Mythri Movie Makers
-
‘కిస్ కిస్ కిస్సిక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ ఏడాదే పుష్ప 3 రిలీజ్.. ప్రకటించిన నిర్మాత
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు.. కాదుకాదు, వైల్డ్ ఫైరు.. అని నిరూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప ఫ్రాంచైజీ (Pushpa Movie)తో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాడు. పుష్ప 1.. 2021లో విడుదల కాగా దాని సీక్వెల్ 2024లో రిలీజైంది. మరి పుష్ప 3 ఎప్పుడు? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.వారి ఎదురుచూపులకు నిర్మాత రవిశంకర్ తెర దించాడు. 2028లో పుష్ప 3 (Pushpa 3 Movie) విడుదల చేస్తామని వెల్లడించాడు. విజయవాడలో ఆదివారం జరిగిన రాబిన్హుడ్ ప్రెస్మీట్లో ఈ విషయాన్ని తెలిపాడు. అలాగే బన్నీ.. ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతిని కూడా బయటపెట్టాడు.పుష్పరాజ్ ప్రయాణం ఎలా మొదలైందంటే?అల్లు అర్జున్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప (Pushpa: The Rise). ఫహద్ ఫాజిల్, సునీల్, డాలి ధనంజయ, అజయ్ ఘోష్, జగదీశ్ ప్రతాప్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీకాంత్ విస్స డైలాగ్స్ రాశాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు.దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో దీనికి సీక్వెల్గా పుష్ప: ద రూల్ తెరకెక్కింది. 2024 డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1650 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత సృష్టించిన పుష్ప 2కి సీక్వెల్ ఉంటుందని చిత్రయూనిట్ ఎప్పుడో ప్రకటించింది. తాజాగా రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: ఆ సినిమా చూస్తుంటే చేదు గతం కళ్లముందుకు..: టాలీవుడ్ హీరోయిన్ -
హీరో ముద్దుపెడితే మరొకరితో పెళ్లి.. ఫన్నీగా ట్రైలర్
'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ ఉంది కదా! ఇప్పుడు ఆ లిరిక్స్ తోనే తెలుగులో ఓ సినిమా రిలీజ్ కాబోతుంది. 'కిస్ కిస్ కిస్సిక్' టైటిల్ తో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 21న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.(ఇదీ చదవండి: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని)మార్చి 1న హిందీలో 'పింటూ కీ పప్పీ' పేరుతో సినిమా రిలీజైంది. ఇప్పుడు దాన్ని పేరు మార్చి, దక్షిణాది భాషల్ల విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఫన్నీగా ఉంది. హీరో ఎవరికి ముద్దుపెడితే.. ఆ అమ్మాయిలకు మరొకరితో వెంటనే పెళ్లి అయిపోయింది. ఈ క్రమంలోనే హీరో.. తన ముద్దు పవర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఇందులో అతిథి పాత్రలో నటించాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్ను విడుదల చేసిన మేకర్స్ ఇవాళ తెలుగుతో పాటు హిందీలోనూ గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు.అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.This summer, it is going to be a crazy entertaining ride 💥💥#GoodBadUglyTeaser out now!Telugu ▶️ https://t.co/Ynl6esv1jhHindi ▶️ https://t.co/Y5QRRG1E67#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩A @gvprakash Musical ❤️🔥… pic.twitter.com/5BxIRxZ1sz— Mythri Movie Makers (@MythriOfficial) March 1, 2025 -
అజిత్ యాక్షన్ థ్రిల్లర్.. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా అలా జరగలేదు. దీంతో వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. అజిత్పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు.అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.Maamey! The festival is here 💥This summer is going to be SUPER CRAZY 🔥🔥Here's the #GoodBadUglyTeaser ❤️🔥▶️ https://t.co/evp1QJiM2J#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩A @gvprakash Musical ❤️🔥#AjithKumar… pic.twitter.com/M4hRGPdbAr— Mythri Movie Makers (@MythriOfficial) February 28, 2025 -
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్.. క్రేజీ కాంబో మొదలైంది!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్ వినిపించింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తారని తెలిసింది. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది.ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీకి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు వెల్లడించింది. భారతీయ సినిమా చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు సమయం ఆసమన్నమైంది. ఎన్టీఆర్నీల్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సరికొత్త యాక్షన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. మొదటి జనవరిలోనే షూటింగ్ ప్రారంభిస్తారని భావించినా అలా జరగలేదు. దీంతో ఈ ఫిబ్రవరిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ యాక్షన్ మొదలైంది. కాగా.. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, డిఫరెంట్ గెటప్స్లో ఎన్టీఆర్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. The SOIL finally welcomes its REIGN to leave a MARK in the HISTORY books of Indian Cinema! 🔥🔥#NTRNeel shoot has officially begun. A whole new wave of ACTION & EUPHORIA is ready to grip the Masses 💥💥MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial… pic.twitter.com/yXZZy2AHrA— Mythri Movie Makers (@MythriOfficial) February 20, 2025 -
‘ప్రేమిస్తావా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
పుష్ప 2 రికార్డు.. సంధ్య థియేటర్లో ఎంత రాబట్టిందంటే?
పుష్ప అంటే బ్రాండ్ అని మరోసారి రుజువైంది. ఇప్పటికే రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్పరాజ్ మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. సింగిల్ స్క్రీన్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఘనత సాధించాడు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో.. ఒక సింగిల్ స్క్రీన్లో అత్యధిక కలెక్షన్స్ (గ్రాస్) రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచిందని ట్వీట్ చేసింది. పుష్ప 2 రికార్డుహైదరాబాద్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య 70 ఎంఎం స్క్రీన్లో 'పుష్ప రూల్' ఆల్టైం రికార్డ్ అందుకుందని తెలిపింది. 51 రోజుల్లో ఒక కోటి 89 లక్షల 75 వేల 880 రూపాయలు వసూలు చేసిందని పేర్కొంది. సంధ్య థియేటర్లో 206 షోలకు గానూ 1,04,580 మంది చూశారని తెలిపింది. ఇకపోతే నైజాంలో పుష్ప 2 సినిమాను మైత్రీమూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు.సినిమాపుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రం ఒక్క హిందీలోనే రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలోనే చైనాలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.Records Breaking Rapa Rapa 🔥 #Pushpa2TheRule creates history with the highest ever gross in a single screen across Telugu states 💥🎥 Sandhya 70MM💪 206 Shows | 👥 1,04,580 Audience💰 Gross: ₹1,89,75,880 in just 51 days#HistoricIndustryHitPUSHPA2Nizam Release by… pic.twitter.com/wFTDzraAdp— Mythri Movie Distributors LLP (@MythriRelease) January 25, 2025 చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే! -
మ్యాడ్ బ్యూటీ '8 వసంతాలు' టీజర్ రిలీజ్
మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మొదటి విడుదలైన గ్లింప్స్లో అద్భుతమైన లొకేషన్స్తో పాటు హీరోయిన్ ఎలివేషన్తో చూపిస్తే.. ఇప్పుడు టీజర్లో మంచి కంటెంట్ ఉన్న లైన్తో ఎమోషనల్గా చూపించారు ఈ చిత్రాన్ని ఫణింద్ర(Phanindra Narsetti) తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్)'8 వసంతాలు'(8 Vasantalu) చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. మ్యాడ్ మూవీలో జెన్నీ పాత్రలో అనంతిక సనీల్కుమార్ అదరగొట్టింది. ఇప్పుడు ఆమె మ్యాడ్ సిక్వెల్లో కూడా నటిస్తుంది. ఈ మూవీతో ఆమె చాలామంది యూత్కు క్రష్గా మారిపోయింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమకు రాకముందిఅనంతిక సనీల్కుమార్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ వివిధ రకాల కంటెంట్తో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు షేర్ చేస్తుండేది. అలా గుర్తింపు రావడంతో తెలుగులో మొదట రోజ్ మిల్క్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే, మ్యాడ్ సినిమాతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అనంతికకు కర్రసాముతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ కూడా వచ్చు. -
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.టాలీవుడ్పై టార్గెట్తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన సుకుమార్ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ వ్యవహారంపై దిల్రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు రెండోరోజూ కొనసాగాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల కార్యాలయాలు, కొందరు సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి మొదలైన సోదాలు, బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించే వారిపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అధికారులు 55 బృందాలుగా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు సాగించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. దిల్రాజు, ఆయన కూతురు హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లు, మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సినీ ఫైనాన్షియర్స్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఐటీ దాడులపై దిల్రాజు స్పందించారు. తన ఒక్కరి ఇళ్లు, కార్యాలయాల్లోనే సోదాలు జరగడం లేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తంపై జరుగుతున్నాయని తెలిపారు. -
ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు
తన ఇంటిపై ఐటీ శాఖ అధికారుల జరుపుతున్న సోదాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)స్పందించారు. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైన మాత్రమే జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వారికి తనతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం సహకరిస్తున్నామని అని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం మొదలైన ఈ సోదాలు.. బుధవారం కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్(sukumar) ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు(IT Rids) నిర్వహించారు. . శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.వెలుగులోకి కీలక ఆంశాలు..ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లు వస్తుంది. ఈ సినిమా వారం రోజుల్లో రూ.203 కోట్లు వసూళ్లు సాధించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వచ్చిన లాభాలకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. -
చిత్ర పరిశ్రమలో ఐటీ సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ (Income Tax Officer) అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. సంక్రాంతి రేసులో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలయ్యాయి. రీసెంట్గా మేత్రీ మేకర్స్ నిర్మించిన పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్లను తాజాగా ఐటీ అధికారులు విచారించారు. వారు నిర్మించిన పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను రాబట్టినట్లు ఐటీ గుర్తించింది. అయితే, వసూళ్లు తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు జరగలేదని అధికారులు కనుగొన్నారు. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను వారు పరిశీలిస్తున్నారు.నిర్మాత దిల్ రాజ్, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహ రెడ్డి , నిర్మాత శిరీష్ ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వారి నిర్మాణ సంస్థ నుంచి భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి. రెండు మూవీల ఆదాయ వ్యయాలపై ఐటీ అధికారలు విచారిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. -
'పుష్ప2, గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటనపై ఐటీ అధికారుల ఫోకస్
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ(Income Tax Officer) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ప్రముఖ గాయని సునీత భర్త రామ్కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.సినిమాల ఆదాయం లెక్కలపై ఫోకస్ ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్రాజు నిర్మించారు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలకు అయిన ఖర్చు, వచ్చిన వసూళ్లు తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. దిల్రాజు ఇంటితోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను, ఐటీ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లను ఐటీ అధికారులు స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. (ఇదీ చదవండి: సైఫ్ అలీఖాన్కు రక్షణగా 'జై లవకుశ' నటుడి టీమ్)ఇక పుష్ప–2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు చెందిన మైత్రీ నవీన్, యలమంచిలి రవిశంకర్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. పుష్ప–2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఐటీ చెల్లింపులకు సంబంధించి అధికారులు పలు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా పుష్ప2(Pushpa 2) , గేమ్ ఛేంజర్(Game Changer Movie) కలెక్షన్ల ప్రకటనతో అందుకు సంబంధించిన చెల్లింపుల వివరాల గురించి వారు పరిశీలించినట్లు తెలుస్తోంది.సాధారణంగా జరిగే సోదాలే: దిల్రాజు భార్య వైగారెడ్డి తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు దిల్రాజు సతీమణి వైగారెడ్డిని తమ కారులో తీసుకెళ్లారు. దిల్రాజు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు. బ్యాంకు లాకర్లను పరిశీలించిన అనంతరం ఆమెను తిరిగి అదే వాహనంలో ఇంటివద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఐటీ సోదాలపై వైగారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవి సాధారణంగా జరిగే సోదాలు మాత్రమేనని చెప్పారు. బ్యాంకు ఖాతాల వివరాలు కావాలని అధికారులు అడిగారని, అవి ఇచ్చామని, బ్యాంకు లాకర్లు తెరిచి చూపించామని తెలిపారు. -
సుకుమార్ నేషనల్ అయితే.. కూతురు ఇంటర్నేషనల్
పుష్ప సినిమాతో దర్శకుడు సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా ఇంటర్నేషనల్ వేదికలపై సత్తా చాటుతుంది. ఆమె ప్రధాన పాత్రధారిగా నటించిన 'గాంధీ తాత చెట్టు' ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్ను అందుకుంది. ఇప్పుడు తెలుగులో జనవరి 24న విడుదల కానుంది.పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య, శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం కూడా పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.ఈ సినిమా గురించి దర్శకురాలు మాట్లాడుతూ.. 'గాంధీజీ సిద్ధాంతాల్ని పాటిస్తూ.. ఓ పదమూడేళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ చిత్రంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేటి తరం తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలకి ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని దర్శకురాలు కోరారు. సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. -
RAPO22: 'మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి'.. భాగ్యశ్రీ లుక్ అదిరింది!
ఉస్తాద్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా. ఈ చిత్రంలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదల చేశారు.'మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి' అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ చూస్తే... చుడీదార్ ధరించి ట్రెడిషనల్ లుక్కులో బావున్నారు. ఆవిడ కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ అయితే ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.'హైదరాబాద్లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీశాం. సాగర్ పాత్రలో రామ్ ఒదిగిన తీరు, ఆయన నటన ఆడియన్స్ అందరికీ ఒక ట్రీట్ అని చెప్పాలి. ప్రేక్షకులు నోస్టాల్జియాలోకి వెళతారు. ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోంది. రామ్, భాగ్య శ్రీ జోడీ క్యూట్ గా ఉందని అందరూ చెబుతున్నారు. సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయి'' అని దర్శక నిర్మాతలు తెలిపారు. మన సాగర్ గాడి లవ్వు ❤️Meet @bhagyasriiborse as Mahalakshmi.Let this new year bring a lot of love and joy to all your lives ✨Team #RAPO22 wishes you all a very Happy New Year ❤🔥@filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @sreekar_prasad… pic.twitter.com/vAHpfWRvXT— RAm POthineni (@ramsayz) January 1, 2025 -
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలుస్తుందని దిల్ రాజుకు చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీ పెద్దల మధ్య సమావేశం జరగడం శుభసూచకమని పోస్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని, నాయకత్వాన్ని అభినందిస్తున్నామని తెలిపింది. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది. సినిమా షూటింగ్లకు హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చేందుకు కట్టుబడి ఉన్నారని రాసుకొచ్చింది. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.కాగా.. ఇవాళ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎంతో భేటీలో పలు అంశాలపై చర్చించారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భేటీ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.We are delighted with the fruitful meeting held today between the Telangana Government and representatives of the Telugu Film Industry facilitated by the Film Development Corporation of Telangana.We deeply appreciate the visionary leadership of our Honourable Chief Minister Sri…— Sri Venkateswara Creations (@SVC_official) December 26, 2024మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత పుష్ప-2 నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. గ్లోబల్ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల దిశగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి దూరదృష్టికి ఇండస్ట్రీ ఎల్లప్పుడు మద్దతుగా ఉంటుందని పేర్కొంది.అలాగే సామాజిక సమస్యలపై అవగాహన పెంచడంలో ప్రభుత్వానికి మద్దతుగా ఇండస్ట్రీ పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మద్దుతుగా ఉంటామని మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. మన సమాజ ఉజ్వల భవిష్యత్తు కోసం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చింది. We sincerely thank the Government of Telangana, Honorable Chief Minister Shri @revanth_anumula Garu, Cinematography Minister @KomatireddyKVR Garu, and Deputy Chief Minister @Bhatti_Mallu Garu for their visionary leadership and steadfast encouragement towards the growth of the…— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2024 -
సంధ్య థియేటర్ ఘటన.. మరో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
సంధ్యా థియేటర్ ఘటన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థను కూడా చేర్చారు. ఈ కేసులో ఏ18గా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పేరును పోలీసులు ప్రస్తావించారు. ఆ రోజు ఏం జరిగిందంటే..ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్కు రాగా.. పెద్దఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. -
సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం
పుష్ప-2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని కీలక నిర్ణయం తీసుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను ఆయన పరామర్శించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బాలుడి చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రాజకీయం చేయొద్దు: మంత్రి కోమటిరెడ్డిఇక ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని.. సినీ హీరోల ఇళ్లపై దాడులు చేయవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లడం లేదని.. రూమర్స్ ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. -
ఓటీటీకి పుష్ప-2.. కీలక ప్రకటన చేసిన మైత్రీ మూవీ మేకర్స్
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతే కాకుండా మొదటి రోజు రూ.294 కోట్లతో మొదలైన పుష్ప రాజ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.అయితే ఇటీవల పుష్ప-2 ఓటీటీకి త్వరగానే వచ్చేస్తోందంటూ పలువురు కథనాలు రాసుకొచ్చారు. దీంతో పుష్ప టీమ్ అప్రమత్తమైంది. ఓటీటీకి వస్తుందన్న వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. పుష్పరాజ్ ఓటీటీ రిలీజ్పై వస్తున్న కథనాలు అవాస్తమమని కొట్టిపారేసింది. ఈ సెలవుల్లో బిగ్ స్క్రీన్పైనే ఆస్వాదించాలని ట్వీట్ చేసింది. అంతేకాకుండా రిలీజైన 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో పుష్ప-2 ముందుగానే ఓటీటీకి వస్తోందన్న రూమర్స్కు చెక్ పెట్టింది మూవీ టీమ్.హిందీలో అరుదైన రికార్డ్బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది.There are rumours floating around about the OTT release of #Pushpa2TheRule Enjoy the Biggest Film #Pushpa2 only on the Big Screens in this Biggest Holiday Season ❤️It won't be on any OTT before 56 days!It's #WildFirePushpa only in Theatres Worldwide 🔥— Mythri Movie Makers (@MythriOfficial) December 20, 2024 -
పండుగ రేసు నుంచి తప్పకున్న నితిన్ 'రాబిన్హుడ్'
క్రిస్టమస్ రేసు నుంచి 'రాబిన్ హుడ్' సినిమా తప్పుకుంది. ఈమేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.‘రాబిన్హుడ్’ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఆ సంస్థ మరో ప్రకటన చేసింది. రాబిన్ హుడ్ చిత్రాన్ని అనుకున్న తేదీలో విడుదల చేయడం లేదంటూ తెలిపింది. కానీ, కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మైత్రీ మూవీస్ నుంచి తెరకెక్కిన పుష్ప2 ఇంకా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. మరోవైపు మోహన్లాల్ బరోజ్ తెలుగు వర్షన్ను ఇదే సంస్థ డిసెంబర్ 25న విడుదల చేస్తుంది. ఆపై ఈ క్రిస్టమస్ రేసులో సుమారు 10కి పైగా చిత్రాలు రేసులో ఉన్నాయి. దీంతో థియేటర్స్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని రాబిన్ హుడ్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.రాబిన్ హుడ్లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. -
పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
'పుష్ప 2' తొలిరోజు నుంచే బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది. తాజాగా మూడు రోజుల్లోనే ఏకంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.హిందీలో తొలిరోజు రికార్డ్ బ్రేక్అయితే పుష్ప -2 హిందీలో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లతో ఆ రికార్డ్ను తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ముందుముందు మరెన్ని రికార్డులు కొల్లగొడుతందో ప్రస్తుత కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తోంది. నార్త్లోనూ పుష్ప-2 రప్పా రప్పా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. The box office is witnessing history with #Pushpa2TheRule ❤🔥The WILDFIRE BLOCKBUSTER collects a gross of 621 CRORES WORLDWIDE in just 3 days, shattering many records 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/CQ1SBTAnV4— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2024 -
'అలాంటివి ఇక వద్దు'.. వారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
సోషల్ మీడియాలో వైరలవుతోన్న పుష్ప చిత్రంలోని ఫేక్ డైలాగ్స్పై చిత్రబృందం స్పందించింది. నెట్టింట వైరలవుతోన్న ఫేక్ డైలాగ్స్ సృష్టించేవారికి పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాంటి పైరసీ వీడియోలు, సంబంధిత లింక్స్ కనిపిస్తే తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు మెయిల్తో పాటు ఫోన్ నంబర్ను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఇలాంటి వాటిని వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది.మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్లో ప్రస్తావిస్తూ..' ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోండి. లేకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.' అని పోస్ట్ చేశారు. దీంతో ఎవరైనా సరే ఫేక్ డైలాగ్స్, వీడియోస్ పోస్ట్ చేసి చిక్కుల్లో పడొద్దు. అలాంటి పైరసీ వీడియోలు కానీ, లింక్స్ కనిపిస్తే వెంటనే వివరాలు పంపితే దాన్ని అడ్డుకుంటామని పేర్కొంది. ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం…— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 Any unauthorized videos or spoilers of the movie #Pushpa2 can be reported immediately to the Anti Piracy Control Room @AntipiracySWe will bring them down immediately.claims@antipiracysolutions.orgWhatsapp: 8978650014— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 -
'పుష్ప2' ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలీవుడ్ కింగ్గా అల్లు అర్జున్
తెలుగు సినిమాల ఓపెనింగ్ కలెక్షన్స్ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి. హిందీ సినిమాలు కూడా ఆ టార్గెట్ను అందుకోవాలంటే కాస్తా కష్టమే అనేలా ఉన్నాయి. బాలీవుడ్లో పుష్ప2 కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేశాయి. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ను విడుదల చేసింది. బాలీవుడ్లో షారుఖ్ఖాన్, అమీర్ఖాన్,సల్మాన్ఖాన్ వంటి స్టార్స్కు కూడా సాధ్యం కానీ రికార్డ్ అల్లు అర్జున్ క్రియేట్ చేశాడు.బాలీవుడ్లో ఇప్పటి వరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా షారుఖ్ఖాన్ 'జవాన్' రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, ఇప్పుడు 'పుష్ప2' ఆ రికార్డ్ను దాటేసింది. హిందీలో ఫస్ట్ డే రూ.72 కోట్ల నెట్ రాబట్టి ఫస్ట్ ప్లేస్లోకి పుష్ప2 చేరిపోయింది. బన్నీ స్టార్డమ్తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ ఫస్ట్ కలెక్షన్స్ టాప్ టెన్ లిస్ట్లో పుష్ప2 చిత్రం మాత్రమే ఉండటం విశేషం. ఆ తర్వాతే టాలీవుడ్ నుంచి బాహుబలి2 ( 41 కోట్లు), ఆదిపురుష్ ( రూ 37.25 కోట్లు), సాహో ( రూ.24.4 కోట్లు), కల్కి (రూ. 22.5 కోట్లు) వంటి చిత్రాలు ఉన్నాయి.బాలీవుడ్లో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ 1. పుష్ప2 ( రూ. 72 కోట్ల నెట్)2. జవాన్ (రూ. 65.5 కోట్ల నెట్)3. స్త్రీ2 ( రూ.55 కోట్లు)4. పఠాన్ ( రూ. 55 కోట్లు)5. యానిమల్ ( రూ.54.75 కోట్లు)6. కేజీఎఫ్2 ( రూ.53.95 కోట్లు)7. వార్ (రూ. 51.60 కోట్లు)8. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ( రూ. 50 కోట్లు)9. సింగం ఎగైన్ (రూ. 43.5 కోట్లు)10. టైగర్3 (రూ.43 కోట్లు) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
నేడు పుష్ప–2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెళ్లే వారికి పోలీసుల సూచనలు
