Kieron Pollard
-
చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్
విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్కు ముందు క్రిస్ గేల్ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్ 463 మ్యాచ్ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్ తన 690వ మ్యాచ్లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ 1056 (463 మ్యాచ్లు)కీరన్ పోలార్డ్ 901 (690 మ్యాచ్లు)ఆండ్రీ రసెల్ 727 (529 మ్యాచ్లు)నికోలస్ పూరన్ 593 (376 మ్యాచ్లు)కొలిన్ మున్రో 550 (434 మ్యాచ్లు)కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్ వైపర్స్తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్లో పోలీ 900 సిక్సర్స్ క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్లో పోలార్డ్ (ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో పోలార్డే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో పోలార్డ్ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో కుసాల్ పెరీరా 33, ముహమ్మద్ వసీం 18, టామ్ బాంటన్ 15, నికోలస్ పూరన్ 15, పోలార్డ్ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్ 16 (నాటౌట్), అకీల్ హొసేన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, డేవిడ్ పేన్, వనిందు హసరంగ, డాన్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్ జమాన్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ హేల్స్ 34, సామ్ కర్రన్ 28 పరుగులు చేసి వైపర్స్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. డాన్ లారెన్స్ (5), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో జహూర్ ఖాన్, డాన్ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్ఖీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. -
గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. పూరన్, పోలార్డ్ కూడా ఏమీ చేయలేకపోయారు..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20, 2025 ఎడిషన్ (రెండో ఎడిషన్) నిన్న (జనవరి 11) ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. దుబాయ్ క్యాపిటల్స్తో తలపడింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కు పరాభవం ఎదురైంది. తప్పక గెలుస్తుందనున్న మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ పరుగు తేడాతో ఓటమిపాలైంది. విధ్వంసకర ఆటగాళ్లు నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్ జట్టులో ఉన్నా ముంబై ఇండియన్స్ను గెలిపించలేకపోయారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దుబాయ్ ఆటగాళ్లలో బ్రాండన్ మెక్ముల్లెన్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రోవమన్ పావెల్ (25), దసున్ షనక (13), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. షాయ్ హోప్ 9, రొస్సింగ్టన్ 9, గుల్బదిన్ నైబ్ 2, ఫర్హాన్ ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూకీ (4-0-16-5) ఐదు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి దుబాయ్ క్యాపిటల్స్ను ఇబ్బంది పెట్టాడు. అల్జరీ జోసఫ్, జహూర్ ఖాన్కు తలో వికెట్ దక్కింది.స్వల్ప లక్ష్య ఛేదనలో ఎంఐ ఎమిరేట్స్ కూడా తడబడింది. ఆ జట్టు 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన జట్టును గెలిపించుకునేందుకు విఫలయత్నం చేశాడు. పూరన్కు అకీల్ హొసేన్ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కాసేపు సహకరించాడు. ఆఖరి ఓవర్లో కీరన్ పోలార్డ్ (15 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) ఎంత ప్రయత్నించినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా పోలార్డ్ బౌండరీ బాదాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. దుబాయ్ క్యాపిటల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఎంఐ ఎమిరేట్స్ 7 వికెట్ల కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్లో ముహమ్మద్ వసీం, ఆండ్రీ ఫ్లెచర్, అల్జరీ జోసఫ్ డకౌట్లు కాగా.. కుసాల్ పెరీరా 12, టామ్ బాంటన్ 7 పరుగులు చేశారు.గెలుపు దూరం చేసిన గుల్బదిన్ నైబ్, ఓల్లీ స్టోన్ఓ దశలో ఎంఐ ఎమిరేట్స్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. ఆ జట్టు 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాల్సి ఉండింది. చేతిలో ఐదు వికెట్లు ఉండేవి. ఈ దశలో గుల్బదిన్ నైబ్ (4-0-13-3, ఓల్లీ స్టోన్ (4-1-14-2) ముంబైకు గెలుపును దూరం చేశారు. 18వ ఓవర్ వేసిన గుల్బదిన్ నైబ్ రెండు కీలక వికెట్లు తీసి (పూరన్, అల్జరీ జోసఫ్) కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం 19వ ఓవర్ వేసిన ఓల్లీ స్టోన్ మరింత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ వచ్చే సరికి ముంబై గెలుపుకు 13 పరుగులు అవసరమయ్యాయి. ఫర్హాన్ ఖాన్ బౌలింగ్లో పోలార్డ్ రెండు బౌండరీలు బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఓవర్లో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీసిన గుల్బదిన్ నైబ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్: ఒక్క ఫోర్ లేదు! అన్నీ సిక్సర్లే!
వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ కీరన్ పొలార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 52 పరుగులు సాధించి సత్తా చాటాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్తో మ్యాచ్లో ఈ మేరకు తుఫాన్ ఇన్నింగ్స్తో అలరించాడు.రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీకాగా సీపీఎల్ తాజా ఎడిషన్లో పొలార్డ్ ట్రిన్బాగో నైట్ రైడర్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సెయింట్ లూసియా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన లూసియా కింగ్స్ సొంత మైదానంలో మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 34), జె.చార్ల్స్(14 బంతుల్లో 29) శుభారంభం అందించగా.. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన చేజ్ 40 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా భనుక రాజపక్స(29 బంతుల్లో 33) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. ట్రిన్బాగో బౌలర్లలో సునిల్ నరైన్, వకార్ సలామ్ఖీల్ రెండేసి వికెట్లు తీయగా.. టెర్రాన్స్ హిండ్స్, పొలార్డ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆకాశమే హద్దుగా పొలార్డ్ఈ క్రమంలో లూసియా కింగ్స్ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన ట్రిన్బాగోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జేసన్ రాయ్(15 బంతుల్లో 16), సునిల్ నరైన్(8 బంతుల్లో 14) విఫలమయ్యారు. అయితే, వన్డౌన్ బ్యాటర్ షకెరె పారిస్ 33 బంతుల్లో 57 పరుగులతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.సిక్సర్ల వర్షంమిగతా వాళ్లలో నికోలస్ పూరన్(17), కేసీ కార్టీ(15) పూర్తిగా నిరాశపరచగా.. పొలార్డ్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఈ ఆల్రౌండర్. ఏడు సిక్సర్ల సాయంతో 19 బంతుల్లోనే 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పందొమ్మిదో ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆఖరి ఓవర్లో అకీల్ హొసేన్ ఫోర్ బాదడంతో.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ట్రిన్బాగో గెలుపు ఖరారైంది. లూయిస్ కింగ్స్పై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిసిన కీరన్ పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.సెయింట్ లూయీస్ వర్సెస్ ట్రిన్బాగో నైట్ రైడర్స్ స్కోర్లులూయీస్ కింగ్స్- 187/6 (20 ఓవర్లు)నైట్ రైడర్స్- 189/6 (19.1 ఓవర్లు)ఫలితం- కింగ్స్పై నాలుగు వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ విజయం.టాప్లో అమెజాన్ వారియర్స్కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో గయానా అమెజాన్ వారియర్స్ మూడు విజయాల(ఆరు పాయింట్లు)తో పట్టికలో టాప్లో ఉండగా.. బార్బడోస్ రాయల్స్ రెండింట రెండు గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ట్రిన్బాగో నైట్ రైడర్స్మూడింట రెండు గెలిచి మూడు, ఆంటిగ్వా-బర్బుడా ఫాల్కన్స్ ఆరింట రెండు గెలిచి నాలుగు, సెయింట్ లూసియా కింగ్స్ నాలుగింట రెండు గెలిచి ఐదు, సెయింట్ కిట్స్- నెవిస్ పేట్రియాట్స్ ఆరింట ఒకటి గెలిచి అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: హిట్మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే..! Kieron Pollard is awarded @Dream11 MVP! Well done Polly 🙌🏾 #CPL24 #SLKvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Dream11 pic.twitter.com/AASf9KO7mC— CPL T20 (@CPL) September 11, 2024 -
వరుసగా ఐదు సిక్సర్లు.. రషీద్ ఖాన్కు చుక్కలు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్
హండ్రెడ్ లీగ్లో సథరన్ బ్రేవ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఆగస్ట్ 10) ట్రెంట్ రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ బౌలింగ్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన పోలార్డ్.. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు రెండుసార్లు బాదిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్కు ముందు పోలార్డ్ శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ టీ20లో అఖిల ధనంజయం బౌలింగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తాజాగా రషీద్ ఖాన్ బౌలింగ్లో ఓ సెట్లో (హండ్రెడ్ లీగ్లో ఐదు బంతులను ఓ సెట్గా పరిగణిస్తారు) ఐదుకు ఐదు సిక్సర్లు కొట్టాడు. పొట్టి క్రికెట్లో రషీద్ను ఈ స్థాయిలో చితక్కొట్టిన బౌలర్ కూడా లేడు. ఈ మ్యాచ్కు ముందు రషీద్ బౌలింగ్లో ఓ ఓవర్లో అత్యధికంగా నాలుగు సిక్సర్లు మాత్రమే వచ్చాయి. Kieron Pollard against yellow teams. 🥶- Rashid Khan taken to the cleaners, 5 sixes in a row. 🤯pic.twitter.com/CjrB63JwWD— Mufaddal Vohra (@mufaddal_vohra) August 11, 20242016 టీ20 వరల్డ్కప్లో ఏబీ డివిలియర్స్ రషీద్ బౌలింగ్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. 2018 ఐపీఎల్లో క్రిస్ గేల్, 2023 సౌతాఫ్రికా టీ20 లీగ్లో మార్కో జన్సెన్, 2024 ఐపీఎల్లో విల్ జాక్స్ రషీద్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదారు.మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో నిదానంగా ఇన్నింగ్స్ను ప్రారంభించిన పోలార్డ్.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఒక్కసారిగా గేర్ మార్చి సిక్సర్ల వర్షం కురిపించాడు. 127 పరుగుల ఛేదనలో 14 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసిన పోలార్డ్.. రషీద్ వేసిన 16వ సెట్లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఐదు సిక్సర్లు బాదాడు. 20 బంతుల్లో తన జట్టు విజయానికి 49 పరుగులు అవసరం కాగా.. పోలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ బౌలింగ్ను ఊచకోత కోసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 23 బంతులు ఎదుర్కొన్న పోలార్డ్ 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. పోలార్డ్ విధ్వంసం ధాటికి బ్రేవ్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. -
కిరాన్ పొలార్డ్ విధ్వంసం.. వరుసగా 5 సిక్స్లు! వీడియో వైరల్
ది హండ్రెడ్ లీగ్-2024లో శనివారం సౌతాంప్టన్ వేదికగా ట్రెంట్ రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో సదరన్ బ్రేవ్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సదరన్ బ్రేవ్ ఆల్-రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు.127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సదరన్ బ్రేవ్ 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్ తొలుత కాస్త ఆచితూచి ఆడాడు. బౌలర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు.ఒకనొక దశలో 14 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్రౌండర్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అభిమానులకు విసుగు తెప్పించాడు. ఆఖరి 20 బంతుల్లో సదరన్ బ్రేవ్ విజయానికి 49 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో అప్పటివరకు జిడ్డు బ్యాటింగ్ చేసిన పొలార్డ్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ట్రెంట్ రాకెట్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను పొలార్డ్ ఊచకోత కోశాడు. 16వ సెట్ బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో పొలార్డ్ వరుసగా 5 సిక్స్లు బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఓవరాల్గా ఈ మ్యాచ్లో 23 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్.. 2 ఫోర్లు, 5 సిక్స్లతో 45 పరుగులు చేశాడు. 127 పరుగుల లక్ష్యాన్ని 99 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. View this post on Instagram A post shared by Southern Brave (@southernbrave) -
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉన్నా ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచ్లలో భాగమైన బుమ్రా.. 18 వికెట్లు కూల్చాడు.తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం(మే 7 నాటికి) అగ్రస్థానంలో నిలిచి.. పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం నాటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే.ఆశలు సజీవమేవాంఖడే వేదికగా హైదరాబాద్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ముంబై.. ఈ సీజన్లో నాలుగో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ అధికారికంగా ముంబై ఇంకా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించలేదు.ఇక ఇప్పటికి 12 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్కు లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ప్లే ఆఫ్స్ చేరితే సంగతి వేరు!కాగా మే 26 నాటి ఫైనల్తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జూన్ 5న టీమిండియా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలిఈ నేపథ్యంలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం విశ్రాంతినివ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అసిస్టెంట్ కోచ్ కీరన్ పొలార్డ్కు సోమవారం ప్రశ్న ఎదురైంది.కుదరదుఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంపై నేను స్పష్టతనివ్వలేను. అయితే, మేమంతా ఇక్కడున్నది సీజన్ ఆసాంతం సేవలు అందించడానికే! ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేము. వరల్డ్కప్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడటం అనవసరం. ఇలాంటివి ప్రస్తుత ప్రదర్శనలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. బుమ్రాకు ప్రస్తుతం విశ్రాంతినిచ్చే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
ధోని 3 సిక్స్లు బాదాడు.. అయితే ఏంటి?: పొలార్డ్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని గురించి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఖరి ఓవర్లో ఎవరైనా హిట్టింగ్ ఆడటం సహజమేనని.. అదేమీ గొప్ప విషయం కాదన్నాడు. ముఖ్యంగా ధోని లాంటి వరల్డ్క్లాస్ ప్లేయర్ల నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడాన్ని బౌలర్ తప్పిదంగా చూడలేమని పొలార్డ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం చెన్నై జట్టుతో తలపడింది. సొంతమైదానం వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు చెత్త ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. గెరాల్డ్ కొయెట్జీ(1/35), జస్ప్రీత్ బుమ్రా(0/27) కాస్త మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేయగా.. హార్దిక్ పాండ్యా(2/43), రొమారియో షెఫర్డ్(0/33). ఆకాశ్ మధ్వాల్ (0/37) మాత్రం చెత్తగా ఆడారు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 సీఎస్కే ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్ వేసిన పాండ్యా బౌలింగ్లో ధనాధన్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లతో దుమ్ములేపాడు. పాండ్యా సంధించిన బంతులను లాంగాఫ్, లాంగాన్, డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్లుగా మలిచి.. మరో రెండు రన్స్ చేసి.. 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ముంబై 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బౌలర్గా, బ్యాటర్(6 బంతుల్లో 2), కెప్టెన్గా విఫలమైన హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అతడి బౌలింగ్లో ధోని సిక్సర్లు హైలైట్ కావడంతో.. ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ భిన్నంగా స్పందించాడు. ‘‘అవును.. అతడు మూడు సిక్సర్లు కొట్టాడు. చివరి ఓవర్లో 20 పరుగులు తీశాడు. అయితే, ఆఖరి ఓవర్లో ఎవరైనా 20 పరుగులు సాధించగలరు కదా! అందులో వింతేముంది? ఇక ఎంఎస్ చాలా ఏళ్లుగా వరల్డ్క్లాస్ క్రికెటర్గా కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటంలో ఆశ్చర్యం లేదు. అతడు మైదానంలో అడుగుపెట్టి షాట్లు బాదుతుంటే చూడటాన్ని మేము కూడా ఆస్వాదిస్తాం. అయితే, ఈరోజు ధోనిని పెవిలియన్కు చేర్చేందుకు మేము రచించిన వ్యూహాలు ఫలితాన్నివ్వలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. కాగా ముంబైపై సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ ‘బేబీ మలింగ’ మతీశ పతిరణ(4/28)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: #Hardik Pandya: అతడిదంతా నటన! ధోని సిక్సర్లు కొడుతుంటే అలా.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#MI: హార్దిక్ రాగానే కోపంగా వెళ్లిపోయిన మలింగ! పొలార్డ్ సైతం..
ముంబై ఇండియన్స్ మ్యాచ్ అంటే చాలు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే ట్రెండింగ్లోకి వస్తున్నాడు. సారథిగా తప్పిదాలు చేయడమే గాకుండా.. సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడంటూ నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడినపుడు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్ను పాండ్యా పదే పదే మారుస్తూ అతడిని పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. ప్రధాన పేసర్, ఎంఐ సీనియర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని తానే బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ ఏడో స్థానంలో వచ్చి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తాజాగా ఉప్పల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనూ ఓటమి పాలైంది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో 31 రన్స్ తేడాతో ప్రత్యర్థి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక్కడ కూడా పాండ్యా.. అరంగేట్ర క్వెనా మఫాకాతో ముంబై బౌలింగ్ ఎటాక్ను ఆరంభించాడు. మరోసారి.. బుమ్రాను పక్కనపెట్టి మూల్యం చెల్లించాడు. Hardik didn't even tried to stop Malinga from getting up and leaving the chair for him. Look at the face of Pollard even he is not comfortable. Pandya doesn't know how to respect seniors. He could have brought new chair 😡😡#MIvsSRH #SRHvMI #RohitSharma𓃵 #klaasen #HardikPandya pic.twitter.com/araISohypL — Rishabh (@iamrishabhNP) March 27, 2024 ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో పాండ్యా ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. మ్యాచ్ అనంతరం కరచాలనం చేస్తున్న సమయంలో మలింగను నెట్టివేసినంత పనిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అనంతరం మరో వీడియో కూడా తెరమీదకు వచ్చింది. ఇందులో బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్, మలింగ కుర్చీల్లో కూర్చుని ఉండగా.. హార్దిక్ అక్కడికి వచ్చాడు. ఇద్దరూ అక్కడి నుంచి లేచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పొలార్డ్ను చెయ్యిపట్టి ఆపిన మలింగ.. కుర్చీ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 ఆ తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న పాండ్యా పొలార్డ్తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అతడు కూడా ముభావంగా ఉన్నట్లు కనిపించింది. ఏదేమైనా.. ముంబై ఇండియన్స్లో ఇప్పుడు పాండ్యా పెత్తనమే నడుస్తోందని.. ఇది ఎవరికీ మింగుడుపడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Im the captain 💙 HARDIK 😎 Give me my chair 🪑 #HardikPandya #pollard#malinga#SRHvMI #MIvsSRH pic.twitter.com/gixxZFj7Qn — கீரிபுள்ள 2.0❤️🔥MSD 💛CSK 💛AMARAN🤓 (@ssv__remo) March 27, 2024 -
#MI: బుమ్రాను వద్దన్నారా?.. అందులో తప్పేముంది?
