scooter
-
ఒక స్కూటర్ ట్రాఫిక్ చలాన్లు 311
బెంగళూరు: అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేసే బ్యాటర్ క్రికెట్ మైదానంలో 300 పరుగులు చేస్తే అద్భుతం అంటాం. అయితే ఒక గేర్లెస్ స్కూటర్ యజమాని క్రికెట్ గ్రౌండ్లో కాకుండా నడిరోడ్డుపై ట్రిపుల్ సెంచరీచేశాడు. అయితే అది పరుగుల రూపంలో కాకుండా ట్రాఫిక్ చలాన్ల రూపంలో. ఒకే స్కూటర్పై ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు ఉండటం చూసి కర్ణాటకలోని వాహన వినియోగదారులు ఔరా అని అచ్చెరువొందారు. ఈ ఘటనకు బెంగళూరు మహానగరం వేదికైంది. సోమవారం బెంగళూరు సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ఈ స్కూటర్ యజమాని ఈ 311 చలాన్లకు జరిమానా కింద రూ.1,61,500 కట్టేసి జప్తులో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లడంతో ఈ కథ సుఖాంతంగా ముగిసింది. ఇన్ని చలాన్లు ఎలా ? కలాసిపాళ్య ప్రాంతానికి చెందిన పెరియస్వామికి ఒక గేర్లెస్ స్కూటర్ ఉంది. ఇతను ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం చేస్తాడు. ఇతనికి సమీప బంధువు సుదీప్ వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు. సుదీప్కు తరచూ స్కూటర్పై వెళ్తూనే ఫోన్ మాట్లాడే అలవాటు ఉంది. హెల్మెట్ అస్సలు ధరించడు. ట్రావెల్ ఏజెన్సీ వ్యవహారాలన్నీ బండితోపాటే ఫోన్లోనే నడిపిస్తాడు. అత్యధికంగా ఇతను నడిపేటప్పుడు ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. రెడ్ సిగ్నల్ దాటి వెళ్లడం, రాంగ్ రూట్, హెల్మెట్ ధరించకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఇలా పలు రకాల చలాన్లు అలా పడుతూనే ఉన్నాయి. సుదీప్గానీ, స్కూటర్ యజమాని పెరియస్వామిగానీ ఏనాడూ ఈ చలాన్లు కట్టలేదు. దీంతో చలాన్లు చాంతాడంత పెరిగిపోయాయి. పెరియస్వామి, సుదీప్, మరో వ్యక్తి ఈ స్కూటర్ను వాడినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో శిభమ్ అనే వ్యక్తి సరదాగా చలాన్లను ఆన్లైన్లో చెక్ చేస్తున్న సమయంలో ఈ స్కూటర్ నంబర్ప్లేట్ మీద వేల రూపాయల చలాన్లు నమోదైన విషయం గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో శిభమ్ ఇటీవల ఒక భారీ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ స్కూటర్పై నమోదైన చలాన్ల సంఖ్యను గత ఏడాది కాలంగా గమనిస్తూ ఉన్నా. ఎప్పటికప్పుడు కొత్త చలాన్లు వస్తూనే ఉన్నాయి. కట్టాల్సిన జరిమానా పెరుగుతూనే ఉంది. ఇప్పుడది రూ.1లక్ష నుంచి రూ.1,60,000 దాటింది. ఇప్పటికైనా పోలీసులు మేలుకొని దానిని సీజ్ చేస్తారా? లేదంటే కొత్త రికార్డ్ సృష్టించేదాకా అలాగే రోడ్లపై తిరగనిస్తారా?’’అంటూ అతను చేసిన పోస్ట్ వైరల్గా మారింది. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. విషయం చివరకు పోలీసులకు తెలియడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఓనర్ను పిలిపించి స్కూటర్ను స్వాదీనం చేసుకున్నారు. అప్పటికిగానీ ఓనర్కు ఈ విషయం తెలియలేదు. పోలీస్స్టేషన్కు బంధువు సుదీప్ను రప్పించి వాళ్ల ముందే చీవాట్లు పెట్టినట్లు వార్తలొచ్చాయి. 311 చలాన్లను ఒకేసారి ప్రింట్ తీస్తే 20 అడుగుల పొడువు పేపర్ బయటికొచి్చంది. ఎట్టకేలకు హెల్మెట్ వందల చలాన్ల గేర్లెస్ స్కూటర్ అంశం నగరంలో హాట్టాపిక్గా మారడంతో పోలీసులు వెంటనే యజమానితో జరిమానా మొత్తాన్ని కట్టేలా ఒప్పించినట్లు వార్తలొచ్చాయి. సోమవారం సుదీప్ ఈ మొత్తాన్ని కట్టేసి వాహనాన్ని వెంటతీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుదీప్ ఒక కొత్త హెల్మెట్ను ధరించారు. ‘‘ఇకనైనా చలాన్ల సెంచరీలు కొట్టడం ఆపండి’’అని పోలీసులు అతనికి హితబోధ చేసి పంపించారు. జరిమానా కట్టించుకుని ఊరకే వదిలేయకుండా ఇలాంటి వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్చేశారు. -
తక్కువ ధర.. మంచి మైలేజ్: ఇదిగో టాప్ 5 స్కూటర్స్
చాలామంది తక్కువ ధర వద్ద ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ తరహా వాహనాలను మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ కథనాల్లో రూ. 1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే.. మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125)యమహా కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన 'రే జెడ్ఆర్ 125' రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 87,800 (ఎక్స్ షోరూమ్). 52 కిమీ / లీ మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 8.2 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5.2 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఇందులో ఉంటుంది.సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ 125 (Suzuki Burgman Street 125)రూ. 96,800 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న.. సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ 125 ఒక లీటరుకు 50 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో 124 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న బర్గ్మన్ స్ట్రీట్ 125 ఏకంగా 5.5 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది మార్కెట్లోని ఇతర స్కూటర్ల కంటే భిన్నంగా ఉంటుంది.యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)యమహా ఫాసినో 125 ధర రూ. 83000 నుంచి రూ. 97500 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఆరు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ 49 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 125 సీసీ ఇంజిన్ 6500 rpm వద్ద 8.2 పీఎస్ పవర్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఉపయోగపడే స్కూటర్లలో ఇది కూడా ఒకటి.హీరో ప్లెజర్ ప్లస్ (Hero Pleasure Plus)హీరో ప్లెజర్ ప్లస్ ధర రూ. 70,500 నుంచి రూ. 74,000 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 4.8 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. 110 సీసీ ఇంజిన్ ద్వారా ఇది 8.15 పీఎస్ పవర్ అందిస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. రైడర్లకు కావలసిన ఫీచర్స్ కలిగి ఉంటుంది.సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125)మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో సుజుకి అవెనిస్ 125 ఒకటి. ఇది 49.6 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 94,500 నుంచి రూ. 95,300 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. -
60 కిమీ మైలేజ్: రూ. లక్ష కంటే తక్కువే..
భారతదేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభించే.. అధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.టీవీఎస్ జుపీటర్ 125 (TVS Jupiter 125)మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతూ.. ఎందోమందిని ఆకర్షిస్తున్న టీవీఎస్ జుపీటర్ 125 ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్ల జాబితాలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 96000 (ఎక్స్ షోరూమ్). ఇది 60 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్ ద్వారా 8.15 Bhp పవర్, 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకించి రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)రూ.79990 ప్రారంభ ధర వద్ద లభించే యమహా ఫాసినో 125 సీసీ ఇంజన్తో పాటు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. కాబట్టి ఇది పెట్రోల్, విద్యుత్ రెండింటిలోనూ నడుస్తుంది. ఇది 66 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది మంచి డిజైన్, రైడర్లకు కావలసిన ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: రూ. 22.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్హోండా యాక్టివా 6జీ (Honda Activa 6G)భారతదేశంలో యాక్టివా 6జీ అనేది హోండా మోటార్సైకిల్ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఇది 109.51 సీసీ ఇంజిన్ ద్వారా 7.73 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. దీని టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ. 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 78000 నుంచి రూ. 84000 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
మార్కెట్లోకి హీరో కొత్త స్కూటర్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp).. న్యూ డెస్టినీ 125 (New Destini 125) స్కూటర్ను విడుదల చేసింది. దీంతో 125సీసీ స్కూటర్ మార్కెట్లో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతికత, అసాధారణమైన మైలేజ్, టైమ్లెస్ డిజైన్ను మిళితం చేస్తూ పట్టణ వాహనదారుల కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.హీరో న్యూ డెస్టినీ 125 స్కూటర్.. డెస్టిని 125 వీఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) వరుసగా రూ.80,450, రూ.89,300, రూ.90,300.ప్రత్యేకంగా పట్టణ వాహనదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన న్యూ డెస్టినీ 125.. వాహనదారుల భద్రత, సౌలభ్యం కోసం 30 పేటెంట్ అప్లికేషన్లతోపాటు ఇల్యూమినేటెడ్ స్టార్ట్ స్విచ్లు, ఆటో-కాన్సల్ వింకర్ల వంటి సరికొత్త ఫీచర్లతో వచ్చింది.‘హీరో డెస్టిని 125 అనేది మా ఆవిష్కరణ-ఆధారిత విధానానికి, పర్యావరణ అనుకూల చైతన్యాన్ని అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. 59 కి.మీ మైలేజ్, అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్ ఆధునిక రైడర్లకు గేమ్-ఛేంజర్’ హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్జిత్ సింగ్ పేర్కొన్నారు. -
సరికొత్తగా హోండా యాక్టివా 125
గురుగ్రామ్: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా అధునాతన ఫీచర్లతో సరికొత్త యాక్టివా 125 స్కూటర్ను విడుదల చేసింది. రూ.94,422 ధరతో డీఎల్ఎక్స్, రూ.97,146 ధరతో హెచ్–స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. బ్లూటూత్ అనుసంధానంతో 4.2 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే కలిగి ఉంది. 123.99 సీసీ సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్ పీజీఎం–ఎఫ్ఐ ఇంజిన్తో తయారైంది. ఇది 6.20 కిలోవాట్ల శక్తిని, 10.5ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది. యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ సదుపాయం ఉంది. పర్ల్ ఇగ్నోస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పర్ల్ సిరెన్ బ్లూ, రెబల్ రెడ్ మెటాలిక్, పర్ల్ ప్రీసియఎస్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఈ సరికొత్త 2025 హోండా యాక్టివా 125 స్కూటర్ దేశవ్యాప్తంగా అన్ని డీలర్ల వద్ద అందుబాటులో ఉందని హెచ్ఎంఎస్ఐ తెలిపింది. -
బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు!
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల స్కూటర్ లభిస్తోంది. రూ.14.90 లక్షలకు కూడా స్కూటర్ లభిస్తోంది. దేశీయ విఫణిలో ఎన్నెన్ని స్కూటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారులు మాత్రం తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కథనంలో సరసమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.హీరో ప్లెజర్ ప్లస్మహిళలకు ఇష్టమైన స్కూటర్ల జాబితాలో ఒకటైన 'హీరో ప్లెజర్ ప్లస్' సరసమైన స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 70577. రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 Bhp పవర్, 8.7 Nm టార్క్ అందిస్తుంది. దీనిని మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా రోజువారీ వినియోగం కోసం కొనుగోలు చేస్తారు.టీవీఎస్ జెస్ట్ 110టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన జెస్ట్ 110 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 73728 మాత్రమే. ఇది కూడా రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.7 Bhp పవర్, 8.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.హోండా డియోఅతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన లేదా అత్యధిక అమ్మకాలు పొందిన స్కూటర్ల జాబితాలో ఒకటి ఈ హోండా డియో. ఈ స్కూటర్ ధర రూ. 75409. ఇది మూడు వేరియంట్లు, తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటర్లోని 109 సీసీ ఇంజిన్ 7.75 Bhp, 9.03 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఇప్పటికి 30 లక్షల కంటే ఎక్కువ హోండా డియో స్కూటర్లు అమ్ముడైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దీనికి భారతదేశంలో ఎంత డిమాంద్ ఉందో అర్థం చేసుకోవచ్చు.హీరో జూమ్ (Hero Xoom)హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన జూమ్ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.05 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 75656. ఈ స్కూటర్ చూడటానికి కొంత ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇది నాలుగు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లుహీరో డెస్టినీ ప్రైమ్ఇక చివరగా మన జాబితాలో చివరి సరసమైన స్కూటర్ 'హీరో డెస్టినీ ప్రైమ్'. ఈ స్కూటర్ ధర రూ. 76,806. ఇందులో 124.6 సీసీ ఇంజిన్ 9 Bhp పవర్, 10.36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కానీ మూడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. -
టాప్ 10 స్కూటర్లు..
టూవీలర్లలో స్కూటర్లది ప్రత్యేకమైన విభాగం. అన్నివర్గాల వారూ స్కూటర్లను నడిపేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలో వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన అక్టోబర్లో జరిగిన విక్రయాల ఆధారంగా టాప్ 10 స్కూటర్లు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..ఆటో న్యూస్ వెబ్సైట్ రష్లేన్ నివేదిక ప్రకారం.. గత అక్టోబర్లో టాప్ 10 స్కూటర్ల అమ్మకాలు 6,64,713 యూనిట్లతో ఏడాది ప్రాతిపదికతోపాటు అంతక్రితం నెలతో పోల్చి చేసినా మెరుగయ్యాయి. ఇవి గతేడాది అక్టోబర్లో 5,22,541 యూనిట్లు, ఈ ఏడాది సెప్టెంబర్లో 6,05,873 యూనిట్లు అమ్ముడుపోయాయి.ఇక అక్టోబర్ నెలలో ఏ స్కూటర్ ఎన్ని యూనిట్లు అమ్ముడుపోయాయో పరిశీలిస్తే.. 2,66,806 యూనిట్లతో హోండా యాక్టివా అగ్ర స్థానంలో ఉంది. మరోవైపు కస్టమర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా ఓలా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఓలా ఎస్1 గత అక్టోబర్లో 41,651 యూనిట్లు అమ్ముడుపోయింది. మొత్తం స్కూటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఎలక్ట్రిక్ విభాగంలో టాప్లో నిలిచింది.ఏ స్కూటర్ ఎన్ని?» హోండా యాక్టివా 2,66,806» టీవీఎస్ జూపిటర్ 1,09,702» సుజుకి యాక్సెస్ 74,813» ఓలా ఎస్1 41,651» టీవీఎస్ ఎన్టార్క్ 40,065» హోండా డియో 33,179» బజాజ్ చేతక్ 30,644» టీవీఎస్ ఐక్యూబ్ 28,923» సుజుకి బర్గ్మన్ 20,479» యమహా రేజర్ 18,451 -
బాక్స్ అనుకుంటున్నారా? ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ - రేటెంతో తెలుసా?
-
ప్రాణం నిలిపి.. ప్రాణాలకు తెగించి
మన్షిదా బాను మంగుళూరులోని కద్రి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. ఈమధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరారు. అక్టోబర్ 23 తెల్లవారు జామున 3.40 కి ఆ స్టేషన్ కి కాల్ వచ్చింది. అక్కడికి దగ్గర్లోని పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో పెద్ద ఆక్సిడెంట్ అయింది. పికప్ వెహికల్, కంటైనర్ ట్రక్కు డీ కొట్టుకున్నాయి. ఇదీ ఆ కాల్. వెంటనే మన్షిదా తన స్కూటీ పై ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె వెళ్ళేటప్పటికి ఆ వాహనాలు తుక్కు తుక్కు అయి ఉన్నాయి. ఒక వ్యక్తి రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. ఆ రెండు వాహనాలలో ఒకదాని క్లీనర్ అతను. మన్షిదా అతడి పరిస్థితిని గమనించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అతడిని అతి కష్టమ్మీద లేపి, తన స్కూటర్ పై నేరుగా ఆ దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి మోసుకెళ్లారు. అతడి ప్రాణాలని నిలబెట్టగలిగారు.ఆమె టైమ్ సైన్స్ ఆమె వేగం, ఆమె ధైర్యం, ఆమెలోని కారుణ్యం, ఆమె యూనిఫామ్.. అన్నీ పంచభూతాల్లా ఒకటై ఆ వ్యక్తి ్రపాణాలను కాపాడాయనే అనుకోవాలి. అదే కనుక.. పోలీస్ కాకుండా ఒక మామూలు వ్యక్తి ఎవరైనా అంతలా గాయపడిన వారిని తీసుకెళితే ప్రైవేటు హాస్పిటల్స్ చేర్చుకుని ఉండేవా?! ‘మేం అడ్మిట్ చేసుకోడానికి లేదు. ఇది పోలీస్ కేస్..‘ అని ఉండేవి.‘వాయు వేగంగా స్పందించి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన కద్రి స్టేషన్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ మన్షిదా బానుకు‘ అభినందనలు అంటూ తెల్లారగానే మంగుళూరు సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ట్వీట్ పెట్టారు. మంగుళూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మన్షిదాకు ప్రశంసలు అందాయి.డ్యూటీ మైండెడ్ మాత్రమే అయి ఉంటే ఘటనా స్థలానికి వెళ్ళగానే ఫార్మాలిటీస్ లో పడి ఉండేవారు మన్షిదా. కానీ ఆమె అలా చేయలేకపోయారు. ఆమెలోని మానవతా హృదయం.. ఉద్యోగ విధి విధానాలను దాటి మరీ స్పందించింది. అందుకు ‘తగిన శిక్ష‘ ఏదైనా ఉందంటే.. అది ప్రమోషనో, ప్రశంసాపత్రమో తప్ప మరొకటి అవుతుందా?! మన్షిదా మాత్రం.. ‘నేను చేసింది ఏముందీ..!‘ అని చిరునవ్వుతో అంటున్నారు.. తనపై కురుస్తున్న అభినందనల జల్లులలో తడిసి ముద్ద అవుతూ.సాహసాన్ని వెన్నెముకగా ధరించే వాళ్లకు అసాధ్యం ఉండదు. హై–రిస్క్ అనేది ఉండదు. ఈ విషయాన్ని మరోసారి అక్షరాలా నిరూపించింది పైలట్ రీనా వర్గీస్. అడవిలో, అత్యంత ప్రతికూల పరిస్థితులలో ప్రాణాపాయంలో ఉన్న జవాన్ను ఆస్పత్రికి తరలించింది. రీనా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో... 2009లో సీనియర్ పోలీసు అధికారులను తీసుకు వెళుతున్న హెలికాప్టర్ను మావోయిస్ట్లు కూల్చివేశారు. తాను చేస్తున్న ఉద్యోగం ఎంత రిస్క్ అనేది అర్థం చేసుకోవడానికి ఆ సంఘటన రీనాకు ఉపయోగపడింది.తాజా విషయానికి వస్తే...మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కమాండోలు, మావోయిస్ట్లకు మధ్య ఎనిమిది గంటల పాటు జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో ఒక కమాండో తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్ట్ల రాకెట్ దాడులకు అవకాశం ఉన్న ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడిన కమాండోను అక్కడి నుంచి తరలించడం అంటే ్రపాణాలను పణంగా పెట్టడమే. ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని అందుకున్న రీనా వర్గీస్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా హన్స్ హెలికాప్టర్తో రంగంలోకి దిగింది. కో–పైలట్కు కమాండ్స్ అందజేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో హెలికాప్టర్ను వీలైనంత వరకు దించి కిందికి దూకింది.తాడు సహాయంతో గాయపడిన కమాండోను హెలికాప్టర్లోకి తీసుకువచ్చింది. 30 నిమిషాలలో గడ్చిరోలికి అక్కడి నుండి నాగ్పూర్ తరలించింది. మూడు బుల్లెట్లు తగిలిన కమాండోకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో బి.టెక్ చేసిన రీనా వర్గీస్ గతంలో ఎన్నో ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో బాధితులను లక్షద్వీప్ నుంచి కొచ్చికి తరలించే రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొని ప్రశంసలు అందుకుంది. -
జుపీటర్ 125 Vs యాక్టివా 125: ఏది బెస్ట్?