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'పుష్ప2'.. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నేడు (డిసెంబర్2) హైదరబాద్లో జరపనున్నారు. యూసుఫ్గూడ పోలీస్లైన్స్లో సోమవారం జరగనున్న పుష్ప–2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏర్పాట్లను నగర అదనపు సీపీ విక్రమ్సింగ్ మాన్, వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్, వెస్ట్జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ కట్టా పరిశీలించారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి యూసుఫ్గూడ బెటాలియన్లో ఈ కార్యక్రమం జరగనుండగా కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్లు ప్రజలు ఇతర రహదారుల నుంచి వెళ్లాలని కోరారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు నుంచి కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియం వైపు వెళ్లే వాహనదారులు శ్రీకృష్ణానగర్, శ్రీనగర్కాలనీ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాల్సి ఉంటుంది. మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు యూసుఫ్గూడ బస్తీ వద్ద ఆర్బీఐ క్వార్టర్స్ వైపు మళ్లి కృష్ణానగర్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు వెళ్లాలి. బోరబండ బస్టాపు వైపు నుంచి మైత్రివనం జంక్షన్కు వెళ్లే వాహనదారులు ప్రైమ్ గార్డెన్, కల్యాణ్నగర్, మిడ్ల్యాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, ఉమేష్ చంద్ర విగ్రహం మీదుగా యూ టర్న్ తీసుకుని, ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద యూ టర్న్ తీసుకుని మైత్రివనం వైపు వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పార్కింగ్ ఇలా.. కార్లను సవేరా అండ్ మహమూద్ ఫంక్షన్ హాళ్లలో పార్కు చేయాలి. జానకమ్మ తోటలో కార్లు, బైకులు పార్క్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. -
'పుష్ప 2' వివాదం.. నిర్మాతలపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు
'పుష్ప 2' మరో పదిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. హైప్ గట్టిగానే ఉంది. కాకపోతే కొన్నిరోజుల క్రితం మ్యూజిక్ విషయంలో చిన్నపాటి గందరగోళం జరిగిందని చెప్పొచ్చు. స్వతహాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ బ్యాక్ గ్రౌండ్ కోసమని చెప్పి మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని అప్పటికప్పుడు తీసుకొచ్చారు. ఇలా జరగడం ఓ రకంగా దేవీకి అవమానం అని చెప్పొచ్చు. తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఇతడు ఓపెన్ అయిపోయాడు. 'పుష్ప' నిర్మాతలని పొగుడుతూనే సెటైర్లు వేశాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.'పుష్ప మా అందరికీ స్పెషల్. మనకు ఏది కావాలన్నా సరే అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ అయినా తెరపై మన క్రెడిట్ అయినా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ. రవిశంకర్ (నిర్మాత) సర్.. నేను స్టేజీపై ఎక్కువ టైమ్ తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే నేను సమయానికి పాట ఇవ్వలేదు, బ్యాక్ గ్రౌండ్ చేయలేదు, టైంకి ప్రోగ్రామ్కి రాలేదు అంటుంటారు (నవ్వుతూ). మీకు నాపై చాలా ప్రేమ ఉంది. కానీ అంతకుమించి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి'(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది)'నా విషయంలో మీకు ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రాంగ్ టైమింగ్ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనేప్పుడూ ఆన్ టైమ్ సర్' అని దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు.మరి దేవిపై 'పుష్ప' నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్కి ఏం కంప్లైంట్స్ ఉన్నాయో తెలీదు గానీ అవన్నీ ఇప్పుడు ఈవెంట్లో బయటపెట్టేశాడు. అది కూడా నవ్వూతూనే. పుష్ప 2కి అనుకున్న టైంలో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని మరో ముగ్గురుని సంగీత దర్శకుల్ని తీసుకొచ్చారు. బహుశా ఆ విషయమై తన నిరసనని దేవిశ్రీ ఇలా సభాముఖంగా ఇలా తెలియజేశాడేమో?(ఇదీ చదవండి: అన్నపూర్ణ స్టూడియోస్లో పెళ్లి.. అసలు కారణం వెల్లడించిన చైతూ!) -
హీరో రామ్ పోతినేని కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. RAPO22 పేరుతో ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నవంబర్ 21న పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించనున్నారు. హీరో రామ్కు 22వ సినిమా ఇది.రామ్ సరసన హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. అయితే, రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది.'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు. ఈ సినిమానూ యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ అందరూ మెచ్చే కథతో తెరకెక్కించనున్నారు. నవంబర్ 21న పూజ జరిగిన తర్వాత ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల వెల్లడించనున్నారు. -
'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్
సడన్ సర్ప్రైజ్ అన్నట్లు 'జై హనుమాన్' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆంజనేయుడు నడిచి వెళ్తుండటాన్ని వెనక వైపు నుంచి చూపించారు. 30న అంటే బుధవారం లుక్ బయటపెడతారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ)ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్'.. ఊహించని విధంగా బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకుంది. చివర్లో సీక్వెల్ 'జై హనుమాన్' ఉంటుందని ప్రకటించారు. కానీ దానికి సంబంధించిన పనులేం జరిగినట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడేమో ఫస్ట్ లుక్ అని చెప్పి షాకిచ్చారు.తొలి భాగంలో హనుమంతుడు పాత్రధారి ఎవరనేది రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా చూపిస్తారు. అయితే 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి.. హనుమంతుడిగా కనిపిస్తాడని అంటున్నారు. తొలి భాగాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించగా.. 'జై హనుమాన్'ని మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. పూర్తి వివరాలు రేపు తెలుస్తాయేమో?(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్లోని చెరువులో దూకేశాడు: శ్రియ) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
బాక్సాఫీస్ కౌంట్డౌన్ స్టార్ట్.. సరికొత్త అధ్యాయానికి పుష్ప నాంది
ఐకాన్స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప2 కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈమేరకు చిత్ర యూనిట్తో పాటు బన్నీ ఒక పోస్టర్ను పంచుకున్నారు. ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి రానున్న ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ పనులన్నీ పూర్తి అయ్యాయి. ఈ చిత్రంలో పుష్పరాజ్గా అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీ వల్లీ పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్తో తెరకెక్కించారు.వాస్తవంగా పుష్ప2 సినిమా ఆగష్టు 15న విడుదల కావాల్సింది. అయితే, నిర్మాణ విలువలు మరింత బలంగా ఉండాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకోవడంతో సినిమా విడుదల విషయంలో కాస్త జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ చిత్రం డిసెంబరు 6న విడుదల కానుందని గతంలోనే ప్రకటించారు. కానీ, ఒకరోజు ముందే పుష్పగాడి రూల్ ప్రారంభం అవుతుందని కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఒక పోస్టర్ను అల్లు అర్జున్ పంచుకున్నారు. డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ను షేర్ చేశారు. 50 రోజుల కౌంట్డౌన్ ప్రారంభమైందని తెలిపింది.పుష్ప2 ఫస్టాప్ ఇప్పటికే లాక్ చేయబడిందని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది. అది ఫుల్ ఫైర్తో ఉంటుందని టీమ్ తెలిపింది. పుష్ప2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తుపాన్ క్రియేట్ చేస్తుంది.. దానిని చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ మేకర్స్ చెప్పారు. భారతీయ చలనచిత్రంలో సరికొత్త అధ్యాయాన్ని పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ లిఖిస్తాడని వారు పేర్కొన్నారు. -
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో '8 వసంతాలు' టీజర్
మ్యాడ్ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపుపొందిన అనంతిక సానీల్కుమార్ నటిస్తున్న కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. అద్భుతమైన లొకేషన్స్తో పాటు మంచి కంటెంట్ ఉన్న లైన్తో ఈ సినిమాను ఫణింద్ర తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.'8 వసంతాలు' చిత్రం నుంచి 'శుద్ధీ అయోధ్య టీజర్' పేరుతో చిత్ర యూనిట్ ఒక వీడియోను పంచుకుంది. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఈ చిత్రం ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. -
‘మత్తు వదలరా- 2’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాలకు 'మైత్రీ మూవీ మేకర్స్' విరాళం
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు నష్టపోయిన బాధితుల కోసం టాలీవుడ్ నుంచి విరాళాలు అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది నటీనటులతో పాటు నిర్మాతలు కూడా వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేతలు రెండు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తమ సోషల్మీడియా ద్వారా ప్రకటించారు.భారీ వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాచోట్లు బాధితులకు సాయం అందడంలేదని వాపోతున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్ విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో రూ. 25 లక్షలు ప్రకటించింది.ఇలాంటి పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని మైత్రీ మూవీస్ అధినేతలు నిర్మాత నవీన్ యెర్నేని, రవిశంకర్ తెలిపారు. చిత్ర పరిశ్రమ నుంచి మొదటగా జూనియర్ ఎన్టీఆర్ రూ.1 కోటి విరాళం ప్రకటించిన తర్వాత చాలామంది స్టార్ హీరోలు తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ
అల్లు అర్జున్ 'పుష్ప 2' చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఇది సెట్స్ మీద ఉంది. లెక్క ప్రకారం ఆగస్టు 15నే థియేటర్లలోకి రావాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబరు 6న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే మరోసారి వాయిదా తప్పదనే రూమర్స్ గత కొన్నాళ్ల నుంచి వస్తున్నాయి. అదే రోజున పలు పాన్ ఇండియా మూవీస్ డేట్ ఫిక్స్ చేస్తుండటమే దీనికి కారణం.తాజాగా 'మత్తు వదలరా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 'పుష్ప 2' తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఈ చిన్న మూవీని కూడా నిర్మిస్తుంది. ఈ క్రమంలోనే నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. బన్నీ మూవీ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. సెప్టెంబరు 2 కల్లా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్, అక్టోబరు 6 కల్లా సెకండాఫ్ ఎడిటింగ్ పూర్తయిపోతుందని అన్నారు. అలానే నవంబరు 20 కల్లా ఫైనల్ కాపీ సిద్ధమవుతుందని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: నాని 'సరిపోదా శనివారం'కి ఊహించని కలెక్షన్స్!)అలానే సెప్టెంబరు, అక్టోబరులో మిగతా పాటల్ని రిలీజ్ చేస్తామని.. నవంబరు 25న సెన్సార్ పూర్తి చేసి డిసెంబరు 6న వరల్డ్ వైడ్ సినిమాని రిలీజ్ చేస్తామని నిర్మాత రవిశంకర్ చెప్పారు. ఈయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే పక్క ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరేం సందేహాలు పెట్టుకోనక్కర్లేదు.మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటుడు రావు రమేశ్.. 'పుష్ప 3' కూడా ఉండబోతుందనే హింట్ ఇచ్చారు. మూవీ టీమ్ తనకు షూటింగ్ కోసమని ఈ విషయం చెప్పినట్లు బయటపెట్టారు. ఒకవేళ మూడో పార్ట్ అంటే ఇప్పుడే తీస్తారా లేదంటే కాస్త గ్యాప్ తీసుకుని వస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: బాలీవుడ్లో టాప్-5 కుబేరులు వీళ్లే.. అమితాబ్ ప్లేస్ ఎంతంటే?) -
ప్రభాస్- హను సినిమా కార్యక్రమంలో పాల్గొన్న స్టార్స్.. వీడియో వైరల్
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న చిత్రం తాజాగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాని గుల్షన్ కుమార్, భూషణ్కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబుతో పాటు చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు.‘‘ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఓ వారియర్ మాత్రం వారి పోరాటం దేని కోసమో నిర్వచించగలిగాడు’’ అంటూ ఈ సినిమాని ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు హను రాఘవపూడి. చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఫిక్షనల్ కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ‘‘1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హను పవర్ఫుల్ వారియర్ స్క్రిప్ట్ని సిద్ధం చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఫౌజీ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మిధున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: సుదీప్ ఛటర్జీ ఐఎస్సీ. -
ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్ విడుదల
పాన్ ఇండియా రేంజ్లో వరుస సినిమాలతో ప్రభాస్ హిట్లు అందుకుంటూనే ఉన్నాడు. రీసెంట్గా కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్.. తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. డైరెక్టర్ హను రాఘవపూడితో మూవీ లాంఛింగ్ కార్యక్రం తాజాగా జరిగింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది.ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. పూర్తిస్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తుంది. సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ను మైత్రీ మూవీ మేకర్స్ షేర్ చేసింది. 1940 దశకంలో జరిగే కథ అని పోస్టర్లో తెలిపింది. పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనుందని మేకర్స్ తెలిపారు. మాతృభూమి ప్రజల కోసం ఒక యోధుడు చేసే పోరాటంగా మూవీ ఉండనుంది. ‘పరిత్రాణాయ సాధూనాం’ అంటూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పోస్టర్లో చూపించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం విశాల్ చంద్రశేఖర్ మూడు పాటలు కూడా కంపోజ్ చేసినట్లు డైరెక్టర్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
#NTRNeel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
అట్టహాసంగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
అనుకున్నదే జరిగింది. మూడు రోజుల క్రితం రూమర్ ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడే అదే నిజమైంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ షురూ అయింది. ఈ వేడుకలో తారక్, ప్రశాంత్ నీల్ కుటుంబాలతో పాటు నిర్మాతలు కూడా పాల్గొన్నారు.(ఇదీ చదవండి: థియేటర్లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!)చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ ఎన్టీఆర్ 'దేవర'తో బిజీ అయిపోయాడు. ప్రశాంత్ నీల్ 'సలార్' చేస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఇద్దరు ఫ్రీ అయిపోవడంతో మూవీ పట్టాలెక్కించారు. ప్రారంభోత్సవం నాడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. 2026 జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.వీళ్ల చెప్పిన దాని బట్టి చూస్తే దాదాపు 16 నెలల సమయముంది. ఇదే టైంలో ప్రశాంత్ నీల్ 'సలార్ 2' కూడా చేస్తాడని అన్నారు. కానీ ఇప్పుడు తారక్ సినిమా మొదలైంది. కాబట్టి ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి పనిచేయడమంటే అదీ 2026లో అవుతుంది. సో అదన్నమాట విషయం.(ఇదీ చదవండి: సినిమా హీరోలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు) Massive Launch Ntr and Neel next project,#TheDragon #NTRNeel pic.twitter.com/kXApJ7GcJS— చందు (@NBK_9999) August 9, 2024This time, the earth will tremble under his reign! 🔥#NTRNeel will step onto the soil on January 9th, 2026 ❤️🔥MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/sWDVCs60bO— NTR Arts (@NTRArtsOfficial) August 9, 2024 -
విజయ్ మూవీతో మైత్రీ మేకర్స్ రిస్క్..
-
టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్హుడ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి నితిన్కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో నితిన్ వృద్ధుడి గెటప్లో కనిపించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. వాస్తవంగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆయన గెటప్ ఉంది. ఫేస్ యాప్, ఏఐ టెక్నాలజీ వంటి సాంకేతికతను ఉపయోగించి అలా వీడియోను క్రియేట్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. రాబిన్హుడ్ సినిమాలో నితిన్ ఇలాగే కనిపించనున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబిన్హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.Pulling each other's legs is our daily routine on #Robinhood sets..@actor_nithiin anna & @sreeleela14 😂🙈 pic.twitter.com/pTp4yiO32o— Venky Kudumula (@VenkyKudumula) July 11, 2024 -
వరుణ్ సందేశ్ కెరీర్లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్: నిఖిల్ సిద్దార్థ్
వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. తాజాగా 'నింద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్దార్థ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘నింద’ని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. మీడియా, ఆడియెన్స్ ఈ సినిమాను సపోర్ట్ చేయాలి. నా కెరీర్లో స్వామిరారా, కార్తికేయ ఎలా పడిందో.. నింద అనేది వరుణ్ కెరీర్కు ఓ మైల్ స్టోన్లా మారాలి. నింద మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. రాజేష్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటారు. నింద అనే మూవీతో వరుణ్ సందేశ్కు హిట్ రాబోతోంది. చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. జూన్ 21న నింద మూవీని అందరూ చూడండి. అందరూ సినిమాను చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.మైత్రీ మూవీస్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాజేష్ ఈ సినిమాను నాకు చూపించారు. చాలా కొత్తగా తీశారు. నెక్స్ట్ సీన్ ఏంటో కూడా చెప్పలేం. అంత బాగా తీశారు. వరుణ్ సందేశ్ గారికి కమ్ బ్యాక్ అవుతుంది. కొత్త బంగారు లోకం మా థియేటర్లో 50 రోజులు ఆడింది. ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు కమ్ బ్యాక్ ఇవ్వాలని, ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. జూన్ 21న ఈ చిత్రాన్ని థియేటర్లో చూడండి. అందరూ సర్ప్రైజ్ అవుతారు’ అని అన్నారు. -
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాపై ఆప్డేట్ ఇచ్చిన మేకర్స్
'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక వచ్చింది. తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. నేడు (మే 20) ఆయన పుట్టినరోజు కానుకగా సినిమా అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది.భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 2024 ఆగష్టు నుంచి ప్రారంభం కానుందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. చిత్రీకరణ ప్రధానంగా విదేశాల్లో ఉంటుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావొచ్చనే ఊహాగానాలూ ఇటీవల తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. మరోవైపు ‘డ్రాగన్’ టైటిల్ హక్కులు బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ దగ్గర ఉన్నాయని, దర్శకుడు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ అడగడంతో తారక్పై ప్రేమతో ఈ టైటిల్ను కరణ్కు ఇచ్చేశారని బాలీవుడ్ సమాచారం. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
తొలిసారి ఆ జానర్ టచ్ చేయనున్న విజయ్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి డిఫరెంట్ జానర్ను టచ్ చేయనున్నాడు. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్తో మరోసారి కలిసి పని చేయనున్నాడు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 అనౌన్స్ అయ్యింది. VD14నేడు (మే 9న) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దానిపై ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. చారిత్రక సంఘటనల ఆధారంగా..19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. చూస్తుంటే ఈ సారి విజయ్ పెద్ద హిట్టే ఇవ్వాలని ప్లాన్ చేసినట్లున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. 'The Legend of the Cursed Land'Rahul Sankrityan X Vijay Deverakonda @MythriOfficial pic.twitter.com/estyTYSUrj— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024చదవండి: ఓటీటీలో పుష్ప విలన్ సూపర్ హిట్ మూవీ.. ఆ విషయంలో రికార్డ్! -
Pushpa 2: పుష్ప..పుష్ప.. పుష్ప.. ఫుల్ సాంగ్ వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చేసింది. పుష్ప-2 మూవీ నుంచి 'నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ పుష్ప-2 చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.గతనెల బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేసిన మేకర్స్.. మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పుష్ప-2 ఫస్ట్ సింగిల్ను ఏకంగా ఆరుభాషల్లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ స్పెషల్ పోస్టర్ను సైతం మేకర్స్ పంచుకున్నారు. సరికొత్త లుక్లో బన్నీ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్గా నిలిచిన సంగతె తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా పుష్ప-2ను తీసుకొస్తున్నారు. ఈ మూవీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. -
పుష్ప-2 ఫస్ట్ సింగిల్.. రిలీజ్ టైమ్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ను రిలీజ్ డేట్ అండ్ టైమ్ను ప్రకటించారు మేకర్స్.మే 1వ తేదీన ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024 -
లక్కీ చాన్స్ కొట్టేసిన శ్రీలీల!
తమిళసినిమా: నటుడు అజిత్తో కలిసి టాలీవుడ్ క్రేజీ నటి నటించనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అలాంటి అవకాశం ఉందని సమాధానం వస్తోంది. కోలీవుడ్లో స్టార్ హీరోల్లో అజిత్ ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రం తుణివు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ఫిలింస్ సంస్థ ని ర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. నటుడు అర్జున్, ఆరవ్, రెజీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ను పూర్తి చేసుకుంది. తాజాగా అజర్బైజాన్లో షూటింగ్ను నిర్వహించారు. తదుపరి సెడ్యూల్ ఎప్పుడు? ఎక్కడ నిర్వహించేది చిత్ర వర్గాలు ఇంకా వెల్లడించలేదు. ఇకపోతే మే నెల 1వ తేదీన నటుడు అజిత్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా విడాముయర్చి చిత్రానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందనే ఆశాభావంతో అజిత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వారిని ఖుషీపరచడానికి అజిత్ నటించిన బిల్లా చిత్రం రీరిలీజ్ కానుంది. ప్రస్తుతం అజిత్ బైక్లో విదేశాలు చుట్టొస్తున్న పని లో ఉన్నారు. కాగా విడాముయర్చి చిత్రం అజిత్ నటిస్తున్న 62వ చిత్రం అవుతుంది. దీంతో తన 63వ చిత్రానికీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలు గు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వచ్చనున్నారు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో అజిత్ మూడు గెటప్లలో నటిస్తారట. కాగా టాలీవుడ్ క్రేజీ నాయకి శ్రీలీల ఈ చిత్రంలో అజిత్కు జంటగా నటించనున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమా ల్లో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. శ్రీలీల తెలుగులో రవితేజ, మహేశ్బాబు వంటి స్టార్ నటుల సరసన నటించారు. తాజాగా అజిత్ సరసన నటించడం నిజమైతే ఇదే ఈమె తొలి తమిళ చిత్రం అవుతుంది. ఇక పోతే ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించి 2025 పొంగల్కు విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
కిడ్నాప్ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేత నవీన్ యర్నేని
క్రియా హెల్త్కేర్ వివాదంలో బలవంతపు షేర్లు, యాజమాన్య బదిలీ వ్యవహారంలో టాలీవుడ్కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని పేరు ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితుల జాబితాలో ఆయన కూడా ఉన్నారని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. అక్రమ ఫోన్ ట్యాపింగ్, వ్యాపారుల పట్ల బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్రావుతో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్పై జూబ్లీహిల్స్ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం విషయాన్ని తెలుసుకున్న క్రియా హెల్త్కేర్ డైరెక్టర్ చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పోలీసులను కొద్దిరోజుల క్రితం సంప్రదించారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్లో చిక్కుకున్న వారిలో కొందరు గతంలో తనను కిడ్నాప్ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్కు ఇటీవల రాధాకిషన్రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్రావు, చంద్రశేఖర్ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన వేణుమాధవ్ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్కేర్ సంస్థను స్థాపించారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులతోపాటు తన సంస్థకు చెందిన నలుగురు పార్ట్టైమ్ డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు తాజాగా ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న నిర్మాత నవీన్ యర్నేని, గోపాలకృష్ణ సూరెడ్డి,రాజ్ తలసిల, రవికుమార్ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్రావులను నిందితుల జాబితాలో తాజాగా చేర్చారు. దీంతో వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. -
'మంజుమ్మల్ బాయ్స్' ప్రదర్శనలు నిలిపేసిన పీవీఆర్ మల్టీప్లెక్స్.. కారణమేంటి?
మలయాళంలో బ్లాక్ బస్టర్ టాక్ తో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. తాజాగా ఏప్రిల్ 6న తెలుగులో రిలీజై అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యాంగా పీవీఆర్ మల్టిఫ్లెక్స్ మంజుమల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. (ఇదీ చదవండి: ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందువల్లే..) మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ యాజమాన్యం వెల్లడించింది. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి... ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది. (ఇదీ చదవండి: నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!) -
Pushpa 2: The Rule Teaser: పుష్ప టీజర్ అప్డేట్.. గూస్బంప్స్ ఖాయమేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే వైజాగ్లో పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యాగంటి క్షేత్రంలోనూ రష్మిక మందన్నాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా టీజర్ టైమింగ్ను రివీల్ చేశారు మేకర్స్. బన్నీ బర్త్ డే రోజున 11:07 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా గూస్ బంప్స్ గ్యారంటీడ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో పుష్ప అభిమానులు వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. #Pushpa2TheRule teaser tomorrow at 11:07AM. pic.twitter.com/utmMi2Hdyu — Allu Arjun (@alluarjun) April 7, 2024 𝐓𝐎𝐌𝐎𝐑𝐑𝐎𝐖 is the day ❤️🔥 𝟏𝟏.𝟎𝟕 𝐀𝐌 is the time ❤️🔥#Pushpa2TheRuleTeaser will mark the entry of #PushpaRaj that will create ripples across the box office💥💥 𝗚𝗢𝗢𝗦𝗘𝗕𝗨𝗠𝗣𝗦 𝗚𝗨𝗔𝗥𝗔𝗡𝗧𝗘𝗘𝗗 🔥#PushpaMassJaathara #Pushpa2TheRule pic.twitter.com/kMTYEgx8GB — Pushpa (@PushpaMovie) April 7, 2024 -
బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు.. తెలుగులోనూ వస్తోన్న థ్రిల్లర్ మూవీ!
సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. మలయాళంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో టాలీవుడ్ అభిమానుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఈ సంస్థ ఏప్రిల్ 6న రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. తెలుగు వర్షన్ను నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. కాగా.. 2006లో కొడైకెనాల్లోని గుణకేవ్లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. తెలుగులోనూ అదే టైటిల్తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 𝐓𝐡𝐞 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐠𝐫𝐨𝐬𝐬𝐢𝐧𝐠 𝐌𝐚𝐥𝐚𝐲𝐚𝐥𝐚𝐦 𝐟𝐢𝐥𝐦 - #ManjummelBoys is now coming to 𝐞𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧 𝐭𝐡𝐞 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐚𝐮𝐝𝐢𝐞𝐧𝐜𝐞 ❤️🔥 Grand release worldwide on April 6th. Telugu release by @MythriOfficial, @Primeshowtweets & @SukumarWritings ✨… pic.twitter.com/xDULaAgbVx — Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2024 -
ఫ్యాన్స్కు చెర్రీ హోలీ ట్రీట్.. ఆ స్టార్ డైరెక్టర్తో మరో సినిమా!
ప్రస్తుత గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇటీవలే ఆర్సీ16 పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. అంతలోనే మరో క్రేజీ డైరెక్టర్తో గ్లోబల్ స్టార్ జతకట్టారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్తో కలిసి పని చేయనున్నారు. హోలీ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.ఈ మూవీ వర్కింగ్ టైటిల్ ఆర్సీ17 పేరుతో మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. కాగా.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్తో పుష్ప-2 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. Mighty forces reunite for an earth-shattering magnum opus 🔥❤🔥 Global Star @AlwaysRamCharan X The Maverick Director @aryasukku X Rockstar @ThisisDSP X @MythriOfficial X @SukumarWritings = #Raring2Conquer 🐎#RC17 is all set to add new colours to the Indian Cinema ❤🔥 pic.twitter.com/ISRZaumDng — Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024 -
మలయాళ ఏకైక సినిమాగా 'మంజుమ్మెల్ బాయ్స్' రికార్డ్..!
మలయాళం సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్' చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మలయాళ ఇండస్ట్రీలో ఏ సినిమా ఈ మార్క్ను అందుకోలేదు. దీంతో ఈ ఫీట్ సాధించిన ఏకైక సినిమాగా 'మంజుమ్మెల్ బాయ్స్' చరిత్రకెక్కింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ మూవీ కేవలం 25 రోజుల్లోనే రూ. 200 కోట్లు కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ ఈ ఘనతను అందుకోలేదు. ఈ చిత్రం తర్వాత '2018' సినిమా తర్వాత స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ. 180 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్లాల్ నటించిన 'మన్యం పులి' రూ. 150 కోట్లు కలెక్ట్ చేస్తే.. 'లూసిఫర్' రూ. 130 కోట్లు అందుకుంది. రీసెంట్గా రిలీజ్ అయిన 'ప్రేమలు' ఇప్పటి వరకు రూ. 120 కోట్లు సాధించి ఐదో స్థానంలో ఉంది. మంజుమ్మెల్ బాయ్స్ కథ 2006లో రియల్గా జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ ఏడాదిలో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు విహారయాత్రకు వెళ్లారు. అందులో ఒక యువకుడు పొరపాటున ఓ లోతైన గుహలోకి జారి పడిపోతాడు. ఆ తర్వాత అతన్ని స్నేహితులు ఎలా కాపాడుతారన్నదే 'మంజుమ్మెల్ బాయ్స్' స్టోరీ. -
ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన మలయాళం సినిమా తెలుగులో ఎప్పుడంటే
మలయాళంలో ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రేమలు చిత్రం రూ. 100 కోట్ల మార్క్ను దాటి విజయవంతంగా రన్ అవుతుంది. అదే విధంగా మంజుమ్మెల్ బాయ్స్ మూవీ కూడా రూ. 190 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే 200 కోట్ల మార్కును కూడా దాటేయబోతోందీ చిత్రం. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయబోతోంది మైత్రీ మూవీ మేకర్స్. ఇతర భాషల్లో బ్లాక్బస్టర్ విజయం అందుకున్న సినిమాలను తెలుగులో విడుదల చేయడం సాధారణం అయ్యింది. ఈ క్రమంలో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ తెలుగులోనూ ఈ సినిమా ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహించి ఆ తర్వాత రిలీజ్ చేయాలని గతంలో వాయిదా వేశారు. మార్చి 29న తెలుగులో రిలీజ్ కానుందని మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే వెల్లడించింది. డైరెక్టర్ చిదంబరం ఈ మూవీని రూ.20 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారని వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 22న విడుదల అయిన ఈ సినిమాకు భారీ స్పందన లభించింది. సర్వైవల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీలో సౌబిన్ షాహిర్, సీనియర్ నటుడు లాల్, అరుణ్ కురియన్, ఖలిడ్ రెహ్మాన్, శ్రీనాథ్ భసి, బాలు వర్గీస్, గణపతి, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, షెబిన్ బెన్సన్, లాంటి స్టార్స్ కీలక పాత్రలో పోషించారు. 2006లో రియల్గా జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ ఏడాదిలో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు విహారయాత్రకు వెళ్లారు. అందులో ఒక యువకుడు పొరపాటున ఓ లోతైన గుహలోకి జారి పడిపోతాడు. ఆ తర్వాత అతన్ని స్నేహితులు ఎలా కాపాడుతారన్నదే 'మంజుమ్మెల్ బాయ్స్' స్టోరీ. -
సంక్రాంతి బరిలో ఏడో సినిమా.. వర్కౌట్ అయ్యే పనేనా?
మొన్నీమధ్యే సంక్రాంతి వెళ్లింది. నాలుగు సినిమాలొస్తే అందులో 'హనుమాన్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, విజేతగా నిలిచింది. అలానే వచ్చే ఏడాది పండక్కి ఇంకా చాలా టైముంది. కానీ ఇంతలోనే బాక్సాఫీస్ బరిలో అర డజనుకు పైగా చిత్రాలు కర్చీఫ్ వేసేస్తున్నాయి. తెలుగు హీరోలని పక్కనబెడితే తాజాగా తమిళ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ సంస్థ పోటీలో పెట్టింది. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్గా మారింది. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మాములుగా ఉండదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీగా ఉంటారు. 2025 పండగ బరిలో చిరంజీవి 'విశ్వంభర' ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. బయటకు చెప్పనప్పటికీ.. ప్రభాస్ 'రాజా సాబ్', బాలకృష్ణ-బాబీ మూవీ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమా, నాగార్జున బంగార్రాజు ఫ్రాంచైజీ మూవీ, శతమానం భవతి సీక్వెల్ చిత్రాలు కూడా పండకే రావాలని గట్టిగా ఫిక్సయ్యాయి. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) ఇప్పుడు వీటికి పోటీగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, తమిళ స్టార్ హీరో అజిత్ కాంబోలో తీయబోయే చిత్రం కూడా సంక్రాంతికే రానుంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టైటిల్ ఫిక్స్ చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. తమిళంలో ఈ సినిమా రిలీజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తెలుగులోకి వచ్చేసరికి చిరుతో పోటీపడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత సంఖ్య బట్టి చూస్తే దాదాపు ఏడు సినిమాల వరకు సంక్రాంతి బరిలో ఉన్నాయి. చివరకొచ్చేసరికి వీటిలో ఎన్ని నిలబడతాయ్? ఎన్ని తప్పుకొంటాయనేది చూడాలి? మరోవైపు అజిత్కి తెలుగులో ఫ్యాన్ బేస్ తక్కువే. దీంతో మైత్రీ-అజిత్ కాంబో తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుందా అనేది సస్పెన్స్. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?) With Wholesome Humbleness herewith, we Announce the title of AK's Next Movie Called as #GoodBadUgly #AjithKumar @Adhikravi @ThisIsDSP @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl@SureshChandraa @supremesundar#kaloianvodenicharov #Anuvardhan @valentino_suren@Donechannel… pic.twitter.com/EU4qKO5fEO — Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2024 -
హరీశ్ శంకర్ సాయం.. నెటిజన్ల నుంచి ప్రశంసలు
టాలీవుడ్లో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. ఇండస్ట్రీలో ఆయన తక్కువ సినిమాలే డైరెక్ట్ చేసినప్పటికీ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలపైనే కాకుండా పలు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ఆయన చెప్పడమే కాకుండా ఇతరులకు సాయం చేస్తూ కూడా అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ఒక మంచి పనికి సోషల్ మీడియా ద్వారా ఆయన్ను అభినందిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్డుపై నిలిచిపోయిన ఒక కారు విషయంలో హరీశ్ సాయం అందించారు. నడిరోడ్డుపై ఆగిపోయిన కారును హరీశ్తో పాటు మైత్రి మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ కలిసి కొంత దూరం పాటు చేతుల సాయంతో నెట్టుకుంటూ వెళ్లారు. దీనిని గమనించిన కొందరు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి నెట్టింట వదిలారు. దీంతో హరీశ్, నిర్మాత రవిశంకర్ల సింప్లిసిటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'మిస్టర్ బచ్చన్' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించినన 'రైడ్' మూవీకి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్సింగ్'ను కూడా హరీశ్ రూపొందిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ల తర్వాత హరీశ్- చిరంజీవితో సినిమా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్కు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్ ఉండనున్నారట. కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. Director #HarishShankar @harish2you sir and @MythriOfficial Ravi gaaru are helping the vehicle which is stopped on road 👏👏👏 Kudos to you sir 🙏🙏 @harish2you it’s a great beginning of my day sir after watching this one 👏👏👏 pic.twitter.com/CbGfCiU7AN — Mahaa Max (@mahaamaxx) March 14, 2024 -
రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది
రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చరణ్- శంకర్ కాంబినేషన్ లో ' గేమ్ ఛేంజర్' మూవీ చాన్నాళ్లుగా షూటింగ్ కొనసాగుతుంది. ఈ చిత్రం గురించి కూడా పెద్దగా అప్డేట్స్ రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా కొంతమేరకు నిరాశ చెందుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా (RC16) మూవీ గురించి కీలక సమాచారాన్ని చిత్ర నిర్మాత సంస్ధ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చారు. రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిగ్ ప్రాజెక్ట్కు కెమెరా మెన్ను ఫిక్స్ చేశారు మేకర్స్. సౌత్ ఇండియాలో క్రేజీ సినిమాటోగ్రాఫర్గా ఉన్న రత్నవేలును ఎంపిక చేశారు. నేడు ఫిబ్రవరి 24న ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మైత్రీ సంస్థ ప్రకటించింది. రత్నవేలు ఇప్పటి వరకు రంగస్థలం,సైరా నరసింహా రెడ్డి,భారతీయుడు 2,ఖైదీ నం. 150, 1: నేనొక్కడినే వంటి చిత్రాలతో పాటు దేవర ప్రాజెక్ట్లో ఆయన భాగమయ్యారు. ఇదే సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్, జాన్వీ కపూర్ నటిస్తున్నారని టాక్ ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం బుచ్చిబాబు అండ్ టీం ఉత్తరాంధ్ర యాస బాగా మాట్లాడగలిగే నటీనటుల కోసం ఆడిషన్స్ జరిగాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఐతే జోరుగా సాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉండటం వల్ల ఆయన అభిమానులకు కానుకగా ఫస్ట్ లుక్ను పరిచయం చేయాలని టీమ్ ప్లాన్ ఉంది. Team #RC16 welcomes the master lensman 🎥 Happy Birthday to the acclaimed cinematographer and the man who delivers stunning visuals, @RathnaveluDop ❤️🔥#RamCharanRevolts Global Star @AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @artkolla @vriddhicinemas @SukumarWritings pic.twitter.com/TFXiJ0Te3W — Mythri Movie Makers (@MythriOfficial) February 24, 2024 -
15 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన రవితేజ సినిమా రీరిలీజ్
మాస్మహారాజా రవితేజ కెరియర్లో కిక్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రవితేజ, బ్రహ్మానందం ట్రాక్ ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది. హల్వారాజ్ పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. ఆ సినిమాలోని కామెడీ సీన్స్ ఇప్పుడు ఎక్కువగా మీమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కిక్ సినిమా రీరిలీజ్ కానుంది. సురేందర్రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 1న రీరిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో రవితేజకు జోడీగా ఇలియానా నటించింది. కోలీవుడ్ నటుడు శామ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అదిరిపోతుంది. కిక్ సినిమాతో థమన్, సురేందర్రెడ్డి,రవితేజలకు విపరీతమైన స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్గా కిక్ 2 కూడా వచ్చింది. కానీ అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటికే ఈగల్తో థియేటర్లో సందడి చేస్తున్న రవితేజ.. మార్చి 1న కిక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రీరిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరిలో రవితేజ అభిమానుల కోసం ఒక ఈవెంట్ను కూడా ప్లాన్ చేస్తున్నారు. -
మృణాల్ ఠాకూర్ ఏ హీరోకు ఎస్ అంటుందో?
నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం విడాముయర్చి. లైకా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిల్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తర్వాత చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల విడుదలైన మార్క్ ఆంటోని చిత్రం ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో అజిత్ సరసన నటి మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో వరుస హిట్లతో క్రేజీ కథానాయకిగా ఈమెకు ఇప్పుడు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల నటుడు శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనుందని ప్రచారం జోరుగా సాగింది. ఆమె కాల్షీట్స్ కోసం ఆ చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. అదేవిధంగా శింబు కథానాయకుడిగా కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలోనూ కథానాయకిగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. దీంతో ఈ అమ్మడు అజిత్కు జై కొడుతుందో, శింబుకు సై అంటుందోనన్న ఆసక్తి కోలీవుడ్లో నెలకొంది. అజిత్ చిత్రం యూనిట్ వేరే ఆప్షన్ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మృణాల్ ఠాకూర్ కాల్షీట్స్ కుదరకపోతే బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది .ఈ భామ ఇప్పటికే కంగువ చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
పుష్ప-2 పై రూమర్స్.. డైరెక్టర్ సుకుమార్ పోస్ట్ వైరల్!
ఐకాన్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్ప సీక్వెల్గా సుకుమార్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. అయితే ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల పుష్ప-2 రిలీజ్ వాయిదా పడుతుందని చాలా సార్లు వార్తలొచ్చాయి. వీటిపై డైరెక్టర్ సుకుమార్ క్లారిటీ కూడా ఇచ్చారు. పుష్ప-2 రిలీజ్ తేదీలో ఎలాంటి మార్పులు లేవని తేల్చి చెప్పారు. ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు సుకుమార్. 'పుష్ప రాజ్ రూల్ బిగిన్స్ ఇన్ 200 డేస్' అంటూ పోస్టర్ను రిలీజ్ చేశారు. దీంతో వాయిదా అంటూ రూమర్స్ వైరలవుతున్న వేళ మరోసారి క్లారిటీ ఇచ్చిపడేశారు. తాజాగా డైరెక్టర్ చేసిన పోస్ట్తో పుష్ప-2పై వస్తోన్న రూమర్స్కు చెక్ పడినట్లే. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. గతేడాది ఎవరూ ఊహించని విధంగా 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్టు కావడంతో అనుకున్న సమయంలో సినిమా విడుదల కాకపోవచ్చనే వార్త ప్రచారం జరిగింది. గతంలో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్'2021లో విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇందులో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్రకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో ఫహద్ ఫాజిల్ కొద్దిసేపు మాత్రమే కనిపించారు. పార్ట్-2లో ఆయన ఎక్కువ సేపు కనిపిస్తారని టాక్ ఉంది. పార్ట్-1కు వచ్చిన ఆదరణ చూసిన మేకర్స్ ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్- 1కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. 200 DAYS for Pushpa Raj to begin his RULE 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024 ❤🔥#PushpaKaRuleIn200Days 💥💥 Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/RxUDlkdrpB — Mythri Movie Makers (@MythriOfficial) January 29, 2024 View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) -
సంక్రాంతి సినిమాల పంచాయతీ సెటిలైందా? చివరకు అలా!
ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దడదడలాడింది. రిలీజైన సినిమాల కంటే నిర్మాత దిల్ రాజు ఎక్కువగా హైలైట్ అయ్యారు. థియేటర్ల విషయంలో 'హనుమాన్' చిత్రానికి అన్యాయం జరగడానికి ఈయనే కారణమని అన్నారు. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం కాస్త చర్చనీయాంశమైంది కూడా. ఇప్పుడు సంక్రాంతి సినిమాల పంచాయతీ విషయం కాస్త సెటిలైనట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ఈసారి పండక్కి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో 'గుంటూరు కారం', 'హనుమాన్' చిత్రాలు జనవరి 12న రిలీజయ్యాయి. వీటిలో మహేశ్ మూవీని నైజాంలో దిల్ రాజుకి చెందిన ఎస్వీసీ డిస్ట్రిబ్యూట్ చేసింది. 'హనుమాన్'ని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్స్ అన్నీ 'గుంటూరు కారం'కి కేటాయించి.. కేవలం మూడు మాత్రమే 'హనుమాన్' చిత్రానికి ఇచ్చారనే విషయం బయటకు రావడంతో ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. చివరికొచ్చేసరికి ఆ మూడు కూడా తీసేసుకున్నారని వినిపించింది. అయితే థియేటర్ల తీసుకున్నారనే విషయమై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో కేసు నమోదు చేయడంతో మొత్తం రచ్చ రచ్చ అయింది. అయితే ఇప్పుడు దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ, అలానే 'హనుమాన్'ని డిస్ట్రిబ్యూట్ చేసి మైత్రీ మూవీ మేకర్స్ పెద్దలు ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై గొడవలు పడకూడదని, కలిసి ఓ ప్లానింగ్తో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఎస్వీసీ తమకు చెందిన పలు థియేటర్లలో సినిమాలు తీసేసి, 'హనుమాన్'కి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) -
Pushpa 2: ఈ ఏడాది రూల్ పుష్పదే.. మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్!
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. పార్ట్-1 బ్లాక్బస్టర్ కావడంతో సుకుమార్ పుష్ప-ది రూల్(పార్ట్-2) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ట్వీట్ చేశారు. స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఈ ఏడాది పుష్పదే రూల్ అంటూ పోస్ట్ చేశారు. 2024 విడుదల కానున్న పుష్ప-2 ఏ మేరకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే. #2024RulePushpaKa ❤️🔥 Pushpa Raj is coming back this year to rule the worldwide box office 🔥🔥 May you all rule your year with ambition & determination and may you get everything you desire for 💫 Happy New Year 2024 ❤️#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG… pic.twitter.com/u6VED8LZbr — Mythri Movie Makers (@MythriOfficial) January 1, 2024 -
రూ.500కోట్ల క్లబ్లో సలార్.. మరో వంద కోట్లు వస్తే
ప్రభాస్ నటించిన సలార్ కలెక్షన్స్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ నెల 22న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో షారుక్ ఖాన్ డంకీ చిత్రాన్ని తట్టుకుని అక్కడ కూడా భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. సినిమా విడుదలయ్యి ఇప్పటికి మొదటి వారం పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్ను సలార్ అందుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే సలార్ రూ.1000 కోట్ల టార్గెట్ను కూడా రీచ్ అవుతుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వంద కోట్లు వస్తే సేఫ్ మార్క్ ప్రపంచవ్యాప్తంగా సలార్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. 'బాహుబలి'ని మించి కొన్ని ఏరియాల్లో టికెట్ రేట్లు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్గా ఈ సినిమాకు రూ. 400 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే టార్గెట్ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ. 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం. ఇప్పటికే సలార్ ఖాతాలో రూ. 500 కోట్లు వచ్చేశాయి. మరో రూ. 100 కోట్లు సలార్కు వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్- ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం సలార్.. రెండు పార్టులుగా రానున్న ఈ చిత్రం డిసెంబర్ 22న మొదటి భాగం విడుదలైంది. ఈ మూవీలో ప్రభాస్ మాస్ యాక్షన్ సీన్స్తో పాటు భారీ ఎలివేషన్స్ అభిమానులను మెప్పిస్తున్నాయి. దీని కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్తో థియేటర్లకు వెళ్తున్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ప్రశాంత్ నీల్తో బిగ్ ప్లాన్ వేస్తున్న మైత్రి మూవీ మేకర్స్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అజిత్ తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి విడాముయర్చి అన్న టైటిల్ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా అజిత్ తన తదుపరి చిత్రాలను వరుసగా కమిట్ అవుతున్నట్లు తాజా సమాచారం. విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత అజిత్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన 63వ చిత్రం అవుతుంది. కాగా అజిత్ తన 64వ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్లో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా తన 65వ చిత్రం కూడా దర్శకుడిని ఫిక్స్ చేసుకున్నట్లు తాజా సమాచారం. ఆయన ఎవరో కాదు తాజా క్రేజీ దర్శకుల్లో ఒకరైన ప్రశాంత్ నీల్. కేజీఎఫ్తో తన సత్తాను చాటుకుని పాన్ ఇండియా దర్శకుడుగా మారి తాజాగా సలార్ చిత్రంతో మరోసారి సంచలన విజయాన్ని అందుకున్నారు. దీంతో ప్రశాంత్ నీల్కు అవకాశాలు వెంటాడుతున్నాయి అనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్లో సక్సెస్ఫుల్ బ్యానర్గా మైత్రి మూవీ మేకర్స్ మంచి పేరు ఉంది. అజిత్ సినిమాతో కోలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా పాగా వేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం ఈయన కేజీఎఫ్ 3, సలార్ 2 చిత్రాలను చేయాల్సి ఉంది. అదేవిధంగా టాలీవుడ్ స్టార్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్తో చిత్రం చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ఈ దర్శకుడిపై అజిత్ కన్నేసినట్లు సమాచారం. తనతో చిత్రం చేయమని ఈయనే స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ను కోరినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అజిత్ 65వ చిత్రానికి ఈయనే దర్శకత్వం వహించే అవకాశం ఉందనే సమాచారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడానికి మాత్రం ఇంకా చాలా సమయం ఉంది. -
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. సలార్ టికెట్స్ బుకింగ్ ఎప్పుడంటే?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సలార్ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్లైన్లో స్టార్ట్ కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మొదలు కాలేదు. తాజాగా సలార్ టికెట్ల బుకింగ్కు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు రాత్రి 8.24 నిమిషాలకు సలార్ నైజాం టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుది. కాగా.. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Khansaar ee kaadhu, anni theatres housefulls tho erupekkala ❤️🔥❤️🔥#SalaarNizamBookings opens online today at 8.24 PM 🔥#Salaar Nizam Release by @MythriOfficial 💥#SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai… pic.twitter.com/FqUidhS126 — Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2023 -
ప్రభాస్ 'సలార్'.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!