‘‘జట్టుగా ముందుకు వెళ్లాలనుకున్నపుడు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా హార్దిక్ గుజరాత్ తరఫున బౌలింగ్ ఎటాక్ ఆరంభిస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే. కొత్త బంతిని అతడు బాగా స్వింగ్ చేయగలడు. ఇందులో కొత్తేమీ లేదు. న్యూ బాల్తో కలిగే ప్రయోజనాలను మేము అందిపుచ్చుకోవాలనుకున్నాం. హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నపుడు నాకేమీ తప్పుగా అనిపించలేదు. అందుకే అలాగే ముందుకు వెళ్లాం’’ అని ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ అన్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. కాగా ఐపీఎల్-2024ను పరాజయంతో మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్. అహ్మదాబాద్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ముంబై కెప్టెన్గా తొలి మ్యాచ్లో హార్దిక్ ఖాతాలో పరాజయం చేరింది. ఈ నేపథ్యంలో గుజరాత్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్క్లాస్ పేసర్ ఉండగా.. ఆల్రౌండర్ పాండ్యా బౌలింగ్ ఎటాక్ ఆరంభించడమేమిటని మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల సేవలను సరిగ్గా వినియోగించుకుంటునే అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చని పాండ్యాకు హితవు పలుకుతున్నారు. అదే విధంగా.. లక్ష్య ఛేదనలో భాగంగా హార్దిక్ పాండ్యా ఏడోస్థానంలో రావడాన్ని విమర్శిస్తున్నారు. ఈ విషయాలపై స్పందించిన కోచ్ కీరన్ పొలార్డ్ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. కొత్త బంతితో హార్దిక్ బరిలోకి దిగడం సరైందేననన్న పొలార్డ్.. ఏడో స్థానంలో బ్యాటింగ్కు రావాలన్నది హార్దిక్ ఒక్కడి నిర్ణయం కాదని తెలిపాడు. ‘‘ఏ డెసిషన్ అయినా కలిసే తీసుకుంటాం. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. టాపార్డర్ చివరి వరకు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. అలా కాని పక్షంలో.. టాప్, మిడిలార్డర్ విఫలమైతే పవర్ హిట్టర్లను కాస్త ఆలస్యంగా పంపిస్తాం. చాలాసార్లు టిమ్ డేవిడ్ మా మ్యాచ్ను ఫినిష్ చేయడం చూసే ఉంటారు. హార్దిక్ కూడా చాలా ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. ఆటలో ఇవన్నీ సహజం. ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. నిన్న మాత్రం మా వ్యూహాలు సత్ఫలితాలను ఇవ్వలేదంతే’’ అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు. చదవండి: #Hardik Pandya: నువ్వేమైనా ధోని అనుకున్నావా?.. నీకిది అవసరమా?: షమీ A game of ᴇʙʙꜱ & ꜰʟᴏᴡꜱ 🫡@gujarat_titans display quality death bowling to secure a remarkable 6️⃣ run win over #MI 👏@ShubmanGill's captaincy starts off with with a W Scorecard ▶️https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/jTBxANlAtk — IndianPremierLeague (@IPL) March 24, 2024 -
పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్లో షాహీన్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్లో భాగంగా శనివారం లాహోర్ ఖలందర్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. చివరి బంతికి మీర్ హంజా సింగిల్ తీసి కరాచీని గెలిపించాడు. అయితే 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కరాచీ ఆటగాడు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదుకు దాడికి దిగాడు. మరో ఎండ్లో ఉన్న షోయబ్ మాలిక్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కిరాన్ కేవలం 33 బంతుల్లోనే 5 సిక్స్లు, ఒక ఫోరుతో 58 పరుగులు చేశాడు. అయితే కరాచీ ఇన్నింగ్స్ 16 ఓవర్లో షాహీన్ అఫ్రిది.. అద్భుత బంతితో పొలార్డ్ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మాలిక్ కూడా ఔట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ లాహోర్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో కరాచీ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది.. ఆఫ్ స్పిన్నర్ ఆషాన్ బట్టికి అప్పగించాడు. ఇదే షాహీన్ చేసిన తప్పిదం. చివరి ఓవర్లో తొలి బంతినే హసన్ అలీ సిక్సర్గా మలిచాడు. దీంతో కరాచీ విజయసమీకరణం 5 బంతుల్లో 5 పరుగులగా మారిపోయింది. ఆ తర్వాత ఐదో బంతికి హసన్ అలీ ఔటైనప్పటికీ.. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ మీర్ సింగిల్ తీసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఇది చూసిన అఫ్రిది తలను పట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లహోర్ ఓన సాహిబ్జాదా ఫర్హాన్(72) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కరాచీ బౌలర్లలో మీర్ హంజా, షంసీ, హసన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. -
పూనకాలు తెప్పించిన పోలార్డ్.. బాబర్ వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో కరాచీ కింగ్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర యోధుడు కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. పెషావర్ జల్మీతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో పూర్వంలా పూనకాలు తెప్పించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 49 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. 𝑽𝒊𝒏𝒕𝒂𝒈𝒆 𝑷𝒐𝒍𝒍𝒚 𝒊𝒏 𝑷𝑺𝑳 𝟐𝟎𝟐𝟒🔥 📸: Fan Code pic.twitter.com/uUMO58x5Sj — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది బ్యాటర్ బాబర్ ఆజమ్ (పెషావర్) వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఈ మ్యాచ్లో 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసిన బాబర్.. టీ20ల్లో అత్యంత వేగంగా (271 ఇన్నింగ్స్ల్లో) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. He's still got it 🥶pic.twitter.com/kthsVbhdf3 — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్తో పాటు జేమ్స్ విన్స్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ అక్లక్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) రాణించడంతో పెషావర్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కరాచీ 16.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ (3.5-1-20-2) ఒక్కడే కరాచీ బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాడు. సలాంకీల్ వికెట్ తీసినప్పటికీ (4-0-54-1) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఆజమ్ (72) రాణించడంతో 154 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ (19.5 ఓవర్లలో ఆలౌట్) చేయగలిగింది. పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్తో పాటు రోవ్మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు, డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ముంబై ఇండియన్స్ విచిత్ర పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్లో ఒకలా మరో, మరో లీగ్లో ఇంకోలా ఆడుతున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్ కేప్టౌన్ వరుస పరాజయాలు (10 మ్యాచ్ల్లో 7 ఓటములు) చవిచూసి, లీగ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు నిలువగా.. ఇంటర్నేషనల్ లీగ్కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు వరుస విజయాలతో (8 మ్యాచ్ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్ కీరన్ పోలార్డ్ నేతృత్వంలో బరిలో నిలువగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఎంఐ ఎమిరేట్స్ నికోలస్ పూరన్ సారథ్యంలో పోటీలో ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన మ్యాచ్లో డెజర్ట్ వైపర్స్పై విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్.. డెజర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధసెంచరీతో (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్), అంబటి రాయుడు (38 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో కెప్టెన్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్తో (15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ అమిర్ 2, సౌటర్, హసరంగ, పతిరణ తలో వికెట్ పడొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వైపర్స్ టాపార్డర్ అంతా విఫలం కావడంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకర హిట్టర్లు అలెక్స్ హేల్స్ (6), కొలిన్ మున్రో (7) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అలీ నసీర్ (63 నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. అతనికి లూక్ వుడ్ (30) తోడైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైపర్స్ను ఎంఐ బౌలర్ ఫజల్ హక్ ఫారూకీ (4-0-31-4) దెబ్బ తీశాడు. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్ మరో రెండు లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా లీగ్ విషయానికొస్తే.. నిన్న ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓటమితో ఈ లీగ్లో ఎంఐ కేప్టౌన్ కథ ముగిసింది. -
లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల మెరుపు ఇన్నింగ్స్.. ఎంఐ ఖేల్ ఖతం
MI Cape Town vs Pretoria Capitals- MI Cape Town knocked out: సౌతాఫ్రికా టీ20 లీగ్-2-24లో ఎంఐ కేప్టౌన్ ప్రయాణం ముగిసింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా క్యాపిటల్స్తో శనివారం నాటి మ్యాచ్లో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేప్టౌన్ వేదికగా న్యూలాండ్స్లో క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వాన్ డర్ డసెన్(46 బంతుల్లో 60), రెకెల్టన్(35) శుభారంభం అందించగా.. మిడిలార్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది. వన్డౌన్ బ్యాటర్ లివింగ్స్టోన్(6), సామ్ కరన్(3), డెవాల్డ్ బ్రెవిస్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే చేతులెత్తేయగా.. కీరన్ పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్రౌండర్ 33 పరుగులు సాధించాడు. మిగతవాళ్లులో ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. క్యాపిటల్స్(PC: Twitter) దంచికొట్టిన లోయర్ ఆర్డర్ ప్లేయర్లు ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎంఐ కేప్టౌన్ 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో కెప్టెన్ వేన్ పార్నెల్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు, ఈథన్ బాష్ రెండు, అకెర్మాన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 𝙃𝙤𝙬 𝙩𝙤 𝙚𝙣𝙙 𝙖𝙣 𝙞𝙣𝙣𝙞𝙣𝙜𝙨. 𝘼 𝙋𝙖𝙧𝙣𝙚𝙡𝙡 𝙈𝙖𝙨𝙩𝙚𝙧𝙘𝙡𝙖𝙨𝙨.#Betway #SA20 #WelcomeToIncredible #MICTvPC pic.twitter.com/3BtcGws1Fb — Betway SA20 (@SA20_League) February 3, 2024 ఇక లక్ష్య ఛేదనకు దిగిన 19.4 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసింది. టాపార్డర్ విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ఆటగాళ్లు దంచికొట్టడంతో ప్రిటోరియాకు ఈ విజయం సాధ్యమైంది. ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన తునిస్ డి బ్రూయిన్ 33 బంతుల్లో 42 పరుగులతో చెలరేగగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సెనూరన్ ముత్తుస్వామి 18 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ పార్నెల్ కూడా మెరుపు ఇన్నింగ్స్(6 బంతుల్లో 12) ఆడాడు. కేప్టౌన్ రాతమారలేదు దీంతో నాలుగు వికెట్ల తేడాతో ఎంఐ కేప్టౌన్పై గెలిచిన ప్రిటోరియా క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. పొలార్డ్ బృందం మాత్రం గతేడాది తరహాలోనే నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఈస్టర్న్కేప్, పర్ల్ రాయల్స్, డర్బన్ సూపర్జెయింట్స్ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాయి. క్యాపిటల్స్తో పాటు సూపర్ కింగ్స్ కూడా నాలుగో స్థానం కోసం పోటీపడుతోంది. -
కీరన్ పొలార్డ్ ఊచకోత.. కేవలం 7 బంతుల్లోనే
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పోలార్డ్ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ఏంఐ కేప్టౌన్కు సారథ్యం వహిస్తున్న పొలార్డ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ లీగ్లో భాగంగా గురువారం ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి ప్రిటోరియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 7 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్లతో 27 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతేకాకుండా బౌలింగ్లో కూడా ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఏంఐ కేప్టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా ప్రిటోరియా బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. -
94 నాటౌట్.. ఎంఐ కేప్టౌన్ ఘన విజయం! పొలార్డ్ ప్రశంసలు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న పర్ల్ రాయల్స్కు ఎంఐ కేప్టౌన్ షాకిచ్చింది. సీజన్ ఆరంభం నుంచి వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన మిల్లర్ బృందానికి తొలి ఓటమిని రుచి చూపించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రియాన్ రెకెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో కేప్టౌన్కు ఈ విజయం సాధ్యమైంది. సొంత మైదానం న్యూల్యాండ్స్లో శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఎంఐ కేప్టౌన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్ ఆల్రౌండర్ థామస్ కెబర్ మూడు కీలక వికెట్లు తీసి పర్ల్ రాయల్స్ను దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఓలీ స్టోన్, జార్జ్ లిండే, కగిసో రబడ, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పర్ల్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో ఎంఐ కేప్టౌన్కు ఓపెనర్లు రాసీ వాన్ డర్ డసెన్(28 బంతుల్లో 41), రియాన్ రెకెల్టన్ అద్భుత ఆరంభం అందించారు. రెకెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక.. వన్డౌన్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్(10) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ కానర్(17*), రియాన్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఎంఐ కేప్టౌన్.. పర్ల్ రాయల్స్ మీద 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. రియాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గెలుపు అనంతరం ఎంఐ కేప్టౌన్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘‘మంచి ఆరంభం ఇవ్వాలని ఓపెనర్లకు చెప్పాము. రెకెల్టన్ అద్భుతం చేశాడు. అతడికి మేము అవకాశం ఇచ్చాం. పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిభకు ఆకాశమే హద్దు’’ అంటూ రియాన్ రెకెల్టన్ను ప్రశంసించాడు. -
IPL 2024: పొలార్డ్ పోస్ట్ వైరల్.. మళ్లీ రోహిత్ శర్మనే దిక్కవుతాడా?
ఐపీఎల్-2024కు ముందు కెప్టెన్ను మారుస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రోహిత్ శర్మనే సారథిగా కొనసాగించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు మాజీ ఆల్రౌండర్, ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఇన్స్టా పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. విశ్వసనీయత కూడా అంతే.. భారమైపోతుంది ‘‘ఒక్కసారి వర్షం కురిసి వెలిసిపోయాక.. ప్రతి ఒక్కరికి తాము పట్టుకున్న గొడుగు భారంగానే అనిపిస్తుంది. విశ్వాసం కూడా అంతే! ఎప్పుడైతే లబ్ది చేకూరడం ఆగిపోతుందో అప్పుడే విశ్వసనీయత కూడా చెల్లిపోతుంది’’ అన్న అర్థంలో పొలార్డ్ ఓ కోట్ షేర్ చేశాడు. ఇందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించడాన్ని ఉద్దేశించే పొలార్డ్ ఈ పోస్ట్ పెట్టాడని హిట్మ్యాన్ ఫ్యాన్స్ భావిస్తుండగా.. రోహిత్ తనకు తానుగా తప్పుకొన్నాడు కాబట్టి ఇరు వర్గాలను ఉద్దేశించి పొలార్డ్ ఇలా అంటున్నాడని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. పాండ్యాను రప్పించి.. కెప్టెన్గా నియమించి కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పాండ్యా కోసం భారీ మొత్తం చెల్లించిన ముంబై.. అతడిని తమ కెప్టెన్గా నియమిస్తూ సంచలన ప్రకటన చేసింది. ఐదుసార్లు ముంబైని చాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మను తప్పిస్తూ.. సారథ్య బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. దీంతో సొంత అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఫాలోవర్లను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్గా నియమితుడైన పాండ్యా గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. రోహిత్ శర్మనే మళ్లీ దిక్కవుతాడా? ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మనే మళ్లీ దిక్కవుతాడా? లేదంటే కొత్త వాళ్లకు పగ్గాలు అప్పగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంఛైజీ ఎంఐ కేప్టౌన్కు కీరన్ పొలార్డ్ను ముంబై తమ సారథిగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆదివారం ధ్రువీకరించింది. Kieron Pollard's Instagram story. pic.twitter.com/4fyml5GPf7 — Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024 -
కెప్టెన్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్ల కోసం తమ అనుబంధ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్ కేప్టౌన్, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్లకు కెప్టెన్లను ప్రకటించింది. ఎంఐ కేప్టౌన్కు (SA20 2024) కీరన్ పోలార్డ్, ఎంఐ ఎమిరేట్స్కు (ILT20 2024) నికోలస్ పూరన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని ముంబై యాజమాన్యం ఇవాళ వెల్లడించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుండగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఈ నెల 19 నుంచి మొదలవుతుంది. కాగా, కీరన్ పోలార్డ్ అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో కూడా ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ ఇటీవల తమ కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ముంబై ఇండియన్స్ను ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్ల తర్వాత మే నెలలో ఐపీఎల్ 2024 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఎడిషన్లో అట్టడుగు స్థానంలో నిలిచి ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపర్చిన ముంబై ఇండియన్స్ ఈసారి కొత్త జట్టుతో ఉత్సాహంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా పేస్ గన్ గెరాల్డ్ కోయెట్, లంక పేసర్ దిల్షాన్ మధుశంకను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్లో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు.. రోహిత్ శర్మ బ్యాట్స్మన్ 16 కోట్లు జస్ప్రీత్ బుమ్రా బౌలర్ 12 కోట్లు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్మన్ 8 కోట్లు ఇషాన్ కిషన్ బ్యాట్స్మన్ 15.25 కోట్లు డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్స్మన్ 3 కోట్లు తిలక్ వర్మ బ్యాట్స్మెన్ 1.7 కోట్లు హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 15 కోట్లు (కెప్టెన్) టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ 8.25 కోట్లు అర్జున్ టెండూల్కర్ బౌలర్ 30 లక్షలు కుమార్ కార్తికేయ బౌలర్ 20 లక్షలు జాసన్ బెహ్రెన్డార్ఫ్ బౌలర్ 75 లక్షలు ఆకాష్ మధ్వల్ బౌలర్ 20 లక్షలు విష్ణు వినోద్ వికెట్ కీపర్ 20 లక్షలు రొమారియో షెపర్డ్ ఆల్ రౌండర్ 50 లక్షలు షామ్స్ ములానీ ఆల్ రౌండర్ 20 లక్షలు నేహాల్ వధేరా బ్యాటర్ 20 లక్షలు పీయూష్ చావ్లా బౌలర్ 50 లక్షలు గెరాల్డ్ కోయెట్జీ ఆల్ రౌండర్ 5 కోట్లు దిల్షాన్ మధుశంక బౌలర్ 4.6 కోట్లు శ్రేయాస్ గోపాల్ బౌలర్ 20 లక్షలు నువాన్ తుషార బౌలర్ 4.8 కోట్లు నమన్ ధీర్ ఆల్ రౌండర్ 20 లక్షలు అన్షుల్ కాంబోజ్ బౌలర్ 20 లక్షలు మహ్మద్ నబీ ఆల్ రౌండర్ 1.5 కోట్లు శివాలిక్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు -
ఇంగ్లండ్ జట్టు అసిస్టెంట్ కోచ్గా కీరన్ పొలార్డ్..
టీ20 వరల్డ్కప్-2024కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు అసిస్టెంట్ కోచ్గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ను నియమించింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్ అమెరికా, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న నేపథ్యంలో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. "వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పొలార్డ్ నియమితులయ్యారు. పొలార్డ్కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. టీ20 వరల్డ్కప్- 2012 విజయంలో పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో 600 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. అటువంటి లెజెండరీ క్రికెటర్తో ఒప్పందం కుదర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని ఇంగ్లండ్ వెల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన పొలార్డ్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు. అయితే అంతర్జాతీయ స్ధాయిలో కోచ్గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఇక 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్తో అరంగేట్రం చేసిన పొలార్డ్ 15 ఏళ్ల పాటు విండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 123 వన్డేలు, 101 టీ20లు ఆడిన పొలార్డ్.. వరుసగా 2,706, 1569 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 3 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. -
IPL 2024: ముంబై ఇండియన్స్ ప్రకటన.. అతడితో తెగదెంపులు! కొత్త కోచ్గా..