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి ''టీవీఎస్ జుపీటర్ 125, హోండా యాక్టివా 125''. ఈ రెండూ 125సీసీ విభాగంలోనే స్కూటర్లు. కాబట్టి ఈ రెండు స్కూటర్లలో ఏ స్కూటర్ కొనుగోలు చేయాలి?, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ధరలు, మైలేజ్ వంటి విషయాలు కొంత గందరగోళాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాంటి వారికోసం ఈ కథనం ఓ చక్కని పరిష్కారం..టీవీఎస్ జుపీటర్ 125, హోండా యాక్టివా 125 స్కూటర్స్ రెండూ డిజైన్, ఫీచర్స్ పరంగా కూడా ఉత్తమంగా ఉంటాయి. కాబట్టి ధర, మైలేజ్, కలర్ ఆప్షన్స్ అన్నీ బేరీజు వేసుకుని.. అవసరాలకు దృష్ట్యా నచ్చిన స్కూటర్ ఎంచుకోవడం అనేది పూర్తిగా కొనుగోలు చేసే వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. -
‘హెల్మెట్ లేకుండా స్కూటర్పై మొసలి’
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎప్పుడు ఎలాంటి విచిత్రాలు కనిపిస్తాయో ఎవరూ చెప్పలేరు. కడుపుబ్బా నవ్వించే వీడియోలతో పాటు కంగుతినిపించే వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటాయి. ఇదేకోవకు చెందిన ఒక వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.గుజరాత్కు చెందిన ఈ వీడియో ఒక పట్టాన నమ్మేలా లేదు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చ్యపోతున్నారు. భారీ వర్షాలకు నదిలో నుంచి మొసళ్లు బయటకు రావడాన్ని చూసిన జనం.. అలాంటి మొసలి స్కూటర్పై వెళ్లడాన్ని చూసి కంగుతింటున్నారు. ఈ వీడియోలో ఇద్దరు యువకులు స్కూటర్పై వెళుతుండటాన్ని చూడవచ్చు. వారి మధ్య ఓ మొసలి కూడా ఉంది. ఒకరు స్కూటర్ నడుపుతుండగా, మరొకరు ఆ భారీ మొసలిని ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. కుక్కలను, పిల్లులను ఇలా స్కూటర్పై ఎక్కించుకుని తీసుకుని వెళ్లడాన్ని ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. కానీ ఇలా మొసలిని బండిపై తీసుకువెళ్లడాన్ని ఎప్పుడూ చూడలేదని ఈ వీడియో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోను @gharkekalesh అనే ఖాతా ద్వారా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ఎక్స్లో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్లో ‘వడోదరలోని విశ్వామిత్ర నది నుంచి బయటకు వచ్చిన ఒక మొసలిని ఇద్దరు యువకులు స్కూటర్పై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి తీసుకెళ్లారు’ అని రాసివుంది. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ మొసలిని నీటిలో నుంచి బయటకు తీసి, దాని నోటిని తాడుతో కట్టేస్తే అది బలహీనపడిపోతుంది’ అని రాశారు. మరొక యూజర్ ‘సోదరుని ధైర్యానికి వందనం’ అని రాయగా, ఇంకొకరు ‘హెల్మెట్ లేకుండా స్కూటర్పై మొసలి ఎలా వెళుతుంది? అని రాశారు. Two young men took a crocodile found in Vishwamitra river in Vadodara to the forest department office on a scooter🫡pic.twitter.com/IHp80V9ivP— Ghar Ke Kalesh (@gharkekalesh) September 1, 2024 -
మరో స్కూటర్ లాంచ్కు సిద్దమవుతున్న జర్మన్ కంపెనీ
బీఎండబ్ల్యూ మోటోరాడ్ దేశీయ విఫణిలో తన ఉనికిని విస్తరించడంతో బిజీ అయిపోయింది. ఇటీవల సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇప్పుడు సీఈ 02ను లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రూ. 14.90 లక్షలు ఖరీదైన సీఈ04 ప్రస్తుతం దేశంలో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్గా అవతరించింది.బీఎండబ్ల్యూ సీఈ 02 అనేది సీఈ04 కంటే సరసమైనదిగా ఉండనున్నట్లు సమాచారం. ఇది ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎలక్ట్రిక్ కారు స్కూటర్ కాదని కంపెనీ వెల్లడించింది. అయితే 310 సీసీ విభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.సీఈ02 స్కూటర్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ వెహికల్స్ ధరలు, ఇంజిన్ వంటి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. -
సుజుకీ స్కూటర్ ఓనర్లకు అలర్ట్.. 4 లక్షల వాహనాలు రీకాల్!
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ భారత్లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్సైట్లోని వివరాల ప్రకారం యాక్సెస్ 125 అత్యధికంగా 2,63,788 యూనిట్లు, అవెనిస్ 125 మోడల్ 1,52,578 యూనిట్లు, బర్గ్మాన్ స్ట్రీట్ వాహనాలు 72,045 యూనిట్లను ఇగ్నిషన్ కాయిల్లోని హై-టెన్షన్ వైర్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ చేసింది. ఈ వాహనాలు 2022 ఏప్రిల్ 30 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్య కాలంలో తయారయ్యాయి. ఆయా మోడల్ స్కూటర్లు కొనుగోలు చేసినవారిని సంప్రదించే పనిలో కంపెనీ ఉంది. సమీపంలోని సర్వీస్ సెంటర్లో లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేసిస్తుంది.సమస్య ఇదే..వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. డ్రాయింగ్ అవసరాలకు సరిపోని హై టెన్షన్ వైర్ను ఇగ్నిషన్ కాయిల్కు అమర్చడం వల్ల రన్నింగ్ సమయంలో వైర్ కోతలు పడటం, తెగిపోవడం జరుగుతోంది. దీంతో ఇంజన్ ఆగిపోవడం, స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కోతలు పడిన హై టెన్షన్ వైర్ నీటితో తడిసినప్పుడు వాహనం స్పీడ్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్ లీక్ దెబ్బతినే అవకాశం ఉంది.కాగా సుజుకీ మోటర్సైకిల్ కంపెనీ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ మోటార్సైకిల్ వీ-స్ట్రోమ్ 800 డీఈ (V-Strom 800 DE)కి సంబంధించిన 67 యూనిట్లను కూడా రీకాల్ చేసింది. లోపభూయిష్టమైన వెనుక టైర్ దీనికి కారణంగా కంపెనీ చెబుతోంది. బైక్ వెనుక వెనుక టైర్పై పగుళ్లు వస్తున్నాయని, టైర్ ట్రెడ్ బయటకు వచ్చేస్తోందని, టైర్ రూపం దెబ్బతింటోందని కంపెనీ పేర్కొంది. ఆయా వాహనాల యజమానులకు సంప్రదిస్తున్నమని అవసరమైతే వెనుక టైర్ రీప్లేస్ చేస్తామని వివరించింది. ఈ వాహనాలు 2023 మే 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 23 మధ్య కాలంలో తయారయ్యాయి. -
‘స్కూటర్ షవర్’.. మండుడెండల్లో మంచులాంటి ఐడియా!
మనిషి కష్టం వచ్చినప్పుడు వెంటనే పరిష్కారాన్ని కనుగొంటాడు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన పరిష్కార మార్గాలు కనిపిస్తుంటాయి. ఇదే కోవలో వేసవి నుంచి తప్పించుకునేందుకు ఓ కుర్రాడు చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఉత్తరాదిన భానుడు భగభగ మండుతున్నాడు. జనం కూలర్లు, ఏసీలను అశ్రయిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగును తీసుకు వెళుతున్నారు. అయితే రాజస్థాన్కు చెందిన ఒక యువకుడు మండుతున్న ఎండల నుంచి ఉపశమనానికి ‘స్కూటర్ షవర్’ తయారు చేసి, ఎండల్లో చల్లగా తిరుగుతున్నాడు. స్కూటర్కి షవర్ను అమర్చడం వల్ల ఎక్కడికెళ్లినా కూల్గా ఉంటున్నదని ఆ యువకుడు కనిపించిన అందరికీ చెబుతున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఈ క్లిప్ను ఇన్స్టాగ్రామ్ పేజీ ‘ఫన్ విత్ సింగ్’లో షేర్ చేశారు. ఈ స్కూటర్ షవర్ తయారు చేసిన వ్యక్తి తన స్కూటర్ లెగ్ స్పేస్లో వాటర్ కంటైనర్ను ఉంచాడు. దానిని నీటితో నింపాడు. దానికి ఒక గొట్టం అమర్చి ట్యాప్ ఫిట్ చేశాడు. చిన్నపాటి మోటారు అమర్చి పైన షవర్ నుంచి నీటి జల్లులు కురిసేలా ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి స్కూటర్పై వెళుతున్నప్పుడు షవర్ నుంచి చిరు జల్లులు అతనిపై పడటాన్ని వీడియోలో మనం గమనించవచ్చు. India is not for beginners 😅#heatwave #Garmi pic.twitter.com/FiXHhOkhQ3— Sneha Mordani (@snehamordani) June 17, 2024 -
భారత్లో జపనీస్ బ్రాండ్ స్కూటర్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
జపనీస్ టూ వీలర్ తయారీ సంస్థ యమహా దేశీయ మార్కెట్లో 'ఫాసినో ఎస్' వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ స్కూటర్ ధర ధర రూ. 93730 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఆన్సర్ బ్యాక్ అనే ఫైండ్ మై స్కూటర్ యాప్ కూడా ఉంది.యమహా ఫాసినో ఎస్ వేరియంట్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.2 హార్స్ పవర్ మరియు 10.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని బరువు కేవలం 99 కేజీలు మాత్రమే. ఇది 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది.యమహా ఫాసినో ఇప్పుడు డ్రమ్, డిస్క్, ఎస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 79900, రూ. 91130, రూ. 93730 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపీటర్ 125, యమహా రే జెడ్ఆర్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల రీకాల్
టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐకూబ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. జులై 10, 2023 నుంచి సెప్టెంబర్ 9, 2023 మధ్య తయారు చేసిన వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్’ కోసం ఐకూబ్ మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తున్నారు. వాహనాల సామర్థ్యం ఎలాఉందో నిర్థారించుకోవడానికి బ్రిడ్జ్ ట్యూబ్ను తనిఖీ చేయనున్నారు. అందులో ఏదైనా సమస్యలుంటే కస్టమర్లకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే సర్వీసు చేస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించి డీలర్ భాగస్వాములు వ్యక్తిగతంగా కస్టమర్లను సంప్రదిస్తారని సంస్థ పేర్కొంది. -
స్కూటర్పై తిరుగుతూ.. స్మృతీ ఇరానీ సందడి!
ఉత్తరప్రదేశ్లోని తన లోక్సభ నియోజకవర్గం అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్కూటర్పై తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. అలాగే పలువురితో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ మీడియాకు కనిపించారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.స్మృతి ఇరానీ ఈరోజు (సోమవారం) అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019లో ఆమె కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓడించి, ఈ సీటును సొంతం చేసుకున్నారు. స్మృతి ఇరానీ ఆదివారం నాడు అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకున్నారు. కాగా అమేథీ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయనున్నారనే విషయాన్ని కాంగ్రెస్ ఇంతవరకూ వెల్లడించలేదు. అమేథీ.. కాంగ్రెస్కు కంచుకోటగా పేరొందింది. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. -
FM Nirmala Sitharaman: దేశ ఆర్థికమంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా?
కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసినంత డబ్బు తన దగ్గర లేదని ఇప్పటికే పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రచారంలో మాత్రం పాల్గొంటానని స్పష్టం చేశారు. ఒక ఆర్థిక మంత్రి దగ్గర డబ్బు లేదు అన్న మాటలు కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ.. అది నిజమే అని తాజాగా వెల్లడైన కొన్ని విషయాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రికి కొంతవరకు ఆస్తులు ఉన్నప్పటికీ.. అప్పులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో రాజ్యసభ సభ్యురాలిగా నామినేషన్ వేసిన సమయంలో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆమె ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ రూ. 2.53 కోట్లుగా ఉంది. నిర్మలా సీతారామన్కు ఉన్న మొత్తం ఆస్తిలో రూ. 1.87 కోట్ల స్థిరాస్థులు, రూ.65.55 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు సమాచారం. అప్పు రూ.26.91 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. 2016లో సీతారామన్ ఆస్తి విలువ రూ. 99.36 లక్షలు కాగా, 2022 నాటికి రూ. 1.7 కోట్లకు పెరిగింది. 2024 నాటికి ఈ ఆస్తి విలువ కొంత వరకు పెరిగి ఉండవచ్చు. 2016, 2022 డిక్లరేషన్ల ప్రకారం నిర్మలా సీతారామన్కు ఒక 'బజాజ్ చేతక్' స్కూటర్ ఉన్నట్లు సమాచారం. 2016లో రూ.7.87 లక్షల విలువైన 315 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. 2022 నాటికి బంగారం పరిమాణం పెరగలేదు, కానీ పెరిగిన ధరల కారణంగా ఆ బంగారం విలువ దాదాపు రెండింతలు పెరిగి రూ.14.49 లక్షలకు చేరుకుంది. ఇప్పటి ధరల ప్రకారం బంగారం విలువ రూ. 19.4 లక్షల నుంచి రూ. 21.18 లక్షల వరకు ఉంటుంది. -
డ్రైవింగ్ మణి @ 71
వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం. 1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది. స్కూటర్ నుంచి జేసీబీ వరకు సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు. సంకల్పంతో నిలబెట్టింది.. రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రికార్డ్ల చక్రం ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి. సోషల్ మీడియాలో.. రాధామణి ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్లిఫ్ట్లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో తన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. -
ఈ యమహా స్కూటర్లలో ప్రాబ్లమ్.. 3 లక్షల యూనిట్లు రీకాల్!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారు సంస్థ యమహా ( Yamaha ) తమ కస్టమర్లకు అత్యవసర సమాచారం ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 4 మధ్య కాలంలో తయారు చేసిన దాదాపు 3 లక్షల యూనిట్ల 125cc స్కూటర్లను తక్షణమే అమలులోకి వచ్చేలా స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్కూటర్లు ఇవే.. కంపెనీ వెల్లడించిన ప్రకారం.. ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. Ray ZR 125 Fi హైబ్రిడ్, Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్ మోడల్స్ (2022 జనవరి తరువాతి మోడల్స్) ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో ఉన్న సమస్యను పరిష్కరించడమే రీకాల్ లక్ష్యంగా యమహా చెబుతోంది. ఉచితంగానే రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ పార్ట్ కస్టమర్కు ఉచితంగా అందించనున్నట్లు యమహా కంపెనీ వెల్లడించింది. రీకాల్ కోసం అర్హతను ధ్రువీకరించడానికి కస్టమర్లు ఇండియా యమహా మోటర్ వెబ్సైట్లోకి వెళ్లి సర్వీస్ సెక్షన్లోని 'SC 125 వాలంటరీ రీకాల్'ని క్లిక్ చేయాలి. ఇక్కడ బండి ఛాసిస్ నంబర్, వివరాలు నమోదు చేస్తే తదుపరి దశలు వస్తాయి. యమహా 2023 కొత్త 125 cc హైబ్రిడ్ స్కూటర్ శ్రేణి BS-VI OBD2 & E-20 ఫ్యూయల్ కంప్లైంట్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ (FI), 125 cc బ్లూ కోర్ ఇంజన్తో 8.2 PS @ 6,500 RPM పవర్ అవుట్పుట్, 10.3 NM @ 5,000 RPM టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. యమహా అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధితో ఈ 125 Fi హైబ్రిడ్ ఇంజన్ తయారు చేశారు. -
స్కూటర్పై రూ.3.20 లక్షల చలానాలు
కర్ణాటక: ఒక స్కూటర్పై వందలాది ట్రాఫిక్ చలానాలు ఉన్నాయి, మొత్తం జరిమానాలను లెక్కిస్తే రూ. 3.20 లక్షలుగా తేలింది. హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంప్, వన్వేలో, మొబైల్లో మాట్లాడుతూ తదితర ధిక్కారాలకు పాల్పడడం వల్ల ఈ చలానాలు పడ్డాయి. వివరాలు.. సుధామనగరవాసి వెంకటరామన్కు చెందిన కేఏ 05 కేఎఫ్ 7969 నంబరు కలిగిన యాక్టివా స్కూటర్ ఈ ఘనతను సాధించింది. దీనిపై 300 కు పైగా చలానాలు ఉండగా, వాటిని కట్టాలంటే రూ.3.20 లక్షలు కావాలి. స్కూటర్ వద్దు, డబ్బు కట్టు వెంకటరామన్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎస్ఆర్నగర, విల్సన్గార్డెన్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరిగేవాడు. ట్రాఫిక్ పోలీసులు అతని ఇంటికి వెళ్లి జరిమానాలను చెల్లించాలని సూచించారు. దీనికి వెంకటరామన్ ఇంత మొత్తంలో డబ్బు కట్టలేనని, స్కూటర్ను తీసుకెళ్లవచ్చని చెప్పాడు. మాకు స్కూటర్ వద్దు, డబ్బు కట్టు, లేదంటే కేసు పెడతామని పోలీసులు హెచ్చరించి నోటీస్ ఇచ్చారు. గతేడాది రూ.3.22 లక్షలు గతంలో ఆర్టీ.నగరలోని గంగానగరలో ఒక స్కూటీ పెప్పై 2023 డిసెంబరులో రూ.3.22 లక్షల జరిమానాలు ఉన్నట్లు తేలింది. మాలా అనే మహిళకు చెందిన స్కూటీ పై 643 చలానాలు ఉన్నాయి. రూ.50 వేల కంటే అధిక జరిమానా ఉంటే ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల ఇళ్లకు వెళ్లి జరిమానా వసూలు చేస్తున్నారు. -
న్యూ ఇయర్లో లాంచ్ అయిన కొత్త వెహికల్స్ - వివరాలు
గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కవాసకి ఎలిమినేటర్ 500 ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్తో 6-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది. ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే? బజాజ్ చేతక్ ప్రీమియం ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్డేట్లు, నోటిఫికేషన్ అలర్ట్ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు. ఏథర్ 450 అపెక్స్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది. -
సింగిల్ ఛార్జ్తో 160 కిమీ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో సర్వ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'డాట్ వన్' (Dot One) లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, ఆఫర్ వివరాలు వంటి వాటితో పాటు రేంజ్ గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'డాట్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందస్తు డెలివరీలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. పరిచయ ధరలు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ధరల పెరుగుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. నాలుగు కలర్ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 160 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ స్కూటర్ రేంజ్ 151 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? 3.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన సింపుల్ ఎనర్జీ కొత్త స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 72 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీదే పనితీరు పరంగా ఇచ్చి చాలా ఉత్తమంగా ఉంటుంది. డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి.. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త స్కూటర్ భారతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
రాహుల్ గాంధీ రూటే వేరు
-
ఇంట్లో పేలిన స్కూటర్ బ్యాటరీ
హోసూరు: హోసూరు సమీపంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. వివరాల మేరకు సూళగిరి ప్రాంతానికి చెందిన మునిరాజ్ (38)తన కుటుంబసభ్యులతో కలిసి హోసూరు సమీపంలోని కళుగొండపల్లి సుభాష్నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ అదే ప్రాంతంలో సూపర్ మార్కెట్ను నిర్వహిస్తున్నాడు. గత మూడేళ్లుగా బ్యాటరీ స్కూటర్ను ఉపయోగిస్తున్నాడు. అర్ధరాత్రి విస్ఫోటం శుక్రవారం రాత్రి 10 గంటలకు షాపును మూసివేసి ఇంటికి వచ్చిన దంపతులు స్కూటర్ బ్యాటరీని విప్పి ఇంట్లో చార్జింగ్కు పెట్టారు. అర్ధరాత్రి బ్యాటరీ గట్టి శబ్దంతో పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. టీవీ, ఫ్యాన్, బల్పులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. ఇంటి పైకప్పు కూడా చీలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న మంజునాథ్, భార్య మాల (33), కొడుకు రక్షణ్ (11), కూతురు జయ్గంగ (8)లు విషవాయువుల మధ్యలో చిక్కుకుని ఉండగా, చుట్టుపక్కల వారు చేరుకొని ఇంటి తలుపులు బద్దలగొట్టి మంటలార్పి ప్రమాదంలో ఇరుక్కుపోయిన దంపతులను, పిల్లలను బయటకు తీశారు. అదృష్టవశాత్తు వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దుర్ఘటనపై బాధితుడు మత్తిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
డివైడర్ను ఢీకొన్న స్కూటర్.. ఇద్దరి దుర్మరణం
కాకినాడ రూరల్: అతి వేగం ఇద్దరు స్నేహితులను బలిగొంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సినిమాకు వెళ్తున్నామని ఇంటి వద్ద చెప్పి, స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన కొడుకు.. రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఒక కుటుంబం.. బయటకు వెళ్లిన కొడుకు ఇక తిరిగి రాడని తెలిసి మరో కుటుంబం తల్లడిల్లిపోయాయి. రెండు కుటుంబాలకు పుత్రశోకం మిగిల్చిన ఈ ప్రమాదం వివరాలివీ.. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద సూపర్ బజార్ ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి డివైడర్ను స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను కాకినాడ రూరల్ మండలం వలసపాకల బాలాజీ నగర్కు చెందిన కర్నాటి షణ్ముఖ గణేష్ (17), ములికి శివసత్య(17)గా గుర్తించారు. వారిద్దరూ స్కూటర్పై సర్పవరం జంక్షన్ నుంచి మితిమీరిన వేగంతో నాగమల్లితోట జంక్షన్ వైపు వస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. స్కూటర్ను శివసత్య నడుపుతూండగా వెనుక షణ్ముఖ గణేష్ కూర్చున్నాడు. అతి వేగంతో డివైడర్ను స్కూటర్ ఢీకొనడంతో వెనుక కూర్చున్న గణేష్ తూలిపోయి రోడ్డు అవతలివైపు పడ్డాడు. వేగాన్ని నియంత్రించలేక కొద్ది దూరం వెళ్లిన తరువాత శివసత్య రోడ్డుపై పడిపోయాడు. అతడి తల వెనుక భాగం రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్ర గాయంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెండాడు. గణేష్ కూడా తలకు గాయమవడంతో దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు సర్పవరం పోలీసులకు, 108కు సమాచారం అందించారు. సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ, సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే శివసత్య, గణేష్ మాట్లాడకపోవడంతో తట్టి లేపే ప్రయత్నం చేశారు. వారిద్దరినీ 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి, మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో ఆ ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఆటోలో జీజీహెచ్కు తరలించారు. ఏమాత్రం కొన ఊపిరి ఉన్నా బతికే అవకాశం ఉంటుందని వైద్యం కోసం ప్రయత్నం చేశారు. అయితే, ఆ ఇద్దరు యువకులూ మృతి చెందారని ప్రభుత్వాస్పత్రి వైద్యులు మరోసారి నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి, జీజీహెచ్కు తరలివచ్చారు. షణ్ముఖ గణేష్ తండ్రి పెంటయ్యకు ఐదు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. పదో తరగతి వరకూ చదువుకున్న గణేష్ తండ్రికి అండగా ఉంటున్నాడు. రాత్రి సినిమాకు వెళ్తున్నట్టు తండ్రి వద్ద రూ.500 తీసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన శివసత్యను తీసుకుని బయటకు వెళ్లాడు. ఇద్దరూ సినిమాకు వెళ్లకుండా చాలాసేపు సర్పవరం జంక్షన్లో గడిపారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు స్కూటర్పై అతి వేగంగా వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. మరో మృతుడు శివసత్య తాపీమేస్త్రిగా జీవనోపాధి పొందుతున్నాడు. తొమ్మిదో తరగతి వరకూ చదువుకున్నాడు. ఇద్దరు యువకుల మృతితో బాలాజీ నగర్లో విషాదం అలుముకుంది. అంది వచ్చిన కొడుకులు అర్ధాంతరంగా మృతి చెందడంతో గణేష్ తల్లిదండ్రులు పెంటయ్య, సత్యవతి.. శివసత్య తల్లిదండ్రులు సత్తిబాబు, సూకరత్నం కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సర్పవరం ఎస్సై మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. సీఐ ఎ.మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. -
హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్.. రూ.80 వేలకే!
ఏదైనా స్కూటర్ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నవారికి శుభవార్త ఇది. దేశంలో స్కూటర్లలో ప్రముఖంగా పేరొందిన హోండా యాక్టీవా (Honda Activa) లిమిటెడ్ ఎడిషన్ తాజాగా మార్కెట్లో లాంచ్ అయింది. హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ (Honda Activa Limited Edition) ఎక్స్ షోరూమ్ ధర రూ.80,734 మాత్రమే. ఇది డీఎల్ఎక్స్ ట్రిమ్ మోడల్ ధర. ఇక స్మార్ట్ ట్రిమ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,734. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి తక్కువ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. కావాలనుకున్నవారు దేశవ్యాప్తంగా ఉన్న హోండా రెడ్ వింగ్ డీలర్షిప్ల వద్ద వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ పరిమిత ఎడిషన్ స్కూటర్లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. ఇందులో డార్క్ కలర్ థీమ్, బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్లు ఉంటాయి. DLX వేరియంట్లో అల్లాయ్ వీల్స్ ఉండగా, స్మార్ట్ వేరియంట్లో హోండా స్మార్ట్ కీ ఫీచర్ ఉంటుంది. -
ఇదేందిది.. కారు కాని కారు.. బానే పోతోందే..!
ఎక్కడ ఏకాస్త ప్రతిభ ఉన్నా అది సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. కొందరు కార్లు, హెలికాప్టర్ల తయారు చేస్తుండగా, మరికొందరు స్కూటర్లు, ఇటుకలతో కూలర్లు తయారు చేస్తున్నారు. ఇదే కోవలోకి చెందిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో నాలుగు చక్రాలతో కూడిన విచిత్ర వాహనం కనిపిస్తుంది. వాహనానికి బైక్ ఇంజిన్ అమర్చారు. స్టీరింగ్ కోసం ప్రత్యేక డిజైన్ చేశారు. పాత వస్తువులతో వాహనం బాడీ తయారు చేశారు. అలాగే పాత టైర్లను అమర్చి వాహనానికి ఫినిషింగ్ ఇచ్చారు. దీనిని చూసినవారికి మొదట నవ్వు వస్తుంది. తరువాత ఈ వినూత్న వాహన తయారీదారులను మెచ్చుకోకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ట్విట్టర్లో @being_happyyy అనే పేరు కలిగిన అకౌంట్లో పోస్ట్ చేశారు. క్యాప్షన్లో దేశీయ ఆవిష్కరణ అని రాశారు. 29 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు, ఇద్దరు పిల్లలు వాహనం మీద కూర్చుని కనిపిస్తారు. ఈ వీడియోకు వేలకొద్దీ లైక్స్ లభిస్తున్నాయి. ఇది కూడా చదవండి: 10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో.. Desi jugaad or desi innovation? #jugaad #innovation pic.twitter.com/CwxFCmjjsD — Neeraj M (@being_happyyy) July 27, 2023 -
లెక్ట్రిక్స్ కొత్త స్కూటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న వ్యాపారాల్లో ఉన్న ఎస్ఏఆర్ గ్రూప్నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ లెక్ట్రిక్స్ ఈవీ.. కొత్త స్కూటర్ను రెండు వేరియంట్లలో ఎల్ఎక్స్ఎస్ జీ3.0, ఎల్ఎక్స్ఎస్ జీ2.0 ట్రిమ్స్లో ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.97,999. తొలిసారిగా 12 రకాల ఫీచర్లతో కలుపుకుని మొత్తం 93 రకాల హంగులను జోడించినట్టు లెక్ట్రిక్స్ ప్రకటించింది. ఎమర్జెన్సీ ఎస్వోఎస్ అలర్ట్, నావేగిషన్ అసిస్ట్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. 3 కిలోవాట్ బ్యాటరీతో రూపొందిన ఎల్ఎక్స్ఎస్ జీ3.0 ఒకసారి చార్జింగ్తో 105 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. 2.3 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఎల్ఎక్స్ఎస్ జీ2.0 తయారైంది. ఒకసారి చార్జింగ్తో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 10.2 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. హర్యానాలోని మనేసర్ వద్ద ఉన్న ప్లాంటు సామర్థ్యం ఏటా 1.5 లక్షల యూనిట్లు. ఇప్పటికే లెక్ట్రిక్స్ ఈవీ కోసంఎస్ఏఆర్ గ్రూప్ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. లుమినస్, లివ్గార్డ్, లివ్ఫాస్ట్, లివ్ప్యూర్ బ్రాండ్లను సైతం ఈ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. -
ఆస్ట్రేలియా రోడ్లపై దూసుకుపోనున్న మేడిన్ ఏపీ ఈ-స్కూటర్లు
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియా రోడ్లపై మేడిన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు దూసుకుపోనున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నున్న సమీపంలోని విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ‘అవేరా’ తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఆ్రస్టేలియాలో అడుగుపెడుతోంది. కాన్బెర్రా రాష్ట్రానికి పైలట్ ప్రాజెక్టు కింద 100 ఎలక్ట్రిక్ స్కూటర్లను అవేరా సంస్థ ఎగుమతి చేయబోతోంది. ఈ విషయాన్ని అవేరా వ్యవస్థాపక సీఈవో డాక్టర్ వెంకటరమణ ‘సాక్షి’ కి తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై చర్చలు జరిగాయని చెప్పారు. కాన్బెర్రా సీఎం ఆండ్రూ భారత్ పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది ఏపీకి వస్తారని, అప్పుదీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. చదవండి: వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. సీఎం జగన్ కీలక నిర్ణయం -
పరమ చెత్త కుక్క..!
కాలిఫోర్నియా: చైనా జాతికి చెందిన ఒక కుక్క ప్రపంచంలో పరమ చెత్తగా, అందవిహీనంగా కనిపించే కుక్కగా కిరీటం సాధించింది. ప్రతీ ఏడాది అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే అందవిహీనమైన శునకాల పోటీలో స్కూటర్ అనే పేరు ఉన్న ఏడేళ్ల వయసు శునకానికి ఈ పురస్కారం దక్కింంది. అవార్డు కింద ఒక ట్రోఫి, 1500 డాలర్లు బహుమానాన్ని ఆ కుక్కని పెంచుతున్న యజమానురాలికి ఇచ్చారు. కుక్కల పెంపకం, వాటిలో లోపాలున్న ప్రేమను పంచడం, జంతుప్రేమపై అవగాహన పెంచడం కోసం సొనొమా –మారిన్ ఫెయిర్లో ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి. -
ఇది స్కూటీ ఆ..? స్కూల్ బస్ ఆ..?
-
వెస్పా మిక్కీ మౌస్ ఎడిషన్ వచ్చేస్తోంది - వివరాలు
Vespa Mickey Mouse Edition: భారతదేశంలో వెస్పా స్కూటర్లకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మహిళల మనసుదోచే ఈ స్కూటర్ ఇప్పుడు కొత్త ఎడిషన్ రూపంలో విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. దీని కోసం వెస్పా డిస్నీతో చేతులు కలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిస్నీతో చేతులు కలిపిన వెస్పా మిక్కీ మౌస్ అనే స్పెషల్ ఎడిషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ స్కూటర్ మిక్కీ మౌస్ మాదిరిగానే కలర్స్ కలిగి ఉంటుంది. బూట్లను పోలిన పసుపు రంగు వీల్స్, చెవులును తలిపించే మిర్రర్స్, బాడీని గుర్తు చేయడానికి రెడ్ కలర్ ఇక్కడ గమనించవచ్చు. అంతే కాకుండా మిక్కీ మౌస్ సంతకం కూడా ఈ స్కూటర్ మీద ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు లేదు, కానీ ఇందులో కాస్మొటిక్ డిజైన్స్ మాత్రం గమనించవచ్చు. అదే ఇంజిన్ కలిగి ఉంటుంది కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. కాగా ఈ లేటెస్ట్ ఎడిషన్ ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది, దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
హోండా డియో కొనాలా.. కొత్త ధరలు తెలుసుకోండి!
Honda Dio H Smart: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా ఇటీవల డియో హెచ్-స్మార్ట్ను సైలెంట్గా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ స్కూటర్ ధరలు కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ. 77,712 (ఎక్స్-షోరూమ్) వద్ద ఉన్నాయి. ఇది బిఎస్ 6 స్టేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందిన కారణంగా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర పొందింది. హోండా డియో స్టాండర్డ్ అండ్ డిఎల్ఎక్స్ వేరియంట్ల ధరలు గతంలో రూ. 68,625 & రూ. 72,626 వద్ద ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్2 (OBD2) కారణంగా ఈ రెండు వేరియంట్ల ధరలు రూ. 1,586 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల కాకుండా ఇందులో ఎటువంటి మార్పులు జరగలేదు. ధరల పెరుగుదల తరువాత 110సీసీ విభాగంలో అత్యంత ఖరీదైన స్కూటర్ల జాబితాలో డియో ఒకటిగా చేరింది. (ఇదీ చదవండి: రూ. 500 నోట్ల రద్దుపై షికార్లు కొడుతున్న పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన శక్తికాంత దాస్!) హోండా డియో స్కూటర్ 109 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి.. లేటెస్ట్ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్స్ పొందింది. ఇది 7.8 బిహెచ్పి పవర్ 9 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త హోండా స్మార్ట్ కీ స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ వంటి ఫంక్షన్లను పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. -
సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్
సూర్యుడు, జనం ‘యూ హౌమచ్ అంటే యూ హౌమచ్’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్ వెరైటీగా ఉందనుకోండి. ఈ వైరల్ విశేషాలు... మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్ ముందు నీళ్ల బకెట్ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు. థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్ శుక్లా అనే యూ ట్యూబర్కు కూడా ఎండ వల్ల మైండ్ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్మన్న యూ ట్యూబర్ ‘సారీ... హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్ కడతా’ అని వీడియో రిలీజ్ చేశాడు. కాని ట్రాఫిక్లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్ చేసినందుకు కదా పోలీసులు ఫైన్ వేస్తారు. అది మర్చిపోయాడు. ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి. -
ఇప్పుడు మరింత అందంగా మారిన వెస్పా.. కొత్త కలర్స్ అదుర్స్!
