komatireddy venkat reddy
-
‘ఎస్ఎల్బీసీ టన్నెల్ స్టార్టింగ్.. ఎండింగ్ ఎక్కడ ఉందో తెలుసా?’
సాక్షి, సూర్యాపేట జిల్లా: కేటీఆర్ ఓ పిలగాడంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పదేళ్లు దక్షిణ తెలంగాణను కేసీఆర్ ముంచాడని.. కేటీఆర్కు జిల్లాకు వచ్చే హక్కే లేదంటూ వ్యాఖ్యానించారు. పాలకవీడు మండలం జానపహాడ్ లో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి మీడియా సమావేశంలో నిర్వహించారు.ఈ సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ స్టార్టింగ్.. ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉందో జగదీష్ రెడ్డికి తెలుసా అంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు జిల్లా పరిషత్లను గెలుస్తాం. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని వైఎస్సార్ చొరవతో ప్రారంభించుకున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం బాధాకరం. ఎస్ఎల్బీసీ సొరంగంపై రేపు(సోమవారం) సీఎం సమీక్షించనున్నారు. 85 శాతం పూర్తయిన బ్రాహ్మణ వెల్లంలను కేసీఆర్ పూర్తి చేయలేదు’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 30న ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్నామని.. సీఎం చేతుల మీదుగా హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి పథకాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. 80 శాతం ప్రజలు రేషన్ బియ్యాన్ని తినడం లేదు. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు అమ్ముకుంటున్నారు. తెలంగాణలో 84 శాతానికి సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాం’’ అని ఉత్తమ్ తెలిపారు. -
మంత్రి కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ బీఆర్ఎస్ శాసనసభా పక్షం, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ మేరకు శనివారం స్పీకర్ ప్రసాద్ కుమార్ను ఆయన చాంబర్లో కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, కేపీ వివేకానంద, కొత్త ప్రభాకర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు ఈ నోటీసు అందజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి సభకు అవాస్తవాలతో కూడిన సమాధానం చెప్పారని నోటీసులో పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఆర్ఎఫ్ నిధులు రాలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు ఎస్క్రో ఖాతా తెరవలేదని అబద్ధాలు చెప్పారన్నారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి కూ డా ఖర్చు చేయలేదని అసత్యాలతో సభను తప్పుదోవ పట్టించారన్నారు. ఈ 3 అంశాలకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ స్పీకర్కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చి, సభా గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని సభా గౌరవం కాపాడాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను కోరారు. -
మీ ప్రాథమ్యాలు యజ్ఞయాగాలే!
సాక్షి, హైదరాబాద్: ‘అప్పుడు మీ ప్రాథమ్యాలు కాళేశ్వరం సహా ఎత్తిపోతల పథకాలు, కొత్త సచివాలయం, పెద్ద భవనాలు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయాలు, పోలీసులకు ఏసీ వాహనాలు, చండీయాగాలు, ప్రగతి భవన్లో య జ్ఞాలు, యాగాలే.. ప్రజలకు మంచి రోడ్లు ఉండాలని మా త్రం కాదు. నాకు యాగాలు, యజ్ఞాలు లేవు. రోడ్లు, బ్రిడ్జీలు కట్టాలని ఉంది’అని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వివాదం రాజేశాయి.రోడ్ల నిర్మాణంపై శనివారం ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్రెడ్డి, హరీశ్రావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. యాగాలు చేశామని, సచివాలయం కట్టామని తమను అవమానించారని వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను యాగాలు చేస్తానని, తనకు దేవుడిపై భక్తి ఉందన్నారు. ‘నేను వాటర్ నీళ్లు అనను... ఎక్కడంటే అక్కడ చేపల పులుసు తినను’అని కోమటిరెడ్డి తీరును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులంతా నిష్క్రమించారు.దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు స్పందిస్తూ యాగాలు చేయడం తప్పని కోమటిరెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ ప్రాథమ్యాల గురించే మాట్లాడారని.. దీనికే వారు సభ నుంచి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తన కుటుంబం లెక్కలేనన్ని గుడులు కట్టించిందని వివరణ ఇచ్చారు. తన సమాధానాలకు దిమ్మ తిరిగే వారు వెళ్లిపోయారని విమర్శించారు.రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై కోమటిరెడ్డి వర్సెస్ ప్రశాంత్రెడ్డి అంతకుముందు రోడ్ల మరమ్మతు లు, నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంత్రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్ర భుత్వం రోడ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయ డం లేదని.. ఫలితంగా తమ హయాంలో ప్రారంభమైన పనులు సైతం ఆగిపోయాయని ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. గత 10 ఏళ్లలో తాము రోడ్ల నిర్మాణానికి రూ. 22 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. కోమటిరెడ్డి నియోజకవర్గ కేంద్రం నల్లగొండలో రూ. 200 కోట్లతో రోడ్లు వేశామన్నారు.అయితే ఈ వాదనను కోమటిరెడ్డి తోసిపుచ్చారు. బీఆర్ఎస్ పాలనలో రూ. 8,112 కోట్లతో 6,668 కి.మీ. రోడ్లకు మాత్రమే మరమ్మతులు చేశారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో వేసిన రోడ్లు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రశాంత్రెడ్డికి కొబ్బరికాయ కొట్టి సన్మానం చేస్తానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. తనపై కక్షతో నియోజకవర్గంలో రోడ్లకు నాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 7 కి.మీ. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను బీఆర్ఎస్ పాలనలో కట్టలేకపోయారని కోమటిరెడ్డి ఆరోపించగా అది ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు అని ప్రశాంత్రెడ్డి వివరణ ఇచ్చారు. -
బాలయ్య దంచుడుపై మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీలో మీడియాతో చిట్ఛాట్ సందర్భంగా.. సినిమాటోగ్రఫీ శాఖ, రోడ్లు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Bala Krishna)ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన రోజుకొకరినీ కొడతారంట కదా అని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ రోజుకొకరిని కొడతారంట కదా. ఆయన సినిమాలు ఎవరు చూస్తారు? బాలయ్య కంటే రోజూ తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారన్న కోమటిరెడ్డి.. అయినా ఆయన సినిమాలకు కలెక్షన్స్ వస్తాయట అంటూ మంత్రి కోమటిరెడ్డి చమత్కరించారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన పలు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్పా ఏమి తెల్వదు. వాళ్లకు మాటలతోనే బతకడం అలవాటైంది. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు. హరీష్ రావు మామ చాటు అల్లుడు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కారు. అలాంటప్పుడు మేం వాళ్లతో ఏం మాట్లాడతాం?. వేముల ప్రశాంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆయన కేబినెట్లోనూ డమ్మీ మంత్రి ఉండే. ఆయనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కనీసం గుర్తు కూడా పట్టరు అని కోమటిరెడ్డి అన్నారు. ఉప్పల్..నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ఇప్పటికే తాను కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడినట్లు తెలిపిన కోమటిరెడ్డి.. త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి టెండర్లు కూడా పిలుస్తామని తెలిపారు.యాగాల కామెంట్.. బీఆర్ఎస్ వాకౌట్అంతకు ముందు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జాప్యం విషయమై మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అడిగిన ప్రశ్నకు.. ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాగాలు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యం రహదారుల అభివృద్ధికి కేటాయించలేదన్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోండికోమటిరెడ్డి వ్యవహారంపై శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాలని హరీష్రావు నేతృత్వంలోని బృందం స్పీకర్ను కోరింది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్ధాలే చెబుతూ సభను తప్పు దోవ పట్టిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను బీఆర్ఎస్ కోరింది. -
మా ముఖ్యమంత్రి స్పీచ్ అద్భుతం: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం నాటి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి స్పీచ్లో అప్పులు, వడ్డీలు లెక్కలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారన్నారు కోమటిరెడ్డి. అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో ముచ్చటించారు. ‘ఈ 15 నెలల్లో మేము చేసిన అప్పు 4500కోట్లే. రేపట్నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే కార్యకర్తలే చేసుకుంటారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సోషల్ మీడియా పేరుతో అడ్డు అదుపు లేకుండా పోయింది. శ్రీశైలంలో చిన్న మాట దొర్లితే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా నన్ను ట్రోల్ చేశారు’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.తప్పులు, అప్పులు చేసి మీరే ముంచేశారు..ఈరోజు సీఎం రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పులు.. అప్పులు చేసి మీరు ముంచేశారని, ఆ శిక్ష ప్రజలు అనుభవించాలా? అని రేవంత్ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు చనిపోయినా ఆ మామా, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలోనే మెరుపు కనిపిస్తోంది. పైశాచికత్వంలో వాళ్లు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ రూ. 8. 19 లక్షల కోట్లు అప్పులు చేశారని, తాము వచ్చాక రూ. రూ. 1.53 లక్షల కోట్లు వడ్డీ చెల్లించామన్నారు సీఎం రేవంత్,. ప్రస్తుత తెలంగాణ అప్పు రూ. రూ. 7. 38 లక్షల కోట్లు అని చెప్పారు. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి: సీఎం రేవంత్మాదే తప్పు అయితే క్షమాపణ చెప్తా.. కేసీఆర్కు రేవంత్ సవాల్ -
రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ ఆమోదం!
సాక్షి, న్యూఢిల్లీ: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) క్లియరెన్స్లన్నీ త్వరలో పూర్తికానున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ ఆమోదానికి వెళ్తుందని చెప్పారు. ఈప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కోమటిరెడ్డి మంగళవారం ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనలతో కలిసి గడ్కరీతో భేటీ అయ్యారు.ట్రిపుల్ ఆర్, హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రోడ్డు, 12 ఆర్వోబీలు తదితర అంశాలపై గడ్కరీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు విమానాశ్రయాల గురించి పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం, రామగుండం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎయిర్పోర్టుల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 95 శాతం భూసేకరణ చేశాం 2018–19లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రకటించగా.. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కోమటి రెడ్డి విమర్శించారు. తాము అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రంతో టచ్లో ఉంటూ ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జంగారెడ్డి–భువనగిరి–చౌటుప్పల్ వరకు టెండర్లు పిలిచామన్నారు. 95 శాతం భూసేకరణను క్లియర్ చేశామని, కేంద్రం నుంచి ఆమోదం వచ్చాక వారికి పరిహారమిస్తామని తెలిపారు.‘హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రహదారిని మచిలీపట్నం వరకు పొడిగిస్తున్నామని, ఇందుకు కన్సల్టెంట్ను పిలిచినట్లు గడ్కరీ తెలిపారు. అయితే, హైదరాబాద్–విజయవాడ వరకు ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున త్వరగా టెండర్లు పిలవాలని కోరాను. రెండు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది.మొదటి ప్యాకేజీలో మల్కాపూర్–విజయవాడ, రెండో ప్యాకేజీలో విజయవాడ–మచిలీపట్నం వరకు నిర్మాణం జరిపేందుకు గడ్కరీ ఒప్పుకున్నారు. పర్వతమాల పథకం కింద యాదగిరిగుట్ట, భువనగిరి కోటకు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా నాగార్జున కొండను కలుపుతూ, మంథనిలోని రామగిరి కోట ప్రాంతాల్లో రోప్వేలు అడిగాను. వీటిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు’అని కోమటిరెడ్డి చెప్పారు.అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్ అనర్హత వేటు పడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక లేనట్లేనని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని మీడియాతో చిట్చాట్లో అన్నారు. ‘కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తానని కేసీఆర్ అంటున్నారు, ఒకవేళ కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తి చూపితే పది అంశాలను సభ ముందు పెడతాం. దళిత సీఎం నుంచి జర్నలిస్ట్ల వరకు కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడతాం’అని అన్నారు. రేవంత్రెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. సీఎం మార్పు జరుగుతుందని వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనంటూ కొట్టిపడేశారు. -
యాదాద్రి ఎంఎంటీఎస్కు కిషన్రెడ్డి అడ్డంకి
శంషాబాద్: ‘నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేకమార్లు రైల్వేమంత్రికి చేసిన విన్నపంతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ మంజూరైంది. కానీ ఆ పనులు ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్రెడ్డియే. ప్రతి ఆదివారం యాదాద్రికి లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్నగర్ పర్యటనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డిలు శంషాబాద్ ఎయిర్పోర్టులోని లాంజ్లో కలసి రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎయిర్పోర్టు మంజూరు కోసం జీఎంఆర్ సంస్థ అభ్యంతరాన్ని పరిష్కరించి.. వారిని ఒప్పించింది తామేనన్నారు.ఇప్పటికే భూసేకరణ కోసం రూ. 2 వేల కోట్లు కూడా ప్రభుత్వం కేటాయించిందన్నారు. మరో మూడు నెలల్లో కొత్తగూడెం విమానాశ్రయం కూడా మంజూరవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. వరంగల్లో రీజినల్ రింగురోడ్డుకు రైల్వేరింగు రోడ్డు కూడా ఏర్పాటు చేసుకునేందుకు రైల్వేమంత్రి అంగీకరించారన్నారు. సానుకూలంగా స్పందించారు..తాము చేసిన అన్ని వినతులకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ అభివృద్ధి ఉత్తి మాటలకే పరిమితమైందని మంత్రి సీతక్క విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
8 మంది కార్మికులను రక్షిస్తాం
సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట/ చందంపేట: ‘ప్రపంచంలో టన్నెళ్లను నిర్మించడంలో నిపుణులైనవారిని పిలిపించి 8 మంది కార్మికులను రక్షిస్తాం. ఉత్తరాఖండ్లో 41 మందిని 17 రోజుల్లో బయటికి తీశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పరిష్కారం చూపిన వారిని ఇక్కడికి రప్పించాం’అని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.సోమవారం ఆయన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడికి సీఎం రేవంత్రెడ్డి ఎందుకు రాలేదని కేటీఆర్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం, మంత్రులు ఇక్కడే ఉన్నారని, సీఎం రావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే రాలేదని అన్నారు. ‘కాళేశ్వరం కట్టినప్పుడు ఏడుగురు జలసమాధి అయితే మీరు వెళ్లి చూశారా?’అని ప్రశ్నించారు. ‘మీ నాన్నలా ఫామ్హౌస్లో పండుకోలేదు’అని దుయ్యబట్టారు.26 మంది పసిపిల్లలు ట్రైన్ కింద పడి ముద్దలైతే పక్కనే ఫామ్హౌస్లో ఉండి కూడా వెళ్లి చూడలేకపోయారని, కొండగట్టు ఘాట్రోడ్డు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 66 మంది చనిపోతే ఎవరైనా వెళ్లి పలకరించారా..? అని నిలదీశారు. ‘ప్రతిపక్ష నాయకులుగా మీరు ఎవరైనా వచ్చి పరామర్శించారా? మీకు బాధ్యత లేదా? ఇలాంటి ఘటనలపై విమర్శలు మాని.. సలహాలు, సూచనలు ఇవ్వండి’అని మంత్రి హితవు పలికారు.టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం..: ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఇంకా బతికి ఉన్నారనే ఆశలు ఉన్నాయన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. లోపల ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడామన్నారు. టన్నెల్లో చిక్కుకుపోయిన జావీద్కు తాను, అధికారులు ఫోన్ చేశామని, రింగ్ అయి తర్వాత స్విచ్ఆఫ్ వస్తోందని తెలిపారు.అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ నిపుణులను పంపించాలని ఆ సంస్థ యజమానిని కోరామన్నారు. రేపటి కల్లా నీళ్లు తగ్గితే కన్వేయర్ బెల్టు ద్వారా మట్టిని బయటకు పంపించే పనులు మొదలుపెడతామన్నారు. ఈ చర్యలను సీఎం రేవంత్రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. కాగా, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్రపవార్ కూడా ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
భూపాలపల్లి లింగమూర్తి కేసుపై రాజకీయ దుమారం..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించినందుకే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్యచేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ హత్యా రాజకీయాలకు తెర లేపింది. లింగమూర్తి హత్య వెనుక గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ హయాం నుంచి తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించినందుకు లింగమూర్తిని చంపేశారు. కాళేశ్వరం అవినీతిపై రాజలింగం అనేక కేసులు వేసి పోరాడుతున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై రాజలింగం కేసులు వేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది. అడ్వకేట్ సంజీవరెడ్డి మృతి అనేక అనుమానాలు ఉన్నాయి.బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి చంపించారని లింగమూర్తి భార్య చెబుతున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై కేసు వేసినందుకే చంపేశారని లింగమూర్తి కూతురు అంటున్నారు. గండ్ర వెంకట రమణారెడ్డిని పోలీసుల ముందు లొంగిపోవాలని కేసీఆర్ ఆదేశించాలి. అవినీతి బయటపడుతుందనే హత్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే నడిరోడ్డుపై వామన్ రావు దంపతులను హత్య చేశారు. నిందితుడు ఎవరో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలిసినా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. లగచర్ల దాడి సూత్రదారుడితో కేటీఆర్ 72 సార్లు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల రాజకీయం ఇలా ఉంటుంది.హరీష్ రావుకు అసలు మానవత్వం ఉందా?. కృష్ణా నీటిని ఏపీకి ఎక్కువ దోచిపెట్టిందే బీఆర్ఎస్. ఈ ఘటనను డైవర్ట్ చేయడానికే ఇలా మాట్లాడుతున్నారు. 15 నెలలుగా బయటకు రాని కేసీఆర్కు కాంగ్రెస్ గ్రాఫ్ గురించి ఏం తెలుసు?. ఎవరిని అడిగి కాంగ్రెస్ గ్రాఫ్ గురించి చెప్తున్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతూ.. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని చెబుతున్నారా?. బీఆర్ఎస్ హత్యలు చేయడం తప్ప ఇంకా ఏం చేయగలదు?. ఈ హత్యను సీరియస్గా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సీబీసీఐడీతో విచారణ జరపాలని సీఎంను కోరుతాను. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలి. ఈ కేసును న్యాయమూర్తి సుమోటోగా తీసుకోవాలి.గండ్ర కౌంటర్.. మరోవైపు.. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కౌంటరిచ్చారు. తాజాగా గండ్ర మీడియాతో మాట్లాడుతూ.. లింగమూర్తి హత్యను మాకు చుట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ ఆధారాలతో మాపై నిందలు వేస్తున్నారు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు. ఈ విషయంపై కోర్టులోనే మేం చట్టపరంగా ఎదుర్కొంటాం. భూ వివాదాలతోనే హత్య జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. లింగమూర్తి హత్యకు నాకు, బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. -
సెక్రటేరియట్లో పెచ్చులు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లోసీఎం చాంబర్ పక్కన పెచ్చులు ఊడిన ఘటనపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. ఈ విషయమై శుక్రవారం(ఫిబ్రవరి14) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రెయిలింగ్ ఊడిన ఘటనపై విచారణ చేయాలని ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించినట్లు తెలిపారు.విచారణ నివేదిక వచ్చాక అసలు విషయం ఏంటనేది తెలియజేస్తాం.ప్రభుత్వానికి రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) లాంటి ప్రధానమైన పనులు చాలా ఉన్నాయి.పెచ్చులు ఊడటం చిన్న విషయం..ఆ అంశాన్ని అధికారులు చూసుకుంటారు’అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.కాగా, ఇటీవల తెలంగాణ సచివాలయంలో పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి కింద ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు.పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది. -
తకిట తదిమి...
ఘన ఆదిత్య, ప్రియ జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తకిట తదిమి తందాన’. చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విడుదల చేసి, ‘‘మంచి కంటెంట్ ఉన్న ఫీల్గుడ్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అన్నారు. ‘‘సినెటేరియా మీడియా వర్క్స్ వెంకట్ బులెమోని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అని చందన్కుమార్ తెలిపారు -
ప్రయగ్ రాజ్ లో పుణ్యస్నానం చేసిన కోమటిరెడ్డి
-
కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పవిత్ర స్నానం
లక్నో: యూపీలోని ప్రయాగరాజ్లో ఎంతో వైభవంగా మహా కుంభమేళా జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డికి అక్కడి పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా కొనసాగుతోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుంభమేళాకు వెళ్లారు. సోమవారం ఉదయం 5.10 గంటలకు ప్రయాగరాజ్లోని సంగం ఘాట్లో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మంత్రి కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ క్రమంలో మంత్రికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజారులు.. ఆయనను ఆశీర్వదించారు. ఈ మేరకు తాను కుంభమేళాకు వెళ్లిన దృశ్యాలను మంత్రి కోమటిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇదిలా ఉండగా.. కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా లక్షలాదిగా పాల్గొంటున్నారు. మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు.ఈరోజు ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొని బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించడం జరిగింది.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం… pic.twitter.com/sZSvsV4tCd— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) February 10, 2025 -
తీన్మార్ మల్లన్నకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్
సాక్షి,హైదరాబాద్: సొంత పార్టీ (కాంగ్రెస్) ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్నకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు ఓటములను ప్రజలు నిర్ణయిస్తారని, వ్యక్తుల కాదన్నారు.మంగళవారం(ఫిబ్రవరి4) కోమటిరెడ్డి మీడియాతో చిట్చాట్లో ఈ విషయమై మాట్లాడారు.‘తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ బీ ఫాం నాకే ఇచ్చారు. అప్పుడుపెద్ద ర్యాలీ చేశాం. మంత్రిగా ఉండి జిల్లాలో ఎమ్మెల్సీ ఓడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా. బీసీ మీటింగ్ పెట్టి మల్లన్న ఇతర కులాలను తిట్టడం ఏంటి.బీసీల కోసం కాంగ్రెస్ గొప్ప నిర్ణయం తీసుకుంది.కాంగ్రెస్ బీ ఫాం మీద గెలిచిన తీన్మార్ మల్లన్న మాపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారు.మల్లన్న నన్ను తిడితే స్వాగతిస్తా. కానీ ఎవరైనా సరే ఓక కులాన్ని తిట్టడం కరక్ట్ కాదు. ఇక కేసీఆర్,కేటీఆర్,హరీష్రావు ఆస్తులు రాయాలంటే ఒక పుస్తకం కావాలి.అందుకే కులగణన సర్వేలో కవిత మినహా కేసీఆర్ ఫ్యామిలీ పాల్గొనలేదు.అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం.కేంద్రం ఓకే అంటే ఓకే..లేదంటే మా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం.ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.ఎస్సీ వర్గీకరణ కోసం ఈనెలలోనే మరో రోజు సభ పెడుతాం’అని కోమటిరెడ్డి తెలిపారు. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు..?ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో టీపీసీసీ ఉంది. త్వరలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల మల్లన్న ఓ బహిరంగ సభలో బీసీ కులగణన సహా పలు అంశాలపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడిన విషయం తెలిసిందే. -
కేసీఆర్ పేరు చెప్పు కుని కేటీఆర్ మంత్రి అయ్యారు: మంత్రి కోమటిరెడ్డి
-
నల్లగొండ టీ హబ్కు తాళం వేయించిందే కేటీఆర్: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండ బీఆర్ఎస్ రైతు ధర్నాలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పదేళ్లుగా నల్లగొండను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ కేటీఆర్ను ప్రశ్నించారాయన. బుధవారం(జనవరి29) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్ పనికిరానోడు.. పనికి రాని మాటలు మాట్లాడుతున్నాడు. నల్లగొండలో కేటీఆర్ మీటింగ్కు మా మీటింగ్ కు వచ్చే పల్లీలు,ఐస్ క్రీం లు అమ్ముకునే వారు వచ్చేంత మంది కూడా రాలేదు. నల్లగొండలో టీ హాబ్కు తాళం వేసిందే కేటీఆర్. ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కంపెనీలు ఎందుకు తేలేకపోయారు. హరీష్రావు, కేటీఆర్ మీరు నా కాలి గోటికి కూడా సరిపోరు. కేటీఆర్ నీలాగా నాపై అవినీతి ఆరోపణలు లేవు. లక్షల కోట్లు సంపాదించుకోలేదు. కేసీఆర్ లాగా నేను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదు. నేను మాట్లాడితే బీఆర్ఎస్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా భట్టి పాదయాత్ర చేసి..ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సెషన్కు కేసీఆర్ వస్తడో రాడో చెప్పాలి.తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నరా? బండి సంజయ్ ఉన్నరా? గద్దర్కు అవార్డ్ ఇస్తే తప్పేంటి? కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది... కేసీఆర్ కంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతో నయం అని కోమటిరెడ్డి అన్నారు. లాలూ జైల్లో ఉన్నప్పుడు.. బయట ఉన్న ఆయన కొడుకులు ఎంపీ సీట్లు గెలిపించారు. కానీ, కేటీఆర్ ఒక్క సీటు అయినా గెలిచారా? కేటీఆర్ ప్లేస్లో నేను ఉంటే.. ఈపాటికి బీఆర్ఎస్ దుకాణం క్లోజ్ చేసేవాడ్ని అని కోమటిరెడ్డి అన్నారు. -
తక్కువ బడ్జెట్లో మంచి చిత్రాలు తీయాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
‘‘ఎక్కువ బడ్జెట్తో సినిమాలు తీసి, ఆ తర్వాత టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం కంటే.. తక్కువ బడ్జెట్లోనే మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మంచిది. అలా తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్తో వస్తున్న ‘ఎల్.వై.ఎఫ్’ వంటి చిత్రాలను ప్రోత్సహించడంలో నేను ముందుంటాను’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎల్.వై.ఎఫ్’ (లవ్ యువర్ ఫాదర్). పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్లపై కిశోర్ రాటి, మహేష్ రాటి, ఎ. రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని కోమటిరెడ్డి వెంకట రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఎక్కువ బడ్జెట్లో కాకుండా మంచి కంటెంట్తో తక్కువ బడ్జెట్తో తీసే సినిమాలు బాగుంటాయి. ఇలాంటి చిత్రాలే మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ‘ఎల్.వై.ఎఫ్’ కూడా అదే విధంగా విజయం సాధించాలి’’ అన్నారు. ఎస్పీ చరణ్, ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, ‘షకలక’ శంకర్, రవిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: మణిశర్మ. -
మంత్రి కోమటిరెడ్డి Vs జగదీష్ రెడ్డి.. రాజ్భవన్ వద్ద సీఎం చేసిందేంటి?
