study
-
పరీక్ష హాల్లో టాపర్స్ టెక్నిక్స్!
పరీక్ష హాల్ అనేది యుద్ధభూమి కాదు, ఇదొక గేమ్బోర్డ్! పరీక్షల్లో నిజమైన విజేతలు ఎవరంటే ఎక్కువగా చదివినవాళ్లు కాదు. పరీక్ష హాల్లో సరిగ్గా ఆలోచించి, సమయాన్ని ప్లాన్ చేసుకుని, ప్రశాంతంగా ఉండగలిగిన వాళ్లే విజేతలుగా నిలుస్తారు. అంటే మీ విజయం మీ మైండ్సెట్, ప్లానింగ్, ఆటిట్యూడ్ మీదే ఆధారపడి ఉంటుంది! అందుకే పరీక్ష హాల్లో మెదడు ఎలా పనిచేస్తుంది? టాపర్ల సీక్రెట్ మైండ్ హ్యాక్స్ ఏమిటనే విషయం ఈరోజు తెలుసుకుందాం.చేయకూడనివి...గడియారం చూస్తూ ఆందోళన చెందవద్దు. ఇది ఒత్తిడిని పెంచుతుంది. ఒక్క ప్రశ్నకే అతుక్కుపోయి ఎక్కువ సమయం వృథా చేయడం.పరీక్ష మధ్యలో ‘నేను తక్కువ మార్కులు తెచ్చుకుంటానేమో‘అనే అనవసరమైన ఆలోచనలతో భయం పెంచుకోవడం.ప్రశ్నలకు పూర్తి సమాధానం రాశానా? లేదా? అన్న ఆందోళనకి లోనవడం.ఎవరైనా పేపర్ రాయడం పూర్తిచేస్తే, ఒత్తిడిగా ఫీల్ అవ్వడం.పరీక్ష భయాన్ని తగ్గించే ‘పామింగ్ టెక్నిక్’కొంతమంది విద్యార్థులకు పరీక్ష హాల్లోకి అడుగు పెట్టగానే గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం, మెదడు ఖాళీ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలకు లోనవుతారు. సింపతటిక్ నర్వస్ సిస్టమ్ అధికంగా యాక్టివ్ కావడమే దీనికి కారణం. దీన్ని నియంత్రించేందుకు ‘పామింగ్ టెక్నిక్’ ఉపయోగపడుతుంది. ఇది చేయడం కూడా చాలా సులువు. చేతులను రుద్ది వేడిగా చేయండి · కళ్లు మూసుకుని వేడి చేతులను కళ్ల మీద ఉంచండి లోతుగా ఊపిరి తీసుకుంటూ, ‘నేను ప్రశాంతంగా ఉన్నాను‘ అని మౌనంగా చెప్పుకోండి 30 సెకన్ల పాటు అలా ఉంచిన తర్వాత, చేతులను వదిలి నెమ్మదిగా గాలి పీల్చుకోండి. ఇది నాడీ వ్యవస్థను రిలాక్సేషన్ మోడ్లోకి మార్చి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. పరీక్ష ముందు, ప్రశ్నపత్రం చూసిన వెంటనే ఇది చేయడం మిమ్మల్ని స్పష్టమైన ఆలోచనకు తీసుకెళుతుంది.మైండ్ బ్లాక్ అయ్యిందా? నో ప్రాబ్లెమ్కొందరు విద్యార్థులకు పరీక్ష మధ్యలో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. చదివినవేవీ గుర్తుకురావు. దీన్ని హ్యాండిల్ చేసేందుకు టాపర్లు జీఎస్ఆర్ మోడల్ అనే ప్రత్యేకమైన టెక్నిక్ ఉపయోగిస్తారు. మీరూ దాన్నే ఫాలో అవ్వండి!Ground Yourself – కాళ్లు నేలకి ఆనించి 5 సెకన్లు లోతుగా ఊపిరి పీల్చుకోండి. Switch Focous– 10 సెకన్ల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండండి.Restart Slowly – నెమ్మదిగా ప్రశ్న మళ్లీ చదవండి.పరీక్ష హాల్లో మైండ్ఫుల్నెస్ టెక్నిక్పరీక్ష సమయంలో ఒక్కసారిగా ప్రశ్న అర్థం కాకపోతే, మెదడు ‘ఫ్రీజ్‘ అవుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, సమయం వృథా అవుతుంది. దీన్ని అధిగమించేందుకు మైండ్ఫుల్నెస్ సైకాలజీలో ఉపయోగించే ‘గౌనర్–స్విచ్ మోడల్‘ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే... గౌనర్ మోడ్ (గమనించు): ప్రశ్న అర్థం కాకపోతే, కొంతసేపు అక్షరాలను ప్రశాంతంగా గమనించు.స్విచ్ మోడ్ (మార్చు): ప్రశ్నను పూర్తిగా వదిలేయకుండా, కొంచెం వెనక్కి వెళ్లి మళ్ళీ నిశ్శబ్దంగా చదువు.స్కానింగ్ మోడ్: పక్కనే ఉన్న ఇతర ప్రశ్నలను చూసి, మైండ్ను మళ్ళీ సెట్ చేసుకోవడం. ఇది మెదడును బ్లాక్ అవుట్ నుంచి రికవరీ మోడ్లోకి తీసుకువచ్చి, మరింత చురుకైన ఆలోచనకు సహాయపడుతుంది.చివరి నిమిషాల్లో చేయవలసినవిపరీక్ష పత్రం అందుకున్న వెంటనే, 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి · ముఖ్యమైన సమాధానాల్ని గుర్తించి, ముందుగా అవి రాయడం మొదలుపెట్టండి · ప్రశ్నలకు సమాధానం రాస్తూ, మధ్యలో చిన్న మైండ్ఫుల్ బ్రేక్స్ తీసుకోండి సమాధానాలను సాఫ్ట్గా, క్లియర్గా రాయండి మార్కుల స్కోరింగ్కు డయాగ్రామ్స్, హైలైట్స్ ఉపయోగించండి గుర్తులేదనుకున్న ప్రశ్నలపై చివరి 15 నిమిషాల్లో ప్రయత్నం చేయండి. పరీక్ష అనేది మీరు చదివిన తీరుకే కాదు, మీ మానసిక స్థిరత్వానికి కూడా పరీక్ష. ఈ టూల్స్టెక్నిక్స్ ఉపయోగించుకుని ప్రశాంతంగా, ప్లానింగ్తో రాస్తే, మీరు విజయం సాధించటం ఖాయం! పరీక్ష అనేది ఒక స్ట్రాటజిక్ గేమ్! దీనిని గెలవడం మీ చేతుల్లోనే ఉంది! పరీక్షలో విజయం సాధించేది ఎక్కువగా చదివినవారు కాదు, ప్రశాంతంగా ఆలోచించగలిగినవారే!సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com (చదవండి: ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!) -
రీల్స్, యూట్యూబ్ మోజులో పిల్లలు, తలలు పట్టుకుంటున్న పేరెంట్స్
నా కూతురు 8వ తరగతితో చదువు మానేసింది. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటోంది. భారీ పెట్టుబడి లేకుండానే త్వరగా డబ్బు సంపాదించవచ్చని అంటోంది. కౌన్సెలింగ్ కూడా ఇప్పించా. అయినా ఫలితం లేదు. ఆమె మనసును ఎలా మార్చాలో తెలియడం లేదు..- హైదరాబాద్కు చెందిన ఓ తండ్రి బాధ మా అమ్మాయిలు ఒకరు 9, మరొకరు8 చదువుతున్నారు. ఇటీవలే రీల్స్ చేయడంఅలవాటు చేసుకున్నారు. మొదట్లో మేం కూడా సరదాగా ఎంకరేజ్ చేశాం. ఇప్పుడు అదే పనిలో పడిపోయి చదువును పూర్తిగా అటకెక్కించారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. - వరంగల్ జిల్లాకు చెందిన ఓ తల్లి ఆవేదనపిల్లల మనసు మార్చాలని మా వద్దకు తీసుకొస్తే.. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరు అంటూ ఎదురు ప్రశ్నలేస్తున్నారు.. - మానసిక వైద్యులు చెబుతున్నది ఇది బాల్యం సోషల్ మీడియా వలలో చిక్కి విలవిల లాడుతోంది. రీల్స్, యూట్యూబ్ చానల్స్తో లక్షలు సంపాదించొచ్చన్న ఇన్ఫ్లుయెన్సర్ల మాటలగారడీలో పడి స్కూలు పిల్లలు కూడా జీవితాలు పాడుచేసుకుంటున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అంతటా ఈ జాడ్యం పెరుగుతోంది. దీంతో స్కూల్ పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి తగ్గిపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు -సాక్షి, హైదరాబాద్చదువు కోసం మొదలై.. కరోనా లాక్డౌన్ సమయంలో పిల్లల చదువు పాడవకూడదని అందరూ ఆన్లైన్ చదువుల వైపు మొగ్గారు. అందుకోసం పిల్లలకు పర్సనల్ కంప్యూటర్స్, ఫోన్లు, ట్యాబులు కొనిచ్చారు. ఇప్పుడు అదే పాపంగా మారింది. ఆన్లైన్లో అధిక సమయం గడపడంతో పిల్లలకు క్విక్ మనీకి బోలెడు మార్గాలు కనిపించాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సహా అనేక అంశాలపై అర్థసత్యాలు, అసత్యాలతో కూడిన అనవసర పరిజ్ఞానాన్ని అందించాయి. ‘హౌ టు మేక్ 30 లాక్స్ ఇన్ 2 ఇయర్స్’వంటి ఊరింపులు టీనేజ్ ఆలోచనలను కలుషితం చేశాయి.సంపాదనకు వెల్కమ్.. స్కూల్కు బైబై...సోషల్ మీడియాకు బానిసైన 8 లేదా 9వ తరగతి విద్యార్థుల్లో చాలామంది పాఠశాలకు వెళ్లడానికి కూడా ఇష్టపడడం లేదు. తాము సుఖంగా బతకడానికి సంప్రదాయ విద్య సరిపోదని వీరు బలంగా నమ్ముతున్నారు. ‘సోషల్ మీడియా ద్వారా కొందరు సులభంగా డబ్బు, పాపులారిటీ సంపాదించడాన్ని చూసి తామూ అలాగే చేయగలమని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. పాఠశాలలో గడిపే కాలం వృథా అనే ప్రమాదకర అభిప్రాయం పెంచుకుంటున్నారు’ అని సైకాలజిస్ట్ అరుణ్ చెప్పారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించాలని కొందరు, తమ వ్యాపార ఆలోచనలకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చాలని ఇంకొందరు, సేవా సంస్థను ప్రారంభించాలని/ ఇన్ఫ్లుయెన్సర్ / సింగర్గా మారాలని.. ఇలా ఏవేవో కోరుకుంటున్నారు. వీరిలో కొందరు చాలా మొండిగా తయారవుతుండడంతో వారికి కౌన్సెలింగ్ కూడా పనిచేయడం లేదని సైకాలజిస్టులు చెబుతున్నారు. బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువఇటీవల ఈజీ మనీ మీద టీనేజర్లలో బాగా ఆసక్తి పెరిగింది. అది వారి చదువు మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ఇది బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువ కనిపిస్తోంది. గేమింగ్తో సహా రకరకాల యాప్స్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల్ని వాటికి దూరం చేసి ఎలాగోలా చదువు మీద దృష్టిపెట్టేలా చేయమని మమ్మల్ని సంప్రదించే తల్లిదండ్రులు పెరిగారు. అయితే ఈ వ్యసనాన్ని ముదరనీయకుండా ప్రాథమిక దశలోనే గుర్తించి తుంచాల్సిన అవసరం ఉంది. దీనిపై స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫోన్ల ద్వారా కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. - డా. పృథ్వీ రెడ్డి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కరీంనగర్ జాగ్రత్తగా డీల్ చేయాలిస్కూల్ విద్యతో ఉపయోగం లేదని 13–15 ఏళ్ల మధ్య వయస్కులు కొందరు పాఠశాల నుంచి నిష్క్రమించాలని కోరుకుంటున్నారు. దీంతో పిల్లలు కనీసం ఇంటర్ పూర్తి చేసినా చాలని, మందులతోనైనా బాగు చేయాలని వారి తల్లిదండ్రులు అడుగుతున్నారు. నా దగ్గరకు కౌన్సెలింగ్కు తీసుకొచ్చిన ఓ టీనేజ్ అమ్మాయి ఆన్లైన్లో ఓ రీల్ చూపించి తన వయసే ఉన్న ఓ టీనేజర్ రూ.30 లక్షలు సంపాదించిందని.. మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరని చెప్పింది. ఫ్రెండ్స్ అంతా కలిసి ప్లాన్ చేసుకుని మరీ డ్రాప్ అవుట్స్గా మారుతున్నారు. వీరిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. గైడెన్స్, అవేర్నెస్ అందించాలి. మన విద్యా విధానం కూడా మారాలి. చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలి.- డా.చరణ్ తేజ, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, హైదరాబాద్ -
పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..?
వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ సామర్థ్యం కూడా తగ్గుతుంటుంది. అది సర్వసాధారణం. అయితే అలా కాకుండా బాడీపై వచ్చే వృద్ధాప్య లక్షణాలకు ఎలా అడ్డుకట్టవేస్తామో అలాగే బ్రెయిన్ సామర్థ్యం వృద్ధాప్యం బారిన పడకుండా ఎలా సంరక్షించుకోవాలనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో చాలా అవాక్కయ్యేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంపెడుమంది పిల్లలు ఉంటే బాధ్యతలు ఎక్కువై మతిమరుపు, త్వరితగతి వృద్ధాప్యం బారినపడటం జరుగుతుదనేవారు. కానీ అది అవాస్తమట. పరిశోధన ఏం చెబుతుందో తెలిస్తే.. అసలు ఇదెలా అని విస్తుపోవడం ఖాయం. మరీ పరిశోధనలో వెలుగు చూసిన ఆ షాకింగ్ విషయాలేంటో చూద్దామా..!.ఈ సరికొత్త పరిశోధన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS)లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం పిల్లలను కలిగి ఉన్నవాళ్లకు మెదడు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుందని తేల్చింది. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు మూడు వేల మందికిపైగా తల్లిదండ్రుల మెదడు పనితీరుపై పరిశోధనలు చేయగా ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలసట, ఒత్తిడి అనేవి తల్లిదండ్రులైన వాళ్లలో కంటే పిల్లలు లేని తల్లిదండ్రులలోనే ఎక్కువగా కనిపించాయట. పిల్లలు ఉండటం అనేది వ్యక్తిగత జీవితాన్ని సుసంపన్నం చేసి అహ్లదభరితంగా చేస్తుందట. సాధారణంగా పేరెంట్స్ శారీరక శ్రమని పరస్పర సహకారంతో సునాయసంగా అధిగమించగలుగుతారని పరిశోధన నొక్కి చెబుతోంది. ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రుల మెదడు మంచి క్రియెటివిటి కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా పేర్కొంది అధ్యయనం. ఈ పరిశోధనలలో తల్లిదండ్రుల్లో తండ్రిని మినహాయించాయి. ఎందుకంటే వారు శారీరకంగా గర్భం ధరించరు, ప్రసివించరు, తల్లిపాలు ఇవ్వరు కాబట్టి తల్లులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కోన్నారు పరిశోధకులు. అయితే ఈ అధ్యయనంలో దాదాపు 17 వేలకు పైగా పురుషులు కూడా పాల్గొన్నారని అన్నారు.అయితే ఈ పరిశోధన పిల్లల పుట్టుక, వారి పెంపకం, పెరిగిన అదనపు బాధ్యతలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి. అయితే లేటు వయసులో తల్లిదండ్రులైన వారిలో తక్కువ మెరుగైన ఫలితాలే కనిపించాయన్నారు. తల్లిదండ్రులుగా వారి పిల్లల బాధ్యతే వారి మెదడుని వృద్ధాప్యం బారిన పడకుండా శ్రీరామరక్షలా కాపాడతుందని అధ్యయనం చెబుతోంది. అంతేగాదు ఈ పరిశోధనకు కీలకమైన శాస్త్రవేత్త అవ్రామ్ హోమ్స్ ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతలా వారి మెదుడు సురక్షితంగా ఉంటుందని చెప్పడం విశేషం. ఇది వరకు పిల్లల బాధ్యతల కారణంగా జుట్టు ఊడిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగతాయని ప్రగాడంగా భావించేవారు అంతా. అయితే అదంతా అవాస్తమని కొట్టిపారేసింది తాజా అధ్యయనం. కానీ ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా యూకేకి చెందిన వాళ్లే కావడంతో మరిన్ని కచ్చితమైన ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్పై పరిశోధన చేయాల్సి ఉందని అన్నారు శాస్త్రవేత్తలు. దీంతోపాటు పిల్లల పెంపకం అనేది బ్రెయిన్ వృధ్యాప్యాన్ని ఎలా నివారిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. ఈ పరిశోధన గనుక నిజమైతై ఒటరితనం, చిత్తవైకల్యం వంటి సమస్యలను ఎలా అధిగమించాలనేందుకు కచ్చితమైన పరిష్కారం కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..! మాజీ సీఎం లాలు యాదవ్, ప్రదాని మోదీ..) -
కుటుంబాలను నడిపిస్తోంది మహిళలే : గో డాడీ అధ్యయనం...
భారతీయ మహిళలే చిన్న తరహా వ్యాపారాల (Indian Female Small Business Owners) ద్వారా తమ కుటుంబాలను నడిపిస్తున్నారు. తమ చిన్న వ్యాపారాలకు మరింత శక్తిని అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) స్వీకరణకు కూడా సై అంటున్నారు. సాంకేతిక సేవలకు పేరొందిన గోడాడీ (GoDaddy) సంస్థ నిర్వహించిన తాజా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. మహిళలు స్థిరత్వంతో విజయాన్ని పునర్నిర్వచించు కుంటున్నారని, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, వ్యాపార అవకాశాలు ఆవిష్కరణల కొత్త శకానికి ప్రేరణనిచ్చేందుకు సాంకేతికతను ఉపయోగిస్తు న్నారని వెల్లడించింది. లఘు, చిన్న తరహా వ్యాపారాలలో పావు వంతు (27%) కంటే ఎక్కువ మహిళల యాజమాన్యంలో ఉన్నాయని అధ్యయనం తేల్చింది, వీటిలో 74% సాంకేతికత విస్తరించిన గత ఐదు సంవత్సరాలలోనే తమ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు కూడా తెలిపింది. మహిళలు తమ సొంత వ్యాపారాలను నడపడమే కాదు, అచంచలమైన విశ్వాసంతో రాణిస్తున్నారు. ప్రతీ ఐదుగురిలో నలుగురు (79%) తమ వ్యాపారాలు వచ్చే సంవత్సరంలో పెద్ద, మెరుగైన వనరులు కలిగిన కంపెనీలతో పోటీ పడటానికి ఏఐ సహాయపడుతుందని ఆశిస్తున్నారు. ఉదాహరణకు, భారతీయ మహిళలు ఏఐఆర్వో వంటి ఏఐ సాధనాలను ఉపయోగించడం ద్వారా వారానికి 12 గంటలు ఆదా చేస్తున్నారని కూడా వెల్లడైంది.. సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావడానికి 63%మంది, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా ప్రస్తుత వాటిని మెరుగుపరచడానికి 55%మంది వ్యాపార భవిష్యత్తును ప్లాన్ చేయడానికి 46% మంది సమయం వెచ్చిస్తున్నారు.చదవండి: ప్రముఖ గాయనితో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం, ఫోటోలు వైరల్ -
సగం జనాభా లావెక్కింది
న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో సగానికి పైగా వయోజనులు ఊబకాయులుగా మారిపోయారు! 2050 నాటికి ఇది 57 శాతం దాటనుంది. అంతేగాక పిల్లలు, టీనేజర్లు, యువకుల్లో మూడింట ఒక వంతు ఊబకాయులుగా మారొచ్చని లానెస్ట్ జర్నల్ అంచనా వేసింది. 200 పైగా దేశాలకు చెందిన గ్లోబల్ డేటాను విశ్లేషించిన మీదట ప్రచురించిన తాజా అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది. దశాబ్ద కాలంలో ముఖ్యంగా అల్పాదాయ దేశాల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని కట్టడికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ)కు చెందిన ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ నాయకత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఊబకాయుల సంఖ్య 1990తో పోలిస్తే నేడు రెట్టింపైంది. 2021 నాటికి ప్రపంచ వయోజనుల్లో సగం మంది ఊబకాయులుగా మారిపోయారు. 25 ఏళ్లు, అంతకు పైబడ్డ వారిలో ఏకంగా 100 కోట్ల పురుషులు, 111 కోట్ల మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే 2050 ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య పురుషుల్లో 57.4 శాతానికి, స్త్రీలలో 60.3 శాతానికి పెరగవచ్చు. ఇక 1990 నుంచి 2021 నాటికి పిల్లలు, టీనేజర్లలో ఊబకాయులు 8.8 శాతం నుంచి 18.1 శాతానికి పెరిగారు. 20–25 మధ్య వయసు యువతలో 9.9 నుంచి 20.3 శాతానికి పెరిగింది. చైనాలో 62 కోట్లు ఊబకాయుల సంఖ్య 2050 నాటికి చైనాలో 62.7 కోట్లు, భారత్లో 45 కోట్లు, అమెరికాలో 21.4 కోట్లకు చేరనుంది. సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో ఈ సంఖ్య ఏకంగా 250 శాతానికి పైగా పెరిగి 52.2 కోట్లకు చేరుతుదని అంచనా. నైజీరియా 2021లో 3.66 కోట్ల మంది అధిక బరువుతో ఉండగా 2050 కల్లా 14.1 కోట్లకు చేరనుంది. సామాజిక వైఫల్యం... వయోజనుల్లో సగం ఊబకాయులే కావడాన్ని సామా జిక వైఫల్యంగా చూడాలని ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ అన్నారు. యువతలో ఊబకాయం వేగంగా పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ‘‘కొత్తగా వచ్చిన బరువు తగ్గించే మందుల ప్రభావాన్ని అధ్యయనం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటే విపత్తును ఎంతో కొంత నివారించవచ్చు’’అని ఆమె వెల్లడించారు. ఆరోగ్య వ్యవస్థలకు సవాలు ఊబకాయం పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు సవాలేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డోక్ చి్రల్డన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు చెందిన డాక్టర్ జెస్సికా కెర్. ‘‘పిల్లలు, టీనేజర్ల విషయంలో ఇప్పట్నుంచే శ్రద్ధ పెడితే ఊబకాయాన్ని నివారించడం సాధ్యమే. యూరప్, దక్షిణాసియా దేశాల్లో పిల్లలు, టీనేజర్లు అధిక బరువుతో ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.ఉత్తర అమెరికా, ఆస్ట్రలేషియా, ఓషియానియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఊబకాయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టీనేజీ బాలికల్లో ఎక్కువగా ఉంది’’అని చెప్పారు. భావి తరాలు అనారోగ్యం బారిన పడకుండా చూడటం, ఆర్థిక, సామాజిక నష్టాలను నివారించడం తక్షణ కర్తవ్యమని సూచించారు. -
ఫోన్ లేకుంటేనే సూపర్ బ్రెయిన్!
మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్ ఫోన్తోనే నడుస్తోంది. అలాంటిది అది లేకుండా ఒక్కరోజైనా ఉండగలమా?. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. అంతలా అడిక్ట్ అయ్యాం మరి!. అయితే ఫోన్ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుండడం చూస్తుంటాం. ఈ క్రమంలో తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా(Smart phone Less Use) ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుందట. జర్మనీకి చెందిన కోలోగ్నే, హెయిడెల్ బర్గ్ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకోసం త్రీడేస్ చాలెంజ్ను కొంతమందిపై ప్రయోగించారు. ఎంపిక చేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు 25 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. సుమారు 72 గంటలపాటు(దాదాపు మూడు రోజులు) కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే వాళ్లకు ఫోన్కు అనుమతించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అడిక్షన్ను కూడా పరిశీలించారు. రీసెర్చ్కు ముందు.. తర్వాత ఆ వ్యక్తులకు ఎమ్మారై స్కాన్తో పాటు కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు. పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. ఫోన్ తక్కువగా వాడిన వాళ్లలో బ్రెయిన్ అత్యంత చురుకుగా ఉండడం. అంతేకాదు.. వ్యసనానికి సంబంధించిన ‘‘న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థ’’కు సంబంధించిన మెదడు క్రియాశీలతలోనూ మార్పులను గమనించారట. తద్వారా ఫోన్కు ఎంత దూరంగా ఉంటే.. బ్రెయిన్ అంత ‘సూపర్’గా మారుతుందని ఒక అంచనాకి వచ్చారు. సుదీర్ఘంగా.. పదే పదే జరిపిన పరిశోధనలన (longitudinal Study) తర్వాతే తాము ఈ అంచనాకి వచ్చినట్లు చెబుతున్న పరిశోధకులు.. భవిష్యత్తులో మరింత స్పష్టత రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఏం చెప్పిందంటే..ఇక్కడో ఆసక్తికరమైన సంగతి చెప్పాలి. ప్రముఖ నటి సమంత ఈ మధ్యే త్రీడేస్ చాలెంజ్ను సక్సెస్ ఫుల్గా పూర్తి చేశారు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన ఆమె.. మూడు రోజులు ఫోన్కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఆ అనుభవాన్ని తన ఇన్స్టాలో షేర్ చేశారు. ‘‘మూడు రోజులపాటు ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది కూడా. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ అభిమానులకు ఆమె సూచన ఇచ్చారు కూడా. -
Sarojini Naidu: మహాత్మునితో ‘మిక్కీ మౌస్’ అని పిలిపించుకుని..
ఆమె ఆరేళ్ల చిరుప్రాయంలోనే కవితలు రాసేది . 12 ఏళ్ల వయసులో రచించిన నాటకం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. లండన్లో విద్యాభ్యాసానికి స్కాలర్షిప్ పొందిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించాలని పోరాడిన ఆమె.. మరెవరో కాదు..స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు(Sarojini Naidu). చిన్నవయసులోనే ఆమె చూపిన తెగువ, పోరాట పటిమను మెచ్చుకున్న మహాత్మాగాంధీ ఆమెను ప్రేమగా ‘మిక్కీమౌస్’ అని పిలిచేవారు.సరోజినీ నాయుడు 1979, ఫిబ్రవరి 13న హైదరాబాద్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఆమెను శాస్త్రవేత్తగా చూడాలనుకున్నారు. కానీ ఆమె ఆమెకు కథలు, కవితలు రాయడమంటే అమితమైన ఆసక్తి. తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్లోని నిజాం కళాశాలలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేసేవారు. సరోజినీ తన 12 ఏళ్ల వయసులో రాసిన ‘మహేర్ మునీర్’ నాటకం ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది.చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే సరోజినీకి 16 ఏళ్ల వయసులో హైదరాబాద్ నిజాం నుంచి స్కాలర్షిప్ లభించింది. ఈ స్కాలర్షిప్తో ఆమె లండన్లోని కింగ్స్ కాలేజీలో చదువుకునేందుకు వెళ్లింది. అక్కడ ఆమె పెద్దిపాటి గోవిందరాజులు నాయుడును కలుసుకుంది. ఇది తరువాతి కాలంలో వారి మధ్య ప్రేమగా పరిణమించి, వివాహానికి దారి తీసింది. పెళ్లి చేసుకునే సమయానికి సరోజినీ వయసు కేవలం 19 ఏళ్లు. నాడు జరిగిన వీరి కులాంతర వివాహం పలు చర్చలకు దారితీసింది. అయితే వారి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగింది. వారికి ఐదుగురు సంతానం. వారి కుమార్తె పద్మజ కూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు. సరోజినీ నాయుడు రాజకీయ జీవితం 1905లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్(Women's Indian Association) (డబ్ల్యూఏఐ) స్థాపనతో ప్రారంభమైంది. ఆమె సాగించిన రచనలు దేశ స్వాతంత్య్రాన్ని, మహిళా స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రతిబింబించేవి. ఆమె 1906లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించారు. సరోజనీ నాయుడు సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ఎనలేని కృషి చేశారు. 1925లో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొని జైలుకు వెళ్లారు.సరోజినీ నాయుడు తొలి కవితా సంకలనం 1905లో ప్రచురితమైంది. దాని పేరు - 'ది గోల్డెన్ థ్రెషోల్డ్.' సరోజినీ నాయుడు భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్. 1947 నుండి 1949 వరకు యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔద్(United Provinces of Agra and Oudh)కు గవర్నర్గా పనిచేశారు. సరోజినీ నాయుడు జ్ఞాపకార్థం దేశంలోని పలు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులకు ఆమె పేరు పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన రెండేళ్ల తర్వాత అంటే 1949 మార్చి 2న సరోజినీ నాయుడు తన 70వ ఏట ఉత్తరప్రదేశ్లోని లక్నోలో గుండెపోటుతో కన్నుమూశారు.ఇది కూడా చదవండి: నేడు తొలి విశ్వశాంతి కేంద్రం ప్రారంభం -
ఒక 24 గంటలు నిద్రలేకుండా గడిపారో ఊబకాయం, కానీ!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం.. ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్ర లేమి మధుమేహం, కేన్సర్ లాంటి అనేక దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని అనేక అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. అంతేకాదు తగినంత నిద్ర లేనపుడు మెదడు పనితీరు ప్రభావితమవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 24 గంటలు నిద్ర పోకపోవడం వలన పెద్దల్లో ఊబకాయం ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధన తేల్చింది. కువైట్లోని దాస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ (DDI) ఆరోగ్యకరమైన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థపై స్వల్పకాలిక నిద్ర లేమి ప్రభావాన్ని అంచనా వేసింది. ఊబకాయం, మధుమేహం , గుండె జబ్బులు వంటి పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించింది. ఈ పరిశోధన ప్రకారం, ఆరోగ్యకరమైన పెద్దలలో ఒక రాత్రి నిద్రను దాటవేయడం వల్ల దీర్ఘకాలిక మంట (chronic inflammation)తో ముడిపడి ఉన్న కణాల్లో పెరుగుదల నమోదైంది. ఇదే ఊబకాయానికి ముఖ్య లక్షణం. అయితే ఆసక్తికరవిషయం ఏమిటంటే, సాధారణ నిద్ర పునరుద్ధరించుకున్న తరువాత ఇది సాధారణ స్థితికి చేరింది. తమ పరిశోధన నిద్ర, రోగనిరోధక ఆరోగ్యం మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హైలైట్ చేస్తుంది అంటున్నారు పరిశోధకులు.నిద్ర - బరువు మధ్య సంబంధంపై చాలా కాలంగా పరిశోధనలు సాగుతున్నాయి. నిద్ర నియంత్రణ అనేది మెదడుకు మాత్రమే సంబంధించినది కాదు, మెదడు ,శరీరంలోని మిగిలిన భాగాల మధ్య సంక్లిష్ట పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుందని ఇప్పటికే స్పష్టమైంది. ఆరోగ్యంపై నిద్ర లేమి ప్రభావం తెలిసినప్పటికీ, ఈ అనుబంధానికి అంతర్లీనంగా ఉన్న విధానం తక్కువగా అర్థం చేసుకున్నారు. 237 మంది ఆరోగ్యకరమైన పెద్దలపై ఈ పరిశోధన జరిగింది. వీరిబాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆధారంగా పీలగా ఉన్నవారు, అధిక బరువుతో ఉన్నవారు, ఊబకాయంతో ఉన్నవారు ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు , మూత్రపిండాల పనితీరు బావుందని నిర్ధారించుకున్నారు. అలాగే మధుమేహం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA), అధిక రక్తపోటు లేదా అధిక రక్తపోటుకు మందులు తీసుకుంటున్న వారు. గుండె సమస్యలు (గుండెపోటు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) శస్త్రచికిత్స, కరోనరీ యాంజియోప్లాస్టీ లేదా 'స్టెంట్లు') గుండె సంబంధిత కారణాల వల్ల అకాల మరణం (40 ఏళ్లకు ముందు) సంభవించిన కుటుంబ చరిత్ర ఉన్నవారిని, డిప్రెషన్, సంబంధిత మందులు తీసుకుంటున్న వారికి కూడా మినహాయించారు."నిద్ర లేమి, రోగనిరోధక కణాల డైనమిక్స్ మధ్య పరస్పర చర్యను పరిశీలించేందుకు ఐదుగురు 'సాధారణ బరువు' వ్యక్తులను - ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలను - 24 గంటల పాటు నిద్ర లేమికి గురిచేశారు. వారి నాన్-క్లాసికల్ మోనోసైట్లు (NCM) , ప్రోఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల స్థాయిలను గమనించారు. ఇందులో ఎన్సీఎంలో తీవ్రమైన, గణనీయమైన పెరుగుదలను గమనించారు. అయితే ఇది రెండు రోజుల తర్వాత అంటే వారు సాధారణంగా నిద్రపోయినపుడు ఇది సాధారణ స్థితికి వచ్చిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనం ది జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీలో ప్రచురితమైంది. -
భవిష్యత్ భయాలు
ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పిల్లల ఫీజులు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు ఏటా తడిసి మోపెడవుతున్నాయి. నిత్యావసరాల ధరలు సరేసరి.. కానీ, ఆ స్థాయిలో ఆదాయాలు పెరగటంలేదు. వచ్చే సంపాదనలోనే ఎంతో కొంత భవిష్యత్ కోసం పొదుపు చేస్తున్నా.. అవి ఏమూలకూ సరిపో వటంలేదు.. ఇదీ నేడు సగం మంది భారతీయుల ఆవేదన. ముఖ్యంగా 35 – 54 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు భవిష్యత్పై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పొదుపు, ఖర్చులపై యూ గౌ, ఎడిల్వీస్ లైఫ్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, హైదరాబాద్అధ్యయనంలోని కీలకాంశాలు..» దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని 4,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 94 శాతం మంది భవిష్యత్ కోసం సవివరమైన ఆర్థిక ప్రణాళిక లేదా ఒక మోస్తరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.» సర్వేలో పాల్గొన్నవారిలో సగానికిపైగా తాము చేస్తునపొదుపు భవిష్యత్ అవసరాలకు సరిపోదని ఆందోళన వ్యక్తంచేశారు.» పక్కా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకున్నా చివరకు అది పూర్తిస్థాయిలో అక్కరకు రావడం లేదని తెలిపారు.» వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, వయసు పెరుగుతున్న పిల్లల ఆర్థిక అవసరాలను తీర్చడంలో నిమగ్నమైన 35–54 ఏళ్ల లోపువారిలో 60 శాతం మంది తమ పొదపు భవిష్యత్ అవసరాలకు సరిపోదని అంగీకరించారు.» వివిధ రూపాల్లో ఎదురయ్యే అత్యవసరాలను ఎదుర్కొనే విషయంలో పొదుపు సొమ్ము సరిపోక అప్పులు చేయాల్సి వస్తోందని ఎక్కువ మంది చెప్పారు.» అనారోగ్య సమస్యలు, విద్య, ఇంటికి మరమ్మతులు వంటివాటికి అన్నిరకాల రుణాలను వినియోగించుకుంటుండటంతో దీర్ఘకాలిక ఆకాంక్షలు నెరవేర్చుకునే విషయంలో ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు.» భవిష్యత్ అవసరాలకు పనికి వస్తుందనే ఆశతో పలు మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నా.. అది అవసరానికి చేతికి రావటంలేదని కొంతమంది పేర్కొన్నారు. » భవిష్యత్లో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్న 35 – 54 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగంమందికి పైగా అభిప్రాయపడ్డారు. భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు జీవిత బీమా వంటి మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.రెండు రకాల సవాళ్లురెండు తరాలవారిని (తల్లి దండ్రులు, పిల్లలు) ఆదుకోవాల్సిన బాధ్యతల మధ్య ‘సాండ్విచ్ జనరేషన్’ (35 – 54 ఏళ్ల మధ్యవారు) నలిగిపోయే పరిస్థితి ఎదురవుతోంది. పెద్దలకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినపుడు తగిన విధంగా ఖర్చు చేయడం, పెరుగుతున్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటం వీరికి సవాల్గా మారుతోంది. –సుమిత్ రాయ్, ఎండీ–సీఈవో, ఎడిల్వీస్ లైఫ్ ఇన్సూరెన్స్. -
కాలేయంపై ’పని’భారం
మానవ శరీరంలోనే అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం.. పని భారంతో తల్లడిల్లుతోంది. క్రమం తప్పిన జీవన విధానాన్ని సమన్వయం చేయలేక సతమతం అవుతోంది. అవసరానికి మించిన తిండి.. అవసరమైన శ్రమ ఏమాత్రం చేయని దినచర్య కాలేయంపై పెను భారం మోపుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జీవన విధానంలోని మార్పులు కాలే యంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరా బాద్ శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో ఏఐజీ సీనియర్ హెపటాలజిస్ట్ పీఎన్ రావు, యూఓహెచ్ప్రొఫెసర్లు కల్యాణ్కర్ మహదేవ్, సీటీ అనిత, రీసెర్చ్ స్కాలర్లు భార్గవ, నందిత ప్రమోద్ పాల్గొన్నారు. వీరి పరిశోధనలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలోని వారి ఆరోగ్యాలను పరిశీలించారు. – సాక్షి, హైదరాబాద్ 71% మంది» అధిక బరువు (ఊబకాయం)తో 71 శాతం మంది బాధపడుతున్నారు. 34 శాతం మందిలో జీవక్రియల సమస్యలు ఉన్నాయి.»ఎక్కువ పని గంటలు, తీవ్ర పని ఒత్తిడి, వేళాపాళా లేని తిండి, నిద్రలేమితో కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించారు.» ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని పనిచేయడం, ఎక్కువ గంటల పని, ఒత్తిడి వల్ల జీవక్రియలో ఇబ్బందులు తలెత్తి, ఫ్యాటీలివర్ సమస్య (ఎంఏఎఫ్ఎల్డీ) వచ్చే ప్రమాదం పెరుగుతోంది.84% మంది» ఐటీ ఉద్యోగుల్లో ప్రస్తుతం దాదాపు84 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది.పరిశోధనలో తేలిన అంశాలుజీవ క్రియల్లో సమస్యలు ఉన్న వారిలో ఫ్యాటీ లివర్, ఊబకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.కాలేయంలో 5 శాతం కన్నా ఎక్కువ కొవ్వు పేరుకుపోతే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారని డాక్టర్ పీఎన్ రావు తెలిపారు. సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయం వాపు, క్యాన్సర్కు కూడా దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అందుకే ఐటీ ఉద్యోగులు జీవన శైలిని మార్చుకోవాల్సిన తక్షణ అసవరం ఉందని సూచించారు. వ్యాయామంతోపాటు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలని పేర్కొన్నారు. -
యంగ్ లుక్ మంచిదే!
మహిళల్లో చాలామంది తమ వాస్తవమైన ఏజ్ కంటే తక్కువ వయసు వారిగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారంటూ ఈ అంశంపై సమాజంలో జోకులూ, సెటైర్లూ ఎక్కువగానే వినిపిస్తుంటాయి. కానీ ఇలా తక్కువ వయసువారిగా కనిపించడం అన్నది ఆరోగ్యపరంగా, ఆత్మవిశ్వాసపరంగా చాలా మేలు చేస్తుందని పరిశోధనల్లో నిరూపితమైంది. మహిళలకే కాదు... ఈ విషయం పురుషులకూ వర్తిస్తుంది. నిజానికి తమ వాస్తవమైన ఏజ్ కంటే తక్కువ వయసువారిగా కనిపించేవారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం తోపాటు ఆరోగ్యపరంగా వాళ్లకు హైబీపీ, పక్షవాతం, గుండెజబ్బుల వంటి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధనల్లో తేలింది. తామింకా చిన్నవాళ్లమేననే భావన వల్ల వారు సుదీర్ఘకాలం పాటు జీవించడమూ జరుగుతుందని వెల్లడైంది. వాళ్ల ముఖంపైన ముడుతలు రావడమూ తక్కువేనని తేలింది. ‘‘జర్నల్ ఆఫ్ జెరంటాలజీ’’ అనే వైద్య జర్నల్లో నమోదైన పరిశోధనల ఫలితాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. (చదవండి: తల్లి పాలతో మెదడు మెరుగ్గా!) -
ఇంగితం సంగతేంటి?
ఇంగితజ్ఞానం ఇంగితజ్ఞానమే, చదువులు చదువులే! చదువు పరమావధి జ్ఞానమే అయినా, చదువుకున్న వారందరూ జ్ఞానులు కాలేరు. అత్యంత దురదృష్టకరమైన విషయమేమిటంటే, చదువు కున్న వారిలో కొందరు కనీసం ఇంగితజ్ఞానులు కూడా కాలేరు. విపరీతంగా చదువుకుని, బహు పట్టభద్రులై, పాఠాలు బోధించే స్థాయిలో ఉన్నా, ఇలాంటివారు ఎప్పటికప్పుడు తమ ఇంగితజ్ఞాన రాహిత్యాన్ని బయటపెట్టుకుంటూ జనాలను విభ్రాంతికి గురిచేస్తుంటారు. ‘విద్యలేనివాడు వింత పశువు’ అంటూ నిరక్షరాస్యులను ఎద్దేవా చేసే పెద్దలు – అతి విద్యావంతులైన ఇంగితజ్ఞాన రహితులను ఏమంటారో!‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/ పొదవెడు నుప్పు లేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని శతకకారుడు వాపోయాడు. రసజ్ఞత లేని చదువును ఉప్పులేని కూరతో పోల్చాడు. బహుశా, ఎంత చదువు చదువుకున్నా, కాస్తంతైనా ఇంగితజ్ఞానం లేనివారు ఆయనకు తారసపడి ఉండరు. అలాంటి అతి చదువరులే తారసడితే ఆయన ఇంకెంతలా వాపోయేవాడో! ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లలో రసజ్ఞత సంగతి దేవుడెరుగు, ఇంగితజ్ఞానం కూడా కొరవడు తోందంటే, మన చదువులు ఎలా అఘోరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు మన చదువులు ఇలా ఎందుకు అఘోరిస్తున్నాయో, అందుకు గల కారణాలను అన్వేషించే వాళ్లు బహు అరుదు. ‘చాలామందికి, పిల్లల్ని చదువంటే బెదరగొట్టడం చాతనయినంత బాగా వాళ్లకి చదువు మీద ఇష్టం కలిగించడం చాతకాదు’ అంటారు కొడవటిగంటి కుటుంబరావు. ‘చదువు’ నవలలో ఆయన వెలి బుచ్చిన అభిప్రాయం ఇది. బెదరగొట్టి మరీ పిల్లలకు చదువు చెప్పే బడిపంతుళ్ల ధోరణి కూడా చదువుకున్న వాళ్లలో ఇంగితజ్ఞాన లోపానికి ఒక కీలక కారణం. బెదరగొట్టి పిల్లలకు చదువు చెప్పే దండోపాయ నిపుణులు పురాణకాలం నుంచే ఉన్నారు. ప్రహ్లాదుడికి చదువు చెప్పిన చండా మార్కుల వారసత్వాన్ని కొందరు నేటికీ కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చండా మార్కుల వారసులకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి గురువులు పిల్లల బుర్రల్లోకి పాఠాల నైతే ఎక్కించగలరేమో గాని, చిటికెడు ఇంగితజ్ఞానాన్ని మాత్రం అలవరచలేరు. ‘ఇంగితజ్ఞానం మరీ అంత సర్వసాధారణమైనది కాదు’ అంటాడు ఫ్రెంచ్ తత్త్వవేత్త వోల్టేర్. ఇంగితజ్ఞానాన్ని ఇంగ్లిష్లో ‘కామన్సెన్స్’ అంటారు. అలాగని, ఇది మనుషులందరికీ ఉండే లక్షణ మని అనుకుంటే పొరపాటే! ‘మనుషులందరిలోనూ ఇంగితజ్ఞానం ఉందనే నమ్మకంతో కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడుతుంటాం’ అన్నాడు ఐరిష్ సంగీతకారుడు హోజీర్.ఒకప్పుడు సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అక్షరాస్యులు బాగా పెరిగారు. అక్షరాస్యత పెరిగితే, జనాల్లో బుద్ధి జ్ఞానాలు, తెలివితేటలు పెరగడం సర్వసహజ పరిణా మమనేది ఒక అమాయకపు అంచనా. సమాజంలో అక్షరాస్యత పెరిగింది, నిజమే! తత్ఫలితంగా మూర్ఖత్వం తగ్గిందనుకుంటే పారపాటే! ‘చదవేస్తే ఉన్న మతి పోయింద’నే నానుడి ఉంది. ఇప్పటి చదువులను చూస్తే, పరిస్థితి అలాగే ఉందనిపిస్తుంది. ఈ చదువులతో కొందరిలో ఇంగితజ్ఞానం లోపిస్తుంటే, ఇంకొందరిలో చావుతెలివి పెచ్చుమీరుతోంది. బొటాబొటి చదువుల సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నత విద్యావంతులు సైతం బోల్తాపడుతున్న ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకవైపు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధతో కుస్తీలు పడుతున్న రోజులు వచ్చిపడ్డాయి గాని, మనుషుల్లో ఇంగితాన్ని పెంచే చదువులే కరవవుతున్నాయి. ‘నడవడికను చక్కబరచడానికి ఉత్త పాఠ్య పుస్తకాల చదువు చాలదు’ అని గాంధీజీ చెప్పిన మాటలను నేటి కార్పొరేట్ విద్యావ్యవస్థ పట్టించు కుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గాంధీజీ ‘హింద్ స్వరాజ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పాఠ్యపుస్తకాల విద్య మానవుల నైతికోన్నతికి ఇంచుకైనా సహకరించదని; చదువు వేరు, సద్గుణం వేరని స్వానుభవంతో తెలుసుకున్నాను’ అన్నారు. ఆయన దేశానికి స్వాతంత్య్రం రాకముందు చెప్పిన మాటలివి. ఇప్పటికీ మన చదువులు పూర్తిస్థాయిలో చక్కబడకపోవడం విచారకరం.చదువులు చెప్పడానికి ఎన్నో బడులు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక నైపుణ్యాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయి. పుట్టల నుంచి చీమలు పుట్టుకొచ్చినట్లు వీటి నుంచి ఏటా పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వాళ్లలో చాలామంది సమాజంలో మేధావులుగా చలామణీ అవుతున్నారు. అంతమాత్రాన, వాళ్లంతా ఇంగితజ్ఞాన సంపన్నులనుకోవడానికి ఆస్కారం లేదు. ‘మీ డిగ్రీ ఒక కాగితం ముక్క మాత్రమే. మీ చదువేమిటో మీ ప్రవర్తనలోను, ఆలోచనా ధోరణిలోను, సౌశీల్యంలోను ప్రతిఫలిస్తుంది’ అన్నాడు అమెరికా మూడో అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. ప్రవర్తనను, ఆలోచనా ధోరణిని మార్చలేని డిగ్రీలు ఉత్త కాగితం ముక్కలు మాత్రమే! ‘కొన్ని ఆలోచనలు చాలా మూర్ఖంగా ఉంటాయి. వాటిని మేధా వులు మాత్రమే నమ్ముతారు’ అని ఇంగ్లిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ అన్నాడు. గోమూత్రపానంతో జ్వరాలు తగ్గుతాయని ఇటీవల ఐఐటీ–మద్రాసు డైరెక్టర్ మహాశయుడు సెలవిచ్చారు. ఆయనను బహుశా మేధావులే నమ్ముతారు కాబోలు! -
International Day of Education 2025 దీని ప్రాముఖ్యత, ఏడాది థీమ్ ఇదే!
International Day of Education 2025 : ప్రతీ ఏడాది జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. జనవరి 24ని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 2018 డిసెంబర్ 3, 2018న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, సమానత్వాన్ని తీసుకురావడంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించడం, అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.నైజీరియాతో సహా 58 సభ్య దేశాల మద్దతుతో వచ్చిన ఈ చారిత్రాత్మక తీర్మానం, విద్య ప్రాప్యత , ప్రతి వ్యక్తికి దాని లోతైన ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన అవసరం అని నొక్కి చెబుతుంది.International Day of Education.To grow is to become wise, and the foundation of wisdom is learning.#UGC #Education #InternationalDayofEducation@PMOIndia @EduMinOfIndia @PIB_India pic.twitter.com/Eam5G2Jiq6— UGC INDIA (@ugc_india) January 24, 2025మానవ అభివృద్ధిలో విద్య పాత్రను గుర్తించడంతోపాటు, సమానమైన నాణ్యమైన విద్యను ప్రాథమిక మానవ హక్కుగా ప్రోత్సహించేలా జనవరి 24, 2019న తొలి సారి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు.అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025, థీమ్ఈ సంవత్సరం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం థీమ్ "ఏఐ అండ్ ఎడ్యుకేషన్గా నిర్ణయించారు. ఆటోమేషన్ ప్రపంచంలో మానవ విలువను పరిరక్షించడం". అంటే ఆటోమేషన్ యుగంలో రోజు రోజుకి అభివృద్ది చెందుతున్న సాంకేతిక తీరుతెన్నులు, పురోగతులు అర్థం చేసుకోవడం, అటువంటి వ్యవస్థలు మానవ నిర్ణయాలు, విద్యా కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రశ్నించడం, విద్యలో కృత్రిమ మేధస్సును పెంచడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.విద్య ప్రాముఖ్యతపేదరికం,లింగ సమానత్వంతో సహా అనేక సమస్యలను పరిష్కరించడంలో విద్య చాలా అవసరం. వ్యక్తిగత అభివృద్ధి, సామూహిక పురోగతిని పెంపొందిస్తుంది. శాంతిని నిర్మించడానికి విద్య ప్రాథమికమైనదని యూఎన్జీఏ పేర్కొంది. సమానమైన నాణ్యమైన విద్యను అందించడం, అందరికీ జీవితాంతం అవకాశాలను ప్రోత్సహించడంతోపాటు, ఆయా వ్యక్తులు సమాజాలు విద్యకు ప్రాధాన్యతనిచ్చి పెట్టుబడి పెట్టడానికి ఇది పిలుపు.విద్యమనిషిని మనస్సును శక్తివంతం చేస్తుంది. భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నేర్చుకోవడంలోని శక్తిని గుర్తిద్దాం. సెలబ్రేట్ చేసుకుందాం. అది అందరికీ చేరేలా చూసుకుందాం. ఇదీ చదవండి : National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..! -
వేళకాని వేళల్లో.. ఆహారంతో అనర్థం..
షిఫ్టుల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులూ, అడపాదడపా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారంతా వేళకాని వేళల్లో ఆహారం తీసుకోవడం చాలా సాధారణం. అయితే ఓ అధ్యయనం ప్రకారం ఇలాంటివారిలో ఊబకాయంతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది. జీర్ణాశయానికి, మెదడుకూ మధ్య సమాచార సమన్వయాలు జరుగుతున్న విషయాలు అనేక అధ్యయనాల్లో వెలుగు చూశాయి.కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా బయటకు కనపడని కమ్యూనికేషన్స్ ఉంటాయని ఈ సరికొత్త అధ్యయనం తేల్చిచెబుతోంది. యూఎస్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని పెరల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన శాస్త్రవేత్తల బృందాల పరిశోధనల్లో ఈ అంశాలు వెలుగుచూశాయి. – సాక్షి, హైదరాబాద్కాలేయానికి, మెదడుకు మధ్య కూడా ‘క్లాక్’లింకు పట్టపగలు పనిచేయడంతోపాటు రాత్రివేళల్లో నిద్రపోయేలా మెదడులోని బయలాజికల్ క్లాక్ నిర్దేశిస్తుందని, దీన్నే సర్కేడియన్ రిథమ్గా చెబుతారన్న విషయం తెలిసిందే. తాజాగా పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం.. కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా ఓ బయలాజికల్ క్లాక్ ఉంటుంది. ఆకలి వేసినప్పుడూ, ఏం తినాలన్నది నిర్ణయం తీసుకునేటప్పుడూ వేగస్ నర్వ్ ద్వారా కాలేయం నుంచి మెదడుకూ, మెదడు నుంచి మళ్లీ కాలేయానికి సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంటుంది.దాన్నిబట్టే ఓ వ్యక్తి తానెప్పుడు తినాలి? తినేటప్పుడు ఎలాంటి ఆహారాలను ఎంపిక చేసుకోవాలి వంటివి జరుగుతుంటాయి. ఈ కాలే య, మెదడు క్లాక్ సమాచారాల రిథమ్లో ఏదైనా తేడా వస్తే.. అది జీవక్రియల్లో అంతరాయాలకు దారితీస్తుందని, దాంతో బరువు పెరగడం, అది అనేక ఆరోగ్య సమస్యలకు తావివ్వడం,అవి మరికొన్ని అనారోగ్యాలకు దారితీయ డం.. ఇలా ఒక దానివెంట మరొక సమస్యకు దారితీస్తుంటాయి. ఎలుకల కాలేయంలోని ‘రెవ్–ఎర్బ్స్’అనే కుటుంబానికి చెందిన జన్యువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దేహంలోని సర్కేడియమ్ రిథమ్ను నిర్దేశించే బయలాజికల్ క్లాక్ నిర్వహణలో ఈ జన్యువులు కీలక భూమిక పోషిస్తాయి. రకరకాల జీవక్రియలు, హార్మోన్లు వెలువడేలా చూడటం వంటి అనేక వాటిలో అవి పాలు పంచుకుంటుంటాయి. ఎలుకలు, మనుషుల జీవక్రియల పరిశీలన ఈ అధ్యయనంలో పాల్గొన్న ముఖ్యుల్లో ఒకరూ అలాగే పెన్ మెడిసిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్, ఒబిసిటీ అండ్ మెటబాలిజమ్ డైరెక్టర్ డాక్టర్ మిచెల్ లాజర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎలుకలూ, మనుషులూ మెలకువతో ఉన్నప్పుడు తినే జీవులు కాబట్టి ఈ రెండు శరీరాల్లో జీవక్రియల పనితీరు పరిశీలించినప్పుడు కాలేయానికి, మెదడుకూ మధ్య ఉండే నిర్దేశిత సమాచారాల గురించిన వివరాలు తెలిశాయి. ఎలుకల్లో ఉండే ‘రెవ్–ఎర్బ్స్’జన్యువులకు మెదడుతో ఉన్న కనెక్షన్ తొలగించినప్పుడు ఎలుకలు తాము చురుగ్గా లేని సమయంలోనూ ఇష్టం వచ్చినట్టుగాతినడం, అవసరమైన దానికంటే ఎక్కువగా తినేయడం మొదలుపెట్టాయి. ఈ తిండి ఎలా ఉందంటే... అచ్చం రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు ఆకలితో నిమిత్తం లేకుండా మామూలు కంటే ఎక్కువగానే తినేయడంలా అనిపించింది. ఇంకా ఇదెలా ఉందంటే.. జెట్లాగ్ తర్వాత బయలాజికల్ క్లాక్లో అంతరాయం కలగడంతో వేళాపాళా లేకుండా ఇష్టమొచ్చి నట్టు తినేయడంలా కనిపించింది. వేగస్ నర్వ్ ద్వారా సమాచార మార్పిడి ఎప్పుడు, ఎలా తినాలి అనే ఈ సమాచారాల ఇచ్చిపుచ్చుకోడాలు వేగస్ నర్వ్ అనే ఓ కీలక నరానికి చెందిన అత్యంత సంక్లిష్టమైన నర్వ్ ఫైబర్స్ ద్వారా జరుగుతుంటుంది. ఎప్పుడు ఆకలిగా అనిపించాలి, ఎప్పుడు ఎంత మొత్తంలో తినాలనే ఆదేశాలు కాలే యం ఈ నరం ద్వారానే మెదడుకు చేరవేస్తుంది. దాని ప్రకారమే మనుషులకూ లేదా జీవాలకు ఎప్పుడు ఆకలి వేయాలో అప్పుడు ఆకలిగా అనిపించడం, దాన్ని బట్టి ఎంత తినాలో అంత తినేశాక ఆకలి తీరడం వంటివన్నీ సర్కేడియన్ రిథమ్కు అనుగుణంగా జరుగుతుంటాయి. డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం ప్రస్తుతం పనివేళల్లో గణనీయమైన మార్పులు రావడం, అర్ధరాత్రి, అపరాత్రీ అనే తేడాలు లేకుండా పనులు చేయాల్సి రావడం దుష్ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం, రక్తంలో కొలెస్టరాల్ మోతాదులు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. చివరకు ఇవన్నీ టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులూ, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తున్నాయని డాక్టర్ మిచెల్ లాజర్ చెబుతున్నారు. మనదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎమ్ఆర్–ఇండియాబ్) నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం భారత్లో 10.1 కోట్ల డయాబెటిస్ బాధితులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉండగా... అందులో 10.1 కోట్ల మంది కేవలం మన దేశం నుంచే ఉన్నారు. అంటే ప్రపంచంలోని ప్రతి 8 మంది డయాబెటిస్ బాధితుల్లో ఒకరు భారత్వాసి అన్నమాట. మన భారతీయ గణాంకాలను యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధనల ఫలితాలతో అనుసంధానించి చూస్తే నిద్రపోవాల్సిన సమయంలో పనిచేస్తూ, వేళగాని వేళల్లో భోజనం చేస్తున్నవారిలో ఈ జీవక్రియలకు సంబంధించిన జబ్బులైన డయాబెటిస్ వంటివి చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా... ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన చికిత్స ప్రణాళికల ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతోంది. ఉదాహరణకు చాలా ఊబకాయంతో ఉన్న ఎలుకల తాలూకు వేగస్ నర్వ్ను కట్ చేసినప్పుడు... మళ్లీ అవి నార్మల్ ఎలుకల్లాగే తినడం, మితంగానే ఆహారం తీసుకోవడం వంటివి చేశాయి.ఈ పరిశోధనతో ఎంతో మేలుదేహం తాలూకు ఓ పూర్తిస్థాయి సమన్వయ వ్యవస్థ (హోమియోస్టాటస్) అంతా చక్కగా కొనసాగుతూ జీవక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూడటానికి కాలేయం తాలూకు ఏఏ అంశాలు, ఏఏ జన్యువులు పాలుపంచుకుంటున్నాయో పరిశీలించి, ఆ వ్యవస్థల కారణంగా దేహంపై పడే ప్రతికూల ప్రభావాలూ, దాంతో వచ్చే అనర్థాలూ, అనారోగ్యాలకు అవసరమైన చికిత్సలను తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందన్నది పరిశోధకుల అభిప్రాయం. ఈ పరిశీలనల వెలుగులో ప్రజల ఆరోగ్య సంరక్షణలకు అసరమైన చర్యలూ, ప్రణాళికలు రూపొందింవచ్చన్నది అనేక ఆరోగ్య సంస్థలకు చెందిన అధికారులు, ప్రణాళికావేత్తల భావన. -
జీన్స్ తొడుక్కుని స్క్వాటింగ్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
ఆధునిక కాలంలో జీన్స్ ప్యాంట్లు లేనిదే కాలం గడవదు. ట్రెండ్కు,ఫ్యాషన్కు తగ్గట్టు అనేక రకాల జీన్స్ ప్యాంట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా జీన్ ప్యాంట్లను వినియోగిస్తారు. ఆఫీసులకు, బయటికి వెళ్లినప్పుడు, పార్టీలకు ఇలా ఏదైనా జీన్స్ ప్యాంట్లకే ప్రాధాన్యత ఉంటుంది. అన్ని వయసుల వారికి ఫిట్ అయ్యే జీన్స్ అనేవి చాలా పాపులర్. అనేక రకాల మోడల్స్లో ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరించడం వలన చాలా కంఫర్ట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వీటిని ఉతుక్కోవడం ఈజీ కావడం కూడా వీటికి ఆదరణ ఎక్కువ. కానీ జీన్స్పాంట్లు వేసుకున్నపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు వేసుకుని కూర్చునేవారు పైకి లేవగానే నడవలేని పరిస్థితి వచ్చేందుకూ అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇక వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ అస్సలు తొడుక్కోవద్దనీ, వాటిని తొడిగి ‘స్క్వాటింగ్’ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్లోనూ ప్రచురితమయ్యాయి. అవే కాకుండా బాగా బిగుతుగా ఉండే జీన్స్ వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశముందని కూడా మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.జీన్స్ ప్యాంట్లు బాగా టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్ ధరించి పడుకుంటే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో దురదలు, చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి. రక్తప్రసరణకు కష్టం : జీన్స్ ప్యాంట్ బిగుతుగా ఉండటంతో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో కొన్ని అవయవాలకు రక్తం సరిగా అందదు. జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రించడం వల్ల శరీరంలోని వేడీ పెరుగుతుంది. పేగుల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. -
మందు బాబులు జాగ్రత్త..! పరిశోధనలో షాకింగ్ విషయాలు
మద్యం ఆరోగ్యానికి హానికరం అంటూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు నిపుణులు. దీని కారణంగా పలు అనారోగ్యాల బారినపడతామని చెబుతుంటారు. ముఖ్యంగా కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తుంటారు. కానీ ఇది ఆల్కహాల్ సేవించడం వల్లే వస్తుందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఆల్కహాల్కి కేన్సర్కి లింక్అప్ ఉందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. మొత్తం నాలుగు అధ్యయనాలను ఉదహరిస్తూ సవివరంగా తెలిపారు యూఎస్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి. అంతేగాదు మద్యపానం సేవిస్తే.. కేన్సర్ తప్పదనే ఓ హెచ్చరిక లాంటి లేబుల్ ఉండాలని వాదిస్తున్నారు. ఎలా కారణమంటే..ఆల్కహాల్ కేన్సర్కు ఎలా కారణమవుతుందో నాలుగు కారణాలను వివరించారు. మొదటిది శరీరంలో ఆల్కహాల్ విచ్ఛిన్నమైప్పుడు డీఎన్ఏతో విభేదించి కణాలను దెబ్బతీస్తుంది. కణితులు వచ్చేందుకు కారణమవుతుంది. అందుకు బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అలాగే దీన్ని చాలామంది వైద్యులు అంగీకరించారు. రెండోది ఆల్కహాల్ ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఇది రొమ్ము కేన్సర్కు మార్గం సుగమం చేస్తుందని కొత్త పరిశోధనలో తేలింది. అయితే ఇది ఎలా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మూడోది ఇటలీ, యుఎస్, ఫ్రాన్స్, స్వీడన్, ఇరాన్ పరిశోధకుల బృందం దాదాపు 4 లక్షలకు పైగా కేన్సర్ కేసులను పరిశీలించగా..సుమారు 572 అధ్యయనాల్లో చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తాగేవారు, తాగనివారిగా విభజించి మరీ అంచనా వేశారు. ఆ పరిశోధనలో నోటి, గొంతు, అన్నవాహిక, కొలొరెక్టమ్, కాలేయం, స్వరపేటిక, రొమ్ము తదితర కేన్సర్లకు మద్యపానంతో సంబంధం ఉందని తేలింది. నాలుగు..అధిక మద్యపానం సేవించిన వారికి మెడ, తలకు సంబంధించిన కేన్సర్ వస్తుందని సుమారు 26 పరిశోధనలో వెల్లడయ్యింది. చివరిగా మరో ముఖ్యమైన అంశమేమిటంటే.. 26 సంవత్సరాల కాలంలో 195 దేశాలలో సంభవించిన మద్యపాన సంబంధిత మరణాలపై 2018 ప్రపంచ నివేదికలో మద్యపానం సేవించడం సురక్షితం కాదని తేలింది. ఇది ఏడు రకాల కేన్సర్ల బారినపడేందుకు కారణమవుతుందని వివరించారు సర్జన్ వివేక్ మూర్తి. ఈ అధ్యయనం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురితమయ్యింది. అయితే ఈ అధ్యయనం మద్యం అతిగా సేవించే వారికి, మితంగా తీసుకునే వారి మధ్య తేడాలను వివరించలేదు. ఈ పరిశోధనపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. ఎందుకంటే..మధ్యధరా ప్రాంతంలో ఉండేవారు రోజూ వైన్ తాగుతారని, అదివారికి బలమైన ప్రయోజనాలను అందిస్తుందనేది వాదన. అలాగే మితంగా మద్యం సేవించేవారే గుండెపోటు, స్ట్రోక్, అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఉందని, రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు పరిశోధకులు. -
2024లో వార్తల్లో నిలిచిన 'సూపర్ఫుడ్స్' ఏంటో తెలుసా?