IPL 2024- Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్-2024 సీజన్లో తమ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్లుగా ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను నియమించుకున్నట్లు వెల్లడించింది. గతంలో వీరిద్దరు ముంబై ఇండియన్స్కు ఆడినవారే కావడం విశేషం. బ్యాటింగ్ కోచ్గా విండీస్ దిగ్గజం కాగా తమ బ్యాటింగ్ కోచ్గా ముంబై ఫ్రాంఛైజీ ఇప్పటికే వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగను తమ బౌలింగ్ కోచ్గా ఎంచుకున్నట్లు తెలిపింది. నాకు దక్కిన గౌరవం: బౌలింగ్ కోచ్ మలింగ ఇక తన నియామకంపై స్పందించిన మలింగ.. ‘‘ఇప్పటికే ఎంఐ న్యూయార్క్, ఎంఐ కేప్టౌన్లతో నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా నియమితుడిని కావడం గొప్పగా అనిపిస్తోంది. పోలీ, రోహిత్, మార్క్లతో పాటు జట్టు మొత్తానికి మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం వస్తుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంతో నాకు కొత్త అనుబంధం ఏర్పడుతుంది. ప్రతిభావంతులైన యువ బౌలర్లకు మార్గదర్శనం చేయడం నాకు దక్కిన గౌరవం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. షేన్ బాండ్తో తెగదెంపులు కాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా లసిత్ మలింగ షేన్ బాండ్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. తొమ్మిదేళ్లపాటు ముంబై ఇండియన్స్ కోచ్గా వ్యవహరించిన న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్తో ఫ్రాంఛైజీ తెగదెంపులు చేసుకున్న తరుణంలో మలింగకు ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన ముంబై జట్లలో సభ్యుడు ఇక ఆటగాడిగా మలింగ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. 2008 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్కి ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో భాగంగా 122 మ్యాచ్లు ఆడి రికార్డు స్థాయిలో 170 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 2013, 2015, 2017, 2019లో ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడైన మలింగ ఖాతాలో నాలుగు టైటిళ్లు ఉన్నాయి. ఇక ప్లేయర్గా 2021లో రిటైరైన తర్వాత మలింగ బౌలింగ్ కోచ్గా అవతారమెత్తాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు 2022, 2023 సీజన్లలో పేస్ బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. ఇప్పుడు ముంబై క్యాంపులో పునరాగమనం చేయనున్నాడు. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి 𝗕𝗔𝗧𝗧𝗜𝗡𝗚 𝗖𝗢𝗔𝗖𝗛 - 🄿🄾🄻🄻🄰🅁🄳 𝗕𝗢𝗪𝗟𝗜𝗡𝗚 𝗖𝗢𝗔𝗖𝗛 - 🄼🄰🄻🄸🄽🄶🄰 Paltan, आता कसं वाटतय? 🤩#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan @malinga_ninety9 @KieronPollard55 pic.twitter.com/bdPWVrfuDy — Mumbai Indians (@mipaltan) October 20, 2023 -
రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్కు చేరిన పోలార్డ్ టీమ్
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో విండీస్ దిగ్గజ ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ నేతృత్వం వహిస్తున్న ట్రిన్బాగో నైట్రైడర్స్ జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్కు చేరింది. ఈ లీగ్లో నైట్రైడర్స్తో పాటు అమెజాన్ వారియర్స్ కూడా ఐదుసార్లు ఫైనల్స్కు చేరినప్పటికీ, ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. అయితే నైట్రైడర్స్ ఇప్పటివరకు ఆడిన నాలుగు ఫైనల్స్లో విజయాలు సాధించి, రికార్డు స్థాయిలో ఐదో టైటిల్పై కన్నేసింది. సీపీఎల్లో అత్యధిక టైటిల్స్ (4) రికార్డు నైట్రైడర్స్ పేరిటే ఉంది. నైట్రైడర్స్ తర్వాత జమైకా తల్లావాస్ మూడు సార్లు, బార్బడోస్ రాయల్స్ రెండు సార్లు, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఓసారి సీపీఎల్ టైటిల్ సాధించాయి. ప్రస్తుతం జరుగుతున్న 2023 ఎడిషన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన నైట్రైడర్స్, క్వాలిఫయర్ 1లో గయానా అమెజాన్ వారియర్స్పై విజయం సాధించి, నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో ఆ జట్టు అమెజాన్ వారియర్స్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. సైమ్ అయూబ్ (49), అజమ్ ఖాన్ (36) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. నైట్రైడర్స్ బౌలర్లలో వకార్ సలామ్ఖీల్, టెర్రెన్స్ హిండ్స్ చెరో 2 వికెట్లు.. అకీల్ హొస్సేన్, అలీ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్.. 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. చాడ్విక్ వాల్టన్ అజేయమైన 80 పరుగులతో నైట్రైడర్స్ను గెలిపించాడు. పూరన్ (33), పోలార్డ్ (23) ఓ మోస్తరుగా రాణించారు. వారియర్స్ బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ 2, ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ పడగొట్టారు. జమైకా తల్లావాస్, అమెజాన్ వారియర్స్ మధ్య సెప్టెంబర్ 23న జరిగే రెండో క్వాలిఫయర్ విజేతతో నైట్రైడర్స్ ఫైనల్స్లో తలపడుతుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 25న జరుగనుంది. -
శివాలెత్తిన గప్తిల్.. 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్లో తొలి సెంచరీ నమోదైంది. బార్బడోస్ రాయల్స్తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో బౌండరీ, 9 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. గప్తిల్కు పోలార్డ్ (32 బంతుల్లో 46; ఫోర్, 4 సిక్సర్లు), మార్క్ దెయాల్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. Raise your bat Martin Guptill. What a knock from the kiwi sensation 🙌 #CPL23 #BRvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Betbarter @BetBarteronline pic.twitter.com/GdqWmEzPx5 — CPL T20 (@CPL) August 31, 2023 నైట్రైడర్స్లో గప్తిల్, పోలార్డ్తో పాటు నికోలస్ పూరన్ (6), ఆండ్రీ రసెల్ (5), డ్వేన్ బ్రావో (0) లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. గప్తిల్ ధాటికి బార్బడోస్ బౌలర్ ఓబెద్ మెక్కాయ్ బలయ్యాడు. అతను 4 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. గప్తిల్ మరో బార్బడోస్ బౌలర్ రకీమ్ కార్న్వాల్ను కూడా ఆడుకున్నాడు. కార్న్వాల్ కేవలం 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. బార్బడోస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2.. కైస్ అహ్మద్, వాన్ డర్ మెర్వ్ తలో వికెట్ దక్కించుకున్నారు. వకార్ దెబ్బకు కుప్పకూలిన బార్బడోస్.. నైట్రైడర్స్ నిర్ధేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బార్బడోస్.. వకార్ సలామ్ కైల్ (3.1-0-14-4), ఆండ్రీ రసెల్ (2-0-13-2), అకీల్ హొసేన్ (4-0-16-2), సునీల్ నరైన్ (2-0-11-1) దెబ్బకు 12.1 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. బార్బడోస్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు రకీమ్ కార్న్వాల్, కైల్ మేయర్స్ డకౌట్లు కాగా.. లారీ ఈవాన్స్ (5), అథనేజ్ (2), కెవిన్ విక్హమ్ (9), యంగ్ (3), వాన్ డర్ మెర్వ్ (3), ఓబెద్ మెక్ కాయ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జేసన్ హోల్డర్ (14), రోవ్మన్ పావెల్ (10), కైస్ అహ్మద్ (10 నాటౌట్) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. -
సిక్సర్ల సునామీ.. విధ్వంసం సృష్టించిన విండీస్ వీరులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. హెట్మైర్, కీమో పాల్ ఊచకోత జమైకా తల్లావాస్-గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. షిమ్రోన్ హెట్మైర్ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్ (29 బంతుల్లో 57; ఫోర్, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్గా మలిచాడు. THE CHAMPION! What a way to mark your 100th CPL match by taking a wicket in your first ball 🙌 @DJBravo47 strikes again! #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/aRoSZv9J2B — CPL T20 (@CPL) August 28, 2023 వీరికి షాయ్ హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకావడంతో గయానా టీమ్ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ గ్రీన్ 2, సల్మాన్ ఇర్షాద్, రీఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. సరిపోని ఇమాద్ వసీం, ఫేబియన్ అలెన్ మెరుపులు 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్ (2/35), సింక్లెయిర్ (2/17) రాణించారు. Rutherford Relishes Responsibility💪 Captain's knock from Sherfane👏#CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Skyfair pic.twitter.com/lSvN2Kehfi — CPL T20 (@CPL) August 28, 2023 రూథర్పోర్డ్ ప్రయాస వృధా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. Nicky P with an entertaining innings 🙌!#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport #Skyfair pic.twitter.com/WAcooLRBgu — CPL T20 (@CPL) August 28, 2023 Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 విధ్వంసం సృష్టించిన పూరన్, పోలార్డ్, రసెల్ 179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. SUPER SALMAN takes 4 🤩 #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/jSr1RT24G4 — CPL T20 (@CPL) August 28, 2023 -
ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్.. ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్
అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఇనాగురల్ టైటిల్ను (2023) ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఎగరేసుకుపోయింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 31) ఉదయం జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్.. సియాటిల్ ఆర్కాస్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఎంఎల్సీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. సీజన్ ఆరంభంలో వెనుకపడిన ఎంఐ న్యూయార్క్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని హ్యాట్రిక్ విజయాలతో టైటిల్ను నెగ్గింది. All the feels 🥰 💙 🤩 Congratulations to @MINYCricket for winning the inaugural #MajorLeagueCricket Championship Final 🏆 pic.twitter.com/Mk1agQmgo6 — Major League Cricket (@MLCricket) July 31, 2023 ఎలిమినేటర్ మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడంపై నెగ్గిన ఎంఐ.. ఆతర్వాత ఛాలెంజర్ మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్పై, ఫైనల్లో పటిష్టమైన సియాటిల్ ఆర్కాస్పై నెగ్గి విజేతగా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఖాతాలో తొమ్మిదో టీ20 టైటిల్ చేరింది. ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ముంబై ఇండియన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను, ఆతర్వాత 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను, ఈ ఏడాదే (2023) ప్రారంభమైన మహిళల ఐపీఎల్ టైటిల్ను, తాజాగా మేజర్ లీగ్ టీ20 టైటిల్ను నెగ్గాయి. MI are serial winners 🏆🏆🏆🏆🏆🏆🏆🏆 📸: IPL/BCCI pic.twitter.com/owVjc46r38 — CricTracker (@Cricketracker) July 31, 2023 ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్ మేజర్ లీగ్ టీ20 లీగ్ 2023 టైటిల్ నెగ్గడం ద్వారా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్.. తన దేశానికే చెందిన సహచర ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉన్న అత్యధిక టీ20 టైటిళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓ ఆటగాడిగా బ్రావో 16 టీ20 టైటిళ్లలో భాగం కాగా.. ఎంఎల్సీ టైటిల్తో పోలార్డ్, బ్రావో రికార్డును సమం చేశాడు. పోలార్డ్ కూడా ఆటగాడిగా 16 టీ20 టైటిళ్లలో భాగమయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో షోయబ్ మాలిక్ (13), రోహిత్ శర్మ (10), ధోని (9), లసిత్ మలింగ (9) ఉన్నారు. RASHID WINS THE BATTLE!⚔️ Rashid Khan gets the last LAUGH 😄against Heinrich Klaasen! 9⃣1⃣/3⃣ (12.1) pic.twitter.com/cfgaAf5CRJ — Major League Cricket (@MLCricket) July 31, 2023 నిప్పులు చెరిగిన బౌల్డ్.. రషీద్ మాయాజాలం ఎంఎల్సీ 2023 ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. ట్రెంట్ బౌల్డ్ (4-0-34-3), రషీద్ ఖాన్ (4-0-9-3) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (52 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు. 𝓞𝓷 𝓻𝓮𝓹𝓮𝓪𝓽 🔄 Can’t stop watching @nicholaspooran’s 1️⃣3️⃣ sixes he hit today‼️ #MLC2023 #MLCFINAL pic.twitter.com/OynKTi2xnD — Major League Cricket (@MLCricket) July 31, 2023 KHAN-TASTIC!🪄 Rashid Khan STRIKES FIRST💫 for the @MINYCricket! 2⃣5⃣/1⃣ (4.1) pic.twitter.com/ZPhVmSQhfA — Major League Cricket (@MLCricket) July 31, 2023 పూరన్ ఊచకోత.. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నికోలస్ పూరన్ (55 బంతుల్లో 137; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
'ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!'
మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్లో భాగంగా ముంబై న్యూయార్క్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నికోలస్ పూరన్ సారధ్యంలోని ముంబై న్యూయార్క్ టెక్సస్ సూపర్ కింగ్స్తో జరిగిన చాలెంజర్ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జూలై 31న జరగనున్న ఫైనల్లో సీటెల్ ఓర్కాస్, ముంబై న్యూయార్క్లు తలపడనున్నాయి. కాగా వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్లు కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావోలు మంచి స్నేహితులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబై న్యూయార్క్కు పొలార్డ్ కెప్టెన్గా ఉంటే.. టెక్సస్ సూపర్ కింగ్స్లో బ్రావో సభ్యుడిగా ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్ను ఓడించగానే బ్రావోనూ చూస్తూ పొలార్డ్.. ''ఇక నువ్వు ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది'' అంటూ సైగలు చేశాడు. దీనికి స్పందించిన బ్రావో పొలార్డ్ ముందు తలవంచి.. ''మీ ఆజ్ఞ మహారాజా.. తప్పక పాటిస్తా'' అంటూ చేతులెత్తి నమస్కరించాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. ఆ తర్వాత బ్రావో, పొలార్డ్లు ఒకరినొకరు హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. These two & their banter 😂💙 Polly wins this round, DJ! 😉#OneFamily #MINewYork #MajorLeagueCricket #MINYvTSK pic.twitter.com/wEDEe7VKvg — MI New York (@MINYCricket) July 29, 2023 చదవండి: Japan Open 2023: భారత్ కథ ముగిసింది.. సెమీస్లో లక్ష్యసేన్ ఓటమి -
Viral: పోలార్డ్పైకి దూసుకెళ్లిన అఫ్రిది.. నాలుగు సిక్సర్లు కొట్టాడన్న కోపంలో..!
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 చివరి అంకానికి చేరుకున్న సమయంలో ఇద్దరు అంతర్జాతీయ స్టార్ల మధ్య జరిగిన గొడవ లీగ్ మొత్తానికే కలంకంగా మారింది. లీగ్లో భాగంగా నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్లో సుల్తాన్స్ ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్పై ఖలందర్స్ బౌలర్ షాహీన్ అఫ్రిది దాదాపుగా చేయి చేసుకున్నంత పని చేశాడు. తన బౌలింగ్లో పోలార్డ్ 4 సిక్సర్లు (ఒక ఓవర్లో 1, ఇంకో ఓవర్ 3) బాదడంతో సహనం కోల్పోయిన అఫ్రిది.. దూషణ పర్వానికి దిగగా, పోలీ సైతం అంతే ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు. Shaheen Afridi and Kieron Pollard 😲#PSL8 #LQvMSpic.twitter.com/HM9CP5Y8tC — Cricket Pakistan (@cricketpakcompk) March 15, 2023 అయితే సొంతగడ్డ అడ్వాంటేజ్ తీసుకున్న అఫ్రిది ఓవరాక్షన్ చేసి పోలార్డ్పైకి దూసుకెళ్లడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం సహచరులు సర్ది చెప్పడంతో వెనక్కు తగ్గిన అఫ్రిది తన పని తాను చేసుకున్నాడు. అఫ్రిది-పోలార్డ్ మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో అఫ్రిది చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు పాక్ యువ పేసర్ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్పై 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ముల్తాన్ సుల్తాన్స్ నేరుగా ఫైనల్కు చేరింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. రెండో ఫైనల్ బెర్తు ఎవరిది..? ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. -
పేలిన పోలార్డ్.. కేక పుట్టించిన కాట్రెల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 ఎడిషన్లో ఓ ఫైనల్ బెర్తు ఖరారైంది. నిన్న (మార్చి 15) లాహోర్ ఖలందర్స్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్తాన్ సుల్తాన్స్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇంకో రెండు మ్యాచ్ల తర్వాత సుల్తాన్స్తో తలపడబోయే రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతుంది. TO THE FINALS#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/gIIye2TYtO — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. 𝐏𝐎𝐋𝐋𝐀𝐑𝐃 𝐓𝐇𝐄 𝐁𝐈𝐆-𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆 𝐌𝐀𝐂𝐇𝐈𝐍𝐄 💥 Giving the treatment to the Qalandars 💪#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/k2CfWGN3xq — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 ఇక నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. లాహోర్ ఖలందర్స్పై ముల్తాన్ సుల్తాన్స్ 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. 🫡 #HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/zDH8en06kW — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 సుల్తాన్స్ ఇన్నింగ్స్లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. -
పొలార్డ్ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ముల్తాన్ సుల్తాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే బుధవారం కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పొలార్డ్ అద్భుతమైన క్యాచ్తో మెరిశాడు. కరాచీ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అబ్బాస్ అఫ్రిది బౌలింగ్లో వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి లాంగాన్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తున్న పొలార్డ్ ముందుకు వేగంగా కదిలి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో 13 పరుగులు చేసిన మాలిక్ నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇక సంచలన క్యాచ్ను అందుకున్న పొలార్డ్ను సహచర ఆటగాళ్లు దగ్గరకు వెళ్లి మరి అభినందించారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక ఈ మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ చేతిలో కరాచీ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: అలుపెరగని యోధుడు రషీద్ ఖాన్.. మనిషా.. రోబోనా అంటున్న జనం BIG MAN @KieronPollard55 TAKES A RIPPER! 😲#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvKK pic.twitter.com/2ynzehnsp2 — PakistanSuperLeague (@thePSLt20) February 22, 2023 -
కిల్లర్ మిల్లర్ ఊచకోత.. పోలార్డ్ విధ్వంసం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 19) ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్), రిలీ రొస్సో (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), పోలార్డ్ (21 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) శివాలెత్తడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. Killer Miller time 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/7bfAEfTRAp — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 ఈ ఇన్నింగ్స్లో రిజ్వాన్, రొస్సో ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించగా.. మిల్లర్, పోలార్డ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిల్లర్ 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తే.. పోలార్డ్ చిన్న సైజ్ విధ్వంసమే సృష్టించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మిల్లర్ హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడితే.. ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులను పోలీ బౌండరీలకు తరలించాడు. సుల్తాన్స్ ఇన్నింగ్స్లో మసూద్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో రయీస్, మహ్మద్ వసీం జూనియర్, షాదాబ్ ఖాన్, టామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. A hat-trick of boundaries ⚡ The perfect finish for @MultanSultans 🙌#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/5HcJQpxs8h — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. అబ్బాస్ అఫ్రిది (4/22), మహ్మద్ ఇలియాస్ (2/12), ఇహసానుల్లా (2/19), ఉసామా మిర్ (2/33) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 138 పరుగలకు ఆలౌటై, 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్లో డస్సెన్ (49) టాప్ స్కోరర్గా నిలువగా.. హసన్ (21), మున్రో (31), ఆజం ఖాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ హవా కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓడిన ఈ జట్టు, ఆతర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. సుల్తాన్స్ కెప్టెన్ రిజ్వాన్ ఈ సీజన్లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు సాధించి సూపర్ ఫామ్లో ఉండగా.. రిలీ రొస్సో 3 మ్యాచ్ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్తో కిల్లర్ మిల్లర్ కూడా ఫామ్లోకి రావడంతో తదుపరి లీగ్లో ప్రత్యర్ధి బౌలర్లకు కష్టాలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. లీగ్లో ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్లో కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ తలపడనున్నాయి. -
ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్.. ప్లేఆఫ్స్కు ఎంఐ ఎమిరేట్స్
అబుదాబి వేదికగా జరుగుతున్న తొలి ఎడిషన్ ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ఎంఐ ఎమిరేట్స్ దుమ్మురేపుతుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇప్పటికే వరుస అర్థసెంచరీలతో జోరు కనబరుస్తున్న పొలార్డ్ తాజాగా మరో కీలక ఇన్నింగ్స్తో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్లాడిన పొలార్డ్ 337 పరుగులు చేశాడు. మూడు అర్థసెంచరీలు సాధించిన పొలార్డ్ ప్రస్తుతం లీగ్లో రెండో టాప్స్కోరర్గా కొనసాగుతున్నాడు. శుక్రవారం లీగ్లో భాగంగా ఎంఐ ఎమిరేట్స్, అబుదాబి నైట్రైడర్స్ మధ్య 26వ మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మహ్మద్ వసీమ్ 60 పరుగులతో రాణించగా.. ఆఖర్లో పొలార్డ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. టక్కర్ 33 పరుగులు చేశాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నైట్రైడర్స్ 19.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో డ్వేన్ బ్రేవో మూడు వికెట్లు తీయగా.. ఇమ్రాన్ తాహిర్, జహూర్ ఖాన్లు చెరో రెండు వికెట్లు తీశారు. కాగా ఈ విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్స్కు చేరుకోగా.. సీజన్లో అబుదాబి నైట్రైడర్స్కు ఇది వరుసగా ఎనిమిదో పరాజయం. ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ రద్దు కాగా.. ఎనిమిదింటిలో ఓడిన ఆ జట్టు ఎప్పుడో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక ఇప్పటికే డెసర్ట్ వైపర్స్, గల్ఫ్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్కు వెళ్లగా.. తాజాగా ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్కు చేరకుంది. ఇక షార్జా వారియర్స్, దుబాయ్ క్యాపిటల్స్లో ఏ జట్టు నాలుగో స్థానంలో ప్లేఆఫ్కు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. Four 4️⃣s. Three 6️⃣s. A powerful 4️⃣3️⃣ off just 17 balls.@KieronPollard55 lit up the field with every shot. Another #DPWorldILT20 innings you don't want to miss! #ALeagueApart #MIEvADKR @MIEmirates pic.twitter.com/vR4FkASBZs — International League T20 (@ILT20Official) February 3, 2023 With a never-say-die attitude, the @MIEmirates have made it to the playoffs 🤩 Congratulations, team 💙 #MIEmirates #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/46XEgirZxK — International League T20 (@ILT20Official) February 3, 2023 చదవండి: అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్లపై ప్రాక్టీస్ -
ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20 క్రికెట్లో హాస్యాస్పద సన్నివేశం చోటుచేసుకుంది. బ్యాటర్ కొట్టిన బంతి స్టేడియం అవతల పడింది. అయితే స్డేడియం బయట ఉన్న వ్యక్తి దానిని క్యాచ్గా తీసుకున్నాడు. ఆ తర్వాత బంతిని తీసుకొని అక్కడినుంచి పారిపోయాడు. చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేకపోయినప్పటికి సదరు వ్యక్తి చర్య నవ్వులు పూయించింది. ఎంఎఐ ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇది జరిగింది. ఎమిరేట్స్ బ్యాటింగ్ సమయంలో మౌస్లే డీప్స్క్వేర్ లెగ్ దిశగా బంతిని స్టాండ్స్ బయటికి పంపించాడు. బంతి వెళ్లి నేరుగా రోడ్డుపై పడింది. ఆ తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని తీసుకున్నాడు. స్టేడియంలోకి తిరిగి విసురుతాడనుకుంటే.. బంతితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత కాసేపటికే కీరన్ పొలార్డ్ భారీ సిక్సర్ కొట్టాడు. ఈసారి కూడా బంతి స్టేడియం అవతల పడింది. ఆ వ్యక్తి మళ్లీ కనిపిస్తాడేమో అని చూస్తే బంతిని తీసుకోవడానికి ఎవరు రాలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఐఎల్టి20 తన ట్విటర్లో షేర్ చేసింది. సిక్సర్ల వర్షం కురుస్తోంది.. మీరు ఏ టైప్ క్రికెట్ లవర్స్.. 1). తీసుకొని పారిపోవడం..2). తీసుకొని తిరిగిచ్చేయడం .. మీరే ఎంపిక చేసుకొండి అంటూ కామెంట్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎంఐ ఎమిరేట్స్ 157 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోరు చేసింది. మహ్మద్ వసీమ్ 86, ఆండ్రీ ఫ్లెచర్ 50, కీరన్ పొలార్డ్ 50, మౌస్లే 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ 84 పరుగులకే కుప్పకూలింది. ఎమిరేట్స్ బౌలింగ్లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. జహూర్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్లు చెరో రెండు వికెట్లు తీశారు. When it’s raining 6️⃣s, There are 2 types of cricket lovers.. 1. Pick and run 🏃♂️ 2. Pick and return Which category are you? Book your tickets now : https://t.co/sv2yt8acyL#DPWorldILT20 #ALeagueApart #DVvMIE pic.twitter.com/P0Es01cMz8 — International League T20 (@ILT20Official) January 29, 2023 చదవండి: కాఫీ బ్యాగులతో ఆసీస్ క్రికెటర్; తాగడానికా.. అమ్మడానికా? రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఓపెనర్ -
86 పరుగులకే కుప్పకూలిన వైపర్స్.. 157 పరుగుల తేడాతో ముంబై విజయం
ఇంటర్నేషనల్ లీగ్లో భాగంగా ఆదివారం డెసర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఎమిరేట్స్ ఏకంగా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన డెసర్ట్ వైపర్స్.. ముంబై బౌలర్లు చెలరేగడంతో 84 పరుగులకే కుప్పకూలింది. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూఖీ మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ వెన్ను విరచగా.. తహీర్, జహూర్ ఖాన్ చెరో రెండు వికెట్లు, బౌల్ట్, బ్రావో, మౌస్లీ తలా వికెట్ సాధించారు. వైపర్స్ బ్యాటర్లలో టామ్ కుర్రాన్(12), మార్క్ వాట్(12) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. చెలరేగిన వసీం, పొలార్డ్ ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఎమిరేట్స్ బ్యాటర్లలో మహ్మద్ వసీం విధ్వంసం సృష్టించాడు. 44 బంతులు ఎదుర్కొన్న వసీం 11 ఫోర్లు, 4 సిక్స్లతో 86 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫ్లెచర్(50), పొలార్డ్(50 నాటౌట్) రాణించారు. కాగా పొలార్డ్ తన అర్ధ సెంచరీని కేవలం 19 బంతుల్లోనే సాధించడం గమానార్హం. వైపర్స్ బౌలర్లలో టామ్ కుర్రాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: పాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్ 1 బౌలర్ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం.. The moment Waseem decided to cut loose 🙌#MIEmirates #OneFamily #DVvMIEpic.twitter.com/4SJFdGdqrV — MI Emirates (@MIEmirates) January 29, 2023 -
విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్ప్రెషన్కు అర్థమేంటి!
