SUV
-
ఎనిమిది సార్లు కారు బోల్తా పడితే.. తాపీగా ‘టీ ఉన్నాయా?’ అని అడిగారంట
జైపూర్ : ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది.పోలీసుల వివరాల మేరకు.. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ఐదుగురు ప్రయాణికులతో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంది. అయితే, మార్గం మధ్యలో జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుండగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఎస్యూవీ క్షణాల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది.ఊహించని పరిణామంతో స్థానికంగా ఉన్న ఇళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. కారు తుక్కు తుక్కు అయ్యింది. ప్రమాద తీవ్రత ఉన్నప్పటికీ వాహనంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. राजस्थान के नागौर में दुर्घटना के बाद कार ने इतने पलटे खाये कि गिनती करना मुश्किल हो गया। सुखद बात यह रही कि इतना होने पर भी सब सुरक्षित रहे।#Nagaur #Rajasthan pic.twitter.com/9GC3bMoZOl— Ajit Singh Rathi (@AjitSinghRathi) December 21, 2024అన్నా.. టీ ఉన్నాయా?స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘కారు పల్టీలు కొట్టే సమయంలో డ్రైవర్ కారులో నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిపోవడంతో మిగతా నలుగురు ప్రయాణికులు దిగారు. ఊహించని ఘోర ప్రమాదంలో కారు దిగిన నలుగురు ప్రయాణికులు స్థానికంగా ఉన్న కార్ షోరూంలోకి వెళ్లారు. అనంతరం, షోరూం సిబ్బందిని ‘టీ ఉన్నాయా’? అని అడిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగినా కారు ప్రయాణికులు స్పందించిన తీరుపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. నాగౌర్ నుండి బికనీర్ వరకు ప్రయాణంప్రమాద సమయంలో ఎస్యూవీ నాగౌర్ నుండి బికనీర్కు వెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. ఫిర్యాదు ఆధారంగా ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించే పనిలో ఉండగా.. మితిమీరిన వేగం కూడా ఓ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కారు ఎలా బోల్తా పడిందో మీరూ చూసేయండి. -
కియా కొత్త ఎస్యూవీ సిరోస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సిరోస్ను భారత్ వేదికగా అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. 2025 జనవరి 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర ఎక్స్షోరూంలో రూ.10–15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. 118 బీహెచ్పీ, 172 ఎన్ఎం టార్క్తో పెట్రోల్ వేరియంట్ 1.0 లీటర్ త్రీ–సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్తో తయారైంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ను ఎంచుకోవచ్చు. లెవెల్–2 అడాస్, 6 ఎయిర్బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. 30 అంగుళాల పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్ వంటి హంగులు జోడించారు. -
టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీ
న్యూఢిల్లీ: పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీని టయోటా మోటార్ కార్పొరేషన్కు సుజుకీ మోటార్ కార్పొరేషన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు తమ సహకారాన్ని మరింత విస్తరింపజేశాయి. ఈ మోడల్ను 2025 ప్రారంభంలో గుజరాత్ ప్లాంటులో తయారు చేయనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.మారుతీ సుజుకీ ఇండియా వచ్చే ఏడాది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్ కోసం తీసుకున్న బీఈవీ యూనిట్, ప్లాట్ఫామ్లను సుజుకీ, టయోటాతోపాటు డైహట్సు మోటార్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.‘ప్రపంచవ్యాప్తంగా టయోటాకు మా మొదటి బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) సరఫరా చేస్తాం. ఈ విధంగా రెండు కంపెనీల మధ్య సహకారం మరింతగా కొనసాగినందుకు చాలా సంతోషంగా ఉంది. పోటీదారులుగా కొనసాగుతూనే ఇరు కంపెనీలు విభిన్న మార్గాల ద్వారా కార్బన్–న్యూట్రల్ సొసైటీని సాకారం చేయడంతో సహా సామాజిక సమస్యలను పరిష్కరించడంలో మరింత సహకరించుకుంటాయి’’ అని సుజుకీ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకోవడం, తయారీ కేంద్రాల వినియోగానికై భాగస్వామ్యం కోసం టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2017లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మారుతీ సుజుకీలో... సుజుకీ కార్పొరేషన్కు దాదాపు 58 శాతం వాటా ఉంది. -
కారు.. రికార్డు! 2 లక్షల మంది కొనేశారు..
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (FRONX) ఎస్యూవీ మరో మైలురాయిని సాధించింది. కేవలం 17.3 నెలల్లో 2 లక్షల విక్రయాల మార్కును చేరుకుని సరికొత్త పరిశ్రమ రికార్డును నెలకొల్పిందని కంపెనీ ప్రకటించింది.2023 ఏప్రిల్లో లాంచ్ అయిన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ దాని థ్రిల్లింగ్ డ్రైవ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన గాడ్జెట్లు, మల్టీ పవర్ట్రెయిన్ ఎంపికల కారణంగా ఈ అద్భుతమైన ఫీట్ను సాధించింది. గతేడాది జనవరిలో 1 లక్ష విక్రయాల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన కొత్త మోడల్గా గుర్తింపు పొందిన తరువాత 7.3 నెలలకే మరో లక్ష విక్రయాలు సాధించి 2 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం విశేషం.ఫ్రాంక్స్ సాధించిన ఈ మైలురాయి మారుతి సుజుకి పట్ల కస్టమర్లకు ఉన్న అంచనాలు, వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందించడానికి తాము చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుందని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ పేర్కొన్నారు. మారుతీ ఫ్రాంక్స్ టైర్ 1, టైర్ 2 నగరాల్లోని కస్టమర్లలో గణనీయమైన ఆకర్షణను పొందింది. వీటి అమ్మకాలకు ఎన్సీఆర్, ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు మొదటి ఐదు టాప్ మార్కెట్లుగా నిలిచాయి. -
కొత్త కార్ల పండగ!
