-
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్తో..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో భారతీయ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ (FAANG) వంటి సంస్థల్లో ఇంటర్వ్యూల్లో ఎలా విజయం సాధించాలో వివరిస్తూ.. రోట్ లెర్నింగ్ గురించి వివరించారు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. బట్టీ పడితే ఉపయోగం లేదని అన్నారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ తప్పకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు.దీనికి ఉదాహరణగా 3 ఇడియట్స్ సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో మోటార్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు ఓ విద్యార్ధి బట్టీ పట్టిన సమాధానం చెబుతాడు. ఆ పద్దతి సరైనది కాదని వివరించారు. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అయినప్పటికీ.. ఫండమెంటల్స్పై దృష్టి పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు. -
నాకు నచ్చిన భారతీయ వంటకాలు ఇవే.. సీఈఓ సుందర్ పిచాయ్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తనకు నచ్చిన ఆహార పదార్ధాల గురించి బహిర్ఘతం చేశారు. నిత్యం ఏఐ, యాప్స్, టెక్నాలజీ అంటూ కంప్యూటర్లతో కుస్తీ పట్టే పిచాయ్ ఓ పాడ్ కాస్ట్లో కాస్త రిలాక్స్ అయ్యారు. పిచాయ్ ఇటీవల యూట్యూబర్ వరుణ్ మయ్య పాడ్కాస్ట్లో దేశంలో ఏఐ ప్రభావం, ఐటీ నిపుణులకు సలహాలు, ర్యాపర్ స్టార్టప్తో పాటు పలు అంశాలపై చర్చించారు. అదే సమయంలో తన అభిమాన భారతీయ వంటకాలను కూడా వెల్లడించారు.భారత్లో తనకు ఇష్టమైన ఆహారం పేరు చెప్పమని సుందర్ పిచాయ్ను మయ్య అడిగినప్పుడు సీఈఓ సుందర్ పిచాయ్ దౌత్యంతో సమాధానమిచ్చారు. ప్రాంతాల వారీ ఎదురుయ్యే ఇబ్బందుల్ని ముందే పసిగట్టారు. దేశీయంగా ఉన్న మూడు మెట్రో నగరాలు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్ధాల గురించి తన మనుసులో మాటను బయట పెట్టారు. బెంగుళూరులో దోసె, ఢిల్లీలో చోలే భతురే ముంబైలో పావ్ భాజీలను ఇష్టంగా తింటానని తెలిపారు. -
‘భళా భారత్’.. జపాన్ కంపెనీ సీఈఓ ప్రశంసల వర్షం
భారత్ సంస్కృతి, సంప్రదాయాలకు జపాన్ టెక్ కంపెనీ కోఫౌండర్ ఫిదా అయ్యారు. భారత్ భళా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సత్తా ఈ దేశానికే ఉందంటూ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.టెక్ జపాన్ కంపెనీ కోఫౌండర్, సీఈఓ నౌటకా నిషియామా.. తన వ్యాపార కార్యకలాపాల్ని భారత్లో విస్తరించాలని భావించారు. ఇందుకోసం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల్ని అర్ధం చేసుకునేందుకు గత నెలలో సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరుకు వచ్చారు.ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఈ నేపథ్యంలో భారత్పై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ రోజు ప్రపంచం నివసించడానికి అస్తవ్యస్తమైన ప్రదేశంగా ఉందని అన్నారు. అయితే అనేక విషయాల్లో అపార అనుభవం ఉన్న భారత్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందన్నారు. ఆశ్చర్యపోయా‘ప్రపంచానికి భారతీయ నాయకత్వం అవసరం. నేను భారతదేశానికి వచ్చి నెలరోజులైంది. దేశంలోని విలువల వైవిధ్యాన్ని చూసి మరోసారి ఆశ్చర్యపోయాను’ అని లింక్డిన్ పోస్ట్లో పేర్కొన్నారు.సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్లు.. వివిధ మతాలు, జాతులు, విలువలతో కూడిన పెద్ద దేశంగా ఉన్నప్పటికీ భారతదేశం ఒకే దేశం కావడం ఒక అద్భుతం. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ల విజయాల్ని ఉదహరించారు. భారత్ పోటీ, సహకారం రెండింటినీ మూర్తీభవించిందని.. ప్రపంచ సంస్థలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిషియామా అన్నారు. వ్యాపార రంగంలో, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల రెండవ తరం అమెరికన్లు కాదు. వారు ఇక్కడే (భారత్) జన్మించారు. ఇక్కడే చదువుకున్నారు. ఆపై గ్రాడ్యుయేట్ కోసం అమెరికాకు వెళ్లారు. వాళ్లే టెక్ రంగాల్ని శాసిస్తున్నారంటూ భారత్ను కొనియాడుతూ పోస్ట్ చేశారు. నౌటకా నిషియామా పోస్ట్పై నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్గా సుందర్ పిచాయ్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గాగూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.సీఈఓ అనే సింహాసనం మీదఅందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్ డాక్లలో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్ పిచాయ్కు గూగుల్ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్ పిచాయ్ ఆదాయం భారీగా పెరిగింది. త్వరలో బిలీయనీర్పలు నివేదికల ప్రకారం.. గూగుల్తో పాటు గూగుల్ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్ ఏఐ టూల్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. -
గూగుల్లో 20 ఏళ్ళు.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్
గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) 'సుందర్ పిచాయ్' టెక్ దిగ్గజంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ 26 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.''2004 ఏప్రిల్ 26 గూగుల్ కంపెనీలో నా మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మాత్రమే కాకుండా.. మా ఉత్పత్తులను ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ అద్భుతమైన కంపెనీలో పని చేయడం వల్ల చాలా థ్రిల్ పొందాను. సంస్థలో పనిచేస్తున్నందుకు ఇప్పటికీ నన్ను నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను'' అంటూ సుందర్ పిచాయ్ పోస్ట్ చేశారు. సుందర్ పిచాయ్ చేసిన ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఇప్పటికే 1,42,999 కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామంది సుందర్ పిచాయ్ విజయాన్ని గొప్పగా అభినందించారు. సుందర్ పిచాయ్ 2004లో గూగుల్లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ హెడ్గా చేరాడు. ఆ తరువాత దినదినాభివృద్ధి చెందుతూ ఆ కంపెనీకి సీఈఓగా ఎదిగారు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన పిచాయ్ నేడు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారంటే దాని వెనుక ఉన్న ఆయన కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. View this post on Instagram A post shared by Sundar Pichai (@sundarpichai) -
ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి.. వారం వ్యవధిలో మరో షాకిచ్చిన అమెజాన్!
కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి వారంలోనే ఈ ఏడాదీ లేఆఫ్స్ తప్పవనే స్పష్టమైన సంకేతాలు ఇస్తూ గూగుల్, అమెజాన్, మెటా సహా పలు దిగ్గజ కంపెనీలు కొలువుల కోతకు తెగబడ్డాయి. ఈ తరుణంలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వారం వ్యవధిలో మరోసారి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. వారం రోజుల క్రితం అమెజాన్ తన పేరెంట్ కంపెనీలు ట్విచ్, ఆడిబుల్లో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వారం తిరిగే లోపే అమెజాన్లో ‘బై విత్ ప్రైమ్’ విభాగంలో పనిచేస్తున్న 5 శాతం మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా తొలగింపుల కారణంగా 30 మంది ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఓ వైపు తొలగింపులు.. మరోవైపు పెట్టుబడులు 2022లో బై విత్ ప్రైమ్ను అమెజాన్ ప్రారంభించింది. అమెజాన్ వ్యాపారులు, రిటైలర్లకు దాని లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా డెలివరీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యూనిట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, బై విత్ ప్రైమ్లో పెట్టుబడులు పెడుతుంటామని చెబుతూనే లేఆఫ్స్పై అమెజాన్ ప్రకటన చేసింది. సిబ్బందిని ఆదుకుంటాం తొలగించిన సిబ్బందిని అన్ని విధాల ఆదుకుంటామని అమెజాన్ తెలిపింది. కాగా, అమెజాన్ ఇప్పటికే తన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ట్విచ్లో సుమారు 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఆడియోబుక్ యూనిట్ ఆడిబుల్ కూడా ఈ ఏడాది మొదటి రెండు వారాల్లోనే వందలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. ఈ తొలగింపులు వ్యయ తగ్గింపు చర్యల్లో భాగమా లేక ఏఐ పునర్నిర్మాణం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఉద్యోగుల్ని నిండా ముంచుతున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల 2024 జనవరి మొదటి మూడు వారాల్లోనే బడా టెక్ కంపెనీలు 7500 ఉద్యోగాలను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్వైఐ తాజా నివేదిక వెల్లడించింది. మరింత మందిని తొలగిస్తూ గూగుల్ ప్రకటన గూగుల్ తన వాయిస్ అసిస్టెంట్, హార్డ్వేర్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించిన వెంటనే సంస్థలో మరో వరుస ఉద్యోగాల కోత ఉంటుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గురువారం ప్రకటించారు. కాగా, గత ఏడాది గూగుల్ పలు విభాగాల్లో 12,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించింది. ఫలితంగా గూగుల్లో భారీ మొత్తంలో తొలగించడం ఇదే తొలిసారి. -
ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా!
గత ఏడాది పెద్ద కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకు ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలు, 2024లో అయినా పరిస్థితులు చక్కబడుతాయనుకుంటే ఇప్పటికే లేఆప్స్ మొదలైపోయాయి. జనవరి 1 నుంచి వివిధ కంపెనీలు 7500 మంది ఉద్యోగులను తొలగించాయి. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ సంస్థ ఈ ఏడాది కూడా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. పనిభారాన్ని తగ్గించడానికి ఏఐ సాఫ్ట్వేర్ అండ్ ఆటోమేషన్ వంటి వాటిని అనుసరించనున్నట్లు, ఈ కారణంగా మరింత మంది ఉద్యోగుల తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. గూగుల్ ఇప్పటికే జెమిని' (Gemini) పేరుతో అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఇది తప్పకుండా భవిష్యత్తులో పనిభారాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది కూడా ఈ ఏడాది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడానికి కారణమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: టీసీఎస్ కీలక నిర్ణయం.. 5 లక్షల మందికి ట్రైనింగ్! ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపులు గతేడాది మాదిరిగా అన్ని విభాగాల్లో ఉండే అవకాశం ఉండదని పిచాయ్ వెల్లడించారు. అయితే గత వారం సంస్థ తన వాయిస్ అసిస్టెంట్ యూనిట్లోని పిక్సెల్, నెస్ట్, ఫిట్బిట్కి బాధ్యత వహించే హార్డ్వేర్ టీమ్లు, అడ్వర్టైజింగ్ సేల్స్ టీమ్ & ఆగ్మెంటెడ్ రియాలిటీ టీమ్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. -
అది తప్పే.. అలా చేయాల్సింది కాదు.. అంగీకరించిన గూగుల్ సీఈవో
పెద్ద మొత్తంలో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తప్పేనని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అంగీకరించారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పలేదని, అయితే మరోలా వ్యవహరించాల్సి ఉండేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 2023 సంవత్సరం ప్రారంభంలో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో ఈ టెక్ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం ఉద్యోగ వర్గాల్లో ఆందోళనను, అలజడిని సృష్టించింది. బిజినెస్ ఇన్సైడర్ నుంచి వచ్చిన కథనం ప్రకారం.. ఇటీవల ఉద్యోగులతో జరిగిన సమావేశంలో సీఈవో సుందర్ పిచాయ్ను ఈ వివాదాస్పద నిర్ణయంతో ఏం సాధించారని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ అది తప్పేనని అంగీకరించారు. కానీ తప్పలేదని, గూగుల్ తన 25 ఏళ్ల చరిత్రలో అంత కీలకమైన క్షణాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పారు. అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మరింత ప్రతికూల ఫలితాలకు దారితీసేదన్నారు. అయితే ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉండేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. తొలగింపులు ఉద్యోగుల మానసిక స్థైర్యంపై చాలా ప్రభావం చూపించాయని, "గూగుల్జీస్ట్" వంటి ఉద్యోగుల ఫీడ్బ్యాక్ ఛానెల్లలో అది స్పష్టంగా కనిపించిందని ఆయన చెప్పారు. -
ఆ ఒక్క సలహా రోజుకి రూ.5 కోట్లు సంపాదించేలా.. భర్త సక్సెస్ వెనుక భార్య..
