైజింగ్ పుణే జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై కాపాడుకొని టైటిల్ విజేతగా నిలిచింది. ఇక 2019లో ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో 136 పరుగుల లక్ష్యాన్ని ముంబై కాపాడుకొని మ్యాచ్ను గెలుచుకుంది. అయితే ఢిల్లీకి కూడా లోస్కోరింగ్ మ్యాచ్ల్లో మంచి రికార్డు ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 130 కంటే తక్కువ పరుగుల లక్ష్య చేధనలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. చదవండి: Rohit And Pant: టాస్ సమయంలో పంత్, రోహిత్ల మధ్య ఏం జరిగింది! Venkatesh Iyer: అయ్యారే అయ్యర్.. కేకేఆర్ తరపున రెండో బ్యాటర్గా