Vespa Dual Tone: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ్ టూ వీలర్ తయారీ సంస్థ 'పియాజియో ఇండియా' తన అప్డేటెడ్ వెస్పా స్కూటర్ భారతీయ విఫణిలో అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనమూ తెలుసుకుందాం. వెస్పా డ్యుయల్ సిరీస్ పేరు విడుదలైన ఈ స్కూటర్ పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో సీటు, ఫుట్బోర్డ్ మాత్రమే కాకుండా పిలియన్ రైడ్ను అనుకూలంగా ఉండే రెస్ట్ కూడా కొత్త కలర్ ఆప్షన్ పొందుతుంది. వేరియంట్స్ & ధరలు: పెర్ల్ వైట్ + అజురో ప్రోవెంజా కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 ధర రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు. పెర్ల్ వైట్ + బీజ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు. పెర్ల్ వైట్ + మ్యాట్ రెడ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. పెర్ల్ వైట్ + మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర) (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) కలర్ ఆప్షన్ కాకుండా ఈ స్కూటర్లలో పెద్దగా ఆశించిన మార్పుయ్లు లేదు. 125 సీసీ వేరియంట్ 7,000 rpm వద్ద 9.65 bhp పవర్, 5,600 rpm వద్ద 10.11 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 150 సీసీ వేరియంట్ 7,400 rpm వద్ద 10.64 bhp పవర్, 5,300 rpm వద్ద 11.26 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్లు రెండూ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందాయి. కావున ఉత్తమ పనితీరుని అందిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రెండింతలకు చేతక్ స్కూటర్ల ఉత్పత్తి
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని జూన్ నాటికి రెండింతలకు చేర్చనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫేమ్–2 పథకం పొడిగింపు విషయంలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్క్లూజివ్ స్టోర్ల విస్తరణ చేపడుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్లను తయారు చేస్తున్నట్టు కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ తెలిపారు. ‘విడిభాగాలు సరఫరా చేసే కొందరు వెండార్లపై పెద్ద ఎత్తున ఆధారపడ్డాం. వారు సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. సరఫరా సమస్యల నుంచి గట్టెక్కాం. అది మాకు కొంత విశ్వాసాన్ని ఇస్తోంది. మే నెలలో ఉత్పత్తి 7,000 యూనిట్లకు, జూన్లో 10,000 యూనిట్లకు చేరనుంది. డిమాండ్నుబట్టి భవిష్యత్లో ఉత్పత్తి ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయిస్తాం. ఎక్స్క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 105 నుంచి సెప్టెంబర్కల్లా సుమారు 150 తాకనుంది. సరఫరా సమస్యలు తొలగిపోయి డిమాండ్ కొనసాగి, నెట్వర్క్ విస్తరణతో 2023–24లో బజాజ్ ఆటో చేతక్తోపాటు ‘యూలుకు’ సరఫరా చేసిన వాహనాలతో కలిపి విక్రయాలు ఒక లక్ష యూనిట్లకు ఎగుస్తుంది’ అని వివరించారు. సబ్సిడీ పొడిగించాల్సిందే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంపొందించే పథకం ఫేమ్–2 పొడిగింపుపై ఈ ఏడాది సెప్టెంబర్కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని బజాజ్ ఆటో అర్బనైట్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ పేర్కొన్నారు. ‘పొడిగింపు నిర్ణయానికి ముడిపడి చాలా అంశాలు ఉన్నాయి. సబ్సిడీని నిలిపివేస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ’ అని తెలిపారు. -
ఓలా స్కూటర్ పోయింది... ఈ టెక్నాలజీతో దొరికింది
-
కుక్కలు వెంటపడుతున్నాయన్నా టెన్షన్లో.. స్పీడ్ పెంచిందంతే..
ఇటీవల కాలంలో కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక ప్రభుత్వాస్పత్రిలో కుక్క పసిబిడ్డను నోట కరుచుకున్న ఉదంతం మరువక మునుపే మరో ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తుండగా కుక్కలు వెంటపడటంతో వేగం పెంచేశారు. పాపం సమీపంలో పార్క్ చేసి ఉన్న కారుని గమనించకుండా ఢీ కొట్టారు. అంతే ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ఘటన ఒడిశాలోని బెరహంపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు స్కూటీపై గుడికి వెళ్లి వస్తున్నారు. ఇంతలో ఆరు కుక్కలు వారి వెంట పడ్డాయి. దీంతో ఆ మహిళ భయంతో స్పీడ్ పెంచేసింది. మరోవైపు ఆమె ముందు వైపు చూడకుండా వాటి వైపే చూస్తుండటంతో అక్కడ పార్క్ చేసి ఉన్న కారుని గమనించలేదు. దీంతో బండి ఆ కారుని నేరుగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా అంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ ముగ్గురులో కనీసం ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించలేదని మండిపడుతుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు తలెత్తకుండా బెరహంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: డీజే సౌండ్ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..) -
పేలిన బ్యాటరీ స్కూటర్
మండ్య(బెంగళూరు): మండ్య జిల్లా మళవళ్లి తాలూకా కిరుగావలు గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి కాలిపోయింది. శుక్రవారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా, స్థానిక పరీక్షా కేంద్రానికి ప్రకాశ్ అనే ఉపాధ్యాయుడు తన బ్యాటరీ స్కూటర్లో వచ్చాడు. దానిని బయట పార్కు చేసి ఉంచాడు. సుమారు 12 గంటల సమయంలో బ్యాటరీ స్కూటర్ పెద్ద శబ్ధంతో పేలిపోయి మంటల్లో చిక్కుకుంది. పక్కనున్న మరో నాలుగు పెట్రోల్ బైక్లకు మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. బూడిదగా మారిన తమ వాహనాలను చూసి యజమానులు లబోదిబోమన్నారు. -
వచ్చే నెలలో విడుదలకానున్న టూ వీలర్స్, ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను వినియోగించాలనే ఆసక్తికలిగిన కస్టమర్ల కోసం కంపెనీలు కూడా ఆధునిక వెహికల్స్ విడుదల చేస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగే వచ్చే నెలలో కూడా కొన్ని లేటెస్ట్ కార్లు, బైకులు దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్నాయి. వచ్చే నెల నుంచి బీఎస్6 పేస్-2 ఎమిషన్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొత్తగా విడుదలయ్యే వాహనాలు తప్పకుండా దానికి లోబడి ఉండాలి. సింపుల్ వన్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికీ విక్రయానికి రాలేదు, ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో గొప్ప ఆదరణ పొందిన ఈ టూ వీలర్ బుకింగ్స్ పరంగా కూడా ఉత్తమ వృద్ధిని కనపరిచింది. కాగా ఈ స్కూటర్ వచ్చే నెల ప్రారంభం నుంచి విక్రయానికి రానున్న సమాచారం. డుకాటీ మాన్స్టర్ ఎస్పీ: ద్విచక్ర వాహన ప్రియులకు ఎంతగానో ఇష్టమైన బైకులతో ఒకటైన డుకాటీ 2023 ఏప్రిల్ చివరి నాటికి తన మాన్స్టర్ ఎస్పీ బైక్ విడుదల చేయాలని ఆలోచిస్తోంది. కంపెనీ గతంలోనే 9 బైకులను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో మరిన్ని డుకాటీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది. హోండా యాక్టివా 125 హెచ్- స్మార్ట్: హోండా మోటార్సైకిల్ దేశీయ మార్కెట్లో వచ్చే నెలలో ఇప్పటికే విక్రయానికి ఉన్న యాక్టివా స్కూటర్లో కొత్త వెర్షన్ విడుదల చేయనుంది. దీని పేరు 'హోండా యాక్టివా 125 హెచ్-స్మార్ట్'. దీనికి సంబంధించిన చాలా వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. కావున డిజైన్ పరంగా పెద్ద తేడా లేనప్పటికీ.. రిమోట్ ఇంజిన్ స్టార్ట్, కీలెస్ ఇగ్నీషన్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయని తెలిసింది. 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్: ఇప్పటికే భారతదేశంలో విడుదల కావాల్సిన 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్ బైకులు కొన్ని అనివార్య కారణాల వల్ల లాంచ్ కాలేదు. అయితే ఇవి రెండూ వచ్చే నెలలో విడుదలకానున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ బైకులకు సంబంధిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
River Indie: ఎక్కువ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతో తెలుసా?
బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ రివర్ తన 'ఇండీ' (Indie) ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్, ఫ్రంట్ ఫుట్పెగ్లు, క్రాష్ గార్డ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది, డెలివరీలు 2023 ఆగష్టులో ప్రారంభమవుతాయి. రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక ఛార్జ్పై 150 కి.మీ పరిధిని అందిస్తుంది, అయితే వివిధ వాతావరణ పరిస్థితుల్లో 120 రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కేవలం 5 గంటలలో 0-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు, ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. రివర్ ఇండీ బ్యాటరీ ప్యాక్ 8.98 బిహెచ్పి పవర్, 26 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 3.9 సెకన్లలో గంటకు 90 కిమీ వేగంతో ముందుకు వెళ్తుంది. ఇందులో ఎకో, రైడ్, రష్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ హైడ్రాలిక్ షాక్ ఉన్నాయి. ఈ లేటెస్ట్ స్కూటర్ ఒక ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది, కావున లో మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్లైట్, ఎల్ఈడీ టైల్లైట్ వంటి వాటితో పాటు కాంట్రాస్ట్ డిస్ప్లే, ఛార్జింగ్ పోర్ట్ పొందుతుంది. ఇందులోని పన్నీర్ మౌంట్స్ లగేజ్ మోయడానికి సహాయపడతాయి. రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది, కావున ఇందులో 12 లీటర్ల గ్లోవ్ బాక్స్, 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది మాన్సూన్ బ్లూ, సమ్మర్ రెడ్, స్ప్రింగ్ ఎల్లో వంటి మూడు కలర్ ఆప్సన్స్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ బ్యాటరీ, స్కూటర్ రెండింటికీ 5 సంవత్సరాల/50,000 కిమీ వారంటీ అందిస్తోంది. -
యమహా త్రీ వీల్ స్కూటర్.. కొత్త లుక్ & అదిరిపోయే ఫీచర్స్
అంతర్జాతీయ మార్కెట్లో మూడు చక్రాల స్కూటర్లు చాలా అరుదు, అయితే ప్రపంచం ప్రగతి మార్గంలో పరుగులు పెడుతున్న తరుణంలో ఆధునిక వాహనాల ఉత్పత్తి, వినియోగం చాలా అవసరం. ఇందులో భాగంగా యమహా కంపెనీ ఇప్పుడు జపనీస్ మార్కెట్లో ట్రైసిటీ స్కూటర్ విడుదల చేసింది. యమహా విడుదల చేసిన ట్రైసిటీ స్కూటర్ 125 సీసీ, 155 సీసీ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. నిజానికి కంపెనీ ఇలాంటి స్కూటర్ 2014 లో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసినప్పటికీ భారతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురాలేదు. ఇది సాధారణ స్కూటర్ మాదిరిగా ఉన్నప్పటికీ ముందు భాగంలో రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం పొందుతుంది. ట్రైసిటీ స్కూటర్ LED డేటైమ్ రన్నింగ్ లైట్స్, సెంటర్ సెట్ LED హెడ్లైట్, LCD సెంటర్ కన్సోల్ వంటి వాటితో పాటు సింగిల్ సీట్తో ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ రైల్ పొందుతుంది. స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్, రెండు వైపులా డిస్క్ బ్రేకులు, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక డ్యూయెల్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంటుంది. ట్రైసిటీ స్కూటర్లోని 125 సీసీ ఇంజిన్ 12.06 బిహెచ్పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, అదే సమయంలో 155 సీసీ ఇంజిన్ 14.88 బిహెచ్పి పవర్ మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జపనీస్ మార్కెట్లో విడుదలైన ట్రైసిటీ 125 స్కూటర్ 125 ధర రూ. 4,95,000 యెన్లు (సుమారు రూ. 3.10 లక్షలు) 155 స్కూటర్ ధర 5,56,500 యెన్లు (సుమారు రూ. 3.54 లక్షలు). డెలివరీలు ఫిబ్రవరి, ఏప్రిల్ సమయంలో మొదలవుతాయి. ఈ మోడల్ స్కూటర్ మన దేశంలో విడుదలవుతుందా.. లేదా అనే విషయాన్నీ యమహా ధ్రువీకరించలేదు. -
హీరో జూమ్ బుక్ చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!
హీరో మోటోకార్ప్ ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 'జూమ్' (Xoom) స్కూటర్ తన తొలి డెలివరీలను ముంబైలో ప్రారంభించింది. కంపెనీ ఈ స్కూటర్ని ఎల్ఎక్స్ (LX), విఎక్స్ (VX), జెడ్ఎక్స్ (ZX) వేరియంట్స్లో అందిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 72,349 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హీరో లేటెస్ట్ జూమ్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న హోండా డియోకి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఇది 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 8.05 బిహెచ్పి పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ i3S ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల స్కూటర్ కెపాసిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. జూమ్ స్కూటర్ రైడర్, పిలియన్కి సౌకర్యవంతంగా ఉన్న విశాలమైన సీటు కలిగి ఉంటుంది. ముందువైపు మంచి లైటింగ్ సెటప్, వెనుక హెచ్ షేప్ టైల్లైట్ కలిగి 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో పొందుపర్చింది. ఫీచర్స్ పరంగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జర్, గ్లోవ్ బాక్స్ లాంటివి ఉన్నాయి. ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ సెటప్ వంటి సస్పెషన్ సెటప్ & ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ తో మంచి బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా కంపెనీ తన కొత్త స్కూటర్ని పోలెస్టార్ బ్లూ, స్పోర్ట్స్ రెడ్, మాట్ అబ్రాక్స్ ఆరెంజ్, పెర్ల్ సిల్వర్ వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్సన్స్ అందిస్తోంది. -
75 ఏళ్ల వృద్ధుడిని స్కూటీతో ఈడ్చుకెళ్లిన యువకుడు
-
పట్టపగలే దారుణం..వృద్ధుడిని బైక్తో ఈడ్చుకెళ్లి..