సుందర్ పిచాయ్ (Sundar Pichai).. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సాధారణ కుటుంబం నుంచి ప్రపంచమే గుర్తించదగిన స్థాయికి ఎదిగాడంటే దాని వెనుక ఆయన కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. అంతే కాకుండా ఈ రోజు ఆ స్థాయిలో ఉండటానికి పిచాయ్ భార్య అంజలి కూడా కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుందర్ పిచాయ్, అంజలి ఇద్దరూ కూడా ఐఐటీ ఖరగ్పూర్లో చదువుకునే రోజుల్లో క్లాస్మేట్స్. దీంతో వారిద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తరువాత పిచాయ్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడు, అంజలి మాత్రం ఇండియాలోనే ఉద్యోగంలో చేరింది. గూగుల్ సీఈఓగా.. ఎంత దూరంలో ఉన్నా ప్రేమకు పెద్ద దూరం కాదన్నట్లు.. చివరికి వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కిరణ్, కావ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం గూగుల్ సీఈఓగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. చాలామందికి సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా మాత్రమే తెలుసు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన గూగుల్ కంపెనీ వదిలేయాలనుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ పోస్ట్ ఆఫర్ చేసింది, ట్విటర్ కంపెనీ కూడా కీలకమైన జాబ్ ఇస్తామని ఆఫర్ చేసింది. గూగుల్ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం ఉన్న సమయంలో వచ్చిన ఆఫర్స్ స్వీకరించాలనుకుని ఆ జాబ్ వదిలేయాలనుకున్నాడు, ఈ విషయాన్ని తన భార్యకు చెప్పినప్పుడు.. ఆమె వద్దని వారిస్తూ.. గూగుల్ సంస్థలోనే మంచి ఫ్యూచర్ ఉందని సలహా ఇచ్చింది. ఆ సలహా తీసుకున్న పిచాయ్.. ఆ తరువాత కంపెనీ సీఈఓగా ఎంపికయ్యాడు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్సీఎల్ - ఎందుకిలా? రోజుకు రూ. 5 కోట్లు.. ఈ రోజు గూగుల్ కంపెనీ సీఈఓగా రోజుకు రూ. 5 కోట్లు ప్యాకేజీ తీసుకుంటున్నాడు అంటే.. దానికి కారణం భార్య ఇచ్చిన సలహా పాటించడమనే చెబుతున్నారు. అర్థం చేసుకునే భార్య ఉంటే.. మగవారి జీవితంలో సక్సెస్ వస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. -
దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్
ఇటీవల జరిగిన దీపావళి సమయంలో గూగుల్లో ఎక్కువ మంది సర్చ్ చేసిన ఐదు విషయాలను సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) రివీల్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దీపావళి జరుపుకునే అందరికి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ ప్రశ్నలను ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇందులో ఐదు అంకెలతో కూడిన ఒక దీపాన్ని సూపించే ఫోటో కూడా షేర్ చేశారు. ఈ అంకెల ద్వారానే ప్రశ్నలను తెలియజేసారు. సుందర్ పిచాయ్ హైలైట్ చేసిన ఐదు ప్రశ్నలు 👉భారతీయులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారు? 👉దీపావళి సమయంలో మనం రంగోలీని ఎందుకు వేస్తారు? 👉దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు? 👉దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు? 👉దీపావళి సమయంలో ఆయిల్ బాత్ ఎందుకు? ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్! ఈ ప్రశ్నలను గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా దీపావళి జరుపుకునేవారు పండుగ అర్థం, సంప్రదాయం వంటి వివరాలను తెలుసుకోవడానికి ఎంత ఆసక్తి చూపుతున్నారో తెలుస్తోంది. దీపావళి జరుపుకుంటున్న చాలా మందికి ఆ పండుగ విశిష్టత గురించి తెలియదు, అలాంటి వారు ద్వారా సర్చ్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. Happy Diwali to all who celebrate! We’re seeing lots of interest about Diwali traditions on Search, here are a few of the top trending “why” questions worldwide: https://t.co/6ALN4CvVwb pic.twitter.com/54VNnF8GqO — Sundar Pichai (@sundarpichai) November 12, 2023 -
ఇజ్రాయెల్పై హమాస్ దాడి : విచారంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్!