ప్రభాస్ నటించిన సలార్ ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సలార్ మూవీ టికెట్ల ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. సలార్ చిత్రానికి రూ.65, రూ.100ల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. సాధారణ థియేటర్లలో, మల్టీఫ్లెక్సుల్లో మొదటి వారం రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 22 నుంచి 28వ తేది వరకు టికెట్ ధరల పెంపు వర్తిస్తుందని తెలిపింది. అలాగే 22వ తేదీన అర్థరాత్రి 1 గంటకు బెన్ఫిట్ షోలకు అనుమతులిచ్చింది. రాష్ట్రంలోని పరిమిత థియేటర్లలో మాత్రమే సలార్ బెన్ఫిట్ షోకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 20 థియేటర్లలో మాత్రమే బెనిఫిట్ షోకు అవకాశం కల్పించింది. అలాగే ఆరో ఆట ప్రదర్శనకు ప్రభుత్వం ఓకే చెప్పిన ప్రభుత్వం.. రిలీజ్ రోజు ఉదయం 4 గంటల నుంచే సలార్ షోలు వేసుకోవచ్చని తెలిపింది. కాగా.. టికెట్ ధరల పెంపు, బెన్ఫిట్ షో, అదనపు షోలకు అనుమతి కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అల్లు అర్జున్ 'పుష్ప'గాడికి రెండేళ్లు.. ఆశ్చర్యం కలిగించే రికార్డ్స్
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప' 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం సుమారు రూ. 170 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. బన్నీ- రష్మిక మందన్నల యాక్టింగ్ ఈ సినిమా విజయానికి బలమైన కారణమైతే.. సినిమా చివరి భాగంలో ఫహద్ ఫాజిల్ పాత్ర హైలెట్గా నిలిచింది. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమా కోసం 'ఉ అంటావా... ఊ ఊ అంటావా..' పాటలో ప్రత్యేకంగా కనిపించింది. ఇలా పుష్ప సినిమాకు ఎన్నో అదనపు ఆకర్షణలతో విడుదలై.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 373 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. నేటికి (డిసెంబర్ 17) ఈ సినిమా విడదులై రెండు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులతో పాటు పలు ఆసక్తకరమైన విషయాలు మరోసారి గుర్తుచేసుకుందాం. ► అల్లు అర్జున్కు పుష్ప తొలి పాన్ ఇండియా సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు. ► ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా నిడివి 2: 59 గంటలు. 'పుష్ప' అత్యధిక భాగం అడవుల్లోనే షూట్ చేశారు. అందుకోసం మారేడుమిల్లి అడవులను ఎంపిక చేసుకున్నారు. ► అల్లు అర్జున్ 'పుష్ప' గెటప్లో రెడీ అయ్యేందుకు మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదని బన్నీ చెప్పాడు. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి సెట్కు వెళ్లితే.. ఉదయం 5 నుంచి 7 వరకూ మేకప్ కోసమే సమయం పట్టేదట. షూటింగ్ పనులు పూర్తయ్యాక మేకప్ తీయడానికి 30 నిమిషాల సమయం పట్టేదని బన్నీ గతంలో చెప్పాడు. ► ఈ సినిమాలోని పాటలు అన్నీ కలిపి యూట్యూబ్లో 7బిలియన్ వ్యూస్ సాధించాయి. అంటే 700కోట్ల మంది వీక్షించారు. ఇండియాలో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా పుష్ప రికార్డుకెక్కింది. ► యూట్యూబ్ 'టాప్ 100 గ్లోబల్ సాంగ్స్' జాబితాలో 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!' పాట మొదటి స్థానంలో నిలవగా.. 'సామీ సామీ' పాట రెండో స్థానం దక్కించుకుంది. దాక్కో దాక్కో మేక 24వ స్థానంలో ఉంటే శ్రీవల్లి సాంగ్ 74వ ప్లేసులో నిలిచింది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట మాత్రం 97వ స్థానంలో నిలిచింది. ► 'ఆర్య'తో బన్నీకి సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్.. దాదాపు పదేళ్ల తర్వాత 'పుష్ప' కోసం మళ్లీ వాళ్లిద్దరూ ఈ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. ► ప్రపంచవ్యాప్తంగా పుష్ప రూ.373కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. ►ఓటీటీలోనూ 'పుష్ప' గాడు దుమ్ములేపాడు. 2022లో అమెజాన్ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్లోనూ పుష్పరాజ్ ఏమాత్రం తగ్గలేదు. 2022లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది. అప్పట్లో 10మిలియన్+ ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేసి ఇండియాలో పుష్పతో ఇన్స్టాగ్రామ్నే షేక్ చేశాడు. ► అవార్డుల విషయంలోనూ 'తగ్గేదేలే' అంటూ దూసుకుపోయాడు. ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ఏడు సైమా అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ► ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్- 2022 పుష్పకు దక్కింది ► పుష్ప సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్కు దక్కాయి. ► 7 ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డ్స్ను దక్కించుకున్న పుష్ప. -
సలార్ మొదటి టికెట్ కొన్న స్టార్ డైరెక్టర్.. ధర ఎంతో తెలుసా..?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటకే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సలార్ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్లైన్లో స్టార్ట్ అయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స్టార్ట్ కాలేదు. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టికెట్ ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మేకర్స్ కోరిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సింగిల్ థియేటర్ నుంచి మల్టీఫ్లెక్స్ వరకు టికెట్ ధరపై రూ. 100 పెంచాలని ప్రభుత్వాన్ని వారు కోరినట్లు సమాచారం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి ఆన్లైన్లోకి టికెట్లు అందుబాటులోకి వస్తాయిని తెలుస్తోంది. సలార్ టికెట్ కోసం రూ.10 వేలు సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్స్లలో సలార్ టీమ్ కొంచెం నెమ్మదిగానే ఉంది. ఇప్పుడిప్పుడే దూకుడు పెంచింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిని తెరపైకి తెచ్చింది మూవీ టీమ్.. ఇందులో భాగంగా సలార్ మొదటి టికెట్ను రాజమౌళి కొన్నారు. డార్లింగ్ సినిమా టికెట్ కోసం రూ. 10 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కు సంబంధించి ఉదయం 7గంటల ఆటకు టికెట్ను ఆయన కొన్నారని మైత్రి మేకర్స్ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. ఇండియా బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా మొదటి టికెట్ను రాజమౌళి కొన్నారని క్యాప్షన్ ఇచ్చింది. త్వరలో జక్కన్నతో ప్రభాస్,ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
సలార్ టికెట్ల ధరలు పెంపు.. టికెట్ ఎంతో తెలుసా?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటకే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సలార్ రన్టైమ్ 2గంటల 55నిమిషాలు ఉన్న ఈ మూవీ టికెట్ రేట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో టికెట్ రేట్లు పెంచుకునేందుకే కాకుండా అదనపు షోస్ అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మేకర్స్ రిక్వెస్ట్ చేసిందట.. అంతే కాకుండా సలార్ విడుదల రోజున సింగిల్ థియేటర్లో 6 షోస్లు ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు మరో రూ. 100 పెంచుకునేందుకు అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సింగిల్ స్క్రీన్లోనే ఒక టికెట్ ధర సుమారు రూ. 300 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అదే మల్టీప్లెక్స్ల్లో అయితే రూ. 400 పైగానే ఉండనుంది. సలార్ విడుదల రోజున అంటే (డిసెంబర్ 22న) కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంటకే (1:00 AM) మొదటి షో పడనుంది. మిగిలిన అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటలకు మొదటి షో ప్రారంభం కానుంది. డిసెంబర్ 15న సలార్ టికెట్ల అమ్మకాలు ప్రారంభం అవుతాయని గతంలోనే ఆ చిత్ర మేకర్స్ ప్రకటించారు. కానీ తెలంగాణలోని నైజాం రైట్స్ కొనుగోలు చేసిన మైత్రి మేకర్స్ అభ్యర్థనపై ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనను బట్టి ఆన్లైన్లో టికెట్ల ఓపెన్ అవుతాయని సమాచారం. ప్రభుత్వం నుంచి సలార్కు అనుకూలంగా ప్రకటన వస్తే RRR సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రికార్డును బీట్ చేయడం దాదాపు ఖాయం అని చెప్పవచ్చు. RRR సినిమాకు మొదటిరోజు రూ. 240 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఓవర్సీస్లలో ఇప్పటికే సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అమెరికా, యూకే వంటి నగరాల్లో సలార్ దూసుకుపోతుంది. ఇప్పటికే అక్కడ దాదాపు 25 వేలకు పైగానే టికెట్లు అమ్ముడబోయాయి. దీంతో సినిమా విడుదలకు ముందే సుమారు రూ. 9 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. #Salaar Nizam: Mythri has applied for a ticket price hike of Rs 100 in both single screens and multiplexes, along with 6th show screening permission. Prices for #SalaarCeaseFire , if the government approves Rs 100/- hike requested by Mythri: - Multiplexes: Max 413/-… pic.twitter.com/ywUpbrXRpp — Movies4u Official (@Movies4u_Officl) December 14, 2023 #SalaarCeaseFire 𝐊𝐞𝐫𝐚𝐥𝐚 Bookings Open From Today at 6:49 PM💥 Be the first to reserve your seats!#SalaarCeaseFireOnDec22 ⚡️#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur… pic.twitter.com/ywCepDNoZf — Hombale Films (@hombalefilms) December 15, 2023 The gates of ‘Khansaar’ are about to open! 7 DAYS to go for #SalaarCeaseFire 💥#SalaarCeaseFireOnDec22 Nizam Release by @MythriOfficial#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/tR4XsOnR6A — Mythri Movie Makers (@MythriOfficial) December 15, 2023 -
కోలీవుడ్ స్టార్ హీరో మూవీ.. నిర్మించనున్న టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ప్రస్తుత 'విడాయమర్చి' చిత్రంతో నటిస్తున్నారు. ఇటీవలే అజర్బైజాన్లో మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. కొద్ది రోజుల క్రితమే అజిత్ ఇండియాకు చేరుకున్నారు. అయితే సీన్స్ కోసం టీమ్ మరోసారి అదే లొకేషన్కి వెళ్లినున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం యూఏఈకి చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అజిత్ తన 63వ చిత్రం కోసం మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాత గోపీచంద్ మలినేని సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. -
రవితేజ సినిమాకు ఇలాంటి కష్టాలా.. నో ఛాన్స్
డాన్ శీను, బలుపు, క్రాక్ ఈ హిట్ సినిమాలన్నీ రవితేజ - గోపీచంద్ మలినేని కలయికలో వచ్చినవే... ఇంతటి క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఆగుతారా..? అందుకే ఈ కాంబోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు రవితేజ ఫ్యాన్స్.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్తోపాటు ఇందుజ రవిచంద్రన్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారని కూడా మేకర్స్ ప్రకటించారు. కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకు గౌరవ దర్శకత్వం వహిస్తే... ఆ సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్నిచ్చారు. ఇలా ఎంతో క్రేజీగా ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్పై పలు రూమర్స్ వస్తున్నాయి. బడ్జెట్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని.. ఈ విషయంలో మేకర్స్ మరోసారి లెక్కలు వేస్తున్నారట. మార్కెట్ లెక్కలకి, సినిమాకి అనుకున్న బడ్జట్కు మధ్య చాలా డిఫరెన్స్ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ను తాత్కాలికంగా ఆపేయాలని చూస్తున్నారట. సమాజంలో జరిగిన నిజ జీవితాల సంఘటనలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ అవుతుందని టాక్. దీంతో రిస్క్ చేయడం ఎదుకని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. రవితేజ ఇప్పటికే వరుసగా రెండు చిత్రాలు రూ. 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ను దాటిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ లాంటి బిగ్ ప్రొడక్షన్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ సినిమాకు మార్కెట్,బడ్జెట్ కష్టాలు అనేవి ఉండకపోవచ్చు. -
అల్లు అర్జున్పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని జాతీయస్థాయిలో అవార్డులను పొందాయి. ఈ ఘనతను పురస్కరించుకుని మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాదులో గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. టాలీవుడ్లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వించాల్సిన విషయం. కానీ.. ఇలాంటి సందర్భంలో చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రావడం లేదు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదు? బన్నీకి జాతీయ అవార్డు వస్తే, అది సినీ పరిశ్రమలోని నటీనటులందరికీ గర్వకారణం. రాజమౌళి మన తెలుగు సినిమాని ఆస్కార్కు తీసుకువెళితే అది తెలుగు పరిశ్రమకు, తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రకాష్ రాజ్ అన్నారు. దేవీశ్రీ ప్రసాద్కు జాతీయ అవార్డు రావడం తెలుగు సినిమా గర్వకారణం. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు ఎందుకంటే అల్లు అర్జున్ కష్టం అలాంటిది. తను మొదటి సినిమా చేస్తున్నప్పుడు అల్లు అరవింద్గారు బన్నీని ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లమంటే.. నేను ఇతర సినిమా షూటింగ్స్లో ఉన్నపుడు అల్లు అర్జున్ వచ్చి ట్రైపాయిడ్ కెమెరా దగ్గర కింద కూర్చుని నన్ను చూస్తున్న క్షణాలు నాకు గుర్తున్నాయి. తరువాత మేము గంగోత్రి చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో నేను తన నటన చూసి అల్లు అరవింద్తో 'దిస్ బోయ్ విల్ గ్రో' అన్నాను. నేను బన్నీలో ఉన్న ఆకలి చూశాను. బన్నీ ఈ రోజు ఉన్న చాలా మంది యువతకి ఒక ఉదాహరణగా నిలిచాడు. నువ్వు ఇప్పుడెలా ఉన్నావనేది కాదు.. నీలో సంకల్పం ఉంటే.. నీ కళ్ల ముందు కళలుంటే.. నువ్వు ధైర్యంగా కష్టపడితే ఈ రోజు బన్నీకి జాతీయ అవార్డు వచ్చింది. బన్నీకి జాతీయ అవార్డు వస్తే నా బిడ్డకి వచ్చినట్టు భావిసున్నా. నాకు మొదటిసారి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో తెలుగు సినిమా అంటే అక్కడివారు తక్కువగా చూసేవారు. కానీ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు తెలువారికి రావడం చాలా గర్వంగా ఉంది. మనకి అవార్డు వస్తేనే కాదు మనవాళ్లకి వస్తే కూడా మనకి వచ్చినట్టు. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు కానీ ఇదెందుకు మన సినీ పెద్దలకి రావట్లేదు? మన సినిమాతో బౌండరీస్ దాటేస్తున్న సమయంలో అవతలి వాళ్లకంటే మన వాళ్లని మనం గౌరవించకపోతే ఎలా..? అంటూ ప్రకాష్ రాజ్ సినీ పెద్దలను ప్రశ్నించారు. -
జాతీయ అవార్డ్ విన్నర్స్కు మైత్రి మూవీ మేకర్స్ పార్టీ.. పాల్గొన్న అల్లు అర్జున్ (ఫొటోలు)
-
20 ఏళ్లుగా అంటున్న మాట నిజమైంది: బన్నీ ఆసక్తికర కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు పుష్ప ది రైజ్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం వరించింది. సుకుమార్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కించిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే జాతీయ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులకు మైత్రీ మూవీ మేకర్స్ విందు ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి హాజరైన బన్నీ అవార్డ్ రావడం పట్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు. జాతీయ అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. నా మిత్రుడు దేవిశ్రీతో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటనకు గుర్తింపు వచ్చేందుకు సుకుమార్ ఎంతో శ్రమించారని బన్నీ వెల్లడించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ..'బాలీవుడ్కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్కు చాలా సార్లు చెప్పా. కానీ ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు వస్తా అనేవాడు. అలాంటిది మేమిద్దరం ఒకేసారి పుష్ప సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టాం. అక్కడా సక్సెస్ అందుకున్నాం. 20 ఏళ్లుగా దేవితో నేను అంటున్న మాట నిజమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. జాతీయ అవార్డులకు మా పేర్లు ప్రకటించినప్పుడు నాన్న చాలా సంతోషించారు. ఇద్దరు కుమారులకు జాతీయ అవార్డులు వచ్చినట్లు ఉందన్నారు. ప్రిన్సిపల్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోలేని మేము.. ప్రెసిడెంట్ దగ్గర మెడల్స్ తీసుకుంటామని అనుకున్నావా?’ అని ఆయన్ని అడిగా' అని నవ్వుతూ అన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే.. ఏరా? ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి టీసీలు తీసుకోవడమే తప్పా? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి మెడల్ తీసుకుంటుంటే నాకెంతో బాధగా ఉందో తెలుసా? అని అన్నారు. డైరెక్టర్ సుకుమార్ గురించి మాట్లాడుతూ..' జీవితంలోని ప్రతి దశలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటూనే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ అవార్డు రావాలని సుకుమార్ నాకంటే ఎక్కువగా కోరుకున్నారు. ఆయనే అఛీవర్.. నేను కేవలం అఛీవ్మెంట్ మాత్రమే.' అని అల్లు అర్జున్ తెలిపారు. -
దిల్ రాజుతో మూడు.. ‘మైత్రీ’లో రెండు... రౌడీ హీరో జోరు!
విజయ్ దేవరకొండ వరసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. మొన్నటి వరకు..సంవత్సరానికి ఓ సినిమాతో పలకరించేవాడు.వచ్చే ఏడాది నుంచి..రెండు సినిమాలతో అలరించేలా ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్లతో పాటు,బిగ్ బ్యానర్లలో మూవీస్ చేయటానికి పచ్చజెండా ఊపాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు,గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు.పరుశురామ్ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈయన బ్యానర్లోనే మరో రెండు మూవీస్కి కూడా సైన్ చేసాడట విజయ్. ఓ మూవీని రవి కుమార్ కొల్లా అనే దర్శకుడు రూపొందిస్తే,మరో మూవీని ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి దిల్ రాజు బ్యానర్లో మూడు సినిమాలు చేస్తు..మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో మరో రెండు సినిమాలు చేయటానికి కమిట్ అయ్యాడని సమాచారం.అలాగే ఓ మలయాళ దర్శకుడు కూడా రౌడీ హీరోకి స్టోరీ వినిపించి ఒకే చేయించుకున్నాడట.ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు చేయబోతున్నాడు .వెంట వెంటనే థియేటర్లలో సందడి చేస్తూ..అభిమానులను హ్యాపీగా ఉంచాలని ఫిక్స్ అయ్యాడట విజయ్. -
విజయ్- సమంత 'ఖుషి'.. టైటిల్ సాంగ్ వచ్చేసింది!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. లైగర్ డిజాస్టర్ తర్వాత సూపర్ హిట్ కావడంతో విజయ్ సైతం ఎమోషనల్ అయ్యారు. శివనిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి మూడో రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్లను మార్కును దాటేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. (ఇది చదవండి: తగ్గేదేలే అంటున్న ఖుషి.. మూడో రోజు అదే జోరు!) 'ఖుషి.. నువ్వు కనబడితే.. ఖుషి.. నీ మటా వినపడితే..' అంటూ సాగే సాంగ్ను రిలీజ్ చేశారు. కాగా.. కశ్మీర్ బ్యాప్ డ్రాప్లో తెరకెక్కించి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. మూవీ హిట్ కావడంతో కుటుంబ సమేతంగా వెళ్లి యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ కూడా కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?) -
నా మీద, నా సినిమాపైన దాడులు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ అందుకున్న హిట్ ఖుషి... ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 70 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో ఖుషి టీమ్ ఫుల్ జోష్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఖుషి సక్సెస్ మీట్ను వైజాగ్ లో నిర్వహించారు. అక్కడ విజయ్ పలు ఆసక్తకరమైన విషయాలను షేర్ చేశాడు. (ఇదీ చదవండి: ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా పెళ్లి.. ఫోటోలు వైరల్) తన మీద, ఖుషి సినిమాపైన సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయని ఆయన సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ' కొందరు డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నో ఫేక్ రేటింగ్స్ వచ్చాయి.. ముఖ్యంగా యూట్యూబ్ ఫేక్ రివ్యూలనూ దాటుకుని ఖుషి సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. అందుకు కారణం నా అభిమానులుగా ఉన్న మీ ప్రేమే... మీరిచ్చే ఈ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు వాటి గురించి చర్చించి నిరుత్సాహపరచడం ఇష్టం లేదు. వాటి సంగతి మరో రోజు చూసుకుందాం. ఈ సినిమాతో మీ ముఖాల్లో నవ్వులు చూడాలనుకునే నా కోరిక తీరింది. (ఇదీ చదవండి: ఫ్యాన్స్కు కోటి విరాళం.. ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్) ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి. సమాజంలో గౌరవం కావాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే నేను ఎప్పుడూ పనిచేస్తుంటా. కానీ, ఇప్పుటి నుంచి కొన్ని నిర్ణయాలు మార్చుకుంటున్నా... మీ మీకోసం పనిచేయాలని అనుకుంటున్నా. నాతో పాటుగా మీరూ ఆనందంగా ఉండాలి. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) పది రోజుల్లో అందిస్తా. ఇక నుంచి మనమంతా దేవర ఫ్యామిలీ. నా ఆనందంలో మీరు ఉన్నారు. అలాంటప్పుడు నా సంపాదనలో కొంత భాగాన్ని మీతో పంచుకోకపోతే వేస్ట్.' అని విజయ్ పేర్కొన్నారు. త్వరలో తన అభిమానుల కోసం మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. -
ఫ్యాన్స్కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్
అర్జున్ రెడ్డితో స్టార్డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తర్వాత తన పంతాను మార్చి ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్కు నచ్చే కథలను ఎంచుకుంటూ అభిమానులను మెప్పిస్తున్నాడు. గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ సరైన విజయం అందుకోలేదు. గత ఏడాది విడుదలైన 'లైగర్' ఘోర పరాజయం చూసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా విడుదలైన 'ఖుషి'తో బ్లాక్బస్టర్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా పెళ్లి.. శ్రావణి రెడ్డి వివరాలు ఇవే) సమంత కథానాయికగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల రోజు డివైడ్ టాక్ వచ్చినా తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో భారీగా కలెక్షన్స్ వైపు దూసుకుపోతుంది. 'ఖుషి' సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న విజయ్, అభిమానులకు కోటి రూపాయల సాయంతో తన ఉదారతను చాటుకున్నాడు. దీంతో పలువురు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మూడు రోజుల్లోనే రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు 'ఖుషి' మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సినిమా ప్రమోషన్ భాగంగా వైజాగ్ చేరుకున్నాడు విజయ్. తన సక్సెస్లో అభిమానులను కూడా భాగం చేయడానికి తన రెమ్యూనిరేషన్ నుంచి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు గాను మొత్తం కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ అక్కడ ప్రకటించాడు. దీంతో ఆయన అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు. పదిరోజుల్లొ 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయల చొప్పున తానే స్వయంగా అందిస్తానని విజయ్ అన్నారు. ఇలా దరఖాస్తు చేసుకోండి 'నా సక్సెస్లో, నా హ్యాపీనెస్లో మీరు భాగం పంచుకోవాలి. నా సంపాదనను మీతో షేర్ చేసుకోలేకపోతే అంతా వేస్ట్. మీరంతా నా ఫ్యామిలీనే.. దేవర ఫ్యామిలీ, స్ప్రెడింగ్ ఖుషి అని సోషల్ మీడియాలో ఒక అప్లికేషన్ ఫార్మ్ పెడతా. ఇది ఎలా చెయ్యాలో తెలియదు కానీ, అవసరం ఉన్నవాళ్లకి ఏ హెల్ప్ చేసినా నాకు సంతోషమే. మీరు ఉంటున్న ఇంటి రెంట్, పిల్లల స్కూల్ ఫీజులు ఇలా కొంతైనా నా సాయం ఉండాలనుకుంటున్నా.. నా సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరాలు తెలుపుతా.. ఆర్థికసాయం కావాల్సిన వారు అభిమానులతో పాటు ఎవరైనా దరఖాస్తు చేసుకోండి.. వాటిలో 100 ఫ్యామిలీలను ఎంపిక చేసుకొని సరిగ్గా పదిరోజుల్లొ ఈ మొత్తాన్ని అందజేస్తా. అప్పుడే నాకు ఖుషి సక్సెస్ సంపూర్తి అవుతుంది.' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. దీంతో విజయ్ను సోషల్మీడియా ద్వారా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. TRULY #SpreadingKushi ❤️ Big hearted @TheDeverakonda announces the distribution of 1 CRORE RUPEES to 100 families to share his #Kushi ❤️ Watch the blockbuster celebrations live now! - https://t.co/mgpbwu8tQp#BlockbusterKushi 🩷 @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic… pic.twitter.com/FmyKqse5uC — Mythri Movie Makers (@MythriOfficial) September 4, 2023 -
ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్
బేబీ సినిమా సక్సెస్తో ఆనంద్ దేవరకొండకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఆనంద్ మార్కెట్ కొంతమేరకు పెరిగింది. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాతో ఒక చిత్రానికి ఆనంద్ సంతకం చేశాడు. ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ టీమ్ నుంచి ఒక కొత్త డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు హీరోయిన్గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’తో తన జర్నీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఇది విడుదల కాకముందే ఈ బ్యూటీకి మరో క్రేజీ సినిమాను కైవసం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్లోకి ఆనంద్ దేవరకొండతో పాటు ప్రగతి శ్రీవాస్తవ కూడా అడుగుపెట్టబోతుంది. (ఇదీ చదవండి: అతను అలా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి) బేబీ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆనంద్ దేవరకొండ మరింత జాగ్రత్త పడుతున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్తో కూడా ఆయన డీల్ కుదుర్చుకున్నాడు. ఆనంద్ జ్ఞానవేల్ రాజా, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి రెండు పెద్ద ప్రొడక్షన్స్లలో ఆనంద్కు ఒకేసారి ఛాన్స్ దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. కానీ బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యతో ఆనంద్ మరో సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని బట్టి చూస్తే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఒక సినిమాకు హీరోయిన్గా ప్రగతి శ్రీవాస్తవ ఎంపిక దాదాపు జరిగిపోయింది. ఇక మిగిలి ఉండేది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే ... అందులోనైనా ఆమెకు అవకాశం దక్కుతుందేమో వేచి చూడాలి. బేబీ సినిమా హిట్ కావడం వెనుక వైష్ణవి చైతన్య నటన ఎంతో బలం చేకూర్చింది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. -
అనిరుద్ గురించి విజయ్ దేవరకొండ వైరల్ కామెంట్స్
రౌడీ హీరోగా ముద్ర వేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం ఖుషి. సమంత కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఎలమంచిలి కలిసి నిర్మించారు. శివ నిర్వాణ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మురళి చాయాగ్రహణంను, హెశాన్ అబ్దుల్ మహబ్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ ఒకటో తేదీ విడుదల కానుంది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో చిరు ఓడిపోవచ్చేమో కానీ సినిమాల్లో ఎప్పటికీ 'మగధీరుడే') దీన్ని తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ అధినేత ఎన్వీ ప్రసాద్, కేరళలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముఖేష్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆర్బీ చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్మాత ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన చిత్రాలు 90 శాతం విజయం సాధించాయన్నారు. ఖుషి చిత్రానికి తమిళనాడులో మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాల కాలం నుంచి తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఖుషీ చిత్రం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. నటి సమంతతో కలిసి ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అన్నారు. తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారని, అయితే జాతీయస్థాయిలో వెలిగిపోతున్న ఒకే ఒక్క సూపర్స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ అని పేర్కొన్నారు. ఆయన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోవాలనిపిస్తోందన్నారు. అనిరుధ్ సంగీత దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల్సిందని, అది మిస్ అయిందని, త్వరలోనే తాము కలిసి పనిచేస్తామని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. -
ఖుషి ఈవెంట్లో మీడియా, మహిళలపై దౌర్జన్యం.. లోనికి రాన్వివకుండా..