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు తాజాగా జగదీష్ రెడ్డి కౌంటిరచ్చారు. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్ను చూస్తేనే ముఖ్యమంత్రి, మంత్రులు భయపడిపోతున్నారంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణభవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. కేటీఆర్ను చూసి సీఎం, మంత్రులు భయపడుతున్నారు. పోలీసుల సూచన మేరకు 12వ తేదీన జరగాల్సిన నల్గొండ రైతు దీక్షను వాయిదావేశాం. ఎక్కడి నుండి ఒత్తిడి వచ్చిందో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. కోమటిరెడ్డి వలనే పోలీసులు అనుమతి రద్దు చేశారు. నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టు సూచనతో ముందుకు వెళ్తాం.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా వెళ్లి రాగలరా?. ఎప్పుడు దొరుకుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రైతుల ధాన్యం కొనే వరకు మేము కల్లాల్లోనే ఉన్నాం. మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి రైతులను దళారులకు కాంగ్రెస్ నేతలు అప్పచెప్పారు.కేటీఆర్ నల్గొండ వస్తుంటే కోమటిరెడ్డికి ఎందుకు అంత భయం?. నల్గొండ క్లాక్ టవర్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేస్తాయి. సీఎం, మంత్రులు హైదరాబాద్ నగరంలో ఈడీ ఆఫీసు, రాజ్భవన్ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగలేదా?. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై నాతో చర్చ చేసే దమ్ము కోమటిరెడ్డికి ఉందా?. కాంగ్రెస్ పాపాలతోనే జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి పుట్టింది. నేను జిల్లాలో చేసిన అభివృద్ధి చూడటానికి కోమటిరెడ్డి జీవిత కాలం సరిపోదు. సొంత నియోజకవర్గాలను కోమటిరెడ్డి అభివృద్ధి చేసుకోలేదు.యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఆపేస్తా అని కోమటిరెడ్డి చెబుతున్నారు. ఆయన స్పృహలో ఉండి మాట్లాడటం లేదు. సరైన పోటీ లేక నల్గొండలో కోమటిరెడ్డి గెలిచారు. భూపాల్రెడ్డి దెబ్బకు నల్గొండలో ఓటమి తప్పలేదు. మంత్రి ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారో అన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయి. చేతగాక పోలీసుల చేత పర్మిషన్ రద్దు చేయించారు. మీరు 20,30 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఆస్తులు పెంచుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు, మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్లను నిర్లక్ష్యం చేసిన నేతలు జిల్లాకు ఎలా వస్తారు?. రేసుల మొనగాడు దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. మూడు ఫీట్లు ఉన్న వ్యక్తి మూడువేల ఓట్లతో గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
చిట్యాల: రోడ్డు ప్రమాదాలకు గల కారణాల్లో డ్రైవర్లకు దృష్టిలోపం ఉండటం కూడా ఒకటి. చాలామంది డ్రైవర్లకు అవగాహన లేక కంటి పరీక్షలు చేయించుకోరు. దాంతో వారికి దృష్టిలోపం ఉన్న విషయం వారికే తెలియదు. ఈ విషయాన్ని గుర్తించిన రోడ్డు రవాణా, పోలీస్ శాఖల అధికారులు.. వైద్యారోగ్య సహకారంతో డ్రైవర్లకు రహదారుల వెంట ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి వెంటనే కళ్లద్దాలు అందిస్తున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో రాష్ట్రంలో మొదటిసారి నల్లగొండ జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ‘నల్లగొండ దృష్టి’పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ దాబా వద్ద ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. వెంటనే అద్దాలు.. కంటి పరీక్షల శిబిరంలో పరీక్ష చార్ట్ను ఆహార పదార్థాల మెనూ కార్డు మాదిరిగా ఏర్పాటు చేశారు. రోటి, పరోటా, తందూరి, దాల్ వంటి పేర్లను హిందీలో రాశారు. ఆదివారం వివిధ రాష్ట్రాలకు చెందిన 82 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందికి కంటి అద్దాలు అందజేశారు. వీరిలో చాలామంది మొదటిసారి కంటి పరీక్షలు చేయించుకోవటం విశేషం. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల వెంట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి వెంకట్రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అవసరమైన సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
‘ఆ మాటలు మేము చెప్పం..’
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తరహా ‘బంగారు తెలంగాణ’ అనే మాటలు తాము చెప్పమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Komatireddy Venkat Reddy). ఈరోజు(మంగళవారం) సాక్షి టీవీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడారు. ‘నాల్గో తేదీన క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది. సంక్రాంతికి రైతు భరోసా(Rythu Bharosa)నిధులు రైతులకు అందిస్తున్నాం, రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇప్పటికే చేయాల్సింది చాలా చేశాం. రాబోయే ఐదేళ్లు మరింత కష్టపడి పనిచేస్తాం. ఆరువేల కోట్ల రూపాయలు పెట్టి ఔటర్ రింగ్ రోడ్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కడితే.. ఏడు వేల కోట్లకు కేసీఆర్ అమ్ముకున్నాడు. డ్రగ్స్ నిర్మూలన కోసం సాక్షి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి అభినందనలు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే హైదరాబాద్ కు సినీ ఇండస్ట్రీ వచ్చింది
-
ఇకపై నో బెనిఫిట్ షోస్
రాంగోపాల్పేట్: తెలంగాణలో ఇకపై ఎంత పెద్ద బడ్జెట్తో రూపొందించే సినిమాలకైనా బెనిఫిట్ షోలను అనుమతించబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. అలాగే టికెట్ రేట్ల పెంపుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సందేశాత్మక చిత్రాలతోపాటు తెలంగాణ పోరాటం, ఉద్యమం, చారిత్రక అంశాలపై రూపొందించే సినిమాలకు నామమాత్రంగా టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తామని తెలిపారు.సంధ్య థియేటర్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను శనివారం సాయంత్రం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్కు గొంతులో పైపులు వేసి ఆహారం అందిస్తున్నారని.. ప్రస్తుతం చాలా బలహీనంగా ఉన్నాడన్నారు. అతను కోలుకోవడానికి ఏడాదికిపైగా సమయం పట్టొచ్చని వైద్యులు అంటున్నారన్నారు.బాలుడు కోలుకొనే వరకు ప్రభుత్వం ఆస్పత్రి ఖర్చులు భరిస్తుందని చెప్పారు. ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’ ద్వారా రూ. 25 లక్షల చెక్కును బాలుడి తండ్రి భాస్కర్కు అందించారు. భాస్కర్కు ఆత్మస్థైర్యం అందించడంతోపాటు ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేందుకు సీఎం రేవంత్ ఆదేశాలతో తాను వచి్చనట్లు తెలిపారు. సంధ్య థియేటర్కు రావొద్దని పోలీసులు రాతపూర్వకంగా సూచించినప్పటికీ హీరో అల్లు అర్జున్ వచ్చారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కొద్దిగా మెరుగుపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడినట్లు కిమ్స్ ఆస్పత్రి శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలిపింది. వెంటిలేటర్ సాయం లేకుండానే అతను శ్వాస తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది. -
ధరణి పేరుతో లక్షల ఎకరాల స్కామ్
నల్లగొండ: ధరణి పేరుతో గత ప్రభుత్వం లక్షల ఎకరాల స్కామ్ చేసిందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లకు తగ్గకుండా సంపాదించుకుని రాష్ట్రాన్ని లూటీ చేశారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణిని తీసుకురావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్కామ్లు చేసి దోచుకున్నారని మండిపడ్డారు. ధరణితో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో భూభారతిని తీసుకొచ్చామన్నారు. ప్రతి రైతుకు గుంట భూమి ఉన్నా భూధార్ కార్డు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఇచి్చన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్, రూ.500కు గ్యాస్, ఉచిత కరెంట్తో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సంక్రాంతికి రైతు భరోసాను అందిస్తామని తెలిపారు. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు. సంక్రాంతికే ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోయడంతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నామని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్సార్ మహిళలను లక్షాధికారులను చేస్తే ప్రస్తుత సీఎం మహిళలను కోటీశ్వరులను చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నారని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి రక్తదానం తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నల్లగొండ ఎన్జీ కళాశాల వద్ద శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో.. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రక్తదానం చేశారు. శిబిరంలో 200 మంది రక్తదానం చేసినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. -
మరోసారి కోమటిరెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
-
మరోసారి కోమటిరెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
-
టీఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు.. సీనీ ప్రముఖుల అభినందనలు (ఫొటోలు)
-
హరీశ్రావు ఏమైనా డిప్యూటీ లీడరా?: కోమటిరెడ్డి
ాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి, హరీష్రావు మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. హరీష్రావు ఏ హోదాలో ప్రశ్నలు అడుగుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ హీట్ నెలకొంది.తెలంగాణలో ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం సభ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు స్పందిస్తూ.. ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీదే మూసీ పాపం. కాళేశ్వరం జలాలను నల్లగొండకు అందించామన్నారు. దీంతో, కోమటిరెడ్డి.. హరీష్ వ్యాఖ్యలు మండిపడ్డారు. Are You a Deputy Leader or an MLA?-- Harish Rao Questioned by Minister Komatireddyమీకు LP లీడర్ లేడుహరీష్ రావు.. నువ్వు డిప్యూటీ లీడర్ వా..?లేక శాసనసభ్యుడిగా...??అసలు ఏ హోదాలో నువ్వు మైక్ అడుగుతున్నావ్-- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి#TelanganaAssembly •… pic.twitter.com/zjt3SUAHEG— Congress for Telangana (@Congress4TS) December 19, 2024అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అసలు హరీష్రావు ఎవరు?. డిప్యూటీ లీడర్నా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారు?. ఆయనకు అడిగే హక్కు లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారు? తెలంగాణ ప్రజలను ఆయన అవమానపరచడమే అవుతుంది. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్లు హైదరాబాద్ వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు లేదు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ మూసీని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా సభలో వీరద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అంతకుముందు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. రైతు సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. -
గుంతల రోడ్లపై సభలో రచ్చ రచ్చ
-
హరీష్ రావును ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు
-
సభలో పొలిటికల్ రచ్చ.. అసెంబ్లీ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెట్టాలన్న హరీష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడీవేడిగా కొనసాగుతున్నాయి. నేడు సభలో మంత్రులు వర్సెస్ మాజీ మంత్రి హరీష్ అన్నట్టుగా వాతావరణం నెలకొంది. సభలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు రోడ్ల అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘హరీష్రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలియదు. నేను మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేదు. ఆయనకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే తెలుసు. హరీష్.. 10వేల కోట్లు దోచుకున్నాడు. రోడ్లు వేయడం బీఆర్ఎస్ నేతలకు చేతకాదు.. కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. లక్ష కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకున్నారు. ఏడేళ్లు అయినా ఉప్పల్లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ కోసం మాత్రం నాలుగు లైన్ల రోడ్లు ఫామ్ హౌస్ వరకు వేసుకున్నారు. వచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాము. వచ్చే నాలుగు ఎండ్లలో ఆర్ఆర్ఆర్ను పూర్తి చేస్తాం అన్నారు.ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డికి హరీష్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ మాట్లాడుతూ..‘వ్యక్తిగతమైనటువంటి విమర్శలు సభలో చేయకూడదని కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. సిద్ధులు మాకే కాదు తమ మంత్రులకు కూడా చెప్పాలి. సభలో ఎవరు తప్పు మాట్లాడినా వారికి రూల్స్ వర్తిస్తాయా. కమీషన్ గురించి మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్టాలు అన్ని వరుసగా చదువుతాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి. నేను కమీషన్ తీసుకున్నట్టు నిరూపించాలి అని సవాల్ విసిరారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి. కొంతమంది సభ్యులు మద్యం తాగి సభకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభ్యులు తాగొచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హరీష్ రావు మాట్లాడిన మాటలు బాధిస్తున్నాయి. సభ్య సమాజం ఇబ్బంది పడే విధంగా హరీష్ రావు మాటలున్నాయి. హరీష్ రావు వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.విప్ బీర్ల ఐలయ్య కామెంట్స్.. హరీష్రావుకు వాళ్ళ మామ గుర్తుకు వచ్చినట్టు ఉన్నాడు. అందుకు గుర్తుకొచ్చి సభలో మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్లో పడుకునే మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడేది. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడిందన్నారు. అనంతరం, స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘హరీష్ రావు, బీర్ల ఐలయ్య మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘కేటీఆర్ చేసింది పెద్ద తప్పు.. జైలుకు వెళ్లక తప్పదు’
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నగరంలో నిర్వహించిన ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కేటీఆర్ చేసింది పెద్ద తప్పు అని, దానికి శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. ఆ కేసులో ఏడేళ్ల వరకూ జైల్లో ఉండాల్సి వస్తుందంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ చేసిన తప్పిదానికి బెయిల్ కూడా రాదని, ఆయనకు బెయిల్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి రావడం పట్ల మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ కేటీఆర్కు బెయిల్ రావాలని మొక్కుతున్నారు.ఎమ్మెల్యేలు శబరిమల వెళ్లడానికి నల్లదుస్తులు ధరించారు. కేటీఆర్ అరెస్టు అయితే శబరిమల వెళ్లి బెయిల్ రావాలని మొక్కుతారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్కు బెయిల్ వచ్చే చాన్స్ కూడా లేదు.’ అని కోమటిరెట్టి పేర్కొన్నారు. ఇవీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్కేటీఆర్ ‘ఈ-కార్ రేస్’ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు -
ఉత్తర ‘రింగు’కు అటవీ అనుమతులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. ఈ నెలాఖరుకు గాని జనవరి మొదటి వారంలో గాని ఈ రోడ్డుకు టెండర్లు పిలిచేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతున్న సమయంలో అటవీ అనుమతులకు సంబంధించిన ఇబ్బంది తొలగిపోయినట్టయ్యింది. ఇక పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అవి కూడా వస్తే ఈ రోడ్డుకు ఎక్స్ప్రెస్ వే నంబర్ కేటాయింపు సులభవుతుంది. ఆ నంబర్ వస్తేనే టెండర్లు తెరిచేందుకు వీలుంటుంది. మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లాలో 8.511 హెక్టార్లు .. వెరసి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని ఉత్తర రింగు అలైన్మెంటులో భాగంగా సేకరించనున్నారు. ఇందుకు ప్రతిగా అటవీ శాఖకు వేరే ప్రాంతంలో అంతే మొత్తం భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. సేకరించే అటవీ భూమిలో కోల్పోయే చెట్లకు పరిహారంతో పాటు, కొత్తగా పొందే భూమిలో అటవీ శాఖ చెట్ల పెంపకానికి అయ్యే ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ భాగానికి కావాల్సిన భూమిలో 90 శాతం సేకరణ ప్రక్రియ పూర్తయింది. త్వరలో అవార్డులు పాస్ చేయటం ద్వారా భూ యజమానులకు పరిహారం చెల్లించనున్నారు.అనుమతి లేఖ అందింది: మంత్రి కోమటిరెడ్డిట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 72.3536 హెక్టార్ల అటవీ భూమి స్వాధీనానికి అనుమతిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్రావ్ భవర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర భాగం రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి భారతమాల పరియోజన కింద అనుమతి ఇస్తున్నట్టుగా లేఖలో పేర్కొనట్టు వెల్లడించారు. పర్యావరణ నిబంధనలకు లోబడి భూసేకరణ చేస్తామని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు తెలిపామని పేర్కొన్నారు. -
కేటీఆర్, హరీష్ రావులది నా స్థాయి కాదు: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ జిల్లా: కేటీఆర్, హరీష్ రావులది తన స్థాయి కాదని.. వాళ్లు కేవలం కేసీఆర్ కుమారుడు, అల్లుడు మాత్రమేనంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘బంగారు తెలంగాణ అంటూ అప్పులు చేసి కేసీఆర్ ఫాంహౌస్లో పడుకున్నాడు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు అవుతున్నాయా?. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తాం’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.మోదీ సొంత రాష్ట్రంలో పదమూడు వందలకు గ్యాస్ సిలిండర్ విక్రయిస్తున్నారు. తెలంగాణలో రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రధాన మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తారిలా మార్చారు. ఒక ఇళ్లు కట్టకుండా కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేశాడుకేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటే మోదీ విదేశాల్లో తిరుగుతున్నారు. డిసెంబరు మొదటి వారంలో సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారు’’ అని కోమటిరెడ్డి తెలిపారు. -
పరిహారం చెల్లించాకే భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేసే ప్రయత్నం సరికాదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ముందుగా పరిహారం చెల్లించాకే భూములు సేకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఎన్హెచ్ఏఐ అధికారులతో జరిపిన సమీక్షలో పలు సూచనలు చేశారు. మంచిర్యాల–విజయవాడ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించి ఎన్హెచ్ఏఐ వద్ద పరిహారానికి సంబంధించి డ్రాఫ్ట్ అవార్డులు 1,023 వరకు పెండింగులో ఉండటంపై ప్రశ్నించారు. 15 రోజుల్లో వాటిని క్లియర్ చేస్తామని అధికారులు పేర్కొనే క్రమంలో.. భూమిని సేకరించి పరిహారం చెల్లిస్తామంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు పేర్కొనటాన్ని మంత్రి తప్పుపట్టారు.భూముల విలువ ఆధారంగా పరిహారాన్ని ఖరారు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులను వచ్చేవారం ప్రారంభించాలని, తాను ఇప్పటికే పదిసార్లు ఆదేశించినా పనులు మొదలుపెట్టకపోవటమేంటని ప్రశ్నించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి డిసెంబర్/జనవరిలో టెండర్లు పిలవాలని సూచించారు. శ్రీశైలం దారిలో మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్నందున తుక్కుగూడ నుంచి డిండి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి నిర్ణయించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.దీని ఆమోదంపై తాను సీఎంతో మాట్లాడతానని మంత్రి పేర్కొన్నారు. రూ.7 వేల కోట్లు ఖర్చయ్యే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఎంతో ఉపయుక్తమైందని, ఈ పనుల్లో వేగం పెరగాలని సూచించారు. భద్రాచలానికి 3 గంటల్లో వెళ్లేలా చేసే గౌరెల్లి–వలిగొండ రోడ్డు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం–దేవరపల్లి రోడ్డులో సరీ్వసు రోడ్డు ఆప్షన్ ఉండాలని సూచించారు. విపక్షాల వికృత చేష్టలు.. రైతులకు లాభదాయక పరిహారం ఇచ్చి కీలక ప్రాజెక్టులకు భూసేకరణ కోసం యత్నిస్తుంటే విపక్షాలు కలెక్టర్లపై కూడా దాడులు చేసి చంపేందుకు కుట్రచేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత రాజకీయాల కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని విమర్శించారు. -
ధరణితో రైతులకు అన్యాయం
యాదగిరిగుట్ట: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో నిజమైన రైతులకు అన్యాయం చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన భూములను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు కోసం యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పైలాన్ పనులకు శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు భారీగా కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు రైతుల భూములు అడుగుతుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకొంటున్నారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదలకు పంచిన 20 వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ పాలనలో కేవలం రూ.5 లక్షలు, రూ.6 లక్షలకు ఎకరం చొప్పున గుంజుకున్నారని ధ్వజమెత్తారు. నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులను ఉత్సవాల్లాగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మేడిగడ్డలాగే బీఆర్ఎస్ సర్కారు కూలింది: కోమటిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని, వారికి మతి భ్రమించిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మేడిగడ్డ కూలినట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందని చురకలంటించారు. డిసెంబర్ 6వ తేదీన సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్లంల డి్రస్టిబ్యూటరీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం పాల్గొన్నారు. -