ఇజ్రాయెల్పై హామాస్ ఉగ్రదాడిపై ప్రముఖ టెక్ దిగ్గజం, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్లో స్థానిక గూగుల్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అండగా నిలుస్తామంటూ ఓ మెసేజ్ను షేర్ చేశారు. ఇజ్రాయెల్ - హమాస్ ఉద్రిక్తతలపై సుందార్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్పై ఉగ్రవాద దాడిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. గూగుల్కు చెందిన రెండు ఆఫీసుల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఉద్రికతల నేపథ్యంలో వారి అనుభవాలు ఎలా ఉన్నాయో ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఉద్యోగులు భద్రతపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Deeply saddened by the terrorist attacks in Israel this weekend and the escalating conflict underway. Google has 2 offices and over 2,000 employees in Israel. It’s unimaginable what they’re experiencing. Our immediate focus since Saturday has been on employee safety. We’ve now… https://t.co/VCiboq9oN8 — Sundar Pichai (@sundarpichai) October 10, 2023 స్థానికంగా ఉన్న మా ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి కంపెనీ అండగా నిలుస్తుంది. అదే విధంగా ఇజ్రాయెల్లో సహాయక చర్యలు చేపట్టే బృందాలకు మా వంతు సాయం అందిస్తాం’ అని సుందర్ పిచాయ్ ట్వీట్లో పేర్కొన్నారు. -
గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్గానా.. ఫోటో వైరల్!
భారతదేశం నుంచి వెళ్లి ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎక్కువ జీతం తీసుకునే సీఈఓల జాబితాలో ఒకడైన ఈయన చాలా ఆడంబరంగా ఉంటారని చాలామంది ఊహించి ఉంటారు. కానీ తాజాగా విడుదలైన ఫోటో మీ ఆలోచనలను తారుమారు చేస్తుంది. మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన 'సిద్ పురి' ఇటీవలే శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడ ఉదయం వాకింగ్ చేసే సమయంలో సుందర్ పిచాయ్ పెద్దగా సెక్యూరిటీ లేకుండానే కనిపించారు. అప్పుడు సిద్ ఫోటో తీసుకోవచ్చా.. అని అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. ఈ ఫోటోలు ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసాడు. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే! ఈ ఫోటోలలో గమించినట్లతే.. సుందర్ పిచాయ్ చాలా సింపుల్గా బ్లూ జీన్స్, జాకెట్, బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోని ఇప్పటికి 6 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించారు. 4000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: భారత్లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో.. ఒక నెటిజన్ అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరా? అని అడిగాడు. దీనికి ఒక్క సెక్యూరిటీ ఉన్నాడు, అతడే ఫోటో తీసాడని సిద్ రిప్లై ఇచ్చాడు. మరి కొందరు అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా చాలా సాధారణంగా ఉండటం చూస్తే.. చాలా ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట తిరగటం కొంత ఆందోళన కలిగిస్తుందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. go to SF they said, no one prepared me to just run into Sundar Pichai on the street. pic.twitter.com/BJitwCw0EE — Sid Puri (@PuriSid) September 25, 2023 -
రూ. 10వేల కోట్ల సుందర్ పిచాయ్ లగ్జరీ భవనం (ఫోటోలు)
-
సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?
సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్,ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. గ్లోబల్ టాప్ సీఈవోలలో ఒకరిగా చాలా మందికి ఆయన రోల్ మోడల్. తమిళనాడుకు చెందిన ఐఐటి గ్రాడ్యుయేట్ చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న పూర్వీకుల భవనాన్ని ఇటీవల విక్రయించిన సుందర్ పిచాయ్ నివాసముంటున్న ఇల్లు ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఐటీ నిపుణుల్లో,బిలియన్ల మందికి రోల్ మోడల్ సుందర్ పిచాయ్ ఉంటున్న ఇల్లు ఖరీదు రూ. 10వేల కోట్లు అంటే నమ్ముతారా. సుందర్ పిచాయ్ అద్భుతమైన భవనం కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలోని లాస్ ఆల్టోస్లోని కొండపై 31.17 ఎకరాల్లో ఉంది. సుందర్ పిచాయ్ భార్య అంజలి పిచాయ్ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ కోసం రూ. 