విజయ్ దేవరకొండ, సమంత తొలిసారి జంటగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే సాంగ్స్తో సినిమాకు కావాల్సినంత హైప్ రాగా అప్పుడే సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. మంగళవారం నాడు హైదరాబాద్లోని హైటెక్స్లోకి హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్లో ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో పోలీసులు, మైత్రీన ఇర్వాహకులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లు, పాస్లు ఉన్నా నో ఎంట్రీ ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ కోసం అభిమానులు, సంగీత ప్రియులు ఎగబడి మరీ టికెట్లు కొనుకున్నాను. తీరా ఈవెంట్కు వచ్చిన వారిలో చాలామందిని పోలీసులు రోడ్డుపైనే అడ్డగించారు. డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కున్నామని, చాలాదూరం నుంచి వస్తున్నామని మొత్తుకున్నా సరే నోవాటెల్ సిబ్బంది, పోలీసులు వారిని లోపలకు వెళ్లనివ్వలేదు. మహిళలు, పిల్లలు, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరినీ గేటు బయటకు నెట్టివేశారు. ఎలాగోలా గేటు దాటి లోనికి చేరుకున్నవారితో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అమర్యాదగా మాట్లాడిన మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఈవెంట్ కవరేజ్ కోసం వచ్చామని మీడియావాళ్లు చెప్పినా వినిపించుకోలేదు. విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ సహా ఇతర పీఆర్వోలను సైతం బయటకు నెట్టివేశారు. విఐపి, వీవీఐపీ పాసులు ఉన్నా కూడా అందర్నీ బయట నిలబెట్టారు. అప్పుడే అక్కడికి చేరుకున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు సైతం లోపల చాలామంది మీడియావాళ్లు ఉన్నారు, మీరు రాకపోతే వచ్చే నష్టం ఏమీ లేదంటూ అమర్యాదగా మాట్లాడారు. వారికి సంబంధించినవారిని మాత్రం యధేచ్చగా లోపలకు తీసుకెళ్లారు. ప్లానింగ్ లేకుండా ఈవెంట పూర్తిగా ప్లానింగ్ లేకుండా ఈవెంట్ చేశారు. ఏడు గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం ఐదు గంటలకే లోపల స్టేడియం నింపేశారు. ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా అడ్డంగా ఆపేశారు. సింగర్ చిన్మయి కూడా లోపలికి రావడానికి చాలా సేపు పట్టింది ఆమెను కూడా బయట పోలీసులు ఆపేశారు. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్లు చిన్న పని మీద బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే ఇలాంటి పరిస్థితి రాకపోయేదని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తమన్నా ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు! -
ఆగ్రహంతో బన్నీ ఫ్యాన్స్.. మైత్రి మూవీస్పై ఫైర్.. నేడు ధర్నా చేసే ఛాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. 2021లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అందువల్ల పుష్ప 2 : ది రైజ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందువల్ల ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మొదటి భాగం కంటే రెండో పార్ట్ మరింత ఆసక్తికరంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. రాయలేని భాషలో కామెంట్లు ) ఈ మధ్య టాలీవుడ్ హీరోలకు చెందిన సినిమా అప్డేట్లు వస్తున్నా.. పుష్ప టీమ్ నుంచి మాత్రం ఎలాంటివి రాకపోవడంతో బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్తో పాటు వేర్ ఈజ్ పుష్ప వీడియో గ్లింప్స్ను మాత్రమే ఇచ్చారు. ఇంతకు మించి మరే అప్డేట్స్ రాలేదు.ఇవి కూడా వచ్చి ఇప్పటికి సుమారు మూడు నెలలు దాటిపోయింది. దీంతో బన్నీ అభిమానులు మరోసారి సోషల్మీడియాలో మోత మోగిస్తున్నారు. హ్యాష్ ట్యాగ్తో వరుస ట్వీట్లు 'పుష్ప టీమ్ మేలుకోవాలి' అంటూ '#WakeUpTeamPushpa' హ్యాష్ ట్యాగ్తో వరుస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. ఇతర హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వస్తూనే ఉన్నాయంటూ.. పుష్ప 2 అప్డేట్లు వెంటనే ఇవ్వాల్సిందేనని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ వార్ మొదలుపెట్టారు. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలకు ఈ హ్యాష్ట్యాగ్లను కలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. నేడు బన్నీ ఫ్యాన్స్ అందరూ మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ వద్దకు భారీగా తరలిరావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పుష్ప 2 అప్డేట్ కోసం వాళ్లు ధర్నా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. Ore @PushpaMovie Team @AIAFA_vizag re Post Ore Update Ivvandi Ra #WakeUpTeamPushpa pic.twitter.com/B5BtFvvzI3 — AA- SUNNY DJ- YS JAGUN (@Ikunasanyasirao) August 5, 2023 Cheviti vaadi mundu sankham oodinattu untadi 😂😭😂😭😭#WakeUpTeamPushpa #PushpaTheRule pic.twitter.com/6seh3THeOc — Naniᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ🪓 (@DHF_AA_Nani) August 5, 2023 We Want Pushpa 2 Update..#WakeUpTeamPushpa pic.twitter.com/xMkpPa4K3K — All Anantapur Allu Arjun Fans&Welfare Association (@AA_ATPFWA) August 5, 2023 #WakeUpTeamPushpa Most neglegence makers = @MythriOfficial pic.twitter.com/npRm2L4UiC — 𝕂𝕣𝕚𝕤𝕙𝕟🅰️🅰️ (@sAAi_krishnAA) August 5, 2023 Rey luchaa gaa @MythriOfficial @PushpaMovie Update ivvandi raa mundas#WakeUpTeamPushpapic.twitter.com/ql7nCCyeZk — Black Cat (@BunnyFan222) August 5, 2023 Do we need to repeat this beast mode @MythriOfficial ? 💥🧎#WakeUpTeamPushpa @PushpaMovie#Pushpa2TheRule pic.twitter.com/XgUXoMPvik — Allu Arjun TFC™ (@AlluArjunTFC) August 5, 2023 It has been more than 4 months and not a single update has been provided after bday @MythriOfficial bsdk@PushpaMovie #Pushpa2TheRule#WakeUpTeamPushpa pic.twitter.com/fWnGGlPVkt — 😈Draco😈™ (@dev66612) August 5, 2023 PR Sarath - Nidra moham gadu Producer Mythri - Nidra Moham gaadu Director Sukku - Jiddu gaadu Hero gaaru - Tour lu thiriguthaaru Ellandarani barinchadam 😴😴🙏#Pushpa2TheRule Last movie release ayyi 20 months , P2 not even 35% shoot completed @PushpaMovie 🙏#WakeUpTeamPushpa pic.twitter.com/nnfVvZOFgR — Hemanth Kiara (@ursHemanthRKO) August 5, 2023 -
బ్రో నైజాం రైట్స్ క్లోజ్.. ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఇచ్చిన నిర్మాతలు
పవన్ కల్యాణ్ - మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా రిలీజ్కు సిద్దంగా ఉంది. తాజాగా ఈ సినిమా నైజాం హక్కుల పంచాయతీకి శుభం కార్డు పడింది. నైజాం హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తీసుకుంది. పీపుల్స్ మీడియా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇవ్వగా సముద్రఖని దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) ఈ చిత్రాన్ని నైజాం ఏరియా కోసం రూ.32 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన మైత్రి వారు కొన్నారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే.. అదనంగా జీఎస్టీ ఉంటుంది కాబట్టి నైజాంలో బ్రో సినిమా నుంచి మైత్రీ డిస్ట్రిబ్యూటర్ సంస్థకు రూ. 38 కోట్ల వరకు షేర్ రావాల్సి వుంటుంది. ఈమేరకు వస్తేనే సేఫ్ జోన్లో ఉంటారు.. లేదంటే దిల్ రాజు అంచనాలే నిజం అవుతాయి. నైజాంలో ఎంతో పట్టున్న దిల్ రాజు ఇంత భారీ ధరకు 'బ్రో'ని కొనేందుకు ముందుకు రాలేదు. ఆయన సుమారు రూ. 30 కోట్ల వరకు డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారని టాక్. నైజాం హక్కులను రూ. 35 కోట్లకు ఇవ్వాలని పీపుల్స్ మీడియా ప్రయత్నించినా ఉపయోగం లేదు. చివరకు రూ.32 కోట్లతో మైత్రి వారు డీల్ క్లోజ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. (ఇదీ చదవండి: దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..) ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఈ నెల 28న థియేటర్లలోకి బ్రో సినిమా వస్తోంది. బ్రో మూవీ రన్ టైం విషయంలోనూ కొంతమేరకు నిరాశే కానుంది. ఈ సినిమా కేవలం 130 నిమిషాలు రన్ టైం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే పవన్ ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఎదురైనట్లే. అంటే కేవలం రెండు గంటల పది నిమిషాలతో మాత్రమే బ్రో రానున్నాడు. స్టార్ హీరోల సినిమా అంటేనే రెండున్నర గంటలకు పైగానే నిడివి ఉండేలా ప్లాన్ చేస్తారు డైరెక్టర్లు.. అలాంటిది మల్టీస్టారర్ సినిమాకు ఇలా తక్కువ రన్ టైమ్ ఉంటే మూవీపై ఎఫెక్ట్ చూపుతుందని నెటిజన్స్ తెలుపుతున్నారు. ఏదేమైనా జులై 28న అసలైన బొమ్మ ఎవరికి కనిపిస్తుందో చూడాలి. -
మలయాళ ఇండస్ట్రీకి మైత్రీ మూవీ మేకర్స్, టొవినో థామస్ హీరోగా..
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలతో పలు బ్లాక్ బస్టర్లను అందించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మలయాళంలో అడుగుపెట్టింది. తొలి ప్రాజెక్ట్గా ‘గాడ్ స్పీడ్’ అనే బ్యానర్తో కలిసి ‘నడికర్ తిలగం’ సినిమాకి శ్రీకారం చుట్టారు. టొవినో థామస్ హీరోగా లాల్ జూనియర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ యర్నేని, వై. రవిశంకర్, అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం కొచ్చిలోప్రారంభమైంది. ‘‘టొవినో థామస్ ఈ చిత్రంలో అనేక సవాళ్లతో కూడిన సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నారు. బుధవారమే రెగ్యులర్ షూటింగ్ప్రారంభించాం’’ అన్నారు. భావన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆల్బీ, సంగీతం: యక్జాన్ గారి పెరీరా, నేహా నాయర్. -
హనుకి గ్రీన్ సిగ్నల్?
ప్రస్తుతం ‘సలార్’, ప్రా జెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆ సినిమా చిత్రీకరణలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కొత్త సినిమాల కోసం కథలు వింటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగా దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన ఓ కథ ప్రభాస్కు నచ్చిందని, ఈ కథకు ప్రభాస్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో ఈ స్క్రిప్ట్కు హను రాఘవపూడి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. అంతేకాదు.. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం ‘రాజా డీలక్స్’ షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న థియేటర్స్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
విజయ్, సామ్ల 'ఖుషీ' ఫస్ట్ సింగిల్కు ముహూర్తం రెడీ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇది వరకే విడుదలైన ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్లకి మాంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ను వదిలారు. ఖుషీ ఫస్ట్ సింగిల్ను మే9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు పోస్టర్ను వదిలారు.కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Musical blast begins with the first single of #Kushi on May 9th❤️🔥 In Telugu, Hindi, Tamil, Kannada & Malayalam ❤️#NaRojaaNuvve#TuMeriRoja#EnRojaaNeeye#NannaRojaNeene@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi @saregamasouth pic.twitter.com/1kSZou8xn1 — Mythri Movie Makers (@MythriOfficial) May 4, 2023 -
ఊహించని స్థాయిలో ప్రభాస్ రెమ్యూనరేషన్!
-
మైత్రీ మూవీ మేకర్స్కు రూ.700 కోట్ల విదేశి పెట్టుబడులు..!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పెట్టుబడులపై ఆదాయపన్ను శాఖ కీలక సమాచారం రాబట్టింది. మైత్రీ సంస్ద లోకి రూ.700 కోట్ల విదేశి పెట్టుబడులు వచ్చినట్లు గుర్తించింది. ఇవి తొలుత ముంబై బేస్డ్ కంపెనీకి బదిలీ అయినట్లుగా నిర్ధరించింది. ఆ తర్వాత ఈ డబ్బును ఏడు కంపెనీలకు తరలించినట్లు ఐటీ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. వాటి నుంచి మైత్రీకి పెట్టుబడుల రూపంలో వచ్చినట్లు ఐడెంటిఫై చేసినట్లు పేర్కొన్నారు. హవాలా ద్వారా బాలీవుడ్ దర్శకుడికి మైత్రీ సంస్థ రూ.150కోట్ల చెల్లించినట్లు వెల్లడించారు. తాజాగా ఈ సంస్థ తీస్తోన్న ఓ సీక్వెల్ మూవీలో హీరోకు సైతం హవాలా రూపంలోనే పేమెంట్స్ ఇచ్చినట్లు సమాచారం. మైత్రీ సంస్థ గత రెండేళ్లలో ఇద్దరు బడా హీరోలకు సైతం అనుమానాస్పద రీతిలో చెల్లింపులు జరిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే హీరోల ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ హీరోలను విచారణ నిమిత్తం ముంబైకి పిలిచే అవాకశం ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. చదవండి: రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయే బిడ్డ ఎవరంటే? -
ఐటీ సోదాలు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతకు అస్వస్థత
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయననను కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సాయంత్రం లోగా డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా మైత్రీ మూవీ ఆఫీస్, నిర్మాతల ఇళ్లతో పాటు డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా తీసుకోవడం, వాటికి సంబంధించి పన్నుల చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఈ సోదా లు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఐటీ రైట్స్ నేపథ్యంలో నిర్మాత ఎర్నేని నవీన్ ఆందోళనకు గురైనట్లు సమాచారం. 2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం పుష్ప2తో పాటు మరికొన్ని సినిమాలను నిర్మిస్తోంది. -
రెండో రోజు ఐటీ సోదాలు.. పుష్ప-2 సినిమాపై ఎఫెక్ట్!
అక్రమమార్గాల్లో పెట్టుబడులు తీసుకోవడం, పన్ను ఎగవేత వంటి ఆరోపణలపై మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయం, ప్రముఖ సినీదర్శకుడు సుకుమార్ ఇళ్లలో గురువారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. భారీ బడ్జెట్ సినిమాల పెట్టుబడుల కోసం విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. జీఎస్టీ చెల్లింపులు సైతం సక్రమంగా చేయకపోవడంతోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలిసింది. నగరంలో బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన సోదాలు గురువారం కూడా కొనసాగాయి. జూబ్లీహిల్స్లోని కార్పొరేట్ ఆఫీస్తోపాటు సుకుమార్ ఇళ్లు, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతినిధులు రవిశంకర్, నవీన్ ఇళ్లలోనూ ఐటీ బృందాలు తనిఖీ చేసినట్టు తెలిసింది. ముంబైకి చెందిన ఓ ఫైనాన్సియర్ హవాలా మార్గంలో తెచ్చిన డబ్బులను సినిమారంగంలో పెట్టుబడులకు వినియోగిస్తున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ అధికారులు ముంబైలో తనిఖీ చేశారు. అందులో వెలుగుచూసిన కీలకపత్రాల ఆధారంగా హైదరాబాద్లోనూ ఈ సోదాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రెండురోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ముంబైకి చెందిన ఫైనాన్సియర్లతో చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ డీల్స్ సైతం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. టాలీవుడ్తోపాటు బాలీవుడ్లోనూ భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు హవాలా మార్గంలో రూ.వందల కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి దర్శకుడు సుకుమార్ పుష్ప–2 సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో ఈ సంస్థకు, సదరు డైరెక్టర్కు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సినిమాల్లో వచ్చిన లాభాలు, పన్నుల ఎగవేత ఫలితంగా మిగిల్చిన సొమ్ముతో హైదరాబాద్ నగర శివారుల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఐటీ అధికారుల బృందాలు ఇప్పటికే పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. రెండురోజుల తనిఖీల్లో లభించిన ఆధారాలను విశ్లేషించిన తర్వాత ఐటీ అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు
-
మైత్రి మూవీ మేకర్స్ పై రెండో రోజు ఐటీ సోదాలు
-
డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ దాడులు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఇల్లు, మైత్రి మూవీస్ కార్యాలయాల్లో ఆదాయపన్నుశాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా తీసుకోవడం, వాటికి సంబంధించి పన్నుల చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఈ సోదా లు చేపట్టినట్టు తెలిసింది. సదరు చిత్ర నిర్మాణ సంస్థ భారీ చిత్రాల నిర్మాణానికి అవసరమైన డబ్బులను విదేశాల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిందని, ఈ సొమ్ము రూ.500 కోట్లకుపైగా ఉండడంతో ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. జీఎస్టీ చెల్లింపుల్లోనూ అవకతవకలు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి డబ్బులు పెట్టుబడుల రూపంలో సేకరించడంతోపాటు, జీఎస్టీ చెల్లింపులలోనూ అవకతవకలు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. మైత్రి మూవీస్, డైరెక్టర్ సుకుమార్ల కాంబినేషన్లోనే పుష్ప–2 సినిమా తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే ఐటీ అధికారుల బృందాలు సుకుమార్ ఇల్లు, మైత్రి కార్యాలయాల్లో సోదాలు జరిపి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నట్టు తెలిసింది. (చదవండి: నందినికి పొగరు, పట్టుదల.. నాతో పోలికే లేదు: సంయుక్త మీనన్) మైత్రీ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు జనవరిలో విడుదలకు ముందు సమయంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఇప్పుడు మరోసారి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. స్వా«దీనం చేసుకున్న పత్రాలు, డాక్యుమెంట్స్ ఆధారంగా గురువారం విచారణ కోసం కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు సమాచారం. (చదవండి: సూర్యగ్రహణం రోజు గర్భిణీలు పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు..!) -
సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి తారక్ తన నివాసంలో గ్రాండ్ పార్టీని అరెంజ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ కూడా ఈ పార్టీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పార్టీకి సంబంధించిన పలు ఫోటోలను ఎన్టీఆర్ స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'నా ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్లతో ఈవ్నింగ్ సరదాగా గడిచింది. పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్ జేమ్స్'.. అంటూ తారక్ ట్వీట్ చేశారు. ఈ పార్టీకి రాజమౌళి, కొరటాల శివ,నిర్మాతలు శోభు యార్లగడ్డ, శిరీష్, మైత్రీ నవీన్ యెర్నేని, రవి శంకర్, దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డితో పాటు అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. అయితే ఆ పార్టీకి రామ్చరణ్ మాత్రం రాలేదు. రీసెంట్గానే మాల్దీవులు ట్రిప్ నుంచి హైదరాబాద్ వచ్చేసిన చరణ్ మరి తారక్ ఏర్పాటు చేసిన పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఇక గత నెలలో రామ్చరణ్ బర్త్డే పార్టీలో కూడా తారక్ కనిపించలేదు. తాజాగా సినీ ప్రముఖులకు ఎన్టీఆర్ విందు ఎందుకు ఇచ్చాడన్నది తెలియలేదు. ఈ పార్టీకి అమెజాన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రావడం మరింత సస్పెన్స్గా మారింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq — Jr NTR (@tarak9999) April 12, 2023 -
బన్నీ ఫ్యాన్స్కు సర్ప్రైజ్.. పుష్ప-2 బిగ్ అప్డేట్ అప్పుడే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప-2 బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 'పుష్ప: ది రూల్' సినిమాకు సంబంధించి బుధవారం ఉదయం 11.07గంటలకు క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్లుక్తో పాటు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట కాన్సెప్ట్ టీజర్ విడుదల చేసి.. ఆ తర్వాత బన్నీ బర్త్డే రోజు ఫస్ట్లుక్ అభిమానులతో పంచుకోనున్నారు. కాగా..సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప: ది రైజ్ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నేపథ్యంలో పుష్ప పార్ట్-1 లో చూపించారు. అదే తరహాలో తన చుట్టూ ఉన్న ప్రత్యర్థులు, శత్రువులను దాటుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పుష్పరాజ్ హవా ఏ విధంగా సాగించాడనేది పుష్ప-2లో తెరకెక్కిస్తున్నారు. And it begins ❤️🔥❤️🔥#PushpaTheRule Update tomorrow at 11:07 AM 🔥🔥 Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/cyi4Osfleq — Mythri Movie Makers (@MythriOfficial) April 4, 2023 -
ఆ రోజు నుంచే ఓటీటీలోకి రానున్న పుష్ప నటుడి కొత్త సినిమా!