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ముంబై ఎమిరేట్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో మెరిసిన పొలార్డ్ ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. మంగళవారం డెసర్ట్ వైపర్స్తో మ్యాచ్లో పొలార్డ్ క్యాచ్ తీసుకునే క్రమంలో చేసిన విన్యాసం అదుర్స్ అనిపించింది. బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో పొలార్డ్ అందుకున్న క్యాచ్ హైలైట్గా నిలిచింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సమిత్ పటేల్ వేసిన ఫుల్టాస్ బంతిని కొలిన్ మున్రో లాంగాన్ దిశగా బాదాడు. కచ్చితంగా సిక్సర్ అనుకున్న తరుణంలో అక్కడే ఉన్న పొలార్డ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ను తీసుకొని వెనుకవైపుకు డైవ్ చేశాడు. ఆ తర్వాత బౌండరీలైన్ ముంగిట నిలబడి అభిమానులను చూస్తూ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెసర్ట్ వైపర్స్ ఏడు వికెట్ల తేడాతో ముంబై ఎమిరేట్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పొలార్డ్ 67 నాటౌట్, పూరన్ 57 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్.. అలెక్స్ హేల్స్(44 బంతుల్లో 62 నాటౌట్), షెర్ఫెన్ రూథర్ఫోర్డ్(29 బంతుల్లో 56 నాటౌట్) విధ్వంసం ధాటికి 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కొలిన్ మున్రో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. #PollyPandey, what have you done! 🤯🤯🤯🤯@KieronPollard55 with a 𝑩𝒂𝒘𝒂𝒂𝒍 one-handed catch and the celebration to match. 😎#MIEvDV #CricketOnZee #DPWorldILT20 #BawaalMachneWalaHai #HarBallBawaal @MIEmirates @ILT20Official pic.twitter.com/2eKZPWjoYk — Zee Cricket (@ilt20onzee) January 24, 2023 చదవండి: టాప్లెస్గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే
ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ అనగానే టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ గుర్తొస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో చూసుకుంటే వన్డేలు మాత్రమే ఆడే రూట్ టి20లు చాలా తక్కువగా ఆడాడు. ఇక టెస్టుల్లో తన ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెప్టెన్గా, బ్యాటర్గా టెస్టుల్లో ఇంగ్లండ్కు ఎన్నో విజయాలు అందించాడు. టెస్టు స్పెషలిస్ట్ అనే ముద్ర ఉండడంతో ఐపీఎల్, బీబీఎల్ లాంటి లీగ్స్లో రూట్ పేరు పెద్దగా కనిపించదు. ఒకవేళ వేలంలో పాల్గొన్నా అతన్ని కొనడానికి ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపేది కాదు. అయితే రూట్కున్న టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ చెరిపేయాల్సిన సమయం వచ్చినట్లుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో రూట్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అందుకు కారణమయింది. ఆదివారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, ముంబై ఎమిరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోవ్మెన్ పావెల్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్ పొలార్డ్(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. We saw the reverse sweep yesterday. Here's the conventional sweep with the SAME precision!@root66 is all class!pic.twitter.com/GRo5zKQAyd — International League T20 (@ILT20Official) January 22, 2023 చదవండి: ఫించ్ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..! -
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన: కెప్టెన్లుగా కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్..
Kieron Pollard- Rashid Khan As MI Teams captains: వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్, అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ కీలక బాధ్యతలు అప్పగించింది. విదేశీ టీ20 లీగ్లలో తమ జట్లకు వీరిద్దరిని కెప్టెన్లుగా నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ప్రకటన విడుదల చేసింది. యూఏఈ ఐఎల్టీ20 లీగ్లో ఎంఐ ఎమిరేట్స్కు కీరన్ పొలార్డ్, సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్కు రషీద్ ఖాన్ సారథ్యం వహిస్తారని తెలిపింది. వీరిద్దరిపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఆయా లీగ్లలో తమ జట్లను ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే నమ్మకం ఉందని పేర్కొంది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబై ఫ్రాంఛైజీల కెప్టెన్ల జాబితాలో పొలార్డ్, రషీద్ కూడా చేరడం విశేషం. ముంబై ఇండియన్స్కు గుడ్బై ఐపీఎల్లో అత్యుత్తమ ఆల్రౌండర్గా పేరొందిన కీరన్ పొలార్డ్ ఇటీవలే ఈ లీగ్కు ఆటగాడిగా గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే, అతడు ముంబై బ్యాటింగ్ కోచ్గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఈ క్రమంలో యూఏఈ లీగ్లో ముంబై జట్టు కెప్టెన్గా పోలీని ప్రకటించడం గమనించడం గమనార్హం. గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ ఇక ఐపీఎల్-2022 సీజన్తో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్కు రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై జట్టుకు సారథిగా నియమితుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్ వదులుకున్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. గుజరాత్ను అరంగేట్ర సీజన్లోనే చాంపియన్గా నిలిపిన విషయం తెలిసిందే. 🇮🇳🇦🇪🇿🇦 Leaders of the #OneFamily. 💙#MICapeTown #MIEmirates @MIEmirates @MICapeTown @ImRo45 @KieronPollard55 @rashidkhan_19 pic.twitter.com/ngGMQWSrgS — Mumbai Indians (@mipaltan) December 2, 2022 -
రుతురాజ్ది ప్రపంచ రికార్డే! కానీ.. అతడు ఒకే ఓవర్లో ఏకంగా 8 సిక్స్లు కొట్టాడు!
Cricketers Who Hits 6 Sixes In An Over- Entire List: అంతర్జాతీయ వన్డేల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టారు. అంతర్జాతీయ టి20ల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో చెలరేగారు. దేశవాళీ వన్డేల్లో ఒక ఆటగాడు ఓవర్లో 6 సిక్సర్లతో సత్తా చాటాడు. దేశవాళీ టి20ల్లో ముగ్గురు బ్యాటర్లు ఓవర్లో 6 సిక్సర్లతో దూకుడు ప్రదర్శించారు. వీరంతా ఓవర్లో ఆరేసి సిక్సర్లతో పండగ చేసుకున్నారు. ఇదంతా ఇప్పటి వరకు రికార్డు... కానీ ఇప్పుడు దీన్ని దాటి ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో కొత్త ఘనత నమోదైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ నోబాల్ సహా 7 బంతుల్లో సిక్సర్లు బాది లిస్ట్–ఎ (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే, స్ట్క్లాస్ క్రికెట్లో (టెస్టులు, మూడు, నాలుగు రోజుల మ్యాచ్లు) మాత్రం రికార్డు లీ జెర్మన్ (8 సిక్స్లు) పేరిట ఉంది. లీ జెర్మన్ కొట్టిన మ్యాచ్లో... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ లీ జెర్మన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఒకే ఓవర్లో 8 సిక్సర్లు కొట్టడం అధికారికంగానే నమోదై ఉంది. అయితే ఆ మ్యాచ్ జరిగిన తీరు పూర్తిగా భిన్నమైంది. వెల్లింగ్టన్ కెప్టెన్ మెక్ స్వీనీ ‘ప్రత్యేక వ్యూహం’లో భాగంగా ఇదంతా జరిగింది. 59 ఓవర్లలో 291 పరుగులు ఛేదించే క్రమంలో కాంటర్బరీ 108/8 వద్ద నిలిచింది. అయితే ఆ జట్టును అంత సులువుగా ఓడించరాదని, సులభంగా పరుగులు ఇచ్చి కాస్త ఆడిద్దామని వెల్లింగ్టన్ భావించింది. ఒకదశలో స్కోరు 196/8కు చేరింది. మరో 2 ఓవర్లు మిగలగా.. అసలు బౌలింగ్ రాని వాన్స్ చేతికి బంతి ఇచ్చారు. అతను ఓవర్లో ఏకంగా 17 నోబాల్స్ సహా 22 బంతులు వేశాడు. అంటే 5 బంతులే! ఇందులోనే లీ జెర్మన్ 8 సిక్స్లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 77 పరుగులు (0,4,4,4,6,6,4,6,1,4,1,0,6,6,6,6,6,0,0,4,0,1) వచ్చాయి. ఇప్పటికీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే. చివరకు మ్యాచ్ ‘డ్రా’ అయింది. మరిన్ని రికార్డులు ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు సమమైంది. 2018లో న్యూజిలాండ్లో ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్తో జరిగిన మ్యాచ్లో నార్తర్న్ డిస్ట్రిక్స్ నమోదు చేసింది. అయితే ఇందులో బ్రెట్ హామ్టన్ 23 పరుగులు, జో కార్టర్ 18 పరుగులు రాబట్టారు. భారత్ తరఫున రోహిత్ శర్మ (3 సార్లు), సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, పృథ్వీ షా, శిఖర్ ధావన్, సమర్థ్ వ్యాస్, కరణ్ కౌశల్ తర్వాత లిస్ట్–ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన పదో భారత ఆటగాడిగా రుతురాజ్ నిలిచాడు. ఓవర్లో 6 సిక్సర్ల వీరులు అంతర్జాతీయ వన్డేలు ►హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా)- బౌలర్: డాన్ వాన్ బంగ్ (నెదర్లాండ్స్; 2007లో) ►జస్కరన్ మల్హోత్రా (అమెరికా)- బౌలర్: గౌడీ టోకా (పాపువా న్యూగినియా; 2021లో) అంతర్జాతీయ టి20లు ►యువరాజ్ (భారత్) బౌలర్- స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో) ►కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్) బౌలర్- అఖిల ధనంజయ (శ్రీలంక; 2021లో) ఫస్ట్ క్లాస్ క్రికెట్ ►సోబర్స్ (నాటింగమ్షైర్ కౌంటీ)- బౌలర్: నాష్ (గ్లామోర్గాన్; 1968లో) ►రవిశాస్త్రి (ముంబై)- బౌలర్: తిలక్ రాజ్ (బరోడా; 1984లో) ►లీ జెర్మన్ (కాంటర్ బరీ)- బౌలర్: వాన్స్ (వెల్లింగ్టన్; 1990లో) దేశవాళీ వన్డేలు ►తిసారా పెరీరా (శ్రీలంక; శ్రీలంక ఆర్మీ స్పోర్ట్స్ క్లబ్)- బౌలర్: దిల్హాన్ కూరే (బ్లూమ్ఫీల్డ్; 2021లో) ►రుతురాజ్ గైక్వాడ్ (భారత్; మహారాష్ట్ర)- బౌలర్: శివ సింగ్ (ఉత్తరప్రదేశ్; 2022లో) దేశవాళీ టి20లు ►రోజ్ వైట్లీ (వొర్స్టర్షైర్) - బౌలర్: కార్ల్ కార్వర్ (యార్క్షైర్; 2017లో) ►లియో కార్టర్ (కాంటర్బరీ) - బౌలర్: ఆంటన్ డెవ్సిచ్ (నార్తర్న్ డిస్ట్రిక్ట్స్; 2020లో) ►హజ్రతుల్లా జజాయ్ (కాబూల్ జ్వానన్)- బౌలర్: అబ్దుల్లా మజారి (బాల్క్ లెజెండ్స్; 2018లో) చదవండి: Christiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్ .. ఏడాదికి రూ.612 కోట్లు! Indian Captain: హార్దిక్తో పాటు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ యువ ప్లేయర్ కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు! 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 -
Kieron Pollard: రిటైర్మెంట్ ప్రకటించినా వదలని ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక మ్యాచ్లు (189) ఆడిన విదేశీ ఆటగాడిగా, ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఒకే జట్టుకు (ముంబై ఇండియన్స్) ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో ఒకడిగా, 13 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్లో భాగమై, ఆ జట్టు 5 ఐపీఎల్ టైటిల్స్, 2 ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడిగా పలు అరుదైన ఘనతలు సాధించిన కీరన్ పొలార్డ్ ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతున్నట్లు నిన్న (నవంబర్ 15) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్ సేవలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం వేరే రూపంలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. పోలార్డ్ ఎంఐకి చేసిన సేవలను గుర్తిస్తూ.. అతన్ని ఫ్రాంచైజీ బ్యాటింగ్ కోచ్గా నియమించుకొవాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు పోలీ కూడా అంగీకారం తెలిపాడు. దీంతో అతను వచ్చే సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కోచ్గా వ్యవహరించనున్నాడు. మరోవైపు యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్ మరో ఫ్రాంచైజీ అయిన ముంబై ఎమిరేట్స్లో ఆటగాడిగా కొనసాగుతానని పోలీ ప్రకటించాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ కెరీర్లో మొత్తంలో 189 మ్యాచ్లు ఆడిన పోలార్డ్.. 147.3 స్ట్రయిక్ రేట్తో 3412 పరుగులు చేశాడు. ఇందులో 16 అర్ధశతాకలు ఉన్నాయి. అలాగే బౌలింగ్లో 8.79 ఎకానమీతో 69 వికెట్లు పడగొట్టాడు. పోలార్డ్ తన ఐపీఎల్ కెరీర్లో రికార్డు స్థాయిలో 218 ఫోర్లు, 223 సిక్సర్లు బాదాడు. చదవండి: 13 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబై ఇండియన్స్.. -
13 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబై ఇండియన్స్..
ఈ ఏడాది ఐపీఎల్లో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2023లో సరికొత్తగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు ఏకంగా 13 మంది ఆటగాళ్లను ముంబై విడిచిపెట్టింది. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ముంబై ఇండియన్స్ ట్విటర్లో షేర్ చేసింది. కాగా మినీ వేలం ముందు ఇంతమంది ఆటగాళ్లను ముంబై రిలీజ్ చేయడం ఇదే తొలి సారి. అదే విధంగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ తరపున ఆడిన జాసన్ బెహ్రెండార్ఫ్ను ముంబై ట్రెడ్ చేసుకుంది. మరోవైపు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరాన్ పోలార్డ్ను బ్యాటింగ్ కోచ్గా ముంబై ఇండియన్స్ నియమించింది. కాగా ఐపీఎల్కు పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ చదవండి: IPL 2023: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
IPL: ముంబై విధ్వంసకర ప్లేయర్ సంచలన నిర్ణయం! మిస్ యూ.. ట్విస్ట్ ఇచ్చాడిలా
IPL 2023- Kieron Pollard- Mumbai Indians: వెస్టిండీస్ వెటరన్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్గా వెలుగొందిన కీరన్ పొలార్డ్ తన ఐపీఎల్ కెరీర్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆటగాడిగా కనిపించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2023 మినీ వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు పోలీ సంచలన ప్రకటన చేశాడు. అపురూప విజయాల్లో భాగమై 2010 నుంచి ముంబై ఫ్రాంఛైజీతో అనుబంధం కొనసాగిస్తున్న 35 ఏళ్ల పొలార్డ్.. ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా రికార్డు సృష్టించాడు. తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు అనేక విజయాలు అందించాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆటగాడిగా 13 ఏళ్ల తన విజయవంతమైన కెరీర్కు గుడ్ బై చెబుతూ మంగళవారం ప్రకటన చేశాడు. అందరికీ ధన్యవాదాలు ఈ మేరకు ట్విటర్లో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఆటగాడిగా ఐపీఎల్ను మిస్ అవుతానని.. 2013, 2015, 2017, 2019, 2020తో పాటు 2011 నాటి చాంపియన్స్ లీగ్ గెలవడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. తనకు ఇన్నాళ్లు సహకరించిన ముంబై యాజమాన్యానికి పొలార్డ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. తన భార్య జెనా, తన ముగ్గురు పిల్లలకు కూడా కృతజ్ఞతలు చెప్పాడు. ఓ బ్యాడ్ న్యూస్.. ఓ గుడ్ న్యూస్ తనకు సహకరించిన ముకేశ్, నీత, ఆకాశ్ అంబానీల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్న పొలార్డ్... ముంబైతో తన బంధం ముగిసిపోలేదంటూ ఫ్యాన్స్కు ఓ శుభవార్త కూడా చెప్పాడు. ఐపీఎల్లో బ్యాటింగ్ కోచ్గా కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు పొలీ ఈ సందర్భంగా వెల్లడించాడు. అదే విధంగా ముంబై ఎమిరేట్స్ తరఫున ఆటగాడిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. తన నోట్ను ముగిస్తూ సిన్సియర్లీ కీరన్ పొలార్డ్.. ది ముంబై వెస్ట్ ఇండియన్ అంటూ అభిమానం చాటుకున్నాడు. తనని అభిమానిస్తున్న వాళ్లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా పొలార్డ్ను ఇక ఐపీఎల్ ఆటగాడిగా చూడలేమా అంటూ ఫ్యాన్స్ ఉద్వేగానికి లోనవుతున్నారు. మిస్ యూ పోలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గత సీజన్లో పొలార్డ్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. 💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6 — Kieron Pollard (@KieronPollard55) November 15, 2022 🙏𝕋ℍ𝔼 𝕃𝕃𝕆ℝ𝔻 𝗛𝗔𝗦 𝗪𝗢𝗡 𝗜𝗧 𝗔𝗟𝗟 🏆#OneFamily #MumbaiIndians @KieronPollard55 pic.twitter.com/VPWTdWZEdH — Mumbai Indians (@mipaltan) November 15, 2022 -
స్టార్ ఆల్రౌండర్ను వదులుకున్న ముంబై, జడేజాను అట్టిపెట్టుకున్న చెన్నై..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి ఎడిషన్ (16) కోసం ఇప్పటినుంచే సన్నాహకాలు ఊపందుకున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితా పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్ 15ను డెడ్లైన్గా ప్రకటించింది. ఈ క్రమంలో ప్రముఖ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. తమ రిలీజ్డ్, రీటెయిన్డ్ ప్లేయర్ల లిస్ట్ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది. తదుపరి సీజన్కు ముంబై వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో విండీస్ వెటరన్ ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2010 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్తో అనుబంధాన్ని కొనసాగిస్తూ, జట్టకు ఎన్నో అపురూప విజయాలు అందించిన పోలీని.. ఇలా అవమానకర రీతిలో తప్పించడం బాధాకరమని ఎంఐకి సంబంధించిన అతని ఫ్యాన్స్ వాపోతున్నారు. పోలార్డ్తో పాటు ఫాబ్ అలెన్, తైమాల్ మిల్స్, మయాంక్ మార్కండే, హతిక్ షోకీన్లను కూడా ఎంఐ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. పేస్ విభాగం బలం పెంచుకోవడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి జేసన్ బెహ్రెన్డార్ఫ్ను ట్రేడింగ్ చేసుకున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల మీడియా కథనం మేరకు ముంబై అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క ఫోర్ టైమ్ ఛాంపియన్ సీఎస్కే అనూహ్యంగా రవీంద్ర జడేజాను అట్టిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలా జరగడానికి జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. గత సీజన్లో సీఎస్కే యజమాన్యానికి, జడేజాకు మధ్య విభేదాలు తలెత్తడంతో.. జడ్డూ లీగ్ మధ్యలోనే గాయం సాకుగా చూపి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక సీఎస్కే వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో క్రిస్ జోర్డన్, ఆడమ్ మిల్నే, మిచెల్ సాంట్నర్ ఉన్నట్లు సమాచారం. సీఎస్కే కొనసాగించనున్న ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముకేశ్ చౌదరీ, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రియాన్ పరాగ్ ఊచకోత.. కెరీర్లో తొలి శతకం బాదిన రాజస్తాన్ రాయల్స్ ఆల్రౌండర్ -
'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్పై కన్నేశారు