49 కోట్లు ఖర్చు చేశారట.. కొన్నేళ్ల క్రితం ఈ భవనాన్ని సుందర్ పిచాయ్ 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. (అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు) విశాలమైన బెడ్ రూమ్స్ ఇన్ఫినిటీ పూల్, జిమ్నాసియం, స్పా, వైన్ సెల్లార్ సోలార్ ప్యానెల్స్ , లిఫ్టులు , నానీ క్వార్టర్ లాంటి హంగులతో ఉన్న అల్ట్రా-ఎక్స్క్లూజివ్ హోమ్ విలువ ఇపుడు రూ. 10,000 కోట్లకు పైమాటే. 2022లో రూ.1852 కోట్లు జీతం అందుకున్న సుందర్ పిచాయ్ నికర విలువ 1,310 మిలియన్ల డాలర్లుగా ఉంది. సుందర్ పిచాయ్ 2015లో గూగుల్ సీఈఓగా, 2019లో ఆల్ఫాబెట్ ఇంక్ సీఈవోగా ఎంపికయ్యారు. జూన్ 10, 1972న తమిళనాడులోని మధురైలో జన్మించారు.1989లో ఐఐటీ ఖరగ్పూర్లో మెటలర్జికల్ఇం జనీరింగ్ పట్టాపొందారు. (అలియా హాలీవుడ్ ఎంట్రీ:ఆమె గ్రీన్ డ్రెస్ ధర ఎంతో తెలుసా?) స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో మెటీరియల్ సైన్స్ లో ఎంఎస్చేశారు. ఈ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేశారు. పిచాయ్ 2004లో గూగుల్లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ హెడ్గా చేరారు. కాలేజీ ఫ్రెండ్ను అంజలి పిచాయ్ని వివాహం చేసుకున్న పిచాయ్కు కిరణ్, కావ్య అనే ఇద్దరు పిల్లలున్నారు. 2022నలో ఇండియా మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. -
గూగుల్ సీఈవో చిన్ననాటి ఇల్లు విక్రయం.. కన్నీటి పర్యంతమైన తండ్రి
చెన్నై: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలో తను పుట్టి పెరిగిన ఇంటిని విక్రయించారు. ఆ ఇంటిని కొనుగోలు చేసిన తమిళ నటుడు, నిర్మాత సి.మణికందన్ ఈ విషయం వెల్లడించారు. ఆస్తి పత్రాల అప్పగింత సమయంలో ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. ‘ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని అన్వేషిస్తుండగా చెన్నైలోని అశోక్ నగర్లో ఓ ఇల్లు ఉందని తెలిసింది. అది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పుట్టి, పెరిగిన చోటని తెలియడంతో కొనుగోలు చేయాలని వెంటనే నిర్ణయించుకున్నా’అని మణికందన్ అన్నారు. ‘మన దేశానికి సుందర్ పిచాయ్ గర్వకారణంగా నిలిచారు. ఆయన నివసించిన ఇంటిని కొనుగోలు చేయడమంటే నా జీవితంలో గొప్ప ఆశయం సాధించినట్లేనని ఆనందం వ్యక్తం చేశారు. ఆస్తి పత్రాలు అందజేసే సమయంలో సుందర్ తండ్రి రఘునాథ పిచాయ్ కన్నీటి పర్యంతమయ్యారని చెప్పారు. ‘వారి ఇంటికి వెళ్లినప్పుడు సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ చేసి తీసుకువచ్చారు. ఆయన తండ్రి ఆస్తి పత్రాలు ఇవ్వబోయారు’వారి నిరాడంబర వ్యవహార శైలి చూసి ఆశ్చర్యపోయా. రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద రఘునాథ గంటలపాటు వేచి ఉన్నారు. ఆస్తి పత్రాలను నాకు అప్పగించడానికి ముందు అన్ని పన్నులను ఆయనే చెల్లించారు. పత్రాలను నా చేతికి ఇచ్చేటప్పుడు ఆయన ఉద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు’అని మణికందన్ చెప్పారు. 1989లో ఐఐటీ ఖరగ్పూర్కు వెళ్లేవరకు సుందర్ పిచాయ్ కుటుంబం ఆ ఇంట్లోనే ఉంది. 20 ఏళ్లు వచ్చే వరకు సుందర్ పిచాయ్ ఆ ఇంట్లోనే గడిపినట్లు పొరుగు వారు చెప్పారు. సుందర్ గత ఏడాది చెన్నైలోని ఆ ఇంటికి వచ్చారు. -
అమ్మకానికి సుందర్ పిచాయ్ ఇల్లు.. కొనుగోలు చేసిన యాక్టర్.. ఎవరో తెలుసా?
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలో తన బాల్యంలో ఇంట్లో గడిపిన మధుర క్షణాలు కనుమరుగు కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. పలు కథనాల ప్రకారం.. చెన్నై అశోక్ నగర్లో పిచాయ్ చిన్ననాటి ఇంటిని ఇటీవలే పిచాయ్ తండ్రి అమ్మేసినట్లు సమాచారం. ఆ ఇంటిని తమిళ నటుడు, నిర్మాత సి.మణికందన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) సుందర్ పిచాయ్ బాల్యంలో గడిపిన ఆ ఇంటిని పిచాయ్ తల్లిదండ్రులు అమ్ముతున్నారని తెలుసుకొని కొనుగోలు చేసేందుకు మణికందన్ ముందుకు వచ్చారు. ‘సుందర్ పిచాయ్ ఇంటిని కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తున్నా. పిచాయ్ సాధించిన విజయాల పట్ల తన గర్వంగా ఉందంటూ’ ప్రశంసల వర్షం కురిపించారు. నాలుగు నెలల సమయం తాను ఆ ఇల్లు కొనుగులో చేసే సమయంలో పిచాయ్ తండ్రి అమెరికాలో నివసిస్తున్నారని,లావాదేవీల ప్రక్రియ పూర్తి చేసేందుకు నాలుగు నెలల సమయం పట్టినట్లు మణికందన్ చెప్పారు. సుందర్ పిచాయ్ తండ్రికి అదే మొదటి ఆస్తి కావడంతో.. ఆస్తిపత్రాలు ఇచ్చే సమయంలో ఉద్వేగ్వానికి గురైనట్లు గుర్తు చేశారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! -
గూగుల్ సంచలన నిర్ణయం..!
-
టిమ్ కుక్ శాలరీ కట్ అయ్యింది..మరి నీ శాలరీ?