పాన్ ఇండియా మూవీ పుష్పను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వస్తున్న తాజా చిత్రం సత్తిగాని రెండు ఎకరాలు. అమ్ముతడా? సస్తడా? అనేది ఉపశీర్షిక. పుష్ప ఫేమ్ జగదీశ్ భండారి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కొల్లూరు బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుంది. వెన్నెల కిశోర్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్కు ఇదే తొలి తెలుగు ఓటీటీ సినిమా కావడం విశేషం. తాజాగా ఓ సినిమా ఓటీటీ విడుదల తేదీ ప్రకటించారు. మార్చి 17 నుంచి ఈ మూవీ ఆహాలో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. మంచి కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తున్నవాళ్లు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న సత్తిగాని రెండు ఎకరాలు చూసి ఆస్వాదించేయండి. ఉన్నవే రెండు ఎకరాలు. అమ్మకపోతే గడవదు, అమ్మితే మింగుడుపడదు. సత్తి గాని రెండు ఎకరాలు, మార్చ్ 17 నుండి. మన ఆహా లో చూడండి..#SGREOnAHA@MythriOfficial @OG_Jagadeesh @vennelakishore @_mohanasree @DamaAneesha @RajTirandasu@BithiriSathiV6 @abhinavdanda #sureshkomminenii @jaymkrish pic.twitter.com/U5FNkAklpK— ahavideoin (@ahavideoIN) March 5, 2023 -
‘సీతారామం’ డైరెక్టర్తో సూర్య కొత్త సినిమా!
‘సీతారామం’ చిత్రంతో స్టార్ డైరెక్టర్ల లిస్ట్లో చేరాడు హను రాఘవపూడి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా గతేడాది ఆగస్ట్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. హను రాఘవపూడి టేకింగ్పై విమర్శకుల సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతటి భారీ విజయం తర్వాత హను రాఘవపూడి ఎలాంటి సినిమా తీయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు బడా నిర్మాతలు ఆయన ముందు క్యూ కడుతున్నారు. అయితే ఈ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడు మాత్రం ఆచి, తూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. తన తర్వాత చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తీయబోతున్నాడు. తొలుత ఈ చిత్రాన్ని నానితో ప్లాన్ చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్ తో తెరకెక్కించాలనుకున్నారట. అదీ సాధ్యం కాలేదు. దీంతో ఈ కథను తమిళ స్టార్ హీరో సూర్యకి వినిపించారు. అతను హను రాఘవపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. -
పుష్ప ఫేం జగదీశ్ ప్రధాన పాత్రలో ‘సత్తిగాని రెండు ఎకరాలు’
తొలి ఓటీటీ సంస్థ ఆహా ఎప్పటికప్పుడు డిజిటల్ ప్రియులను కొత్త చిత్రాలతో అలరిస్తూ ఉంటుంది. సరికొత్త కంటెంట్తో సినిమాలను రిలీజ్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో వైవిధ్యమైన చిత్రాన్ని ఆహా ఆడియన్స్ మందుకు తీసుకురాబోతోంది. పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘సత్తిగాని రెండు ఎకరాలు’ మూవీ ఆహా వేదికగా విడుదల కానుంది. దీనిపై తాజాగా అధికారిక పకటన ఇచ్చింది ఆహా. కొల్లూరు బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో పుష్ప ఫేమ్ జగదీస్ భండారి ఇప్పటి వరకు చేయనటువంటి ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. డార్క్ కామెడీ జోనర్లో ఎవరూ ఊహించని ట్విస్టులు, టర్న్లతో ఈ మూవీ ఆడియన్స్ని మెప్పించనుంది. వెన్నెల కిషోర్ సహా పలువురు నటీనటులు ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. క్రిస్మిస్ కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆహాలో రిలీజ్ చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆహా వెల్లడించింది. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ఎంజాయ్ చేసే మన ప్రేక్షకుల కోసం మా బ్యానర్ నుంచి తొలి తెలుగు ఓటీటీ సినిమాను తీసుకు రాబోతున్నాం. ఇది మాకెంతో థ్రిల్లింగ్గా ఉంది. మా ఆడియెన్స్ను ఆకట్టుకోవటానికి, వారికి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందించటానిఇకి, వారికి మరింత దగ్గర కావటానికి మరో మాధ్యమంలోకి అడుగు పెట్టటమనేది చాలా సంతోషంగా ఉంది. సత్తిగాని రెండు ఎకరాలు పవర్ఫుల్ స్టోరి లైన్తో పాటు అమేజింగ్ మ్యూజిక్తో మిళితమై ఉంది. అలాగే ఆహాతో కలిసి ఈ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. సత్తిగాని రెండు ఎకరాలు కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. Rendekaralu unte manchiga panta vesukoni bathakochu… Adhe rendekarala meedha verevalla kallu padithe..🙆🏻♂️?? An aha original film, Sathi Gaani Rendu Ekaralu. Ammuthada? Sasthada? 🙃#SGREonAHA. Coming Soon!@MythriOfficial @OG_Jagadeesh @vennelakishore @_mohanasree @DamaAneesha pic.twitter.com/lMBCV3Y6gX — ahavideoin (@ahavideoIN) February 6, 2023 -
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ప్రభాస్- హృతిక్ రోషన్ కాంబో
బాలీవుడ్లో ‘బ్యాంగ్ బ్యాంగ్’(2014), ‘వార్’ (2019), ‘పఠాన్’(2023) వంటి సూపర్ హిట్స్ సాధించారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్పై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో మల్టీ స్టారర్గా ఈ మూవీ రూపొందనుందని, ఇందులో ప్రభాస్, టైగర్ ష్రాఫ్లు కలిసి నటిస్తారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్, హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక హృతిక్ రోషన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో 2019లో ‘వార్’ సినిమా వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ‘ఫైటర్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రభాస్ కూడా ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ లతో పాటుగా ‘రాజాడీలక్స్’(ప్రకటన రావాల్సి ఉంది) సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్తో పాటు హృతిక్ రోషన్–సిద్ధార్థ్ ఆనంద్ల ప్రస్తుత కమిట్మెంట్ ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాతే వీరి ముగ్గురి కాంబినేషన్ సినిమా గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశాలుఉన్నాయి. కాగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న బాస్.. 10 రోజుల్లోనే రూ.200 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య' ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో మూవీ భారీ విజయంతో చిత్రబృందం ఫుల్ జోష్లో ఉంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్యకు 2.25 రేటింగ్పై చిరంజీవి సెటైర్లు) వాల్తేరు వీరయ్య విడుదలైన పది రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకుంది. కేవలం పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రావడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. 'వాల్తేరు వీరయ్య' సినిమాతో మెగాస్టార్ అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. బాస్ పార్టీ సాంగ్, మెగాస్టార్ యాక్టింగ్, డ్యాన్స్, గ్రేస్కు ఫిదా అయిపోయారు మెగా ఫ్యాన్స్. మాస్ మహారాజ రవితేజ కూడా సినిమాలో ఉండగా వీరి కాంబినేషన్లో వచ్చే సీన్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. Megastar's ACTION PACKED BONANZA CONTINUES at Box Office with 200 CR+ Gross 💥🔥❤️🔥 Watch the MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥 - https://t.co/KjX8J7HFFi@KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/4Ma7Fg21r3 — Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2023 -
వీరసింహారెడ్డి కలెక్షన్స్ ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ‘వీరసింహారెడ్డి’పై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల అంచనాలకు తగినట్లే విడుదలైన తొలిరోజు నుంచే మంచి వసూళ్లు వచ్చాయి. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. GOD OF MASSES has conquered the US Box Office 🔥🔥 VEERA MASS BLOCKBUSTER #VeeraSimhaReddy grosses $ 1M+ and is continuing its glorious run 💥 Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/eL6vwuMVO7 — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023 -
Waltair Veeraya: మూడు రోజుల్లో వందకోట్లు, రికార్డులు లోడింగ్..
బాస్ వచ్చాడు.. బాక్సాఫీస్ బద్ధలు కొడుతున్నాడు. పూనకాలు లోడింగ్ కాదు.. రికార్డులు హంటిగ్ అన్నట్లుగా కలెక్షన్ల వేట మొదలుపెట్టాడు. ముచ్చటగా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేశాడు మెగాస్టార్ చిరంజీవి. రికార్డుల్లో నా పేరుండటం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయన్న మాటను అక్షరాలా నిజం చేస్తున్నాడు. చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. టైటిల్కు తగ్గట్టుగా మాస్ కంటెంట్తో అభిమానులను తెగ అలరిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించడంతో సినిమా మరింత సూపర్ హిట్టయింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన వాల్తేరు వీరయ్య ఇతర స్టార్ హీరోల సినిమాలకు గట్టి పోటీనిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లు రాబట్టిందీ చిత్రం. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. #WaltairVeerayya takes over the Box Office like BOSS 😎🔥 108 Crores Gross in 3 days for MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥💥 - https://t.co/KjX8J7HFFi MEGA⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP #ArthurAWilson @SonyMusicSouth pic.twitter.com/n8PszOFt5u — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023 చదవండి: వారం కాకముందే సెంచరీ కొట్టిన వారిసు మరో అవార్డు దక్కించుకున్న నాటు నాటు, ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ -
కాలం వెనక్కి వెళ్లే కథలు.. రీల్లైఫ్లో అలాంటి బ్యాక్గ్రౌండ్తో వస్తున్న సినిమాలివే
2023లో ఉన్నప్పుడు 40, 50, 60 ఏళ్లు... అంతకుమించి వెనక్కి వెళ్లే అవకాశం వస్తే...? రియల్ లైఫ్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ రీల్ లైఫ్లో ఏదైనా సాధ్యమే. కాలం వెనక్కి వెళ్లొచ్చు.. ముందుకూ వెళ్లొచ్చు. ఇప్పుడు కాలం వెనక్కి వెళ్లే కథలు వెండితెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. స్టువర్టుపురం దొంగగా ముద్రపడిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. హీరో రవితేజ టైటిల్ రోల్లో వంశీ దర్శకత్వంలో అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టువర్టుపురంలో 1970–1980 కాలంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. వీలైనంత త్వరగా ఈ చిత్రం పూర్తి చేసి ఈ ఏడాదే థియేటర్స్లోకి తీసుకురావాలనుకుంటున్నారు మేకర్స్. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హీరోగా చేస్తున్న చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1970 బ్యాక్డ్రాప్లో ఉంటుందన్న టాక్ ఆల్రెడీ ఫిల్మ్నగర్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ‘సలార్’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదల కానుంది. మరోవైపు రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్చరణ్ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. రామ్చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి పాత్ర సన్నివేశాలన్నీ 1960–1970 బ్యాక్డ్రాప్కి సంబంధింనవని తెలిసింది. ఐఏఎస్ ఆఫీసర్ల నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మిస్తున్నారు. ఇంకోవైపు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రకథ 1990 బ్యాక్డ్రాప్ నుంచే ఆరంభం అవుతుంది. రెండు భాగాల ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ గత ఏడాది డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రైజ్’ నిర్మాణంలో ఉంది. ఈ సినిమాకు కూడా 1990 బ్యాక్డ్రాప్ ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ వేసవిలో థియేటర్స్లో ఆడియన్స్కు ‘దసరా’ చూపేందుకు రెడీ అవుతున్నారు హీరో నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1980–1990 బ్యాక్డ్రాప్లో తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిసింది. ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితులను ధరణి (నాని) ఏ విధంగా పరిష్కరించాడు, వెన్నెల (ఇందులో హీరోయిన్ కీర్తీ సురేష్ పాత్ర)తో అతని లవ్స్టోరీ ఏమైంది? అన్నదే ‘దసరా’ ప్రధాన కథాంశం. మరోవైపు ‘డెవిల్’ సినిమా కోసం 1945వ కాలం నాటి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా మారిపోయారు కల్యాణ్ రామ్. స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్వాళ్లు పరి΄ాలింన మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన కొన్ని రహస్య అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని ఛేదించడానికి గూఢచారిగా కల్యాణ్ రామ్ ఏం చేశారు? అన్నదే ‘డెవిల్’ కథాంశం. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లోకి రానుంది. ఇంకోవైపు ‘హరోం హర’ అంటున్నారు హీరో సుధీర్బాబు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ‘ది రివోల్ట్’ అనేది క్యాప్షన్. సుమంత్. జి నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగుతుంది. తమిళ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు ఉన్నాయి. హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్గా వీరి కాంబినేషన్లోనే ప్రస్తుతం ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రధానంగా స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1920–1930 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇక ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా ΄ాన్ ఇండియన్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ది 1930–1940 బ్యాక్డ్రాప్ అని త్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటింంది. అరుణమాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్కుమార్, సందీప్ కిషన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాలే కాదు.. దర్శకుడు వెట్రిమారన్తో సర్య కమిట్ అయిన ‘వాడివాసల్’, శివ దర్శకత్వంలో సర్య చేస్తున్న 42వ సినిమాలు కూడా గతంలోకి తీసుకెళ్లేవే. 1990 బ్యాక్డ్రాప్ అంటే బొమ్మ హిట్టే అని గత ఏడాది బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. హిట్ రిపీట్ అయితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి.. రిపీట్ అవ్వాలని కోరుకుంటుంటారు. గత ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ హిట్గా నిలి, బాక్సాఫీస్ వద్ద దాదాపు ర. 1300 కోట్ల గ్రాస్ను వసలు చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 1920 బ్యాక్డ్రాప్లో ర΄÷ందింది. ఇక సువరు 90 కోట్ల ర΄ాయల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టి సపర్హిట్గా నిలిన ‘సీతారామం’ చిత్రకథ 1964–1985 బ్యాక్డ్రాప్లో సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాలే కాదు... బాక్సాఫీస్ వద్ద ర. 1100 కోట్లు రాబట్టిన ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2 (1980 నేపథ్యంలో...), ర. 400 కోట్లకు పైగా వసలు చేసిన కన్నడ బ్లాక్బస్టర్ ‘కాంతార’ (కథ 1847లో స్టార్ట్ అయినా మేజర్ కథాంశం, స్క్రీన్ ప్లే..1990 బ్యాక్డ్రాప్లోనే సాగుతుంది), హిందీలో ర. 300కోట్లకు పైగా వసలు చేసిన సపర్హిట్ మూవీ ‘ది కశ్మీరీ ‡ఫైల్స్’ (స్క్రీన్ ప్లే 2020లో స్టార్ట్ అయినా... కథ మేజర్గా 1989–1990 నేపథ్యంలోనే సాగుతుంది) కొన్నేళ్లు వెనక్కి తీసుకెళ్లే చిత్రాలే కావడం విశేషం. ఈ జాబితాలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ‘విరసాక్ష’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు సాయిధరమ్ తేజ్. 1990 నేపథ్యంలో ఓ ఫారెస్ట్ బేస్డ్ విలేజ్లో సాగే థ్రిల్లర్ సినిమా ఇది. మూఢ నమ్మకాలు, సైన్స్, ఆధ్యాత్మిక అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు... 1990ల నేపథ్యంలో రూపొందుతోన్న మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. -
నాది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్.. వీరసింహారెడ్డి ట్రైలర్ అవుట్
అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఇందులో శృతిహాసన్ కథానాయికగా నటించింది. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. ఇవాళ ఒంగోలులో జరగుతున్న ప్రీరిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. 'సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనే కత్తి పట్టా.. పరపతి కోసమో.. పెత్తనం కోసమో కాదు' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ ఫైట్స్ అభిమానులను అలరించనున్నాయి. 'పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్' అనే డైలాగ్ హైలెట్గా నిలవనుంది. ట్రైలర్ చూస్తే సీమ నేపథ్యంలోనే సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం. -
‘వీరసింహారెడ్డి’ న్యూ ఇయర్ సర్ప్రైజ్ .. ఆ వీడియో చూశారా?
నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక పాట మినహా దాదాపు షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ కానుకగా బాలయ్య ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేకింగ్ వీడియో చూస్తే బాలయ్య యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సీన్స్ చూస్తే రాయలసీమలో ఎక్కువగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్ సరిపోయేలా ఫైట్స్ తెరకెక్కించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
ముగిసిన మైత్రీ మూవీ మేకర్స్ ఐటీ రైడ్స్, కీలక పత్రాలు, హార్డ్డిస్క్లు స్వాధీనం
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై నిన్న(డిసెంబర్ 12న) ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), జీఎస్టీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి జరగగా రాత్రి 12 గంటలకు ఈ తనిఖీలు ముగిసినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ డైరెక్టర్స్ అయిన యలమంచిలి రవిశంకర, ఎర్నేనీ నవీన్కు సంబంధించిన ఇల్లు, కార్యాలయలపైన కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లతో పాటు పలు హార్డ్డిస్క్లను స్వాధినం చేసుకున్నట్లు సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హై బడ్జెట్ చిత్రాలకు నిర్మాణ వ్యయం, పెట్టుబడులను ఎలా సమకుర్చుతున్నారనే దానిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాదు హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్, లాభాల గురించి కూడా సంస్థ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలను ఈ సందర్భంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఇది రెగ్యులర్ చెకింగ్లో భాగంగానే సోదాలు నిర్వహించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ మీడియాతో పేర్కొన్నారు. కాగా పుష్ప, శ్రీమంతుడు, డియర్ కామ్రేడ్,సర్కారు వారి పాట, ఉప్పెన, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఈ సంస్థలోనే నిర్మించబడ్డాయి. చదవండి: నన్ను నమ్మిన మొదటి వ్యక్తి నువ్వే డార్లింగ్: ప్రభాస్పై జక్కన్న కామెంట్స్ అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటిస్తా: రణ్బీర్ కపూర్ -
మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ముగిసిన సోదాలు
-
‘మైత్రీ’పై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిన్నటివరకు రియల్ ఎస్టేట్ సంస్థలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో దాడులు నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ తాజాగా సినీ నిర్మాతలపై దృష్టి సారించింది. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలపై సోమవారం జీఎస్టీ అధికారులతో కలిసి దాడులకు దిగింది. ఏకకాలంలో ప్రారంభమైన సోదాలు మొత్తం 15 చోట్ల కొనసాగుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థలో యలమంచిలి రవిశంకర్, ఎర్నేనీ నవీన్ భాగస్వాములుగా ఉన్నారు. ప్రముఖ సినీ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్.. భారీ లాభాలు ఆర్జించినా ఆ మేరకు పన్నులు చెల్లించకుండా ఎగవేసిందనే అనుమానాలతో ఐటీ తనిఖీ లకు దిగినట్లు తెలిసింది. ఈ సంస్థకు చెందిన తాజా చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్నాయి. మంచి లాభాలు ఆర్జించిన పుష్ప సినిమా సీక్వెల్గా వస్తు న్న పుష్ప–2, వస్తాద్ భగత్సింగ్తో పాటు, మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నట్టు సమాచారం. ఫైనాన్షియర్ల ఇళ్లల్లోనూ.. నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఉద్యోగులు, వీరికి ఫైనాన్స్ చేస్తున్నారన్న అనుమానం ఉన్న వారి ఇళ్లల్లోనూ ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ప్రస్తుతం లైన్లో ఉన్న సినిమాల బడ్జెట్ ఆరేడు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఇందుకు అవసరమైన భారీ మొత్తం నిధులు ఏ విధంగా సమకూరాయి? ఎక్కడ నుంచి ఫైనాన్స్ తీసుకున్నారు? అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సక్రమంగానే ఉన్నాయా.? పన్నుల చెల్లింపులు ఎలా ఉన్నాయి? చిత్రాల నిర్మాణానికి ఎంతెంత ఖర్చు చేస్తున్నారు.? అందుకు సంబంధించి జీఎస్టీ చెల్లింపులు చేశారా? లేదా? అన్న అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే వారికి పారితోషికాలు ఏ విధంగా చెల్లిస్తున్నారు? పూర్తి పారదర్శకంగా ఉన్నాయా? లేదా? హవాలా లావాదేవీలు ఏమైనా ఉన్నాయా.? అన్న కోణంలోనూ కూలంకషంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ నిర్మాణ సంస్థకు వచ్చిన లాభాలకు, చెల్లించిన పన్నుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లుగా వచ్చిన సమాచారం ఆధారంగానే అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు వ్యత్యాసాలు బయటపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఐటీ శాఖ నుంచి అధికారిక సమాచారం ఏదీ విడుదల కాలేదు. తలసాని శ్రీనివాస్యాదవ్ పీఏ విచారణ కేసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతూనే ఉంది. సోమవారంమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వ్యక్తిగత సహాయకుడు అశోక్ను విచారించారు. కేసినో ఆడించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానాల్లో నేపాల్, శ్రీలంకతో పాటు గోవాలకు తీసుకెళ్లిన చీకోటి ప్రవీణ్పై ఇదివరకే కేసులు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులోనే అశోక్ను కూడా విచారణకు పిలిచారు. అయితే ఇప్పటివరకు ఈడీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. -
మైత్రీ మూవీస్ కార్యాలయంలో ఐటీ సోదాలు
-
మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ దాడులు
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్కు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్లోని మైత్రీ మూవీస్కు చెందిన కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తోంది. పుష్ప, శ్రీమంతుడు, డియర్ కామ్రేడ్,సర్కారు వారి పాట, ఉప్పెన, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్.. సంస్థ లావాదేవీలు, సినిమా బడ్జెట్కు సంబంధించి లెక్కలు సరిగా చూపలేదని ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్కు చెందిన అన్ని ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ప్రొడ్యూసర్స్ యలమంచిలి రవి, నవీన్ ఏర్నేని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ అల్లు అర్జున్తో పుష్ప-2, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, పవన్ కల్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. -
అఫీషియల్: 'కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమే'.. రామ్ చరణ్ లేటెస్ట్ అప్ డేట్
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తదుపరి చిత్రంపై లేటేస్ట్ అప్ డేట్ వచ్చేసింది. దీనిపై అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వారి సందేహాలకు పుల్స్టాప్ పెడుతూ ఆర్సీ16 మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ ఈ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేస్తూ.. 'కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమవుతుంది' అంటూ హీరో రామ్చరణ్, దర్శకుడు బుచ్చిబాబును ట్యాగ్ చేసింది. దీనిపై హీరో రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఉన్నట్లు రీట్వీట్ చేశారు. బుచ్చిబాబు టీమ్తో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని రామ్ చరణ్ వెల్లడించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చెర్రీ శంకర్ డైరెక్షన్లో ఆర్సీ15 షూటింగ్లో విదేశాల్లో బిజీగా ఉన్నారు. గతంలో 'ఆర్సీ 16' గౌతమ్ తిన్ననూరితో ప్రకటించారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చిత్రం ఉంటుందని టీమ్ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. మొదట జూనియర్ ఎన్టీఆర్కు ఆఫర్?: ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే.. దర్శకుడు బుచ్చి బాబు మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్తో చేయాలనుకున్నట్లు సమాచారం. అయితే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలకు డేట్స్ బ్లాక్ కావడంతో కుదరలేదని తెలుస్తోంది. Sometimes, Revolt becomes a necessity ❤️🔥 Mega Power Star @AlwaysRamCharan & Sensational director @BuchiBabuSana team up for a powerful subject and a Pan India entertainer 💥 #RamCharanRevolts 🔥 Produced by @vriddhicinemas & @SukumarWritings Presented by @MythriOfficial pic.twitter.com/SisvkrbJo8 — Mythri Movie Makers (@MythriOfficial) November 28, 2022 Excited about this !! Looking forward to working with @BuchiBabuSana & the entire team.@vriddhicinemas @SukumarWritings #VenkataSatishKilaru @MythriOfficial pic.twitter.com/hXuI5phc7L — Ram Charan (@AlwaysRamCharan) November 28, 2022 -
పోటీ ఇద్దరికీ రిస్క్ మాత్రం ఒక్కరికే..
-
వీరసింహారెడ్డి నుంచి 'జై బాలయ్య' సాంగ్ విడుదల..