మార్కులు కొట్టి... ‘మార్కెట్’ పట్టి...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అనుకోకుండా లభించిన అవకాశాన్ని ఓ మహిళ సద్వినియోగం చేసుకున్నారు. అడిగిన ప్రశ్నలకు మెప్పించేలా సమాధానం ఇచ్చారు. ఏకంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నారు. మార్కెట్ కమిటీ పదవికి ప్రశ్నలేంటి? జవాబులేంటి? చైర్ పర్సన్ను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది కదా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయా? అలాంటి సందేహాలు నిజమే..అలాగే ప్రశ్నలకు సరైన జవాబులివ్వడం ద్వారా చైర్ పర్సన్ పదవికి ఎంపికైంది కూడా వాస్తవమే. కామారెడ్డి జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈ వినూత్న ప్రయోగం చేశారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎంపికకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన యువతిని పదవికి ఎంపిక చేశారు. ప్రశ్నపత్రం రూపొందించి.. పరీక్ష నిర్వహించి.. సాధారణంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు ను అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేనో లేదా ఆ పార్టీ ముఖ్య నాయకులో ప్రభుత్వానికి ప్రతిపాదించి నామినేట్ చేయిస్తారు. కానీ లక్ష్మీకాంతారావు ఇందుకు భిన్నంగా ఈ పదవికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఎక్కువ మార్కులు సాధించిన వారినే చైర్మన్గా నియమిస్తామని ప్రకటించారు. దీనికి మార్కెట్ కమిటీ పరిధిలోని మద్నూర్, జుక్కల్, డోంగ్లీ మండలాల నాయకులు కూడా సరే అన్నారు. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ పదవికి నిర్వహించిన మౌఖిక పరీక్షకు స్థానిక నేతల కుటుంబాలకు చెందిన 15 మంది మహిళలు సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్యే స్థానిక పార్టీ నేతలతో కలిసి ఓ ప్రశ్నపత్రం రూపొందించారు. మార్కెట్ కమిటీల విధులు, బాధ్యతలు, అభివృద్ధికి సంబంధించిన 15 ప్రశ్నలను పొందుపరిచారు. సెప్టెంబర్ 29న నిర్వహించిన ఈ పరీక్షకు ఆ 15 మందీ హాజరయ్యారు. వీరిలో జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన అయిల్వార్ సౌజన్య అత్యధిక మార్కులు సాధించారు. దీంతో ఆమె పేరును ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వానికి పంపించారు. ఆ మేరకు ప్రభుత్వం తాజాగా సౌజన్యను చైర్ పర్సన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 ప్రశ్నలకు 12 సరైన జవాబులిచ్చిన సౌజన్య సౌజన్య ఎంఎస్సీ బీఈడీ చదివారు. పరీక్షలో 15 ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారు. ఈ పరీక్షకు ఆయా మండలాలకు చెందిన పూజా సందే, నమేవార్ పద్మ, జి.పార్వతి, వాగ్మారే ప్రియాంక, నమేవార్ అనిత, వాగ్మారే సోని, సంగీత తుకారాం, గైక్వాడ్ రాజాబాయి, కర్మల్కార్ సంగీత, అర్పిత అంజనీకర్, ఎడికే రాంబాయితో పాటు మరో ముగ్గురు హాజరయ్యారని సమాచారం. కాగా రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును, చైర్ పర్సన్గా నియమితులైన అయిల్వార్ సౌజన్యను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందించారు. బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, నాయకులు మంత్రిని కలిశారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రయతి్నస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం: సీఎం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్గా సౌజన్య ఎంపిక కావడంపై సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం.. పదవుల ఎంపికలో నయా దృక్పథం..ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం..ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మన ఆడబిడ్డ సౌజన్య మద్నూర్ మార్కె ట్ కమిటీ చైర్ పర్సన్గా ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం. తొలిసారిగా ఇంటర్వ్యూ పద్ధతిలో, ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ, మహిళల చదువుకు.. ఆత్మస్థైర్యానికి ప్రోత్సాహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించింది..’అని సీఎం పేర్కొన్నారు. పారదర్శక విధానంలో ఈ పదవికి సౌజన్యను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అభినందనలు తెలిపారు. -
కేటీఆర్ అలా మాట్లాడటం సిగ్గుచేటు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,సంగారెడ్డి జిల్లా: ప్రజా ఆశీర్వాదంతో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జహీరాబాద్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లు పాలించి రాష్ట్రంలో వందేళ్ళ ఆర్థిక విధ్వంసం సృష్టించారు. అభివృద్ధిని విస్మరించి స్నో, పౌడర్ ఖర్చులకు 50 వేల కోట్లు అప్పులు చేశారు. అధికారం పోయిన రెండో రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. మాజీలమని మరిచి కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. లగచర్ల ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం వెనక బీఆర్ఎస్ శ్రేణులు కుట్ర ఉంది. కలెక్టర్పై దాడి చేసిన సురేష్ తన మనిషేనని కేటీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజా ఆశీర్వాదంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరు.పైసా పైసాకు కూడబెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. జహీరాబాద్లో అధునాతన మోడల్ ప్రభుత్వ అతిథి గృహం నిర్మిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న అన్ని రహదారులకు మరమ్మత్తులు పూర్తి చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. -
Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వద్దంటే కాంగ్రెస్ లోకి వస్తున్నారు
-
‘గుంతలు లేని రోడ్లు కోసం వ్యూహాత్మక ప్రణాళిక’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్ర రహదారులను నిర్మించలేదని, జాతీయ రహదారుల మంజూరుకు ప్రయత్నించలేదన్నారు.గాలికి దీపంపెట్టి దేవుడా అని మొక్కినట్లు కేసీఆర్ రూలింగ్ చేశారని, తాము ఇప్పుడు రహదారుల మరమ్మత్తుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో 9 వేల కిలో మీటర్ల మేర రహదారులపై గుంతలు పూడుస్తామన్నారు. -
రోజుకో స్కామ్ బయటకి..కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
-
కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్ వెళ్ళడం ఒక పెద్ద జోక్ అని, ఆయన ఒక జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం(అక్టోబర్22) మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ‘పార్లమెంట్లో ఒక్క సీటు రాకున్నా,అసెంబ్లీలో ఓడించినా కేటీఆర్కు బుద్ధి రాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్ళకు మా ప్రభుత్వం ఇస్తోంది. కేంద్ర మంత్రులు సంజయ్,కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కి ఎంత నిధులు తెచ్చారు’అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.పార్లమెంట్ సెంట్రల్హాల్ తరహాలో అసెంబ్లీ..‘రూ.49కోట్ల అంచనాతో అఘాఖాన్ ట్రస్ట్ అసెంబ్లీని ఆధునికీకరిస్తోంది. ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిజాం తరహాలో ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నారు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహలో అసెంబ్లీ,కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు వెళ్లాలంటే వెహికిల్లో సీఎం మంత్రులు వెళ్లాల్సి వస్తుంది. రెండూ ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుంది’అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. -
‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని నాలుగు కార్పొరేషన్లుగా విభజించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. ఈ విషయమై శనివారం(అక్టోబర్ 5) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ మహా నగరంలో జనాభా కోటిన్నరకు చేరింది.జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా చేసిన తర్వాత నలుగురు మేయర్లు ఉంటారు.రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలుగురు మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.ఈ నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచేందుకు రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను నిర్మిస్తాం.అమెరికా తర్వాత అత్యధికంగా ఎంఎన్సీ కంపెనీల హెడ్క్వార్టర్స్ హైదరాబాద్లోనే ఉండనున్నాయి’అని కోమటిరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: హోం మంత్రి పదవి ఇవ్వాలని.. -
ఆ ఇద్దరు మంత్రులు దద్దమ్మలు: జగదీష్రెడ్డి
సాక్షి,నల్లగొండజిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు దద్దమ్మ మంత్రులున్నారని మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్రెడ్డి మండిపడ్డారు. సాగర్ జలాలపై ఈ మంత్రులకు అవగాహన లేకపోవడంతో ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేటలో మంగళవారం(సెప్టెంబర్24) నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్రెడ్డి మాట్లాడారు.ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు అధికంగా తరలించడం వల్లనే ఎడమ కాల్వకు గండి పడిందని ఆరోపించారు. జిల్లాలో ఉన్న మంత్రుల మాటలు విని పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ ఇంకా 30 శాతం కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: సాగర్కాలువ గండి పూడ్చడం చేతకాదా..? -
గత ప్రభుత్వంలో స్కాములు తప్ప అభివృద్ధి లేదు
లింగోజిగూడ: గత ప్రభుత్వ పాలనలో స్కాము లు తప్ప అభివృద్ధి జరగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం మదర్ డెయిరీ ఎన్నికల్లో ఆరు డైరెక్టర్ పోస్టులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో శనివారం నూతన చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని హయత్నగర్ మదర్ డెయిరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నూతన చైర్మన్గా ఎన్నికైన గుడిపాటి మధుసూదన్రెడ్డితో పాటు గెలుపొందిన డైరెక్టర్లకు ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్రావు బినామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారని, యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాలలో లడ్డూల తయారీకి హరీశ్రావు తన బినామీ కంపెనీల ద్వారా నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. ఇక నుంచి దేవాలయాలకు అవసరమైన నెయ్యి, పాలను మదర్ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని మంత్రి కొండా సురేఖను కోరతానని ఆయన తెలిపారు. -
కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటి రెడ్డి
హైదరాబాద్,సాక్షి : ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మొదలైన సవాళ్ల పర్వం నిన్న తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. చివరికి అరెస్ట్లకు దారితీసింది. ఈ తరుణంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అని అరికెపూడి గాంధీ చెప్పారు. సచ్చి పోయిన పార్టీని బ్రతికించడం కోసం నాటకాలు అడుతున్నారా? సర్పంచ్కి పనికి రాని కౌశిక్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు.ఆంధ్రప్రాంత ప్రజల్ని తిట్టడం బీఆర్ఎస్ విధానామా ’ అని ప్రశ్నించారు.వాళ్లు లేకుంటే బీఆర్ఎస్కు ఇన్ని సీట్లు వచ్చేవా? జీహెచ్ఎంసీలో ఎలా ఎలా గెలిచారు? అని మండిపడ్డారు. హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బ తీయాలనేది వాల్ల ఉద్దేశం.కాంగ్రెస్ శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. ఇదీ చదవండి : ఈ తండ్రంటే కూతురికి అసహ్యం -
జూబ్లీహిల్స్లో ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ క్లబ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు, మెగాస్టార్ సందడి (ఫొటోలు)
-
Raksha bandhan 2024 : ప్రముఖుల రక్షాబంధన్ వేడుక (ఫొటోలు)
-
అనాధ బాలికకు అండగా నిలిచిన మంత్రి కోమటి రెడ్డి
-
బీఆర్ఎస్ ఆఫీస్ను కూల్చేయండి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆదేశాలు
సాక్షి నల్గొండ జిల్లా: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీరు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆఫీస్ను నిర్మించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి.. తాను గతంలోనే అధికారులకు ఈ విషయంపై ఆదేశాలిచ్చాను కదా వ్యాఖ్యానించారు.‘‘నేను అమెరికాకు వెళ్తున్నా.. ఆగస్టు 11న తిరిగి వస్తాను.. వచ్చేలోపు అనుమతి లేని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలి.. లేకపోతే అధికారులపై యాక్షన్ తీసుకుంటా అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. -
'పవర్' ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్’ పద్దుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ ప్రకంపనలు రేపింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, సవాళ్లు– ప్రతిసవాళ్లు, ఆరోపణలు– ప్రత్యారోపణలు, రాజీనామా డిమాండ్లతో సభ అట్టుడికింది. అదే సమయంలో ఇరుపక్షాల నేతల మధ్య వ్యక్తిగత దూషణలూ చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఏడాది విద్యుత్ రంగానికి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాల వల్లే విద్యుత్ రంగం నష్టాల్లోకి వెళ్లిందని ఆక్షేపించారు. విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, ఆ కథంతా వెలికి తీస్తామని పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచామంటూ పలు గణాంకాలను వివరించారు. అవినీతి అంటూ కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఈ దశలో సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోని విద్యుత్ ఒప్పందాలన్నీ అవినీతిమయమంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కౌంటర్గా జగదీశ్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ఇద్దరూ వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ఇరుపక్షాల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో శాసనసభ దద్దరిల్లింది. -
సభలో సవాల్.. జగదీష్ రెడ్డి Vs మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్, మంత్రులు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. దీంతో, ఆరోపణలు నిజమైతే రాజీనామాలకు సిద్ధమని జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేసుకున్నారు.కాగా, విద్యుత్ అంశంపై చర్చలో భాగంగా గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్కు కౌంటరిచ్చారు.జగదీష్ రెడ్డి కామెంట్స్..సంచుల మూటలు పట్టుకుని దొరికిన వ్యక్తి.చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాలను రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాను.మేము తెలంగాణ కోసం ఎన్నో మంచి పనులు చేశాను. జగదీష్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్..జగదీష్ రెడ్డి సూర్యాపేటలో దారుణాలు చేశారు.ఆయనపై మర్డర్ కేసులు కూడా ఉన్నాయి.మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు.దీంతో, సభలో గందరగోళం నెలకొంది.నేను చెప్పిన కేసులో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు. జగదీష్ రెడ్డి కౌంటర్..నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను.సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతాను.కోమటిరెడ్డి తన ఆరోపణలు నిరూపించాలి.నాపై కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కేసులు పెట్టింది.మూడు కేసుల్లో కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది.సభలో ఆరోపణలపై హౌస్ కమిటీ వేయండి.మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడు.మీలాగా డబ్బుల సంచులు పట్టుకుని తిరగలేదు.కోమటిరెడ్డి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. కోమటిరెడ్డి కామెంట్స్..జగదీష్ రెడ్డి ఛాలెంజ్ను స్వీకరిస్తున్నాను.నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.నేను చేసిన ఆరోపణలను నిరూపిస్తాను.ఒకవేళ నిరూపించలేకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అంతకుముందు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కరెంట్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడిగింది మీరే.సత్యహరిశ్చంద్రుడు మా నాయకుడి రూపంలో పుట్టారన్నట్టు మాట్లాడారు.జ్యుడీషియల్ కమిషన్ ముందుకెళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేది.కానీ, మీరు కమిషన్ విచారణే వద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.విచారణ కొనసాగించాల్సిదేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.కమిషన్ ఛైర్మన్ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్కు కొత్త ఛైర్మన్ పేరును ప్రకటిస్తాం.తెలంగాణను సంక్షోభం నుంచి కాపాడింది సోనియా గాంధీ, జైపాల్ రెడ్డి మాత్రమే.సోనియా గాంధీ దయ వల్ల రాష్ట్రం కరెంట్ సమస్య నుంచి గట్టెక్కింది.లేనిపక్షంలో తెలంగాణ చీకటిమయమయ్యేది.నాడు నేను టీడీపీలో ఉన్నా అసెంబ్లీలో వాస్తవాలు చెప్పాను. దీంతో, నన్నుమార్షల్స్ను పెట్టి బయటకు ఇడ్చుకెళ్లారు. సోలార్ పవర్లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. దీంతో, కరెంట్ ఉత్పత్తి పెరిగింది. సిగ్గులేకుండా ఇంకా మేము విద్యుత్ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారు.బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్లు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చారు.ఆఖరికి అటెండర్ పోస్టులు కూడా వాళ్ల బినామీలకే ఇచ్చారు.ఈ సందర్భంగా వాళ్లకు కావాల్సిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడేవిచారణ అంటే భయపడి కోర్టుకు వెళ్లారు.టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇంకా విద్యుత్ ఉత్పత్తి కాలేదు.ఇండియా బుల్స్ నుంచి రూ.1000 కోట్లు దండుకున్నారు.భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ నీళ్లలో మునిగిపోతోంది. -
హైదరాబాద్-విజయవాడ హైవేని సిక్స్ లైన్గా మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆగస్టు 15వ తేదీలోపే తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదిహేనేళ్లు అధికారంలో ఉంటామనేది పెద్ద జోక్ అంటూ కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి కోమటిరెడ్డి భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ..‘భువనగిరి, ఆలేరు ప్రజలకు ఇన్నాళ్లు తాగడానికి నీరు కూడా లేక మూసీ నీరు తాగుతున్నారు. నాలుగు నెలల్లోనే మూసీ నదిని శుద్ధి చేస్తాం. ఆగష్టు 15వ తేదీలోపే రైతులకు రుణమాఫీ చేస్తాం. హైదరాబాద్-విజయవాడ హైవేని ఆరు లైన్లుగా మారుస్తాం. తెలంగాణలో కేసీఆర్ పదిహేనేళ్లు అధికారంలో ఉంటామనేది ఓ పెద్ద జోక్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఏడు చోట్ల డిపాజిట్ కూడా రాలేదు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను పట్టించుకోవద్దు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రెండు నెలల్లో ప్రారంభం.. రెండేళ్లలో పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిర్మించబోయే తెలంగాణ భవన్ దేశానికి ఐకానిక్గా ఉంటుంద ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. రెండు నెలల్లోగా పనులు ప్రారంభించి రెండేళ్లలోపు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. హంగూ, ఆర్భా టాలనేవి భవన్ నిర్మాణంలో కనిపించవని.. అయితే ఢిల్లీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆగి మరీ భవ న్ను చూసేలా మోడ్రన్గా నిర్మిస్తామని వివ రించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిజైన్ను ఖరా రు చేసిన వెంటనే పనులు ప్రారంభమవు తాయ ని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఏపీ జితేందర్ రెడ్డి బాధ్య తల స్వీకారం కార్యక్రమానికి వచ్చిన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అదిరిపోయేలా నిర్మాణంపదేళ్లుగా తెలంగాణకు ఢిల్లీలో భవన్ లేకపోవడం బాధాకరమని కోమటిరెడ్డి పేర్కొ న్నారు. సుమారు రూ.400–500 కోట్ల బడ్జెట్తో తెలంగాణ భవన్ అదిరిపోయేలా నిర్మిస్తామని చెప్పారు. రెండు కంపెనీలు బిల్డింగ్ నిర్మాణం గురించి ప్రజెంటేషన్ ఇచ్చాయన్నారు. వాళ్లు గోపురం టైపులో నిర్మిద్దామనే డిజైన్ ఇవ్వడంతో..తాను కొన్ని మార్పులు చేసినట్లు చెప్పారు. సింపుల్ లుక్లో భవన్ అదిరిపోయేలా ఉండాల ని సూచించినట్లు తెలిపారు. అందుకు తగ్గ డిజై న్లు వచ్చిన వెంటనే 2 నెలల్లోపే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని వివరించారు. హైదరా బాద్ హౌజ్ పక్కన గవర్నర్, సీఎం బంగ్లాలు నిర్మించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ వల్లే పరిష్కారమైందిరాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్కు సంబంధించిన 19 ఎకరాల ఆస్తుల్లో 42% వాటా తెలంగాణకు రావాల్సి ఉందని కోమటిరెడ్డి తెలిపారు. ఈ ఆస్తులను సాధించుకోవడంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పటౌడీ హౌజ్, హైదరాబాద్ హౌజ్ల పక్కన స్థలాలు తెలంగాణకు కేటాయించాలంటూ అప్పటి సీఎం వైఎస్ జగన్ను తాను కోరడంతో ఆయన వెంటనే ఓకే చేసినట్లు చెప్పారు. ఆ వెంటనే అప్పటి సీఎస్ జవహర్ రెడ్డితో కూడా మాట్లాడి ఏపీ, తెలంగాణకు కేటాయించాల్సిన ఆస్తులపై చర్చించి కేంద్రానికి తెలిపామన్నారు. కేంద్రం కూడా స్థలాల్ని రెండు రాష్ట్రాలకు విభజన చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. కేంద్రంతో మంచిగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడి సాధించుకుంటామన్నారు. హైదరాబాద్ – విజయవాడ బుల్లెట్ ట్రైన్, కృష్ణా– గోదావరి ట్రిబ్యునల్ వ్యవహారం వంటి సమస్యలకు కేంద్రం నుంచి పరిష్కారాన్ని సాధిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ పై కోమటి రెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
-
నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. కోమటిరెడ్డికి హరీశ్రావు కౌంటర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మతిభ్రమించిందని.. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదంటూ మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అంటూ ధ్వజమెత్తారు. తాను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లింది వాస్తవం.. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను’’ అని హరీశ్రావు చెప్పారు.‘‘నేను అమెరికా వెళ్లి, ప్రభాకర్రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం. రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలి. నేను ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్లో ఉన్నాను తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా పాస్పోర్ట్తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తాను. పాస్పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనం.’’ అంటూ హరీశ్రావు దుయ్యబట్టారు.కోమటిరెడ్డి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేస్తున్నాను. ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. కోమటిరెడ్డి చెప్పిన తేదీన, చెప్పిన టైంకి అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తాను, మీ ఆధారాలతో మీరు రండి. చిల్లర వ్యాఖ్యలు చేయడంమాని పాలనపై దృష్టి సారించాలి. నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి తన హుందాతనాన్ని నిలుపుకోవాలి’’ అంటూ హరీశ్రావు హితవు పలికారు. -
నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడని.. ప్రభాకర్ను కలిసేందుకే హరీశ్రావు అమెరికా వెళ్లారని.. ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పొచ్చారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.‘‘ఏ విమానంలో వెళ్లారో.. ఎక్కడ కలిశారో నిరూపిస్తా. ప్రభాకర్రావును కలవలేదని హరీశ్ ప్రమాణం చేస్తారా?. నేను దేనికైనా సిద్ధమే’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. -
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
-
కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు?.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్గొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదేళ్లే కాదు మరో పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు లేరని స్పష్టం చేశారు. తమ పార్టీలో గ్రూపులు లేవని అన్నారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఏక్నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ పార్టీ అని మండిపడ్డారు. కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఈ మేరకు నల్లగొండలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దళితున్ని ప్రతిపక్ష నేతగా సహించని పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబటారు. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదన్న హరీష్రావు మాటల్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్లో అయిదు గ్రూపులు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అనడం తప్పని అన్నారు. బీఆర్ఎస్.. హరీష్ రావు, మహేశ్వర్రెడ్డి నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడాలని, కోమటిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని పడగొడతామన్న మాటలు బంద్ చేయాలని అన్నారు. ‘ప్రతిసారి మహేశ్వర్ రెడ్డి నా పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు. బండి సంజయ్ను దింపి కిషన్ రెడ్డిని ఎందుకు సీట్లో కూర్చోబెట్టారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా?. 39 సీట్లకే పరిమితం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు జ్ఞానోదయం కావట్లేదా?. ప్రతిపక్ష నేతలు విజ్ఞతతో మాట్లాడాలి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస 14 సీట్లను గెలవబోతుంది’ అని తెలిపారు. చదవండి: Congress: కాంగ్రెస్లో ఆ ముగ్గురు ఎవరు? -
గచ్చిబౌలి: ఓఘ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన డింపుల్ హాయతి
-
దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని అన్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రిగా ఉండి సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..‘సభకు 10 లక్షల మందిని తరలిస్తాం. ఏప్రిల్ ఎనిమిదో తేదీన నాంపల్లిలో ఫిరోజ్ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుంది. బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. భువనగిరి, నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తాం. సికింద్రాబాద్లో కూడా దానం నాగేందర్ను గెలిపిస్తాం. దానం గెలుపు బాధ్యత మాదే. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఈసారి గెలిచాం. బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన. మాజీ మంత్రి హరీష్రావు మాటలకు అర్ధం లేదు. కేసీఆర్ చేసిన పాపాలకు వర్షాలు కూడా పడటం లేదు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నాడు. 40వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్ను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం. కేంద్రమంత్రిగా ఉండి కిషన్రెడ్డి సికింద్రాబాద్ను పట్టించుకోలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడు. అది సాధ్యం కాదు. కాంగ్రెస్ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ఇక, దానం నాగేందర్ మాట్లాడుతూ..‘సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నేను గెలవడానికి అందరి సహకారం కావాలి. తుక్కుగూడ సభ విజయవంతం చేయడానికి సమావేశమయ్యాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఆర్థిక పరిస్థితి బాలేదు, కొంచెం టైం పట్టుద్ది: మంత్రి కోమటిరెట్టి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ల గెలుపు కోసం పనిచేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక్క తెలంగాణ కోసం తప్ప తాను ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. తన నియోజకవర్గం, తన శాఖ తప్ప వేరే పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ ఆయన చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ను చుట్టుకున్నాయని విమర్శించారు. యాదగిరగుట్ట పేరును యాదాద్రిగా మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పని అన్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల నేడు రాష్ట్రానికి కరువు వచ్చిందన్నారు. దేవుడి పేరు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. . బీసార్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంటే కేసీఆర్ మైండ్ బ్లాక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదని, అందుకే టికెట్ ఇచ్చినా వద్దు అని ప్రకటిస్తున్నారని అన్నారు. ‘మేము గేట్లు తెరుచుడు కాదు...గేట్లు తెరవకముందే కాంగ్రెస్లోకి తోసుకుని వస్తున్నారు. మా గేట్లు పలగొట్టి పార్టీలో జాయిన్ అవుతున్నారు’ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరూ మిగిలరని పేర్కొన్నారు. బీజేపీ నుంచి రాకుంటే ఆపుకుంటే చాలు ఉద్యమాల పోరాట గడ్డ తెలంగాణ గడ్డ. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక లెక్క తెలంగాణ ప్రభుత్వాన్ని పడకొడితే ఊరుకోం. మా ప్రభుత్వాన్ని పడగొట్టుడు తరువాత బీజేపీకి ఉన్న 8మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు రాకుండా ఆపుకుంటే చాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం, మంత్రులు, ఎమ్మేల్యేలు అందరూ ఒక్కటే. కేసీఆర్ ప్రభుత్వంలో R అండ్ D మినిస్టర్ గణపతి రెడ్డి మాత్రమే...ప్రశాంత్ రెడ్డి కాదు. ప్రశాంత్ రెడ్డి మాత్రమే కాదు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్దే నడిచింది. రేవంత్కు తెలియక నలుగురే రావులు ఉన్నారు అనుకున్నారు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మాత్రమే పోటీ అవినీతి చూస్తుంటే రావులందరూ ఒకే దగ్గర జమైనారు. ప్రగతి భవన్ను జైలులాగా మార్చి రావులందరిని వేయాల్సి వచ్చేలా ఉంది. ఒక్కరిద్ధరే అనుకున్నాం కానీ తవ్వేకొద్దీ రావులందరూ బయటకు వస్తున్నారు. కేసీఆర్ అవితిని అంతా తీయాలంటే మాకు 20 ఏళ్లు పడేటట్లు ఉంది. పార్లమెంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మాత్రమే పోటీ. మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. భగవంతుడు కూడా మమ్ములను విడదియ్యలేరు. చిన్న చిన్న మనస్పర్థలు ప్రతీ కుటుంబంలో ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి కానీ, నేను టికెట్ అడుగలేదు. మా పెద్దన్న కొడుకు మాకు చెప్పకుండా ధరకాస్తు ఇచ్చారు. తెలిశాక వద్దు అన్నాను. వైఎస్సార్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి వైఎస్ఆర్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగింది. హాలీవుడ్ లాంటి స్టూడియో పెట్టీ టూరిజం పెంచాలని చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేదు. రుణమాఫీ, పెన్షన్లు, లాంటి స్విమ్స్కు కొంత సమయం పడుతుంది. ఎలాగోలా నెట్టుకొస్తాం అనుకున్నాం. కానీ కేసీఆర్ అన్ని శాఖల్లో వేల కోట్ల బకాయిలు పెట్టీ పోయారు. రాష్ట్రం నిధులన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో పెట్టారు. విచారణ చేసి ఆ మూడు సెగ్మెంట్ల నిధుల ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేస్తాం. కడియం శ్రీహరి అనే వ్యక్తి ఒక సిస్టమేటిక్గా ఉంటారు. కడియం శ్రీహరి కూతురు అలా చెప్పింది అంటే అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ 12 సీట్లు రావడం పక్క. మా నల్గొండ, భువనగిరి సీట్లలో భారీ మెజారిటీ వస్తది. బీజేపీకి నాలుగు సీట్లు అనుకుంటున్నా. అక్కడ మేము దృష్టి పెట్టాం. దానం నాగేందర్ ఎమ్మేల్యేకు రాజీనామ చేయకుండా ఎంపికి పోటీ కష్టమే అనుకుంటా. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి.. ఇంకో పార్టీలో ఎంపిగా పోటీ అంటే లీగల్ సమస్యలు వస్తాయి అని నా అభిప్రాయం. సినిమాలు తీసి ప్రజలను రెచ్చకొట్టడం కాదు. పార్టీ పిరాయింపులు అనేది మోదీ, కేసీఆర్ అలవాటు చేసినవనే. బ్లాక్ మనీ అన్నారు ఏమైంది? అదానీ అంబానీ నంబర్ వన్ టు ఎలా అయ్యారు? కిషన్ రెడ్డి తెలంగాణకు ఎం చేశారు? కిషన్ రెడ్డి పుణ్యమా అని కాంగ్రెస్కు మంచి జరిగింది. మేము 12అనుకున్నాం కానీ 14 సీట్లు కిషన్ రెడ్డి వల్ల వస్తాయి. కిషన్ రెడ్డి స్థానంలో నేను ఉంటే మూసీ అభివృద్ధి, హైదరాబాద్లో సైతం 30, 40వేల పనులు చేసే వాడిని’ అని తెలిపారు. -
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్
-
కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ విసిరారు. నేను నల్గొండలో రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలి. నేను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తా. ఇక కారు షెడ్డు మూసుకోవాల్సిందే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానంటూ కేసీఆర్ ప్రకటన చేస్తారా?. నేను సిరిసిల్ల లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కేటీఆర్కు టెక్నికల్ పరిజ్ఞానం లేదు. ఆయనొక పిల్లగాడు. స్థాయి కేటీఆర్ది కాదు. కేటీఆర్కు క్యారెక్టర్ లేదు. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. నాకు క్యారెక్టర్ ఉంది. నా దగ్గర డబ్బులు లేవ’’ అంటూ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. లోక్ సభ పోటీలో మాకు ప్రత్యర్థి బీజేపీనేని, బీఆర్ఎస్ కాదని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించాం. నల్గొండ, భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కోరుతున్నాం. నాలుగు లక్షలకు పైగా మెజారిటి వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అరవింద్ను ప్రజలు మర్చిపోయారు. 2 వేల కోట్లు నాకు ఉన్నాయని అంటే భయం కలిగింది. రాజకీయాల వల్ల ఆస్తులు పోగుట్టుకున్నాం. నాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్తులు కూడా తగ్గాయి. నా పేరు మీద ఎక్కడైనా ఆస్తులు ఉంటే అరవింద్కు ఇస్తా. బీఆర్ఎస్ ఎలాగూ లేదు... బీజేపీకి రెండు, మూడు వస్తాయేమో మాకైతే తెలియదు’’ అని ఉత్తమ్, కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణ రాష్ట్రం వచ్చాక వలసలు తగ్గాయి: హరీష్ రావు
-
హరీష్ రావు ది పోస్ట్ మాన్ పని: మంత్రి కోమటిరెడ్డి
-
కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు
-
‘సీఎం కావడానికి హరీష్ రావు ప్లాన్లో ఉన్నాడు’: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు కావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని అన్నారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్లో భాగంగా మాట్లాడుతూ.. హరీష్రావు ముఖ్యమంత్రి కావాలనే ప్లాన్లో ఉన్నట్టున్నాడు. కేసీఆర్ను వ్యతిరేకించే వస్తే మేము అందుకు సపోర్టు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్రావు, కవిత పేర్ల మీదుగా విడిపోతుంది. బీఆర్ఎస్లో నాలుగు పార్టీలు అవుతాయి. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడు. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలి. కేసీఆర్ కట్టే పట్టుకొని తిరుగుతున్నాడు.. ఆయన పులి ఎట్లా అవుతాడు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న నేనేం కావాలి. ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు
-
KCR తెలంగాణకు అప్పులు మిగిల్చారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-
కేసీఆర్పై కోమటిరెడ్డి ఫైర్.. క్షమాపణలు చెప్పాల్సిందే..
సాక్షి, నల్లగొండ: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేతపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ నల్లగొండ జిల్లాలోకి రావాలంటే ముందుగా ముక్కు నేలకు రాసి రావాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాను బీఆర్ఎస్ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి ఆదివారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు. ఇక్కడ కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడు. బీఆర్ఎస్ నల్లగొండను నాశనం చేసింది. త్వరలో ఇక్కడికి కేసీఆర్ వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ మళ్లీ వస్తున్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి. బీఆర్ఎస్ సభ రోజున ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ప్రసంగించాలి. కేసీఆర్ మాట తప్పడంపై జిల్లా కేంద్రంలో వినూత్న నిరసన చేపడుతున్నాం. కేసీఆర్ కోసం కుర్చీ, పింక్ టవల్, ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే, రాష్ట్ర బడ్జెట్పై కూడా కోమటిరెడ్డి స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైంది. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించాం. కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలి. కేఆర్ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టింది కేసీఆర్, హరీష్రావే అని వ్యాఖ్యలు చేశారు. -
తాగునీటి కష్టాలకు కారణం కేసీఆరే..
నల్లగొండ: ‘‘మాజీ సీఎం కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను బీజేపీకి తాకట్టు పెట్టారు. పైగా రేవంత్రెడ్డే కేంద్రానికి అప్పగించారని ఉల్టా మాట్లాడుతున్నారు. దీనిపై నల్లగొండలో సభ పెడతామంటున్నారు. కేసీఆర్ నల్లగొండకు ఎలా వస్తారో చూస్తాం. కేసీఆర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆయన మిలటరీని పెట్టుకుని వచ్చినా నల్లగొండ ప్రజలు తరిమికొడతారు’’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ (శ్రీశైలం సొరంగమార్గం), డిండి లిఫ్ట్, లోలెవెల్ కెనాల్ ప్రాజెక్టులను పక్కనబెట్టి దక్షిణ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని వెంకట్రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో ఎస్ఎల్బీసీ మంజూరు చేస్తే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడిందని మండిపడ్డారు. తన బిడ్డ కవిత లిక్కర్ కేసులో జైలుకు పోకుండా ఉండేందుకు కేసీఆర్ బీజేపీకి తలొగ్గి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించారని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్తో కుమ్మక్కై ఏపీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ పారిపోయేలా ఉన్నారు! కమీషన్ల కోసం చేసిన ప్రాజెక్టుల వల్లే జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్టు అయ్యారని.. కేజ్రీవాల్ను కూడా అరెస్టు చేస్తారంటున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తాను జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతోనే కేంద్రం ఏం చెబితే కేసీఆర్ అది చేశారని ఆరోపించారు. ‘‘పులి వస్తోందని హరీశ్రావు అంటున్నారు. పులి లేదు, గిలి లేదు. మూటాముల్లె సర్దుకుని పోవాల్సిందే. కేసీఆర్ ఓడిపోయినా ప్రైవేటు స్పెషల్ ఫ్లైట్ను ఇంకా ఎందుకు రద్దు చేసుకోలేదు? కవిత లిక్కర్ కేసు సమయంలో అద్దెకు తీసుకుని, మాజీ సీఎం అయినా దాన్ని అలానే ఉంచారంటే ఏ రాత్రి అయినా అరెస్టు చేస్తామంటే.. ఠక్కున ఫ్యామిలీ అంతా పారిపోయేందుకు స్పెషల్ ఫ్లైట్ను సిద్ధంగా ఉంచుకున్నారు. దుబాయ్ వెళ్లిపోతే ఎవరూ అరెస్టు చేయరనేది వారి ఉద్దేశం..’’ అని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ విషయంలో కేసు నమోదవడం, కేసీఆర్, హరీశ్రావు అరెస్టవడం ఖాయమని పేర్కొన్నారు. హంతకుడికి మంత్రి పదవి ఇచ్చారు నల్లగొండ జిల్లాకు చెందిన హంతకుడికి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని.. ఆ మంత్రి అవినీతికి పాల్పడ్డారే తప్ప ఏనాడూ ప్రాజెక్టులను సందర్శించలేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని ఉద్దేశించి వెంకట్రెడ్డి ఆరోపణలు చేశారు. రెండు పూటలా తిండికి లేని వ్యక్తి మంత్రి అయ్యాక దోపిడీకి పాల్పడ్డాడని, యాదాద్రి పవర్ ప్లాంట్లో దోచుకున్నాడని వ్యాఖ్యానించారు. ఆ అవినీతిపై విచారణ చేయిస్తున్నామని, ఆయన జైలుకుపోక తప్పదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంతా అవినీతేనని, హెచ్ఎండీఏ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి దగ్గరే వెయ్యి కోట్లు దొరికాయంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. -
త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. హామీల అమలుపై సమీక్షలు జరిపి వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు గుల్ల చేసిందని, అందుకే హామీల అమలులో కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. ఇక, కరెంటు బిల్లులు కోమటిరెడ్డి ఇంటికి పంపాలన్న మాజీ మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో జగదీశ్రెడ్డి పాత్ర కూడా ఉందని, ఆయన జైలుకెళ్లడం ఖాయమని, ఆయన తోపాటు కేటీఆర్, కవితలకూ జైలు తప్పదన్నారు. 200 యూ నిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే కరెంటు బిల్లులు తమకు పంపాలని బీఆర్ఎస్ ప్రజలను రెచ్చగొడుతోందని, రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీ ఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, తాము నిరుద్యోగులను ఇలాగే రెచ్చగొట్టి ఉంటే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అక్రమాల నిగ్గు తేల్చే పనిలో ఉన్నామని, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ చీలికలు, పీలికలు అవుతుందని, ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలవదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. -
ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల తెలంగాణ అప్పులపాలైందన్నారు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్న మంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోలో తెలంగాణ నుంచి చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను సేకరిస్తున్న కేంద్ర మేనిఫెస్టో కమిటీ.. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు.. రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది. చదవండి: కేటీఆర్, హరీశ్రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్ ప్రతిపక్షాలవి తొందరపాటు విమర్శలు మేనిఫెస్టోతోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించిందని అన్నారు పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వసాన్ని చూపారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు టీ కాంగ్రెస్ సాయం తీసుకుంటాం మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విదంగా ఉండాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. తెలంగాణలో మంచి మేనిఫెస్టో అందించారని.. అందుకే రాష్ట్ర ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ఏఐసీసీ మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతుందని చెప్పారు. మ్యానిఫెస్టో పబ్లిక్ ఫ్రెండ్లీగా, క్రోని కాపిటల్కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకుంటామన్నారు. -
బయటపడ్డ కాంగ్రెస్ 7 గ్యారంటీ
-
రెండేళ్లలో పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను వచ్చే రెండేళ్లలోగా పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం, బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకాల కింద కాల్వలతో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ కాల్వలను పూర్తి చేసినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. 10 ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో చెట్లు, పూడికతో నిండిపోయాయన్నారు. సత్వరమే నిర్వహణ పనులు చేపట్టాలని, బెడ్, సైడ్ లైనింగ్ పనులను ఈ ఏడాదే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద తొలి దశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో భూసేకరణ, కాల్వల నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు రూ.100 కోట్లు, పనుల కోసం మరో రూ.100 కోట్లను సత్వరంగా విడుదల చేస్తామని, పనులు నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. వచ్చే ఏడాదిలో పనులు పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది..: కోమటిరెడ్డి గత ప్రభుత్వం నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. పనులు చివరి దశలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. అసెంబ్లీలో తాను ఎన్నో మార్లు మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ రావు, చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్ పాల్గొన్నారు. -
మురళీమోహన్కు సన్మానం
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీ మోహన్కి 'నట సింహ చక్రవర్తి' బిరుదు ప్రదానం చేశారు. వి బి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన ఆధ్వర్వంలో ఈ వేడుకకి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సినీ పెద్ద మురళీమోహన్ గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా నన్ను ఈ ఈవెంట్ కి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. విష్ణు బొప్పన గారు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అన్నారు. బిజీ షెడ్యూల్ ని కూడా పక్కనపెట్టి మురళీమోహన్ గారి కోసం ఈవెంట్ కి రావడం జరిగింది. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మురళీమోహన్ గారు ఆయన్ని సన్మానించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక సినీ యాక్టర్ గా చూశాను రాజకీయ నాయకుడిగా చూసాను బయట మంచి వ్యక్తిగా కూడా చూడడం జరిగింది అలాంటి వ్యక్తికి సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. ‘నా 50 సంవత్సరాల నట జీవితాన్ని పురస్కరించుకుని 'నటసింహ చక్రవర్తి' బిరుదునివ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది’అని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు. ‘ప్రతి ఏడాది పేద కళాకారులకు స్కూల్ ఫీజులు లేదా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఈసారి వికలాంగులకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతులు మీదుగా చెక్కుల అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’అని వి బి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా సీతారామం దర్శకుడు హను రాఘవపూడి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, బింబిసార దర్శకుడు వశిష్ట, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ ఎస్తేర్, గాయని హారిక నారాయణ, గాయకుడు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. -
సకల హంగులతో హైకోర్టు నిర్మిస్తాం: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్/ఏజీ వర్సిటీ: రాష్ట్ర హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, సకల హంగులతో నిర్మిస్తామని ఆర్ అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో హైకోర్టు భవనానికి కేటాయించిన వంద ఎకరాల స్థలాన్ని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి, జస్టిస్ టి.వినోద్కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్రెడ్డితో కలసి ఆయన శనివారం పరిశీలించారు. సంబంధిత అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు సత్వరన్యాయం అందించడానికి అవసరమైన మౌలికవసతుల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇది తీరని ఇబ్బందులు కలిగించిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో న్యాయ సౌకర్యాల కల్పనలో రాజీపడకుండా కక్షిదారులు, న్యాయమూర్తులు, న్యాయవాదుల అవసరాలకు సరిపడేలా, సకల సౌకర్యాలతో హైకోర్టును నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, పంచాయతీరాజ్ కార్యదర్శి ఎం.రఘునందన్రావు, న్యాయశాఖ కార్యదర్శి ఆర్.తిరుపతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హోళికెరితోపాటు ఇతర న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, హైకోర్టు నిర్మాణం కోసం వ్యవసాయ వర్సిటీలో భూమి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు తీర్మానించారు. వర్సిటీ భూములు రైతులకు విజ్ఞానాన్ని అందించడానికే తప్ప, ఇతర నిర్మాణాలకు కాదన్నారు. -
ఢిల్లీలో కోమటిరెడ్డి.. రింగ్రోడ్, తెలంగాణ భవన్పై కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్ను పరిశీలించారు. అనంతరం, ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ ఏర్పాటుపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వెంకట రెడ్డి మాట్లాడుతూ..‘ఢిల్లీలో వీలైనంత త్వరగా కొత్తగా తెలంగాణ భవన్ నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న భవన్లో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ భవన్ విభజనలో ఎలాంటి వివాదం లేదు. గత ప్రభుత్వ విధానానికి భిన్నమైన వైఖరి మేం తీసుకుంటాం. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మరొక మణిహారం. ట్రిపుల్ ఆర్ సహా పలు జాతీయ రహదారుల అంశాలపై మాట్లాడేందుకు నేషనల్ హైవే అథారిటీ చైర్మన్ను కలుస్తున్నాం. రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం’ అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా వారితో కోమటిరెడ్డితో మాట్లాడుతూ..‘రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అని అప్పటి పీఎం మన్మోహన్ చెప్పారు. ఇప్పటికీ విభజన చట్టం అమలుపరచకపోవడం బాధాకరం. నా వంతు ప్రయత్నం చేస్తాను. ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో చెప్పారు, అమలుపరిచే బాధ్యత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిది’ అని వ్యాఖ్యలు చేశారు. -
28న మరికొన్ని గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ/నల్లగొండ: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28న మరికొన్ని గ్యారంటీలను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలులోకి తెస్తామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భేటీలో ఆ శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్–విజయవాడ రహదారిని ఆరులేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని, తెలంగాణలోని 14 రహదారులను స్టేట్ హైవేలుగా మార్చాలని కేంద్రమంతిని కోరానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివరించారు. కేంద్రంతో తరచూ సంప్రదిస్తూ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రోడ్ల గుంతలను మట్టితో పూడ్చిందని, తమ ప్రభుత్వంలో అలా జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరిపైనా తాము కక్ష సాధింపులకు దిగబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మిస్తామన్నారు. ఈ విషయంపై మంగళవారం అధికారులతో సమీక్ష జరుపుతానని కోమటిరెడ్డి తెలిపారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాను కలిసి రాజీనామాపత్రాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. -
తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ చేస్తా..
-
తెలంగాణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరంటే..?
తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను టాలీవుడ్ ఆసక్తిగా గమనిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడంతో.. కొత్త ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల ఎలా వ్యవహరిస్తుంది? ప్రభుత్వ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? సినిమాటోగ్రపీ మంత్రి ఎవరు.. అనే చర్చలు టాలీవుడ్లో మొదలయ్యాయి. నేడు మంత్రులకు శాఖలు కేటాయించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు వరుసగా రెండు సార్లు సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పని చేశారు. సినిమా ఈవెంట్స్లో రెగ్యులర్గా పాల్గొంటూ ఆయన చిత్రపరిశ్రమకు దగ్గరగానే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పరిశ్రమ అభివృద్ధికి సహకరించింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నంది అవార్డులను ఇచ్చింది. కానీ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఆ అవార్డులు కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యాయి. కొత్త ప్రభుత్వం అయినా పెద్ద మనసు చేసుకొని ఆ అవార్డులను ఇస్తుందా లేదా అని టాలీవుడ్ పెద్దలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి తమ సమస్యలను వినిపించుకునేందుకు టాలీవుడ్ పెద్దలు రెడీ అవుతున్నారు. -
ఈ జీవితం ప్రజలకే అంకితం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
సోనియా దీవిస్తే సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
సాక్షి, నల్లగొండ: సోనియాగాంధీ ఆశీర్వదిస్తే ఏదో ఒకరోజు సీఎం అవుతా నని నల్లగొండ కాంగ్రెస్ అభ్యరి్థ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి మండలం థానేదారుపల్లి, కంకణాలపల్లి, దుప్పలపల్లి, రాయినిగూడెం తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కేసీఆర్ పాలన లో తెలంగాణ ఆగమైందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తున్నార ని చెప్పారు. 15 రోజుల్లో కేసీఆర్ను ప్రగతి భవ న్ నుంచి బయటకు పంపే పరిస్థితి రాబోతుందని జోస్యం చెప్పారు. ఉద్యోగాల భర్తీ కోసం పోటీ పరీక్షలు నిర్వహించడంలోనూ ప్రభుత్వం విఫలం కావడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలో పడేశారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణను కాపాడేది కాంగ్రెస్సే తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలనుంచి ప్రజల ను కాపాడేది కాంగ్రెస్ పార్టీనేనని, ఆరు గ్యారంటీ స్కీంలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకే రాష్ట్ర ప్రజలు ఓటు వేయాలని సీడబ్ల్యూసీ సభ్యురాలు ఆల్కాలాంబా పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...తెలంగాణ తో పాటు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర తర్వాత ప్రజల్లో ఆలోచన పెరిగిందని, అందుకే కర్ణాటకలోని డబుల్ఇంజన్ సర్కారును ఓడించి అక్కడి ప్రజలు కాంగ్రెస్ పారీ్టకి పట్టం కట్టారని చెప్పారు. బీజేపీ నేతలు దేశాన్ని విడిచిపెట్టి తెలంగాణలో ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చారని, కశ్మీర్లో ఐదుగురు జవాన్లు చనిపోతే వెళ్లకుండా అమిత్షా తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, తమను గెలిపించడం ద్వారానే సమగ్రాభివృద్ధి జరుగుతుందని అల్కాలాంబా చెప్పారు. -
బీఆర్ఎస్ పాలనలో దోపిడీ తప్ప మరేమీ లేదు
-
తెలంగాణలో అభివృద్ధి సున్నా..కేసీఆర్ ని మూడోసారి నమ్మరు..
-
నేనే సీఎం..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
అప్పుడే మొదలైన కుర్చీలాట.. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుర్చీ ఆట మొదలైంది. కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకమో, లేక ఎమ్మెల్యేగా గెలవడానికి ఆ కుర్చినీ చూపిస్తున్నారో కాని మొత్తం మీద ముఖ్యమంత్రి పదవి తనదంటే తనదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలలో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉందన్ని సమాచారంతో సీఎం పదవి కుర్చీపై కూడా కొందరు ఖర్చీఫ్ వేసుకుంటున్నట్లుగా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కొడంగల్ శాసనసభ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా కుర్చీ పేరుతో చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షించాయి. పార్టీలో కొందరికి కాస్త అసహనం కూడా ఏర్పడింది. నాకే సీఎం పదవి: రేవంత్ రేవంత్ చాలా స్పష్టంగా తనకే ముఖ్యమంత్రి పదవి వస్తుందని కొడంగల్ ప్రజలకు చెప్పడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. ఇందులో రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి తానే ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నానని పార్టీలో పోటీ పడేవారికి సంకేతం ఇవ్వడం, తాను ముఖ్యమంత్రి అవుతాను కనుక తనను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం. నిజానికి ఇది ఒకరకంగా సాహసం అని చెప్పాలి. వర్గాలతో నిండి ఉండే కాంగ్రెస్లో ఇలా చెప్పడం అంటే సమస్యలను కొని తెచ్చుకోవడమే. అయినా ఆ పని చేయడానికే ముందుకు వెళ్లారు. దానికి కారణం సెంటిమెంట్ను ప్రయోగించడమే. ఉమ్మడి మహబూబ్నగర్నుంచి ఒక్కరే ఈ సందర్భంగా గతంలో బూర్గుల రామకృష్ణారావు ఒక్కరే ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు తనకు అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. మరో విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆఆర్ పోటీ చేసే కామారెడ్డి నుంచి కూడా నామినేషన్ వేశారు. అక్కడ గెలిచే అవకాశం సహజంగానే తక్కువ. ఒకవేళ అక్కడ గెలిస్తే, కాంగ్రెస్ అధికారంలో వచ్చే పక్షంలో ఆయనే సీఎం అవుతారని చెప్పవచ్చు. మరో పాయింట్ ఏమిటంటే రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు కోట్లు కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లారు. అది నెగిటివ్ మార్క్ అయినా, ఆ విషయం తెలిసి కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు కనుక అది పెద్ద అభ్యంతరం కాకపోవచ్చు. కాంగ్రెస్లో అతి వేగంగా పీసీసీ అధ్యక్షుడిగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అయ్యే అర్హత బాగానే ఉంటుంది. అందులోను రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి అతి వేగంగా పీసీసీ అధ్యక్ష స్థాయికి చేరారు. కాని అన్నిసార్లు అలా జరగాలని లేదు. గతంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఆయన ఆ రెండుసార్లు సీఎం కూడా అయ్యారు. కాని రెండేళ్లలోపే పదవిని వదలుకోవల్సి వచ్చిన సంగతి కూడా గుర్తుచుకోవాలి. కానీ ఆ తర్వాత కాలంలో అలాంటి అవకాశంఎవరికి రాలేదు. ఉదాహరణకు డి.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ, వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వానికి జనామోదం ఉండడంతో ఆయనను ముఖ్యమంత్రిని చేశారు. లైన్లో కోమటిరెడ్డి కూడా.. తాజాగా కర్నాటకలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను కాదని, సిద్దరామయ్యను సీఎంగా చేశారు. సిద్దరామయ్య అంతకు ముందు కూడా సీఎంగా పనిచేసిన అనుభవం ఉపయోగపడింది. వీరిద్దరి పోటీ అక్కడ వర్గ కలహాలకు ప్రాతిపదికగా మారింది. కాంగ్రెస్ రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు తామూ సీఎం అభ్యర్దులమేనని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటించుకున్నారు. రేవంత్ రెడ్డి సభలో ఆయన అభిమానులు సీఎం, సీఎం అని నినాదాలు చేసి ఉత్సహాపడ్డారో, అదే మాదిరి మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ ఘట్టం సందర్భంగా జరిగిన సభలో కూడా ఆయనను సీఎం, సీఎం అని అనుచరులు నినాదాలు చేశారు. దానిపై ఆయన స్పందించారు. తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ లో తనకు సీనియారిటీ ఉందన్నది ఆయన భావన. ఆయనతో పాటు నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా తనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించవచ్చు. అందరికన్నా సీనియర్ అయిన మాజీ మంత్రి జానారెడ్డి ఈసారి పోటీ చేయకపోయినా, ఆయా ప్రచార సభలలో తనకు సీఎం అయ్యే అర్హత ఉందని చెప్పి మనసులో మాట బయటపెట్టారు. మరో నేత జగ్గారెడ్డి ఎప్పటికైనా సీఎం అవుతానని అంటున్నారు. పైగా సీఎం పదవిని అధిష్టానం నిర్ణయిస్తుందని పరోక్షంగా రేవంత్ రెడ్డికి ఆయన జవాబు ఇచ్చారు. భట్టికి చాన్? మరో నేత మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించారు. దళితవర్గానికి చెందినవారికి సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే ఆయనకు చాన్స్ రావచ్చు. మరోవైపు బీజేపీ బీసీ కార్డు ప్రయోగిస్తున్నందున, ఆ వర్గాలకు చెందినవారు కూడా తాము రేసులో ఉంటామని ప్రకటించవచ్చు. బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, ప్రధాని మోదీ ఈ మేరకు హామీ ఇచ్చారని ఈటెల రాజేందర్ కూడా ప్రచారం ఆరంభించారు. ఆయన లక్ష్యం కూడా ఆ సెంటిమెంట్ ద్వారా తొలుత శాసనసభ్యుడిగా ఎన్నికవడమే అన్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇదంతా ఎన్నికల ముందు జరుగుతున్న చర్చ. అసలు ఎన్నికలలో గెలవడం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు వీరంతా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఈలోగా ఎవరికి వారు తొలుత ఎమ్మెల్యే అవడం కోసం వ్యూహాత్మకంగా సీఎంపదవిని ఒక ఆకర్షణగా తమ నియోజకవర్గాలలో ప్రచారం చేసుకుంటున్నారని అనుకోవచ్చు. ఇంతకీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటారా? :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
నేనూ ఏదో ఒకరోజు సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షి, నల్గొండ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ ఊపందుకుంది. అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులు మాత్రమే గడువుండటంతో అన్నీ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు. మరోవైపు కీలక పార్టీ అభ్యర్థులతోపాటు రెబల్స్, స్వతంత్రులు.. ఇలా ఎవరికి వారే ఎన్నికల ప్రచారంలో దూసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్గొండ అసెంబ్లీ స్థానానికి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నామినేషన్ వేశారు. అంతకు ముందు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ గెలిచిందని విమర్శించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలను భర్తీలో చేయటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు నల్గొండను నాశనం చేశారని కోమటిరెడ్డి విమర్శించారు. పోలింగ్కు ముందు రైతు బంధు వేస్తారని, దానితో మోసపోవద్దని సూచించారు. డిసెంబర్ 9 కాంగ్రెస్కు లక్కీ నెంబర్ అని పేర్కొన్నారు. సోనియా పుట్టిరోజు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ నుంచి తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతానని తెలిపారు. అయితే సీఎం కావాలనే తొందర మాత్రం తనకు లేదని చెప్పారు. చదవండి: పంతం నెగ్గించుకున్న ఈటల, బండి సంజయ్ -
భారీ ర్యాలీతో కోమటిరెడ్డి నామినేషన్
-
చిన్న పార్టీలు వద్దు.. జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యం: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యంగా ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లో చిన్న(ప్రాంతీయ) పార్టీలే అధికారంలోకి వస్తాయని సీఎం కేసీఆర్ అనడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..‘జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ చిన్న పార్టీలే అధికారంలోకి వస్తాయని సీఎం కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. చిన్న పార్టీలు గెలిచి ప్రధాని మోదీకి సపోర్ట్ చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెడుతోంది. ప్రధాని మోదీ అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు వేస్తా అన్నాడు. పది సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎవరి అకౌంట్లోనూ పైసా వేయలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందన్న ఆందోళనతో కేసీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. జాతీయ పార్టీ అని చెప్పి మహారాష్ట్రలో పనికిమాలిన నాయకులను బీఆర్ఎస్లో చేర్చుకున్నాడు. వారిని ప్రగతి భవన్ తీసుకువచ్చి బిర్యానీలు పెట్టాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పక్కదారి పట్టించడానికి కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రుణమాఫీ చేయడం లేదు. తెలంగాణ కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: దీపావళి ప్రత్యేక రైళ్లు -
అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
సాక్షి, నల్గొండ జిల్లా: తాను సిద్దిపేటలో పోటీ చేసేది లేదని, తమ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని.. కానీ అలాంటి ప్రయోగాలు చేస్తుందని తాను అనుకోనని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, ప్రజల రుణం తీర్చుకోవడం కోసం నల్గొండలోనే పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. ‘‘కర్ణాటకలో అమలవుతున్న పథకాలను పర్యవేక్షించేందుకు కర్ణాటక వెళ్దాం. బీఆర్ఎస్ నేతల కోసం హెలికాప్టర్ కూడా సిద్ధం చేశాను. బావ, బామ్మర్థులు ఎవరు వస్తారో తెల్చుకోండి. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో కర్ణాటక ప్రజల్ని అడుగుదాం. సంక్షేమ పథకాలు అందడం లేదని కర్ణాటక ప్రజలు చెప్తే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా’’ అంటూ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ‘‘బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ఆడుతున్నారు. 5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించలేదు. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే తొమ్మిది ఏళ్లుగా బాగుపడ్డారు. కేసీఆర్ సొంత కులస్తులు కూడా తెలంగాణలో బాగుపడలేదు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకు నేతలంతా కాంగ్రెస్లో చేరుతున్నారు. ధరణితో ఎవరు బాగుపడ్డారో కేసీఆర్ చెప్పాలి’’ అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిలదీశారు. చదవండి: వివేక్తో రేవంత్రెడ్డి భేటీ -
కేసీఆర్ మోసకారి..కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
రాజగోపాల్ రెడ్డి చేరికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
బీఆర్ఎస్ ను మల్లన్నసాగర్ లో ముంచుతాం
-
‘ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య’
సాక్షి, ఢిల్లీ: గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన వరంగల్ విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళసై నివేదిక కోరగా, ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘ప్రవల్లికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య. సమయానికి పరీక్షలు నిర్వహించకపోవడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దీనిపై స్పందించాలి. తెలంగాణ యువత సీఎం కేసీఆర్ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం -
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారిని వదలం: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ: ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్లోనే కొనసాగతానని, తాను చనిపోయినా నా శవంపై కాంగ్రెస్ జెండానే ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. గురువారం ఆయన కనగల్ మండలం ధర్వేశిపురంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, అభివృద్ధి పనుల కోసం ప్రధానిని కలిస్తే.. బీజేపీలో చేరుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్కు వంతపాడుతున్న అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వదలం. ఈ నెల 15న కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేస్తాం. 75 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది’’ అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఈటల రాజేందర్ సంచలన ప్రకటన -
ఎన్నికల వేళ కాంగ్రెస్లో సీఎం పోస్టుపై కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీ సహా, ప్రతిపక్ష పార్టీల నేతలు గెలుపు తమదంటే తమదేనని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్లో చేరిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా నకిరేకల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి, మధు యాష్కీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అంటున్నారు. కానీ, కాంగ్రెస్లో అలా కాదు.. ఎవరైనా సీఎం కావొచ్చు. తెలంగాణలో ఎవరు సీఎం అన్నది ముఖ్యం కాదు. ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడం అందరిముందున్న లక్ష్యం. నేను భవిష్యుత్తులో ఎప్పుడైనా సీఎం అవుతాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో.. కేటీఆర్ నేను ఎక్కడికి వెళితే అక్కడ కుట్రతో కరెంటు కట్ చేయిస్తున్నాడు. బీఆర్ఎస్ ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి వందల కోట్లు పంచుతున్నారు. లక్షల సార్లు అబద్ధాలు చెప్పిన వ్యక్తి కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులు, మహిళలు వివక్షకు గురయ్యారు. చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోలేదు. సంతలో గేదెలను కొన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారు. ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోతో బయపడి గ్యాస్, యూరియా ఫ్రీ అంటాడు. నాలుగు వేల పింఛన్ భార్యాభర్తలకు ఇద్దరికీ ఇస్తాము. కరెంటు 24 గంటలు ఇస్తున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట తప్ప మిగతా 116 నియోజక వర్గాలు అభివృద్ధికి నోచుకోలేదు. కేసీఆర్ ఫామ్హౌస్కు పోవడానికి రూ.600 కోట్లతో రోడ్లు వేసుకున్నాడు. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఆ పేరు పెట్టింది కూడా నేనే. కేటీఆర్కు ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే వీరేశంను నకిరేకల్లో ఓడించు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సత్తా ఏంటో బీఆర్ఎస్కు చూపిస్తాం అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్కు రేఖా నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్ -
సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, నల్గొండ: సగం నెల పూర్తయినా ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు ఇవ్వకపోవడం బాధాకరం అంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన కోమటిరెడ్డి.. ఇప్పటికైనా జీతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే రెండు నెలలన్న ఒకటికే జీతాలు ఇవ్వాలంటూ లేఖలో సూచించారు. జీతాలు రాకపోవడంతో ఈఎంఐలు కట్టలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఓపీఎస్ను అమలు చేస్తామని లేఖలో పేర్కొన్నారు. చదవండి: లొల్లి చేస్తే దవడ పగలగొడతా: రేణుకా చౌదరి బుధవారం ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. బానిస బతకుల పార్టీ బీఆర్ఎస్దే. కనీసం అపాయింట్మెంట్ అడిగినా తనకు ఇవ్వలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. ‘‘కేసీఆర్ లాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. కాళేశ్వరం కాంట్రాక్టర్లు, భూ కబ్జాకోరులు బీఆర్ఎస్కు కావాలి. ఉద్యోగులకు ఒకటినే జీతాలు ఇవ్వాలి. ఏడాది కాలంగా పదమూడు, పద్నాలుగునా జీతాలు ఇస్తున్నారు. డిఫాల్టర్లుగా మారడంతో భవిష్యత్తులో లోన్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఇవ్వకపోడంతో ఉద్యోగులు శాపనార్ధాలు పెడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు అమ్ముడుపోయారు. కేటీఆర్ చేతగాని దద్దమ్మ. పింఛన్లు ఇవ్వలేని వాళ్లు కూడా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దోచుకున్న సొమ్మంతా రాబోయే రోజుల్లో బయట పడుతుంది. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు పంపిస్తాం’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ‘‘రేపటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం. నల్లగొండను దత్తత తీసుకుంటున్నామని అన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయలేదు.దత్తత తీసుకుంటే ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు’’ అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. ‘‘ఎస్సెల్బీసీ సొరంగం ఎందుకు పూర్తి చేయలేదు. గజ్వేల్, సిద్దిపేటలో వేల ఇళ్లు నిర్మించారు. నల్లగొండలో ఒక్క ఇళ్లు కూడా ఎందుకు నిర్మించలేదు. రోడ్డు కోసం ఇళ్లు కూలగొట్టి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కానీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని మాత్రం కట్టుకున్నారు. దత్తత పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్కు డిపాజిట్ రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే. కాంగ్రెస్ అధికారంలోకి రాగామే స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తాం’’ అని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
అలిగిన కోమటిరెడ్డి!.. రంగంలోకి ఏఐసీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇవాళ జరిగిన స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీకి సైతం ఆయన డుమ్మా కొట్టారు. ఇంతకాలం పార్టీనే తన తొలి ప్రాధాన్యతగా చెబుతూ వస్తున్న ఆయన.. ఇప్పుడు ఆత్మగౌరవం ముఖ్యమంటూ స్వరం మార్చడం గమనార్హం. ఆయన అలక వెనుక సరైన కారణం తెలియనప్పటికీ.. కీలక పదవులు దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుజ్జగింపులకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఏఐసీసీ ఆదేశాలనుసారం.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సమస్యల్ని అంతర్గతంగానే.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో.. వచ్చి తనను కలవాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్రావు ఠాక్రే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్తారని, అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి ని బుజ్జగిస్తారని తెలుస్తోంది. కోమటిరెడ్డి ఇంటికి వెళ్తున్న.. ఆయనతో భేటీ అవుతా అంటూ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం ఠాక్రే సైతం ప్రకటన చేశారు. అయితే కోమటిరెడ్డి స్ట్రాంగ్ లీడర్ అని, ఆయన అలగరు అని సీనియర్ నేత భట్టి చెబుతుండడం గమనార్హం. రేవంత్రెడ్డి పీసీసీ నాయకత్వాన్ని విబేధిస్తూ.. పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు కోమటిరెడ్డి. అయితే కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత కలిసి పని చేయాలనే అధిష్టానం ఆదేశాలతో కలుపుగోలుగా పని చేయాలని భావించారు. ఈ తరుణంలో.. పార్టీలో చేరికలు, సీట్ల కేటాయింపు అంశం మళ్లీ కోమటిరెడ్డిని అసహనానికి లోను చేశాయి. ఈలోపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ రెండింటిలో జాబితా వెలువడడం.. ఆ రెండింటిలో తనకు పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు స్పష్టమవుతోంది. -
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి అలక
-
ఎన్నికల్లో పోటీపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. నల్గొండ సీటు ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల జోరు ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నాయి. ఇక, ఇటీవల కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో కూడా విజయం సాధించాలనే దిశగా హస్తం నేతలు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, కోమటిరెడ్డి గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కోసం నా నల్గొండ సీటు త్యాగం చేసేందుకు కూడా సిద్దం. సమర్థవంతమైన వాళ్లకే టిక్కెట్లు ఇస్తాం. నా నియోజకవర్గంలో కూడా ఆరు అప్లికేషన్స్ వచ్చాయి. అందరి బలాబలాలను పరిశీలిస్తాం. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ వన్ టూ వన్ మాట్లాడాలని రేవంత్ ప్రతిపాదించారు. రేవంత్ ప్రతిపాదనను అందరం ఆమోదించాం. డిక్లరేషన్ను తెలంగాణలో అమలు చేస్తాం.. అమలు చేయకపోతే రాజీనామా చేస్తాం. కేసీఆర్.. మూడెకరాలు ఇస్తా అని మాట తప్పాడు. మాట తప్పితే తల నరుక్కుంటా అన్నాడు.. ఏం చేశాడు?. మొండెంతో తిరుగుతున్నాడా?. అని సెటైరికల్ పంచ్ వేశారు. ఎన్నికల ముందు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఏదో మతలబు ఉంటుంది అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. టికెట్ల కోసం పోటీ.. ఇదిలా ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ టెన్షన్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్కు స్క్రీనింగ్ పరీక్ష టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అనేక నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక, సీనియర్లు పోటీపడుతున్న సీట్లలో కూడా టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ► జనగామలో పొన్నాల Vs కొమ్మూరి ప్రతాప్రెడ్డి ► వనపర్తిలో చిన్నారెడ్డి Vs మెఘారెడ్డి, శివసేన రెడ్డి ► ఎల్బీ నగర్లో మధు యాష్కీ Vs మల్రెడ్డి రంగారెడ్డి ► కల్వకుర్తిలో వంశీచందర్రెడ్డి Vs రాఘవరెడ్డి ► కొల్లాపూర్లో జూపల్లి Vs జగదీశ్వరరావు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇది కూడా చదవండి: కమలం నేతల్లో కొత్త టెన్షన్.. అసలేం జరుగుతోంది? -
ఎవరూ ఆవేశపడొద్దు: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ వైపు చూస్తుండడం.. ఆ చేరికకు తెలంగాణ పీసీసీ సైతం పచ్చ జెండా ఊపిందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈలోపు అనూహ్యాంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ తెర మీదకు వచ్చారు. శనివారం నకిరేకల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘‘బీఆర్ఎస్కు రాజీనామా చేస్తే కాంగ్రెస్ తరపున టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టే కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారు. ఎవరో వస్తున్నారన్న వార్తలు నమ్మి కార్యకర్తలు ఆవేశపడొద్దు. కారక్యర్తలు ఎవరి పేరు చెబితే.. వాళ్లనే అభ్యర్థిగా ప్రకటిస్తా. ఉచిత విద్యుత్పై రేవంత్ నోరు జారితే.. లాగ్బుక్ పెట్టి నష్టనివారణ చేయించింది నేనే అని కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. నల్లగొండ కాంగ్రెస్ చేరికలపై కోమటిరెడ్డితో మరో సీనియర్.. ఎంపీ ఉత్తమ్కుమార్ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరినీ కూడదీసుకుని బీఆర్ఎస్కు ఢీ కొట్టాలనే ఆలోచనతో ఉన్న పీసీసీ చేరికలకు ఆటంకం కలగకుండా ఈ ఇద్దరు సీనియర్లను బుజ్జగించే సంప్రదింపులు జరుపుతోంది. అయితే కోమటిరెడ్డి మాత్రం కార్యకర్తల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలని పీసీసీకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. -
కాంగ్రెస్లోకి వేముల వీరేశం?
