SUV
-
ఈ ఏడాదే భారత్లోకి చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ
స్వీడిష్ లగ్జరీ కార్ల దిగ్గజం వోల్వో తమ చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈఎక్స్30ని ఈ ఏడాదే భారత మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దేశీయంగా ఏటా ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలనే వ్యూహానికి అనుగుణంగా దీన్ని తీసుకురానున్నట్లు సంస్థ ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. మిగతా కార్లలాగానే ఈ వాహనాన్ని బెంగళూరు ప్లాంటులో అసెంబుల్ చేసి విక్రయించాలని భావిస్తున్నామని, ప్రస్తుతం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.ఓ కొత్త సెగ్మెంట్ సృష్టించడం ద్వారా ఇది దేశీయంగా ఈవీల వినియోగం మరింతగా పెరిగేందుకు ఉపయోగపడగలదని మల్హోత్రా చెప్పారు. గతేడాది తాము భారత్లో విక్రయించిన ప్రతి నాలుగు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్దని ఆయన వివరించారు. ఈ విభాగంలో ఎక్స్సీ40, సీ40 అని తమకు రెండే కార్లు ఉన్నప్పటికీ వీటి అమ్మకాలు తమ మొత్తం కార్ల విక్రయాల్లో దాదాపు పాతిక శాతానికి చేరినట్లు మల్హోత్రా చెప్పారు. ప్రస్తుతం మాస్ మార్కెట్ విభాగంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రెండు శాతంగానే ఉన్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో 6–7 శాతంగా ఉన్నట్లు వివరించారు. 2030 నాటికి అంతర్జాతీయంగా 90–100 శాతం ఆదాయాలను ఎలక్ట్రిక్ కార్ల నుంచే ఆర్జించాలనే లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఇంజినీరింగ్ ఎగుమతుల జోరుకంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..ఇది 427 హెచ్పీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కేవలం 3.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. EX30 రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 51 కిలోవాట్ల లిథియం-ఐరన్-ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) బ్యాటరీ, 69 కిలోవాట్ల నికెల్-మాంగనీస్-కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీలో వస్తుంది. గరిష్టంగా అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 474 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. -
నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మైలురాయి
నిస్సాన్ మోటార్ ఇండియా తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ నిస్సాన్ మాగ్నైట్లో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించింది. స్వచ్ఛమైన, మరింత స్థిరమైన ఇంధన ఎంపికల కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అనుగుణంగా ఈ వాహనం ఇప్పుడు పూర్తిగా ఈ20 అనుకూలమైనదిగా మారింది. అదేకాకుండా మాగ్నైట్ అద్భుతమైన ఎగుమతి మైలురాయిని సాధించింది, 2020 లో లాంచ్ అయినప్పటి నుండి 50,000 యూనిట్లను దాటింది.ఈ20 కంపాటబిలిటీనిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ బీఆర్ 10 పెట్రోల్ ఇంజన్ ను ఈ20 కంప్లైంట్ గా అప్ గ్రేడ్ చేశారు. ఇది ఇప్పటికే ఈ20 కంపాటబుల్ గా ఉన్న 1.0-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజిన్ కు జతయింది. 20% ఇథనాల్, 80% గ్యాసోలిన్ కలిగి ఉన్న ఈ20 ఇంధనం.. కర్బన ఉద్గారాలు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ విస్తృత వ్యూహంలో భాగం. న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ 71బీహెచ్పీ పవర్, 96ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టర్బోఛార్జ్ డ్ ఇంజన్ 98బీహెచ్పీ పవర్, 160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కోసం ట్రాన్స్మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) ఉన్నాయి. టర్బోఛార్జ్డ్ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ లేదా కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (సీవీటీ) తో లభిస్తుంది.ఎగుమతి మైలురాయిమాగ్నైట్ విడుదల చేసినప్పటి నుండి 50,000 యూనిట్ల ఎగుమతి మార్కును అధిగమించిందని నిస్సాన్ మోటార్ ఇండియా నివేదించింది. జనవరిలో మాగ్నైట్ లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వేరియంట్ను ఎగుమతి చేయడం ప్రారంభించింది. చెన్నైలోని కామరాజర్ పోర్ట్ నుండి లాటిన్ అమెరికన్ మార్కెట్లకు దాదాపు 2,900 యూనిట్లను రవాణా చేసింది. ఫిబ్రవరి నాటికి, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోని మార్కెట్లకు 10,000 యూనిట్లకు పైగా మాగ్నైట్ ఎగుమతి అయింది. -
ఎనిమిది సార్లు కారు బోల్తా పడితే.. తాపీగా ‘టీ ఉన్నాయా?’ అని అడిగారంట
జైపూర్ : ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది.పోలీసుల వివరాల మేరకు.. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ఐదుగురు ప్రయాణికులతో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంది. అయితే, మార్గం మధ్యలో జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుండగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఎస్యూవీ క్షణాల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది.ఊహించని పరిణామంతో స్థానికంగా ఉన్న ఇళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. కారు తుక్కు తుక్కు అయ్యింది. ప్రమాద తీవ్రత ఉన్నప్పటికీ వాహనంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. राजस्थान के नागौर में दुर्घटना के बाद कार ने इतने पलटे खाये कि गिनती करना मुश्किल हो गया। सुखद बात यह रही कि इतना होने पर भी सब सुरक्षित रहे।#Nagaur #Rajasthan pic.twitter.com/9GC3bMoZOl— Ajit Singh Rathi (@AjitSinghRathi) December 21, 2024అన్నా.. టీ ఉన్నాయా?స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘కారు పల్టీలు కొట్టే సమయంలో డ్రైవర్ కారులో నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిపోవడంతో మిగతా నలుగురు ప్రయాణికులు దిగారు. ఊహించని ఘోర ప్రమాదంలో కారు దిగిన నలుగురు ప్రయాణికులు స్థానికంగా ఉన్న కార్ షోరూంలోకి వెళ్లారు. అనంతరం, షోరూం సిబ్బందిని ‘టీ ఉన్నాయా’? అని అడిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగినా కారు ప్రయాణికులు స్పందించిన తీరుపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. నాగౌర్ నుండి బికనీర్ వరకు ప్రయాణంప్రమాద సమయంలో ఎస్యూవీ నాగౌర్ నుండి బికనీర్కు వెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. ఫిర్యాదు ఆధారంగా ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించే పనిలో ఉండగా.. మితిమీరిన వేగం కూడా ఓ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కారు ఎలా బోల్తా పడిందో మీరూ చూసేయండి. -
కియా కొత్త ఎస్యూవీ సిరోస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సిరోస్ను భారత్ వేదికగా అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. 2025 జనవరి 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర ఎక్స్షోరూంలో రూ.10–15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. 118 బీహెచ్పీ, 172 ఎన్ఎం టార్క్తో పెట్రోల్ వేరియంట్ 1.0 లీటర్ త్రీ–సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్తో తయారైంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ను ఎంచుకోవచ్చు. లెవెల్–2 అడాస్, 6 ఎయిర్బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. 30 అంగుళాల పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్ వంటి హంగులు జోడించారు. -
టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీ
న్యూఢిల్లీ: పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీని టయోటా మోటార్ కార్పొరేషన్కు సుజుకీ మోటార్ కార్పొరేషన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు తమ సహకారాన్ని మరింత విస్తరింపజేశాయి. ఈ మోడల్ను 2025 ప్రారంభంలో గుజరాత్ ప్లాంటులో తయారు చేయనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.మారుతీ సుజుకీ ఇండియా వచ్చే ఏడాది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్ కోసం తీసుకున్న బీఈవీ యూనిట్, ప్లాట్ఫామ్లను సుజుకీ, టయోటాతోపాటు డైహట్సు మోటార్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.‘ప్రపంచవ్యాప్తంగా టయోటాకు మా మొదటి బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) సరఫరా చేస్తాం. ఈ విధంగా రెండు కంపెనీల మధ్య సహకారం మరింతగా కొనసాగినందుకు చాలా సంతోషంగా ఉంది. పోటీదారులుగా కొనసాగుతూనే ఇరు కంపెనీలు విభిన్న మార్గాల ద్వారా కార్బన్–న్యూట్రల్ సొసైటీని సాకారం చేయడంతో సహా సామాజిక సమస్యలను పరిష్కరించడంలో మరింత సహకరించుకుంటాయి’’ అని సుజుకీ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకోవడం, తయారీ కేంద్రాల వినియోగానికై భాగస్వామ్యం కోసం టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2017లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మారుతీ సుజుకీలో... సుజుకీ కార్పొరేషన్కు దాదాపు 58 శాతం వాటా ఉంది. -
కారు.. రికార్డు! 2 లక్షల మంది కొనేశారు..
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (FRONX) ఎస్యూవీ మరో మైలురాయిని సాధించింది. కేవలం 17.3 నెలల్లో 2 లక్షల విక్రయాల మార్కును చేరుకుని సరికొత్త పరిశ్రమ రికార్డును నెలకొల్పిందని కంపెనీ ప్రకటించింది.2023 ఏప్రిల్లో లాంచ్ అయిన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ దాని థ్రిల్లింగ్ డ్రైవ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన గాడ్జెట్లు, మల్టీ పవర్ట్రెయిన్ ఎంపికల కారణంగా ఈ అద్భుతమైన ఫీట్ను సాధించింది. గతేడాది జనవరిలో 1 లక్ష విక్రయాల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన కొత్త మోడల్గా గుర్తింపు పొందిన తరువాత 7.3 నెలలకే మరో లక్ష విక్రయాలు సాధించి 2 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం విశేషం.ఫ్రాంక్స్ సాధించిన ఈ మైలురాయి మారుతి సుజుకి పట్ల కస్టమర్లకు ఉన్న అంచనాలు, వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందించడానికి తాము చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుందని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ పేర్కొన్నారు. మారుతీ ఫ్రాంక్స్ టైర్ 1, టైర్ 2 నగరాల్లోని కస్టమర్లలో గణనీయమైన ఆకర్షణను పొందింది. వీటి అమ్మకాలకు ఎన్సీఆర్, ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు మొదటి ఐదు టాప్ మార్కెట్లుగా నిలిచాయి. -
కొత్త కార్ల పండగ!
సార్వత్రిక ఎన్నికలు.. మండుటెండలు.. కుండపోత వర్షాలు.. కార్ల కంపెనీల అమ్మకాలను గత మూడు నాలుగు నెలలూ గట్టిగానే దెబ్బకొట్టాయి. గ్రామీణ డిమాండ్తో జూలైలో మాత్రం కాస్త పుంజుకుని ఊరటనిచ్చాయి. నిండు కుండలా కార్ల నిల్వలు పేరుకుపోవడంతో డీలర్లు పండగ సీజన్ కోసం అవురావురుమని ఎదురుచూస్తున్నారు. మరోపక్క, అమ్మకాలు మందగించడంతో.. కార్ల కంపెనీలు గేరు మారుస్తున్నాయి. కొంగొత్త వాహన మోడళ్లను కారు ప్రియుల కోసం రెడీ చేస్తున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు సేల్స్ పెంపుతో పండుగ చేసుకోవాలని చూస్తుండగా.. కస్టమర్లకు కూడా కొత్త కార్ల జాతర కనువిందు చేయనుంది. రాబోయే పండుగ సీజన్ కోసం కార్ల కంపెనీలన్నీ ‘కొత్త’ వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. దాదాపు 20 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అంచనా. ఇందులో 12 కార్లు పూర్తిగా కొత్తవి కావడం విశేషం. ప్రస్తుతం దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ)పైనే కంపెనీలన్నీ ఎక్కువగా గురి పెట్టాయి. కొత్తగా విడుదలయ్యే వాటిలో 13 ఎస్యూవీ మోడల్స్ ఉండటం దీనికి నిదర్శనం. టాటా మోటార్స్, నిస్సాన్, సిట్రాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ మోటార్స్, కియా, హ్యుందాయ్, ఫోక్స్వ్యాగన్తో పాటు లగ్జరీ కార్ దిగ్గజాలు మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ తదితర కంపెనీలు వచ్చే మూడు నెలల్లో కొత్త ఎస్యూవీలతో మార్కెట్ను ముంచెత్తనున్నాయి. ఇక మారుతీ సుజుకీ, మెర్సిడెస్ నయా సెడాన్లతో అలరించనుండగా.. కియా, ఎంజీ మల్టీ పర్పస్ వాహనాలను (ఎంపీవీ) రంగంలోకి దించుతున్నాయి. సేల్స్ తగ్గినా.. నిల్వల పెంపు.. ఈ ఆరి్థక సంవత్సరం మొదలు (ఏప్రిల్ నుంచి) వాహన అమ్మకాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఎన్నికలతో పాటు మండుటెండలు కూడా వాహన విక్రయాలపై ప్రభావం చూపాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేయడం కంపెనీల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, గ్రా మీణ డిమాండ్ మళ్లీ పుంజుకోవడంతో జూలైలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 10% పెరగ డం విశేషం. కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేయడం.. పండుగల్లో భారీ డిమాండ్ ఆశలతో వాహన కంపెనీలు భారీగా నిల్వలు పెంచుకున్నాయి. డీలర్ల వద్ద సగటున 25–30 రోజుల నిల్వలు ఉంటాయని, ప్రస్తుతం 60–65 రోజుల నిల్వలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.73,000 కోట్లుగా అంచనా. సెపె్టంబర్తో షురూ... దక్షిణాదిన కేరళ ‘ఓనమ్’ తో పండుగ సేల్స్ మొదలవుతాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి, దుర్గాపూజ, దసరా, దీపావళి ఇలా వరుసగా అటు జనాలకు ఇటు కంపెనీలకూ పండుగే. మూడు నెలలుగా పేరుకున్న నిల్వలను పండుగల్లో విక్రయించడంతో పాటు కొత్త మోడళ్లతో కస్టమర్లను షోరూమ్లకు క్యూ కట్టించాలనేది వాహన సంస్థల వ్యూహం. మహీంద్రా సక్సెస్ఫుల్ ఎస్యూవీ ‘థార్’లో (ప్రస్తుతం మూడు డోర్ల మోడల్ ఉంది) కొత్తగా ఐదు డోర్ల థార్ ‘రాక్స్’ను తీసుకొస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దీన్ని ఆవిష్కరించి.. పండుగ సీజన్లో మార్కెట్లోకి తీసుకొచ్చేలా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ‘ఐదు డోర్ల థార్ కోసం మేము ముందుగా ప్లాన్ చేసిన ఉత్పత్తికి మరో 3,000–4,000 అదనంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం’ అని ఎంఅండ్ఎం సీఈఓ (ఆటో, ట్రాక్టర్ల విభాగం) రాజేష్ జెజూరికర్ క్యూ1 ఆరి్థక ఫలితాల సందర్భంగా వెల్లడించారు.ఈవీలు, హైబ్రిడ్లు కూడా... కొత్తగా లైన్ కడుతున్న వాహన మోడల్స్ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా రకరకాల ఇంజిన్ ఆప్షన్లతో లభించనున్నాయి. పెట్రోల్, డీజిల్తో పాటు ఎలక్ట్రిక్ (ఈవీ) హైబ్రిడ్ (సీఎన్జీ+పెట్రోల్ వంటివి) ఇంజిన్లు సైతం వీటిలో ఉన్నాయి. ఈవీ విభాగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్ సరికొత్త ఎస్యూవీ కూప్ ‘కర్వ్’తో పండగ చేసుకోవాలనుకుంటోంది. ఈ మోడల్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఈవీ వేరియంట్ను కూడా తీసుకొస్తోంది. ముందుగా ఈవీ ‘కర్వ్’ను ప్రవేశపెట్టడం విశేషం. గత నెలలో నిస్సాన్ ఆవిష్కరించిన ప్రీమియం ఎస్యూవీ ఎక్స్–ట్రెయిల్ కూడా పండుగల్లో రోడ్డెక్కనుంది.పండుగ రేసు గుర్రాలు (అంచనా ధర రూ.లలో).. → టాటా మోటార్స్–కర్వ్ ఈవీ (18–25 లక్షలు), → కర్వ్ (రూ.10.5–20 లక్షలు), → మారుతీ–స్విఫ్ట్ హైబ్రిడ్ (10 లక్షలు), డిజైర్–2024 (7–10 లక్షలు) → మహీంద్రా–థార్ రాక్స్ (13–23 లక్షలు) → నిస్సాన్ – ఎక్స్ట్రెయిల్ (49 లక్షల నుంచి)→ టయోటా బెల్టా – (9.5–12 లక్షలు) → మెర్సిడెజ్–బెంజ్ – ఈక్యూఎస్ ఎస్యూవీ (2 కోట్లు) → బీఎండబ్ల్యూ–ఎం3 (1.47 కోట్లు) → రెనో–కార్డియన్ (10–12 లక్షలు) → ఎంజీ–క్లౌడ్ ఈవీ (29–30 లక్షలు), → గ్లోస్టర్–2024 (40 లక్షలు) → స్కోడా–కొడియాక్–2024 (40–50 లక్షలు) → బీవైడీ–సీగల్ ఈవీ (10 లక్షలు) → కియా–ఈవీ9 (75–82 లక్షలు)→ ఆడి–క్యూ8 ఫేస్లిఫ్ట్ (రూ.1.17 కోట్లు) → సిట్రాన్ – సీ3ఎక్స్ (రూ.11.5 –15 లక్షలు), బసాల్ట్ (రూ.8 లక్షలు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టాటా కర్వ్ ఈవీ వచ్చేసింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కర్వ్.ఈవీ ఎస్యూవీ కూపే విడుదల చేసింది. ఎక్స్షోరూంలో ధర రూ.17.49 లక్షలతో ప్రారంభమై రూ.21.25 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 2023 ఆటో ఎక్స్పోలో కాన్సెప్ట్ రూపంలో ఈ కారు తొలిసారిగా దర్శనమిచ్చింది. కర్వ్.ఈవీ చేరికతో టాటా మోటార్స్ ఖాతాలో ఎలక్ట్రిక్ మోడళ్ల సంఖ్య అయిదుకు చేరుకుంది. 123 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కర్వ్. ఈవీలో పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో 502 కిలోమీటర్లు, 55 కి.వా.అవర్ బ్యాటరీ ప్యాక్తో 585 కి.మీ. ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. భారత్ ఎన్సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇవీ అదనపు ఫీచర్లు.. 20కిపైగా సేఫ్టీ ఫీచర్స్తో లెవెల్–2 అడాస్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్బ్యాగ్స్, ఆటోహోల్డ్తో ఎల్రక్టానిక్ పార్కింగ్ బ్రేక్, 190 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 18 అంగుళాల వీల్స్, పనోరమిక్ సన్రూఫ్ ఇతర హంగులు. 40 నిమిషాల్లో బ్యాటరీ 80% చార్జింగ్ పూర్తి అవుతుంది. కర్వ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మోడల్ను సెప్టెంబర్ 2న ఆవిష్కరిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర తెలిపారు. లక్ష టాటా ఈవీలు భారత రోడ్లపై పరుగెడుతున్నాయన్నారు. కంపెనీకి ఎలక్ట్రిక్ కార్ల విపణిలో 70% వాటా ఉందన్నారు. -
ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ విషాదం : ఎస్యూవీ డ్రైవర్కు బెయిల్
ఢిల్లీ : ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్లో విద్యార్ధుల మరణాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్యూవీ డ్రైవర్ మను కతురియాకు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జులై 27న ఢిల్లీలో రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ముగ్గురు విద్యార్థుల మరణానికి పరోక్షంగా ఎస్యూవీ డ్రైవర్ మను కతురియా కారణమంటూ ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.తన అరెస్ట్ని సవాల్ చేస్తూ కతురియా ఢిల్లీ జిల్లా తీస్ హజారీ కోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ చేపట్టిన కోర్టు రూ.50వేల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. [Rajendra Nagar deaths] A Delhi Sessions Court grants bail to Manuj Kathuria, an SUV driver arrested by Delhi Police in connection with the case. Kathuria was denied bail by the Magistrate Court on Wednesday. #UPSCaspirants #RajendraNagar #bail pic.twitter.com/RDOmIdyIAH— Bar and Bench (@barandbench) August 1, 2024జులై 27న సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దాంతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేందర్ నగర్లోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లో సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. అదే సమయంలో రావుస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై మను కతురియా తన ఎస్యూవీ వాహనాన్ని వేగంగా డ్రైవింగ్ చేయడంతో వరద నీరు సెల్లార్లోకి చేరుకుంది. దీంతో వరదలో చిక్కుకుని సెల్లార్లోని లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్ధులు మరణించారు. ఈ దుర్ఘటనలో విద్యార్ధుల మరణానికి మను కతురియా కారకుడేనంటూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ను కతురియా సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
అమ్మకాల్లో దేశీయ దిగ్గజం అరుదైన రికార్డ్.. 20 లక్షల యూనిట్లు
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. దేశంలో ఇప్పటికి 20 లక్షల ఎస్యూవీలను విక్రయించి అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇందులో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీలుగా టాటా సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్ ఉన్నాయి. వీటితో పాటు పాత మోడల్ సియెర్రా, సఫారీ కూడా ఉన్నాయి.కంపెనీ సాధించిన ఈ విజయాన్ని సంస్థ 'కింగ్ ఆఫ్ ఎస్యూవీస్' పేరిట ఆఫర్స్ కూడా ప్రకటించింది. దీంతో హారియర్, సఫారీ, పంచ్ వంటి వాటిని కొంత తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో అడిషినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ గత నెలలో (2024 జూన్) ఎక్కువ సంఖ్యలో విక్రయించిన ఎస్యూవీ పంచ్ కావడం గమనించదగ్గ విషయం. కాగా కంపెనీ ఇప్పుడు తన నెక్సాన్ కార్టూను CNG రూపంలో కూడా లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది త్వరలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. -
మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ ‘అర్బన్ క్రూజర్ టైజర్’ను విడుదల చేసింది. దీని ధర రూ. 7.73 లక్షల నుంచి రూ. 13.03 లక్షల వరకు (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. ఇది మారుతీ సుజుకీకి చెందిన ఫ్రాంక్స్కి టీకేఎం వెర్షన్గా ఉంటుంది. టైజర్ పెట్రోల్, ఈ–సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రీమియం ఇంటీరియర్స్, కీ లెస్ ఎంట్రీ, 360 వ్యూ కెమెరా, 9 అంగుళాల హెచ్డీ స్మార్ట్ప్లే, యాంటీ–థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రూ. 11,000తో టైజర్ను బుక్ చేసుకోవచ్చు. మే నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు ఈ మోడల్ తమకు ఉపయోగపడగలదని కంపెనీ డిçప్యూటీ ఎండీ తడాషి అసాజుమా తెలిపారు. కస్టమర్లు చిన్న కార్ల నుంచి క్రమంగా పెద్ద కార్ల వైపు మళ్లుతున్నారని, అందుకే మరిన్ని కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టేందుకు తాము ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. -
రూ.16.8 లక్షల ఎస్యూవీని ఆవిష్కరించిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మధ్యశ్రేణి ఎస్యూవీ క్రెటా ఎన్లైన్ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుందని తెలిపింది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఎన్లైన్ శ్రేణిలో ఇప్పటికే ఐ20 హ్యాచ్బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ ఉన్నాయి. ఎన్ లైన్, ప్రామాణిక మోడల్ వాహనాల మధ్య డిజైన్లో పలు మార్పులుంటాయి. కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్వీల్స్, రెడ్ ఫ్రంట్, రేర్ బ్రేక్ కాలిపర్స్, గ్రిల్పై ఎన్ లైన్ బాడ్జింగ్ పలు డిజైన్ సంబంధిత మార్పులుంటాయి. ఎన్ లైన్ వినియోగదార్ల సగటు వయసు 36 ఏళ్లుగా ఉందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ–స్కూటర్కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
Traffic Effect: నదిలో దూసుకెళ్లిన కారు
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఒక వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి ట్రాఫిక్ను తప్పించుకోవడం కోసం రోడ్డు దిగి తన ఎస్యూవీ కార్ను ఏకంగా నదిలో పరుగులు పెట్టించాడు. ఈ ప్రమాదకర ప్రయణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నదిలో వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిలో కారును పరుగులు పెట్టించిన ఘటన హిమాచల్ప్రదేశ్లోని లాహోల్ స్పితి జిల్లాలో జరిగింది. కారు వెళ్లిన చంద్రా నదిలో ప్రస్తుతం నీళ్ల లోతు పెద్దగా లేదు. దీంతో ఎస్యూవీ ఈజీగా నదిని దాటేసింది. ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డ వాహనదారునికి మోటార్ వెహికిల్ చట్టం కింద భారీ జరిమానా విధించినట్లు ఎస్పీ మయాంక్ చౌదరి తెలిపారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవులు రావడంతో హిమాచల్కు టూరిస్టుల తాకిడి పెరిగింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. డ్రోన్లతో పోలీసులు ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Himachal Pradesh: Challan issued after a video of driving a Thar in Chandra River of Lahaul and Spiti went viral on social media. SP Mayank Chaudhry said, "Recently, a video went viral in which a Thar is crossing the river Chandra in District Lahaul Spiti. The said… pic.twitter.com/V0a4J1sgxv — ANI (@ANI) December 25, 2023 ఇదీచదవండి..పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్కు భారత్లో అ«దీకృత సంస్థగా ఎక్స్క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
మహీంద్రా కార్ల అమ్మకాల జోరు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ వాహన విక్రయాల్లో వృద్దిని నమోదు చేసింది. అక్టోబర్ నెలలో మహీంద్రా మొత్తం 43,708 ఎస్యూవీ వెహికల్స్ను అమ్మింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35శాతం వృద్దిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో 32,298 యూనిట్లను విక్రయించింది. 1,854 యూనిట్ల ఎస్యూవీలను ఎగుమతి చేయగా.. 25,715 యూనిట్ల వాణిజ్య వాహనాలను అమ్మనిట్లు తెలిపింది ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. ‘అక్టోబర్లో 32 శాతం వృద్ధితో 679,32 వాహనాలతో అత్యధిక అమ్మకాలు జరిపాం. వరుసగా మూడో నెలలో ఎస్యూవీలు 43,708, సీవీలు 25,715 వాహనాలతో హై వాల్యూమ్లు సాధించాయి.’అని అన్నారు. కాగా, మహీంద్రా 2026 నాటికి ఐదు డోర్ల ఎలక్ట్రిక్ ఎస్యూవీని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈవీ ఎస్యూవీలో 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో రానుంది. -
భారత్లో టయోటా మూడవ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా మోటార్.. భారత్లో మూడవ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏటా 80,000–1,20,000 యూనిట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని స్థాపించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో నూతన కేంద్రంలో తయారీ సామర్థ్యాన్ని 2,00,000 యూనిట్లకు చేరుస్తారు. కర్నాటకలోని బీదడి వద్ద ఉన్న టయోటాకు చెందిన రెండు ప్లాంట్లు ఏటా 4,00,000 యూనిట్లు తయారు చేయగలవు. ఈ ప్లాంట్లకు సమీపంలోనే మూడవ కేంద్రం నెలకొల్పాలన్నది కంపెనీ ప్రణాళిక. భారత విపణి కోసం కొత్త ఎస్యూవీని అభివృద్ధి చేసే పనిలో కంపెనీ ఇప్పటికే నిమగ్నమైంది. 2026లో ఇది ఇక్కడి రోడ్లపై పరుగు తీయనుంది. కొత్త ఫ్యాక్టరీలో ఈ ఎస్యూవీని తయారు చేయనుండడం విశేషం. మధ్యస్థాయి అర్బన్ క్రూజర్ హైరైడర్కు మలీ్టపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్కు మధ్య ఈ మోడల్ ఉండనుంది. 340–డి కోడ్ పేరుతో రానున్న ఈ ఎస్యూవీ మోడల్ కింద ఏటా 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ ఆలోచన. ఇందుకోసం సరఫరాదార్లను టయోటా సన్నద్ధం చేస్తోంది. భారత్లో మినీ ల్యాండ్ క్రూజర్ను సైతం పరిచయం చేయాలని సంస్థ భావిస్తోంది. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్తో అంతర్జాతీయంగా భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. భారత్లో టయోటా ప్లాంట్ల సామర్థ్యంలో 40 శాతం మారుతీ సుజుకీ వినియోగించుకుంటోంది. భారత్లో 2030 నాటికి ఏటా 5,00,000 యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగి ఉండాలని టయోటా భావిస్తోంది. -
మెర్సిడెస్ బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..సింగిల్ ఛార్జ్తో 550 కిలోమీటర్లు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4మేటిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని భారత్లో విడుదల చేసింది. ధర ఎక్స్షోరూంలో రూ.1.39 కోట్లు. బ్యాటరీపై 10 ఏళ్లు లేదా 2,50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉంది. 90.56 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 465–550 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. పొడవు 4,863 మిల్లీమీటర్లు ఉంది. సీమ్లెస్ గ్లాస్ కవర్తో 12.3 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, 17.7 అంగుళాల ఓలెడ్ సెంట్రల్ డిస్ప్లే, 12.3 అంగుళాల ఓలెడ్ ఫ్రంట్ ప్యాసింజర్ డిస్ప్లే ఏర్పాటు చేశారు.థర్మోట్రానిక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాక్టివ్ స్టీరింగ్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, ట్రాన్స్పరెంట్ బానెట్, 360 డిగ్రీల కెమెరా వంటి హంగులు ఉన్నాయి. కాగా, మెర్సిడెస్కు చెందిన చార్జింగ్ కేంద్రాల్లో ఇతర బ్రాండ్ల కార్లకు సైతం చార్జింగ్ సదుపాయం కల్పిస్తారు. -
ఆగస్ట్లో ఆల్టైమ్ ‘రయ్’!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఆగస్టులో ఆల్టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు డిమాండ్ కొనసాగడం, పండుగ సీజన్ మొదలవడంతో గిరాకీ పుంజుకుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. మొత్తం 1,89,082 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెల అమ్మకాలు 1,65,173 యూనిట్లతో పోలిస్తే 14% అధికం. హ్యుందాయ్, ఎంఅండ్ఎం, టయోటా కిర్లోస్కర్ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ విక్రయాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ ఆటో విక్రయాలు 15% తగ్గాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 6%, 4% పెరిగాయి. వాణిజ్య వాహనాలు, ట్రాకర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. -
ట్రక్కును ఢీకొన్న ఎస్యూవీ
ససరాం(బిహార్): బిహార్లోని రొహతస్ జిల్లా ససరాం వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. ససరాం పట్టణంలోని శివసాగర్ వద్ద రెండో నంబర్ జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. కైముర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఎస్యూవీలో జార్ఖండ్లోని రాజ్రప్ప ఆలయానికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆ వాహనం నిలిపి ఉన్న ట్రక్కును వేగంగా ఢీకొంది. ఘటనలో రాజ్మాతాదేవి(55)తోపాటు ఆమె కూతురు, అల్లుడు, మనవడు(8), మనవరాలు(9)తోపాటు ఒక బాలిక (15), మహిళ(22) చనిపోయారు. -
ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే..