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారుని ర్యాష్గా వచ్చి ఢీ కొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కారు యజమాని వృద్ధుడుని ఆపేందుకు యత్నించాడంతో ఈడ్చుకెళ్లిపోయాడు. దీంతో పలువురు అతన్ని వెంబడించి అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకెళ్తే..బెంగళూరులోని ముత్తప్ప అనే వ్యక్తి కారుని సాహిల్ అనే వ్యక్తి బైక్తో ఢీ కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కారులోంచి దిగి మాట్లాడాదాం అనుకుంటుండగా.. సాహిల్ తన బైక్తో పారిపోయేందుకు యత్నించాడు. ఐతే వృద్ధుడు అతన్ని ఆపాలనే ఉద్దేశంతో అతని బైక్ బ్యాక్ సైడ్ గట్టిగా పట్టుకున్నాడు. కానీ సాహిల్ వృద్ధుడన్న కనికరం లేకుండా బైక్ని ఆపకుండా ఈడ్చు కెళ్లిపోయాడు. పట్టపగలే అందరూ చూస్తుండగా 71 ఏళ్ల వృద్ధుడుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు. ఇంతలో అటుగా వస్తున్న ఆటో రిక్షా వాలా, ఒక ద్విచక్ర వాహనదారుడు ఆ వ్యక్తిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ఆ వృద్ధుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. click here: viral Video (చదవండి: జల్లికట్టు పోటీలో అపశ్రుతి..నలుగురు మృతి) -
అంజలి కారు ముందు పడిపోయింది.. భయంతో పారిపోయా: స్నేహితురాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అంజలి(20) అనే యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనలో ఆమెతోపాటు తన స్నేహితురాలు కూడా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు కారు ఢీకొట్టిన సమయంలో అంజలి ఒకరే ఉన్నారని అనుకున్నారు కానీ హోటల్ ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా పార్కింగ్ నుంచి స్కూటీ తీస్తుండగా పక్కన మరో యువతి కూడా కనిపించింది. ఆమే అంజలి స్నేహితురాలు నిధి. ఇద్దరు స్నేహితులు శనివారం సాయంత్రం సుల్తాన్పురిలో న్యూ ఇయర్ ఈవెంట్కు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 1.45 గంటలకు హోటల్ నుంచి అంజలి స్కూటర్పై బయలుదేరారు. ముందుగా స్కూటీ డ్రైవ్ చేసే విషయంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. టూవీలర్ను మొదట నిదీనే డ్రైవ్ చేయగా కొంత సమయం తర్వాత అంజలి డ్రైవింగ్ తీసుకుంది. నిధి వెనకాల కూర్చుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మద్యం మత్తులో అయిదుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. దీంతో అంజలి కారు ముందు పడిపోగా.. నిధి మరోవైపు పడింది. అదృశవశాత్తు ఆమెకు గాయాలేవి అవలేదు. కానీ అంజలి కారు ముందు చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను కారుతోపాటే వీధుల గుండా 13 కిమీ ఈడ్చుకెళ్లారు. #WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area. (CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze — ANI (@ANI) January 3, 2023 డ్డ్రైవర్ తప్పిదం వల్లే నిధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణకు ఆమె సహకరిస్తోందని తెలిపారు. మంగళవారం నిధిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపింది. భయంతో ప్రమాదం గురించి ఎవరికీ చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. కారు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్లు నిధి కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. స్కూటర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని నిందితులు పేర్కొన్నారు. మరోవైపు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు సైతం ప్రకటించారు. అత్యాచారం జరగలేదు మరోవైపు అంజలిపై హత్యాచారం జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీ ఆందోళనలు చేపట్టారు. అయితే అంజలిపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇక కారు డ్రైవ్ చేసిన వ్యక్తితోపాటు మొత్తం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు నిందితులు అంగీకరించారు. వారిపై నేరపూరిత హత్య అభియోగం, ర్యాష్ డ్రైవింగ్ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా ఈవెంట్ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అంజలి సింగ్ను ఢిల్లీలోని సుల్తాన్పురిలో జనవరి 1వ తేదీ తెల్లవారు జామున కొంతమంది యువకులు కారుతో ఢీకొట్టి కొన్ని కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. స్కూటర్ను ఢీకొట్టడంతో భయంతో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే మహిళ శీరరం కారు చక్రాలకు చిక్కుకుందన్న విషయం వారికి తెలియలేదు. సుల్తాన్పూరి నుంచి కంజావాలా వరకు 13 కిలోమీటర్ల మేరకు ఆమెను అలాగే ఈడ్చుకెళ్లారు. చివరికి కంజావాలా వద్ద యూ టర్న్ తీసుకునే సమయంలో మహిళ కారుతోపాటు రావడాన్ని గమనించిన కారులోని ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారు ఆపడంతో ఆమె శరీరం పడిపోయింది. దీంతో మళ్లీ అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. అయితే కారుతోపాటు రోడ్డుపై మహిళ శరీరం ఈడ్చుకెళ్లడం చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులుకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసిన పోలీసులు అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్ ఖన్నా(26), అమిత్ ఖన్నా(25), క్రిష్ణణ్(27), మిథున్(26), మనోజ్ మిత్తల్గా గుర్తించారు. వీరకి కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీపక్ ఖన్నా అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా.. స్కూటీనిని ఢీ కొట్టిన సమయంలో దేని మీద నుంచో కారు ఎక్కించినట్లు అనిపించిందని దీపక్ పోలీసుల ఎదుట అంగీకరించాడు, అయితే మిగతావాళ్లు మాత్రం తామకు అలాంటిది ఏం అనిపించలేదని తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి భయంతో పారిపోయినట్లు తెలిపారు. -
హీరో ఎలక్ట్రిక్ వెహికల్ డెలివరీలు షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటో కార్ప్ విదా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించింది. బెంగళూరుతో మొదలుకుని దశలవారీగా ఇతర నగరాల్లో డెలివరీలు చేపడతారు. 2022 అక్టోబరులో విదా వీ1 వాహనాన్ని కంపెనీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఒకసారి చార్జింగ్ చేస్తే 163 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. వేరు చేయగలిగే బ్యాటరీ, మూడు రకాల చార్జింగ్ ఆప్షన్స్తో లభిస్తుంది. ఢిల్లీలో ఆన్రోడ్ ధర విదా వీ1 ప్లస్ రూ.1.35 లక్షలు, విదా వీ1 ప్రో రూ.1.46 లక్షలు ఉంది. -
అయ్యో తల్లి.. ఎంత ఘోరం జరిగిపోయింది
సాక్షి, చెన్నై(అన్నానగర్): ఆర్టీసీ బస్సు ఢీకొని స్కూటర్పై వెళుతున్న అమ్మమ్మ, మనవరాలు మృతిచెందిన ఘటన తేనిలో జరిగింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వివరాలు.. తేని జిల్లా వరుసనాడు సమీపంలోని మురుకోడై గ్రామానికి చెందిన అమావాసై, భార్య రాణి (44) కేరళ మున్నార్ సమీపంలోని బూపరాయ్ ప్రాంతంలో ఉంటూ తోట పని చేసేవారు. వీరి కుమారుడు సత్యరాజ్, కుమార్తె యోగాన కుటుంబం కూడా బూపరాయ్ ప్రాంతంలోనే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం రాణి, ఆమె కుమారుడు కుమార్తె కుటుంబంతో కలిసి స్వగ్రామమైన తేని జిల్లా మురుకోడై వచ్చారు. మంగళవారం మోటారు సైకిల్, స్కూటర్పై బూపరాయ్ బయలుదేరారు. మోటారు సైకిల్ను రాణి అల్లుడు జయప్రకాష్ నడుపుతున్నాడు. అక్కడ అతని భార్య, కూతురు రుద్రశ్రీ (04), బంధువు జగతీశ్వరన్ (15) ఉన్నారు. స్కూటర్లో రాణి, ఆమె కోడలు వానతి (25), వానతి కుమారుడు ఉద్గేశ్వరన్ (07)లు వున్నారు. వానతి స్కూటర్ నడిపింది. తేని బోడి రోడ్డులోని తీర్థతొట్టి సమీపంలోని ఓ దుకాణం వద్ద ఆపి టీ తాగారు. తరువాత రుద్రశ్రీ అమ్మమ్మతో కలిసి స్కూటర్పై వెళ్లింది. తొప్పుపట్టి సమీపంలో రోడ్డు మలుపు వద్ద పెరియకుళం నుంచి వచ్చిన ప్రభుత్వ బస్సు వెనుక నుంచి ఢీకొంది. బస్సు చక్రం ఎక్కిదిగడంతో రాణి, రుద్రశ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని తల్లిదండ్రులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. 108లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పళని శెట్టిపట్టి పోలీసులు తామరైకులంకు చెందిన బస్సు డ్రైవర్ అయ్యన్న స్వామి (52)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..) -
అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Cheapest Electric Scooters: దేశంలో గత పది ఏళ్లలో ద్విచక్ర వాహన విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇంధన వాడకం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. దీంతో వాటి డిమాండ్ పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తెరపైకి వచ్చింది. దీనికి తోడు కేంద్రం ఈ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పోత్సాహకాలు కూడా అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే వీటితో ప్రయోజనాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా ఈవీల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ ఈవీ మార్కెట్లో వస్తున్న స్కూటర్లు కొన్ని ఖరీదుగా ఉండడం, కస్టమర్ల బడ్జెట్కు సరిపోనివి రావడంతో ఈ విషయమై సామాన్యుల్లో కాస్త ఆందోళన మొదలైంది. అటువంటి వారి కోసం చౌకగా వారి బడ్జెట్కు సరిపోయే చౌకైన ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. Bounce Infinity E1 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,099(బ్యాటరీ లేని వేరియంట్) నుంచి ప్రారంభమవుతుంది. ఒక వేళ మీకు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కావాలనుకుంటే దాని ధర రూ.68,999. ఇది 2kWh/48V బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కంపెనీ తెలిపిన ప్రకారం దీని గరిష్ట వేగం 65kmph, 85km రేంజ్ కలిగి ఉంటుంది. Hero Electric Optima CX ఈ ఈవీ స్కూటర్(సింగిల్ బ్యాటరీ వేరియంట్) ధర రూ.62,190గా ఉంది. దీని గరిష్ట వేగం 45 KM/H & 82KM రేంజ్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇది మూడు కలర్స్లో కస్టమర్లకు లభిస్తుంది. ఇది 51.2V/30Ah బ్యాటరీతో కంపెనీ అందిస్తోంది. కేవలం 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. Avon E Scoot ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ తెలిపిన ప్రకారం.. ఈ స్కూటర్ 65 కి.మీల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం 24KMPH, 215W BLDC మోటార్ & 48V/20AH బ్యాటరీతో వస్తుంది. కేవలం 6 నుంచి 8 గంటల సమయంలో దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. Ampere Magnus EX ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో LCD స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ USB పోర్ట్, కీలెస్ ఎంట్రీ మరియు యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. ఇది 1.2 kW మోటార్తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఇది 60V, 30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది 121 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.73,999. Hero Electric Photon హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ స్కూటర్ 1200W మోటార్తో జతచేసిన 72V, 26 Ah బ్యాటరీ ప్యాక్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ఇది 90 కి.మీల రేంజ్తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీగా ఉంది. ఫీచర్ల పరంగా ఇది LED హెడ్లైట్, టెయిల్ లైట్తో పాటు అల్లాయ్ వీల్స్ను కలిగి ఉంటుంది. కేవలం 5 గంటల్లో దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కానుంది. -
కొత్త రంగుల్లో వెస్పా ఎస్ఎక్స్ఎల్
పుణే: వాహన తయారీ సంస్థ పియాజియో.. వెస్పా ఎస్ఎక్స్ఎల్ వేరియంట్లలో కొత్తగా నాలుగు రంగులను పరిచయం చేసింది. వీటిలో మిడ్నైట్ డిసర్ట్, టస్కనీ సన్సెట్, జేడ్ స్ట్రీక్, సన్నీ ఎస్కపేడ్ ఉన్నాయి. ఇప్పటికే ఇవి మార్కెట్లో లభ్యం అవుతున్నాయని కంపెనీ తెలిపింది. ధర తెలంగాణ ఎక్స్షోరూంలో రూ.1.32 లక్షల నుంచి రూ.1.51 లక్షల వరకు ఉంది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ సుజుకి మోటార్సైకిల్ ఇండియా సరికొత్త స్కూటర్ను ఇండియాలో లాంచ్ చేసింది. బర్గ్మన్ స్ట్రీట్ ఈఎక్స్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బర్గ్మన్ స్ట్రీట్కు అప్గ్రేడెడ్ వెర్షన్గా ఈ ఈఎక్స్ మోడల్ను విడుదలచేసింది. లేటెస్ట్ టెక్నాలజీ,నయా ఫీచర్లతో ప్రీమియం లుక్లో ఆకట్టుకునేలా ఆవిష్కరించింది. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) ధర: సుజుకీ బర్గ్మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ధరను రూ.1,12,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. మారుతి సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ స్టాండర్డ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 89,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ), సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ రూ. 93,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కి అందుబాటులో ఉంది.మెటాలిక్ మ్యాట్ ప్లాటినమ్ సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ లభ్యం. సుజుకీ బర్గ్మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ఇంజీన్ ఫీచర్లు ఎఫ్ఐ టెక్నాలజీతో పాటు ఎకో పర్ఫార్మెన్స్ ఆల్ఫా (SEP-a) ఇంజిన్తో 124cc సీసీ మోటార్ను అమర్చింది. ఇది 8.6PS గరిష్ట శక్తిని ,10Nm గరిష్ట టార్క్ను అందిస్తుంది. ఆటో స్టాప్-స్టార్ట్ సిస్టమ్ ,సైలెంట్ స్టార్టర్ సిస్టమ్ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. వెనుక 12 అంగుళాల వెడల్పైన, పెద్ద టైర్ను అమర్చింది. సుజుకీ రైడ్ కనెక్ట్ బ్లూటూత్ డిజిటల్ ఎనేబుల్డ్ కన్సోల్తో కూడిన సుజుకీ రైడ్ కనెక్ట్ ఫీచర్ ను సుజుకీ బర్గ్మన్ స్ట్రీట్ ఈఎక్స్ మరో ఫీచర్. ఇది స్మార్ట్ఫోన్ను సింక్ చేసే సౌలభ్యాన్ని రైడర్కు అందిస్తుంది. నావిగేషన్, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ అలెర్ట్స్ ఈ బైక్ డిస్ప్లేలో చూడవచ్చు. స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవల్స్ కూడా డిజిటల్ కన్సోల్లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ లాంటి వివరాలు కూడా ఈ బైక్ డిజిటల్ కన్సోల్లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. -
Viral Video : వాటే ఐడియా.. స్కూటర్ని ఇలా కూడా వాడేయొచ్చా..!
-
స్కూటర్ని ఇలా కూడా వాడేయొచ్చా!: మహీంద్రా మెచ్చిన ఆవిష్కరణ
మనసు పెడితే దేన్నైనా మనకు సహాయకారిగా ఉపయోగించవచ్చు. కొంచెం కామెన్సెన్స్ ఉంటే దానికి కాస్త తెలివి తోడైతే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అందుకు ఉదాహరణ ఇక్కడొక వ్యక్తి నిర్మాణ పనులకు స్కూటర్ని ఉపయోగిస్తున్న విధానమే నిదర్శనం. ఇలా కూడా స్కూటర్ని వాడేయొచ్చా అని ఆశ్చర్యం కలిగించేలా ఉపయోగించాడు. వివరాల్లోకెళ్తే...ఇది వరకు 90లలో ఉపయోగించే స్కూటర్ని సిమ్మెంట్ బస్తాలను చేరవేసే సాధనంగా ఉపయోగించాడు ఒక వ్యక్తి . స్కూటర్ మోటారుకి తాడు చివర భాగాన్ని ఇంజన్కి జోడించడంతో..దాని సాయంతో సిమ్మెంట్ బస్తాలను నిర్మాణంలో ఉన్న భవనంపైకి తరలిస్తున్నారు. స్కూటర్ హ్యాండిల్ని రైజ్ చేయగానే బస్తా పైకెళ్లుతుంది. ఎంచక్కా మనుషుల సంఖ్య, ఖర్చు తగ్గుతుంది కూడా. పని కూడా ఎంతో సులభంగా అయిపోతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతేగాదు ఈ సరికొత్త ఆవిష్కరణను ఆనంద్ మహీంద్ర మెచ్చుకుంటూ ట్విట్టర్లో... వీటిని పవర్ రైళ్లు అని పిలుస్తాం. ఇంజన్ల శక్తిని ఉపయోగించడానికి అనేక మార్గాలు. ఈ స్కూటర్ మెరుగ్గా ఉంటుంది. నిశబ్దంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇవి సెక్హ్యాండ్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు మహీంద్ర. 👏🏽👏🏽👏🏽 I guess that’s why we call them ‘power’trains. Many ways to utilise the power of vehicle engines. This would be even better ( and quieter!) with an e-scooter, once their cost is brought down or they are available second-hand. pic.twitter.com/Xo6WuIKEMV — anand mahindra (@anandmahindra) December 6, 2022 (చదవండి: ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్: వీడియో వైరల్) -
ఓలా ఎలక్ట్రిక్ బైక్.. ఊహించని అమ్మకాలు, మళ్లీ అదే సీన్ రిపీట్!
ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నవంబర్లో 20 వేల యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. పండుగ సీజన్ తర్వాత కూడా తమ విక్రయాలు జోరు ఏ మాత్రం తగ్గలేదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు జనాదరణ పొందుతున్న తరుణంలో ఓలా కంపెనీ విడుదల చేసిన ఈవీ బైకలు అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. సేల్స్లో మరో సారి 20వేల మార్క్ను అందుకున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. కాగా గత అక్టోబర్లోనూ సేల్స్ 20 వేలు దాటాయంటూ ఓలా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో.. తమ ద్విచక్ర వాహన బ్రాండ్ మెరుగైన వృద్ధిని సాధించింది. స్కూటర్ మార్కెట్ వాటాలో 50 శాతం సొంతం చేసుకున్నాం. నవంబర్లో మా అమ్మకాలు మళ్లీ 20,000 యూనిట్లను దాటాయి. భారతదేశంలో అతిపెద్ద ఈవీ కంపెనీగా మార్చిన మా కస్టమర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. జూన్ 2021లో 1,400 EVల నుంచి ప్రస్తుతం 90 శాతం ఈవీ సెగ్మెంట్ షేర్ కలిగి ఉంది. 2025 చివరి నాటికి అన్ని 2W విభాగాలలో EVలకు 100 శాతం షేర్ ఉండబోతోందని ట్వీట్ చేశారు. నవంబర్లో ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి అనే డేటాను ఓలా కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. 20,000 యూనిట్లు అమ్మకాలను మరో సారి అందుకున్నట్లు మాత్రమే ప్రకటించింది. ఓలా ప్రస్తుతం భారత్లో S1 ఎయిర్, S1, S1 ప్రోల పేరుతో విక్రయాలు జరుపుతోంది. దీని ధరలు రూ. 84,999 నుంచి రూ. 1.39 లక్షలుగా ఉంది( ఎక్స్-షోరూమ్). వీటిలో ఎస్1 ప్రో ఒక సారి ఫుల్ చార్జింగ్తో 116kmph అత్యధిక వేగంతో 180km వరకు ప్రయాణించగలదు. Our sales crossed 20000 again in Nov. Largest EV company in India by a margin! Huge thanks to our customers. From 1400 EVs in June 2021, to 90% EV share today, #EndIceAge is complete in the premium scooter segment! Transition to EVs will be 100% in all 2W segments by end 2025! pic.twitter.com/8dRHcxaxnd — Bhavish Aggarwal (@bhash) December 1, 2022 చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ మోటర్సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ. 1,500 వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. మోడల్స్, మార్కెట్లను బట్టి పెంపు పరిమాణం ఉంటుందని సంస్థ వివరించింది. ‘ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచక తప్పడం లేదు’ అని హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. ధరల భారం ప్రభావం కస్టమర్లపై ఎక్కువగా పడకుండా వినూత్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా అందించడం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పరిశ్రమ అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నట్లు గుప్తా వివరించారు. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
మరీ ఇంత దారుణమా.. అప్పు చెల్లించకపోతే ఇలా చేస్తారా?