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా పేరుపొందిన ముంబై ఇండియన్స్ క్రికెట్ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్లోనూ పెట్టుబడులు పెట్టి జట్లను కొనుగోలు చేసింది. కొనుగోలు చేయడమే కాదు అందరికంటే ముందుగా తమ కొత్త జట్ల పేర్లను ప్రకటించడంతో పాటు ఆటగాళ్లను పరిచయం చేసింది. సీఎస్ఏ టి20 లీగ్లో 'ఎంఐ కేప్టౌన్'(MI Capetown).. యూఏఈ టి20 లీగ్లో 'ఎంఐ ఎమిరేట్స్'(MI Emirates)ను జట్లుగా ప్రకటించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్. తాజాగా యూఏఈ ఇంటర్నేషనల్ టి20లో తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోయే జట్టును కూడా ప్రకటించింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఈ జట్టులో పెద్దపీట వేసింది. 14 మందితో కూడిన ఈ జట్టులో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్, విండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్తో పాటు నికోలస్ పూరన్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ ఫ్లెచర్లు కూడా ఉన్నారు. ఇక ఐపీఎల్లో గతంలో ముంబై ఇండియన్స్కు ఆడిన ట్రెంట్ బౌల్ట్ను మళ్లీ జట్టులో చోటు కల్పించింది. వీరితో పాటు ఇంగ్లండ్ నుంచి సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్ లు ఉన్నారు. అఫ్ఘనిస్తాన్ బౌలర్ జహీర్ ఖాన్, ఫజల్హక్ ఫరూఖీలను ఎంపిక చేసింది. సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్కు అవకాశం దక్కింది. ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ జట్టును తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12వరకు జరగనుంది. లీగ్ మార్గదర్శకాలను అనుసరించి తమ ఫ్రాంచైజీకి ఆటగాళ్లు ఒప్పందాలు చేసుకున్నారని, ఇక స్థానిక (యూఏఈ) క్రికెటర్లు కూడా వీరికి జతకలుస్తారని ఎంఐ ఎమిరేట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా జట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ.. ‘మా జట్టుకు చెందిన 14 మంది ఆటగాళ్లను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ముంబై ఇండియన్స్లో కీలక ఆటగాడైన పొలార్డ్.. ఎమిరేట్స్లో మాతోనే కొనసాగుతున్నాడు. బ్రావో, బౌల్డ్, పూరన్ లు మళ్లీ మాతో చేతులు కలపనున్నారు. ఎమిరేట్స్ జట్టుకు ఆడబోయే ఆటగాళ్లకు స్వాగతం.’అని పేర్కొన్నాడు. ఐఎల్టీ20కి ఎంఐ ఎమిరేట్స్ జట్టు: కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, అండ్రె ఫ్లెచర్, ఇమ్రాన్ తాహిర్, సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్, నజిబుల్లా జద్రాన్, జహీర్ ఖాన్, ఫరూఖీ, బ్రాడ్లే వీల్, బాడ్ డీ లీడే The 𝗟𝗹𝗼𝗿𝗱, the 𝗟𝗲𝗴𝗲𝗻𝗱 & his 𝗟𝗲𝗴𝗮𝗰𝘆! @KieronPollard55 will don the iconic Blue and Gold in IL T20 💙 🗞️ Read more: https://t.co/RMiQOJfj9N#OneFamily #MIemirates @MIEmirates @EmiratesCricket pic.twitter.com/C1flVytrpI — Mumbai Indians (@mipaltan) August 12, 2022 చదవండి: MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్టౌన్.. రబడ సహా.. Mumbai Indians: విదేశీ లీగ్స్లోనూ తనదైన ముద్ర.. -
చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో
వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ టి20 క్రికెట్లో అరుదైన ఫీట్ అందుకున్నాడు. టి20ల్లో 600వ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్గా పొలార్డ్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హండ్రెడ్ టోర్నమెంట్లో ఆడుతున్న ఈ హిట్టర్ లండన్ స్పిరిట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం మాంచెస్టర్ ఒరిజినల్స్తో మ్యాచ్లో పొలార్డ్ ఈ ఘనత అందుకున్నాడు. కాగా తన 600 వ ప్రతిష్టాత్మక మ్యాచ్లో పొలార్డ్ 11 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక టి20ల్లో సక్సెస్ అయిన బ్యాట్స్మెన్లలో పొలార్డ్ ఒకడిగా నిలిచాడు. 600 మ్యాచ్ల్లో 31.34 సగటుతో 11, 723 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా.. 56 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్లో 309 వికెట్లు పడగొట్టిన పొలార్డ్ అత్యుత్తమ బౌలింగ్ 4/15 గా ఉంది. దాదాపు 15 ఏళ్ల నుంచి టి20లు ఆడుతున్న పొలార్డ్ వెస్టిండీస్తో పాటు ఎన్నో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాలీలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ, కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్కు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, బీబీఎల్లో అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్, బంగ్లా ప్రీమియర్ లీగ్లో డాకా గ్లాడియేటర్స్, డాకా డైనమిటీస్, పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జాల్మికి ప్రాతినిధ్యం వహించాడు. పొలార్డ్ తర్వాత టి20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జాబితాలో డ్వేన్ బ్రావో(543 మ్యాచ్లు), షోయబ్ మాలిక్(472 మ్యాచ్లు), క్రిస్ గేల్(463 మ్యాచ్లు), రవి బొపారా(426 మ్యాచ్లు) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పొలార్డ్ హిట్టింగ్తో లండన్ స్పిరిట్స్ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు చేసింది. పొలార్డ్తో పాటు కెప్టెన్ ఇయాన్ మెర్గాన్(37 పరుగులు), ఓపెనర్ జాక్ క్రాలీ(41 పరుగులు) చేశారు. ఆ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్ జోర్డాన్ థాంప్సన్(4/15) ధాటికి 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో లండన్ స్పిరిట్స్ 52 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. చదవండి: Asia Cup 2022: పాక్ ప్రత్యర్ధిగా వందో టీ20 ఆడేందుకు సిద్ధంగా ఉన్న కోహ్లి బంగ్లాదేశ్కు మరోసారి ఊహించని షాక్.. వన్డే సిరీస్ జింబాబ్వే సొంతం! -
పొలార్డ్ ఇంట పాండ్యా.. ఇది జరగకుండా విండీస్ టూర్ ముగియదంటూ కామెంట్స్
విండీస్ పర్యటనలో వరుస విజయాలతో (ఒక్క టీ20 మినహాయించి) దూసుకుపోతున్న టీమిండియా ఖాళీ సమయం దొరికితే కరీబియన్ దీవుల్లో చక్కర్లు కొడుతూ సేద తీరుతుంది. భారత జట్టులోని మెజారిటీ సభ్యులు వివిధ పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయగా.. స్టార్ ఆల్రైండర్ హార్ధిక్ పాండ్యా మాత్రం తన మాజీ ఐపీఎల్ సహచరుడు, తనెంతో అభిమానించే విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఇంటిని సందర్శించి, అతని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. No trip to the Caribbean is complete without a visit to the King’s home ❤️❤️ Polly my favourite and your beautiful family, thank you for hosting me my brother 🥰❤️😘 @KieronPollard55 pic.twitter.com/pGdhNX0n6l — hardik pandya (@hardikpandya7) August 4, 2022 టీమిండియా విండీస్ పర్యటన ముగిసే ముందు హార్ధిక్.. పోలార్డ్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు ట్విటర్లో పోస్ట్ చేశాడు. కింగ్ పొలార్డ్ ఆతిథ్యం స్వీకరించకుండా విండీస్ పర్యటన ముగియదని.. పోలార్డ్ తన ఫేవరెట్ అని, అన్నతో సమానమని, తనకు ఆతిధ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని కామెంట్ చేశాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, విండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ప్రస్తుతానికి (3 మ్యాచ్ల్లో) టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తదుపరి రెండు మ్యాచ్లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనున్నాయి. విండీస్ పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్ను 3-0తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. చదవండి: రోహిత్ బాటలోనే కేఎల్ రాహుల్.. హార్దిక్కు ప్రమోషన్! -
ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు.. టీ10 చరిత్రలో అరుదైన ఫీట్.. తొలి ఆటగాడిగా..!
క్రికెట్ చరిత్రలో మరో ఆరు బంతుల్లో ఆరు సిక్స్ల రికార్డు నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న పాండిచ్చేరి టీ10 లీగ్లో పేట్రియాట్స్ యువ ఆటగాడు కృష్ణ పాండే ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాది ఈ అరుదైన రికార్డు సాధించాడు. శనివారం రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కృష్ణ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పేట్రియాట్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన నితీష్ ఠాకూర్ బౌలింగ్లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాది పాండే విధ్వంసం సృష్టించాడు. పాండే కేవలం 19 బంతుల్లోనే 12 సిక్స్లు, 2 ఫోర్లతో 83 పరుగులు సాధించాడు. అయితే ఆనూహ్యంగా పేట్రియాట్స్ ఈ మ్యాచ్లో 4పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పేట్రియాట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగల్గింది. ఇక టీ20ల్లో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో మొదటిసారిగా ఈ ఫీట్ను సాధించాడు. అదే విధంగా శ్రీలంకతో జరగిన టీ20లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ కూడా ఈ అరుదైన ఫీట్ సాధించాడు. అయితే టీ10 క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా పాండే నిలిచాడు. చదవండి: Attack On Cricketer Mondli Khumalo: కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్.. 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣ He has done the unthinkable! #KrishnaPandey shows what's possible with his heart-stirring hits! Watch the Pondicherry T10 Highlights, exclusively on #FanCode 👉 https://t.co/GMKvSZqfrR pic.twitter.com/jfafcU8qRW — FanCode (@FanCode) June 4, 2022 -
IPL 2022: గత సీజన్లో అదరగొట్టారు.. కోట్లు కొట్టేశారు.. ఈసారి అట్టర్ ఫ్లాఫ్!
IPL 2022: ఐపీఎల్ లాంటి టీ20 టోర్నమెంట్లో ఎప్పుడు ఎవరు అదరగొడుతారు? ఎప్పుడు ఎవరు డీలా పడతారు? ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్న విషయాలను అంచనా వేయడం కాస్త కష్టమే! ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. పొట్టి ఫార్మాట్లో ఫామ్ను కొనసాగిస్తూ ముందుకు సాగటం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక సీజన్లో అదరగొట్టిన వాళ్లు.. మరో ఎడిషన్లో ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు. లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ డేవిడ్ వార్నర్లా గతంలో ఫామ్లేమితో ఇబ్బంది పడిన వాళ్లు తిరిగి విజృంభించనూ వచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021లో అదరగొట్టి.. 2022 ఎడిషన్లో చతికిలపడ్డ టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం. PC: IPL/BCCI మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ఐపీఎల్-2021లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 12 ఇన్నింగ్స్లలో కలిపి 441 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గత ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్గా మయాంక్ నిలిచాడు. అయితే, తాజా సీజన్లో పరిస్థితులు మారాయి. 12 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుని పంజాబ్ కెప్టెన్గా అతడిని నియమించింది ఫ్రాంఛైజీ. కానీ కెప్టెన్సీ భారం మోయలేక మయాంక్ చేతులెత్తేశాడు. బ్యాటర్గానూ విఫలమయ్యాడు. ఐపీఎల్-2022లో ఆడిన 12 మ్యాచ్లలో కలిపి 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మయాంక్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ పెద్దగా రాణించింది కూడా లేదు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో కేవలం ఆరు గెలిచి ఏడో స్థానంలో ఉంది. PC: IPL/BCCI వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మధ్యప్రదేశ్ యువ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ను కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్ రెండో అంచెలో వరుస అవకాశాలు దక్కించుకున్న వెంకటేశ్.. 10 ఇన్నింగ్స్లలో 370 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగల ఆల్రౌండర్గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఐపీఎల్-2022లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. వరుస వైఫల్యాలతో ఒకానొక సమయంలో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇక మొత్తంగా ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ ఆడిన అతడు కేవలం 182 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 50 నాటౌట్. తనను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంఛైజీ ఖర్చు చేసిన 8 కోట్లకు న్యాయం చేయలేకపోయాడు. PC: IPL/BCCI కీరన్ పొలార్డ్ వెస్టిండీస్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2010 నుంచి ముంబై జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ మాజీ కెప్టెన్ గత సీజన్లో 245 పరుగులు చేశాడు. చెన్నైపై సంచలన ఇన్నింగ్స్(34 బంతుల్లో 87 పరుగులు నాటౌట్) ఆడాడు. కట్ చేస్తే ఐపీఎల్-2022లో పరిస్థితి తలకిందులైంది. 6 కోట్లకు ముంబై రిటైన్ చేసుకుంటే స్థాయికి తగ్గట్లు రాణించలేక అతడు డీలా పడ్డాడు. ఆడిన 11 మ్యాచ్లలో కలిపి పొలార్డ్ చేసిన స్కోరు 144. ఇక వరుసగా పొలార్డ్ నిరాశపరిచిన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే తలంపుతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. PC: IPL/BCCI హర్షల్ పటేల్ గత ఐపీఎల్ ఎడిషన్లో అదరగొట్టే ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. ఆడిన 15 మ్యాచ్లలో 8.14 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టి ‘పర్పుల్’ పటేల్ అని కితాబులందుకున్నాడు. ఆర్సీబీని ప్లే ఆఫ్స్ చేర్చడంలో హర్షల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్లో వదిలేసిన్పటికీ మెగా వేలంలో ఆర్సీబీ అతడ కోసం 10.75 కోట్లు వెచ్చించింది. కానీ తాజా సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 12 మ్యాచ్లలో అతడు తీసినవి 18 వికెట్లు. గతేడాది పోలిస్తే ఈసారి పెద్దగా రాణించలేదనే చెప్పాలి. PC: IPL/BCCI వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత ఐపీఎల్ సీజన్లో 17 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ అద్భుత ప్రదర్శనతో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో కోల్కతా నైట్రైడర్స్ అదరగొట్టింది. ఏకంగా ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో వరుణ్ను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది కేకేఆర్. కానీ అతడు ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో తుదిజట్టు నుంచి తప్పించి హర్షిత్ రాణా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ఐపీఎల్-2022లో వరుణ్ చక్రవర్తి 11 ఇన్నింగ్స్లో కలిపి తీసిన వికెట్ల సంఖ్య- 6. చదవండి👉🏾IPL 2022: సన్రైజర్స్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్ చదవండి👉🏾IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్లోనైనా అవకాశమివ్వండి! -
"పొలార్డ్ను పక్కన పెట్టండి.. ఆ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వండి"
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ విధ్వంసకర ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన పొలార్డ్ కేవలం 129 పరుగులు మాత్రమే సాధించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఆడునున్న తదుపరి మ్యాచ్లకు పొలార్డ్ను పక్కన పెట్టి, డెవాల్డ్ బ్రెవిస్ను తుది జట్టులోకి తీసుకురావాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా సూచించాడు. "వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇప్పుడు అద్భుతంగా ఆడుతోంది. అయితే వారి జట్టులో ఒక మార్పు చేయవలసిన సమయం వచ్చింది. కీరన్ పొలార్డ్ స్థానంలో డెవాల్డ్ బ్రీవిస్ మళ్లీ తిరిగి జట్టులో రావాలి.పొలార్డ్కి మీరు ఎన్ని అవకాశాలు ఇస్తారు? అతడు బ్యాటింగ్లో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ పిచ్లపై బౌలింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నాడు.. అయితే బౌలర్గా అతడిని జట్టులో ఎంపిక చేయడం లేదు కదా. కాబట్టి పొలార్డ్కు టాటా బై బై చెప్పే సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను"అని ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ముంబై తన తదపురి మ్యాచ్లో సోమవారం కేకేఆర్తో తలపడనుంది. చదవండి: IPL 2022: ముంబైతో కేకేఆర్ ఢీ.. శ్రేయస్ సేన ఓడిందా..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: పొలార్డ్ కథ ముగిసింది.. జట్టు నుంచి తప్పించడం ఖాయం!
IPL 2022 MI Vs GT: ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో వెస్టిండీస్ ‘హిట్టర్’ కీరన్ పొలార్డ్ను 6 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. కానీ ఈ సీజన్లో అతడు తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లలో పొలార్డ్ చేసింది కేవలం 129 పరుగులు. అత్యధిక స్కోరు 25. ఈ గణాంకాలను బట్టి చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో కీలక సభ్యుడైన పొలార్డ్ వైఫల్యం ముంబై ఇండియన్స్ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ పొలార్డ్ను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం(మే 6) మ్యాచ్లో మరోసారి పొలార్డ్ విఫలం కావడంతో అతడి ఆట తీరుపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ మ్యాచ్లో 14 బంతులు ఎదుర్కొన్న ఈ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మిగిలి ఉన్న మ్యాచ్లలో పొలార్డ్పై వేటు తప్పదని అభిప్రాయపడ్డాడు. గుజరాత్తో మ్యాచ్ ఈ సీజన్లో అతడికి చివరిది కావొచ్చంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. ‘‘నాకు తెలిసి కీరన్ పొలార్డ్ ఇక వచ్చే ఏడాది నుంచి ఆడకపోవచ్చు. డెవాల్డ్ బ్రెవిస్ ఉన్నాడు. టిమ్ డేవిడ్ రాణిస్తున్నారు. కాబట్టి ఇక పొలార్డ్ను ఆడించకపోవచ్చు. నిజానికి ముందే వాళ్లు(ముంబై) టిమ్ డేవిడ్ను ఎందుకు జట్టులోకి తీసుకురాలేదో తెలియడం లేదు. సిక్సర్లు కొట్టే హిట్టింగ్ మెషీన్ను వాళ్లు పక్కకు పెట్టారు’’ అని పేర్కొన్నాడు. ఇక టిమ్ డేవిడ్ను తప్పక కొనసాగిస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక ఈ సీజన్లో సమిష్టి వైఫల్యంతో పదింట కేవలం రెండే మ్యాచ్లు గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలినవి 4 మ్యాచ్లు. వీటిలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. కాగా గుజరాత్తో మ్యాచ్లో ముంబై 5 పరుగుల తేడాతో గెలిచి రెండో విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. 21 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచిన టిమ్ డేవిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి👉🏾PBKS Vs RR Records: పంజాబ్, రాజస్తాన్.. వాంఖడేలో ఇరు జట్లకు పాపం ఏకంగా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: పొలార్డ్ వచ్చే ఏడాది గుజరాత్ టైటాన్స్కు ఆడతాడేమో!
IPL 2022 MI Vs GT: వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్తో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన సమయంలో వీరి మధ్య స్నేహం బలపడింది. ఇక క్యాష్ రిచ్ లీగ్ మెగా వేలం-2022 నేపథ్యంలో ముంబై హార్దిక్ను వదిలేసి.. పొలార్డ్ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకుని తమ కెప్టెన్గా నియమించింది. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు కేవలం తొమ్మిదింట ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా.. గుజరాత్ మాత్రం పది మ్యాచ్లలో ఏకంగా ఎనిమిది విజయాలతో టాప్లో కొనసాగుతోంది. ఇక ఈ రెండు జట్లు శుక్రవారం(మే 6) ముంబైలోని బ్రబౌర్న్ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న పొలార్డ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ముంబై జట్టుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఈరోజు పాలీ(పొలార్డ్) బాగా ఆడాలి. అయితే మేము మ్యాచ్ గెలవాలి. నువ్వు బాగానే ఉన్నావా అంటూ తనకు నేను మెసేజ్లు పెడుతూ ఉంటాను. ఒకవేళ నువ్వు వచ్చే ఏడాది గుజరాత్ టైటాన్స్కు ఆడతావేమో అని సరాదాగా ఆటపట్టిస్తూ ఉంటాను. అది ఎప్పటికీ జరగదని నాకు తెలుసు. కానీ అలా జోక్ చేస్తూ ఉంటా’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘2015 నాకు అత్యంత ముఖ్యమైనది. నాకౌట్ దశకు చేరాలంటే ఏడు మ్యాచ్లలో గెలవాల్సిన తరుణంలో నేను రెండు మ్యాచ్లలో జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నా. అలా విజయంతో పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకున్నా. అప్పుడు నేను మూడు సిక్సర్లు కొట్టానుకుంటా. చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు అవసరమైన వేళ మూడు నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరుకుంటే ఆ మజానే వేరు’’ అని గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాడు. ఇక గుజరాత్తోనూ తనకు ప్రత్యేక బంధం ఉందన్న హార్దిక్ పాండ్యా.. ముంబై జట్టు టైటిళ్లు గెలిచిన సందర్భంలో తాను కూడా ఆ జట్టులో భాగం కావడం మరింత ప్రత్యేకమని ఫ్రాంఛైజీ మీద అభిమానం చాటుకున్నాడు. చదవండి👉🏾Rovman Powell: ఆ రికార్డు బద్దలు కొట్టాలి! 130 మీటర్లు.. నా లక్ష్యం అదే! A tale of two colours - blue and golden - in the words of #PapaPandya 😍 📽 Captain relives his MI memories before the clash of the day #GTvMI@hardikpandya7 #SeasonOfFirsts #AavaDe pic.twitter.com/4ZNe7Gh69v — Gujarat Titans (@gujarat_titans) May 6, 2022 -
IPL 2022: పాపం పొలార్డ్.. కృనాల్ ఓవరాక్షన్ భరించలేకున్నాం!