-
సుందర్ పిచాయ్పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీరుపట్ల ఆ సంస్థ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని ఉద్యోగులకు కాస్ట్ కటింగ్ నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో సీఈవో భారీ ఎత్తున వేతనాలు ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఉద్యోగులు సైతం ఇంట్రర్నల్ ఫోరమ్లో సంస్థను ప్రశ్నిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గూగుల్ సెక్యూరిటీస్ ఫైలింగ్లో సుందర్ పిచాయ్కు ఎంత వేతనం చెల్లిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. వ్యయ నియంత్రణ అంటూ ఉద్యోగులకు భారీగా కోతపెడుతున్న గూగుల్.. సీఈవోకు మాత్రం 2022 సంవత్సరానికి రూ.1,850 (226 మిలియన్ డాలర్లు) కోట్ల పారితోషికం ఇచ్చింది. గూగుల్లో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ జనవరిలో గ్లోబుల్ వర్క్ ఫోర్స్లో 6 శాతంతో సుమారు 12 వేల మందిని విధుల నుంచి తొలగించడాన్ని తప్పుబడుతున్నారు. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? సుందర్ పిచాయ్ వర్సెస్ టిమ్కుక్ సుందర్ పిచాయ్ కాంపన్సేషన్ కింద భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. దీంతో సీఈవోకి చెల్లించే వేతనాల విషయంలో గూగుల్ ఉద్యోగులు పిచాయ్ వేతనాన్ని, యాపిల్ సీఈవో టిమ్కుక్ వేతనంతో పోల్చుతూ మీమ్స్ను షేర్ చేస్తున్నారు. టిమ్కుక్ గత ఏడాదిలో సుమారు 40 శాతం వేతనంలో కోత విధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ మీమ్స్ వేస్తున్నారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకున్నప్పటికీ సుందర్ పిచాయ్ వేతనాల పెంపుపై గూగుల్ ఇంట్రర్నల్ ఫోరమ్లో ఉద్యోగులు సంస్థకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీపీఎస్, సీఈవో మినహా అందరికీ వర్తిస్తుంది మార్చి నెలలో గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరట్ ఉద్యోగులకు మెమో పంపారు. సంస్థ ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో భాగంగా స్నాక్స్, లంచ్లు, లాండ్రీ, మసాజ్ సర్వీసులు ఆఫీసులో ఉండవని ప్రకటించింది. ఇలా ఆదా చేసిన డబ్బుల్ని మరిన్ని కీలకమైన పరిశోధనలకు ఖర్చు పెడతామని పేర్కొన్నారు. అందులో ఖర్చు ఆదా అందరికీ వర్తిస్తుంది. సంస్థ కోసం కష్టపడే వైస్ ప్రెసిడెంట్ సీఈవోకి మినహాయింపు ఉంటుందని గూగుల్ ఎంప్లాయిస్ ఫోరమ్లో పోరట్ స్పష్టం చేశారు. కాగా, ఉద్యోగుల నుంచి వస్తున్న విమర్శలపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందన ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విమర్శలకు చెక్ పెట్టేలా జీతాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? లేదంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారా? అని చర్చించుకుంటున్నారు. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే?
ఏ మార్పైన కొంత వరకు మంచిదే. కానీ అతిగా జరిగితే అనార్ధం తప్పదు. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఎటు చూసినా ఇదే చర్చ నడుస్తోంది. దీనిని నమ్మితే మానవజాతి వినాశనం తప్పదని, మానవుని ఎదుగుదలకు మూలమైన సృజనాత్మకతను అంతం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా దిగ్గజ టెక్ సంస్థలు ఈ ఏఐ రేసులో ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ విభాగంలో సత్తా చాటేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్తో పాటు కృత్రిమ మేధస్సు వినియోగంలో కాస్త వెనుకంజలో ఉన్న మరో టెక్ దిగ్గజం యాపిల్ సైతం దృష్టి సారించింది. గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ చాట్జీపీటీతో ముందంజలో ఉంటే యాపిల్ ఏఐని విస్మరించింది. ఊహించని పరిణామలతో ఓపెన్ ఏఐ లాంటి సంస్థలతో పోటీపడలేక ఆ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చీఫ్ జాన్ జియానాండ్రియా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బంగారు గుడ్లు పెట్టే బాతుల్లా నివేదికల ప్రకారం.. ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురిలో శ్రీనివాస్ వెంకటా చారి, ఆనంద్ శుక్లాలు (స్టీవెన్ బాకెర్ కాకుండా) ఇద్దరు దిగ్గజ కంపెనీలకు బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాగా కనిపిస్తున్నారు. అందుకే ఎంత ప్యాకేజీ కావాలంటే అంత చెల్లించి తమ సంస్థలో చేర్చుకునేందుకు పోటీపడుతున్నారు. యాపిల్ను వదిలేసి గూగుల్ వైపు యాపిల్ సెర్చ్ టెక్నాలజీలో పని చేస్తున్న ఆ ముగ్గురు యాపిల్ను వదిలేసి గూగుల్లో చేరారు. అందులో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)పై పనిచేస్తున్నారు. వారిలో ఇద్దరు ఐఐటీని పూర్తి చేశారు. ఆ ఇద్దరిని తమతో పాటు ఉంచుకునేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రయత్నిస్తుంటే.. యాపిల్ సంస్థ నుంచి గూగుల్కు వెళ్లిన ఆ ఇద్దరినే.. మళ్లీ తమవైపుకు తిప్పుకోవాలని సీఈవో టిమ్కుక్ చూస్తున్నారు. దీంతో ఇప్పుడు ఐఐటీయన్ల కోసం టెక్ సంస్థలు పోటీ పడుతున్న తీరు ప్రపంచ టెక్ రంగంలో చర్చాంశనీయంగా మారింది. ఎవరా ఇద్దరు భారతీయులు? ఐఐటీ మద్రాస్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ను పూర్తి చేసిన వెంకటాచారి ప్రస్తుతం గూగుల్ ఏఐ ప్రొడక్ట్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. మరొకరు ఆనంద్ శుక్లా. శుక్లా గూగుల్లో మంచి పేరున్న ఇంజినీర్గా చెలామణి అవుతున్నారు. లింక్డిన్ ఫ్రొఫైల్ ప్రకారం.. 2022 అక్టోబర్ నెలలో వెంకటచారీ యాపిల్కు రిజైన్ చేయగా.. అదే ఏడాది నవంబర్లో యాపిల్కు గుడ్పై చెప్పి గూగుల్లో చేరారు శుక్లా. బ్రతిమలాడి, బామాలి ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం, ఆ ఇద్దరు భారతీయులు గూగుల్లో పనిచేందుకు మొగ్గుచూపుతున్నట్లు తేలింది. గూగుల్ ఎల్ఎల్ఎంలో పనిచేసుందకు మంచి ప్రదేశమని భావించారని, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం తమ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వాళ్లిద్దరికి ఇక్కడే ఉండమని ఒప్పించేందుకు ప్రయత్నించారని నివేదిక పేర్కొంది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ -
కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే.. గూగుల్ సీఈఓ సుందర్
వాషింగ్టన్: కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పిచాయ్ చెప్పారు. ఈ టెక్నాలజీ ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకొనేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఐతో అసత్య సమాచారాన్ని సృష్టించే వీలుందని, ఇది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. అణ్వాయుధాలను నియంత్రిస్తున్న తరహాలోనే ఏఐని నియంత్రించడానికి ఒక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. -
ఉద్యోగాలు కోల్పోతున్న గూగుల్ ఉద్యోగులు
-
'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ai) ఆధారిత టూల్స్ చాట్జీపీటీ (chatgpt) వంటి టెక్నాలజీలతో ఉద్యోగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్మన్ శాక్స్ సైతం స్పష్టం చేసింది. ఆ సంస్థ నిర్వహించిన పరిశోధనల్ని ‘ఆర్థికప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ పేరుతో పలు అంశాలు వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలో వస్తోన్న నూతన ఒరవడులు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది. ఈ తరుణంలో కేసీ న్యూటన్, కెవిన్ రూస్లతో జరిగిన న్యూయార్క్ టైమ్స్ హార్డ్ ఫోర్క్ పాడ్కాస్ట్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘ఏఐతో ప్రమాదంలో ఉద్యోగాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ ఉద్యోగుల స్థానాల్ని భర్తీ చేస్తుందా? అన్న ప్రశ్నకు సుందర్ పిచాయ్ గూగుల్ బార్డ్, చాట్జీపీటీలపై సానుకూలంగా స్పందించారు. గూగుల్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందాలా? అని అడిగినప్పుడు.. ఎవరైనా టెక్నాలజీకి అనుగుణంగా మారాల్సిందేనని పిచాయ్ అన్నారు. ఏఐ సాంకేతికత కారణంగా ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే విషయాన్ని ధృవీకరించలేదు. కానీ ఉత్పాదకత విషయంలో ఏఐల పనితీరును ప్రశంసించారు. ‘ఏఐ వినియోగంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల విషయంలో రెండు విషయాలు నిజమవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకటి ప్రోగ్రామింగ్లో మీ పని తీరు మరింత మెరుగుపడుతుంది. చాట్జీపీటీ, బార్డ్ వంటి ఏఐ టూల్స్ కారణంగా ప్రోగ్రామింగ్ అనేది అందరికి అందుబాటులోకి వస్తుంది. ఇది కొత్త విషయాలను తెలుసుకోవడానికి లేదంటే సృష్టించడానికి వినియోగదారులకు అండగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూగుల్ బార్డ్ కాలక్రమేణా మెరుగుపడుతుందని చెప్పారు. ఓపెన్ ఏఐ పనితీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందా? అని అడిగినప్పుడు.. పిచాయ్ వారి విజయాన్ని చూసి తాను ఆశ్చర్యపోలేదని పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న (ఓపెన్ ఏఐ) వ్యక్తుల క్యాలిబర్ మాకు తెలుసు. కాబట్టే తాను ఆశ్చర్యపోలేదని తెలిపారు. చదవండి👉 చాట్జీపీటీ జాబ్.. జీతం ఏడాదికి రూ.2.7కోట్లు -
గూగుల్ ‘బార్డ్’ మళ్లీ ఫెయిల్.. ఈ సారి ఏకంగా
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తామేమీ తక్కువ కాదంటూ చాట్జీపీటీకి పోటీగా బార్డ్ పేరిట గూగుల్ తీసుకొచ్చిన చాట్బాట్ వరుస షాకులిస్తుంది. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలో జరిగిన తప్పిదంతో గూగుల్ భారీగా నష్టపోయింది. తాజాగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బార్డ్ మరోసారి ఫెయిల్ అయ్యింది. ‘బార్డ్’ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బార్డ్ను పరిచయం చేస్తూ గూగుల్ ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడంలో బార్డ్ విఫలమైంది. దీంతో గూగుల్కు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. చదవండి👉 చాట్జీపీటీకీ భారీ షాక్.. బ్యాన్ దిశగా ప్రపంచ దేశాల అడుగులు? తాజాగా టెస్టింగ్ దశలో ఉన్న బార్డ్ శాట్ పరీక్షలకు సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అమెరికాకు చెందిన కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే శాట్ (sat) అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు సంబంధిత కాలేజీల్లో సీటు దొరుకుతుంది. ఫార్చ్యూన్ సంస్థ ఆ పరీక్షకు సంబంధించిన మ్యాథ్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని బార్డ్ను అడిగింది. అందుకు బార్డ్ స్పందించింది. 75 శాతం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను తప్పుగా ఇచ్చింది. కొన్నింటికి సమాధానాలు ఇచ్చినప్పటికీ.. మళ్లీ అదే ప్రశ్న వేసినప్పుడు గతంలో ఇచ్చిన సమాధానం కాకుండా వేరే ఆన్సర్ ఇచ్చినట్లు తేలింది. రిటర్న్ లాంగ్వేజ్ ఎగ్జామ్లో 30 శాతం మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చింది. దీనిపై గూగుల్ ప్రతినిధి ఫార్చ్యూన్తో మాట్లాడుతూ..