భోపాల్: కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన ఓ వ్యక్తికి వింతైన అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి వచ్చిన సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉంది. దీంతో ఆయన తన ట్రక్కును వినియోగించాల్సి వచ్చింది. అయితే.. ఇంత మొత్తంలో సమాచారానికి ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆయనకు ఉచితంగా ఈ సమచారాన్ని అధికారులు అందించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి రాష్ట్రంలో కొవిడ్ సంబంధించిన మెడికల్ టెండర్లు, బిల్ పేమెంట్ల గురించి సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఇందుకు ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎమ్హెచ్ఓ)కు తన అభ్యర్థనను సమర్పించారు. ఈ సమాచారాన్ని నిర్ణీత గడువు ఒక నెలలో సమర్పించలేకపోయారు అధికారులు. దీంతో ధర్మేంద్ర ఉన్నత అధికారులను సంప్రదించారు. ధర్మేంద్ర అభ్యర్థనను పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఆయనకు ఉచితంగానే ఆ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉండటంతో ఆయన తన ట్రక్కును తీసుకుని వెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు తప్పా మిగిలిన భాగమంత పేపర్లతోనే నింపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. పేపరు సమాచారానికి రూ.2 చెల్లించాల్సి ఉండగా.. ఉచితంగానే లభించిందని చెప్పారు. అటు.. ఖజానాకు రూ.80 వేల నష్టాన్ని కలిగించిన అధికాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదీ చదవండి: పాకిస్థాన్కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత.. -
పీవీ విక్రయాలు స్వల్పంగా పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ విక్రయాలు జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.2 శాతం పెరిగాయి. ఎంట్రీ లెవెల్ ఎస్యూవీలకు డిమాండ్ ఈ పెరుగుదలకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. కస్టమర్లు ఎస్యూవీలకు మళ్లడంతో హ్యాచ్బ్యాక్స్ విక్రయాలు తగ్గాయని వెల్లడించింది. 2023 జనవరి–జూన్లో పీవీల అమ్మకాలు తొలిసారిగా అత్యధికంగా 20 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్నాయి. సియామ్ గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో తయారీ కంపెనీల నుంచి డీలర్íÙప్లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 1.7 శాతం అధికమై 13.30 లక్షల యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 53,019 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విక్రయాల పరంగా ఎటువంటి ఆందోళన లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం కలిసి వచ్చే అంశం అని అన్నారు. రానున్న రోజుల్లో పీవీ విభాగం సానుకూలంగా ఉంటుందని చెప్పారు. -
కొత్త కారు కొనేవారికే కష్టమే! జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో..
సాధారణంగా ఎప్పటికప్పుడు వాహన తయారీ సంస్థలు తన ఉత్పత్తుల ధరలను పెంచుతూనే ఉంటాయి. ముడిసరుకుల ధరల కారణంగా.. ఇతరత్రా కారణాలు చూపిస్తూ ఏడాదికి కనీసం ఒక్క సారైనా పెంచుతుందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు పెరిగినట్లు స్పష్టంగా తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మంగళవారం జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త కారు కొనాలనుకునే వారికి జీఎస్టీ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల మీద జీఎస్టీ సెస్ పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కావున ఇప్పుడు కొత్త ఎమ్యూవీ కార్లను కొనుగోలు చేసేవారు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. 28 శాతం జీఎస్టీ ఉండగా.. దీనిపైన 22 శాతం సెస్ విధించారు. దీంతో వాహన ధరలకు రెక్కలొచ్చాయి. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) ఎస్యూవీ అంటే పొడవు 4 మీటర్ల కంటే ఎక్కువ ఉండటమే కాకుండా.. ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీ కంటే ఎక్కువ ఉండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 మీమీ కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఉన్న కార్లు మాత్రమే ధరల పెరుగుదల అందుకుంటాయని తెలుస్తోంది. గతంలో సెస్ అనేది 20 శాతంగా ఉండేది. ఇది తాజాగా రెండు శాతం పెరిగి సెస్ 22 శాతానికి చేరింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
లఢక్ పర్యటకుని నిర్లక్ష్యం.. సోయగాల ఒడిలో కమ్ముకున్న దుమ్ము మేఘాలు..
లఢక్: భూతల స్వర్గం కశ్మీర్.. అక్కడి లఢక్ పీఠభూమి అందాలు ఎంత చూసిన తనివితీరనివి. అలాంటి ప్రాంతాలను పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగా మురికిగా మారుతున్నాయి. లఢక్ను పరిరక్షించుకోవాలని భావించి ఈ ప్రాంతాన్ని రామ్సర్ సైట్లో కూడా చేర్చారు. అయినప్పటికీ ఇటీవల ఓ యాత్రికుడు చేసిన పని చూస్తే చివాట్లు పెట్టకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన దృశ్యాలను అటవీ అధికారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రామ్సైట్ అయినటువంటి త్సో కర్, త్సో మోరిరి సరస్సుల ప్రాంగణం ప్రశాంతతకు పెట్టింది పేరు. వలస పక్షుల కిలకిలరావాలతో అలరారుతుంది. అలాంటి ప్రాంతంలో ఓ యాత్రికుడు ఎస్యూవీతో భీబత్సం సృష్టించాడు. వేగంగా చక్కర్లు కొడుతూ ఆ ప్రాంతాన్ని దుమ్ము మయం చేశాడు. ఎస్యూవీ టైర్ల నుంచి లేచే దమ్ము దృశ్యాలు అక్కడి మేఘాలను తలపిస్తున్నాయి. ఈ వీడియోను మోఫుసిల్_మెడిక్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్తా తెగ వైరల్ అయింది. Shared by a fellow birder from #Ladakh... this stupidity is getting out of hand. This seemingly "barren" landscape is teeming with #life- and the short summer is when that life is at its peak. That too at a Ramsar Site! These idiots need to be named, shamed and booked!… pic.twitter.com/wRpYkkYf6p — Mofussil_Medic (@Daak_Saab) July 9, 2023 ఈ వీడియోపై నెటిజన్లు ఫైరయ్యారు. పర్యటకుని నిర్లక్ష్యానికి తగిన బుద్ది చెప్పాలను సూచించారు. మూర్ఖత్వం తారాస్థాయికి చేరింది.. ఇలాంటి పర్యటకులను ఆ ప్రాంతంలోకి అనుమతించకూడదని మరో యూజర్ అన్నాడు. భూటాన్ లాగే లఢక్లో పర్యటకులకు భారీ ట్యాక్స్లను విధించాలని, ఇలాంటి ఘటనలపై భారీ జరిమానాలు వసూలు చేయాలని మరో వ్యక్తి కామెంట్ బాక్స్లో రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. 2024 జనవరి నుంచి రామ్లాలా దర్శనభాగ్యం! -
ఆడి క్యూ8 ఈ–ట్రాన్ వస్తోంది
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ ఆడి భారత మార్కెట్లో క్యూ8 ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని 2023 ఆగస్ట్లో ఆవిష్కరిస్తోంది. ఎస్యూవీ, స్పోర్ట్బ్యాక్ రకాల్లో విడుదల చేయనుంది. 114 కిలోవాట్ బ్యాటరీ పొందుపరిచారు. పూర్తిగా తయారైన కారును భారత్కు దిగుమతి చేసుకుంటారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా ఈ–ట్రాన్ 50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్బ్యాక్ 55, ఈ–ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడళ్లను విక్రయిస్తోంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న మోడళ్లను ఇక్కడి మార్కెట్కు తీసుకువస్తామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘2033 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కంపెనీగా మారాలన్నదే సంస్థ లక్ష్యం. మరిన్ని ఈవీలు ప్రవేశపెడతాం. భారత్లో ఈ కార్లు రూ.1.5 కోట్ల సగటు ధరకు అమ్ముడవుతున్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో ఆడి ఈవీలు ఆదరణ పొందుతున్నాయి’ అని వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి ఆడి ఇండియా 2023 జనవరి–జూన్లో 3,474 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 97% ఎక్కువ. -
మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన మోస్ట్ ప్రీమియం కారు వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్స్తో మల్టీ-పర్పస్ వెహికల్ ఇన్విక్టోను లాంచ్ చేసింది. ధరలు రూ. 24.79 లక్షల నుండి ప్రారంభం. మారుతి ఇన్విక్టో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ను హైబ్రిడ్ మోటార్తో జత చేసింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్లను పొందిన తొలి మారుతీ కారు ఇన్విక్టో అని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన కారుగా భావిస్తున్న ఇన్విక్టో ప్రాథమికంగా గత సంవత్సరం విడుదల చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్పివికి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. 2016లో ప్రారంభమై 2019లో లాంఛన ప్రాయమైన మారుతి , టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం తర్వాత ఇది సెకండ్ ప్రొడక్షన్. Zeta+ (7 సీటర్), Zeta+ (8 సీటర్) , Aplha+ (7 సీటర్)అనే మూడు వేరియంట్లలో వీటి ధర రూ. 24.79 లక్షల మొదలై టాప్ వేరియంట్ రూ. 28.42 లక్షల వరకు ఉంటుంది. మిడ్ వేరియంట్ ధర రూ. 24.84 లక్షలు. ఇది నెక్సా బ్లూ , మిస్టిక్ వైట్తో సహా నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది నెక్సా లైనప్లో ఎనిమిదోది . 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్ 172బిహెచ్పి పవర్, 188ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇన్నోవా హైక్రాస్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయింది. హైక్రాస్తో పోలిస్తే, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, సెకండ్ రో ఒట్టోమన్ సీట్లు తప్ప దాదాపు మిగిలిన ఫీచర్లున్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కోసం మెమరీ సెట్టింగ్స్, 10.1-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్రూఫ్, 7-అంగుళాల TFT MIDతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ఆరుఎయిర్ బాగ్స్, లెదర్ అప్హోల్స్టరీతో కూడా వస్తుంది. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బాందా: విద్యుదాఘాతానికి గురైన ఒక బాలు డిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వేగంగా వెళ్తు న్న వాహనం ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బాందాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. టిలౌసా గ్రామానికి చెందిన కల్లు(13) అనే బాలుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతడిని తీసుకుని దగ్గర్లోని బబెరు ఆరోగ్య కేంద్రానికి ఎస్యూవీలో బయలుదేరారు. వారి వాహనం అదుపుతప్పి కమాసిన్ రోడ్డులో నిలిపిఉన్న ట్రక్కును వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ఘటనలో కల్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో వారి వాహనం గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుతోందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు. -
సింగిల్ ఛార్జ్కి 501 కిలోమీటర్ల రేంజ్: కియా కొత్త ఎలక్ట్రిక్ కార్
దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా కొత్త ఎలక్ట్రిక్ కార్ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా ఆల్-ఎలక్ట్రిక్ ఈవీ9 ఫ్లాగ్షిప్ ఎస్యూవీని విడుదల చేయనున్నట్లు తాజాగా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఈవీ6 ఎస్యూవీని 2021లో విడుదల చేసిన కియా కంపెనీకి ఇది రెండో ఎలక్ట్రిక్ కార్. మూడు వరుసల సీటర్ అయిన ఈ ఎస్యూవీ 99.8 కిలోవాట్-హవర్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్తో 501 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ మోడల్ కూడా అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియాలో సోమవారం (జూన్ 19) విడుదల కానున్న ఈవీ9 ఎస్యూవీ ధర 73 నుంచి 82 మిలియన్ వాన్లు ( రూ. 46.8 లక్షలు నుంచి రూ.52.5 లక్షలు) ఉంటుంది. తర్వాత విడతలో ఈ ఎస్యూవీని యూరప్, యునైటెడ్ స్టేట్, ఇతర మార్కెట్లలో విడుదల చేయాలని కియా కంపెనీ యోచిస్తోందని యాన్హాప్ అనే కొరియన్ వార్తా సంస్థ నివేదించింది. The future of driving isn’t just a technological jump forward. It will incorporate the humanity and user experience of passengers to help people move in a better way. Learn more: https://t.co/mRhnWQ1OEz#KiaEV9 #Kia pic.twitter.com/dHaRcrrxLY — Kia Worldwide (@Kia_Worldwide) June 16, 2023 -
ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో
ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఖరీదైన కారును పోగొట్టుకున్న వైనం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గుజరాతీ గాయకుడు ,సంగీత దర్శకుడు, బిన్నీ శర్మ రూ. 40 లక్షల విలువైన ఎప్యూవీని పోగొట్టకుని లబోదిబోమంటున్నాడు. ఈ మేరకు తనకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ అవుతోంది. (అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు) తన పాటలు, వాయిస్తో గాయకుడిగా పాపులర్ అయిన బిన్నీ గూగుల్లో సెర్చ్ చేసి ఫేక్ పోర్ట్ల్ ద్వారా మోసానికి గురయ్యాడు. తాను సాధారణంగా సహాయం కోసం అడగను, కానీ మోసగాడు చేసిన స్కామ్కు బలైపోయా.. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను సాయం చేయాలంటూ ఇన్స్టా వేదికగా కోరుతున్నాడు. అలాగే మూవ్ మై కార్, జస్ట్ డయల్, గూగుల్ యాడ్స్ తో జాగ్రత్తగా ఉండాలి, మోస పోవద్దంటూ పిలుపునివ్వడం గమనార్హం. రూ.40 లక్షలు విలువ చేసే తన ఎస్యూవీని హిమాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ కు తరలించాలంటూ శర్మ మూవ్ మై కార్ అనే పోర్టల్ లో వెండర్ను సంప్రదించాడు. ఈ మేరకు సదరు వెండర్కు చెందిన ట్రక్ శర్మ కారును తీసుకెళ్లింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. తీసుకెళ్లి కారును మాత్రం గమ్యస్థానానికి చేర్చలేదు. పైగా ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన సొమ్ముకాకుండా అధికంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గమనించిన బిన్నీ పోలీసులను ఆశ్రయించాడు. అగర్వాల్ ఎక్స్ ప్రెస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, మూవ్ మై కార్ పోర్టల్పై కూడా సైబర్ పోలీసులు కన్జ్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేశానని బిన్నీ తెలిపారు. అటు పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. (ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం) కాగా రేడియో జాకీగా తొలినాళ్ల నుంచి 'మై వరల్డ్' అనే షోను హోస్ట్ చేస్తూ సునిధి చౌహాన్, శంకర్ ఎహసాన్ లాయ్, అర్జిత్ సింగ్ వంటి పాపులర్ సింగర్స్తో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, తన టాలెంట్తో అనేక మంది ఫ్యాన్స్ని, ఫాలోయర్స్ని సంపాదించకున్నాడు బిన్నీ శర్మ. -
మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు వచ్చేసింది. భారత్లో రూ. 12.7 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అడుగుపెట్టింది. ఈ ఎస్యూవీ జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన ఆల్ఫా వేరియంట్లో టాప్ ధర రూ. 15.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్యూవీని భారత్లో నెక్సా షోరూమ్ల ద్వారా కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. కొత్త జిమ్నీ 103 హార్స్పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. కస్టమర్లు తమకు కావాల్సిన విధంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్యూవీకి పోటీగా మహీంద్రా 5-డోర్ థార్ను రంగంలోకి దించుతోన్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో దీన్ని పరిచయం చేసింది.మారుతి సుజుకి కొత్త జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్లు సాధించింది. ఇప్పటి వరకు జిమ్నీ 3-డోర్ వెర్షన్ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.2 మిలియన్ యూనిట్ల జిమ్నీని విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త 5-డోర్ వెర్షన్తో మారుతి సుజుకి భారతీయ ఎస్యూవీ మార్కెట్లో అగ్రస్థానాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చవకైన 4X4 కారు మారుతి సుజుకి జిమ్నీ భారత్లో చవకైన 4X4 కారుగా అవతరించింది. లుక్స్ పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్.. 3-డోర్ జిమ్నీని పోలి ఉంటుంది. రౌండ్ హెడ్ల్యాంప్లు, బ్లాక్ అవుట్ గ్రిల్స్ దానిలాగే ఉంటాయి. కారు వెనుక భాగం కూడా అలాగే ఉంటుంది. పొడవైన వీల్బేస్ కారణంగా రెండు వైపులా గుర్తించదగిన మార్పు కన్పిస్తుంది. క్యాబిన్ విషయానికి వస్తే ఇందులో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, USB-C పోర్ట్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్లో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఈఎస్పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణికులకు మూడు పాయింట్ సీట్బెల్ట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇదీ చదవండి: హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్యూవీలు -
హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్యూవీలు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా.. భారత మార్కెట్లో 2030 నాటికి అయిదు కొత్త ఎస్యూవీలను పరిచయం చేయనుంది. వీటిలో ఎలివేట్ ఎలక్ట్రిక్ మోడల్ సైతం ఉందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయా సుమురా తెలిపారు. మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఎలివేట్ సాయంతో కంపెనీ తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిటీ, అమేజ్ సెడాన్లను భారత్లో విక్రయిస్తున్నాం. మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో సెడాన్ల వాటా 10 శాతమే. ఈ విభాగంలోనే కంపెనీ పోటీపడుతోంది. అలాగే ఈ మోడళ్లు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాయి. ఎలివేట్ను తొలిసారిగా భారత్లో ప్రవేశపెట్టాం. రానున్న రోజుల్లో ఈ మోడల్ ప్రధాన ఉత్పాదనగా ఉంటుంది. కొత్తగా వచ్చే మోడళ్లు ప్రీమియం సెగ్మెంట్లో పోటీ పడతాయి. ఎలివేట్ ఎగుమతి కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దుతాం. ఇక 2022–23లో 1.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశాం. 2024–25లో దీనిని 1.7 లక్షల యూనిట్లకు చేరుస్తాం’ అని వివరించారు. 2040 నాటికి బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ వాహనాలను మాత్రమే విక్రయిస్తామని హోండా మోటార్ కో ఆసియా హెడ్ తోషియో కువహర తెలిపారు. -
మహీంద్రా థార్ లాంచ్పై కీలక అప్డేట్
మహీంద్రా థార్ (5-డోర్) దేశంలో అత్యంత ఎదురుచూస్తున్న ఎస్యూవీ(SUV)లలో ఒకటి. ఇప్పటి వరకు ఈ ఏడాది ఆగస్టు 15న ఈ ఎస్యూవీ లాంచ్ అవుతుందని పుకారు ఉండేది. అయితే థార్ 5-డోర్ లాంచ్ ఎప్పుడనేది కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాహన ప్రియులను మరింత నిరీక్షణలోకి నెట్టేసింది. మహీంద్రా థార్ 5-డోర్ 2024లో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ సంవత్సరం కంపెనీకి సంబంధించిన కొత్త ఉత్పత్తులేవీ లేవని మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటో & ఫార్మ్ సెక్టార్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో రాజేష్ జెజురికర్ తెలిపారు. ఇప్పటికే 50,000లకుపైగా బుకింగ్లు 5-డోర్ థార్కు చాలా డిమాండ్ ఉందని, ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ బుకింగ్లు వచ్చాయని జెజురికర్ పేర్కొన్నారు. కస్టమర్ల నిరీక్షణకు తెర దించుతూ 2024 సంవత్సరంలో 5-డోర్ థార్ను లాంచ్ చేయనున్నట్లు వివరించారు.పెంచాలి మరియు ఇప్పుడు మేము 2024లో వచ్చే థార్ 5-డోర్లను చూస్తున్నాము”, జోడించారు. మహీంద్రా థార్కు దేశంలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ ఎస్యూవీ డెలివరీ పొందాలంటే కస్టమర్లు మరికొంత కాలం వేచి ఉండాలి. కాగా మహీంద్రా ఈ సంవత్సరం ప్రారంభంలో థార్లో RWD 4X2 వెర్షన్ను కూడా ప్రారంభించింది. ఇక మహీంద్రా థార్ 5-డోర్ డిజైన్, ఇతర ప్రత్యేకతల విషయానికి వస్తే పొడవైన స్తంభాలతో బాక్స్ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. వాహనం ముందు, వెనుక భాగాలు ప్రస్తుత థార్ మాదిరిగానే ఉంటాయని తెలిసింది. అయితే కొత్త 5-డోర్ థార్లో పొడవైన డోర్లు, వీల్బేస్తో మరింత విశాలమైన క్యాబిన్ ఉంటుంది. సరికొత్త అల్లాయ్ వీల్స్, హుడ్ కింద 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉంటాయని వెల్లడైంది. ఇదీ చదవండి: మెర్సిడెస్ కొత్త వర్షన్స్ భారత్కు వచ్చేశాయ్! ధరలు ఇవే.. -
జిమ్నీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. లాంచింగ్ మే నెలలో కాదు!
మారుతి సుజుకి జిమ్నీ ప్రియులకు నిరాశ తప్పేటట్లు కనిపించడం లేదు. మహీంద్రా థార్ కు పోటీగా వస్తున్న మారుతి సుజుకి జిమ్నీ కోసం కొనుగోలుదారులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే జిమ్నీ భారత్ లో మే నెలలో విడుదల కావడం లేదని తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో అరంగేట్రం చేసింది. ఈ SUV మే నెలలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావించారు. అయితే తాజా నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి జిమ్నీ లాంచ్ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 24,500 పైగా బుకింగ్లు దేశంలో జిమ్నీ కోసం ఇప్పటి వరకు 24,500 కుపైగా బుకింగ్లు వచ్చాయి. జూన్ మొదటి వారంలో లాంచ్ అయిన వెంటనే డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 5-డోర్ల జిమ్నీ కంపెనీ.. మారుతి సుజుకి గుర్గావ్ ప్లాంట్లో తయారవుతోంది. ఆటోమొబైల్ సమాచార సంస్థ కార్టాక్ ప్రకారం, దేశీయ, విదేశీ డిమాండ్కు అనుగుణంగా ప్రతి నెలా 7,000 యూనిట్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో ఆల్ఫా ట్రిమ్ వేరియంట్ను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. జిమ్నీ రంగుల విషయానికి వస్తే కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లూయిష్ బ్లాక్ కలర్లను చాలా మంది ఇష్టపడుతున్నారు. రూ. 10 లక్షల నుంచి ప్రారంభం లీక్ అయిన డీలర్ ఇన్వాయిస్ ప్రకారం.. భారత్ లో మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ భారత్ లో నెక్సా షోరూమ్ల ద్వారా బుకింగ్లకు అందుబాటులో ఉంది. రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
‘ఎలివేట్’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా
జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా భారత్లో ఎస్యూవీ మార్కెట్ విభాగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మిడ్ రేంజ్ ఎస్యూవీ వాహనాలైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటార’ తరహాలో మిడ్ సైజ్ ఎస్యూవీ కార్ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల జూన్ 6న ‘ఎలివేట్’ పేరుతో ఎస్యూవీని విడుదల చేయనున్నట్లు హోండా అధికారికంగా ప్రకటించింది. హోండా ఎలివేట్ ఇంజన్ ఉందంటే ఎలివేట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లో మార్కెట్కు పరిచయం కానుంది. ఇందులో ట్రాన్స్మిషన్ ఆప్షన్తో పాటు మ్యాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. సీవీటీ గేర్ బాక్స్లు ఉన్నాయి. కార్ సౌకర్యంగా ఉండేలా అప్రైట్ స్టాన్స్, డ్రైవింగ్ సమయంలో కాంతివంతంగా ఉండేలా స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ప్రయాణ సమయంలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి వాహనంలోని ప్రయాణికుల్ని సంరక్షించేలా మెటల్ బార్స్ గ్రిల్స్తో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి. దేశీయ కంపెనీలతో పోటీపడలేక భారత్లో ఎస్యూవీలకు మంచి గిరాకీ నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎస్యూవీల వాటా 47 శాతం. కానీ 2020లో ఎస్యూవీ మార్కెట్ వ్యాల్యూ 28 శాతంగా ఉంది. కోవిడ్-19తో ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. హ్యుందయ్, దేశీయ వాహన తయారీ సంస్థలైన టాటా మోటార్స్, మారుతి సుజికిల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ వరుస విపత్కర పరిణామాలతో హోండా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ నోయిడాలో తయారీ ప్లాంటును రాజస్థాన్కు తరలించింది. దీంతో పాటు సివిక్ సెడాన్, సీఆర్- వీ ఎస్యూవీ తయారీని నిలిపింది. 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ మరుసటి ఏడాది అంటే 2021లో భారత్లో కొత్త ఎస్యూవీ కారును విడుదల చేయాలని హోండా గట్టి ప్రయత్నాలే చేసింది. 7 సీట్ల ఎస్యూవీ కోసం ‘ఎలివేట్’ పేరుతో ట్రేడ్ మార్క్ను రిజిస్టర్ చేసింది. కానీ ఆ కార్ ఎలా ఉండబోతుంది. ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై స్పష్టం చేయలేదు. తిరిగి మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎలివేట్ ఎస్యూవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది .కాగా, హోండా కార్స్ ఇండియా ప్రస్తుతం భారత్లో సిటీ , అమేజ్ అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. చదవండి👉 చాట్జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
భారత్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ కారు - ఇదే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఈ ఏడాది భారత్లో విడుదల చేయనున్న చిన్న ఎస్యూవీకి ఎక్స్టర్గా నామకరణం చేసింది. ఈ మేరకు టీజర్ను విడుదల చేసింది. జూలైలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆగస్ట్ నుంచి మార్కెట్లో అడుగు పెట్టనుందని సమాచారం. దక్షిణ కొరియాతోపాటు పలు దేశాల్లో అమ్ముడవుతున్న ఏఐ3 (క్యాస్పర్) మోడల్కు స్వల్ప మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఈ వాహనం భారత్ కోసం తయారు చేస్తున్నారు. భవిష్యత్లో పొరుగున ఉన్న దేశాలకూ ఎగుమతి చేస్తారు. గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్ఫామ్పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. 1.0 లీటర్ టీ–జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో తయారు కానుంది. -
భారత్లో విడుదలైన ఇటాలియన్ సూపర్ కారు - ధర అక్షరాలా..
Lamborghini Urus S: ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని 2022లో 'ఉరుస్ ఎస్' (Urus S) SUV గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన తరువాత ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి అంతకంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. ధర: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ ఎస్యువి ధర రూ. 4.18 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది ఉరుస్ పెర్ఫార్మంటే కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఇది ఉరుస్ లైనప్లో ఉన్న రెండవ మోడల్. డిజైన్ & ఫీచర్స్: లంబోర్ఘిని ఉరుస్ ఎస్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇది కొత్త బంపర్, కూలింగ్ వెంట్స్తో కూడిన కొత్త బానెట్తో కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందుతుంది. కానీ బయట కనిపించే కార్బన్-ఫైబర్ బానెట్, కార్బన్-ఫైబర్ రూఫ్ మాత్రం పెర్ఫార్మంటే మోడల్ని గుర్తుకు తెస్తుంది. ఫీచర్స్: కొత్త ఉరుస్ ఎస్ లోపలి భాగంలో ఉరుస్ ఎస్ ఉరుస్ పెర్ఫార్మంటే మాదిరిగానే అదే డిజైన్ కలిగి ఉన్నప్పటికీ కొంత విభిన్నమైన మెటీరియల్ చూడవచ్చు. పెర్ఫార్మంటే బ్లాక్ ఆల్కాంటారా ఇంటీరియర్ను స్టాండర్డ్గా కలిగి చోట ఉరుస్ ఎస్లోని ఇంటీరియర్ లెదర్ను స్టాండర్డ్గా పొందుతుంది. (ఇదీ చదవండి: ChatGPT: మీరు చేసే ఈ ఒక్క పని మిమ్మల్ని లక్షాధికారుల్ని చేస్తుంది.. డోంట్ మిస్!) ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ సూపర్ SUV 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్ పొందుతుంది. ఇది 666 హెచ్పి పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ సూపర్ కారు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ చేస్తుంది. ఉరుస్ ఎస్కి శక్తినివ్వడం ఉరుస్ పెర్ఫార్మంటే వలె అదే 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8, 666hp మరియు 850Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఉరుస్ పెర్ఫార్మంటే క్లెయిమ్ చేయబడిన 3.3 సెకన్లలో గంటకు 0-100కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు, ఉరుస్ ఎస్ దానిని 3.5 సెకన్లలో (క్లెయిమ్ చేయబడింది) నిర్వహిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు పంపబడుతుంది. (ఇదీ చదవండి: బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ) ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ జర్మన్ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్, ఆడి RSQ8, ఆస్టన్ మార్టిన్ DBX 707, పోర్స్చే కయెన్ టర్బో జిటి, మసెరటి లెవాంటే ట్రోఫియో వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్.. వట్టి చేతుల్తో కారును పక్కకు జరిపేశాడు..