IPL 2022 MI Vs LSG- Krunal Pandya- Kieron Pollard: లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా తీరును టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ విమర్శించాడు. ఎదుటి వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలంటూ హితవు పలికాడు. స్నేహితుడే కదా అని ఇష్టారీతిన ప్రవర్తించడం సరికాదని, ఎదుటివారి మనోభావాలను గౌరవించాలని సూచించాడు. కాగా ముంబై ఇండియన్స్, లక్నో జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో లక్నో ముంబైపై 36 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, చివరి ఓవర్లో కృనాల్ పాండ్యా.. ముంబై ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్తో వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా పొలార్డ్ కృనాల్ పాండ్యాను అవుట్ చేశాడు. ఇక ముంబై లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పొలార్డ్ వికెట్ను కృనాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్ వీపు పైకి దుమికి కృనాల్ అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. అయితే, పొలార్డ్ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్ చేరాడు. ఈ ఘటనపై స్పందించిన పార్థివ్ పటేల్ క్రిజ్బజ్తో మాట్లాడుతూ.. ‘‘కృనాల్, పొలార్డ్ మంచి స్నేహితులు. కానీ, ప్రత్యర్థులుగా మైదానంలో దిగినపుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. పొలార్డ్ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటపుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి. అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్రూంలో ‘స్నేహితుల’తో ఏడాదంతా ఎంత సరదాగా ఉన్నా పర్లేదు కానీ.. మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్ నాకైతే మరీ ఓవర్గా అనిపిస్తోంది’’ అని కృనాల్ తీరును తప్పుబట్టాడు. ఇక మరో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘‘ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు. ఒక ఆటగాడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో ఇలాంటివి చేయకపోవడం మంచిది. ఆ సమయంలో అతడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. ఒకవేళ పొలార్డ్ వెనక్కి తిరిగి సమాధానం ఇచ్చి ఉంటే ఏమయ్యేది? తను జట్టును గెలపించలేకపోతున్నాననే నిరాశతో వెనుదిరిగినపుడు కృనాల్ ఇలా చేయడం నిజంగా టూ మచ్’’ అని కృనాల్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. కాగా గతంలో పొలార్డ్, కృనాల్ ఒకే ఫ్రాంఛైజీ(ముంబై)కి ఆడారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా ప్రత్యర్థులుగా మైదానంలోకి దిగుతున్నారు. ఇక భారీ హిట్టర్గా పేరొందిన పొలార్డ్ ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అతడికి తాజా ఐపీఎల్ ఎడిషన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి 115 పరుగులు(అత్యధిక స్కోరు: 25) చేసిన ఈ వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్.. 3 వికెట్లు తీశాడు. ఇక లక్నోతో మ్యాచ్లో పొలార్డ్ చేసిన స్కోరు: 20 బంతుల్లో 19 పరుగులు. ఇదిలా ఉంటే.. ముంబై వరుసగా ఎనిమిదో ఓటమి మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఈ జట్టు నిష్క్రమించినట్లయింది. చదవండి👉🏾 Trolls On Ishan Kishan: ధర 15 కోట్లు.. ఇషాన్ ఇదేమైనా టెస్టు మ్యాచ్ అనుకున్నావా? పాపం ముంబై ఫ్రాంఛైజీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 37 and @LucknowIPL take this home with a 36-run win over #MumbaiIndians Scorecard - https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/9aLniT8oHi — IndianPremierLeague (@IPL) April 24, 2022 -
అప్పుడూ.. ఇప్పుడూ ధోని మాస్టర్ ప్లాన్కు చిత్తు.. ఇగో వదిలెయ్!
IPL 2022 CSK Vs MI- MS Dhoni- Kieron Pollard: ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. నాకు తిరుగులేదు అన్న అహంభావంతోనే చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్లో వికెట్ కోల్పోయాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా ఇగోను పక్కనపెట్టి జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని సూచించాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైతో గురువారం జరిగిన మ్యాచ్లో ముంబై పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి బంతికి ధోని ఫోర్ బాదడంతో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై వరుసగా ఏడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(0), ఇషాన్ కిషన్(0) పూర్తిగా విఫలం కాగా... వన్డౌన్లో వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(51) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆఖర్లో 9 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 14 పరుగులు సాధించిన పొలార్డ్ భారీ స్కోరు చేసేలా కనిపించాడు. అయితే, ప్రమాదకరంగా పరిణమిస్తున్న పొలార్డ్ను పెవిలియన్కు పంపేందుకు చెన్నై మాజీ కెప్టెన్ ధోని ఫీల్డ్ సెట్ చేశాడు. తలైవా మాస్టర్ ప్లాన్లో చిక్కుకున్న ఈ భారీ హిట్టర్ మహీశ్ తీక్షణ బౌలింగ్లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మహీశ్ సంధించిన క్యారమ్ బాల్ను తేలికగా తీసుకుని డీప్లో ఉన్న దూబేకు దొరికిపోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ధోనికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇగోకు పోయి బొక్కబోర్లా పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘స్ట్రెయిట్ షాట్లు ఆడటమే పొలార్డ్ బలం. అందుకే అక్కడ వాళ్లు(సీఎస్కే) ఫీల్డర్ను పెట్టారు. కాబట్టి పొలార్డ్ కాస్త ఆచితూచి ఆడాల్సింది. కానీ అతడు అప్పుడు కూడా స్ట్రెయిట్ షాట్ ఆడేందుకే మొగ్గు చూపాడు. మూల్యం చెల్లించాడు. మంచి ఇన్నింగ్స్ ఆడుతూ.. మ్యాచ్లు గెలిపిస్తూ కీలక ప్లేయర్గా అవతరించిన తర్వాత.. ‘‘మీరు నాకోసం వల పన్నారు కదా! చూడండి నా బలమేమిటో చూపిస్తా’’ అన్నట్లుగా పొలార్డ్ వ్యవహరించాడు. ఫలితంగా వికెట్ సమర్పించుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. 12 ఏళ్ల క్రితం ఇదే తరహాలో ఐపీఎల్-2010 ఫైనల్లో సీఎస్కేతో మ్యాచ్లో పొలార్డ్ అవుటైన సంగతి తెలిసిందే. ఆల్బీ మోర్కెల్కు బంతిని ఇచ్చిన ధోని మిడాఫ్లో మాథ్యూ హెడెన్ ఫీల్డర్గా పెట్టగా.. పొలార్డ్ అతడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో ముంబైపై 22 పరుగుల తేడాతో గెలుపొందిన ధోని సేన టైటిల్ ఎగురేసుకుపోయింది. చదవండి👉🏾: MS Dhoni IPL Record: ఐపీఎల్లో ధోని అరుదైన రికార్డు.. రైనా, డివిల్లియర్స్ను వెనక్కి నెట్టి.. Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home. What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ — IndianPremierLeague (@IPL) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పొలార్డ్ కాళ్లకు దండం పెట్టిన బ్రావో.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై విధ్వంసకర ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ప్రాక్టీస్కు వెళ్తుండగా.. సీఎస్కే స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో అతడి కాళ్లకు దండం పెట్టాడు. అదే విధంగా అనంతరం వీరిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అదే విధంగా వీరిద్దరూ చాలా ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే పొలార్డ్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరనీ షాక్కు గురి చేశాడు. పొలార్డ్ విండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. pic.twitter.com/7gVh2Uys7n — Diving Slip (@SlipDiving) April 21, 2022 -
పొలార్డ్ నిర్ణయం నన్ను షాక్కు గురిచేసింది: సునీల్ నరైన్
వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని అందరని షాక్కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, కేకేఆర్ విధ్వంసకర ఆల్రౌండర్ సునీల్ నరైన్ .. కీరన్ పొలార్డ్ ఆకస్మిక రిటైర్మెంట్ పట్ల నిరాశను వ్యక్తం చేశాడు.అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పొలార్డ్ ఇకపై దేశవాళీ టోర్నీల్లో మాత్రం ఆడనున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున పొలార్డ్ ఆడుతున్నాడు. పొలార్డ్ విండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20ల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. "పొలార్డ్ తీసుకున్న నిర్ణయం నన్ను షాక్కు గురి చేసింది. అయితే అతడు మరి కొంత కాలం విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉంటే బాగుండేది. అతడు జట్టుకు చేయవలిసింది ఇంకా చాలా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పొలార్డ్.. తన భవిష్యత్తులో ఏ టోర్నమెంట్లో ఆడినా అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నాను" నరైన్ అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: లంక యువ పేసర్కు బంపర్ ఆఫర్.. ఆడమ్ మిల్నే స్థానంలో సీఎస్కేలోకి ఎంట్రీ -
పొలార్డ్ సంచలన నిర్ణయం.. గుడ్బై చెప్పేశాడు!
Kieron Pollard Retirement: వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు పొలార్డ్ బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో.. ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. పొలార్డ్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. వెస్టిండీస్ జట్టుకు పరిమిత ఓవర్ల కెప్టెన్గా పొలార్డ్ వ్యవహరిస్తున్నాడు. కేవలం 34 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. పొలార్డ్ ప్రస్తుతం ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ఇక ఏప్రిల్ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పొలార్డ్ తన ఆల్రౌండ్ సామర్థ్యంతో విండీస్ జట్టులోతన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎన్నో మ్యాచ్లను ఒంటి చేత్తో జట్టును పొలార్డ్ గెలిపించాడు. "నేను ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. నాకు నేను ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చాలా మంది యువకుల మాదిరిగానే.. నేను 10 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పటి నుంచి వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల. 15 సంవత్సరాలకు పైగా టీ20,వన్డేల్లో వెస్టిండీస్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నాను. నేను రిటైర్ అయ్యాక కూడా.. నా జట్టుకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాను. నాకు 15 ఏళ్లపాటు ఈ అవకాశం కల్పించినందుకు వెస్టిండీస్ క్రికెట్ నా కృతజ్ఞతలు అని పొలార్డ్ పేర్కొన్నాడు. కాగా 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్తో అరంగేట్రం చేసిన పొలార్డ్ 15 ఏళ్ల కెరీర్లో 123 వన్డేలు ఆడాడు. 2,706 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. 2008లో ఆస్ట్రేలియాతో టి20 ఫార్మాట్కు శ్రీకారం చుట్టిన ఈ హిట్టర్ 101 మ్యాచ్ల్లో 1,569 పరుగులు చేశాడు. గత ఏడాది శ్రీలంకతో మ్యాచ్లో పొలార్డ్ 6 బంతుల్లో 6 సిక్స్ లు బాది... అంతర్జాతీయ క్రికెట్లో గిబ్స్, యువరాజ్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా నిలిచాడు. 2012లో విండీస్ గెలిచిన టి20 ప్రపంచకప్లో పొలార్డ్ సభ్యుడిగా ఉన్నాడు. చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా... -
పొలార్డ్.. మరీ ఇంత నిర్లక్ష్యం పనికి రాదు!
ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ తన నిర్లక్ష్యం కారణంగా వికెట్ పారేసుకోవాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఇది చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతిని పోలార్డ్ లాంగాన్ దిశగా ఆడాడు. ఇక్కడ ఈజీగా రెండు పరుగులు వచ్చే అవకాశం ఉంది. కానీ పొలార్డ్ పరుగు తీయాలా వద్దా అన్నట్లుగా నత్తనడకన సింగిల్ పూర్తి చేశాడు. అయితే అప్పటికే సూర్యకుమార్ సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం వస్తున్నాడు. ఇది గమనించని పొలార్డ్ కొన్ని సెకన్లు నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్నాడు. సూర్యను చూసి తేరుకున్న పొలార్డ్ రెండో పరుగుకు వెళ్లినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతి అందుకున్న ఓడియన్ స్మిత్ కీపర్ జితేశ్ శర్మకు త్రో వేశాడు. పొలార్డ్ క్రీజులోకి చేరుకునేలోపే అతను వికెట్లను గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు. పొలార్డ్ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. రెండు పరుగులు వచ్చే చోట ఒక పరుగుకే పరిమితం కావడం ఏంటని అభిమానులు దుమ్మెత్తి పోశారు. అప్పటికే సూర్య కారణంగా తిలక్ వర్మ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా సూర్య తప్పు లేదు.. తిలక్ వర్మ ఆవేశంగా పరిగెత్తి అనవసరంగా రనౌట్ అయ్యాడు. చదవండి: IPL 2022: సూర్య తప్పు లేదు.. తిలక్వర్మదే దురదృష్టం పొలార్డ్ రనౌట్ కోసం క్లిక్ చేయండి -
రోహిత్ కెప్టెన్సీ వదిలేస్తాడనుకున్నా..!
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ పరాజయాలే చూసిన ముంబై.. బుధవారం పంజాబ్ కింగ్స్తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గనుక ముంబై ఓడిపోతే ఇక అంతే సంగతి. దీనికి తోడూ రోహిత్ శర్మ అటు కెప్టెన్గా.. ఇటు బ్యాట్స్మన్గా ఘోరంగా విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్లు కలిపి రోహిత్ .. 41,10, 3,26 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ రోహిత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కోహ్లిలాగే రోహిత్ శర్మ సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్సీ వదిలేస్తాడనుకున్నా. కోహ్లి కూడా గత సీజన్లో బ్యాటింగ్పై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఇక రోహిత్ కూడా కెప్టెన్సీ బాధ్యతలు పొలార్డ్కు అప్పజెప్పి తాను బ్యాటింగ్పై దృష్టి సారిస్తే బాగుండేది. టీమిండియా కెప్టెన్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టకముందు రోహిత్ ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్గా ఉన్నాడు. ఐదుసార్లు ముంబైని చాంపియన్గా నిలిపాడు. కానీ దేశానికి కెప్టెన్ అనే పదం రోహిత్ను ఒత్తిడిలో పడేసింది. ఆ ప్రభావం ఐపీఎల్లో కనిపిస్తుంది. ఇప్పటికైనా రోహిత్.. పొలార్డ్కు నాయకత్వ బాధ్యతలు అప్పజెపితే బాగుంటుంది. కెప్టెన్గా పొలార్డ్కు చక్కని అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో విండీస్ కెప్టెన్గా పొలార్డ్ వ్యవహరిస్తున్నాడు. ఒక రకంగా పొలార్డ్కు కెప్టెన్సీ ఉంటేనే బ్యాటింగ్లో రాణిస్తాడని అంటారు. కెప్టెన్సీ అతనికి బలంగా మారుతుంది.. సిక్సర్లు అవలీలగా సందిస్తాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022: 'రిటైర్డ్ ఔట్'.. ఇది ఆరంభం మాత్రమే : అశ్విన్ IPL 2022: రెండు భారీ రికార్డులపై కన్నేసిన రోహిత్ శర్మ -
దేవుని దయవల్ల ఏం కాలేదు.. అంతా బాగానే ఉంది
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ ఓపెనర్ అనూజ్ రావత్కు కొంచెంలో ప్రమాదం తప్పింది. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో డుప్లెసిస్, అనూజ్రావత్ నిలకడగా ఆడుతున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ కీరన్ పొలార్డ్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని అనూజ్ రావత్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న డుప్లెసిస్ సింగిల్కు కాల్ ఇయ్యడంతో అనూజ్ పరిగెత్తాడు. ఇంతలో ముంబై ఫీల్డర్ పొలార్డ్కు త్రో వేశాడు. దానిని అందుకునే క్రమంలో పొలార్డ్ అనూజ్ రావత్ పరిగెత్తుతున్న వైపు వచ్చాడు. దీంతో ఇద్దరు ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకోవడంతో అనూజ్ కిందపడ్డాడు. అయితే హెల్మెట్ గ్రౌండ్కు బలంగా గుద్దుకున్నప్పటికి.. రావత్ కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత పొలార్డ్ అతని వద్దకు వచ్చి బాగానే ఉందిగా అని అడిగాడు.. దానికి రావత్.. ఐయామ్ ఫైన్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఈ వీడియో చూసిన అభిమానులు.. ''పెద్ద గండం తప్పింది.. దేవుని దయవల్ల ఏం కాలేదు.. అంతా బాగానే ఉంది'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: Surya Kumar Yadav: అంతా కట్టగట్టుకొని విఫలమయ్యారు.. ఒక్కడు మాత్రం Abhishek Sharma: కోట్లు పెట్టి కొన్నందుకు ఎట్టకేలకు మెరిశాడు.. #AnujRawat pic.twitter.com/WG8OAsCYYw — Raj (@Raj93465898) April 9, 2022 -
జట్టుకు భారంగా మారుతున్నాడా.. సమయం ఆసన్నమైందా!
విధ్వంసకర ఆటతీరుకు పెట్టింది పేరు కీరన్ పొలార్డ్. 10వేలకు పైగా పరుగులు.. 300కు పైగా వికెట్లు తీసి టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత ఆల్ఆరౌండర్గా పేరు పొందాడు. కానీ ఎందుకనో పొలార్డ్లో ఆ విధ్వంసం కొన్నాళ్లుగా కనబడడం లేదు. అంతర్జాతీయ మ్యాచ్ల నుంచి ప్రైవేట్ లీగ్స్ వరకు పొలార్డ్ ఈ మధ్యన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ జట్టుకు భారంగా మారనున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్లోనూ పొలార్డ్ పెద్దగా రాణించింది ఏం లేదు. 14 మ్యాచ్లాడిన పొలార్డ్ 245 పరుగులు.. బౌలింగ్లో కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలిచిన ప్రతీసారి పొలార్డ్ జట్టులో ఉండడంతో మెగావేలానికి ముందే అతన్ని రిటైన్ చేసుకున్నారు. కానీ ఒక రాణించని ఆటగాడిని రిటైన్ చేసుకోవడం ఏంటని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఐపీఎల్ 2022లోనూ పొలార్డ్ తొలి మ్యాచ్లో నిరాశ పరిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాగా శనివారం రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో బౌలింగ్లోనూ తేలిపోయాడు. పొలార్డ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హెట్మైర్ విశ్వరూపం ప్రదర్శించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు సహా మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు. ఈ దెబ్బతో పొలార్డ్ తన 4 ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయగలిగాడు. ఇక బ్యాటింగ్లో పొలార్డ్ మెరవకపోతే.. రోహిత్ అతన్ని జట్టు నుంచి పక్కకు తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ముంబై అభిమానులు కూడా పొలార్డ్ ఆటతీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. పొలార్డ్ను ఎందుకు రిటైన్ చేసుకున్నారో అర్థం కావడం లేదు.. అతని స్థానంలో వేరే వాళ్లకు అవకాశం ఇవ్వండి.. మునుపటి పొలార్డ్ను మేము చూడలేకపోతున్నాం.. అతని పని అయిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Russell-Sam Billings: 'రసెల్తో బ్యాటింగ్ అంటే నాకు ప్రాణ సంకటం' IPL 2022: సీఎస్కేకు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ బౌలర్ ఆసుపత్రి పాలు, మరొకరిది అదే పరిస్థితి -
స్పిన్నర్గా మారిన పొలార్డ్.. ముంబై ఇండియన్స్కు ఇక.. వీడియో వైరల్
వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ సరికొత్త అవతారం ఎత్తాడు. సాదారణంగా మీడియం పేస్ బౌలింగ్ చేసే పొలార్డ్.. తొలి సారి స్పిన్నర్గా మారాడు. ట్రినిడాడ్ టీ10 బ్లాస్ట్లో భాగంగా స్కార్లెట్ ఐబిస్ స్కార్చర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోకా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పొలార్డ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ అందరనీ ఆశ్చర్య పరిచాడు. సోకా కింగ్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన పొలార్డ్ స్పిన్ బౌలింగ్ చేయడమే కాకుండా.. బ్యాటర్ లియోనార్డో జూలియన్ను క్లీన్ బౌల్డ్ కూడా చేశాడు.ఈ మ్యాచ్లో కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన పొలార్డ్ 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కాగా పొలార్డ్ బౌలింగ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మంబైకు కొత్త స్పిన్నర్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సోకా కింగ్స్ నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. అయితే వర్షం కారణంగా టార్గెట్ను 8 ఓవర్లకు 122 పరుగులకు కుదించారు. ఇక 122 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కార్చర్స్ మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులకు మాత్రమే పరిమితమైంది. అయితే స్కార్చర్స్ కెప్టెన్ పొలార్డ్ మాత్రం కేవలం 8 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్కు పొలార్డ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. Kieron Pollard bowling off-spin in the Trinidad T10 Blast.pic.twitter.com/rN0mq04II8 — Johns. (@CricCrazyJohns) February 28, 2022 -
Ind Vs Wi: అతడు వరల్డ్ క్లాస్ ప్లేయర్.. అందరూ తన నుంచి నేర్చుకోవాలి: పొలార్డ్
Ind Vs Wi T20 Series- మిగతా ఆటగాళ్లతో పోలిస్తే ఎంట్రీ కాస్త లేటయినా... అవకాశం వచ్చిన ప్రతిసారి తనను నిరూపించుకుంటూనే ఉన్నాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో ముగిసిన టీ20 సిరీస్లోనూ సత్తా చాటాడు ఈ ముంబైకర్. మూడు మ్యాచ్లలో కలిపి 107 పరుగులు సాధించాడు. సగటు 53.50. స్ట్రైక్రేటు 194.55. ముఖ్యంగా ఆఖరిదైన మూడో మ్యాచ్లో 31 బంతుల్లోనే 65 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో ఒక ఫోర్, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సూర్యకుమార్ సొంతమయ్యాయి. ఈ క్రమంలో విండీస్తో సిరీస్లో సూర్యకుమార్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక వెస్టిండీస్ కెప్టెన్, ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ కూడా సూర్యను ప్రశంసల్లో ముంచెత్తడం గమనార్హం. ఆదివారం నాటి వర్చువల్ సమావేశంలో పొలార్డ్ మట్లాడుతూ... ‘‘సూర్య వరల్డ్క్లాస్ ప్లేయర్. 2011 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో తనతో కలిసి ఆడుతున్నాను. క్రికెటర్గా తన ఎదుగులను చూస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా... టీమిండియా విజయాల కోసం అతడు చేస్తున్న కృషి, ఆడుతున్న తీరు అమోఘం. అతడు 360 డిగ్రీ ప్లేయర్. ప్రతి బ్యాటర్ తన నుంచి నేర్చుకోవాల్సి ఉంది. అతడి నుంచి స్ఫూర్తి పొందాలి’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో రిటెన్షన్లో భాగంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(రూ. 16 కోట్లు) సహా జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు) , కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20 సిరీస్లో భాగంగా రోహిత్, సూర్యకుమార్ అదరగొట్టగా... పొలార్డ్ ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా విఫలమయ్యాడు. రోహిత్ సేన చేతిలో పొలార్డ్ బృందం వన్డే, టీ20 సిరీస్లో వైట్వాష్కు గురైంది. 𝐓𝐇𝐀𝐓. 𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆. 𝐅𝐄𝐄𝐋𝐈𝐍𝐆 ☺️ ☺️ What a performance this has been by the @ImRo45 -led #TeamIndia to complete the T20I series sweep! 🏆 👏#INDvWI | @Paytm pic.twitter.com/L04JzVL5Sm — BCCI (@BCCI) February 20, 2022 చదవండి: Ind Vs Wi 3rd T20- Rohit Sharma: వాళ్లు జట్టులో లేకున్నా మేము గెలిచాం.. సంతోషం: రోహిత్ శర్మ -
సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా
-
IND vs WI 2nd T20I Prediction: బ్యాటర్లు కూడా అంతంత మాత్రమే.. పాపం విండీస్ను గెలిపించేదెవరు?