2024 ఏడాదికి బైబై చెప్పేసి2025 సంవత్సరానికి ఆహ్వానం పలికాం. అనేక రంగాల్లో ఎన్నో పరిశోధనలు, సరికొత్త అధ్యయనాలకు సాక్ష్యం 2024. ఈ క్రమంలో 2024లో సూపర్ ఫుడ్గా వార్తల్లో నిలిచిన ఆహారం గురించి తెలుసుకుందాం. గతంలో లాగానే 2024 కూడాసహజమైన ఆహారాలు , పదార్దాల ఆరోగ్య ప్రయోజనాలపై కొత్త పరిశోధనలకు బలమైన సంవత్సరంగా నిలిచింది వీటిలో కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించ బడుతున్నవే. బరువు తగ్గడం, కణాల మరమ్మత్తు, వాపు లేదా గుండె ఆరోగ్యం తదితర విషయాల్లో 'సూపర్ఫుడ్స్' అద్భుత నివారణలు కాకపోవచ్చు. కానీ కొన్ని మాత్రం ఆరోగ్య సంరక్షణ మించి ఉన్నాయని తేలింది. అలాగే చాలా మంచి ఫుడ్ కూడా కొంతమందికి ప్రాణాపాయంగా ఉండవచ్చిన నిపుణులు చెప్పారు.చీజ్తో మానసిక ఆరోగ్యం2.3 మిలియన్ల మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో, షాంఘై జియావో టోంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చీజ్ వినియోగంతో మెరుగైన మానసిక ఆరోగ్యం ముఖ్యంగా వృద్ధుల్లో సామాజిక ఆర్థిక కారకాలతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రభావం ఉంటుందని తేలింది. జన్యపరంగా వృద్ధాప్యం సహజమే అయినా, చీజ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ముఖ్యమైన సాంఘికీకరణ వంటి ఇతర కార్యకలాపాలతో ముడిపడి ఉందని పరిశోధన సూచించింది.నట్స్ - మెదడుగింజలు చిత్తవైకల్యం నుండి మెదడును రక్షించడంలో సహాయపడతాయి మెల్బోర్న్లోని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు 49-ఐటమ్ ఫుడ్-ఫ్రీక్వెన్సీ సర్వేను పూర్తి చేసిన 70 ఏళ్లు పైబడిన 9,916 మంది వ్యక్తుల రికార్డులను పరిశీలించారు. ఇతర కారకాలను పరిశీలించిన తరువాత, తక్కువ నట్స్ తినే వారితో పోలిస్తే,తమ ఆహారంలోరోజుకు ఒకటి లేదా రెండుసార్లు నట్స్ను తీసుకునేవారిలో మంచి అభిజ్ఞా పనితీరు శారీరక ఆరోగ్యాన్ని నిలుపుకోవటానికి మంచి అవకాశం ఉందని గుర్తించింది. ఫాక్స్ నట్స్ఫాక్స్ నట్స్ ఆగ్నేయాసియాతోపాటు ఇండియాలో చాలాకాలంగా సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. నీటి కలువ కుటుంబానికి చెందిన నీటి మొక్క (యురేల్ ఫెరోక్స్ ఫ్లవర్) గింజలే ఫాక్స్ నట్స్. వీటిల్లోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ఈ ఏడాది పరిశోధకులకు ప్రత్యేక ఆసక్తిని కలిగించాయి. 2012, 2018, 2020లో అధ్యయనాలతో పాటు, ఇటీవల 2023లోని యాంటీఆక్సిడెంట్ల అధ్యయనాలను సమీక్షించారు. తద్వారా ఇవి కణాల ఆరోగ్యానికి, వాపును ఎదుర్కోవడానికి ముఖ్యమైన సమ్మేళనాలు అని గమనించారు. అంతేకాదు ప్రోటీన్- స్టార్చ్-రిచ్ సీడ్స్ పాప్కార్న్ లాగా చేసుకోవచ్చు. ఇవి ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ నివారణలో బాగా ఉపయోగడతాయని గుర్తించారు.గాలి నుండి తయారైసూపర్ ప్రోటీన్సొలీన్ ప్రొటీన్ ఉత్పత్తికి ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య-స్థాయిఫ్యాక్టరీ ఫిన్లాండ్లో ఏర్పాటైంది 2024లోనే. సోలిన్ ప్రొటీన్ (సోలెంట్ గ్రీన్ కాదు) శక్తి కోసం హైడ్రోజన్ను ఆక్సీకరణం చేసే రహస్య సింగిల్-సెల్ మట్టిలో ఉండే సూక్ష్మజీవి ద్వారా తయారు చేస్తారు. సోలిన్ అని పిలువబడే పొడి లాంటి పదార్ధంలో 65-70% ప్రోటీన్, 5-8% కొవ్వు, 10-15% డైటరీ ఫైబర్స్ , 3-5% ఖనిజ పోషకాలు ఉంటాయి కేవల ఐదో వంతు కర్బన ఉద్గారాలతో, 100 రెట్లు తక్కువ నీరు, 20 శాతం కంటే తక్కువ మొక్క ప్రోటీన్ ఉత్పత్తి. డయాబెటిస్కు డార్క్ చాక్లెట్డార్క్ చాక్లెట్ ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధనా ప్రపంచంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. కానీ ఈ ఏడాది హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వారానికి ఐదు సార్లు డార్క్ చాక్లెట్ వల్ల మంచిదని తేల్చారు. దీని వల్ల బరువు పెరగకుండానే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21శాతం తగ్గుతుందని కనుగొన్నారు. అధిక-ఫ్లావనాల్ కోకో ఉత్పత్తులు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇది ఇతర రకాల చాక్లెట్లలో కనిపించదు. ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మెరుగైన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంచనా.తేనె- ప్రొబయాటిక్స్ఇల్లినాయిస్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ పరిశోధకులు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించడం వల్ల జీర్ణకోశంలో ప్రోబయోటిక్ మనుగడను పెంచుతుందనికనుగొన్నారు. జీర్ణక్రియను పెంచడంలో సహాయ పడుతుంది. ముఖ్యంగా క్లోవర్ తేనె - మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఎగువ జీర్ణశయాంతర ప్రేగుల ద్వారా గట్ మైక్రోబయోమ్కు ప్రయాణిస్తుంది, అక్కడ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.అలర్జీ నివారణలో స్ట్రాబెర్రీటోక్యో యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రాబెర్రీ అలర్జీల నివారణలో సాయపడతాయి. ఫ్లేవనాయిడ్ కెంప్ఫెరోల్ రోగనిరోధక వ్యవస్థపై దాని ప్రభావం ద్వారా ఆహార అలెర్జీలతో సహా,ఇతర శరీరం అలెర్జీలను ఇవి తగ్గిస్తాయి. కెంప్ఫెరోల్ టీ, బీన్స్, బ్రోకలీ, యాపిల్స్, స్ట్రాబెర్రీలలో పుష్కలంగా ఉంటుంది. ఈ నిర్దిష్ట ఫ్లేవనాయిడ్ మైక్రోబయోలాజికల్ యాంటీగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
ఐడియల్ బ్రేక్ఫాస్ట్ అంటే..? ఎలా తీసుకోవాలంటే..
చాలామంది బ్రేక్ఫాస్ట్ అనగానే ఏదో తిన్నాంలే అనుకుంటారు. చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ రోజులో తొలి భోజనమైన ఈ అల్పాహారం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందట. శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఆ విషయం వెల్లడైంది. ముఖ్యంగా వృద్ధులు, పిలల్లు తీసుకునే బ్రేక్ఫాస్ట్ని నిర్లక్ష్య చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు.అల్పాహారంలోని కేలరీ కంటెంట్, పోషక నాణ్యత ఎలా ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుందనే దానిపై అధ్యయనం చేశారు స్పానిష్ పరిశోధకులు. వారి పరిశోధనలో వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అనేది అత్యంత కీలకమని తేలింది. అల్పాహారమే అని అల్పంగా చూస్తే.. దీర్ఘకాలిక హృదయ ఆరోగ్యంపై గట్టి ప్రభావమే చూపిస్తుందని చెప్పారు. మన దినచర్యలో ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని భాగం చేసుకునే యత్నం చేస్తే దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలుగుతాయని అన్నారు. ముఖ్యంగా జీవన నాణ్యాత మెరుగుపరిచి, ఒబెసిటీ వంటి అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం తగ్గుతుందన్నారు పరిశోధకులు. అందుకోసం 55 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్న.. దాదాపు 383 మంది వ్యక్తులపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారందరి హెల్త్ ట్రాక్ల ఆధారంగా ఈ విషయాలను వెల్లడించినట్లు తెలిపారు. ఉదయం తక్కువ కేలరీలతో కూడిన బ్రేక్ఫాస్ట్ తీసుకున్న వారిలో ఆరోగ్య ఫలితాలు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని, పైగా వారి బాడీ సరైన ఆకృతిలో లేకపోవడమే గాక, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువుగా ఉన్నట్లు పరిశోధనలో వెలడైందని చెప్పారు.అంతేగాదు ఈ పరిశోధన అల్పాహారం నాణ్యాత ఎంత ముఖ్యమో అలాగే క్వాంటిటీ కూడా ముఖ్యమని పేర్కొంది. దీర్ఘకాలిక గుండె జబ్బులతో ఉన్నవారు, వృద్ధులు అల్పాహారం విషయంలో కేర్ఫుల్గా ఉండాలన్నారు. దీంతోపాటు ఎట్టిపరిస్థితుల్లోనూ అల్పాహారాన్ని స్కిప్ చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ ఏజింగ్లో ప్రచురితమైంది. 'ఐడియల్ అల్పాహారం' అంటే..సమతుల్యమైన పోషకాలతో కూడినా ఆహారమే ఐడియల్ అల్పహారం. ఇందులో రోజువారీగా కనీసం 20% నుంచి 30% కేలరీలు ఉండాలని పరిశోధన చెబుతోంది. అందుకోసం తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు కూరగాయలతో కూడినవి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ప్రాసెస్ చేసిన వాటికి దూరంగా ఉండాలన్నారు. సరైన మొత్తంలో అధిక-నాణ్యత కలిగిన పోషకాహారంతో మనం రోజును ప్రారంభిస్తే.. జీవక్రియ మెరుగై మొత్తం ఆరోగ్యమే బాగుటుందని పరిశోధన చెబుతోంది. రోజులో అతిముఖ్యమైన భోజనం అల్పాహరం అని స్పష్టం చేసింది. అయితే ఏం తింటున్నారు, ఎలాంటిది తింటున్నారు అనేది అత్యంత ముఖ్యమని అన్నారు. ముఖ్యంగా పరిమాణం, పోషక నాణ్యత అనేవి అత్యంత కీలకమైనవని చెప్పారు పరిశోధకులు. (చదవండి: పల్లెటూరి కుర్రాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!: మోదీ) -
టెన్త్ అర్హతతో 10 మెడికల్ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం
టెన్త్ చదువుతున్న చాలామందికి వైద్యవిద్యను అభ్యసించాలని ఉంటుంది. అయితే వారి ఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో ఎంబీబీఎస్ చేయలేని స్థితిలో ఉంటారు. ఇలాంటివారికి వైద్యరంగంలోకి ప్రవేశించేందుకు పలు మార్గాలు ఉన్నాయి. వీటికి 10వ తరగతి పాసయితే చాలు. ఈ కోర్సులను పూర్తిచేసి, చక్కని ఉపాధితో పాటు అధిక జీతాన్ని కూడా అందుకోవచ్చు. ఆ కోర్సులు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1. డీఎంఎల్టీ (డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ)మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ల్యాబ్ టెస్టులు, రోగ నిర్ధారణ, రిపోర్టు ప్రిపరేషన్ మొదలైనవి నేర్పిస్తారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. అధిక జీతం కూడా అందుకోవచ్చు.2. రేడియాలజీ టెక్నాలజీ కోర్సుఈ కోర్సులో చేరినవారికి ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ యంత్రాలను ఆపరేట్ చేయడం నేర్పుతారు. 10వ తరగతి తర్వాత రెండు సంవత్సరాల ఈ డిప్లొమా కోర్సు చేయవచ్చు. కోర్సు పూర్తయ్యాక రూ.30,000 నుంచి రూ.50,000 వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు.3. డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharm)ఈ రెండు సంవత్సరాల కోర్సులో ఔషధాలు, వాటి విక్రయాల గురించిన సమాచారాన్ని బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు మెడికల్ స్టోర్ ప్రారంభించవచ్చు. లేదా ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పని చేయవచ్చు.4. ఆప్టోమెట్రీలో డిప్లొమాఈ కోర్సులో కంటి సంబంధిత వ్యాధుల చికిత్స, దృష్టిని మెరుగుపరచడానికి అవసరమైన శిక్షణను అందిస్తారు. ప్రారంభ వేతనం రూ. 25,000 నుంచి రూ. 40,000 వరకు ఉంటుంది.5. ANM/GNM (నర్సింగ్ కోర్సు)రెండు సంవత్సరాల పాటు ఉండే ఈ కోర్సులో ప్రాథమిక నర్సింగ్ నైపుణ్యాలను బోధిస్తారు. నర్సింగ్ ఫీల్డ్ను కెరీర్గా ఎంచుకోవడం ద్వారా మంచి ఆదాయం అందుకోవచ్చు.6. డెంటల్ హైజీనిస్ట్ కోర్సుఈ కోర్సులో దంతాల శుభ్రత, వ్యాధులను గుర్తించడం మొదలైనవి నేర్పిస్తారు. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ప్రారంభ వేతనం రూ. 25,000 నుంచి మొదలవుతుంది7. డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ (DPT)ఈ రెండు సంవత్సరాల కోర్సులో శారీరక రుగ్మతలను నయం చేసే పద్ధతులు నేర్పుతారు. ఈ కోర్సు పూర్తి చేశాక క్లినిక్ తెరవడం లేదా ఆసుపత్రిలో పని చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని అందుకోవచ్చు.8. హోమియోపతి అసిస్టెంట్ కోర్సుఈ కోర్సు రెండు సంవత్సరాల పాటు ఉంటుంది. దీనిలో హోమియోపతి మందులు, చికిత్సకు సంబంధించిన శిక్షణను అందిస్తారు. దీనిని పూర్తి చేసిన తర్వాత, సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది.9. సర్జికల్ అసిస్టెంట్ కోర్సుశస్త్రచికిత్స సమయంలో వైద్యునికి సహాయం చేయడానికి ఈ కోర్సు ద్వారా శిక్షణనిస్తారు. ఈ కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్సుకు అత్యధిక డిమాండ్ ఉంది.10. అంబులెన్స్ అసిస్టెంట్ కోర్సుఅత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ను నడపడానికి, ప్రథమ చికిత్స అందించడంపై శిక్షణనిస్తారు. ప్రారంభ వేతనం రూ.20,000 నుండి రూ.30,000 వరకు ఉంటుంది.ఇది కూడా చదవండి: అర్థ, పూర్ణ, మహాకుంభమేళాల్లో తేడాలేమిటి?.. ఈసారి ఎందుకంత ప్రత్యేకం? -
చాపకింద నీరులా మధుమేహ ముప్పు
సాక్షి, అమరావతి: దేశంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 10 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. 2045 నాటికి 12 కోట్లకు చేరతారని అంచనాలున్నాయి. ప్రతి ఇద్దరిలో ఒకరికి రక్తంలో అసాధారణ గ్లూకోజ్ స్థాయిలు ఉన్నట్టు ప్రముఖ డయాగ్నోస్టిక్ ప్రివెంటివ్ హెల్త్కేర్ ప్రొవైడర్ సంస్థ థైరోకేర్ అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది దేశవ్యాప్తంగా 19.66 లక్షల మంది హెచ్బీఏ1సీ ఫలితాలను థైరోకేర్ సంస్థ విశ్లేíÙంచింది. వ్యాధి వ్యాప్తిలో భయంకరమైన పోకడలను గుర్తించినట్టు స్పష్టం చేసింది.కలవరపెడుతున్న అసాధారణ గ్లూకోజ్ స్థాయి 19.66 లక్షల మంది ఫలితాలను విశ్లేషించగా అందులో 49.43 శాతం మంది రక్తంలో అసాధారణ గ్లూకోజ్ స్థాయిలను కలిగి ఉన్నట్టు గుర్తించారు. 22.25 శాతం మంది ప్రీడయాబెటిక్ దశలో ఉండగా, 27.18 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఆహారంలో బియ్యాన్ని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాలు మధుమేహం, ప్రీడయాబెటిస్ ముప్పు అధికంగా ఉన్నట్టు పరిశోధకులు స్పష్టం చేశారు. గోధుమ ఆధారిత ఆహారాలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో తక్కువ ప్రాబల్యం రేటును ఉన్నట్టు వివరించారు. యువకుల్లో అధికంగా ప్రీ డయాబెటిక్ 18–35 ఏళ్ల యువతలో ప్రీ డయాబెటిక్ ప్రాబల్యం అధికంగా ఉండగా, 36–65 సంవత్సరాల వారిలో వ్యాధి ప్రభావం వృద్ధి చెందుతోంది. క్రమం తప్పకుండా స్క్రీనింగ్లు నిర్వహించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లైతే వ్యాధిని నివారించవచ్చని థైరోకేర్ సూచించింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవడంతో పాటు, తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ, ఒత్తిడి నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.‘హాని’కరమైన ఆహార అలవాట్లు ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్ ఉండటానికి హానికరమైన ఆహార అలవాట్లే ప్రధాన కారణమని ఐసీఎంఆర్ గతంలో స్పష్టం చేసింది. సమోసా, పకోడీ, చిప్స్, నూడిల్స్ ఇలా మార్కెట్లో లభించే అ్రల్టాప్రాసెస్డ్ ఫుడ్స్తో మధుమేహం ప్రమాదం పెరుగుతున్నట్టు వెల్లడించింది. ఈ పదార్థాల్లో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అధికంగా ఉంటుందని, దీంతో ఈ ఆహారం తిసుకునే వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగి తొందరగా మధుమేహం బారినపడతారని పేర్కొంది. -
నాజుకు నడుముతో నష్టమే..!
నడుము నాజుగ్గా తీగలా ఉండాలని కోరుకుంటారు మహిళలు. అందుకు సంబంధించిన వ్యాయామాలు, వర్కౌట్లు తెగ చేస్తుంటారు. అయితే ఇలా అస్సలు చెయ్యొద్దని వార్నింగ్ ఇస్తున్నారు వైద్య నిపుణులు. నడుమ చుట్టుకొలత తక్కువగా ఉండాలని భావిస్తే ఆరోగ్య సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు. దీనిపై వైద్య నిపుణులు జరిపిన పరిశోధనలో చాలా షాకింగ్ విషయాలే బయటపడ్డాయి. హుయిజోంగ్ జీ, బిన్ సాంగ్ వైద్యుల నేతృత్వంలోని నార్తర్న్ జియాంగ్సు పీపుల్స్ హాస్పిటల్ చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం వాళ్లు దాదాపు 6 వేల మందికిపైగా పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. సుమారు 2003 నుంచి 2019 వరకు వారి హెల్త్ డేటాను ట్రాక్ చేశారు. నడుము చుట్టుకొలత తక్కువగా ఉన్న మహిళలు ఎలా మరణాలకు దారితీసే ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారో సవివరంగా వెల్లడిచింది ఆ అధ్యయనం. ఆ పరిశోధనలో నడుము చుట్టుకొలత తక్కువుగా ఉన్న మహిళలే ఎక్కువగా మరణాలకు దారితీసే గుండె సంబంధిత వ్యాధులు బారినపడుతున్నట్లు తేలింది. కనీసం ప్రతి మహిళ 107 సెంటీమీటర్లు నడుమ కొలత ఉండాలని, అంతకన్నా తక్కువుగా ఉంటే ప్రమాదమేనని పేర్కొంది. ఆరోగ్యంగా పరిగణించబడే దానికంటే ఎక్కువే ఈ నడుమ చుట్టుకొలత. ఇక పురుషుల నడుము కొలత కనీసం 89 సెంటీమీటర్లు ఉండాలని పేర్కొంది. అందువల్ల మధుమేహం ఉన్న మహిళలు తమ నడుమ కొలత 107 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండేలా ప్రయత్నించొద్దని హెచ్చరించారు వైద్యులు. ఒకరకంగా ఈ అధ్యయనం ఊబకాయానికి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తుందటూ పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వైద్య నిపుణులు ఇంత సైజులో నడము ఉంటే పొత్తికడుపు వద్ద కొవ్వు పెరుకుపోతుంది ఇది అనారోగ్యమైనది అనే సందేహం అందరిలోనూ కలిగే అవకాశం ఉంటుందని అన్నారు. నిజానికి ఇక్కడ ఈ అధ్యయనం అధిక బరువుని సిఫార్సు చేయడం లేదని నడుమ సైజు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే మరణానికి దారితీసే ఆరోగ్య ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంది. ఇది మనిషి జీవన నాణ్యతను తగ్గిస్తుందని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చామని, మరింత సమాచారం కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ ..!) -
వెరీగుడ్
-
‘నువ్వు చచ్చినా పర్వాలేదు’.. కొడుకుని కొట్టి చంపిన తండ్రి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుషం వెలుగుచూసింది. కొడుకు ఫోన్ వాడటానికి బాని, చదవును నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతో.. క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపిన ఘోర ఘటన శనివారం జరిగింది. కన్న కొడుకును దారుణంగా హత్య చేయడమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు నిందితుడైన తండ్రి.వివరాలు.. వృత్తిరీత్యా వడ్రంగి అయిన రవికుమార్ తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో నివిసిస్తున్నాడు. 14 ఏళ్ల కుమారుడు తేజస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల మొబైల్ వాడకం ఎక్కువై చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. స్నేహితులతోనూ చెడు సావాసం చేస్తుండటం తండ్రికి నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అంతేగాక ఇటీవల ఆ ఫోన్ పనిచేయకపోవంతో దానిని రిపేర్ చేయించాడు తేజస్.. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. కొడుకుతో గొడవకు దిగాడు.. ఇది కాస్తాపెరిగి పెద్దది కావడంతో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తేజస్ను కొట్టాడు. అక్కడితో ఆగకుండా గొడకేసి బాది ‘నువ్వు బతికినా, చచ్చినా నాకు పర్వలేదు’ అంటూ చితకబాదాడు. దీంతో విద్యార్ధి నొప్పి భరించలేక నేలపై పడిపోయాడు.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన పరిస్థితి విషమంగా మారింది. అయితే శ్వాస ఆగిపోయిన తర్వాతే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రవికుమార్ ఇంటికి చేరుకోగా.. అప్పటికే కొడుకు అత్యంతక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.ఇక బాలుడి తలపై తీవ్రమైన అంతర్గత గాయాలు, అతని శరీరంపై కూడా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే బాలుడి మృతదేహానికి ఉన్న రక్తపు మరకలను తొలగించి, బ్యాట్ను దాచిపెట్టి హత్యను దాచిపెట్టేందుకు నిందితుడు ప్రయత్నించాడని, వెంటనే అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించాడని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసి కేసును సాధారణ మరణంగా మార్చే ప్రయత్నమిదని తెలిపారు. మొబైల్ ఫోన్ ఎక్కువ వాడటంపై పిల్లవాడికి, తండ్రికి వాగ్వాదం జరుగుతోందని, అదే అతడి హత్యకు దారితీసినట్లు డీసీపీ లోకేష్ బీ పేర్కొన్నారు. తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
రక్తం తాగే గబ్బిలం..పరుగెడుతోంది మన కోసం..
గబ్బిలాలు అంటేనే కాస్త జలదరింపు.. అందులోనూ రక్తం తాగే గబ్బిలాలు ఇవి. వాటి పేరే ‘వాంపైర్ (రక్తపిశాచి) బ్యాట్స్’.. కానీ అవి మన కోసం పరుగెడుతున్నాయి.. పగలు, రాత్రి తేడా లేకుండా, అవసరమైనప్పుడల్లా ట్రెడ్మిల్పై పరుగెడుతున్నాయి.. ఇదేంటి రక్తపిశాచి గబ్బిలమేంటి? మన కోసం ట్రెడ్మిల్పై పరుగెత్తడమేంటి? అని డౌట్ వస్తోందా.. ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం.. ఓ పరిశోధనలో భాగం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..ఆహార అలవాటే కీలకం..సాధారణంగా జంతువులు, కీటకాలు వేటికైనా ప్రొటీన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు (షుగర్స్) వంటి అన్ని పోషకాలు ఉండే ఆహారం కావాల్సిందే. లేకుంటే అవి ఆరోగ్యంగా ఉండవు. బతకవు కూడా. శరీరంలో వివిధ జీవక్రియలు సరిగా సాగాలంటే.. వేర్వేరు పోషకాలు తప్పనిసరికావడమే దీనికి కారణం. కానీ వాంపైర్ గబ్బిలాలు చాలా చిత్రం. అవి కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతూ బతికేస్తుంటాయి. అలా ఎలా జీవించ గలుగుతున్నాయన్నది తేల్చేందుకు టొరొంటో స్కార్బోరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.ట్రెడ్మిల్పై పరుగుపెట్టించడం ఎందుకు? సాధారణంగా జంతువులు కదలడానికి, వేటాడటానికి, తినడానికి.. ఇలా అన్నింటికీ శక్తి అవసరం. చాలా వరకు కార్బోహైడ్రేట్లు (షుగర్స్), కొవ్వుల నుంచే అవి శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. శాఖాహార, మాంసాహార జంతువులకు అవి తినే ఆహారం నుంచి ఇవి అందుతాయి. కానీ రక్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అతి తక్కువ... ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలే ఎక్కువ. కేవలం వీటితోనే వాంపైర్ గబ్బిలాలు ఎలా శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందుకోసం జంతువుల రక్తంలో.. కాస్త రసాయన మార్పులు చేసిన అమైనో యాసిడ్లు కలిపి గబ్బిలాలకు తాగించారు. తర్వాత వాటిని చిన్నపాటి ట్రెడ్మిల్పై నిమిషానికి 10, 20, 30 మీటర్ల వేగంతో పరుగులు పెట్టించారు. ఆ సమయంలో వాటి శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతోంది, ఏ ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు.. ఏరకంగా జీర్ణం అవుతున్నాయన్నది పరిశీలించారు.దీనివల్ల మనకేంటి లాభం? సాధారణంగా జంతువుల్లో వివిధ రకాల ప్రొటీన్లు, ఎంజైమ్లు ఉత్పత్తికావడానికి, అవయవాలు సరిగా పనిచేయడానికి అమైనో ఆమ్లాలు అవసరం. కానీ వాంపైర్ గబ్బిలాలు అమైనో ఆమ్లాలను నేరుగా శక్తి ఉత్పత్తి కోసం వాడుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వాటిని అత్యంత వేగంగా జీర్ణం చేసుకుంటున్నట్టు తేల్చారు. దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తే.. క్షీరదాలు భౌతికంగా ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా శరీరంలో, ఆహారంలో చేసుకునే మార్పులను గుర్తించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కెన్నెత్ వెల్చ్ తెలిపారు. మనలో జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దడం, సమస్యలకు ఔషధాల రూపకల్పన, పోషకాహార లోపానికి చేపట్టాల్సిన చర్యలు వంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని వెల్లడించారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
వాసన కోల్పోవడం..ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో..!
వాసన కోల్పోవడానికి ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో ముందుగానే సంకేతం ఇస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇది ఒకరకంగా ఘ్రాణ శక్తి ప్రాధాన్యతను హైలెట్ చేసింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో మన ముక్కు పనితీరు చాలా కీలకమని వెల్లడయ్యింది. ఈ కొత్త అధ్యయనం వాసనం కోల్పోవడాన్ని ఏకంగా 140 వైద్య పరిస్థితుల ద్వారా ముందుగానే హెచ్చరిస్తుందని పేర్కొంది. అది వృద్ధాప్యం, మోనోపాజ్, నరాలు, శారీరక వ్యాధుల రూపంలో సంకేతమిస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది ఫ్రాంటియర్స్ ఇన్ మాలిక్యులర్ న్యూరోసైన్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యింది. అంతేగాదు రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన కూడా దీనిపై ఆదారపడి ఉంటుందట. మంచి ఘ్రాణ శక్తి ఉంటే వారికి అపారమైన జ్ఞాపక శక్తి ఉందని అర్థమట. అంతేగాదు ఆహ్లదకరమైన సువాసనలు మెదడు ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయట. ఘ్రాణ శక్తిని కోల్పోతున్నట్లుగా ముందుగానే దాదాపు 139 వ్యాధుల రూపంలో తెలియజేస్తుందట.అందువల్ల ముందుగా ఈ ఘ్రాణ శక్తికి మంచి చికిత్సను అందిస్తే ఆ 140 రకాల వ్యాధులు రాకుండా నివారించొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఈ పరిశోధనలో కొన్ని కాంప్లీకేషన్స్ కూడా ఉన్నాయని అన్నారు. ఇక ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తల బృందం పలువురిపై అధ్యయనం చేయగా చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 9 వేల మంది సుదీర్ఘ కోవిడ్ కారణంగా వాసన కోల్పోగా, దాదాపు మూడు వేల మందికి పైగా మోనోపాజ్ వల్ల వాసనను కోల్పోయారు. మరో మూడు వేలమంది డిప్రెషన్ కారణంగా ఘ్రాణ శక్తిని కోల్పోయారు. అంతేగాదు ఈ వాసన కోల్పోవడానికి పర్యావరణ కారకాలు కూడా కొంత కారణమని వైద్యులు చెబుతున్నారు. ముందుగానే వివిధ రకాల వ్యాధుల రూపంలో సంకేతం ఇచ్చినప్పుడే.. ఘ్రాణ శక్తికి సత్వరమే మంచి చికిత్స ఇస్తే ఎలాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండదని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం వాసన ప్రాముఖ్యతను తెలియజేయడమే గాక భవిష్యత్తులో చేసే మరిన్ని పరిశోధనలకు ఇది పునాదిగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పరిశోధకులు. (చదవండి: ఇలాంటి క్రేజీ గ్రౌండ్ఫ్రిడ్జ్ని చూశారా..? కరెంట్తో పని లేకుండానే..) -
డాక్టర్ చదువుకు డబ్బుల్లేక..కూలి పనులకు..
హుస్నాబాద్ రూరల్: వైద్యురాలు కావాలన్నది ఆ అడవి బిడ్డ తపన.. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది. చిన్న కూతురు దేవిని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేరి్పంచి చదివించారు.పదో తరగతి, ఇంటర్మిడియెట్లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్కు సిద్ధమైంది. నీట్లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు వచి్చంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది. ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
గుడ్ న్యూస్: హెచ్ఐవీ రోగుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమే!
తీవ్రమైన కిడ్నీసమస్యలతో బాధపడుతున్న హెచ్ఐవీ (HIV) రోగులకు భారీ ఊరట లభించనుంది. హెచ్ఐవీ ఉన్న వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమని కొత్త అధ్యయనంద్వారా వెల్లడైంది. హెచ్ఐవీఉన్న వ్యక్తులు, ఎయిడ్స్ వైరస్తో జీవిస్తున్న వ్యక్తుల నుంచి కిడ్నీలను సురక్షితంగా స్వీకరించవచ్చని ఈ స్టడీ తేల్చింది. జీవించి ఉన్నపుడు ఇచ్చినా, లేదా మరణం తరువాత కిడ్నీలను దానం చేసినా రెండింటినీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చని తెలిపింది.న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో బుధవారం ప్రచురించబడిన ఈ కొత్త అధ్యయనాన్ని అమెరికాలో నిర్వహించారు. 198 కిడ్నీ మార్పిడికేసులను పరిశీలించి, దానం చేసిన అవయవం ఎయిడ్స్ వైరస్ ఉన్న వ్యక్తి నుండి వచ్చినా లేదా లేని వ్యక్తి నుండి వచ్చినా ఇదే ఫలితాలను పరిశోధకులు గుర్తించారు. గత నెలలో, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పరిశోధనా అధ్యయనాల ప్రకారం ఈ రకమైన మూత్రపిండాలు , కాలేయ మార్పిడిని అనుమతించే నియమ మార్పును ప్రతిపాదించింది. దీనికి ఆమోదం లభిస్తే ఇది రాబోయే సంవత్సరంలో అమల్లోకి వస్తుందని రావచ్చు.హెచ్ఐవీ పాజిటివ్, కిడ్నీ ఫెయిల్ అయిన రోగులపై ఈ అధ్యయనం జరిగింది. HIV-పాజిటివ్తో మరణించిన దాత లేదా HIV-నెగటివ్ మరణించిన దాత నుండి అవయవాన్ని స్వీకరించి,నాలుగేళ్లపాటు ఈ పరిశోధన నిర్వహించారు. అలాగే హెచ్ఐవీ పాజిటివ్ దాతల నుంచి కిడ్నీలు పొందిన సగం మందిని హెచ్ఐవీ లేని దాతల నుంచి వచ్చిన వారితో పోల్చారు. వీరిలో 13మంది రోగులకు,ఇతర సమూహంలోని నలుగురికి వైరస్ స్థాయిలు పెరిగాయి. దీనికి హెచ్ఐవీ మందులను సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని NYU లాంగోన్ హెల్త్కు చెందిన అధ్యయన సహ-రచయిత డాక్టర్ డోరీ సెగెవ్ చెప్పారు. తమ పరిశోధన అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. -
అలాంటి జన్యువులు ఉంటే బరువు తగ్గడం ఈజీ..!
14 'స్కిన్నీ జన్యువులు'(సన్నగా ఉండే జన్యువులు) బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తాయని అధ్యయనం పేర్కొంది. ఇలాంటి జన్యువులు లేని వారితో పోలిస్తే..ఈ 14 'స్కిన్నీ జన్యువులు వ్యాయమం చేసిన వాళ్లే వేగంగా బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నారు. వీళ్లు జస్ట్ ఎనిమిది వారాల పరుగుకే దాదాపు 11 పౌండ్లు కోల్పోతారట. ఈ పరిశోధన బరువుకి సంబంధించిన కీలక జన్యువుల గురించి వెల్లడించింది. ఈ జన్యవులు వ్యాయామం, జీవనశైలి మార్పులకు అనుగుణంగానే సక్రియం చేయబడి, బరువు తగ్గడం జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్, రిహాబిలిటేషన్ ఉపాధ్యాయుడు హెన్నీ చుంగ్ అన్నారు. అయితే యూకేలోని కొన్ని పరిశోధనలు మాత్రం వ్యాయామం జోక్యం లేకుండా జన్యువులు తమ నిజమమైన సామర్ధ్యాన్ని చూపించవని చెబుతోంది. అంటే ఇక్కడ తగిన వ్యాయామం, సరైన జన్యువులతోనే మనిషిలో ఎలాంటి జన్యువులు ఉన్నాయనేది చెప్పగలరు వైద్యులు. అందుకోసం 20 నుంచి 40 ఏళ్ల వయస్సు గల దాదాపు 38 మందిపై పరిశోధన చేశారు. వారిలో సగం మందికి సాధారణ ఆహారం, అలవాట్లను మార్చకుండా.. వారానికి మూడుసార్లు 20 నుంచి 30 నిమిషాలు పరుగెత్తమని సూచించారు. మిగిలిన సగం మంది నియమనిబంధనలతో కూడిన ఆహారం, జీవనశైలి ఫాలో అయ్యారు. అయితే పరిశోధనలో 62% బరువు తగ్గడంలో జన్యు శాస్త్రమే కీలకమని అధ్యయనం పేర్కొనగా.. 37% మాత్రం వ్యాయామం, జీవనశైలి కారకాలతో ముడిపడి ఉందని తేలింది. ఈ పరిశోధన జన్యు ప్రొఫెల్ని అర్థం చేసుకోవడంలో వ్యాయామం, చక్కటి డైట్ ఉపకరిస్తుందని నిర్ధారణ అయ్యింది. అయితే ప్రతి ఒక్కరూ జన్యుపరమైన వాటితో సంబంధం లేకుండా వ్యాయమంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందడం ముఖ్యమని చెప్పారు పరిశోధకులు. ఇది హృదయ ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి తద్వారా బరువుని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వర్కౌట్లు చేయాలని సూచించారు. ఈ అధ్యయనం జర్నల్ రీసెర్చ్ క్వార్టర్లీ ఫర్ ఎక్సర్సైజ్ అండ్ స్పోర్ట్లో ప్రచురితమయ్యింది. (చదవండి: ఖఫ్లీ గోధుమలు గురించి తెలుసా..! ఎందుకు తినాలంటే..!) -
రెస్టారెంట్లో వెయిటర్ ఉద్యోగాలు.. క్యూ కట్టిన 3 వేల మంది విద్యార్థులు
త్వరలో మా రెస్టారెంట్ ప్రారంభం కానుంది. అందులో పనిచేసేందుకు వెయిటర్లు, సర్వర్లు కావలెను అంటూ ఓ ప్రకటన. అంతే ఉద్యోగాల గురించి తెలుసుకున్న సుమారు మూడు వేల మంది విద్యార్థులు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేందుకు రెస్టారెంట్ క్యూ కట్టారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కెనడాలో నిరుద్యోగం పెరిగిపోయింది. బ్రాంప్టన్లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ వెలుపల విద్యార్థులు క్యూకట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. బ్రాంప్టన్లో ప్రారంభమైన కొత్త రెస్టారెంట్లో పనిచేసేందుకు వెయిటర్, సర్వెంట్ ఉద్యోగాల కోసం కెనడా నుండి 3,000 మంది విద్యార్థులు (ఎక్కువగా భారతీయులు) వరుసలో ఉన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోని ఉద్దేశిస్తూ.. ట్రూడో.. కెనడాలో భారీ నిరుద్యోగం’ అనే క్యాప్షన్ను జోడించి విద్యార్థుల గురించి పలు అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే అనేక కలలతో భారత్ నుంచి కెనడాకు వచ్చే విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరమని వ్యాఖ్యానిస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ఎప్పటిదనేది స్పష్టత లేకపోయినప్పటికీ కొంతమంది వినియోగదారులు ఆర్థిక అనిశ్చితి మధ్య విదేశాలకు వెళ్లే సమయం గురించి తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. మాంద్యం కారణంగా విదేశాలకు వెళ్లడానికి ఇది సరైన సమయం కాదని అర్థం చేసుకోవాలి అని ఒక నెటిజన్ అంటుంటే.. మరికొందరు విద్యార్థులను సమర్థించారు.రెస్టారెంట్లలో పార్ట్టైమ్ పని చేయడం చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులకు సర్వ సాధారణం అని అంటున్నారు. విద్యార్థులు ఇంకా చదువుతున్నట్లయితే, రెస్టారెంట్లో పనిచేయడం బహుశా తమను తాము పోషించుకోవడానికి పార్ట్టైమ్ ఉద్యోగం కావచ్చు. దానిని నిరుద్యోగం అని అనకూడదని మరొకరు అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో విద్యార్థులు అలాంటి ఉద్యోగాలు చేసుకునే సంస్కృతి ఇదేనని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను కూడా ఎత్తిచూపారు. కెనడాలో పెద్దగా కలలు కనే ఈ విద్యార్థులకు ప్రారంభం చాలా కష్టంగా ఉండవచ్చు. చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, చివరికి విజయం సాధించి, ఇంటికి తిరిగి వచ్చిన వారితో పోలిస్తే సుసంపన్నమైన జీవితాన్ని గడపడం మేం చూశాం’ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. Scary scenes from Canada as 3000 students (mostly Indian) line up for waiter & servant job after an advertisement by a new restaurant opening in Brampton.Massive unemployment in Trudeau's Canada? Students leaving India for Canada with rosy dreams need serious introspection! pic.twitter.com/fd7Sm3jlfI— Megh Updates 🚨™ (@MeghUpdates) October 3, 2024 -
వచ్చే ఏడాది ఎవరి జీతాలు పెరుగుతాయి?
వచ్చే ఏడాది ఏ ఉద్యోగుల జేబులు నిండుతాయి.. ఏ రంగంలో జీతాలు ఎక్కువగా పెరుగుతాయి? దేశంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 2025 ఏడాదిలో జీతాలు ఎంత మేర పెరుగుతాయన్న దానిపై ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ సర్వే నిర్వహించింది.30వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2024-25 మొదటి దశ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో 40కి పైగా పరిశ్రమల నుండి 1,176 కంపెనీల డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. దీని ప్రకారం 2025లో అన్ని రంగాల్లో సగటు వేతన పెంపు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కాగా ఈ ఏడాది వాస్తవిక పెంపు 9.3 శాతంగా ఉంది.డబుల్ డిజిట్ ఈ రంగాలదే..ఇంజనీరింగ్, తయారీ, రిటైల్ పరిశ్రమలు 2025లో అత్యధికంగా 10 శాతానికి పైగా వేతనాలు పెంచుతాయని అంచనా వేశారు. 9.9 శాతంతో తర్వాత స్థానంలో ఆర్థిక సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ సెక్టార్కు ఈ సంవత్సరం జాగ్రత్తగా ప్రారంభమైనప్పటికీ వచ్చే ఏడాది ఆశాజనకంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ హిస్టరీ ప్రింట్ తీసి.. జాబ్ నుంచి తీసేసిన కంపెనీగ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, టెక్నాలజీ ఉత్పత్తులు, ప్లాట్ఫామ్లు 9.9 శాతం, 9.3 శాతం వేతనాల పెంపును ఆశిస్తున్నాయి. అయితే టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ సర్వీస్ రంగ సంస్థలు 8.1 శాతమే ఇంక్రిమెంట్ను అందించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అధ్యయనం రెండో దశలో భాగంగా వచ్చే డిసెంబర్, జనవరిలో డేటాను సేకరించి 2025 ప్రారంభంలో వెల్లడించనున్నారు. -
ఐవీఎఫ్ సంతానానికి ఆ ప్రమాదం మరింత ఎక్కువ!
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు నిజంగా ఇది నిరాశ కలిగించే వార్త. యూరోపియన్ హార్ట్ జర్నల్లో శుక్రవారం ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన శిశువులలో గుండె లోపంతో పుట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు పెరుగుతున్నాయని స్వీడన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు వచ్చే ముప్పు 36 శాతం ఎక్కువని చెప్పారు. అంతకాదు ఈ విధానం ద్వారా పుట్టిన కవల పిల్లల్లో రిస్క్ మరింత ఎక్కువని చెప్పారు. స్వీడన్ లోని గోథెన్ బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఉల్లా బ్రిట్ వెనర్ హాల్మ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్ ఈ పరిశోధన వివరాలు ప్రచురితమైనాయి. ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే దేశాలలో 1980 లలో జన్మించిన దాదాపు 77 లక్షల మంది చిన్నారుల హెల్త్ డేటాను అధ్యయన వేత్తలు పరిశీలించారు.ఈ అధ్యయనానికి స్వీడన్లోని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ ఉల్లా-బ్రిట్ వెన్నెర్హోమ్ నాయకత్వం వహించారు. ఆమె ఇలా చెప్పారు: ‘‘సహాయక పునరుత్పత్తి సాంకేతికత సహాయంతో గర్భం దాల్చిన శిశువులకు ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని మునుపటి పరిశోధనలు చూపిస్తున్నాయి. వీటిలో ముందస్తు జననం తక్కువ బరువుతో కూడిన జననాలున్నాయి. అయితే ఇలా జన్మించిన శిశువులకు గుండె లోపాల ప్రమాదం ఎక్కువగా ఉందా లేదా అనేది మరింత పరిశోధించాలనుకుంటున్నాము. .’’సాధారణ పద్ధతిలో జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ వంటి పద్ధతులలో జన్మించిన పిల్లల్లో గుండె లోపాలు ఎక్కువగా కనిపించాయన్నారుఉల్లా-బ్రిట్. బిడ్డ పుట్టిన సంవత్సరం, పుట్టిన దేశం, ప్రసవ సమయంలో తల్లి వయస్సు, గర్భధారణ సమయంలో తల్లి ధూమపానం చేసినట్లయితే లేదా తల్లికి మధుమేహం లేదా గుండె లోపాలు ఉన్నట్లయితే, పుట్టుకతో వచ్చే గుండె లోపాల ప్రమాదాన్ని పెంచే ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఈ లోపాలను వీలైనంత తొందరగా గుర్తించి, చికిత్స అందించాలన్నారు.కాగా సహజంగా సంతానం కలగని దంపతులకు ఐవీఎఫ్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. తాజా పరిశోధన కొంత ఆందోళన కలిగించినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఇలాంటి ప్రమాదాలను తప్పించుకునే అవకాశాలున్నాయి. -
చర్చ కాదు, రచ్చ
మాట్లాడగలగడం, మేధ వికసించడం మానవ చరిత్రలో మహత్తర ఘట్టాలంటారు శాస్త్రవేత్తలు. అవి లేకపోతే మనిషి మనుగడా, ఆ మనుగడతో పెనవేసుకున్న ప్రపంచమూ ఇప్పటిలా ఉండేవే కావు. మేధ జ్ఞానాన్ని పెంపొందిస్తే, దానిని నలుగురికీ పంచేది మాటే. మాట నేర్చిన తొలిరోజుల్లో దాని ప్రభావానికి ఆశ్చర్య చకితుడైన మనిషి దానికి మహత్తును ఆపాదించి మంత్రంగా మార్చు కున్నాడు. నిత్య జీవనంలో దాని లౌకికమైన విలువనూ గుర్తించాడు. ఒంటరి మనిషిలో స్వగతంగా ఉన్న మాట, మరో మనిషి జత కాగానే సంభాషణ అయింది; మరికొందరు జత పడితే చర్చ అయింది; శ్రోతలు పెరిగిన కొద్దీ ప్రసంగమైంది. వీటిలో ప్రతి ఒక్కటీ జ్ఞానవ్యాప్తికి వాహిక అయింది. చర్చనే వాద, ప్రతివాదమనీ; సంవాదమనీ; ఆంగ్లంలో డిబేట్, డిస్కషన్ అనీ అంటున్నాం. చర్చలేని సందర్భం మానవ జీవితంలో ఉండనే ఉండదు. కుటుంబ స్థాయి నుంచి, దేశస్థాయి వరకూ నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. చర్చకు వస్తువు కాని విషయమూ ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే మానవ ప్రపంచం చర్చ చుట్టూ తిరుగుతుంది. దేనినైనా సరే చర్చించే అభ్యాసం మనకు కొత్తది కాదంటూ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’(సంవాద భారతీయుడు) అనే పుస్తకమే రాశాడు. రామాయణ, మహాభారతాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చర్చలూ, వాదప్రతివాదాలూ ఎలా సాగాయో ఎత్తిచూపాడు. హెచ్చు, తగ్గుల సమాజంలో కిందిమెట్టు మీద ఉన్న స్త్రీ, పురుషవర్గాల గొంతుకూ మన సంవాద సంప్రదాయం ఎంతోకొంత చోటిచ్చిందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్ళు చర్చలోనే పాతుకున్నాయంటూ, ప్రత్యేకించి మన దేశంలోని రకరకాల అసమానతలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోడానికి మనదైన సంవాద సంప్రదాయం స్ఫూర్తినిస్తుందన్నాడు. రామాయణంలో రాముడికి పట్టాభిషేక నిర్ణయాన్ని దశరథుడు అందిరినీ సంప్రదించే తీసుకుంటాడు. జాబాలికి, రాముడికి జరిగిన సంవాదం మరో ఉదాహరణ. పరలోకం లేదనీ, పితృవాక్పాలన అర్థరహితమనీ, ప్రత్యక్షంగా కనిపించే రాజ్యాన్ని అనుభవించమనీ జాబాలి అన్నప్పుడు రాముడు అతని మాటలు ఖండిస్తూ, నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా సంచరిస్తారంటాడు. విభీషణ శరణాగతి లాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సహచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు. మహాభారతంలో ధర్మరాజు తనను జూదంలో ఒడ్డి ఓడినప్పుడు; తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా అన్న చర్చను ద్రౌపది సభాముఖంగా లేవదీస్తుంది. ధర్మరాజు యుద్ధానికి విముఖుడైనప్పుడు యుద్ధపక్షాన వాదిస్తుంది. బృహదారణ్యకో పనిషత్తులో గార్గి అనే విదుషీమణి యాజ్ఞ్యవల్క్యునితో వాదోపవాదాలు జరిపి ఓటమిని హుందాగా ఒప్పుకుంటుంది. యాజ్ఞ్యవల్క్యునికి, అతని భార్య మైత్రేయికి జరిగిన సంవాదం గురించి కూడా ఉపనిషత్తు చెబుతుంది. ప్రత్యామ్నాయ చింతన నుంచి, ప్రతివాదం నుంచి, ప్రతిపక్షం నుంచే జైన, బౌద్ధ తాత్వికతలు అభివృద్ధి చెందాయి. అద్వైతవాది అయిన శంకరాచార్యుడు, కర్మవాది అయిన మండనమిశ్రునితోనూ, అతని భార్య ఉభయభారతితోనూ రోజుల తరబడి వాదోపవాదాలు జరిపి ఓడిస్తాడు. ఇప్పటిలా ప్రచురణ, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలు లేని కాలంలో సైతం మనిషి తనే సంచార మాధ్యమంగా మారి, దూరభారాలను జయించి పండిత పరిషత్తులను మెట్టాడు; వాద, ప్రతివాదాలలో ప్రకర్షను చాటి జ్ఞానవిజ్ఞాన వ్యాప్తికి వేగుచుక్క అయ్యాడు. అలాంటి ఒక పండిత స్పర్థలోనే శ్రీనాథ మహాకవి ‘‘పగుల గొట్టించి తుద్భటవివాద ప్రౌఢి గౌడడిండమభట్టు కంచుఢక్క’’ అని చెప్పుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ కాశీ, బెంగాల్లోని నవద్వీపం మొదలైనవి విద్వత్పరీక్షలకు పట్టుగొమ్మలుగా ప్రసిద్ధికెక్కాయి. అయల సోమయాజుల గణపతిశాస్త్రి అనే పండితుడు ఆంధ్రదేశం నుంచి నవద్వీపం వెళ్ళి అక్కడి విద్వజ్జనాన్ని మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదును అందుకొని వచ్చాడు. పురాతన నాగరికతలన్నీ సంవాద సంప్రదాయాన్ని పెంచి పోషించినవే. ప్రాచీన గ్రీకు తాత్వికుడు సోక్రటిస్ అభివృద్ధి చేసిన ప్రశ్నోత్తరాల సంవాద శైలి ‘సోక్రటిక్ డైలాగ్’ పేరిట ఒక వచనరచనా ప్రక్రియగా సారస్వతంలో భాగమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం దరిమిలా యూరప్లో ఆధునిక చర్చారూపాలు అభివృద్ధి చెంది, సంవాద సమాజాలు ఏర్పడి వైజ్ఞానిక వికాసాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. సంవాద ప్రక్రియ నిర్దిష్టమైన రూపురేఖలు తెచ్చుకుని పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యలో భాగమైంది. అందులో పోటీపడే విద్యార్థుల తర్ఫీదుకు శిక్షకులు అవత రించారు. ఆల్ఫ్రెడ్ స్నైడర్, మాక్స్ వెల్ ష్రూనర్ అనే ఇద్దరు శిక్షకులు సంవాదకళను అనేక కోణాల నుంచి చర్చిస్తూ, నిర్వచిస్తూ ‘మెనీ సైడ్స్– డిబేట్ ఎక్రాస్ కరిక్యులమ్’ అనే పుస్తకం వెలువరించారు. ఈ మొత్తం నేపథ్యం నుంచి చూసినప్పుడు మన పరిస్థితే ఆశ్చర్యకరం. రాచరికపు రోజుల్లోనే మనం తీర్చిదిద్దుకున్న సంవాద సంప్రదాయం ప్రజాతంత్రంలో అక్కరకు రాకుండాపోయింది. ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో కీలక సంవాద కేంద్రాలైన శాసనసభలకు వేలసంఖ్యలో ప్రతినిధులను పంపుకున్నా, పంపుతున్నా సంవాద విధివిధానాల శిక్షణ అంచెలంచెల విద్యలో ఇప్పటికీ భాగం కాలేదు. ఎక్కడైనా పాఠ్యేతర అంశంగా కొన ఊపిరితో ఉన్నా కార్పొరేట్ చదువులు దానినీ పాడి ఎక్కించాయి. కొత్తగా సామాజిక మాధ్యమాల వెల్లువ సంవాదపు బరిలో ప్రతి ఒకరికీ అవకాశమిచ్చి మేలు చేసినా విధివిధానాల శిక్షణ లేక చర్చ రచ్చగా మారడం; ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు కావలసిన సంవాదం విషవాయువు కావడం చూస్తున్నాం! -
ఎంఎస్ ధోని కూతురు జివా స్కూల్ ఫీజు ఎంతో తెలుసా? (ఫొటోలు)
-
పండ్లకే నష్టం ఎక్కువ!
సాక్షి, అమరావతి: పంటల కోత అనంతరం పండ్లకు అత్యధికంగా నష్టం వాటిల్లుతోందని, ఆ తరువాత ఆ నష్టం ఎక్కువగా కూరగాయల్లో ఉందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పండ్లు, కూరగాయలు కోత అనంతరం అధిక ఉష్ణాగ్రతల కారణంగా నాణ్యత క్షీణించడం, వృధా అవ్వడం జరుగుతోందని పేర్కొంది. పండ్ల కోత అనంతరం దేశంలో 6.02 శాతం నుంచి 15.05 శాతం మేర నష్టపోతున్నాయని, ఆ తరువాత కూరగాయల్లో 4.87 శాతం నుంచి 11.61 శాతం మేర నష్టం వాటిల్లుతోందని అధ్యయనంలో తేలినట్లు తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, విలువ జోడింపులు పెంచడం తదితర చర్యలను తీసుకుంటోందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. మెగా ఫుడ్ పార్క్లు, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, విలువ పెంపు మౌలిక సదుపాయాలను, ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లను, ఫుడ్ ప్రాసెసింగ్–ప్రిజర్వేషన్ కెపాసిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1,680 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం బ్యాంకులు, ఇతర రుణ సంస్థల ద్వారా దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడానికి సులభతరం చేసిందని తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. -
చదవమంటే నిద్ర వస్తుందంటాడు..? ఏం చేయాలి?
మా అబ్బాయికి 12 సం‘‘లు. వేదపాఠశాలలో చదువుతున్నాడు. క్లాసులో నిద్రపోతున్నాడని టీచర్ల కంప్లైంట్. బాబు ఇష్టం మీదే వేదపాఠశాలలో చేరాడు. సెలవులకు వచ్చినప్పుడు కూడా సమయం దొరికితే నిద్రపోతున్నాడు. ఎన్నిసార్లు మందలించినా నిద్రపోవడం మానడం లేదు. మా బాబు అతి నిద్ర తగ్గించి, బాగా చదివేటట్లు ఏదైనా సలహా చెబుతారా? – రాజేశ్వరి, తిరుపతివాస్తవానికి పిల్లలకు తమకిష్టంలేని సబ్జెక్టు చదువుతున్నప్పుడు బోర్ కొట్టి నిద్ర రావడం సహజమే! కానీ మీ అబ్బాయి తన ఇష్టంతోనే వేద΄ాఠశాలలో చేరాడంటే, అతని అతి నిద్రకు వేరే ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. క్లాసులు లేప్పుడు, సెలవుల్లో కూడా అతిగా నిద్ర΄ోతున్నాడని రాశారు. ఇలాంటి అతి నిద్ర సమస్యను ‘హైపర్ సోమ్నియా’ అంటారు. నార్కొలెప్సి, స్లీప్ ఆప్నియా లాంటి ఆరోగ్య సమస్యలున్నవారు, ఇలా అతిగా నిద్రపోతుంటారు. మీరు బాబును మందలించడం వల్ల పిల్లవాడు ఆత్మవిశ్వాసం కోల్పోయి, సమస్య మరింత పెద్దది అయే ప్రమాదముంది. ఆధునిక వైద్యశాస్త్రంలో అతి నిద్రను తగ్గించేందుకు అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ఒకసారి అబ్బాయిని సైకియాట్రిస్టుకు చూపించి, తగిన వైద్యం చేయిస్తే, మీ బాబు అతి నిద్రను తగ్గించి, మళ్లీ మామూలుగా చదివేటట్లు చేయవచ్చు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్కు మించి బ్యాక్టీరియా
వంట చేయడం ఒక ఎత్తయితే...అంట్ల గిన్నెలను తోమడం, కడగడం అంతకు రెండింతలు. శుభ్రంగా తోమాలి. ఎలాంటి మరకలు లేకుండా కడగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆరోగ్యానికి చేటే. మన ఇంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే మన ఇంటికి, ఒంటికీ అంత మంచిది. కానీ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే వంట గిన్నెల్ని శుభ్రం చేసే స్క్రబ్బర్, స్పాంజ్ల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సోకవచ్చని తాజా పరిశోధనలో తేలింది. ప్రస్తుతం కాలంలో వంట పాత్రల్ని శుభ్రం చేసేందుకు ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్ని, లేదా స్పాంజ్ని వాడుతూ ఉంటాం కదా. ఈ డిష్ స్క్రబ్బింగ్ స్పాంజ్ హానికరమైన బాక్టీరియాకు హాట్స్పాట్ అంటే నమ్ముతారా? ఇది టాయిలెట్ బౌల్ కంటే ఎక్కువ ప్రమాదాలను కలిగిస్తుందని తాజా స్టడీ తేల్చింది. కిచెన్ స్పాంజ్లు ఎందుకు ప్రమాదకరం?డ్యూక్ యూనివర్శిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీర్లు స్పాంజ్లు తేమతో కూడిన నిర్మాణం కారణంగా సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయని ధృవీకరించారు. ఒక చిన్న క్యూబిక్ సెంటీమీటర్ స్క్రబ్బర్లో 54 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. 5 శాతం వరకు సాల్మొనెల్లాను కలిగి ఉండవచ్చు. దీంతో తేలికపాటి గ్యాస్ట్రోఎంటెరిటిస్ మాత్రమే కాకుండా మెనింజైటిస్, న్యుమోనియా, అధిక జ్వరాలు, బ్లడీ డయేరియా, ప్రాణాంతక బ్లడ్ పాయిజిన్లాంటి తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్తో ఆహార సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటికి చికిత్స చేయకపోతే ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అంతేకాదు అందులో ఉండే రకరకాల బ్యాక్టీరియాలతో కిడ్నీ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఈ స్పాంజ్లలో వృద్ధి చెందే ఈ-కొలి కారణంగా మూత్రపిండ వైఫల్య ప్రమాదం కూడా ఉంది. దీన్నే హిమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ అంటారు. ఇది ఆహార కాలుష్యం వల్ల వస్తుంది. స్టెఫిలోకాకస్ అనేది స్పాంజ్లలో కనిపించే మరొక వ్యాధికారకం. చర్మ వ్యాధులకు, ఇంపెటిగో, సెల్యులైటిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. పరిష్కారం ఏమిటి? ఏం చేయాలి. పాత్రలను శుభ్రం చేసే స్పాంజ్లు,స్క్రబ్బర్లు తరచుగా మారుస్తూ ఉండాలి. అలాగే ఏరోజుకారోజు శుభ్రంగా క్లీన్ చేయాలి. తడి లేకుండా బాగా పిండేసి, తర్వాత వాటిని గాలిలో ఆరనివ్వాలి. మాంసం కంటైనర్లు, ఇతర పాత్రలు..ఇలా అన్నింటికి ఒకటే కాకుండా వేరు వేరువస్తువులను శుభ్రం చేయడానికి వేరు వేరు స్పాంజిని ఉపయోగించాలి. బాక్టీరియా ప్రమాదాన్ని నివారించేందుకు స్పాంజ్లను తడిపి రెండు నిమిషాలు మైక్రోవేవ్లో ఉంచాలి.డిష్ గ్లోవ్స్ ధరించడం వల్ల కలుషితమైన స్పాంజ్లతో వచ్చే చర్మ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించు కోవచ్చు. స్పాంజ్లకు ప్రత్యామ్నాయాలుప్లాస్టిక్ స్పాంజ్లను తరచుగా వాడి పారేయడం పర్యావరణ అనుకూలమైనది కాదు, కాబట్టి సెల్యులోజ్ ఆధారిత స్పాంజ్ లాంటి ప్రత్యామ్నాయాలుఎంచుకోవాలని పరిశోధకులు సూచించారు. స్పాంజ్లను ఉపయోగించడంలో అసౌకర్యంగా ఉన్నవారు, స్క్రబ్ బ్రష్లు, సిలికాన్ బ్రష్లు, సింగిల్ యూజ్ మెటల్ స్క్రబ్బీలు, డిష్వాషర్లు లాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలింటున్నారు. -
సంతాన లేమి : అవే కొంప ముంచుతున్నాయి!
వంధ్యత్వం లేదా ఇన్ఫెర్టిలిటీ అనేది ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఏడు జంటలలో ఒకరిని ప్రభావితం చేస్తోంది దక్షిణ , మధ్య ఆసియా, సబ్-సహారా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో అత్యధిక ఈ సమస్య కనిపిస్తోంది. పురుషుల్లో వాయు కాలుష్యం, మహిళల్లో రోడ్డు ట్రాఫిక్ శబ్దం కారణంగా వంధ్యత్యం వేధిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్లో పబ్లిష్ అయ్యాయి.డెన్మార్క్లోని నోర్డ్ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM 2.5) వాయు కాలుష్యాన్ని గురైన పురుషుల్లో సంతాన లేమి ఏర్పడే ముప్పు అధికంగా ఉందని పేర్కొంది. పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. దీనికి ఎక్కువ ఎక్స్పోజ్ కావడంతో పురుషులలో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదేవిధంగా, శబ్ద కాలుష్యం మహిళల్లో అధిక వంధ్యత్వానికి దారితీస్తోంది. సగటు కంటే 10.2 డెసిబుల్స్ ఎక్కువగా ఉండే రోడ్డు ట్రాఫిక్ శబ్దం 35 ఏళ్లు పైబడిన మహిళల్లో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనం కనుగొంది. 2000-2017 మధ్య డెన్మార్క్లో 30-45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పీఎం 2.5కి ఐదేళ్లకు పైన గురైన 30-45 ఏళ్ల వయసున్న వారిలో వంధ్యత్య ముప్పు 24 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది. -
ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం!
మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మపోషకాలు, స్థూల పోషకాలు ఉండాలని చెబుతుంటారు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మన ఆహారంలో అత్యంత కీలకమైన పోషకాలను కోల్పోతున్నామట. ఇటీవల పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. మన తీసుకునే ఆహారంలో అత్యంత కీలకమైన, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే పోషకాలను కోల్పోతున్నామని పరిశోధకులు చెప్పారు. ఇంతకీ ఏంటా నాలుగు కీలక పోషకాలంటే..!హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాంటా బార్బరా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు కాల్షియం, ఐరన్, విటమిన్ సీ, ఈతో సహా శరీరానికి అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను సరిపోని స్థాయిలో వినయోగిస్తున్నట్లు తెలిపారు. అందుకో 34 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తుల డేటాపై అధ్యయనం చేసినట్లు తెలిపింది. ఇలా మొత్తం 31 దేశాలలోని ప్రజల డేటాను సర్వే చేసి మరీ అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అందులో పురుషుల, స్త్రీల డేటాను వేరు చేసి మరి అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారందరిపై దాదాపు 15 విటమిన్లు, ఖనిజాల గురించి అధ్యయనం చేసింది. అందులో నాలుగు కీలక పోషకాలను ఆహారం నుంచి చాల తక్కువ మోతాదులో తీసుకుంటున్నారని తేలింది. ముఖ్యంగా అయోడిన్, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్ తగినంతగా తీసుకోవడం లేదని పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇక సగానికి పైగా ప్రజల్లో రిబోఫ్లావిన్, ఫోలేట్, విటమిన్ సీ, బీ6, నియాసిన్ తదితరాలను చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ప్రపంచ జనాబాలో దాదాపు 22% మంది చాలా తక్కువ స్థాయిలో ఈ పోషకాలను తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు పరిశోధకులు. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బలోపతం చేయడంలో కీలక పాత్ర పోషించేవని తెలిపారు. (చదవండి: పెళ్లిలో తోడిపెళ్లి కూతురు/పెళ్లి కొడుకు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..!) -
స్మార్ట్ఫోన్ యూజర్లకు ఊరట: బ్రెయిన్ కేన్సర్తో సంబంధం లేదు!
స్మార్ట్ఫోన్ వాడకంతో బ్రెయిన్ కేన్సర్ వస్తుందని ఇప్పటిదాకా చాలా భయపడ్డాం. సెల్ఫోన్ రేడియేషన్ దుష్ర్పభావానికి సంబంధించి పలువురు నిపుణులు హెచ్చరించారు కూడా. అయితే తాజా అధ్యయనం మాత్రం స్మార్ట్ఫోన్లకు, బ్రెయిన్ కేన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పడుకునేటపుడు దిండుకింద మొబైల్ పెట్టుకుని పడుకున్నా, పసిపిల్లలకు దగ్గరగా ఉంచి, రేడియేషన్ ప్రభావం ఉంటుందిని, తీవ్రమైన ప్రమాదకరమైన జబ్బులొస్తాయనే ఆందోళన ఇప్పటివరకు ఉండేది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వినియోగానికి, మెదడు కేన్సర్ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడింది. వైర్లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు కేన్సర్లో పెరుగుదల లేదని మంగళవారం ప్రచురించిన ఒక రివ్యూలో తెలిపింది. సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్లను ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొంది. కాగా డబ్ల్యూహెచ్ఓ , ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియేషన్ నుంచి వచ్చే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో చెప్పాయి, అయితే మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చాయి. ఈ నేపత్యంలో తాజా స్టడీ ఆసక్తికరంగా మారింది. -
వీకెండ్ హాయిగా నిద్రపోతే, ఆ ముప్పు 20 శాతం తగ్గుతుంది!
మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు నిరంతరం వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజా పరిశోధన సరికొత్త విషయాన్ని గుర్తించింది. కంటి నిండా నిద్రపోతే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని తెలుసు, కానీ వారాంతాల్లో ఎక్కువగా నిద్రపోవడం వల్ల కూడా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం, వారాంతాల్లో నిద్ర తప్పిన వ్యక్తుల్లో గుండె జబ్బుల ముప్పు 20శాతం తగ్గుతుంది. ముఖ్యంగా వారమంతా పని ఒత్తిడిలో ఉండి సరిగా నిద్రపోని వారికి వీకెండ్ నిద్ర గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొత్త పరిశోధన వెల్లడించింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వారాంతాల్లో నిద్రపోవడం తరచుగా ఆలస్యంగా నిద్రపోయే వారికి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వృత్తిరీత్యా స్లీపింగ్ సైకిల్ సరిగా లేని వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుందని వివరించింది.ఆధునిక జీవనశైలి తరచుగా పని వారంలో నిద్రలేమికి గురయ్యేవారికి ఇది ఉపయోడ పడనుంది. చైనాలోని బీజింగ్లోని నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్లోని ఫువై హాస్పిటల్లోని స్టేట్ కీ లాబొరేటరీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్కు చెందిన స్టడీ కో-రచయిత మిస్టర్ యంజున్ సాంగ్ మాట్లాడుతూ, "తగినంత పరిహార నిద్ర గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారం రోజుల్లో నష్టపోయిన నిద్రకు పరిహారంగా వారాంతపు రోజుల్లో క్రమం తప్పకుండా నిద్రను భర్తీ చేసుకునే వారిలో ఈ ఫలితం స్పష్టంగా కనిపిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. -
మలబద్దకంతో గుండెకు ముప్పే : తాజా అధ్యయనం
మనం తిన్న ఆహారం శుభ్రంగా జీర్ణమైన తరువాత వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వచ్చేయాలి. లేదంటే అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. అడపాదడపా మలబద్దకం చాలా సాధారణమే అయినప్పటికీ, దీర్ఘకాలిక మలబద్దకం అనేక రోగాల పెట్టు. దీనిని పట్టించుకోకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే, అది చివరికి హెమోరాయిడ్స్ లేదా పైల్స్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు దీన్ని సరైన సమయంలో నివారించకపోతే రక్తపోటు, గుండెపోటు లాంటి తీవ్ర సమస్యలు తప్పవు.గతంలో 60 ఏళ్లు పైబడిన 5.4 లక్షలమంది ఆసుపత్రి రోగులపై జరిపిన ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం, మలబద్దకం లేని రోగులతో పోలిస్తే మలబ్దకం ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండెపోటు. స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అదేవిధంగా, 9 లక్షల మంది వ్యక్తులపై చేసిన డానిష్ అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో మలబద్దకం ఉంటే ఈ ముప్పు ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఇటీవలి అంతర్జాతీయ అధ్యయనం సాధారణ జనాభాలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని తేల్చింది. మలబద్దకం రకాలు, కారణాలుఅందరూ మలబద్దకాన్ని చిన్నపాటి సమస్యగా భావిస్తారు. దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది అనేక ప్రధాన వ్యాధులకు హెచ్చరిక. పురుషులతో పోలిస్తే, మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువట. మలబద్దకానికి అనేక కారణాలున్నాయి. అలాగే దీన్ని ప్రైమరీ, సెకండరీ అని రెండు గ్రూపులుగా వర్గీకరిస్తారు. మలబద్దకం సమయంలో ప్రేగు కదలికల్లో ఒత్తిడి కడుపుపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో బీపీ, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే అది గుండె జబ్బులకు దారి తీస్తుంది.సాధారణంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం, శరీరానికి కావల్సిన నీటిని తీసుకోకపోవడం మలబద్ధకానికి దారి తీస్తుంది. మలబద్దకంతో ఉన్నప్పుడు, సాధారణంగా ప్రేగుల్లో గ్యాస్ పేరుకుపోతుంది. ఇది పొత్తి కడుపులో ఒత్తిడి పెంచి ఛాతీ దాకా విస్తరిస్తుంది. దీంతో నొప్పి, మంట లాంటి అసౌకర్యాలు కలుగుతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని పెంచి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు చాలా అరుదుగానే అయినప్పటికీ ఊపిరి పీల్చుకోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. బలవంతంగా మల విసర్జనకు ప్రయత్నించడంతో చాలామందిలో రక్తం స్రావం కనిపిస్తుంది. ఇది ఎనిమీయాకు కారణమవుతుంది. ఎపుడు అప్రమత్తం కావాలి?జీవన శైలిమార్పులతోపాటు, వైద్యుల సలహాపై తీసుకొనే కొన్ని రకాల మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే మలబద్దకంతోపాటు ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం ఒకటీ రెండు రోజులకు మించి ఉంటే తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆందోళన, దవడ, మెడ లేదా వెనుక భాగంలో నొప్పి లేదా అసౌకర్యం, చేతులు భుజాలలో నొప్పి లేదా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.మలబద్దకం-నివారణ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , చిక్కుళ్ళు తీసుకోవాలి.పుష్కలంగా నీరు తాగాలి. ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి తేలికపాటి వ్యాయాయం, వాకింగ్ లాంటివి చేయాలి.పరగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగడం, కొన్నిరకాల యోగాసనాల వల మంచి ఫలితం ఉంటుంది. -
మాయమవుతున్న ‘వై’ క్రోమోజోమ్ : మగజాతి మనుగడకు ముప్పు?
మనిషిలోని ఎక్స్, వై క్రోమోజోములు అనేవి ఆడ, మగ లింగ నిర్ధారణకు మూలం. ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అందుకే దీన్ని మేల్ క్రోమోజోమ్ అని పిలుస్తారు. అయితే ఈ వై క్రోమోజోముకు సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మానవులలోని రెండు సెక్స్ క్రోమోజోమ్లలో ఒకటైనవై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధాన మవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్లో ఆఅధ్యయన పేపర్ ను ప్రచురించారు.మగవారిలో సాధారణంగా ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ (XY) ఉంటాయి. అదే ఆడవారిలో అయితే రెండు ఎక్స్ క్రోమోజోములు (XX) లుంటాయి. ఈ వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ కంటే చాలా చిన్నది. తాజా అధ్యయనం ప్రకారం పురుషుల్లో వై క్రోమోజోమ్ క్రమంగా మాయవుతోందని పరిశోధకులు తేల్చారు.ప్రముఖ జెనెటిక్స్ ప్రొఫెసర్ , శాస్త్రవేత్త జెన్నిఫర్ ఎ. మార్షల్ గ్రేవ్స్ ప్రకారం, వై క్రోమోజోమ్ సమయం గతించిపోతోంది ఈ ధోరణి కొనసాగితే, వై క్రోమోజోమ్ 11 మిలియన్ సంవత్సరాలలో పూర్తిగా అదృశ్యమవుతుంది, ఇది మగ సంతానం , మానవ మనుగడ గురించి భయాలను పెంచుతుంది.అయితే అంత భయపడాల్సిన పనిలేదుఅయితే జపాన్కు చెందిన ఎలుకల జాతి, దాని అంతర్ధానమైనందున, మరో కొత్త మగ జన్యువును అభివృద్ధి చేసుకుంది. కనుక 1.1 కోట్ల ఏళ్ల కాలంలో వై క్రోమోజోమ్ కనుమరుగైనా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే లక్షణాలతో మరో మేల్ క్రోమోజోమ్ రూపొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.మార్షల్ గ్రేవ్స్ వెల్లడించిన అంశాల ప్రకారం గత కొన్ని లక్షల సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. వాస్తవానికి ‘Y’ క్రోమోజోములో 1438 జన్యువులుంటాయి. కానీ, గత 300 మిలియన్ సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువుల (Genes) సంఖ్య భారీగా పడిపోయింది. 1393 జీన్స్ మటుమాయమై, ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అంటే మరో 11 మిలియన్ల సంవత్సరాల్లో ఆ మిగిలిన 45 జన్యువులు కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది.జపాన్లోని హక్కైడో విశ్వవిద్యాలయంలో అసటో కురోయివా నేతృత్వంలోని పరిశోధకులు స్పైనీ ఎలుకలలోని చాలా Y క్రోమోజోమ్ జన్యువులు ఇతర క్రోమోజోమ్లకు మారినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా, వారు క్రోమోజోమ్ 3పై SOX9 జన్యువు దగ్గర చిన్న DNA ను గుర్తించారు. ఇది మగవారిలో ఉంటుంది కానీ ఆడవారిలో ఉండదు. ఈ డూప్లికేషన్ SOX9ని యాక్టివేట్ చేస్తుంది. ఇది పురుష అభివృద్ధిలో తప్పిపోయిన SRY జన్యువు పాత్రను తీసుకుంటుంది. Y క్రోమోజోమ్ కోల్పోయినప్పుడు క్షీరదాలు ప్రత్యామ్నాయ లింగాన్ని నిర్ణయించే విధానాలను అభివృద్ధి చేయగలవని ఈ అధ్యయనం చెబుతోంది. మరొక చిట్టెలుక జాతి, మోల్ వోల్ కూడా దాని వై క్రోమోజోమ్ను కోల్పోయిన తరువాత కూడా మనుగడలో ఉంది.సర్వైవల్ కీలకంమానవ వై క్రోమోజోమ్ల క్షీణత అంశం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, కొత్త లింగాన్ని నిర్ణయించే జన్యువును అభివృద్ధితో మగ జాతి ఉనికికి వచ్చే నష్టమేమీ ఉండదంటున్నారు. అయినప్పటికీ, ఇటువంటి పరిణామాత్మక మార్పులు వివిధ మానవ జనాభాలో బహుళ లింగ-నిర్ధారణ వ్యవస్థల ఆవిర్భావానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, దీని ఫలితంగా కొత్త జాతులు ఏర్పడతాయని సూచించారు. -
నిద్రలో తేడాలొచ్చినా టైప్-2 డయాబెటిస్ ముప్పు
టైప్ 2 డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతున్న సమస్య. దాదాపు 90 నుండి 95శాతం ఈ తరహా డయాబెటిస్తో బాధపడుతున్నారు. 2021లో ప్రపంచంలో 540 మిలియన్ల మధుమేహ కేసులు (ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్, 2021) ఉన్నట్లు అంచనా. ఒత్తిడి, నిశ్చల జీవనశైలి , నాణ్యత లేని, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వంటి కారణాలతో మధుమేహం విస్తరిస్తోంది. అయితే తాజా అధ్యయనం ప్రకారం అతిగా నిద్రపోవడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట.మనిషి ఆరోగ్యంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సమయా పాలన పాటించని నిద్రకూడా ప్రమాదమే అంటున్నారు. హెచ్చు తగ్గుల నిద్రకు మన ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. నిద్ర వ్యవధిని తరచూ మార్చుకునే వారికి డయాబెటిస్ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని తాజా పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఈ పరిశోధన ప్రకారం తమ నిద్ర వ్యవధిని 31 నుంచి 45 నిముషాల పాటు మార్చుకోవడం (నిద్ర వ్యవధి ఎక్కువ/తక్కువ చేయడం) వల్ల 15 శాతం డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. ఈ వ్యవధి గంటకు మించి ఉంటే ఆ ప్రమాదం 59 శాతం పెరుగుతుంది. అతి నిద్ర కారణంగా కారణంగా డయాబెటిస్ సోకే అవకాశాలు 34 శాతం అధికంగా ఉంటుంది.జూలై 2024 అధ్యయనం మరియు డయాబెటిస్ కేర్లో దీన్ని ప్రచురించారు. యూకే బయో బ్యాంక్ ద్వారా పరిశోధకులు యాక్సిలోమీటర్లు (స్మార్ట్ వాచ్) ద్వారా 84 వేల మంది నిద్ర నమూనాలను పరిశీలించారు. అతి నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా డయాబెటిస్కు దారితీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. నిద్రలేమి కారణంగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావడమే కాక, తీవ్ర రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, హృద్రోగ సంబంధ వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధన పేర్కొంది. క్రమరహిత నిద్ర అనేది ఆధునిక జీవనశైలితో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్య. వృత్తి, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, కుటుంబ కట్టుబాట్ల కారణంగా ప్రజలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు, ఇది వారి నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రకు ముందు మొబైల్ ఫోన్ల వంటి డిజిటల్ పరికరాల వినియోగం పెరగడం మరో ప్రధాన అంశం. మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పేలవమైన నిద్ర భవిష్యత్తులో మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
చదువుల తల్లికి సీఎం చేయూత
వీర్నపల్లి (సిరిసిల్ల): ఐఐటీ పాట్నా లో సీటు సాధించిన పేద గిరిజన విద్యార్థి ని బదావత్ మధులత విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎంవో బుధవారం అధికారికంగా వెల్లడించింది. కోర్సు పూర్తయ్యేవరకు ఆర్థిక సహాయం కొనసాగుతుందని హైదరాబాద్కు వెళ్లిన విద్యారి్థనితోపాటు వారి కుటుంబీకులకు సీఎంవో హామీ ఇచి్చంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రతిభచూపి 824వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. పాట్నా ఐఐటీలో చదవాలంటే దాదా పు రూ.3 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సోమవారం ‘సాక్షి’లో ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇది సీఎంవో దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్రెడ్డి ఆ విద్యారి్థనిని హైదరాబాద్కు పిలిచారు. బుధవారం మధులత ఆమె తండ్రి రాములుతో కలిసి వెళ్లింది. చదువు పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని సీఎం ఆదేశించడంతో గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధుల మంజూరు ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయంలో రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి శరత్ మధులతకు రూ.1,51,831 చెక్కును అందజేశారు. మధులత కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం రూ.70 వేలు ఇవ్వడంతో పాటు అదనంగా మరో రూ.30 వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని గిరిజన సంక్షేమ శాఖ మధులతకు భరోసా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ, మధులతను రేవంత్రెడ్డి ‘ఎక్స్’లో అభినందించారు. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సాక్షితోపాటు తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధులత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే టైప్-1 డయాబెటిస్ ముప్పు ఎక్కువ
ఆధునికకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. అయితే తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యూకే లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్కి చెందిన పరిశోధనా బృందం వెల్లడించింది. చిన్నపిల్లలకు టైప్-1 డయాబెటిస్ (T1D) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. తాజా అధ్యయనం ప్రకారం అమ్మాయిల్లో 10 ఏళ్ల తర్వాత టైప్ 1 మధుమేహం రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం ఈ ముప్పు స్థిరంగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది. సెక్స్ హార్మోన్లు పాత్ర పోషిస్తాయని పరిశోధన తెలిపింది. పురుషుల్లోని ఆటోఆంటిబాడీల అభివృద్ధితో దీనికి సంబంధం ఉండవచ్చని సూచించింది. రోగనిరోధక వ్యవస్థ, దీనికి సంబంధించిన ప్రోటీన్లైన్ ఆటోఆంటిబాడీ ఎక్కువున్న అబ్బాయిల్లో ప్రమాదం ఉందని అధ్యయనం చూపించింది. వీరు మెజారిటీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల మాదిరిగా కాకుండా ఈ తరహా మధుమేహానికి ప్రభావితమవుతారని వెల్లడించింది.ఈ అధ్యయనంలో కంప్యూటర్, స్టాటిస్టికల్ మోడలింగ్ డేటా సాయంతో పరిశోధకులు టీఐడీ ఉన్న వ్యక్తుల 235,765 మంది బంధువులను పరిశీలించారు. ఇందులో మగవారిలో అధిక ఆటోయాంటిబాడీ స్థాయిలు ఉన్నట్లు కనుగొన్నారు (అమ్మాయిల్లో: 5.0శాతం, పురుషుల్లో: 5.4శాతం). అలాగే మగవారు మల్టిపుల్ యాంటిబాడీ ప్రతిరోధకాలకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నందున వీరిలో ఐదేళ్ల ముందే ఈ టీఐడీ వచ్చే అవకాశం ఉంది. పదేళ్ల వయస్సులో వచ్చే ప్రమాదంలో మార్పు టీనేజ్-సంబంధిత హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నఅధ్యయన బృందం మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9-13 వరకు జరిగే స్పెయిన్లోని మాడ్రిడ్లో యూరోపియన్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను ప్రెజెంట్ చేయనున్నారు. -
పార్టనర్కి బీపీ ఉంటే..వచ్చే అవకాశం ఉందా..?
బీపీ, ఘుగర్ వంటి వ్యాధులు ఒకరి నుంచి మరొకరకి సంక్రమించే వ్యాధులు కాకపోయినప్పటికీ భార్యభర్తలో ఎవరో ఒకరికి ఉంటే మరొకరికి ఆటోమెటిక్గా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. భాగస్వామికి గనుకు రక్తపోటు ఉంటే..సదరు వ్యక్తిని కూడా కచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. నిపుణులు జరిపిన తాజా అధ్యయనాల్లో ఇది నిర్థారణ అయ్యింది కూడా. చైనా, ఇంగ్లండ్, భారత్, అమెరికా వంటి దేశాల్లోని జంటలపై చేసిన పరిశోధనలో అధిక బిపీ ఉన్న పురుషులను చేసుకున్న స్త్రీలు కూడా రక్తపోటుకి గురవ్వుతున్నట్లు గమనించారు. భాగస్వామి నుంచి రక్తపోటు నేరుగా సంక్రమించకపోయినా పరోక్షంగా ఇది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి ఈ రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్తో సహా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది తీసుకునే ఆహారం, జీవనశైలి, ఒత్తిడి తదితర కారకాలచే ప్రభావితమవుతుందని వివరించారు నిపుణులు. భాగస్వామి ఎదుర్కొంటున్న రక్తపోటు, ఒత్తిడి అనేవి వారితో కలిసి జీవిస్తున్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. వారికేమవుతుందన్న ఆందోళన వారిని ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. దీన్ని 'సంరక్షకుల ఒత్తిడిగా' పేర్కొనవచ్చని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎంత సేపు తమ భాగస్వామికి ఏమవుతుందనే అప్రమత్తత వారిలో తెలియని ఒత్తిడిని కలుగ చేసి, ఆందోళనకు గురి అయ్యేలా చేస్తుంది. దీంతో క్రమేణ వారు కూడా ఈ బీపీ బారినపడతారని వివరించారు. అందుకు దారితీసే కారణాలు..జీవనశైలి..జంటలు తరుచుగా జీవనశైలి అలవాట్లను పంచుకుంటారు. ఇవి రక్తపోటులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు అనారోగ్యకరమైన జీవనశైలి ఫాలో అయితే అది మరొకరిని ఆటోమేటిగ్గా ప్రభావితం చేస్తుంది. భావోద్వేగ కోణం..తనకు ఇష్టమైన వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం భావోద్వేగ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆందోళన ఒత్తడికి దారితీసి రక్తపోటు వచ్చేందుకు కారణమవుతుంది. అంతేగాదు భాగస్వామి ఆరోగ్యం పట్ల ఆందోళన కారణంగా చాలా మానసిక ఒత్తిడికి లోనవ్వుతారు. దీని వల్ల కలిగే అపార్థాలు లేదా సంఘర్షణలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్కి అంతరాయం ఏర్పడి భావోద్వేగానికి గురవ్వడం జరుగుతుంది. ఒకరకంగా మానసికంగా కుంగిబాటుకు గురయ్యి వారు కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు నిపుణులు.ఏం చేయాలంటే..ఆరోగ్యకరమైన రీతీలో రక్తపోటుని మెరుగ్గా నిర్వహించాలంటే జంటలు పాటించాల్సినవి ఇవే..రోజూవారిగా తీసుకోవాల్సిన పరిమాణంలో ఉప్పు తీసుకోవడం, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడంశారీరక కార్యకలాపాల్లో కలిసి పనిచేయడంధూమపానం, మధ్యపానం మానుకోవడంఅనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా ఉండటంయోగా, ధ్యానం కలిసి సాధన చేయడంపుస్తకాలు చదవడం లేదా కలిసి సంగీతం వినడంఆరోగ్యకరమైన జీవనశైలితో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటే ఈ రక్తపోటు నుంచి సులభంగా బయటపడొచ్చు. ఆరోగ్యంగా నిండు నూరేళ్ల జీవితాన్ని ఆస్వాధించగలుగుతారు భార్యభర్తలు.(చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!) -
ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్.. ఐఐటీ జోధ్పూర్లో చేరొచ్చు
దేశంలో నూతన ఆవిష్కరణల విషయంలో రాజస్థాన్ ఎప్పుడూ ముందుంటుంది. విద్య లేదా వైద్యం... ఏదైనా ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక నూతన ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. తాజాగా రాజస్థాన్లోని జోధ్పూర్ ఐఐటీ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది.ఇకపై ఐఐటీ జోధ్పూర్లో చేరే విద్యార్థులు బీటెక్ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్ చదువులను అందించే తొలి ఐఐటీగా జోధ్పూర్ ఐఐటీ నిలిచింది.ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం కలిగిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జోధ్పూర్ ఐఐటీ ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. జాతీయ విద్యా విధానం 2020 కింద ఈ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నారు. జోధ్పూర్ ఐఐటీలో ఇకపై హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో బిటెక్ చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని ఇతర ఐఐటీలలో కూడా దీనిని అమలు చేసే అవకాశాలున్నాయి.దేశంలోని 50 శాతం మంది విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలుకంటుంటారు. అయితే ఆంగ్లంలో ఈ కోర్సులు ఉండటం వలన చాలామంది విద్యకు దూరమవుతున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే జోధ్పూర్ ఐఐటీ ఇంజినీరింగ్ కోర్సులను హిందీ మాధ్యమంలో ప్రవేశపెడుతోంది. -
Healthy Snacking Report 2024: మనోళ్లు కొంటున్నది... పోషకాలున్న స్నాక్సే!
న్యూఢిల్లీ: మార్కెట్లో స్నాక్స్ కొనేటప్పుడు ప్యాక్పై ఉన్న వివరాలు తప్పనిసరిగా చదువుతున్నారా? అయితే ఈ లిస్ట్లో మీరూ ఉన్నట్టే. ఆహారపదార్థాలు, ప్రత్యేకించి స్నాక్స్ కొనేటప్పుడు దానిలో వాడిన పదార్థాలేంటి? అందులో ఏమాత్రం పోషక విలువలున్నాయని 73శాతం మంది భారతీయులు చదువుతున్నారని హెల్తీ స్నాకింగ్ రిపోర్ట్–2024 సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా 6వేల మందిపై సర్వే నిర్వహించి నివేదికను ఆది వారం విడుదల చేసింది. వీరిలో 93 శాతం మంది ఆరో గ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకోవడానికే ఇష్టపడుతున్నారని తెలిపింది. ఆహార కల్తీకి సంబంధించి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుగంధ ద్రవ్యాలు, స్వీట్స్, ఇతర స్నాక్స్ ప్యాకెట్స్ కొనుగోలుదారులపై సర్వే నిర్వహించింది. ప్రతి 10 మందిలో 9 మంది సంప్రదాయ చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ కొనాలని చూస్తున్నారని తెలిపింది. డ్రైఫ్రూట్స్, నట్స్, తృణధాన్యాలతో చేసిన సహజమైన ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడుతు న్నారని తెలిపింది. డ్రై ఫ్రూట్స్, తామర గింజలతో చేసిన పేలాల (మఖనా)ను హెల్తీ స్నాక్గా గుర్తించారు. పోషకాలు అత్యధికంగా ఉన్న వీటిని కొనడానికి 67శాతం మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారని సర్వే వెల్లడించింది. -
మల్టీవిటమిన్లు మరణ ప్రమాదాన్ని తగ్గించగలవా?
ఇటీవల కాలంలో మల్టీవిటమిన్లు వాడకం ఎక్కువయ్యింది. కొందరూ వీటి వల్ల ఎలాంటి దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడమని మరణాల ప్రమాదం తగ్గుతుందన్న నమ్మకంతో తీసుకుంటుంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల మరణా ప్రమాదం తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజు వీటిని వినియోగించే వారికే మరింత ప్రమాదం ఉందంటూ పలు ఆసక్తికర షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..డైలీ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించేలా సహాయపడదని అధ్యయనంలో తేలింది. ఇలా వాడటం వల్ల మరణ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఈవిధంగా డైలీ మల్టీవిటమిన్లు వినియోగించేవారిలో రాబోయే దశాబ్దాలలో వారి మరణ ప్రమాదాన్ని తగ్గించాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు దాదాపు నాలుగు లక్షల మంది పెద్దల డేటాను విశ్లేషించారు. ఆ పరిశోధనలో మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే తీసుకున్న వారికే మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించారు. ఇలా సప్లిమెంట్లను తీసుకునే వ్యక్తుల్లో మరణాల ప్రమాదం 4% పెరుగుతుందని అధ్యనం వెల్లడించింది. నిజానికి ఇప్పటి వరకు మల్టీవిటమిన్లు వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, హాని గురించి తగిన ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలోనే దీర్ఘకాలికి వ్యాధి సంబంధిత మరణాలకు మల్టీవిటమిన్ల వినియోగంకు ఎంత వరకు లింక్ అప్ అయ్యి ఉంటుందనే దిశగా అధ్యయనాలు చేసినట్లు పరిశోధకులు వివరించారు. ఈ క్రమంలో డాక్టర్ ఎరిక్కా లాఫ్ట్ఫీల్డ్, అతడి సహచరులు యూఎస్ ప్రజలకు సంబంధించి మూడు ప్రదాన ఆరోగ్య అధ్యయనాల డేటాను విశ్లేషించారు. ఈ పరిశోధనలో దాదాపు 3 లక్షలకు పైగా ప్రజల ఆరోగ్య వంతమైన డేటాను రికార్డు చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొనే వారి సగటు వయసు 60 ఏళ్లు మాత్రమే. కానీ ప్రజలు అనారోగ్యం వచ్చినప్పుడూ వాటి వినియోగం ఎక్కువగా ఉందని, ఇలా వినియోగించడం వల్ల మంచిది కాదని పరిశోధన చెబుతోంది. అయితే నిర్థిష్ట సమయంలో ఇవి మంచి ఫలితాలు కూడా ఇస్తాయని అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. నావికులు విటమిన్ సీ సప్లిమెంట్స్ ద్వారా రక్షించబడ్డారు. అలాగే బీటా కెరోటిన్, విటమిన్ సీ, ఈ, జింక్ వంటి వాటితో వయసు సంబంధిత మచ్చల క్షీణత నెమ్మదిస్తుందని చెప్పారు. ఇక్కడ మల్లీవిటమిన్లు మనిషిని ఎక్కువ కాలం బతికేలా చేయలేవని, మరణాల ప్రమాదం రాకుండా చేయలేదని వెల్లడించారు. దాని బదులు ఆ విటమిన్లన్నీ పుష్కలంగా లభించేలా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ను పరిమితం చేస్తూ..సూక్ష్మపోషకాలు, మాక్రోన్యూట్రియెంట్లు, ఫైబర్లు ఉన్నటువంటి వాటిని తీసుకోవాలని అన్నారు. కేవలం విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లతో ప్రయోజనం ఉండదని, అవి మరణా ప్రమాదాన్ని తగ్గించవని అన్నారు. వాటన్నింటిని ఆహారం నుంచి పొందేలా కష్టపడితే వ్యాధుల బారినపడరని, ఎక్కువకాలం జీవించగలుగుతారని అన్నారు పరిశోధకులు. (చదవండి: నీతా అంబానీ కొనుగోలు చేసిన లక్క బుటీ బనారసీ చీరలు! ప్రత్యేకత ఏంటంటే.) -
అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
మనిషి ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరం. ఆహారంతో పాటు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే అనేక ప్రమాదకరమైన అనారోగ్యాల్ని కొని తెచ్చుకున్నట్టే ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే అర్థరాత్రి దాకా మెలకువతో ఉండటం మాత్రమే కాదు, ఎక్కువ వెలుగులో ఉన్నా ప్రమాదమేనని తాజా అధ్యయనం చెబుతోంది.85వేల మంది వ్యక్తులపై జరిపిన భారీ అధ్యయనంలో, ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రాత్రిపూట కాంతికి ఎక్స్పోజ్ కావడం మూలంగా (పగటిపూట కార్యకలాపాలతో సంబంధం లేకుండా) టైప్-2 మధుమేహం ముప్పును పెంచుతుందని గుర్తించారు.రాత్రి ఆలస్యంగా నిద్రకుపక్రమించడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుందని ఇది జీవక్రియలో మార్పులకు దారితీస్తుందని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రచయిత ఆండ్రూ ఫిలిప్స్ తెలిపారు. ఇన్సులిన్ స్రావం, గ్లూకోజ్ జీవక్రియ మార్పుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుందని, చివరికి టైప్-2 డయాబెటిస్కి దారి తీస్తుందని తెలిపారు. 2013 -2016 మధ్య కాలంలో యూకే బయెబ్యాంకు డాటాతో, ఒక వారం పాటు మణికట్టు కాంతి సెన్సార్లను ధరించి 84,790 మంది ఈ స్టడీలో పాల్గొన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అంచనాల ప్రకారం 13 మిలియన్ గంటల లైట్-సెన్సర్ డేటాతో తరువాతి జీవితంలో మధుమేహం వచ్చే ప్రమాదం 67శాతంఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జీవనశైలి, షిఫ్ట్ డ్యూటీలు, సమయానికి నిద్రపోకపోవడం లాంటివి షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయన్న విషయాన్ని పరిగణనలో తీసుకున్న పరిశోధకులు, అర్థరాత్రి 12.30 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువ కాంతికి ప్రభావితమవ్వడం కూడా అనారోగ్య సమస్యల్ని మరింత పెంచుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఎక్కువ లైట్కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలని, తద్వారా టైప్-2 మధుమేహం ముప్పు నుంచి తప్పించు కోవచ్చని సూచించారు.రాత్రి సమయంలో ప్రకాశవంతమైన వెలుగులో ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని ఫిలిప్స్ తెలిపారు. లైట్ ఎక్ప్పోజర్కి, మధుమేహం ముప్పుకు ఉన్న సంబంధాన్ని తమ పరిశోధనలో గుర్తించామన్నారు. సో.. ఈ తరహా డయాబెటిస్ నుంచి తప్పించు కోవాలంటే రాత్రిపూట పని చేసేటపుడు, ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవడం లేదా సాధ్యమైనంత చీకటి వాతావరణాన్ని సృష్టించుకోవడం సులభమైన మార్గమని సూచించారు. -
రోజుకు 2 వేల మంది చిన్నారులను మింగేస్తున్న ‘కాలుష్యభూతం’
దేశ రాజధాని నగరం ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. గాలిలో నాణ్యత అత్యంత ప్రమాదకరస్థాయిలకు పడిపోవడం ఇటీవలి కాలంలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా వాయు కాలుష్యానికి సంబంధించిన ఆందోళకరమైన అధ్యయనం ఒకటి మరింత ఆందోళన రేపుతోంది. వాయుకాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు రెండో అతిపెద్ద ప్రమాద కారకంగా వాయు కాలుష్యం నిలుస్తోందని కూడా ఈ నివేదిక తేల్చింది.అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం, 2021లో ఏకంగా 81 లక్షలమంది చిన్నారు వాయు కాలుష్య భూతానికి బలైనారు. మొత్తం మరణాలలో దాదాపు 12 శాతం. అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం ఉంది. పొగాకు, పోషకాహార లోపం కంటే ఎక్కువగా వాయుకాలుష్యమే ప్రజలను బలితీసుకుంటోందని ఈ అధ్యయనం తేల్చింది. మన నిర్లక్ష్యమే తదుపరి తరంపై తీవ్ర ప్రభావం చూపుతోందని యునిసెఫ్కు చెందిన కిట్టి వాన్ డెర్ హీజ్డెన్ తెలిపారు.వాయు కాలుష్యంకారణంగా ఐదేళ్ల లోపు ఉన్న 7 లక్షల మంది పిల్లల మరణించారు. ఇందులో 5 లక్షల మరణాలకు ప్రధాన కారణం ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య బొగ్గు, చెక్కలు, పేడ వంటి వాటిని వంటచెరకుగా వాడటం వలన సంభవించాయి.తరువాతి తరంపై తీవ్ర ప్రభావంయూనీసెఫ్తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన వార్షిక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం చూపుతోందని అధ్యయనం హెడ్ పల్లవి పంత్ వెల్లడించారు. ఇవి మనం పరిష్కరించగల సమస్యలేనని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోని దాదాపు ప్రతీ ఒక్కరూ ఆనారోగ్యకర స్థాయిలో వాయుకాలుష్యం బారిన పడుతున్నారు. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90 శాతానిపైగా పీఎమ్ 2.5 అనే సూక్ష్మ ధూళి కణాలే కారణం. పీఎమ్ 2.5 సూక్ష్మధూళి కణాల కారణంగా ఊపిరితిత్తుల కేన్సర్, గుండె జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వాస్తవ పరిస్థితి తీవ్రత ఇంతకంటే ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాలుష్యంతో 2021లో 5 లక్షల మంది ప్రాణాలు గాల్లోకి కలిసి పోయాయి. వాతావరణ మార్పులు, వాయుకాలుష్యానికి చాలా సారూప్యమైన పరిష్కార మార్గాలు ఉన్నాయని పల్లవి వ్యాఖ్యానించారు. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ఇళ్లల్లో వంటకు బొగ్గు, చెక్క వంటి అనారోగ్య కారక ఇంధనాల వినియోగం తగ్గించాలి. ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది. ఓజోన్ స్థాయిలను పెంచే అడవి మంటలు, దుమ్ము తుఫానులు లేదా విపరీతమైన వేడి వంటి సంఘటనల కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్లు లేదా మంటలపై ఆహారం వండుకుంటూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే మెరుగైన స్టవ్లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గాయి. 200 పైగా దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది. -
ఒత్తిడికి గురైనప్పుడు జంక్ ఫుడ్ తినడకూడదా?
సాధారణంగా దైనందిన జీవితం లేదా కెరీర్లో రకరకాల ఒత్తిడులను ఎదుర్కొనాల్సి వస్తుంటంది. ఈ ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో రిలీఫ్ కోసం కొన్ని రకాల అలవాట్లకు లోనవ్వుతుంటాం. అవి మంచివి అయితే పర్లేదు. అదే కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి అవి మనషులను ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఆ దిశగా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే చాలామంది ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటారని వాటివల్ల వారి ఆరోగ్యం ఎలా ప్రమాదంలో పడుతుందో సవివరంగా వెల్లడించారు. అదెలాగో తెలుసుకుందామా..!బౌల్డర్లోని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం..ఒత్తిడికి గురైనప్పుడూ చాలామంది సమోసా లేదా బర్గర్ వంటి జంక్ ఫుడ్ తినేందుకు మొగ్గు చూపుతారట. ఇలా తినడం వల్ల ఆందోళన స్థాయిలు పెరుగుతాయే గానీ ప్రయోజనం ఉండదని పరిశోధనలో తేలింది. అందుకోసం జంతువులపై జరిపిన అధ్యయనంలో పల ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆందోళనలో ఉన్నప్పుడూ అవి అధిక కొవ్వుతో కూడిన జంక్ ఫుడ్ తీసుకోవడంతో వాటి శరీరంలోని గట్ బ్యాక్టీరియాకి అంతరాయం కలిగించి వాటి ప్రవర్తనను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది మెదుడు రసాయనాలన ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధన పేర్కొంది కూడా. ఈ మేరకు ప్రొఫెసర్ క్రిస్టోఫర్ లోరీ మాట్లాడుతూ..అధిక కొవ్వు మెదుడులోని జన్యువుల వ్యక్తీకరణనే మార్చేయడం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని అన్నారు. అంతేగాదు తమ పరిశోధనలో ఈ అధిక కొవ్వు ఆహారం తప్పనిసరిగా మెదుడులో ఆందోళన స్థితి మరింత పెంచుతున్నట్లు వెల్లడయ్యింది. పైగా ఇలా జంక్ఫడ్ ఎక్కువగా తీసుకున్న జంతువుల్లోని మైక్రోబయోమ్ లేదా గట్ బ్యాక్టీరియాని అంచనా వేయగా తక్కువ వైవిధ్యాన్ని చూపించాయని, పైగా వాటి బరువు కూడా పెరిగినట్లు తెలిపారు. అంతేగాదు ఈ అధిక కొవ్వుతో కూడిన ఆహారం కారణంగా మెదడులో న్యూరోట్రాన్స్మీటర్ సెరోటోనిన్ ఉత్పత్తికి సంబంధించిన సిగ్నలింగ్లో మూడు జన్యువులు అధిక వ్యక్తీకరణనను చూపించడం గుర్తించామన్నారు పరిశోధకులు. ఇది ఒత్తిడి, ఆందోళనను పెంచే సంకేతమని చెబుతున్నారు. ఇక్కడ ఈ సెరోటోనిన్న ఫీల్ గడ్ బ్రెయిన్ కెమికల్ అని పిలుస్తారు. అయితే పరిశోధనలో జంతువుల్లోని ఈ సెరోటోనిన్ న్యూరాన్లలోని కొన్ని ఉపసమితులను సక్రియం చేయండంతో ఆందోళన వంటి ప్రతిస్పందనలు వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అంటే ? ఇక్కడ.. శరీరంలోని అనారోగ్యకరమైన మైక్రోబయోమ్ గట్ లైనింగ్(మనం తీసుకున్న ఆహారం)తో రాజీపడి శరీర ప్రసరణలో కలిసిపోతుంది. దీంతో జీర్ణశయాంతర ప్రేగు నుంచి మెదడుకు వెళ్లే వాగస్ నరాల ద్వారా మెదడుతో కమ్యూనికేట్ అయ్యి ప్రవర్తనను లేదా మూడ్ని మారుస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం మనకు అనారోగ్యం కలిగించే విషయాలను గుర్తించి తద్వారా భవిష్యత్తులో వాటిని నివారించేలా చేసే మరిన్ని ప్రయోగాలకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే ఇక్కడ అన్ని కొవ్వులు చెడ్డవికావని చేపలు ఆలివ్ నూనె వంటి మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు.(చదవండి: డిప్రెషన్తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?) -
రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక!
నోటి దుర్వాసనను నివారించేందుకు, ఫ్రెష్గా ఉండేందుకు లిస్టరిన్ మింట్ మౌత్ వాష్ను తరచుగా వినియోగిస్తున్నారా? అయితే తాజా అధ్యయనం గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ప్రముఖ కంపెనీకి చెందిన లిక్విడ్ మౌత్ వాష్ వాడితే కేన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. బెల్జియంలోని యాంట్వెర్ప్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నిపుణులు ఇటీవలి అధ్యయనంలో కూల్ మింట్ ఫ్లేవర్ మౌత్వాష్ రోజువారీ వినియోగంపై పరిశోధన చేశారు. దీని ప్రకారం రోజూ లిస్టరిన్ కూల్ మింట్ వాడటం వల్ల రెండు రకాల బాక్టీరియా నోట్లో పెరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు అంటు వ్యాధులు, ఇతర వ్యాధులతో ముడిపడి ఉన్న బ్యాక్టీరియా జాతులైన ‘ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం, స్ట్రెప్టోకోకస్ ఆంజినోసస్’ స్థాయిలను బాగా ఎక్కువగా గుర్తించినట్టు తెలిపారు. ఇవి రక్తంలో కలిసి పలు నోటి సమస్యలకు కారణమవుతాయని అధ్యయన రచయిత ప్రొఫెసర్ క్రిస్ కెన్యన్ తెలిపారు. నోటిలోని చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్లు కూడా లిస్టెరిన్ కెమికల్ కారణంగా వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలిందన్నారు. మౌత్ ఫ్రెష్నర్లోని రసాయనం కారణంగా నోటిలో బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుందని, ఫలితంగా పీరియాంటల్ వ్యాధులు, అన్నవాహిక, కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయన్న గత పరిశోధనలు కూడా గుర్తించాయని ఆయన ఉటంకించారు. ‘‘చాలా మంది వ్యక్తులు దీనిని ఉపయోగించకూడదు. ఒకవేళ దానిని ఉపయోగిస్తే, వారు ఆల్కహాల్ లేనిది ఎంచుకోవాలి. అలాగే వినియోగాన్ని రెండు రోజులకు పరిమితం చేయాలి." అని పేర్కొన్నారు. తమ అధ్యయనం లిస్టరిన్ను మాత్రమే పరీక్షించినప్పటికీ, ఇతర ఆల్కహాల్ ఆధారిత మౌత్వాష్లతో కూడా ముప్పు ఉంటుందని ప్రొఫెసర్ నొక్కి చెప్పారు.అలాగే నోటిలోని సమస్యలు, అనారోగ్యం వివిధ రకాల కేన్సర్ల ముప్పును పెంచుతుంది. నోటిలోని దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు కేన్సర్గా మారే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలు, సెల్యులార్ మార్పులు, డీఎన్ఏ ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. చివరికి ప్రాణాంతం కూడా కావచ్చు. ప్రతి ఒక్కరికి నోటి, గొంతు ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. రెగ్యులర్ బ్రషింగ్, ఫ్లాసింగ్ , డెంటల్ చెక్-అప్ల ద్వారా మంచి నోటి పరిశుభ్రతను కాపాడుకోవాలి. సుదీర్ఘ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా నివారణలో శ్రద్ధ వహించాలి. తద్వారా కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నోటి పరిశుభ్రతను పాటించకపోవడంతోపాటు, పొగాకు వాడకం, అధిక మద్యపానం నోటి, గొంతు, అన్నవాహిక తదితర కేన్సర్లకు కారకాలు అనేది గుర్తించాలి. నోటి ఆరోగ్య సమస్యలకు వైద్యుల ద్వారా తగిన చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు.అయితే కెన్వ్యూ వాదనలను లిస్టరిన్ యజమాన్యం తిరస్కరించింది.మౌత్ వాష్లో ఏముంటుంది?సాధారణంగా మౌత్వాష్లలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఉంటుంది. ఇలాంటి వాటిని నిత్యం వాడటం వల్ల నోటి లోపలి చర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు వస్తాయి. ఇది నోటి కేన్సర్ ముప్పును కూడా పెంచుతుంది. -
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఆర్థిక వృద్ధి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడిన టెక్నాలజీతోనే ఆర్థిక వృద్ధి సాధ్యం. ఇది అత్యధిక మంది భారతీయులు నమ్ముతున్న మాట. సాంప్రదాయకంగా ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న జనాభాను ఏకీకృతం చేయడంలో 89 శాతం మంది భారతీయులు సాంకేతికతను కీలక అంశంగా భావిస్తున్నారని హెచ్పీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ సగటు 76 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇది సాంకేతికత పరివర్తన శక్తిపై భారత్ బలమైన నమ్మకాన్ని నొక్కిచెబుతోందని హెచ్పీ ఒక ప్రకటనలో తెలిపింది.పర్యావరణ, సామాజిక లక్ష్యాల దిశగా తన పురోగతిని తెలియజేస్తూ హెచ్పీ తన సుస్థిర ప్రభావ నివేదిక 2023తో పాటు ఈ ఫలితాలను ఆవిష్కరించింది. టెక్నాలజీ అందుబాటును పెంచడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి సానుకూల సామాజిక ప్రభావం కోసం కృత్రిమ మేధను ఉపయోగించడానికి హెచ్పీ చేస్తున్న ప్రయత్నాలను నివేదికలో వివరించింది. ఈ అంశంపై స్వతంత్ర పరిశోధనలు జరిపేందుకు హెచ్పీ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ను నియమించింది. 2023 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు నిర్వహించిన ఈ సర్వేలో అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, యూకే, జర్మనీ, జపాన్, చైనా, మెక్సికో, బ్రెజిల్, కెనడా వంటి 10 దేశాలకు చెందిన 1,036 మంది బిజినెస్ లీడర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.భారత్లో ఉచిత ఏఐ శిక్షణ ఇవ్వనున్న హెచ్పీతన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా తన డిజిటల్ బిజినెస్ స్కిల్స్ ‘హెచ్పీ లైఫ్’ ప్రోగ్రామ్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉచిత కృత్రిమ మేధ శిక్షణను మిళితం చేయాలని హెచ్పీ యోచిస్తోంది. వర్క్, సృజనాత్మక ప్రక్రియలను పెంచడానికి హెచ్పీ భారత్లో నెక్ట్స్ జనరేషన్ ఏఐ పీసీలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.అదనంగా 2030 నాటికి హెచ్పీ లైఫ్ ఉచిత నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమంలో 27.5 లక్షల మంది వినియోగదారులను నమోదు చేయాలనే తన లక్ష్యాన్ని హెచ్పీ విస్తరిస్తోంది. ఈ కార్యక్రమాన్ని హెచ్పీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2016 నుంచి ఇప్పటికే 12 లక్షల మంది యూజర్లు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా భారత్ అత్యధికంగా కొత్త యూజర్లను కలిగి ఉంది.టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండాలని హెచ్పీ గ్లోబల్ హెడ్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్, హెచ్పీ ఫౌండేషన్ డైరెక్టర్ మిషెల్ మాలెజ్కీ సూచించారు. డిజిటల్ ఎకానమీలో వృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలను యాక్సెస్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. "పురోగతిని నడిపించడానికి సాంకేతికత ఒక గొప్ప శక్తివంతమైన సాధనం" అని మాలెజ్కీ పేర్కొన్నారు. -
కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?
చక్కగా కూర్చొని ఆహారం తింటుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడూ ఈ ఉరుకులు పరుగులు జీవన విధానంలో చాలామంది నిలబడి గబగబ తినేసి భోజనం కానిచ్చాం అన్నట్లుగా తింటున్నారు. అంతెందుకు పెళ్లిళ్లలో కూడా బఫే పేరుతో నిలబడి తినడమే. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లలోనూ ఇదే తీరు. ఇంతకీ ఇలా తినడం మంచిదేనా? అంటే..ముమ్మాటికి కాదనే చెబుతున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయమై పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.నిలబడి తింటే..నిలబడి తినడం వల్ల వేగంగా జీర్ణమయ్యి, కొవ్వు తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఇది ఒక్కోసారి పొట్ట ఉబ్బరాన్ని కలిగించి ఆకలిని పెంచుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఇటీవల చాలామంది టైం ఆదా అవుతుందనే ఉద్దేశ్యంతో నిలబడి ఏదో కానిచ్చాం అన్నట్లు భోజనం చేస్తుంటారు. ఇది జీర్ణక్రియకు హానికరం అని, అతిగా తినేందుకు దారితీస్తుందని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. గురత్వాకర్షణ కారణం కడుపులోని ఆహరం వేగంగా ప్రేగుల్లో కదులి, త్వరగా జీర్ణమయ్యిపోతుంది. ఫలితంగా అతి ఆకలికి దారితీస్తుందని తెలిపారు.చాలామంది నిలబడి తినడం వల్ల బరువు తగొచ్చని భావిస్తుంటారు. కానీ దీని వల్ల బరువు తగ్గడం అటుంచి శరీరానికి అవసరమయ్యే కొవ్వుల, నష్టం, పోషకాల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ఇలా నిలబడి తింటే ఆహారం టేస్టీగా అనిపించదట. అదీగాక వాళ్లు కూడా ఆటోమేటిగ్గా రచి తక్కువ ఉన్న ఆహారపదార్థాలను ఇష్టపడతారని చెబుతున్నారు. ఎందుకంటే నిలబడి తింటున్నప్పుడూ నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ముడుచుకుపోతాయని తెలిపారు. ఇందుకోసం సుమారు 30 మంది వ్యక్తులను తీసుకుని అధ్యయనం చేయగా నిలబడి తిన్న వాళ్లలో బరువు కోల్పోడమే గాక టేస్టీగా ఉన్న ఆహారాన్ని తినకపోవడాన్ని గుర్తించామని చెప్పారు. కూర్చొని తినడం..మీరు తినేటప్పుడు అనుసరించే భంగిమ మీ ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఒక వ్యక్తి కూర్చొన్నప్పుడు కడుపులోని ఆహారం నెమ్మదిగా ఖాళీ అవుతుందని అన్నారు. నిలబడి భోజనం చేసిన దానికంటే నెమ్మదిగా జీర్ణం అవుతుందని అన్నారు. అలాగే శరీరం ప్రోటీన్లు గ్రహించేలా మంచిగా జీర్ణం అవుతుంది. అంతేగాక రక్తానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాల లభ్యత కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఇక కూర్చొని తినడం వల్ల టేస్టీగా ఉన్న ఆహారాన్నే తీసుకుంటారు. పైగా నిలబడి తిన్నప్పటి కంటే కూర్చొని భోజనం చేసినప్పుడూ ఆహారం టేస్టీగా అనిపిస్తుందట కూడా. తక్కువ ఆకలి ఉంటుంది. నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు పరిశోధుకులు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందిలో.. కూర్చొన తిన్న వారిలో జీర్ణ సంబధ సమస్యలు లేకపోవడమే గాక బరువు అదుపులో ఉన్నట్లు తెలిపారు. పైగా నిలబడిన వారితో పోలిస్తే టేస్టీగా ఉండే భోజనాన్నే ఇష్టపడినట్లు గుర్తించామని అన్నారు. ఏదీ బెటర్ అంటే..కూర్చొని తినే భంగిమే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. కూర్చొవడం అంటే..డైనింగ్ టేబుల్స్ మీద కాదు. నేల మీద నిటారుగా కూర్చొని భోజనం చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే గూని లేకుండా నిటారుగా కూర్చొని తినడం వల్ల కడుపులోంచి ఆహరం ప్రేగుల్లోకి నెట్టడానికి అనుమతిస్తుంది. అలాగే ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం తగ్గుతుందని చెప్పారు. నిజానికి ఇది భారతీయ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న భోజన సాంప్రదాయం కూడా ఇదే.ఇక నిలబడినప్పుడు త్వరితగతిన ఆహారం విచ్ఛిన్న అయ్యి కాలక్రమేణ కొవ్వులు నష్టానికి దారితీస్తుందని పరిశోధనలో తేలిందన్నారు పరిశోధకులు. అలాగే టేస్టీగా తినాలనుకుంటే కూర్చొని హాయిగా భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడం మంచిదని వెల్లడించారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల బృందం. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ కంజ్యూమర్ రీసెర్చ్లో ప్రచురితమయ్యింది.(చదవండి: నటి విద్యాబాలన్ ఫాలో అయ్యే "నో రా డైట్" అంటే..!) -
అమ్మాయిల్లో తొలి పీరియడ్స్ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం
సాధారణంగా ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, తదితర కారణాల రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్ ఓపెన్లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్కనిపించగా, 2000- 2005 మధ్య జన్మించిన 56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో పోస్ట్డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్ తెలిపారు. -
ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?
ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయి అని పూర్వం అనుకునేవారు. డబ్బుతో వైద్యం కొనవచ్చునని, కావాల్సిన ఆహార పదార్థాలు తెప్పించుకు తినగలరని తద్వారా ఎలాంటి వ్యాధినైనా వారు తట్టుకోగలరని అంచనా. అలాగే కొన్ని రకాల వ్యాధులు వారికి మాత్రమే వస్తాయన్న అపోహ కూడా ఉండేది. కానీ ఇప్పుడూ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో అదే నిజమని తేలింది. ముఖ్యంగా ప్రాణంతక వ్యాధి అయిన కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎవరికి అధికమో సవివరంగా వెల్లడించారు పరిశోధకులు. అవేంటో చూద్దామా..!ఫిన్లాండ్లోని హెల్సింకీ విశ్వవిద్యాలయం నిర్వంహించిన సరికొత్త అధ్యయనం ప్రకారం... మనకొచ్చే వ్యాధులకూ, సామాజిక, ఆర్థిక పరిస్థితికీ మధ్య సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా కేన్సర్ విషయంలో. ఈ ప్రాణాంతక వ్యాధి పేదల కంటే సంపన్నులకు వచ్చే అవకాశాలు ఎక్కువని వీరు తేల్చారు. ముఖ్యంగా ధనవంతులలో రొమ్ము, ప్రొస్టేట్, వంటి ఇతర రకాల కేన్సర్ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది. తక్కువ సంపాదన కలవారు డిప్రెషన్కి గురై ఆల్కహాల్కి బానిసవ్వడంతో ఊపిరితిత్తుల కేన్సర్ తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్ల వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ ఆదాయాలు ఆర్జించే సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రోమ్ము కేన్సర్కి సంబంధించిన జన్యు ప్రమాదం గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళలు కంటే వీరే అధికంగా ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందని పరిశోధన పేర్కొంది. అందుకోసం శాస్త్రవేత్తల బృందం సుమారు 80 ఏళ్ల వయసుగల దాదాపు రెండు లక్షలకు పైగా ఫిన్లాండ్ పౌరుల ఆరోగ్య డేటాని సేకరించారు. దానిలో వారి సామాజిక పరిస్థితితో లింక్అప్ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్ చేశారు. అయితే ఇలా వ్యాధుల వచ్చే ప్రమాదం జెండర్ పరంగా చూస్తే ఆడ, మగలో మద్య చాలా తేడా ఉందని, ఇది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ హగెన్ బీక్ చెప్పారు. ఇక్కడ వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇక్కడ ఒక వ్యక్తిలో జన్యు సమాచారం అనేది జీవితకాలంలో మారదు. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారినప్పుడూ వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యుప్రభావం మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక నిర్థిష్ట వృత్తితో లింక్ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి వివిధ పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!) -
చల్లని రేయే వేడెక్కెనులే!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా చల్లని రాత్రులు కరువవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దేశంలోని 140కి పైగా భారత నగరాల్లో 60 శాతానికి పైగా రాత్రులు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు భువనేశ్వర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బృందం జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. నేచర్ సిటీస్ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. రాత్రిళ్లు పెరుగుతున్న వేడిమి వర్షపాతం, కాలుష్యంతో సహా వాతావరణంలోని ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అహ్మదాబాద్, జైపూర్, రాజ్కోట్ నగరాలు తీవ్ర పట్టణ ప్రభావ రాత్రులను అనుభవిస్తున్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, పూణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా వేడి రాత్రుల తాకిడి బాగానే ఉంది. అర్బన్ హీట్ ఐలాండ్కు పట్టణీకరణే కారణం అర్బన్ హీట్ ఐలాండ్కు విపరీతమైన పట్టణీకరణే ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణాల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు గుర్తించారు. పట్టణీకరణలో భాగంగా కాంక్రీటు, తారు (రోడ్లు, పేవ్మెంట్లను నిర్మాణాలతో) ఉపరితలాలు పగటిపూట వేడిని గ్రహించి నిల్వ చేసి, సాయంత్రం ఆ వేడిమిని తిరిగి బయటకు విడుదల చేస్తాయి. తద్వారా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. గత రెండు దశాబ్దాలుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడానికి పట్టణీకరణ, స్థానిక వాతావరణ మార్పు ఎంతవరకు దోహదపడిందో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిచారు. 37.73 శాతం పట్టణీకరణ జరిగితే దశాబ్దానికి సగటున 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వాయువ్య, ఈశాన్య భారతంలోనే.. దేశంలోని వాయువ్య, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లోని నగరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలలో ఎక్కువ పెరుగుదల కనిపించింది. వేగవంతమైన అభివృద్ధి, పట్టణాల విస్తరణ వేగంగా జరుగుతున్న తూర్పు, మధ్య భారతీయ నగరాల్లో కూడా రాత్రిపూట వేడి పెరుగుతోందని తేల్చారు. రాత్రి ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి సగటున 0.53 డిగ్రీలు పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతల పెరుగుదల నగరాలకే పరిమితం కాలేదు.. దేశవ్యాప్తంగా ప్రతి దశాబ్దానికి సగటున 0.26 డిగ్రీలు పెరుగుతున్నట్లు గుర్తించారు. అంటే దేశం మొత్తం వేడెక్కుతున్న రేటు కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో నగరాలు వేడెక్కుతున్నాయని నివేదిక సూచిస్తోంది. 2050 నాటికి పట్టణాల్లో 80 కోట్ల మందిపెరిగిన మానవ కార్యకలాపాలు, వాహన ఉద్గారాలు, పారిశ్రామిక ఉత్పత్తి అధిక స్థాయిలో గ్రీన్హౌస్ వాయువులకు దోహదం చేస్తున్నాయి. ఇవి పట్టణాల్లో పగటితో పాటు రాత్రిళ్లు వేడిమిని మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే 2050 నాటికి దేశ జనాభాలో పట్టణ జనాభా 68 శాతానికి చేరుతుందని అధ్యయనం పేర్కొనడం మరింత ఆందోళన కలిగించే అంశం. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) ఇండియా రాస్ సెంటర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు 2050 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని అంచనా. ప్రస్తుతం దేశ జనాభాలో 36 శాతం అంటే దాదాపు 40 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటే.. ఇది 2050 నాటికి 80 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇది రాత్రి వేడిమి మరింత పెరగడానికి దోహదం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లోనూ పచ్చదనం పెంపు ద్వారా పగటి వేడిని నిరోధించవచ్చని, రాత్రిపూట వేడిని నిరోధించడానికి ఈ విధానం పనికిరాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పట్టణాల్లో ఎక్కడ చూసినా భారీ భవంతులు, తారు, సిమెంట్ రోడ్లతో కాంక్రీట్ జంగిల్గా మారిపోవడం, చెరువులు కనుమరుగు కావడంతో రాత్రిపూట నగరాలు అస్సలు చల్లబడట్లేదని న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక సైతం వెల్లడించడం గమనార్హం. -
చైనా ల్యాబ్లో మరో ప్రాణాంతక వైరస్?
చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోని మరో కొత్త వైరస్ను సృష్టించారు. ఎబోలా మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మనిషిని కేవలం మూడు రోజుల్లోనే చంపేస్తుంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే శాస్త్రవేత్తులు ఈ వైరస్ సృష్టించారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ ప్రయోజనాలు, ప్రమాదాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ వైరస్ స్వభావం సింథటిక్ అని తెలుస్తోంది. ఈ అధ్యయన నివేదిక సైన్స్ డైరెక్ట్లో ప్రచురితమయ్యింది.ఎబోలా వైరస్ను ఉపయోగించి సృష్టించిన ఈ కొత్త వైరస్పై సాగిస్తున్న పరిశోధన వివాదాస్పదంగా మారింది. అయితే ఈ పరిశోధన ఉద్దేశ్యం వివిధ వ్యాధులను నివారించడం, లక్షణాలను పరిశోధించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ మనిషి శరీరంపై ఎబోలా లాంటి ప్రభావాన్నే చూపుతుంది. పరిశోధకుల బృందం ఎబోలా వైరస్ నుండి గ్లైకోప్రొటీన్ (జీపీ)ని స్వీకరించేందుకు వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ (వీఎస్వీ)ని ఉపయోగించింది.ఈ వైరస్ను శాస్త్రవేత్తలు సిరియన్ హామ్స్టర్స్ (జంతు జాతులు) సమూహంపై పరీక్షించారు. వీటిలో ఐదు మగ, ఐదు ఆడ జాతులున్నాయి. ఈ జంతువులకు ఈ వైరస్ను ఇంజెక్ట్ చేయగా, వాటిలో ఎబోలా లాంటి లక్షణాలు కనిపించాయి. మూడు రోజుల్లో అవన్నీ మృతి చెందాయి. ఈ వైరస్ ఇంజక్ట్ చేయగానే కొన్ని జంతువుల కళ్లు దెబ్బతిన్నాయి. ఆప్టిక్ నరాలలోపై తీవ్రమైన ప్రభావం కనిపించింది. కాగా 2014- 2016 మధ్య కాలంలో ఆఫ్రికన్ దేశాలలో ఎబోలా వ్యాప్తి చెందింది. దీనివల్ల వేలాది మంది మృత్యువాత పడ్డారు. Scientists in China have engineered a virus using parts of the deadly Ebola to study the disease and its symptoms. A study detailing the experiment at Hebei Medical University has been published in Science Direct. Researchers noted...#China #ChinaSciencehttps://t.co/VoHWxriE2a— chinaspotlight (@chinaspotlight1) May 25, 2024 -
సైక్లింగ్తో మెకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ప్రమాదాలకు చెక్!