సార్వత్రిక ఎన్నికలు.. మండుటెండలు.. కుండపోత వర్షాలు.. కార్ల కంపెనీల అమ్మకాలను గత మూడు నాలుగు నెలలూ గట్టిగానే దెబ్బకొట్టాయి. గ్రామీణ డిమాండ్తో జూలైలో మాత్రం కాస్త పుంజుకుని ఊరటనిచ్చాయి. నిండు కుండలా కార్ల నిల్వలు పేరుకుపోవడంతో డీలర్లు పండగ సీజన్ కోసం అవురావురుమని ఎదురుచూస్తున్నారు. మరోపక్క, అమ్మకాలు మందగించడంతో.. కార్ల కంపెనీలు గేరు మారుస్తున్నాయి. కొంగొత్త వాహన మోడళ్లను కారు ప్రియుల కోసం రెడీ చేస్తున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు సేల్స్ పెంపుతో పండుగ చేసుకోవాలని చూస్తుండగా.. కస్టమర్లకు కూడా కొత్త కార్ల జాతర కనువిందు చేయనుంది. రాబోయే పండుగ సీజన్ కోసం కార్ల కంపెనీలన్నీ ‘కొత్త’ వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. దాదాపు 20 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అంచనా. ఇందులో 12 కార్లు పూర్తిగా కొత్తవి కావడం విశేషం. ప్రస్తుతం దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ)పైనే కంపెనీలన్నీ ఎక్కువగా గురి పెట్టాయి. కొత్తగా విడుదలయ్యే వాటిలో 13 ఎస్యూవీ మోడల్స్ ఉండటం దీనికి నిదర్శనం. టాటా మోటార్స్, నిస్సాన్, సిట్రాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ మోటార్స్, కియా, హ్యుందాయ్, ఫోక్స్వ్యాగన్తో పాటు లగ్జరీ కార్ దిగ్గజాలు మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ తదితర కంపెనీలు వచ్చే మూడు నెలల్లో కొత్త ఎస్యూవీలతో మార్కెట్ను ముంచెత్తనున్నాయి. ఇక మారుతీ సుజుకీ, మెర్సిడెస్ నయా సెడాన్లతో అలరించనుండగా.. కియా, ఎంజీ మల్టీ పర్పస్ వాహనాలను (ఎంపీవీ) రంగంలోకి దించుతున్నాయి. సేల్స్ తగ్గినా.. నిల్వల పెంపు.. ఈ ఆరి్థక సంవత్సరం మొదలు (ఏప్రిల్ నుంచి) వాహన అమ్మకాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఎన్నికలతో పాటు మండుటెండలు కూడా వాహన విక్రయాలపై ప్రభావం చూపాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేయడం కంపెనీల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, గ్రా మీణ డిమాండ్ మళ్లీ పుంజుకోవడంతో జూలైలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 10% పెరగ డం విశేషం. కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేయడం.. పండుగల్లో భారీ డిమాండ్ ఆశలతో వాహన కంపెనీలు భారీగా నిల్వలు పెంచుకున్నాయి. డీలర్ల వద్ద సగటున 25–30 రోజుల నిల్వలు ఉంటాయని, ప్రస్తుతం 60–65 రోజుల నిల్వలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.73,000 కోట్లుగా అంచనా. సెపె్టంబర్తో షురూ... దక్షిణాదిన కేరళ ‘ఓనమ్’ తో పండుగ సేల్స్ మొదలవుతాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి, దుర్గాపూజ, దసరా, దీపావళి ఇలా వరుసగా అటు జనాలకు ఇటు కంపెనీలకూ పండుగే. మూడు నెలలుగా పేరుకున్న నిల్వలను పండుగల్లో విక్రయించడంతో పాటు కొత్త మోడళ్లతో కస్టమర్లను షోరూమ్లకు క్యూ కట్టించాలనేది వాహన సంస్థల వ్యూహం. మహీంద్రా సక్సెస్ఫుల్ ఎస్యూవీ ‘థార్’లో (ప్రస్తుతం మూడు డోర్ల మోడల్ ఉంది) కొత్తగా ఐదు డోర్ల థార్ ‘రాక్స్’ను తీసుకొస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దీన్ని ఆవిష్కరించి.. పండుగ సీజన్లో మార్కెట్లోకి తీసుకొచ్చేలా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ‘ఐదు డోర్ల థార్ కోసం మేము ముందుగా ప్లాన్ చేసిన ఉత్పత్తికి మరో 3,000–4,000 అదనంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం’ అని ఎంఅండ్ఎం సీఈఓ (ఆటో, ట్రాక్టర్ల విభాగం) రాజేష్ జెజూరికర్ క్యూ1 ఆరి్థక ఫలితాల సందర్భంగా వెల్లడించారు.ఈవీలు, హైబ్రిడ్లు కూడా... కొత్తగా లైన్ కడుతున్న వాహన మోడల్స్ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా రకరకాల ఇంజిన్ ఆప్షన్లతో లభించనున్నాయి. పెట్రోల్, డీజిల్తో పాటు ఎలక్ట్రిక్ (ఈవీ) హైబ్రిడ్ (సీఎన్జీ+పెట్రోల్ వంటివి) ఇంజిన్లు సైతం వీటిలో ఉన్నాయి. ఈవీ విభాగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్ సరికొత్త ఎస్యూవీ కూప్ ‘కర్వ్’తో పండగ చేసుకోవాలనుకుంటోంది. ఈ మోడల్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఈవీ వేరియంట్ను కూడా తీసుకొస్తోంది. ముందుగా ఈవీ ‘కర్వ్’ను ప్రవేశపెట్టడం విశేషం. గత నెలలో నిస్సాన్ ఆవిష్కరించిన ప్రీమియం ఎస్యూవీ ఎక్స్–ట్రెయిల్ కూడా పండుగల్లో రోడ్డెక్కనుంది.పండుగ రేసు గుర్రాలు (అంచనా ధర రూ.