బార్డ్ టెస్టింగ్ దశలో ఉంది. కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. బార్డ్ పనితీరు మెరుగుపడుతోంది. వినియోగంలోకి తెచ్చేందుకు వేలాది మంది టెస్టర్లు దీనిపై పని చేస్తున్నారని అన్నారు. చదవండి👉 త్వరలో ‘చాట్జీపీటీ’తో ఊడనున్న ఉద్యోగాలు ఇవే! బార్డ్ పనితీరుపై అనుమానాలు మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీకి పోటీగా బార్డ్ను పరిచయం చేస్తూ ప్రమోషనల్ వీడియోలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి అడిగిన ప్రశ్నకు బార్డ్ తప్పుడు సమాధానం ఇచ్చింది. సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహాల చిత్రాలను తొలుత జేమ్స్ వెబ్ స్పేస్ తీసిందని పేర్కొంది. వాస్తవానికి 2004లోనే యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన టెలీస్కోప్ సౌరవ్యవస్థకు వెలుపలి చిత్రాలను తీసింది. గూగుల్ విడుదల చేసిన జిఫ్ వీడియోలో ఈ పొరపాటును గుర్తించడంతో దీని సామర్థ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. అప్ గ్రేడ్ చేస్తున్నాం ఈ తరుణంలో న్యూయార్క్ టైమ్స్ పాడ్కాస్ట్ లో బార్డ్ పనితీరుపై సుందర్ పిచాయ్ స్పందించారు. బార్డ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బార్డ్ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన టెస్టర్లతో ప్రయోగాలు నిర్వహించాక పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి! -
గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్.. అసలేం జరిగిందంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఇకపై వారికి అందించే ఫ్రీ స్నాక్స్, లంచ్, మసాజ్, లాండ్రీతో పాటు ఇతర సౌకర్యాల్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్లో పనిచేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఆహ్లాదకర వాతావరణం, జీత భత్యాలు, ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, ఇతర ప్రోత్సహాకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేసే వారికి సొసైటీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే గూగుల్ ఉద్యోగం అంటే ఎగిరి గంతేస్తుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ప్రథమ స్థానంలో ఉన్న గూగుల్ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితిని తట్టుకొని నిలబడాలంటే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకొని..దూబారా ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో ఇప్పటి వరకు ఉద్యోగులకు అందించిన అన్నీ ప్రోత్సాహకాల్ని రద్దు చేసింది. నియామకాల్ని తగ్గించి డబ్బుల్ని ఆదా చేస్తోంది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ మాట్లాడుతూ..సంస్థ అధిక ప్రాధాన్యత కలిగిన పనులపై మాత్రమే డబ్బుల్ని సమర్థవంతంగా వినియోగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రోత్సాహకాల నిలిపి వేతపై ఉద్యోగులకు గూగుల్ మెమో జారీ చేసింది. హైరింగ్ ప్రాసెస్ను నిలిపివేసి ఉద్యోగుల్ని అధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్లపై పనిచేసేలా రీలొకేట్ చేయనున్నట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక తెలిపింది. ఉద్యోగులకు అందించే ల్యాప్ట్యాప్లను తిరిగి వెనక్కి తీసుకోవడంతో పాటు, ఆఫీస్ లొకేషన్ అవసరాలు, ప్రతి ఆఫీస్ స్పేస్లో కనిపించే ట్రెండ్ల ఆధారంగా ప్రొత్సహకాల్ని సర్ధుబాటు చేయాల్సి వస్తుందని పోరాట్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది. మైక్రో కిచెన్ల అవసరం ఎంత వరకు ఉందనే విషయంపై స్పష్టత వచ్చిన వెంటనే వాటిని మూసివేయడం, వినియోగానికి తగ్గట్లు ఫిట్నెస్ క్లాసుల్ని షెడ్యూల్ చేయడం పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వాడాకాన్ని తగ్గించి డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టేందుకు సిద్ధమైనట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక హైలెట్ చేసింది. కొన్ని సర్ధుబాట్లు తప్పవ్ ఇక తాజా గూగుల్ నిర్ణయంపై ‘సంస్థ ఇచ్చే ప్రోత్సహాకాల్ని ఇష్టపడే ఉద్యోగులకు ఈ నిర్ణయం అసంతృప్తి కలిగించవచ్చు. కానీ కంపెనీకి నిధులను ఆదా చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా అధిక ప్రాధాన్యత కలిగిన ఇతర రంగాలపై దృష్టిసారించడం తప్పనిసరి. ముఖ్యమైన ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు, సౌకర్యాలను అందించడం కొనసాగిస్తుంది. అయితే కంపెనీ తన వనరుల విషయంలో బాధ్యతాయుతంగా ఉండేందుకు కొన్ని సర్ధుబాట్లు చేయబడతాయి అంటూ గూగుల్ ప్రతినిధి ర్యాన్ లామోన్ గిజ్మోడోకి చెప్పారు. చదవండి👉 గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు!
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పోలీసులతో నివేదా పేతురాజ్ వాగ్వాదం.. అసలు విషయం ఇదన్నమాట!
ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కేసీఆర్.. నెట్టింట వైరల్
ఐదేళ్ల వయసులోనే అబ్బురపరిచే ప్రతిభ.. అరుదైన ఘనత
ఎగ్జిట్ పోల్స్పై ఈసీ కీలక ఆదేశాలు
గొర్రెల స్కాం.. పశుసంవర్ధక శాఖ సీఈవో రాంచందర్ అరెస్ట్
రాజమండ్రిలో దివ్యాంగులకు నాట్స్ చేయూత
అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ
రేపే చివరి విడత పోలింగ్
జాన్వీ కపూర్ వీడియోపై కామెంట్.. ఇచ్చిపడేసిన హీరోయిన్!
Advertisement