మహా నగరాల్లో డ్రైవింగ్ చేయడమంటే కత్తి మీద సాములాంటిదే! రహదారులు, ఇరుకైన రోడ్లు ఇలా ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లే కనిపిస్తాయి. ఇక పార్కింగ్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో బైక్, కారు పార్కింగ్ చేసేందుకు స్థలమే దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ ఎలాగోలా పార్కింగ్ స్థలం దొరికినా.. కొంతమంది సరిగా తమ వాహనాలను పార్క్ చేయరు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తుతోంది. తాజాగా కారు పార్కింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారును ఓ వ్యక్తి తన రెండు చేతులతో అమాంతం ఎత్తి పక్కకు జరిపాడు. అసలేం జరిగిందంటే.. ఇరుకుగా ఉన్న రోడ్డు మీద వరుసగా కొన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో మారుతీ సుజుకీ వ్యాగనార్ కారును ఎవరో అడ్డదిడ్డంగా పార్క్ చేశారు. దీంతో అటుగా వెళుతున్న వాహనాలకు ఇబ్బంది ఎదురైంది. కారును దాటుకుంటూ వెళ్లడం కష్టంగా మారింది. దీనిని ఎస్యూవీ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగి తప్పుగా పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లాడు.. ఎవరి సాయం లేకుండానే దాదాపు 850 కిలోల బరువున్న కారును కేవలం తన రెండు చేతులతో ఎత్తి పక్కకు జరిపాడు. దీనిని మల్టీవీల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేయడంతో వైరలవుతోంది. View this post on Instagram A post shared by MULTI WHEELS (@multiwheelss) -
న్యూగ్రాండ్ విటారా ఎక్స్పీరియన్స్ డ్రైవ్: థ్రిల్ అయిన కస్టమర్లు
హైదరాబాద్: దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన ఎస్యూవీ ఆల్ న్యూ గ్రాండ్ విటారాతో ‘‘ఎక్స్పీరియన్స్ డ్రైవ్’’ను నిర్వహించింది. సుమారు 300 మందికి పైగా కస్టమర్లు ర్యాలీలో పాల్గొని ఆల్ న్యూ గ్రాండ్ విటారా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ డ్రైవ్లో వినియోగదారులు గ్రాండ్ విటారా అద్భుతమైన అనుభవం, సామర్థ్యాలతో పులకించి పోయారనీ, ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ నెక్సా డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సుజుకీ పేటెంట్ కలిగి ఆల్గ్రిప్ సెలెక్ట్ ట్రిమ్ ధర రూ.16.89 లక్షలు ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ డ్రైవ్ ద్వారా గ్రాండ్ విటారాకు సుమారు 100 బుకింగ్లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఈ వేరియంట్ లీటరుకు 19.38 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. -
ఎస్యూవీలతో పర్యావరణ ముప్పు
బెర్లిన్: పెద్ద కార్లతో పర్యావరణానికి సమస్య పెరుగుతోంది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం’ అని ప్యారిస్కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఎస్యూవీ సగటు సైజు తగ్గించడం, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలు పెంచడం, వినూత్న బ్యాటరీ సాంకేతికతల్లో పెట్టుబడులు ఇందుకు పరిష్కారమని స్పష్టం చేసింది. ‘2022లో ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) 100 కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వెదజల్లాయి. ఇది జర్మనీ వంటి పారిశ్రామిక దేశ వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువ. పెద్ద కార్ల వైపు మార్కెట్ మళ్లడం, తక్కువ ఇంధన సామర్థ్యం గల సంప్రదాయ వాహనాలతో చమురు డిమాండ్తోపాటు కర్బన ఉద్గారాలు అధికం అవుతాయి. ఎస్యూవీలు మినహా సంప్రదాయ కార్లు వినియోగించిన చమురు 2021, 2022లో దాదాపు సమానం. ఎస్యూవీల విషయంలో చమురు వాడకం రోజుకు 5 లక్షల బ్యారెల్స్ దూసుకెళ్లింది. 2022 అమ్మకాల్లో చిన్న కార్లు 10 లక్షల యూనిట్లు, ఎస్యూవీలు 10 లక్షల యూనిట్లు తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు రెండింతలై 1 కోటి యూనిట్లకు చేరాయి. గతేడాది ఎలక్ట్రిక్ నాన్–ఎస్యూవీలు 53 లక్షల యూనిట్లు అమ్ముడైతే, ఎలక్ట్రిక్ ఎస్యూవీలు 55 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. పెరుగుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్తో బ్యాటరీ సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడి ఉంటుంది. బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన క్లిష్ట ఖనిజాల కోసం డిమాండ్ను మరింత పెంచుతుంది’ అని ఏజెన్సీ వివరించింది. -
ఎస్యూవీలపై మారుతీ సుజుకీ గురి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంపై దృష్టిసారించింది. ఈ సెగ్మెంట్లో 2023–24లో 33 శాతం వాటా చేజిక్కించుకోవడం ద్వారా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బ్రెజ్జా, గ్రాండ్ వితారా ఎస్యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. మార్చి నుంచి జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్లు రోడ్డెక్కనున్నాయి. జిమ్నీ ఇప్పటికే 17,500 యూనిట్లు, ఫ్రాంక్స్ 8,500 యూనిట్ల బుకింగ్స్ను కైవసం చేసుకోవడం విశేషం. భారత ప్యాసింజర్ వాహన రంగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వాటా 42.5 శాతం ఉంది. 2022–23లో ఇది 45 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ విభాగంలో మారుతీ సుజుకీ వాటా 11.5 శాతం. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో సంస్థకు ఏకంగా 45 శాతం వాటా ఉంది. దీనిని 50 శాతానికి పెంచుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 2023 జనవరిలో ఎస్యూవీల విపణిలో మారుతీ సుజుకీ 15 శాతం వాటా దక్కించుకుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ విభాగంలో 2021–22లో టాటా మోటార్స్కు 18 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రాకు 15 శాతం వాటా ఉన్నట్టు సమాచారం. -
తగ్గని డిమాండ్! హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతి జిమ్నీ
2023 ఆటో ఎక్స్పోలో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచిన 5-డోర్స్ 'మారుతి సుజుకి జిమ్నీ' ప్రారంభం నుంచి భారత్లో మంచి బుకింగ్స్ పొందుతోంది. ఇప్పటికి ఈ ఆఫ్-రోడర్ 16,500 కంటే ఎక్కువ బుకింగ్స్ కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ప్రతి రోజూ 700 మందికంటే ఎక్కువ కస్టమర్లు ఈ ఎస్యువీ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా తన 5 డోర్స్ జిమ్ని ఆవిష్కరించిన రోజు నుంచి రూ. 11,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన రెండు రోజులకే 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన జిమ్ని బుకింగ్ ప్రైస్ రూ. 25,000 కు పెరిగింది. బుకింగ్ ప్రైస్ పెరిగినప్పటికీ బుక్ చేసుకునే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్లోని K15B పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్పి పవర్, 135 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్లో లభిస్తుంది. సుజుకి యొక్క లెజెండరీ ఆల్ గ్రిప్ ప్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కొత్త మారుతి జిమ్నీ కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. ఈ ఎస్యువీ లాడెర్ ఫ్రేమ్ ఛాసిస్ కలిగి ఉండటం వల్ల నాలుగు మూలల్లో కాయిల్ స్ప్రింగ్లతో 3-లింక్ రిజిడ్ యాక్సిల్ టైప్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఆఫ్ రోడర్ బాద్షా జిమ్నీ డిజైన్, ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేసే 9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ పొందుతుంది -
మారుతి జిమ్నీ హవా మామూలుగా లేదుగా, 2 రోజుల్లోనే
సాక్షి, ముంబై: ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి ఆవిష్కరించిన లైఫ్స్టైల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ జిమ్నీ బుకింగ్స్లో దూసుకుపోతోంది. ఆవిష్కరించిన రెండు రోజుల్లోనే, 3వేల యూనిట్ల బుకింగ్లను పొందింది. రాబోయే రోజుల్లో జిమ్నీకి బలమైన ఆర్డర్లు వస్తాయని కంపెనీ భావిస్తోంది. దీంతో జిమ్నీ వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికే మూడు నెలల వరకు పెరిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి జిమ్నీని 5 డోర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజీన్తో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికి దీనిని వినియోగదారులకు అందించనుంది. ఈ జిమ్నీ ధర రూ. 10-12.5 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. -
భారత్కు స్కోడా ఎన్యాక్ ఐవీ
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న చెక్ కంపెనీ స్కోడా.. భారత మార్కెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎన్యాక్ ఐవీ మోడల్ను ప్రవేశపెట్టనుంది. పూర్తిగా తయారైన కారును దిగుమతి చేసుకుంటామని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెటర్ సాక్ తెలిపారు. అమ్మకాలు పెరిగిన తర్వాత దేశీయంగా తయారీ చేపడతామన్నారు. ‘కంపెనీకి టాప్–3 మార్కెట్లలో భారత్ ఒకటి. యూరప్ వెలుపల అతిపెద్ద మార్కెట్ కూడాను. మరిన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాలతోపాటు ఈవీలను సైతం భారత్కు పరిచ యం చేస్తాం. గతేడాది దేశంలో 57,721 యూ నిట్లు విక్రయించాం. 2021తో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి సాధించాం. 2023లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’ అని వివరించారు. -
డ్రైవర్కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గాంధీనగర్: గుజరాత్ నవసారీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఎస్యూవీ ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెస్మా గ్రామంలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. బస్సులోని ప్రయాణికులు సూరత్లో ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్లో పాల్గొని తిరిగివస్తున్నారు. టొయోటా ఫార్చునర్ డ్రైవర్కు గుండెపోటు వచ్చి వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. దీంతో ఎస్యూవీలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులోని 28 మందికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన 11 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎస్యూవీలో ప్రయాణించిన వారిని అంకలేశ్వర్కు చెందినవారిగా గుర్తించారు. వస్లాద్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి. రూ.2లక్షల పరిహారం.. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రూ.2లక్షలు పరిహారంగా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు సాయంగా అందించనున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాాలని ఆకాంక్షించారు. అమిత్షా దిగ్భ్రాంతి.. ఈ దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. క్షతగాత్రులకుు స్థానిక అధికారులు చికిత్స అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. చదవండి: షిర్డీకని వెళ్లి అనంతలోకాలకు.. పాపం గాయాలతో చిన్నారి -
కేంద్రం కీలక నిర్ణయం, వీటి ధరలు పెరగనున్నాయా?
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్నీ రాష్ట్రాల్లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్పై ఒకే విధమైన పన్ను విధించాలని భావిస్తోంది. ఈ కొత్త మార్గ దర్శకాలు అమల్లోకి వస్తే ఎస్యూవీ వెహికల్స్ ధరలు పెరగడంతో పాటు ఆ వెహికల్స్పై అధిక పన్ను కట్టాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో 15 అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా.. కేవలం 8 అంశాలపై చర్చలు జరిపి అసంపూర్ణంగా ముగించారు. అయితే ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్ధిక మంత్రి, కౌన్సిల్ సభ్యులు ఎంయూవీ, ఎస్యూవీగా పరిగణలోకి తీసుకోవాలంటే కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలు ఉండాలని సూచించారు. ఎస్యూవీ అంటే? వాటిలో ఎస్యూవీకి ఈ ప్రమాణాలు ఉంటేనే ఆ వెహికల్ను ఎస్యూవీగా నిర్ధారించాల్సి ఉంటుందని వెల్లడించారు. కార్ ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీకి మించి ఉండాలి.వాహనం పొడవు 4000 మిమీల కన్నా ఎక్కువ ఉండాలి.170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి. ఈ ప్రమాణాలు ఉంటేనే అవి ఎస్యూవీ వెహికల్స్ అని స్పష్టం చేసింది. ఈ వాహనాలపై 28శాతం జీఎస్టీ, 22శాతం సెస్తో మొత్తంగా 50శాతం పన్ను విధించాలని ఆదేశించింది. కాగా, ఆర్ధిక శాఖ వర్గాల సమాచారం మేరకు.. ఇతర వాహనాలపై అసెస్మెంట్ 22శాతం చెల్లించాలనే విషయంపై సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్స్ అథారిటీ (ఫిట్మెంట్ కమిటీ) సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ అంటే ఏమిటి? జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్ధం జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్కు అధ్యక్షత వహించేది ఎవరు? కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్కు అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కేంద్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. -
లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: జర్మన్కు చెందిన లగ్జరీకారు మేకర్ బీఎండబ్ల్యూ మరో హైబ్రిడ్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం పేరుతో ఫ్లాగ్షిప్ ఎస్యూవీని తీసుకొచ్చింది. భారతదేశంలో దీని ధరను రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. (ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి) బవేరియన్ కార్మేకర్ ఎం బ్రాండ్ నుంచి వచ్చిన రెండో లగ్జరీ కారుగాను, ఎం బ్యాడ్జ్తో వచ్చిన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఎక్స్ఎం ప్లగ్-ఇన్హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించింది. అమెరికాలోని స్పార్టాన్స్బర్గ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఇంజీన్, ఫీచర్లు ఇందులో అమర్చిన ట్విన్-టర్బోఛార్జ్డ్ 4.4లీటర్ పెట్రోల్ ఇంజీన్ 653బీహెచచ్పీ పవర్ను, 800ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ ఎస్యూవీ కేవలం 4.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. అలాగే EV మోడ్లో గంటకు 140 కిమీ వేగంతో 88 కిమీ వరకు దూసుకెళుతుందని కంపెనీ పేర్కొంది. ఈ మాసివ్ ఎస్యూవీలోని కిడ్నీ షేప్డ్ ఫ్రంట్ గ్రిల్ , LED స్పిట్ హెడ్లైట్లు, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంకా 23-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-టిప్ ఎగ్జాస్ట్ ద్వారా డిజైన్ను ఆకర్షణీయంగా మార్చింది.రియర్లో వర్టికల్లీ స్టాకెడ్ ఎక్సాస్ట్ ఔట్లెట్స్,అడాప్టివ్ ఎం సస్పెన్షన్, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ డ్యాంపర్స్, కొత్త 48వీ సిస్టెమ్ ఉన్నాయి. ఇక ఇంటీరియర్గా హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), 15,000 వాట్ బోవర్స్ అండ్ విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్, ఐడ్రైవ్ 8 సాప్ట్వేర్, ఏడీఏఎస్ టెక్, యాంబియంట్ లైటింగ్, 4 జోన్ ఆటోమెటిక్ కంట్రోల్ లాంటి ఇతర ఫీచర్లున్నాయి. దీంతోపాటు బీఎండబ్ల్యూ ఎక్స్ 7 ఫేస్ లిఫ్ట్, బీఎండబ్ల్యూ ఎం 340ఐ ఎక్స్ డ్రైవ్ని కూడా లాంచ్ చేసింది. తద్వారా దేశంలో తన ఉత్పత్తి శ్రేణిని మరింత విస్తరిస్తోంది. BMW M340i xDrive ధర రూ. 69.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. -
ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్...స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ ప్రైస్!
సాక్షి,ముంబై: లగ్జరీ కార్ మేకర్ ఆడి తన ఎస్యూవీలో కొత్త స్పెషల్ ఎడిషన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఆడి క్యూ5 ఎస్యూవీలో స్పెషల్ ఎడిషన్ను కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో మిర్రర్ హౌసింగ్ ,బ్లాక్లో ఆడి లోగోలు, బ్లాక్లో రూఫ్ రెయిల్, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కొత్త బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ లాంటి అదనపు ఫీచర్లను ఇందులో జోడించింది. అలాగే ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ కిట్తో 2022 ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో రూ. 67.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందిస్తోంది. (ట్విటర్కు సవాల్: టాప్-...0 ఆల్టర్నేటివ్స్ ఇవిగో!) అంతేకాదురెండు స్పెషల్ కలర్స్తో (డిస్ట్రిక్ట్ గ్రీన్, ఐబిస్ వైట్) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ను ప్రత్యేక ధరతో,పరిమితి కాలానికి అందిస్తోంది. ఆడి క్యూ5 కస్టమర్ల కోసం ప్రత్యేక ఎడిషన్ను పరిచయం చేయడం సంతోషంగా ఉందనీ, ఇది పరిమిత యూనిట్లలో అందుబాటులో ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (SuperMeteor 650: రాయల్ఎన్ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ ఇంజీన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ (45 TFSI), 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అందిస్తోంది. ఇది 249 hpపవర్ను, 370Nm టార్క్ను అందిస్తోంది. కేవలం 6.3 సెకన్లలో 0-100కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 237కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ డంపింగ్ కంట్రోల్తో అడాప్టివ్ సస్పెన్షన్ను అందిస్తుంది. కంఫర్ట్; డైనమిక్, ఇండివిడ్యువల్, ఆటో, ఎఫిషియెన్సీ,ఆఫ్-రోడ్ వంటి ఆరు డ్రైవ్ మోడ్స్లో ఇది లభ్యం. సింగిల్ గ్రిల్లే, వర్టికల్, స్ట్రట్స్, పనోరమిక్ గ్లాస్ సన్రూఫ్, సెన్సార్-నియంత్రిత బూట్ లిడ్ ఆపరేషన్ , LED హెడ్లైట్ ఇందులో ఉన్నాయి. బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ ప్లస్తో ఎక్స్టీరియర్ మిర్రర్ హౌసింగ్, బ్లాక్లో ఆడి లోగోలు, బ్లాక్లో రూఫ్ రెయిల్స్, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ క్యాబిన్లో ఖరీదైన లెదర్, లెథెరెట్ కాంబినేషన్ అప్హోల్స్టరీ, 8 ఎయిర్బ్యాగ్లు, పార్కింగ్ ఎయిడ్ ప్లస్తో పార్క్ అసిస్ట్, 3-జోన్ ఎయిర్ కండిషనింగ్, యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్ 30 రంగులతో తీర్చి దిద్దింది. 755 వాట్స్ అవుట్పుట్తో 3D సౌండ్ ఎఫెక్టస్తో 19 స్పీకర్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే సపోర్ట్తో 25.65 సెం.మీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే లాంటి ఇంటీరియర్ ఫీచర్లున్నాయి. ధరలు: ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ రూ.67,05,000 (ఎక్స్ షోరూమ్) ఆడి క్యూ5 ప్రీమియం ప్లస్ ధర రూ. 60,50,000 (ఎక్స్-షోరూమ్) ఆడి క్యూ5 టెక్నాలజీ రూ. 66,21,000 (ఎక్స్-షోరూమ్) -
Viral Video: గన్తో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లారు
-
Live Video: గన్తో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో దొంగలు రెచ్చిపోయారు. తెల్లవారుజామునే జాతీయ రహదారిపై తుపాకులతో బెదిరించి రు.30లక్షలకుపైగా విలువైన ఎస్యూవీ కారును ఎత్తుకెళ్లారు ముగ్గురు దుండగులు. అంతా చూస్తుండగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 5.19 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర్ప్రదేశ్లోని మీరట్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల రాహుల్ అనే వ్యక్తి తన ఎస్యూవీ ఫార్చునర్ కారులో ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో ఝరేరా గ్రామంలో జాతీయ రహదారి-8పై రోడ్డు పక్కన కారును నిలిపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు తుపాకీ చూపించి బెదిరించాడు. మిగిలిన ఇద్దరు సైతం తుపాకులతో హల్చల్ చేశారు. కారును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 397, 34 ప్రకారం ఢిల్లీ కంటోన్మెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: అగ్నితో చెలగాటమా? దెబ్బకు ముఖం కాలిపోయిందిగా..! -
అమానుషం: నన్నే ఆపుతారా అంటూ... కారుతో తొక్కించి....
ఇటీవల కాలంలో పలువురు వ్యక్తులు చిన్నవాటికే విసుగుపోయి చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడోక వ్యక్తి కూడా చిన్న గొడవకే ఆగ్రహంతో చాలా దారుణంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని అలీపూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... ఒక వ్యక్తి ఎస్యూవీ కారుతో ఒక ఇరుకైన గల్లీ గుండా వెళ్తున్నాడు. అక్కడే తన ముందు ఉన్న ఒక బైకర్తో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే చుట్టుపక్కల వాళ్లు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఐతే కారు డ్రైవర్ మాత్రం కోపంతో యాక్సిలరేటర్ నొక్కి ఒక్కసారిగా ప్రజలపైకి దూసుకుని పోనిచ్చి... ఇక ఆగకుండా అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు. దీంతో ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే సదరు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో వైరల్ అవుతోంది. (చదవండి: ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు) -
స్పోర్టీ డిజైన్తో స్కోడా ఎలక్ట్రిక్ ఎస్యూవీ: అదిరిపోయే ఫీచర్స్
సాక్షి,ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఎన్యాక్ ఐవీ వీఆర్ఎస్' (Enyaq iV vRS) పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల లాంచ్ చేసింది. స్పోర్టీ-డిజైన్తో వస్తున్న ఈ కారు కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందు కుంటుందని కంపెనీ తెలిపింది. గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. అంతేకాదు ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని స్కోడా ఆటో ప్రకటించింది. ఈ కారు ధర విషయానికి వస్తే మన దేశంలో సుమారు రూ. 48.6 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎన్యాక్ ఐవీ వీఆర్ఎస్ స్పెసిఫికేషన్స్ ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ట్రాక్షన్ అనే ఐదు డ్రైవింగ్ మోడ్లతో ఎలక్ట్రిక్ ఎస్యూవీని తీసుకొచ్చింది. తమ డ్రైవింగ్కి అనుగుణంగా వినియోగ దారులు ఈ వెహికల్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులోని 82 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 296 బీహెచ్పీ పవర్ని అందిస్తుంది. కేవలం 36 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే గ్లాసీ-బ్లాక్ ఫ్రంట్ ఏప్రాన్లు, డోర్ మిర్రర్లు, రియర్ డిఫ్యూజర్ తో పాటు మరిన్ని స్పోర్టీ ఫీచర్లను జోడించింది. ఇంటీరియర్గా ఫాక్స్ లెదర్ ఫినిషింగ్, డ్యాష్ బోర్డ్ ను కార్బన్ ఫైబర్తోనూ రూపొందించింది. 13 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 'క్రిస్టల్ ఫేస్' ఫ్రంట్ గ్రిల్, ముందువైపు ఎల్ఈడీ లైట్లు, క్రోమ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్లోయ్ వీల్స్, రూఫ్ రైల్స్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
భారత్కు నిస్సాన్ గ్లోబల్ మోడల్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ నిస్సాన్.. అంతర్జాతీయంగా విక్రయిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ను (ఎస్యూవీ) భారత మార్కెట్లో పరిచయం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో మాగ్నైట్, కిక్స్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్–ట్రయల్, జూక్, కష్కాయ్ మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఎక్స్–ట్రయల్, కష్కాయ్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత రోడ్లపై ఈ రెండు మోడళ్ల పరీక్ష మొదలైందని వెల్లడించింది. భారతీయ రోడ్లు, విభిన్న భూభాగాలకు ఈ వాహనాలు అనుకూలమా కాదా అన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని ఈ పరీక్షలు అంచనా వేస్తాయని కంపెనీ తెలిపింది. పరీక్షలు పూర్తి అయ్యాక సానుకూల ఫలితాలు వస్తే తొలుత ఎక్స్–ట్రయల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత కష్కాయ్ కూడా రోడ్డెక్కనుంది. ఉద్గారాలను బట్టి పన్ను..: వాహనాల పొడవు, ఇంజన్ పరిమాణం కంటే ఉద్గారాల ఆధారంగా ప్రయాణికుల వాహనాలపై పన్ను విధించడాన్ని భారతదేశం పరిగణించాలని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ రాకేష్ శ్రీవాస్తవ అన్నారు. ‘ఆటోమొబైల్స్ ద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి హైబ్రిడ్ల వంటి బహుళ సాంకేతికతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్గారాల స్థాయిని బట్టి వేర్వేరు పన్ను స్లాబ్లు ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే నాలుగు మీటర్ల లోపు, నాలుగు మీటర్ల కంటే పొడవు, ఇంధనం పరంగా భిన్నమైన పన్ను నిర్మాణాన్ని కలిగి ఉంది. జీఎస్టీ విధానం ప్రకారం కార్లపై 28 శాతం పన్నుతోపాటు సెస్ విధిస్తున్నారు. 4 మీటర్ల కంటే పొడవు ఉండే కార్లు, ఎస్యూవీలకు 50 శాతం, హైబ్రిడ్ వాహనాలకు 43 శాతం, ఎలక్ట్రిక్ వెహికిల్స్కు 5 శాతం జీఎస్టీ ఉంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
భారత్లో బీవైడీ అటో–3
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత్లో తాజాగా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ అటో–3 ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్తో 521 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 7 ఎయిర్బ్యాగ్స్ పొందుపరిచారు. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్–కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, రెండు వైపులా కొలీషన్ వార్నింగ్, ఏబీఎస్, ఈఎస్సీ, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను జోడించారు. ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బీవైడీ భారత్లో మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ వెహికిల్ ఈ6ను విక్రయిస్తోంది. 2030 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహన విపణి 55 లక్షల యూనిట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని బీవైడీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. ఆ సమయానికి 30 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. చెన్నై ప్లాంటులో ఎస్యూవీని అసెంబుల్ చేస్తామన్నారు. మార్కెట్ డిమాండ్నుబట్టి తయారీ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. బీవైడీ తయారీ 800లకుపైగా ఎలక్ట్రిక్ బస్సులు భారత్లో 11 నగరాల్లో పరుగెడుతున్నాయని వివరించారు. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్తో షాకైన కంపెనీ! -
బిగ్ డే..మంచి పేరు కావాలి చెప్పండబ్బా: ఆనంద్ మహీంద్రా
సాక్షి, ముంబై: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎం అండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక సంతోషకరమైన వార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల మహీంద్రా లాంచ్ చేసిన స్కార్పియో-ఎన్ తన చేతికి వచ్చిన ముచ్చటను ట్విటర్లో షేర్ చేశారు. నిజంగా ఇది నాకు బిగ్ డే.. స్కార్పియో ఎన్ ను రిసీవ్ చేసుకున్నా. అయితే దీనికి ఒక మంచి పేరు కావాలి. ఎవరైనా పేరు సూచించే వారికి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. స్కార్పియో-ఎన్ ఎస్యూవీని భారత మార్కెట్లో మహీంద్రా ఇటీవల లాంచ్ చేసింది. ఈ పండుగ సీజన్లో స్కార్పియో-ఎన్ డెలివరీలను ప్రారంభించింది. ఈ క్రమంలో మహీంద్ర ప్రతినిధి ఆనంద్ మహీంద్రకు స్కార్పియో-ఎన్ తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర, తన స్కార్పియోకు పేరు సూచించమని అభిమానులను అడగడం విశేషంగా నిలిచింది. స్కార్పియో-ఎన్ ఎస్యూవీ క్యాబిన్ ప్రీమియం లుక్తో, 3D సరౌండ్ 12-స్పీకర్ సోనీ సిస్టమ్, విశాలమైన సన్రూఫ్, రిచ్ కాఫీ బ్లాక్ లెథెరెట్ సీట్లు, సిక్స్-వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు, 70+ కనెక్టెడ్ కార్ ఫీచర్లతో లాంచ్ చేసింది. స్కార్పియో-ఎన్ ఎస్యూవీ ధర Z2 పెట్రోల్ MT వేరియంట్ రూ. 11.99 లక్షల నుండి ప్రారంభం. అలాగే Z8 L డీజిల్ MT వేరియంట్ ధర రూ. 19.49 లక్షల వరకు ఉంటుంది. 5 వేరియంట్లు, ఏడు రంగుల్లో లభ్యం. ఈ ఏడాది జూలై 31న బుకింగ్లు ప్రారంభమైన తొలి నిమిషంలోనే 25 వేలకు పైగా వాహనాలు బుక్ అయ్యాయి. అంతేకాదు ఈ మోడల్ దేశంలో అత్యంత వేగంగా లక్ష బుకింగ్స్ నమోదు చేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Big day for me; received my ScorpioN…. Need a good name for it…Recommendations welcome! pic.twitter.com/YI730Eo9uh — anand mahindra (@anandmahindra) October 7, 2022 -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ బంపరాఫర్
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొనుగోలు దారులకు టాటా టియాగో, టైగోర్,టైగోర్ సీఎన్జీ, హారియర్, సఫారీ కార్లపై పలు ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో రెండో స్థానంలో టాటా హారియర్పై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ ,రూ.5000 కార్పొరేట్ బెనిఫిట్ను అందిస్తుంది. దీంతో పాటు టైగోర్ సీఎన్జీపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.15,000 , రూ.10 వేలు డిస్కౌంట్ అందిస్తున్నట్లు టాటా ప్రతినిధులు తెలిపారు. అన్ని టాటా సఫారీ వేరియంట్లపై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. టైగోర్పై ఎక్స్ఛేంజ్ బోనస్గా రూ.10 వేలు, క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 బెనిఫిట్ లభిస్తుంది. టాటా టియాగోపై ఎక్స్చేంజ్ బోనస్గా రూ.10వేలు, క్యాష్ డిస్కౌంట్గా రూ.10 వేలు బెనిఫిట్ పొందవచ్చు. హ్యాచ్బ్యాక్ టియాగోపై కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ.3000 అందిస్తున్నది. -
మహీంద్రా, బీఐఐ రూ.4,000 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభా గం కోసం మహీంద్రా గ్రూప్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్(బీఐఐ) రూ.4,000 కోట్లు పెట్టు బడి చేయాలని నిర్ణయించాయి. మహీంద్రా ఈవీ విభా గం అయిన ఈవీ కో కంపెనీలో బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇద్దరు భాగస్వాముల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్ర ణాళికాబద్ధమైన ఉత్పత్తులకు 2023–24 నుంచి 2026–27 మధ్య నూతన ఎలక్ట్రిక్ వాహన కంపెనీ మొత్తం రూ.8,000 కోట్ల మూలధనాన్ని కలిగి ఉంటుంది. వ్యాపారాన్ని పటిష్టం చేయడం కోసం ఈవీ కో కంపెనీలోకి మరింత మంది పెట్టుబడిదార్లను తీసుకు వస్తామని మహీంద్రా గ్రూప్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాటా 25 శాతం.. ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన ఎక్స్యూవీ 400 మోడల్ను మహీంద్రా ఇటీవలే ఆవిష్కరించింది. అయిదు రకాల ఈ–ఎస్యూవీలను భారత్తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం పరిచయం చేస్తామని యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్స్యూవీతోపాటు బీఈ పేరుతో పూర్తి ఎలక్ట్రిక్ బ్రాండ్ శ్రేణి లో ఈ నూతన మోడళ్లను పరిచయం చేయనుంది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు లేదు. అయితే ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహ న విభాగంలో సంస్థకు ఏకంగా 70% వాటా ఉంది. 2027 నాటికి సంస్థ విక్రయించే అన్ని ఎస్యూవీల్లో ఎలక్ట్రిక్ వాటా 25% ఉంటుందని భావిస్తోంది. -
ఎస్యూవీల్లోకి హోండా రీ–ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్యూవీలైన సీఆర్–వి, బీఆర్–వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్–వి, జాజ్ ఎస్యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది. నిష్క్రమించే ఆలోచనే లేదు.. హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది. -
ఫోక్స్వ్యాగన్ టైగన్ యానివర్సరీ ఎడిషన్: అదరిపోయే ఫీచర్స్, కలర్స్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీ తొలి వార్షికోత్సవ ఎడిషన్ లాంచ్ చేసింది. టైగన్ ఎస్యూవీని లాంచ్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా కొన్ని స్పెషల్ ఫీచర్లతో ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్గా సరికొత్తగా లాంచ్ చేసింది. రైజింగ్ బ్లూ కలర్, ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్లో ఇది అందుబాటులో ఉంది. స్టాండర్డ్ టైగన్తో పోలిస్తే ఇందులో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ , ఇతర ఫీచర్లతో తీసుకొచ్చింది. డైనమిక్ లైన్లో తీసుకొచ్చిన ఫోక్స్వ్యాగన్ టైగన్ స్పెషల్ ఎడిషన్ రెండు ఇంజీన్లతోరానుంది. 1.0 TSI MT & ATలో అందుబాటులో ఉన్న టాప్లైన్ వేరియంట్. "1" వార్షికోత్సవ బ్యాడ్జింగ్తో స్పోర్టియర్ లుక్స్తో అదరగొడుతోంది. ఇందులో హై లగ్జరీ ఫాగ్ ల్యాంప్స్, బాడీ-కలర్ డోర్ గార్నిష్, బ్లాక్ సి-పిల్లర్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్ ఫాయిల్, డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్, బ్లాక్ ORVM క్యాప్స్, విండో వైజర్లతో సహా ప్రత్యేకంగా డిజైన్చేసిన 11 అంశాలు ఉన్నాయి. సెఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే టైగన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 వరకు ఎయిర్ బ్యాగ్లు, మల్టీ-కొలిజన్ బ్రేక్లు, రివర్స్ కెమెరా, ISOFIX, టైర్ ప్రెజర్ డిఫ్లేషన్ వార్నింగ్ సిస్టమ్ లాంటి పూర్తి స్థాయి 40+ భద్రతా ఫీచర్లను జోడించింది. అదనంగా 3 పాయింట్ సీట్ బెల్ట్లతో పాటు వెనుకవైపు 3 ఎడ్జస్టబుల్ హెడ్రెస్ట్ కూడా ఉంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్తో కూడిన 1.0L TSI ఇంజన్, 5000 నుండి 115PS (85 kW) గరిష్ట శక్తిని, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక. 5500 ఆప్పిఎం వద్ద గరిష్ట టార్క్ 178 టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5L TSI EVO ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ , 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ ఆప్షన్తో అమర్చబడి ఉంటుంది, ఇది 150PS (110 kW) గరిష్ట శక్తిని 5000, 6000 rpm వద్ద, 5000 టార్క్ అందిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన ధరలు రూ. 15.40 లక్షలు- రూ. 16.90 లక్షల వరకు ఉంటాయి. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్లో టాప్ 3 ఫైనలిస్ట్గి నిలిచి ప్రపంచస్థాయిలో టైగన్ ఖ్యాతిగడించిందని ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ఈ సందర్బంగా టైగన్ కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. టైగన్ ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 40 వేల కంటే ఎక్కువ ఆర్డర్లను సాధించగా , 22వేల టైగన్లను డెలివరీ చేసింది. -
మారుతీ సుజుకీ కొత్త ప్లాన్స్: మారుతీ మిడ్-ఎస్యూవీ
న్యూఢిల్లీ: దేశంలో కంపెనీ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగాన్ని కీలకంగా పరిగణిస్తున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో ప్రస్తుతం సంస్థ వాటా 45 శాతంగా ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది మారుతీ సుజుకీ లక్ష్యం. ‘ఎస్యూవీయేతర విభాగంలో కంపెనీ వాటా 65 శాతం పైచిలుకు. ఎస్యూవీల్లో అంత పెద్దగా లేదు. దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం ఇది. ఇందులో మారుతీ సుజుకీ తప్పనిసరిగా సుస్థిర స్థానం సంపాదించాలి. ప్రారంభ స్థాయి ఎస్యూవీల విపణి వార్షిక పరిమాణం 6.6 లక్షల యూనిట్లు. ఇందులో సంస్థకు 20 శాతం వాటా ఉంది. 5.5 లక్షల యూనిట్ల వార్షిక పరిమాణం ఉన్న మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో కంపెనీకి ఒక్క మోడల్ కూడా లేదు. ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరులో మిడ్ సైజ్ ఎస్యూవీ ఆవిష్కరించనున్నాం. 4 మీటర్ల లోపు పొడవు ఉండే ఎస్యూవీలపైనా దృష్టిసారిస్తాం’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
2023 స్కోడా కొడియాక్ లాంచ్: ఆ లగ్జరీ కార్లకు షాక్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ఫ్టాగ్షిప్ కొడియాక్ 2023 వెర్షన్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,49,000 (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ-లెవల్ లగ్జరీ 4×4 SUV స్టైల్, స్పోర్ట్లైన్ , ఎల్ అండ్ కే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే 2023 స్కోడా కొడియాక్ ధర రూ. టాప్-ఎండ్ ఎల్ అండ్ కే వేరియంట్ ధర 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి ఆఫర్ ధరలు మాత్రమే. 2023, మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం బుకింగ్లు అందుబాటులో ఉన్నాయి. 50వేలు చెల్లించి అన్ని స్కోడా డీలర్షిప్లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య డెలివరీలు అవుతాయి. గత జనవరిలో లాంచ్ చేసిన స్కోడా మోడల్ 2022 ఎస్యూవీ 48 గంటల్లో మొత్తం 1,200 యూనిట్లు రికార్డ్ స్థాయి సేల్స్ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మోడల్తో పోలిస్తే దాదాపు లక్షన్నన్నర రూపాయల రేటు పెంచింది. 2023 స్కోడా కొడియాక్ ఇంజన్, ఫీచర్లు వోక్స్వ్యాగన్ గ్రూప్ 2-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ను అమర్చింది. ఇది 187.7 HP , 320 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రామాణిక 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించింది. ఇది 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుంది. 6 డ్రైవింగ్ మోడ్లలో ఇది లభ్యం. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) CANTON 12-స్పీకర్ 625W సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి కొన్ని కూల్ సెగ్మెంట్-ఎక్స్క్లూజివ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లైండ్లు, బ్లాంకెట్స్,అంబరిల్లా, హోల్డర్, పనోరమిక్ సన్రూఫ్ వంటి అనేక సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 2023 స్కోడా కొడియాక్ జీప్ కంపాస్, మెరిడియన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్క్రాస్, వోక్స్వ్యాగన్ టిగువాన్,2023 హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
హఠాత్తుగా పెరిగిన నది ఉధృతి... ఏకంగా 14 కార్లు గల్లంతు
మధ్యప్రదేశ్: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో సుక్ది నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఐతే కొన్ని కుటుంబాలు ఆదివారం కదా అని సరదాగా గడుపుదామని సుక్ది నదికి సమీపంలోని కట్కూట్ అడవికి వచ్చారు. అకస్మాత్తుగా నది ఉప్పెనలా ప్రవహించడంతో దాదాపు 50 మంది ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆ నది ప్రవాహధాటికి సుమారు 14 కార్లు కొట్టకుపోయాయి. దీంతో మహిళలు పిల్లలతో సహ 50 మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ తలదాచుకున్నారు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు వ్యక్తులను రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు ఈ నది అకస్మాత్తుగా ఉధృతంగా ప్రవహించడం మొదలైందని పోలీస్ అధికారి జితేందర సింగ్ పవార్ పేర్కొన్నారు. ఎస్యూవీ కార్లతో సహా సుమారు 14 కార్లు ఈ నది ఉదృతికి కొట్టుకుపోయాయిని చెప్పారు. అంతేకాదు వాటిలో ఒక ఎస్యూవీ కారుతో సహ దాదాపు 10 కార్లను ట్రాక్టర్ సాయంతో బయటకు తీశామని చెప్పారు. అంతేకాదు మూడు కార్లు సుదూర ప్రాంతాలకు కొట్టుకుపోయాయని, మరో కారు వంతెన వద్ద ఉన్న హోలులో ఇరుక్కుపోయిందని చెప్పారు. ఐతే ఆ కార్ల లోపలికి నీళ్లు చేరిపోవడంతో పనిచేయకుండా మోరాయించాయిని తెలిపారు. దీంతో తాము వారిని వేరే వాహనాల్లో ఇళ్లకు పంపించినట్లు వెళ్లడించారు. అంతేకాదు సదరు పర్యాటకులు ఇలాంటి ప్రదేశాల్లో ఈ సుక్ది నది ఉప్పెనలా ముంచేస్తుందని హెచ్చరిక బోర్డులను కూడా పెట్టాల్సిందిగా స్థానిక పోలీసులను కోరినట్లు అదికారులు తెలిపారు. (చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో?) -
మారుతి ఆల్ న్యూ గ్రాండ్ విటారా: సరికొత్త టెక్నాలజీతో
సాక్షి, ముంబై: మారుతితి సుజుకి గ్రాండ్ విటారాను ఎట్టకేలకు ఈ రోజు (జూలై 20) ఇండియాలో పరిచయం చేసింది. అర్బన్ క్రూయిజర్, గ్లాంజా తరువాత టయోటా సుజుకి భాగస్వామ్యంతో తయారైన కొత్త మోడల్ ఎస్యూవీ గ్రాండ్ విటారా. 28 కిలోమీటర్ల మైలేజీ ఎస్యూవీగా కంపెనీ వెల్లడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు మారుతి డీలర్షిప్ వద్ద లేదా ఆన్లైన్లో రూ. 11,000తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. 2020 మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్యూవీ ధర రూ.9.50 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఉండనుంది. డిజైన్, ఫీచర్లు, ఇంజన్ గ్రాండ్ విటారా ఎస్యూవీ కూడా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్యూవీ మాదిరిగానే ఉన్నా. SUV క్రోమ్ స్ట్రిప్, ట్రైఎల్ఈడీ టెయిల్ లైట్ల పొడవైన బంపర్, స్పోర్టి ఎయిర్ డ్యామ్, పూర్తి-LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ స్పెషల్. ప్రత్యేకమైన 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుపర్చింది. 27.97km మైలేజీని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల విషయానికి వస్తే,వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హెడ్స్-అప్-డిస్ప్లే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా , అనేక ఇతర స్మార్ట్ కార్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగూ ఆల్గ్రిప్ AWD సాంకేతికతను కూడా జోడించింది. AllGrip సిస్టమ్లో ఆటో, స్పోర్ట్, స్నో, లాక్ అనే నాలుగు మోడ్లు అందుబాటులో ఉంటుంది. ఏడబ్యూడీ టెక్నాలజీని అందించిన మారుతి సుజుకీ ఏకైక కారు గ్రాండ్ విటారా. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 6-ఎయిర్బ్యాగ్లు, ESP, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణీకులకు 3 పాయింట్ సీట్బెల్ట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్లు, హిల్ డిసెంట్ కంట్రోల్ లాంటి సెక్యూరిటీ ఫీచర్లున్నాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం. ఇందులో ఒకటి 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్. ఇది 92hp , 122Nm టార్క్ను, 79hp, 141Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్తో అందుబాటులో ఉంటుంది. కొత్త బ్రెజ్జా, XL6 , ఎర్టిగాలో ఇదే ఇంజన్ను అమర్చింది.ఇది 103hp , 137Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
స్టైలిష్ లుక్తో..హ్యుందాయ్ నుంచి ఎస్యూవీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త టుసో ఎస్యూవీని ఆవిష్కరించింది. వచ్చే నెల ప్రారంభంలో ఈ కారు మార్కెట్లోకి రానుంది. పెట్రోల్ వేరియంట్ 6 స్పీడ్, డీజిల్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, 2 లీటర్ పవర్ట్రైయిన్స్, అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్తో రూపుదిద్దుకుంది. కెమెరా, రాడార్ సెన్సార్స్తో ఆటోమేటిక్ సెన్సింగ్ టెక్నాలజీని పొందుపరిచారు. ఈ విభాగంలో తొలిసారిగా 29 రకాల ఫీచర్లను జోడించారు. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది కస్టమర్లు టుసోను సొంతం చేసుకున్నారు. 2021లో అంతర్జాతీయంగా 4.85 లక్షల టుసో కార్లు అమ్ముడయ్యాయి. భారత్లో ఏటా సుమారు 40,000 యూనిట్లు రోడ్డెక్కుతున్నాయి. 2025 నాటికి ఇది 55,000 యూనిట్లకు చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. -
సరికొత్త ఫీచర్లతో అదరగొడుతోన్న..నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ షురూ!