లలో).. → టాటా మోటార్స్–కర్వ్ ఈవీ (18–25 లక్షలు), → కర్వ్ (రూ.10.5–20 లక్షలు), → మారుతీ–స్విఫ్ట్ హైబ్రిడ్ (10 లక్షలు), డిజైర్–2024 (7–10 లక్షలు) → మహీంద్రా–థార్ రాక్స్ (13–23 లక్షలు) → నిస్సాన్ – ఎక్స్ట్రెయిల్ (49 లక్షల నుంచి)→ టయోటా బెల్టా – (9.5–12 లక్షలు) → మెర్సిడెజ్–బెంజ్ – ఈక్యూఎస్ ఎస్యూవీ (2 కోట్లు) → బీఎండబ్ల్యూ–ఎం3 (1.47 కోట్లు) → రెనో–కార్డియన్ (10–12 లక్షలు) → ఎంజీ–క్లౌడ్ ఈవీ (29–30 లక్షలు), → గ్లోస్టర్–2024 (40 లక్షలు) → స్కోడా–కొడియాక్–2024 (40–50 లక్షలు) → బీవైడీ–సీగల్ ఈవీ (10 లక్షలు) → కియా–ఈవీ9 (75–82 లక్షలు)→ ఆడి–క్యూ8 ఫేస్లిఫ్ట్ (రూ.1.17 కోట్లు) → సిట్రాన్ – సీ3ఎక్స్ (రూ.11.5 –15 లక్షలు), బసాల్ట్ (రూ.8 లక్షలు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టాటా కర్వ్ ఈవీ వచ్చేసింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కర్వ్.ఈవీ ఎస్యూవీ కూపే విడుదల చేసింది. ఎక్స్షోరూంలో ధర రూ.17.49 లక్షలతో ప్రారంభమై రూ.21.25 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 2023 ఆటో ఎక్స్పోలో కాన్సెప్ట్ రూపంలో ఈ కారు తొలిసారిగా దర్శనమిచ్చింది. కర్వ్.ఈవీ చేరికతో టాటా మోటార్స్ ఖాతాలో ఎలక్ట్రిక్ మోడళ్ల సంఖ్య అయిదుకు చేరుకుంది. 123 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కర్వ్. ఈవీలో పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో 502 కిలోమీటర్లు, 55 కి.వా.అవర్ బ్యాటరీ ప్యాక్తో 585 కి.మీ. ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. భారత్ ఎన్సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇవీ అదనపు ఫీచర్లు.. 20కిపైగా సేఫ్టీ ఫీచర్స్తో లెవెల్–2 అడాస్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్బ్యాగ్స్, ఆటోహోల్డ్తో ఎల్రక్టానిక్ పార్కింగ్ బ్రేక్, 190 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 18 అంగుళాల వీల్స్, పనోరమిక్ సన్రూఫ్ ఇతర హంగులు. 40 నిమిషాల్లో బ్యాటరీ 80% చార్జింగ్ పూర్తి అవుతుంది. కర్వ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మోడల్ను సెప్టెంబర్ 2న ఆవిష్కరిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర తెలిపారు. లక్ష టాటా ఈవీలు భారత రోడ్లపై పరుగెడుతున్నాయన్నారు. కంపెనీకి ఎలక్ట్రిక్ కార్ల విపణిలో 70% వాటా ఉందన్నారు. -
ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ విషాదం : ఎస్యూవీ డ్రైవర్కు బెయిల్
ఢిల్లీ : ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్లో విద్యార్ధుల మరణాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్యూవీ డ్రైవర్ మను కతురియాకు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జులై 27న ఢిల్లీలో రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ముగ్గురు విద్యార్థుల మరణానికి పరోక్షంగా ఎస్యూవీ డ్రైవర్ మను కతురియా కారణమంటూ ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.తన అరెస్ట్ని సవాల్ చేస్తూ కతురియా ఢిల్లీ జిల్లా తీస్ హజారీ కోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ చేపట్టిన కోర్టు రూ.50వేల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. [Rajendra Nagar deaths] A Delhi Sessions Court grants bail to Manuj Kathuria, an SUV driver arrested by Delhi Police in connection with the case. Kathuria was denied bail by the Magistrate Court on Wednesday. #UPSCaspirants #RajendraNagar #bail pic.twitter.com/RDOmIdyIAH— Bar and Bench (@barandbench) August 1, 2024జులై 27న సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దాంతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేందర్ నగర్లోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లో సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. అదే సమయంలో రావుస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై మను కతురియా తన ఎస్యూవీ వాహనాన్ని వేగంగా డ్రైవింగ్ చేయడంతో వరద నీరు సెల్లార్లోకి చేరుకుంది. దీంతో వరదలో చిక్కుకుని సెల్లార్లోని లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్ధులు మరణించారు. ఈ దుర్ఘటనలో విద్యార్ధుల మరణానికి మను కతురియా కారకుడేనంటూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ను కతురియా సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
అమ్మకాల్లో దేశీయ దిగ్గజం అరుదైన రికార్డ్.. 20 లక్షల యూనిట్లు
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. దేశంలో ఇప్పటికి 20 లక్షల ఎస్యూవీలను విక్రయించి అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇందులో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీలుగా టాటా సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్ ఉన్నాయి. వీటితో పాటు పాత మోడల్ సియెర్రా, సఫారీ కూడా ఉన్నాయి.కంపెనీ సాధించిన ఈ విజయాన్ని సంస్థ 'కింగ్ ఆఫ్ ఎస్యూవీస్' పేరిట ఆఫర్స్ కూడా ప్రకటించింది. దీంతో హారియర్, సఫారీ, పంచ్ వంటి వాటిని కొంత తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో అడిషినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ గత నెలలో (2024 జూన్) ఎక్కువ సంఖ్యలో విక్రయించిన ఎస్యూవీ పంచ్ కావడం గమనించదగ్గ విషయం. కాగా కంపెనీ ఇప్పుడు తన నెక్సాన్ కార్టూను CNG రూపంలో కూడా లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది త్వరలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. -
మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ ‘అర్బన్ క్రూజర్ టైజర్’ను విడుదల చేసింది. దీని ధర రూ. 7.73 లక్షల నుంచి రూ. 13.03 లక్షల వరకు (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. ఇది మారుతీ సుజుకీకి చెందిన ఫ్రాంక్స్కి టీకేఎం వెర్షన్గా ఉంటుంది. టైజర్ పెట్రోల్, ఈ–సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రీమియం ఇంటీరియర్స్, కీ లెస్ ఎంట్రీ, 360 వ్యూ కెమెరా, 9 అంగుళాల హెచ్డీ స్మార్ట్ప్లే, యాంటీ–థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రూ. 11,000తో టైజర్ను బుక్ చేసుకోవచ్చు. మే నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు ఈ మోడల్ తమకు ఉపయోగపడగలదని కంపెనీ డిçప్యూటీ ఎండీ తడాషి అసాజుమా తెలిపారు. కస్టమర్లు చిన్న కార్ల నుంచి క్రమంగా పెద్ద కార్ల వైపు మళ్లుతున్నారని, అందుకే మరిన్ని కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టేందుకు తాము ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. -
రూ.16.8 లక్షల ఎస్యూవీని ఆవిష్కరించిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మధ్యశ్రేణి ఎస్యూవీ క్రెటా ఎన్లైన్ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుందని తెలిపింది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఎన్లైన్ శ్రేణిలో ఇప్పటికే ఐ20 హ్యాచ్బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ ఉన్నాయి. ఎన్ లైన్, ప్రామాణిక మోడల్ వాహనాల మధ్య డిజైన్లో పలు మార్పులుంటాయి. కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్వీల్స్, రెడ్ ఫ్రంట్, రేర్ బ్రేక్ కాలిపర్స్, గ్రిల్పై ఎన్ లైన్ బాడ్జింగ్ పలు డిజైన్ సంబంధిత మార్పులుంటాయి. ఎన్ లైన్ వినియోగదార్ల సగటు వయసు 36 ఏళ్లుగా ఉందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ–స్కూటర్కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
Traffic Effect: నదిలో దూసుకెళ్లిన కారు
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఒక వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి ట్రాఫిక్ను తప్పించుకోవడం కోసం రోడ్డు దిగి తన ఎస్యూవీ కార్ను ఏకంగా నదిలో పరుగులు పెట్టించాడు. ఈ ప్రమాదకర ప్రయణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నదిలో వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిలో కారును పరుగులు పెట్టించిన ఘటన హిమాచల్ప్రదేశ్లోని లాహోల్ స్పితి జిల్లాలో జరిగింది. కారు వెళ్లిన చంద్రా నదిలో ప్రస్తుతం నీళ్ల లోతు పెద్దగా లేదు. దీంతో ఎస్యూవీ ఈజీగా నదిని దాటేసింది. ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డ వాహనదారునికి మోటార్ వెహికిల్ చట్టం కింద భారీ జరిమానా విధించినట్లు ఎస్పీ మయాంక్ చౌదరి తెలిపారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవులు రావడంతో హిమాచల్కు టూరిస్టుల తాకిడి పెరిగింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. డ్రోన్లతో పోలీసులు ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Himachal Pradesh: Challan issued after a video of driving a Thar in Chandra River of Lahaul and Spiti went viral on social media. SP Mayank Chaudhry said, "Recently, a video went viral in which a Thar is crossing the river Chandra in District Lahaul Spiti. The said… pic.twitter.com/V0a4J1sgxv — ANI (@ANI) December 25, 2023 ఇదీచదవండి..పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్కు భారత్లో అ«దీకృత సంస్థగా ఎక్స్క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
మహీంద్రా కార్ల అమ్మకాల జోరు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ వాహన విక్రయాల్లో వృద్దిని నమోదు చేసింది. అక్టోబర్ నెలలో మహీంద్రా మొత్తం 43,708 ఎస్యూవీ వెహికల్స్ను అమ్మింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35శాతం వృద్దిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో 32,298 యూనిట్లను విక్రయించింది. 1,854 యూనిట్ల ఎస్యూవీలను ఎగుమతి చేయగా.. 25,715 యూనిట్ల వాణిజ్య వాహనాలను అమ్మనిట్లు తెలిపింది ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. ‘అక్టోబర్లో 32 శాతం వృద్ధితో 679,32 వాహనాలతో అత్యధిక అమ్మకాలు జరిపాం. వరుసగా మూడో నెలలో ఎస్యూవీలు 43,708, సీవీలు 25,715 వాహనాలతో హై వాల్యూమ్లు సాధించాయి.’అని అన్నారు. కాగా, మహీంద్రా 2026 నాటికి ఐదు డోర్ల ఎలక్ట్రిక్ ఎస్యూవీని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈవీ ఎస్యూవీలో 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో రానుంది. -