ఆర్థరైటిస్ అనేది కీళ్ళను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల పుండ్లు పడడం, కీళ్ళు గట్టిగా మారడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్లో 100 కంటే ఎక్కువ స్టేజెస్ ఉంటాయి. ప్రతిది కూడా వేర్వేరు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది పిల్లలు, యువకులనూ కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి సమస్యలకు సైక్లింగ్ చెక్ పెడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అసలు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ సైక్లింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందనేది ఈ పరిశోధనలో సవివరంగా తెలిపింది. శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో జీవితంలో కనీసం ఒక్కసారైన సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారికి మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం 17% తక్కువగా ఉందని, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం 21% తక్కువగా ఉందని వెల్లడయ్యింది. అందుకోసం 60 ఏళ్ల లోపు సుమారు రెండు వేలకు పైగా వ్యక్తుల డేటాను విశ్లేషించి మరీ పేర్కొంది. ఈ పరిశక్షధన మెడిసిన్ అండ్ సైన్స్లో ప్రచురితమయ్యింది. స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్లో ఆరుబయట చేసే సైక్లింగ్ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను నివారిస్తుందని గుర్తించారు శాస్త్రవేత్తలు. తమ పరిశోధనల ఆధారంగా జీవితాకాలంలో సైకిల్ తొక్కడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడం తోపాటు మెరుగైన మోకాలి ఆరోగ్యం ఉంటుందని, పైగా ఈ ప్రమాదం బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని రుమాటాలజీ చీప్ డాక్టర్ గ్రేస్ అన్నారు. అంతేగాదు ఎక్కువ సమయం సైకిల్పై గడిపితే అతడు లేదా ఆమెకు మోకాళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. అలాగే 12 నుంచి 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారి డేటాను ట్రాక్ చేయగా వారిలో సగానికిపైగా మంది సైక్లింగ్ని తమ రోజువారి వ్యాయమంలో భాగం చేసినట్లు తెలిపారు. వారందరిలో క్వాడ్రిస్ప్లు బోలపేతమయ్యాయని అన్నారు. వారంతా సైక్లింగ్ని మానేసిన తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగిందన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే లాభాలు..రన్నింగ్ లేదా జంపింగ్ వంటి అధిక ప్రభావ వ్యాయామాలతో పోలిస్తే సైక్లింగ్ అనేది ప్రభావ చర్య కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలగజేస్తుంది. మోగాలి గాయాల ప్రమాదాన్ని తగ్గిండానికి, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.మోకాళ్ల చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా క్వాడ్రిస్ప్స్, హామ్ స్ట్రింగ్స, కండరాలు బలంగా ఉన్నప్పుడు, మోకాలి కీలుకు మెరుగైన మద్దతునిచ్చి, తద్వారా గాయలయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.క్రమం తప్పకుండా సైకిల్ నడుపుతున్నప్పుడు కదలికల పరిధిని నిర్వహించడానికి, మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పెడలింగ్ సైనోవియల్ ద్రవం ప్రవాహంలో సహాయపడుతుంది. ఇది కీళ్ల సరళతకు తోడ్పడుతుంది.అలాగే బరువు నిర్వహణలో సహాయపడుతుంది. శరీరంలోని కేలరీలను బర్న్ చేయడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సైక్లింగ్ మంచి మార్గం. అధిక బరువు మోకాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల, సైక్లింగ్ ద్వారా మీ బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, మోకాలి సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.(చదవండి: ఆ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే బరువు తగ్గుతారు! పోషాకాహార నిపుణులు) -
టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
సాక్షి, అమరావతి: సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం.. రాత్రి 8 గంటలకు చివరి భోజనం తీసుకోవడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఫ్రాన్స్లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ అధ్యయనంలో భోజన సమయాలకు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలకు మధ్య గుట్టును నిర్ధారించింది.ముఖ్యంగా కార్డియోవాసు్కలర్ డిసీజెస్ (సీవీడీ)లో భాగంగా కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాసు్కలర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రమాదాలను అరికట్టడానికి క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మేలైన మార్గమని సూచిస్తోంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించిన ఈ ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసంతో ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపు.. శరీరంలోని వివిధ అవయవాల సిర్కాడియన్ లయలను సరి చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణ వంటి కార్డియోమెటబాలిక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ శరీరంలోని అంతర్గత గడియారంగా పని చేస్తుంది. లేటుగా తింటే చేటే.. అల్పాహారం దాటవేయడం, రోజులో మొదటి ఆహారాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు తినేవారి కంటే 9 గంటలకు అల్పాహారం చేసే వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 6 శాతం ఎక్కువ. ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బదులు 9 గంటలకు తినడం వల్ల ముఖ్యంగా మహిళల్లో పోలిస్తే స్ట్రోక్ వంటి సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. రాత్రిపూట ఎక్కువ సేపు ఉపవాస సమయం ఉంటే సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని, ఉదయం ప్రారంభ భోజనం మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీని, ఇన్ఫ్లమేషన్ను నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం ద్వారా కాలక్రమేణా హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. భోజనం చేసే సమయం నిద్ర నాణ్యతను కూడా ప్రభావతం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. ఐదో వంతు భారత్లోనే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1.80 కోట్ల మరణాలు నమోదైతే.. ఇందులో ఐదో వంతు భారత్ నుంచే ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ యువతలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనంలోనూ భారత్లో ఒక లక్ష జనాభాకు 272 మంది హృదయ సంబంధ మరణాలు రేటు ఉంది. ఇది ప్రపంచ సగటు 235 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
పాకిస్థాన్కు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన వ్లాగర్గా పాపులర్ అయిన మహమ్మద్ షిరాజ్ తన ఫ్యాన్స్కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 1.57 మిలియన్లకుపైగా ఫాలోయర్స్ని సొంతం చేసుకున్న షిరాజ్ ఇదే నా చివరి వ్లాగ్ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్గా మారింది.మొహమ్మద్ షిరాజ్, తన యూట్యూబ్ అనుచరులకు భావోద్వేగ వీడ్కోలు పలికాడు."మేన్ ఆజ్ సే వ్లాగ్ నహీ బనౌంగా. మేరే అబ్బు నే బోలా హై ఆప్ కుచ్ దిన్ పధై కరో ఔర్ వీడియో నహీ బనావో (నేను ఇకపై వ్లాగ్లు చేయను. మా నాన్న నన్ను చదువుకోవాలని, ప్రస్తుతానికి వీడియోలు చేయవద్దని అడిగారు)" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. "లేకిన్, ముఝే వ్లోగ్ బనానే కా బోహత్ షౌఖ్ హై. ఇస్లీయే, ఆజ్ మేరా ఆఖ్రీ వ్లాగ్ హై. మైన్ క్యా కరూం(కానీ నాకు వ్లాగ్లు చేయడం చాలా ఇష్టం. కానీ, ఇదే నా చివరి వ్లాగ్. నేను ఏమి చేయాలి?)" అని షిరాజ్ తన వీడియోలో తెలిపారు.అలాగే అభిమానులందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు వ్లాగ్స్ చేయడానికి తనను అనుమతించమని తన తండ్రిని అభ్యర్థించమని కూడా అభిమానులను కోరాడు. ఈ వీడియో ఆరు లక్షలకుపై వ్యూస్ సాధించింది.కమెంట్ల రూపంలో తమ ప్రేమను అభిమానాన్ని ప్రకటించారు. ‘‘నీ భవిష్యత్తు కోసం నీ తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నారు, అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు రాశారు. "అయ్యో నిన్ను మిస్ అవుతాను" అని మరొకరు వ్యక్తం చేశారు. చదువు చాలా ముఖ్యం చిన్నా అని ఒకరు, కష్టపడి చదువుకో, మరోవైపు వ్లాగ్లు కూడా చేయి మొరకరు కమెంట్ చేశారు. చాలామంది"మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని కమెంట్ చేశారు.కాగా పాక్లోని ఖప్లు అనే నగరానికి చెందిన షిరాజ్ తన రోజు వారీ దినచర్యతోపాటు, తన చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను, మంచు పర్వతాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పేరు సంపాదించాడు. -
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ నిజంగానే మంచివి కావా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
ప్యాకేజ్డ్ ఫుడ్స్, కొన్ని రకాల ప్రిజర్వేటెడ్ డ్రింక్స్ తింటే మంచిదికాదని విన్నాం. వాటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడం జరిగిది. అయితే శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో అదే నిజమని ధృవీకరించారు. అందుకోసం సుమారు 30 ఏళ్లు జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..బాగా ప్రాసెస్ చేసిన పిండులు(మైదా వంటివి)తో తయారు చేసే స్నాక్స్లు, డ్రింక్లు తీసుకుంటే ఆయుర్ధాయం తగ్గి, అకాల మరణాలు సంభవిస్తాయని వెల్లడయ్యింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయినా..ఆలు చిప్స్, బర్గర్, బేకరి పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. వీటిలో శరీరానికి అవసరమయ్యే ఫైబర్, విటమిన్లు లేకపోవడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు. వీటిని ఎక్కువుగా తీసుకుంటే మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో వెల్లడయ్యింది. అందుకోసం తాము 1984 నుంచి 2018 మధ్య సుమారు 11 యూఎస్ రాష్ట్రాల నుంచి70 వేల మంది మహిళా నర్సుల దీర్ఘాకాలిక ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయని చెప్పారు. బాగా శద్ధి చేసిన పిండులతో చేసిన బేకరి పదార్థాలను రోజుకు ఏడుసార్లకు పైగా తీసుకున్న వారిలో అకాల మరణాల ప్రమాదం 4% అని, ఇతర కారణాల వల్ల 9% అని వెల్లడించారు. వీటిని తీసుకోవడం వల్ల ముఖ్యంగా కేంద్ర నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో మరణాలు సంభవించే ప్రమాదం 8%కి పైగా ఉందని చెప్పుకొచ్చారు పరిశోధకులు.ఇక మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్ ఆధారిత ఉత్పత్తుల వల్ల కూడా అకాల మరణం సంభవించే ప్రమాదం ఎక్కువేనని చెప్పారు. ఇది పరిశీలనాత్మక అధ్యయనమే అయినప్పటికీ..ఇది ఎంతవరకు నిజం అనేందుకు కచ్చితమైన నిర్థారణలు లేవు. అయితే దీర్ఘకాలిక ఆరోగ్య కోసం శుద్ధి చేసిన పిండులతో చేసే పదార్థాల వినియోగాన్ని పరిమితం చేయాలనే విషయాన్ని మాత్రం అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో పాసెస్డ్ ఫుడ్స్ వినియోగంపై మరిన్ని పరిశోధనలు చేసి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు పరిశోధకులు. (చదవండి: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
వంట చేయడం వల్ల వచ్చే పొగ నుంచి గాలి కాలుష్యమవుతుంది. ఇటీవల కార్లలో వాసన చూస్తే కేన్సర్ వస్తుందని పలు నివేదికలు హల్ చల్ చేశాయి. తాజాగా మరో అధ్యయనం దిగ్భ్రాంతి రేపుతోంది. అదేంటో తెలియాలంటే మీరీ కథనం చదవాల్సిందే!పప్పు పోపు, పులిహోర తాలింపు, చికెన్, మటన్ మసాలా ఘుమ ఘుమలు లాంటివి రాగానే గాలి ఒకసారి అలా గట్టిగాపైకి ఎగ పీల్చి.. భలే వాసన అంటాం కదా. కానీ ఇలా వంట చేసేటపుడు వచ్చే వాసన గాలిని కలుషితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో తినుబండారాలను కలిగి ఉన్న లాస్ వెగాస్లో గాలి నాణ్యత సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) చేసిన ఈ పరిశోధనలో రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు , వీధి వ్యాపారుల వద్ద వంట చేసే రుచికరమైన వాసన గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కనుగొంది. పట్టణ వాయు కాలుష్యం ప్రభావంపై కెమికల్ సైన్సెస్ లాబొరేటరీ (CSL) పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను విడుదల చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్ ,కొలరాడోలోని బౌల్డర్ మూడు నగరాలపై దృష్టి సారించారు. ఈ నగరాల్లో వంటకు సంబంధించిన మానవ-కారణమైన అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCలు) కొలుస్తారు. మీకు వాసన వచ్చిందంటే, అది గాలి నాణ్యతను ప్రభావితం చేసే మంచి అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.వెగాస్ బహిరంగ గాలిలో ఉన్న మొత్తం కర్బన సమ్మేళనాల్లో 21 శాతం వంటలనుంచి వచ్చినవేనని అధ్యయన రచయిత మాట్ కాగన్ చెప్పారు. వాహనాలు, అడవి మంటల పొగ, వ్యవసాయం, వినియోగదారు ఉత్పత్తులు వంటి విభిన్న వనరుల ఉద్గారాలను పరిశోధకులు అంచనా వేశారు. పట్టణాల్లో వీటిని లాంగ్-చైన్ ఆల్డిహైడ్లు అని పిలుస్తామని వెల్లడించారు. అయితే వంట చేయడం వల్ల వచ్చే వాయు కాలుష్యం చాలా తక్కవే అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్గారాలకు వంట వాసన కారణమవుతుందని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాదు ఇంటి లోపల ,ఇళ్ల లోపల సమస్య మరింత తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరించారు. -
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
చాలామంది కార్లను భలే మెయింటెయిన్ చేస్తారు. కొందరు లగ్జరీ కార్లను ఎంచుకుంటే..మరికొందరూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కార్లను ఇష్టపడతారు. అయితే కొంతమంది పెద్ద సౌండ్లు వచ్చే కార్లను ఇష్టపడతారు. వాళ్లకు తమ ఇంజిన్ల నుంచి వచ్చే సౌండ్లు అదిరిపడేలా ఉంటేనే వారికి మంచి కిక్ అన్న ఫీల్లో ఉంటారు. అయితే తాజా అధ్యయనంలో పెద్ద శబ్దాలు వచ్చే కార్లను ఇష్టపడే వారిలో ఆ టైపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయిని వెల్లడయ్యింది. అంతేగాదు దీని గురించి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.కారు ఇంజిన్ల శబ్దం ఎక్కువగా ఇష్టపడే వారి జీవన విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. తమ కారు శబ్దమే అధికంగా ఉండాలనుకుని మార్పులు కూడా చేసుకుంటారట కొందరు. అలాంటి వారిలో అధిక స్థాయిలో శాడిజం, సైకో మనస్తత్వం ఎక్కుగవగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మేరకు కెనడాలోని వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త జూలీ ఐట్కెమ్ షెర్మెర్ నేతృత్వంలోని బృందం దీనిపై అధ్యయనం చేయగా..బిగ్గరగా శబ్దం వచ్చే కార్లను ఇష్టపడే వారి మనస్తత్వం చాలా వైరైటీగా ఉంటుందని తేలింది. అందుకోసం దాదాపు 500 మందికి పైగా వ్యక్తలపై అధ్యయనం నిర్వహించారు. మనుషులకు, జంతువులకు ఇబ్బంది కలిగించే పరిధిలో శబ్బాలను ఇష్టపడేవారిలో మనసు చాలా భయనకంగా ఉంటుందట. ఈ పరిశోధన పాల్గొన్న వారిలో దాదాపు 52% మంది పురుషులకు బిగ్గరగా శబ్దం వచ్చే కార్లకు ప్రాధాన్యత ఇచ్చారట. వారిలో ఇతరుల భావలకు విలువ ఇవ్వని నిర్లక్ష్య పూరిత మనస్తత్వం క్లియర్గా కనిపించిందట. ప్రజలు ఆ శబ్దాలను చూసి ఇబ్బందిపడుతుంటే..వారు ఆనందిస్తూ కిక్గా ఫీలవ్వుతారట. వారిలో ఇలాంటి సైకోపతి, శాడిజం లక్షణాలు ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. పరిశోధకులు జరిపిన ఈ పరిశోధనను 'ఎ డిజైర్ ఫర్ ఎ లౌడ్ కార్ విత్ మోడిఫైడ్ మఫ్లర్ ఈజ్ ప్రిడిక్డ్ బై ఏ మ్యాన్ అండ్ హైయర్ స్కోర్ ఆన్ సైకోపతి అండ్ శాడిజం' అనే పేరుతో అంతర్జాతీయ జర్నల్ కరెంట్ ఇష్యూస్ ఇన్ పర్సనాలిటీ సైకాలజీలో ప్రచురితమయ్యింది కూడా.(చదవండి: ఉంగరంతో ఆరోగ్యం పదిలం!) -
మరి ఆ రోజుల్లో... అలా.. మేడమీద చదువులు
రాత్రి భోజనాల తరువాత మా చదువు మొదలయ్యేది. అప్పుడప్పుడూ ఆదివారాలు మధ్యాహ్నాలు కూడా. మధ్యాహ్నాలు పర్లేదు వెలుతురయ్య ఎల్లడై ఉన్న సమయం అది. రాత్రి సమయపు లెక్కలు వేరు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో అనవసరమైనది, అవసరానికి మించినదీ ఏది ఉండేది కాదు. రాత్రి చదువుకు వెలుతురు కావాలి అంటే దానికి బల్బు కావాలి, కరెంటు లాగడానికి వైర్ కావాలి, బల్బ్కు హోల్డర్ కావాలి, వైరుకు ప్లగ్గు కావాలి, ఒక స్విచ్చు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి. ఉన్న నలుగురైదుగురం తలా ఇంత అని వేసుకుని అవన్నీ కొనుక్కుని తెచ్చుకుని బిగించుకుని చదువుకు సిద్దం అయ్యేవాళ్ళం. పుల్లయ్యగాడు వాడి వాటాకు డబ్బులు కాక ఇంటినుండి కరెంటు గుంజి తెచ్చేవాడు. బల్బు వెలిగేదిఆ విధంగా కాంచిపురముననొకడు కాంచనగుప్తుడను వైశ్యుడి దగ్గరి నుండి, వాటర్లూ యుద్దాలు, చిరపుంజిలో వర్షపాతము, గర్జించే నలభైలు, తళ్ళికోట చరిత్ర, గణిత సూత్రాలు, బీజీయ సమాసాలు, ఐ లే ఇన్ సారో డీప్ డిస్ట్రెస్స్డ్, మై గ్రీఫ్ ఏ ప్రౌడ్ మ్యాన్ హర్డ్, హిజ్ లుక్స్ వర్ కోల్డ్, హి గేవ్ మీ గోల్డ్… అనే శబ్ద పాండిత్యాన్ని బట్టీప్రవాహంలా ఒకళ్ళమీదికి ఒకళ్ళము ప్రవహింపజేసుకునేవాళ్ళము.ఉదయం ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీదకి చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు. మాకు అప్పటికి అంతగా తెలియని పరకాయ ప్రవేశవిద్య ఒకటి వారు సాధన చేస్తూ ఉండేవారు. దానివలన చదువు భంగం అయ్యేది. విశ్వామిత్రుడికీ దూర్వాసుడికీ కూడా ఎదురవ్వని అనుభవాలు మావిఅన్వర్, సాక్షి -
నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఇటీవలకాలంలో కొన్ని ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో క్యాడ్బరీ చాక్లెట్లు, బోర్నావిటా వంటి ప్రొడక్ట్స్పై ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో అధిక చక్కెర ఉందని ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తెలిపారు. అవి మరువక మునుపై తాజాగా ప్రముఖ బేబి బ్రాండ్ నెస్లేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రొడక్ట్స్పై జరిపిన అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందంటే..నెస్లే బ్రాండ్కి సబంధించిన శిశువుల ప్రొడక్ట్స్ సెరెలాక్లో అధిక చక్కెర కలుపుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఒక్కో స్పూన్లో దాదాపు మూడు గ్రాములు చక్కెర ఉన్నట్లు పరిధనలో గుర్తించారు. ఇది అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు పబ్లిక్ ఐ, అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్స్ అనే పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. దీని కారణంగా ఊబకాయం, దీర్థకాలిక వ్యాధులు తలెత్తుతాయిని తెలిపింది. ఈ ఉల్లంఘనలు కేవలం ఆసియా, ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ దేశాలలో మాత్రమే జరుగుతున్నట్లు గుర్తించింది. నెస్లే ద్వారా అమ్ముడవుతున్న రెండు రకాల బేబీ ఫుడ్ బ్రాండ్స్లలో అధిక స్థాయిలో చక్కెర ఉన్నట్లు పబ్లిక్ ఐ వెల్లడించింది. అయితే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెస్లే ఉత్పత్తుల్లో చక్కెర రహితం ఉన్నాయని పబ్లిక్ ఐ తెలిపింది. భారత్లో ఇదే బ్రాండ్ మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రొడక్ట్స్లో ఒక్కో సర్వింగ్లో సగటున దాదాపు మూడ గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే ఇథియోపియా, థాయ్లాండ్ వంటి దేశాల్లో ఇదే బ్రాండ్ ప్రొడక్ట్స్లో ఏకంగా ఆరు గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మరీ జర్మనీ, యూకేలో మాత్రం చక్కెర జోడించకుండా విక్రయించడ గమనార్హం. నిజానికి ఈ నెస్లే ప్యాకేజింగ్పై షోషకాహార సమాచారంలో ఈ జోడించిన చక్కెర గురించి సమాచరం లేనట్లు నివేదిక పేర్కొంది. ఇది కేవలం తన ఉత్పత్తులపై విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల గురించి ప్రముఖంగా హైలైట్ చేస్తుందని, పారదర్శకంగా లేదని నివేదిక వెల్లడించింది. నిపుణలు ఏం మంటున్నారంటే.. శిశువుల ఉత్పత్తుల్లో అధిక చక్కెర ప్రమాదకరమైనదని నిపుణలు చెబుతున్నారు. శివువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారంలో చక్కెర ఎక్కువగా జోడించకూడదు. వాళ్లు ఈ రుచికి అలవాటు పడి చక్కెరకు సంబంధించిన ఆహారాలను తినేందుకు ఇష్టపడటం జరుగుతుంది. దీంతో క్రమంగా పోషకాహార రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా కౌమర దశకు చేరుకోక మునుపే ఊబకాయం, మధుమేహం లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు వెల్లడించారు. అయితే పరిశోధన సంస్థపబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్లు నెస్లే కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా..గత ఐదేళ్లలో, నెస్లే ఇండియా ప్రపంచవ్యాప్తంగా శిశు తృణధాన్యాల పోర్ట్ఫోలియోలో (పాలు తృణధాన్యాల ఆధారిత కాంప్లిమెంటరీ ఫుడ్) వేరియంట్ను బట్టి 30% వరకు చక్కెరలను జోడించడం తగ్గించింది అని చెబుతుండటం విశేషం. (చదవండి: ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్ మ్యాగజైన్లో..!) -
ఫెయిర్నెస్ క్రీమ్ల వల్ల ఆ సమస్యలు ! పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఇటీవల కాలంలో ఎన్నో రకాల ఫెయిర్నెస్ క్రీమ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఉండే అడ్వర్టైస్మెంట్లు మహిళలను అట్రెక్ట్ చేసి మరీ కొనేలా చేస్తాయి ఈ ఫెయిర్నెస్ ప్రొడక్ట్లు. అయితే తాజా అధ్యయనంలో ఈ ఫెయిర్నెస్ వాడకం వల్ల ఆ సమస్యలు వస్తున్నాయంటూ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ప్రజల ఆరోగ్యానికి హానికరమైన వాటితో ఫెయిర్నెస్ క్రీమ్లు తయారు చేస్తారా? అని తయారీదారులపై ఫైర్ అవుతున్నారు. చర్మ సంరక్షణ ఎలా ఉన్నా.. ఆరోగ్యమే చెడి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఫెయిర్నెస్ క్రీమ్లు ఆరోగ్యానికి నిజంగానే హానికరమా? ఎందుకని? సవివరంగా తెలుసుకుందామా..! ఫెయిర్నెస్ క్రీమ్లంటే మహిళలకు, ముఖ్యంగా యువతకు ఎంత మక్కువ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్కి ఉన్నంత డిమాండ్ మరే వ్యాపారానికి ఉండదంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి ఈ ఫెయిర్నెస్ క్రీముల్లో మెర్క్యురీ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల మూత్రపిండాలకు సంబంధించిన మెంబ్రానస్ నెఫ్రోపతీ (ఎంఎన్) కేసులు భారత్లో ఎక్కువగా పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అందుకు సంబంధించిన విషయం కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యింది. ఈ పరిస్థితి కారణంగా మూత్రపిండాల్లో ఫిల్టరింగ్ వ్యవస్థ దెబ్బతిని ప్రోటీన్ లీకేజ్ కారణమవుతుందని చెబుతున్నారు. మూత్ర పిండాల వ్యాధి అనేది ముఖ్యంగా శరీరంలోని అంతర్గత రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడి మూత్రపిండాల రుగ్మతకు కారణమవుతుంది. దీని కారణంగా మూత్రంలో పోటీన్లు వెళ్లిపోవడం జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే.. మనం ముఖానికి రాసుకునే ఫెయిర్నెస్ క్రీమ్ మూత్ర పిండాలపై ఎలా ఎఫెక్ట్ చూపుతుందంటే..?. ఆ ఫెయిర్నెస్ క్రీమ్లో వాడే పాదరసం చర్మం ద్వారా లోపలికి వెళ్తుంది. అది నేరుగా మూత్రపిండాల ఫిల్టర్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసులు పెరుగుదలకు దారితీస్తుందని పరిశోధకులు డాక్టర్ సజీష్ శివదాస్ అన్నారు. అందులోనూ మార్కెట్లో వచ్చే ప్రతి ఫెయిర్నెస్ క్రీమ్ తక్షణమై ముఖం ఫెయిర్గా ఉండేలా చేసే ఫలితాల కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యిందని అన్నారు. అంతేగాదు జులై 2021 నుంచి 2023 మధ్య కాలంలో ఇలాంటి మూత్ర పిండాల రుగ్మతకు సంబంధించిన 22 కేసులపై అధ్యయనం నిర్వహించారు. ఆయా వ్యక్తులు తేలికపాటి ఎడెమా(వాపు), నురుగతో కూడిన మూత్రం తదితర లక్షణాలు కనిపించాయని అన్నారు. అంతేగాదు వారిలో చాలామందికి మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు పెరిగాయన్నారు. అలాగే ఒక రోగి మాత్ర మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా వచ్చినట్లు తెలిపారు. అలాగే వైద్యపరీక్షల్లో 22 కేసుల్లో 68% మంది అంటే 15 మందికి న్యూరల్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ప్రోటీన్(NELL-1) పాజిటివ్గా తేలింది. అంటే వారంతా మాత్రపిండాలకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారని పరిశోధనలో తేలిందన్నారు. అంతేగాదు ఆ 15 మందిలో దాదాపు 13 మంది ఈ లక్షణాలు కనిపించక మునుపే తాము ఫెయిర్నెస్ క్రీమ్లు వాడినట్లు అంగీకరించారు. మిగతా ఇద్దిరిలో ఒకరు సాంప్రదాయ స్వదేశీ క్రీములను వాడినట్లు తెలిపారు. మరోకరికి ఆ చరిత్ర కూడా లేదు. అయితే ఆయా రోగులు ఈ ఫెయిర్నస్ క్రీమ్లు వాడటం మానేసిన తర్వాత మూత్రిపిండాల వ్యాధి అదుపులో ఉన్నట్లు తేలింది. అంతేగాదు ఆయా ఫెయిర్నెస్ క్రీమ్ల ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తున్నాయి అనేందుకు ఈ తాజా పరిశోధనే ఉదహరణ అని తెలిపారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ ఉత్పత్తులను సమర్థించడం, పైగా ఇది బహుళ బిలియన్ డాలర్ల పరిశ్రమ కావడం వల్ల అధికారులెవరూ ఈ ఉత్పత్తులకు అడ్డకట్టవేసే సాహసం చేయడం లేదని ఆరోపించారు. ఇక్కడ కేవలం చర్మ సంరక్షణ, మూత్ర పిండాల సమస్య కాదు. ఇందులో ఉపయోగించే పాదరసం ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమైనదనేది గుర్తించడం తోపాటు ఈ హానికరమైన ఉత్పత్తులకు అడ్డుకట్టవేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!) -
ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? పరిశోధన ఏం చెబుతోందంటే.!.
హిమ క్రీములు..అదేనండి చలచల్లని ఐస్క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ ఇష్టమైనది ఈ ఐస్క్రీమ్. అయితే ఇది తింటే కొలస్ట్రాల్ వస్తుందన్న భయంతో తినడానికి భయపడుతుంటారు చాలామంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వాటి జోలికి వెళ్లను కూడా వెళ్లరు. ఇందులో చక్కెర కంటెంట్ ఎక్కు ఉంటుందని, అది కాస్త చెడు కొలస్ట్రాల్గా మారుతుందని రకరకాల భయాలు ఉన్నాయి. కానీ అదేమీ నిజం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా తాజా అధ్యయనంలో ఐస్క్రీమ్ ఏమీ ఆరోగ్యానికి అంత భయానక నష్టం చేయదని తేలింది కూడా. నిజంగానే ఆరోగ్యానికి ఐస్క్రీమ్ మంచిదా? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తదితరాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. ఐస్క్రీమ్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి మూడు విధాలుగా అధ్యయనం చేశారు హార్వర్డ్ డాక్టరల్ విద్యార్థులు. ఆ పరిశోధనలో ఐస్క్రీం ఆరోగ్యానికి హానికరం కాదని, మంచి ప్రయోజనాల ఉన్నాయని తెలింది. చెప్పాలంటే ఈ పరిశోధన ఫలితాలు ఐస్క్రీంలా చల్లటి తియ్యని వార్తని అందించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు ఐస్క్రీం తోపాటు ఇంకా ఏమీ తీసుకుంటున్నారో గమనించి మరీ విశ్లేషించింది. పాల కొవ్వులు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయా అనే దిశగా కూడా పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనంలో డైరీ కొవ్వుల కంటే మాంసం, శుద్ధి చేసిన పిండి పదార్ధాలతో కార్డియోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అంతేగాదు దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించింది. అవేంటంటే.. మెదడు అభివృద్ధికి రోజూ ఓ స్కూప్ ఐస్క్రీమ్ తీసుకోవడం వ్లల ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. అంతేకాకుండా దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ పరిశోధన తేల్చింది. ఐస్క్రీమ్ కాల్షియం, మెగ్నీషియం, బి12 విటమిన్లు, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ప్రోటీన్ను కలిగి ఉంటుందని తెలిపింది. పాలు, క్రీమ్ అనేవి ఐస్క్రీమ్లో ప్రధానంగా వినియోగిస్తారు. విటమిన్ ఎ, కోలిన్ను కలిగి ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు.. రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధికి తోడ్పడుతున్నాయి వెల్లడించింది. ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుస్తుంది ఐస్క్రీమ్లు న్యూట్రీషియన్ రిచ్ ఫుడ్గా చెప్తున్నారు. దీనిలో న్యూట్రిషియన్లు, కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ ఉంటాయని ఇవి పూర్తి ఆరోగ్యానికి మంచివని చెప్తున్నారు. మానసికంగా దీనివల్ల ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి మూడ్ని లిఫ్ట్ చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. సమ్మర్లో ఇవి శరీరానికి హైడ్రేషన్ని అందిస్తాయట. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. బోన్స్ను హెల్తీగా మార్చడంలోనూ, స్కిన్ హైడ్రేషన్కి, జీర్ణక్రియలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం.. తాజా పరిశోధనలో పాలు డెయిరీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచవని తేలింది. అయినప్పటికీ.. పాలు, చీజ్, పెరుగు, ఐస్క్రీమ్ వంటి ఆరోగ్యకరమన ఎంపికల మధ్య తేడాను గుర్తించాలని చెప్తున్నారు. అయితే ఈ ఉత్పత్తుల్లో చక్కెర ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పెద్ద మొత్తంలో చక్కెర, ఫ్యాట్, కృత్రిమ స్వీటెనర్లు, గట్టిపడే పదార్థాలు వాటిలో వినియోగిస్తారని తెలిపారు. అందువల్ల స్వీట్ తక్కువగా ఉన్న బ్రాండెడ్ ఐస్క్రీంలు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మితంగా తింటే సమస్యల నిల్.. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివే అయినా.. వాటిని కంట్రోల్గా తీసుకోవడం మంచిది అంటున్నారు. డైటీషియన్లు రోజుకు గరిష్ఠంగా అరకప్పు తీసుకోవచ్చని చెప్తున్నారు. ఐస్ క్రీమ్ను మితంగా తీసుకుంటే.. ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. ఏదీఏమైన దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మాత్రం తీసుకునే క్వాంటింటీపై కచ్చితంగా శ్రద్ధ చూపించాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ఈ పరిశోధన కేవలం ఐస్క్రీం ఆరోగ్యానికి హానికరం కాదని లేదా లాభలు ఉన్నాయని చెప్పడానికే చేసిందే తప్ప ఐస్క్రీం తినమని చెప్పేందుకు కాదు. అలాగే పరిశోధనలో ఎక్కువగా ఐసీక్రీం తింటే మధుమేహం, ప్రీడయాబెటిస్ మరియు PCOS తో ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుందని, కేన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని చెప్పారు నిపుణులు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. డైట్లో చేర్చుకునే ముందు మీ వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించి ఫాలో అవ్వడం ఉత్తమం. (చదవండి: అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!) -
మహిళల్లో వృద్ధాప్యం త్వరగా రావడానికి కారణం ఇదే!
మహిళలకు మాతృత్వం అపురూపమైనది. చాలామంది అమ్మ నవ్వడం ఓ వరంలా భావిస్తారు. పిల్లలను కనడమే ఆడజన్మకు సార్థకత అని భావించేవాళ్లు ఉన్నారు. కానీ అమ్మగా ఓ స్త్రీ ఎప్పుడైతే మారుతుందో.. ఇక ప్రతి నిమిషం పిల్లల కోసమే వెచ్చిస్తుంది. తన గురించి ఆలోచించడమే మానేస్తుంది. అంతటి త్యాగమూర్తి స్త్రీ. అలాంటి మహిళలు మగవారికంటే తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చి ముసిలి వాళ్లు అయిపోతుండటం జరుగుతుంది. అందుకు కారణం ఏంటో తాజా అధ్యాయనంలో వెల్లడించారు శాస్త్రవేత్తలు. దీనికి అదే కారణమంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మెయిల్మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు మహిళల్లో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతమవ్వడానికి గల కారణాలపై అధ్యయనం చేశారు. అందుకోసం సుమారు వెయ్యిమందికి పైగా మహిళలపై పరిశోధన చేశారు. వాళ్లలో పునరుత్పత్తి తర్వాత వస్తున్న డీఎన్ఏ మార్పులపై క్షణ్ణంగా అధ్య యనం నిర్వహించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం శాస్త్రవేత్తలు ఆరు విభిన్నమైన "ఎపిజెనెటిక్ క్లాక్లు" లేదా డీఎన్ఏ మిథైలేషన్ నమునా ప్రక్రియలతో మహిళల జీవసంబంధమైన వయసును లెక్కించారు. ఆరేళ్ల సుదీర్ఘ పరిశోధనల్లో.. ఇలా అధ్యయనంలో పాల్గొన్న 825 మంది ఫలితాలు ప్రకారం..ప్రతి గర్భం స్త్రీకి రెండు నుంచి మూడు నెలలు బయోలాజికల్ వృద్ధాప్యంతో ముడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆరేళ్లుగా మహిళల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేయగా..గర్భవతుల జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదలను గుర్తించారు. ఈ అంశంపై కొలంబియా ఏజింగ్ సెంటర్లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్లు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. గర్భధారణ జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని.. ఈ ప్రభావాలు అధిక సంతానోత్పత్తి కలిగిన యువ స్త్రీలలో స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు. అంతేగాదు ఎక్కువ గర్భాలు లేదా పిల్లలను కన్న మహిళల్లో జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదల కనిపించిదని అన్నారు. అందువల్లే గతంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు బిడ్డను మోయని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారని చెప్పారు. కొందరికి ధూమపానం అలవాట్లు, ఆర్థిక పరిస్థితి కారణంగా సరైన పోషాకాలతో కూడిన ఆహారం తీసుకోలేని మహిళలపై పరిశోధనలు చేయగా వారిలో జీవసంబంధమైన వృద్ధాప్యం మరింత వేగవంతంగా ఉందన్నారు. ముఖ్యంగా తండ్రులుగా ఉన్న పురుషుల్లో ఈ ప్రభావ లేదని అన్నారు. దీని ప్రభావం కేవలం గర్భం లేదా పాలిచ్చే తల్లుల్లో కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ ప్రతి స్త్రీ గర్భం సంఖ్య కూడా వారిలో జీవసంబంధమైన మార్పులు తీసుకువస్తుందని అధ్యయనంలో తేలింది. ఇవే వృద్ధాప్యంపై ప్రభావం చూపిస్తాయని తెలిపారు. అయితే కౌమారదశలోని గర్భం దాల్చినవారిపై ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకు ఆరోగ్య సంరక్షణ, సరైన వనరులు లేకపోవడం తదితరాలు కూడా ఈ ప్రభావానికి కారణమవుతాయని అన్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇక్కడ మహిళల్లో వేగంగా వచ్చే ఈ వృద్ధాప్యం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపి మరణానికి కారణమవుతోందా? లేదా? అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఇక్కడ తల్లుల సంరక్షణ అనేది ప్రధానమైనది అనేది ఈ అధ్యయనం పేర్కొంది. కొత్త తల్లులకు మంచి పోషకాలతో కూడిన ఆహారం, హెల్తీగా ఉండేలా తగిన వైద్యం ప్రాముఖ్యతలను తెలియజేస్తోంది ఈ పరిశోధన. అంతేగాఉ ముఖ్యంగా గర్భధారణ సమయంలో సరైన ఫుడ్, డైట్, మానసికంగా హెల్తీగా ఉంటే ఈ వృధ్యాప్య ఛాలయలను అధిగమించొచ్చని చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలు 'ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'లో ప్రచురితమయ్యింది. (చదవండి: మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!) -
చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!
ప్రపంచ జనాభాను వణికిస్తున్న వ్యాధి కేన్సర్. ఇతర ప్రమాదకర కేన్సర్లతో పాటు, మహిళలు రొమ్ముకేన్సర్, సర్వైకల్ కేన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఈ కేన్సర్కు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. భారతీయ స్త్రీలకు చీరల వల్ల కేన్సర్ వ్యాధి పొంచి ఉందిట. చీర ధరించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశంతో పాటు, అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. అయితే దుస్తులు ఏవైనా పరిశుభ్రతే ఎక్కువ కారణమని వైద్యులు పేర్కొడం గమనార్హం. ముంబైలోని RN కూపర్ హాస్పిటల్ లాంటి చోట్ల పరిశోధనలు కూడా జరిగాయి. ఈ పరిశోధనలో ధోతీ కూడా ఉంది. చీర కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన అందమైన దుస్తుల్లో ఒకటి. ఐదున్నర నుండి ఆరు మీటర్ల చీరను ధరించడం ఆనవాయితీ. ఢిల్లీలోని పిఎస్ఆర్ఐ ఆసుపత్రిలో క్యాన్సర్ సర్జన్ డాక్టర్ వివేక్ గుప్తా, ఒకే వస్త్రాన్ని ఎక్కువసేపు ధరించడం వల్ల నడుము వద్ద రాపిడి ఏర్పడుతుంది. చర్మం రంగు మారుతుంది. పొట్టులాగా రావడం జరుగుతుందిట. ఆ తరువాత మానని పుండుగా మారి ఇదే కేన్సర్కు దారితీసే అవకాశాలున్నాయి. దీన్నే వైద్య పరిభాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC), చీర క్యాన్సర్ అని పిలుస్తారని పరిశోధకులు తెలిపారు. నడుము చుట్టూ ఇరిటేషన్, పుండ్లు తాజాగా 68 ఏళ్ల మహిళ ఈ కేన్సర్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. చీర కట్టుకోవడం వలన వచ్చిన కేన్సర్ కాబట్టి, దీన్ని చీర కేన్సర్గా భావిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత, తేమ ఉండే జార్ఖండ్, బీహార్లో చీర క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య ఒక శాతంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. డెర్మటోసిస్ నుండి ఉత్పన్నమయ్యే ప్రాణాంతక, చాలా అరుదైన కేసుగా వైద్యులు పేర్కొంటున్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాలలో, ధనికులు, పేదలు, పట్టణ లేదా గ్రామీణ మహిళలు ఏడాది పొడవునా, వారానికి ఏడు రోజులు చీరలను ధరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నిజానికి ఏ పని చేస్తున్నా రోజంతా చీరలోనే ఉంటారు. చీర జారిపోకుండా ఉండేందుకు పెటీకోట్ను నాడాతో గట్టిగా కట్టుకుంటారు. ఇలా గట్టిగా కట్టు కోవడం వల్ల నడుము చుట్టూ చర్మం కమిలిపోవడం, దురద రావడం, క్రమంగా పుండ్లు రావడం.. ఇవన్నీ చీర కట్టుకునేవారికి అనుభవమే. అధిక ఉష్ణోగ్రతలుండే ప్రదేశాల్లో ఇది మరీ చికాకు పుట్టిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, ఇది కేన్సర్గా (చాలా అరుదు)గా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు జీన్స్తో సహా బిగుతుగా ఉండే దుస్తులు ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎవరికైనా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చాలా బిగుతుగా ఉండే దుస్తులను ఎక్కువసేపు ధరించడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుందని, మగవారిలో వ్యంధ్యత్వ సమస్యకు దారి తీస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన సంగతి విదితమే. కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అదేవిధంగా, కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అని పిలువబడే చర్మ కేన్సర్కి మరో రూపం. చలికాంలో వెచ్చదనం కోసం కాంగ్రీస్ అని పిలువబడే కుంపటితో నిండిన మట్టి కుండలను వాడే విధానం వల్ల ఈకేన్సర్ వస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు , తొడ ప్రాంతాలలో కాంగ్రిస్ నుండి వేడికి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ కావడం దీనికి దారి తీస్తుంది. నోట్ : చీరలు కట్టుకునేవారికి అందరికీ కేన్సర్ వస్తుందని కాదు. దుస్తులు ఏవైనా, పరిశుభ్రంగా ఉండటం, మరీ బిగుతుగా కట్టుకోకుండా ఉండటం అవసరం. అలాగే లోదుస్తుల విషయంలో, ముఖ్యంగా వేసవిలో చాలా పరిశుభ్రతను పాటించాలి. చిన్న పిల్లల విషయంలో కూడా అప్రతమత్తత అవసరం. నడుము చుట్టూ గానీ, స్థనాల వద్ద, తొడలు, జననాంగాల మధ్య ఇరిటేషన్, నల్లటి మచ్చలు మానని పుండ్లు లాంటి సమస్యలొస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
మానవ మెదళ్లు పెద్దవి అవుతున్నాయ్! ఇక ఆ వ్యాధి..
మానవ మెదళ్లు పరిమాణంలో వస్తున్న మార్పులను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఒక తరానికి మరొక తరానికి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడించారు. దీన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ హెల్త్ బృందం నిర్థారించింది. ఈ మేరకు యూఎస్లోని దాదాపు 55 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మూడు వేల మంది వృద్ధులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. 1930లలో జన్మించిన వారి కంటే 1970లలో (జనరేషన్ X) మొత్తం మెదడు పరిమాణం 6.6 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మునపటితరం సభ్యులకంటే ప్రస్తుత జనరేషన్ మెదడులో దాదాపు 8% ఎక్కువ వైట్ మ్యాటర్, 15% ఎక్కువ గ్రే మ్యాటర్ ఉందని పరిశోధనలో తేలింది. అంటే.. మునపటితరంతో పోలిస్తే ఇక్కడ మెదడు వాల్యూమ్ 5.7% పెరిగిందని తెలిపారు. దీని కారణంగా నేర్చుకోవడం, జ్ఞాపకశక్తిలో మెరుగుదల ఉంటుందన్నారు. అలాగే వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని చెప్పారు. ఎవరైనా జన్మించినప్పుడు ఉన్న మెదడు పరిమాణం పైనే దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇలా మెదడు పరిమాణం పెరిగితే వృద్ధాప్య వ్యాధులకు వ్యతిరేకంగా శక్తి పెరుగుతుందన్నారు. తత్ఫలితంగా అల్జీమర్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పారు పరిశోధకులు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది ప్రజలను ప్రభావితం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమెరికాలో దాదాపు 7 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధితోనే బాధపడుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి. (చదవండి: గుడ్లు ఎక్కువగా తింటున్నారా ? పరిశోధనలో షాకింగ్ విషయాలు!) -
గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
గుడ్లు ఎక్కువుగా తింటే అస్సలు భయపడాల్సిన పనిలేదు. పైగా మీ ఆరోగ్యం పదిలం అని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. అస్సలు ఆ సమస్యలు బారినపడరని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు సైతం రావని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఆ అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలేంటంటే.. గుడ్డు ఎముకలు బలంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందట. రోజుకి ఒక గుడ్డు తినడం అనేది ఎంతో మంచిదని, దీని వల్ల ఫోలేట్, బీ విటమిన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని అన్నారు. అలాగే ఎముకల వ్యాధి రాకుండా నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గుండెతో ఎముకల ఆరోగ్యం ముడిపడి ఉందనే ఆసక్తికర విషయం తమ పరిశోధనలో బయట పడిందని హువాజోంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త తెలిపారు. అందుకోసం నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ దాదాపు 1900 మందిపై అధ్యయనం నిర్వహించింది. పరిశోధకులు గుడ్డు వినియోగం తోపాటు, వారి ఎముకల బలాన్ని కూడా అంచనా వేశారు. ఈ పరిశోధనలో పాల్గొనేవారికి గుడ్డులోని 3.53 ఔన్సుల పోషకాలు వారి తొడలు, వెన్నుముకలోని ఎముకలను దృఢంగా ఉంచాయిని తెలిపారు. వారిలో అధిక బీఎండీ స్థాయిలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో అయితే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గిందని చెప్పారు. వయసు పెరిగే కొద్ది ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఆ సమస్య రాకూడదంటే గుడ్డుకి మించిన తగిన పోషకాహారం లేదని ఈ పరిశోధనలో తేలిందని చెప్పారు. అలాగే ఇదే సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అధిక మొత్తంలో మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు దీర్థకాలికంగా వాడడం వంటి ఇతక కారణాల వల్ల కూడా ఈ బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఎముకలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే.. గుడ్లు ప్రోటీన్తో నిండి ఉంటాయి. ఇవి ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అని పిలువబడే శారీరక ఎంజైమ్ల సమూహాన్ని సక్రియం చేసి, ఎముకలను బలోపేతం చేస్తుంది. ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అనేది ప్రధానంగా కాలేయం, ఎముకలు, మూత్రపిండాలు మొదలైన వాటిలో ఉండే ఎంజైమ్ల సమూహం. ఇది ఎముక జీవక్రియ బయోమార్కర్ గుడ్లు తీసుకోవడం వల్ల ఏఎల్పీ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో తొడ, కటి వెన్నెముక వంటి భాగాల్లోని ఎముకలను బలంగా ఉంచుతుంది. అంటే ఇక్కడ గుడ్లలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందని తేలింది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: చెఫ్గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
భారత్లో చేపలు తినేవాళ్ల సంఖ్య పెరిగింది!: అధ్యయనంలో వెల్లడి!
భారత్లో చేపల వినియోగం పెరిగిందని అధ్యయనంలో వెల్లడయ్యింది. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఈ మేరకు భారతదేశంలో చేపల వినయోగం, సంబంధిత ఆహార పొకడలపై అధ్యయనం నిర్వహించగా..సరికొత్త నివేదికలును అందించింది. ఆ ఫలితాల్లో ఇటీవల కాలంలో చేపల వినియోగంలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు వెల్లడించింది. భారత దేశంలో చేపల వినియోగం: ప్యాటర్న్, ట్రేండ్ అనే వాటిని బేస్ చేసుకుని స్టడీ చేయగా గణనీయమైన వృద్ధి కనిపించింది. ఈ స్టడీని ఇండియన కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్), మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, భారత ప్రభుత్వం అండ్ వరల్డ్ ఫిష్ ఇండియా కలిసి నిర్వహించాయి. కాల పరిమిత 2005-2006 నుంచి 2019-2020 వరకు చేపల వినియోగం ఎలా ఉందనే దానిపై అధ్యయనం చేయగా, చేపల వినియోగంలో భారతేశంలో గణనీయమైన వృద్ధి కనిపించిందని తేలింది. అందుకు జనాభ పెరుగుదల, పెరిగిన సంపద, మారుతున్న పరిస్థితులు కారణం అని పేర్కొన్నారు అధికారులు. ఇక భారతదేశంలో చేపల తినే జనభా 73.6 మిలియన్ల(66%) నుంచి 966.9 మిలియన్లకు(71.1%)కు చేరింది. ఇది సుమారు 32% పెరుగుదలను సూచిస్తోంది. అలాగే 2019-2020లో 5.95% మంది ప్రజలు ప్రతిరోజూ చేపలను తీసుకోగా, 34.8% మంది కనీసం వారానికి ఒకసారి మిగలిన 31.35% అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటారని అధ్యయనంలో తేలింది. కాగా, త్రిపురలో అత్యధికంగా (99.35%), హర్యానాలో అత్యల్పంగా (20.55%) చేపలను వినయోగిస్తున్నారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, గోవాలలో అత్యధికంగా చేపలు తినే వాళ్ల సంఖ్య (90% కంటే ఎక్కువ) ఉంది. దీనికి విరుద్ధంగా, పంజాబ్, హర్యానా రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు అత్యల్పంగా ఉన్నాయి (30% కంటే తక్కువ). అయితే, దేశంలోని ఉత్తరాన ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో చేపలు తినేవారి సంఖ్య అత్యధికంగా పెరగడం గమనార్హం. అలాగే కేరళ, గోవాలలో కూడా రోజువారీ చేపల వినియోగదారుల శాతం అత్యధికంగా ఉందని స్టడీ పేర్కొంది. అంతేగాక పురుషుల కంటే స్త్రీలు చేపల తక్కువుగా తింటున్నారని అధ్యయనం పేర్కొంది. (చదవండి: ఇదేం వ్యాధి.. తినకూడనివన్నీ లాగించేస్తోంది..) -
కొండచిలువలు తినడం మంచిదంటున్న శాస్త్రవేత్తలు!
ఇంతవరకు మాంసాన్ని ల్యాబ్లో తయారు చేయడం వంటి వాటి గురించి కథనాలు విన్నాం. దీని వల్ల శాకాహారులకు కూడా మేలు జరుగుతుంది. వారికి కావాల్సిన పోట్రీన్లు ఇలా కృత్రిమంగా తయారు చేసిన మాంసం ద్వారా అందుతుందని భావించారు కూడా. అవన్నీ పరిశోధన దశల్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఇది కాదంటూ ఏకంగా కొండచిలువలనే ఆహారంగా తినమని చెబుతున్నారు. పైగా ఆరోగ్యానికి మంచిదంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎందుకిలా అన్నారంటే.. ఇంతవరకు మనుషులు మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి ఇతరత్ర మాంసాలను తినేవారు. అయితే వీటి వల్ల కేవలం వంద గ్రాములు ప్రోటీన్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే వీటి కారణంగా గాలిలో 49.89 కిలోగ్రాముల కార్బన్డయాక్స్డ్ విడుదలవుతుందని పరిశోధనల్లో తేలిందన్నారు. అందువల్ల మాంసాహారం ఎక్కువుగా తినడమనేది పర్యావరణాని హానికరమని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. వీటికి బదులు కొండచిలువలు తినడం చాలా మంచిదని, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. ఈ మేరకు తాము ఒక పొలంలో దాదాపు 12 నెలలపాటు పెంచిన రెండు కొండచిలువలపై జరిపిన అధ్యయనంలో తేలిందని సరీసృపాల నిపుణుడు డాక్టర్ డేనియల్ నాటుష్ చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇవి నీరు లేకుండా దాదాపు నెలరోజులు జీవిస్తాయట. వీటి పొలుసుల మీద ఉండే నీటితోనే అన్ని రోజుల పాటు నీరు తీసుకోకుండా బతకగలవని అన్నారు. అలాగే దాదాపు ఒక సంవత్సరం పాటు ఏం తినకుండానే బతికేస్తాయట. అలాగే పంట బాగా పండటంలో వీటి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అన్నారు. అలాగే ఇవి తక్కువ గ్రీన్హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయని అన్నారు. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండగలవు, పైగా బ్లర్డ్ ఫ్లూ లేదా కోవిడ్ -19 వంటి వ్యాధులను వ్యాప్తి చేయవని అధ్యయనంలో వెల్లడయ్యిందని తెలిపారు. ఈ ఆసక్తికర పరిశోధన సైంటిఫిక్ రిసెర్చ్ ప్రచురితమయ్యింది. అలాగే వీటిని ఆహారంగా తీసుకుంటే మంచి ప్రోటీన్ పుష్కలంగా అందుతుందని అన్నారు. ఒక ఏడాదిపాటు సాగిన ఈ పరిశోధనలో తాము ఈ కొండచిలువలకు ఎలుకలు, చేపలు వంటి వాటిని ఆహరంగా అందించి ఎప్పటికప్పుడూ వాటి బరువుని కొలిచే వాళ్లమని చెప్పారు. అయితే ఈ రెండు పైథాన్లలో ఆడ కొండచిలువ వేగంగా బరువు పెరిగినట్లు పేర్కొన్నారు. వివి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరువు ఏర్పడి పశువులు పెద్ద సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మాంసాహారంగా ఈ కొండచిలువలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తుల. వామ్మో కొండ చిలువ తినడమమా ఏందీ వింత పరిశోధన అని భావిస్తున్నారా?. టెన్షన్ పడొద్దు ఎందుకంటే..దీనిపై ఇంకా కూలంకషంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు పూర్తి అయ్యేతే గానీ కార్య రూపం దాల్చదు. అదీగాక కొండచిలువల పెంపకం అనే విషయంలో సాధ్యా సాధ్యాలు కూడ అంచాన వేయాల్సి ఉంటుంది. (చదవండి: 'కుమారీ ఆంటీ' లాంటీ ఇన్సిడెంట్..మరీ ఇదేమవుతుందో..!) -
మద్యపాన వ్యసనానికి చెక్పెట్టే సరికొత్త చికిత్స విధానం!
మద్యపాన వ్యసనం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపింది. బంధాలను ముక్కలు చేసి ఎవర్నీ ఎవరికీ కాకుండా చేసి జీవితాలను కాలరాస్తోంది. అలాంటి మహమ్మారిలాంటి ఈ మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు ఇప్పటివరకు అందుబాటుల్లో లేవు. డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి కదా! అని అంటారేమో. మందు బాబులు అక్కడ ఇచ్చే కౌన్సిలింగ్కి, జీవనశైలికి దాని అడిక్షన్ నుంచి బయటపడినట్లు అనిపిస్తారు అంతే. కళ్ల ముందు చుక్క కనిపించిందంటే మళ్లీ కథ మాములే. కొందరే ఆయా సెంటర్ల నుంచి మెరుగై మళ్లీ దాని జోలికి వెళ్లకుండా ఉండేందుకు యత్నిస్తారు. ఇది కూడా అంత ప్రభావంతమయ్యింది కాదు. దీని పరిష్కారం కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనాల్లో దీనికి ప్రభావంతమైన జన్యు చికిత్స విధానాన్ని కనుగొన్నారు. అదేంటంటే..ఈ ఆల్కాహాల్ యూజ్ డిజార్డర్(ఏయూడీ) ఓ పట్టాన వదిలించుకోలేని జబ్బు అని చెప్పొచ్చు. దీని కోసం శాస్త్రవేత్తలు చేసిని పరిశోధన కొంతవరకు పురోగతినే చూపించింది. ఈ మద్యపానానికి బానిసలుగా మారిన వాళ్ల బ్రెయిన్పై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఎందుకు మందువైపు నుంచి వాళ్లను వాళ్లు మరల్చుకోలేకపోవడానికి కారణం ఏంటా? అనే దిశగా పరిశోధనలు చేయగా..మెదడులో ఉండే కమ్యేనికేషన్ వ్యవస్థకు సంబంధించిన మొసోలింబిక్ డోపమేన్ సిగ్నలింగ్ లోతుగా ఉన్నట్లు గురించారు. ఇది మద్యం సేవిస్తే కలిగి మంచి అనుభూతిని న్యూరోట్రాన్సిమీటర్కు ఎలా ప్రశారం చేస్తుందో నిర్థారించారు. ఈ వ్యవస్థ పనితీరులో ప్రధానమైనది గ్లియల్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్(జీడీఎన్ఎఫ్) అనే ప్రోటీన్. అల్కహాల్ తాగకుండా ఉండేందుకు యత్నిస్తున్న ఏయూడీ రోగుల మెదుడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ) జీడీఎన్ఎఫ్స్థాయిలు పడిపోతాయని పరిశోధనలో తేలింది. దీని కోసం జన్యు చికిత్స ఉపయోగించి వీటీఏలో జీడీఎన్ఎఫ్ స్థాయిలను భర్తీ చేస్తే డోపమేన్ సిగ్నలింగ్ను బలోపేతం అవుతుందా? అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఆ అధ్యయనంలో తక్కువ మోతాదులో మద్యపానం సేవిస్తే డోపమైన్ సిగ్నలింగ్ విడుదల బాగానే ఉంది. దీర్ఘకాలికంగా తాగితే మాత్రం మెదడును డీసెన్సిటైజ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కాలక్రమేణ తక్కువ డోపమైన్ను విడుదల చేస్తుందని అన్నారు. ఈ వ్యసనంతో బాధపడుతున్నవారికి నిగ్రహంగా ఉందామనే సమయంలో వచ్చే అసౌకర్యం, చికాకుని తట్టుకోలే మళ్లీ తాగడం ప్రారంభిస్తుంటారని అన్నారు. ఇక్కడ తాగాలనిపించేలా మెదడు సిగ్నలింగ్ ఇచ్చే డోపమేన్ వ్యవస్థకే జన్యు చికిత్స చేస్తే సమస్యను అధిగమించవచ్చు అనేది శాస్త్రవేతల ఆలోచన. అందుకోసమని కొన్ని కోతులపై ఈ పరిశోధన చేశారు. దాదాపు 21 రోజుల పాటు కోతులకు మద్యపానం, నీరు వాటికి నచ్చినంత తాగేలా స్వేచ్ఛగా వదిలేశారు. కొద్దిరోజులకే అవి అధికంగా మధ్యపానానికి అడిక్ట్ అవ్వడం చూశారు. ఆ తర్వాత ఆ కోతులకు జీడీఎన్ఎఫ్ జన్యు చికిత్సను అందించారు. దీంతో అవి మద్యపానానికి బదులు నీటిని తాగడానికి ప్రయత్నించడం మొదలు పెట్టాయి. తెలియకుండానే మద్యపానాన్ని పక్కనపెట్టడం జరిగింది. వాటి రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ తక్కువుగా ఉండటాన్ని కూడా గుర్తించారు. ఆల్కహాల్ యూస్ డిజార్డర్తో బాధపడుతున్నవారికి ఈ చికిత్స గొప్ప పరిష్కార మార్గం అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారని, వారికి ఈ చికిత్స విధానం అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని అన్నారు. అయితే ప్రభావవంతంగా పనిచేస్తున్న ఈ జన్యు చికిత్స మానువులకు ఎంతవరకు సురక్షితం అనేదాని గురించి ట్రయల్స్ నిర్వహించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడకల్లో 'ఇడ్లీ లొల్లి'..దీని మూలం ఎక్కడిదంటే..) -
కుండలినీ యోగాతో అల్జీమర్స్కు చెక్: తాజా పరిశోధన
యోగాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం శారీరకదృఢత్వానికి మాత్రమే కాదు, మేధాశక్తి, ఆత్మశక్తి పెంపులో కూడా సహాయపడుతుంది. యోగా ప్రయోజనాలపై ఒక ఆసక్తికరమైన అధ్యయనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కుండలిని యోగాతో మెదడుకు చాలా మంచిదని ఇది వెల్లడించింది. అల్జీమర్స్లాంటి భయంకరమైన వ్యాధికి చెక్ చెప్పవచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ అధ్యయనం ప్రాథమికంగా కనుగొంది. ఆ వివరాలు.. మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు, దీర్ఘకాలిక ఆయుర్దాయం, జీన్స్ తదితర కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళలకు అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువ. అందుకే అల్జీమర్స్ ముప్పున్న 50 అంతకంటే ఎక్కువ వయస్సున్న 79 మహిళలపై కుండలిని యోగా, జ్ఞాపకశక్తికి సంబంధించి అధ్యయనం చేశారు. వీరంతా జ్ఞాపకశక్తి క్షీణత (మునుపటి సంవత్సరం పనితీరుతో పోలిస్తే), గుండెపోటు చరిత్ర, చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటుకు, గుండెలోని రక్తనాళాల సమస్య, అధిక కొలెస్ట్రాల్ కోసం ప్రస్తుత మందులు తీసుకుంటున్నవారే. 12 వారాల పాటు యోగా శిక్షణ, మెమరీ ట్రైనింగ్ రెండు గ్రూపులుగా వీరిపై పరిశోధన సాగింది. వీరిలో 40 మందికి యోగా, 39 మందికి మెమరీ ట్రైనింగ్ ఇచ్చారు. యోగా టీంలో వారానికి 60 నిమిషాలు చొప్పున 12 వారాలు కుండలిని యోగాను నిష్ణాతుడి ద్వారా వ్యక్తిగతంగా శిక్షణ ఇప్పించారు. 39 మందికి మెమరీ శిక్షణ నిచ్చారు. మెమరీ ట్రైనింగ్లో కొన్నిపేర్లను, ముఖాలను గుర్తించుకోవడం, తలుపులు తాళం వేయడం లాంటి రోజవారీ కార్యక్రమాలను గుర్తుంచుకొనే పద్దతులపై శిక్షణనిచ్చారు. తరువాత మరో 24 వారాలు వీరి మెమరీ బేస్లైన్ కూడా పరీక్షించారు. అలాగే వారి రక్తంలోని సైటోకిన్లనూ విశ్లేషించారు. రోగ నిరోధక వ్యవస్తలోని కీలకమైన, ప్రోటీన్లు , జన్యు వ్యక్తీకరణలో మార్పులను గమనించారు. అయితే కుండలిని యోగా టీంలో మాత్రమే ఆత్మాశ్రయ జ్ఞాపకశక్తిలో మెరుగుదల ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జ్ఞాపకశక్తి శిక్షణతో పోలిస్తే, యోగాద్వారా హిప్పోకాంపస్ వాల్యూమ్లో పెరుగుదల గమనించామనీ, ఫంక్షనల్ కనెక్టివిటీ, స్వల్పకాలిక జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని వాటిని మెదడులోని దీర్ఘకాలిక నిల్వకు బదిలీ అనేది బాగా మెరుగుపడిందని గుర్తించారు. ఇంకా కుండలిని యోగా ద్వారా మెరుగైన జ్ఞాపకశక్తి, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్లతో సహా మెదడుకు సంబంధించి అనేక ప్రయోజనాలను గమనించారు. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుందని తెలిపింది. "ఒత్తిడిని తగ్గించడానికి, మెదడు ఆరోగ్యం, ఆత్మాశ్రయ జ్ఞాపకశక్తి పనితీరును మెరుగు పర్చేందుకు, ఇన్ఫ్లమేషను, న్యూరోప్లాస్టిసిటీని మెరుగుపరచడానికి" యోగా చాలా మంచిదని దీని రచయిత హెలెన్ లావ్రెట్స్కీ చెప్పారు. మెమరీ ట్రైనింగ్లో దీర్థకాలిక జ్ఞాపకశక్తిలోనూ మెరుగుదల కనిపించిందట. అయితే కుండలిని యోగాతో అల్జీమర్స్ వ్యాధిని నివారణ, వాయిదా వేయడం లేదా దీర్ఘకాలిక మెరుగుదల కనిపిస్తుందో లేదో నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని వ్యాఖ్యానించారు. కుండలిని యోగ కుండలిని అనేది మానవ శరీరంలో వెన్నుపాములో ఉంటుంది. దీంట్లో దాగివున్న శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ అంటారు. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడని యోగ నిపుణులు, గురువులు చెబుతారు. ఇతర యోగాలా కాకుండా,ఇదొక శక్తివంతమైన అభ్యాసం. మనలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పడం, దాని పరివర్తన శక్తిని ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది. ఇతర రకాల యోగాల మాదిరిగా కాకుండా, కుండలిని యోగా అనేది శరీరంలోని శక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, కుండలిని శక్తి ప్రవాహాన్ని ప్రేరేపించే నిర్దిష్ట భంగిమలను కుండలిని యోగా భంగిమలు అని పిలుస్తారు శ్వాసమీద, ఉచ్ఛరణ, గానం, శారీరక భంగిమలపై దృష్టి పెడుతుంది. -
సార్.. నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా!
జగిత్యాలక్రైం: ‘నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా’అని ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన విద్యార్థిని(20)కి రాయికల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సంబంధం కుదుర్చారు. ఈ నెల 26న నిశ్చితార్థం జరపాలని నిర్ణయించారు. అయితే ‘ఇంటర్ సెకండియర్ చదువుతున్నా, ఇంకా చదువుకుంటా, అమ్మనాన్న నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు, నాకు పెళ్లి ఇష్టం లేదు’అని జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్లో సీఐ ఆరీఫ్ అలీఖాన్, ఎస్సై సుధాకర్ను ఆ విద్యార్థిని కలిసి గోడు వెళ్లబోసుకుంది. స్పందించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి చదువుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ విద్యార్థినిని సఖీ కేంద్రానికి తరలించారు. -
ఇడ్లీ లవర్స్కు షాకింగ్ న్యూస్, జీవవైవిధ్యానికి అత్యంత ప్రమాదకారిగా
మనకెంతో ఇష్టమైన వంటకాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందంటే నమ్ముతారా? లేటెస్ట్ స్టడీ ఈ భయాల్నే రేకెత్తిస్తోంది. భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలపై జరిపిన పరిశోధనల్లో కొన్ని భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట. ముఖ్యంగా ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలుంటం గమనార్హం. అలాగే శాకాహారం , శాకాహార వంటకాలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవవైవిధ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనం చెబుతోంది. శుభవార్త ఏమిటంటే, బియ్యం , పప్పుధాన్యాల వంటకాలు అధిక స్కోర్లు ఉన్నప్పటికీ, భారత జనాభాలో ఎక్కువ భాగం శాకాహారుల కారణంగా, జీవవైవిధ్య ముప్పుకు పెద్ద ప్రమాదం లేదని పరిశోధకులు వివరించారు. బ్రెజిల్లో వాడే గొడ్డు మాంసం ,స్పెయిన్కు చెందిన రోస్ట్ లాంబ్ డిష్ , బ్రెజిల్ నుండి లెచాజో,జీవవైవిధ్యానికి అత్యధిక నష్టం కలిగించిన ఆహార పదార్థాలుగా నిలిచాయి. ఈ జాబితాలో ఇడ్లీ ఆరో స్థానంలో ఉంది. అంతేకాదు అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రభావం చాలా తక్కువ. ఈ లిస్ట్లో ఆలూ పరాటా 96వ స్థానంలో, దోస 103వ స్థానంలో, బోండా 109వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో జీవవైవిధ్యంపై అపారమైన ఒత్తిడిని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 151 ప్రసిద్ధ వంటకాలపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధన నిర్వహించారు. పర్యావరణంపై ప్రభావం చూపించే దాదాపు 25 ప్రమాదకర ఆహారాల పదార్థాలను గుర్తించారు .యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్లోని బయోలాజికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో మాట్లాడుతూ, ప్రతి వంటకం దాని పదార్థాల ఆధారంగా జాతులు, అడవి క్షీరదాలు, పక్షులు ఉభయచరాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. -
COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!
కొవిడ్-19 వాక్సినేషన్, గుండెపై ప్రభావానికి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారిలో(భారత్ మినహా) గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిర్డిటిస్ , సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST) లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో COVID-19 టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించేందుకు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం అని తెలుస్తోంది. భారత్ మినహా, వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది వాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరీశీలించారు. వివిధ దేశాల్లో 9.9 కోట్లమందిలో ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన నిర్వహించింది. Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కీలక డాటా సేకరించింది. మోడర్నా(mRNA),కోవిషీల్డ్ (ChadOX1) వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్నవారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే Guillain-Barre సిండ్రోమ్ను గుర్తించారు ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించవచ్చు, సుదీర్ఘ చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది. వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..! కోవిషీల్డ్ వ్యాక్సిన్తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయట. ఈ తరహా టీకాలే భారత్లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదనినిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్ , ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా , కెనడా, డెన్మార్క్లోని అంటారియోతో సహా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ , స్కాట్లాండ్ పలు ప్రదేశాల్లో డి COVID-19 వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్కేర్ డేటాను సేకరించింది. కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ పరిశోధనపై వాక్సిన్ తయారీదారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఆ కంపెనీలకు ‘ఇంకా డిగ్రీ’లే కొలమానం!
సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీలు డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులను నియమించుకుంటాయి. అయితే ఆ ధోరణికి స్వస్తి పలుకుతామని కొన్ని కంపెనీలు గతంలో వాగ్దానాలు చేశాయి. డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించాయి. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, లాక్హీడ్ మార్టిన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా అభ్యర్థులకు కళాశాల డిగ్రీలు ఉండాలనే నిబంధనను వదులుకుంటామని వాగ్దానం చేసిన కంపెనీలలో ఉన్నాయి. అయితే హార్వర్డ్ బిజినెస్ స్కూల్, బర్నింగ్ గ్లాస్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం.. వారి నియామక పద్ధతులు ఇప్పటికీ పాత ధోరణినే అనుసరిస్తున్నాయి. ఆయా కంపెనీలు ఇప్పటికీ కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. ఆయా కంపెనీల్లో డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియమించుకుంటామని చెప్పిన సుమారు 11,300 ఉద్యోగాలను 2014 తర్వాత నుంచి అధ్యయనం పరిశీలించింది. గత సంవత్సరం జరిగిన 700 మంది నియామకాలను పరిశీలించగా డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియమించుకున్న ఉద్యోగం ఒక్కటీ లేదని అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనంలో కంపెనీలను మూడు వర్గాలుగా విభజించారు. వాల్మార్ట్, యాపిల్, టార్గెట్తో సహా 37 శాతం కంపెనీలు నైపుణ్యాల ఆధారిత నియామకంలో పురోగతి సాధించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్, లాక్హీడ్ మార్టిన్లతో సహా 45 శాతం కంపెనీలు డిగ్రీలతో సంబంధం లేకుండా నైపుణ్యాల ఆధారంగా నియామకాలు చేపట్టడంలో విఫలమయ్యాయి. ఇక మూడవ వర్గం కంపెనీలను "బ్యాక్స్లైడర్స్" అని పిలుస్తారు. వాటిలో నైక్, ఉబెర్, డెల్టా ఉన్నాయి. నివేదికలో 18 శాతంగా ఉన్న ఈ కంపెనీలు నైపుణ్యాల ఆధారిత నియామకాల విషయంలో మొదట్లో పురోగతిని సాధించాయి. కానీ తర్వాత పాత పద్ధతికే వచ్చేశాయి. -
బియ్యం,గోధుమల్లో బలం సగమే, పైగా.. : షాకింగ్ రిపోర్ట్
తిండికి కటకటలాడుతూ ఓడలో ధాన్యం వస్తేనే దేశం ఆకలి తీరే పరిస్థితుల్లో హరిత విప్లవ సాంకేతికత (జిఆర్టి)ల అమలు మన దేశంలో 1960వ దశకంలో ప్రాంరంభమైంది. అధిక దిగుబడినిచ్చే వరి/గోధుమ ఆధునిక వంగడాలు తయారుచేసుకొని వాడుతున్నాం.. నీటి పారుదల, రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పంటలు పండిస్తున్నాం.. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తెల్ల బియ్యం, గోధుమలు అందిస్తున్నది. ఏభయ్యేళు గడచిపోయాక.. వెనక్కి చూస్తే జనం కడుపు నిండుతోంది. కానీ, పోషకలోపం వెంటాడుతోంది. ముందెన్నడూ లేనట్లుగా రోగాలు ముసురుకుంటున్నాయి. దీనికి మూలకారణం ఏమిటో ఓ తాజా అధ్యయనం విడమర్చి చెబుతోంది. ప్రసిద్ధ వంగడాలపైనే అధ్యయనం వరి, గోధుమల్లో పోషకాల స్థాయిని తెలుసుకునేందుకు ఐసిఎఆర్, ఐసిఎంఆర్ పరిశోధన సంస్థల్లో పనిచేస్తున్న నేలల నిపుణుడు డా. సోవన్ దేబనాద్, మరో 11 మంది శాస్త్రవేత్తలతో కలసి విస్తృత పరిశోధనలు చేశారు. డా. సోవన్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసిఎఆర్– సెంట్రల్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త. పశ్చిమబెంగాల్లోని ఐసిఎఆర్– బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ, హైదరాబాద్లోని ఐసిఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కు చెందిన మరో 11 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 1960వ దశకం నుంచి ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు 1,199 వరి, 448 గోధుమ, 417 మొక్కజొన్న, 223 జొన్న అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన (50 లక్షల హెక్టార్ల కన్నా ఎక్కువగా సాగైన) వంగడాల్లో నుంచి ఒక్కో దశాబ్దానికి 2–4 రకాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా పండించి మరీ అధ్యయనం చేశారు. జయ నుంచి స్వర్ణ సబ్ 1 వరకు.. ఈ విధంగా ఎంపికచేసిన 16 వరి, 18 గోధుమ రకాలను 2018–2020 మధ్యకాలంలో మూడేళ్ల పాటు సాగు చేశారు. ఎంపికైన వరి రకాల్లో 1960ల నాటి జయ, పంకజ్, 1970ల నాటి ఐఆర్8, స్వర్ణ, రాశి, 1980ల నాటి ఐఆర్ 36, క్షితిశ్, సాంబ మసూరి, లలత్, 1990ల నాటి ఐఆర్ 64, ఖందగిరి, రంజిత్, త్రిగుణ, 2000ల నాటి నవీన్, ప్రతిక్ష్య, స్వర్ణ సబ్ 1 వున్నాయి. గోధుమ రకాల్లో 1960ల నాటి సొనాలిక నుంచి 2010లలో విడుదలైన హెచ్డి–3059 రకాలను ఎంపిక చేశారు. 2009లో విడుదలైన స్వర్ణ సబ్ 1 తర్వాత 5 లక్షల హెక్టార్లకు పైగా సాగైన లాండ్మార్క్ వరి వంగడాలు లేక΄ోవటం వల్ల 2010లలో విడుదలైన ఏ వరి వంగడాన్నీ అధ్యయనం చేయలేదని డా. సోవన్ తెలి΄ారు. వరి విత్తనాలను కటక్లోని ఎన్ఆర్ఆర్ఐ నుంచి, గోధుమ విత్తనాలను కర్నల్లోని ఐఐడబ్లు్యబిఆర్ల నుంచి సేకరించారు. వీటన్నిటినీ ఒకే రకమైన మట్టి మిశ్రమంతో కూడిన ప్రత్యేక కుండీల్లో సాగు చేశారు. అలా పండించిన తెల్ల బియ్యం, గోధుమ పిండిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో సరిపోల్చి విశ్లేషించటం ఈ అధ్యయనం లక్ష్యం. 45శాతం తగ్గి పోయిన పోషకాలు మన దేశంలో ప్రజలు రోజువారీ ప్రధాన ఆహారంగా తినే వరి బియ్యం లేదా గోధుమల ద్వారానే రోజుకు అవసరమైన శక్తిలో 50%కి పైగా సమకూరుతుంది. ఈ రెండు ధాన్యాలు గత 50 ఏళ్లలో 45% పోషక విలువలను కోల్పోయినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గత 50 ఏళ్లలో, వరి బియ్యంలో అత్యవసరమైన పోషకాలైన జింక్ 33%, ఇనుము 27% తగ్గిపోయాయి. గోధుమలో జింక్ 30%, ఇనుము 19% తగ్గిపోయాయి. ఈ సమస్యను ఇప్పటికైనా సరిచేయకపోతే 2040 నాటికి వరి బియ్యం, గోధుమలు తినటానికి పనికిరానంతగా పోషకాలన్నిటినీ కోల్పోతాయని డా. సోవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాలు బాగా తగ్గి΄ోవటంతో పాటు మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ఈ ధాన్యాల్లో విషతుల్య పదార్థాలు చాలా పెద్ద ఎత్తున పోగుపడటం. ఆర్సెనిక్ (పాషాణం) ఏకంగా 1,493 శాతం మేరకు పెరిగిపోయింది. భార ఖనిజాలతో జబ్బులు ఈ అధ్యయనం మనకు తెలియజెప్తున్నదేమిటంటే.. రోజువారీగా ప్రధాన ఆహారంగా మనం తింటున్న తెల్ల అన్నం, గోధుమ రొట్టెల్లో పోషకాలు సగానికి తగ్గటంతో పాటు ఆరోగ్యానికి హాని చేసే భార ఖనిజాలు మెండుగా చేరాయన్న మాట. షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊబకాయం, కేన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులు పెచ్చుమీరిపోవడానికి వరి, గోధుమల్లో ΄ోషకాలు లోపించటంతో పాటు భార ఖనిజాలు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఫాస్ఫరస్, కాల్షియం, సిలికాన్, వనాడియం వంటి పోషకాలు ఎముకల అభివృద్ధికి దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తి, పునరుత్పాదక శక్తికి, నరాల బలానికి జింక్ కీలకం. రక్తవృద్ధికి ఇనుము చాలా ముఖ్యం. రోజూ ఎక్కువ మొత్తంలో తినే ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే నరాల బలహీనత, సంతానలేమి, కండరాలు, ఎముకల క్షీణతకు దారితీస్తుందని నేచర్ పత్రికలో ప్రచురితమైన వ్యాసాల్లో నిపుణులు చెబుతున్నారు. ఆర్సెనిక్, క్రోమియం, బేరియం, స్ట్రాంటియమ్ వంటి విషతుల్య భార ఖనిజాలు ఊపిరితిత్తుల కేన్సర్లు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, హైపర్కెరటోసిస్, కిడ్నీల సమస్యలు, ఎముకల్లో కాల్షియం లోపించటం వంటి జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వం మాదిరిగా జొన్న తదితర చిరుధాన్యాలు తినటం తగ్గిపోవటం, వరి, గోధుమల వినియోగం బాగా పెరిగి΄ోవటం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. 1990–2016 మధ్యకాలంలో అసాంక్రమిక వ్యాధులు 25% పెరిగి΄ోయాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) నివేదికలు చెబుతున్నాయి. బయోఫోర్టిఫైడ్ వంగడాలతో సమస్య తీరేనా? ధాన్యాల్లో పోషకాల లేమిని అధిగమించేందుకు ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొదించటంపై ఐసిఏఆర్ పదేళ్ల క్రితం నుంచే పని ప్రారంభించింది. ఇప్పటికి 142 బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొందించింది. ఇందులో 124 ధాన్యపు పంటలు. వీటిలో 10 వరి, 43 గోధుమ, 20 మొక్కజొన్న, 13 రకాల కొర్ర వంటి చిన్న చిరుధాన్యాలు, 11 సజ్జ రకాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాల లోపాన్ని కొంతమేరకు అధిగమించవచ్చన్నది శాస్త్రవేత్తల మాట. దేశవ్యాప్తంగా 6% సాగు భూమిలో ఈ వంగడాలు సాగవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. సాగు భూమిలో పోషకాలు తగ్గిపోయాయి కాబట్టి ఆహారంలో పోషకాలు తగ్గి పోతున్నాయని ఇన్నాళ్లూ అనుకున్నాం. అయితే, వరి, గోధుమ మొక్కలకు నేలలో ఉన్న పోషకాలను తీసుకునే శక్తి కూడా తగ్గిపోయిందని ఇప్పుడు రూఢి అయ్యింది. ఇంతకన్నా ఆందోళన కలిగించే మరో విషయాన్ని కూడా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. నేలలో భార ఖనిజాలు వంటి విషతుల్య పదార్థాలను కంకుల్లోని ధాన్యాలకు చేరకుండా ఆపి వేసే సహజసిద్ధమైన విచక్షణా జ్ఞానం మొక్కలకు ఉంటుంది. అయితే, అధిక దిగుబడుల కోసం తయారు చేసిన ఆధునిక వరి, గోధుమ విత్తనాల బ్రీడింగ్ ప్రక్రియల్లో గత ఏభయ్యేళ్లలో చేసిన కీలక మార్పుల వల్ల ఈ పంటల్లో ఆ తెలివి లోపించింది. అందువల్లే ఇప్పుడు వరి బియ్యం, గోధుమల్లోకి ప్రాణాంతక భార ఖనిజాలు అధిక పాళ్లలో చేరుతున్నాయి. వీటిని తిన్న మనుషులకు పోషకాలు లోపించటం వల్ల మాత్రమే కాదు, భార ఖనిజాల వల్ల కూడా రకరకాల జబ్బులొస్తున్నాయని తేలింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, భారతీయ వైద్య పరిశోధనా మండలి సమన్వయంతో అత్యంత కీలకమైన ఈ అధ్యయనం చేయటం విశేషం. గత నవంబర్లో ‘నేచర్’ లో ఈ అధ్యయన పత్రం అచ్చయ్యింది. ఇందులోని వివరాలు సంక్షిప్తంగా.. ► గత ఏభయ్యేళ్లలో 45% మేరకు పోషకాలు కోల్పోయిన వరి, గోధుమలు.. ►2040 నాటికి పూర్తిగా తగ్గే ప్రమాదం.. ►అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల్లో దశాబ్దానికి ఒకటి, రెండు ప్రాచుర్యం ΄పొందిన రకాలపై ఐసిఏఆర్, ఐసిఎంఆర్ సంయుక్త అధ్యయనం ►సాంబ మసూరి, స్వర్ణ సబ్ 1 తదితర 16 రకాల వరి, 18 రకాల ►గోధుమ అధిక దిగుబడి వంగడాలపై అధ్యయనం ►భారఖనిజాల శాతం పెరగటంతో ప్రజారోగ్యానికి ముప్పు ►బయోఫోర్టిఫైడ్ వంగడాలు మేలంటున్న శాస్త్రవేత్తలు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఏకంగా రూ.7 కోట్ల భూమిని విరాళమిచ్చిన మహిళ, ఎందుకో తెలుసా?
జనవరి 26 గణ తంత్ర దినోత్సవాల్లో తమిళనాడు సీఎం ప్రత్యేక అవార్డును ఒక పేద మహిళ గెల్చుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.7 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వ పాఠశాల కోసం విరాళంగా ఇచ్చినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఆమె పేరు ఆయి అమ్మాళ్ను అలియాస్ పూరణం. ఆమె మదురై జిల్లా పూడూర్నివాసి. నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషి చేసిన తన దివంగత కుమార్తె జ్ఞాపకార్థం ఆమె తన 7 కోట్ల రూపాయల విలువైన భూమిని తమిళనాడు ప్రభుత్వానికి అందించడం విశేషంగా నిలిచింది.. సంబంధధి పత్రాలను చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె కార్తిగాకు అందజేశారు. అమ్మాళ్ చేసిన దాతృత్వానికి స్పందించిన తమిళనాడు సీఎం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అవార్డుతో ఆమెను ఘనంగా సత్కరించారు. అమ్మాళ్ కెనరా బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తోంది. కోడికులంలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్కు హైస్కూల్గా అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ. 7 కోట్ల విలువైన స్థలాన్ని జనవరి 5న విరాళంగా ఇచ్చింది. రెండేళ్ల క్రితం మరణించిన తన కుమార్తె జనని పేరును పాఠశాలకు పెట్టాలన్నది ఆమె కోరిక. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన పూర్ణం, జనని చిన్నపిల్లగానే ఉన్నపుడే భర్తను కోల్పోయింది. భర్త చనిపోయిన తరువాత కారుణ్య ప్రాతిపదికన తన భర్త ఉద్యోగాన్ని పొందింది. కష్టపడి బిడ్డను బి.కామ్ దాకా చదివించుకుంది. కానీ అనూహ్యంగా జనని కూడా చనిపోయింది. దీంతో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని నిరుపేద పిల్లలు చదువుకోవాలంటూ విరాళంగా ఇచ్చేసింది. అలా తన బిడ్డను కల నెరవేర్చాలని భావించింది. Madurai Woman donates Landto School | சிறப்பு விருது | Madurai Pooranam Amma | CM MK Stalin #maduraiwomandonateslandtoschool #womandonateslandworth7crores #maduraigovernmentschool #maduraipooranamamma #kodikulamschool pic.twitter.com/TWqz1dBMAv — OH Tamil (@ohtamil) January 27, 2024 முதல் நாள் சுமார் ஏழு கோடி மதிப்புள்ள நிலத்தை கல்வித்துறைக்கு கொடையாக அளித்துவிட்டு மறுநாள் வங்கியில் கிளார்க் வேலையை சத்தமில்லாமல் செய்துக் கொண்டிருக்கும் ஆயி பூரணம் அம்மாளின் கரங்களைப் பற்றி வணங்கினேன். pic.twitter.com/5tat2Z7dC9 — Su Venkatesan MP (@SuVe4Madurai) January 11, 2024 -
డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చా?
డబ్బుతో అన్ని కొనగలం గానీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కొనలేం అని తెలిసిందే. అందుకే పిసినారుల్లా, డబ్బు కోసం పడిగాపులు పడొద్దని పెద్దలు హితవు చెబుతుంటారు. అయితే ఈ విషయంపై పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు కూడా. అందుకు సమాధానం కనుగొన్నారు. ఆ అధ్యయనాల్లో డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చు అనిపించేలా ఫలితాలు వచ్చాయి. ఆదాయాలు పెరగడంతో కొందరూ సంతోషంగా ఉన్నామని చెప్పగా, అల్రెడీ ఎక్కువ ఆర్జిస్తున్న వారిలో సంతోషం కనిపించలేదు. ఇక్కడ పెరుగుతున్న ఆదాయాలు సంతోషానికి కారణమవుతాయని తేలింది గానీ చివరిగా అందరూ ఒక్కదానికే ఏకగ్రీవంగా ఓటేశారు. అలా చేస్తేనే చాలా సంతోషంగా అనిపించిందన్నారు. ఇంతకీ అందరూ దేన్నీ హైలెట్ చేసి చెప్పారంటే... వివరాల్లోకెళ్తే..పరిశోధకులు డేనియల్ కాహ్నెమాన్, మాథ్యూ కిల్లింగ్స్వర్త్ ద్యయం చేసిన అధ్యయనం నిర్ధిష్ట ఆదాయ పరిమితిని చేరుకున్న తర్వాత సంతోషంగా ఉండగలమా? అనే దాన్ని సవాలు చేసిందన్నారు. ఈ మేరకు పరిశోధకులు స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా సుమారు 33 వేల మందిపై అధ్యయనం చేసి వారి డేటాను సేకరించింది. అయితే వారిలో పెరుగుతున్న ఆదాయాలతో సంతోషం పెరుగుతుందని తేలింది. తక్కువ సంపాదన కలిగిన వ్యక్తులు అధిక సంపాదన కలిగిన వారితో పోలిస్తే పెరిగిన ఆదాయం కారణంగా సంతోషంగా ఉండగలరని వెల్లడయ్యింది. వార్షిక జీతం దాదాపు 74 లక్షలు వరకు ఉంటే మానసిక ఆనందంలో మెరుగుదల కనపించింది. అంతకుమించి ఆదాయం పెరిగితే.. అవి ఆనందానికి, మానసికి సంతోషానికి మధ్య సంబంధాల పరిమితి ఏర్పడుతున్నట్లు గమనించారు. ఇక కిల్లింగ్సవర్త్ 2021 అధ్యయనం ప్రకారం దాదాపు రూ. 4 కోట్ల ఆదాయం ఉన్నప్పుడూ.. ఆనందంపై డబ్బు సానుకూల ప్రభావం కనిపించింది. అదేసమయంలో దాదాపు 83 లక్షలు కంటే ఎక్కువ జీతాలు అందుకున్న వ్యక్తుల్లో సంపద పెరిగినప్పటికీ వారి ఆనందంలో మెరుగుదల కనిపించలేదు. వారు కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదని అన్నారు. ఈ మేరకు హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ సంతోషాన్ని పొందడంలో అనుబంధాల పాత్ర అత్యంత కీలకమనిపేర్కొంది. మంచి జీవితానికి సంబంధాలు అవసరమని అందుకు సంపద కూడా ఒకింత కారణమని చెప్పారు. భౌతకపరమైన సంపదకంటే అనుభవాలతో ఆర్జించుకున్న సంతోషమే గొప్పదని తేలింది. కొంతమంది సామాజికి సంబంధాలతో సంతోషాన్ని పెంపొందించుకున్నారు. డబ్బుతో పనిలేదని ప్రూవ్ చేశారన్నారు. 2008లో ఎలిజబెత్ డన్ ఆమె సహచరులు నిర్వహించిన అధ్యయనంలో ఒక సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన అధ్యయనంలో కెనడాలోని వాంకోవర్ వీధిలో నడిచే వ్యక్తులకు కొంత డబ్బు నోటులు ఇచ్చి మీ కోసం లేదా ఇతరుల కోసం ఖర్చే చేయమని చెప్పారు. చివరిగా వారంతా తమ కోస కంటే ఇతరుల కోసం ఖర్చు చేసినప్పుడు ఎక్కువ సంతోషం కలిగినట్లు ముక్తకంఠంతో చెప్పారు. పరోపకారమే ఎక్కువ ఆనందాన్నిస్తుంది అని అన్నారు. అలాగే మిస్సౌరీ-కొలంబియా విశ్వవిద్యాలయంలోని సైకలాజి పరిశోధకుల అధ్యయనంలో ఇతరులను సంతోష పెట్టడం వల్ల ఆనందం అర్థవంతంగా ఉందన్న విషయాన్ని హైలెట్ అయ్యింది. దయతో కూడిన పరోపకార చర్యలే ఎక్కువ సంతోషానికి కారణమవుతాయని ఆ పరిశోధనలో తేలింది కూడా. ఈ అధ్యయనం ఇతరుల ఆనందానికి తోడ్పడటం అనే ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ పరిశోధనల సారాంశం అవసరాలకు సరిపడ ఆదాయ పెరుగుదల మన సంతోషానికి కారణమవ్వడం తోపాటు ఇతరులకు సాయం చేయడం వల్ల మనం మరింత మానసిక సంతోషాన్ని పొందగలమని వెల్లడించింది. (చదవండి: చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు! ధర ఏకంగా..!) -
పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా?
మనుషుల మానసిక ఆరోగ్యంపై పక్షుల ప్రభావం కూడా ఉంటుందని విన్నారా?. అసలు మన మానసిక పరిస్థితికి పక్షులకు లింక్ ఏంటీ. అవి ఎలా మన మనఃస్థితిని ప్రభావితం చేయగలవు అనే కదా సందేహం!. అయితే పరిశోధకులు మాత్రం వాటి వల్లనే మన మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి పక్షులను చూసే అవకాశం ఉండదు కదా! అని అడగొచ్చు దానికి శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే.. పక్షులను చూడటం లేదా వీక్షించటం, వాటి కిలకిలరావాలను వినడం వంటివి చేస్తే తెలియకుండా మానసిక ప్రశాంతత చేకూరి సంతోషంగా ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల నిరాశ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉత్ఫన్నం కావని అన్నారు. ఈ మేరకు సుమారు 13 వందల మందిని క్షుణ్ణంగా అధ్యయనం చేయగా...పక్షులను చూడటం, వాటి శబ్దాలను విన్న వారి మానసిక ఆరోగ్యం బాగున్నట్లు గమనించారు. పక్షులతో పనిగట్టుకుని గడపడం మొదలుపెట్టాక నెమ్మదిగా మెరుగుదల కనిపించింది. ముఖ్యంగా ఈ మెరుగుదలను డిప్రెషన్తో బాధపడుతున్న వారిలోనూ, ఆరోగ్యవంతమైన వ్యక్తులలోనూ కనిపించాయన్నారు. అలాగే మరో అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 295 మందిని పక్షులతో గడిపి తమ భావోద్వేగ స్థితిని స్వయంగా అంచనా వేసి చెప్పాలని కోరారు. వారంతా పక్షి పాటలను విన్నప్పటి నుంచి డిప్రెషన్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. అంతేగాదు మతిస్థిమితం, మరచిపోవడం వంటి రుగ్మతలు కూడా తగ్గినట్లు వెల్లడించారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ప్రకృతితో గడపలేకపోయినా కనీసం పక్షుల కిలకిల రావాలను మనసును ఆహ్లాదపరిచి స్థిమ్మితంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై ప్రకృతి ప్రభావం చూపుతోందా? మానసిక ఆరోగ్యంపై ప్రకృతి చూపించే ప్రభావాన్ని సాఫ్ట్ ఫాసినేషన్గా చెప్పొచ్చు. మన దృష్టి ప్రకృతి వద్దకు వచ్చేటప్పటికీ విస్తృతంగా చూసేలా చేసి మెదడు తనను తాను రిఫ్రెష్ చేసుకునేలా చేస్తుంది. తద్వారా మానసిక ప్రశాంత పొంది, మతిమరుపు, మతిభ్రమించడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే తనకు తానుగా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అంతేగాదు ప్రకృతి దృశ్యాలు, శబ్దాలు మనలను రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసి ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వదు. ఈ పరిశోధన జర్నల్ ఆక్యుపేషనల్ అండ్ ఇన్విరాన్మెంటల్ మెడిసన్లో ప్రచురితమయ్యింది. సామాజిక ఆర్థిక పరిస్థితి సంబంధం లేకుండా పచ్చని ప్రదేశాలను సందర్శిస్తే..వారి మానసిక స్థితి మాత్రమేగాక, యాంటీహైపెర్టెన్సివ్, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయని అధ్యయనంలో తేలిందన్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకైనా పక్షుల అభయారణ్యాలు, పర్వతాలు, బీచ్లు, సరస్సులు, నదులు వద్ద గడపండి అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
ఫుడ్ అలెర్జీ ఎందుకు వస్తుందో తెలుసా?
ఇంతవరకు ఎన్నో రకాల అలెర్జీలు చూశాం. కొన్ని రకాల ఎలర్జీలు చూస్తే మరీ ఇంత ఘోరంగా ఉంటాయా! అని ఆశ్చర్యపోతారు. అవి ఎంత జుగుప్సకరంగా ఉంటాయంటే..వామ్మో ఈ రేంజ్లో ఉంటుందా అలెర్జీ అన్నంత భయం వేస్తుంది. అలసు సడెన్గా ఇలా అలెర్జీలు ఎలా వస్తాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా చాలా షాకింగ్ విషయాలే వెల్లడించారు వివరాల్లోకెళ్తే..సీఫుడ్ ఎలర్జీ ఉన్నవారు వాటి వాసన చూసినా అనారోగ్యానికి గురవ్వుతారని అంటున్నారు. అంతేకాదు ఒక వేళ్ల ఆహారంగా తింటే ఎలా అనారోగ్యానికి గుర్వవ్వుతారో అలానే వాసన చూసి అవ్వుతారని చెప్పారు. అంతేకాదు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఇలా అలెర్జీకి దారితీసేందుకు ప్రధాన కారణం ఏంటన్న? దాని గురించి చాలా షాకింగ్ విషయాలే వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు అలర్జీపై యేల్ స్కూల్ ఆఫ్ మెడసిన్ వైద్య పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందుకు ప్రధాన కారణం రోగ నిరోధక వ్యవస్థే కీలకమని వెల్లడించారు. దీనికి సంబంధించిన పరిశోధన నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యింది. పరిశోధన ప్రకారం..ఏదైన పడని ఆహారం లేదా ఫుడ్ ఎలర్జీ ఉన్నవారిలో సడెన్గా సంభవించే మార్పుల్లో రోగ నిరోధక వ్యవస్థే కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనంలో తేలింది. రోగనిరోధక వ్యవస్థే శరీరంలో మార్పులను నియంత్రిస్తుందని ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. ఈ మేరకు యూల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ మాట్లాడతూ..మన శరీరానికి హాని చేసే విషపదార్థాలకు వ్యతిరేకంగా మన మెదడు రక్షణాత్మక చర్యలను తీసుకునేలా ఈ రోగనిరోధక వ్యవస్థే ప్రేరేపిస్తుందని కనుగొన్నామన్నారు. ఈ రోగ నిరోధక వ్యవస్థ కమ్యూనికేషన్ లేకుండా మెదడు పర్యావరణంలో సంభావ్య ప్రమాదాల గురించి శరీరాన్ని హెచ్చరించ లేదని కూడా తెలిపారు. అందుకోసం కొన్ని ఎలుకలపై అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. కోడి గుడ్లలో ఉండే ఓవా అనే ప్రోటీన్కు అలెర్జీ ప్రతిచర్యలు ఉంటాయని గుర్తించారు. దీంతో పరిశోధకులు ఎలుకలకు ఈ ఓవాతో కలిపిన నీటిని ఇవ్వగా..వాటిలో కొన్ని ఎలుకలు ఆ నీటిని నివారించేందుకు మొగ్గు చూపుతాయి. మరికొన్ని ఆ నీటిని ఇష్టపడటం గమనించారు. కొన్ని ఎలుకలు నెలల తరబడి గుడ్డు ఓవా నీటి పట్ల విముఖతను చూపించాయి. ఈ రోగనిరోధక వ్యవస్థలో వేరియబుల్స్ను మార్చడం ద్వారా ఎలుకల్లో ఈ విముఖత ప్రవర్తనను మార్చగలమా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అంటే రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇమ్యునోగ్లోబులిన్ (IgE) ప్రతిరోధకాలను నిరోధించినట్లయితే ఈ గుడ్డు ఓవా నీటికి అలెర్జీ ఉన్న ఎలుకలకు ఆ ప్రోటీన్ పట్ల ఉన్న విరక్తిని కోల్పోతాయని కనుగొన్నారు. ఇక్కడ ఒక కమ్యూనికేటర్ లేకుండా ఇదంతా జరగదని గుర్తించారు. దీని అర్థం రోగనిరోధక వ్యవస్థను ఉత్పత్తి చేసే IgE ప్రతిరోధకాలు మెదడుని మాస్ట్ కణాల విడుదలను ప్రేరేపించేలా కమ్యూనికేట్ చేస్తుందని. తద్వారా ఎలుకలు విరక్తి ప్రవర్తన లేదా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుందని చెప్పారు. అంతేగాదు జంతువులకు పర్యావరణంలో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేలా రోగనిరోధక వ్యవస్థ ఎల అభివృద్ధి చెంది ఉందో ఈ పరిశోధన వివరించిందన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: జస్ట్ చెమటతోనే డయాబెటిస్ని గుర్తించే సరికొత్త సాంకేతిక పరికరం!) -
గ్రహశకలాలకు ‘గాలం’!
గ్రహాలు, గ్రహశకలాలపై అధ్యయనం చేయడం ద్వారా విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమి పుట్టుపూర్వోత్తరాల గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. దీనికోసమే గ్రహాలు, గ్రహశకలాల నుంచి మట్టి, శిలల నమూనాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చంద్రుడు, ఇటోకవా అనే గ్రహశకలం నుంచి మాత్రమే నమూనాలు సేకరించగలిగారు. అంతరిక్షంలో సుదూర తీరాలకు ప్రయాణించి గ్రహాలపై, గ్రహశకలాలపై వ్యోమనౌకలను దింపి అక్కడి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమన్నది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. క్యూరియాసిటీ లాంటి రోవర్లు గ్రహాలపై దిగి మట్టిని విశ్లేషించి సమాచారం పంపగలిగినా మనిషి నేరుగా చేసే పరీక్షలకు, యంత్రాలు చేసే పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఇప్పటిదాకా ఆశించినంత పురోగతి సాధ్యం కాలేదు. అయితే.. గ్రహశకలాలకు ‘గాలం’ వేసి వాటి నుంచి నమూనాలు సేకరించే పనిని సులభం చేసే ఓ అద్భుత స్పేస్ టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన రాబర్ట్ వింగ్లీ బృందం అభివృద్ధిపరుస్తోంది. ఖగోళ వస్తువుల నుంచి నమూనాల సేకరణను కొత్తపుంతలు తొక్కించనుందని భావిస్తున్న ఈ అంతరిక్ష ‘గాలం’ సంగతేంటో ఇప్పుడు చూద్దాం... ఈటెలు రువ్వి... నమూనాలు సేకరించి.. చేపలు పట్టడానికి గాలం ఉపయోగిస్తారు. తిమింగలాలు పట్టేందుకు ఈటెల్లాంటి పెద్ద గాలాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే చేపలకు కొక్కెంలాంటి గాలం వేస్తారు. తిమింగలాలకు ఈటెలాంటి హార్పూన్ (తెలుగులో పంట్రకోల, రువ్వుటీటె అంటారు)లను యంత్రాల సాయంతో వేగంగా వదులుతారు. ముందు భాగం బాణంలా ఉండే ఈ హార్పూన్ తిమింగలాల శరీరంలోకి దిగిన తర్వాత చిక్కుకుపోతుంది. దీంతో హార్పూన్ను బలమైన తాడుతో మోటార్ల సాయంతో వెనక్కి లాగుతూ తిమింగలాలను ఓడ దగ్గరికి తీసుకొస్తారు. మరి ఈ ఐడియాను అంతరిక్షంలో ఎలా ఉపయోగిస్తారనే విషయానికొస్తే రాకెట్ మాదిరిగా మొనదేలిన కవచంతో ఉన్న హార్పూన్లను వ్యోమనౌకల ద్వారా పంపుతారు. హార్పూన్ను వ్యోమనౌకకు మైళ్లకొద్ది పొడవుండే దృఢమైన తాడుతో కడతారు. చంద్రుడు లేదా ఓ గ్రహ శకలం సమీపంలోకి వ్యోమనౌక వెళ్లిన తర్వాత హార్పూన్ బలంగా విడుదలవుతుంది. దీంతో సెకనుకు ఒక కి.మీ. వేగంతో హార్పూన్ దూసుకుపోయి ఆ ఖగోళ వస్తువు ఉపరితలంలోకి దిగబడిపోతుంది. హార్పూన్ నేలలోకి దిగిపోగానే దాని కవచం విడిపోతుంది. ఇంకేం.. లోపల ఉండే డబ్బాలోకి కొన్ని కిలోల వరకూ మట్టి, రాళ్లు చేరిపోతాయి. శాంపిల్తో కూడిన హార్పూన్ను తాడు సాయంతో వ్యోమనౌక వెనక్కి లాక్కుని భూమికి తిరిగి వచ్చేస్తుందన్నమాట. నాసా శాస్త్రవేత్తలు ఈ స్పేస్ హార్పూన్ని బ్లాక్రాక్ ఎడారిలో ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోనూ హార్పూన్ల ప్రయోగానికి వీరు సిద్ధమవుతున్నారు. ప్రయోజనాలు చాలానే... స్పేస్ హార్పూన్లతో గ్రహశకలంపై వేర్వేరు చోట్ల శాంపిళ్లను సేకరించవచ్చు. వ్యోమనౌకను దింపాల్సిన అవసరం లేనందున ఇంధనం బాగా ఆదా అవుతుంది. గ్రహాల ఉపరితలంపై కొన్ని మీటర్ల లోతు నుంచీ నమూనాలు సేకరించొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. విఫలమైన ఉపగ్రహాలకు చెందిన శకలాలు ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మనం పంపే ఉపగ్రహాలకు ముప్పు తెస్తున్నాయి. అలాంటి శకలాలపైకి హార్పూన్లను వదిలి, అవి గుచ్చుకున్నాక.. శకలాలను భూవాతావరణంలోకి ఈడ్చుకొచ్చి మండించొచ్చని అంటున్నారు. అలాగే.. భూమిపై అగ్నిపర్వతాల బిలాల నుంచి, అణు ప్రమాదాలు జరిగి రేడియోధార్మికత తీవ్రంగా ఉన్న చోటు నుంచి, ఇతర ప్రతికూలమైన ప్రదేశాల్లో ఆకాశం నుంచే శాంపిళ్లను సేకరించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: 2023లో ఎవరెస్టును ఎందరు అధిరోహించారు? సరికొత్త రికార్డు ఏమిటి? -
అటెన్షన్ ఉంటే..టెన్షన్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : పరీక్షల ఫోబియాతోనే ఇంటర్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సగానికి తగ్గుతోంది. హైటెన్షన్కు గురయ్యే విద్యార్థులు 36 శాతం ఉంటుండగా, పరీక్షల షెడ్యూల్ వచ్చాక టెన్షన్కు లోనయ్యేవారు 23 శాతం మంది ఉంటున్నారు. దీనికి సంబంధించి వైద్య, విద్యాశాఖలు రెండేళ్ల అధ్యయనం చేశాయి. మొదటి పరీక్ష కాస్త కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం ఫస్టియర్ పరీక్షలు 4.09 లక్షల మంది రాస్తున్నారు. సెకండియర్ పరీక్షలు 3.82 లక్షల మంది వరకూ రాస్తున్నారు. వీరిలో సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. దీంతో పరీక్షలు రాసే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల టెన్షన్ దూరం చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రిపరేషన్కు ఇదే అదును రెండు నెలల ముందు నుంచే పరీక్షలకు సన్నద్ధమైతే విద్యార్థుల్లో టెన్షన్ ఉండదని ఇంటర్ అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలనుకుంటున్నారు. ముందుగా విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తారు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వడానికి నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై లెక్చరర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులోనూ విద్యార్థి వెనుకబడి ఉన్న సబ్జెక్టులు, పాఠ్యాంశాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రిన్సిపల్స్కు ఇస్తారు. మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ఈ 60 రోజులూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో టెన్షన్ దూరం చేయడం తేలికని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పరీక్షల టైంటేబుల్ను బోర్డు విడుదల చేసింది. త్వరలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకునే చర్యలపైనా జిల్లా ఇంటర్ అధికారులు టైం టేబుల్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సిలబస్ సకాలంలో పూర్తికాకపోవడం కూడా విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్కు ఓ కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతుందని అధ్యయన నివేదికల సారాంశం. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకొని కొన్ని జిల్లాలపై ఇంటర్ అధికారులు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు కనబరుస్తున్న జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ వంటి జిల్లాలున్నాయి. సెకండియర్లో మెదక్, నాగర్కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ముఖ్యాంశాలు... ♦ ప్రతీ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు – 7 లక్షలకుపైగా ♦ ఫెయిల్ అవుతున్న వారు – 2.5 లక్షల మంది ♦ పరీక్షల ఫోబియా వెంటాడుతున్న విద్యార్థులు – 1.02 లక్షల మంది ♦ పరీక్ష షెడ్యూల్ ఇవ్వగానే భయపడే వారు – 28 వేల మంది ♦ సిలబస్పై టెన్షన్ పడుతున్న విద్యార్థులు – 51 వేల మంది మానసిక ధైర్యం నింపాలి ఈ 60 రోజులూ లెక్చ రర్లది కీలకపాత్ర. పరీక్షల భయం ఉన్న వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. వెనుకబడ్డ సబ్జెక్టులపై రివిజన్ చేయించడం ఒక భాగమైతే, వీలైనంత వరకూ పరీక్ష తేలికగా ఉంటుందనే భావన ఏర్పడేలా చూడాలి. దీనివల్ల ఎగ్జామ్ ఫోబియా తగ్గుతుంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లిదండ్రులదీ కీలకపాత్రే పరీక్షల భయం వెంటాడే విద్యార్థి సైకాలజీని బట్టి అధ్యాపకులు వ్యవహ రించాలి. వారిని ప్రణాళిక బద్ధంగా చదివించే విధా నం అనుసరించాలి. సాధ్యమైనంత వరకూ పరీక్ష వెంటాడుతోందన్న భావనకు దూరం చేయాలి. చదివే ప్రతీ అంశం గుర్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా జాగ్రత్త పడాలి. పరీక్షల పట్ల భయం అనిపిస్తే నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పించాలి. – రావులపాటి సతీష్బాబు, మానసిక వైద్య నిపుణుడు స్టడీ అవర్స్ పెడుతున్నాం విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేందుకు 60 రోజుల పాటు ప్రత్యేక కార్య క్రమాలు చేపడుతున్నాం. వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, స్పెషల్ క్లాసులు నిర్వహించమని ఆదేశాలిచ్చాం. టెన్షన్ పడే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వమని ప్రిన్పిపల్స్కు చెప్పాం. అవసరమైతే టెలీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. – జయప్రదాబాయ్,ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి -
పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం మద్యపానమే!వెలుగులోకి షాకింగ్ విషయాలు
ప్రెగ్నెన్సీ లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే మాత్రం పురుషులు మద్యం సేవించడం మానేయాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. లేదంటే గర్భధారణ సమస్యలు లేదా పిల్లల్లో సరైన పెరుగుదల లేకపోవడం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువుగా ఉటాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కనీసం ఓ వారం రెండు వారాల నుంచి మద్య మానేయడం కాదని బాంబు పేల్చారు. సేవించిన మద్యం ప్రభావం స్పెర్మ్పై ఎలా ఉంటుందో కూడా సవివరంగా వివరించారు. మద్య సేవించే పురుషులకు పుట్టే పిల్లల్లో ఎలాంటి సమస్యలొస్తాయో తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇంతవరకు గర్భధారణ, పిల్లల అభివృద్ధి విషయాల్లో తల్లి ఆరోగ్యాన్ని కీలకంగా పరిగణించేవారు పరిశోధకులు. ఆ దిశగానే పరిశోధనలు చేయడం జరిగింది. అయితే గర్భధారణకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా ఆ మహిళకు పిల్లలు కనడంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే దిశగా పరిశోధనలు జరగలేదు. తొలిసారిగా ఆవైపుగా అధ్యయనం సాగించారు శాస్త్రవేత్తలు. ఆ పిండానికి ఆల్కహాల్ సిండ్రోమ్(ఎఫ్ఏఎస్)తో సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయా? అనే దిశగా సరికొత్త ప్రయోగాలు చేశారు. ఆ అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగా బరువు తక్కువుగా జననాలు, హైపర్ యాక్టీవిటీ సమస్యలు, సరైన ఎదుగుదల లేని పిల్లలు పుట్టడానికి కారణమని తేలింది. పిల్లలను లేదా ఫ్యామీలిని ప్లాన్ చేసుకుంటే మగవాళ్లని మద్యం సేవించకుండా మహిళలే చూసుకోవాలని లేదా బాధ్యత తీసుకోవాలని సూచించారు పరిశోధకులు. మద్యం సేవించిన ఎంతకాలం వరకు స్పెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం ఉంటుందనే దానిపై కూడా పరిశోధనలు నిర్వహించారు. తండ్రి ఆల్కహాల్ అలవాట్లు పిండం అభివృద్ధిలో బలమైన ప్రభావం ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. దీంతో తాము స్పెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం తగ్గడానికి ఎంత సమయం పడుతుందో అనే దిశగా కూడా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అందుకోసం మగ ఎలుకలపై ప్రయోగాలు చేయగా..కొన్నింటి ఆల్కహాల్కు గురిచేసి మరికొన్నింటికి ఆల్కహాల్ ఇవ్వకుండా చూడగా వాటి జన్యువుల్లో సంభించిన పలు మార్పులను గమనించినట్లు తెలిపారు. ఈ పరిశోధనల్లో కనీసం మూడు, నాలుగు వారాలు కాకుండా ఏకంగా మూడు నెలల పాటు ఆల్కహాల్కి దూరంగా ఉంటేనే వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్పై ప్రభావం ఉండదని అధ్యయనంలో వెల్లడయ్యిందని అన్నారు. అలాగే మగవారిలో స్పెర్మ్ 60 రోజుల వ్యవధిలో తయారవుతుందని మాకు తెలుసు. కానీ మద్యం మానేసిన ఒక నెలకు గానీ సెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం తగ్గటం ప్రారంభమవ్వదని అన్నారు. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పడూ కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు మద్యం మానేయాల్సిందేనని సూచించారు. అప్పటి వరకు ఆగి ఫ్యామిలీని ప్లానే చేసుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు మద్యం మానేసినప్పటికీ దాని తాలుకా రసాయనా ప్రభావం శరీరంలో అలా కొనసాగుతు ఉంటుందని అందువల్ల మూడు నెలల సమయం విరామం తీసుకోవాల్సిందేనని అన్నారు. లేదంటే తల్లిదండ్రులు ఆల్కహాలిక్ సంబంధిత పుట్టుకతో వచ్చే లోపాలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు పరిశోధకులు. (చదవండి: భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు) -
టమాటాలు ఫ్రిజ్లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!
సాధారణంగా టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఫ్రిజ్లో పెడితే కనీసం ఓ వారం అయినా వాడుకోవచ్చు. అందులో అయితే కనీసం నాలుగురోజుల వరకు పాడవ్వకుండా కాపాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇలా ఫ్రిజ్లో పెట్టడం అస్సలు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్లో పెట్టొదని హెచ్చరిస్తున్నారు కూడా. ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందో దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు. ఎందుకు పెట్టకూడదంటే.. ఫ్రిజ్లో పెడితే టమాటాలు ముందుగా వాటికుండే సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయని చెబతున్నారు పరిశోధకులు. 39 డిగ్రీల చల్లటి ఉష్టోగ్రతలో ఉన్న టమాటాల్లో వాటికి సహజంగా ఉండే వాసన ఎలా కోల్పోతుంది పరిశోధనలో వెల్లడైంది. ఒకటి రెండు రోజులు ఫ్రిజ్లో ఉంటే పర్లేదు గానీ చాలా రోజులు ఫ్రిజ్లో ఉంటే మాత్రం టమాటకు ఉన్న సహజ లక్షణం కోల్పోతుందని చెప్పారు. అలాగే దాని డీఎన్ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయని అన్నారు. మిథైలేషన్ అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం. జీవి డీఎన్ఏకి అనుగుణంగా పనితీరును మార్చే ప్రక్రియ ఇది కీలకం. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సక్రమంగా లేకపోతే అసాధారణ వ్యాధుల వచ్చేందుకు దారితీస్తుంది. ఎప్పడైతే సుదీర్థకాలం రిఫ్రిజిరేటర్లో టమోటాలు ఉంచుతామో వాటి లోపల ఉన్న జెల్లీ విరిగిపోతుంది. దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది. ఒకరకంగా చెప్పాలంటే లోపలంతా జ్యూసీగా అయిపోతుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం అంత మంచిది కాదు. టమాటాలు పండినప్పడు ఇథిలిన్ను విడుదల చేస్తాయి. ఐతే ఫ్రిజ్లోని చల్లదనం కారణంగా టమాటాల్లో ఇథిలిన్ ఉత్పత్తిని నిలిచిపోతుంది.. దీంతో టమాటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిది. టమాటాలు పండినప్పుడు ఇథిలిన్ను విడుదల చేస్తాయి. ఐతే రిఫ్రిజిరేటర్లోని చల్లదనం ఈ ఇథిలీన్ ఉత్పత్తిని నిలిపేస్తుంది. ఇది టమోటాలు రుచిని కోల్పోవడానికి లేదా పుల్లగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి టమోటాలు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుదీర్ఘకాలం ఫ్రిజ్లో ఉన్న టమాటాలు విషంతో సమానమని వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. కాగా, తాము ప్రస్తుతం చల్లదనంలో కూడా టమాటాలు రుచిని కోలపోకుండా ఉండేలా పలు పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: టైప్ 2 డయాబెటిస్ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు! శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్పెట్టేలా..) -
భూగర్భజల పరిరక్షణలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: గతేడాది కంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైనా భూగర్భజలాల పెరుగుదలలో దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. వర్షం తక్కువగా కురిసినా రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలుగా మార్చే జలసంరక్షణ చర్యలు మెరుగ్గా చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర భూగర్భ జలవనరుల మండలి (సీజీడబ్ల్యూబీ) ప్రశంసించింది. దేశంలో ఈ ఏడాది భూగర్భజలాల పరిస్థితిపై సీజీడబ్ల్యూబీ అధ్యయనం చేసింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలపై కేంద్ర జల్శక్తి శాఖకు ఇటీవల నివేదికను అందించింది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. వరుసగా రెండో ఏడాదీ అగ్రగామిగా రాష్ట్రం ♦ దేశవ్యాప్తంగా 6,553 మండలాలు/బ్లాక్లలో భూగర్భజలాల పరిస్థితిపై సీజీడబ్ల్యూబీ అధ్యయనం చేసింది. రాష్ట్రంలో 667 మండలాల్లో అధ్యయనం చేసింది. ♦ నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఏటా సగటున దేశంలో 1,236.4 మిల్లీమీటర్లు, రాష్ట్రంలో 1,148.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాలి. ♦ ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షం కురిసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 835.03 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 714.88 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 14.39 శాతం తక్కువగా నమోదైంది. ♦ వర్షపాతం, జలసంరక్షణ కట్టడాలు, చర్యల వల్ల దేశంలో 2023లో భూగర్భజలాలు 15,861.50 టీఎంసీలు పెరిగాయి. ఇందులో జాతీయ ప్రమాణాల మేరకు 14,382.65 టీఎంసీలు (90.67 శాతం) వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో 8,524.12 టీఎంసీలను (59.26%) ఇప్పటికే వినియోగించుకున్నారు. ♦ రాష్ట్రంలో వర్షపాతం, జలసంరక్షణ చర్యల వల్ల భూగర్భజలాలు ఈ ఏడాది 983.30 టీఎంసీలు పెరిగాయి. ఇందులో 934.21 టీఎంసీలు వాడుకోవచ్చు. అందులో ఇప్పటివరకు 264.18 టీఎంసీలు (28.3 శాతం) మాత్రమే వినియోగించుకున్నారు. ఇటు భూగర్భజలాలు సంరక్షిస్తూ, అటు పొదుపుగా వినియోగించుకుంటూ భూగర్భజలాల పరిరక్షణలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. గతేడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షం కురిసినా భూగర్భజలాలు 982.95 టీఎంసీలే పెరగడం గమనార్హం. ♦ భూగర్భజలాల పరిరక్షణలో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా అగ్రగామిగా నిలిచింది. ♦ దేశంలో 2–5 మీటర్ల లోతులోనే పుష్కలంగా భూగర్భజలాలు లభ్యమయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, ఉత్తరప్రదేశ్ (ఉత్తర ప్రాంతం), బిహార్ (ఉత్తర ప్రాంతం) నిలిచాయి. భూగర్భజలమట్టం దారుణంగా 20–40 మీటర్లకు పడిపోయిన రాష్ట్రాల్లో ఢిల్లీ, హరియాణ, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయి. జలసంరక్షణ చర్యల వల్లే రాష్ట్రంలో కురిసిన వర్షపాతం కంటే.. ప్రాజెక్టులు, చెక్డ్యామ్లు, అడవుల్లో కందకాలు తవ్వడం వంటి జలసంరక్షణ చర్యల వల్లే భూగర్భజలాలు అధికంగా పెరుగుతున్నాయి. వర్షాకాలంలో వర్షం వల్ల 316.82 టీఎంసీలు భూగర్భజలాలుగా మారుతుండగా.. జలసంరక్షణ చర్యల వల్ల 351.08 టీఎంసీలు భూగర్భజలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇక చలి, వేసవి కాలాల్లో కురిసే వర్షాల వల్ల 30.02 టీఎంసీలు భూగర్భజలాలుగా మారుతుంటే.. జలసంరక్షణ చర్యల వల్ల 285.38 టీఎంసీలు భూగర్భజలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. వ్యవసాయానికే సింహభాగం వినియోగం రాష్ట్రంలో భూగర్భజలాలను సింహభాగం వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. పంటల సాగుకు 227.46 టీఎంసీలను బోరుబావుల ద్వారా రైతులు వాడుకుంటున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం 4.94 టీఎంసీలను బోరుబావుల ద్వారా వినియోగించుకుంటున్నారు. గృహ అవసరాల కోసం ప్రజలు 31.78 టీఎంసీలను వాడుకుంటున్నారు. -
పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
భారతీయ వంటకాల్లో పప్పులు చాలా ప్రధానమైనవి. కచ్చితంగా ఏదో రూపంలో మన ఆహారంలో పప్పులు తీసుకుంటాం. అది పప్పుగా వండుకుని తీసుకోవడం లేదా స్నేక్స్ రూపంలోనో పప్పులను తీసుకోవడం జరగుతుంది. అలాంటి వాటిని రోజూవారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు ఇంకా మంచిదని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు పరిశోధకులు పప్పుధాన్యాలపై జరిపిన అధ్యయనంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అవేంటంటే.. పరిశోధకుల అధ్యయనం ప్రకారం అన్ని రకాల కాయధాన్యాలు, చిక్కుళ్లు జాతికి చెందినవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో మంచి ప్రోటీన్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదీగాక పప్పుల్లో తక్కువుగా గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరని ప్రభావవంతంగా తగ్గిస్తాయి. అందువల్ల టైప్ 2 మధుమేహం ఉన్నవారికి అధిక ఫైబర్ ఉన్న పప్పు దినుసులు ఎంత మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు టోరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సుమారు 121 మంది మధుమేహ రోగులపై అధ్యయనం నిర్వహించారు. వారిలో సగం మందికి ఆహారంలో ప్రతిరోజూ ఒక పప్పు ధాన్యాలను చేర్చారు. మిగిలిన సగం మందికి గోధుమ ఆహారాన్ని ఇచ్చారు. అధికంగా పప్పుజాతికి సంబంధించిన వాటిని తీసుకున్న వారిలో చక్కెర హెచ్బీఏ1సీ(హీమోగ్లోబిన్ ఏ1సీ) స్థాయిల్లో తగ్గుదల కనిపించింది. ఇందులో ఉండే ఫైబర్లు రక్తంలోని చక్కెరను సమర్ధవంతగా నియంత్రించాయి. ముఖ్యంగా పప్పులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) ఉండటం కారణంగా రక్తంలోని గ్లైసెమిక్ని సులభంగా నియంత్రించగలదని తెలిపారు. ఈ పప్పుజాతికి చెందిన కాయధాన్యాలు నేరుగా రక్తంలోనే గ్లూకోజ్ని విడుదల చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగదని చెబుతున్నారు. వీటిలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా విచ్ఛిన్నమవుతాయి. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ని సమస్థాయిలో ఉంచడం లేదా స్థిరంగా ఉండేటట్లు చేస్తాయిని చెబుతున్నారు. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు పప్పుధాన్యాలు అత్యంత మంచివి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈజీగా రక్తంలో కరిగిపోగలదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వుల, తక్కువ గ్లైసెమిక్ ఆహారా పదార్థాల తోపాటు ఈ పప్పు ధాన్యాలను కూడా చేర్చితే మరింత పోషాకాలతో కూడిన ఆహారం అందినట్లు అవుతుంది. పైగా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది పప్పులకి సంబంధించిన మరిన్నీ ఆసక్తికర విషయాలు.. కెనడియన్ల అధ్యయనం ప్రకారం పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లుకు ప్రతిస్పదించే విధానం ప్రభావితం అవుతున్నట్లు గమనించారు. ఫలితంగా గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతున్నట్లు తెలిపారు అధ్యయంనంలో బంగాళ దుంపలు, బియ్యం స్థానంలో పప్పులు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సుమారు 20%కి పైనే తగ్గుతాయి. సగం అన్నం స్థానంలో అధికంగా కాయధాన్యాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సుమారు 20% వరకు తగ్గుదల కనిపించింది పూర్తిగా పప్పుధాన్యాలను తీసుకుంటే 35%పైగా చక్కెర స్థాయిలు తగ్గుతాయిని చెబుతున్నారు పరిశోధకులు కాబట్టి పప్పులను మీ రోజూవారి ఆహారంలో సూప్ రూపంలోనే లేదా స్నాక్స్ కింద ఉకడబెట్టి తీసుకున్నా మంచిది. అదీగాకుండా మీరు తీసుకునే సలాడ్లో వీటిని కూడా చేర్చుకున్నా మంచిదే. అలా కాకుండా రోజూ పప్పుతినలేం అనుకున్న వాళ్లు, ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు మీరు తినే చికెన్, మటన్కి ఈ పప్పు ధాన్యాలను జోడించి తీసుకోవచ్చని చెబుతున్నారు పోషాకాహార నిపుణులు. (చదవండి: చపాతీలు డయాబెటిక్ రోగులకు మేలు! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన నిరుపేద విద్యార్థిని వాచ్చల్య శ్రీ ఉన్నత చదువు చదుకోవాలనే కోరికను ఎమ్మెల్యే తీర్చారు. రష్యాలో ఎంబీబీఎస్ సీటు వాచ్చల్య శ్రీ సాధించగా, రష్యాలో ఆమె చదువుకయ్యే సుమారు రూ.50 లక్షల ఖర్చును ఎమ్మెల్యే భరించి చదివించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ, కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు. ఇదీ చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
కోవిడ్ కొత్త వ్యాక్సిన్ ఆ క్యాన్సర్ని రానివ్వదు! అధ్యయనంలో వెల్లడి
కోవిడ్ మహమ్మారి ప్రజలను ఎంతలా వణికించిందో తెలిసిందే. దీన్ని నుంచి సురక్షితంగా బటపడేందుకు బయోఎన్టిక్ కొత్త ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆ క్యాన్సర్ మహమ్మారిని రాకుండా కూడా నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో కనుగొన్నారు. కరోనా కోసం వ్యాక్సిన్ వేసుకున్నట్లే క్యాన్సర్ వ్యాక్సిన్లు వేసుకొవచ్చేనే ఆలోచనకు పురిగొల్పింది. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా లేదా క్యాన్సర్ అటాక్ అయ్యే దశలో ఉన్న వాళ్ల పాలిట ఈ వ్యాక్సిన్ వరం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఇది ఏ రకమైన క్యాన్సర్ని రాకుండా కాపాడుతుంది? అధ్యయనంలో కనుగొన్న సరికొత్త విషయలేంటీ?.. కోవిడ్కి సంబంధించిన ఎంఆర్ఎన్ వ్యాక్సిన్లపై క్లినకల్ ట్రయల్స్ నిర్వహించగా ఈ సరికొత్త విషయం వెల్లడైంది. ఇది క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు క్యాన్సర్ ఇమ్యునోథెరపీకి చెందిన డేవిడ్, రూబెన్స్టెయిన్ సెంటర్ ఫర్ ఫ్యాంక్రియాటిక్ క్యాన్సర్ రీసెర్చ్కు సంబంధించిన శాస్త్రవేత్త వినోద్ బాలచంద్రన్ల బృందం ఈ విషయాలను వెల్లడించింది. ఇంతకీ ప్యాక్రియాటిక్ క్ అంటే.. జీర్ణవ్యవస్థలో ఒక భాగం. ఇది పొత్తికడుపులో ఉండే శరీర అవయవం. ప్యాంక్రియాస్ నిర్వహించే ముఖ్యమైన విధులేంటంటే.. జీర్ణక్రియను సులభతరం చేసే ఎక్సోక్రైన్ ఫంక్షన్, రరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఎండోక్రైన్ పనితీరు. అయితే ఈ అవయవం వెలుపల అసాధారణ కణుతులు వస్తే దాన్ని ప్యాక్రియాటిక క్యాన్సర్ అంటారు. దీని వల్ల ఆహారం అరగదు. నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించటం కష్టం. దీనఇన తొలి దశలో గుర్తిస్తేనే రోగికి చికిత్స అందించి ప్రాణాలను కాపడగలం. అలాంటి ప్రమాకరమైన ప్యాక్రియాటిక్ క్యాన్సర్ని ఈ వ్యాక్సిన్ రాకుండా ఆపగలదని చెబుదున్నారు వైద్యులు. ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్ కణాలను గుర్తించేలా హెచ్చారిస్తాయి. తత్ఫలితంగా ప్యాంక్రియాటిక్ కణితుల్లో కనిపించే నియాయాంటిజన్ ప్రోటీన్లు అలారం గంటలుగా పనిచేసేలా చేసి రోగనిరోధక వ్యవస్థను సమీకరిస్తుంది. ఈ వ్యాక్సిన్లో ఉండే టీ కణాలు నిర్దిష్ట రోగ నిరోదక కణాల ఉత్పత్తిని ప్రేరిపించే లక్ష్యంతో పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. దీంతో రోగుల్లో ఈ క్యాన్సర్ కణితిని సులభంగా గుర్తించి శస్త్ర చికిత్స ద్వారా తొలగించగలుగుతారు వైద్యులు. అంతేగాదు మళ్లీ ఈ క్యాన్సర్ పునరావృత్తం గాకుండా చేస్తుంది డాక్టర్ బాల చంద్రన్ అన్నారు. దాదాపు ఏడేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగులలో ఎలా పనిచేస్తుందనే ఆలోచనను రేకెత్తించిందని ఆ దిశగా మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని అన్నారు వైద్యులు. ఈ టీకాలు సంప్రదాయ టీకాల వలె కాకుండా జన్యు సంకేత విభాగాన్ని ప్రేరేపించి నిర్దిష్ట ప్రోటీన్ ఉత్పతి చేసేలా నిర్దేశిస్తుంది. తద్వారా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. అందువల్ల ఈ వ్యాక్సిన్ ప్యాక్రియాంటిక్ క్యాన్సర్ని రాకుండా నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పరిశోధనలు ప్యాంక్రియాంటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు జీవితంపై సరికొత్త ఆశను అందిస్తాయని అన్నారు వైద్యులు. దాదాపు 20 మంది రోగులపై చేసిన క్లినికల్ ప్రయోగాల్లో ఈ చక్కటి ఫలితాలు కనిపించాయన్నారు. ఒకరకంగా పరిశోధనలు వ్యాక్సిన్ల ఆవశక్యత తోపాటు ఇతర క్యాన్సర్లను నివారించేలా మరిన్ని వ్యాక్సిన్లు అభివృద్ధి చేసే ఆలోచనకు నాంది పలికిందన్నారు. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సవాలుకు చెక్పెట్టేలా చేసి రోగుల జీవితంలో కొత్త ఆశాజ్యోతిని వెలిగించిందన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: సెల్యులర్ రీప్రోగ్రామింగ్కి ఆ విటమిన్ కీలకం: పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
ఓట్.. ఆల్ఔట్..
ముందుగా నాయకుల హామీలపై.. రెండు మాటలు సరదాగా.. అసలే చలికాలం.. ఆపై ఎన్నిక లు.. ఇంకేం గొర్రెల నాయకుడు దండోరా వేయించాడు. మా పాలనలో అన్ని గొర్రెలకు ఉచితంగా కోటు పంపిణీ చేస్తానని. అన్ని గొర్రెలు ఖుషీగా పండుగ చేసుకున్నాయి. ఇలాంటి నాయకుడు దొ రకడం తమ అదృష్టమని పాలాభిషేకాలూ గట్రాలూ చేశాయి. అందులో కాసింత అమాయకంగా, అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న గొర్రెకు రాకూడని డౌట్ వచ్చింది..అడగకూడని ప్రశ్న ఆ నాయకుడిని అడిగింది. ‘మేం ఇంతమందిమి ఉన్నాం కదా.. అందరికీ అంత ఉన్ని ఎక్కడనుంచి తెస్తారూ ’.. అని. ‘‘ ఇంకెక్కడనుంచి గొర్రెల నుంచే తీస్తాం కదా..’’ నాయకుడి సమాధానం. మగదోమ – నీకోసం సింహాన్ని వేటాడి తేనా డియర్ ఆడదోమ – వద్దులే ముందు పడుకో మగదోమ – పోనీ ఐరావతాన్ని కుట్టి నీకు బ్లడ్ బాత్ చేయించనా ఆడదోమ– వద్దు..వద్దు ముందు నిద్రపో, నాకూ నిద్ర వస్తోంది మగదోమ – పోనీ ఇంకా ఏదైనా.... ఆడదోమ– అసలే ఓట్ల టైమ్.. రాజకీయ నా యకులను కుట్టి వచ్చావా ఏంటి... నోరుమూసుకు ని పడుకోకపోతే ఆల్ ఔట్ పెట్టి బయటకు పోతా.. ఇదో సైకాలజీ.. ఇలాంటి జోకులు, కథలు ఎన్నికల టైమ్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇదంతా రాజకీయ నాయకులపై. ఎన్నికలపై, పోలింగ్పై వారి అభిప్రాయాన్ని ప్రతిఫలిస్తుంటాయి. చాలామంది ఓటర్లు ఎన్నికల పట్ల నిరాసక్తంగా, పోలింగ్కు దూరంగా ఉంటుంటారు. వీలుంటే పోలింగ్ తేదీని హాలిడేగా కూడా పరిగణిస్తుంటారు. పొలిటీషియన్లపై , ఎన్నికలపై మంచి అభిప్రాయం క్రమక్రమంగా కనుమరుగవుతోందని పై జోకులు చెబుతూనే ఉంటాయి. ఇలాంటి కథల వెనుక, ఓటు పట్ల నిరాసక్తత వెనుక సైకాలజీ కూడా ఉందట..అమెరికాలోని స్టోనీబ్రూక్, మిన్నెసోటా యూనివర్సిటీల పొలిటికల్ సైన్స్–ఎలక్షన్ సైకాలజీ ప్రొఫెసర్లు అధ్యయనం చేసి ఇలా చెబుతున్నారు.. నిరాసక్త జీవులు.. ♦ జీవితంలో కష్టానష్టాలు ఎదుర్కొని ప్రభుత్వం నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి సాయం దక్కనివారు ఓటేసేందుకు విముఖతతో ఉంటారు. తమకు లాభం లేదనుకున్నప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏమిటన్న అభిప్రాయం వారిది. ♦ తోటివారిని పెద్దగా నమ్మనివారు, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడతారనే అభిప్రాయంతో ఉన్నవారు కూడా ఓటింగ్కు దూరంగా ఉంటారట. ♦ పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోవడంతోనూ ఓటు వేయకుండా ఉండేవారూ ఎక్కువే. తమకు న చ్చిన అభ్యర్థి ఉన్నప్పుడే ఓటు వేయాలనిపిస్తుందని కొందరు ఓటర్లు ఓ సర్వేలో వెల్లడించారు. ♦ అభ్యర్థుల్లో ఎవరూ మంచివారు లేరని.. చెడ్డవారిలో ఎక్కువ, తక్కువ అంటూ ఎవరూ ఉండరనే అభిప్రాయంతో ఓటేయడం లేదని చెప్పినవారూ ఎందరో. ♦ కొందరైతే నిత్యం రాజకీయ వార్తలను చూస్తుంటారు. పార్టీలు, అభ్యర్థులపై చర్చలూ చేస్తారు. కానీ ఎన్నికల వ్యవస్థ రిగ్గింగ్కు గురైందనే, ఎవరు గెలుస్తారో ముందే తేలిపోయినట్టేననే భావనతో ఓటు వేయరు. ♦ గెలిచినవారు హామీలు నిలబెట్టుకోకపోవడం, డబ్బులున్నవారే గెలుస్తుండటం వంటివి కూడా జనం ఓటింగ్పై అనాసక్తికి కారణాలు ♦ ‘రాజకీయాలతో, నేతలతో మనకేం పని, నా పనేదో నాకుంది..’ అనుకునేవారు ఓటేసేందు కు వెళ్లరు. ముఖ్యంగా యువతలో ఇలాంటి భా వన కనిపిస్తుందని.. కెరీర్, చదువు, ఇతర వ్యా పకాల్లో మునిగి ఉండటంతో వారు నిత్యవార్తలకు, రాజకీయాలకు దూరంగా ఉంటుండట మే దీనికి కారణమని అధ్యయనం పేర్కొంది. రాజకీయ జీవులు.. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, రాజకీయాలు–ఎన్నికలు తమ నిత్యజీవితంపై ప్రభావం చూపుతాయన్న అవగాహన ఉన్నవారు క చ్చితంగా ఓటు వేస్తారని.. కొత్త అంశాలు, సంగతులపై ఆసక్తి ఉండేవారు ఓటు వేసే అవకాశాలు ఎక్కువని, దీనికి భిన్నంగా ఉండేవారు దూరంగా ఉంటారని తేల్చింది. నిస్వార్థజీవులు.. ఎప్పుడో అరుదుగా తప్ప మామూలుగా అయితే ఒక ఓటు పడకపోతే, లేక అటూ ఇటూ అయితే వచ్చే తేడా ఏమీ ఉండదనే భావనలో కొందరు ఉండగా, గంటల తరబడి క్యూలో నిలుచుని మరీ ఓటు వేసేవారు కొందరు. మనుషుల్లో ఉండే నిస్వార్థమైన తత్వమే ఇలా ఓటు వేయడానికి కారణమని న్యూయార్క్ యూనివర్సిటీ సైకాలజీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారతీయుల బాధ.. ♦ మేం ప్రభుత్వంపై, పథకాలపై ఆధారపడటం లేదనే భావనతో ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు ఓటు వేయడానికి దూరంగా ఉంటున్నాయి. తమకు ఏమైనా అవసరమైతే డబ్బుతోనో, పలుకుబడితోనో చేసుకోగలమనేది వారి భావన. ♦ సొంత ప్రాంతాలను వదిలి వలస వెళ్లినవారు.. కొత్త ప్రాంతాల్లో నేతలు, అభ్యర్థులపై ఆసక్తి లేకుండా ఉండటం, వారాంతాల్లో పోలింగ్ వల్ల ఓటేయడం కంటే వినోదంపై దృష్టిపెట్టడం వల్ల కూడా ఓటింగ్ శాతం తగ్గుతోంది. ♦ భూస్వాములో, నేర చరిత్ర ఉన్నవారో, రాజకీయాలు తెలియని ప్రముఖులో ఎన్నికల బరిలోకి దిగినచోట మధ్యతరగతి, యువత వారిపట్ల ఏహ్యభావంతో ఓటేయడం లేదు. వేరేవారికి వేసినా గెలవరని భావిస్తున్నారు. ♦ రోతగా మారిన రాజకీయాలకు, నేతల అవినీతికి నిరసన అంటూ కొందరు ఓటు వేయకుండా ఉంటున్నారు. ♦ ఓటు ప్రాధాన్యత చాటి చెప్తూ సెలబ్రిటీలతో ఎన్నికల సంఘం చేస్తున్న ప్రచారం పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని.. యువత పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేయడం లేదని పరిశీలకులు చెప్తున్నారు. అమెరికాలోనూ అంతే.. పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాలో జనం ఓటేయడంలో బద్ధకస్తులే. అక్కడ పేదలు, యువత, విదేశాల నుంచి వచ్చి స్థిరపడినవారు పెద్దగా ఓటేసేందుకు ముందుకు రావడం లేదని అధ్యయనాల్లో తేలింది. -సరికొండ చలపతి -
ఆ సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట!