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్ను పరిచయం చేసింది. జులై 8 ( నిన్న శుక్రవారం) నుంచి ఈ కార్ బుకింగ్స్ను ప్రారంభించినట్లు తెలిపింది. జులై 18న ఈ కారును విడుదల చేయనుంది. మాగ్నైట్ ఎక్స్వీ వేరియంట్ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైఫై కనెక్టివిటీ, 7 అంగుళాల ఫుల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, డైమంట్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. మూడు వేరియంట్లలో నిస్సాన్ సంస్థ మ్యాగ్నైట్ రెడ్ పేరుతో మూడు వేరియంట్లలో మ్యాగ్నైట్ టర్బో ఎక్స్వీ ఎంటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ టర్బో ఎక్స్వీ సీవీటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ ఎక్స్వీ ఎంటీ రెడ్ ఎడిషన్ కార్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్ల వినియోగదారులకు మెమోరబుల్ జర్నీని అందించేందుకు బోల్డ్ డిజైన్, పవర్ ప్యాక్డ్ పర్మామెన్స్, కంఫర్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లను జత చేసినట్లు నిస్సాన్ ప్రతినిధులు వెల్లడించారు. నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఫీచర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్లలో కారు గ్రిల్స్(కారు హెడ్లైట్స్ మధ్యలో ఉండే డిజైన్),ఫ్రంట్ బంపర్ క్లాడింగ్,వీల్ ఆర్చ్, బాడీ సైడ్ క్లాడింగ్లు ఉన్నాయి. వీటితో పాటు రెడ్ ఎడిషన్లో బోల్డ్ బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్,టైల్ డోర్ గ్రానిషన్ పొందుపరిచింది. యాంబినెట్ మూడ్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్,7.0 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రామెంట్ క్లస్టర్, వైఫై కనెక్టివీటి, స్టార్ట్, స్టాప్ కోసం పుష్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, బ్రేక్ అసిస్ట్ వంటి సదుపాయం ఉంది. కార్లపై డిస్కౌంట్ ఇటీవల నిన్సాన్ ప్రతినిధులు నిస్సాన్ మ్యాగ్నైట్ సీవీటీ వేరియంట్ ఎక్స్, ఎక్స్వీలపై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ కార్ల ప్రైస్ రేంజ్ రూ.5.88లక్షల నుంచి రూ.10.56లక్షల మధ్య ఉంది. -
ఎంఅండ్ఎం ఎలక్ట్రిక్ ఎస్యూవీల్లో బీఐఐ పెట్టుబడులు
ముంబై: బ్రిటన్కు చెందిన ఆర్థిక సంస్థ బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (బీఐఐ) తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) గ్రూప్లోని ఎలక్ట్రిక్ ఎస్యూవీల తయారీ వ్యాపార విభాగంలో రూ. 1,925 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయనుంది. ఎంఅండ్ఎం కూడా అదే స్థాయిలో రూ. 1,925 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనుంది. ఎస్యూవీల కోసం ఈవీ కంపెనీ పేరిట ఎంఅండ్ఎం అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. 2024–2027 మధ్య కాలంలో ఈ సంస్థకు దాదాపు రూ. 8,000 కోట్ల వరకూ పెట్టుబడులు సమకూర్చే ప్రతిపాదనలు ఉన్నాయి. సెప్టెంబర్లో తమ ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఎక్స్యూవీ 400 వాహనాలను సెప్టెంబర్లో ఆవిష్కరించే అవకాశం ఉందని, 2023 జనవరి–మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కావచ్చని కంపెనీ ఈడీ (ఆటో, ఫార్మ్ సెక్టార్) రాజేశ్ జేజూరికర్ వివరించారు. -
మార్కెట్లోకి అదిరిపోయే టయోటా ఎస్యూవీ!
ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ శుక్రవారం కొత్త ఎస్యూవీ ‘అర్బన్ క్రూయిజర్ హైరైడర్’’ను ఆవిష్కరించింది. టయోటా డీలర్షిప్లలో లేదా అధికారిక వెబ్సెట్లలో రూ. 25,000 చెల్లించి ముందుస్తు బుకింగ్ చేసుకోవచ్చు. వచ్చేనెలలో డెలివరీలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో 1.5–లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ 5–స్పీడ్ మాన్యువల్ లేదా 6–స్పీడ్ ఆప్షనల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఆరు ఎయిర్బ్యాగ్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్–హోల్డ్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రియర్ ప్యాసింజర్ల కోసం సీట్బెల్ట్స్ సౌకర్యం ఉంది. దేశీయ మార్కెట్లోని టాటా సఫారీ, హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ తదితర ఎస్యూవీలకు ప్రత్యర్థిగా ఉంటుంది. -
పండుగల సీజన్లో ఎస్యూవీల సందడే సందడి!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్ బహుళ ప్రయోజాలతో కూడిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీలు) పెద్ద ఎత్తున ఆవిష్కరణకు సాక్ష్యంగా నిలవనుంది. సుమారు డజను ఎస్యూవీ మోడళ్లను కంపెనీలు విడుదల చేయనున్నాయి. వీటి ధరలు రూ.5.5 లక్షల నుంచి రూ.65 లక్షల మధ్య ఉండనున్నాయి. మిగతా సంవత్సరాలకు ఈ ఏడాది భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే కంపెనీలు సాధారణంగా ఏడాదిలో వివిధ సందర్భాల్లో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తుంటాయి. కానీ, ఈ విడత రానున్న పండుగల సీజన్ను ఆవిష్కరణలకు లక్ష్యంగా పెట్టుకోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2020–21లో ఎనిమిది కొత్త కార్లు విడుదల కాగా.. వీటి ఆవిష్కరణలు ఏడాది వ్యాప్తంగా కొనసాగాయి. 2021–22లో ఏడు కొత్త మోడళ్లు విడుదలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లోనూ కొత్త కార్ల ఆవిష్కరణలు ఐదు లేదా ఆరు స్థాయిలో ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మాత్రం పదికి పైగా కొత్త ఎస్యూవీలు వినియోగదారులను పలకరించనున్నాయి. దేవీ నవరాత్రులతో పండుగల సందడి తారా స్థాయికి చేరి, దీపావళితో ముగుస్తుంటుంది. ఆటో కంపెనీలకు ఈ పీరియడ్ చాలా కీలకమైనది. ఏడాదిలో నమోదయ్యే విక్రయాల్లో 20% ఈ 3 నెలల కాలంలోనే నమోదవుతుంటాయి. కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురావడం అసాధారమేమీ కాదు. కానీ, ఈ ఏడాది పండుగల సీజన్ సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ఎస్యూవీలు (ఒకే తరహా బాడీతో కూడినవి) ఆవిష్కరణ చేస్తుండడమే ప్రత్యేకం. ముందుగా మారుతీ.. మొదటిగా మారుతీ సుజుకీ నుంచి కొత్త జెనరేషన్ బ్రెజ్జా ఆవిష్కరణ ఉండనుంది.గత సోమవారం మారుతి సుజుకీ ఇందుకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడంతోపాటు, బుకింగ్లు తీసుకోవడాన్ని ప్రారంభించింది. జూన్ 30న విడుదల కానుంది. మిడ్సైజు ఎస్యూవీ అయిన టయోటా హైరైడర్ జూలై 1న మార్కెట్లోకి రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్కు పోటీనివ్వనుంది. టయోటా అర్బన్ క్రూయిజర్ (బ్రెజాకు రీబ్రాండింగ్)ను కూడా ఆవిష్కరించనుంది. -
లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో, ధరెంతో తెలుసా?
కన్నడ స్టార్ దర్శన్ కొత్త కారు కొనుగోలు చేశాడు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్యూవీని తన గ్యారేజీలోకి తెచ్చుకున్నాడు. దీని ధర దాదాపు రెండున్నర కోట్ల పైమాటే ఉంటుందని తెలుస్తోంది. కాగా సన్నీడియోల్, అర్జున్ కపూర్, ప్రకాశ్ రాజ్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ యజమానులే! ఇకపోతే దర్శన్కు కార్ల మీద మోజు ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడికి లంబోర్గిని ఉరుస్, హ్యురాకాన్ సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో మరో ఖరీదైన కారు చేరడంతో ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు నెట్టింట శుభాకాంక్షలు చెప్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ పెంపుడు కుక్కకి ఫ్లైట్ టికెట్స్ డిమాండ్ చేసిన రష్మిక? నటి రియాక్షన్! -
సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆపీ... : వీడియో వైరల్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రోడ్షోలో ప్రజలను పలకరిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఎస్యూవీ కారులో నుంచుని ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇంతలో ఒక నల్లని టీషర్టు ధరించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాన్యాయ్ని ఆపాల్సిందిగా చేతులు ఊపాడు. దీంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆ వ్యక్తితో మాట్లాడేందుకు తన కారుని ఆపారు. సదరు వ్యక్తి మొదటగా ముఖ్యమంత్రికి కరచలనం చేసి అగ్నిపథ్ గురించి మాట్లాడాడు. ఈ అగ్నిపథ్ పథకాన్ని అమలు చేసే ముందు నాయకులంతా సమావేశమై చర్చించి ఉంటే బావుండేది కదా అని అడిగాడు ఆ వ్యక్తి. దీంతో భగవంత్ మాన్ సదరు వ్యక్తి చేతిని పట్టుకుని అగ్నిపథ్ గురించి చర్చించడానికి ఎంపీలంతా సమావేశమైతే...తానే స్వయంగా వెళ్లి మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. మరోవైపు సాయుధ దళాల రిక్రూట్మెంట్లో సమూల మార్పులను ప్రకటించే ముందు ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఇతర నాయకుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని ఉండాల్సిందని ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. అంతేకాదు ఈ విషయమై చర్చలకు కూర్చొవల్సిందే అంటున్న జౌత్సాహిక నిరసనకారులకు వంత పాడుతున్నాయి ప్రతిపక్షాలు. ఐతే ప్రభుత్వం ఇంకా కొన్ని చోట్ల నిరసనలు జరుగుతుండటంతో దిద్దుబాటు చర్య చేపట్టడమే కాకుండా పలు రాయితీలను కూడా ప్రకటించింది. ఈ మేరకు కోస్ట్గార్డు, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో సహా మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్లో విస్తరించి ఉన్న రక్షణ మంత్రిత్వశాఖ ఉద్యోగాల్లో 10 శాతం కోటా కల్పించింది. ఈ రిజర్వేషన్ మాజీ సైనికులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్కు అదనంగా ఉంటుంది. The reason why Punjab loves @BhagwantMann ❤️ Punjab CM STOPPED his roadshow for #SangrurBypoll to listen to a youth protesting against #AgnipathScheme pic.twitter.com/PVXiTU0MYI — AAP (@AamAadmiParty) June 19, 2022 (చదవండి: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్) -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్టార్.. కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెర్సీడెస్కు చెందిన ఎస్యూవీ లగ్జరీ మెర్సీడెస్-ఏంఎంజీ జి 63ని రూ. 2.45కోట్లు పెట్టి కొన్నాడు. అయ్యర్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయ్యర్ కొనుగోలు చేసిన కారు కేవలం 4.5 సెకన్లలో 100కిమీ వేగాన్ని అందుకుంటుంది. కాగా అయ్యర్ కారుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన మెర్సిడెస్ లగ్జరీ కార్ల కంపెనీ ట్వీట్ చేసింది. ''కంగ్రాట్స్ టూ టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. అలాగే మా మెర్సిడెస్ బెంజ్ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. మెర్సిడెస్ బెంజ్లో కొత్త మోడల్ కారును కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు. మీ బ్యాటింగ్లో కవర్ డ్రైవ్స్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం.. ఇప్పుడు మీరు మా కారు డ్రైవింగ్ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో కేకేఆర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. బ్యాటింగ్లోనూ అంతగా రాణించని శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్గానూ మెరవలేదు. రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్ ఐపీఎల్ 15వ సీజన్ను ఏడో స్థానంతో ముగించింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా సిరీస్కు శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు. సీనియర్ల గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు కీలకం కానున్నాడు. ఈ సిరీస్ ద్వారా శ్రేయాస్ తన ఫామ్ను తిరిగి అందుకుంటాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బిగ్స్క్రీన్పై చారిత్రక టెస్టు సిరీస్.. రోమాలు నిక్కబొడుచుకునేలా ట్రైలర్ Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! -
అదిరిపోయే లుక్తో విడుదలైన ఎస్యూవీ, ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: స్టెలాంటిస్ గ్రూప్లో భాగమైన జీప్ ఇండియా తాజాగా తమ కొత్త ఎస్యూవీ మెరీడియన్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 29.9 లక్షల నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం తొలిసారిగా మూడు వరుసల సీటింగ్తో ఈ ఎస్యూవీని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆల్–వీల్ డ్రైవ్ వెర్షన్తో పాటు ఇది అయిదు వేరియంట్లలో లభిస్తుందని పేర్కొంది. ప్రారంభ ధరలు రూ. 29.9 లక్షల నుంచి రూ. 36.95 లక్షల వరకూ ఉంటాయని జీప్ బ్రాండ్ ఇండియా హెడ్ నిపుణ్ జె మహాజన్ తెలిపారు. జీప్ మెరిడియన్కి ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 50,000 డౌన్పేమెంట్ కట్టి మెరీడియన్ను తమ వెబ్సైట్లో బుక్ చేసు కోవచ్చని, జూన్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు. బుకింగ్స్ ప్రారంభించడానికి ముందే 67,000 పైచిలుకు ఎంక్వైరీలు వచ్చినట్లు, 5,000 మందికి పైగా కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు మహాజన్ చెప్పారు. -
వాటివల్లే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి! కారణమేంటీ?
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెల్లడైంది. అమెరికాలో ఇటీవల నిర్వహించిన సర్వేలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. రోడ్డు ప్రమాదాలకు ఇటువంటి కారణాలు కూడా ఉంటాయా అనేట్టుగా నిజాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన ఇన్సురెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైవే సేఫ్టీ (ఐఐహెచ్ఎస్) సంస్థ ఇటీవల రోడ్డు ప్రమాదాలు, అందులో చనిపోతున్న వ్యక్తులకు సంబంధించిన డేటాను విశ్లేషించింది. రోడ్డు ప్రమాదాలో ఎక్కువగా మరణాలకు కారణం అవుతున్న వాహనాల్లో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ (ఎస్యూఈ), పికప్ వెహికల్స్ ఉన్నట్టుగా తేలింది. దీంతో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్, పికప్ వెహికల్స్పై మరోసారి పరిశీలన చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఎస్యూవీ, పికప్ వెహికల్స్లో ముందు వైపు ఇరుపక్కలా పెద్దగా ఉండే పిల్లర్స్ కారణంగా డ్రైవర్కి బ్లైండ్ స్పాట్స్ ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మూల మలుపులు తీసుకునే సమయంలో ఈ బ్లైండ్స్పాట్స్ డ్రైవర్ దృష్టి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్టుగా గుర్తించారు. ఎస్యూవీ, పికప్ వెహికల్ డ్రైవర్లకు ఏర్పడుతున్న బ్లైండ్స్పాట్ల వల్ల రోడ్డు కదులుతున్న లేదా నిలబడి ఉన్న వ్యక్తులను గుర్తించడంలో పొరపాట్లు జరుగుతున్నట్టుగా తేలింది. సాధారణ ప్యాసింజర్ వెహికల్స్లో ఈ సమస్య కొద్ది మొత్తంలోనే ఉండగా ఎస్యూవీ, పికప్ వెహికల్స్లో ఎక్కువగా ఉన్నట్టు ఐఐహెచ్ఎస్ పరిశీలనలో వెల్లడైంది. 2020లో రోడ్డు ప్రమాదాల కారణంగా అమెరికాలో 6,519 మంది చనిపోయారు. అంతుకు ముందు ఏడాదితో పోల్చితే ఇది నాలుగు రెట్లు అధికం. ఇక 2009 నుంచి 2019 రోడ్డు ప్రమాదాల గణాంకాలను పోల్చితే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఏకంగా 59 రెట్లు పెరిగింది. గత కొంత కాలంగా అమెరికాలో ఎస్యూవీ అమ్మకాలు పెరిగిపోయాయి. మరోవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ఒక్క ఎస్యూవీ, పికప్ వెహికల్స్నే బాధ్యులను చేయలేం, అదే సమయంలో ప్రమాదాల్లో ఎక్కువగా ఉన్న ఈ వాహనాల సంఖ్యను విస్మరించలేం. మరింత అధ్యయనం చేసి తగు విధమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఐఐహెచ్ఎస్ అంటోంది. -
మహీంద్రా థార్కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్ గుర్ఖా..!
ఆఫ్ రోడ్ కార్లలో మహీంద్రా థార్ అత్యంత ఆదరణను పొందింది. ఈ సెగ్మెంట్లో మహీంద్రా థార్, మారుతి సుజుకీ జిమ్నీ కార్లకు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్స్ మోటార్స్ గుర్ఖా ఎస్యూవీను లాంచ్ చేసింది. తాజాగా గుర్ఖాను సరికొత్తగా తెచ్చేందుకు ఫోర్స్ సన్నాహాలను చేస్తోంది. 5 డోర్ వెర్షన్లో సరికొత్తగా..! గత ఏడాది ఫోర్స్ మోటార్స్ ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో గుర్ఖాను తీసుకొచ్చింది.తొలుత 3 డోర్ వెర్షన్ గుర్ఖాను ఫోర్స్ మోటార్స్ లాంచ్ చేసింది. దీనికి అదనంగా మరిన్నీ సీట్లను యాడ్ చేస్తూ 5 డోర్ వెర్షన్ గుర్ఖాను త్వరలోనే లాంచ్ చేస్తామని ఫోర్స్ తెలియజేసింది. ఇప్పుడు తాజాగా 5 డోర్ వెర్షన్ గుర్ఖా టెస్టింగ్ మోడల్కు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో వైరల్గా మారాయి. ఈ ఎస్యూవీను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. నయా ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీలో 6-7 సీట్ల సదుపాయం ఉండనుంది. అదే డిజైన్..ఇంజిన్తో..! ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీ 5-డోర్ వెర్షన్ కారు అదే డిజైన్ , ఇంజిన్తో వచ్చే అవకాశాలున్నాయి. డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టూఐర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం బ్లాక్ థీమ్తో ఇంటీరియర్ రూపొందించారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలు వర్క్ చేస్తాయి. డ్రైవర్ డిస్ప్లేను సెమి డిజిటల్గా అందించారు. 2.6 ఫోర్ సిలిండర్ బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన డీజిల్ ఇంజన్ అమర్చారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. గూర్ఖా ఇంజన్ 90 బీహెచ్పీతో 250 ఎన్ఎం టార్క్ని విడుదల చేస్తుంది. చదవండి: అలా చేస్తే సగం ధరకే పెట్రోల్, డీజిల్..! -
క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..!
కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తాజాగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. హోళీ సందర్భంగా పలు కార్లపై మహీంద్రా భారీ తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా ఆయా మోడల్స్పై ఏకంగా రూ.3.02 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఆయా మోడల్స్పై మహీంద్రా అందిస్తోన్న ఆఫర్స్ ఇవే..! మహీంద్రా KUV100 NXT మహీంద్రా కాంపాక్ట్ ఎస్యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 20,000 వరకు కొనుగోలుదారులకు లభించనుంది. మహీంద్రా XUV300 మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు విలువైన ఉచిత యాక్సెసరీలను అందిస్తోంది. ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియో కారు కొనుగోలుపై ఎటువంటి నగదు తగ్గింపును అందించడం లేదు. అయితే కొనుగోలుదారులు రూ. 15,000 పైగా విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చు. ఈ కారు కొనుగోలుపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 15,000 కూడా అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా అల్టురాస్ మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై ఏకంగా రూ. 2.2 లక్షల భారీ తగ్గింపును అందిస్తోంది .దాంతో పాటుగా రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది.అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చును. మహీంద్రా మరాజ్జో మహీంద్రా మరాజో ఎస్యూవీ బేస్ M2 ట్రిమ్పై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, ఇతర ట్రిమ్ వేరియంట్స్పై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. వీటితో పాటుగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: సరికొత్త హంగులతో విడుదలైన ఎంజీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు..! -
జీప్ మెరిడియన్.. ఇది మేడ్ ఇన్ ఇండియా
ఎస్యూవీ సెగ్మెంట్లో మంచి పట్టున్న జీప్ సంస్థ 7 సీటర్ వెహికల్ను మార్కెట్లోకి తెస్తామంటూ ఎప్పటి నుంచో చెబుతోంది. టెస్ట్ రైడ్ సందర్భంగా పలుమార్లు జీప్ 7 సీటర్ ఎస్యూవీ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఎస్యూవీకి ఏ పేరు పెడతారనే ఆసక్తి మొబైల్ ఇండస్ట్రీలో నెలకొని ఉండేది. దాదాపు 70 పేర్లను పరిశీలించిన జీప్ ఇండియా చివరకు మెరిడియన్ పేరును ఫిక్స్ చేసింది. ఈ మెరిడియన్ పూర్తిగా మేడిన్ ఇండియా అని ఇది ఇండియన్ల కోసమే తయారు చేశామని చెబుతున్నారు. జీప్ మెరిడియన్ 7 సీటర్ ఎస్యూవీకి సంబంధించి కేవలం పేరు ఒక్కటే వెల్లడైంది. ఇంజన్ సామర్థ్యం, ఇన్ఫోంటైన్మెంట్, ఇతర ఫీచర్లకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ జీప్ మెరిడియన్లో కచ్చితంగా ఉండబోయే ఫీచర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల అంచనాలు ఇలా ఉన్నాయి - పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో వస్తుంది. 2.0 ఇంజన్ను ఉపయోగించే అవకాశం - 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బాక్స్ - 10.25 ఇంచ్ ఇన్ఫోంటైన్మెంట్ స్క్రీన్ - పనోరమిక్ సన్రూఫ్ - 4 జోన్ వెదర్ కంట్రోల్ - ఫ్రంట్ వెంటిలేడెట్ సీట్స్ - టయోటా ఫార్చునర, ఎంజీ గ్లూస్టర్ , స్కోడా కోడియాక్ రేంజ్లో రూ. 35 లక్షల దగ్గర జీప్ 7 సీటర్ ఎస్యూవీ ధర ఉండవచ్చని అంచనా -
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ కారు..!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ కారును ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ లాంచ్ చేయనుంది. ఆస్టన్ మార్టిన్ 2022 DBX ఎస్యూవీకు చెందిన టీజర్ను కంపెనీ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. లాంచ్ ఎప్పుడంటే..! ఆస్టన్ మార్టిన్ 2022 DBX ఎస్యూవీ కారును రేపు (ఫిబ్రవరి 1)న రిలీజ్ చేయనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లగ్జరీ ఎస్యూవీగా నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కారు లంబోర్ఘిని ఉరస్ కారుకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఈ కొత్త తరం డీబీఎక్స్ ఎస్యూవీ పలు మార్పులతో రానున్నట్లు కంపెనీ పేర్కొంది. సరికొత్తగా ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్..! ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్ను భారీ మార్పులతో, మరింత ఆకర్షణీయంగా రానుంది. రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త సెట్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ రీపోజిషన్ చేయబడ్డాయి. కొత్త వీల్ డిజైన్స్తో సరికొత్త కలర్ కాంబినేషన్తో రానుంది. ఇంజన్ విషయానికి వస్తే..! న్యూ ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్ ఎస్యూవీ అభివృద్ధి చేసిన కొత్త టర్బోఛార్జ్డ్ వీ12 ఇంజిన్తో రానుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 650 hp శక్తిని ఉత్పత్తి చేయనుంది. మునపటి మోడల్ కంటే 100 hp అధిక శక్తిని విడుదల చేయనుంది. 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో అందుకోనుంది. గరిష్టంగా 290 kmph వేగంతో ప్రయాణించనుంది. Change is coming. Power talks. The world’s most powerful luxury SUV. 01.02.22#AstonMartin#NewSeatOfPower — Aston Martin (@astonmartin) January 18, 2022 చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా కారు..! -
అడ్వాన్స్ బుకింగ్.. ముందుగా రూ.5 లక్షలు చెల్లించండి
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన నూతన వెర్షన్ ప్రీమియం ఎస్యూవీ ‘క్యూ7’కు బుకింగ్లు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. 3 లీటర్ల పెట్రోల్ ఇంజన్తో ఉండే ఈ కారు కోసం ముందుస్తుగా రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2021లో తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేశామని.. ఆడి క్యూ7 బుకింగ్లతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించం ఉత్సాహంగా ఉన్నట్టు పేర్కొంది. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, క్వాట్టో ఆల్వీల్ డ్రైవ్, పార్క్ అసిస్ట్ తదితర ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. -
బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ.. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐఎక్స్ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.16 కోట్లు. వచ్చే ఆరు నెలల్లో భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ ప్రవేశపెట్టబోయే మూడు ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ఇది మొదటిది. దీన్ని పూర్తి బిల్టప్ యూనిట్గా (సీబీయూ) దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. డెలివరీ ఎప్పుడంటే సరికొత్త బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆన్లైన్ ఆఫ్లైన్ పద్దతిలో విక్రయించాలని నిర్ణయించారు. డీలర్షిప్లతో పాటు షాప్డాట్బీఎండబ్ల్యూడాట్ఇన్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చని బీఎండబ్ల్యూ పేర్కొంది. 2022 ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు. ప్రారంభ ఆఫర్ కింద కాంప్లిమెంటరీగా స్మార్ట్ బీఎండబ్ల్యూ వాల్బాక్స్ చార్జర్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 11కేడబ్ల్యూ ఏసీ చార్జరుతో 7 గంటల్లో 100 శాతం చార్జింగ్ చేయవచ్చని, 2.5 గంటల్లో 100 కి.మీ.కు సరిపడేంత చార్జింగ్ వీలవుతుందని విక్రమ్ వివరించారు. చదవండి: బీఎండబ్ల్యూ దండయాత్ర.. 6 నెలల్లో 3 ఎలక్ట్రిక్ కార్లు! -
నిస్సాన్ బంపర్ ఆఫర్..! కారు కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!
వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్ ఎండ్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. కాగా ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ కూడా ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2021 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. నిస్సాన్ అందిస్తోన్న ఆఫర్స్ ఇవే..! నిస్సాన్ మిడ్-సైజ్ ఎస్యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్లైన్ బుకింగ్ బోనస్ను కూడా పొందవచ్చును. కిక్స్ ఫీచర్స్ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రోల్ ఇంజన్తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో వేరియంట్ 154 బీహెచ్పీతో 254 ఎన్ఎమ్ టార్క్ని రిలీజ్ చేస్తుంది. రెండో వేరియంట్ అయిన 1.5 లీటర్ వేరియంట్ 105 బీహెచ్పీతో 142 ఎన్ఎం టార్క్ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్లో లభిస్తున్నాయి. కిక్స్ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్ తెలిపింది. చదవండి: రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్ బైక్..! ఎగబడుతున్న జనాలు..! -
ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో
న్యూయార్క్: రోడ్డుపై పలు యాక్సిడెంట్ ఘటనలు చూసినప్పటికీ ఇంకా అలాంటి భయంకరమైన ఘటనలు పునరావృతమౌతునే ఉన్నాయి. అంతేకాదు వేగం తగ్గించమని ఎంతలా ట్రాఫిక్ యంత్రాంగం మొత్తుకున్న ప్రజల్లో సరైన మార్పు రాకపోవడం బాధకరం. కానీ యూఎస్లోని ఇండియానాలో జరిగిన అతి పెద్ద యాక్సిడెంట్ చూస్తే ఎవరికైనా భయం వేయాల్సిందే. (చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. వైద్య చరిత్రలో గుర్తిండిపోయే పనిచేశాడు.. హైస్కూల్ చదువుతోనే..!!) అసలు విషయంలోకెళ్లితే...ఇండియానాలోని ఇండియానాపోలిస్లో కనీసం మూడు స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ ఢీ కొన్నాయి. అయితే మొదట రోడ్డు ఖాళీగా ఉందని రెడ్ సిగ్నల్ పడినప్పటికీ ఒక ఎస్యూవీ కారు వేగంగా వచ్చేస్తుంది. అంతే మరో ఎస్యూవీ కారు దాన్ని గట్టిగా ఢీ కొడుతుంది. దీంతో అది గాల్లోకి లేచి రహదారికి మరోవైపు పడుతుంది. వెంటనే అటువైపేగా వస్తున్న ఎస్యూవీ కారు పై పడి అక్కడ ఉన్న ఆరు కారులను ఢీ కొడుతుంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదుగానీ, మొత్తం ఆరు కారులు దెబ్బతిన్నాయి. అంతేకాదు ఈ ఘటన జరిగినప్పుడు ఒక పాదచారి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అయితే అదృష్టమేమిటంటే అతనికి ఏం కాలేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?) -
ఆనంద్ మహీంద్రా చెప్పినట్లుగానే చేశారే..!
Anand Mahindra Gifts XUV700 To Neeraj Chopra Sumit Antil: ఒలింపిక్స్, పారాలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిన నీరజ్చోప్రా, సుమిత్ ఆంటిల్కు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వారికి బహుమతిగా లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా 700ఎక్స్యూవీ కార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనంద్ మహీంద్రా చెప్పినట్లుగానే తన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. పారాలింపియన్ సుమిత్ ఆంటిల్కు మహీంద్రా 700ఎక్స్యూవీ పర్సనలైజ్డ్ కారును మహీంద్రా కంపెనీ అక్టోబర్ 30న బహుకరించింది. ఈ విషయాన్ని సంస్థ ట్విటర్లో షేర్ చేసింది. కార్ డెలివరీ విషయంపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఆనంద్ మహీంద్రా తన ట్విట్లో...‘ మహీంద్రా 700ఎక్స్యూవీ జావెలిన్ ఎడిషన్ కారును మీతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. మే ద ఫోర్స్ విత్ యూ ’ అంటూ శుభాకాంక్షలను తెలిపారు. ఇదిలా ఉండగా...టోక్యో ఒలింపిక్స్ 2020లో గోల్డ్మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా కూడా తన ట్విటర్ హ్యండిల్లో జావెలిన్ ఎడిషన్ మహీంద్రా 700ఎక్స్యూవీ కార్తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రాకు నీరజ్ చోప్రా ధన్యవాదాలు తెలిపారు. జావెలిన్ త్రో..కార్పై..! నీరజ్ చోప్రాకు, సుమిత్ ఆంటిల్కు ఇచ్చిన మహీంద్రా 700ఎక్స్యూవీలో టోక్యోలో జరిగిన జావెలిన్ త్రో విభాగంలో వారు విసిరిన దూరాన్ని సూచిస్తూ జావెలిన్ సింబల్ను సూచించేలా కారును రూపొందించారు. మహీంద్రా 700ఎక్స్యూవీ రికార్డు...! మహీంద్రా 700ఎక్స్యూవీ ప్రి-బుకింగ్స్లో దుమ్మురేపింది. మహీంద్రా తన ఎక్స్యువి700 ఎస్యూవి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డు అని కంపెనీ పేర్కొంది. We are so proud of you @sumit_javelin Thank you for giving us the privilege of sharing our very own ‘Javelin’ with you! May the Force be with you …always. https://t.co/8iDwX6wa41 — anand mahindra (@anandmahindra) October 30, 2021 Thank you @anandmahindra ji for the new set of wheels with some very special customisation! I'm looking forward to taking the car out for a spin very soon. 🙂 pic.twitter.com/doNwgOPogp — Neeraj Chopra (@Neeraj_chopra1) October 30, 2021 చదవండి: కేవలం 4రోజుల్లో రూ.1000 పెట్టుబడితో రూ.3.45లక్షల్ని సంపాదించారు -
మహీంద్రా థార్కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...!
Maruti Suzuki Teases New Off Road Car: ఆఫ్ రోడ్స్ వాహనాల్లో మహీంద్రా థార్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మహీంద్రా థార్కు పోటీగా ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఆఫ్ రోడ్స్ ఎస్యూవీ కార్లపై ఫోకస్ పెట్టాయి. భారత మార్కెట్లలోకి థార్కు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ గుర్ఖా పేరుతో ఆఫ్ రోడ్ ఎస్యూవీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహీంద్రా థార్కు పోటీగా మారుతి సుజుకి భారత మార్కెట్లలోకి ‘జిమ్నీ’ పేరుతో ఆఫ్ రోడ్ ఎస్యూవీను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా థార్కు తీసిపోకుండా అదే స్టైల్తో జిమ్నీ రానుంది. మారుతి తీసుకువస్తోన్న ఆఫ్ రోడ్ ఎస్యూవీ కస్టమర్లను ఇట్టే కట్టిపడేస్తుంది. మారుతి సుజుకీ జిమ్నీకి సంబంధించిన టీజర్ను సోషల్ మీడియా హ్యాండిల్స్లో లాంచ్ చేసింది. అన్ని రకాల భూభాగాల్లో అడ్వెంచరస్ డ్రైవింగ్ అనుభూతిని వాహనదారులకు కచ్చితంగా అందిస్తోందని మారుతి సుజుకీ పేర్కొంది. చదవండి: డావో ఎలక్ట్రిక్ స్కూటర్.. భలే ఉంది కదూ! ఇండియా నుంచి ఇతర దేశాలకు... మారుతి సుజుకీ జిమ్నీ ఎస్యూవీ 3 డోర్ వెర్షన్తో రానుంది. ఈ కారును హర్యానాలోని మాన్నేసర్లో ప్లాంట్లో తయారుచేశారు. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు కూడా ఎగుమతికానుంది. భారతీయుల కోసం సపరేట్గా 5 డోర్ వెర్షన్తో రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఇంజన్ విషయానికి వస్తే..! మారుతి సుజుకీ జిమ్నీ ఇంటర్నేషనల్ వెర్షన్ 1.4-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో రానుంది. అయితే ఇండియన్ వెర్షన్ జిమ్నీ 1.5-లీటర్ కె 15 బి పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. ఇక్కడ విశేషమేమిటంటే..విటారా బ్రెజ్జా, సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 మోడల్స్లో ఇదే ఇంజిన్ను మారుతి అమర్చింది. 6000 ఆర్పిఎమ్ వద్ద 103 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది, 4400 ఆర్పిఎమ్ వద్ద 138 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అందిస్తోంది. ఈ ఎస్యూవీ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో పాటు ఆప్షనల్ 4-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్లో కూడా అందుబాటులో ఉంది. కాగా ఈ కారు ధర ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: రికార్డ్ సేల్స్, ప్రతిరోజు 400 అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు -
అరేవాహ్...! జాతీయ రికార్డును కొల్లగొట్టిన మహీంద్రా ఎక్స్యూవీ..!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సెప్టెంబర్ 30న భారత మార్కెట్లలోకి మహీంద్రా ఎక్స్యూవీ700 ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.మహీంద్రా ఎక్స్యూవీ 700 కార్లను కొనుగోలుదారులు ఎగబడి బుకింగ్ చేసుకున్నారు. కేవలం ఒక గంటలోపు 25 వేల మంది మహీంద్రా XUV700ను బుక్ చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డును మహీంద్రా ఎక్స్యూవీ రికార్డును నమోదుచేసింది. చదవండి: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత...! మహీంద్రా ఎక్స్యూవీ మరో రికార్డు...! తాజాగా మహీంద్రా ఎక్స్యూవీ700 మరో జాతీయ రికార్డును నెలకొల్పింది. చెన్నై సమీపంలోని కొత్త ఎస్యూవీ ప్రూవింగ్ ట్రాక్ (ఎమ్ఎస్పీటీ) లో జరిగిన 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్లో మహీంద్రా ఎక్స్యూవీ కొత్త జాతీయ రికార్డును సృష్టించింది.ఈ ఛాలెంజ్లోకి నాలుగు XUV700 SUV లు ఈవెంట్లో ఒక్కొక్కటి సుమారు 4000 కి.మీ. మొత్తంగా 17000 కిలోమీటర్ల మేర ప్రయాణించాయి. గతంలో ఈ రికార్డు 3161 కిలోమీటర్లతో ఉండేది. మహీంద్రా XUV700 నాలుగు వేరియంట్లలో డీజిల్ మాన్యువల్ వేరియంట్ 4384.73 కిమీలతో , డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ 4256.12 కిమీ, పెట్రోల్ మాన్యువల్ 4232.01 కిమీ చేయగా, పెట్రోల్ ఆటోమేటిక్ 4155.65 కి.మీమేర ప్రయాణించి రికార్డును సృష్టించాయి. ఈ వాహనాలు సగటున 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో నడిచాయి. చదవండి: 9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..! -
అక్టోబరులో గూర్ఖా... ధర ఎంతంటే ?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఎస్యూవీ కొత్త వెర్షన్ ధరను ప్రకటించింది. ఎక్స్షోరూంలో ధర రూ.13.59 లక్షల నుంచి ప్రారంభం. రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అక్టోబరు 15 తర్వాతి నుంచి డెలివరీలు మొదలు కానున్నాయి. ఇవి ఫీచర్స్ గూర్ఖా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 2.6 లీటర్ 91 బీహెచ్పీ మెర్సిడెస్ డిరైవ్డ్ కామన్ రైల్, డైరెక్ట్ ఇంజెక్షన్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, 5 స్పీడ్ మెర్సిడెస్ జి–28 ట్రాన్స్మిషన్, రెండు ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ పొందుపరిచారు. ఆరు రంగుల్లో లభిస్తుంది. టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో స్టీరింగ్, 500 లీటర్ల బూట్ స్పేస్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, వైపర్స్తో సింగిల్ పీస్ రేర్ డోర్, పూర్తి మెటల్ టాప్తో తయారైంది. చదవండి : దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్! -
కొత్త వేరియంట్లలో బీఎండబ్ల్యూ ఎక్స్5
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ బీఎండబ్లు్య కొత్త వేరియంట్లలో ఎస్యూవీ ఎక్స్5 ప్రవేశపెట్టింది. ధర ఎక్స్షోరూంలో రూ.77.9 లక్షల నుంచి ప్రారంభం. పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రోప్లేటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టేబుల్ రోలర్ సన్బ్లైండ్స్ వంటివి పొందుపరిచారు. ఎక్స్డ్రైవ్30డీ స్పోర్ట్ఎక్స్ ప్లస్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్, 265 హెచ్పీ, 620 ఎన్ఎం టార్క్, గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుంటుంది. ఎక్స్డ్రైవ్40ఐ స్పోర్ట్ఎక్స్ ప్లస్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 340 హెచ్పీ, 450 ఎన్ఎం టార్క్, 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో చేరుకుంటుంది. -
మహీంద్రా థార్కు పోటీగా మార్కెట్లోకి గూర్ఖా...! లాంచ్ ఎప్పుడంటే..?
Force Gurkha SUV: స్పోర్ట్స్ యూటిలీటీ వెహికిల్(ఎస్యూవీ) శ్రేణిలో మహీంద్రా థార్కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. భారత మార్కెట్లో మహీంద్రా థార్కు పోటీగా ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఎస్యూవీను ఈ నెల 15న లాంచ్ చేయనుంది. గత సంవత్సరం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పోలో ఫోర్స్ గూర్ఖా ఎస్యూవీని ప్రదర్శనకు ఉంచింది. ఈవెంట్లో చూపించిన విధంగానే ఎటువంటి మార్పులు లేకుండా బహిరంగ మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..! ఫోర్స్ మోటార్స్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫోర్స్ గూర్ఖా వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఎస్యూవీ కారు ధరలు ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఫోర్స్ గూర్ఖా ధర రూ. 8లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండవచ్చునని ఆటో మొబైల్ రంగ నిపుణుల భావిస్తోన్నారు. ఫోర్స్ గూర్ఖాకు సింగిల్-స్లాట్ గ్రిల్, ఎల్ఈడీ ప్రో ఎడ్జ్ హెడ్ల్యాంప్లతో పాటు డే టైం రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బ్రాండింగ్తో కూడిన ఫెండర్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్స్, క్లామ్షెల్ బోనెట్, వెనుక డోర్కు మౌంటెడ్ స్పేర్ వీల్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వర్టికల్ టెయిల్లైట్లు, హై-మౌంటెడ్ ఎల్ఈడీ లైట్లను గూర్ఖాకు అమర్చినట్లు తెలుస్తోంది. కారు ఇంటీరియర్స్ విషయానికి వస్తే మాట్టే బ్లాక్ డాష్బోర్డ్, సెంటర్ కన్సోల్తో గూర్ఖా రానుంది. కారులో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా అమర్చినట్లు తెలుస్తోంది. 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్ను కారులో అమర్చారు. 89 బీహెచ్పీ సామర్థ్యంతో 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయనుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో నడవనుంది. It’s just you and your adventure. And our moulded floor mats, that ensure low NVH in the cabin, make sure of that! With this, we’ve designed the interiors of the All-New Gurkha to be as breath-taking as the view outside. . . .#TheallnewGurkha #ForceGurkha #Comingsoon #StayTuned pic.twitter.com/ksnAzyAzs7 — Force Gurkha (@ForceGurkha4x4) September 9, 2021 We're thrilled & excited to reveal the All-New Gurkha in its full glory on the 15th September'21. 5 days to go! Don't forget to #savethedate. . . .#TheallnewGurkha #ForceGurkha #Comingsoon #StayTuned #GetReady #Gurkha4x4x4 pic.twitter.com/W9jbJU74WT — Force Gurkha (@ForceGurkha4x4) September 10, 2021 చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
అవనికే తొలి ప్రత్యేక ఎస్యూవీ: ఆనంద్ మహీంద్ర ఆఫర్
సాక్షి,ముంబై: టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. భారత పారా ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మాలిక్ అభ్యర్థన మేరకు ప్రత్యేక ఎస్యూవీల తయారీకి మొగ్గు చూపిన ఆయన తాజాగా అవనికి బంపర్ ఆఫర్ ప్రకటించారు ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్యూవీని ఆమెకే ఇస్తానని ప్రకటించారు. షూటింగ్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన అవనిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చదవండి : Avani Lekhara: గోల్డెన్ గర్ల్ విజయంపై సర్వత్రా హర్షం పారా ఒలింపిక్స్ అవని సాధించిన ఘనతపై దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు తనకు బంగారు పతకం లభించడంపై అవని సంతోషాన్ని ప్రకటించారు. ఈ అనుభూతిని వర్ణించ లేనిదని ప్రపంచం శిఖరానికి ఎదిగిన భావన కలుగుతోందని పేర్కొన్నారు. కాగా తన లాంటి ప్రత్యేక సామర్థ్యం ఉన్న వారికోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను దీపా మాలిక్ అభ్యర్ణించారు. తనకు ఎస్యూవీ నడపడం అంటే చాలా ఇష్టమనీ, ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. ఎవరైనా ప్రత్యేక సీట్లతో కూడిన ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకువస్తే, తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని ఆమె ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. దీపా మాలిక్ ట్వీట్పై ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఈ సవాలును స్వీకరించి వారికోసం ఎస్యూవీలను తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును కోరిన సంగతి తెలిసిందే. A week ago @DeepaAthlete suggested that we develop SUV’s for those with disabilities. Like the one she uses in Tokyo.I requested my colleague Velu, who heads Development to rise to that challenge. Well, Velu, I’d like to dedicate & gift the first one you make to #AvaniLekhara https://t.co/J6arVWxgSA — anand mahindra (@anandmahindra) August 30, 2021 Impressed with this technology.Sincerely hope Automobile world in India can give us this dignity and comfort.. I love to drive big SUVs but getting in and out is a challenge, Give me this seat n I buy your SUV @anandmahindra @TataCompanies @RNTata2000 @MGMotorIn #Tokyo2020 pic.twitter.com/0yFGwvl46V — Deepa Malik (@DeepaAthlete) August 20, 2021 -
గూర్ఖా వచ్చేస్తోంది.. మహీంద్రా థార్కు గట్టిపోటీ!
ఆఫ్రోడ్ ఎస్యూవీ సెగ్మెంట్లో రారాజుగా ఉన్న మహీంద్రా థార్కు గట్టిపోటీ ఎదురవబోతుంది. ఈ సెగ్మెంట్లో థార్కి పోటీగా గూర్ఖా తెస్తోంది ఫోర్స్ మోటార్స్ కంపెనీ. రాబోయే పండగ సీజన్లో ఈ ఎస్యూవీని మార్కెట్లో రిలీజ్ చేసేందుకు వీలుగా సన్నహకాలు చేస్తోంది. ఈ మేరకు ఇటీవల సోషల్ మీడియాలో టీజర్ వదిలింది. సెప్టెంబరులోనే ? ఆఫ్రోడ్ రైడ్ని ఇష్టపడే వారి అభిరుచులకు తగ్గట్టుగా గూర్ఖా ఎస్యూవీని ఫోర్స్ సంస్థ డిజైన్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పోలో గూర్ఖా వాహనాన్ని ప్రదర్శించింది ఫోర్స్ సంస్థ. ఇదే ఏడాది మూడో త్రైమాసికంలో ఈ వాహనాన్ని మార్కెట్లోకి తెస్తామని ప్రకటించింది. దీంతో సెప్టెంబరు చివరి నాటికి ఫోర్స్ మార్కెట్లోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. గూర్ఖా ప్రత్యేకతలు - ఫోర్ వీల్ డ్రైవింగ్తో వచ్చే ఈ థార్ జీప్లో త్రీ డోర్స్, ఫోర్ డోర్ డిజైన్లు అందుబాటులో ఉంటాయి - ఎల్ఈడీ డీఆర్ఎల్ హెడ్లైట్లను ఉపయోగించారు - ఆఫ్రోడ్ ఎస్యూవీకి తగ్గట్టుగా గ్రిల్స్, క్రోమ్, బంపర్లను డిజైన్ చేశారు. - రెండో వరుసలో కూడా కెప్టెన్ సీట్లను అమర్చే అవకాశం ఉంది - ఆఫ్రోడ్ స్పెషాలిటీ అయిన టైయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ డిజైన్ను కొనసాగిస్తున్నారు - గూర్ఖా పూర్తిగా రగ్గడ్ లుక్తో వస్తోంది. చదవండి :ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ఆపిల్ కార్లు -
కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్కే జై కొడుతున్నారు
దేశంలో కార్ల వినియోగం రోజోరోజుకు పెరిగిపోతుంది. ఆకట్టుకునే ఫీచర్లు, టెక్నాలజీతో పాటు రకరకాల మోడళ్లతో వాహన దారుల్ని కనువిందు చేస్తున్నాయి. దీంతో వాహన దారులు సరసమైన ధరల్లో తమకు కావాల్సిన కార్లను సొంతం చేసుకునేందుకు వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా సన్ రూఫ్ ఆప్షన్ ఉన్న ఎస్యూవీ వాహనాలు కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతుండగా..ఆయా ఆటోమొబైల్ సంస్థలు ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)వాహనాల్లో ఈ సన్ రూఫ్ ఫీచర్ తప్పనిసరిగా మారుతోంది. లగ్జరీ టూ బడ్జెట్ కార్లు సన్ రూఫ్..! లాంగ్ డ్రైవ్లో వెదర్ను ఎంజాయ్ చేసేందుకు వెస్ట్రన్ కంట్రీస్కు చెందిన ఆటోమొబైల్ సంస్థలు లగ్జరీ కార్లలో ఈ ఫీచర్ను యాడ్ చేసేవి. ఆ తర్వాత భారత మార్కెట్లో హై ఎండ్ కార్లలో ఈ ఫీచర్ ఉండేది. అయితే గత మూడేళ్లుగా మిడ్ రేంజ్ ఎస్యూవీలలో సన్రూఫ్ ఆప్షన్ను ప్రవేశపెట్టారు. దీంతో ఆ కార్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రానురాను సన్రూఫ్ అనేది కార్లకు తప్పనిసరి ఫీచర్గా మారింది. వాహన తయారీ సంస్థలు సైతం వివిధ బడ్జెట్లలో గ్లాస్ రూఫ్, సన్ రూఫ్, పనోరమిక్ సన్రూఫ్, స్కై రూఫ్ ఆప్షన్లను ప్రవేశపెడుతున్నాయి. అందుకు తగ్గట్టే అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ సన్ రూఫ్ ఆప్షన్ ఒక భాగమైంది. ఎస్ యూవీ వాహనాల్లో ఈ సన్ రూఫ్ ఫీచర్ ఉండడంతో సేల్స్ పెరిగిపోతున్నాయని ఆటో మొబైల్ రీసెర్చ్ సంస్థ 'జాటో' తెలిపింది. సర్వేలు ఏం చెబుతున్నాయి సన్రూఫ్ ఫీచర్కి సంబంధించి 2019తో ఇప్పటి పరిస్థితులను పోల్చితే .. సన్రూఫ్ ఆప్షన్ ఉన్న కార్ల అమ్మకాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్టు జాటో తెలిపింది. ఈ ఫీచర్ ఉండటం వల్ల కారు ప్రయాణంలో కొత్త రకం అనుభూతిని పొందడంతో పాటు ... కారు శుభ్రంగా ఉండడమే కాకుండా, శబ్ధ కాలుష్యం నుంచి దూరంగా ఉండొచ్చనే అభిప్రాయం వినియోగదారుల్లో పెరిగింది. -
చర్చకు దారి తీసిన ఆనంద్ మహీంద్ర వైరల్ వీడియో
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశారు. హైవేపై రెండు పులులు దర్జాగా నడిచి పోతున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఎప్పటిలాగానే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలోచింపజేసే పోస్టులు, ఫన్నీ వీడియోలే కాదు, నెటిజనులను ఆశ్చర్యపరిచే, వారికి ప్రేరణనిచ్చే వీడియోలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా తన తాజా పోస్ట్లో తన ఎస్యూవీ ప్రమోషన్ చేసుకున్నారు. ఈ వీడియోతో ఒక ఆసక్తికరమైన శీర్షికను కూడా యాడ్ చేశారు. ‘హైవేమీద మహీంద్ర ఎస్యూవీ ఒక్కటే టైగర్ కాదు.. ఇంకా బిగ్ కేట్స్ ఉన్నాయన్నమాట.. అద్భుతం’’ అంటూ కమెంట్ చేశారు. ఈ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ వీడియోపై ఎక్కడ ఎలా తీశారనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఆగస్ట్ 19న మహాబలేశ్వర్ సమీపంలోని పంచగని రహదారిపై పులులు కనిపించాయని ఈ వీడియో క్లిప్పింగ్లో పేర్కొన్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. మహారాష్ట్ర, చంద్రపూర్లోని తడోబాలో తీసిన చాలాకాలం క్రితం నాటి వీడియో ఇదని వ్యాఖ్యానించారు. అంతేకాదు కొంతమంది ప్రకృతి, పర్యావరణం, అడవుల ధ్వంసం, ఆయా భూభాగాలను ఆక్రమించడం లాంటి అంశాలపై నిరసనగా స్పందించారు. వాటి నివాసాలను మనం ఆక్రమించుకుంటున్నాం... ఎవరైనా మనల్ని అలా చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది.. ఊహించుకోండి.. దయచేసి వాటి మానాన వాటిని అలా ఉండనివ్వండి అని కొందరు, పాపం తమ ఇల్లు ఏమైందని ఆశ్చర్యపోతున్నట్టున్నాయంటూ విచారం వ్యక్తం చేయడం విశేషం. చదవండి: అత్తగారి అదిరిపోయే డాన్స్: చూస్తూ ఉండిపోయిన వధువు! Seems like they are wondering what has become of their home. Road through jungle, then shabas, then hotels, then restaurants, then farmhouses, then waterparks. The debate of environment v. entertainment is prolonged. — Bye Bye (@Sagar25687231) August 22, 2021 -
ఎంజీ ఎస్టర్ ఎస్యూవీ.... కీ ఫీచర్లు ఇవే
సాక్షి, వెబ్డెస్క్: ఆటోమొబైల్ ఇండస్ట్రీ టెక్నాలజీ బాట పట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతుండటంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సాంకేతిక హంగులు జోడిస్తున్నాయి. ఈ విషయంలో మిగిలిన కంపెనీల కంటే ఎంజీ మోటార్స్ ఒక అడుగు ముందే ఉంది. ఇప్పటికే రిలయన్స్ జియోతో జట్టు కట్టి నెట్ కనెక్టివిటీ అందిస్తుండగా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మీద దృష్టి సారించింది. ధర తక్కువ హెక్టార్ ఎస్యూవీతో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంజీ మోటార్, ఈసారి ఇండియన్ మార్కెట్కు తగ్గట్టుగా ఎస్టర్ పేరుతో ఎంట్రీ లెవల్ ఎస్యూవీసి మార్కెట్లోకి తెస్తోంది. ఎంజీ మోటార్స్ నుంచి తక్కువ ధరకు లభించే వాహనంగా ఇది ఇప్పటికే పేరు తెచ్చుకుంది. ఎస్టర్ ధర విషయంలోనే తక్కువని, ఫీచర్ల విషయంలో కాదంటోంది ఎంజీ మోటార్స్. సీఏఏపీ ఎంట్రీ లెవల్ ఎస్యూవీ సెగ్మెంట్లో డ్రైవర్ అసిస్టెంట్ అర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ కలిగిన తొలి మోడల్గా ఎస్టర్ నిలవనుంది. ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ లెవల్ టూ టెక్నాలజీని ఉపయోగించారు. కాన్సెప్ట్ ఆఫ్ కార్ యాజ్ ఏ ప్లాట్ఫార్మ్ (సీఏఏపీ) సాఫ్ట్వేర్ని ఇందులో అందిస్తున్నారు. ఏఐ ఫీచర్లు డ్రైవర్ అసిస్టెంట్లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైట్ డిపాచర్ ప్రివెన్షన్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ (మాన్యువల, ఇంటిలిజెంట్మోడ్), రియర్ డ్రైవ్ అసిస్టెంట్, ఇంటిలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటికి పోటీగా ఈ కారు ధర ఎంత అనేది ఇంకా ఎంజీ మోటార్స్ వెల్లడించలేదు. అయితే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ధరల శ్రేణిలోనే ఎస్టర్ ధరలు ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. -
కార్ల కంపెనీతో జియో ఒప్పందం.. నెట్ కనెక్టివిటీలో కొత్త శకం
ముంబై: ప్రయాణం చేసేప్పుడు మారుమూల ప్రాంతాల్లో తరచుగా ఎదురవుతున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్వర్క్లు చేతులు కలిపాయి. అంతరాయం లేని ఇంటర్నెట్ అందిస్తామంటూ వినియోగదారులకు హమీ ఇస్తున్నాయి, ఈ మేరకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్వర్క్ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఎంజీ ప్లస్ జియో మోరిసన్ గ్యారెజేస్ (ఎంజీ) ఇండియా నుంచి ఇప్పటికే హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లు భారతీయ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. కాగా త్వరలోనే మిడ్ రేంజ్ ఎస్యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ ఎంజీ మోటార్స్ రెడీ అవుతోంది. అయితే ఈ ఎస్యూవీలో ఇన్ఫోంటైన్మెంట్కి సంబంధించి గేమ్ ఛేంజర్ ఫీచర్ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఇంటర్నెట్ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్వర్క్తో జోడీ కట్టింది. నెట్ కనెక్టివిటీ త్వరలో రిలీజ్ చేయబోతున్న మిడ్ రేంజ్ ఎస్యూవీలో నిరంతం నెట్ కనెక్టివిటీ ఉండే ఫీచర్ని ఎంజీ మోటార్స్ జోడించనుంది. దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం జియో నెట్వర్క్ అందిస్వనుంది. కారులో నిరంతరం నెట్ కనెక్టెవిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్తో పాటు ఇతర హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను జియో అందివ్వనుంది. దీంతో ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేప్పుడు కూడా 4G ఇంటర్నెట్ను పొందవచ్చు. ఏమూలనైనా కొత్తగా వస్తున్న కార్లలో ఇన్ఫోంటైన్మెంట్ విభాగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీపీఎస్ నావిగేషన్తో పాటు ఆడియో, వీడియోలకు సంబంధించి లేటెస్ట్ ఫీచర్లు యాడ్ చేస్తున్నారు. అయితే ఇంటర్నెట్ లేకపోతే ఇందులో సగానికి పైగా ఫీచర్లు నిరుపయోగమే,. దీంతో కారులో ప్రయాణించే వారు పల్లె పట్నం తేడా లేకుండా ఏ మూలకు వెళ్లినా నెట్ కనెక్టివిటీ లభిస్తుంది. టెక్నాలజీలో నంబర్ 1 జియోతో చేసుకున్న తాజా ఒప్పందం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టెక్నాలజీకి సంబంధించి తమ బ్రాండ్ నంబర్వన్గా నిలుస్తుందని ఎంజీ మోటార్స్ ప్రెసిడెంట్స్, ఎండీ రాజీవ్ చాబా అన్నారు. కనెక్టివీటీ, ఇన్ఫోంటైన్మెంట్, స్ట్రీమింగ్, టెలిమాటిక్స్ విషయంలో ఇప్పటి వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న అవరోధాలు తీరిపోతాయని జియో ప్రెసిడెంట్ కిరణ్ థామస్ అన్నారు. -