భారత్లో టయోటా మూడవ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా మోటార్.. భారత్లో మూడవ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏటా 80,000–1,20,000 యూనిట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని స్థాపించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో నూతన కేంద్రంలో తయారీ సామర్థ్యాన్ని 2,00,000 యూనిట్లకు చేరుస్తారు. కర్నాటకలోని బీదడి వద్ద ఉన్న టయోటాకు చెందిన రెండు ప్లాంట్లు ఏటా 4,00,000 యూనిట్లు తయారు చేయగలవు. ఈ ప్లాంట్లకు సమీపంలోనే మూడవ కేంద్రం నెలకొల్పాలన్నది కంపెనీ ప్రణాళిక. భారత విపణి కోసం కొత్త ఎస్యూవీని అభివృద్ధి చేసే పనిలో కంపెనీ ఇప్పటికే నిమగ్నమైంది. 2026లో ఇది ఇక్కడి రోడ్లపై పరుగు తీయనుంది. కొత్త ఫ్యాక్టరీలో ఈ ఎస్యూవీని తయారు చేయనుండడం విశేషం. మధ్యస్థాయి అర్బన్ క్రూజర్ హైరైడర్కు మలీ్టపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్కు మధ్య ఈ మోడల్ ఉండనుంది. 340–డి కోడ్ పేరుతో రానున్న ఈ ఎస్యూవీ మోడల్ కింద ఏటా 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ ఆలోచన. ఇందుకోసం సరఫరాదార్లను టయోటా సన్నద్ధం చేస్తోంది. భారత్లో మినీ ల్యాండ్ క్రూజర్ను సైతం పరిచయం చేయాలని సంస్థ భావిస్తోంది. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్తో అంతర్జాతీయంగా భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. భారత్లో టయోటా ప్లాంట్ల సామర్థ్యంలో 40 శాతం మారుతీ సుజుకీ వినియోగించుకుంటోంది. భారత్లో 2030 నాటికి ఏటా 5,00,000 యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగి ఉండాలని టయోటా భావిస్తోంది. -
మెర్సిడెస్ బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..సింగిల్ ఛార్జ్తో 550 కిలోమీటర్లు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4మేటిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని భారత్లో విడుదల చేసింది. ధర ఎక్స్షోరూంలో రూ.1.39 కోట్లు. బ్యాటరీపై 10 ఏళ్లు లేదా 2,50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉంది. 90.56 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 465–550 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. పొడవు 4,863 మిల్లీమీటర్లు ఉంది. సీమ్లెస్ గ్లాస్ కవర్తో 12.3 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, 17.7 అంగుళాల ఓలెడ్ సెంట్రల్ డిస్ప్లే, 12.3 అంగుళాల ఓలెడ్ ఫ్రంట్ ప్యాసింజర్ డిస్ప్లే ఏర్పాటు చేశారు.థర్మోట్రానిక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాక్టివ్ స్టీరింగ్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, ట్రాన్స్పరెంట్ బానెట్, 360 డిగ్రీల కెమెరా వంటి హంగులు ఉన్నాయి. కాగా, మెర్సిడెస్కు చెందిన చార్జింగ్ కేంద్రాల్లో ఇతర బ్రాండ్ల కార్లకు సైతం చార్జింగ్ సదుపాయం కల్పిస్తారు. -
ఆగస్ట్లో ఆల్టైమ్ ‘రయ్’!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఆగస్టులో ఆల్టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు డిమాండ్ కొనసాగడం, పండుగ సీజన్ మొదలవడంతో గిరాకీ పుంజుకుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. మొత్తం 1,89,082 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెల అమ్మకాలు 1,65,173 యూనిట్లతో పోలిస్తే 14% అధికం. హ్యుందాయ్, ఎంఅండ్ఎం, టయోటా కిర్లోస్కర్ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ విక్రయాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ ఆటో విక్రయాలు 15% తగ్గాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 6%, 4% పెరిగాయి. వాణిజ్య వాహనాలు, ట్రాకర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. -
ట్రక్కును ఢీకొన్న ఎస్యూవీ
ససరాం(బిహార్): బిహార్లోని రొహతస్ జిల్లా ససరాం వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. ససరాం పట్టణంలోని శివసాగర్ వద్ద రెండో నంబర్ జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. కైముర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఎస్యూవీలో జార్ఖండ్లోని రాజ్రప్ప ఆలయానికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆ వాహనం నిలిపి ఉన్న ట్రక్కును వేగంగా ఢీకొంది. ఘటనలో రాజ్మాతాదేవి(55)తోపాటు ఆమె కూతురు, అల్లుడు, మనవడు(8), మనవరాలు(9)తోపాటు ఒక బాలిక (15), మహిళ(22) చనిపోయారు. -
ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే..