కేలరీలు బర్న్ అవ్వాలని రకరకాల వ్యాయామాలు, ఏవేవో ఫీట్లు చేస్తుంటా. అంతా చేసిన కాస్తో కూస్తో బరువు తగ్గుతాం. కానీ ఆ సినిమాలు చూస్తే వందల కొద్ది కేలరీలు ఖర్చు అవ్వడమే గాక ఆకలి తగ్గి తెలియకుండానే మితంగా తింటమట. బరువు కూడా ఈజీగా తగ్గుతామని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అదెలా సాధ్యం పైగా కూర్చొని సినిమా చూస్తే కేలరీలు తగ్గిపోతాయా..? అనిపిస్తుంది కదా!. కానీ ఇది నిజం అని బల్లగుద్ది మరీ నమ్మకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హారర్ మూవీలు చూసే అలవాటు ఉంటే..ఇంకా మంచిది అంటున్నారు పరిశోధకులు. హాయిగా హారర్ మూవీలు చూస్తూ.. ఈజీగా కేలరీలు తగ్గించుకోండి అని అంటున్నారు. ఈ మేరకు వెస్ట్మినిస్టర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం మూవీ రెంటల్ కంపెనీ సాయంతో సుమారు పదిమందిపై ఈ పరిశోధన చేశారు. వారంతా హారర్ మూవీలు చూస్తున్నప్పుడూ.. వారికి హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ తీసుకుని కార్బన్డయాక్సైడ్ని వదులుతున్న రేటును కొలిచే పరికరాలను కూడా అమర్చారు. ఈ పరిశోధనలో పాల్గొన్న ఆ పదిమందికి సినిమాలు చూస్తున్నప్పుడూ.. హృదయ స్పందన రేటు, జీవక్రియ రేటు పెరిగాయని, తత్ఫలితంగా ఎక్కువ కేలరీలు బర్న్ అయినట్లు కనుగొన్నారు. అంతేగాదు ఈ కేలరీలు బర్న్ అవ్వడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని అన్నారు. కాగా ఈ పరిశోధనలో 90 నిమిషాల భయానక చిత్రం సగటున 150 కేలరీలను బర్న్ చేస్తుందని తెలిపారు. అది దగ్గర దగ్గరగా.. మనం చేసే జాగింగ్ లేదా 30 నిమిషాల పాటు చేసే వాకింగ్లో తగ్గే కేలోరీలకు సమానం అని చెప్పారు. తమ అధ్యయనం పాల్గోన్న ఆ పదిమంది చూసిన మొదటి పది రకాల భయానక చిత్రాలు వరుసగా ఎన్ని కేలరీలను బర్న్ చేశాయో కూడా వివరించారు. ఒత్తిడి సమయంలో విడుదలయ్యే అడ్రినల్ వేగంగా విడుదలై ఆకలిని తగ్గించి, బేసల్ మెటబాలిక్ రేటును పెంచి అధిక స్థాయిలో కేలరీలను తగ్గిస్తుందని డాక్టర్ రిచర్డ్ మాకెంజీ అన్నారు. ఈ పరిశోధన రోజూవారి వ్యాయామాన్ని, సక్రమమైన ఆహారపు అలవాట్లను మానేయమని సూచించదని హెచ్చరించారు. ఆరోగ్యకరంగా బరువు, జీవనశైలి ఉండాలంటే హారర్ మూవీలు ఒక్కటే చూడటం సరిపోదని చెప్పారు. సులభంగా కేలరీలు తగ్గించే పరిశోధనల్లో భాగంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామే గానీ ఇదే సరైనదని చెప్పడం లేదన్నారు. (చదవండి: 'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..) -
బీపీని కరెక్ట్గానే చెక్ చేస్తున్నారా? రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదా..?
ఇప్పుడు ఎవర్నీ కదలించినా బీపీ ఉందని చెబుతుంటారు. నిజానికి అంతమందికి బీపీ ఉందా? కరెక్ట్గానే వైద్యులు చెక్ చేస్తున్నారా?. అస్సలు బీపీకి ప్రతి రోజు మాత్రలు వేసుకోవాల్సిందేనా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి తదితరాల గురించే ఈ కథనం!. రక్తపోటు లేదా బీపీ అనేది సర్వసాధారణమైన వ్యాధిలా అయిపోయింది. దేని గురించి అయినా ఆస్పత్రికి వెళ్తే..ముందుగా బీపీ చెక్ చేయడం కామన్ కూడా. నిజంగా కరెక్ట్గానే చెక్ చేస్తున్నారా? అంటే?. అదంతా అవాస్తమనే చెబుతున్నాయి తాజా అధ్యయనాలు. ఏటా 10 లక్షల మందికిపైగా అధిక రక్తపోటు ఉందని నిర్థారణ అవుతోంది. కానీ ఇదంతా వాస్తవం కాదని, వేలాది మందికిపైగా బీపీని తప్పుగా నిర్ధారణ అవుతున్నట్లు కొలంబస్లోని ఒహియో స్టేట్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు కొలంబస్లోని ఒహియా యూనివర్సిటీ పరిశోధకులు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్ట్లతో కలసి జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ బీపీ పరీక్షలు చాలా తప్పు విధానంలో నిర్వహిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అందుకోసం ఒహియో పరిశోధకులు దాదాపు 150 సముహాల వారిగా పెద్దవాళ్లను తీసుకుని జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రోగిని ఆమోదయోగ్యమైన కూర్చిలో కూర్చొబెట్టి గుండె స్థానానికి సమాంతర స్థాయిలో చేయిని ఉంచి రీడింగ్ని తీసుకోవాలి కానీ అలా జరగడం లేదని పరిశోధనల్లో తేలింది. చాలమంది పేషెంట్లకు తప్పుగా బీపీని రికార్డు చేస్తున్నారని. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ పేషెంట్కి బీపీ నార్మల్గా ఉన్నా..ట్యాబ్లెట్లు ఇస్తే అది అధిక రక్తపోటుకి లేదా వివిధ దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. తమ అధ్యయనంలో చాలామందికి తప్పుగా బీపీని గుర్తించారని, పైగా అధికంగా మందులను కూడా వైద్యులు సూచించినట్లు వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. ఈ కారణాల వల్లే యూఎస్లో దాదాపు సగం మందికి పైగా పెద్దలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చాలావరకు బీపీకి మందులను కూడా విపరీతంగా వాడాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవచ్చని తెలిపారు పరిశోధకుఉల. తప్పుగా బీపీని రికార్డు చేయడం, దీనికి తోడు మందులను వాడించటం వల్ల చాలమంది ప్రజలు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడుతున్నట్ల తెలిపారు. ఇక మందులు బీపీకి అదేపనిగా వాడాల్సిన అవసరం లేదా? విరామం ఇవ్వొచ్చా అంటే? అంతలా అవసరం లేదనే చెబుతున్నాయి అధ్యయనాలు. అంతేగాదు త్వరలో కంటిన్యూగా మందులు వాడాలసిన అవసరం లేకుండానే సరికొత్త ఔషధాన్ని అందుబాటులోకి తేనట్లు కూడా చెప్పుకొచ్చారు. బీపీకి రోజూ మందులు వేసుకోనక్కర్లేదా? బీపీ అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీనికి ప్రతిరోజు టెన్షన్గా ఓ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే అందరికీ తెసిందే. అందులోనూ హైబీపీ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రోజూకి కనీసం ఒకటి నుంచి రెండు ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిందే. కానీ పరిశోధకులు కనిపెట్టిన ఈ కొత్త రకం ఔషధం 'జిలేబేసిరాన్' ఆ సమస్యలన్నింటికి చెక్ పెడుతుందట. కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు హైబీపీని సమర్ధవంతంగా నియంత్రించడమే గాక ప్రభావంతంగా పనిచేస్తుంది. దీని వల్ల తరుచుగా మందులు వేసుకోవడం, దాని వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల నుంచి రోగులకు ఉపశమనం లభించినట్లు అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ రక్తపోటు అదుపులో లేకపోతే రోగులు స్ట్రోక్, గుండెపోటు లేదా హృదయనాళాలకు సంబంధిత రుగ్మతల బారినపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పేషెంట్లు బీపీ ట్యాబ్లెట్న్ కంప్లసరీ తమ పక్కనే పెట్టుకుంటుంటారు, టెన్షన్గా రోజూ వేసేసుకుంటారు. ఇక ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు ఈ సరికొత్త డ్రగ్తో. ఇది సమర్థవంతంగా హైబీపి నియంత్రించి సమ స్థాయలో ఉండేలా చేస్తుంది. మనం కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు మాత్రలు లేకుండా గడపొచ్చు. (చదవండి: మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్ స్థాయిలు పెరగకూడదంటే..) -
మహిళలే త్యాగమూర్తులు.. అవయవ దానంపై ఆసక్తికర అధ్యయనం!
అవయవదానం అనేది చాలా గొప్పది. శరీరంలో ఏదైనా అవయం పాడైపోయి చావుకు దగ్గరైనవారికి అవయవ మార్పిడితో తిరిగి ఊపిరిపోస్తున్నారు. అవయవ మార్పిడిలో అత్యాధునిక వైద్య విధానాలు రావడంతో అవయవ మార్పిడి చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. అయితే స్త్రీ, పురుషుల్లో అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు ఎంత మంది? అవయవ దానం చేసినవారు ఎంత మంది అనే దానికి సంబంధించి ఓ ఆసక్తికర అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఐదుగురిలో నలుగురు మహిళలే.. దేశంలో అవయవదానం పొందిన ప్రతి ఐదుగురిలో నలుగురు పురుషులు ఉండగా మహిళలు కేవలం ఒక్కరే. ఇక అవయవ దానం చేసిన వారిలో ప్రతి ఐగుగురిలో నలుగురు మహిళలు ఉండగా మగవారు ఒక్కరే ఉన్నారు. 1995 నుంచి 2021 వరకు ఉన్న డేటా ప్రకారం దేశంలో 36,640 అవయవ మార్పిడిలు జరిగాయి. వీటిలో 29,000 మార్పిడులు పురుషులకు, 6,945 మార్పిడులు మహిళలకు జరిగాయి. అంటే అవయవదానం పొందిన వారిలో ఐదింట నాలుగు వంతుల మంది మగవారే ఉన్నారు. ఆర్థిక ఆర్థిక బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు, పాతుకుపోయిన ప్రాధాన్యతలే ఈ అసమానతలకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన తర్వాత అవయవ దానం చేసేవారిలో మగవారు ఎక్కువగా ఉండగా బతికుండగానే అవయవ దానంచేసిన వారిలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారని నేషనల్ ఆర్గాన్ & టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. దేశంలో మొత్తం అవయవ దానాల్లో బతికుండి అవయవదానం చేసినవారినవి 93 శాతం ఉండగా వీరిలో అత్యధికులు మహిళలేనని ఆయన పేర్కొన్నారు. గ్రహీతల్లో మగవారే.. 2021లో ఎక్స్పెర్మెంటల్ అండ్ క్లినికల్ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయన పత్రం భారత దేశంలో అవయవ మార్పిడికి సంబంధించి భారీ లింగ అసమానతలను బయటపెట్టింది. 2019లో అవయవ మార్పిడి డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం సజీవ అవయవ దాతలలో 80 శాతం మంది మహిళలేనని తేల్చింది. వీరిలోనూ ప్రధానంగా భార్య లేదా తల్లి దాతలుగా ఉంటున్నారు. ఇక అవయవ గ్రహీతల విషయానికి వస్తే 80 శాతం మంది మగవారు ఉన్నారు. అవయవ దాతల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటానికి ప్రాథమిక కారణాలను ఈ అధ్యయనం వివరించింది. కుటుంబంలో సంరక్షకులుగా, త్యాగానికి ముందుండేలా మహిళలపై సామాజిక-ఆర్థిక ఒత్తిడి ఉందని, మగవారే కుటుంబ పోషకులుగా ఉండటంతో వారు శస్త్రచికిత్స చేయించుకోవడానికి వెనుకాడతారని విశ్లేషించింది. పూణేలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్కు చెందిన అవయవ మార్పిడి కోఆర్డినేటర్ మయూరి బార్వే మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా తాను ఈ రంగంలో పనిచేస్తున్నానని, ఇన్నేళ్ల తన అనుభవంలో ఒక్కసారి మాత్రమే భర్త తన భార్యకు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చాడని చెప్పారు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు అవయవదానం చేసేందుకు ముందుంటారని, ఒకవేళ వారిద్దరూ అందుబాటులో లేనప్పుడు, భార్యలు అవయవ దానానికి ముందుకు వస్తున్నట్లు ఆమె చెపారు. తరచుగా కుమార్తె అవివాహిత అయితే ఆమె దాత అవుతోందని, కానీ భార్యకు అవయవం అవసరమైనప్పుడు మాత్రం దాతలు ముందుకు రాకపోవడంతో వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సి వస్తోందని వివరించారు. -
‘అమెరికా’ ఏం చదువుతోంది?
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) అమెరికాలో విద్యనభ్యసించడం వివిధ దేశాలకు చెందిన ఎన్నో లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ఎన్నో కష్టాలు పడి, వివిధ పరీక్షలు రాసి అమెరికాకు పరుగులు తీస్తుంటారు. అక్కడే గ్రాడ్యుయేషన్లు, పోస్ట్గ్రాడ్యుయేషన్లు చేసి.. ఉద్యోగాలు కూడా సంపాదించి స్థిరపడిపోతుంటారు. కానీ అసలు అమెరికా విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఏఏ కోర్సులు ఎక్కువగా చదువుతున్నారు? ఏఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? అనే ప్రశ్నలు మనలో తలెత్తుతుంటాయి. ఈ అంశాలపై అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ (ఎన్సీఈఎస్) అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పలు ముఖ్యమైన కోర్సులపై అధ్యయనం చేసింది. 2010–11 విద్యా సంవత్సరంలో వివిధ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో.. సరిగ్గా దశాబ్దం తర్వాత అంటే 2020–21లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో పోల్చి గణాంకాలు రూపొందించింది. కంప్యూటర్ సైన్స్కే పట్టం అమెరికాలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకే విద్యార్థుల నుంచి విశేష ఆదరణ దక్కింది. దశాబ్దకాలం తర్వాత కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు 144 శాతం పెరిగారు. 2010–11లో 43,066 మంది కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, 2020–21లో ఈ రంగం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్య 1,04,874కు పెరిగింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉండటం, భవిష్యత్ను శాసించే శక్తి ఉందని యువత భావించడం వల్లే దీనిపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైద్య రంగంలోనూ భారీ వృద్ధి: వైద్య, ఆరోగ్య రంగంలోని విస్తృత అవకాశాలు కూడా అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 2010–11తో పోలి్చతే.. 2020–21 విద్యా సంవత్సరంలో 87 శాతం వృద్ధితో 2.6 లక్షల మంది విద్యార్థులు ఈ రంగంలో పట్టాలు అందుకున్నారు. అమెరికాలోని మొత్తం గ్రాడ్యుయేట్లలో వైద్య, ఆరోగ్య రంగంలో పట్టభద్రులైన విద్యార్థుల సంఖ్య దాదాపు 13 శాతం. అలాగే బయోమెడికల్ సైన్స్లోనూ 46 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఈ విభాగంలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వన్నె తగ్గని ఇంజనీరింగ్ కోర్సులు కంప్యూటర్ సైన్స్ను మినహాయించి మిగతా బ్రాంచ్లను ఇంజనీరింగ్ కింద పరిగణించారు. దశాబ్దకాలంలో 65 శాతం వృద్ధితో 1.26 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 2020–21లో కాలేజీల నుంచి పట్టాలతో బయటకు వచ్చారు. ఏటా లక్ష డాలర్లకు తగ్గని వేతనాలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదనే భరోసా.. ఈ రంగం వైపు విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్ ఎంటర్ప్రెన్యూర్స్గా మారుతున్న వారిలో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారి శాతమే ఎక్కువ. దాదాపు 4 లక్షల మంది.. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్కు ఆదరణ ఏటా పెరుగుతూనే ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న వారిలో అత్యధికులు ఈ రంగం వారే. 2020–21లో దాదాపు 4 లక్షల మంది ఈ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పడిపోతున్న ‘ఆర్ట్స్’ అమెరికాలో పలు ఆర్ట్స్ గ్రూప్లకు ఆదరణ తగ్గుతోంది. సామాజిక శా్రస్తాలు, భాషలు, చరిత్ర లాంటి 17 సబ్జెక్టుల్లో గత దశాబ్దకాలంలో విద్యార్థుల చేరికలు తగ్గినట్లు తేలింది. ఇంగ్లిష్, చరిత్ర తదితర సబ్జెక్టుల్లో దశాబ్దకాలంలో 35 శాతం విద్యార్థుల సంఖ్య పడిపోయింది. పాకశాస్త్రంలో తగ్గుదల 50 శాతానికిపైగా ఉంది. ఉపాధి అవకాశాలున్నా.. తగ్గిన చేరికలు అమెరికాలో ఎడ్యుకేషన్ రంగంలో గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. టీచర్ల వేతనాలు పెద్దగా పెరగకపోవడం ఈ రంగంలోకి విద్యార్థులు రాకపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. టీచర్ల కొరత ఉన్నందున ఉద్యోగవకాశాలు సులభంగా దక్కే అవకాశం ఉన్నా.. ఇతర రంగాల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దకాలంలో 16 శాతం మేర చేరికలు తగ్గాయి. అలాగే మారుతున్న ప్రపంచంలో పరిశ్రమలు స్పెషలైజేషన్ను కోరుకుంటుండటంతో విద్యార్థులు కూడా లిబరల్ ఆర్ట్స్వైపు ఆసక్తి చూపించం లేదు. దీంతో విద్యార్థుల సంఖ్య దశాబ్దకాలంలో 10 శాతం తగ్గింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇంగ్లిష్దీ ఇదే పరిస్థితి. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో ఊబకాయ సమస్య!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఊబకాయం, అధిక బరువు సమస్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. పట్టణ/నగర ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. జనాభాలోని పలు వర్గాల నుంచి సమాచారం సేకరించి జరిపిన ఈ అధ్యయనం వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రియంట్స్’లో ప్రచురితమయ్యాయి. వేర్వేరు వయసుల వారిలో పోషకాల స్థాయి, ఆ స్థాయుల్లో ఉండేందుకు గల కారణాలను ఈ అధ్యయనం ద్వారా అర్థం చేసుకున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ శుక్రవారం తెలిపింది. అధ్యయనంలో భాగంగా హైదరాబాద్తోపాటు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామాల నుంచి మొత్తం 10,350 మంది వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఇందులో 8317 మంది తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందిన వారు. మధుమేహం, రక్తపోటు సమస్యలూ... నగర ప్రాంతాల్లో దాదాపు 47.7 శాతం పెద్దలు ఊబకాయంతో బాధపడుతూండగా.. 14.8 శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. పల్లెల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఊబకాయం సమస్య 46.7 శాతం ఉంది. అధికబరువు సమస్య తెలంగాణ నగర ప్రాంతాల్లో మాదిరిగానే 14.8 శాతం నమోదైంది. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో వయసు తేడా తెలంగాణలో 50.6 శాతమైతే.. ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో 33.2 శాతం మంది ఉన్నారు. అంతేకాదు.. అధ్యయనంలో పాల్గొన్న హైదరాబాదీల్లో 11 శాతం మంది అధిక రక్తపోటు సమస్యను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య ఆరు శాతం మాత్రమే. ఇరు ప్రాంతాల్లోనూ సమానంగా ఉన్న ఇంకో సమస్య మధుమేహం. హైదరాబాద్, చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామీణ ప్రాంతాల్లోని వారిలో 5 శాతం చొప్పున మధుమేహులు ఉన్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అధ్యయనంలో పాల్గొన్న 40 - 59 మధ్య వయస్కుల్లో అధికులు క్లరికల్ ఉద్యోగాల్లో లేదంటే కొద్దిపాటి నైపుణ్యం ఉన్న వృత్తుల్లో ఉన్నవారే. ఈ రకమైన వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇతరులతో పాలిస్తే ఊబకాయం సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. ‘‘అధ్యయనంలో పాల్గొన్న వారు కొంతమందిలో అవసరమైన దానికంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఆహారం, పర్యావరణం, శారీరక శ్రమ లేకపోవడం, వంటివి ఇందుకు కారణం కావచ్చు. చాలామందిలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయమాల ప్రాధాన్యత కూడా తెలియదు’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ సమరసింహా రెడ్డి తెలిపారు. ‘‘నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా పెద్దగా లేకపోవడం ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయం. పైగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఊబకాయం సమస్య ఎక్కువ ఉన్న సూచనలు కనిపించాయి.’’ అని చెప్పారు. జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత మాట్లాడుతూ...‘‘విచిత్రమైన విషయం ఏమిటంటే.. పెద్దవాళ్లలో ఊబకాయం, అధిక బరువు సమస్యలుంటే... చిన్నవాళ్లలో పోషకాహార లేమి కనిపించడం. అది కూడా జాతీయ స్థాయి సగటుకు దగ్గరగా ఉండటం విశేషం." అని చెప్పారు. -
కప్పు 'టీ'తో మధుమేహాన్ని నియంత్రించొచ్చా?
ప్రస్తుత రోజుల్లో మధుమేహం చాలా సర్వసాధారణమైపోయింది. ప్రతి ఇంటిలోనూ ఒకరో ఇద్దరో డయాబెటిస్ పేషెంట్లు ఉంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధే తప్ప తగ్గేది కాదు. షుగర్కి సంబంధించినవి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుని అదుపులో పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. అలాంటి డయాబెటిస్ వ్యాధి ఓ కప్పు టీతో క్యూరో అవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆయా పరిశోధనల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కప్పు టీతో ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపోవడమే గాక ఒక్కసారిగా ఈ విషయం చాలా హాట్టాపిక్గా మారిపోయింది. ఇంతకీ ఆ టీ ఏంటి? ఎలా గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది తెలుసుకుందాం!. చైనాలో ప్రత్యేకంగా తయారు చేసే..పులియబెట్టిన టీ మధుమేహాన్ని అదుపులో ఉంచుతోందని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఇతర టీల అన్నింటిలో విభిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా శాస్త్రవేత్తల్లో ఈ అంశం ఓ నూతన ఉత్తేజాన్ని ఇచ్చి పలు అధ్యయనాలకు పురిగొల్పింది. ఇది ఎంత వరకు నిజం? అనే దిశగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయం, చైనాల సౌత్ ఈస్ట్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించేందుకు దారితీసింది. వారు నిర్వహించిన అధ్యయనంలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం చైనాలో వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న దాదాపు రెండు వేల మందిపై పరిశోధనలు నిర్వహించారు. వారిలో డయాబెటిస్ లేనివారు, డయాబెటిస్ ఉన్న వ్యక్తుల ఉన్నారు. ఐతే వారి ఆహారపు అలవాట్లను తెలుసుకుని మరీ ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ టీ తాగిని వారి యూరిన్లో గ్యూకోజ్ స్థాయిలు పరీక్షించగా తక్కువగా ఉండటమే కాకుండా కొందరికి ఫీల్టర్ అయ్యి యూరిన్ నుంచి గ్లూకోజ్ వెళ్లడం లేదని గమనించారు. నిజానికి టీ తాగితే మూత్రంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కానీ ఈ డార్క్టీ మాత్రం అందుకు విభిన్నంగా ఉంది. ఈ టీని సేవించని వారితో పోలిస్తే ఆయా వ్యక్తుల్లో ప్రీ డయాబెటిస్ వచ్చే ప్రమాదం సుమారు 15% తగ్గగా, టైప్2 మధుమేహం వచ్చే అవకాశం దాదాపు 28% తగ్గిందన్నారు. ఈ మేరకు అడిలైడ్ యూనివర్సిటీ పరిశోధకుడు డాక్టర్ టోంగ్జి మాట్లాడుతూ..ఈ టీపై నిర్వహించిన పరిశోధనలు ఆశ్చర్యకరమైన రీతీలో ఫలితాలిచ్చాయన్నారు. ఈ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను మెరుగ్గా నియంత్రించిందన్నారు. బహుశ ఆ టీ తయరీలో ఉపయోగించే కిణ్వన ప్రక్రియ ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చన్నారు. చైనాలో ఉన్న ఆరు ప్రధాన రకాల టీల్లో ఈ డార్క్ టీ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. ఇందులో ప్రధానంగా సూక్ష్మజీవుల కిణ్వన ప్రక్రియ ఉంటుంది. అదే ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ టీలో ఉన్న శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్సూలిన్ తీరును మెరుగుపరిచి గట్ మైక్రోబయోమ్ను ప్రోత్సహిస్తుందన్నారు. శరీరంలో సోడియం, గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్(ఎస్జీఎల్టీ)-2 ఇన్హిబిటర్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తత్ఫలితంగా మూత్రపిండాలు మరింతగా గ్లూకోజ్ను విసర్జించేలా చేయడంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే గుండె, మూత్రపిండాల తీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది ఈ డార్క్ టీ. మన పాత కాల సంప్రదాయ పానీయమైన డార్క్ టీ గొప్పతనాన్ని ఈ అధ్యయనాలు వెల్లడించాయన్నారు. ప్రజలు ప్రతిరోజు డార్క్ టీ తీసుకోవడం వల్ల తమ ఆరోగ్యాన్ని సులభంగా మెరుగుపరుచుకోవడమే గాక శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోగలుగుతారని నమ్మకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!) -
గ్రీన్ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది?
కోర్టులు, ప్రభుత్వాలు పర్యావరణ అనుకూల గ్రీన్ క్రాకర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. అయితే తాజా అధ్యయనాల్లో గ్రీన్ క్రాకర్స్కు సంబంధించిన 63 శాతం నమూనాలలో బేరియంతో పాటు ఇతర ప్రమాదకరమైన రసాయన మూలకాలు ఉన్నాయని తేలింది. ఇవి మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీపావళి వేడుకలు సమీపిస్తున్న సమయంలో వెల్లడైన ఈ అధ్యయనం టపాసుల విక్రేతల ఉత్సాహాన్ని చల్లార్చేలా ఉంది. ఈ తరహా గ్రీన్ క్రాకర్స్ విక్రయాలను నిలిపివేయాలని ఈ అధ్యయనం చేపట్టిన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎస్ఐఆర్ నీరి అధికారిక గ్రీన్ లోగోతో మార్కెట్లోకి విడుదల చేసిన టపాసులు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతాయని ఆ సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వేతర సంస్థలు, ఆవాజ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో గ్రీన్ టపాసులలో బేరియం, ఇతర ప్రమాదకరమైన రసాయన మూలకాలు ఉన్నట్లు తేలింది. ఇవి మనిషి ఆరోగ్యాన్ని హరింపజేస్తాయి. దేశవ్యాప్తంగా బేరియం వ్యాపింపజేసే పటాకులను నిషేధించారు. సాంప్రదాయ బాణసంచాలో వెలువడే మెటల్ ఆక్సైడ్ బేరియం అనేది శబ్ద కాలుష్యంతోపాటు కళ్ళు, ముక్కు, గొంతు, చర్మం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. ఇది కూడా చదవండి: ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి.. -
వ్యాయామం తక్కువుగా చేసినా చాలు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
చాలమంది వర్క్ఔట్లు ఎక్కువగా చేస్తుంటారు. త్వరితగతిన బరువు తగ్గాలని లేదా మంచి ఫలితాలు కనిపించాలంటే ఆ మాత్రం వర్క్ఔట్లు ఉండాలని అనుకుంటారు. అందుకోసం అని వాకింగ్లు కొన్ని రకాల వ్యాయమాలు తెగ చేసేస్తుంటారు. ఐతే తాజా పరిశోధనలో అందుకు భిన్నంగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు కూడా మితంగా వ్యాయామం చేస్తే చాలని తేల్చి చెప్పారు. మొన్నటి వరకు పదివేల అడుగులు వేస్తే బరువు తగ్గుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని అధ్యయనంలో వెల్లడైందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తక్కువ వ్యాయామంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్పెట్టగలమా? పరిశోధనల్లో ఏం వెల్లడైంది తదితరాల గురించే ఈ కథనం!. స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామంతోనే మంచి రిజల్ట్స్ని పొందొచ్చని ప్రభావంతంగా కూడా ఉంటుందని పరిశోధనలో తేలింది. వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం దాదాపు 60% తగ్గుతుందని కూడా వెల్లడైంది. ఈ మేరకు ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. అందుకోసం సుమారు లక్ష మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా పదివేల అడుగులు అవసరమని చెబతుంటారు. ఐతే అన్ని అడుగులు అవసరం లేదంటున్నారు. కేవలం రెండు కిలోమీటర్లు అనగా దాదాపు 2,700 అడుగులు చాలు వివిధ గుండె సంబంధిత సమ్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎక్కువగా నడిచే వారిలో చాలా మంచి ప్రయోజనాలు కూడా కనిపించాయి. కానీ కొందరు ఎక్కువగా నడిస్తేనే మంచిదని భావించి బలవంతంగా చేస్తుంటారు. కానీ అదంతా అవసరం లేదంటున్నారు. రోజుకు రెండు కిలోమీటర్లు నడవండి, మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి చాలు చాలా రుగ్మతలు నుంచి సులభంగా బయటపడతారని అంటున్నారు. అలాగే మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామం ఎంత చేయాలనే వ్యత్యాసం ఏం ఉండదని పరిశోధనలో తేలిందన్నారు. తక్కువగా చేసిన మంచి ఫలితాలు ఉంటాయని భయపడాల్సి అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అదే టైంలో ఎక్కువగా చేసేవారికి ఆరోగ్య మరింత మెరుగ్గా ఉండటమేగాక మరిన్ని ప్రయోజనాలు ఉండటాన్ని గుర్తించాం అని చెప్పారు. ఐతే ఈ పదివేల అడుగులు నడవడం అనేది జపాన్ నుంచి వచ్చింది టోక్యో ఒలంపిక్స్ నేపథ్యంలో వచ్చిందని. ఆటగాళ్లు మెరుగ్గా ఆడేలా ఫిట్నెస్పై ఎక్కువగా దృష్టి సారించేందుకు జపాన్ ఇలా పదివేల అడుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందని పేర్కొన్నారు. సైన్సు పరంగా అది ఎక్కడ ఫ్రూవ్ కాలేదన్నారు. ఈ నెంబర్ ఫిగర్ అందరు గుర్తుంచుకునేందుకు సులభంగా ఉంటుందని ఇలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల ప్రతీరోజూ తక్కువ వ్యాయామం, సుమారు రెండు కిలోమీటలర్లు నడకతో కూడా పూర్తి ఫిట్నెస్గా ఉండగలమని నొక్కి చెబుతున్నారు. దీంతోపాటు వేళకు తినడం, కంటి నిండ నిద్రపోవడం వంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగొంటుంది. తద్వారా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నం కావు అని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: 'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!
ICMR Male Contraceptive: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక పురోగతిని సాధించింది. పురుషులకోసం గర్భనిరోధక ఇంజెక్షన్ను అభివృద్ది చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్’ (ICMR Male Contraceptive)ను ఇంజెక్షన్ను డెవలప్ చేసింది. దీనికి సంబందించిన క్లినికల్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు ఏడేళ్ల పరిశీలిన తర్వాత RISUG (రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్) పిలిచే నాన్-హార్మోనల్ ఇంజెక్షన్నపై సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈ ఇంజక్షన్ వల్ల ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు లేవనీ, చాలా సురక్షితం ప్రభావవంతమైనదని కూడా తేలడం విశేషం. ఫేజ్ 3 ట్రయల్స్ సక్సెస్ 25-40 ఏళ్ల వయసుస్సున్న 303 మంది ఆరోగ్యవంతులైన, వివాహిత పురుషులపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు గత నెలలో రిలీజ్ అయ్యాయి. ICMR, న్యూఢిల్లీ సమన్వయంతో ఢిల్లీ, ఉదంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్ పూర్ ఆసుపత్రుల్లో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించారు. ఈ వాలంటీర్లకు 60 మి.గ్రా. RISUG ఇంజెక్షన్ను అందించారు. ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా 99.02 శాతం సమర్థతతో ఈ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా హార్మోన్లను ఇంజెక్ట్ చేసే ఇతర గర్భ నిరోధకాల మాదిరిగా గాకుండా, లోకల్ ఇంజెక్షన్తోనే దీన్ని సాధించడం కీలకమని కూడా పేర్కొంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఇండియా (DCGI)సహా, ఇతర సంబంధిత కమిటీలచే అనుమతి మేరకు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఫలితాలను అంతర్జాతీయ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్లో ప్రచురించారు. కాగా గర్భనిరోధం అంటే కేవలం అది స్త్రీల పనే అని అభిప్రాయం సమాజంలో బాగా వేళ్లూనుకుంది. పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేసెక్టమీపై రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వేసెక్టమీ అంటేనే భయపడే పరిస్థితి. ఈ క్రమంలో పురుషుల్లో సంతానం నిరోధం కోసం ఒక ఇంజెక్షన్ను తీసుకు రావడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
టన్నుల కొద్దీ బంగారమున్న గ్రహశకలం ఏది? భూమి మీదకు తెస్తే ఏమవుతుంది?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(నాసా) తాజాగా అంగారక గ్రహం- బృహస్పతి మధ్యనున్న 16 సైక్ అనే ఒక భారీ లోహ గ్రహశకలాన్ని చేరుకునేందుకు ఉద్దేశించిన మిషన్పై పని చేస్తోంది. ఈ లోహ గ్రహశకలంలో 10,000 క్వాడ్రిలియన్ డాలర్ల (ఒక క్వాడ్రిలియన్.. రూ.7,44,045) విలువైన ఇనుము, నికెల్, బంగారం ఉన్నట్లు అంచనా. నాసా తెలిపిన వివరాల ప్రకారం బంగాళాదుంప ఆకారంలో ఉన్న ఈ గ్రహశకలం సగటు వ్యాసం సుమారు 140 మైళ్లు (226 కిలోమీటర్లు). భూమికున్న చంద్రుని వ్యాసంలో దాదాపు 16వ వంతు. లేదా హైదరాబాద్ - గుంటూరు మధ్య దూరం. ఈ గ్రహశకలంపై ప్రస్తుతం ఉన్న బంగారం విలువ బిలియన్ డాలర్ల మేరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా పలు గ్రహశకలాలు రాతి లేదా మంచుతో నిండి ఉంటాయి. కానీ 16 సైక్ను మృత గ్రహానికి చెందిన ఓపెన్ మెటాలిక్ హార్ట్గా భావిస్తున్నారు. ఈ గ్రహశకలంపై లభ్యమయ్యే బంగారాన్ని భూమిపైకి తెచ్చి, అందరికీ సమానంగా పంచగలిగితే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ బిలియనీర్లు కావచ్చు. ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ 1852 మార్చి 17న ఈ గ్రహశకలాన్ని కనుగొన్నారు. గ్రీకు దేవత అయిన సైకీ పేరు మీద ఈ గ్రహశకలానికి పేరు పెట్టారు. ఆ గ్రీకు దేవత ఒక చేపగా జన్మించింది. ప్రేమ దేవుడైన ఎరోస్ (రోమన్ మన్మథుడు)ను వివాహం చేసుకుంది. సైక్ సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి సుమారు ఐదు భూమి సంవత్సరాలు పడుతుంది. నాసా ఈ సైక్ స్పేస్క్రాఫ్ట్ పరిశోధనను 2022 ఆగష్టులో ప్రారంభించింది. ఈ నేపధ్యంలో 2026లో ఈ గ్రహశకలాన్ని చేరుకోవచ్చని భావించారు. అయితే ఏవో కారణాలతో ఈ మిషన్ను 2023(ఈ ఏడాది)కి వాయిదా వేశారు. మరి ఈ మిషన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? గజ ద్వారం దేనికి సూచిక? -
మరింత ఆసరా.. మరికొంత సాయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దడంలో నిమగ్నమైంది. ప్రధాన విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇస్తున్న హామీలకు మించిన అంశాలతో ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తు న్నట్టు తెలిసింది. ఈ నెలలో ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా ఉంటుందని మంత్రి హరీశ్రావు పదే పదే చెబు తుండటం గమనార్హం. కాగా రైతుబంధు, ఆసరా పింఛన్ల పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచడంపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ల మొత్తాన్ని పెంచడంతో పాటు రైతులందరికీ పింఛన్ ఇవ్వాలనే ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తయినట్లు తెలిసింది. రైతుబంధు, సామాజిక పింఛన్లు ఎంత మేర పెంచాలనే అంశంపై సీఎం కేసీఆర్ తుది నిర్ణ యం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. వరంగల్లో ఈ నెల 16న బహిరంగ సభ వేదికగా పార్టీ మేని ఫెస్టోను ప్రకటించాలని బీఆర్ఎస్ భావించింది. అయితే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆరోగ్యా న్ని దృష్టిలో పెట్టుకుని వరంగల్ సభ వాయిదా పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూ ల్ వెలువడ్డాక త్వరగా మేనిఫెస్టోను ప్రక టించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ తేదీకి ఐదు రోజుల ముందు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అయితే చాలా తక్కువ వ్యవధి కారణంగా మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయినట్లు ఆ తర్వాత పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి వీలైనంత త్వరగా మేనిఫెస్టో విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. విపక్షాల మేనిఫెస్టోలపై నజర్ గతంలో యువత, రైతు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ ఇటీవల తుక్కుగూడ సభ వేదికగా ఆరు గ్యారంటీల పేరిట ఎన్నికల హామీలను ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలు ఫలితాన్ని ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారంలో పెడుతోంది. ఎన్నికల మేని ఫెస్టోలో మరిన్ని జనాకర్షక పథకాలను కూడా చేర్చే అవకాశముంది. బీఆర్ఎస్ బంగారు తెలంగాణ నినాదానికి విరుగుడుగా తాము సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుని, ఆ మేరకు మేనిఫెస్టోలో ప్రతిఫలించేలా చూస్తామ ని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీధర్బాబు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. ఇలా రెండు ప్ర ధాన ప్రతిపక్ష పార్టీలు ప్రకటించే తాయిలాలు, ఇచ్చే హామీలను బీఆర్ఎస్ పరిగణనలోకి తీసుకుంటోందని, ఆయా అంశాలను మరిపించేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండబోతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని పథకాల మొత్తాలు పెంపు? బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1,000కి పెంచింది. వితంతువులు, వృద్ధులు తదితరులకు ఇచ్చే ఈ పింఛన్ను తర్వాత రూ.2,016కు పెంచింది. కాగా ఈ మొత్తాన్ని రూ.3,016కు పెంచే అవకాశముందని, ఈ మేరకు మేనిఫెస్టోలో చేరుస్తున్నట్టు తెలుస్తోంది. వికలాంగుల పింఛన్ రూ.1,500తో ప్రారంభమై ప్రస్తుతం రూ.4,016కు చేరింది. ఈ మొత్తాన్ని కూడా మరో రూ.1,000 మేర పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రైతుబంధు పథకం కింద ఏటా రెండు విడతల్లో కలుపుకొని ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇస్తుండగా, దీనిని రూ.12 వేలకు పెంచేలా ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే కేసీఆర్ కిట్ పథకం కింద ఇస్తున్న రూ.12 వేలను రూ.15 వేలకు పెంచాలనే ప్రతిపాదనపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మేనిఫెస్టో రూపకల్పన కసరత్తులో పాల్గొంటున్న నేతలు చెప్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని కూడా పెంచడం ద్వారా విపక్షాల దూకుడుకు అడ్డకట్ట వేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. -
పురుగు.. పిట్టా.. పంట.. కనుమరుగు!
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులు కీటకాలపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వాటి జనాభా తగ్గుతోంది. ముఖ్యంగా రక్షిత ప్రాంతాల్లోని కీటకాల సంతతి అత్యంత వేగంగా తగ్గిపోవడమే కాకుండా పెరుగుదల కూడా భారీగా పడిపోయిందని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జ్బర్గ్ బయో సెంటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జోర్గ్ ముల్లర్ వెల్లడించారు. ఈ నెలలో విడుదలైన నేచర్ మ్యాగజైన్లో ఆయన రాసిన కథనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. 1989 నుంచి 2016 మధ్యకాలంలో జర్మనీలోని రక్షిత ప్రాంతాల్లో కీటకాల జీవం 75 శాతం కంటే ఎక్కువగా తగ్గిపోయిందని ముల్లర్ పేర్కొన్నారు. 2005లో అత్యంత వేగంగా పతనమైందని.. ఆ తర్వాత సంవత్సరాల్లో వాటి పెరుగుదల కోలుకోలేదని అధ్యయనం నిరూపించిందని స్పష్టం చేశారు. ముల్లర్ 2022లో చేసిన అధ్యయనంలో కీటకాల బయో మాస్లో కొంత పెరుగుదల కనిపించింది. అయితే, గతంలో తగ్గినంత వేగంగా ఈ పెరుగుదల లేదని ఆయన పేర్కొన్నారు. ముల్లర్ బృందం 2016, 2019, 2020, 2022లో పచ్చిక భూములు, వ్యవసాయ యోగ్యమైన పొలాలు సహా అనేక బహిరంగ ఆవాసాలలో పురుగుల బయో మాస్ పెరుగుదలపై పరిశోధనలు చేసింది. వాతావరణ మార్పులు.. ఆవాసాల నష్టం పర్యావరణ పరిరక్షణలో ఎంతో కీలకమైన కీటకాల క్షీణత మానవాళి జీవనంపైనా పెద్ద ప్రభావం చూపుతుందని ప్రొఫెసర్ ముల్లర్ పేర్కొన్నారు. వీటి జాతి తగ్గిపోవడానికి వాతావరణ మార్పులు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఆవాసాల నష్టం, పట్టణీకరణ, కాలుష్యం, సింథటిక్ పురుగు మందులు, ఎరువుల వినియోగం కూడా కారణమని తేల్చారు. వీటితోపాటు జీవ సంబంధ కారకాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 1989 నుంచి 2016 మధ్య కీటకాల బయో మాస్లో 75 శాతానికి పైగా క్షీణత నమోదైనట్టు.. 2005 తర్వాత వాతావరణ ప్రభావాలు కీటకాలకు ప్రతికూలంగా మారినట్టు గుర్తించారు. ఉష్ణోగ్రతలు కీటకాల జీవన చక్రంలోని వివిధ దశల్లో వాటి జనాభాను ప్రభావితం చేస్తాయని, వీటి మనుగడ శీతాకాల పరిస్థితులు, వేసవి వంటి చివరి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ముల్లర్ తన అధ్యయనంలో పేర్కొన్నారు. శీతాకాలంలో చాలా వెచ్చగాను పొడిగాను ఉండటం, వేసవిలో చల్లగాను తడిగాను మారడంతో ఆ పరిస్థితులను తట్టుకోలేక కీటకాలు అంతరించిపోయినట్టు తేల్చారు. కీటకాల నాశనం ఆహార గొలుసును చిక్కుల్లో పడేస్తోందని.. దీనివల్ల కీటకాలను తినే పక్షులకు ఆహారం లభించక మరణిస్తున్నాయని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎకో క్లెమటాలజీ ప్రొఫెసర్ అన్నెట్ మెన్జెల్ తెలిపారు. దీనివల్ల పంటలు నాశనం అవుతున్నట్టు తేల్చారు. ముఖ్యంగా ఈ తగ్గుదల 2005 నుంచి 2019 మధ్య బాగా తగ్గినట్టు గుర్తించారు. 20 నుంచి 30% తగ్గిన పంటలు ఆహార గొలుసులో కీటకాలు తగ్గిపోవడంతో పక్షులకు ఆహారం దొరకక చనిపోతున్నాయని, వీటిలో సముద్ర పక్షులు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రభావం జర్మనీతో పాటు సమీప యూరోపియన్ దేశాల్లోనూ కనిపించినట్టు తేల్చారు. ఆహారం కొరతతో వలస పక్షులు సైతం రావడం లేదని, స్థానిక పక్షులు సైతం తగ్గిపోతున్నాయని, ఉన్నవి పంటలపై దాడులు చేస్తున్నాయని గుర్తించారు. ఈ క్రమంలో 2005–2019 మధ్య పంట దిగుబడులు 30% వరకు తగ్గినట్టు అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువుల్ని తగ్గించాలని, సమతుల వాతావరణ పరిస్థితులను కాపాడేందుకు అడవులను పెంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లేకపోతే ఆసియా, అమెరికా దేశాలకూ ఇదే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. -
ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు?
మనదేశంలోని పేరుగాంచిన పలువురు బాబాలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిమీద పోలీసు కేసులు నమోదయ్యాయి. కొందరు బాబాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బాబాలు ఏమి చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామీ నిత్యానంద: కలకత్తా యూనివర్శిటీలో ఎంఏ ఆశారాం బాపు: మూడవ తరగతి బాబా రామ్దేవ్: ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి శ్రీశ్రీ రవిశంకర్: సెంట్ జోసెఫ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సంత్ రామ్ పాల్: ఇంజినీరింగ్ డిప్లమో జగ్గీవాసుదేవ్(సద్గురు): మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో బ్యాచులర్ ఇది కూడా చదవండి: అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది? -
విషయ పరిజ్ఞానమే కొలమానం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో విద్యార్థి వికాస చదువులకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా రాణించేలా పరీక్షల్లోను, ప్రశ్నల తీరులోను మార్పులు తీసుకొచ్చారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పరీక్షల్లో సంప్రదాయ ప్రశ్నల శైలి.. మార్కుల సాధనకే పరిమితమైంది. పిల్లల్లో వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను అంచనా వేసే విధానం కరువైంది. దీంతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహణ, ప్రశ్నల శైలిలో మార్పులు తీసుకొచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాస్థాయిని అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేస్తోంది. వీటిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), నేషనల్ అచీవ్మెంట్ సర్వే ముఖ్యమైనవి. వీటిద్వారా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తోంది. విద్యా సంవత్సరంలో నిర్వహించే ఫార్మెటెవ్, సమ్మెటివ్ అసెస్మెంట్లలో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ప్రకారం విశ్లేషణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ఏఎస్ సర్వేకు అనుగుణంగా పరీక్షలు దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ (ఎన్ఏఎస్), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వేను ఏటా చేపడుతుంది. 2021లో కేంద్రం ఎన్ఏస్, 2022లో ఎఫ్ఎల్ఎస్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలను చేపట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏ తరహా పరీక్షలు, ప్రశ్నలు ఉంటాయో అదే విధానాన్ని ప్రభుత్వం పాఠశాల విద్యలో గత ఏడాది నుంచి అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3న జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో అండమాన్–నికోబార్లో వివిధ రాష్ట్రాల అసెస్మెంట్ సభ్యులకు శిక్షణ ఇచ్చింది. అందులో రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అసెస్మెంట్లో అనుసరించాల్సిన విధానాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో అసెస్మెంట్ సెల్ ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా పరీక్ష విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎఫ్ఎల్ఎస్ పరీక్షల తరహాలోనే రాష్ట్రంలో పరీక్ష పత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 15 మంది నిపుణులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా బోధనలో సైతం మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా సబ్జెక్టు టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ సైతం ఇస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం అంచనాకు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ (ఆరు) అసెస్మెంట్లు నిర్వహిస్తోంది. వీటిలో రెండు ఫార్మెటివ్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్లకు ‘ఓఎంఆర్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ–1 ఓఎంఆర్ విధానంలో పూర్తిచేయగా, ఎఫ్ఏ–2ను పాత విధానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అనుసరిస్తోంది. పదో తరగతిలో బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా 9, 10 తరగతులకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఏలో మొత్తం 20 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో 10 ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో జవాబులు గుర్తించాలి. మరో ప్రశ్నలకు 5 డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి మానసిక సామర్థ్యం, ప్రశ్నలు అర్థం చేçసుకునే విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి. -
గిరిజనులపై ప్రధానిది కపట ప్రేమ మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులపై ప్రధాని మోదీ కపటప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పదేళ్లుగా గిరిజన వర్సిటీని తొక్కిపెట్టింది మోదీ ప్రభుత్వమే అని, దీంతో ఎంతో మంది ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్నందునే మోదీకి గిరిజన వర్సిటీ గుర్తొచ్చిందన్నారు. ఈ వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా జాకారంలో 335 ఎకరాలను ఇప్పటికే కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా కేంద్రం స్పందించలేదన్నారు. -
అనీ బిసెంట్ భారత్ ఎందుకు వచ్చారు?
బ్రిటీష్ సోషలిస్ట్, థైసోఫిస్ట్, మహిళా హక్కుల న్యాయవాది, హోమ్ రూల్ కార్యకర్త, భారతీయ జాతీయవాద ప్రచారకురాలు అనీ బిసెంట్ ప్రపంచంలో అనేక విధాలుగా గుర్తింపు పొందారు. ఐరిష్ మహిళ అయినప్పటికీ ఆమె జీవితంలో అనేక సైద్ధాంతిక మార్పులు వచ్చాయి. మొదట్లో క్రైస్తవ మతంలోని కొందరి చెడులను బహిర్గతం చేశారు. తరువాత ఆమె భారతదేశపు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితురాలయ్యారు. అనీ బిసెంట్ 1847 అక్టోబర్ 1న లండన్లో జన్మించారు. తండ్రి వైద్యుడైనప్పటికీ ఆయనకు గణితం, తత్వశాస్త్రంపై ఆసక్తి ఎక్కువ. ఆమె తల్లి ఐరిష్ కాథలిక్ మహిళ. ఆమె ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. చిన్నతనంలోనే ఫ్రాన్స్, జర్మనీ వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంది. ఆమె 17 సంవత్సరాల వయస్సులో తన తల్లి వద్దకు తిరిగి వచ్చింది. 20 ఏళ్ల వయసులో రెవరెండ్ ఫ్రాంక్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. అయితే అతనితో సైద్ధాంతిక విభేదాల కారణంగా వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక 26 ఏళ్లకే భర్తకు విడాకులు ఇచ్చి, రచనా వ్యాసంగాన్ని చేపట్టారు. 1989లో ఆమె థియోసఫీ భావజాలం వైపు మొగ్గు చూపారు. మార్క్సిజం నుండి ఆస్తికవాదం వైపు మళ్లారు. థియోసాఫికల్ సొసైటీలో సభ్యురాలిగా చేరి, ప్రపంచమంతటా థియోసాఫీని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో ఆమెకు భారతదేశానికి వెళ్లాలనే కోరిక కలిగింది. 1893లో భారతదేశానికి వచ్చిన ఆమె చెన్నైలో థియోసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు. దీనిని థియోసాఫికల్ సొసైటీ అడయార్ అని పిలుస్తారు. ఇది కూడా చదవండి: 375 ఏళ్లకు బయటపడిన 8 వ ఖండం ఏది? -
డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?
పెళ్లిళ్లలోనూ ఏదైన పండుగ, జాతర్లలో పెట్టే డీజే మ్యూజిక్ వల్ల గుండె పోటు వస్తుందా?. ఈ ఏడాది మార్చి4న బిహార్లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. సురేంద్ర కుమార్ డీజే సౌండ్ తనకు చాలా అసౌకర్యంగా ఉందని, తగ్గించమని చెప్పినట్లు సమాచారం. ఆ భారీ శబ్దాల వల్లే సురేంద్ర కూమార్ చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు కూడా. అలాగే తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అంతేకాదు గతేడాది నవండర్ 25న ఇలానే డీజే మ్యూజిక్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. భారతదేశంలో ఇలాంటి ఘటనలు గతకొంతకాలంగా కోకొల్లలుగా జరగడంతో ప్రజల్లో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ఎందుకిలా జరుగుతుంది?. శబ్దానికి గుండెపోటుకి సంబంధం ఏంటి? చెవికి గుండెకు ఉన్న లింక్ ఏమిటి తదితరాల గురించే ఈ కథనం.. భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్లో వెల్లడించారు. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు 500 మందిపై అధ్యయనం నిర్వహించారు. వారంతా రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో నివశిస్తున్నారు. నిత్యం భారీ శబ్దాల మధ్య పనిచేయడం లేదా నివశిస్తుంటారు. ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో గుండె జబ్బు లక్షణాలు లేని వ్యక్తులు సైతం హృదయ సంబంధ వ్యాధులకు గురైనట్లు గుర్తించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరగుతున్న మార్పలను గుర్తించారు. అలాగే మెదడులో ఉండే బూడిద రండు పదార్థాం అమిగ్డాలాపై తీవ్ర ప్రభావం చూపినట్లు గుర్తించారు. ఒక రకంగా బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. అనునిత్యం పెద్ద శబ్దాల వద్ద పనిచేసే వ్యక్తుల్లో మానసిక కల్లోలం, అసహనం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. హృదయ స్పందనలు క్రమరాహిత్యం.. జర్మనీలో మెయిన్జ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో కూడా 35 నుంచి 74 ఏళ్ల వయసు ఉన్న 15 వేల మంది వ్యక్తులపై అధ్యయనం నిర్వహించారు. ఏ సంగీతాన్ని అయినా ఓ నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే మానవ హృదయాలపై హానికరమైన ప్రభావం చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది. భారీ శబ్దానికి గురైనప్పుడూ హృదయ స్పందన వేగం ఒక్కసారిగా మారిపోవడం, భయం ఆందోళన ఒక్కసారిగా ఉత్ఫన్నమవుతున్నట్లు గుర్తించారు. చాలామంది, జాగింగ్ చేసేటప్పుడూ వ్యాయామాలు చేసేటప్పుడూ మ్యూజిక్ పెట్టుకుని చేస్తుంటారు ఇది అంత మంచి పద్ధతి కాదనే అంటున్నారు. ఓ మోస్తరుగా మనిషి వినగలిగేంత పరిమితి సౌండ్తోనే సంగీతం వింటే ఎటువంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకుని వినడం తగ్గించాలి.. చాల ఎక్కువ వాల్యూమ్లో ధ్వనిని వినడం చెవిలోని ఇంద్రియ కణాలు, నిర్మాణాలు అలసిపోతాయి. ఇది చాలాకాలం పాటు కొనసాగితే శాశ్వతంగా వినికిలోపం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని అధ్యయనంలో తేలింది. అందువల్ల ఎక్కువ గంటలపాటు పెద్ద పెద్ద వాల్యూమ్లో హెడ్ఫోన్ పెట్టుకుని వినడం, వివాహ ఫంక్షన్లో పెట్టే భారీ సంగీ మ్యూజిక్ల్లో పాల్గొనడం వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గుండెకు చెవికి ఉన్న సంబంధం ఏంటీ .. ఏదైన ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్న జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్లతో సాగే మ్యూజిక్ తరంగాలు మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తే.. మోతాదుకు మించిన వాల్యూమ్తో వినే మ్యూజిక్ గుండె, మెదడుపై అదే స్థాయిలో ప్రభావం చూపిస్తాయి. మన శరీరంలోని అవయవాలు ఒకదానితో ఒకటి లింక్ అప్ అయ్యే ఉంటాయి. ఒక అవయవానికి ఏర్పడిన నష్టం దేహంలోని మిగతా అవయవాలపై ఎంతోకొంత ప్రభావం తప్పక ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. (చదవండి: గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి దూసుకుపోయి..) -
ఓపీఎస్తో అధోగతే..
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) నుంచి ప్రభుత్వోద్యోగులు పాత పెన్షన్ స్కీముకు (ఓపీఎస్) మారితే రాష్ట్రాలు అథోగతి పాలవుతాయని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయన నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. ఇదే జరిగితే భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని.. వారి ప్రయోజనాల విషయంలో రాజీపడటమేనని ఆర్బీఐ నివేదిక హెచ్చరించింది. ఇటీవల కొన్ని రాష్ట్రాలు ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్కు మారుతామని చెబుతున్న నేపథ్యంలో.. వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత ఉద్యోగుల పెన్షన్ భారం, ఓపీఎస్కు మారితే భవిష్యత్లో పెరిగే పెన్షన్ల వ్యయం, తద్వారా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బేరీజు వేస్తూ ఆర్బీఐ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఓపీఎస్కు వెళ్లడమంటే ఆర్థిక సంస్కరణల్లో వెనుకడుగు వేయడమేనని తేల్చిచెప్పింది. అలాగే, ఓపీఎస్కు మారడంవల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెనుభారం పడుతుందని పేర్కొంది. అదే జరిగితే రాష్ట్రాల మొత్తం పెన్షన్ భారం 2023 మార్చి చివరి నుంచి 2084 మార్చి చివరి వరకు సగటున 4.5 రెట్లు పెరుగుతుందని ఆర్బీఐ నివేదిక స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇది 4.3 రెట్లు ఉంటుందని తెలిపింది. దీర్ఘకాలిక వృద్ధిపై తీవ్ర ప్రభావం.. మరోవైపు.. 2022 నవంబర్ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎన్పీఎస్ ఉద్యోగుల సంఖ్య 50 లక్షలు ఉందని, వీరి ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ కార్పస్ ఫండ్ రూ.2.5 లక్షల కోట్లు ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో వీరి సంఖ్య రెండున్నర లక్షలు ఉందని.. ఇప్పటికే ఏపీ సొంత రెవెన్యూ రాబడిలో పెన్షన్లకు 24 శాతం వ్యయమవుతోందని, ఓపీఎస్కు మారితే పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఇది మూలధన వ్యయాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు తీరని నష్టం కలిగిస్తుందని కూడా ఆర్బీఐ హెచ్చరించింది. ప్రస్తుతం ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగులు రిటైరయ్యాక చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్ పొందుతారని, డియర్నెస్ రిలీఫ్ రివిజన్ల ప్రయోజనాన్ని కూడా పొందుతారని తెలిపింది. అయితే, ఉద్యోగులకు ఓపీఎస్ విధానం ఆకర్షణీయంగా ఉండవచ్చుగానీ ప్రభుత్వాల మీద అపారమైన ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని, తద్వారా భవిష్యత్ సంవత్సరాల్లో ప్రభుత్వ పెన్షన్ బాధ్యతలను మరింత పెంచుతుందని నివేదిక స్పష్టంచేసింది. ఓపీఎస్కు మారితే మొత్తం రాష్ట్రాల పెన్షన్ భారం 2040 నుంచి 2060 వరకు భారీగా పెరుగుతుందని, ఇది దేశ జీడీపీలో 0.9 శాతానికి చేరుకుంటుందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో పెన్షన్లు చెల్లించడమే కష్టం.. ఇక ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్కు మారితే మొత్తం రాష్ట్రాల పెన్షన్ల వ్యయం 2023 నుంచి పెరగడం ప్రారంభమై 2045 నాటికి లక్ష కోట్లకు చేరుతుందని, 2057 సంవత్సరం నాటికి రూ.1.80 లక్షల కోట్లకు పెరుగుతుందని.. ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారం కానుందని ఆ నివేదిక తెలిపింది. భవిష్యత్లో పెన్షన్లను చెల్లించడమే చాలా కష్టతరం కావచ్చునని వ్యాఖ్యానించింది. అంతేకాక.. ఓపీఎస్కు వెళ్తే భవిష్యత్ తరాల ప్రయోజనాల విషయంలో రాజీపడటమే అవుతుందని, ఇది రాష్ట్రాలకు మంచిది కాదని ఆర్బీఐ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం 2019 ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ ఉద్యోగుల పెన్షన్ కంట్రిబ్యూషన్ను 14 శాతానికి పెంచిందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 14 శాతానికి పెంచాల్సి ఉందని తెలిపింది. -
టెక్ ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!
ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా టెక్నాలజీ కంపెనీల్లో నియామకాలు మందగించాయి. దీంతో టెక్ ఉద్యోగార్థులు జాబ్లు దొరక్క సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించే అధ్యయనం ఒకటి వెలువడింది. ఇక రానున్నవి మంచిరోజులే అని ఆ అధ్యయనం చెబుతోంది. టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘సీల్’ గ్రూప్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. చాలా కంపెనీలు టెక్నాలజీ, ఇన్నోవేషన్-లీడ్ ఇనిషియేటివ్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హెడ్కౌంట్ను పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రత్యేక డిజిటల్ మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోందని ఈ అధ్యయనం తెలిపింది. ఇలాంటి ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్లైడ్ మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్స్ డిజైన్, ఇంజినీరింగ్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి ఉద్యోగులను గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు నియమించుకుంటున్నాయని ‘సీల్’ అధ్యయనం పేర్కొంది. సాఫ్ట్వేర్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలలో ఈ ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయని వివరించింది. 96 కంపెనీల నుంచి ఇన్పుట్స్ గతేడాది ప్రారంభమైన లేదా విస్తరించిన 96 కంపెనీల నుంచి తీసుకున్న ఇన్పుట్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇవి ఇప్పటికే గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు కలిగి 57,500 మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థలు. ఈ సెంటర్లలో ఏడాదిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగినట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది. క్లౌడ్ ఇంజనీర్లు, డేటా ఇంజనీర్లకు కూడా డిమాండ్ పెరిగిందని పేర్కొంది. గత సంవత్సరంలో, ఆటో రంగంలో కంపెనీలు గణనీయంగా గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లును ఏర్పాటు చేశాయని ‘సీల్’ హెచ్ఆర్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అధ్యయనం ప్రకారం, బెంగళూరులో 42 శాతం, హైదరాబాద్లో 22 శాతం, పూణేలో 10 శాతం, ఢిల్లీలో 8 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేసేవే.. అన్ని జీసీసీ ఉద్యోగ అవకాశాలలో దాదాపు 51 శాతం ఆఫీస్ నుంచి పని చేసేవే. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల పరంగా ఐటీ రంగంతో పోల్చితే ఇది తక్కువే. ఐటీ రంగంలో 77 శాతం వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో నియామకాలు జరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కంది. -
ఎక్కువ ఫీజులు కట్టేస్తే మార్కులు వచ్చేయవు..ఆ స్కిల్..