స్కోడా ‘కుషాక్’ వచ్చింది..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ స్కోడా తాజాగా కుషాక్ మోడల్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద రూపొందించిన ఈ తొలి మోడల్ ద్వారా కంపెనీ మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. వేరియంట్నుబట్టి ధర ఢిల్లీ ఎక్స్షోరూంలో రూ.10.5 లక్షల నుంచి రూ.17.6 లక్షల వరకు ఉంది. 1 లీటర్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్లతో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్తోపాటు 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ రకాలతో వాహనం తయారైంది. హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, ఆరు వరకు ఎయిర్బ్యాగ్స్ వంటివి అదనపు హంగులు. జూలై 12 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 30,000, వచ్చే సంవత్సరం 60,000 యూనిట్ల అమ్మకం లక్ష్యంగా చేసకున్నట్టు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. -
అదిరే అల్కాజర్, సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో సందడి
కరోనా కారణంగా కొత్త కార్ల తయారీ, విడుదల ఆగిపోయింది. అయితే పరిస్థితులు అదుపులోకి రావడంతో కొత్త కొత్త కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ 7 సీట్ల సామర్థ్యంతో ప్రీమియం ఎస్యూవీ- 'అల్కాజర్ వచ్చే వారం మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ కార్ను ప్రీ ఆర్డర్ కోసం హ్యుందాయ్ ప్రతినిధులు అందుబాటలోకి తెచ్చారు. రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ మరియు రెండు ఇంజన్ ఆప్షన్లతో ఈ కార్ రాబోయే హ్యుందాయ్ ఎస్యూవీ టాటా సఫారి వంటి కార్లతో పోటీ పడుతుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే కొత్త అల్కాజర్ ఎస్యూవీని ఎన్ని ట్రిమ్ లెవల్లో అందిస్తుందో హ్యుందాయ్ ఇండియా ధృవీకరించలేదు. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. హ్యుందాయ్ ఎస్యూవీ సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (ఓ), ప్లాటినం మరియు ప్లాటినం (ఓ) అనే మొత్తం ఆరు ట్రిమ్ లెవల్స్ అందుబాటులో ఉంచవచ్చని తెలుస్తోంది. హ్యుందాయ్ అల్కాజర్ యొక్క సెగ్మెంట్ వీల్బేస్ 2,760 మి.మీటర్లుగా ఉంది. దీంతో పాటు.. • 10.25 అంగుళాల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే • 8స్పీకర్లతో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం • AQI డిస్ప్లేతో ఎయిర్ ప్యూరిఫైయర్ • సీట్ల ముందు భాగంగా వాటర్ బాటిల్, బుక్స్ పెట్టుకునేలా సెట్ బ్యాక్ టేబుల్ • వాయిస్-ఎనేబుల్డ్ స్మార్ట్ పనోరమిక్ సన్రూఫ్ • మంచు, ఇసుక వంటి ప్రదేశాల్లో కార్ ను కంట్రోల్ చేసే ట్రాక్షన్ కంట్రోల్ మోడేస్ • హ్యుందాయ్ బ్లూ లింక్ కనెక్ట్ చేసిన కార్ సిస్టమ్ • యాంబెంట్ వేరియంట్స్ 64రంగుల కలర్స్ తో లైంటింగ్ • హ్యుందాయ్ బ్లూ లింక్ కనెక్ట్ చేసిన కార్ సిస్టమ్ హ్యుందాయ్ అల్కాజర్ ఇంజిన్ వివరాలు రాబోయే హ్యుందాయ్ అల్కాజర్ ఎస్యూవీకి ఒక పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజిన్లను డిజైన్ చేశారు. పెట్రోల్ మోటారు 2.0-లీటర్ ఎంపిఐ యూనిట్ ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 157 బిహెచ్పి మరియు 191 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరొకటి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. ఇది బెల్ట్లు 113 బిహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ మరియు ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో రెండు ఇంజిన్లను రెండు ట్రాన్స్మిషన్లతో హ్యుందాయ్ అల్కాజర్ మార్కెట్లో సందడి చేస్తోంది. చదవండి : సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ను రూపొందించిన విద్యార్థులు -
ఎస్యూవీ కారులో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు
మియామి: అమెరికాలో ఆదివారం మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫ్లొరిడా రాష్ట్రంలోని మియామి నగరంలో గుర్తు తెలియని దుండగులు ఎస్యూవీ కారులో వచ్చి పార్టీలో ఉన్న అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. అర్థరాత్రి 12 గంటల తర్వాత దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మియామి పోలీస్ డైరెక్టర్ ఆల్ఫ్రెడో రామిరెజ్ పేర్కొన్నారు. మియామిలోని బిలియర్డ్స్ క్లబ్ వద్దకు అర్థరాత్రి 12 గంటల సమయంలో నిస్సాన్ ఎస్యూవీ కారు వచ్చి ఆగిందని.. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు వ్యక్తులు గన్స్తో కిందకు దిగి క్లబ్ నుంచి బయటకు వస్తున్న ఒక గుంపుపై కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు రామిరెజ్ తెలిపారు. కాల్పులు జరిగే సమయంలో 20 నుంచి 25 మంది ఉన్నారని.. వారిలో ఇద్దరు చనిపోయారని.. మిగతావారిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించామని.. కాల్పులకు పాల్పడ్డ దుండగులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: 41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి -
ఘోర రోడ్డు ప్రమాదం :15 మంది దుర్మరణం
వాషింగ్టన్: అమెరికా-మెక్సికో సరిహద్దు సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దక్షిణ కాలిఫోర్నియా- మెక్సికో సరిహద్దులోని స్టేట్ రూట్ 115, ఇంపీరియల్ కౌంటీలోని నోరిష్ రోడ్లో యూఎస్వీ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే కన్నుమూయగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు ఎల్ సెంట్రో రీజినల్ మెడికల్ సెంటర్ అత్యవసర విభాగం డైరెక్టర్ జూడీ క్రజ్ తెలిపారు. ఎస్యూవీని ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో అందులో చిక్కుకున్న వారిని, మృతదేహాలను వెలికి తీసేందుకు శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. బాధితులంతా 15 నుంచి 53 ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులు ఉన్నారని,డ్రైవర్ కూడా తీవ్ర గాయాలపాలైనట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు జాతీయ రవాణా భద్రతా బోర్డు వెల్లడించింది. కెపాసిటీకి మించి తీసుకు వెళుతూ ప్రమాదానికి గురైందనీ, దాదాపు సుమారు 27 మంది వరకు ఉన్నట్లు స్తానిక బోర్డర్ డివిజన్ చీఫ్ ఆర్టురో ప్లేటెరో పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మెక్సికన్ పౌరులు ఉన్నారని, ఇతరుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. -
టెస్లాకి షాకిస్తున్న హ్యుందాయ్
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో ఈ-వెహికల్స్కు పెట్టింది పేరైన అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ దేశంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ మౌతోంది. మరోవైపు హ్యుండాయ్ కంపెనీ తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఐయోనిక్ 5 టీజర్ను విడుదల చేసింది. సూపర్బ్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో టెస్లాకు షాక్ ఇవ్వనుందంటూ ఈ టీజర్పై చర్చ టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. భారీ డిజిటల్ స్క్రీన్ సహా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్తో పాటు ఎల్ఇడి యాంబియంట్ లైటింగ్ లాంటి అల్ట్రా-మోడరన్ టెక్నాలజీతో దీన్ని రూపొందించింది. ఐయోనిక్ 5లో యూనివర్సల్ ఐలాండ్ కన్సోల్ ద్వారా ముందు, వెనుక సీట్లను ముందుక వెనుకకు మూవ్ కావడం విశేషంగా నిలుస్తోంది.దీని సహాయంతో డ్రైవర్ , ప్రయాణీకులు ఇద్దరూ ఇరువైపుల నుండి వాహనంలోకి ప్రవేశించడానికి లేదా నిష్క్రమించే సౌలభ్యం ఉంటుందనీ హ్యుందాయ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫామ్పై లివింగ్ స్పేస్ థీమ్తో మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. ఈ టీజర్పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఫిబ్రవరి 23న వరల్డ్ ప్రీమియర్ షోకి రెడీ అవుతున్న తరుణంలో హ్యుందాయ్ దీన్ని విడుదల చేసింది. గత నెలలోనే హ్యుందాయ్ ఐయోనిక్ 5 ని రిలీజ్ చేసిన సందర్భంలోనే కొత్త వెర్షన్ ఐదు నిమిషాల ఛార్జింగ్తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐయోనిక్ 5 ఇంటీరియర్లో వాడిన మెటీరియల్ కూడా ఎకో ప్రాసెస్డ్ లెదర్ను వినియోగించింది. అలాగే కారు మొత్తం సహజసిద్దమైన పెయింట్, రీసైకిల్డ్ ఫైబర్ వాడారు. సీట్లను కవర్ చేసే ఈ ఎకో లెదర్కి తోడు అవిసెగింజల నూనె నుంచి తీసిన డైలతో పెయింట్ వేసినట్లు కంపెనీ ప్రకటించింది. కారులోని క్యాబిన్లో కూడా ఊలు, పాలీయార్న్ కూడా చెరకు నుంచి ఉత్పన్నమైన ఫైబర్ను వినియోగించింది. అంతేకాదు పర్యావరణ హితంగా పెట్ బాటిల్స్..వాటినుంచి ఫైబర్ చేసి ఐకానిక్ 5కి వాడిందట. ఫ్లోర్ మాట్స్, కారు డ్యాష్ బోర్డ్, స్విచ్చులు, స్టీరింగ్ వీల్, డోర్ ప్యానెల్స్ జొన్న,తదితర పూల నుంచి తీసిన బయో కాంపొనెంట్స్తో కోటింగ్ ఇవ్వడం మరో హైలైట్. ఇదంతా పర్యావరణానికి సంబంధించిన కోణమైతే, కారులోపల డ్రైవర్తో పాటు ఫ్రంట్ సీట్లో కూర్చునేవారు హాయిగా రిలాక్స్ అవడానికి లెగ్ రెస్ట్ సదుపాయాన్ని జోడింది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పూర్తయ్యేవరకూ ఈ ఇద్దరూ హ్యాపీగా రిలాక్స్ అయ్యేలా డిజైన్ చేసింది. పెద్దలు, పిల్లలు, వెనుక కూర్చున్న పెంపుడు జంతువుల కోసం కూడా సీట్ల అరేంజ్మెంట్ కూడా మనకి అవసరమైనట్లుగా రీపొజిషన్ చేసుకోవచ్చు. [#HMG] #IONIQ5’s Living Space and Sustainable Interior. IONIQ 5 virtual world premiere on February 23, 2021. #IONIQ #EV #Hyundai pic.twitter.com/t1ucBmW81v — Hyundai Motor Group (@HMGnewsroom) February 15, 2021 -
బీఎండబ్ల్యూ ఎక్స్3 కొత్త వేరియంట్
సాక్షి, ముంబై: జర్మనీ కంపెనీ బీఎండబ్ల్యూ తన ఎస్యూవీ మోడల్ ఎక్స్3లో ‘‘స్పోర్ట్ఎక్స్’’ పేరుతో పెట్రోల్ వేరియంట్ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 56.5 లక్షలుగా ఉంది. ఇందులో 252 హెచ్పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేసే రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్ను అమర్చారు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను కలిగి ఉంది. ఈ కొత్త వేరియంట్ 6.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దేశీయంగా చెన్నై ప్లాంట్లో తయారయ్యే ఈ కారు అమ్మకాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 28 లోపు ఆన్లైన్లో బుకింగ్స్ చేసుకునే కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా సర్వీస్ ప్యాకేజీతో పాటు రూ.1.50 లక్షల విలువైన ఉపకరణాలను ఉచితంగా పొందవచ్చని కంపెనీ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా బీఎమ్డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పాహా మాట్లాడుతూ ... బీఎమ్డబ్ల్యూ ఎక్స్3 పరిధిని పెంచే ప్రణాళికల్లో భాగంగా పెట్రోల్ వేరయంట్లో స్పోర్ట్స్ఎక్స్ వేరియంట్ను విడుదల చేశామన్నారు. -
ఎంజీ హెక్టార్ సరికొత్తగా, ధర ఎంత?
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన ఎస్యూవీ హెక్టార్లో 8-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో కొత్త వేరియంట్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీ షోరూం వద్ద దీని ప్రారంభ ధర రూ.16.51 లక్షలుగా ఉంది. మెరుగైన బ్యాటరీ ప్యాక్, చక్కటి డ్రైవింగ్ శ్రేణితో వీటిని తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్లో ఐదు సీట్లతో హెక్టార్ 2021, ఆరు సీట్లతో హెక్టార్ ప్లస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పెట్రోల్ హెక్టార్ ఇప్పుడు మొత్తం నాలుగు ఆప్షన్లో లభ్యం కానుంది. మాన్యువల్, హైబ్రీడ్ మాన్యువల్, డ్యూయల్ - క్లచ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఆవిష్కరించిన సీవీటీ ఆప్షన్ వెర్షన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ప్రయాణాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 12.89 లక్షలు నుండి రూ. 18.42 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఎంజీ హెక్టార్ సీవీటీ వేరియంట్లో స్మార్ట్, షార్ప్ ట్రిమ్ మోడళ్ల ధరలు రూ. 16.51 లక్షలు -18.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆరు సీట్ల హెక్టార్లోప్లస్ కూడా కొత్త సీవీటి గేర్బాక్స్ను జోడించింది. వీటి ధరలు 17.21 లక్షలు - 18.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తాయి. -
నిస్సాన్ తొలి కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాహన రంగంలో అధిక పోటీ ఉండే కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలోకి నిస్సాన్ మోటార్ అడుగుపెట్టింది. ప్రారంభ ధర రూ.4.99 లక్షలతో బుధవారం తన కాంపాక్ట్ ఎస్యూవీ ‘మాగ్నైట్’ మోడల్ను ఆవిష్కరించింది. మాన్యువల్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఆప్షన్లలో ఇది లభ్యమవుతుంది. ఈ మోడల్ దేశంలోని మారుతీ విటారా, బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్యూవీ 300 హోండా డబ్ల్యూఆర్–వీలతో పోటీ పడనుంది. ఈ కారు రెండు పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఒక లీటరు పెట్రోల్ వేరియంట్లో లభ్యమయ్యే మోడల్ ధరలు రూ.4.99– రూ.7.55 లక్షల మధ్య ఉండగా.., ఒక లీటరు టర్బో పెట్రోల్ వేరియంట్ మోడల్ ధరలు రూ.6.99–రూ.8.45 లక్షల మధ్య ఉన్నాయి. ఈ ధరలు ఈ ఏడాది చివరి తేది డిసెంబర్ 31 నాటి వరకే వర్తిస్తాయి. ఇందులో 8 అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ యాపిల్ కార్డ్ప్లే, అండ్రాయిడ్ ఆటో, టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ ఏసీ, పుష్బటన్ స్టార్ట్, క్రూజ్కంట్రోల్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
కొత్త మహీంద్రా థార్ వచ్చేసింది
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా 2020 థార్ వాహనాన్ని విడుదల చేసింది. ఎస్యూవీ ప్రియుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత, మహీంద్రా బీఎస్-6 ప్రమాణాలతో కొత్త థార్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర 9.8 లక్షలు. గరిష్ఠ ధరను 13.75 లక్షల (ఎక్స్ షోరూం) ఉంటుందని కంపెనీ ప్రకటించింది. థార్ ఏఎక్స్, ఎల్ఎక్స్ మోడళ్లలో పెట్రోల్, డీజిల్ వెరియెంట్లలో కొత్త థార్ అందుబాటులో ఉంది. ధరలు పెట్రోల్ ఏఎక్స్ వేరియంట్ల ధరలు 9.8 లక్షల నుంచి ప్రారంభమై 11.9 లక్షల వరకు, డీజిల్ ఏఎక్స్ వేరియంట్లు 9.8 లక్షల నుంచి 12.2 లక్షల వరకు ఉన్నాయి. ఇక పెట్రోల్ ఎల్ఎక్స్ వేరియంట్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ధరను కంపెనీ 12.49 లక్షలుగా, డీజిల్ ఎల్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గరిష్ఠ ధరను 12.95 లక్షలుగా పేర్కొంది. పెట్రోల్ వెర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో వస్తున్న ఎల్ఎక్స్ మోడల్ గరిష్ఠ ధరను 13.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. శుక్రవారం నుంచి బుకింగ్స్ ఓపెన్ కాగా, ఈ నెల చివరినుంచి డెలివరీ ప్రారంభం కానుంది. థార్ వేరియంట్లు, ఫీచర్లు 2 లీటర్ల ఇంజిన్, 150 బీహెచ్పీపవర్ ను అందిస్తాయి. డీజిల్ వేరియంట్లు 2.2 లీటర్ల ఇంజిన్తో 130 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 17.7 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్ , 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ కొత్త డిజైన్ తోపాటు, 4 ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు, 2+4 సైడ్ ఫేసింగ్ సీట్లను ఇందులోఅమర్చింది. పాత వినియోగదారులతోపాటు, కొత్త కస్టమర్లలో తమ కొత్త థార్ వాహనానికి ఆదరణ పెరుగుందని నమ్ముతున్నామనొ ఎంఅండ్ఎం సీఎండీ పవన్ గోయెంకా వెల్లడించారు. -
పావురానికో గూడు.. భళా ప్రిన్స్!
బాల్కనీలోకి పక్షులు రాకుండా నెట్లు వేసుకుంటున్న ప్రస్తుత సమయంలో ఒక ఆసక్తికరమైన సంగతి నెట్లో చక్కర్లు కొడుతోంది. పావురం గూడు కోసం ఖరీదైన కారును కూడా పక్కన పెట్టిన వైనం నెటిజనుల ప్రశంసలందుకుంటోంది. (భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో చూడండి!) వివరాలను పరిశిలిస్తే.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్కు చెందిన మెర్సిడెస్ బెంజ్ ఎస్యూవీ విండ్షీల్డ్పై ఒక పావురం జంట గూడు చేసుకొని, గుడ్లు కూడా పొదగడం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్స్ ఆ గూడుకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా కారును వాడకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే కారు చుట్టూ రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాదు దీనికి సంబంధించిన టైమ్ ల్యాప్ వీడియోను ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కొన్నిసార్లు జీవితంలో చాలా చిన్న విషయాలు సరిపోతాయంటూ కమెంట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. పోస్ట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే 10లక్షలకు పైగా వ్యూస్ను సాధించింది. View this post on Instagram A post shared by Fazza (@faz3) on Aug 12, 2020 at 5:57am PDT -
కియా నుంచి ఎస్యూవీ సోనెట్
సాక్షి, అమరావతి: కియా మోటార్స్ మేడిన్ ఆంధ్రా సరికొత్త స్మార్ట్ అర్బన్ కాంపాక్ట్ ఎస్యూవీ ‘సోనెట్’ను శుక్రవారం వర్చువల్గా ఆవిష్కరించింది. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో సెల్టోస్ తర్వాత తయారైన రెండవ కారు ఇది. వచ్చే పండుగల సీజన్కు ఈ కారును వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ కారును వర్చువల్గా ఆవిష్కరిస్తూ కియా మోటార్ కార్పొరేషన్ సీఈవో హూ సంగ్ సాంగ్ మాట్లాడుతూ ప్రపంచ శ్రేణి నాణ్యతతో రూపొందించిన ఈ కారుడ్రైవర్తో పాటు ప్రయాణికులకు విన్నూతనమైన ఆనందాన్ని అందిస్తుందన్నారు. భారతదేశంలో వృద్ధి చెందుతున్న ఎస్యూవీ మార్కెట్ అవసరాలను సోనెట్ తీర్చడమే కాకుండా విస్తృత శ్రేణి వినియోగదారులు కియా బ్రాండ్ పట్ల మరింతగా ఆకర్షితులవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కియా మోటర్స్ ఇండియా ఎండీ, సీఈవో కూఖ్యున్ షిమ్ మాట్లాడుతూ ప్రపంచం కోసం ఇక్కడ తయారైన కారుగా సోనెట్ను అభివర్ణించారు.సెల్టోస్, కార్నివాల్ తర్వాత మరో విభాగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తుందన్నారు. డ్రైవర్కు అలసట లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేసే విధంగా క్లచ్ పెడల్ లేకుండా మాన్యువల్ ట్రాన్స్మిషన్స్, సిక్స్ స్పీడ్ స్మార్ట్ స్ట్రీమ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రిన్స్మిషన్ వంటి 30కిపైగా ప్రత్యేకతలు ఈ సోనెట్ సొంతం. ఈ ఎస్యూవీ ధరను కియా ఇంకా ప్రకటించలేదు. -
మారుతి ఎస్-క్రాస్ పెట్రోల్.. ధర ఎంతంటే
సాక్షి, ముంబై: దేశీయకార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ వెర్షన్ ఆవిష్కరించింది. కరోనా వైరస్ సంక్షోభం నుంచి తేరుకున్న ఆటో మేజర్ మారుతి ఎస్-క్రాస్ పెట్రోల్ కారును దేశంలో లాంచ్ చేసింది. దీని 8.39 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి. మారుతి సుజుకి ఎస్-క్రాస్లోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 103 బిహెచ్పీ, 138 ఎన్ఎమ్ పీక్ టార్క్ను అందిస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లలో, నాలుగు వేరియంట్లలో లభ్యం. ఈ మోడల్ను కంపెనీ నెక్సా డీలర్షిప్ల ద్వారా మాత్రమే కాకుండా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్లు ఇప్పటికే మొదలు కాగా డెలివరీలు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయి. మారుతి సుజుకి ఎస్-క్రాస్ పెట్రోల్ ధరలు ఎస్-క్రాస్ పెట్రోల్ సిగ్మా 8.39 లక్షల రూపాయలు ఎస్-క్రాస్ పెట్రోల్ డెల్టా మాన్యువల్ ధర 9.60 లక్షల రూపాయలు, ఆటోమేటిక్ వెర్షన్ ధర 10.84 లక్షలు ఎస్-క్రాస్ పెట్రోల్ జీటా మాన్యువల్ 9.95 లక్షల రూపాయలు, ఆటోమేటిక్ వెర్షన్ ధర 11.19 లక్షలు ఎస్-క్రాస్ పెట్రోల్ ఆల్ఫా మాన్యువల్ 11.16 లక్షల రూపాయలు , ఆటోమేటిక్ వెర్షన్ ధర 12.39 లక్షలు -
సరికొత్తగా హ్యుందాయ్ వెన్యూ వెర్షన్లు
సాక్షి,న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూలో కొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఐఎంటీ) అమర్చిన వెర్షన్ను బుధవారం విడుదల చేసింది. ఐఎంటీ వెర్షన్ వెన్యూ ఎస్యూవీ ప్రారంభ ధర 10.20లక్షలు (ఎక్స్ షోరూమ్, పాన్ ఇండియా). దీంతో పాటు స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్ను కూడా పరిచయం చేసింది. దీని ధర 10-11.58 లక్షల రూపాయల మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఐఎంటీ వెర్షన్ ఎస్యూవీ ద్వారా వినియోగదారులకు క్లచ్ పెడల్ ఫ్రీ డ్రైవ్ను అందిస్తున్నామని, అయితే సిక్స్-స్పీడ్ ట్రాన్స్మిషన్ మాన్యువల్ గేర్ షిఫ్ట్తో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కప్పా 1.0 లీటర్ టీ-జీడీ బీఎస్-6 పెట్రోల్ ఇంజన్ అమర్చామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఎండీ ఎస్ఎస్ కిమ్ ప్రకటించారు. ఇందులో ఎలక్ట్రోమెకానికల్ యాక్చుయేటెడ్ క్లచ్ ఉంటుందన్నారు. ఐఎంటీ వెన్యూ, స్పోర్ట్ ట్రిమ్కార్ల విడుదల ద్వారా మరోసారి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నామన్నారు. హ్యుం ఇంటెండేషన్ సెన్సార్, హైడ్రాలిక్ యాక్యుయేటర్ , ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్తో ట్రాన్స్మిషన్ గేర్ షిఫ్ట్ లివర్ను ఐఎంటీ టెక్నాలజీ ద్వారా కస్టమర్లకు స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తున్నట్టు కంపెనీ వివరించింది. వివిధ భాగాల మధ్య సమైక్య తర్కాన్ని చేర్చడం ద్వారా అతుకులు లేని డ్రైవ్ అనుభవాన్ని అందించడానికి సిస్టమ్ రూపొందించబడింది. స్పోర్ట్ వేరియంట్లో 1.5 లీటర్ డీజిల్ బీఎస్-6 ఇంజిన్ (6 ఎమ్టి) తో పాటు కప్పా 1.0 లీటర్ టీ-జీబీ పెట్రోల్ బీఎస్-6 ఇంజిన్ ఇంజిన్పై ఐఎఎంటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ వెన్యూ స్పోర్ట్ ట్రిమ్ రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. -
కోవిడ్ పేషెంట్ల కోసం లగ్జరీ కారు అమ్మాడు
ముంబై: కళ్ల ముందే ఫ్రెండ్ సోదరి ప్రాణాలు కోల్పోయింది. బతికించుకునే ఆర్థిక స్థోమత ఉన్నా ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొరత, పడకలు ఖాళీగా లేకపోవడం వల్ల ఆమె కడుపులో బిడ్డతో సహా మరణించాల్సి వచ్చింది. ఇది చూసిన ముంబైకి చెందిన షెహనవాజ్ మనసు చలించిపోయింది. కనీసం ఆక్సిజన్ సిలిండర్ ఉన్నా ఆమె బతికి ఉండేదని ఓ వైద్యుడు చెప్పడంతో అతను మరింత బాధపడ్డాడు. అదే సమయంలో అతని మనసులో పదిమందికి సాయం చేయాలనే ఆలోచన పునాది పోసుకుంది. ఆ మహిళలాగా ఎవరూ చనిపోవడానికి వీల్లేదంటూ తనకు చేతనైన సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. (మృతదేహాలకు కరోనా పరీక్షలు బంద్) కరోనా బారిన పడ్డ పత్రి ఒక్కరికీ ఆసుపత్రిలో బెడ్డు దొరకని పరిస్థితి అందరికీ తెలిసిందే. అటు ఆసుపత్రులనూ వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత వెంటాడుతోంది. ఈ క్రమంలో ఇంట్లో స్వీయ నిర్బంధం విధించుకుంటున్న కోవిడ్ పేషెంట్లకు సాయం చేసేందుకు షెహనవాజ్ తనకు ఎంతో ఇష్టమైన ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్) కారును అమ్మేశాడు. ఆ డబ్బుతో 60 సిలిండర్లను కొని మరో 40 సిలిండర్లను అద్దెకు తీసుకున్నాడు. వీటిని సకాలంలో కోవిడ్ బాధితులకు అందజేసి ప్రాణదాతగా మారాడు. అలా సుమారు 300 మందికి సాయం చేశాడు. కాగా షెహనవాజ్ తన మిత్రుడు అబ్బాస్ రిజ్వీతో కలిసి ఓ ఎన్జీవో నడిపిస్తున్నాడు. సాయం కోసం ఎన్జీవో తలుపు తట్టినవారికి తామున్నామంటూ అండగా నిలబడుతున్నారు. కరోనా కష్టకాలంలో వీరు చేస్తున్న పని ఇతరులకు ఆదర్శప్రాయంగా మారింది. (తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం) -
గంభీర్ ఇంట్లో చోరీ.. పోలీసులకు సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తండ్రి కారు చోరీకు గురైంది. తన ఇంటి ఆవరణలోని ఎస్యూవీ కారు దొంగతనానికి గురైందని గంభీర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం తెల్లవారుజామున ఈ కారు చోరీకి గురైందని పోలీసులు గుర్తించారు. ఎంపీ ఇంట్లో కారు చోరీకి గురికావడాన్ని రాజేంద్రనగర్ పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఢిల్లీ సెంట్రల్ డీసీపీ ఆధ్వర్యంలో పలు పోలీసు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూనే మరోవైపు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా గౌతమ్ గంభీర్ తన తండ్రితో కలిసి రాజేంద్రనగర్లోనే నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. (‘అవే గంభీర్ కొంప ముంచాయి’) ఇక ఢిల్లీలో ప్రముఖల ఇళ్లే లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు కూడా చోరీకి గురైన విషయం తెలిసిందే. తన బ్లూ కలర్ వాగనార్ కారు చోరీకి గురవడంపై సీఎం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కారుతో తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేజ్రీవాల్ పలుసందర్బాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఎట్టకేలకు దానిని పోలీసులు గుర్తించడంతో కథ సుఖాంతమైంది. (సౌరవ్ గంగూలీ రేసులో లేడు..కానీ) -
రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం తెల్లవారుజామున తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా బ్యాలదకెరె గేట్ వద్ద బెంగళూరు – మంగళూరు జాతీయ రహదారి (ఎన్హెచ్–75)పై ఈ ఘటన జరిగింది. రోడ్డు డివైడర్ను ఢీకొన్న ఎస్యూవీ అనంతరం కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో నలుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని హోసూరుకు చెందిన మంజునాథ్ కుటుంబం ధర్మస్థలానికి వెళ్లింది. అనంతరం టవేరా వాహనంలో తిరుగు పయనమయ్యారు. ఇదే సమయంలో బెంగళూరు నుంచి బ్రిజా కారులో నలుగురు స్నేహితులు ధర్మస్థల వైపు వెళుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కుణిగల్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి పల్టీలు కొడుతూ రోడ్డుకు అటువైపుగా దూసుకెళ్లి, అటునుంచి వస్తున్న టవేరా వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్నవారిలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. అమృతూరు పోలీసులు రెండు కార్లలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. -
స్కోడా తొలి ఇ-వాహనం ఎన్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా ఆటో తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీని త్వరలో లాంచ్ చేయనుంది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ద్వారా స్కోడా బ్రాండ్ తన 125 సంవత్సరాల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీయనుంది. వాహనం పేరు చివరలో క్యూ(ఇంగ్లీషు లెటర్) చేర్చే తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ‘ఎన్యాక్’ అని కొత్త వాహనానికి పేరు పెట్టింది. ఈ పేరు ఎలా వచ్చిందంటే..ఎన్యాక్ అనే పేరును ఐరిష్ భాషలోని ఎన్యా నుంచి తీసుకున్నట్టు స్కోడా వెల్లడించింది. ఎన్యా అర్థం 'జీవన మూలం’, (సోర్స్ ఆఫ్ లైఫ్). ఎన్యాక్ అంటే చైతన్యం, సామర్థ్యం మేళవింపుగా దీన్ని తీసుకురాబోతున్నట్టు స్కోడా ప్రకటించింది. తన కొత్త ఈ వాహనం పేరు విషయంలో క్యూ అక్షరంతో ముగిసే స్కోడా ఎస్యూవీలు (కామిక్, కోడియాక్, కరోక్) తరహానే అనుసరించింది. దీంతోబాటు ఇ-మొబిలిటీ ఎరాలో తన ఉనికిని చాటుకునేందుకు గుర్తుగా కూడా ఎన్యాక్ ఎలక్ట్రిక్ కారు పేరు అతికినట్టు సరిపోతుంది. స్కోడా ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఖచ్చితంగా విస్తృతంగా ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎన్యాక్ ఎపుడు ఏయే మార్కెట్లలో లాంచ్ చేసేది, ఫీచర్లు,డిజైన్ తదితర వివరాలపై ఇంకా స్పష్టత లేదు. స్కోడా ఎన్యాక్ డిజైన్పై అంచనా -
మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2020 లోకొత్త విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్యూవీని మారుతి సుజుకి లాంచ్ చేసింది. దేశంలో అమలు కానున్న ఉద్గార నిబంధనలు నేపథ్యంలో బీఎస్-6 1.5 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజీన్తో గురువారం ఆవిష్కరించింది. సరికొత్త వెర్షన్లో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను అందిస్తుంది. కాంపాక్ట్ ఎస్యూవీలలో విటారా బ్రెజ్జా ఉన్నతంగా నిలిచిందని మారుతి సుజుకి ఇండియా సీఎండీ కెనిచి ఆయుకావా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ, ప్రీమియంలో వస్తున్న ఆదరణకు తగినట్టుగా, విటారా బ్రెజ్జా మరింత స్పోర్టియర్గా మరింత శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. కస్టమర్ల నుంచి భారీ స్పందనను ఆశిస్తున్నట్టు తెలిపారు. విటారా బ్రెజ్జా 1.5 లీటర్ కె-సిరీస్ బీఎస్ 6 పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 138 ఎన్ఎం వద్ద 4400 ఆర్పీయం టాప్ ఎండ్ టార్క్, పెప్పీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2016లో లాంచ్ చేసిన విటారా బ్రెజ్జా వాహనం నాలుగేళ్లలో 500,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయని వెల్లడించింది. చదవండి : ఆటో ఎక్స్పో సందడి షురూ: కార్ల జిగేల్.. జిగేల్ అదరగొడుతున్న పియాజియో స్కూటీలు -
మార్కెట్లోకి మెర్సిడెస్ ‘ఎల్డబ్ల్యూబీ జీఎల్ఈ’
ముంబై: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్–బెంజ్ ఇండియా’ తన ఎస్యూవీ పోర్ట్ఫోలియోలోని లాంగ్ వీల్ బేస్ (ఎల్డబ్ల్యూబీ) జీఎల్ఈలో రెండు నూతన వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటిలో ‘ఎల్డబ్ల్యూబీ జీఎల్ఈ 300 డీ’ ధర రూ. 73.70 లక్షలు కాగా.. హిప్–హాప్ వేరియంట్గా కంపెనీ వ్యవహరిస్తున్న ‘ఎల్డబ్ల్యూబీ జీఎల్ఈ 400 డీ’ ధర రూ. 1.25 కోట్లు. ఎంట్రీ లెవెల్ మోడల్లో 2.0 లీటర్ల 4–సిలిండర్ డీజిల్ ఇంజిన్ను.. హిప్–హాప్లో 3.0 లీటర్ల 6–సిలిండర్ డీజిల్ ఇంజిన్ అమర్చింది. జీఎల్ఈ మోడల్ 7.2 సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 225 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని సంస్థ వెల్లడించింది. లగ్జరీ ఎస్యూవీ విభాగంలో జీఎల్ఈ మోడల్ అత్యధిక అమ్మకాలను నమోదుచే సిందని సంస్థ సీఈఓ మార్టిన్ ష్వెంక్ అన్నారు. -
హ్యుందాయ్ ‘ఆరా’.. ఆగయా
చెన్నై: హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన కొత్త కాంపాక్ట్ సెడాన్ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ), కాంపాక్ట్ హ్యాచ్బాక్ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్డీ, సీఈఓ ఎస్.ఎస్. కిమ్ పేర్కొన్నారు. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో వెనకబడి ఉన్నామని, కొత్త ఆరా కారుతో ఆ సెగ్మెంట్లో కూడా మంచి అమ్మకాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఎస్ 6 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభ్యమవుతుందని చెప్పారాయన. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, వైర్లెస్ చార్జింగ్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, స్వెప్ట్బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, బూమరాంగ్ షేప్లో ఉండే ఎల్ఈడీ డే రన్నింగ్ లైట్స్ తదితర ఫీచర్లున్నాయని తెలియజేశారు. కాగా ఈ కారు ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్షోరూమ్ ధరలు) శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ కారు మారుతీ డిజైర్, హోండా అమేజ్, ఫోక్స్వ్యాగన్ అమియో, ఫోర్డ్ ఆస్పైర్, టాటా టిగొర్, టొయోటా యారీలకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
మార్కెట్లోకి టాటా ఎలక్ట్రిక్ ఎస్యూవీ
ముంబై: వాహన దిగ్గజం టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్యూవీ మోడల్, నెక్సాన్లో ఎలక్ట్రిక్ వేరియెంట్.. నెక్సాన్ ఈవీని గురువారం ఆవిష్కరించింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్లు కంటే ఎక్కువగానే ప్రయాణించే ఈ వాహన విక్రయాలను మరికొన్ని వారాల్లోనే ప్రారంభిస్తామని టాటా మోటార్స్ తెలిపింది. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని 9.9 సెకన్లలోనే ఈ వాహనం అందుకోగలదని టాటా మోటార్స్ సీఈఓ, ఎమ్డీ గుంటర్ బశ్చెక్ చెప్పారు. నేటి (శుక్రవారం) నుంచే బుకింగ్స్ మొదలుపెడతామని, ఆన్లైన్లో కూడా ఈ కారును బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మూడు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ వాహనం ధర రూ.15–17 లక్షలు రేంజ్లో ఉంటుందని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. వారంటీని ఇస్తున్నామని, పరిశ్రమలో ఇదే అత్యధిక వారంటీ అని వివరించారు. ఈ వాహన బ్యాటరీని ఫాస్ట్ చార్జింగ్ మోడ్లో చార్జింగ్ చేస్తే గంటలోనే 80 శాతం మేర చార్జింగ్ అవుతుందని కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర చెప్పారు. 15 యాంపియర్ ప్లగ్ పాయింట్ ద్వారా కూడా ఈ వాహన బ్యాటరీని చార్జింగ్ చేయవచ్చని వివరించారు. జిప్ట్రాన్ పవర్ట్రైన్ టెక్నాలజీతో రూపొందిన ఈ వాహనంలో 30.3 కిలోవాట్ఆవర్ హై ఎనర్జీ డెన్సిటీ లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుందని పేర్కొన్నారు. రెండో ఎలక్ట్రిక్ వాహనం.... టాటా మోటార్స్ నుంచి వస్తోన్న రెండో ఎలక్ట్రిక్ వాహనం ఇది. ఇంతకు ముందు ఈ కంపెనీ టిగోర్లో ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. ట్యాక్సీ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన టిగోర్ ఈవీకి మంచి స్పందన లభిస్తోందని శైలేష్ చంద్ర పేర్కొన్నారు. ఒక్కో టిగోర్ ఈవీ వల్ల ట్యాక్సీ ఆపరేటర్లకు రూ.7,000 ఆదా అవుతున్నాయని వివరించారు. దీని రేంజ్ 150 కి.మీ. అని, ఇప్పుడు 300 కి.మీ. రేంజ్ ఉండే నెక్సాన్ ఈవీను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. టిగోర్ ఈవీని ట్యాక్సీ ఆపరేటర్ల కోసం తెస్తే, నెక్సాన్ ఈవీని వ్యక్తిగత వినియోగదారుల కోసం తెస్తున్నామని వివరించారు. -
వచ్చే ఏడాదిలో సిట్రోయెన్ ‘సీ5 ఎయిర్క్రాస్’..!
న్యూఢిల్లీ: యూరోపియన్ ఆటో దిగ్గజం గ్రూప్ పీఎస్ఏ.. వచ్చే ఏడాదిలో తన సిట్రోయెన్ బ్రాండ్ కార్లను ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలుత ‘సీ5 ఎయిర్క్రాస్’ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ)ని విడుదలచేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ ప్రణాళిక ప్రకారం.. ఈ ఏడాదే ఎస్యూవీ విడుదల కావాల్సి ఉన్నా, తొలికారు విషయంలో రాజీలేకుండా ఉండటానికే మరింత సమయం తీసుకున్నట్లు సంస్థ భారత సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ రోలాండ్ బౌచారా అన్నారు. -
వైరల్ : అమ్మో! పెద్ద ప్రమాదం తప్పింది
లూసీయానాలోని ఒక పెట్రోల్ బంకులోకి యస్యూవీ కారు ఒకటి వచ్చి ఆగింది. పెట్రోల్ కొట్టిద్దామని తన పెంపుడు కుక్క చువావాను కారులోనే ఉంచి యజమాని బయటకు దిగి సిబ్బందితో మాట్లాడుతున్నారు. ఈలోగా కారు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యి బ్యాక్వర్డ్ డైరక్షన్లో పక్కనే ఉన్న 4- లేన్ల మెయిన్ రోడ్డుమీదకు వెళ్లింది. దీంతో అవాక్కయిన కారు యజమాని కారు వెనకాలే పరిగెత్తారు. కారు డోరు తెరిచే ప్రయత్నంలో ఆమె కిందపడిపోయారు. దేవుడి దయ వల్ల ఆ సమయంలో వాహనాలు ఏవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చివరకు ఎదురుగా ఉన్న మరో గ్యాస్ స్టేషన్ బారీకేడ్లను ఆనుకొని కారు నిలిచిపోయింది. కాగా కారులో ఉన్న చుహాహా క్షేమంగానే ఉంది. ఈ ఘటన లూసీయానాలో గత శుక్రవారం చోటుచేసుకుంది. అయితే ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ లూసియానా పోలీసులు ఫేస్బుక్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీకామెంట్లు పెట్టారు. ' ఈ కుక్క మహా తెలివైనదని, కారును స్టార్ట్ చేసి నడిపిందని' పేర్కొన్నారు. మరికొందరు మాత్రం చువావా క్షేమంగా బయటపడినందుకు సంతోషిస్తున్నట్లు కామెంట్లు పెట్టారు. నెటిజన్ల కామెంట్లపై స్పందించిన పోలీసులు అసలు విషయం వెల్లడించారు. కారులో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా బ్రేక్ వేయకుండానే ఆటోమెటిక్ గేర్లను మార్చుకోగలదని, అందుకే కారు ఒక్కసారిగా బ్యాక్వర్డ్ డైరక్షన్లో మూవ్ అయిందని తెలిపారు. ఆ సమయంలో వాహనాలు ఏవి రాకపోవడం, అలాగే ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడం నిజంగా అద్బుతమని పేర్కొన్నారు. ' కార్లలో తమ పెంపుడు జంతువులను వదిలి వెళ్లేవారికి ఈ ఘటన ఒక చక్కటి ఉదాహరణ అని' పోలీసులు వెల్లడించారు. కాగా, ఇలాంటి ఘటనే గత గురువారం ఫ్లోరిడాలో జరిగింది. తన పెంపుడు కుక్క బ్లాక్ లాబ్రాడర్ను కారులోనే ఉంచి పార్క్ చేసి వెళ్లాడు. ఆ తర్వాత ఆటోమెటిక్ మోడ్ ఆన్ అయి కారు ఒక గంట పాటు వృత్తాకారంలో తిరగడం వైరల్గా మారింది. ఈ రెండు ఘటనల్లో పెంపుడు కుక్కలు ఉండడం గమనార్హం. -
స్కోడా ‘కొడియాక్, సూపర్బ్’ స్పెషల్ ఎడిషన్స్ విడుదల
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో తాజాగా తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) ‘కొడియాక్’, ప్రీమియం సెడాన్ ‘సూపర్బ్’ కార్లలో స్పెషల్ ఎడిషన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెట్రోల్ వెర్షన్ సూపర్బ్ (డీఎస్జీ) కార్పొరేట్ ఎడిషన్ ధర రూ. 25.99 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ధర రూ. 28.49 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఇక డీజిల్ వేరియంట్ కొడియాక్ కార్పొరేట్ ఎడిషన్ ధర రూ. 32.99 లక్షలుగా నిర్ణయించింది. -
మారుతి సుజుకి చిన్న ఎస్యూవీ వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి మాస్ మార్కెట్ లక్ష్యంగా రూపొందించిన చిన్న ఎస్యూవీ ‘ఎస్–ప్రెస్సో’ త్వరలో రోడ్డెక్కనుంది. సెప్టెంబరులో ఈ కారు విడుదలకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. గ్రేటర్ నోయిడాలో గతేడాది జరిగిన ఆటో ఎక్స్పో సందర్భంగా మారుతి సుజుకి కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. కంపెనీ నుంచి ఇదే అతి చిన్న ఎస్యూవీ కావడం గమనార్హం. కాంపాక్ట్ ఎస్యూవీ వితారా బ్రెజ్జా కంటే ఇది చిన్నగా ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఎస్యూవీ కోరుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్గా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. బీఎస్–6 ప్రమాణాలతో 1.2 పెట్రోల్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో రూపుదిద్దుకుంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) మోడల్ కూడా రానుంది. సీఎన్జీ వేరియంట్ను సైతం రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనుంది. బేస్ వేరియంట్ రూ.5 లక్షల లోపు ఉండే అవకాశముంది. వేరియంట్నుబట్టి ధర రూ.8 లక్షల దాకా ఉండొచ్చు. యువతను దృష్టిలో పెట్టుకుని మోడర్న్ స్టైలింగ్, క్యాబిన్ ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఆధునిక టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఎయిర్బ్యాగ్, ఏబీఎస్ వంటివి అదనపు హంగులు. -
ఎంజీ మోటార్ నుంచి ‘ఎస్యూవీ హెక్టర్’..!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్కు భారత అనుబంధ సంస్థ అయిన ఎంజీ మోటార్ ఇండియా త్వరలోనే స్పోర్ట్–యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ)ను విడుదలచేయనుంది. ‘హెక్టర్’ పేరుతో ఈఏడాది మధ్యనాటికి కారు విడుదలకానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చబా మాట్లాడుతూ... ‘ఎస్యూవీ విభాగం ఇప్పుడు భారత్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఇక్కడి వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా భారీస్థాయిలో ఈ కారును ఇంజనీరింగ్ చేయగలిగాం. ఈ ఎస్యూవీ పూర్తిగా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ కారు ఉత్పత్తి నిమిత్తం గుజరాత్లోని హలోల్ ప్లాంట్లో రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టిన ఈ కంపెనీ.. వచ్చే ఐదేళ్లలో రూ.5,000 కోట్లకు పెట్టుబడిని పెంచనున్నట్లు తెలిపింది. -
దేశీ మార్కెట్లోకి రూ 1.19 కోట్ల పోర్షే కారు
సాక్షి, ముంబై : భారత మార్కెట్లో పోర్షే ఎస్యూవీ మోడల్ లేటెస్ట్ జనరేషన్ కయానే లాంఛ్ అయింది. కస్టమర్లు కయానే, కయానే ఈ హైబ్రిడ్, కయానే టర్బో వంటి మూడు మోడల్స్ నుంచి తమకు నచ్చిన మోడల్ను ఎంచుకోవచ్చు. ముంబైలోని సహారా స్టార్ హోటల్లో ప్రతిష్టాత్మక ఎస్యూవీను పోర్షే ఇండియా అట్టహాసంగా లాంఛ్ చేసింది. ఈ ప్రోడక్ట్ లాంఛ్ సందర్భంగా మూడు మోడల్స్నూ ప్రదర్శించారు. కొత్త కయానేలో అత్యాధునిక రియర్ యాక్సిల్ స్టీరింగ్, షార్పర్ డిజైన్, మెరుగైన ఛేసిస్ సిస్టమ్స్తో అద్భుత సామర్థ్యంతో లేటెస్ట్ ఫీచర్లను పొందుపరిచారు. ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కనెక్టివిటీ ఫీచర్స్ను అదనంగా సమకూర్చారు. కయానే టర్బో కేవలం 3.9 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఎల్ఈడీ హెడ్లైట్స్, వార్న్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్స్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్స్ను పొందుపరిచారు. భారత్లోని అన్ని పోర్షే షోరూమ్స్లో కయానే, కయానే ఈ హైబ్రిడ్, కయానే టర్బోలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ కార్ల బుకింగ్ ప్రారంభం కాగా కయానే రూ 1.19 కోట్లు, కయానే ఈ హైబ్రిడ్ రూ 1.58 కోట్లు, కయానే టర్బో రూ 1.92 కోట్లు ధర పలుకుతోంది. -
బీఎండబ్ల్యూ007..
జేమ్స్ బాండ్ సినిమాలంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో.. ఈ సినిమాల్లో బాండ్ లాగే ఆయన వాడే కారు కూడా ఫేమస్. అందులో అత్యాధునిక గాడ్జెట్స్ ఉంటాయి కదా. అయితే.. అలాంటివి బాండ్కే సొంతమా.. సినిమాలకే పరిమితమా.. అస్సలు కాదు.. ఎందుకంటే.. బీఎండబ్ల్యూ కంపెనీ కొంచెం ఆ టైపు ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్)ని మార్కెట్లోకి తేనుంది. దాని పేరు విజన్ ఐనెక్ట్స్. ఇదో ఎలక్ట్రిక్ కారు.. అంతేకాదు.. దీనికి డ్రైవర్ అక్కర్లేదు. శాటిలైట్ నేవిగేషన్ మ్యాప్ ద్వారా మనకు కావాల్సిన ప్రదేశానికి వెళ్లిపోతుంది. పార్కింగ్ కూడా అదే చేసుకుంటుంది. కావాలంటే.. మనం నడపొచ్చు. కారు ఉపయోగంలో లేనప్పుడు లేదా డ్రైవర్ లైస్ మోడ్లో ఉన్నప్పుడు స్టీరింగ్ డ్యాష్బోర్డులోకి వెళ్లిపోతుంది. దాని వల్ల ముందు భాగం విశాలంగా మారి.. కూర్చున్నవాళ్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక వెనుక సీటు చూశారుగా.. ఎంత బాగుందో.. స్టార్ హోటల్లోని సోఫాలో కూర్చున్నట్లు ఉంటుంది. అంతేకాదు.. ఈ సీటు మనం చెప్పినట్లు వింటుంది కూడా. పాటల సౌండ్ను తగ్గించాలన్నా పెంచాలన్నా.. సీటుపై చేతితో అలా చేస్తే చాలు పనై పోతుంది. అలాగే నేవిగేషన్ మ్యాప్ను జూమ్ చేయాలన్నా దీన్నే వాడుకోవచ్చు. దీని ద్వారా మరిన్ని ఆదేశాలు ఇచ్చేలా మార్పులు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వాయిస్ కమాండ్స్ వంటివాటిని అందుబాటులోకి తేనుంది. పైభాగం అంతా పారదర్శకంగా ఉంటుంది. 2021లో మార్కెట్లోకి దీన్ని విడుదల చేయనున్నారు. -
మద్యం మత్తులో డ్రైవింగ్..ఇద్దరి మృతి
జైపూర్: ఎస్యూవీ కారు, రోడ్డు పక్కన నిద్రిస్తున్న నలుగురిపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రాజస్తాన్లోని జైపూర్ నగరం గాంధీనగర్లో ఓ ఫైఓవర్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. డ్రైవింగ్ చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు భరత్ భూషణ్ మీనా రక్తంలో ఆల్కహాల్ ఉండవలసిన దాని కంటే 9 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు బద్రీ నారాయణ్ మీనా అనే బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడి పేరు మీద రిజిస్టర్ అయింది. ఎస్యూవీ వెనక అద్దాలపై రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే గౌరవ యాత్రకు సంబంధించిన ఫోటోలు అంటించి ఉన్నాయి. ఘటన తర్వాత వాటిని తొలగించినట్లుగా తెలుస్తోంది. నిందితుడిపై హత్యాయత్నం, రాష్ డ్రైవింగ్లకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
ఫ్యాషన్ డిజైనర్ నిర్లక్ష్యం.. లగ్జరీ కారుతో దారుణం!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్లక్ష్యంగా రాంగ్సైడ్లో వాహనం నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఓ యువతి. లగ్జరీ ఎస్యూవీని కారు అడ్డదిడ్డంగా నడుపుతూ.. ఓ మహిళ ఢీకొట్టి తొక్కించేసింది. దీంతో ప్రమాదస్థలిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని కనాట్ ప్లేస్లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా అగర్వాల్ లగ్జరీ ఎస్యూవీ (స్పోర్ట్ష్ యుటిలిటీ వెహికల్) కారును రాంగ్రూట్లో నడుపుతూ.. ఫూల్వతి అనే 50 ఏళ్ల మహిళను ఢీకొట్టింది. ఆదివారం రాత్రి శివాజీ స్టేడియం బస్ టెర్మినల్ వద్ద గల ఓ రెస్టారెంట్ ముందు ఫూల్వతి నిల్చుని ఉండగా.. అజాగ్రత్తగా వాహనం నడుపుతూ.. ఆమెపైకి శ్రేయ దూసుకుపోయింది. ఆమెను ఢీకొట్టడమే కాకుండా.. దాదాపు 300 మీటర్లు కారుతో ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఫూల్వతి అక్కడిక్కడే మృతిచెందారు. దగ్గరలోని చెక్ పోస్టు వద్ద విధుల నిర్వర్తిస్తున్న పోలీసులు విషయాన్ని గ్రహించి నిందితురాలిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి.. కేసు నమోదు చేశామని వెల్లడించారు. -
20 అడుగుల గుంతలో పడ్డ ఎస్యూవీ
లక్నో : ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై వెళ్తున్న ఎస్యూవీ వాహనం 20 అడుగుల గుంతలో పడిపోయింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న రుచిత్ ఇటీవల ముంబైలో సెకండ్ హ్యాండ్ ఎస్యూవీ వాహనాన్ని కొనుగోలు చేశాడు. మరో ముగ్గురితో కలసి తన సొంత ఊరు కాన్నూజ్కు రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రయాణం మొదలుపెట్టిన వారు ఆగ్రాకు 16 కిలోమీటర్ల దూరంలో గల డౌకి వద్దకు రాగానే ఇంటర్నెట్ కనెక్షన్ కొల్పోయారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సర్వీస్ రోడ్డును అనుకుని పెద్ద గుంత ఏర్పడింది. అదే మార్గంలో ప్రయాణిస్తున్న వారు ఇది గమనించకపోవడంతో వాహనం గుంతలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు వాహనంలో ఉన్నవారిని రక్షించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో గుంతలో పడ్డ ఎస్యూవీని బయటకు తీశారు. వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సర్వీస్ రోడ్డుపై అంత పెద్ద గుంత ఎలా ఏర్పడిందో 15 రోజుల్లో నివేదిక అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత వర్గాలను కోరింది. అలాగే కాంట్రాక్టు సంస్థను మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశించింది. -
టాటా కొత్త ఎస్యూవీ ‘హారియర్’
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన కంపెనీ ‘టాటా మోటార్స్’ తన కొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) ‘హారియర్’ను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువస్తున్నది ప్రకటించింది. 2019 తొలి త్రైమాసికంలో దీన్ని ఆవిష్కరిస్తామని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్ ఈ హారియర్ ఎస్యూవీని జాగ్వార్ ల్యాండ్ రోవర్తో కలిసి అభివృద్ధి చేస్తోంది. కాగా కంపెనీ ఆటో ఎక్స్పో 2018లో హెచ్5ఎక్స్ కాన్సెప్ట్తో దీన్ని ప్రదర్శనకు ఉంచింది. స్టైల్, టెక్నాలజీ, పెర్ఫార్మెన్స్ వంటి పలు అంశాల్లో తమ భవిష్యత్ ప్రొడక్ట్ నమూనాలను ప్రతిబింబించేలా హారియర్ ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది. ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఆధారంగా రూపొందుతున్న తొలి వెహికల్ ఇదని పేర్కొంది. అత్యుత్తమ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, అధునాతన కనెక్టివిటీ ఫీచర్లను హారియర్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. తొలి కాంపాక్ట్ ఎస్యూవీ నెక్సాన్, కొత్త సెడాన్ టిగోర్, కాంపాక్ట్ కారు టియాగో వంటి మోడళ్లతో టాటా మోటార్స్ తిరిగి విజయపథంలోకి వచ్చింది. ల్యాండ్ రోవర్ డీ8 ఆర్కిటెక్చర్పై భారతీయ పరిస్థితులకు అనుగుణంగా టాటా మోటార్స్ ఇంజనీర్లు ఈ హారియర్ను తయారు చేశారని కంపెనీ పేర్కొంది. ‘టర్న్అరౌండ్ 2.0 ప్రణాళిక ఫలితాలను ఇస్తోంది. వేగంగా ఎదుగుతాం. అందులో భాగంగానే హారియర్ను తీసుకువస్తున్నాం. దీన్ని 2019 తొలి త్రైమాసికంలో ఆవిష్కరిస్తాం. ఈ కొత్త ఎస్యూవీ ద్వారా సంస్థ బ్రాండ్ విలువ మరో స్థాయికి చేరుతుంది’ అని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ విభాగం) మయాంక్ పరీఖ్ తెలిపారు. -
దూసుకుపోయిన విటారా బ్రెజ్జా
సాక్షి, ముంబై: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతికి ఎస్యూవీ విక్రయాల్లో దూసుకుపోయింది. ఎస్యూవీ సెగ్మెంట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం విటారా బ్రెజ్జా 3 లక్షల విక్రయాలను సాధించింది. 28 నెలల కాలంలో ఈ హాట్ సేల్ను సాధించామని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ప్రతి నెల ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాప్ 10లో ప్లేస్ సాధించే మారుతి ఘనతను మరింత పెంచడమే కాకుండా అతిపెద్ద కార్ల తయారీదారు మహీంద్రాను అధిగమించిదని తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరంలో మారుతి యూవీ సేల్స్ 53759 యూనిట్లతో 27.53 శాతం వృద్ధిని సాధించింది. 25.69 శాతం నుంచి 27.53 శాతానికి విక్రయాలు పుంజుకున్నాయి. మరోవైపు మహీంద్రా యూవీ విక్రయాలు (2,33,915 యూనిట్లతో) 29.20 శాతం నుంచి 25.38 శాతం క్షీణించాయి. బ్రెజ్జా టాప్వేరియింట్ విక్రయాలు 56శాతం పుంజుకున్నాయని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ ఎస్ కల్సీ వెల్లడించారు. ఈ సెగ్మెంట్లో పలుకొత్త కార్లు వచ్చినప్పటికి మార్చి 2016 లో లాంచ్ అయిన విటారా బ్రెజ్జా ఉత్తమంగా నిలిచిందన్నారు. -
మహింద్రా నుంచి 9 సీటర్ ఎస్యూవీ
మహింద్రా అంతా కొత్తగా టీయూవీ300 ప్లస్ వాహనాన్ని ఎట్టకేలకు మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ.9.47 లక్షలుగా(ఎక్స్షోరూం, ముంబై) నిర్ణయించింది. ఈ వాహనంలో 9 సీట్లు ఉన్నాయి. ఈ వాహనాన్ని అధికారికంగా లాంచ్ చేయడానికి కంటే ముందు, ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ వాహనాలను డెలివరీ చేసి వారి నుంచి కంపెనీ ఫీడ్బ్యాక్ తీసుకుంది. తాజాగా ఈ వాహనాన్ని కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేసింది. 2.2 లీటరు ఎంహెచ్ఏడబ్ల్యూకేడీ120 ఇంజిన్ను ఇది కలిగి ఉంది. 88 కేడబ్ల్యూ(120 బీహెచ్పీ)ని డెలివరీ చేస్తోంది. ఇటాలియన్ డిజైన్ హౌజ్లో దీన్ని డిజైన్ చేశారు. హై-టెక్ ఫీచర్లను ఇది ఆఫర్ చేస్తోంది. 17.8 సీఎం టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ విత్ జీపీఎస్ నావిగేషన్, 4 స్పీకర్లు+2 ట్వీటర్లు, ఈసీఓ మోడ్, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, బ్లూసెన్స్ యాప్, ఈసీఓ మోడ్, బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ టెక్నాలజీ, ఇంటెలిపార్క్ రివర్స్ అసిస్ట్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దీనిలో ఉన్నాయి. 4400ఎంఎం పొడవు, 1835 వెడల్పు, 1812 ఎత్తును ఇది కలిగి ఉంది. ఐదు రంగుల్లో ఇది మార్కెట్లోకి వచ్చింది. మేజిస్టిక్ సిల్వర్, గ్లాసియర్ వైట్, బోల్డ్ బ్లాక్, డైనమో రెడ్, మోల్టెన్ ఆరెంజ్ రంగుల్లో ఈ వాహనం లభ్యమవుతుంది. పీ4, పీ6, పీ8 వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. 2015 సెప్టెంబర్ నుంచి టీయూవీ300 విజయవంతంగా రోడ్లపై నడుస్తుందని, ఇప్పటి వరకు ఆన్ రోడ్డుపై 80వేల వాహనాలను విక్రయించినట్టు మహింద్రా అండ్ మహింద్రా సేల్స్, మార్కెటింగ్ చీఫ్ విజయ్ రామ్ నోక్రా చెప్పారు. ఎక్కువ స్పేస్, ఎక్కువ పవర్తో టీయూవీ300 ప్లస్ను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. -
లెక్సస్ సరికొత్త ఎస్యూవీ@2.33 కోట్లు
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ భారత్లోకి సరికొత్త ఎస్యూవీని విడుదల చేసింది. ఎల్ఎక్స్ 570 ఎస్యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. శక్తివంతమైన 5.7లీటర్ల వీ8 పెట్రోల్ ఇంజిన్తో ఇది రూపొందింది. దీని ఎక్స్ షోరూం ధర 2.33 కోట్లుగా నిర్ణయించింది. క్లైమెట్ కంట్రోల్, బెటర్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ మంచి డ్రైవింగ్ అనుభూతిని కల్పించనున్నాయి. ఈ కారులో విలాసవంతమైన 19 స్పీకర్లతో కూడిన ది మార్క్ లెవిన్సన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ను అమర్చారు. మూడు వరుసల సీటింగ్ను దీనిలో అమర్చామని, ఒకవేళ అవసరమైతే అదనపు కార్గో స్పేస్కు ఇది ఉపయోగపడనుందని కంపెనీ తెలిపింది. వెనుక సీట్లకు 11.6 అంగుళాల లిక్విడ్ క్రిస్టల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డిస్ప్లే కూడా ఉంది. ‘ రహదారిపై అద్భుతమైన పట్టుసాధించే ఈ వాహనంతో వినియోగదారులు గొప్ప డ్రైవింగ్ అనుభూతిని ఆస్వాదిస్తారు’ అని లెక్సస్ ఇండియా చైర్మన్ ఎన్.రాజ తెలిపారు. నేటి నుంచి ఈ ఎల్ఎక్స్ 570 ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. -
వేగంగా వచ్చి హోటల్లోకి దూసుకెళ్లింది
-
కారు బీభత్సం : హోటల్లోకి దూసుకెళ్లింది
పుణే : డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం పలువురిని ఘోర రోడ్డు ప్రమాదాలకు గురిచేస్తోంది. తాజాగా పుణేలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ వాహన డ్రైవర్ తన ఎస్యూవీని వేగంగా నడపడంతో, అది అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓం ప్రకాశ్ పండిన్వార్(60) అనే వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. డ్రైవర్తో పాటు మరో ఇద్దరు గాయాలు పాలయ్యారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకి సంఘ్వీ చౌక్లో ఈ ప్రమాదం జరిగింది. హోటల్కు ఎదురుగా ఉన్న రోడ్డులో ఎస్యూవీ చాలా వేగంగా నడుపుకుంటూ వచ్చింది. ఆ సమయంలో స్పీడ్ బ్రేకర్ రావడంతో, డ్రైవర్ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. స్పీడ్ బ్రేకర్ను ఢీకొన్న ఎస్యూవీ, రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. అలా దూసుకెళ్లిన ఎస్యూవీ క్యాష్ కౌంటర్లో ఉన్న పండిన్వార్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. అదే సమయంలో అతని భార్య, మరో వ్యక్తి కూడా అదే హోటల్లో ఉన్నారు. ఎస్యూవీ డ్రైవర్ కూడా గాయాల పాలయ్యాడని పోలీసులు చెప్పారు. పోలీసులు ప్రస్తుతం ఆ డ్రైవర్ ఎవరు? ఎస్యూవీ యజమాని ఎవరు? అని విచారిస్తున్నారు. హోటల్ పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఈ ప్రమాద వీడియో రికార్డైంది. -
మహీంద్రా, ఫోర్డ్ల ఎస్యూవీ!