భోపాల్: కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన ఓ వ్యక్తికి వింతైన అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి వచ్చిన సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉంది. దీంతో ఆయన తన ట్రక్కును వినియోగించాల్సి వచ్చింది. అయితే.. ఇంత మొత్తంలో సమాచారానికి ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆయనకు ఉచితంగా ఈ సమచారాన్ని అధికారులు అందించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి రాష్ట్రంలో కొవిడ్ సంబంధించిన మెడికల్ టెండర్లు, బిల్ పేమెంట్ల గురించి సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఇందుకు ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎమ్హెచ్ఓ)కు తన అభ్యర్థనను సమర్పించారు. ఈ సమాచారాన్ని నిర్ణీత గడువు ఒక నెలలో సమర్పించలేకపోయారు అధికారులు. దీంతో ధర్మేంద్ర ఉన్నత అధికారులను సంప్రదించారు. ధర్మేంద్ర అభ్యర్థనను పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఆయనకు ఉచితంగానే ఆ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉండటంతో ఆయన తన ట్రక్కును తీసుకుని వెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు తప్పా మిగిలిన భాగమంత పేపర్లతోనే నింపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. పేపరు సమాచారానికి రూ.2 చెల్లించాల్సి ఉండగా.. ఉచితంగానే లభించిందని చెప్పారు. అటు.. ఖజానాకు రూ.80 వేల నష్టాన్ని కలిగించిన అధికాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదీ చదవండి: పాకిస్థాన్కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత.. -
పీవీ విక్రయాలు స్వల్పంగా పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ విక్రయాలు జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.2 శాతం పెరిగాయి. ఎంట్రీ లెవెల్ ఎస్యూవీలకు డిమాండ్ ఈ పెరుగుదలకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. కస్టమర్లు ఎస్యూవీలకు మళ్లడంతో హ్యాచ్బ్యాక్స్ విక్రయాలు తగ్గాయని వెల్లడించింది. 2023 జనవరి–జూన్లో పీవీల అమ్మకాలు తొలిసారిగా అత్యధికంగా 20 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్నాయి. సియామ్ గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో తయారీ కంపెనీల నుంచి డీలర్íÙప్లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 1.7 శాతం అధికమై 13.30 లక్షల యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 53,019 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విక్రయాల పరంగా ఎటువంటి ఆందోళన లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం కలిసి వచ్చే అంశం అని అన్నారు. రానున్న రోజుల్లో పీవీ విభాగం సానుకూలంగా ఉంటుందని చెప్పారు. -
కొత్త కారు కొనేవారికే కష్టమే! జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో..
సాధారణంగా ఎప్పటికప్పుడు వాహన తయారీ సంస్థలు తన ఉత్పత్తుల ధరలను పెంచుతూనే ఉంటాయి. ముడిసరుకుల ధరల కారణంగా.. ఇతరత్రా కారణాలు చూపిస్తూ ఏడాదికి కనీసం ఒక్క సారైనా పెంచుతుందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు పెరిగినట్లు స్పష్టంగా తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మంగళవారం జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త కారు కొనాలనుకునే వారికి జీఎస్టీ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల మీద జీఎస్టీ సెస్ పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కావున ఇప్పుడు కొత్త ఎమ్యూవీ కార్లను కొనుగోలు చేసేవారు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. 28 శాతం జీఎస్టీ ఉండగా.. దీనిపైన 22 శాతం సెస్ విధించారు. దీంతో వాహన ధరలకు రెక్కలొచ్చాయి. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) ఎస్యూవీ అంటే పొడవు 4 మీటర్ల కంటే ఎక్కువ ఉండటమే కాకుండా.. ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీ కంటే ఎక్కువ ఉండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 మీమీ కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఉన్న కార్లు మాత్రమే ధరల పెరుగుదల అందుకుంటాయని తెలుస్తోంది. గతంలో సెస్ అనేది 20 శాతంగా ఉండేది. ఇది తాజాగా రెండు శాతం పెరిగి సెస్ 22 శాతానికి చేరింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
లఢక్ పర్యటకుని నిర్లక్ష్యం.. సోయగాల ఒడిలో కమ్ముకున్న దుమ్ము మేఘాలు..