వన్డే సిరీస్లో టీమిండియా చేతిలో వైట్వాష్కు గురైన వెస్టిండీస్ టీ20 సిరీస్ను కూడా పరాజయంతోనే ఆరంభించింది. మొదటి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో శుక్రవారం(ఫిబ్రవరి 18) నాటి రెండో టీ20 మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. కాగా బౌలింగ్లో చెప్పుకోదగ్గ వనరులు లేని విండీస్ కనీసం తమకు తెలిసిన విద్య దూకుడైన బ్యాటింగ్తోనైనా మ్యాచ్లో ప్రభావం చూపలేకపోక అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. నికోలస్ పూరన్ మాత్రమే గత మ్యాచ్లో బాగా ఆడగా, మిగతా వారంతా టి20 తరహా ప్రదర్శన చేయలేకపోయారు. ముఖ్యంగా ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ‘హిట్టర్’ పొలార్డ్ ఒక్క ఇన్నింగ్స్లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. కెప్టెన్ కూడా అయిన పొలార్డ్ గత మ్యాచ్లో మరీ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఇదిలా ఉంటే... వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. మరి విండీస్ ఓపెనర్లు బ్రండన్ కింగ్, మేయర్స్ శుభారంభం అందించడం సహా, పూరన్, పొలార్డ్ భారీ ఇన్నింగ్స్ ఆడితే తప్ప పర్యాటక జట్టు నుంచి చెప్పుకోదగ్గ స్కోరు ఆశించలేం. ఇండియా వర్సెస్ వెస్టిండీస్- రెండో టీ20: ఎప్పుడు, ఎక్కడ.. తదితర వివరాలు తేదీ: ఫిబ్రవరి 18, 2002 వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా . సమయం: రాత్రి 7 గంటలకు ఆరంభం స్టార్స్పోర్ట్స్, హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం ముఖాముఖి రికార్డు: మొత్తం 18 మ్యాచ్లు జరుగగా భారత్ 11, విండీస్ 6 మ్యాచ్లు గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది. తుది జట్ల అంచనా: భారత్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్/శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్/ ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయి, యజువేంద్ర చహల్. వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫ్యాబియన్ అలెన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్/డొమినిక్ డ్రేక్స్. చదవండి: Ishan Kishan-Rohit Sharma: ఇషాన్ కిషన్కు క్లాస్ పీకిన రోహిత్ శర్మ.. విషయమేంటి Ranji Trophy 2022: సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే .@surya_14kumar and Venkatesh Iyer take #TeamIndia home with a 6-wicket win in the 1st T20I. Scorecard - https://t.co/dSGcIkX1sx #INDvWI @Paytm pic.twitter.com/jfrJo0fsR3 — BCCI (@BCCI) February 16, 2022 -
తొలి టీ-20లో భారత్ ఘన విజయం
-
IND Vs WI : తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫోటోలు)
-
అదే జోరు.. టీమిండియా తగ్గేదే లే
రోహిత్ శర్మ నాయకత్వంలో వెస్టిండీస్పై వన్డే సిరీస్లో ఏకపక్ష విజయాలు సాధించిన భారత జట్టు టి20 సిరీస్లోనూ అదే జోరును కొనసాగించింది. మ్యాచ్ ఫార్మాట్, వేదిక మారడం మినహా ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తొలి మ్యాచ్ ఆడిన రవి బిష్ణోయ్ సహా బౌలర్లు రాణించడంతో ముందుగా ప్రత్యర్థిని సాధారణ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ పునాదిపై సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. కోల్కతా: వెస్టిండీస్తో జరిగిన తొలి టి20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 61; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కైల్ మేయర్స్ (24 బంతుల్లో 31; 7 ఫోర్లు) రాణించాడు. తన తొలి మ్యాచ్లోనే ప్రత్యర్థిని కట్టడి చేసిన రవి బిష్ణోయ్ (2/14) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, చహల్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (19 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 35; 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇరు జట్ల మధ్య రేపు రెండో టి20 జరుగుతుంది. పూరన్ మినహా... తొలి ఓవర్లోనే బ్రండన్ కింగ్ (4)ను అవుట్ చేసి విండీస్ను భువనేశ్వర్ దెబ్బ కొట్టాడు. అయితే ఎనిమిది బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టిన మేయర్స్, ఆపై భువీ, హర్షల్ పటేల్ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. అయితే చహల్ మొదటి ఓవర్లోనే మేయర్స్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా... ఛేజ్ (4), రావ్మన్ పావెల్ (2) విఫలమయ్యారు. వీరిద్దరిని రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. మరో ఎండ్లో పూరన్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్తో జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. చహల్ బౌలింగ్లోనే మూడు సిక్సర్లు బాదిన పూరన్ 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో కీరన్ పొలార్డ్ (19 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొంత ధాటిని ప్రదర్శించడంతో విండీస్ స్కోరు 150 పరుగులు దాటగలిగింది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు 61 పరుగులు సాధించింది. శుభారంభం... ఛేదనను భారత్ మెరుపు వేగంతో ప్రారంభించింది. ముఖ్యంగా ఒడెన్ స్మిత్ వేసిన ఓవర్లో రోహిత్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగాడు. పవర్ప్లే ముగిసేసరికే భారత్ స్కోరు 58 పరుగులకు చేరింది. అయితే తొలి వికెట్కు 45 బంతుల్లోనే 64 పరుగులు జోడించాక భారీ షాట్కు ప్రయత్నించి రోహిత్ అవుటయ్యాడు. కొద్ది సేపటికే రెండు పరుగుల వ్యవధిలో ఇషాన్, కోహ్లి (17) కూడా వెనుదిరగ్గా, పంత్ (8) విఫలమయ్యాడు. అయితే సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్ (13 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్ను ముగించారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) సూర్యకుమార్ (బి) భువనేశ్వర్ 4; మేయర్స్ (ఎల్బీ) (బి) చహల్ 31; పూరన్ (సి) కోహ్లి (బి) హర్షల్ 61; ఛేజ్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 4; పావెల్ (సి) వెంకటేశ్ (బి) బిష్ణోయ్ 2; హొసీన్ (సి అండ్ బి) చహర్ 10; పొలార్డ్ (నాటౌట్) 24; స్మిత్ (సి) రోహిత్ (బి) హర్షల్ 4; ఎక్స్ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–4, 2–51, 3–72, 4–74, 5–90, 6–135, 7–157. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–31–1, దీపక్ చహర్ 3–0–28–1, హర్షల్ పటేల్ 4–0–37–2, చహల్ 4–0–34–1, రవి బిష్ణోయ్ 4–0–17–2, వెంకటేశ్ అయ్యర్ 1–0–4–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్మిత్ (బి) ఛేజ్ 40; ఇషాన్ కిషన్ (సి) అలెన్ (బి) ఛేజ్ 35; కోహ్లి (సి) పొలార్డ్ (బి) అలెన్ 17; పంత్ (సి) స్మిత్ (బి) కాట్రెల్ 8; సూర్యకుమార్ (నాటౌట్) 34; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 24; ఎక్స్ట్రాలు 4; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–64, 2–93, 3–95, 4–114. బౌలింగ్: కాట్రెల్ 4–0–35–1, షెఫర్డ్ 3–0–24–0, ఒడెన్ స్మిత్ 2–0–31–0, హొసీన్ 4–0–34–0, ఛేజ్ 4–0–14–2, అలెన్ 1.5–0–23–1. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
IND Vs WI 1st T20: ఇండియా వర్సెస్ వెస్టిండీస్.. అప్డేట్స్
-
Ind Vs Wi 1st T20: అలా అయితే రోహిత్ సేనకు సవాళ్లు తప్పవు మరి!
West Indies Tour Of India 2022- T20 Series: కోల్కతా వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య బుధవారం టీ20 సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ కోల్పోయిన పొలార్డ్ బృందం టి20 సిరీస్లో ఎలాగైనా శుభారంభం చేయాలనే కసితో బరిలోకి దిగుతోంది. తద్వారా పరాజయాల పరంపరకు ఫుల్స్టాప్ పెట్టాలనే లక్ష్యంతో ఉంది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో భారీ మొత్తాలు పలికిన విండీస్ ఆటగాళ్లు ఆ ఉత్సాహాన్ని తమ ప్రదర్శనలో చూపాలని పట్టుదలతో ఉన్నారు. నిలకడలేమి సమస్యను ఆధిగమిస్తే నిజంగానే విండీస్ టి20ల్లో దీటైన ప్రత్యర్థి. పొలార్డ్, పూరన్, పావెల్, హోల్డర్లు తమ బ్యాట్లు ఝుళిపిస్తే రోహిత్ సేనకు సవాళ్లు తప్పవు. భారత్- విండీస్ ముఖాముఖి పోరు- రికార్డులు భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 17 టి20 మ్యాచ్లు జరిగాయి. భారత్ 10 మ్యాచ్ల్లో నెగ్గగా... విండీస్ 6 మ్యాచ్ల్లో గెలిచింది. మరో మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? ఈడెన్ గార్డెన్స్, కోల్కతా ఫిబ్రవరి 16(బుధవారం)- రాత్రి 7 గంటలకు ఆరంభం. అంచనా జట్లు: భారత్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్/శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చహల్. వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్/డొమినిక్ డ్రేక్స్. చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్రైజర్స్ కోచ్ A sneak peek into #TeamIndia's fielding drill at the Eden Gardens. 👀 👌#INDvWI | @Paytm pic.twitter.com/wSFH4keVTx — BCCI (@BCCI) February 15, 2022 Bull's-eye Bhuvi 🎯 Sharp Siraj ⚡ A snippet of how the #TeamIndia speedsters sweated it out in the practice session under the watchful eyes of the Bowling Coach Paras Mhambrey at the Eden Gardens. 👌 👌#INDvWI | @Paytm | @BhuviOfficial | @mdsirajofficial pic.twitter.com/hMhCdAY9VJ — BCCI (@BCCI) February 15, 2022 -
Ind Vs WI 1st T20I: భువీ వద్దు... సిరాజ్కు జతగా ఆవేశ్ ఖాన్!
Ind Vs Wi T20 Series 2022- కోల్కతా: వన్డే సిరీస్ సంపూర్ణ విజయంతో ఆతిథ్య భారత జట్టు టి20 సిరీస్పైనా కన్నేసింది. మెరిపించి మురిపించేందుకు బ్యాటర్స్ సిద్ధంగా ఉన్నారు. సత్తా చాటేందుకు సీమర్లు తహతహలాడుతున్నారు. ఇక శుభారంభమే తరువాయి అన్నట్లుగా టీమిండియాలో ఆత్మవిశ్వాసం తొణకిసలాడుతోంది. మరోవైపు వన్డేలన్నీ ఓడిన వెస్టిండీస్ జట్టు మళ్లీ ఓడేందుకు సిద్ధంగా లేదు. పైగా ఫార్మాట్ మారింది. తమ ఆటగాళ్ల గేరు కూడా మారబోతుందని మ్యాచ్ ద్వారా చాటాలని కరీబియన్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే తొలి టి20 ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. ఇషాన్తోనే ఓపెనింగ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తిస్థాయి కెప్టెన్గా టీమిండియాకు అంతర్జాతీయ ట్రోఫీ అందించేందుకు తొలి అడుగు వేయబోతున్నాడు. తన ఫ్రాంచైజీ సహచరుడు పొలార్డ్ ఇప్పుడు ప్రత్యర్థి కెప్టెన్. ఈ నేపథ్యంలో పొట్టి సిరీస్లో ఎవరి వ్యూహాప్రతివ్యూహాలు పైచేయి సాధిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. తుది జట్టు కసరత్తు విషయానికొస్తే రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో దూరం కావడంతో రోహిత్ తన ఓపెనింగ్ భాగస్వామిగా ఇషాన్ కిషన్నే బరిలోకి దింపుతాడు. సూర్యకుమార్ను కొనసాగించాలనుకుంటున్న కెప్టెన్ ఆల్రౌండర్లలో శార్దుల్, దీపక్ చహర్, హర్షల్ పటేల్లలో ఒకరినే తీసుకోవచ్చు. పేసర్లలో వన్నే తగ్గిన భువనేశ్వర్ను కాదని సిరాజ్కు జతగా అవేశ్ ఖాన్ను బరిలోకి దించడం దాదాపు ఖాయమైంది. చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్రైజర్స్ కోచ్ Bull's-eye Bhuvi 🎯 Sharp Siraj ⚡ A snippet of how the #TeamIndia speedsters sweated it out in the practice session under the watchful eyes of the Bowling Coach Paras Mhambrey at the Eden Gardens. 👌 👌#INDvWI | @Paytm | @BhuviOfficial | @mdsirajofficial pic.twitter.com/hMhCdAY9VJ — BCCI (@BCCI) February 15, 2022 -
Ind Vs Wi: ‘నిజంగా విచారకరం.. పొలార్డ్ మిస్సయాడు.. పోలీసులకు రిపోర్టు చేయండి’
Ind Vs Wi ODI Series- Kieron Pollard- Dwayne Bravo : టీమిండియాతో వన్డే సిరీస్లో వెస్టిండీస్కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్లలోనూ ఓడి సిరీస్ను భారత జట్టుకు సమర్పించుకుంది. ముఖ్యంగా విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫామ్లేమి, గాయం జట్టును కలవరపెడుతోంది. మొదటి వన్డేలో అతడు వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. టీమిండియా బౌలర్ యజువేంద్ర చహల్ సంధించిన మొదటి బంతికే పొలార్డ్ వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక రెండో వన్డేలో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్లో రోహిత్ సేన విండీస్పై 44 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే, పొలార్డ్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. ఏ మేరకు రాణిస్తాడన్నది వేచిచూడాల్సిందే. అతడు బ్యాట్ ఝులిపిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొలార్డ్ సహచర ఆటగాడు, విండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్గా మారింది. ‘‘ఇది నిజంగా విచారకర దినం. నా బెస్ట్ ఫ్రెండ్ పొలార్డ్ తప్పిపోయాడు. ఒకవేళ మీకు ఏదైనా సమాచారం అందితే దయచేసి నాకు తెలియజేయండి. లేదంటే పోలీసులకు రిపోర్టు చేయండి’’ అంటూ ఏడుపు, నవ్వులు కలగలిసిన ఎమోజీలను జతచేశాడు. అంతేగాక.. ‘‘వయసు 34, ఎత్తు 1.85 మీటర్లు, చివరగా చహల్ పాకెట్లో చూశాం. కనిపిస్తే వెస్టిండీస్ను కాంటాక్ట్ చేయండి’’ అని పొలార్డ్ ఫొటోను షేర్ చేశాడు. ఇందుకు పొలార్డ్ సైతం సరదాగా స్పందించాడు. ‘‘అవునా బ్రావో.. నేను మిస్సయ్యానా.. ఎప్పుడు ఎలా?’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలతో బదులిచ్చాడు. కాగా ఇటీవల స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో ఓడి విండీస్ వన్డే సిరీస్ను చేజార్చుకుంది. భారత పర్యటనలో ఇదే తరహాలో చేదు అనుభవం మూటగట్టుకుంది. చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్కు భారీ షాక్! Series lost, but the boys go again on Friday in the final ODI with the opportunity to gain some World Cup qualification points. #MenInMaroon #INDvWI pic.twitter.com/Ah8U8XAnzt — Windies Cricket (@windiescricket) February 9, 2022 View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆 (@djbravo47) View this post on Instagram A post shared by Kieron Pollard (@kieron.pollard55) -
Ind Vs Wi 3rd ODI: సీమర్లు, స్పిన్నర్లకు చక్కని అవకాశం.. కుల్దీప్ తుదిజట్టులోకి?
Ind Vs Wi 3rd ODI: వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో వెస్టిండీస్తో నామమాత్రపు మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలోనూ విజయం సాధించి వైట్వాష్తో విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావిస్తోంది. ఆల్రౌండ్ ప్రతిభతో ఇప్పటికే రెండింట గెలిచిన రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇటు బ్యాటర్లు.. అటు బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో విండీస్ను క్లీన్స్వీప్ చేయడం అంత కష్టమేమీ కాకపోవచ్చు. మరోవైపు ఒత్తిడిలో కూరుకుపోయిన విండీస్ ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కోహ్లి, రాహుల్, పంత్, దీపక్ హుడా / సూర్యకుమార్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, సిరాజ్, చహల్ / కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ. వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), షై హోప్, బ్రండన్ కింగ్, డారెన్ బ్రేవో, బ్రూక్స్, పూరన్, హోల్డర్, ఫ్యాబియన్ అలెన్, హోసీన్, జోసెఫ్, రోచ్. పిచ్, వాతావరణం గత మ్యాచ్లాగే బౌలర్లకు అనుకూలించవచ్చు. ఇది సీమర్లు, స్పిన్నర్లకు చక్కని అవకాశం. వాతావరణంతో ఇబ్బంది లేదు. చలి తగ్గడంతో మంచు ప్రభావం ఉండదు. చదవండి: Under 19 Vice Captain Shaik Rasheed: సీఎం వైఎస్ జగన్ను కలిసి ఆశీస్సులు తీసుకుంటా That Winning Feeling! 👏 👏@prasidh43 picks his fourth wicket as #TeamIndia complete a 4⃣4⃣-run win over West Indies in the 2nd ODI. 👍 👍 #INDvWI @Paytm Scorecard ▶️ https://t.co/yqSjTw302p pic.twitter.com/R9KCvpMImH — BCCI (@BCCI) February 9, 2022 -
IPL 2022: 6 కోట్లు తగలేశారు.. ఇషాన్ను పక్కనపెట్టారు.. ముంబై పెద్ద తప్పే చేసింది!