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జైబాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్ను విడుదల చేశారు. రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన పాట బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా కరీముల్లా పాడారు.ఇక పాటలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కనిపించారు. వైట్ అండ్ వైట్ అవుట్ఫిట్లో మెడలో బంగారు చైన్, చేతికి వాచ్ పెట్టుకొని తనదైన స్టైల్లో డ్యాన్స్ చేయడం విశేషం. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగిన వాస్తవ అంశాల నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈసినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. -
వీరసింహారెడ్డి లేటెస్ట్ అప్ డేట్.. ఫస్ట్ సింగిల్ ఆరోజే...!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజా క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. (చదవండి: యాక్షన్ మోడ్లో బాలయ్య.. ‘వీరసింహారెడ్డి’లో ఇదే కీలక సన్నివేశం) ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పాటను ఈనె 25న ఉదయ 10.29 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. దీంతో బాలయ్య మాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. A MASS ANTHEM for the GOD OF MASSES 🔥#VeeraSimhaReddy first single #JaiBalayya on November 25th at 10.29 AM ❤️🔥#NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/nYGn2dVRTv — Mythri Movie Makers (@MythriOfficial) November 23, 2022 -
మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ఆరోజే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ ఖరారు చేసిన చిత్రబృందం తాజాగా మరో క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తన ట్విటర్లో వెల్లడించింది. (చదవండి: మెగాస్టార్కు విద్యార్థుల సర్ప్రైజ్.. ఒకేసారి ఆరు వేలమంది కలిసి..!) వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్ సింగిల్ ఈనెల 23న సాయంత్రం 4.05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలోని ఓ ఐటం సాంగ్లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కనిపించనుంది. Get ready for the biggest party of the year 🤩🤩#WaltairVeerayya first single #BossParty on November 23rd at 4.05 PM 💥💥 Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @UrvashiRautela @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/s725DcvosQ — Mythri Movie Makers (@MythriOfficial) November 20, 2022 -
ఆసక్తిగా కల్యాణ్ రామ్ మూవీ టైటిల్.. సోషల్ మీడియాలో వైరల్
బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి హీరో కల్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న కల్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్కు ఆయన ఇప్పటికే ఒకే చెప్పారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. (చదవండి: బింబిసార సక్సెస్.. ఫ్యాన్స్కు డైరెక్టర్ మరో సర్ప్రైజ్..!) రాజేంద్రా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'అమిగోస్' అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. బింబిసార తర్వాత కల్యాణ్ రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన తన ట్విటర్లో రాస్తూ..' ఊహించని వాటిని ఆశించండి' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. బింబిసార హిట్ తర్వాత మరో వైవిధ్యమైన సినిమాతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. టాలీవుడ్లో భారీ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తుండటం మరో విశేషం. కళ్యాణ్ రామ్ 19వ చిత్రంగా ఇది నిలవనుంది. ఈ సినిమా ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. సోషల్ మీడియా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే టైటిల్ అమిగోస్ టాలీవుడ్ ఫ్యాన్స్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అమిగోస్ అనే పేరు కాస్త వైరైటీగా అనిపించడంతో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అమిగోస్ పదానికి స్పానిష్లో స్నేహితుడు అని అర్థం వస్తుందట. ఇవాళ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కల్యాణ్ రామ్లు కనిపిస్తున్నారు. ముగ్గురు కూడా మూడు డిఫరెంట్ లుక్స్లో ఉన్నారు. ఈ పోస్టర్ ద్వారా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే ట్విటర్లో ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘మీలాగే కనిపించే వారిని మీరు కలిసినప్పుడు, మీరు చనిపోతారని వారు అంటున్నారు’ అంటూ రాసుకొచ్చారు. సినిమా టైటిల్, కల్యాణ్ రామ్ లుక్స్ చూస్తుంటే మరో వైవిధ్యమైన కథతో నందమూరి హీరో వస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. Hola #Amigos ❤️🔥 Expect the unexpected! See you in cinemas from Feb 10, 2023 🔥#RajendraReddy @AshikaRanganath @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/1S2gdnUHeg — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 7, 2022 -
మెగా ఫ్యాన్స్కు దీపావళి సర్ప్రైజ్.. ఆ మూవీ క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. అదే జోష్తో తన నెక్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు మెగాస్టార్. భోళా శంకర్, డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో చిరు 154వ చిత్రంగా మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. దీపావళి కానుకగా మెగా154 అఫీషియల్ టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈనెల 24 ఉదయం 11.07 నిమిషాలకు బాస్ వస్తున్నాడు అంటూ పోస్టర్ను ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉండగా.. అక్టోబర్ 24న క్లారిటీ రానుంది. This Diwali it's Gonna be a "MEGA BLAST" 💥💥💣 💣 Our #Mega154 Title Teaser Launch on 24th October at 11.07 AM❤️🔥 Trust me,... Poonakalu Loading 🔥🤙 Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/ZRZmvUoKAl — Bobby (@dirbobby) October 20, 2022 -
మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్
తమిళసినిమా: కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్పై మక్కువ చూపుతున్నారనడంలో ఎలాంటి సందేహమే లేదు. నటుడు విజయ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. కమల్హాసన్, రజనీకాంత్ వంటి సీనియర్ హీరోలు ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించారు. నటుడు కార్తీ కూడా ఆ మధ్య ఊపిరి అనే తెలుగు చిత్రంలో నాగార్జునతో కలిసి నటించారు. తాజాగా నటుడు సూర్య కూడా మహేష్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించనున్న భారీ బడ్జెట్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్ తెలుగులో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఈయన ప్రస్తుతం వారీసు (తెలుగులో వారసుడు) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం కాబోతున్నారు. దిల్రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్న ఇందులో నటి రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా విజయ్ తదుపరి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన నటించే 67వ చిత్రం అవుతుంది. ఇప్పుడు విజయ్ 68వ చిత్రం గురించి ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఆయన తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్కు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఆ సంస్థ నుంచి విజయ్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు, ఆయన ఇటీవల మైత్రీ మూవీస్ అధినేతలకు కథను కూడా వినిపించినట్లు సమాచారం. ఇప్పటికే విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరీ, మెర్సల్ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. అట్లీ ప్రస్తుతం షారుఖ్ఖాన్, నయనతార జంటగా హిందీలో జవాన్ చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి విజయ్తో చేసే చిత్ర కథపై దృష్టి సారిస్తున్నట్లు కోడంబాక్కం టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
చిరు ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ‘మెగా154’ నుంచి క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అదే జోష్తో తన నెక్ట్ ప్రాజెక్ట్స్ చకచక పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు చిరు. ప్రస్తుతం భోళా శంకర్, డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు 154వ చిత్రంగా మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ టీం మెగా ఫ్యాన్స్కి గుడ్న్యూస్ అందించింది. ఈ సినిమా డబ్బింగ్ పనులను స్టార్ట్ చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. దర్శకుడు బాబీ, పలువురు టెక్నిషియన్ల సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాల నిర్వహించి డబ్బింగ్ పనులను మొదలు పెట్టారు. చదవండి: 31 ఏళ్ల తర్వాత మళ్లీ రీపిట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్ ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే మరిన్ని భారీ అప్డేట్స్ ఇస్తామని ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
అల్లు అర్జున్ లేకుండానే 'పుష్ప-2' మొదలైందిగా.. ఫోటోలు వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు ఓ రేంజ్లో స్వాగ్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నేడు(సోమవారం)పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని న్యూయార్క్లో ఉండటంతొ కార్యక్రమానికి హాజరు కాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నానే హీరోయిన్గా నటించనుంది. అయితే ఆమె పాత్ర నిడివి తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
క్రేజీ న్యూస్: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్.. ఆ రోజే షూటింగ్ ప్రారంభం!
Allu Arjun Pushpa 2 Movie Pooja Ceremony Will Start On August 22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు.. ఇలా ప్రతీదీ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ఓ స్వాగ్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క డైలాగ్కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. వాటిని రీల్స్ రూపంలో చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇంకా సమంత గ్లామర్, తనతోపాటు అల్లు అర్జున్ డ్యాన్స్, ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా ఎదురు చూసేది 'పుష్ప 2' కోసమే. ఆ సినిమాను అప్పుడు స్టార్ట్ చేస్తాం.. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా అందులో విలన్గా ఆ స్టార్ హీరోలు, ఈ బాలీవుడ్ నటులు నటిస్తున్నారని అని ప్రచారం జరిగింది. మరోవైపు అసలు స్క్రిప్టే పూర్తి కాలేదు అని వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఆ వార్తలన్నింటికి తెర దించుతూ 'పుష్ప: ది రూల్'ను స్టార్ట్ చేయనున్నాడు సుకుమార్. చదవండి: పాపం హిందీ హీరోలు!.. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్ రోషన్ సోమవారం అంటే ఆగస్టు 22న 'పుష్ప 2: ది రూల్' పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టనుంది చిత్రబృందం. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆగస్టు 22నే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడం విశేషం. కాగా ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు ఆ మధ్య టాక్ వినిపించింది. చదవండి: తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం After September 15th... — Sarath Chandra Naidu (@imsarathchandra) August 21, 2022 -
మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియాపై మాదాపూర్ పీఎస్లో కేసు నమోదు
-
‘అంటే సుందరానికీ’ నిర్మాణ సంస్థపై కేసు నమోదు
అనుమతి తీసుకోకుండానే ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియాపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాని, నజ్రియా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ని గురువారం మాదాపూర్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. (చదవండి: ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ) అయితే ప్రీరిలీజ్ ఈవెంట్కి పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరో వస్తున్నప్పటీకీ.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్ని నిర్వహించింది. దీంతో నిబంధనలు ఉల్లఘించారంటూ శ్రేయాస్ మీడియా ఈవెంట్ మేనేజర్ సురేశ్తో పాటు మైత్రీ మూవీస్పై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. -
లావణ్య త్రిపాఠీ 'హ్యాపీ బర్త్డే'.. ఇంటింటికీ గన్ను, ఎదురు లేని ఫన్ను..
'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠీ. గతేడాది 'చావు కబురు చల్లగా' సినిమాతో అలరించిన లావణ్య ప్రస్తుతం 'హ్యాపీ బర్త్డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బ్లాక్ కామెడీ థ్రిల్లర్గా అలరించనుంది. ఇందులో నరేశ్ అగస్త్య హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ఆద్యంతం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంది. ఇంటింటికి గన్ను.. ఎదురులేని ఫన్ను.. వంటి పలు డైలాగ్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చెర్రీ, హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. ఒక్క ఏడాదిలో ఏకంగా 20 సినిమాలు ఒప్పుకున్న స్టార్ హీరో ! -
'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. మే12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ కోసం మహేశ్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ను మేకర్స్ షేర్ చేశారు. మే2న ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, పాటలు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్ చెప్పిన హీరో The wait ends! Rocking #SVPTrailer drops on MAY 2nd💥 Super🌟 @urstrulyMahesh is all set to mesmerize you with his MASS Energy😎#SarkaruVaariPaata#SVPOnMay12@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/eyrDbdx8aM — Mythri Movie Makers (@MythriOfficial) April 28, 2022 -
అంటే సుందరానికి టీజర్ లాంచ్ ఈవెంట్
-
'పుష్ప' డిలీటెడ్ సీన్.. సూపర్ సీన్ పోయిండాదే!
Mythri Movie Makers Released Pushpa Deleted Scene: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతుంది. టాలీవుడ్లో రూ. 100కోట్లకు పైగా కలక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ సహా ఇతర భాషల్లోనూ మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఈ సినిమా. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప చిత్రం నుంచి డిలీటెడ్ సీన్ని విడుదల చేశారు. ఇందులో.. అప్పు ఇచ్చిన వ్యక్తికి బర్రెలు అమ్మి అయినా అప్పు తీర్చేస్తాడు పుష్పరాజ్.ఈ క్రమంలో అప్పు చెల్లించినట్లు ఊరందరికి చెప్పాలంటూ అతడిపై చేయిచేసుకుంటాడు. అయితే లెంగ్త్ ఎక్కువైన కారణంగా ఈ సీన్ను చిత్రం నుంచి తొలగించారు. తాజాగా పుష్ప డిలీటెడ్ సీన్లో ఈ వీడియోను రిలీజ్ చేయగా కాసేపటికే ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ఈ సీన్ ఉంటే థియేటర్ దద్దరిల్లిపోయేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
పార్టీ లేదా 'పుష్ప'.. సక్సెస్ మీట్ క్యాన్సిల్
Pushpa Movie Massive Success Party Cancelled In Kakinada: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. డిసెంబర్17న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అల్లు అర్జున్ పుష్పరాజ్గా అదరగొట్టగా, రష్మిక మందన్నా శ్రీవల్లిగా కనువిందు చేసింది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరిపోయిన పుష్ప ప్రస్తుతం సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తుంది. ఈ సందర్భంగా వివిధ నగరాల్లో మూవీ టీం సక్సెస్ పార్టీలు నిర్వహిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు(డిసెంబర్24)న కాకినాడలో సక్సెస్ మీట్ జరగాల్సి ఉంది. అయితే అనుమతులు రాకపోవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. -
'పుష్ప' కలెక్షన్స్ సునామీ..రెండు రోజుల్లోరూ.116 కోట్ల గ్రాస్..
Pushpa Movie Two Days Box Office Collections: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద దమ్మురేపుతుంది. డిసెంబర్17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తొలిరోజే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. చదవండి: స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఎందుకు ఒప్పుకుందో తెలుసా? అలా రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది 'పుష్ప'.అంతేకాకుండా మూడో రోజు కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా పుష్పరాజ్గా బన్నీ యాక్టింగ్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళం సహా హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది ఈ చిత్రం. కాగా ఫిబ్రవరిలో ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. చదవండి:Pushpa Move : బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన 'పుష్ప'.. బాక్సాఫీస్ ప్రభంజనం Bigg boss 5 Telugu: బిగ్బాస్ స్టేజ్పై బాలయ్య డైలాగ్ చెప్పిన ఆలియాభట్ -
Pushpa Move : బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన 'పుష్ప'.. బాక్సాఫీస్ ప్రభంజనం
Pushpa Movie First Day Box Office Collections: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(డిసెంబర్17)న విడుదలైన ఈ చిత్రం రిమార్కబుల్ ఓపెనింగ్స్తో దుమ్మురేపుతుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.71 కోట్ల గ్రాస్ రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఇది 2021లో ఇండియాలోనే తొలి రోజు అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా అని.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందని మేకర్స్ తెలిపారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్గా పార్ట్-2కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రూల్'(Pushpa: The rule)టైటిల్తో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 2021 INDIA'S BIGGEST DAY 1 GROSSER 🔥#PushpaTheRise strikes big at the Box Office 💥 MASSive 71CR Gross Worldwide🤘#ThaggedheLe 🤙#PushpaBoxOfficeSensation @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @TSeries @PushpaMovie pic.twitter.com/FwRvqNVl7m — Mythri Movie Makers (@MythriOfficial) December 18, 2021 -
పుష్ప: థర్డ్ సింగిల్ 'సామీ సామీ' సాంగ్ రిలీజ్
Pushpa Movie Third Song Released: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే 'పుష్ప' నుంచి విడుదలైన.. దాక్కో దక్కో మేక', ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ పాటలు యూట్యూబ్ను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ సామీ సామీ సాంగ్ను రిలీజ్ చేశారు. ‘నువ్వు అమ్మి అమ్మి అంటాంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ’ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కానుంది. -
సల్మాన్ని డైరెక్ట్ చేయనున్న డాషింగ్ డైరెక్టర్ పూరీ..?
టాలీవుడ్లోని టాలెంటెడ్ డైరెక్టర్స్లో ఒకరు పూరీ జగన్నాథ్. తెలుగు ఎన్నో మంచి సినిమాలు చేసిన గుర్తింపు పొందిన ఆయన అమితాబ్ హీరోగా ‘బుడ్డా హోగా తేరే బాప్’తో బాలీవుడ్కి కూడా పరిచయమైయ్యాడు. అయితే తాజాగా ఆయన గురించి క్రేజీ రూమర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదే కండల వీరుడు సల్మాన్ ఖాన్ డైరెక్ట్ చేయనున్నాడని. నిజానికి సల్మాన్ ఖాన్తో పూరీ సినిమా చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనుందని ఫిల్మీ దునియాలో ప్రచారం జరుగుతోంది. దానికోసం ఇప్పటికే ఈ మేకర్స్ టీం సల్లు భాయ్కి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ కూడా తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇదే గనక నిజమైతే తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్గా చూపించే ఈ డాషింగ్ డైరెక్టర్ ఈ కండల వీరుడ్ని ఎలా చూపించబోతున్నాడోనని ఫ్యాన్స్లో ఆసక్తి పెరుగుతోంది. కాగా పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చేస్తుండగా, బాలీవుడ్ స్టార్ ‘టైగర్ 3’ సినిమాతో బిజీగా ఉన్నాడు. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం.. షారుక్ని కలిసి సల్మాన్ ఖాన్ -
బాలకృష్ణ 107 టైటిల్ గురించి మేకర్స్ ఏమన్నారంటే?
టాలీవుడ్లో ఎంతో పాపులారిటీ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డెరెక్షన్లో ‘అఖండ’ చేస్తున్నాడు. ఆయన హీరోగా 107వ సినిమాని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి ‘రౌడీయిజం’ అనే టైటిల్ పెట్టారంటూ టీటౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఎన్బీకే 107 మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో.. ‘ఎన్బీకే 107 మూవీ టైటిల్ ఇదేనంటూ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలు నిజం కాదు. ఆ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే ఇలాంటివి చూస్తే ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుస్తోంది. ఆ మూవీకి సరిపోయే టైటిల్ని, ఇతర విషయాలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని టీం తెలిపింది. కాగా బాలనటుడిగా 1974లో తెరంగేట్రం చేసిన ఆయన ఇప్పటి వరకూ అవిశ్రాంతంగా నటిస్తూనే ఉన్నాడు. హీరోగా 105 సినిమాలు పూర్తి చేసి త్వరలో 106 సినిమాగా ‘అఖండ’తో పలకరించనున్నాడు. ఇక జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక వంటి అన్ని జానర్లలో బాలయ్య చిత్రాలు చేశాడు. -
పుష్ప నుంచి ఫైటింగ్ సీన్ లీక్..సినిమాకు ఇదే కీలకమట!
కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ మధ్యే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా, మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా సినిమాలకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు, ఫోటోలు నెట్టింట దర్శనమివ్వడం చూస్తూనే ఉంటాం. ఇక పెద్ద సినిమాల విషయంలో ఈ లీకుల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట, పుష్ప చిత్రాల నుంచి ఇప్పటికే ఫస్ట్లుక్, పాటలు ముందే లీకైన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప నుంచి దీని నుంచి మరో వీడియో బయటకు వచ్చింది. ఇది ఆ సినిమాలోని ఎంతో ముఖ్యమైన ఫైటింగ్ సీన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పందిస్తూ.. 'మా సినిమాలకు సంబంధించిన మెటీరియల్ ఒకదాని తర్వాత ఒకటి ఆన్లైన్లో లీక్ కావడం పట్ల చాలా నిరాశ చెందాం. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంశంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. త్వరలోనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దు' అని ట్వీట్ చేసింది. ఈ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. We are deeply disturbed by the recent leaks of our movie material online. We condemn it and have lodged a complaint against the same in the cyber crime department. The culprits would soon be booked by the law. Please do not encourage piracy. - Team @MythriOfficial pic.twitter.com/FelB6ih0TD — Mythri Movie Makers (@MythriOfficial) August 15, 2021 -
Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ అప్డేట్స్పై టీం క్లారిటీ
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్తో కలిసి ఘట్టమనేని మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘మహానటి’ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండడంతో షూటింగ్ నిలిచిపోయింది. అయితే, చాలారోజులుగా సర్కారు వారి పాట నుంచి అప్ డేట్ రాకపోవడంతో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. ‘షూటింగ్ పునః ప్రారంభమైనపుడు సర్కారి వారి పాట అప్డేట్స్ పంచుకుంటాం. అప్పటి వరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి’ అని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే ప్రతిఫలం ఉంటుందని తెలిపింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ స్టోరీ సాగుతోందని.. మహేశ్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. The excitement and anticipation for #SarkaruVaariPaata is in the air! All our upcoming updates will be worth the wait. Until then, Stay safe & Stay healthy. pic.twitter.com/26PH3ENFU0 — Mythri Movie Makers (@MythriOfficial) June 11, 2021 చదవండి: ఆ హీరోయిన్ని ప్రేమిస్తున్నా : వైష్ణవ్ తేజ్ ఆ హీరోయిన్ గురించి రహస్యంగా అలా అనుకునేదాన్ని: సమంత -
PSPK28: ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్.. స్పందించిన నిర్మాణ సంస్థ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లో 28 చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్ బైక్పై బ్లాక్ షర్ట్ ధరించి, చేతిలో ఓ సూట్కేసు పట్టుకొని స్టైలీష్గా కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే అఫిషియల్ లుక్ అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం బాగా ముదరడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఏ విషయం అయినా తాము అధికారికంగా చెప్పే వరకు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. పవన్ కల్యాణ్ 28వ సినిమాకి సంబంధించిన ఫస్ట్లుక్, టైటిల్ని ఈ ఏడాది ఉగాది రోజున విడుదల చేయాలని భావించాం. అయితే, కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వార్తలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా సరైన సమయంలో వెల్లడిస్తాం’మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. #PSPK28 😊 pic.twitter.com/BhpRrBZkw3 — Mythri Movie Makers (@MythriOfficial) June 8, 2021 చదవండి : ఈ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? రామ్చరణ్తో సినిమా..ఆ డైరెక్టర్కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన 'మైత్రీ' -
రామ్చరణ్తో సినిమా..ఆ డైరెక్టర్కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన 'మైత్రీ'
వరుస విజయాలతో జోరు మీదున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజు త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోతో ఓ సినిమా చేయనున్నాడట. కార్తీ నటించిన “ఖైదీ” చిత్రంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ డైరెక్టర్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళంలో కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ డైరెక్టర్తో పనిచేసేందుకు పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా తలపతి విజయ్తో మాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఫోకస్ మన తెలుగు హీరోలపై పడిందట. రంగస్థలంతో తన నట విశ్వరూపాన్ని చూపించిన రామ్చరణ్తో కనగరాజు ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై రామ్చరణ్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని, దీన్ని తెలుగు, తమిళ ద్విభాష చిత్రంగా తెరకెక్కిస్తారని సినీ వర్గాల్లో టాక్ వినిపస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారట. ఇప్పటికే డైరెక్టర్ కనగరాజుకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. చదవండి : శంకర్-రామ్చరణ్ సినిమా మరింత ఆలస్యం కానుందా? Liger Movie: ఆసక్తిరేపుతున్న క్రైమాక్స్ సీన్ అప్డేట్! -
తెలుగులో హీరోగా చేయనున్న విజయ్ సేతుపతి!