సుబ్బారావు, సుమిత్రలకు ఆనంద్, అంజలి పిల్లలు. ఆనంద్ చిన్నప్పటి నుంచీ బాగా చదువుకునేవాడు. కానీ అంజలి ఎంత చదివినా మార్కులు వచ్చేవి కావు. దాంతో పేరెంట్స్ ఆమె గురించి ఆందోళన పడుతుండేవారు. బెటర్ స్కూల్, బెటర్ మెటీరియల్స్, బెస్ట్ ట్యూషన్ ్స పెట్టించినా ఫలితం లేకపోయింది. పదో తరగతి ఎలాగోలా గట్టెక్కింది. లక్షల ఫీజు కట్టి హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు. మొదటిసారి పేరెంట్స్కి, ఊరికి దూరంగా హాస్టల్లో ఉండటం వల్ల దిగులుగా ఉండేది. దానికి తోడు మార్కులు సరిగా రాకపోవడంతో క్లాసులో అందరిముందూ అవమానంగా మాట్లాడేవారు. దాంతో మరింత కుంగిపోయింది. ఈ మధ్యకాలంలో పేరెంట్స్ ఫోన్ చేస్తే.. ఇంటికి వచ్చేస్తానంటూ ఏడుస్తోంది. ఎలాగోలా రెండేళ్లు సర్దుకోమ్మా అని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థంకాక, లెక్చరర్ సలహా మేరకు కౌన్సెలింగ్కి తీసుకువచ్చారు. అంజలితో మాట్లాడుతున్నప్పుడు చాలా చురుకైన పిల్ల అని అర్థమైంది. బాగా బొమ్మలు వేస్తుంది, పాటలు పాడుతుంది, నాట్యం చేస్తుంది. మార్కులు మాత్రం రావు. దాంతో ‘పనికిమాలిన కళలన్నీ బానే ఉన్నాయి, చదువు మాత్రం రాదు’ అంటూ విమర్శలు. ‘నేను అందరికంటే ఎక్కువసేపు చదువుతా సర్, అయినా గుర్తుండవు. ఏం చేయాలో అర్థం కావడంలేదు’ అని బాధపడుతూ చెప్పింది అంజలి. తెలివితేటలున్నా వాటిని మార్కులుగా మార్చుకునేందుకు అవసరమైన స్టడీస్కిల్స్ లేకపోవడమే ఆమె సమస్యని అర్థమైంది. స్టడీస్కిల్స్ లేకపోతే కష్టం, నష్టం.. స్టడీస్కిల్స్ లేని విద్యార్థులు ఏకాగ్రతతో వినలేరు, చదవలేరు. చదివినా గుర్తుండదు. దాంతో వాయిదా వేస్తుంటారు. సిలబస్ పేరుకుపోతుంది. ఫలితంగా పరీక్షల ముందు ఒత్తిడి పెరుగుతుంది. పరీక్షలంటే భయం ఏర్పడుతుంది. భయం, ఆందోళన, ఒత్తిడి కలగలిసి పెర్ఫార్మెన్స్ ని దెబ్బతీస్తాయి. మార్కులు తక్కువ వస్తాయి. దాంతో ‘ఎంత చదివినా ఇంతే, నా మొహానికి మార్కులు రావు’ అనే భావన స్థిరపడిపోతుంది. ఆ నెగెటివ్ సైకిల్లో పడ్డారంటే నిరాశ, నిస్పృహలతో చదువు అటకెక్కుతుంది. విజయానికి పునాది అకడమిక్స్లో విజయం సాధించాలంటే స్టడీస్కిల్స్ పునాదిగా పనిచేస్తాయి. క్లాసులో చెప్పింది శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం, చదవడం, గుర్తు చేసుకోవడం.. ఇవన్నీ స్టడీస్కిల్స్ కిందకు వస్తాయి. ఇవి సహజంగా వస్తాయని, ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని చాలామంది పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ భావిస్తుంటారు. కానీ ఇవన్నీ ‘స్కిల్స్’.. అంటే ప్రయత్నంతో నేర్చుకోవాల్సినవని గుర్తించాలి. స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు.. స్టడీస్కిల్స్ పుట్టుకతో రావు. కాలక్రమేణా కొందరికి సహజంగా రావచ్చు. అలాంటివారికే మార్కులు, ర్యాంకులు వస్తాయి. అలాగని మిగతావారు నిరాశ పడాల్సిన అవసరంలేదు. కాస్తంత ప్రయత్నం చేస్తే ఎవరైనా స్టడీస్కిల్స్ నేర్చుకోవచ్చు. కోరుకున్న మార్కులు, ర్యాంకులు సాధించవచ్చు. అందుకోసం కొన్ని టిప్స్.. స్టడీస్కిల్స్లో అతి ముఖ్యమైనది ఎఫెక్టివ్ లిజనింగ్. క్లాసులో శ్రద్ధగా వింటే.. మీరు 70శాతం సబ్జెక్ట్ నేర్చుకున్నట్లే. అందుకే శ్రద్ధగా వినడం ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోవడం మీ మెంటల్ స్టేటస్పై ఆధారపడి ఉంటుంది. బాగా విశ్రాంతి తీసుకున్న మనసు మెరుగ్గా పని చేస్తుంది. అందువల్ల తగినంత నిద్ర, సమతుల ఆహారం, సరిపడా శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి. శరీరం యాక్టివ్గా ఉంటే మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది. ఎఫెక్టివ్ స్టడీ అనేది ఎఫెక్టివ్ ప్లానింగ్తో మొదలవుతుంది. మీరు నేర్చుకోవాల్సిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి స్టడీ షెడ్యూల్ను రూపొందించుకోవాలి. ప్రతి అంశానికి సరిపడా సమయం కేటాయించాలి. ఫోకస్ కొనసాగించడానికి మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. చదవడమంటే పుస్తకం ముందేసుకుని కూర్చోవడం కాదు. అందులోని కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడం, ప్రాసెసింగ్ చేయడం, ఇంకొకరికి బోధించడం. ఇలా చేయడం ద్వారా మీ అవగాహన, జ్ఞాపకశక్తి బలోపేతమవుతాయి. క్లాసులో చెప్పిన ప్రతి అక్షరం నోట్సులో రాసుకునే అలవాటును వదిలేయండి. బదులుగా ముఖ్య అంశాలను మాత్రమే నోట్ చేసుకునే సెలక్టివ్ నోట్ టేకింగ్ ప్రాక్టీస్ చేయండి. కంటెంట్ సారాంశాన్ని గ్రహించి కీలక అంశాలను మీ సొంత మాటల్లో రాసుకోండి. ఆడియో, వీడియో, ఫ్లాష్ కార్డ్లు ఉపయోగించండి. సులువుగా నేర్చుకోగలుగుతారు. పరీక్షల్లో ఇచ్చిన టైమ్లో సమాధానాలు రాయడం అత్యంత ముఖ్యమైన విషయం. అందువల్ల పోమోడోరో టెక్నిక్ వంటి వాటిని ఉపయోగించి ఫోకస్డ్గా చదవడం, రాయడం నేర్చుకోండి. ఏ విషయంలోనైనా మీకు సమస్య ఎదురైతే పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. (చదవండి: హలో బ్రదర్ సినిమా మాదిరి కవల సిస్టర్స్ !..ఊహాతీతమైన ఓ మిస్టరీ గాథ) -
మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్లు యూజర్ల ఏటాను చోరీ చేస్తున్నాయా? అంటే నివేదికలు అవుననే అంటున్నాయి. మోడ్రన్ టాప్ బ్రాండ్స్ కార్లలో డేటా ప్రైవసీ అనేది పీడకలే అంటూ కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ తన తాజా పరిశోధనలో వెల్లడించింది. దాదాపు 25 కార్ బ్రాండ్లను సమీక్షించింది. ఆ సందర్బంగా సెక్స్ లైఫ్ నుంచి ఇష్టా ఇష్టాలు, పాలిటిక్స్ గగుర్పాటు కలిగించే ఇతర విషయాలు అన్నీ లీక్ అవుతున్నాయంటూ సంచలన అధ్యయన నివేదికను ప్రకటించింది. (గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్ ) మొజిల్లా ఫౌండేషన్ నిర్వహించిన వినియోగదారు గోప్యతా పరీక్షల్లో అవన్నీ విఫలమయ్యాయని తేలింది. పరిశోధనలో 84శాతం కార్ కంపెనీలు కారు యజమానుల నుండి సేకరించిన డేటాను సమీక్షించాయి, పంచుకుంటాయి లేదా విక్రయించాయి అని వెల్లడించింది. డ్రైవింగ్ డిజిటల్గా మారుతున్న యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, విక్రయించడంపై ఆందోళన వ్యక్తం చేసిన మొజిల్లా అసలు తమ పరిశోధనలోని కంపెనీలేవీ గోప్యతపై దాని ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరచలేదని తెలిపింది. సెక్స్ టాయ్లు ,మానసిక ఆరోగ్య యాప్ల తయారీదారులతో సహా ఇంత పేలవమైన సమీక్ష రాలేదని తెలిపింది. కార్ల తయారీదారులు తమ కార్లను 'కంప్యూటర్ ఆన్ వీల్స్' అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అంతా డొల్ల అని ప్రైపసీ ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్కు ప్రసిద్ధి చెందిన మొజిల్లా రిపోర్ట్ చేసింది. "ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే డోర్బెల్లు, గడియారాలు తమపై గూఢచర్యం చేస్తున్నాయని ఆందోళన నేపథ్యంలో కార్ బ్రాండ్లు కూడా తమ వాహనాలను డేటా-గాబ్లింగ్ మెషీన్లుగా మార్చడం ద్వారా నిశ్శబ్దంగా డేటా వ్యాపారంలోకి ప్రవేశించాయని మొజిల్లా పేర్కొంది. అధ్యయనం ప్రకారం టెస్లా టాప్లో ఉందంటూ మరో బాంబు పేల్చింది.నిస్సాన్ రెండో స్థానంలో నిలిచింది. నిస్సాన్ సేకరించే డేటాలో “లైంగిక కార్యకలాపాలు” ఎక్కువగానూ, అలాగే కియా కంపెనీ ప్రైవసీ సిస్టం ప్రకారం, జాతి, మతపరమైన లేదా తాత్విక విశ్వాసాలు, లైంగిక ధోరణి, లైంగిక జీవితం, రాజకీయ అభిప్రాయాలతోపాటు "ట్రేడ్ యూనియన్ సభ్యత్వం" సమాచారంతో సహా "ప్రత్యేక వర్గాల" డేటాను ప్రాసెస్ చేయవచ్చని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!) 84 శాతం బ్రాండ్స్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు , ఇతర బహిర్గతం చేయని వ్యాపారాలతో పంచుకున్నట్లు అంగీకరించినట్లు అధ్యయనం తెలిపింది. ఎక్కువమంది, 76 శాతం కస్టమర్ల డేటాను విక్రయించినట్లు చెప్పడం గమనార్హం. సగం కంటే ఎక్కువమంది డేటాను షేర్ చేస్తున్నట్టు చెప్పారు. కనెక్టెడ్ వాహనాలు డ్రైవింగ్ డేటామాత్రమే కాకుండా, వాహనంలోని వినోదం, శాటిలైట్ రేడియో మ్యాప్ లాంటి థర్డ్-పార్టీ ఫంక్షన్లను ట్రాక్ చేస్తున్నాయట. అత్యధిక సంఖ్యలో కార్ బ్రాండ్లు, 92 శాతం, కేవలం ఫ్రాన్స్కు చెందిన రెనాల్ట్, Dacia బ్రాండ్తో వినియోగదారులకు వారి వ్యక్తిగత డేటాపై ఎటువంటి నియంత్రణ లేకుండా అందిస్తోంది. బహుశా యూరోపియన్ యూనియన్ చట్టానికి లోబడి డేటా డిలిట్ రైట్ను వినియోగదారులకు అనుమతించి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. కనీస భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్నుటికీ ఫోర్డ్, చేవ్రొలెట్, టయోటా, వోక్స్వ్యాగన్ , BMW వంటి కార్ల బ్రాండ్లు ఏవీ కూడా గత మూడేళ్లుగా 68 శాతం డేటా లీక్లు, హ్యాక్లు లేదా ఉల్లంఘన బారిన పడుతున్నాయని మొజిల్లా ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్టడీపై టాప్ కంపెనీలేవీ ఇంకా ఎలాంటి స్పందన ప్రకటించలేదు. (రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?) కాగా ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కార్లు, భద్రత, డేటా నియంత్రణ, ఏఐ కి సంబంధించిన అన్ని రివ్యూల్లో ఫెయిల్ అనే విమర్శలను ఎదుర్కొంది. కస్టమర్ల కార్లలోని కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు,ఫోటోలు ను ఉద్యోగులు పంచుకోవడం దుమారాన్ని రేపింది. అయితే 2021లో, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా చైనా సైనిక మిలిటరీకి ఈ వాహనాలను నిషేధించిన తర్వాత చైనాలో కెమెరాలు నిలిపివేసినట్టు టెస్లా ప్రకటించింది. -
రోజూ పాలు తాగడం కూడా ప్రమాదమేనా?.. వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
పాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. కాల్షియం ఉంటుంది ఎముకలకు బలం మన పెద్దవాళ్లు చెబుతుంటారు. చదివే పిల్లలు రోజు పాలు తాగడం మంచిదని మన బామ్మలు పాలు అవి ఇస్తుంటారు. కమ్మటి పాలు తాగితే హాయిగా నిద్ర కూడా వచ్చేస్తుంది. అలాంటి పాలను రోజు తాగొద్దంటూ ఆరోగ్య నిపుణులు. కాదని అలా తాగితే ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందులోనూ పురుషులకైతే ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారంటే.. కాల్షియం వంటి విటమిన్లను అందించే పాలు రోజు తాగితే..ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు. ఎముకలకు బలం అన్న ఆ పాలే మంచిది కాదని స్ట్రాంగ్గా చెప్పేస్తున్నారు యూకే ఆధారిత క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ వైద్యులు. ఆ రీసెర్చ్ సెంటర్ వైద్య బృందం చేసిన పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు వెల్లండించారు. పాలల్లో ఉండే హార్మోన్లు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఆ హార్మోన్లే క్యాన్సర్ కారకాలుగా.. యూకే క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ తన పరిశోదన ఫలితాల్లో పాలు ప్రోస్టేట్ క్యాన్సర్కు ఎలా కారకం అవుతుందో వెల్లడించారు. ఈస్ట్రోజన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు సహజంగా ఆవుపాల్లో ఉంటాయి. ఈ హర్మోన్లు పెరుగుదల హార్మోన్లు. అవే ఇప్పుడు క్యాన్సర్ వృద్ధికి కారణమవుతాయని అంటున్నారు. ప్రతి రోజు కాఫీతో పాలు తాగడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువని చెబుతున్నారు. యూఎస్లోని లోమా లిండా విశ్వవిద్యాలయం మూడు దశాబ్దాలుగా 22 వేలమంది పురుషులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రోజు 2.5 శాతం పాల ఉత్పత్తులకు సంబంధించిన వాటిని ఇవ్వగా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని నిర్థారించారు వైద్యులు. అధిక వెన్న శాతం ఉన్న పాల కంటే తక్కువ వెన్న శాతం ఉన్న నాన్ క్రీమ్ పాలతోనే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని అధ్యయనంలో గుర్తించారు. అయితే ప్రత్యేకించి ఈ ఆహారం నుంచే ఈ ప్రమాదం ఎక్కువ అని కచ్చితంగా చెప్పడం కష్టమేనని అన్నారు. దీనిపై మరింత పరిశోనలు చేయాల్సి ఉందని కూడా చెప్పారు. దీనికి సరైన విధమైన జీవనశైలి పాటించని వారై, చెడ్డ ఆహారపు అలవాట్లు ఉన్నట్లయితే ఆ ప్రమాదం మరింత ఎక్కువ అని చెబుతున్నారు. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
పని చేసేవారు కొందరైతే.. హడావుడి చేసేవారు మరికొందరు!
కంచర్ల యాదగిరిరెడ్డి: ప్రతి ఆఫీసులో రెండు రకాల ఉద్యోగులు ఉంటారు.. పనిలో ఆనందం పొందాలనుకునే వారు కొందరైతే.. పనిచేస్తున్నట్టుగా హడావుడి (షో) చేసేవాళ్లు ఇంకొందరు. ఎవరు ఏమిటన్నది తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే.. కానీ ఐటీ కంపెనీల్లో ఇలాంటి వారిని గుర్తించేందుకు ఈ–కమ్యూనికేషన్ టెక్ కంపెనీ ‘స్లాక్’ ఒక అధ్యయనం చేసింది. ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది.మన దేశంలో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో షో చేసేవాళ్లు 43 శాతందాకా ఉన్నారని వెల్లడైనట్టు తేల్చి చెప్పింది. అంటే ప్రతి వంద మందిలో 57 మంది చక్కగా పనిచేసుకుంటూంటే.. మిగతా వారు చేసేపనికన్నా ఎక్కువగా ‘షో’ చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని కంపెనీల్లో ఇలాంటి ఉద్యోగులు గణనీయంగానే ఉన్నారని పేర్కొంది. 18వేల మందిని ప్రశ్నించి.. ఆఫీసుల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వినియోగించే అప్లికేషన్ ‘స్లాక్’. వాట్సాప్, మెసెంజర్, సిగ్నల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది ఆఫీసు బృందాలకు మాత్రమే పరిమితం. అయితే ఉద్యోగుల్లో పనిచేసేవాళ్లు, చేస్తున్నట్టు నటించే/హడావుడి చేసేవారిని గుర్తించేందుకు స్లాక్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక అధ్యయనం చేపట్టింది. వివిధ దేశాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 18వేల మందిని రకరకాల ప్రశ్నలు వేసి.. వారు ఏ రకానికి చెందినవారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ అధ్యయనం నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా, జపాన్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో పనిచేస్తున్న వారిలో ‘షో’ చేసేవారే ఎక్కువని పేర్కొంది.ఇండియాలో 43 శాతం, జపాన్లో 37 శాతం, సింగపూర్లో 36 శాతం ఇలాంటి ఉద్యోగులు ఉన్నారని తెలిపింది. కానీ ఆసియాలో భాగమే అయినా దక్షిణ కొరియాలో మాత్రం దాదాపు 72 శాతం మంది ఒళ్లు వంచి బుద్ధిగా పనిచేస్తున్నారని పేర్కొంది. యూరప్, అమెరికాలలో హడావుడి చేసే ఉద్యోగులు కొంత తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగులు ఏమంటున్నారు? స్లాక్ సర్వే ప్రకారం.. పలువురు ఐటీ ఉద్యోగులు తమ పనితీరును లెక్కగట్టే విధానంలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు. కేవలం ఆన్లైన్ స్టేటస్, ఈ–మెయిళ్లకు ఇచ్చిన సమాదానాలు వంటివాటిపై మాత్రమే కాకుండా.. పనికి సంబంధించి మేనేజర్లతో మాట్లాడిన సందర్భాలు, ఏదైనా పని పూర్తి చేసేందుకు పట్టిన గంటలు వంటివాటి ఆధారంగా పనితీరును మదింపు చేయాలని అంటున్నారు. కోవిడ్ సమయంలో మాదిరిగా రిమోట్ వర్కింగ్ లాంటి పద్ధతులే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పనివేళలు ఫ్లెక్సిబుల్గా ఉండాలని కోరుకుంటే.. ఇష్టమైన చోట పనిచేసే అవకాశం ఉండాలని 36శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆఫీసుల్లో ప్రోత్సాహకాలు భిన్నంగా ఉండాలని, కార్యాలయాల్లో వసతులు పెరగాలని 32శాతం మంది భావిస్తే.. వర్క్ ఫ్రం హోమ్ కాకుండా మళ్లీ ఆఫీసులకు వచ్చి పనిచేయడంపై నిర్ణయం తీసుకోవాలని మరికొందరు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఆఫీసులలో ఒకరిద్దరు కాకుండా బృందాలుగా పనిచేయాలని, బృందంగా మేధోమథనం చేయడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. సహోద్యోగులతో కలివిడిగా ఉండవచ్చునని, నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చని తెలిస్తేనే మళ్లీ ఆఫీసులకు వెళతామని మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 84శాతం మంది ఉద్యోగులు చెప్పడం గమనార్హం. పని చేయకున్నా ‘ఆన్లైన్’ కొందరు ఉద్యోగులు తాము పెద్దగా పనేమీ చేయకపోయినా యాక్టివ్గా ఉన్నామని చూపుకొనేందుకు ప్రయత్నిస్తుంటారని స్లాక్ అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి 63 శాతం మంది ఉద్యోగులు యాప్స్లో తమ స్టేటస్ ‘ఆన్లైన్’ అని ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. మీటింగ్లతోనే సరి! తమకు మీటింగ్లలో, ఈ–మెయిళ్లకు సమాధానాలు ఇవ్వడంతోనే రోజంతా గడచిపోతోందని.. దీనివల్ల తాము ఉత్పాదకత ఎక్కువగా ఉండే పనులు చేయలేకపోతున్నామని సింగపూర్ ఉద్యోగుల్లో 44 శాతం మంది పేర్కొన్నట్టు స్లాక్ అధ్యయనం వెల్లడించింది. స్లాక్ ఏమంటోంది? ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి పనితీరును, ఉత్పాదకతను అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రమాణాలు విజిబిలిటీ, యాక్టివిటీ అని రెండు రకాలు. ఉద్యోగి ఆన్లైన్లో ఎన్ని గంటలు ఉన్నాడు? ఎన్ని ఈ–మెయిళ్లు పంపాడు? వంటి వివరాల ఆధారంగా 27శాతం మేనేజర్లు ఉత్పాదకతను నిర్ణయిస్తుంటారని స్లాక్ సర్వే చెప్తోంది. ఉద్యోగులు అసలు పనిలో ఉత్పాదకత ఎంత పెంచారనేది మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్లాక్ టెక్నాలజీ ఎవాంజలిస్ట్ డెరెన్ లానే పేర్కొన్నారు. ఫలితాలను బట్టి కాకుండా, కంటికి కనిపించే అంశాల ఆధారంగా ఉత్పాదకతను నిర్ణయిస్తే.. ఆ కంపెనీ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు నటించేందుకే ఇష్టపడతారని చెప్పారు. ఈ తీరువల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని.. పనితో సంబంధం లేకుండా ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడపడం, వచ్చిన ఈ–మెయిళ్లకు వెంటనే సమాధానాలు చెప్పడంలో బిజీగా మారిపోతున్నారని, లేదంటే అవసరమున్నా లేకపోయినా అన్ని మీటింగ్లకూ హాజరవుతున్నారని స్లాక్ అధ్యయనంలో తేలిందని వివరించారు. -
చదువుకోవాలా..? బాత్రూంలు క్లీన్ చేయాలా?
ఉట్నూర్రూరల్: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్రూంలు క్లీన్ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్ కోఆర్డినేటర్ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్ ప్రిన్సిపాల్ను ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతోనే రైతుల ఆర్థిక ప్రగతి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి కె. తారక రామా రావు ఆదివారం షికాగోలో ఫుడ్ ప్రాసె సింగ్ రంగంపై అధ్య యనం చేశారు. ఇందులో భాగంగా పలు కంపెనీల ప్రతినిధుల తో పెట్టుబడులకు సంబంధించి వరుస సమావేశాలు నిర్వహించారు. ‘‘షికాగో ఫుడ్ స్టాప్‘ను సందర్శించి అక్కడ వరల్డ్ బిజినెస్ షికాగో సంస్థ ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లా డారు. షికాగో ఫుడ్ స్టాప్లో ఏర్పాటు చేసిన అనేక షాపులను పరిశీలించారు. స్థానిక వ్యాపారవేత్తలతో సంభాషించారు. షికాగో అనుసరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతులపైన చర్చించారు. షికాగో ఫుడ్ స్టాప్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. షికాగో ఫుడ్ స్టాప్ మాదిరి తెలంగాణలో కూడా.. షికాగో ఫుడ్ స్టాప్ మాదిరిం ఫుడ్ ప్రాసెసింగ్ పురోగతికి తెలంగాణ ఫుడ్ స్టాప్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నో వేషన్ ప్రాధాన్యత ఎంతగానో ఉందని, ఇది కేవలం ఫుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంపైన ఆధార పడిన రైతులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లోని భాగస్వాముల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ఫుడ్ ఇన్నోవేషన్ హబ్గా మారేందుకు కావలసిన అన్ని రకాల అవకాశాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ బలోపేతానికి.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఆ మేరకే తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. కోకా కోల, పెప్సీకో, ఐటీసీ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి కోసం పదివేల ఎకరాలకు పైగా కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కేటీఆర్ వివరించారు. నిజామాబాద్ ఐటీ హబ్లో క్రిటికల్ రివర్ సంస్థ నిజామాబాద్ ఐటీ హబ్ లో అమెరికాకు చెందిన క్రిటికల్ రివర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు అంగీకరించిన్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. -
టెక్ ఉద్యోగులకు ఊరట! సానుకూల విషయాన్ని చెప్పిన ఐఎల్వో
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రపంచంలో చాట్జీపీటీ (ChatGPT) రాక సంచలనాన్ని సృష్టించింది. తర్వాత క్రమంగా, మరిన్ని కంపెనీలు తమ సొంత ఏఐ సాధనాలతో ముందుకు వచ్చాయి. ఈ ఏఐ టూల్స్తో కొలువుల కోత తప్పదని, వేలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీనికి తోడు ఎలాన్ మస్క్ సహా అనేక టెక్ కంపెనీ అధినేతలు, సీఈవోలు సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ భయాందోళనల నేపథ్యంలో టెక్ ఉద్యోగులకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది ఐక్యరాజ్యసమితి (UN)కి చెందిన అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ILO). ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని, ఏఐ టెక్నాలజీ ఉద్యోగులను రీప్లేస్ చేయలేదని ఐఎల్వో తాజా అధ్యయనం వెల్లడించింది. ఐఎల్ఓ ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఏఐ టెక్నాలజీ మనుషులు చేసే పనులను మార్చేస్తుంది తప్ప ఉద్యోగాలకు ముప్పు కాబోదు. అయితే ఏఐ రాకతో చాలా ఉద్యోగాలు, పరిశ్రమలు పాక్షికంగా యాంత్రీకరణకు గురవుతాయని ఐఎల్ఓ స్టడీ పేర్కొంది. చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్ వల్ల ప్రయోజనమే తప్ప విధ్వంసం ఉండదని వివరిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలేం ఊడిపోవని, కాకపోతే పనిలో నాణ్యత, ఉద్యోగుల పనితీరు మెరుగు వంటి అంశాలకు దోహదం చేస్తుందని ఐఎల్ఓ అధ్యయనం పేర్కొంది. నూతన టెక్నాలజీ ప్రభావం వివిధ ఉద్యోగాలు, ప్రాంతాలకు వేర్వేరుగా ఉంటాయని, పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగాలపైనే ఈ ప్రభావం కాస్త ఉండే అవకాశం ఉందని ఐఎల్ఓ స్టడీ అంచనా వేసింది. ఇదీ చదవండి: ఏఐ ముప్పు లేని టెక్ జాబ్లు! ఐటీ నవరత్నాలు ఇవే.. -
దాల్చిన చెక్కతో ప్రొస్టేట్ కేన్సర్ నివారణ!
సాక్షి, హైదరాబాద్: భారతీయులు వంటకాల్లో తరచూ ఉపయోగించే దాల్చిన చెక్క ప్రొస్టేట్ కేన్సర్ నివారణకు దోహదపడుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) జరిపిన అధ్యయనం తేల్చింది. దాల్చిన చెక్కతో మన ఆరోగ్యానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. ఎన్ఐఎన్ తాజా అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. దాల్చిన చెక్కలోని చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిన్ బీ–2లను ఎలుకలకు అందించినప్పుడు ప్రాథమిక దశలోని ప్రొస్టేట్ కేన్సర్పై సానుకూల ప్రభావం చూపినట్లు తెలిసింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలకు 16 వారాలపాటు దాల్చిన చెక్క, దాంతోపాటు చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిస్ బీ–2లను అందించారు. ఆ తరువాత ఈ ఎలుకలకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చేలా చేశారు. దాల్చిన చెక్క, దాంట్లోని రసాయనాలను ఆహారంగా తీసుకున్న 60–70 శాతం ఎలుకల్లో కేన్సర్ లక్షణాలేవీ కనిపించలేదు. ఈ పదార్థాలు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ను సమర్థంగా తట్టుకోగలగడం వల్లనే వాటికి కేన్సర్ సోకలేదని భావిస్తున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అయేశా ఇస్మాయిల్ తెలిపారు. ప్రొస్టేట్ గ్రంథిలో కేన్సర్ కణాల వ్యాప్తి కూడా తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు. అంతేగాకుండా... ఎముకల్లోని ఖనిజాల మోతాదు ఎక్కువైందని, ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం తగ్గిందని వివరించారు. ప్రొస్టేట్ కేన్సర్ నివారణలో దాల్చిన చెక్క ఉపయోగపడగలదన్న విషయం ఎలుకల్లో రుజువైనప్పటికీ మనుషుల్లో వాడకానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘కేన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్’జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. -
‘ఐటీ’కి మెటబాలిక్ సిండ్రోమ్!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కనిపిస్తోందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పేర్కొంది. ఉద్యోగ హడావుడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె జబ్బుల బారినపడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. ఐటీ కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని.. సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతోపాటు వ్యాయామాలు చేయించడం, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను చేపట్టడం మంచిదని సూచించింది. –సాక్షి హైదరాబాద్ ఐసీఎంఆర్ నేతృత్వంలో.. భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) నేతృత్వంలో ఎన్ఐఎన్ ఈ అధ్యయనం నిర్వహించింది. దేశంలో ప్రముఖ ఐటీ హబ్ అయిన హైదరాబాద్లో పెద్ద, మధ్య తరహా, చిన్న ఐటీ కంపెనీల్లో విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించింది. ఉద్యోగాల తీరుతెన్నులు, వాటిలో పనిచేస్తున్నవారి ఆహార అలవాట్లు, జీవనశైలి, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించి విశ్లేషించింది. వారిలో 46శాతం మందికిపైగా మెటబాలిక్ సిండ్రోమ్ బారినపడినట్టు గుర్తించింది. చాలా మందిలో హెచ్డీఎల్ (మంచి) కొవ్వులు తక్కువగా ఉండటం, రక్తపోటు, నడుము చుట్టుకొలత వంటివి ఎక్కువగా ఉండటాన్ని గమనించింది. ఐటీ ఉద్యోగులు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు కూర్చునే ఉంటున్నారని.. 22 శాతం మంది మాత్రమే వారానికి కనీసం 150 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలన్న సూత్రాన్ని పాటిస్తున్నారని తేల్చింది. వ్యాయామం లేకపోవడం, తీవ్ర ఒత్తిడి, పోషకాలు లేని జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి శరీరంలో ఇన్ఫ్లమేషన్కు కారణం అవుతున్నాయని.. ఇది కాలం గడిచిన కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్కు దారితీస్తోందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల సగటు వయసు 30 ఏళ్లు మాత్రమేనని.. చిన్నవయసులోనే సమస్యల బారినపడుతున్నారని వివరించారు. ఏమిటీ మెటబాలిక్ సిండ్రోమ్! మన శరీరంలో క్రమంకొద్దీ జరగాల్సిన జీవక్రియల్లో తేడాలు రావడం, లోపాలు చోటు చేసుకోవడమే మెటబాలిక్ సిండ్రోమ్. ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్, హెచ్డీఎల్, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు.. అనే ఐదు ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్లను బట్టి దీన్ని నిర్ధారిస్తారు. నడుము చుట్టుకొలత, అధిక బరువు ఊబకాయాన్ని సూచిస్తాయి. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. నడుము చుట్టుకొలత పురుషుల్లోనైతే 90 సెంటీమీటర్లకన్నా, మహిళలకు 80 సెంటీమీటర్లకన్నా ఎక్కువగా ఉండటం ఊబకాయానికి సూచిక. ఇక రక్తంలో ట్రైగ్లిజరైడ్లు 150ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండటం అనారోగ్యకరం. ఆరోగ్యకరమైన కొవ్వులైన హెచ్డీఎల్ (హైడెన్సిటీ లిపిడ్స్) పురుషుల్లోనైతే 40 ఎంజీ/డెసిలీటర్ కంటే, మహిళల్లో 50 ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. రక్తపోటు 135/85 కన్నా తక్కువగా ఉండాలి. కనీసం ఎనిమిది గంటలకన్నా ఎక్కువ సమయం ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నాక రక్తంలో గ్లూకోజు స్థాయిలు 100 ఎంజీ/డెసిలీటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఈ ఐదింటిలో ఏ మూడు వ్యతిరేకంగా ఉన్నా.. సదరు వ్యక్తులు మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టేనని వైద్యులు చెప్తున్నారు. జీవన శైలిలో మార్పులే పరిష్కారం మెటబాలిక్ సిండ్రోమ్కు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారు. తరచూ బయటి ఆహారం (ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్) తినడం తగ్గించుకోవాలని.. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని, వీలైనంత వరకూ కాయగూరలు, పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు చాలామంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదని వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.సుబ్బారావు గవరవరపు తెలిపారు. దీనికితోడు ఒత్తిడికి లోనవుతుండటం మెటబాలిక్ సిండ్రోమ్కు గురయ్యేందుకు దారితీస్తోందని వివరించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సంఖ్య తక్కువే అయినా.. సగటున అందరు ఉద్యోగుల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి దాదాపు ఒకేలా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ సమస్య నుంచి ఐటీ ఉద్యోగులు బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలనివేదికను ఎన్ఐఎన్ శాస్త్రవేత్త భానుప్రకాశ్రెడ్డితో కలసి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. న్యూట్రియంట్స్’ఆన్లైన్ జర్నల్లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. -
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
రోజుకొక పెగ్గేసినా..అనర్థమే
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఒక పెగ్గు చొప్పున తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే ఏం కాదు అనుకుంటే.. అది పొరపాటేనని ఓ అధ్యయనం హెచ్చరించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించిన ఇటలీ, అమెరికాకు చెందిన ఓ మల్టీ నేషనల్ టీమ్ అధ్యయనం ప్రకారం.. తక్కువ మోతాదులో మద్యం సేవించే వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, అధిక రక్తపోటు బారినపడుతున్నారని వెల్లడైంది. 1997 నుంచి 2021 మధ్య కాలంలో జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో మద్యపానం వల్ల సంభవించే పర్యవసానాలపై ఏడు అధ్యయనాలు నిర్వహించారు. 20 నుంచి 70 ఏళ్ల వయసుతో పాటు అధిక రక్తపోటు లేని 19,548 మందిపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా 4 నుంచి 12 ఏళ్ల అనంతరం వీరి రక్తపోటు స్థాయిల్లో నిరంతర పెరుగుదలను కనుగొన్నారు. రోజుకు సగటున 12 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో ఐదేళ్లలో సిస్టోలిక్ రక్తపోటు 1.25 ఎంఎం హెచ్జీ పెరిగినట్టు గుర్తించారు. రోజుకు సగటున 48 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో సిస్టోలిక్ రక్తపోటు 4.9 ఎంఎం హెచ్జీ పెరిగినట్లు తేలింది.. ఒక్క రక్తపోటే కాదు.. అనేక సమస్యలు మద్యాన్ని ఎక్కువా.. తక్కువా.. అని కాదు.. ఏ పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎక్కువ పరిమాణంలో తాగే వారిలో వేగంగా, తక్కువ పరిమాణంలో తాగేవారిలో ఆలస్యంగా ప్రభావాలుంటాయి. రక్తపోటుతో పాటు కాలేయం, గుండె, మెదడుతో పాటు శరీరంలో మద్యపానానికి ప్రభావమవ్వని భాగం ఉండదు. ఆధునిక జీవనశైలి వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఇలా అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటికి మద్యపానం తోడైతే వేగంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మితంగా మద్యపానం ఆరోగ్యానికి మంచిదేనని గతంలో కొన్ని అధ్యయనాలు వచ్చినా.. అవి అవాస్తవమని తర్వాతి రోజుల్లో కొట్టిపడేశారు. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ -
సెప్టెంబర్లో ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చందమామపై పరిశోధనల కోసం చంద్రయాన్–3 మిషన్ను ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఆదిత్య–ఎల్1 పేరిట అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది. సెపె్టంబర్ మొదటివారంలో ప్రయోగం ఉటుందని ఇస్రో సోమవారం వెల్లడించింది. ఆదిత్య–ఎల్1 స్పేస్క్రాఫ్ట్ బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి శ్రీహరి కోటలో ఉన్న ‘షార్’కు చేరుకుంది. షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 స్పేస్క్రాఫ్ట్ను ప్రయోగిస్తారు. ఇక్కడి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో మూడు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేశారు. ఆదిత్య–ఎల్1కు క్లీన్రూంలో పరీక్షల అనంతరం రాకెట్ శిఖరభాగంలో అమర్చుతారు. ప్రయోగం ద్వారా సూర్యుడు–భూమి వ్యవస్థలోని లాంగ్రేంజ్ పాయింట్ 1(ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇది భూమికి 10.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనానికి అడ్డంకులుండవని సైంటిస్టులు చెబుతున్నారు. -
బాల్యంలో స్మార్ట్ ఫోన్తో యవ్వనంలో మతి చెడుతోంది
సాక్షి, అమరావతి: చిన్నతనంలోనే స్మార్ట్ ఫోన్ను వినియోగించడం మొదలుపెట్టిన వారికి యవ్వనంలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. స్మార్ట్ఫోన్ ఎంత ఆలస్యంగా అలవాటు చేసుకుంటే అంత మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. వాషింగ్టన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ సపియన్ ల్యాబ్స్ ‘గ్లోబల్ మైండ్ ప్రాజెక్టు’లో భాగంగా 41 దేశాల్లో 18–24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మందిపై అధ్యయనం చేసింది. వీరిలో చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగించడం మొదలు పెట్టిన వారి మానసిక స్థితి బలహీనంగా ఉందని పేర్కొంది. యువకుల కంటే యువతుల్లోనే ఎక్కువ మానసిక రుగ్మతల ప్రభావాన్ని గుర్తించింది. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఓషియానియా, దక్షిణాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని యువత మానసిక స్థితిగతులను 47 అంశాల ఆధారంగా లెక్కించారు. వయసు పెరిగితే దుష్ప్రభావం తక్కువ యువకులు 6 ఏళ్ల వయసు నుంచి ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారు 42 శాతం, 18 ఏళ్ల వయసుల్లో ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారిలో 36 శాతం మానసిక అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. అయితే మహిళల్లో ఆరేళ్ల వయసు నుంచి ఫోన్ వాడుతున్న వారిలో 74 శాతం, వయోజనులైన తర్వాత 46 శాతం వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత స్మార్ట్ఫోన్ వినియోగం మొదలైతే దాని దు్రష్పభావం కొంత వరకు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అలాగే పురుషుల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక దృక్పథం, ఇతరులతో సానుకూల సంబంధాలు కలిగి ఉండే సామర్థ్యాలు పెరిగినట్లు, మహిళల్లో మానసిక స్థితి, స్థితప్రజ్ఞత మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, దుందుడుకు భావాలు, వాస్తవికత నుంచి వేరుగా ఉన్నారనే భావనలు గణనీయంగా తగ్గాయి. వారంలో ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నారు స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న 10 ఏళ్ల వయసు్కల్లో 12.5 శాతం మంది నోటిఫికేషన్లు చూసుకోవడానికి అర్ధరాత్రి మేల్కొంటున్నారు. దీంతో సగటున వారానికి ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి సామాజిక మాధ్యమాల్లో రోజుకు మూడు గంటలు గడిపే కౌమారదశ పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు రెట్టింపు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల్లోని 13–17 ఏళ్ల మధ్య వయసు్కల్లో దాదాపు 95 శాతం మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో సుమారు 200 మిలియన్ల మంది చిన్నారులు, తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఐబీడీపై ఏఐజీ అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో: పట్టణ ప్రాంతాలకే పరిమితమైన జీర్ణకోశ సంబంధిత వ్యాధి ఇన్ల్ఫమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ)గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డి.నాగేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తమ ఆసుపత్రి అధ్యయన ఫలితాలను ప్రతిష్టాత్మక లాన్సెట్ ప్రచురించిన నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 15 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా కాగా, తాము గ్రామాల్లో 30 వేల మంది బాధితులను గుర్తించడం ద్వారా అది గ్రామీణ ప్రాంతాలకు కూడా బాగా విస్తరించినట్టు వెల్లడైందన్నారు. తమ తొలి దశ అధ్యయనం ప్రకారం గ్రామీణుల్లో ఈ వ్యాధి 0.1 శాతం మాత్రమే కాగా రెండో దశలో 5.1 శాతానికి పెరిగిందన్నారు. శిశువులకు తల్లిపాలు అందకపోవడం, యాంటీబయాటిక్స్ వినియోగం...తో పాటు గ్రామాల్లోనూ ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరగడం, పాశ్చాత్య జీవనశైలి వంటివి గ్రామాల్లో ఐబీడీ విజృంభణకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఐబీడీ వ్యాప్తిపై ప్రతీఒక్కరిలో అప్రమత్తత అవగాహన పెరగాలన్నారు. సమావేశంలో ఏఐజీ ఆసుపత్రి ఐబీడీ సెంటర్ డైరెక్టర్, డాక్టర్ రూపా బెనర్జీ అధ్యయనం తీరుతెన్నులను వివరించారు. -
వ్యాపార సామ్రాజ్యంలో మహిళా సారధులు - ఏం చదువుకున్నారో తెలుసా?
బిజినెస్ అనగానే సాధారణంగా పురుషులే గుర్తుకు వస్తారు. కానీ వ్యాపార రంగంలో మహిళలు కూడా తమదైన రీతిలో ముందుకు దూసుకెట్లున్నారన్న సంగతి చాలామంది విస్మరించి ఉండవచ్చు. మనం ఈ కథనంలో కోట్ల రూపాయల వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ మహిళల గురించి, వారు ఏం చదువుకున్నారు? ఏ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధా మూర్తి (Sudhamurthy) భారతదేశంలో ఎంతో మందికి ఆదర్శప్రాయమైన 'సుధా మూర్తి' ప్రముఖ టెక్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ చైర్పర్సన్. ఈమె నారాయణ మూర్తిని వివాహం చేసుకోవడానికి ముందు బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. 2023లో పద్మశ్రీ పొందిన ఈమె నికర సంపద విలువ సుమారు రూ. 775 కోట్లు అని సమాచారం. రోష్ని నాడార్ (Roshni Nadar) శివ నాడార్ కుమార్తె 'రోష్ని నాడార్' ప్రస్తుతం హెచ్సిఎల్ కంపెనీ సీఈఓ. ఈమె వసంత్ వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత నార్త్వెస్టర్న్ యూనివర్శిటీ రేడియో/టీవీ/ఫిల్మ్ వంటి వాటి మీద దృష్టి సారించి కమ్యూనికేషన్లో ప్రావీణ్యం సంపాదించింది. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2022 నాటికి ఆమె నికర సంపద విలువ రూ. 84,330 కోట్లని సమాచారం. నీతా అంబానీ (Nita Ambani) భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ భార్య 'నీతా అంబానీ' ముంబైలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఈమె ప్రస్తుతం రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్. 2022 నాటికి ఈమె సంపద విలువ రూ. 84,330 కోట్లు అని తెలుస్తోంది. కిరణ్ మజుందార్-షా (Kiran Mazumdar-Shaw) కిరణ్ మజుందార్-షా బయోకాన్ లిమిటెడ్ అండ్ బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు & ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కూడా. ఈమె బెంగళూరు ఐఐఎం మాజీ చైర్మన్గా కూడా పనిచేసింది. మజుందార్-షా బెంగుళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత బెంగుళూరు యూనివర్శిటీలో జువాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఈమె నికర ఆస్తుల విలువ 18779 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: భారత్లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! స్మితా కృష్ణ-గోద్రెజ్ (Smita Crishna-Godrej) నావల్ గోద్రెజ్ కుమార్తె అయిన స్మితా కృష్ణ-గోద్రెజ్ ముంబైలో హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసింది. ఈమె థియేటర్ యాక్టర్ విజయ్ కృష్ణను వివాహం చేసుకుంది. ఈమె సంపద విలువ సుమారు 2.9 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: 2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. ఈ రంగంలోని వారికి తిరుగులేదండోయ్! రేష్మా కేవల్రమణి (Reshma Kewalramani) డాక్టరుగా జీవితం మొదలుపెట్టిన రేష్మా కేవల్రమణి తరువాత కాలంలో వ్యాపారంలోకి అడుగుపెట్టి వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్తో కొత్త శిఖరాలకు అధిరోహించింది. ఈమె అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి లిబరల్ ఆర్ట్స్/మెడికల్ సైన్స్లో ఏడేళ్ల కోర్సు చేసి ఆ తరువాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి జనరల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పొందింది. -
కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!
కొంబుచా అనేది టీ, ఈస్ట్, బ్యాక్టీరియా, చక్కెరతో కలిసి తయారు చేసే పానీయం. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే కొత్తరకం డ్రింక్. మధుమేహం వ్యక్తులకు ఇది చక్కటి దివ్యౌషధం. ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలను చూసి పరిశోధకులు సైతం ఫిదా అయ్యారు. ఇంతకీ కొంబుచా అంటే ఏమిటి? దీన్ని ఎవరూ తయారు చేశారు?..అంటే.. ఈ డ్రింక్ రెండు వేల ఏళ్లక్రితం నాటిది. తొలిసారిగా చైనాలో తయారు చేశారు. ఆ తర్వాత దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి జపాన్, రష్యా దేశాలకు పాకింది. 20వ శతాబ్దంలో యూరోపియన్ దేశాలతో సహా అమెరికాలో కూడా దీనికి విశేష ప్రజాధరణ లభించింది. ఇందులో ప్రాథమిక పదార్థాలు ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీ. వీటన్నింట్ల మిశ్రమాన్ని ఒక వారం పాటు నిల్వ ఉంచగా పులియబెట్టిన ఒక ఆమ్లం తయారవుతుంది. ఈ ప్రక్రియను కిణ్వణ ప్రక్రియ అంటారు. డ్రింక్ ఎలా తయారు చేస్తారంటే.. కొంబుచా టీని వివిధ మార్గాల్లో తయారు చేస్తారు, అయితే కొంబుచా తయారీలో ఉపయోగించే కొన్ని ప్రాథమిక పదార్థాలు ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీ. వీటన్నింటి మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు పులియబెట్టేందుకు అలా వదిలేస్తారు. దీన్ని కిణ్వన ప్రక్రియ అంటారు. దీనిలో ఉండే ఈస్ట్, బ్యాక్టీరియా కొన్ని రకాలు ఆమ్లాలు విడుదల అయ్యి పైన ఒక పొరలాంటిది ఏర్పడుతుంది. ఈ పొరను పక్కకు ఉంచి అందులో ఉన్న పానీయాన్ని సేవిస్తారు. ఈ పొరనే కొంబుచా అంటారు దీన్ని పక్కకు ఉంచుకుని దీని సాయంతో డ్రింక్ తయారు చేసుకుంటారు. ఇది తియ్యటి ఆల్కహాల్ మాదిరి ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువుగా ఉంటుంది. డైలీ డ్రింక్ తయారీ విధానం: పెద్ద గాజు సీసా తీసుకోండి. ఒకటిన్నర కప్పుల చక్కెరను రెండు కప్పుల నీటిలో వేసి స్టవ్ మీద పెట్టాలి. చక్కెర బాగా కరిగాక రెండు టేబుల స్పూన్ల బ్లాక్ టీ వేసి పది నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఆఫ్ కప్ వెనిగర్ వేయాలి. ఈ నీటిని మనం పైన చెప్పనట్లుగా తయారు చేసకుని పక్కకు పెట్టుకున్న కొంబుచా పొరలో వేసేసి అలా సుమారు 15 నుంచి 20 రోజు చల్లని పొడి ప్రదేశంలో ఉంచండి. దీన్ని ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంచితే అంత తియ్యగా రుచిగా ఉండే కొంబుచా డ్రింక్ తయారవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ కొంబుచాలో ఉండే బ్యాక్టీరియా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. టైప్2 డయాబెటీస్ పేషంట్లకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఈ కొంబుచా డ్రింక్ జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంచుతుంది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పులియబెట్టిన డ్రింక్ కావడం చేత క్యాన్సని క్యూర్ అయ్యేలా చేస్తుంది అలాగే ఎయిడ్స్ పేషంట్లకు వ్యాధి నియంత్రణలో ఉండి మరింతకాలం బతికే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాల పునరుత్పత్తికి సహాయపడటమేగాక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగు సంబంధిత అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. అలాగే జార్జ్టౌన్ విశ్వవిద్యాలయం జరిపిన క్లినకల్ ట్రయల్స్లో ఈ కొంబుచా డ్రింక్ని సేవించిని నాలుగు వారాల తర్వాత ఆయ వ్యక్తుల రక్తంలో సగటున ఉండే గ్లూకోజ్ స్థాయిలు డెసిలీటర్కు 164 నుంచి 116 మిల్లీగ్రాములకు తగ్గినట్లు వెల్లడైంది. ఎలుకలపై జరిపిన అధ్యయనాల్లో కూడా ఇది నిరూపితమైందని అందువల్ల ఇది శరీరానికి తక్షణ రోగ నిరోధక శక్తి అందించడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఔషధంగా పేర్కొన్నారు. ఐతే కొందరూ మాత్రం ఇది పూర్తి స్థాయిలో ఆరోగ్యప్రయోజనాలను అందించగలదని నిరూపితమవ్వలేదంటూ వాదించడం గమనార్హం. (చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్కి ప్రదాన కారణమా! వెలుగులోకి విస్తూపోయే నిజాలు!) -
ఆ అలవాటే కరోనా అటాక్ అవ్వడానికి ప్రధాన కారణమా?
కొందరికి ముక్కుని టచ్ చేయడం, లోపల పట్టి ఉన్నవాటిని తీయడం అనే బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అలవాటుగా అలా చేస్తూనే ఉంటారు. అవసరం ఉన్న లేకపోయినా అదే పనిగాముక్కుని టచ్ చేస్తూ లోపలి వేళ్లు పెట్టి క్లీన్ చేయడం వంటివి చేస్తారు. ఇది మంచిది కాదని ఇదే కరోనా ఈజీగా అటాక్ అయ్యేందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు శాస్తవేత్తలు. ఈ మేరకు నెదర్లాండ్స్లోని శాస్త్రవేత్తల బృందం తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇదే సమయంలో మనం కూడా కోవిడ్ సంబంధిత రోగులతో సన్నిహితంగా ఉంటే కరోనా అటాక్ అయ్యే అవకాశాలు మరింతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్స్లోని దాదాపు 219 మంది ఆరోగ్య కార్యకర్తలపై సర్వే చేయగా..సుమారు 84 శాతం మంది యాదృచ్ఛికంగానే ముక్కుని టచ్ చేయగా మిగిలినవారు అదే పనిగా ముక్కుని ముట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇలా ముక్కుని టచ్ చేస్తూ లోపల వేలు పెట్టి తిప్పే వారికే ఈజీగా కరోనా సోకినట్లు తేలింది. అలాగే గోర్లు కొరకడం, కళ్లకు ధరించే అద్దాలను శుభ్రపరచకపోవడం, గడ్డంతో ఉండట తదితరాలే కరోనా అటాక్ కావడానికి ప్రధాన కారణం అని చెప్పడం లేదని చెప్పారు శాస్త్రవేత్తలు. నిజానికి ఇలాంటి అలవాట్ల వల్ల క్రిములు, బ్యాక్టిరియా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఇక ముక్కుని చేతితో ముట్టుకోవడం, రంధ్రాల్లో పెట్టడం వల్ల సున్నితంగా ఉండే ముక్కు గోడలు దెబ్బతింటాయి. ఫలితంగా కోవిడ్ -19 సోకే అవకాశం పొంచి ఉంటుందని సూచించారు. ఇలాంటి అలావాట్లను దూరం చేసుకుంటే కరోనా మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు అటాక్ అవ్వకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారని పేర్కొంది శాస్త్రవేత్తల బృందం. (చదవండి: ఆకాశ పండు గురించి విన్నారా! ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!) -
కష్టాలకు లొంగని మహిళా ట్యాక్సీ డ్రైవర్.. విదేశాల్లో చదువుకునే స్థాయికి..
ముంబయి: కష్టాలకు లొంగని తత్వం తనది. ఎక్కడో మారుమూల గిరిజన గూడెంలో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తోంది. పరిస్థితులు పరీక్షించినా.. కుటుంబ భారం మీద పడినా.. అమ్మాయి డ్రైవారా..! అంటూ సమాజం చిన్నచూపు చూసినా బెరుకులేని జీవిత ప్రయాణం సాగించింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహాయంతో చివరికి విదేశాల్లో చదువుకోవాలనే తన కలను సాకారం చేసుకుంది. ఆ యువతి పేరు కిరణ్ కుర్మా. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలోని రేగుంత గ్రామానికి చెందినది. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ పోషణకు ట్యాక్సీ డ్రైవర్గా పనిచేయాల్సి వచ్చింది. రేగుంత నుంచి సిరోంచ వరకు 140 కిలోమీటర్ల దూరం ట్యాక్సీ నడిపింది. ప్రస్తుతం ఆమెకు మూడు ట్యాక్సీ లు ఉన్నాయి. మావోయిస్టు ప్రాంతంలో సాహసంతో ట్యాక్సీ సేవలు అందించినందుకు వరల్డ్ క్రాస్ అనే సంస్థ ఆమెను గుర్తించింది. ఇప్పటికీ ఆమెకు 18 అవార్డులు కూడా వచ్చాయి. అయితే.. తన ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను సంప్రదించింది. దీంతో ఆయన రూ.40 లక్షల స్కాలర్షిప్ను మంజూరు చేశారు. యూకేలో ఏడాది పాటు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ కోర్సును యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ లో ఆమె చదవనున్నారు. మరో రెండేళ్ల పాటు అక్కడే ఓ సంస్థలో పనిచేయనున్నారు. ఇదీ చదవండి: IIT Bombay: ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ.. -
ఇంజనీరింగ్ చదివిన టీమిండియా క్రికెటర్లు వీరే! (ఫొటోలు)
-
ప్రకృతి సేద్యం..ఉపాధికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు!
అనారోగ్యం వల్ల కోల్పోయే పనిదినాలు మూడో వంతు తగ్గాయి.ప్రకృతి వ్యవసాయంతో పంట దిగుబడులను పెరిగే జనానికి సరిపోయేంత సాధ్యమేనా? వంటి ప్రాధమిక ప్రశ్నలకు, అనుమానాలకు ఇప్పుడు పూర్తిగా కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 8 లక్షల మందికి పైగా రైతులు ఇటువంటి ప్రశ్నలన్నిటినీ తమ అనుభవాల ద్వారా పటాపంచలు చేశారు. దిగుబడులు సరే, ప్రకృతి సేద్యంలో శాస్త్రీయత ఎంత? అనే ప్రశ్నకు కూడా ఇటీవల విడుదలైన అంతర్జాతీయ స్థాయి అధ్యయన నివేదిక దీటుగా బదులిచ్చింది. జిస్ట్ ఇంపాక్ట్, గ్లోబల్ అలియన్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ అనే స్వచ్ఛంద సంస్థలు ఏపీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో 2020 నుంచి మూడేళ్లు లోతుగా అధ్యయనం చేసి, ‘నాచురల్ ఫార్మింగ్ త్రో ఎ వైడ్ యాంగిల్ లెన్స్’ పేరిట నివేదికను వెలువరించాయి. ఈ నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.)కి కూడా సమర్పించాయి. హరిత విప్లవానికి ప్రతీకైన డెల్టా ప్రాంతంలోని పశ్చిమగోదావరి, నీటి ఎద్దడి ప్రాంతాలకు ప్రతీకైన అనంతపురం, కొండ ప్రాంత గిరిజన వ్యవసాయానికి ప్రతీకైన విజయనగరం జిల్లాల్లో 12 గ్రావలను ఎంపిక చేసుకొని, ఆయా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం, రసాయనిక వ్యవసాయం చేసే రైతుల క్షేత్రాల్లో లోతుగా అధ్యయనం చేశాయి. ఖరీఫ్, రబీ పంటలు, దీర్ఘకాలిక పంటలతో పాటు పశువుల పెంపకానికి సంబంధింన విషయాలను అధ్యయనం చేశాయి. దిగుడులు, ఖర్చులు, నికరాదాయంతో పాటు.. రసాయనిక పురుగుమందులు, ఎరువుల ప్రభావం రైతులు, గ్రామీణుల ఆరోగ్యంపై ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించి తొలి అధ్యయనం కావటం మరో విశేషం. ప్రకృతికి సంబంధించిన అంశాలపై నోబెల్ ప్రైజ్గా భావించే టేలర్ పురస్కారం(2020) అందుకున్న ప్రముఖ పర్యావరణ ఆర్థికవేత్త పవన్ సుఖదేవ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ నివేదికలో ఏముందంటే..? ప్రకృతి సేద్యంతో 49% పెరిగిన నికరాదాయం రసాయనిక సేద్యం జరిగే పొలాల్లో ఒకటో రెండో పంటలు పండిస్త ఉంటే.. ప్రకృతి వ్యవసాయంలో సగటున 4 పంటలు పండిస్తున్నారు. వరి, మొక్కజొన్న, మినుము, రాగులు, కంది వంటి ప్రధాన పంటల దిగుబడి రసాయనిక వ్యవసాయంతో పోల్చితే ప్రకృతి వ్యవసాయంలో సగటున 11% పెరిగింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో శ్రమ అవసరం రసాయనిక సేద్యంతో పోల్చితే సగటున 21% పెరిగింది. రైతు కుటుంబం, కలీల శ్రమ మొత్తాన్నీ లెక్కగట్టారు. గోదావరి డెల్టాలో రసాయన వ్యవసాయంలో ఏడాదికి 313 గంటలు పని చేస్తే, ప్రకృతి సేద్యంలో ఇది 377 గంటలకు పెరిగింది. రాయలసీమలో 258 నుంచి 322 గంటలకు పెరిగింది. ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో 234 నుంచి 268 గంటలకు పెరిగింది. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం మానెయ్యటంతో ఖర్చు సగటున 44% తగ్గింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రకృతి వ్యవసాయదారుల సగటు నికరాదాయం 49% పెరిగింది. చిన్న రైతులే ‘సామాజిక మూలధనం’ ప్రకృతి సేద్య అనుభవాలను ఒకరితో మరొకరు పంచుకోవటం వల్ల మీకు తోడుగా మేం ఉన్నాం అన్న భావం విస్తరించింది. పరస్పర విశ్వాసం, మద్దతు, సాంఘిక సమన్వయం పెరిగాయి. అన్యోన్యతకు దారితీసింది. ∙ఈ విధంగా రసాయనాల్లేని సాగు అనుభవాలను పంచుకోవడం ద్వారా సామాజిక మూలధనం గణనీయంగా పెరగడానికి మహిళా స్వయం సహాయక బృందాలు ప్రభావశీలంగా పనిచేస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయానికి మళ్లటంలో, ఈ క్రమంలో ఒకరికి మరొకరు తోడుగా నిలబడటంలో పెద్ద రైతుల కంటే చిన్న కమతాల రైతులు ముందంజలో ఉన్నారు. సావజిక మూలధనాన్ని పెంపొందిచటంలో చిన్న రైతుల పాత్ర చాలా ప్రధానమైనదని తేటతెల్లమైంది. మన రైతుల్లో 83% మంది చిన్న, సన్నకారు రైతులే. మెరుగైన ఆరోగ్యం... రసాయనిక వ్యవసాయం చేసే రైతులు, ఆ పొలాల్లో పనిచేసే కూలీలు అనారోగ్యాల పాలవుతూ చాలా పని దినాలు కోల్పోతూ ఉంటారు. వీరితో పోల్చితే ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే కూలీలు, రైతులు అనారోగ్యం వల్ల పనికి వెళ్లటం మానుకోవాల్సిన రోజులు మూడింట ఒక వంతు (33%) తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది. రసాయనిక పురుగుమందులు, ఎరువుల వాడే రైతులకు ఆరోగ్య ఖర్చులు ఎక్కువ. వారి జీవన నాణ్యత, పని సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. సాధారణంగా ఇటువంటి ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగించే నష్టాన్ని లెక్కలోకి తీసుకోవటం లేదు. ∙ప్రకృతి సేద్యం చేసే రైతుల ఆస్పత్రి ఖర్చులు 26% తక్కువ. ప్రకృతి వ్యవసాయదారులు ఎక్కువ రకాల పంటలు పండించడమే కాదు ఎక్కువ రకాల ఆహారాన్ని తినగలుగుతున్నారు. పోషకాలతో కూడిన అనేక రకాల ఆహారం తినటం వల్ల వీరి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది. (చదవండి: ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!) -
అన్నా.. ఇది పద్ధతి కాదే.. పవన్ కళ్యాణ్ కు అభిమాని చురకలు
పవన్ కళ్యాణ్.. నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రతీ సారి చెప్పుకునే పీకే.. ఇప్పుడు పనికిరాని ప్రశ్నలు వేసి నవ్వులపాలవుతున్నాడు. తనకు తెలియని విద్యావిధానం గురించి, ఇంకెవరో రాసిచ్చిన ప్రశ్నలను అనుసంధానం చేసి.. దాన్ని సోషల్ మీడియా వేదికగా సంధించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్న పవన్ ప్రయత్నం పాపం.. బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాలు భేష్ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన పథకాలకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జులై మూడో వారంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ డిస్కషన్ మీట్ సందర్భంగా ఏపీ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రంలో చేపడుతున్న విద్యావిధానాలను ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రజెంట్ తీసుకొచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే విద్యకు మించిన విధానం మరొకటి లేదన్న సీఎం జగన్ ఆశయానికి పలు ప్రశంసలు వచ్చాయి. (ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విద్యావిధానాలపై స్టాల్) (చదవండి : ఏపీ విద్యావిధానాలు భేష్) విద్యార్థులకిచ్చిన ట్యాబ్లెట్లపై అక్కసు ఏపీ విధానాలను అందరూ ప్రశంసిస్తుంటే.. కొందరిలో మాత్రం అక్కసు మొదలైంది. అసలు పేద విద్యార్థులకు ట్యాబ్లు ఎలా ఇస్తారన్నట్టుగా వీరి వ్యవహారం తయారయింది. విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ట్యాబ్లు ఉపయోగపడుతాయన్న కనీస స్పృహ లేకుండా.. దానిపై చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు జోడించి, కొన్ని ప్రశ్నలను ట్విట్టర్ వేదికగా వదిలారు పవన్ కళ్యాణ్. Points to note : 1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది. 2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి… — Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023 సొంత అభిమాని నుంచే పవన్ కు ప్రశ్న పవన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అయితే వారంతా ప్రభుత్వానికి చెందిన వారని, వైఎస్సార్ సిపి క్యాడర్ అని జనసేన చెప్పుకోవచ్చు కానీ.. పవన్ ట్వీట్కు సొంత అభిమాని రమేష్ బోయపాటి నుంచి ఎదురయిన విమర్శను మాత్రం కచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. మీ సినిమాలు చూస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను కానీ, పేద విద్యార్థులకు మేలు చేసే విద్యావిధానాన్ని విమర్శిస్తే మాత్రం మౌనంగా ఉండలేనంటూ నేరుగా స్పందన వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానంలో కచ్చితంగా సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనంటూ నొక్కి వక్కాణించారు రమేష్ బోయపాటి. పవన్ కళ్యాణ్ గారు బైజూస్ తో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మీరు లేవనెత్తిన సందేహాలు విలువైనవి. ఇక్కడ మీ ట్వీట్ ఉద్దేశం బైజూస్ తో ఒప్పందం గురించి కన్నా, ఆ ఒప్పందంలో ఉన్న అనేక సందేహాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం అనిపించింది. నేను కూడా ఈ విషయం గురించి అవగాహన ఏర్పరుచుకునే… pic.twitter.com/thDcCgldYM — Ramesh Boyapati (@rameshboyapati) July 24, 2023 -
కోవిడ్ కూడబెట్టిన బంగారం! పసిడి పొదుపుపై ఆసక్తికర అధ్యయనం
బంగారంపై భారతీయులకు ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. దాన్ని కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ఇదంతా తెలిసిందే. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లాడిస్తున్న సమయంలో భారతీయుల ఆర్థిక కార్యకలాపాలు, పొదుపు, బంగారు కొనుగోలు వంటి అంశాలపై ఓ ఆసక్తికర అధ్యయనం వెల్లడైంది. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశంలోని ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాలే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - అహమ్మదాబాద్ (ఐఐఎంఏ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ‘గోల్డ్ ఇన్ హౌస్హోల్డ్ పోర్ట్ఫోలియోస్ డూరింగ్ ఎ ప్యాండమిక్: ఎవిడెన్స్ ఫ్రం ఎమర్జెన్సీ ఎకానమీ’ పేరుతో రూపొందించిన అధ్యయన పత్రాన్ని ఐఐఎంఏ ఇటీవల తమ వెబ్సైట్లో ప్రచురించింది. ప్రతి 1000 జనాభాకు నమోదైన కోవిడ్ కేసులతోపాటు మరో సూచిక ఆధారంగా ఈ అధ్యయనం సంక్షోభ తీవ్రతలోని వైవిధ్యాన్ని సంగ్రహించింది. ఆభరణాల రూపంలో బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. ఒక సగటు భారతీయ కుటుంబం తన మొత్తం హోల్డింగ్లలో 11 శాతాన్ని బంగారంపై పెట్టుబడి పెడుతున్నట్లు ఈ అధ్యయన పత్రం పేర్కొంది. దీని ప్రకారం.. ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాల పొదుపు పోర్ట్ఫోలియోలలో బంగారం వాటా గణనీయంగా 6.9 శాతం ఎక్కువగా ఉంది. ఆయా కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు కోవిడ్కి ముందు కంటే మహమ్మారి సమయంలో గణనీయంగా పెరిగాయి. ఇదీ చదవండి ➤ రూ.2,000 నోటు ఉపసంహరణ ఎఫెక్ట్: ఆరేళ్ల గరిష్టానికి బ్యాంక్ డిపాజిట్లు 2020-21 ఆర్థిక సంవత్సరం కోవిడ్ సమయంలో ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (IGPC), పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (PRICE) ద్వారా నిర్వహించిన గోల్డ్ వినియోగానికి సంబంధించిన గృహ సర్వే ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో 160 జిల్లాల్లోని 40,427 కుటుంబాలతో ఈ సర్వే నిర్వహించారు. ఆ డేటా ఆధారంగా దేశంలో 21 రాష్ట్రాల్లోని 142 జిల్లాల్లోని 21,611 కుటుంబాలను శాంపిల్గా తీసుకుని అంచనాలను రూపొందించారు. ఆయా కుటుంబాల్లో బంగారంపై పొదుపులో వచ్చిన మార్పులను పోల్చడానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ‘ప్రైస్’ ముందస్తు ప్రతినిధి సర్వేను ఉపయోగించారు. ఇక జిల్లా స్థాయిలో కోవిడ్ కేసుల సంఖ్యను డెవలప్మెంట్ డేటా ల్యాబ్కు చెందిన సోషియో ఎకనామిక్ హై-రిజల్యూషన్ రూరల్-అర్బన్ జియోగ్రాఫిక్ ప్లాట్ఫాం ఫర్ ఇండియా (SHRUG) డేటాబేస్ నుంచి తీసుకున్నారు. -
మీకు తెలుసా! వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి
రోగాలను నిర్థారించడంలో తలెత్తిన లోపాల కారణంగా ఏటా లక్షలాదిమంది ప్రాణాలను కోల్పోతున్నారట. ఈ విషయాన్ని యూఎస్కి చెందిన ఓ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది లక్షల మంది దాక చనిపోతున్నట్లు యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే ప్రకారం ..ప్రతి ఏడాది వ్యాధులను సరిగా గుర్తించడంలో వైఫల్యం కారణంగా ఏటా మూడు లక్షల మరణాలు, నాలుగు లక్షల మందికి అంగవైకల్యం, మరికొందరూ ఇతర శారీరక రుగ్మతలతో బాధ పడుతున్నట్లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన అధ్యయనంలో పేర్కొంది. శాస్త్రవేత్తలు 15 రకాల వ్యాధులను గుర్తించడంలో వైద్యులు విపలమవుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ రోగ నిర్థారణ లోపాల్లో చాలా వరకు ఆస్పత్రుల్లో సరైన విధంగా వనరులు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని అని తెలిపింది. ఇక వైద్యులు ఊపితిత్తుల క్యాన్సర్, సెప్సిన్, న్యుమోనియా, సిరలలో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, తదితర వ్యాధులను తప్పుగా నిర్థారిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యాధులు సాధారణ వ్యాధుల లక్షణాలను చూపించడంతో తరుచుగా వైద్యులు ఆయా వ్యాధులను గుర్తించడంలో విఫలమవుతున్నట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ న్యూమాన్-టోకర్ వెల్లడించారు. (చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు) -
ఏపీలో విద్యా విధానాలపై UNO అభినందనలు
-
ఆపుకోలేక.. చెప్పుకోలేక..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సగటు మనిషి ఆయుర్దాయం నూరేళ్లుగా లెక్క కడుతూంటారు. ఇందులో సగం అంటే 50 ఏళ్లు వచ్చేసరికి సాధారణంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూంటాయి. అలా వచ్చే కొన్ని సమస్యలను కంటికి రెప్పలా చూసుకునే కన్న పిల్లలకు కూడా చెప్పుకోలేక కొంతమంది లోలోపలే కుమిలిపోతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన 60 నుంచి 70 శాతం మందిలో హఠాత్తుగా చుక్కలు చుక్కలుగా యూరిన్ (మూత్రం) రావడం సమస్యగా ఉంటోంది. దీనిని వైద్య పరిభాషలో ‘స్ట్రెస్ ఇన్కంటినెన్స్’ అని పిలుస్తుంటారు. దీనికి వయోభారంతో వచ్చే కండరాల బలహీనత ప్రధాన కారణమని యూరాలజీ నిపుణులు చెబుతున్నారు. 50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి 10 మందిలో ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురు ఈ సమస్యతో బాధ పడేవారని, ఇప్పుడు ఆ సంఖ్య ఐదు నుంచి ఆరు ఉంటోందని యూరాలజీ వైద్యులు అంటున్నారు. కొంతమంది ఈ సమస్యను ఎవ్వరికీ చెప్పలేక.. ముందు జాగ్రత్తలు తీసుకోలేక కేన్సర్ బారిన పడుతూ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారని అంటున్నారు. మహిళల్లో అధికం స్ట్రెస్ ఇన్కంటినెన్స్ పురుషుల్లో కంటే నాలుగు పదులు దాటిన మహిళల్లో ఎక్కువని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. పెల్విక్ కండరాల బలహీనత, ఈస్ట్రోజన్ హార్మోన్ స్రావంలో లోపాలు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బ తీసి కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. అసాధారణ పరిస్థితుల్లో మూడు పదుల వయసు దాటిన వారిని కూడా ఈ సమస్య వెంటాడుతోంది. రుతుస్రావం నిలిచిపోయే పరిస్థితిలో ఏర్పడే పోస్ట్ మెనోపాజల్ దశలో స్ట్రెస్ ఇన్కంటినెన్స్, వెజైనల్ డ్రైనెస్ సమస్యలు మొదలవుతాయి. అధిక కాన్పులు, శస్త్రచికిత్సలు, ప్రొస్టేట్ చికిత్స మహిళల్లో మూత్రం చుక్కలు చుక్కలుగా రావడానికి కారణమవుతున్నాయి. పురుషుల్లో మధుమేహం, శస్త్రచికిత్సలతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. తుమ్మినా, దగ్గినా తెలియకుండానే మూత్ర విసర్జన, వెజైనల్ సమస్యలు దీని లక్షణాలుగా చెబుతున్నారు.మూత్రం చుక్కచుక్కలుగా పడుతున్న వారికి కాకినాడ జీజీహెచ్లో యూరాలజీ, వెజైనల్ డ్రైనెస్ సమస్యకు గైనకాలజీ ఓపీల్లో సేవలందిస్తున్నారు. గడచిన ఆరు నెలల వ్యవధిలో ఈ రెండు విభాగాల ఓపీకి ప్రతి నెలా వస్తున్న కేసులను పరిశీలిస్తే రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం వంటి ప్రాంతాల్లో కూడా యూరాలజీ వైద్యుల వద్ద అవుట్ పేషెంట్లు, ఇన్పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. స్ట్రెస్ ఇన్కంటినెన్స్, వెజైనల్ డ్రైనెస్కు అధునాత వైద్య సదుపాయాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో అందుబాటులోకి తీసుకువచ్చామని స్థానిక సృజనా ఆస్పత్రి కాస్మెటిక్ గైనకాలజిస్టు డాక్టర్ ఏఎల్ సత్యవతి చెప్పారు. ముంబైకి చెందిన ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు సీజెల్ అజ్మీరా భాగస్వామ్యంతో ఈ సేవలు తీసుకువచ్చారు. మానసిక సమస్యలు ఉత్పన్నం స్ట్రెస్ ఇన్కంటినెన్స్ సహా, పెల్విక్ కండరాల బలహీనత, ఈస్ట్రోజన్ అసమతుల్యతలు మానసిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మహిళలు సంసార, సాధారణ జీవితాల్లో ఇబ్బందులు పడుతున్నారు. చెప్పుకోలేని వేదనతో సతమతమవుతూంటారు. తొలి దశలో నిర్వహించే కౌన్సెలింగ్లోనే ఈ సమస్యలను ధైర్యంగా వైద్య నిపుణుల వద్ద ప్రస్తావిస్తే తక్షణ పరిష్కారం ఉంటుంది. – డాక్టర్ వానపల్లి వరప్రసాద్, మానసిక వైద్య నిపుణుడు, జీజీహెచ్, కాకినాడ మందులు అవసరం లేని చికిత్స అవాంఛిత మూత్రం కేసులు పెరుగుతున్నాయి. స్ట్రెస్ ఇన్కంటినెన్స్ సమస్యకు చెమట పట్టని వ్యాయామాలతో పెల్విక్ కండరాల పటిష్టత ద్వారా మందుల అవసరం లేని పరిష్కారం లభిస్తోంది. దీనికి అధునాతన బీటీఎస్ ఎంసెల్లా చైర్ను వినియోగిస్తాం. 28 నిమిషాల వ్యవధిలో 11 వేల పెల్విక్ వ్యాయామాలు చేయించడం ఈ యంత్రం ప్రత్యేకత. వీటిని కిగెల్స్ ఎక్సర్సైజ్లు అంటారు. వెజైనల్ డ్రైనెస్ నివారణకు వెజైనల్ రెజువనేషన్ను కూడా అందుబాటులోకి తెచ్చాం. కుర్చీలో కూర్చోవడం ద్వారా నొప్పి లేని చికిత్స అందిస్తాం. – డాక్టర్ ఏఎల్ సత్యవతి, కాస్మెటిక్ గైనకాలజీ నిపుణురాలు, కాకినాడ ఆగితే తగ్గదు మూత్రం లీకేజీ, వెజైనల్ డ్రైనెస్లు నానాటికీ అధికమవుతున్న సమస్యలు. ముఖ్యంగా పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. తగ్గుతుందిలే అన్న ధీమా ఎంత మాత్రం సరికాదు. దీనివలన సమస్య తగ్గదు సరికదా, మానసిక సమస్యలు ఎక్కువై మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఇది శారీరక అనారోగ్యాలకూ దారి తీస్తుంది. తక్షణమే వైద్యులను సంప్రదించి వైద్యం పొందాలి. ఈ ఇబ్బందిని చెప్పుకొనేందుకు చాలా మంది మహిళలు ముందుకు రాకపోవడమే అసలు సమస్య. మందులు అవసరం లేని అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. సత్ఫలితాలిస్తున్నాయి. – డాక్టర్ మణికంఠన్ జంధ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ -
మనిషికి నిత్యం సంతోషాన్నిచ్చేది ఏంటి? హర్వర్డ్ స్టడీ ఏం చెబుతోంది!