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ ఫోర్డ్ మోటార్తో కలసి కొత్త ఎస్యూవీలను అభివృద్ధి చేయనున్నది. అంతేకాకుండా ఒక చిన్న ఎలక్ట్రిక్ వెహికల్ను కూడా అందుబాటులోకి తేనున్నది. గత ఏడాది ఇరు కంపెనీల మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగమే ఇదంతా అని మహీంద్రా అండ్ మహీంద్రా ఎమ్డీ పవన్ గోయెంకా పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే ఇరు కంపెనీలు తాజాగా ఐదు ఒప్పందాలను కుదుర్చుకున్నాయని తెలిపారు. దీంట్లో భాగంగా ఇరు సంస్థలు కలసి మిడ్సైజ్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ను అందుబాటులోకి తేనున్నాయని వివరించారు. ఈ ఎస్యూవీని మహీంద్రా ప్లాట్ఫార్మ్పై తయారు చేస్తామని, ఇరు కంపెనీలు వేర్వేరు బ్రాండ్ల కింద ఈ ఎస్యూవీలను సొంతంగా విక్రయిస్తాయని తెలిపారు. ఇరు కంపెనీల ఉద్యోగుల మధ్య సహకారం కొనసాగుతుందని, మూడేళ్ల పాటు కలసి పనిచేస్తామని గోయెంకా తెలిపారు. యుటిలిటి వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ దృష్టిపెట్టాల్సిన కీలక అంశాలని ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ జిమ్ ఫార్లే పేర్కొన్నారు. వినియోగదారుల అభిరుచులు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలను అందిస్తామని వివరించారు. -
ఆడి క్యూ5 లాంచ్..కొత్త డిజైన్తో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ ఆడి కొత్త ఎస్యూవీని లాంచ్ చేసింది. కొన్ని నెలలు వెయింటిగ్ తరువాత , ఆడి చివరకు ఇండియాలో సెకండ్ జనరేషన్ క్యూ5 ఎస్యూవీని ప్రారంభించింది. ఫ్లెక్సిబుల్ ఎంఎల్బీ ఎవో ప్లాట్ఫాం ఆధారంగా రూపొందించిన ఈ లగ్జరీ కారు ప్రారంభ ధరను రూ.53.25 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ నిర్ణయించింది. టాప్ ఎండ్ టెక్నాలజీ వేరియంట్ ధరను రూ. 57. 60లక్షలుగాను ప్రకటించింది. త్వరలో డెలివరీ ప్రారంభం కానుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర ఫీచర్లు క్యూ7 మాదిరిగానే 2.0లీటర్ టీడీఐ ఇంజీన్ కెపాసిటీతో వస్తున్నఈ కారులో కంట్రోల్ నాబ్ స్థానంలో నాలుగు టోగుల్ బటన్స్ యాడ్ చేసి మునుపటి 8.3అంగుళాల ఎంఎంఐ ఇన్ఫోటైన్మెంట్ను, బోనెట్ డిజైన్ను అప్ గ్రేడ్ చేసింది. వర్చువల్ కాక్పిట్, వైర్లెస్ చార్జింగ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రీకల్లీ ఎడ్జస్టబుల్ సీట్స్తోపాటు ముందుభాగంలో మాట్రిక్స్ సింగిల్ ఫ్రేమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అమర్చింది. వెనుక కూడా ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, డిఫ్యూసర్తో కొత్త బంపర్ను జోడించింది. దీని ఇంజీన్18బీహెచ్పీ, 400ఎన్ఎం టార్క్ను అందిస్తుంది. -
వోల్వో కొత్త ఎస్యూవీ లాంచ్..
సాక్షి, న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన లగ్జరీ కార్ మేకర్ వోల్వో కార్స్ సరికొత్త ఎస్యూవీకార్ను లాంచ్ చేసింది. ఎస్యూవీ ఎక్స్ సి 60 కొత్త వెర్షన్ను మంగళవారం విడుదల చేసింది. రూ. 55.9 (ఎక్స్ ఫోరూం. ఆల్ ఇండియా) లక్షలకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక భద్రతా లక్షణాలతో, ముఖ్యంగా పాదచారులను, సైక్లిస్టలను గుర్తించగలిగే టెక్సాలజీతో లాంచ్ చేసింది. స్టీర్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్, సీట్ వెంటిలేషన్ తదితర ఇతర ముఖ్య ఫీచర్లుగా ఉన్నాయి. తమ లగ్జరీ మోడరన్ స్కాండినేవియన్ డిజైన్ కారు వినియోగదారులను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ వ్యకర్తం చేశారు. ఎక్స్ సి 60 కి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్ మాత్రమే కాదు, భారతదేశంలో కూడా మంచి ఆదరణ పొందిందన్నారు. అలాగే ఈ ఏడాది 2వేల యూనిట్లు విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 25 శాతం వృద్ధిని సాధించిన కంపెనీ అమ్మకాలలో మూడింట రెండు వంతులను ఇండియాలోనే సాధిస్తోంది. దేశవ్యాప్తంగా 19 డీలర్ షిప్లనును కలిగి ఉంది. దీనితోపాటు రాబోయే రెండేళ్లలో వీటిని రెండింతలు చేయాలని వోల్వో యోచిస్తోంది. -
ఎం అండ్ ఎం ఎక్స్యూవీ500 పెట్రోల్ వెర్షన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్ర అండ్మహీంద్ర కొత్ వెర్షన్ ఎస్యూవీలాంచ్ చేసింది. పెట్రోల్ వెర్షన్లో ఎస్యూవీ ఎక్స్ యూవీని 500 ను విడుదల చేసింది. దీని రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. తాజా నివేదిక ప్రకారం 6స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కొత్త వెహికల్ లభించనుంది. 2.2 లీటర్ mHawk పెట్రోల్ ఇంజిన్తో, 140 హెచ్పీ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే స్టాటిక్ బెండింగ్ హెడ్ లైట్లు, , క్రూయిస్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ లాంటి ఇతర ప్రధాన ఫీచర్లతో ఈ ఎస్యూవీ లభ్యం. పెట్రోల్ వేరియంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కస్టమర్లకు ఎక్స్యూవీ500 అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఎంఅండ్ ఎం చీఫ్ సేల్స్ & మార్కెటింగ్ ఆఫ్ రామ్ నక్రా ఒక ప్రకటనలో తెలిపారు. -
పన్ను బాదుడుకు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దకార్లు, లగ్జరీ కార్లపై జీఎస్టీ పెంపునకు ఉద్దేశించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీచేసింది. మిడ్-సైజ్ నుండి హైబ్రీడ్ వేరియంట్లపై గరిష్టంగా 25 శాతం వరకు సెస్ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. లగ్జరీ కార్ల ధరలు మోత మోగనున్నాయి. వస్తువులు, సేవల పన్ను (రాష్ట్రాలకు పరిహారం) ఆర్డినెన్స్, 2017 సవరణ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబరు 2వతేదీ నుంచి ఈ పెంపు అమలులోకి వచ్చింది. దీనికి పార్లమెంట్ అమోదం లభించాల్సి ఉంటుంది. అయితే ఏయే కార్లపై గరిష్టంగా ఎంతపన్ను బాదుడు ఉంటుంది అనేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈనెల (సెప్టెంబరు) 9న హైదరాబాద్లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో తేలనుంది. ఈ ఏడాది జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో కార్ల ఉత్పత్తి సంస్థలు ధరలను రూ.లక్ష నుంచి 3లక్షల మధ్య తగ్గించాయి. ప్రస్తుతం అమలవుతున్న సెస్ 15 నుంచి గరిష్టంగా 25 శాతానికి పెరగడంతో ఈ ప్రీమియం సెగ్మెంట్ కార్ల ధరలు మోత మోగనున్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్యూవీలు), లగ్జరీ కార్లన్నింటిపైనా పెరిగిన సెస్ అమలు కానుంది. పెద్ద మోటార్ వాహనాలు, ఎస్యూవీలు, మిడ్ సెగ్మెంట్ కార్లు, పెద్ద కార్లు, హైబ్రిడ్ కార్లు, హైబ్రిడ్ మోటార్ వాహనాలపై సెజ్ 25 శాతంగా ఉండనుంది. గతంలో ఇది 15శాతం. జీఎస్టీ పరిధిలో లగ్జరీ, ఎస్యూవీ, మరియు ఇతర వాహనాలపై పన్ను పెంపు ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గత వారం ఆమోదించిన సంగతి తెలిసిందే. -
మెర్సిడెస్ ‘జీఎల్ఏ క్లాస్’.. కొత్త వేరియంట్
ప్రారంభ ధర రూ.30.65 లక్షలు ముంబై: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్–బెంజ్ ఇండియా’ తన ఎస్యూవీ పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేసుకుంది. ఇది తాజాగా ‘జీఎల్ఏ క్లాస్’లో కొత్త వెర్షన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. డైనమిక్ డిజైన్తో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త ఎస్యూవీ ప్రధానంగా జీఎల్ఏ 200, జీఎల్ఏ 200 డీ, జీఎల్ఏ 220 డీ 4 మ్యాటిక్ అనే మూడు ఇంజిన్ వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. జీఎల్ఏ 200 డీ 2 లీటర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.30.65 లక్షలుగా, 2.2 లీటర్ 4 మ్యాటిక్ డీజిల్ వేరియంట్ ధర రూ.36.75 లక్షలుగా ఉంది. ఇక అన్నింటిలోనూ ఆరు ఎయిర్బ్యాగ్లు ఉంటాయి. కంపెనీ ఈ ఏడాది మార్కెట్లోకి తెస్తున్న ఏడో మోడల్ ఇది. దీన్ని చకన్ ప్లాంట్లో తయారు చేస్తోంది. -
మహీంద్రా వాహన ధరలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా’ తాజాగా తన యుటిలిటీ వెహికల్స్, ఎస్యూవీల ధరలను 6.9 శాతం వరకు తగ్గించింది. చిన్న కార్ల విభాగంలోని వాహన ధరల్లో సగటున 1.4 శాతంమేర కోత విధించింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ అలాగే చిన్న వాణిజ్య వాహన ధరలను సగటున 1.1 శాతంమేర, తేలికపాటి, భారీ వాణిజ్య వాహన ధరలను సగటున 0.5 శాతంమేర తగ్గించింది. ఇక హైబ్రిడ్ వాహన ధరలను స్వల్పంగా పెంచింది. సవరించిన ధరలు ప్రాంతాన్ని బట్టి మారతాయని కంపెనీ పేర్కొంది. ట్రాక్టర్ల ధరల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. -
మార్కెట్లోకి రెండు కొత్త బెంజ్ ఎస్యూవీలు
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ఏఎంజీ పోర్ట్ఫోలియోలో మరో రెండు ఎస్యూవీలను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. మెర్సిడెస్–ఏఎంజీ జీ–63 ‘ఎడిషన్ 463’, మెర్సిడెస్–ఏఎంజీ జీఎల్ఎస్–63 అనే ఈ రెండు కార్ల ధరలు వరుసగా రూ.2.17 కోట్లు, రూ.1.58 కోట్లుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్షోరూమ్ పుణేవి. తాజా కార్ల ఆవిష్కరణతో కంపెనీ లగ్జరీ ఎస్యూవీ విభాగం మరింత పటిష్టంగా మారిందని, ఎస్యూవీ పోర్ట్ఫోలియోలోని ప్రొడక్టుల సంఖ్య ఎనిమిదికి చేరిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా పేర్కొంది. -
‘టైమ్స్ ఆసియా’లో ఐఐఎస్సీ ర్యాంకు 27
♦ జాబితాలో ఉస్మానియా, ఎస్వీయూ, ♦ ఆచార్య నాగార్జున, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు న్యూఢిల్లీ: 2017 ఏడాదికి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వారు ఆసియాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన ర్యాంకింగ్స్లో బెంగళూరులోని ఐఐఎస్సీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) 27వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఐఐఎస్సీ ఇదే ర్యాంకును సొంతం చేసుకుంది. ఆసియాలో మొదటి ఐదు విశ్వవిద్యాలయాలుగా వరసగా సింగపూర్ జాతీయ వర్సిటీ, చైనాలోని పెకింగ్, సింగువా విశ్వవిద్యాలయాలు, సింగపూర్లోని నాన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం, హాంకాంగ్లోని వర్సిటీ ఆఫ్ హాంకాంగ్లు నిలిచాయి. ఐఐఎస్సీతోపాటు ఐఐటీ–బాంబే (42వ ర్యాంకు), తమిళనాడులోని వేల్–టెక్ యూనివర్సిటీ (43), ఐఐటీ–ఢిల్లీ (54), ఐఐటీ–మద్రాసు (62)లు కూడా మెరుగైన స్థానాలు సాధించాయి. ఆసియాలోని టాప్–300 యూనివర్సిటీల జాబితాలో భారత్ నుంచి మొత్తం 33 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి. దీంతో టాప్–300లో అత్యధిక యూనివర్సిటీలను కలిగిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. గతేడాది టాప్–200 యూనివర్సిటీల్లో భారత్ నుంచి 16 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉన్నాయి. టీహెచ్ఈ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం టాప్–300 జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 191–200 మధ్య ర్యాంకు, గుంటూరులోని ఆచార్య నాగార్జున, హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు 201–250 మధ్య ర్యాంకులు, విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి 251 కన్నా ఎక్కువ ర్యాంకు లభించాయి. అయితే ఏ విశ్వవిద్యాలయానికి ఏ ర్యాంకు అన్న కచ్చితమైన సమాచారం మాత్రం తెలియరాలేదు. పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ప్రపచంలో భారత యూనివర్సిటీలు వెనుకబడి ఉన్నాయని టీహెచ్ఈకి రాసిన వ్యాసంలో ఒకరు పేర్కొన్నారు. టాప్–300 జాబితాలో అత్యధికంగా జపాన్కు చెందిన 69 విద్యాసంస్థలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో చైనా 54, భారత్ 33 ఉన్నాయి. -
టాటా కొత్త ఎస్యూవీ ‘హెక్సా’
• ధరలు రూ.12.08 లక్షలు –17.48 లక్షల రేంజ్లో • మైలేజీ 14.4 కి.మీ. ముంబై: టాటా మోటార్స్ కంపెనీ కొత్త స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ), హెక్సాను మార్కెట్లోకి తెచ్చింది. ఈ లైఫ్ స్టైల్ ఆఫ్–రోడర్ వాహన ధరలు రూ.12.08 లక్షల–రూ.17.43 లక్షల రేంజ్లో ఉన్నాయని టాటా మోటార్స్ తెలిపింది. ఈ హెక్సా ఎస్యూవీ, ఇన్నోవా, మహీంద్రా ఎక్స్యూవీ 500, మారుతీ ఎర్టిగలకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ హెక్సా కారు ఆరు వేరియంట్లలో (మూడు మాన్యువల్, మూడు ఆటోమేటిక్), ఐదు రంగుల్లో లభిస్తుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ కార్ బిజినెస్) మయాంక్ పరీక్ చెప్పారు. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్తో రూపొందిన ఈ ఏడు సీట్ల కారు 14.4 కి.మీ. మైలేజీని ఇస్తుందని టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గుంటెర్ బషెక్ పేర్కొన్నారు. హెక్సా రాకతో తమ మరో ఎస్యూవీ అరియాను మార్కెట్ నుంచి ఉపసంహరిస్తున్నామని, సఫారీని మాత్రం కొనసాగిస్తామని పరీక్ తెలిపారు. హెక్సా ప్రత్యేకతలు..: 2.2 లీటర్ వారికోర్ 400 డీజిల్ ఇంజిన్తో రూపొందిన హెక్సాలో 6 స్పీడ్ జి–85 ట్రాన్సిమిషన్, సూపర్ డ్రైవ్ మోడ్, 10 స్పీకర్లతో కూడిన కనెక్ట్నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్(స్మార్ట్ ఫోన్ కంపాటబిలిటి, యూఎస్బీ బ్లూటూత్ కనెక్టివిటీ,) డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, కార్నర్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అన్ని వీల్స్కు డిస్క్ బ్రేక్స్, ట్రాక్షన్, క్రూయిజ్ కంట్రోల్, మూడ్ లైటింగ్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఎల్ఈడీ డే రన్నింగ్ లైట్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. -
జేఎల్ఆర్ నుంచి కొత్త రేంజ్ రోవర్
ప్రారంభ ధర రూ.49.1 లక్షలు న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ కంపెనీ ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్’ తాజాగా కొత్త ఏడాది కోసం కొత్తమోడల్ను ఆవిష్కరించింది. ఇది తన పాపులర్ ఎస్యూవీ రేంజ్ రోవర్ ఇవోక్లో 2017 మోడల్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.49.1 లక్షల నుంచి రూ.67.9 లక్షల (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఇది ఆరు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఇది వరకు మోడళ్లతో పోలిస్తే తాజా కొత్త వాహనంలో కంపెనీ కొన్ని మార్పులు చేసింది. ఇందులో ప్రధానమైనది 2.0 లీటర్ ఇంజీనియమ్ డీజిల్ ఇంజిన్ను అమర్చడం. కంపెనీ నుంచి వచ్చిన ఇదివరకు ఇంజిన్లతో పోలిస్తే దీనిబరువు 20 కేజీలు తక్కువ. ల్యాండ్ రోవర్ నుంచి వచ్చిన కొత్త ఇంజిన్ ఇది. ఇక కొత్త రేంజ్ రోవర్ ఇవోక్లోని అదిరిపోయే డిజైన్, టాప్క్లాస్ టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లు కస్టమర్లను కట్టిపడేస్తాయని కంపెనీ పేర్కొంది. ఆల్ ఫోర్ వీల్ డ్రైవ్, 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఇన్కంట్రోల్ టచ్ ప్రొ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది. -
జింక ఓ మహిళను పగబట్టిన వేళ..
-
జింక ఓ మహిళను పగబట్టిన వేళ..
న్యూజెర్సీ: సాధారణంగా పాములు పగబడతాయంటే విన్నాము.. మనుషులు పగబడతారంటే నిజంగా చూశాం. కానీ, బెదురుబెదురుగా ఉంటూ చీమ చిటుక్కుమన్న చెవులు నిక్కపొడుచుకొని తలపైకెత్తి చూసి పారిపోయేందుకు సిద్ధంగా ఉండే జింకలు కూడా పగబడతాయంటే నమ్ముతామా.. కానీ, నమ్మాలి. న్యూజెర్సీలో ఓ కొమ్ముల జింక ఇలాగే చేసింది. తనను ఢీకొట్టిన ఓ ఎస్యూవీ వాహనం నడుపుతున్న మహిళపై తన కసి కొద్దిగా దాడికి దిగింది. తన కొమ్ములతో డోర్ ఓపెన్ చేసి మరి యుద్ధం చేసినంతపని చేసి ఆమెకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో ఆమె కాలికి గాయం కూడా అయింది. అయితే, ఏదో ఒకలా ఆ జింక గట్టిగా తన్ని బయటపడిన ఆమె వెంటనే డోర్ వేసుకుంది. కానీ, కారుతగలడంతో గాయాలపాలయిన ఆ జింకా కొద్ది సేపటి తర్వాత చనిపోయింది. ఇద్దరు వ్యక్తులు కలిసి జాలిగా షికారుకు వెళుతుండగా రాత్రి పూట కొద్ది రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదంతా పెట్రోలింగ్ కు వెళుతున్న ఓ అధికారి కారులోని డాష్ క్యామ్ లో రికార్డవ్వగా దానిని తాజాగా విడుదల చేయడంతో వైరల్ గా మారింది. -
లగ్జరీ కార్లలో పోలీసు పెట్రోలింగ్!
దుబాయ్: పోలీసులు అనగానే జీపులు గుర్తుకు వస్తాయి. నిన్న మొన్నటి దాకా సినిమాల్లో కూడ పోలీసులు జీపుల్లో రావడమే చూపించారు. అలాంటిది ఇటీవల కొన్ని ప్రభుత్వాలు నగరాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడమే కాక, వారికి ప్రత్యేకంగా కార్లను సమకూర్చాయి. ప్రస్తుతం దుబాయ్ ప్రభుత్వం కూడా పోలీసులు గస్తీ తిరిగేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ లగ్జరీ కార్లను, ఎస్ యూవీలను అందించింది. దీంతో ఇప్పుడు పోలీసులు ఆ ఖరీదైన కార్లలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అత్యంత హార్స్ పవర్ కలిగిన లగ్జరీ కార్లను దుబాయ్ ప్రభుత్వం మెట్రో పోలీసులు గస్తీ తిరిగేందుకు ఇవ్వడంతో ఇప్పుడు గ్యారేజీలన్నీ అత్యాధునిక లగ్జరీ కార్లతో ఆకట్టుకుంటున్నాయి. ఆడి ఆర్8, బెంట్లీ కాంటినెంటల్ జీటీ, ఆస్టాన్ మార్టిన్ వన్ 77, బీఎం డబ్ల్యూ ఐ8, బీఎం డబ్ల్యూ ఎం6, బ్రాబస్ మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, బుగట్టి వేరాన్, చెవ్రోలెట్ కేమెరో, ఫెరారీ ఎఫ్ ఎఫ్, ఫోర్డ్ ముస్టాంగ్ కస్టమైజ్డ్ బై రష్ పెర్భార్మెన్స్, లంబోర్గిని ఎవెంటేడర్, లెక్సస్ ఆర్సీ ఎఫ్, మెక్ లారెన్ ఎంపీ4 12సీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్ ఎల్ ఎస్ ఏఎంజీ, నిస్సాన్ జీటీఆర్, పోర్స్ ఖె పనామెరా ఎస్ ఈ హైబ్రిడ్ వంటి అన్ని మోడల్స్ లోనూ ఖరీదైన కార్టు.. ఇప్పుడు దుబాయ్ పోలీసుల పెట్రోలింగ్ లో భాగం పంచుకుంటున్నాయి. -
మార్కెట్లోకి హోండా చౌక ఎస్యూవీ ... బీఆర్-వీ
ధరలు రూ.8.75 లక్షల నుంచి రూ.12.9 లక్షల రేంజ్లో ఎస్యూవీ ప్రత్యేకతలు...: 4 వేరియంట్లలలో లభ్యమయ్యే ఈ ఎస్యూవీలో బ్లాక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, డ్యుయల్ ఎయిర్బ్యాగ్లు, స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ తదితర ఫీచర్లున్నాయి. పెట్రోల్ వేరియంట్ మైలేజీ 16 కిమీ కాగా... డీజిల్ వేరియంట్ 21.9 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా... బీఆర్-వీ మోడల్తో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) సెగ్మెంట్లో ప్రవేశించింది. ఈ ఎస్యూవీని పెట్రోల్ డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని హోండా కార్స్ ఇండియా తెలిపింది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.8.7 లక్షల నుంచి రూ.11.84 లక్షలు, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.9.9 లక్షల నుంచి రూ.12.9 లక్షల రేంజ్లో ఉన్నాయని హోండా కార్స్ ఇండియా(హెచ్సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యుఇనో పేర్కొన్నారు. ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.11.99 లక్షలని (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) పేర్కొన్నారు. హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ ఎస్యూవీలకు ఈ బీఆర్-వీ ఎస్యూవీ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. -
కారు వాడకంపై వెనక్కుతగ్గిన మాజీ సీఎం
బెంగళూరు: ప్రజలు తీవ్ర కరువుతో అల్లాడుతుంటే.. లగ్జరీ కారులో పర్యటనలేంటని తీవ్రవిమర్శలు రావడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వెనక్కు తగ్గారు. మాజీ మంత్రి, తన విధేయుడు, వ్యాపారవేత్త మురుగేష్ నిరాణి తనకు అందజేసిన లగ్జరీ కారును తిరిగి ఇచ్చేశారు. ట్రైన్ లలో ప్రయాణించి కరువు ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. కర్ణాటక బీజేపీ చీఫ్గా ఇటీవల పగ్గాలు చేపట్టిన బీఎస్ యడ్యూరప్ప కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు మురుగేష్ నిరాణి రూ.1.15కోట్ల ఖరీదైన టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. 73 ఏళ్ల యడ్యూరప్ప రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఖరీదైన కారును సమకూర్చానని నిరాణి తెలిపారు. -
మహీంద్రా కొత్త ఎస్యూవీ పేరు నువొస్పోర్ట్
వచ్చే నెల 4న మార్కెట్లోకి .. ఫొటోల విడుదల ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఎస్యూవీను వచ్చే నెల 4న మార్కెట్లోకి తేనున్నది. నువోస్పోర్ట్ పేరుతో తామందిస్తున్న ఈ కొత్త ఎస్యూవీని స్కార్పియో ప్లాట్ఫార్మ్పైననే రూపొందిస్తున్నామని తెలిపింది. ఈ ఎస్యూవీ ఇంజిన్ వివరాలు, ధర, ఇతర ప్రత్యేకతలను వెల్లడించలేదు. మంగళవారం ఈ కారు ఫొటోలను మాత్రంవిడుదల చేసింది. ఫోర్డ్ ఇకోస్పోర్ట్, మారుతీ విటారా బ్రెజ్జాలకు నువొస్పోర్ట్ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. -
లోకేశ్ బర్త్డే కేక్ కట్ చేసిన వీసీ!
-
లోకేశ్ బర్త్డే కేక్ కట్ చేసిన వీసీ!
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు శనివారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ)లో నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వీసీ దామోదరం హజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ భాస్కర్, సెనేట్ మెంబర్ డాక్టర్ ఆర్ సుధారాణి, మాజీ వీసీలు రాళ్లపల్లి రామ్మూర్తి, కొలకలూరి ఇనాక్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆనంద్ గౌడ్, హారికృష్ణ యాదవ్, మణికంఠ, లోకనాధం తదితరులు పాల్గొన్నారు. -
ఫోర్డ్ నుంచి కొత్త ఎండీవర్
♦ రక్షణ కోసం ఏడు ఎయిర్బ్యాగ్స్ ♦ ధర రూ.24.1-28.69 లక్షలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ప్రీమియం ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎండీవర్ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. పటిష్టమైన ఉక్కుతో వాహ నాన్ని తయారు చేశారు. ప్రీమియం ఎస్యూవీలో తొలిసారిగా ఈ కారులో ఏడు ఎయిర్బ్యాగ్స్ను వాడారు. ఇందులో ఒకటి డ్రైవర్ సీటు ముందు మోకాలి రక్షణకోసం ఏర్పాటు చేశారు. మౌఖిక ఆదేశాల ఆధారంగా పనిచేసేలా సింక్-2 అనే వ్యవస్థ ఉంది. 10,000లకుపైగా విభిన్న ఆదేశాలను ఇది సులభంగా గుర్తిస్తుంది. ఏడుగురు కూర్చోవచ్చు. ఫోర్ వీల్ డ్రైవ్, కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సెమి-ఆటో ప్యారలల్ పార్క్ అసిస్ట్, ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్రూఫ్తోపాటు ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్న రోడ్లలో డ్రైవర్ను హెచ్చరించే అడ్వాన్స్డ్ టెరైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం ఎస్యూవీల హవా..: భారత్లో ప్రీమియం ఎస్యూవీల మార్కెట్ ప్రస్తుతం 18,000 యూనిట్లుంది. 2024 నాటికి ఇది ఒక లక్ష యూని ట్లకు ఎగుస్తుందని ఫోర్డ్ ఇండియా డీలర్ డెవలప్మెంట్ జీఎం ఎస్.లక్ష్మీరామ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో కొత్త ఎండీవర్ను ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2020 నాటికి భారత్ నుంచి 50 దేశాలకు వాహనాలను ఎగుమతి చేయాలన్నది కంపెనీ లక్ష్యమని చెప్పారు. 2016 ఫోర్డ్కు ఆశాజనకంగా ఉంటుందన్నారు. కాగా, హైదరాబాద్ ఎక్స్షోరూంలో సరికొత్త ఎండీవర్ ధర వేరియంట్నుబట్టి రూ.24.1-28.69 లక్షలు ఉంది. 2.2, 3.2 లీటర్ ఇంజిన్ వేరియంట్లలో 6 స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఇది లభిస్తుంది. -
మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్పీరియో పికప్
-
వాఘా సరిహద్దు వద్ద కలకలం