లఢక్: భూతల స్వర్గం కశ్మీర్.. అక్కడి లఢక్ పీఠభూమి అందాలు ఎంత చూసిన తనివితీరనివి. అలాంటి ప్రాంతాలను పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగా మురికిగా మారుతున్నాయి. లఢక్ను పరిరక్షించుకోవాలని భావించి ఈ ప్రాంతాన్ని రామ్సర్ సైట్లో కూడా చేర్చారు. అయినప్పటికీ ఇటీవల ఓ యాత్రికుడు చేసిన పని చూస్తే చివాట్లు పెట్టకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన దృశ్యాలను అటవీ అధికారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రామ్సైట్ అయినటువంటి త్సో కర్, త్సో మోరిరి సరస్సుల ప్రాంగణం ప్రశాంతతకు పెట్టింది పేరు. వలస పక్షుల కిలకిలరావాలతో అలరారుతుంది. అలాంటి ప్రాంతంలో ఓ యాత్రికుడు ఎస్యూవీతో భీబత్సం సృష్టించాడు. వేగంగా చక్కర్లు కొడుతూ ఆ ప్రాంతాన్ని దుమ్ము మయం చేశాడు. ఎస్యూవీ టైర్ల నుంచి లేచే దమ్ము దృశ్యాలు అక్కడి మేఘాలను తలపిస్తున్నాయి. ఈ వీడియోను మోఫుసిల్_మెడిక్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్తా తెగ వైరల్ అయింది. Shared by a fellow birder from #Ladakh... this stupidity is getting out of hand. This seemingly "barren" landscape is teeming with #life- and the short summer is when that life is at its peak. That too at a Ramsar Site! These idiots need to be named, shamed and booked!… pic.twitter.com/wRpYkkYf6p — Mofussil_Medic (@Daak_Saab) July 9, 2023 ఈ వీడియోపై నెటిజన్లు ఫైరయ్యారు. పర్యటకుని నిర్లక్ష్యానికి తగిన బుద్ది చెప్పాలను సూచించారు. మూర్ఖత్వం తారాస్థాయికి చేరింది.. ఇలాంటి పర్యటకులను ఆ ప్రాంతంలోకి అనుమతించకూడదని మరో యూజర్ అన్నాడు. భూటాన్ లాగే లఢక్లో పర్యటకులకు భారీ ట్యాక్స్లను విధించాలని, ఇలాంటి ఘటనలపై భారీ జరిమానాలు వసూలు చేయాలని మరో వ్యక్తి కామెంట్ బాక్స్లో రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. 2024 జనవరి నుంచి రామ్లాలా దర్శనభాగ్యం! -
ఆడి క్యూ8 ఈ–ట్రాన్ వస్తోంది
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ ఆడి భారత మార్కెట్లో క్యూ8 ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని 2023 ఆగస్ట్లో ఆవిష్కరిస్తోంది. ఎస్యూవీ, స్పోర్ట్బ్యాక్ రకాల్లో విడుదల చేయనుంది. 114 కిలోవాట్ బ్యాటరీ పొందుపరిచారు. పూర్తిగా తయారైన కారును భారత్కు దిగుమతి చేసుకుంటారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా ఈ–ట్రాన్ 50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్బ్యాక్ 55, ఈ–ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడళ్లను విక్రయిస్తోంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న మోడళ్లను ఇక్కడి మార్కెట్కు తీసుకువస్తామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘2033 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కంపెనీగా మారాలన్నదే సంస్థ లక్ష్యం. మరిన్ని ఈవీలు ప్రవేశపెడతాం. భారత్లో ఈ కార్లు రూ.1.5 కోట్ల సగటు ధరకు అమ్ముడవుతున్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో ఆడి ఈవీలు ఆదరణ పొందుతున్నాయి’ అని వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి ఆడి ఇండియా 2023 జనవరి–జూన్లో 3,474 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 97% ఎక్కువ. -
మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన మోస్ట్ ప్రీమియం కారు వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్స్తో మల్టీ-పర్పస్ వెహికల్ ఇన్విక్టోను లాంచ్ చేసింది. ధరలు రూ. 24.79 లక్షల నుండి ప్రారంభం. మారుతి ఇన్విక్టో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ను హైబ్రిడ్ మోటార్తో జత చేసింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్లను పొందిన తొలి మారుతీ కారు ఇన్విక్టో అని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన కారుగా భావిస్తున్న ఇన్విక్టో ప్రాథమికంగా గత సంవత్సరం విడుదల చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్పివికి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. 2016లో ప్రారంభమై 2019లో లాంఛన ప్రాయమైన మారుతి , టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం తర్వాత ఇది సెకండ్ ప్రొడక్షన్. Zeta+ (7 సీటర్), Zeta+ (8 సీటర్) , Aplha+ (7 సీటర్)అనే మూడు వేరియంట్లలో వీటి ధర రూ. 24.79 లక్షల మొదలై టాప్ వేరియంట్ రూ. 28.42 లక్షల వరకు ఉంటుంది. మిడ్ వేరియంట్ ధర రూ. 24.84 లక్షలు. ఇది నెక్సా బ్లూ , మిస్టిక్ వైట్తో సహా నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది నెక్సా లైనప్లో ఎనిమిదోది . 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్ 172బిహెచ్పి పవర్, 188ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇన్నోవా హైక్రాస్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయింది. హైక్రాస్తో పోలిస్తే, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, సెకండ్ రో ఒట్టోమన్ సీట్లు తప్ప దాదాపు మిగిలిన ఫీచర్లున్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కోసం మెమరీ సెట్టింగ్స్, 10.1-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్రూఫ్, 7-అంగుళాల TFT MIDతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ఆరుఎయిర్ బాగ్స్, లెదర్ అప్హోల్స్టరీతో కూడా వస్తుంది. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బాందా: విద్యుదాఘాతానికి గురైన ఒక బాలు డిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వేగంగా వెళ్తు న్న వాహనం ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బాందాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. టిలౌసా గ్రామానికి చెందిన కల్లు(13) అనే బాలుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతడిని తీసుకుని దగ్గర్లోని బబెరు ఆరోగ్య కేంద్రానికి ఎస్యూవీలో బయలుదేరారు. వారి వాహనం అదుపుతప్పి కమాసిన్ రోడ్డులో నిలిపిఉన్న ట్రక్కును వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ఘటనలో కల్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో వారి వాహనం గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుతోందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు. -