-దొడ్డ శ్రీనివాస్రెడ్డి మనిషి సంతోషదాయకమైన జీవితం గడిపేందుకు కారణమయ్యే అంశం ఏమై ఉంటుందనే మీమాంసకు సమాధానం వెదికేందుకు 1938లో హార్వర్డ్ యూనివర్సిటీ ‘హర్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్’ పేరిట పరిశోధనా ప్రాజెక్టు మొదలుపెట్టింది. వందలాది మంది జీవితాలను దశాబ్దాలు పరిశీలిస్తూనే ఉంది. మనిషి జీవన విధానంపై ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలం సాగిన ఈ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో మనకు ఉన్న సంబంధాలే మన మానసిక ఆరోగ్యానికి, తద్వారా శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. మనిషికి నిత్యంసంతోషాన్నిచ్చేది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం తరతరాలుగా అన్వేషణ సాగుతూనే ఉంది. మనిషికి నిత్యం సంతోషాన్నిచ్చేది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం తరతరాలుగా అన్వేషణ సాగుతూనే ఉంది. తత్వవేత్తల నుంచి యోగుల వరకూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. యోగం, భోగం నిరంతరంగా ఆనందాన్ని ఇవ్వలేవు. ధనం, పదవి, హోదా వంటివి కూడా ఎప్పటికీ మనిషిని ఆనందదాయకంగా ఉంచలేవనేది అందరూ అంగీకరించే విషయమే. మరి ఏ అంశం మనిషిని నిత్య సంతోషిగా మార్చగలదు? దీనికి సమాధానం కనుగొనేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ దశాబ్దాలుగా పరిశోధన చేస్తోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం–గ్రేట్ డిప్రెషన్ కాలంలో మొదలై, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తర్వాతి కాలం దాకా కొనసాగిన ఈ పరిశోధన.. తమ చుట్టూ ఉన్నవారితో కొనసాగే ఆరోగ్యకరమైన సంబంధాలే మనిషి ఆనందకరమైన జీవితం సాగించడానికి దోహదపడుతుందని తేల్చింది. సత్సంబంధాలే కొలమానం ఒంటరితనం మనిషిని కుంగదీస్తుందని.. ఆరోగ్యకరమైన సంఘ జీవనం మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న హార్వర్డ్ మెడికల్ స్కూల్ మానసిక శాస్త్రం ప్రొఫెసర్ రాబర్ట్ వాల్డింగర్ అంటున్నారు. మనిషి తన చుట్టూ అల్లుకున్న ఆరోగ్యకర బంధాల ఫలితంగా సంతోషకరమైన జీవితాన్ని నిరంతరంగా కొనసాగిస్తాడని పేర్కొన్నారు. తమ పరిశోధన ఫలితాలపై 2015లో వాల్టింగర్ చేసిన ‘టెడ్ టాక్’ ప్రసంగాన్ని ఇప్పటివరకు నాలుగున్నర కోట్ల మంది వీక్షించడం గమనార్హం. హార్వర్డ్ మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి సహా అనేక సంస్థలు నిర్వహించిన పరిశోధనల్లో కూడా మనిషికి తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో ఉన్న సత్సంబంధాలే మానసిక, శారీరక ఆరోగ్యానికి కొలమానాలు కాగలవని తేలింది. మనిషి తన 50వ ప్రాయంలో చుట్టూ ఉన్న అనుబంధాల పట్ల ఎంత సంతృప్తితో ఉన్నాడనేదే అతడి శారీరక ఆరోగ్యానికి కూడా కొలమానం కాగలదని, కొలెస్టాల్ స్థాయి కాదని పరిశోధకులు అంటున్నారు. కోవిడ్ తదనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఇతరులపట్ల సహానుభూతి స్థాయి పెరగడం సంతోషకర పరిణామమని ఐక్యరాజ్యసమితి సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ తాజా నివేదిక పేర్కొంది. ఇతరుల పట్ల సహానుభూతి, అపరిచితులపట్ల సానుభూతి స్థాయి ప్రపంచవ్యాప్తంగా 2021 నుంచీ పెరుగుతూ వస్తోందని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టుకు రూపకల్పన చేసినవారిలో ఒకరైన జాన్ హెల్లీవెల్ అన్నారు. చదవండి: చైనాను అధిగమించి.. దూసుకెళ్తున్నారు.. మిస్టర్ సంతోషి! ప్రపంచం మొత్తంలో అత్యంత సంతోషకర జీవితం గడుపుతున్న వ్యక్తి ఎవరనే విషయం తేల్చడానికి విస్కాన్సిన్ యూనివర్సిటీ 12 ఏళ్లపాటు పరిశోధించి మాథ్యూ రికార్ట్ అనే బౌద్ధ భిక్షువును ఎంపిక చేసింది. మాలిక్యులర్ జెనెటిక్స్లో పీహెచ్డీ చేసిన మాథ్యూ తదనంతరం బౌద్ధ భిక్షువుగా మారారు. వర్సిటీ శాస్త్రవేత్తలు మాథ్యూ రికార్ట్ తలకు 256 సెన్సర్లను తగిలించి వివిధ అంశాలపై పరిశోధన చేశారు. ఆయన మెదడు అధిక స్థాయిలో గామా తరంగాలను ఉత్పత్తి చేస్తోందని కనుగొన్నారు. మాథ్యూ మెదడు ఎటువంటి ప్రతికూల భావనలకు చోటు ఇవ్వకుండా ఎల్లప్పుడూ సానుకూల ధోరణిలో ఉండేట్టు చేస్తోందని వెల్లడించారు. ‘‘ఎల్లప్పుడూ నేనే, నాదే అనే భావన.. ప్రపంచంలో ఇతర అంశాలన్నింటి పట్లా శత్రు భావనను రేకెత్తిస్తుంది. మనిషిని నిత్యం అలజడిలో ఉంచుతుంది. అదే ఇతరుల పట్ల సహానుభూతి పెంచుకుంటూ ఉంటే మానసిక ఆరోగ్యం తద్వారా శారీరక ఆరోగ్యం ఇనుమడిస్తుంది.’’ అని మాథ్యూ రికార్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆనంద నిలయం ఫిన్లాండ్ ఫిన్లాండ్ ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా వరుసగా ఆరోసారి ఎంపికైంది. పౌరుల జీవన విధానం ఆధారంగా అమెరికాకు చెందిన గాలప్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఫిన్లాండ్ మొదటిస్థానంలో నిలవగా.. దాని పొరుగు దేశాలు డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నార్వే తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఆరోగ్యకర జీవితం, సగటు ఆదాయం, సామాజిక భద్రత, అవినీతి రహితం, సహానుభూతి, తమ జీవితానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పౌరులకు ఉండటం వంటి అంశాలు/లక్షణాల ఆధారంగా దేశాలకు ర్యాంకులు ఇచ్చినట్టు గాలప్ సంస్థ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఏటా విడుదల చేసే హ్యపీనెస్ ఇండెక్స్ కూడా ఫిన్లాండ్ను అత్యంత సంతోషకర దేశంగా పేర్కొంది. ఫిన్లాండ్ పౌరుల మధ్య ఆర్థిక అసమానతలు అతి తక్కువ స్థాయిలో ఉండటం, ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉండటం కూడా ప్రజల మధ్య సయోధ్య ఎక్కువ స్థాయిలో ఉందని పేర్కొంది. చదవండి: టాపర్లంతా క్యాంపస్ కాలేజీలకే.. ఆనందాల హార్మోన్లు మనిషి ఆనందాన్ని మరింత ఇనుమడింపజేయడానికి శరీరం పలు రకాల హార్మోన్లను (రసాయనాలను) విడుదల చేస్తుంది. వాటిలో నాలుగు ముఖ్యమైన హారోన్ల గురించి తెలుసుకుందాం. డోపమైన్: మెదడులో ఉత్పత్తి అయి శరీరమంతా వ్యాపించే డోపమైన్ హార్మోన్ గుండె కొట్టుకోవడాన్ని, రక్తపోటును నియంత్రించడంతోపాటు మూత్రపిండాల పనితీరునూ మెరుగుపరుస్తుంది. మంచి భోజనం చేసిన తరువాత, ఏదైనా లక్ష్యాన్ని సాధించినప్పుడు, గమ్యాన్ని చేరుకున్నప్పుడు మనలో కలిగే ఆనందం, సంతృప్తికి ఈ డోపమైనే కారణం. సెరటోనిన్: శాస్త్రవేత్తలు ‘హ్యాపీనెస్ కెమికల్’గా పిలిచే ఈ హార్మోన్ మనిషి మెదడు, పేగులలో ఉత్పత్తి అవుతుంది. కేంద్ర నాడీ మండలమంతా వ్యాపిస్తుంది. సంఘజీవి అయిన మనిషి నలుగురి మధ్య సంతోషంగా సమయం గడుపుతున్న వేళ ఈ సెరటోనిన్ ఉత్పత్తి పెరిగి సంతోషకర అనుభూతిని మరింత పెంచుతుంది. దీని స్థాయి పెరిగే కొద్దీ మనిషిలో సంతృప్తి, ఆనందం, ఆత్మ నిర్భరత స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆక్సిటోసిన్: మనిషిలో ప్రశాంతతను, భద్రతను విశ్వాసాన్ని కలిగించడంలో ప్రేరకంగా పనిచేసే ఆక్సిటోసిన్.. ఆత్మీయత, అనుబంధాలనూ పెంపొందించేందుకు దోహదపడుతుంది. అయినవారిని ఆలింగనం చేసుకున్నప్పుడు, ఆత్మీయులతో అనుబంధాలు పంచుకునేప్పుడు విడుదలయ్యే ఈ ఆక్సిటోసిన్ దీర్ఘకాలంపాటు మనిషిని సంతోషంగా ఉండేలా చేస్తుంది. ఎండార్ఫిన్: మత్తు మందులా పనిచేసే ఎండార్ఫిన్ శరీరంలోని నాడీ మండలం, పిట్యుటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది. ప్రధానంగా నొప్పి నుంచి ఉపశమనం కోసం తయారయ్యే ఈ హార్మోన్ సంతోషం, సంతృప్తికి కూడా కారణమవుతుంది. ఆహారం తీసుకున్నాక, వ్యాయామం చేశాక, ఇష్టమైన పానీయాలు తీసుకున్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్.. మనిషిలో ఆత్మ నిర్భరతను పెంచడం, ఒత్తిడిని తగ్గించడం, బరువును తగ్గించడానికీ తోడ్పడుతుంది. ఎండారి్ఫన్ హార్మోన్ స్థాయి పెంచుకోవాలంటే.. ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేయడం, సుగంధాలను ఆస్వాదించడం, ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవడం వంటివి చేయాలి. నవ్వుల క్వాకా.. టెడ్డీ బేర్ వంటి మొహంతో ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉన్నట్టు కనిపించే క్వాకాకు ప్రపంచ పౌరులు అత్యంత సంతోషకర జీవిగా ముద్రవేశారు. సాధారణ పిల్లి పరిమాణంలో ఎలుకను పోలినట్టుగా ఉండే ఈ క్వాకా నిజానికి కంగారూల జాతికి చెందినది. ఆ్రస్టేలియా పశి్చమ తీరానికి దగ్గరగా ఉండే రెండు దీవులు రాట్నెస్ట్, బాల్ట్ ఐలాండ్లలో మాత్రమే ఈ క్వాకాలు జీవిస్తున్నాయి. మనుషులతో సన్నిహితంగా మెదిలే ఈ జీవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు ప్రీతిపాత్రమైంది. క్వాకాతో సెల్ఫీ దిగేందుకు వేలాదిమంది పర్యాటకులు ఏటా ఈ దీవులను సందర్శిస్తుంటారు. ‘#సెల్ఫీ విత్ క్వాకా’ అనేది ట్రెండ్గా మారింది. క్వాకాల సంఖ్య పదివేలలోపే ఉండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. -
మధ్యతరగతి మందహాసం! వచ్చే పాతికేళ్లలో రెండింతలకు పైగా వృద్ధి..
సాక్షి, హైదరాబాద్: దేశమేదైనా మధ్యతరగతి వివిధ రూపాల్లో నిర్వహించే పాత్ర ప్రత్యేకతను చాటుతు న్న విషయం తెలిసిందే. సమాజంలో కీలకమైన వ ర్గంగా పేరుబడిన ఈ నడిమి తరగతి క్రమంగా దే శాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. దీనికి తగ్గట్టు గానే భారత్లోని మధ్యతరగతి 2047 నాటికి అంటే దేశం స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తిచేసుకునే నాటికి మొత్తం జనాభాలో 61 శాతానికి చే రుకోబోతున్నట్టుగా అధ్యయనాలు చెపుతున్నాయి. మనదేశంలో 2020–21లో 43.2 కోట్లున్న నడిమి తరగతి జనాభా 2030–31కల్లా 71.5 కోట్లకు, 20 47 నాటికి 102 కోట్లకు (ఆనాటికి... మొత్తం 166 కో ట్ల భారత జనాభాలో) పైగా చేరుకుంటుందని అంచనా వేస్తు న్నారు. ప్రస్తుతం 31 శాతంగా ఉన్న దేశ మిడిల్క్లాస్ వచ్చే పాతికేళ్లలో రెండింతలకు పైగా వృద్ధి నమోదు చేస్తుందని అంటున్నారు. తాజాగా పీపుల్స్ రీసెర్చీ ఆన్ ఇండియాస్ కన్జుమర్ ఎకానమీ (ప్రైస్) ‘ద రైజ్ ఆఫ్ ఇండియాస్ మిడిల్క్లాస్’ నివేదికలో పలు ఆస క్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 25 రాష్ట్రాల్లోని 40 వేల కుటుంబాలకు పైగా చే సిన అధ్యయనం ఆధారంగా నివేదిక తయారు చేశారు. ఇదీ నివేదిక... దేశంలో రాజకీయ స్థిరత్వం కొనసాగింపుతో పాటు ఆర్థిక సంస్కరణల అమలు ద్వారా ప్రతీ ఏడాది 6 నుంచి 7 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించడం కొనసాగిస్తే వచ్చే రెండు, రెండున్నర దశాబ్దాల కాలంలోనే భారత్ ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తుందని ఈ నివేదిక అంచనా వేస్తోంది. ధనికవర్గం సంపాదించే ఆదాయం ఎక్కువగానే ఉన్నా...జనాభారీత్యా భారత మధ్యతరగతి సంఖ్యాపరంగా అధికంగా ఉన్నందున ఆర్థికరంగాన్ని నడిపించడంలో ఈవర్గం కీలకపాత్ర పోషించనుందని ఇందులో పేర్కొన్నారు. ఈ దశాబ్ది చివరికల్లా తక్కువ ఆదాయం ఆర్జించే వర్గం కాస్తా క్రమంగా నడిమితరగతిలో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. మధ్యతరగతిలో భారీగా పెరుగుదల, ధనికుల క్రీమీలేయర్గా అత్యున్నత స్థాయిలో నిలవడంతో అల్పాదాయ, ఇతర కిందిస్థాయి వర్గాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని అంచనా వేస్తోంది. ఇదిలాఉంటే...2030–31 కల్లా దేశంలోని ‘సూపర్రిచ్ హౌస్హోల్డ్స్’ ఐదింతలు పెరగడంతో పాటు, ఈ వర్గాలు అధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెరుగుతాయని పేర్కొంది. మధ్యతరగతి పరిగణన ఎలా? మధ్యతరగతి అంటే ఏమిటి అన్న దానికి ప్రపంచవ్యాప్తంగాఒక స్పష్టమైన, ఒకేవిధమైన నిర్వచనమంటూ ఇంకా స్థిరపడలేదు. భారత్లో 2020–21 ధరల ఆధారంగా చూస్తే మాత్రం...ఏడాదికి రూ.1.09 లక్షల నుంచి రూ.6.46 లక్షల వార్షికాదాయం సంపాదించే వారిని లేదా కుటుంబ వార్షికాదాయంరూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్యలో ఉన్న వారినిమధ్యతరగతిగా పరిగణిస్తున్నారు. నిపుణులేమంటున్నారంటే... భారత్లో మధ్యతరగతి కుటుంబాలు పెరిగేకొద్ది నడిమి తరగతి వర్గం(కేటగిరి) వృద్ధి చెందడం ద్వారా నాణ్యమైన వైద్య ఆరోగ్యసేవలు,విద్య, గృహ నిర్మాణరంగం, వినిమయ వస్తువులు తదితరాలకు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడం కోసం విద్య, వైద్యంపై మరింత ఫోకస్ను పెంచాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఏతావాతా చూస్తే...మధ్యతరగతి జనాభా పెరుగుదల ద్వారా 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు.ఈ విధంగా భారత్ వృద్ధికి, పురోగతి విషయంలో మధ్యతరగతికీలకపాత్ర పోషిస్తుందని వారు భావిస్తున్నారు. -
చేసే పనీ.. చేటు చేయొచ్చు..!
ఒక వ్యక్తి రోజులో ఎక్కువ భాగం గడిపే చోటు ఏదైనా ఉందంటే అది ఉద్యోగం/ వృత్తిపరమైన విధులు నిర్వర్తించే ప్రదేశమే. ఎవరికైనా ఇది తప్పనిసరే అయినా.. ఆయా ఉద్యోగాలు/వృత్తి ప్రదేశాలకు వ్యక్తుల అనారోగ్యాలకు సంబంధం ఏర్పడుతోంది. సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమయ్యే దాకా.. వివిధ ఉద్యోగాలు, వృత్తుల ప్రభావం పడుతోంది. ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యే వరకు కూడా చాలా మంది ఈ సమస్యను గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఇటీవలికాలంలో వృత్తి వ్యాపకాల ప్రభావం గతంలో కంటే మరింత పెరిగిందని.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బంది పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. వీటినే ఆక్యుపేషనల్ హజార్డ్స్గా చెప్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆక్యుపేషనల్ హెల్త్పై అవగాహన కలిగిస్తున్న పలు సంస్థల అధ్యయనాలు ఏయే రంగాల్లో పనిచేస్తున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నది తేల్చి చెప్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ వినికిడికి.. ‘ధ్వని’ దెబ్బ ఎక్కువ ధ్వని వెలువడే పరిశ్రమలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు వినికిడి సమస్యల బారినపడుతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఏవైనా పరిశ్రమల్లో ఒక ఉద్యోగి 8గంటల పాటు 90 డెసిబుల్స్ ధ్వనిలో పనిచేయవచ్చు. 95 డెసిబుల్స్ ఉంటే 4 గంటలు, 100 డెసిబుల్స్ ఉంటే 2 గంటలు మాత్రమే పనిచేయాలి. అదే 115 డెసిబుల్స్, ఆపైన తీవ్రతతో ధ్వని ఉంటే.. ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. అంతేకాదు.. ఇయర్ ప్లగ్స్, ఇయర్ కెనాల్స్ వంటివి వాడాలి. శుభ్రత.. ఆరోగ్యానికి లేదు భద్రత విభిన్న రకాల ఆవరణలను శుభ్రపరిచే వారికీ ఆరోగ్యపు ముప్పు తప్పడం లేదు. టాయిలెట్, బాత్రూం, ఫ్లోర్ క్లీనర్లు వాడినప్పుడు విష వాయువులు వెలువడతాయి. అవి చాలా ప్రమాదకరం. వెన్నెముక కష్టాలు.. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి వెన్ను భాగం, చేతులు, కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల ఈ రకమైన కెరీర్ను ఎంచుకుంటున్నవారు పెరిగారు. చాలా మంది వెన్నెముక సమస్యలు, స్లిప్డ్ డిస్క్, కండరాల ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పూల డిజైనర్కూ డేంజర్ అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ పూల డిజైనర్ వృత్తి కూడా సమస్య రేపేదే. పూల డిజైనర్ కాండం నుంచి పూలను కత్తిరించి, అందంగా అమర్చే సమయంలో వాటికి దగ్గరగా ఉంటారు. ఆ పూల మొక్కల కోసం వినియోగించే బలమైన పురుగుమందుల ప్రభావానికి లోనవుతారు. అనారోగ్య ‘గనులు’ గనులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వారు పీల్చే కలుషిత గాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నెమ్మదిగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఎన్ని జాగ్రత్తలు, గట్టి టోపీలు, అగ్నిమాపక భద్రత పరికరాలు, గాగుల్స్ వంటివి వాడినా ప్రమాదం తప్పని పరిస్థితే ఉంటోందని నిపుణులు తేల్చారు. భవన నిర్మాణం.. ఆరోగ్య ధ్వంసం నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరికీ, వారు కార్మికులు, ఉద్యోగులు, డిజైనర్లు ఎవరైనా సరే.. ఎక్కువసేపు అక్కడే గడిపితే ప్రమాదకరమే. సిమెంట్, మట్టి, ఇసుక ధూళి, పెయింట్లు, మరికొన్ని నిర్మాణ ఉత్పత్తులు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ముందు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము చేస్తున్న వృత్తి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో గుర్తించి.. వాటి నుంచి తప్పించుకునే అంశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు.. మధ్యలో కాసేపు లేచి నడవడం, అటూ ఇటూ దూరంగా ఉన్న వస్తువులను చూడటం, వీలైతే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మంచిదని చెప్తున్నారు. అపరిశుభ్ర, కాలుష్య పరిస్థితుల్లో పనిచేసేవారు మాస్కులు, గ్లౌజులు వంటివి కచి్చతంగా వాడాలని సూచిస్తున్నారు. వైద్యులను సంప్రదించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు తీసుకుని పాటించాలని స్పష్టం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం వృత్తి, ఉద్యోగపరమైన బాధ్యతల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిపై తరచుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గత వారం ట్రాఫిక్ పోలీసులకు వచ్చే సమస్యలపై సదస్సు ఏర్పాటు చేశాం. కొత్తగా పుట్టుకొస్తున్న ప్రొఫెషన్ల వల్ల కూడా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఈ తరహా ఆక్యుపేషనల్ హజార్డ్స్కు చికిత్సలు లేవు. నివారణే శరణ్యం. అందువల్ల ఆయా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు అవగాహన పెంచుకుని, ముందు జాగ్రత్తలు పాటించడం మంచిది. – డాక్టర్ విజయ్రావు, జాతీయ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సమస్యల కర్మాగారాలు కర్మాగారాల్లో భారీ యంత్రాలు, ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. పెద్ద శబ్దాలు వెలువడతాయి. ఇవన్నీ వ్యక్తుల ఆరోగ్యానికి హానికరమే. ఫ్యాక్టరీ కార్మికులు, మేనేజర్లు లేదా ఫ్లోర్ వర్కర్లలో వినికిడి లోపం సాధారణంగా మారుతోంది. బీపీఓలలో.. బాడీ క్లాక్కు బ్రేక్ బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీఓ) సెంటర్లలో రాత్రి షిఫ్టులలో పనిచేయడం, నిరంతర రాత్రి షిఫ్టులు, తరచూ షిప్టులు మారడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పగటిపూట నిద్రపోతున్నా, షిఫ్టులు మారుతున్నా శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ప్రభావితమవుతుంది. దీర్ఘకాలిక నష్టానికి కారణమవుతోంది. రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్తోపాటు సెప్టిక్ అల్సర్లు, గ్యా్రస్టిక్ అల్సర్లు వస్తున్నాయి. వృత్తికో వ్యాధి తప్పట్లేదు అనేక రకాల పరిశ్రమలు, వృత్తులు, ఉద్యోగాలు వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ♦ ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు, అతిగా నిలబడడం వల్ల వెరికోసిటీస్, వినికిడి సమస్యలు వస్తున్నాయి. ♦ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని, డయాబెటిస్, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారని అధ్యయనాలు తేల్చాయి. గట్టిగా మాట్లాడుతూ బోధించడం వల్ల గొంతు సమస్యలూ కనిపిస్తున్నాయని అంటున్నాయి. ♦ లారీలు, కంటైనర్లు వంటి భారీ వాహనాల డ్రైవర్లకు వెన్ను సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, వాహనాల వైబ్రేషన్ వల్ల రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. కన్నార్పకుండా రోడ్లను చూస్తుండటం వల్ల కళ్లు పొడిబారుతూ దృష్టి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. ♦ సిలికా పరిశ్రమలో పనిచేసేవారు ఊపిరితిత్తులకు సంబంధించిన సిలికోసిస్కు గురవుతారు. ఆస్బోస్టాస్ పరిశ్రమల్లో పనిచేసేవారు పలు రకాల కేన్సర్లకు, చక్కెర పరిశ్రమలో పనిచేసేవారు పెగసోసిస్ వంటివాటికి గురవుతారు. -
Andhra Pradesh: వారికి దారిచూపిన ‘గడప గడపకు’
కర్నూలు(సెంట్రల్) : నిర్మల కోరిక నెరవేరింది. చదువుకోవడానికి మార్గం సుగమమైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. తాను చదువుకుంటానని.. అందుకు తన తల్లిదండ్రులను ఒప్పించాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిని కోరడంతో కలెక్టర్ డాక్టర్ జి.సృజన స్పందించారు. బాలికను ఆస్పరి కస్తూర్బా జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూప్లో ఇంటర్ చదివేందుకు సీటు ఇప్పించారు. భవిష్యత్లోనూ ఆ బాలిక చదువుకు ఆటంకాలు లేకుండా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భర్తిస్తుందని భరోసా ఇచ్చారు. ఆదోని మండలం పెద్ద హరివణంకు చెందిన శ్రీనివాసులు, అనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో నిర్మల చిన్న కుమార్తె. మిగిలిన ముగ్గురికి పెళ్లిళ్లయ్యాయి. నిర్మల చిన్నతనం నుంచే చదువులో రాణిస్తుండటంతో తల్లిదండ్రులు పదో తరగతి వరకు చదివించారు. 2022 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 537 మార్కులు తెచ్చుకుంది. అయితే తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత ఆ బాలిక ఉన్నత చదువులకు శాపమైంది. చదువుకుంటానంటే తమకు అంత స్థోమత లేదని, ఇంటి దగ్గర ఉండాలని చెప్పారు. దీంతో గతేడాది ఇంటి దగ్గర ఉంటూ సాయంత్రం చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ పొలం పనులకు వెళ్లేది. అయితే ఆ బాలికలో చదువుకోవాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఈ క్రమంలో బాలికకు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం వరమైంది. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, అధికారుల బృందం బుధవారం ఇంటింటికీ తిరుగుతూ ఆ బాలిక ఇంటికి చేరుకున్నారు. తాను పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నానని, తాను ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేదని, ఆ దిశగా తనకు సాయం చేసి.. తన తల్లిదండ్రులను కూడా తనను చదివించేలా ఒప్పించాలని కోరింది. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. మరుసటి రోజు బాలిక ఉదంతం మీడియాలో రావడంతో పాటు ఎమ్మెల్యే కూడా ఆదేశించడంతో కలెక్టర్ డాక్టర్ సృజన వెంటనే స్పందించారు. బాలికను, ఆమె తల్లిదండ్రులను తన క్యాంపు కా>ర్యాలయానికి పిలిపించి మాట్లాడి.. నిర్మలను కాలేజీలో చే ర్పిం చేందుకు మార్గం సుగమం చేశారు. తాను ఐపీఎస్ అయి దేశానికి సేవ చేస్తానని నిర్మల సంతోషంగా చెప్పింది. -
గంగా తరంగం.. కాదిక నిరంతరం
పావన గంగా తరంగం.. బ్రహ్మపుత్ర గాంభీర్యం.. సింధునదీ సోయగం ఇక గతమే అంటోంది ఓ అధ్యయనం. మరో ఎనభై ఏళ్ల తరువాత ఈ జీవనదుల్లో వర్షాకాలంలోనే నీటి ప్రవాహం ఉంటుందని చెబుతోంది. భారత ఉపఖండానికి హిమాలయాలే జీవగర్ర. ఇక్కడ పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ఉపఖండంలోని మెజారిటీ భాగాన్ని సస్యశ్యామలం చేస్తూ భారత దేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా మారుస్తున్నాయి. హిమాలయాల్లో జరిగే ప్రతి మార్పూ భారత ఉపఖండంపై పెను ప్రభావం చూపుతుంది. అటువంటి హిమాలయాలు భూతాపం కారణంగా ప్రస్తుతం సంకటస్థితిని ఎదుర్కొంటున్నాయి. ధ్రువప్రాంతాలు మినహాయిస్తే భూగోళంలో అత్యధిక హిమపాతం కనిపించే హిమాలయాల్లో మరికొన్నేళ్లలో మంచు మటుమాయమైపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. సాక్షి, అమరావతి: ఉత్తరార్ధగోళంలో 1950 నుంచి 2019 వరకు ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, వర్షపాతం, హిమపాతం తదితర వాతావరణ సంబంధిత గణాంకాలపై బర్క్లీ–మిచిగాన్ యూనివర్సిటీలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. యూరోపి యన్ సెంటర్ నుంచి సేకరించిన సమాచా రాన్ని ఈ రెండు యూనివర్సిటీల ప్రొఫెసర్లు లోతుగా విశ్లేషించారు. ఆ గణాంకాలను 2024 నుంచి 2100 వరకూ వర్తింపజేసి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశా రు. ఈ అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦పర్యావరణ కాలుçష్యం కారణంగా వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగు తున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ పెరిగితే.. ఉత్తరార్ధగోళంలో హిమాల యపర్వతాల నుంచి యూరప్లో విస్తరించిన ఆల్ప్స్ పర్వతాల వరకూ వర్షపాతం 15 శాతం పెరుగుతోంది. ఆ మేరకు హిమపాతం తగ్గుతోంది. ♦ ఉత్తరార్ధగోళంలో మన దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న హిమాలయాల నుంచి యూరప్లోని ఆల్ప్స్ అమెరికాలోని రాఖీ పర్వతాల వరకూ చూస్తే.. హిమాల యాల్లోనే అధిక వర్షపాతం నమోదవు తోంది. ఆ మేరకు హిమపాతం గణనీయంగా తగ్గుతోంది. ♦ హిమాలయాల్లో పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉప నదుల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం.. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వర్షపాతం పెరగడమే. ఈ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు సారవంతమైన నేల కోతకు గురవుతోంది. ఈ ప్రభావం వల్ల హిమాలయాలకు దిగువన నివసించే కోట్లాది ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ♦హిమాలయపర్వతాల్లో ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమనీనదాలు (గ్లేసియర్స్) కరుగుదల ఇటీవలి కాలంలో 65 శాతం పెరిగినట్లు ఐసీఐఎంవోడీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్) సంస్థ తేల్చింది. 2100 నాటికి హిందూకుష్ పర్వతాల్లోని హిమనీనదాలు ప్రస్తుతం ఉన్న పరిమాణంలో 80 శాతం మాయం కావడం ఖాయమని ఆ సంస్థ పేర్కొంది. ♦ హిమపాతం తగ్గడం, హిమనీనదాలు వేగంగా కరుగుతుండటాన్ని బట్టి చూస్తే జీవనదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు, వాటి ఉప నదుల్లో 2100 తరువాత వర్షాకాలంలో మాత్రమే నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా సమయాల్లో ఆ జీవనదులు ఎండిపోవడం ఖాయం. దీనివల్ల భారతదేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చడంలో అత్యంత కీలకమైన గంగా సింధు మైదానానికి నీటి లభ్యత కష్టమే. -
గంగమ్మకూ నీటి కష్టాలు!
సాక్షి, అమరావతి: తన తాత ముత్తాతలకు సద్గతుల ప్రాప్తి కోసం భగీరథుడు దివి నుంచి భువికి రప్పించిన గంగమ్మకూ నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం జీవ నదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు, తీస్టా సహా 12 నదుల్లో ప్రవాహం 2100 నాటికి వర్షాలపైనే ఆధారపడే పరిస్థితి రావచ్చు. మన దేశంతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఆసియా ఖండంలోని 16 దేశాల్లో 167.40 కోట్ల మంది ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తప్పవని చెబుతోంది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ (ఐసీఐఎంవోడీ) సంస్థ ఈ నెల 20న విడుదల చేసిన అధ్యయన నివేదిక. ఇందుకు ప్రధాన కారణం.. ఆ జీవ నదులకు జన్మ స్థానమైన హిమాలయ పర్వతాల్లోని హిందూకుష్ శ్రేణుల్లో హిమనీ నదాలు శరవేగంగా కరిగిపోతుండటమేనని తేల్చింది. వాతావరణ మార్పులు, భూఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్లే హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాల పరిమాణం 2010 నాటికి 80 శాతానికి తగ్గిపోవడం ఖాయమని అంచనా వేసింది. ఆసియా ఖండపు నీటి శిఖరం ధ్రువ ప్రాంతాల తర్వాత భూగోళంపై అతి పెద్ద హిమనీ నదాలకు నిలయం హిందూకుష్ పర్వత శ్రేణులే కావడం గమనార్హం. హిమాలయ పర్వత శ్రేణుల్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లోనే గంగా, బ్రహ్మపుత్రా, సింధు, తీస్టా సహా 12 నదులు పురుడు పోసుకుని మనదేశంతోపాటు పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ తదితర 16 దేశాల్లో ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఈ నదులకు ప్రధాన ఆధారం హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాలే. హిమపాతంలో గణనీయంగా తగ్గుదల కాలుష్యంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమపాతం గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఐసీఐఎంవోడీ అధ్యయనంలో వెల్లడైంది. 1971 నుంచి 2000 సంవత్సరాల మధ్య హిందూకుష్ పర్వత శ్రేణుల్లో అంచనా వేసిన దానికంటే హిమపాతంలో సగటున 15 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే.. 2070 నుంచి 2100 సంవత్సరాల మధ్యలో అంచనా వేసిన దాని కంటే సింధూ బేసిన్లో 30 నుంచి 50, గంగా బేసిన్లో 50 నుంచి 60, బ్రహ్మపుత్రా బేసిన్లో 50 నుంచి 70 శాతం హిమపాతం తగ్గుతుందని అంచనా వేసింది. శరవేగంగా కరుగుతున్న మంచు 2000 సంవత్సరం నుంచి 2009 మధ్య ఏటా సగటున 0.18 మీటర్ల మేర హిమనీ నదాల పరిమాణం తగ్గితే.. 2010 నుంచి 2019 మధ్య అది 0.28 మీటర్లకు పెరిగిందని ఐసీఐఎంవోడీ తెలిపింది. అంటే.. 2000–2009తో పోల్చి తే 2010–2019 మధ్య హిమనీ నదాల మంచు కరుగుదల 65 శాతం పెరిగినట్టు స్పష్టమవుతోంది. మంచు శరవేగంగా కరుగుతుండటం వల్ల 2100 సంవత్సరం నాటికి హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాల పరిమాణం 80 శాతం తగ్గుతుందని లెక్కగట్టింది. దీనివల్ల గంగా, సింధు, బ్రహ్మపుత్ర సహా 12 నదుల్లో వర్షాకాలం తప్ప మిగతా సమయాల్లో నీటి ప్రవాహం ఉండే అవకాశాలు తక్కువని అంచనా వేసింది. ఇది ఆ నదీ పరీవాహక ప్రాంతాల్లోని 167.40 కోట్ల మంది ప్రజల జీవనోపాధులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. హిమపాతం తగ్గడం వల్ల 1979 నుంచి 2019 మధ్య గంగా, బ్రహ్మపుత్ర, సింధు బేసిన్లలో నీటిలభ్యత తగ్గడం వల్ల 1.29 కోట్ల మంది రైతుల జీవనోపాధులు దెబ్బతిన్నాయని తమ అధ్యయనంలో తేలిందని ఐసీఐఎంవోడీ వెల్లడించింది. -
పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు!
సోషల్ మీడియాలో చిన్న పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ, నెటిజన్లను అమితంగా అలరిస్తుంటాయి. వీటిని చూసినప్పుడు మనకు ఉండే ఒత్తిడి క్షణాల్లో మాయం అవుతుంటుంది. సాధారణంగా చిన్నారులకు అంత త్వరగా చదువుపై మనసు లగ్నం కాదు. అయితే కొందరు పిల్లలు అటు టీచర్లు చెప్పారనో లేదా తల్లిదండ్రులు చెప్పారనో సొంత టైమ్ టేబుల్ తయారు చేసుకుంటుంటారు. వీటిలో రోజువారీ దినచర్య రాసుకుంటారు. ఈ కోవలో ఒక కుర్రాడు తయారు చేసుకున్న టైమ్ టేబుల్ ఇప్పుడు వైరల్గా మారింది. దీనిని చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. క్రమశిక్షణ కోసం టైమ్ టేబుల్ ట్విట్టర్ యూజర్ @Laiiiibaaaa ఒక పోస్టు షేర్ చేశారు. దీనిని చూసినవారెవరైనా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఆరేళ్ల పిల్లాడు తనను తాను క్రమశిక్షణతో ఉంచుకునే ఉద్దేశంతో తన 24 గంటల దినచర్యకు సంబంధించిన టైమ్ టేబుల్ రూపొందించుకున్నాడు. ఈ పిల్లాడు తాను చేయాల్సిన అన్ని పనులకు అధిక సమయం కేటాయిస్తూ, చదువుకునేందుకు కేవలం 15 నిముషాలు మాత్రమే కేటాయించాడు. ఇదే నెటిజన్లను తెగ నవ్విస్తోంది. My 6 year old cousin made this timetable...Bas 15 minutes ka study time, zindgi tu Mohid jee ra hai 😭🤌 pic.twitter.com/LfyJBXHYPI — Laiba (@Laiiiibaaaa) June 22, 2023 ఏమేమి రాశాడంటే.. ఆ పిల్లాడు తన టైమ్ టేబుల్లో నిద్ర నుంచి లేచే సమయం, వాష్రూమ్, బ్రేక్ఫాస్ట్, టీవీ టైమ్, స్నానం చేసే సమయం, లంచ్, నిద్రించే సమయం. ప్లే విత్ రెడ్ కార్, అత్త ఇంటికి వెళ్లే సమయం.. ఇలా అన్నింటికీ రోజులో కొంత సమయాన్ని కేటాయించాడు. అయితే చదువుకునేందుకు కేవలం 15 నిముషాల సమయం మాత్రమే కేటాయించాడు. ఈ పోస్టుకు ఇప్పటివరకూ 12 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. ఇది కూడా చదవండి: దిమ్మతిరిగే ఆ పట్టణం పేరు చదివితే..జీనియస్! -
కంటి నిండా నిద్ర కరువు
సాక్షి, అమరావతి: మారిన జీవన విధానాలు, చుట్టుముడుతున్న ఆర్థిక, కుటుంబ సమస్యల నడుమ మధ్య వయస్కులు, వృద్ధుల్లో కంటి నిండా నిద్ర కరవు అవుతోంది. ముఖ్యంగా మధ్య వయసు్కలు పగలంతా కష్టం చేసి రాత్రి అయ్యాక కంటి నిండా నిద్రపోవడం ఒక కలగా మారుతోంది. ఏజ్వెల్ ఫౌండేషన్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 40 నుంచి 64 ఏళ్లు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇలా రెండు వర్గాలుగా మే నెలలో దేశవ్యాప్తంగా 5 వేల మంది నుంచి ఫౌండేషన్ వివరాలు సేకరించింది. వీరిలో 40 నుంచి 64 ఏళ్ల వారు 2245 (పురుషులు 1102, మహిళలు 143)మంది, 65 ఏళ్లు పైబడిన వారు 2,755 (పురుషులు 1,336, మహిళలు 1,419) మంది ఉన్నారు. ఆరు గంటలు కూడా నిద్రపోలేకున్నాం 70 శాతం మంది రోజులో కనీసం ఆరు గంటలు కూడా కంటి నిండా నిద్ర పోలేకపోతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 24 శాతం మంది మాత్రం 7 నుంచి 8 గంటలు, 6 శాతం మంది 8 గంటలకు పైగా నిద్రపోతున్నట్టు తెలిపారు. మధ్య వయసు్కల్లో 60 శాతం ఆరు గంటలలోపు, 31 శాతం 7 నుంచి 8 గంటలు, 9 శాతం మంది 8 గంటలకుపైగా నిద్రపోతున్నామన్నారు. అదే వృద్ధుల్లో 78 శాతం మంది ఆరు గంటల్లోపు, 19 శాతం మంది 7 నుంచి 8 గంటలు, 3 శాతం మంది 8 గంటలకుపైగా నిద్ర పోతున్నట్టు వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణం నిద్ర లేమికి ప్రధాన కారణం ఆర్థిక పరమైన అంశాలేనని సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య లేకపోవడం, ఇతర కలహాలు కారణమని పేర్కొంది. యాంత్రిక జీవనం, మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు, మద్యం సేవించడం, ఇతర సమస్యలతో సరైన నిద్ర ఉండటంలేదని కూడా ఫౌండేషన్ తెలిపింది. వయోభారం రీత్యా చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు, ఒంటరి జీవనం నిద్రలేమికి కారణంగా వృద్ధులు పేర్కొన్నారు. పురుషులే అధికం నిద్రలేమితో సతమతం అవుతున్న వారిలో పురుషులే అధికం. పురుషుల్లో 81 శాతం మంది కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని వెల్లడించారు. అదే మహిళల విషయానికి వస్తే 60 శాతం మంది ఆరు గంటలలోపు నిద్రపోతున్నామని చెప్పారు. మరో 15 శాతం మంది పురుషులు, 32 శాతం మంది మహిళలు 7 నుంచి 8 గంటలు, 4 శాతం పురుషులు, 8 శాతం మహిళలు 8 గంటలకు పైగా నిద్రపోతున్నట్టు తెలిపారు. సర్వేలో పాల్గొన్న మొత్తం వ్యక్తుల్లో 55.08 శాతం మంది ప్రస్తుతం నిద్ర విధానంతో అసంతృప్తిగా ఉన్నామని తెలిపారు. ఇలా చేయండి.. నిద్ర పడుతుంది సర్వేలో భాగంగా నిద్ర లేమి సమస్య నివారణకు పలు సలహాలు, సూచనలు కూడా ఫౌండేషన్ తెలియజేసింది. అవి.. ♦ నిద్రకు ఉపక్రమించే 4 గంటల ముందు నుంచి కాఫీ, టీలు తాగకూడదు. ధూమపానం, మద్యపానం చేయకూడదు. వేడి పాలను తాగాలి ♦ ఆందోళన, ఒత్తిడి, నిరాశ నిద్రకు పెద్ద అవరోధం. వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి ♦ పగటిపూట నిద్ర మానుకోవాలి ♦టీవీ, సెల్ఫోన్ చూడకూడదు ♦ పడక గదిలో స్లీప్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా చూసుకోవాలి -
మాకిచ్చే జీతానికి ఈ మాత్రం పని చేస్తే చాల్లే..!: సర్వే
ఆఫీసులో ఎంత కష్టపడ్డా... శాలరీ పెరిగేది మాత్రం అత్తెసరుగానే.. ఎంత గొడ్డు చాకిరీ చేసినా... లభించే గుర్తింపు అంతంతే.. వేతనంతో పాటు ఇంకేదైనా అలవెన్స్ రూపంలో నగదు ఇస్తే బాగుంటుంది.. రోజూ ఆఫీసుకు రావాలా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ రోజులుంటే బాగుండు.. మీకు ఈ మధ్యకాలంలో ఇలాగే అనిపిస్తోందా? పైన చెప్పుకున్న నాలుగు అంశాల్లో ఏదో ఒకటి మీకు వర్తిస్తుందా? అలాగైతే మీరు ఒంటరి వారేమీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు ఇదే విధమైన భావనలతో ఉన్నారు. కోవిడ్ భయం ముగిసి అన్నిరకాల ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో అఫీసులకు వెళ్లాల్సి వస్తున్న ఈ సమయంలో వారి మనోభావాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ సర్వే సంస్థ ‘గాలప్’ఓ అధ్యయనం నిర్వహించింది. (వైట్హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) కంపెనీలు, ఉద్యోగుల మధ్య సంబంధాలేమైనా బలపడ్డాయా? ఉద్యోగుల సంక్షేమానికి ఏం చేస్తున్నారు? పనిచేసే చోట ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది? వంటి అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలిపెట్టి ఆఫీసులకు వస్తున్నవారిలో వివిధ కారణాలతో నెలకొన్న ఆందోళన, ఒత్తిడి తగ్గించడంపై కంపెనీలు దృష్టి పెట్టాయని తేల్చింది. ఉద్యోగుల్లో కోవిడ్ భయాలు ఇంకా కొనసాగుతున్న సమయంలో కంపెనీలు వారిని ఆఫీసులకు రమ్మనడం మాత్రమే కాకుండా, వారి యోగక్షేమాలు కనుక్కునేందుకు, అవసరమైన సాయం చేసేందుకూ ముందుకొచ్చాయని గాలప్ అధ్యయనం పేర్కొంది. (టీసీఎస్లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ ) ఉద్యోగుల బాగోగులపై కంపెనీల దృష్టి మూడేళ్ల క్రితం 2020 జనవరిలో మొదలైన కోవిడ్ మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అట్టుడికించిందంటే అతిశయోక్తి కాదు. ఆఫీసులు మాత్రమే కాదు కరోనాతో సామాన్యుడి జీవితం దాదాపుగా స్తంభించిపోయింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కు పరిమితమయ్యారు. అయితే టీకాలు వేయడం మొదలైన తరువాత 2021 ఆఖరుకు పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించి, 2022 మార్చికల్లా పరిస్థితులు సాధారణమయ్యాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఉద్యోగుల్లో ఆందోళన మునుపెన్నడూ లేనంత ఉచ్ఛస్థితిలో ఉందని, కోవిడ్ భయాలు తొలగినా ద్రవ్యోల్బణం, అర్థ వ్యవస్థ మందగమనం, భవిష్యత్తుపై చింత వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయని గాలప్ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు గత ఏడాదిలో ఉద్యోగుల ఆందోళనను, వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. కంపెనీలు ఉద్యోగుల బాగోగులు చూసుకునే ప్రయత్నం చేయడం గత ఏడాది పతాక స్థాయిలో ఉన్నట్టు గాలప్ చెబుతోంది. 2009 నుంచి తాము ఈ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ సమాచారాన్ని నమోదు చేస్తున్నామని, 2022లో అది రికార్డు స్థాయిలో 23 శాతానికి చేరిందని తెలిపింది. కోవిడ్ ముందునాటి పరిస్థితితో పోలిస్తే భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ఉద్యోగుల బాగోగులు చూసుకునే అంశం 33 శాతానికి చేరింది. (ఉద్యోగులతో సంప్రదింపులు జరపడం ఆధారంగా ఈ అంచనాకొచ్చారు) (ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్స్టార్?) కొనసాగుతున్న క్వైట్.. లౌడ్ క్విట్టింగ్.. మీరెలా ఉన్నారని కంపెనీ తరచూ అడుగుతూంటే ఉద్యోగులు సంతోషంగా మరింత కష్టపడతారని అనుకుంటాం కానీ, గాలప్ సర్వే ఫలితాలు దీనికి భిన్నంగానే కనిపించాయి. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు క్వైట్ క్విట్టింగ్... అంటే ఆఫీసుకు రావడం.. అప్పగించిన పనిని పూర్తి చేయడం. ఎప్పుడు టైమ్ అవుతుందా.. అని కాచుకు కూర్చొని ఇంటికెళ్లిపోవడం చేస్తున్నారని సర్వే తెలిపింది. వీరు తాము పనిచేస్తున కంపెనీతో ఎలాంటి మానసికమైన సంబంధాన్ని కూడా కలిగిలేరని తెలిపింది. నామ్ కే వాస్తే పని మాత్రం చేస్తున్నారు. అంతే. ఇలా క్వైట్ క్విట్టింగ్ చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా ఉండగా.. కొంతమంది లౌడ్ క్విట్టింగ్కు పాల్పడుతున్నారు. అంటే.. తరచూ గ్రూప్ లీడర్లు లేదా సెక్షన్ హెడ్లతో విభేదించడం, కంపెనీ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేయడం చేస్తున్నారు. తమకు తగ్గ పని చేయనందుకు కంపెనీ పట్టించుకోవడం లేదని వీరు భావిస్తున్నారు. క్వైట్ క్విట్టర్లు సరిగా పనిచేస్తే.. క్వైట్ క్విట్టర్లు.. తమకు అప్పగించిన పనికి మించి వీసమెత్తు ఎక్కువ చేసేందుకు ఇష్టపడరు. మాకిచ్చే జీతానికి ఈ మాత్రం చేస్తే చాల్లే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దీనర్థం.. వారు మరింత ఎక్కువ ఉత్పాదకత సాధించగల సామర్థ్యం ఉన్నవారే. కానీ.. వేతనం, సౌకర్యాలు, నైతిక మద్దతు వంటి అనేక కారణాల వల్ల నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారని ఈ సర్వే తేల్చింది. ఒకవేళ వీరు కూడా ఉత్సాహంగా పనిచేస్తే... అది ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. గాలప్ అంచనాల ప్రకారం క్వైట్ క్విట్టర్లు మనసుపెట్టి పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఏటా దాదాపు 8.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతోంది. ఇది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపుగా తొమ్మిది శాతం. ఒత్తిడి...పైపైకి! కోవిడ్ భయాలు తొలగిపోయినప్పటికీ గత ఏడాది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారని గాలప్ సర్వే తెలిపింది. కోవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటి మాదిరిగానే 2022లోనూ ఉద్యోగుల్లో సుమారు 44 శాతం మంది తాము తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు ఈ సర్వేలో తెలిపారు. చైనా, అమెరికా, కెనడాల్లో ఇది మరింత తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమైంది. తూర్పు ఆసియా ప్రాంతంలో ఆఫీసులకు దూరంగా ఉంటూ పనిచేస్తున్న వారు, యువకులు 60 నుంచి 61 శాతం మంది రోజూ ఒత్తిడికి గురైనట్లు సర్వే వివరించింది. ఈ ఒత్తిడి పనికి సంబంధించింది మాత్రమే కాకుండా.. కుటుంబ ఆరోగ్య సమస్యలు, ద్రవ్యోల్బణం వంటి వాటివల్ల కూడా కావచ్చునని అంచనా. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే. ఉద్యోగుల యోగక్షేమాలు కనుక్కునేందుకు ప్రయత్నించిన కంపెనీల్లో ఈ ఒత్తిడి తక్కువగా ఉండటం!. ఉద్యోగులకు స్వేచ్ఛ ఇవ్వడమే మంచిది.. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ మేలా? లేక ఆఫీసుకు రావాలా? ఈ రెండూ కాకుండా హైబ్రిడ్ పద్ధతుల్లో పనిచేయించుకోవాలా? అన్న అంశాలపై ఇప్పటికే చర్చ చాలానే జరిగింది కానీ.. ఈ విషయాల్లో ఉద్యోగులకు స్వేచ్ఛనివ్వడం అన్నింటి కంటే మేలైన పద్ధతని గాలప్ చెబుతోంది. అంతేకాదు... తరచూ మాట్లాడుతుండటం, వారికి అవసరమైన పనులు సులువుగా చేసి పెట్టగలగడం వంటివి ఉద్యోగులకు కంపెనీపై ఉన్న అభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలవని ఈ సర్వే తెలిపింది. పనిచేసే చోటుకు కాకుండా... పరిస్థితులు, వాతావరణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించవచ్చునని గాలప్ సూచిస్తోంది. మెరుగైన ఉద్యోగానికి మంచి సమయం 2022లో కొత్త ఉద్యోగం చూసుకునేందుకు లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మెరుగైంది చూసుకునేందుకు మంచి సమయం ఇదే అని గాలప్ సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది అభిప్రాయ పడ్డారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి కాగా.. 2019 నాటి స్థాయికి దగ్గరగా ఉండటం గమనార్హం. అయితే అమెరికా, కెనడాల్లో మాత్రం ఈ పరిస్థితి లేదని సర్వే తెలిపింది. చేసే ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్న వారు స్వేచ్ఛగా ఉద్యోగాలు వదులుకునే పరిస్థితి 2022లో కనిపించిందని, ఇది కాస్తా ఉద్యోగాల లభ్యతను అధికం చేసిందని గాలప్ విశ్లేషించింది. ఆసక్తికరంగా... సర్వే చేసిన ఉద్యోగుల్లో యాభై శాతం మంది ఉద్యోగం మానేసే ఆలోచన చేశారు. కంపెనీలు ఉద్యోగులను కోల్పోకూడదని అనుకుంటే వారి బాగోగులు మరింత మెరుగ్గా చూసుకోవాల్సిన అవసరముందని గాలప్ తెలిపింది. ఇలా చేసిన కంపెనీల్లో ఉద్యోగం మానేసే ఆలోచన చేసిన వారు గణనీయంగా తక్కువగా ఉండటాన్ని ఇందుకు సాక్ష్యంగా చూపుతోంది. సమస్య వేతనం ఒక్కటే కాదు... ఒత్తిడి, పనిచేసే వాతావరణం లేకపోవడం వంటి అనేక కారణాలతో ఉద్యోగాలు మానేయాలని అనుకున్న వారికి గాలప్ ఒక ప్రశ్న వేసింది. ‘‘పరిస్థితులు మెరుగవ్వాలంటే మీ ఆఫీసులో లేదా మీ కంపెనీలో ఏ చర్యలు తీసుకోవాలి?’’అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు 85 శాతం మంది కేవలం వేతనాలు, ఆర్థిక లాభాలు కాకుండా.. వర్క్/లైఫ్ బ్యాలెన్స్, ఎంగేజ్మెంట్ లేదా ఆఫీసు కల్చర్ వంటి విషయాలను ప్రస్తావించారు. మిగిలిన 15 శాతం మంది సమాధానాలు ఏ కోవకూ చెందనివి కావడం గమనార్హం. ఎంగేజ్మెంట్ లేదా ఆఫీస్ కల్చర్ వర్గంలో మేనేజర్లు మరీ కఠినంగా ఉండరాదని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశమివ్వాలని కొందరు అభిప్రాయపడ్డారు. సొంతంగా పనిచేసుకునేందుకు అవకాశముండాలని, కొత్త విషయాలు నేర్చుకునే సౌకర్యం, తగిన గౌరవం లభించాలని, ప్రమోషన్లలో అందరికీ సమాన అవకాశాలుండాలని మరికొందరు భావించారు. దాదాపు 28 శాతం మంది వేతనాలు, ఇతర లాభాలను ప్రస్తావిస్తే.. ఆఫీసులో మంచి క్యాంటీన్/కేఫటేరియా ఉండాలని కొందరు, పిల్లల సంరక్షణ ఖర్చుల గురించి కొందరు, కంపెనీ ఫలితాలకు తగ్గట్టుగా ఉద్యోగులందరికీ సమానంగా ప్రతిఫలాలు దక్కాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఆఫీసు వాళ్లు హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని, భోజన సమయం మరింత పెంచాలని పని మధ్యలో సేద తీరేందుకు తగిన ప్రాంతం లేదని ఇంకొందరు భావించారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
భారతీయుల అత్యవసర నిధి ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: పిల్లల చదువులు... వారి పెళ్లిళ్లు, రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలకు అనుగుణంగా జీవిత బీమా, పోస్టాఫీస్ సేవింగ్స్, ఎఫ్డీ, ఆర్డీ తదితర మార్గాల్లో పొదుపు చేయడంలో దిట్టలైన భారతీయులు అత్యవసర పరిస్థితులు ఎదురైతే మాత్రం చేతులెత్తేస్తారట! కోవిడ్ తరహాలో ఏదైనా అత్యవసరాలకు 75 శాతం భారతీయుల వద్ద నిధులు అందుబాటులో ఉండటం లేదని ఓ అధ్యయనం పేర్కొంది. అనూహ్యంగా ఉద్యోగాలు ఊడినా, ఉన్నపళంగా తీవ్ర అనారోగ్యం పాలైనా ఎదుర్కొనేందుకు కేవలం 25 శాతం మందే సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆర్థికంగా సిద్ధమయ్యేలా వ్యవహరిస్తున్నా ‘ఎమర్జెన్సీ ఫండ్ ప్లానింగ్’పై మాత్రం అంతగా ముందుచూపుతో వ్యవహరించడం లేదని వివరించింది. ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ ఫినోలాజీ సంస్థ ‘ఇండియన్ మనీ హాబిట్స్’పై జరిపిన పరిశీలనలో ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అత్యవసర నిధి ఉంచుకోవాలి.. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ ఫండ్ అందుబాటులో ఉంచుకోవడంతోపాటు కుటుంబం మొత్తం కవరయ్యేలా నాణ్యమైన మెడికల్ కవర్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం కష్టపడి ఆదా చేసిన మొత్తంలో సింహభాగం ఆసుపత్రి ఖర్చులకే వ్యయంచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా మరేది అందుబాటులో లేకపోతేనే ఈ ఫండ్ను ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు. లిక్విడ్ ఫ్యూచర్ ఫండ్స్ అనేవి మరో ఆప్షన్గా నిలుస్తాయని, సేవింగ్స్ ఖాతా కంటే వాటిలోనే ఎక్కువ రిటర్న్స్ రావడంతోపాటు కేవలం ఒక రోజులోనే ఈ ఫండ్స్ను విత్డ్రా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. నెలకు ఎంత మొత్తం ఆదా చేస్తున్నారనే సంబంధం లేకుండా కనీసం నెలకు రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు తక్కువ మొత్తాల్లోనైనా క్రమం తప్పకుండా ఆదా చేయడం అలవాటు చేసుకొవాలని చెబుతున్నారు. ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు విడిగా పెట్టే మొత్తమే ఎమర్జెన్సీ ఫండ్. ఉద్యోగం నుంచి ఉద్వాసన, అనారోగ్యం, ఏదైనా పెద్ద సమస్య ఎదురైనప్పుడు ఉపయోగపడేదే ఈ నిధి. ఇది అందుబాటులో లేనిపక్షంలో ఇతర ఆర్థిక అవసరాల కోసం విడిగా ఉంచిన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి రావడం, అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోంది – పైసా బజార్ సీఈవో నవీన్ కుక్రేజా అధ్యయనంలోని ముఖ్యాంశాలు.. ♦ తమ తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయోభిలాషులను ‘అత్యవసర నిధి’ కింద భారతీయులు పరిగణిస్తారు. ♦ఉద్యోగం కోల్పోవడం లేదా ఏదైనా అకస్మాత్తుగా ఎదురయ్యే సమస్యను ఎదుర్కోవడంలో భాగంగా వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐ కట్టలేకపోతున్నారు. ♦ప్రతి ముగ్గురిలో ఒకరికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ అనేది అందుబాటులో లేదు. ♦తమ శాలరీ మొత్తం 15 రోజుల్లోనే ఖర్చయిపోతోందంటున్న 29 శాతం మంది.