IPL 2022 Auction- Mumbai Indians: టీ20 ప్రపంచకప్-2021 జరుగుతున్న సమయంలోనే జట్టుకు దూరం..... డిసెంబరులో పాకిస్తాన్ పర్యటనకు గైర్హాజరు.. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స... పర్లేదనిపించాడు... తర్వాత భారత్ టూర్కు విచ్చేశాడు.. టీమిండియాతో వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో పూర్తిగా విఫలం... రెండో వన్డేకు దూరం.. అవును... ఈ ఉపోద్ఘాతమంతా వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ గురించే. 34 ఏళ్ల ఈ ‘భారీ హిట్టర్’ ఇటీవలి కాలంలో తరచూ గాయాల బారిన పడుతున్నాడు. ఫిట్నెస్ లేమి కారణంగా పలు సందర్భాల్లో జట్టుకు దూరమయ్యాడు. భారత్తో బుధవారం నాటి మ్యాచ్లోనూ పొలార్డ్ ఆడలేదు. అతడి స్థానంలో నికోలస్ పూరన్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, అప్పటికే 1-0 తేడాతో వెనుకబడి ఉన్న విండీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో ఈ మ్యాచ్లోనూ ఓడి సిరీస్ను సమర్పించుకుంది. తద్వారా 19 ఏళ్ల తర్వాత భారత గడ్డపై వన్డే సిరీస్ గెలవాలన్న ఆశ నిరాశే అయ్యింది. Series lost, but the boys go again on Friday in the final ODI with the opportunity to gain some World Cup qualification points. #MenInMaroon #INDvWI pic.twitter.com/Ah8U8XAnzt — Windies Cricket (@windiescricket) February 9, 2022 ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే... కెప్టెన్ పొలార్డ్ ఫిట్నెస్ గురించే ముంబై ఇండియన్స్ అభిమానులు కలవరపడుతున్నారు. ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(రూ. 16 కోట్లు) సహా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు) , కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను అట్టిపెట్టుకుంది. కానీ పొలార్డ్ తరచూ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం, బ్యాటింగ్లో కూడా అంతగా మెరుపులు లేకపోవడంతో ముంబై.. అతడిని రిటైన్ చేసుకుని పెద్ద తప్పు చేసిందా అనే చర్చ మొదలైంది. అదే విధంగా... విధ్వంసకర యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను వదిలేయడంపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇషాన్ను పక్కనపెట్టడం, పొలార్డ్ రిటైన్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరుగనుంది. కాగా భారత్తో తొలి వన్డేలో పొలార్డ్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు.. ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు.విండీస్తో జరిగిన రెండో వన్డేలో సూర్యకుమార్ 83 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్ల్లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. చదవండి: Surya Kumar Yadav: వన్డే క్రికెట్ చరిత్రలో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్కడు -
Live Blog: విండీస్తో టీమిండియా రెండో వన్డే... హైలైట్స్
-
Ind Vs Wi: అదే ఆఖరు... 19 ఏళ్లకు పైగానే అయింది గెలిచి.. ఈసారి కూడా!
Ind Vs Wi ODI Series 2022- చారిత్రాత్మక 1000వ వన్డేలో వెస్టిండీస్పై అద్భుత విజయం అందుకున్న టీమిండియా రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు భారత్లో మరోవన్డే సిరీస్ పరాజయాన్ని తప్పించుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే రోహిత్ సేనదే పైచేయిగా కనిపిస్తోంది. తొలి వన్డేలో ఆల్రౌండ్ ప్రతిభతో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన నేపథ్యంలో టీమిండియాకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుధవారం నాటి మ్యాచ్లో పొలార్డ్ సేనకు మరోసారి పరాభవం తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత గడ్డపై విండీస్ వన్డే సిరీస్ల పరాజయ పరంపర రికార్డును పరిశీలిద్దాం. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వన్డే రికార్డులు: ►19 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా విండీస్ భారత్లో టీమిండియాను ఓడించలేకపోయింది. ►2002 సిరీస్లో 7 మ్యాచ్ల సిరీస్లో వెస్డిండీస్ 4-3 తేడాతో గెలుపొందింది. భారత్లో విండీస్కు ఇదే ఆఖరి విజయం. ►ఆ తర్వాత వరుసగా ఏడు వన్డే సిరీస్లో భారత్ చేతిలో విండీస్ ఓటమి పాలైంది. ►2007లో టీమిండియా 4 మ్యాచ్ల సిరీస్లో విండీస్పై 3-1 తేడాతో గెలుపొందింది. ►2011లో భారత్ విండీస్ను 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది. ►2013లో విండీస్పై 2-1తేడాతో టీమిండియా నెగ్గింది. ►2014లో భారత జట్టు మరోసారి 2-1 తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. ►2018లో భారత్ 3-1 తేడాతో విండీస్ను ఓడించి సిరీస్ గెలిచింది. ►2019లో విండీస్ టీమిండియా చేతిలో 2-1 తేడాతో పరాజయం పాలై వన్డే సిరీస్ను చేజార్చుకుంది. ►2022లో భాగంగా భారత్తో తొలి వన్డేలో వెస్టిండీస్ ఓడిపోయింది. చదవండి: IPL 2022 Mega Auction: అప్పుడు 1.5 కోట్లు.. ఇప్పుడు అతడి కోసం యుద్దం జరగనుంది.. రికార్డులు బద్దలు అవ్వాల్సిందే! -
IND Vs WI: ఏంటి సూర్య.. ఆ షాట్ ఎందుకు ఆడటం లేదు? ఇది ఐపీఎల్ కాదుగా పొలార్డ్!
వెస్డిండీస్తో తొలి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. చారిత్రాత్మక 1000వ వన్డేలో 36 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(60 పరుగులు) తర్వాత టీమిండియాలో సూర్యదే టాప్ స్కోర్. సూపర్ ఇన్నింగ్స్తో విజయంలో తన వంతు పాత్ర పోషించిన సూర్య.. మ్యాచ్ సందర్భంగా విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్తో జరిగిన సంభాషణ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్లో సూర్య, పొలార్డ్ సహచర ఆటగాళ్లన్న సంగతి తెలసిందే. సూర్య ఆట, షాట్ సెలక్షన్ గురించి అవగాహన ఉన్న పొలార్డ్... వన్డే మ్యాచ్లో అతడిని మాటలతో కవ్వించాడు. ఈ విషయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్... ‘‘పొలార్డ్ నాకు కొన్ని విషయాలు చెప్పాడు. మిడ్ వికెట్ ఓపెన్ ఉంది కదా. ఐపీఎల్లో ఆడిన మాదిరిగా ఫ్లిక్ షాట్ ఇక్కడెందుకు ఆడటం లేదు’’ అని నన్ను అడిగాడు. ‘‘ఐపీఎల్కు... వన్డేకు తేడా ఉంది కదా! చివరి వరకు క్రీజులో ఉండాలనుకుంటున్నా.. అందుకే షాట్ ఆడటం లేదు అని చెప్పాను’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా అరంగేట్ర ఆటగాడు దీపక్ హుడాతో భాగస్వామ్యం నెలకొల్పడం గురించి మాట్లాడుతూ... ‘‘గత ఏడేళ్లుగా తను దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండటం తనకు ముఖ్యం. అయితే... తనకు నేనేమీ సలహాలు ఇవ్వలేదు. ఆత్మవిశ్వాసంతో అతడు అజేయంగా నిలిచాడు. తన పట్టుదల నాకు నచ్చింది’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. Not the start to series boys wanted. But we go again on Wednesday. #MenInMaroon #INDvWI pic.twitter.com/1VpPjMHnyZ — Windies Cricket (@windiescricket) February 6, 2022 -
రోహిత్ శర్మ కళ్లు చెదిరే సిక్స్.. ఆ చూపుకు అర్థమేంటి ?
టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఓటమి పాలయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 28 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా కెప్టెన్.. ఓపెనర్ రోహిత్ శర్మ 60 పరుగులతో ఆరంభంలోనే గట్టి పునాది వేసి విజయానికి బాటలు పరిచాడు. తద్వారా టీమిండియా 1000వ వన్డేలో విజయం సాధించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇక పూర్తిస్థాయి కెప్టెన్గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటింగ్లో సూపర్ షాట్స్ ఆడాడు. రోహిత్ తాను ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోరు 84. అందులో రోహిత్వే 60 పరుగులున్నాయంటే ఎంత వేగంగా ఆడాడో అర్థమవుతుంది. చదవండి: Rishabh Pant: ఎంత పని చేశావు సూర్య.. పంత్ను వెంటాడిన దురదృష్టం 51 బంతుల్లో 60 పరుగులు సాధించిన రోహిత్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ హైలెట్గా నిలిచింది. జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని రోహిత్ క్రీజులోనే ఉండి వెనక్కి వంగి డీప్స్క్వేర్ లెగ్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఇది చూసిన పొలార్డ్ కోపంతో రోహిత్కు ఒక లుక్ ఇచ్చాడు.. తన పళ్లు నూరుతూ ఏంటి రోహిత్ అన్నట్లుగా ఆ లుక్లో అర్థం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Ear Therapy @ImRo45 💉pic.twitter.com/mrEJaU8oyW — 🎭 (@CloudyCrick) February 6, 2022 -
భారత్- విండీస్ తొలి వన్డే.. తుది జట్లు అంచనా!
స్వదేశంలో వెస్టిండీస్తో తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా భారత్-విండీస్ మధ్య తొలి వన్డే ఆదివారం జరగనుంది. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, కరోనాతో ధావన్, శ్రేయస్, రుతురాజ్, సైనీలు దూరమయ్యారు. మరో వైపు విండీస్ జట్టుకు గాయంతో హెట్మైర్, కోవిడ్తో ఎవిన్ లూయిస్ దూరమయ్యారు. వీరి స్ధానంలో ఒడియన్ స్మిత్, రొమరియో షెఫర్డ్ జట్టులోకి వచ్చారు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, పంత్, సూర్యకుమార్, దీపక్ హుడా/వాషింగ్టన్ సుందర్, చహర్, శార్దుల్, కుల్దీప్, చహల్, ప్రసిధ్ కృష్ణ. వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), హోప్, బ్రాండన్ కింగ్/బానెర్, పూరన్, బ్రూక్స్, డారెన్ బ్రేవో, స్మిత్/షెఫర్డ్, హోల్డర్, హొసెయిన్, రోచ్, హెడెన్ వాల్ష్ జూనియర్. పిచ్–వాతావరణం పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. భారీ స్కోర్లు ఖాయం. మంచు వల్ల బౌలర్లకు సవాళ్లు తప్పవు. వర్షం ముప్పులేదు. చదవండి: Under-19 World Cup Final: అరుదైన రికార్డు సాధించిన రాజ్ బావా.. కపిల్ దేవ్ తర్వాత! -
"టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం"
స్వదేశంలో ఇంగ్లండ్ను మట్టి కరిపించి టీమిండియా పర్యటనకు వెస్టిండీస్ బయలు దేరింది. కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని విండీస్ జట్టు మంగళవారం రాత్రి భారత్కు చేరుకోనుంది. అనంతరం అహ్మదాబాద్లో 3 రోజుల పాటు క్వారంటైన్లో విండీస్ జట్టు గడపనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో టీమిండియాను ఓడించిడం అంత సులువు కాదని, అయితే ప్రస్తుత కరీబియన్ జట్టుకు భారత్ను ఓడించే సత్తా ఉందని హోల్డర్ తెలిపాడు. "టీమిండియాతో సిరీస్ అతి పెద్ద సిరీస్గా భావిస్తున్నాను. ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ ఆల్రౌండ్ క్రికెట్ జట్టు. వాళ్ల గడ్డపై వారిని ఓడించడం అంత సులభం కాదు. గత రెండేళ్లుగా టీమిండియా స్వదేశంలో అధ్బుతంగా రాణిస్తుంది. కానీ ప్రస్తుత వెస్టిండీస్ జట్టుకు భారత్ను ఓడించే సత్తా ఉంది. గత ఏడాది స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత మా జట్టు నిరాశకు గురైంది. ఇంగ్లండ్పై మా జట్టు బౌన్స్బ్యాక్ చేసి అద్భుతమైన విజయం సాధించింది. అదే విధంగా మా డ్రెసింగ్ రూమ్లో కూడా ఏటువంటి విభేదాలు లేవు" అని హోల్డర్ పేర్కొన్నాడు. ఇక భారత పర్యటనలో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. చదవండి: Rashid Khan: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన రషీద్ ఖాన్.. అదరగొట్టేశాడుగా! -
Ind Vs Wi: కెప్టెన్ను మార్చే ప్రసక్తే లేదు... అనవసరంగా విమర్శలు... ఒకవేళ..
Ind Vs Wi: ‘‘ఫిల్, పొలార్డ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటేతర కారణాల వల్లే ఇలా జరుగుతోంది. అంతేతప్ప ఆట పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏదేమైనా ఇప్పట్లో కోచ్, కెప్టెన్ను మార్చే యోచనే లేదు’’ అని క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు రికీ స్కెరిట్ స్పష్టం చేశాడు. కాగా టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్కు ముందు విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్, కోచ్ ఫిల్ సిమన్స్పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2021లో వెస్టిండీస్ జట్టు ఘోర వైఫల్యం, ఇటీవల స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా జట్టులోని కొందరు ఆటగాళ్ల పట్ల పొలార్డ్ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి స్థానిక మీడియాలో కథనాలు వెలువడగా... విండీస్ బోర్డు వాటిని ఖండించింది. ఈ క్రమంలో సీడబ్ల్యూఐ అధ్యక్షుడు రికీ క్రిక్బజ్తో మాట్లాడుతూ... ‘‘ఒకవేళ వాళ్లు(ఫిల్, పొలార్డ్) తమ బాధ్యతను సరిగా నెరవేర్చలేదని నిరూపితమైతే అప్పుడు కచ్చితంగా పునరాలోచన చేస్తాం. అంతేతప్ప ఇప్పటికిప్పుడు వారిని పంపే ప్రసక్తే లేదు. కొంతమంది అకారణంగా వారిపై నిందలు వేస్తున్నారు. వారిని తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారు’’ అని కెప్టెన్, కోచ్కు మద్దతుగా నిలిచాడు. కాగా ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమి పాలైన విండీస్.. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్(3-2 తేడాతో)ను కైవసం చేసుకుని తిరిగి ఫామ్లోకి వచ్చింది. ఫిబ్రవరి 6న టీమిండియాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్కు పొలార్డ్ బృందం సన్నద్ధమవుతోంది. చదవండి: IPL 2022 Mega Auction: అతడు వేలంలోకి వస్తే.. జట్లు పోటీ పడాల్సిందే: అశ్విన్ IND vs WI: ఇప్పుడు ఇంగ్లండ్ పని అయిపోయింది.. తరువాత టీమిండియానే: పొలార్డ్ -
ఇంగ్లండ్ పని అయిపోయింది.. తరువాత టీమిండియానే: పొలార్డ్
Wi Vs Eng T20I: స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్ను 3-2 తేడాతో వెస్టిండీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా త్వరలో టీమిండియాతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్పై కీరన్ పొలార్డ్ సారథ్యంలోని విండీస్ జట్టు ఇప్పుడు కన్ను వేసింది. ఇంగ్లండ్తో ఐదో టీ20 అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కీలక వాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుతో ఆడడం తనకు చాలా ప్రత్యేకమైనది పొలార్డ్ తెలిపాడు. "ఇంగ్లండ్పై మాకు ఇది అద్భుత విజయం. ఇప్పుడు మేము భారత పర్యటనపై దృష్టిసారిస్తాం. మేము ఈ పర్యటనలో టీమిండియాపై కచ్చితంగా విజయం సాధిస్తాం. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాతో ఆడడానికి అతృతగా ఎదురు చూస్తున్నాం" అని పొలార్డ్ పేర్కొన్నాడు. ఇక భారత పర్యటనలో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. కాగా ఐపీఎల్లో రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ తరఫున పొలార్డ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2022 మెగా వేలం ముందు ముంబై ఇండియన్స్ పొలార్డ్ను రీటైన్ చేసుకుంది. చదవండి: ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్ The first captain in history to start his post-match interview with a song? 😀🎶 Loving Captain @KieronPollard55's rendition of Sizzla's "Solid As A Rock"🎙🌴#WIvENG #MenInMaroon pic.twitter.com/3TESWijqdZ — Windies Cricket (@windiescricket) January 31, 2022 WI WIN the Betway T20I Series!!💥🙌🏾 #WIvENG #WIVibes pic.twitter.com/gAdNgMA6wS — Windies Cricket (@windiescricket) January 31, 2022 -
అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం
ఇంగ్లండ్, వెస్టిండీస్ల మధ్య శనివారం నాలుగో టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 34 పరుగులుతో గెలిచి సిరీస్ను సమం చేసింది. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో ఇరు జట్లు రెండు విజయాలతో సమానంగా ఉన్నాయి. టోర్నీ విజేత ఎవరో తేలాలంటే ఆఖరి మ్యాచ్ కీలకం కానుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కెప్టెన్ మొయిన్ అలీ 63, జేసన్ రాయ్ 52 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి 34 పరుగులతో ఓటమి పాలైంది. చదవండి: కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు.. చేదు అనుభవమే మిగిల్చింది మ్యాచ్ ఓటమి అనంతరం విండీస్ కెప్టెన్ పొలార్డ్ తన సొంతజట్టుపై అసహనం వ్యక్తం చేశాడు.'' ఇంగ్లండ్ వికెట్లు తీయడంలో మా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. . ఇంగ్లండ్ను 160, 170లోపే కట్టడి చేయాలని భావించాం. చివరి ఓవర్లలో అనవసరంగా 20 పరుగులు ఇచ్చుకున్నాం. ఇంగ్లండ్ చివర్లో బాగా ఆడి తమ స్కోరును 190 దాటించింది. అదే మా కొంప ముంచింది. ఇక సిరీస్ గెలవాలంటే ఆఖరి మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. మా శక్తి మేరకు ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. -
టీమిండియాతో టి20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన
Wi Squad For India 2022 T20: ఫిబ్రవరిలో టీమిండియా టూర్ రానున్న వెస్టిండీస్ జట్టు టి20 సిరీస్కు 16 మందితో కూడిన జట్టును శనివారం ప్రకటించింది. కీరన్ పొలార్డ్ కెప్టెన్ కాగా.. నికోలస్ పూరన్ వైస్ కెప్టెన్గా వ్యహరించనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతున్న విండీస్.. 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్తో ఆడుతున్న జట్టునే భారత్తో జరగనున్న టి20 సిరీస్కు ఎంపిక చేశారు. అయితే విండీస్ క్రికెట్ బోర్డు ఇదివరకే వన్డే జట్టును ప్రకటించింది. షామ్రా బ్రూక్స్, క్రుమ్హా బోనర్, కీమర్ రోచ్లను వన్డేలకే పరిమితం చేశారు. ఇక టి20 ప్రపంచకప్లో పొలార్డ్ కెప్టెన్సీలో విండీస్ జట్టు అంతగా రాణించకపోవడంతో సూపర్-12 దశలోనే వెనుదిరిగింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్లో విండీస్ జట్టు క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడి సూపర్-12 దశకు అర్హత సాధించాల్సి ఉంటుంది. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షై హోప్, అకియెల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్మన్ పావెల్, ఓడియన్ స్మిత్ షెపర్డ్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ -
IND Vs WI: టీమిండియా సేఫ్ హ్యాండ్స్లో ఉంది.. అయినా మాతో అంత ఈజీ కాదు..!
Darren Sammy: త్వరలో టీమిండియాతో ప్రారంభంకానున్న పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో విండీస్ మాజీ సారధి డారెన్ సామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తమ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయరాదని భారత్ను హెచ్చరించాడు. గతంలో చాలా సందర్భాల్లో టీమిండియా కంటే బలమైన జట్లకు షాకిచ్చామని, ఈ విషయాన్ని భారత్ గుర్తు చేసుకోవాలని సూచించాడు. భారత్ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచైనా త్వరగా బయటపడగలదని, ప్రస్తుతం ఆ జట్టు రోహిత్ శర్మ లాంటి గొప్ప నాయకుడి చేతుల్లో సేఫ్గా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస ఓటములు, కెప్టెన్సీ వివాదం వంటివి భారత్పై ఎలాంటి ప్రభావం చూపవని, స్వదేశంలో రోహిత్ సేన బెబ్బులిలా గర్జిస్తుందని తమ జట్టును అలర్ట్ చేశాడు. ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్లో పోలార్డ్ సేనకు ప్రధాన ముప్పు కెప్టెన్, మాజీ కెప్టెన్ల నుంచి ఉంటుందని హెచ్చరించాడు. రోహిత్ నేతృత్వంలో టీమిండియా బలంగా కనిపిస్తుందని, విండీస్ జట్టు సైతం ఆల్రౌండర్లతో నిండి ఉందని ప్రస్తావించాడు. విండీస్ జట్టులోని కొందరు ఆటగాళ్లకు భారత్లో ఆడిన అనుభవం ఉందని, ముఖ్యంగా కెప్టెన్ పోలార్డ్కు భారత్లో పరిస్థితులపై మంచి అవగాహన ఉందని, ఇది ఓ రకంగా తమకు కలిసొచ్చే అంశమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో సిరీస్లో రాణిస్తున్న కుర్రాళ్లు విండీస్కు అదనపు బలంగా మారతారని, యువకులు, అనుభవజ్ఞుల కలియకలో కరీబియన్ జట్టు టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. లెజెండ్స్ లీగ్ సందర్భంగా మాట్లాడుతూ.. సామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..!