సాక్షి, నల్గొండ జిల్లా: జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ సీనియర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నకిరేకల్కు చెందిన తన అనుచరులు, నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్లో చేరనున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటి వరకు వీరేశం చేరికను కోమటిరెడ్డి వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అవమానించడమే అవుతుందని, సునీల్ కనుగోలు(ఎన్నికల వ్యూహకర్త) చెబితే చేర్చుకోవడమేనా? అంటూ కోమటిరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీరేశం చేరికపైనే కోమటిరెడ్డి నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. నకిరేకల్లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎన్ని బాధలు పెట్టినా భరించా.. అయినా ఇంకా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా’’ అంటూ తన అనుచరులు ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి -
బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు.. కేసీఆర్పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, నల్గొండ జిల్లా: ఓట్ల కోసమే కేసీఆర్ దళిత బంధు తెచ్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శలు గుప్పించారు. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని, బీసీ బంధు కూడా ఎన్నికల తర్వాత మాయం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపై ఉన్నారన్న ఆయన కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశాడని దుయ్యబట్టారు. ‘‘బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కోమటిరెడ్డికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పనులు చేయడం లేదు. సిద్దిపేటలో లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసి నన్ను 10 సంవత్సరాలుగా ఏడిపిస్తవా. మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని గ్రామాలకు సాగు నీళ్లు ఇస్తా. కుటుంబ పాలన పోతేనే పేదలు, నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి. కేసీఆర్ దళిత బంధు పథకం ఓట్ల కోసమే తెచ్చారు. దళిత బంధు పేరుతో రూ.10 లక్షల ఇస్తే అందులో 3 లక్షలు కమిషన్ తీసుకుంటున్నారు’’ అని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: కేసీఆర్ పక్కా ప్లాన్.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ రెడీ.. -
కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీ నుంచి పోండి: కోమటిరెడ్డి సీరియస్
సాక్షి, యాదాద్రి: పార్టీలో తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని.. బతుకు తెలంగాణే తన అభిమతమని అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. భువనగిరిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరగ్గా.. ఎంపీ కోమటిరెడ్డి హజరయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి.. నాకు ఏ పదవీ అవసరం లేదు.. నాకు బతుకు తెలంగాణ కావాలి. ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు కచ్చితంగా బీసీలకు కేటాయించాలని సోనియా, రాహుల్ను కోరాను. బలహీనవర్గాలను అవమానపరిస్తే ఖబడ్దార్. కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోండి. సామాజిక తెలంగాణ ఇంకెప్పడొస్తుంది కేసీఆర్? అని అధికార పక్షాన్ని నిలదీశారాయన. కేసీఆర్ కేబినెట్లో ఎక్కువమంది ఓసీలే. ..నాకు వ్యాపారాలు లేవు, గుట్టలు, కొండలు అమ్ముకోను అంటూ పరోక్ష విమర్శలు చేశారాయన. గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి గందమల్ల రిజర్వాయర్ పనులు అప్పగించారని, ఔటర్ రింగ్ రోడ్డును కాంట్రాక్టర్లు అప్పగించి ఆ డబ్బులతో రుణమాఫీ చేస్తున్నామంటున్నారని కేసీఆర్ సర్కార్పై ఆరోపణలు చేశారాయన. కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ అని విమర్శించారు. పంట నష్టం పది వేల రూపాయలు ఎక్కడని? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి. -
కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. షర్మిల మౌనం!
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ కావడం.. రాహుల్ గాంధీకి బర్త్డే విషెస్తో పాటు లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత శుభాకాంక్షలు తెలియజేయడం.. తాజాగా హస్తిన పర్యటనతోనూ దాదాపుగా సంకేతాలు ఇచ్చేశారు. ఈ క్రమంలో.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్లోకి వస్తే లాభమే జరుగుతుందని చెబుతూనే.. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభ నిరవధిక వాయిదా పడడంతో.. హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో షర్మిల సైతం ఆయన వెంట ఉండడం గమనార్హం. ‘‘షర్మిల తెలంగాణకు వస్తే తప్పేంటి?. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారు కదా!. షర్మిలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నాం. వైఎస్సార్ కూతురిగా ఆమెకు ఎప్పుడైనా కాంగ్రెస్లోకి ఆహ్వానం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేసింది. ఆమె కాంగ్రెస్లోకి వస్తే లాభమే జరుగుతంది. షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా.. 400 ఓట్లు వచ్చినా లాభమే. ఒకరినొకరు కలుపుకుని బలపడాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీది’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. షర్మిల మౌనం.. మరోవైపు ఢిల్లీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల. ఈ క్రమంలో కోమటిరెడ్డితో పాటు ఉన్న ఆమెను మీడియా స్పందన కోరగా.. ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే.. ఢిల్లీ పరిణామాలపై తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయని ఆమె వర్గీయులు చెబుతున్నారు. Warm congratulations to Sree @RahulGandhi ji on being reinstated as the Member of Parliament. While your unwavering grit continues to rekindle hopes among millions of people across the nation, justice took its course and delivered a verdict that gladdened many hearts. I am now… — YS Sharmila (@realyssharmila) August 8, 2023 ఇదీ చదవండి:మంత్రి శ్రీనివాసగౌడ్పై కోర్టు ఆగ్రహం -
ప్రధాని మోదీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి
ఢిల్లీ; ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. హైదరాబాద్లోని గురునానక్ యూనివర్శిటీ, శ్రీనిధి యూనివర్శిటీలపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. ఆ రెండు యూనివర్శిటీలకు హోదా లేకున్న లక్షల్లో ఫీజులు వసూలు చేశారని, దీనిపై వెంటనే ఈడీ, సీబీఐలతో ఫిర్యాదు చేయించాలని వెంకట్రెడ్డి కోరారు. NH 65లో మల్కాపూర్ నుండి విజయవాడ వరకు 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రధానిని ఎంపీ కోమటిరెడ్డి కోరారు. -
కాంగ్రెస్కు షాక్! కోమటిరెడ్డి ఎఫెక్ట్.. హైదరాబాద్కు కుంభం.. కారులో షి‘కారు’
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. నిన్న ఘట్ కేసర్ లో అనిల్ కు వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశమైంది. ఈనేపథ్యంలో అనిల్ కుమార్ రెడ్డి భువనగిరిలో సోమవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యతిరేకవర్గంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ దెబ్బతినేలా ఎంపీ వెంకట్రెడ్డి గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని అనిల్ ఆరోపించారు. ఆయన పార్టీని డిస్టర్బ్ చేస్తున్నారని అన్నారు. తన ఇంట్లోనే ఐదు ఆరు సీట్లు తీసుకున్నప్పుడు కోమటిరెడ్డికి బీసీలు గుర్తు రాలేదా? అని అనిల్ కుమార్రెడ్డి ప్రశ్నించారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్నది తప్పు అని వ్యాఖ్యానించారు. పార్టీ పటిష్టంగా ఉంది, గెలిచే అవకాశాలు ఉన్న సమయం లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంచి సహకారం అందిస్తున్నారని కార్యకర్తల సమావేశంలో అనిల్ చెప్పుకొచ్చారు. (బండి వ్యాఖ్యల సెగలు.. ఢిల్లీలో అమిత్షాతో కరీంనగర్ ఎంపీ భేటీ, కీలక సూచన) కారెక్కనున్న కుంభం కాంగ్రెస్లో వర్గపోరుతో కుంభం అనిల్కుమార్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పొసగకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని వార్తలు వెలువడుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డితోపాటు అనిల్కుమార్రెడ్డి హైదరాబాద్లో కనిపించడం వార్తలకు బలం చేకూరింది. (బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్) -
కోమటిరెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్కుమార్గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా దాదాపు 30 మంది నేతలు హాజరయ్యారు. ఉమ్మడి కార్యాచరణ, జనంలోకి ఎలా వెళ్లలనేదానిపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఉచిత విద్యుత్ అంశం, పార్టీలో చేరికల అంశం చర్చలోకి రానుంది. ఇక కర్ణాటకలో ఎన్నికల సక్సెస్ స్ట్రాటజీని తెలంగాణలో అమలు చేసే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయిదు అంశాలతో ప్రజలకు గ్యారంటీ కార్డు ఇచ్చేందుకు హస్తం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్లో చేరికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పార్టీ నేతలంతా 119 నియోజకవర్గాలు తిరిగేలా ప్లాన్ చేస్తే బాగుంటుందన్నారు. బస్సు యాత్ర చేపట్టాలని సలాహా ఇస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని కోమటిరెడ్డి తెలిపారు. చదవండి: సందీప్ సుల్తానియా వ్యవహారశైలిపై అధికారులు, ఉద్యోగుల ఆగ్రహం -
పొలిటికల్ అలర్ట్.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెట్ స్పీడ్లో దూసుకోపోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు బుధవారం హైదరాబాద్లో సమావేశం కానున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాసంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్కుమార్గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు హాజరు కానున్నారు. రేపు ఢిల్లీకి రేవంత్.. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకే పార్టీ ముఖ్యులను కోమటిరెడ్డి లంచ్కు ఆహ్వానించారని తెలియవచ్చింది. త్వరలో పార్టీలో చేరే నాయకుల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకొనే దిశగా చర్చలు జరిపేందుకే ఈ భేటీ జరగనుందని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రేవంత్రెడ్డితోపాటు ఠాక్రే, ఇతర ముఖ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. గురువారం వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. ప్రియాంకా గాంధీ సమక్షంలో జూపల్లి, కూచుకుళ్ల బృందంతోపాటు రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన పలువురు నేతలు కూడా వారితోపాటు వెళ్లి ఖర్గేను కలుస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్లో భారీ చేరికలు.. ఇక, ఈ జాబితాలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్నగర్కు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, నల్లగొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఓ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రముఖ ట్రావెల్స్ అధినేత, ఆదిలాబాద్కు చెందిన మరో కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం భేటీ అనంతరం కోమటిరెడ్డి నివాసంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారని, ఈ సమావేశంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ నేతలు స్పష్టతనిస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘కాంగ్రెస్లో చేరినందుకే కక్ష సాధింపు చర్యలు’ -
తెలంగాణలో 24 గంటల కరెంట్.. బీఆర్ఎస్కు చెక్ పెట్టిన కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలంగాణలో ఉచిత కరెంట్ అంశంపై పొలిటికల్ హీట్ నడుస్తోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని తేలిందన్నారు. కాగా, రేవంత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ కొనుగోలులో భారీ అవినీతి జరిగింది. కేసీఆర్ అవినీతి బయటపెడతాం.. జైలుకు పంపిస్తాం. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్స్టేషన్ల పర్యటనల్లో ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడంలేదని తేలింది. సబ్స్టేషన్ల సవాల్ను స్వీకరించే ధైర్యం బీఆర్ఎస్కు ఉందా?. ఏం చేసినా మోటర్లకు మీటర్లు పెట్టం అన్న కేసీఆర్.. ఇప్పుడు మీటర్లు పెడతామని ఒప్పుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారనే భయం కేసీఆర్కు పట్టుకుంది. ప్రతిపక్షం ఎలా ఉండాలో బీఆర్ఎస్ నేతలు ట్రయల్ వేస్తున్నారు. ఖమ్మం సభ ద్వారా మేము ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. నిన్నటి(బుధవారం) నిరసనలతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పోలరైజేషన్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్కు కూడా గజ్వేల్లో నెగిటివ్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తామని చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. మరోవైపు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం. 11 గంటల విద్యుత్లో కూడా కోతలే ఉన్నాయి. ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితి ఉంది. తెలంగాణలో 11 గంటల కంటే విద్యుత్ ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం అని సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన -
మంత్రి కేటీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: పది గంటల కరెంట్ ఇస్తున్నట్లు కేటీఆర్ చూపిస్తే.. సబ్ స్టేషన్లోనే రాజీనామా చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్, ఎక్కడి సబ్ స్టేషన్కైనా వెళ్దాం. ఇక్కడ లాక్ బుక్ల్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్కి సేవ చేస్తా’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారంటే కేసీఆర్, కేటీఆర్ ఫ్లైక్సీలకు పాలాభిషేకం చేస్తానన్న కోమటిరెడ్డి.. ఒక్కొక్క ఎమ్మెల్యే రూ.వెయ్యి కోట్లు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారు. నా సవాల్కి ఎవరొస్తారో రండి.. కనీసం ఆరు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారో చూపించాలని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! కాగా, కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత మంచి జోష్తో దూసుకెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆత్మరక్షణలో పడేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్కు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక సొంత పార్టీలోనే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతుంటే, మరికొందరు మాత్రం..అధికార బీఆర్ఎస్ రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. -
అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం.. పోలీసులపై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, నల్లగొండ జిల్లా: తెలంగాణ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం సభ విజయవంతం అవుతుందని వాహనాలను అడ్డుకుంటున్నారని, బారీకేడ్లు పెట్టిన తొక్కుకుంటూ వెళ్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, పోడు భూముల సమస్య చెప్పుకోవడానికి వస్తున్న వారిని ప్రభుత్వాధికారులు ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి?. 4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు నిన్న రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారు.. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఆర్టీసీ వాహనాలను డబ్బులు కడతామన్నా ఇవ్వలేదు. ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ సభకు భయపడి ప్రభుత్వం బస్సులను ఇవ్వలేదు’’ అని మండిపడ్డారు. ‘‘జనాన్ని కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులు న్యాయంగా డ్యూటీ చేయాలి. సభా ప్రాంగణానికి 15, 20 కిలోమీటర్ల దూరంలో ఆపేయడం కరెక్ట్ కాదు. 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు’’ అంటూ ఎంపీ కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు. చదవండి: జన గర్జన సభ.. బీఆర్ఎస్పై రేవంత్రెడ్డి ట్వీట్ -
డీకేతో కోమటిరెడ్డి భేటీ.. రాజగోపాల్ చేరికపై చర్చ!
సాక్షి, కర్ణాటక: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. పార్టీలోకి చేరికలపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్ణాటకకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్తో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. అయితే, బెంగళూరులో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్లో చేరికలపై ప్రధానంగా చర్చించుకునే అవకాశాలున్నాయి. మరోవైపు, కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరికపై కూడా అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో డీకే శివ కుమార్ పేరు హైలైట్ అవుతోంది. డీకే చుట్టే కాంగ్రెస్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్కు టైమొచ్చిందా?..ఆ విషయంలో సక్సెస్ అయ్యే ఛాన్స్! -
జూపల్లి, పొంగులేటి విషయంలో క్లారిటీ ఇచ్చిన రేవంత్, వెంకట్ రెడ్డి
-
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉందని గ్రహించి నాలుగేళ్ల క్రితమే ఎదురు తిరిగామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని, బీఆర్ఎస్ను రాష్ట్రంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణను పాలించే హక్కు కేసీఆర్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నారెడ్డి బుధవారం హైదరాబాద్లోని జూపల్లి కృష్ణారావు నివాసానికి లంచ్ మీటింగ్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి జూపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అటు నుంచి పొంగులేటి నివాసానికి రేవంత్, కోమటిరెడ్డి బయల్దేరారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చవద్దని తెలిపారు. తెలంగాణ అమరవీరులు కోరుకున్నది ఇలాంటి సమాజం కాదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు, అవినీతిమయం చేశారని, బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి తొక్కేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయిందని, బంగారు తెలంగాణ కొందరికే పరిమితమైందని విమర్శించారు. ప్రాణ త్యాగాలపై ఏర్పడిన తెలంగాణను ద్రోహులు ఏలుతున్నారని, తెలంగాణలో దుర్మార్గపు పాలన సాగుతోందని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించేవారిని పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ను గద్దె దించేందుకు అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తనను కాంగ్రెస్లో రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. చదవండి: అన్నదమ్ముల్లా కలిసి పని చేస్తాం: రేవంత్, కోమటిరెడ్డి -
ఎంపీ కోమటిరెడ్డితో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం
-
అన్నదమ్ముల్లా కలిసి పని చేస్తాం: రేవంత్, కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో చేరికలపై సీనియర్లలో అసంతృప్తి నెలకొందని వస్తున్న ఊహాగానాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి స్పందించారు. స్థానిక నేతలను సంప్రదించకుండా.. ఎవరినీ పార్టీలోకి తీసుకోబోమని స్పష్టం చేశారాయన. బుధవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన నివాసంలో కలిసిన రేవంత్.. చేరికలు ఇతర పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేరికలపై ఎలాంటి విభేదాలు లేవు. పొంగులేటికి నల్లగొండకు ఏం సంబంధం?. నల్లగొండలో కాంగ్రెస్లో చేరికలపై రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ, అలాంటిదేమైనా ఉంటే కోమటిరెడ్డి, ఉత్తమ్, జానారెడ్డిలతో చర్చిస్తాం. ఈ ముగ్గురిని సంప్రదించాకే.. ఎవరినైనా పార్టీలోకి తీసుకుంటాం. చాలామంది పార్టీలో చేరతామని వస్తున్నారు. కానీ, స్థానిక నేతలను అడగకుండా ఎవరినీ తీసుకోం. కోమటిరెడ్డి, నేనూ కలిసి పని చేస్తాం. రాహుల్ను ప్రధానిని చేసేంత వరకూ కలిసి పని చేస్తాం. లోక్సభ ఎన్నికల్లో 15 సీట్లు గెలిపించేందుకు కృషి చేస్తాం అని తెలిపారాయన. అధికారంలోకి వచ్చినా.. కలిసే ఉంటామన్నారు పార్టీ సీనియర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చాక కూడా కలిసే ఉంటాం. రేవంత్ నేనూ సోదరులుగా ఉంటాం. ఉత్తమ్, జానారెడ్డికి తెలియకుండా చేరికలు ఏవీ జరగవు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారాయన. భేటీ అనంతరం ఇద్దరూ కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు. అక్కడ జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం అవడం ఖాయం. కేసీఆర్ పాలన ఇక చాలని ప్రజలు అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక వేముల వీరేశం, శశిధర్రెడ్డి చేరికలపై(ప్రయత్నాలపై) అలకబూనినట్లుగా జరుగుతున్న ప్రచారంపై మరో సీనియర్ ఉత్తమ్ కుమార్రెడ్డి స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: ఓరుగల్లులో డైలాగ్ వార్ -
ఎవరో చెబితే చేర్చుకోవడమేనా?: టీ కాంగ్రెస్లో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో చేరికలపై చీలికలు మొదలయ్యాయా?. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్రెడ్డి చేరికలు ఖరారు అయిపోయాయి. అయితే తేదీల విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. వీళ్ల చేరికలపై నేతల్లో ఏకాభిప్రాయం ఉంది. అయితే ఈలోపు మరికొందరి చేరికలపై హడావిడి నడుస్తుండగా.. పలువురు సీనియర్లు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత వేముల వీరేశం కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే చిన్నయ్యతో ఆయనకు పడదన్న సంగతి తెలిసిందే. అదే టైంలో టికెట్ కూడా దక్కే ఛాన్స్లు కనిపించడం లేదు. దీంతో వీరేశంతో పాటు కోదాడకు చెందిన శశిధర్రెడ్డి సైతం హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పొంగులేటి ఇంటికి ఈ ఇద్దరూ వెళ్లినట్లు సమాచారం. వేముల వీరేశం అయితే.. వీరేశం, శశిధర్రెడ్డి చేరికల అంశాన్ని నల్లగొండ సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అవమానించడమే అవుతుందని, సునీల్ కనుగోలు(ఎన్నికల వ్యూహకర్త) చెబితే చేర్చుకోవడమేనా? అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి ఇంటికి పీపీసీ చీఫ్ రేవంత్రెడ్డి వెళ్లనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలుపే ముఖ్యమన్న కోమటిరెడ్డికి ఆయన చేరికలపై నచ్చజెప్పి.. ఆపై ఇద్దరూ పొంగులేటి ఇంటికి వెళ్తారని సమాచారం. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ నుంచి కొత్త మనోహర్రెడ్డి సైతం కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. 2014లో మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారీయన. పొంగులేటితో పాటే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు మనోహర్రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్రెడ్డితో భేటీ కానున్నారు. ఇదీ చదవండి: పక్కా.. బీఆర్ఎస్ నేతలు పార్టీ మారతారు చూస్కోండి! -
టీకాంగ్రెస్లో విభేదాలు లేవని సోనియాకు చెప్పా: కోమటిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. దీంతో, కాంగ్రెస్ పార్టీలో కూడా వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ఇక.. సోనియా, ప్రియాంక భేటీ అనంతరం కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను సోనియాకు వివరించాం. అలాగే, భట్టి విక్రమార్క పాదయాత్ర, ప్రియాంక గాంధీ సభలపై కూడా చర్చించాము. ఖమ్మం, నల్లగొండ సభలకు సోనియా, ప్రియాంకను ఆహ్వానించాను. వీలుంటే సభకు సోనియా వస్తానని హామీ ఇచ్చారు. జూలై 7వ తేదీ తర్వాత తెలంగాణ పర్యటన తేదీ చెబుతామన్నారు. ప్రతీ 10 రోజులకు ఒకసారి తెలంగాణకు రావాలని ప్రియాంకను కోరాను. ఈ మూడు నెలల్లో 33 జిల్లాలు కవర్ చేయాలని ప్రియాంకను కోరాం. కర్ణాటక తరహాలో టికెట్లు ముందే ప్రకటించాలని కోరాను. మేమంతా కలిసిపోయాం.. ఎలాంటి విభేదాలు లేవని సోనియాకు చెప్పాను. రాహుల్ గాంధీతో పాటు మీరు కూడా తెలంగాణకు ఎక్కువ సమయం ఇవ్వాలని ప్రియాంకను కోరాను. తెలంగాణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని ప్రియాంక చెప్పారు. ఒకరి పాదయాత్రకు మరొకరం సహకరిస్తామని సోనియాకు చెప్పాను. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిపెడతామని సోనియా చెప్పినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు.. ఎల్బీనగర్లో 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో.. -
సీడబ్ల్యూసీకి కొత్త టీమ్! తెలంగాణ నుంచి ఒకరికి చాన్స్?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పునర్వ్యవస్థీకరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దృష్టి సారించారు. ఈ ఏడాది డిసెంబర్లోనే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండటం, మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవాల్సిన దృష్ట్యా సీడబ్ల్యూసీ నియామకాలను పూర్తి చేసే కసరత్తులో పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగిన పార్టీ మూడు రోజుల ప్లీనరీ సమావేశంలో, వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ నామినేట్ చేసేందుకు పార్టీ అధ్యక్షుడికే పూర్తి అధికారం ఇవ్వాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కుల, ప్రాంత, రిజర్వేషన్ల ప్రాతినిధ్యం ఆధారంగా సభ్యుల ఎంపికను మొదలుపెట్టినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్పూర్ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు సీడబ్ల్యూసీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, 50 ఏళ్లలోపు యువకులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో వీటి ఆధారంగా ఇప్పటికే కొన్ని పేర్లను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రాహుల్గాంధీ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ లిస్ట్పై చర్చలు చేసి నెలలోగా తుది ప్రకటన చేస్తారని సమాచారం. ఇక సీడబ్ల్యూసీలోకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది చివరన జరుగనున్న ఎన్నికల దృష్ట్యా తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ పార్టీలో అత్యున్నత పార్లమెంటరీ బోర్డుతో పాటు, కేంద్ర ఎన్నికల కమిటీలో సీనియర్ నేత కె.లక్ష్మణ్కు ఆ పార్టీ అవకాశం ఇచ్చింది. మరోపక్క పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగుతున్నారు.తెలంగాణ నేతలకు బీజేపీ ఇచ్చిన ప్రాధాన్యత మాదిరే రాష్ట్ర నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ సీడబ్ల్యూసీలో ప్రాధాన్యమిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ చోటు కల్పించాలని నిర్ణయిస్తే షార్ట్లిస్ట్లో ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పదేళ్ల కింద తెలంగాణ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు సీడబ్ల్యూసీలో సభ్యునిగా ఉండగా, ఆ తర్వాత రాష్ట్రం నుంచి కొత్త సభ్యుడిగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. -
రైతుల చేతులకు సంకెళ్లు!