భువనేశ్వర్: ఒడిశా కటక్ నగరంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ యువకుడ్ని స్కూటర్కు కట్టేసి పరుగెత్తించింది ఓ గ్యాంగ్. అతని చేతులకు తాడు కట్టి నడిరోడ్డుపై చాలా దూరం లాక్కెల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #WatchVideo l Youth tied to scooter dragged along road in #Odisha pic.twitter.com/2idf9dAMrI — Prameya English (@PrameyaEnglish) October 17, 2022 వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. యువకుడు తనకు తెలిసిన వాళ్ల దగ్గరే కొంతడబ్బు అప్పుగా తీసుకున్నాడని, కానీ వాళ్లు తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా అతను ఇవ్వకపోవడంతో ఇలా చేశారని తెలిపారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం తెలిసిందని వివరించారు. ఇది చాలా సున్నితమైన కేసు అయినందున నిందితుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. విచారణ పూర్తయ్యక అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఒడిశాలో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేం కాదు. గతంలోనూ ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించాడని అతడ్ని లారీ ముందుభాగంలో కట్టేసి, మెడలో చెప్పుల దండవేసి ఊరేగించారు. జగత్సింగ్పుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చదవండి: అత్యాచార కేసులో నిందితుడికి బెయిల్.. కానీ.. పెళ్లిపై షరతు! -
టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ సంస్థ టీవీఎస్ కొత్తగా అప్డేట్ చేసిన జూపిటర్ వెహికల్నులాంచ్ చేసింది. దేశంలో 50 లక్షల స్కూటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్భానికి గుర్తుగా స్పెషల్ ఎడిషన్గా ‘‘ ఫాస్టెస్ట్ ఫైవ్ మిలియన్ వెహికిల్స్ ఆన్ రోడ్’’ అంటూ టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ స్కూటర్ను తెచ్చింది. ఈ స్కూటర్లు మిస్టిక్ గ్రే, రీగల్ పర్పుల్ రంగుల్లో లభ్యం. క్లాసిక్ టాప్-స్పెక్ ట్రిమ్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధరను రూ. 85,866 (ఎక్స్ షోరూం) గా కంపెనీ నిర్ణయించింది. కాస్మెటిక్ మార్పులు, ఇంజీన్ జూపిటర్ క్లాసిక్ ఇతర వేరియంట్లతో పోల్చినప్పుడు అది ప్రత్యేకంగా కనిపించేలా పలు బ్యూటీ అప్డేట్స్ ఇచ్చింది. ముందు ,బ్రౌన్ బాడీ ప్యానెల్ల వద్ద లేతరంగు గల విజర్ను పొందుతుంది (ఇతర వేరియంట్లు బ్లాక్ ప్యానెల్). మిర్రర్లు ఇతర వేరియంట్లలో క్రోమ్తో పోలిస్తే బ్లాక్ ఫినిషింగ్ను ఇచ్చింది. ఫ్రంట్ ఆప్రాన్ న్యూ గ్రాఫిక్స్, పైనుంచి కిందికి జుపిటర్ బ్యాడ్జింగ్ లాంటివి యాడ్ చేసింది. జూపిటర్ క్లాసిక్ నెక్స్ట్ జెన్ అల్యూమినియం, 109.7 సిసి, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్ 7.47 పిఎస్ పవర్, 8.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మోటార్ పేటెంట్ ఎకోనోమీటర్తో కూడా వస్తుంది, ఇది 'ఎకో మోడ్' ,'పవర్ మోడ్' రెండింటిలోనూ రైడర్లను గైడ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్టర్,కిక్ స్టార్టర్ రెండింటితోపాటు, బ్రేకింగ్ హార్డ్వేర్, ముందు డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్ను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్ఫోర్క్, త్రిస్టెప్ ఎడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ ఇందులో ఉన్నాయి. -
40 ఏళ్ల కిత్రం ఆ స్కూటర్ క్రేజ్ వేరబ్బా.. మళ్లీ స్టైలిష్ లుక్తో వచ్చేస్తోంది!
ఒకప్పుడు ఆటో మొబైల్ రంగాన్ని ఏలిన లాంబ్రెట్టా స్కూటర్ కంపెనీ మరోసారి భారత్లో తన మార్క్ని చూపెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం 1970లో కస్టమర్లను తనవైపు తిప్పుకుని భారత రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరిగిన లాంబ్రెట్టా స్కూటర్లును .. 2023లో లేటెస్ట్ మోడల్తో తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రానున్న మోడల్స్లో 200, 350సీసీ ఇంజిన్స్తో ఈ స్కూటర్లు రానున్నాయి. వీటితో పాటు 2024 చివరి నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. బర్డ్ గ్రూప్తో జాయింట్ వెంచర్లో భాగంగా ఈ కంపెనీ మార్కెట్లోకి ఈ స్కూటర్లను తీసుకురాబోతున్నాయి. కంపెనీ ముఖ్య అధికారి మాట్లాడుతూ.. బర్డ్ గ్రూప్తో కలిసి వచ్చే 5 సంవత్సరాలలో $200 మిలియన్లకు పైగా ఈ రంగంలో పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. 1970లో భారత్ మార్కెట్లో ఈ స్కూటర్ బ్రాండ్కి ప్రత్యేక గుర్తింపుతో పాటు కస్టమర్లలో వీటికి విపరీతమైన క్రేజ్ ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త రకం స్కూటర్ల మోడళ్లను డిజైన్, లుక్, ఫీచర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో విడుదల కానున్న స్కూటర్లతో కంపెనీకి భారత్లో ఉన్న గత వైభవాన్ని తిరిగి తీసుకురావడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ స్కూటర్లు హై-ఎండ్ మోడల్స్గా, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అత్యంత ఖరీదైన మోడల్ల కంటే దాదాపు 20% ఖరీదు ఉంటుందని అంచనా. ఈ జాయింట్ వెంచర్లో లాంబ్రెట్టా 51% వాటా ఉండగా, మిగిలిన 49% బర్డ్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఎలక్ట్రిక్ లాంబ్రెట్టా స్కూటర్ 2023లో మిలన్ మోటార్సైకిల్ షోలో ప్రజలకు ప్రదర్శించబోతోంది. అదే మోడల్ను భారత్లో స్థానికంగా ఉత్పత్తి చేయాలని చూస్తోంది. లాంబ్రెట్టా ప్రస్తుతం దాదాపు 70 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. -
మార్కెట్లోకి ఓలా న్యూ వెర్షన్ స్కూటర్, అదిరే ఫీచర్లు, కేవలం రూ.499తో మన ఇంటికి!
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా మరో సంచలనానికి సై అంది. ఇప్పటికే దేశం నలుమూలలా విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రయ్ రయ్ మంటూ రోడ్లపై పరుగులు పెడుతుండగా ఆగస్టు 15న ఈ కంపెనీ నుంచి రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 (Ola S1)ని కూడా రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నావిగేషన్, సహచర యాప్, రివర్స్ మోడ్ వంటి సాఫ్ట్వేర్ ఫీచర్లు ఉన్నాయి. లేటస్ట్ టెక్నాలజీ, సౌకర్యవంతమైన రైడ్ని అందివ్వగల ఈ స్కూటర్ ధరని రూ.99,000గా నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం రూ.499 చెల్లించి కస్టమర్లు ఈ స్కూటర్ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 15 నుంచి 31 వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే. ఈ తేదీలో బుక్ చేసుకున్న కస్టమర్లకు సెప్టంబర్ 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. Ola S1 బ్యాటరీ 3KWh సామర్థ్యం ఉండగా, ఒక సారి చార్జ్ చేస్తే 141 కిలోమిటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో 3 రకాల డ్రైవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎకో మోడ్లో 128 కిలోమిటర్లు , సాధారణ మోడ్ (నార్మల్ మోడ్) 101 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్లో 90కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ 95kmphగా ఉంది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు కలర్స్లో అందుబాటులో ఉన్నాయి. చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి -
వావ్...హోండా యాక్టివా 7జీ కమింగ్ సూన్..!
సాక్షి,ముంబై: హోండా 2వీలర్స్ తన కస్టమర్లకు మరో చక్కటి స్కూటర్ను అందించనుందా. కంపెనీ విడుదల చేసిన తాజా టీజర్ ఈ అంచనాలనే బలపరుస్తోంది. “కమింగ్ సూన్” అంటూ రానున్న హోండా యాక్టివా స్కూటర్పై వినియోగదారులను ఆకట్టుకుంటోంది. రానున్న కొత్త స్కూటర్ ఫీచర్లు లాంటి విషయాలపై హోండా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ టీజర్లోని సిల్హౌటీని చూసి హోండా యాక్టివా 7జీ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా 6జీని తీసుకొచ్చింది. ఫ్రంట్ టర్న్ ఇండికేటర్లు, హెడ్ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, హ్యాండిల్ బార్స్తోపాటు, కొత్త డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లతో హోండా యాక్టివా 7జీ రానుంది. అయితే యాక్టివా 6 జీ మోడ్తో పోలిస్తే ఫీచర్లను మరింత అప్గ్రేడ్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. (జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్) BS6-కంప్లైంట్ 109.51cc, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ సింగిల్-సిలిండర్ ఇంజన్ని ఉపయోగిస్తుంది. ఈ మోటార్ 8,000rpm వద్ద 7.79bhpను, 5,250rpm వద్ద 8.79Nm శక్తిని అందిస్తుంది. 'సైలెంట్ స్టార్ట్' సిస్టమ్, పాస్ లైట్ స్విచ్, 12 అంగుళాల ఫ్రంట్ వీల్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ యూనిట్తో సహా చాలా ఫీచర్లు యథావిధిగా ఉంటాయని అంచనా. అలాగే టీవీఎస్ జూపిటర్ వంటి ప్రత్యర్థులు కూడా అందిస్తున్న బ్లూటూత్ కనెక్టివిటీ వంటి కొత్త ఫీచర్లను వచ్చే దీపావళి నాటికి లాంచ్ అవుతుందని సమాచారం. చదవండి : Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు? రాబోయే హోండా హోండా యాక్టివా 7జీ ఖరీదైనదిగా ఉండనుందట. ప్రస్తుత స్టాండర్డ్ మోడల్ ధర రూ. 72,400, డీలక్స్ వేరియంట్కు రూ. 74,400 వద్ద విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇది హీరో ప్లెజర్ ప్లస్, టీవీఎస్ జూపిటర్ప్లస్, హీరో Maestro Edge 110, యమహా ఫాసినోలాంటి మోడల్స్కు గట్టి పోటీ ఇవ్వనుంది. Raise the bar with style that is unlike any other. Stay tuned! pic.twitter.com/u9RwNWe48F — Honda 2 Wheelers (@honda2wheelerin) August 9, 2022 -
హోండా డియో స్పోర్ట్స్ లాంచ్, ఆశ్చర్యంగా ధర తక్కువే!
సాక్షి,ముంబై: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త స్పోర్టీ బైక్ను మార్కెట్లో విడుదల చేసింది. హోండా డియో స్పోర్ట్స్ పేరుతో రెగ్యులర్ డియో మోటో-స్కూటర్ స్పోర్టీ వెర్షన్గా లాంచ్ చేసింది. అయితే లిమిటెడ్ ఎడిషన్గా తీసుకొచ్చిన హోండా స్పోరర్ట్స్ పరిమిత కాలంలోనే అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ ధర 68,317/- (ఎక్స్-షోరూమ్). టాప్-ఎండ్ డీలక్స్ వేరియంట్ ధర రూ. 73,317 (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ ప్రకటించింది. రెగ్యులర్ డియో స్టాండర్డ్ , డీలక్స్ ధర రూ. 73,599, రూ. 77,099 (ఎక్స్-షోరూమ్)ధరలతో పోలిస్తే కొత్త లిమిటెడ్ ఎడిషన్ ధరలు చౌకగా ఉండటం విశేషం. ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ స్పోర్టీ రెడ్ రియర్ సస్పెన్షన్తో తీసుకొచ్చిన హోడా డియో స్పోర్ట్స్ స్కూటర్ బ్లాక్తో స్ట్రోంటియమ్ సిల్వర్ మెటాలిక్ ,స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్ 2 కలర్ స్కీమ్లలో వస్తుంది. డీలక్స్ వేరియంట్ అదనంగా అల్లాయ్ వీల్స్ను అందిస్తుంది. 110 cc PGM-FI ఇంజిన్తో మెరుగైన స్మార్ట్ పవర్ (eSP) సాంకేతికతను అందిస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్, పాస్ స్విచ్ , ఇంజన్ కట్-ఆఫ్తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇంకా డియో స్పోర్ట్స్లో హోండా కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS) ఈక్వలైజర్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం 3-స్టెప్ ఎకో ఇండికేటర్ని జోడించింది. -
స్కూటర్ని ఢీ కొట్టిన మోటార్ బైక్: షాకింగ్ వీడియో
అతి వేగం ప్రమాదకరం అని చెబుతూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఇంకా ఎక్కడో ఒకచోటా ఏదో ఒక ప్రమాదం జరగుతూనే ఉంటుంది. మనం బాగా నడిపిన అవతల నుంచి వచ్చే వ్యక్తి సరిగి డ్రైవ్ చేయకపోయితే ఇకా అంతే పరిస్థితి. మైనర్లు బండి నడపకూడదని సూచనలు సైతం ఇస్తూన్నా వాటిని సైతం పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలానే ఒక మైనర్ మోటార్ బైక్ని అతి వేగంగా నడిపి ఘోరమైన రోడ్డు ప్రమాదానిక కారకుడయ్యాడు. వివరాల్లోకెళ్తే....పాట్నాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న మోటార్ బైక్ ఎదురుగా వస్తున్న స్యూటర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం పాట్నాలోని గంగా మార్గంలో జరిగింది. దీంతో స్కూటర్పై వెళ్తున్న ఇద్దరికి, బైక్ నడిపిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు క్షతగాత్రులను ఆస్పుత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే మోటార్ బైక్ని నడిపిన వ్యక్తి మైనర్ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. #WATCH | A speeding motorcycle rider hits a scooty coming from the opposite direction at Ganga Pathway in Patna. Scooty riders hospitalised. Police say, "FIR registered. The biker is a minor & hospitalised too. Both vehicles confiscated, investigation on." (Source: Viral video) pic.twitter.com/LyLHK1URa0 — ANI (@ANI) June 8, 2022 (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల పార్కింగ్లో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన వాహనాలు, ఫొటోలు వైరల్) -
సెట్ దోశ కాదు.. సీటుపై దోశ
ఎండలు ఎలా మండుతున్నాయో తెలుసుగా.. అయితే.. కొందరు వామ్మో ఎండలు అని చిరాకు పడకుండా.. తమలోని క్రియేటివిటీకి ఇలా పదును పెడుతున్నారు. పెనంలా బాగా వేడెక్కిన తన స్కూటర్ సీటుపై ఓ వ్యక్తి ఇదిగో ఇలా దోశ వేసేశాడు.. ఈ వీడియోను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ గొయెంకా ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట హల్చల్ చేస్తోంది. పునరుత్పాదక శక్తిని అద్భుతంగా వినియోగించుకుంటున్నాడని కొందరు వ్యాఖ్యానించగా.. ఇంధనాన్ని ఆదా చేస్తూ.. దేశంలో ధరలను తగ్గించడంలో, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రభుత్వానికి సాయపడుతున్నాడంటూ మరికొందరు సరదాగా కామెంట్ చేశారు. వీడియోను చూడాలంటే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి.. -
సెంచరీ దాటింది, సరికొత్త మైలురాయి చేరుకున్న ఈవిట్రిక్!
ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఈవిట్రిక్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. దేశ వ్యాప్తంగా 100 డీలర్ షిప్లను పూర్తి చేసుకుందని ఆ సంస్థ ఫౌండర్ మనోజ్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవిట్రిక్ మోటార్స్ 6 నెలల కాలంలోనే దేశ వ్యాప్తంగా 100కు పైగా డీలర్ షిప్ను చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈవీట్రిక్ స్కూటర్లు రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో లభిస్తున్నాయని తెలిపారు. మెట్రో నగరాలకు అతీతంగా ఆగ్రా, వారణాసి, అలీఘర్, జోధ్పూర్, బికనీర్, సూరత్ తో పాటు ఇతర ప్రాంతాల్లో సత్తా చాటుందని అన్నారు. ఇక దేశంలో పెరిగిపోతున్న పెట్రో ధరల కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగిపోతుందని, డిమాండ్కు అనుగుణంగా వెహికల్స్ను కొనుగోలు దారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈవిట్రిక్ ఫౌండర్ మనోజ్ పాటిల్ చెప్పారు. -
ఓలా స్కూటర్ యూజర్లకు గుడ్న్యూస్ చెప్పిన భవీశ్ అగర్వాల్
ఓలా స్కూటర్ యూజర్లకు ఆ కంపెనీ సీఈవో భవిశ్ అగర్వాల్ శుభవార్త చెప్పారు. గత ఆర్నేళ్లుగా ఎదురు చూస్తున్న కీలక ఫీచర్కి సంబంధించిన అప్డేట్ను వెల్లడించారు. అతి త్వరలోనే యూజర్లకు మూవ్ఓఎస్2 అప్డేట్ అన్లాక్ అవుతుందని తెలిపారు. ఓలా స్కూటర్ ప్రీ పొడక్షన్లో ఉండగానే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. లక్షన్నర ప్రీ బుకింగ్స్తో సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన బూమ్తో స్కూటర్ డెలివరీ ఒత్తిడిలో పడిపోయింది ఓలా సంస్థ. ఆగష్టు 15న ప్రీ బుకింగ్స్ ప్రారంభమైతే అక్టోబరు చివరి వారం నాటికి గానీ డెలివరీ చేయలేకపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా కస్టమర్లకు బైకులు డెలివరీ అవుతున్నాయి. అయితే యూజర్లకు డెలివరీ అయిన బైకుల్లో చాలా ఆప్షన్లో లాక్మోడ్లోనే ఉండిపోయాయి. డిజిటల్ కీ, మూవ్ఓస్ లాంటి ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. క్రమంగా ఒక్కో ఫీచర్ను అన్లాక్ చేస్తూ వస్తోంది ఓలా. దీనిపై ఇప్పటికే అనేక విమర్శలు ఓలాను చుట్టుముట్టాయి. ఈ తరుణంలో భవీశ్ అగర్వాల్ త్వరలోనే మూవ్ఓస్ 2 అందుబాటులోకి వస్తోందంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఓలా స్కూటర్ డిజటల్ కన్సోల్లో నావిగేషన్ మ్యాప్ అందుబాటులోకి రానుంది. Taking the wife out for some ice cream! Navigation on MoveOS 2 working great 👌🏼Coming very soon to all. pic.twitter.com/CUXh2mOQYQ — Bhavish Aggarwal (@bhash) April 18, 2022 చదవండి: ఓలా మరో సంచలనం! 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 160 కి.మీ ప్రయాణం.. -
మంటల్లో చిక్కుకున్న ఓలా స్కూటర్.. క్షణాల్లో బుగ్గి..
పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తుందంటూ చెబుతూ వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయా? అంటే అవును అనేట్టుగా వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వేసవి కాలం మొదలైందో లేదో ఒకే రోజు తమిళనాడు, మహారాష్ట్రలలో రెండు చోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పూనే నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో బైకు అగ్నికి ఆహుతయ్యింది. రోడ్డు పక్కన ఓ షాపు ముందు నిలిపి ఉంచిన స్కూటరు నుంచి ఉన్నట్టుండి పొగలు రావడం మొదలైంది. క్షణాల్లోనే దట్టమైన పొగలు కాస్తా మంటలుగా మారింది. నిమిషాల వ్యవధిలోనే ఓలా స్కూటర్ అగ్ని కీలల్లో చిక్కుకుని కాలి మసయ్యింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. A @OlaElectric scooter starts burning out of nowhere in front of our society. The scooter is totally charred now. Point to ponder.#safety #Pune @Stockstudy8 @MarketDynamix22 @LuckyInvest_AK pic.twitter.com/C1xDfPgh6p — funtus (@rochakalpha) March 26, 2022 దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న ఓలా స్కూటర్ మంటల్లో చిక్కుకుని తగలబడి పోవడం సంచలనంగా మారింది. ఈ స్కూటరులో అమర్చిన లిథియం ఐయాన్ బ్యాటరీలో ఎక్సోథెర్మిక్ రియాక్షన్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని.. స్కూటరు డిజైనులో లోపాలు ఉంటే వెంటనే సరి చేయాలని ఓలా స్కూటర్ యూజర్లు డిమాండ్ చేస్తున్నారు. As summer arrives, it’s a real test for survival of #EV in India. #EVonFire #BatteryMalfunction pic.twitter.com/Xxv9qS4KSu — Saharsh Damani, MBA, CFA, MS (Finance) (@saharshd) March 26, 2022 మరోవైపు ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైకు మంటల్లో చిక్కుకోవడం కారణంగా ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన శనివారం తమిళనాడులోని వెల్లూర్లో చోటు చేసుకుంది. దురైవర్మ అనే ఫోటోగ్రాఫర్ ఇటీవలే ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడు. రాత్రి ఛార్జింగ్ పెట్టి నిద్రకు ఉపక్రమించాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా స్కూటర్కు మంటలు అంటున్నాయి. ఇళ్లంతా పొగ వ్యాపించడంతో దుర్మైవర్మ అతని కూతురు ప్రీతీ మోహాన ఇద్దరు నిద్రలోనే చనిపోయారు. ఎలక్ట్రిక్ బైకుల తయారీలోకి కొత్త కంపెనీలు తామరతంపలా వచ్చి పడుతున్నాయి. స్కూటర్ల తయారీలో నాసిరకం వస్తువులు వాడటం, ఛార్జింగ్ పాయింట్లు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్, తయారీ చేస్తున్న కంపెనీలపై నజర్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
బతుకు బండి: బామ్మ స్టీరింగ్... బంగారు డ్రైవింగ్
భర్త చనిపోయిన దుఃఖం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న రాధామణి, బతుకు మార్గంపై దృష్టి పెట్టింది. వ్యాపారం చేసిన అనుభవం లేదు. ఆర్థిక స్థోమత అంతకంటే లేదు. తనకు తెలిసిన ఏకైక విద్య డ్రైవింగ్. ముప్పై సంవత్సరాల వయసులో భర్త లలాన్ దగ్గర స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంది రాధామణి. మొదట్లో ఎంత భయమేసిందో! అయితే ఆ భయం కొన్ని రోజులే. ఆ తరువాత భయం స్థానంలో ఇష్టం ఏర్పడింది. స్కూటర్ డ్రైవింగ్ను పర్ఫెక్ట్గా నేర్చుకుంది. కేరళలోని తొప్పుంపేడి పట్టణానికి చెందిన రాధ స్కూటర్ డ్రైవింగ్ దగ్గర మాత్రమే ఆగిపోలేదు. కారు, బస్, లారీ, ట్రాక్టర్, ఆటో–రిక్షా, క్రెన్, రోడ్ రోలర్ అండ్ జేసిబి, కంటేనర్ ట్రక్...ఇలా 11 వాహనాలను నడపడంలో లైసెన్స్ తీసుకుంది. కేరళలో హెవీ వెహికిల్ లైసెన్స్ తీసుకున్న తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది రాధామణి. కొన్ని సంవత్సరాల క్రితం... తొప్పుంపేడి నుంచి చెర్తాలం వరకు రాధామణి బస్సు నడిపినప్పుడు, ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చి చూశారు. ‘నా దృష్టిలో ఒక కొత్త వాహనం నేర్చుకోవడం అంటే, కొత్త బడిలో చేరడం లాంటిది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. దీనికి ఏకైక కారణం డ్రైవింగ్ అని చెబుతుంటాను’ అంటుంది 71 సంవత్సరాల రాధామణి. ఆమెను అందరూ ‘మణియమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. తన పిల్లలతో కలిసి తొప్పుంపేడిలో మొదలు పెట్టిన డ్రైవింగ్ స్కూల్కు అనూహ్యమైన ఆదరణ ఏర్పడింది. కాలేజి స్టూడెంట్ రీతిక ఇలా అంటుంది... ‘గతంలో డ్రైవింగ్పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కాలేజీలో చేరిన తరువాత మాత్రం బండి నేర్చుకోవడం తప్పనిసరి అనిపించింది. వెంటనే మణియమ్మ డ్రైవింగ్ స్కూల్ గుర్తొచ్చి చేరిపోయాను. అమ్మాయిలు ఇక్కడ సేఫ్టీగా ఫీలవుతారు. మణియమ్మ దగ్గరికి వెళితే డ్రైవింగ్ స్కూల్కు వెళ్లినట్లు అనిపించదు. బామ్మ దగ్గరకు వెళ్లినట్లు అనిపిస్తుంది. చాలా సరదాగా ఆమె డ్రైవింగ్ నేర్పిస్తుంది. ఇప్పుడు నేను టూవీలర్స్ మాత్రమే కాదు కారు కూడా నడుపుతున్నాను’ మణియమ్మ భర్త కోచిలో ‘ఏ టు జెడ్’ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపేవాడు. ఆయన చనిపోయిన తరువాత ఆ స్కూల్ మూతపడింది. అయితే ఇప్పుడు తొప్పుంపేడిలోని ‘డ్రైవింగ్ స్కూల్’లో అడుగడుగునా భర్తను చూసుకుంటుంది మణియమ్మ! -
నాన్న.. నేను.. ఓ స్కూటర్
కనిపించే దేవత అమ్మ.. నడిపించే దైవం నాన్న. నాన్నంటే భద్రత, భరోసా, బాధ్యత.. నాన్నంటే ఓ రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఎమోషన్. అలాంటి ఓ నాన్న ఎమోషన్ను అర్థం చేసుకున్నాడో కుమారుడు. తండ్రి ఎంతో ఇష్టంగా చూసుకున్న స్కూటర్ను జ్ఞాపకంగా మార్చుకునేందుకు ఆరేళ్లు తపన పడ్డాడు. స్కూటర్కు కొత్త రూపు తీసుకొచ్చేందుకు ఇంటర్నెట్లో శోధించాడు. ఆ రంగంలో నిష్ణాతులను కలిశాడు. వివిధ విభాగాల కోసం పలు రాష్ట్రాలకు వెళ్లాడు. అనుకున్నది సాధించాడు. అద్భుతమైన స్కూటర్ తయారు చేశాడు. తండ్రి జ్ఞాపకంగా ఆ స్కూటర్పై రయ్ రయ్మంటూ దూసుకుపోతున్నాడు. అతనే జీవీఎంసీ 52వ వార్డు శాంతినగర్కు చెందిన స్టీల్ప్లాంట్ ఉద్యోగి బి.కె.రమేష్. – గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) సాధారణంగా తుప్పుపట్టిన వస్తువులను పాత సామాన్ల వారికి అమ్మేస్తుంటాం. కానీ తన తండ్రి ఇష్టపడి కొనుక్కున్న లాంబ్రెట్టా మోడల్ లాంబీ 150 స్కూటర్ పూర్తిగా మరమ్మతులకు గురైనా.. రమేష్ దాన్ని విక్రయించాలని అనుకోలేదు. మూలన పడేయనూ లేదు. ఆ కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ స్కూటర్ను మళ్లీ కొత్త బండిలా తయారు చేయాలని భావించారు. తానే సొంతంగా బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. డిప్లమో ఇంజినీరింగ్ చేసిన రమేష్ దీన్ని తీర్చిదిద్దడానికి నడుంకట్టారు. సుమారు ఆరేళ్ల పాటు స్కూటర్కు కావాల్సిన స్పేర్ పార్ట్స్ కోసం అన్వేషణ సాగించారు. స్కూటర్ల వాడకం కనుమరుగైన కాలంలో.. లాంబీ విడి పార్టుల కోసం నానా పాట్లు పడ్డారు. ఒరిజినల్ పార్ట్స్ కోసం విశాఖపట్నంతో పాటు కర్నాటక, ఢిల్లీ, ముంబయి, కేరళ తదిత ర ప్రాంతాల్లో తిరిగారు. ఇంటర్నెట్ ద్వారా లాంబీ స్కూటర్పై అభిమానమున్న వ్యక్తులను కలుసుకొని కొన్ని పార్టులు సంపాదించారు. స్కూటర్ ఆయిల్ ట్యాంక్, ఫోర్కు, ఫోర్క్ బాల్స్ సెట్ తదితర పార్టులు మార్కెట్లో దొరక్క పోవడంతో.. తానే సొంతంగా డిజైన్ చేసి తయారు చేసుకున్నారు. ఇలా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి.. చివరకు స్పేర్ పార్ట్స్ సంపాదించారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఆరు నెలల పాటు శ్రమించి అద్భుతంగా స్కూటర్ తయారు చేశారు. లాంబీ.. ఓ సెంటిమెంట్ ‘లాంబీ స్కూటర్ పార్టుల కోసం తిరుగుతుంటే దీని విలువ తెలిసింది. విశాఖలోనే ఓ పెద్ద షాపు యజమాని ఒకప్పుడు లాంబీ స్కూటర్ స్పేర్ పార్టులు అమ్మేవాడని తెలిసి.. ఆయన్ని కలిశాను. ఆయన దగ్గర ఈ స్కూటర్కు సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. ఎంత బతిమలాడినా ఆయన పార్ట్స్ ఇవ్వలేదు. ఎందుకని ప్రశ్నిస్తే వాటి ద్వారానే ఇంతటి వాడినయ్యానని.. ఆ పార్టులు తనకు సెంటిమెంట్ అని చెప్పారు. నేను తిరిగిన చోట్ల ఇలాంటి వ్యక్తులు చాలా మంది తారసపడ్డారని’ రమేష్ తెలిపారు. నాన్న జ్ఞాపకాలు పదిలం ‘మా నాన్న అప్పలస్వామి ఆర్మీలో పనిచేశారు. ఆయనకు లాంబ్రెట్టా స్కూటరంటే చాలా ఇష్టం. 1971లో తొలిసారిగా లాంబీ స్కూటర్ కొన్నారు. కొన్నాళ్లు దానిపై తిరిగాక.. అమ్మేశారు. ఆ స్కూటర్పై మక్కువ తీరక మళ్లీ 1994లో లాంబ్రెట్టా మోడల్ స్కూటర్ కొన్నారు. అదే ఈ స్కూటర్. రిటైర్ అయ్యాక వాడడం మానేశారు. తర్వాత అది పూర్తిగా పాడైంది. దాన్ని పూర్వం మాదిరిగా తయారు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు ఆ బండి నడిపారు. ఇప్పుడు ఆ బండిని మరింత మెరుగ్గా తీర్చి దిద్దే పనిలో ఉన్నాను.’ అని రమేష్ వివరించారు. స్టీల్ప్లాంట్లో ఉద్యోగం ప్రస్తుతం రమేష్ స్టీల్ప్లాంట్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ స్కూటర్ తయారీలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆటో మొబైల్ రంగంలో చాలా విజ్ఞానాన్ని సముపార్జించానని రమేష్ చెబుతున్నారు. ఇంటర్నెట్ ద్వారా, కొందరు మెకానిక్లకు సంప్రదించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించారు. బండికి కావాల్సిన కొత్త వస్తువును తయారు చేసే ముందు ఆ వస్తువుకు సంబంధించి కొలతలన్నీ రాసుకోవడంతో పాటు డయాగ్రమ్ గీసుకునేవారు. ఆ వస్తువు మార్కెట్లో దొరక్కపోతే సొంతంగా తయారు చేసుకునేవారు. అనుభవం వల్లే ఈ విజ్ఞానం సాధించినట్లు చెప్పారు. ఆరు నెలల పాటు స్కూటర్ తయారీలో ప్రతి అంశాన్ని తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసినట్లు వివరించారు. లాంబ్రెట్టా రమేష్ పేరుతో యూట్యూబ్ చానల్లో ఆటో మొబైల్కు సంబంధించిన చాలా విషయాలు వివరించినట్లు చెప్పారు. నాన్న సెంటిమెంట్ను నిలబెట్టాను ఈ స్కూటర్ మా నాన్నకు ఎంతో ఇష్టమైనది. అరుదైనది. అందుకే దీన్ని బాగు చేశాను. లాంబీ–150 మోడల్ స్కూటర్లు 1977 నుంచి 86 మధ్య కాలంలో మన దేశంలో అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇది ఇటలీ వెర్షన్లో తయారైన బండి. ఒక్కో పార్టును అధిక ధర ఇచ్చి కొనుగోలు చేశాను. రూ.70 ఖరీదు గల లాంబీ–150 మోనోగ్రామ్ రూ.300 ఇచ్చి కొనాల్సి వచ్చింది. పెట్రోల్ ట్యాంకును కేరళలో కొన్నాను. ఇంజిన్లోకి అవసరమయ్యే పార్టులను ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేశాను. దాదాపు రూ.4.50 లక్షలు వెచ్చించి స్కూటర్ను తయారు చేశాను. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దేశం మొత్తం మీద 10 లోపు స్కూటర్లు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించాను. ఇప్పుడు ఈ బండిపై వెళ్తుంటే ఆరేళ్ల పాటు నేను పడిన కష్టం మర్చిపోతున్నా.. ప్రస్తుతం ఈ స్కూటర్ను మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నా. – బి.కె.రమేష్, స్టీల్ప్లాంట్ ఉద్యోగి -
వాళ్ల సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదన్న ఓలా సీఈవో.. మండిపడుతున్న కస్టమర్లు
OLA CEO Bhavish Aggarwal: ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనంత హైప్ క్రియేట్ చేసింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్ సాధించింది. రిలీజ్కు ముందు వచ్చిన హైప్ని సరిగా ఉపయోగించుకోవడంలో ఓలా విఫలమైంది. డెలివరీలు ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో సందర్భం ఏదైనా సరే ఓలా స్కూటర్స్ సీఈవో భవిష్య అగర్వాల్పై కస్టమర్లు విరుచుకు పడుతున్నారు. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తల్లిదండ్రులు పంజాబ్లోని లుథియానాలో నివసిస్తున్నారు. దేశంలో మిగిలిన కస్టమర్లలాగే 2021 ఆగస్టు 15న వారు కూడా ఓలా స్కూటర్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంచు మించు ఆరు నెలల తర్వాత ఆ స్కూటర్ని లుథియానాలో భవీష్ అగర్వాల్ తల్లిదండ్రులకు డెలవరీ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఎంతో సంతోషంగా తెలిపారు భవీష్ అగర్వాల్. @OlaElectric @varundubey No updates regarding dispatch by taking amount early and customer support wont reply those people paid after me got delivered.why to show first come first serve when r not following it.and you people only reply for good response who will ans complaints? — ashwin (@ashwinas92) February 25, 2022 భవీష్ అగర్వాల్ ట్వీట్కి నెటిజన్ల నుంచి నెగటివ్ స్పందన వచ్చింది. ఆరు నెలలుగా ఇంచుమించు లక్షన్న రూపాయలు చెల్లించి స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నామని ఇంత వరకు ఎందుకు డెలివరీ చేయడం లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రస్టేట్ అవకుండా ఓలా స్కూటర్ అందుకోవడం కష్టమంటున్నారు. My dad is waiting for his @OlaElectric scooter too. Super frustrated by seeing those copy-paste tweet replies from you people. I was a fool to pay money every time in first place when you people opened the payment windows 3 times. The limit is reached now. @consumerforum_ — अभिषेक राय (@Abhishek_Rai555) February 25, 2022 మేము చెల్లించిన డబ్బలుకు వడ్డీ ఎవరు ఇస్తారు ? ఎన్ని సార్లు అడిగినా కాపీ పేస్ట్ సమాధానాలు తప్పితే మీ నుంచి ఏమీ రావడం లేదు ? ఒక మోడల్ బుక్ చేస్తే మరో మోడల్ డెలివరీ చేశారంటూ ఒకరి తర్వాత ఒకరుగా నెటిజన్లు భవీష్ అగర్వాల్పై మండిపడుతున్నారు. -
బస్తా చిల్లర పైసలతో షోరూంకి వెళ్లాడు.. ఆ తర్వాత
stationary shopkeeper bought a new scooter: ఇటీవలే మహీంద్రా షోరూమ్లోని ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ రైతుని అవమానించి క్షమాపణలు చెప్పుకున్న కథ గురించి విన్నాం. అయితే ఇక్కడొక వ్యక్తి స్కూటర్ కొనక్కునేందుకు బస్తా చిల్లరతో షోరూమ్కి వెళ్లాడు. స్కూటర్ని మొత్తం ఆ చిల్లర నాణేలతోనే కొనుగోలు చేశాడు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అస్సాంలో హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి కొత్త స్కూటర్ని కొనుగోలు చేసేందుకు నెలలు తరబడి నాణేలను పొదుపు చేశాడు. అంతేకాదు ఎనిమిది నెలలు తరబడి పోగుచేసిన నాణేలన్నింటిన ఒక బస్తాలో వేసి షోరూంకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ షోరూం వాళ్లు ఆ నాణేలను ఒక ప్లాస్టిక్ బుట్టల్లో వేసుకుని లెక్కించారు. ఆ తర్వాత అతను తనకు నచ్చిన స్కూటర్ని కొనుకున్నాడు. అయితే అతను స్కూటర్ని మొత్తం చిల్లర నాణేలతోనే కొనుగోలు చేయడం విశేషం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహాలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి!) -
స్కూటర్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన యమహా మోటార్స్..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా మోటార్ ఇండియా పలు స్కూటర్స్పై క్యాష్బ్యాక్ను ప్రకటించింది. కాగా ఈ ఆఫర్స్ ఎంపిక చేయబడిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండనున్నాయి. ఈ మోడల్స్పై..! యమహా మోటార్స్ శ్రేణిలోని హైబ్రిడ్ మోడల్స్పై క్యాష్బ్యాక్ రానుంది. యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్స్పై ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ను కంపెనీ ప్రకటించింది. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొనుగోలుదారులకు క్యాష్బ్యాక్ రానుంది. ఆయా రాష్ట్రాల వారు ఫిబ్రవరి నెల మొత్తం ఈ ఆఫర్ను పొందవచ్చును. యమహా అందిస్తోన్న ఆఫర్స్లో భాగంగా... Yamaha Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్పై అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు , పశ్చిమ బెంగాల్లో రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. మహారాష్ట్రలో...Fascino 125 FI హైబ్రిడ్, RayZR 125 FI హైబ్రిడ్ స్కూటర్లపై రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ను అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లపై తమిళనాడులో రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. ఇక విభిన్న రాష్ట్రాల్లో క్యాష్బ్యాక్ను యమహా అందిస్తోంది. ఈ హైబ్రిడ్ స్కూటర్స్ 125సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజిన్తో పనిచేయనున్నాయి. ఇది 6,500 rpm వద్ద 8 bhp సామర్థ్యాన్ని, 5,000 rpm వద్ద 10.3 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ స్కూటర్లలో హైబ్రిడ్ పవర్ అసిస్ట్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టమ్ను ఏర్పాటు చేశారు. SMG ఆన్బోర్డ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇది మెరుగైన పుల్లింగ్ పవర్ కోసం అదనపు టార్క్ను అందిస్తోంది. Fascino 125 FI హైబ్రిడ్, అలాగే RayZR FI 125 హైబ్రిడ్ స్కూటర్స్ రెండూ కూడా సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్తో వస్తాయి.Yamaha Fascino 125 FI, Yamaha Ray ZR 125 FI స్కూటర్స్ రెండూ కూడా ప్రామాణికంగా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ను కలిగి ఉన్నాయి. చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు!! -
రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు
ద్విచక్ర వాహనాల ఎగుమతుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2021లో కొత్త రికార్డు సృష్టించింది. 2021 ఏడాది కాలంలో భారతీయ, ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమకు సవాళ్లు ఎదురైనప్పటికి హీరో మోటోకార్ప్ అత్యధిక సంఖ్యలో 2.89 లక్షల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఏ సంవత్సరంలో నమోదు చేయని విధంగా భారత్తో సహా, ఇతర దేశాల్లో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. హీరో మోటోకార్ప్ గత సంవత్సరంలో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ & మధ్య అమెరికా, కరేబియన్ ప్రాంతంలో తన మార్కెట్ విస్తరించింది. ఈ మార్కెట్ విస్తరణ వల్ల భారతదేశం వెలుపల మార్కెట్లలో అమ్మకాల పరంగా 71 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2020లో విదేశీ మార్కెట్లలో 1.69 లక్షల యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య (2.89 లక్షల యూనిట్లు) చాలా ఎక్కువ. కానీ, హీరో మోటోకార్ప్ తన పనితీరుతో సంతృప్తిగా లేదు. "ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా గ్లోబల్ లాజిస్టిక్స్, సప్లై ఛైయిన్ లో ఉన్న అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాలెండర్ సంవత్సరంలో ప్రపంచ మార్కెట్లలో విక్రయాలు ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నాయి" అని సంజయ్ భాన్, హెడ్ - గ్లోబల్ బిజినెస్, హీరో మోటోకార్ప్ అన్నారు. "2025 నాటికి గ్లోబల్ బిజినెస్ అమ్మకాల వాటా కంపెనీ మొత్తం వాటాలో 15% చేరుకోవడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు" తెలిపారు. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం 42 దేశాలకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తుంది. భారత్తో సహా గ్లోబల్ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్ ప్రణాళికలను రచిస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని కంపెనీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి కానున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో, హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 3,94,773 యూనిట్లను విక్రయించింది. (చదవండి: భారత మార్కెట్లలో కియా మోటార్స్ ప్రభంజనం..!) -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్న్యూస్! ఈ పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ ఫ్రీ
ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స ట్రెండ్ నడుస్తోంది. క్రమంగా పెట్రోలు, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వైపు ప్రజలు మళ్లుతున్నారు. అయితే ఈ చేంజింగ్ ట్రెండ్కి ఛార్జింగ్ పాయింట్ల షార్టేజీ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు ఈవీ తయారీ సంస్థలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా మరో అడుగు ముందుకు వేసింది. పెట్రోలు బంకుల్లో పెట్రోల్ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్లకు ఛార్జింగ్ సౌకర్యం అందించే లక్ష్యంతో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్తో ఓలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్న భారత్ పెట్రోల్ బంకుల్లో ఓలా సంస్థ హైపర్ ఎలక్ట్రిక్ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఓలా స్కూటర్స్ సీఈవో భవీశ్ అగర్వాల్ ట్విట్టర్లో స్వయంగా ప్రకటించారు. రెండు నెలల్లో భారత్ పెట్రోలు బంకుల్లో హపర్ ఛార్జింగ్ పాయింట్లు 6 నుంచి 8 వారాల్లోగా అందుబాటులోకి వస్తాయంటూ భవీశ్ తెలిపారు. పెట్రోలు బంకులతో పాటు ఇళ్ల సముదాయల దగ్గర కూడా హైపర్ ఛార్జింగ్ పాయింట్లు తెస్తామంటూ శుభవార్త తెలిపారు. ఛార్జింగ్ ఫ్రీ ఇక పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా భవీశ్ అగర్వాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. భారత్ పెట్రోలు బంకులు, రెసిడెన్షియల్ కాంప్లెక్సుల దగ్గర ఓలా సంస్థ నెలకొల్పే హైపర్ ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. 2022 జూన్ 30 వరకు ఈ ఆఫర్ని అందిస్తున్నారు. ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు సంబంధించి ఒక యూనిట్ కరెంట్కి రూ. 12 నుంచి రూ.15 వరకు విద్యుత్ సంస్థలు ఛార్జ్ చేస్తున్నాయి. Hypercharger roll out has begun across cities. At key BPCL pumps as well as residential complexes. 4000+ points up through next year. We’re installing across India and will make them operational in 6-8 weeks. Will be free for use till end June 22 for all customers. pic.twitter.com/WKEzok4E98 — Bhavish Aggarwal (@bhash) December 28, 2021 అథర్కి పోటీగా ఓలా కంటే ముందే ఈవీ మార్కెట్లో ఉన్న అథర్ సంస్థ సైతం పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఫ్రీ ఛార్జింగ్ పెసిలిటీని కల్పించింది. 2021 డిసెంబరు 31తో ఈ గడువు ముగియగా తాజాగా 2022 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఆ వెంటనే ఓలా నుంచి పబ్లిక్ హైపర్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు ప్రకటన వచ్చింది. చదవండి:విశాఖలో ఓలా స్కూటర్ల డెలివరీ.. గెట్ రెడీ అంటున్న భవీశ్ అగర్వాల్ -
స్పైడర్మ్యాన్ క్రేజ్..! మార్కెట్లలోకి సూపర్ హీరోస్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్స్
Tvs Ntorq 125 Price And Mileage: ప్రపంచవ్యాప్తంగా మార్వెల్స్ హీరోస్పై క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజ్ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీలు మార్వెల్స్ హీరోస్ స్ట్రాటజీతో తమ వ్యాపారాలకు మరింత ఆదాయాలను సంపాదించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16 న రిలీజైన స్పైడర్మ్యాన్: నో వే హోమ్ వెండి తెర సంచలనం సృష్టిస్తోంది. భారత్లో కూడా స్పైడర్మ్యాన్: నో వే హోమ్ క్రేజ్ మామూలుగా లేదు. మార్వెల్స్ హీరోస్ లవర్స్ కోసం ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మార్వెల్స్ సూపర్ హీరోస్ ఎడిషన్ స్కూటర్లను లాంచ్ చేసింది. చదవండి: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..! అందులో టీవీలు, హెడ్ఫోన్స్, ఇంకా మరెన్నో..! టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ NTORQ 125 సూపర్స్క్వాడ్ ఎడిషన్లో భాగంగా మరో రెండు మార్వెల్ సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్, థోర్ ప్రేరేపిత స్కూటర్లను కంపెనీ విడుదల చేసింది. గత ఏడాది సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో భాగంగా మార్వెల్ సూపర్ హీరోస్ - ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా ఎడిషన్ టీవీఎస్ Ntorq 125బైక్లను ప్రారంభించింది. భారత్లోకి RT-Fi సాంకేతికతతో వచ్చిన మొట్టమొదటి బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన స్కూటర్గా టీవీఎస్ Ntorq 125 నిలుస్తోంది. సూపర్ హీరోస్ ఫీచర్స్తో..! కొత్త మార్వెల్ స్పైడర్ మ్యాన్ , థోర్ వెర్షన్లు స్కూటర్స్ సూపర్ హీరోల ముఖ్య లక్షణాలను టీవీఎస్ Ntorq 125 ఏర్పాటుచేశారు. స్పైడర్ మ్యాన్, థోర్ కు సంబంధించిన విషయాలను ఇందులో ఉండేలా టీవీఎస్ డిజైన్ చేసింది. ఈ స్కూటర్లలోని స్మార్ట్కనెక్ట్ యాప్ స్పైడర్ మ్యాన్ లోగో , థోర్స్ హమర్ వంటి సంబంధిత పాత్రల చిహ్నాల సిల్హౌట్తో ఒపెన్ కానుంది.ఈ స్కూటర్లు మార్వెల్ సూపర్ హీరోస్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ధర ఎంతంటే..! టీవీఎస్ NTORQ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 84,850 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు... స్కూటర్ మొదటి-రకం వాయిస్ అసిస్ట్ ఫంక్షన్, మొదటి-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్ రైడ్ మోడ్లను అందించే వేరియంట్తో రానుంది. చదవండి: మల్టీప్లెక్సుల బిజినెస్ అదరహో.. సాయం చేసిన స్పైడర్మ్యాన్- భరోసా ఇచ్చిన పుష్ప -
తాళం చెవితో పనిలేదు.. ‘సెల్ఫీ’ కొడితే స్కూటర్ రయ్ రయ్..
సాక్షి, హైదరాబాద్: తాళం చెవితో పనిలేదు.. ఈ–స్కూటర్ వద్దకు వెళ్లి యాప్ను ఆన్చేసి సెల్ఫీ తీస్తే చాలు.. అది స్టార్ట్ అయిపోతుంది. యాప్ ద్వారానే స్కూటర్ నడిపిన తర్వాత పేమెంట్ కూడా చేయొచ్చు. ఈ మేరకు రూపొందించిన ‘హల’మొబిలిటీ యాప్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం, అద్దె, చార్జింగ్ స్టేషన్లు తదితర సేవలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. పలు విద్యాసంస్థల ఆవరణలో ఒకే సీటు ఉన్న ‘ఈ స్కూటర్’సేవలను ఇప్పటికే ‘హల’అందిస్తోంది. తాజాగా ఆవిష్కరించిన ‘హల’మొబిలిటీ యాప్ సేవలను ఈ నెల నుంచే హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ‘ఈ స్కూటర్’సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. స్మార్ట్ బ్యాటరీతో పనిచేసే ఈ–స్కూటర్ల కోసం ట్రిపుల్ ఐటీ ఆవరణలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ వాహనాల్లో బ్లూ టూత్ కనెక్షన్, జీపీఎస్ వంటి టెక్నాలజీ ఉండటంతో మొబైల్ ఫోన్లోని హల మొబిలిట్ యాప్ ద్వారా డిజిటల్ తాళాన్ని తెరిచి ప్రయాణించొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ యాప్ ప్రయాణికుడి సెల్ఫీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు వివరాలు క్షణాల్లో సేకరించి ‘ఈ స్కూటర్’పై ప్రయాణానికి అనుమతిస్తుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను ‘హల’తీరుస్తుందని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రయాణాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు. వచ్చే 12 నెలల్లో ఆరు నగరాల్లో ‘హల’యాప్ ద్వారా పనిచేసే 15వేల స్కూటర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదిలాఉంటే, టి హబ్లోని ‘ల్యాబ్ 32 ప్రాజెక్టు’ కింద ‘హల మొబిలిటీ యాప్’ పురుడుపోసుకున్నట్లు టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్రావు వెల్లడించారు. -
Scooter Trolley: ఐడియా అదిరింది
రోజువారీ రవాణా ఖర్చులు పెరుగుతుండటంతో ఈ యువ రైతు కొత్తగా ఆలోచించాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్కడ్మూర్కు చెందిన జానకి రాంరెడ్డి తమకున్న ఆరెకరాల పొలంలో బొప్పాయి తోటను సాగు చేశాడు. ఈ పండ్లను అమ్మడానికి అమరచింత, ఆత్మకూర్కు రావడానికి ఆటోకు రోజుకు రూ.600 చెల్లించేవాడు. ఇది భారంగా మారింది. అతను స్వతహాగా బైక్ మెకానిక్ కావడంతో దాన్నుంచి బయటపడే ఆలోచన చేశాడు. స్కూటర్కు ట్రాలీని జతపరిచాడు. తన భార్యతో కలిసి బొప్పాయిలను విక్రయిస్తున్నాడు. – అమరచింత పరుగో పరుగు జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో భవానీమాత జాతర సందర్భంగా ఆదివారం నిర్వహించిన శునకాల పరుగుపందెం పోటీలు ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతిని గద్వాలకు చెందిన శునకం దక్కించుకుంది. – గద్వాల (గట్టు) చిలుకమ్మ పలికింది.. విజయవాడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన డాగ్ షోలో రెండు చిలుకలు సందడి చేశాయి. ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన తోకటూ(తెల్ల రంగులో ఉన్నది), అమెరికా నుంచి తెచ్చిన మకావ్ చిలుకలు సందర్శకుల మాటలకు బదులిస్తూ వారిని ఆశ్చర్యచకితులను చేశాయి. దీంతో డాగ్షోకు వచ్చిన పలువురు ఈ చిలుకలతో సరదాగా మాట కలిపి ఆనందంలో మునిగితేలారు. – సాక్షి, విజయవాడ -
అప్రీలియా ఎస్ఆర్ కొత్త వెర్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో ఇండియా అప్రీలియా ఎస్ఆర్ 125, ఎస్ఆర్ 160 స్కూటర్స్ కొత్త వర్షన్స్ విడుదల చేసింది. పుణే ఎక్స్షోరూంలో ఎస్ఆర్ 160 ధర రూ.1.17 లక్షలు, ఎస్ఆర్ 125 ధర రూ.1.07 లక్షలు ఉంది. ఫీచర్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్, సింగిల్ చానెల్ ఏబీఎస్తో డిస్క్, డ్రమ్ బేక్స్, డ్యూయల్ సీట్స్, నకిల్ గార్డ్స్, అలాయ్ వీల్స్, వి–షేప్డ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, ఎక్స్–షేప్డ్ ఎల్ఈడీ టెయిల్లైట్ పొందుపరిచారు. ఎస్ఆర్ 160 స్కూటర్ 160 సీసీ 3వీ టెక్ ఈఎఫ్ఐ ఎయిర్కూల్డ్ ఇంజన్తో తయారైంది. -
మార్కెట్లోకి రెండు శక్తివంతమైన స్కూటర్లు లాంఛ్ చేసిన పియాజియో
ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో ఇండియా భారత్లో అప్ డేట్ చేసిన అప్రిలియా న్యూ ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125 స్కూటర్లను లాంఛ్ చేసింది. న్యూ ఎస్ఆర్ 160 మోడల్ ధర ₹.1,17,494(ఎక్స్ షోరూమ్ పూణే)గా ఉంటే, ఎస్ఆర్ 125 మోడల్ ధర ₹1,07,595(ఎక్స్ షోరూమ్ పూణే)గా ఉంది. డిజైన్ సహా పలు ఫీచర్లను అప్డేట్ చేయడంతో పాటు నూతన శ్రేణి వాహనాలు బీఎస్6 ప్రమాణాలతో కస్టమర్ల ముందుకు వచ్చాయి. రూ 5000 టోకెన్ అమౌంట్తో న్యూ ఎస్ఆర్ రేంజ్ బైక్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. కొత్త ఎస్ఆర్ 160 రేంజ్ వైట్, బ్లూ, గ్రే, రెడ్, మాట్ బ్లాక్ రంగులలో లభ్యం కానుంది. అప్రిలియా ఎస్ఆర్ 160 కొత్త హెడ్ ల్యాంప్, కొత్త ఎల్ఈడి హెడ్ లైట్ తో వస్తుంది. ఎస్ఆర్ 160 స్కూటర్లో ఎబిఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), 160 సీసీ 3వీ టెక్ ఎఫ్ఐ, హైటెక్, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్ తో వస్తుంది. ఇందులో 160 సీసీ ఎయిర్ కూల్డ్ త్రీ వాల్వ్ ఇంజిన్ సహాయం చేత పనిచేస్తుంది. ఇది 7600 ఆర్ పిఎమ్ వద్ద 10.84 బిహెచ్ పఈ పవర్, 6000 ఆర్ పిఎమ్ వద్ద 11.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. (చదవండి: భారీగా పడిపోయిన బిట్కాయిన్ ధర) -
యువత కోసం మార్కెట్లోకి హోండా గ్రాజియా లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్
ఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామిగా ఉన్న హోండా మోటార్ సైకిల్ ఇండియా మార్కెట్లోకి గ్రాజియా 125 సీసీ రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ స్కూటర్ను లాంచ్ చేసింది. గుర్గావ్ ఎక్స్షోరూంలో దీని ధర రూ.87,138 ఉంది. రెప్సోల్ హోండా రేసింగ్ టీమ్ డిజైన్ థీమ్, గ్రాఫిక్స్ స్ఫూర్తితో గ్రేజియా 125 రెప్సాల్ హోండా టీమ్ ఎడిషన్ను రూపొందించినట్లు కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్, సీఈఓ అత్సుషి ఒగాటా వెల్లడించారు. ఈ స్కూటర్ను దేశీయంగా యువత ఔత్సాహికుల కోసం విడుదల చేసినట్లు తెలిపారు. ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్((పీజీఎం-ఎఫ్ఐ) ఇంజన్, ఐడ్లింగ్ స్టాప్ వ్యవస్థ, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ (ఈఎస్పీ), మల్టీ-ఫంక్షన్ స్విచ్, ఇంజిన్-కటాఫ్తో సైడ్ స్టాండ్ ఇండికేటర్, మూడు దశల్లో సర్దుబాటు చేసే రేర్ సస్పెన్షన్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వంటి సదుపాయాలు ఈ స్కూటర్ను రూపొందించారు. (చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!)