తమిళనాట విజయ్సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు నటుడు విజయ్సేతుపతి. అందుకే విలక్షణమైన పాత్రలు పోషించాలంటే అది విజయ్ సేతుపతే అనేంతగా పాత్రకు వంద శాతం న్యాయం చేస్తారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే విలన్ సహా కీలక పాత్రలు పోషిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. ఇటీవలె సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దీంతో తెలుగులో ఆయనకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఆయనను సంప్రదించినట్లు సమాచారం. విజయ్ సేతుపతి హీరోగా తెలుగులో డైరెక్ట్గా ఓ సినిమా చేయాలని ఆయనను కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ఆయనకు కథ కూడా వినిపించినట్లు ఇండస్ర్టీలో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీ అప్డేట్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి : విజయ్ సేతుపతికి జంటగా కత్రినా కైఫ్.. టైటిల్ ఇదే ఉప్పెన: విజయ్ సేతుపతి అందుకే డబ్బింగ్ చెప్పలేదు.. -
ఈ డైరెక్టర్ రూటే సెపరేటు..ఏకంగా రెండో సినిమాకే
తొలి సినిమా ఉప్పెనతోనే హిట్ డైరెక్టర్గా గుర్తింపు పొందారు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్.. టాలీవుడ్కు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేశాడు. ఉప్పెనతో హీరో, హీరోయిన్లకు ఎంత క్రేజ్ వచ్చిందో డైరెక్టర్ బుచ్చిబాబుకు సైతం అంతే పేరు ప్రఖ్యాతలు దక్కాయి. దీంతో బుచ్చిబాబుతో పని చేసేందుకు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఉప్పెన బంపర్ హిట్తో ఇదివరకే డైరెక్టర్ బుచ్చిబాబుకు కాస్ట్లీ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ బ్యానర్లో ఇంకో సినిమా చేయమని మైత్రీమూవీ మేకర్స్ బుచ్చిబాబును సంప్రదించారట. ఇందుకోసం ఆయనకు 10 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో రెండో సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోనున్న అతి కొద్దిమంది దర్శకుల్లో ఒకరిగా బుచ్చిబాబు నిలిచారు. తాజా సమాచారం ప్రకారం బుచ్చి తన రెండో సినిమాను జూనియర్ ఎన్టీఆర్తో చేయనున్నట్లు సమాచారం. ఇందుకుఓసం ఇప్పటికే స్ర్కిప్ట్ను సిద్దం చేశాడట. పిరియాడికల్ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం హిందీ మూవీ దంగల్ తరహాలో ఉండనుందట. ఇందులో ఎన్టీఆర్ 60 ఏళ్ల మాజీ ఆటగాడి పాత్ర చూట్టు ఈ కథ తిరగనుంది. కాగా ఇటీవల ఎన్టీఆర్ను కలిసి బుచ్చి కథ వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై ఎన్టీఆర్ స్పందించలేదని ఆయన గ్రీన్ సిగ్నిల్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమచారం. చదవండి : 'ఉప్పెన' దర్శకుడికి బెంజ్ కారు గిఫ్ట్ అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదు : చిన్మయి -
కేబుల్ బ్రిడ్జి మీద బన్నీ బర్త్డే వేడుకలు
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. సుకుమార్ డైరెక్షన్లో చేసిన 'ఆర్య' సినిమాతో బన్నీకి స్టైలిష్ స్టార్ అన్న పేరు వచ్చింది. ఇక అదే డైరెక్టర్తో చేస్తున్న 'పుష్ప'తో బన్నీకి ఐకాన్ స్టార్ అన్న కొత్త పేరొచ్చింది. ఇక పుష్పరాజ్ ఎలా ఉంటాడనేది టీజర్ ద్వారా శాంపిల్ చూపించింది చిత్రయూనిట్. ఇందులో ఎర్రచందనాన్ని లారీలో లోడ్ నింపుతూ, అడ్డొచ్చినవారిని చితకబాదుతూ ఊరమాస్ లుక్లో కనిపించాడు బన్నీ. అభిమాన హీరోను తొలిసారి ఇలా డిఫరెంట్ స్టైల్లో చూసి విజిల్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. పైగా ఈ రోజు హీరో బర్త్డే కావడంతో రచ్చరచ్చ చేస్తున్నారు. అటు చిత్రయూనిట్ కూడా అతడి బర్త్డే సెలబ్రేషన్స్ను గ్రాండ్గా ప్లాన్ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద లేజర్, లైట్ షో ఉంటుందని ప్రకటించింది. ఈరోజు రాత్రి 7- 8.30 గంటల మధ్య ఈ స్పెషల్ షో ఉంటుందని వెల్లడించింది. గతంలో ఏ తెలుగు హీరోకు దక్కని ఈ అరుదైన గౌరవం అల్లు అర్జున్కు దక్కడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. హీరో బర్త్డే కోసం ఇలా లేజర్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేయడం విశేషమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పుష్ప టీజర్ లక్షల వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 13న థియేటర్లలోకి రానుంది. చదవండి: పుష్ప టీజర్: తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ చూస్తుండగానే మోనాల్కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! -
'ఉప్పెన' దర్శకుడికి బెంజ్ కారు గిఫ్ట్
తొలి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్బస్టర్ హిట్ అందించాడు బుచ్చిబాబు. భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ టాలీవుడ్కు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ హీరోహీరోయిన్లకు భారీ ఎమౌంట్ గిఫ్ట్గా ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో వైష్ణవ్ తేజ్కు కోటి రూపాయలు, హీరోయిన్ కృతీ శెట్టికి రూ.25 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు బుచ్చిబాబుకు కారు లేదా ఇల్లును ఆఫర్ చేయగా ఆయన కారు తీసుకునేందుకు ఆసక్తి చూపారట. దీంతో తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ బుచ్చిబాబుకు బెంజి జీఎల్సీ కారును బహుమతిగా ఇచ్చారు. దీని విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కారు తన చేతికి రాగానే తన గురువు సుకుమార్ను ఎక్కించుకుని హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు బుచ్చి బాబు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా వుంటే ఆయన తర్వాతి సినిమా కూడా ఇదే బ్యానర్లోనే చేయనున్నాడు. Blockbuster #Uppena Director@BuchiBabuSana is now a proud owner of the luxurious Benz GLC, gifted by his producers @MythriOfficial. The first ride was reserved for his mentor @aryasukku. #BuchiBabu is committed to work for another film under Mythri Movie Makers. pic.twitter.com/pQMbuQzcBN — BARaju (@baraju_SuperHit) March 25, 2021 చదవండి: ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్ నన్ను పెళ్లి చేసుకుంటావా?: విజయ్ సేతుపతి -
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
మెగా మేనల్లుడు వైష్ణవ్తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన బాక్సాపీస్ వద్ద దుమ్మురేపుతోంది. లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటిని నిజం చేస్తూ సూపర్ హిట్గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఇది వంద కోట్ల సినిమా అవుతుందని డైరెక్టర్ సుకుమార్ జోస్యం చెప్పారు. ఇప్పుడు అక్షరాలా అదే నిజమైంది. ఉప్పెన చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని'ఉప్పెన' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని పోస్టర్ను రిలీజ్ చేశారు. 'ఓ మంచి సినిమాను ఏదీ ఆపలేదని మరోసారి ఈ ఉప్పెనతో రుజువైంది. మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేశారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. చదవండి : (ఆ యాడ్స్లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’!) (ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్) Time and again it is proved that nothing can stop Good Cinema ❤️#100CroreGrossForUppena 🌊 మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు 🙏❤️#BlockbusterUppena#Uppena#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/lAWjiaVjc4 — Mythri Movie Makers (@MythriOfficial) March 6, 2021 -
ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్
డెబ్యూ మూవీతోనే భారీ హిట్ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్, దర్శకుడు. వైష్ణవ్ తేజ్, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం. భారీ అంచానాల మధ్య విడుదలైన ఈ చిత్రం అదే రేంజ్లో కలెక్షన్స్ సాధించింది. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హీరో, హీరోయిన్లకు ఊహించని.. భారీ సర్ప్రైజ్ ఇచ్చారట. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీరిద్దరికి భారీ ఎమౌంట్ గిఫ్ట్గా ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో హీరో వైష్ణవ్ తేజ్కి కోటి రూపాయలు.. హీరోయిన్ కృతీ శెట్టికి 25 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఇప్పటికే చెక్స్ని హీరో, హీరోయిన్లకు ఇచ్చినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారట. గతంలో బుచ్చి బాబుకు కారు లేదా ఇల్లుని ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఉప్పెన’ చిత్రానికి గాను వైష్ణవ్ తేజ్ 50 లక్షల రూపాయల పారీతోషికం తీసుకోగా.. గిఫ్ట్గా అంతకు రెట్టింపు అందుకోవడం విశేషం. ఏది ఏమైనా ఉప్పెన విజయం ఈ మెగా హీరోకు ఇండస్ట్రీలో బలమైన పునాది వేసిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో అల్లు అర్జున్ పుష్ప, మహేష్ బాబు సర్కార్ వారి పాట వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి. చదవండి: బాలీవుడ్లో రీమేక్ కానున్న ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే? -
‘ఉప్పెన’ మేకింగ్ వీడియో కూడా అదుర్స్!
మెగా మేనల్లుడు వైష్ణవ్తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పలు రికార్డులను తిరగరాసింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ను లాభాల్లో ముంచెత్తింది. లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగానూ నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయానికి ప్లస్ అయింది. విలన్ పాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి యాక్టింగ్ సినిమాకే హైలెట్గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఉప్పెన మేకింగ్ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొదటి సినిమాతోనే ఎంతో పరిణతితో నటించిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా టీజర్లు, పాటలు సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి. కరోనా నిబంధనల సడలింపుతో ఉప్పెన 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది. ఇలా ప్రతీ అంశం ఉప్పెన విజయంలో భాగమై సునామీలా వసూళ్లు కురిపిస్తుంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి : (ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు) (వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే?) -
బాలీవుడ్లో రీమేక్ కానున్న ‘ఉప్పెన’
మెగా మేనల్లుడు వైష్ణవ్తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. ఇప్పటికే ఈ సినిమా రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటుతోంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తన కుమారుడు సంజయ్ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని తమిళ సూపర్స్టార్ విజయ్ భావిస్తున్న్ట్లట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందంతో ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాను టాలీవుడ్తో పాటు తమిళ్లో కూడా విడుదల చేయాలని భావించినా విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగుందని, డబ్ చేయడం కంటే రీమేక్ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అంతేకాకుండా తమిళ రీమేక్ రైట్స్ను స్వయంగా విజయ్ సేతుపతి తీసుకోబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్లోనూ ఉప్పెనను రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా ఉప్పెన రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. చదవండి : (‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ) (బాప్రే.. కేజీఎఫ్ 2 తెలుగు రైట్స్కి అన్ని కోట్లా?) -
స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. అయితే ఈ సినిమాను టాలీవుడ్తో పాటు తమిళ్లో కూడా విడుదల చేయాలని తొలుత భావించారట. విజయ్ సేతుపతికి అక్కడ భారీగా క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా ఉప్పెనను తమిళ్లో డబ్ చేసి విడుదల చేయాలని అనుకున్నారట. కానీ విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగుందని, డబ్ చేయడం కంటే రీమేక్ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అందుకే తమిళ్లో విడుదల చేయకుండా కేవలం తెలుగులో మాత్రమే ఉప్పెనను విడుదల చేసింది చిత్ర బృందం. తమిళ రీమేక్ రైట్స్ను విజయ్ సేతుపతి తీసుకోబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాను స్టార్ హీరో కొడుకుతో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్..ఆల్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో ఈ సినిమాపై తమిళ హీరో దళపతి విజయ్ కన్ను పడిందట. ఉప్పెన తమిళ రీమేక్తో కొడుకు జాన్సన్ సంజయ్ను హీరోగా పరిచయం చేయాలని విజయ్ భావిస్తున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పెన ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఉప్పెన తమిళ రీమేక్ పనులు ప్రారంభం కానున్నాయి. మరి అదే జరిగితే హీరోయిన్గా కృతి శెట్టినే తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్తో ప్రయోగం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : (21 ఏళ్ల ఆల్టైం రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’ ) (అదేంటో తెలుసుకోలేను.. బుచ్చిబాబుపై సుకుమార్ ఎమోషనల్) -
కారు లేదా ఇల్లు: ఉప్పెన దర్శకుడికి ఆఫర్!
కంటెంట్ బాగుంటే చాలు, కొత్త, పాత, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన "ఉప్పెన" చిత్రం బాక్సాఫీస్ మీద దాడి చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తన ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తీసిన ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుందని దర్శకుడు సుకుమార్ గతంలోనే చెప్పాడు. ఇప్పటికైతే హాఫ్ సెంచరీని అవలీలగా దాటేయగా, ఈ సినిమా చాలా బాగుందంటూ పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా వుంటే 'డియర్ కామ్రేడ్', 'సవ్యసాచి' సినిమాలతో నిండా మునిగిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ను ఉప్పెన సునామీలా వచ్చి ఆదుకుంది. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని పూడ్చుతూ లాభాల బాట పట్టించింది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.. దర్శకుడు సానా బుచ్చిబాబుకు ప్రత్యేక బహుమతిచ్చేందుకు రెడీ అయ్యారట. ఇల్లు లేదా కారులో ఏది కావాలో కోరుకోమని బుచ్చిబాబును అడిగినట్లు సమాచారం. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్కు ఆ రెండూ ఇచ్చినా తప్పు లేదని అంటున్నారు. కాగా మంచి విజయాలు నమోదు చేసుకున్న ఛలో, ప్రతిరోజు పండగే సినిమాలకుగానూ దర్శకులు వెంకీ, మారుతిలకు కార్లు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పది సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బిజీబిజీగా మారింది. సూపర్స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా చెయ్యనున్నారు. నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్తో చేస్తున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్, నటసింహా నందమూరి బాలకృష్ణ – గోపిచంద్ మలినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్తో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా తన తర్వాతి రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీస్ బ్యానర్లోనే చేయనున్నట్లు సమాచారం. చదవండి: ‘నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’బుచ్చిబాబు’ మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు! -
నాకూ ఫ్యాన్స్ ఉంటారని ఊహించలేదు
‘‘యాక్టింగ్ అంటే నాకు ఇష్టమే కానీ యాక్టర్గా మాత్రం కెరీర్ను ఊహించుకోలేదు. నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. కానీ ‘ఉప్పెన’ కథ విన్నాక ఈ సినిమా చేయాలనిపించింది. కథ విని, ఏడ్చాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది’’ అని కృతీ శెట్టి అన్నారు. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు. ♦మా స్వస్థలం బెంగళూరు. కానీ ముంబైలో పుట్టి, పెరిగాను. నాన్న వ్యాపారవేత్త. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేశాను. దర్శకుడు బుచ్చిబాబు నన్ను ఎక్కడో చూసి ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. మొదట్లో ఇప్పుడే సినిమాలు చేయకూడదని అనుకున్నాను. ఎందుకంటే సైకాలజీ చదువుకుంటున్నాను. అయినప్పటికీ కథ విందామని వచ్చి, నచ్చడంతో ఓకే చేశాను. ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్ చేశాను. బేబమ్మది బబ్లీ అండ్ హైపర్ క్యారెక్టర్. చాలా ఎక్స్ప్రెసివ్. నేనే బేబమ్మనని ఊహించుకుని చేశాను. అందుకే స్క్రీన్పై అంత బాగా వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ వివేక్, చిత్రబృందం సహాయం చేయడం వల్లే నేను తెలుగు ఇంత త్వరగా, ఇంత బాగా నేర్చుకోగలిగాను. ♦ఈ సినిమా కోసం ప్రత్యేకమైన యాక్టింగ్ క్లాసులు ఏం తీసుకోలేదు. యాడ్స్ చేసిన అనుభవం ఉపయోగపడింది. నాకు వచ్చినదాన్ని సహజంగా చేశాను. తెలుగు నేర్చుకోవడానికి మాత్రం కొన్ని వర్క్ షాప్స్ చేశాం. వైష్ణవ్ తేజ్ బ్రిలియంట్ యాక్టర్. మంచి సపోర్టింగ్ కో స్టార్. విజయ్సేతుపతిగారితో నాకో పెద్ద ఎమోషనల్ సీన్ ఉంది. ఇంత పెద్ద యాక్టర్తో ఎలా చేయాలా? అని భయపడ్డాను. కానీ ఆయన హెల్ప్ చేశారు. యాక్టింగ్ టిప్స్ కూడా చెప్పారు. ♦ఓ భావోద్వేగభరితమైన సన్నివేశాన్ని చిత్రీకరించిన తర్వాత, నా నటన చూసి మా సినిమాటోగ్రాఫర్తో పాటు చిత్రబృందంలోని కొందరు ఏడ్చారు. అంత బాగా చేసినందుకు నాకు చాలా గర్వంగా, హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా జర్నీలో నాకు ఇదొక మంచి జ్ఞాపకం. అయితే నా ఇంట్రడక్షన్ సీన్ కోసం మాత్రం ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. ♦ఈ సినిమాతో అసోసియేట్ అయ్యాక దర్శకుడు సుకుమార్ను కలిశాను. ఆయన ఇచ్చిన ధైర్యాన్నే నేను సినిమాలో క్యారీ చేశాను. నా తొలి సినిమాకే సుకుమార్, మైత్రీమూవీ మేకర్స్, దేవి శ్రీ ప్రసాద్గారు వంటివారితో అసోసియేట్ అవ్వడాన్ని అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. హీరోయిన్స్లో దివంగత నటి శ్రీదేవిగారు, సమంత నాకు స్ఫూర్తి. ♦‘ఉప్పెన’ సినిమాను కొందరు ప్రముఖులు చూశారు. చిరంజీవిగారు బిగ్ స్టార్. నాకు ఇన్స్పిరేషన్. అలాంటి ఆయన మా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నన్ను అభినందించడం చాలా గర్వంగా అనిపించింది. దర్శకులు కొరటాల శివ, సుకుమార్, మా నిర్మాతలు రవిశంకర్, నవీన్గార్లు కూడా నా పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పారు. ♦సోషల్ మీడియాలో నాకు ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయని నా సన్నిహితులు చెప్పారు. నాక్కూడా ఫ్యాన్స్ ఉంటారని ఎప్పుడూ ఊహించలేదు. నిజానికి నేనే చాలామంది స్టార్స్కు అభిమానిని. నా అభిమానుల సపోర్ట్ అండ్ లవ్కు థ్యాంక్స్. ♦‘ఉప్పెన’ సినిమా విడుదలయ్యాకే కొత్త సినిమాలకు ఓకే చెబుదాం అనుకున్నాను. కానీ కథలు నచ్చడంతో ‘శ్యామ్ సింగరాయ్, ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నాను. -
మిస్సైల్
ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు ‘న్యూక్లియర్’ లేదా ‘మిస్సైల్’ అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారట. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో రామ్చరణ్ మరో హీరో. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసే సినిమా ఆరంభమవుతుందని తెలిసింది. -
హరీశ్ మరో చిత్రం.. పవన్ ఫ్యాన్స్కు డౌట్
‘గద్దలకొండ గణేష్’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు క్రేజీ డైరెక్టర్ హరీశ్ శంకర్. తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో ఓ చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హరీశ్ కాంబినేషన్లో వస్తున్న పవన్ 28వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే కథ, స్క్రిప్ట్ను సిద్దం చేసిన దర్శకబృందం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతోంది. అంతేకాకుండా లాక్డౌన్ అనంతరం నిర్వీరామంగా షూటింగ్ జరిపేందుకు పూర్తి సన్నద్దమవుతోంది చిత్ర బృందం. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కాక ముందే మరో చిత్రాన్ని లైన్లో పెట్టారు హరీశ్ శంకర్. ఈ విషయాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. హరీశ్తో ఓ సినిమా చేస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఇదే నిర్మాణ సంస్థలో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దల కొండ గణేష్’ చిత్రం తెరకెక్కించాడు హరీశ్. దీన్ని ఉద్దేశిస్తూ ‘గద్దల కొండ గణేష్ తర్వాత మరోసారి పవర్ఫుల్ దర్శకుడు హరీశ్తో పనిచేసేందుకు ఆనందంగా ఉన్నాం. త్వరలోనే ఇతర వివరాలు తెలియజేస్తామ’ని 14 రీల్స్ ప్లస్ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్తో పవన్ అబిమానుల్లో అనుమానాలు రేకెత్తాయి. పవన్-హరీశ్ సినిమా వాయిదా పడిందా అనే అనుమానంతో ఓ అబిమాని హరీశ్కు ట్వీట్ చేశాడు. ‘హరీశ్ అన్నా నువ్వు ఎన్ని సినిమాలైనా చేయ్. కానీ తర్వాతి చిత్రం పవన్తోనే ఉండాలి. అది కూడా చరిత్ర సృష్టించాలి’ అని పవర్స్టార్ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. దీనికి ప్రతి స్పందనగా ‘ తమ్ముడు.. పవర్స్టార్ మూవీ స్క్రిప్ట్, మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నాయి. నేను చేసే ఏ ప్రాజెక్ట్ అయినా పవన్ చిత్రం తరువాతే ఉంటుంది. నేను కూడా మీలాగే పవన్కు వీరాభిమాని అని మర్చిపోకు’ అంటూ హరీశ్ ట్వీట్ చేశారు. ఇక హరీశ్-పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్తో పాటు పవర్స్టార్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలను పెట్టుకుంది. We are proud and happy to be working with Powerful Director @harish2you garu again after #GaddalakondaGanesh! More details to be announced once the Industry is back to business post lockdown! — 14 Reels Plus (@14ReelsPlus) May 18, 2020 చదవండి: హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు 42 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్ Thammudu..... Power Star movie script work and music work under progress!! What ever may be the new commitment would be only after #PSPK28 👍👍 Nenu kooda mee lanti Fan ani marchipoku!! https://t.co/9PdjDRsKIQ — Harish Shankar .S (@harish2you) May 18, 2020 -
సమంత కోసం ‘మైత్రీ’ భారీ ప్లానింగ్!
అక్కినేని ఇంటి కోడలుగా మారిన తర్వాత కేవలం కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటిస్తున్నారు సమంత. గ్లామరస్ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఈ క్రమంలో దక్షిణాదిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా కూడా నిలుస్తున్నారు. యు టర్న్, సూపర్ డీలక్స్, ఓ బేబీ వంటి చిత్రాలు సూపర్హిట్ కావడంతో ఈ తరహా కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు సినిమాలతోనే కాకుండా డిజిటల్ రంగంలోనూ ఆమె అడుగు పెట్టారు. `ద ఫ్యామిలీ మెన్` వెబ్ సిరీస్ సీజన్2లో ఓ నెగటీవ్ పాత్రలో నటిస్తున్నానని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారామె. ఈ క్రమంలో మహేష్బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమంతతో ఓ భారీ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ చిత్రమని తెలుస్తోంది. సమంతతో ఓ సినిమా చేయాలని మైత్రీ ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా ఆమెతో ఓ సినిమా కమిట్మెంట్ కూడా తీసుకున్నారు. దీంతో సమంతతో చిత్రాన్ని చేసేందుకు మంచి కథ, డైరెక్టర్ కోసం ఈ నిర్మాణ సంస్థ అన్వేషిస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు మైత్రీ మూవీస్ ఆఫీసులోనే జరుగుతున్నాయి. దాంతో పాటు సమాంతరంగా సమంత కథపై కూడా వర్క్ చేస్తున్నారు. మరి సమంతకి తగిన కథ ఎప్పుడు సిద్దమవుతుందో వేచి చూడాలి. చదవండి: ప్రియా షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్ ‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా? -
పవన్ కల్యాణ్.. ‘ఇప్పుడే మొదలైంది’?
రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్. ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ డైరెక్షన్లో ‘విరూపాక్ష’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తున్నారు.పీరియాడిక జానర్లో తెరకెక్కుత్ను ఈ చ్రితంలో పవన్ క్యారక్టరైజేషన్ రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. క్రిష్ చిత్రం తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ నటించనున్నారు. గబ్బర్సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. పవన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ను డైరెక్టర్ సిద్దం చేసి పెట్టుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మలయాళ నటి మానసా రాధాకృష్ణన్ హీరోయిన్గా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్-హరీష్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రానికి ‘ఇప్పుడే.. మొదలైంది’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు లీకువీరులు పేర్కొంటున్నారు. గబ్బర్ సింగ్ విడుదలై 8 ఏళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్ చేసిన ట్వీట్తో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఈ ట్వీట్లో ‘ఇప్పుడే మొదలైంది.. మేము మళ్లీ వస్తున్నాం' అని పేర్కొన్నారు. అలాగే, ఆ తర్వాత చేసిన ట్వీట్లలో కూడా ఆ టైటిల్ను హైలైట్ చేయడంతో సినిమా పేరు అదే అని అందరూ ఫిక్సయ్యారు. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: ‘జాన్వీ కపూర్’ వెనక ఇంత కథ ఉందా? శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్ Thanks again for the overwhelming appreciations and celebrations.... 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg — Harish Shankar .S (@harish2you) May 11, 2020