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలని ఆందోళన చేసిన రైతులకు యాదాద్రి భువనగిరి పోలీసులు సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. పోలీసుల తీరుపై రాజకీయ పార్టీల నేతలు, రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జైల్లో ఉన్న రైతులను మంగళవారం భువనగిరి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకు వచ్చే క్రమంలో వారి చేతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. వాస్తవానికి ఆ రైతులకు సోమవారమే బెయిల్ వచ్చింది. అయినా పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వారు కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి కాన్వాయ్ను అడ్డుకోవడంతో.. భువనగిరి మండలం రాయిగిరి గ్రామ రైతులు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ రోడ్డుతో తాము భూములను పూర్తిగా కోల్పోతున్నా మని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మే 30న భువనగిరి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా.. అదే సమయంలో మంత్రి జగదీశ్రెడ్డి కలెక్టరేట్లో సమావేశం ముగించుకుని వెళ్తున్నారు. ధర్నా చేస్తున్న రైతులు మూకుమ్మడిగా వెళ్లి మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెద రగొట్టారు. అదే రోజు భువనగిరి రూరల్ పోలీసులు ఆరుగురు రైతులపై కేసు నమోదు చేశారు. రాత్రికల్లా గడ్డమీద మల్లేశ్ (ఏ1), పల్లెర్ల యాదగిరి (ఏ2), అవిశెట్టి నిఖిల్ (ఏ3), మల్లెపోయిన బాలు (ఏ4) అనే నలుగురు రైతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏ5 తంగళ్ళపల్లి రవికుమార్, ఏ6 గూడూరు నారాయణరెడ్డి (బీజేపీ నేత)లు పరా రీలో ఉన్నట్టుగా చూపించారు. తొలుత భువనగిరి సబ్ జైలుకు తరలించిన నలుగురు రైతులను.. వారికి రాజకీయ నాయకుల పరామర్శలు అధికం కావడంతో శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపుతూ 4న నల్లగొండ జైలుకు తరలించారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రిమాండ్లో ఉన్న నలుగురికి సోమవారం భువన గిరి జిల్లా కోర్టులో కండిషనల్ బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ ప్రక్రియలో జాప్యం కావడంతో వారి విడుదల ఆలస్యమైంది. అయితే సోమవారా నికి 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో మంగళ వారం ఉదయమే భువనగిరి కోర్టులో హాజరుపర్చ డానికి తీసుకువచ్చారు. కోర్టు ముందువరకు సంకెళ్లు వేసి రైతులను వాహనంలో తీసుకువచ్చిన పోలీసులు.. వారిని జడ్జి ముందు హాజరుపరిచి తిరిగి పోలీస్ వాహనంలో ఎక్కించుకునిపోయే క్రమంలోనూ బేడీలు వేయడంతో వివాదం తలెత్తింది. తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇలావుండగా ఈ రైతులు మంగళవారం సాయంత్రం నల్లగొండ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ఎంపీ కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతులకు బేడీలు వేయడం చూసి తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపర్చడమేనని, అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా?: బండి సంజయ్ రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాల్సింది పో యి దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా? అని మండిపడ్డారు. కాగా రైతులేమైనా తీవ్రవాదులు, రేపిస్టులు, బందిపోట్లా? సంకెళ్లు వేసి తీసుకెళ్ల డానికి.. అని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలావుండగా రైతుల దగ్గర ఏకే 47 తుపాకులున్నాయని సంకెళ్లు వేశారా? అని కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రశ్నించారు. న్యాయం చేయమని ప్రాధేయపడితే సంకెళ్లు వేస్తారా? నల్లగొండ క్రైం: న్యాయం చేయమని ప్రాధేయ పడితే సంకెళ్లు వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రజా ప్రతినిధులను అడిగిన ప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ కోసం, వరంగల్ రహదారి కోసం, హైటెన్షన్ విద్యుత్ లైన్ కోసం మూడు దశలుగా ఇప్పటికే తమ భూములు త్యాగం చేశామని, ఇప్పుడు మళ్లీ ఆర్ఆర్ఆర్కు భూములు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఉన్న కొద్దిపాటి భూమి కూడా పోతే తమ కుటుంబాల భవిష్యత్ అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రియాంక సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్కడ..?
-
కోమటిరెడ్డికి జ్వరమొచ్చిందో.. ఏం నొప్పొచ్చిందో నాకేం తెలుసు?: జానా రెడ్డి
సాక్షి, నల్లగొండ: ‘ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి జ్వరమొచ్చిందో.. నొప్పొచ్చిందో నాకేం తెలుసు? భట్టి విక్రమార్క పాదయాత్రకు ఎందుకు పోలేదో ఆయన్నే అడగాలి.. నన్నుకాదు’ అని కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడారు. భువనగిరి జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఎంపీ కోమటిరెడ్డి ఎందుకు పాల్గొనడం లేదని విలేకరులు అడగ్గా జానారెడ్డి పైవిధంగా స్పందించారు. నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని, ఇప్పటికే 14 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నాయని, 7 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు బీఆర్ఎస్ పాలనలో నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కేసీఆర్ తరమే కాదన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నిరుద్యోగుల విషయంలో ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే టీఎస్పీఎస్సీ పేపర్లు లీకయ్యాయన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ పాల్గొన్నారు. చదవండి: ముహూర్తం ఫిక్స్!.. పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరుతారో? -
కేసీఆర్.. ఛత్తీస్గఢ్కు వెళ్లి చూడు
గుండాల: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం కార ణంగా రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాల పాలవుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన మాటముచ్చట సమావేశంలో మాట్లాడుతూ.. వరి కోతలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని పక్షం రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించినా చాలాచోట్ల మొదలుకాలేదన్నారు. ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నా.. రైతులు నష్టపోకుండా వడ్ల సంగతి తేల్చాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఔరంగాబాద్లో కాదని.. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్కు వెళ్లి చూడాలని, అక్కడ మార్కెట్లలోకి వచ్చిన ధాన్యాన్ని గంటలోనే మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. ఇది నిజం కానట్లయితే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. నిజమైతే నీ పదవికి రాజీనామా చేస్తావా అని కేసీఆర్ను ప్రశ్నించారు. సమ్మేళనాలు పెట్టి ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటమాడుతోందని ఆరోపించారు. -
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
ఢిల్లీ: భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం ఉందని, భువనగిరి స్టేషన్ తెలంగాణలోని ప్రముఖంగా రాకపోకలు సాగిస్తున్న రైల్వే స్టేషన్ అని. ఇందుకు సంబంధించి ఆధునీకరణ పనులు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో గురువారం భేటీ అయిన వెంకట్రెడ్డి.. పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అలాగే, భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడింది. ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్కు రోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు స్టేషన్లపై దృష్టి సారించాలి. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపుపై వినతి ఎంఎంటీఎస్ ను ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాల్సిన అవసరం చాలా ఉంది. ఎంఎటీఎస్ రెండోదశకు 2/3 వంతున పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా ఇది కార్యరూపం దాల్చడం లేదు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థనపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.. కేంద్రమే మొత్తం ఖర్చు భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారని,. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను కూడా ఆధునికీకరస్తామని చెప్పారన్నారు. -
'కొడుకు పోయిన బాధ ఎలా ఉంటదో తెలుసు.. హాత్విక్ను దత్తత తీసుకుంటా'
సాక్షి, నల్గొండ: హైదరాబాద్లోని కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన నరేశ్, అతడి భార్య సుమ, కుమారుడు జస్విత్ మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. నరేశ్ స్వగ్రామం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కోల్పోయిన నరేశ్ పెద్ద కుమారుడు హాత్విక్ను దత్తత తీసు కుంటానని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న ఆయన తన పీఏ సైదులుతో హాత్విక్ పేరిట బ్యాంకులో రూ. లక్ష డిపాజిట్ చేయించారు. ఖర్చుల నిమిత్తం నరేశ్ తల్లిదండ్రులకు రూ.25వేలను అందజేయించారు. నరేశ్ తల్లిదండ్రులను ఫోన్లో ఓదార్చారు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, అధైర్య పడొద్దని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. నరేశ్ కొడుకును ఇంటర్నేషనల్ స్కూ ల్లో చదివిస్తానని, పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని, ఢిల్లీ నుంచి రాగానే, గ్రామానికొచ్చి కలుస్తానని నరేష్ కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు. చదవండి: బీఆర్ఎస్తో పొత్తుపై మాణిక్రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు -
‘దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్లో లేదు’
సాక్షి, హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘దళిత ముఖ్యమంత్రి’ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రే స్పందించారు. దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్లో లేదని, కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరిస్తుందని ఠాక్రే స్పష్టత ఇచ్చారు. దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్లో ఏనాడూ జరగలేదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరిస్తుందని పేర్కొన్నారాయన. అలాగే ఏలేటి మహేశ్వరరెడ్డి బీజేపీ చేరికపైనా ఠాక్రే స్పందించారు. మహేశ్వర్రెడ్డికి కాంగ్రెస్ ఏం తక్కువ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పించింది. ఆయన పార్టీని ఎందుకు వీడారో చెప్పాల్సిన అవసరం ఉందని ఠాక్రే వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికార పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ నడుస్తోంది. దీనిపై ఠాక్రే స్పందిస్తూ.. తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదు. ఈ విషయంపై పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని ఠాక్రే తెలిపారు. -
కొత్త ట్విస్ట్ ఇచ్చిన కోమటిరెడ్డి.. రేవంత్ను సైడ్ చేసే ప్లాన్!
సాక్షి, మంచిర్యాల: కాంగ్రెస్ సీనియర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా పార్టీ వీడుతున్నట్టు ఎన్నోసార్లు ప్రచారం చేశారని, అయినా తాను పార్టీ మారలేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా? అని ప్రశ్నించారు. పార్టీ నుంచి మహేశ్వర్రెడ్డి వెళ్లినా ఎలాంటి నష్టం లేదన్నారు. కాగా, కోమటిరెడ్డి మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదు. దళిత బంధు పథకం బీఆర్ఎస్ నేతలకు దోపిడీగా మారింది. న్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులకు అండగా ఉన్నట్టు కాదు. 16శాతం ఉన్న మాదిగలకు ఇప్పటికీ మంత్రి వర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో దళిత నాయకుడు ఖర్గేను తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. అలాగే, కాంగ్రెస్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. మరోవైపు, రాష్ట్రంలో నా పాదయాత్ర ఉండదు. భట్టి విక్రమార్క పాదయాత్రనే నా పాదయాత్ర. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని ఖర్గేను కోరతాము అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక, తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తానంటే గిట్టనివాళ్లు దుష్ప్రచారం చేస్తుంటారని మండిపడ్డారు. 33 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా.. పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా? అని ప్రశ్నించారు. -
ఆ జిల్లాలో ఇప్పటికీ అడుగుపెట్టని రేవంత్.. వారంటే భయమా? లేక..
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడే అయినా ఓ జిల్లాలో అడుగు పెట్టేందుకు ఆలోచిస్తున్నారట. పార్టీ చీఫ్గా బాధ్యతలు తీసుకుని రెండేళ్ళవుతున్నా ఒకే ఒక జిల్లాలో పర్యటించలేదు. ఆ జిల్లాలోని సీనియర్లతో పడటంలేదా? వారంటే భయమా? రేవంత్ను వారే అడ్డుకుంటున్నారా? ఇంతకీ ఆ జిల్లా ఏది? రేవంత్ పర్యటించకపోవడానికి కారణం ఏంటి?.. రెండేళ్ళ క్రితం పార్టీలోని ఉద్ధండులను కాదని, అంతకుముందే పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది పార్టీ హైకమాండ్. పార్టీ రాష్ట్ర చీఫ్గా రాష్ట్రమంతా తిరుగుతున్న రేవంత్ నల్గొండ జిల్లాలో మాత్రం అడుగు పెట్టడంలేదు. ఆ జిల్లాలో అడుగు పెట్టేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట. ఒకే ఒకసారి రాహుల్ వరంగల్ సభకు సన్నాహకంగా నాగార్జునసాగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. అది కూడా సీనియర్ నేత జానారెడ్డి సపోర్టుతో. ఆ తర్వాత మరోసారి ఆయన నల్గొండ జిల్లాలో కాలు పెట్టింది లేదు. జిల్లాకు రేవంత్ను రానిచ్చేవారేరి అని పార్టీ కేడరే సెటైర్లు వేసుకుంటున్నారట. ఇక్కడ ఉన్న సీనియర్ నేతలను కాదని... వారి అనుమతి లేకుండా.. జిల్లాలో పర్యటించే అవకాశమే లేదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర జిల్లాలో లేనట్లేనా అంటే సమాధానం ఇచ్చేవారే లేరు. కాంగ్రెస్ వర్గాల్లోనే టాక్.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో భాగంగా కొన్ని జిల్లాల్లో పూర్తి చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. నల్లగొండ జిల్లాలో మాత్రం పాదయాత్ర ఉండకపోవచ్చని కాంగ్రెస్ వర్గాల్లోనే టాక్ నడుస్తోంది. సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిలు టీ కాంగ్రెస్లో కీలక నేతలుగా చెలామణి అవుతున్నారు. వీరంతా నల్లగొండ జిల్లాకు చెందినవారే. జానారెడ్డి మినహా మిగతా వారంతా రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలే. వీరి అనుమతి లేకుండా రేవంత్ జిల్లాలో పర్యటించే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న రెండు లోక్ సభ స్థానాలకు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటించాలంటే ఖచ్చితంగా వీరికి సమాచారం ఇవ్వక తప్పదు. ఎలాగూ వారు పాదయాత్రలో పాల్గొనే అవకాశం లేదు. అందువల్ల వారిని కాదని రేవంత్ సొంతంగా పాదయాత్ర జరిపే అవకాశం ఉండదనేది స్పష్టం. ఒకవేళ రేవంత్ సాహసంతో పాదయాత్ర చేసిన పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువుంటుందనేది ఓ విశ్లేషణ. అనవసర తలనొప్పులు తెచ్చుకోవడం కంటే నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేయకపోవడమే బెటర్ అనే ఆలోచనతో రేవంత్ అండ్ కో ఉన్నట్లు సమాచారం. సీనియర్ల కొత్త వ్యూహం.. అయితే రేవంత్కు పోటీగా సీనియర్లు కొత్త వ్యూహానికి తెరలేపారని తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్కు ధీటుగా పాదయాత్ర చేస్తోన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో జిల్లాలో పాదయాత్ర చేయించాలని.. భారీ హంగు ఆర్భాటాలతో దాన్ని విజయవంతం చేయాలని సీనియర్లు ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో భట్టితో పాదయాత్ర చేయించేందుకు సీనియర్లు ఆలోచిస్తున్నారట. అందుకు షెడ్యూల్ కూడా తయారు చేశారని జోరుగా వినిపిస్తోంది. ఎవరైతే ఏంటీ శత్రువును దెబ్బకొట్టేందుకు ఎవరి భుజాలపై తుపాకీ పెట్టి కాల్సినా అంతిమంగా లక్ష్యం చేరడమే కదా కావాల్సింది అని సీనియర్లు భావిస్తున్నారట. భట్టి విక్రమార్క పాదయాత్రకు తోడుగా..కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి ఎవరికి వారే వారి నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కాంగ్రెస్లో రేవంత్ నాయకత్వాన్ని బలపరుస్తున్న జానారెడ్డి మరోసారి ఆయన్ని తన నియోజకవర్గం సాగర్తో పాటు ఆయన ఆశపడుతున్న మరో నియోజకవర్గం మిర్యాలగూడకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తీసుకొస్తారా అనే టాపిక్ ఆసక్తికర చర్చకు తెరతీసింది. బహుశా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నేత ఒక జిల్లాలో పర్యటించడానికి ఇబ్బందిపడిన సన్నివేశం గత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల్లో ఎవరికీ వచ్చి ఉండదు. మంచి దూకుడు మీదుండే రేవంత్ రెడ్డికి మాత్రమే నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. -
నాది కాంగ్రెస్ రక్తం.. కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై సీరియస్ అయ్యారు. పార్టీ మార్పుపై కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. నేను ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఉద్దేశ్యపూర్వకంగా కొందరు తనను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాది కాంగ్రెస్ రక్తం.. నా ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. నేను కాంగ్రెస్కు రాజీనామా చేయడంలేదని స్పష్టం చేశారు. బుధవారం అంతా తాను సోనియాగాంధీతోనే ఉన్నానని తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అని వెల్లడించారు. -
‘సర్వే’తోనేచాన్స్!
సాక్షి, హైదరాబాద్: సీనియర్లు.. జూనియర్లు.. ఎవరైనా సరే.. ప్రజాక్షేత్రంలో బలం, బలగం ఉన్నవారికే ఈసారి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా?ముందుగా చెప్పినా, చివరి క్షణంలో ప్రకటించినా ‘సర్వే’ సూత్రం ఆధారంగానే రేసుగుర్రాలను ఎంపిక చేయనుందా? కర్ణాటకలో అవలంబించిన ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించిందా?.. ఈ ప్రశ్నలకు గాంధీభవన్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్లు, ముఖ్య నాయకులుగా గుర్తింపు పొందిన వారంతా ఈసారి కూడా టికెట్ తమకే అన్న ధీమాలో ఉండగా.. మరోవైపు సర్వేలో ప్రతికూల ఫలితం వస్తే మాత్రం ‘టికెట్ కట్’ అయినట్టే అన్న వాదన కూడా వినిపిస్తోంది. కర్ణాటకలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఏకంగా 124 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేయడం.. తెలంగాణలోనూ అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. ‘సర్వే’ అంశం చర్చనీయాంశంగా మారింది. ‘చాన్స్’పై చర్చ ఈ ఏడాది నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో.. ఇక్కడ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆరు నెలల ముందే అభ్యర్థులను అధికారికంగా క్షేత్రంలోకి పంపాలని భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు నుంచీ కోరుతున్నారు. రాష్ట్ర ఇన్చార్జులు, ఏఐసీసీ పెద్దలను కలిసినప్పుడు కూడా దీనిపై విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కర్ణాటకలో అభ్యర్థుల ప్రకటన తర్వాత చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర కాంగ్రెస్లో దాదాపు 50 శాతం సీట్లు ఖరారైనట్టేనని.. 60 మంది వరకు అభ్యర్థుల ప్రకటనకు ఇబ్బందులు లేవని ఆయన హాథ్సే హాథ్ జోడో యాత్రల సందర్భంగా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. ఈ లెక్కన ఎన్నికల ముందే ఒక జాబితా రావొచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరికి ఖాయంగా టికెట్లు? రాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద తలలుగా గుర్తింపు పొందిన నేతలంతా తమకు టికెట్ ఖాయమనే ధీమాలో ఉన్నారు. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప తమకు టికెట్ పక్కా అనే ధోరణిలో ముందుకెళుతున్నారు. పార్టీ తరఫున ఉన్న ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతోపాటు మరికొందరికి టికెట్ ఖాయమనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఎంపీలు రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్క, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డితోపాటు మహేశ్వర్రెడ్డి, ప్రేమ్సాగర్రావు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, మధుయాష్కీ, గీతారెడ్డి, షబ్బీర్అలీ, ఈరవత్రి అనిల్, మహేశ్కుమార్గౌడ్, బల్మూరి వెంకట్, పొన్నాల లక్ష్మయ్య, దొంతి మాధవరెడ్డి, ఉత్తమ్ పద్మావతి, జానారెడ్డి, సంపత్కుమార్, వంశీచందర్రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్కుమార్, టి.రామ్మోహన్రెడ్డి, బలరాం నాయక్, ఫిరోజ్ఖాన్, బాలూనాయక్, బీర్ల అయిలయ్య, కుంభం అనిల్కుమార్రెడ్డి, విజయరమణారావు, రాజ్ఠాకూర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆది శ్రీనివాస్, విజయారెడ్డి, నందికంటి శ్రీధర్, మెట్టు సాయికుమార్, శ్రీరంగం సత్యం తదితరులు టికెట్ చాన్స్ జాబితాలో ఉన్నారు. సర్వేలో ప్రతికూల ఫలితమొస్తే..? చాలా మందికి టికెట్ ఖాయమని భావిస్తున్నా, మరికొందరికి చాన్స్ ఎక్కువేనని అంచనా వేస్తున్నా పరిస్థితి ఎలా మారుతుందోనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కచ్చితంగా టికెట్ వస్తుందన్నదా, లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని... ఏఐసీసీ సర్వేల ఆధారంగానే టికెట్ ఇవ్వాలా, వద్దా అన్నది నిర్ణయమవుతుందని గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటకలో తొలి జాబితా కింద ప్రకటించిన 124 మందికి కూడా ఏఐసీసీ సర్వే తర్వాతే టికెట్లు ఖరారు చేశారని.. దీనితో చాలా మంది పోటీచేసే స్థానాలు కూడా మారాయని చెప్తున్నాయి. ఇప్పటికే కసరత్తు ముమ్మరం.. తెలంగాణలో నియోజకవర్గాలు, అభ్యర్థుల బలాబలాలపై వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఇప్పటికే అంతర్గతంగా సర్వేలు చేస్తోంది. ఆ సర్వేలకు సంబంధించిన రెండు, మూడు నివేదికలను అధిష్టానానికి అందజేసింది. ఇలా సునీల్ టీం చేసే సర్వేలతోపాటు ఏఐసీసీ నేరుగా చేసే సర్వేలు త్వరలోనే తెలంగాణలో ప్రారంభమవుతాయని తెలిసింది. టీపీసీసీ నేతలకు కూడా సమాచారం లేకుండా జరిగే ఈ సర్వే వివరాలు నేరుగా అధిష్టానానికి అందుతాయని.. టికెట్ల కేటాయింపు సమయంలో వాటినే ప్రాధాన్యతగా తీసుకుంటారని అంటున్నారు. సీనియర్లయినా, జూనియర్లు అయినా, టికెట్లు ఎప్పుడు ప్రకటించినా ‘సర్వే’ సూత్రం ఆధారంగానే జరుగుతుందని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పునర్వైభవం పొందేందుకు.. ఈ ఏడాది జూన్ నెలలో భారీ బహిరంగసభను నిర్వహించాలని, సోనియా, రాహుల్, ప్రియాంకలలో ఒకరిని రప్పించి ఉత్తేజపూరిత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని టీపీసీసీ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
రాహుల్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాహుల్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. అదానీ ఇష్యూని డైవర్ట్ చేయడానికే రాహుల్పై అనర్హత వేటు వేశారు. అవసరమైతే ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. రాహుల్పై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్లో ఆదివారం.. కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, ‘‘రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన పరిస్థితి కంటతడి పెట్టేలా ఉంది.. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారన్నారు. అదానీ గురించి రాహుల్ ఎప్పుడు మాట్లాడారో.. అప్పటి నుంచి కుట్ర చేశారు. ఆగమేఘాల మీద పరువు నష్టం కేసు లో శిక్ష పడేలా చేశారు’’ అని కోమటిరెడ్డి ఆరోపించారు. రాహుల్ పై అనర్హత వేటు ఎత్తేసే వరకు పోరాటం ఉధృతం చేయాలన్నారు. ఇందిరా గాంధీ పై వేటు వేస్తే ఏం జరిగిందో..ఇప్పుడు అదే జరుగుతుంది’’ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. చదవండి: కాంగ్రెస్లో చేరిన డి.శ్రీనివాస్ -
ప్రధాని మోదీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి.. కారణం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ, నియోజకవర్గంలో జాతీయ రహదారులపై చర్చించానని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నుంచి మెట్రో రైల్ పొడిగించాలని కోరానన్నారు. ‘‘కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివి ఉంటాయి. అన్ని అంశాలపై ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారు. రెండు, మూడు నెలలలో అన్ని మంజూరు చేసే అవకాశం ఉంది. ప్రధానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణలో వడగళ్ల వానతో రైతులు నష్ట పోయారు. కేంద్రం నుంచి పరిశీలనకు బృందాన్ని పంపాలని కోరాను’’ అని కోమటిరెడ్డి అన్నారు. చదవండి: నడుచుకుంటూ సిట్ ఆఫీస్కు రేవంత్.. తీవ్ర ఉద్రిక్తత -
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. చెరుకు సుధాకర్, ఆయన తనయుడిని ఫోన్లో బెదిరించిన వ్యవహారానికి సంబంధించి ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నల్లగొండ వన్ టౌన్లో సుధాకర్ తనయుడు సుహాన్ నిన్న(సోమవారమే) ఫిర్యాదు చేశారు.దీంతో ఐపీసీ 506(నేరపూరిత బెదిరింపులు)తో పటు పలు సెక్షన్ల కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడైన డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన తనయుడు డాక్టర్ సుహాస్ను.. తన(కోమటిరెడ్డి) వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు తాను భావోద్వేగంతో చేసినవేనని, తనపై విమర్శలు చేయొద్దని మాత్రమే సుధాకర్ కొడుక్కి చెప్పానని కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు.. సంభాషణల్లో కొన్ని మాటలనే కట్ చేసి.. ఆడియోను లీక్ చేశారని, కాల్ రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫోన్ సంభాషణను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి పంపించారు చెరుకు సుధాకర్. అలాగే.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారాయన. -
నేను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే..వేరే ఉద్దేశం లేదు : కోమటిరెడ్డి
-
అందుకే అలా మాట్లాడా.. నాకు వేరే ఉద్దేశం లేదు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్ను తన వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. వెంకట్రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే.. వేరే ఉద్దేశం లేదు. నా 33 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరినీ దూషించలేదు. శత్రువును కూడా దగ్గరకు తీసే తత్వం నాది. చెరుకు సుధాకర్పై పీడీ యాక్ట్ పెడితే నేనే కొట్లాడాను. నాపై విమర్శలు వద్దనే సుధాకర్ కుమారుడికి చెప్పాను. నా మాటలను కట్ చేశారు. కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేశారు. ఫోన్ రికార్డు చేస్తున్న విషయం నాకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి చెరుకు సుధాకర్ నన్ను తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నావని అడిగాను. నన్ను తిట్టొదు అని మాత్రమే సుహాస్కు చెప్పాను. నన్ను సస్పెండ్ చేయాలి అనడం, తిట్టడం వల్లే బాధతో అలా మాట్లాడాను’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి ఆడియో క్లిప్లో ‘మీ నాన్న వీడియో చూసినవా? ఇప్పటికే నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజుల నుంచి ఓపిక పడుతున్నా. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి నన్ను విమర్శిస్తాడా? వాడిని వదిలేది లేదు. వాడు (చెరుకు సుధాకర్) క్షమాపణ చెప్పకపోతే మా వాళ్లు చంపుతరు. నా అభిమానులు వంద కార్లల్లో బయల్దేరారు. ఇంటి పార్టీ ఏందిరా? వాడు పీడీ యాక్ట్ కేసులో జైల్లో పడితే నేను ఒక్కడినే వెళ్లి పరామర్శించిన. కౌన్సిలర్గా గెలవనోడు నన్ను విమర్శిస్తాడా? 25 ఏండ్ల నా రాజకీయ జీవితంలో లక్షల మందిని బతికించిన. వారిలో చాలామంది ఇప్పటికే వాడి మీద కోపంతో చంపుతామంటూ బయల్దేరారు. నేను ఎంతమందినని ఆపుతా. నిన్ను కూడా చంపేస్తరు. నీ హాస్పిటల్ ఉండదు. వారంలో వాడిని చంపేస్తారు’ అని సీరియస్ అయ్యారు. చెరుకు సుధాకర్ సీరియస్.. ఈ ఆడియోను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి పంపించానని సుధాకర్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. ఎంపీ కోమటిరెడ్డి.. తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై అధిష్టానమే చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. కోమటిరెడ్డిపై సుహాస్ నల్లగొండ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు కోమటిరెడ్డి నుంచి ప్రాణభయం ఉన్నదని, రక్షణ కల్పించి ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. -
చంపుతమని తిరుగుతున్నరు.. కోమటిరెడ్డి ఆడియో కలకలం!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్ను తన అభిమానులు చంపుతారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బెదిరించినట్లుగా ఉన్న ఆడియో లీక్ అయ్యింది. అసభ్యంగా వారిద్దరినీ దూషించినట్లున్న ఆ ఆడియో ఆదివారం కలకలం రేపింది. అసలు ఆడియోలో ఏముందంటే.. ‘చూసినవా స్టేట్మెంట్.. (అంకుల్ అది వాట్సప్లో అట్ల ఇచ్చిండు కానీ ఆ వీడియో ఒకసారి మీరు పూర్తిగా చూడండి–ఎదుటి వ్యక్తి వాయిస్) ఏం చూసుడు. వాన్ని చంపుతమని తిరుగుతున్నరు. వంద మంది వెహికిల్ వేసుకొని తిరుగుతున్నరు. ఈ వీడియో కాదు నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజులు ఓపిక పట్టి ఇప్పుడు వంద కార్లలో వాణ్ని చంపుతమని తిరుగుతున్నరు. నిన్ను కూడా చంపుతరు. నీ హాస్పిటల్ను కూడా కూలగొడుతరు. లక్షల మందిని బతికించిన నేను. వానికెంత ధైర్యం నిన్న మొన్న పార్టీలకొచ్చి.. వాణ్ని వదిలిపెట్టర్రా.. నేను చెబుతున్న నీకు, వార్నింగ్ ఇస్తున్న. నేను ఆపలేను .. క్షమించమని చెప్పి, నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్లు ఇచ్చిండు ఓపిక పట్టిండ్రు. సార్ మాతో ని కాదిగ, నువ్వేమో ఏమనొద్దంటున్నవ్ సార్.. మేము వెళ్లినం బయటికి, యాడ దొరికితే ఆడ చంపేస్తం అంటుండ్రు వాళ్లు. నా తోని కాదు.. వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తరు... అసోంటి వంద వీడియోలు, డైరెక్టు పేరు పెట్టి వందసార్లు తిట్టిండు వాడు. ఇప్పుడొక బ్యాచ్ వెళ్లింది. నిన్ను కూడా చంపుతరు చెబుతున్న అరేయ్... నీ హాస్పిటల్ నడువదు. 25 ఏళ్లలో లక్షల మందిని బతికించిన నేను. వారందరిని కంట్రోల్ చేస్తానా నేను. అతనికి ఫోన్ చేసి చెప్పు.. అరేయ్ నీకు పార్టీ ఉన్నదారా.. ఇంటిపార్టీ ఏందిరా.. నువ్వు కౌన్సిలర్గా గెల వవు.. ఆయన అంతపెద్ద లీడరు అని చెప్పు. వాడు జైళ్ల పడితే నేను ఒక్కడినే పోయిన. ఎవరూ పోలే అప్పుడు. చెప్పు.. వారంకంటే ఎక్కువుండడాడు’. కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం డాక్టర్ చెరుకు సుధాకర్ను, ఆయన కుమారుడిని చంపుతామంటూ బెదిరించినట్లుగా ఆడియో లీక్ నేపథ్యంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ గడియారం సెంటర్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేశారు. కాగా, ఎంపీ కోమటిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని బీసీ యువజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దరిద్రుడు, చీడపురుగంటూ నన్ను తిట్టుడేంది: కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటినుంచి చెరుకు సుధాకర్ నాపై కామెంట్స్ చేస్తుండు. ఒకసారి దరిద్రుడని, మరోసారి చీడపురుగని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నడు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నరని ఆయన కొడుకును అడిగితే పెడితేఏంది అంటూ వంకర టింకర మాట్లాడుతుండు. ఇది ఎంతవరకు కరెక్టు. పార్టీకి పని చేయాలి. నన్ను తిట్టుడేంది? నా కొడుకుకు ఫోన్ చేసి నన్ను తిట్టడం ఆశ్చర్యం కలిగించింది: చెరుకు సుధాకర్ వెంకట్రెడ్డి అసభ్యంగా నన్ను తిట్టడం అశ్చర్యం కలిగించింది. నేను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా, అతను స్టార్ క్యాంపెయినర్గా ఉండి ఒకే పారీ్టలో పని చేస్తున్నా నాపై అత్యంత నేరపూరితమైన, టెర్రరిస్టు భాష మాట్లాడారు. ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండో.. మతి లేక మాట్లాడుతుండో అర్థం కావడంలేదు. ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి పంపించా. కోమటిరెడ్డిని నేను వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు లేవు. నయీం లాంటి కరుడు గట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకయాడు. కోమటిరెడ్డి ఏం చేస్తాడు? ఈ వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. -
నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ కోమటిరెడ్డి దీక్ష
సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాలేజీ వద్ద దీక్ష చేపట్టారు. సాత్విక్ సూసైట్ నోట్లో పేర్కొన్న నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని చెప్పారు. కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళకు దిగారు. దీంతో పోలీసులు కాలేజీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థులకు బోధించేంకు క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా లేరని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఐఐటీ పేరుతో విద్యార్థులను మోసం చేసి రూ.లక్షల వసూలు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిపై హెచ్ఆర్డీకి కూడా ఫిర్యాదు చేశానని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని చెప్పారు. కాలేజీలో విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సున్నితమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు. చదవండి: సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్! -
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో నష్టం లేదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంపీ కోమటిరెడ్డి ఒక టి మాట్లాడితే మరో విధంగా మీడియాలో వచ్చిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మా ణిక్రావ్ ఠాక్రేను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల సన్నద్ధతలపై చ ర్చించారు. అనంతరం జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను కూడా త్వరలో నే పాదయాత్ర మ్యాప్ను ప్రకటిస్తానని చెప్పారు. -
ఎవ్వరితో పొత్తుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తెలంగాణలో ఎవరిపైనా ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయదని, స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా తమ పార్టీకి ఉందని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గంటకో మాట మార్చే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విశ్వసనీయత లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్లో బుధవారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలతో మమేకమైన తమ పార్టీకి పొత్తులు పెట్టుకునే అవసరం లేదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్లో ఎంపీగా ఉంటూ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓట్లు వేయాలని కోమటిరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. చర్చకు సిద్ధమేనా కిషన్రెడ్డి? అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో అంబర్పేటలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు అక్కడి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీలు మారిన వారు, బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన వారి పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారని, ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి రావడం గురించి ఆయనకే తెలియాలని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. సెక్రటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్తులో అందరికీ తెలుస్తుందని, కొత్త సచివాలయాన్ని చూసి కొందరు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహిస్తాం ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను డివిజన్ల వారీగా నిర్వహిస్తామని, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు, మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరుగుతాయని తలసాని వివరించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో మేయర్ విజయలక్ష్మి, సికింద్రాబాద్ గణేశ్ దేవాలయంలో డిప్యూటీ మేయర్ శ్రీలత పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బల్కంపేట ఆలయంలో రాజశ్యామల యాగం నిర్వహించడంతో పాటు నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. -
కోమటిరెడ్డి గురించి మరోసారి మాట్లాడుదాం.. మీటింగ్లో ఠాక్రే సీరియస్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన కామెంట్స్ వేళ పీసీసీ ఉపాధ్యక్షులతో ఇంఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రపై సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కూడా ఠాక్రే స్పందించారు. సమావేశం సందర్భంగా మాణిక్రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఠాక్రే మాట్లాడుతూ.. కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్కు ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్నే తాను చెప్పానన్నారు. కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు. త్వరలో పాదయాత్రలో పాల్గొంటారు. ఒంటిరిగానే ఎన్నికలకు వెళ్తాం, విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పీసీసీ ఉపాధ్యక్షుల తీరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి 20 మంది ఉపాధ్యక్షులు హాజరుకాకపోవడంతో సీరియస్ అయ్యారు. సమావేశానికి హాజరుకానీ వారందరూ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే శుక్రవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి వ్యవహారంపై మరోసారి మాట్లాడుకుందామని నేతలకు ఠాక్రే సర్ది చెప్పారు. -
కోమటిరెడ్డి పూటకోమాట మాట్లాడతారు: తలసాని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలే కాకుండా.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. అనంతరం, తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక, తాజాగా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు అర్థం లేనివి. కోమటిరెడ్డి పూటకోమాట మాట్లాడతారు. కోమటిరెడ్డి మాటల్లో విశ్వసనీయత లేదు. బీఆర్ఎస్కు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. బీఆర్ఎస్ ఏ రాజకీయ పార్టీపైనా ఆధారపడదు. వచ్చే ఎన్నికల్లో మాకు పూర్తి మెజార్టీ వస్తుంది. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ సాధిస్తాం. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సవాల్పై మంత్రి తలసాని స్పందించారు. కిషన్ రెడ్డి అంబర్పేట్, సికింద్రాబాద్కు చేసిన అభివృద్ధి గురించి చెప్పాలన్నారు. అంబర్పేట్లో చేసిన అభివృద్ధిపై చర్చకు మా పార్టీ ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు. తాడు బొంగురం లేకుండా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి వస్తారా లేదా అనేది ఆయనకే తెలియాలి. సెక్రటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
రాహుల్గాంధీ చెప్పిందే నేనూ చెప్పా: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పొత్తు కామెంట్లు.. తెలంగాణలో పోలిటికల్ హీట్ రాజేయగా.. ఆ ఎపిసోడ్ వెనువెంటనే అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. కోమటిరెడ్డి చేసిన పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం గరంగరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలోని చోటా మోటా నేతలు సైతం కోమటిరెడ్డిపై మండిపడుతున్నారు. ఈ తరుణంలో.. రేపు(బుధవారం) ఉదయం తనను కలవాలని కోమటిరెడ్డికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావ్ ఠాక్రే నుంచి పిలుపు వచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఈ లోపే వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఇవాళ (మంగళవారం) సాయంత్రమే ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారు. తెలంగాణలో హంగ్ వస్తుందని నేను అనలేదు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని కూడా నేను అనలేదు. నా వ్యాఖ్యలు అర్థం అయ్యే వాళ్లకు అర్థం అవుతాయి. మాకు ఎవరితో పొత్తు ఉండదు. రాహుల్ గాంధీ చెప్పిందే నేను చెప్పా. కాంగ్రెస్కు ఎవరితో పొత్తు ఉండదని. ఇవాళ చిన్న చిన్న నాయకులు కూడా నన్ను తిట్టారు. బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు అని పేర్కొన్నారు కోమటిరెడ్డి. అనూహ్యం.. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే తో ఎంపీ కోమటిరెడ్డి భేటీ అయ్యారు. బుధవారం కంటే ముందుగానే ఈ భేటీ జరగడం గమనార్హం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లాంజ్లో వీళ్ల భేటీ జరిగనట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి తో పాటు ఏఐసీసీ కార్యదర్సులు నదీమ్ జావీద్ , బోసురాజు , హర్కర్ వేణుగోపాల్ కూడా హాజరు కాగా.. 20 నిమిషాలుగా పైగా భేటీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తన వ్యాఖ్యలపై ఠాక్రేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకట్రెడ్డి ఏం మాట్లాడారో చూడలేదు ఇక ఈ పరిణామంపై అంతకు ముందు మీడియాతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే స్పందించారు. వెంకట్రెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు. ఏం మాట్లాడారో తెలుసుకున్నాక స్పందిస్తా. పొత్తులపై రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పిందే మాకు ఫైనల్. బీఆర్ఎస్తో పొత్తు ఉండదని ఆయన తేల్చేశారు. ఇలాంటి తరుణంలో.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన మాకు అవసరం లేదు అని ఠాక్రే మీడియా ద్వారా స్పష్టం చేశారు. -
కాంగ్రెస్పై కోమటిరెడ్డి కామెంట్స్.. జగ్గారెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కామెంట్స్ తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పందిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్తో పొత్తకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కాంగ్రెస్లో ముఖ్య నాయకుడు.. పార్టీలో కోవర్డులు ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్టార్లు, సూపర్ స్టార్లు ఇలా మాట్లాడుతుంటే ఎవరికీ ఏమీ చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్. బీజేపీకి మాపై ఆరోపణలు చేస్తే అర్హత లేదు. కేంద్రం తెచ్చిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ పోరాటం అని స్పష్టం చేశారు. మరోవైపు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మల్లు రవి కూడా స్పందించారు. మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుందనడం హాస్యాస్పదం. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తాం. గతంలో కోమటిరెడ్డికి షోకాజ్నోటీసులు ఇస్తే చెత్తబుట్టలో వేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కు నష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుంది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్కు నష్టం చేసేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కేడర్ను గందరగోళంలో పడేశాయి. పార్టీని రక్షించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా తప్పుపట్టారు. అటు టీపీసీసీ రేవంత్ రెడ్డి వర్గం కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. -
కోమటిరెడ్డికి అదిరిపోయే కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదనే కామెంట్స్పై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా స్పందించి పొలిటికల్ కౌంటర్ ఇస్తున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కాగా, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాదు. వారు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో ఉండి బీజేపీని గెలిపించమని.. బీజేపీలో కాంగ్రెస్ను గెలిపించమని వ్యాఖ్యలు చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ కూడా స్పందించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో హంగ్ వచ్చే ఛాన్స్ లేదు. బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్లు పొత్తుల కోసం చూస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయింది. ఎవరైనా గెలుస్తామని చెప్తారు. కానీ, కాంగ్రెస్ ఓడిపోతామని చెబుతున్నారు. ఓడిపోతామని తెలిసి కూడా యాత్ర ఎందుకు చేస్తున్నారు?. ఎన్నికలకు ముందు ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేదు. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. అందుకే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలుస్తుంది. కేసీఆర్ ఇంకా.. ఈటల రాజేందర్ తన మనిషే అనుకుంటున్నారు. కాంగ్రెస్లో గెలిచిన వారు బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్కి ఓటు వేస్తే బీఆర్ఎస్లోకి వెళ్తారని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తాయి. వీళ్లందరూ దండుపాళ్యం బ్యాచ్ అని సంచలన కామెంట్స్ చేశారు.’ అని అన్నారు. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారు.. కాంగ్రెస్ వెంటిలేటర్పై ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కలలు కనేది.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తుంది. కుటుంబ పాలన, అవినీతి పాలన, రైతుల వ్యతిరేక పాలన నిరుద్యోగ వ్యతిరేక పాలన బీఆర్ఎస్ ప్రభుత్వానిది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో పోటీచేసి ఘన విజయం సాధిస్తుంది. -
కోమటిరెడ్డి పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ‘పొత్తు’ వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలతో అటు అధికార బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండూ.. కాంగ్రెస్ తీరును ఏకిపడేస్తున్నాయి. ఈ తరుణంలో.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కోమటిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తాయని చెబుతున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు. మరోవైపు కోమటిరెడ్డి కామెంట్స్ వీడియోను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావ్ ఠాక్రే పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కోమటిరెడ్డి కామెంట్లపై ఠాక్రే.. కోమటిరెడ్డి కామెంట్లపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. అధిష్టానానికి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రేపు(గురువారం) ఉదయం ఆయన కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో విడిగా భేటీ అవుతారని తెలుస్తోంది. ఇంకోవైపు రేవంత్ వర్గం ‘కోమటిరెడ్డి వ్యాఖ్యలు’ పార్టీకి తీరని నష్టం చేస్తాయని అంటోంది. అంతేకాదు.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే గెలిచే సత్తా కాంగ్రెస్కు ఉందని చెబుతోంది రేవంత్ వర్గం. ఆనాడే కోమటిరెడ్డి చర్య తీసుకునేది ఉండే! కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు సహ నేత అద్దంకి దయాకర్. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కల్గించేలా ఉన్నాయి. వెంకట్ రెడ్డి ప్రతిసారీ పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసేలా వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ పై సీరియస్ గా తీసుకోవాలి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆయనపై హైకమాండ్ యాక్షన్ తీసుకొని ఉంటే.. ఇప్పుడు ఇలా మాట్లాడే వాడు కాదు. ::: అద్దంకి దయాకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్కే ఆ అవసరం ఉండొచ్చు! బీఆర్ఎస్ తో పొత్తు విషయం ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగతం తప్ప పార్టీకి సంబంధం లేదు. రాష్ట్రంలో బిఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది. ఓటమి అంచున ఉన్నది. బీఆర్ఎస్ను ఓడించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఓటమి అంచున ఉన్న బీఆర్ఎస్కు పొత్తులు అవసరం ఉండొచ్చు కానీ, కాంగ్రెస్కు ఆ అవసరం లేదు. గతంలోనే తెలంగాణ సభలో కాంగ్రెస్ పార్టీకి ఎవరితో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేయశారు. అంతేకాదు.. పొత్తు గుతించి మాట్లాడితే చర్యలు తీసుకుంటాం అన్నారు కూడా. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన పూర్తి మెజార్టీ తో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తోంది. :::మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదీ చదవండి: తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీనే: కోమటిరెడ్డి