సింగిల్ ఛార్జ్కి 501 కిలోమీటర్ల రేంజ్: కియా కొత్త ఎలక్ట్రిక్ కార్
దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా కొత్త ఎలక్ట్రిక్ కార్ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా ఆల్-ఎలక్ట్రిక్ ఈవీ9 ఫ్లాగ్షిప్ ఎస్యూవీని విడుదల చేయనున్నట్లు తాజాగా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఈవీ6 ఎస్యూవీని 2021లో విడుదల చేసిన కియా కంపెనీకి ఇది రెండో ఎలక్ట్రిక్ కార్. మూడు వరుసల సీటర్ అయిన ఈ ఎస్యూవీ 99.8 కిలోవాట్-హవర్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్తో 501 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ మోడల్ కూడా అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియాలో సోమవారం (జూన్ 19) విడుదల కానున్న ఈవీ9 ఎస్యూవీ ధర 73 నుంచి 82 మిలియన్ వాన్లు ( రూ. 46.8 లక్షలు నుంచి రూ.52.5 లక్షలు) ఉంటుంది. తర్వాత విడతలో ఈ ఎస్యూవీని యూరప్, యునైటెడ్ స్టేట్, ఇతర మార్కెట్లలో విడుదల చేయాలని కియా కంపెనీ యోచిస్తోందని యాన్హాప్ అనే కొరియన్ వార్తా సంస్థ నివేదించింది. The future of driving isn’t just a technological jump forward. It will incorporate the humanity and user experience of passengers to help people move in a better way. Learn more: https://t.co/mRhnWQ1OEz#KiaEV9 #Kia pic.twitter.com/dHaRcrrxLY — Kia Worldwide (@Kia_Worldwide) June 16, 2023 -
ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో
ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఖరీదైన కారును పోగొట్టుకున్న వైనం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గుజరాతీ గాయకుడు ,సంగీత దర్శకుడు, బిన్నీ శర్మ రూ. 40 లక్షల విలువైన ఎప్యూవీని పోగొట్టకుని లబోదిబోమంటున్నాడు. ఈ మేరకు తనకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ అవుతోంది. (అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు) తన పాటలు, వాయిస్తో గాయకుడిగా పాపులర్ అయిన బిన్నీ గూగుల్లో సెర్చ్ చేసి ఫేక్ పోర్ట్ల్ ద్వారా మోసానికి గురయ్యాడు. తాను సాధారణంగా సహాయం కోసం అడగను, కానీ మోసగాడు చేసిన స్కామ్కు బలైపోయా.. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను సాయం చేయాలంటూ ఇన్స్టా వేదికగా కోరుతున్నాడు. అలాగే మూవ్ మై కార్, జస్ట్ డయల్, గూగుల్ యాడ్స్ తో జాగ్రత్తగా ఉండాలి, మోస పోవద్దంటూ పిలుపునివ్వడం గమనార్హం. రూ.40 లక్షలు విలువ చేసే తన ఎస్యూవీని హిమాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ కు తరలించాలంటూ శర్మ మూవ్ మై కార్ అనే పోర్టల్ లో వెండర్ను సంప్రదించాడు. ఈ మేరకు సదరు వెండర్కు చెందిన ట్రక్ శర్మ కారును తీసుకెళ్లింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. తీసుకెళ్లి కారును మాత్రం గమ్యస్థానానికి చేర్చలేదు. పైగా ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన సొమ్ముకాకుండా అధికంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గమనించిన బిన్నీ పోలీసులను ఆశ్రయించాడు. అగర్వాల్ ఎక్స్ ప్రెస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, మూవ్ మై కార్ పోర్టల్పై కూడా సైబర్ పోలీసులు కన్జ్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేశానని బిన్నీ తెలిపారు. అటు పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. (ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం) కాగా రేడియో జాకీగా తొలినాళ్ల నుంచి 'మై వరల్డ్' అనే షోను హోస్ట్ చేస్తూ సునిధి చౌహాన్, శంకర్ ఎహసాన్ లాయ్, అర్జిత్ సింగ్ వంటి పాపులర్ సింగర్స్తో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, తన టాలెంట్తో అనేక మంది ఫ్యాన్స్ని, ఫాలోయర్స్ని సంపాదించకున్నాడు బిన్నీ శర్మ. -
మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు వచ్చేసింది. భారత్లో రూ. 12.7 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అడుగుపెట్టింది. ఈ ఎస్యూవీ జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన ఆల్ఫా వేరియంట్లో టాప్ ధర రూ. 15.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్యూవీని భారత్లో నెక్సా షోరూమ్ల ద్వారా కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. కొత్త జిమ్నీ 103 హార్స్పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. కస్టమర్లు తమకు కావాల్సిన విధంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్యూవీకి పోటీగా మహీంద్రా 5-డోర్ థార్ను రంగంలోకి దించుతోన్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో దీన్ని పరిచయం చేసింది.మారుతి సుజుకి కొత్త జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్లు సాధించింది. ఇప్పటి వరకు జిమ్నీ 3-డోర్ వెర్షన్ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.2 మిలియన్ యూనిట్ల జిమ్నీని విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త 5-డోర్ వెర్షన్తో మారుతి సుజుకి భారతీయ ఎస్యూవీ మార్కెట్లో అగ్రస్థానాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చవకైన 4X4 కారు మారుతి సుజుకి జిమ్నీ భారత్లో చవకైన 4X4 కారుగా అవతరించింది. లుక్స్ పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్.. 3-డోర్ జిమ్నీని పోలి ఉంటుంది. రౌండ్ హెడ్ల్యాంప్లు, బ్లాక్ అవుట్ గ్రిల్స్ దానిలాగే ఉంటాయి. కారు వెనుక భాగం కూడా అలాగే ఉంటుంది. పొడవైన వీల్బేస్ కారణంగా రెండు వైపులా గుర్తించదగిన మార్పు కన్పిస్తుంది. క్యాబిన్ విషయానికి వస్తే ఇందులో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, USB-C పోర్ట్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్లో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఈఎస్పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణికులకు మూడు పాయింట్ సీట్బెల్ట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇదీ చదవండి: హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్యూవీలు -
హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్యూవీలు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా.. భారత మార్కెట్లో 2030 నాటికి అయిదు కొత్త ఎస్యూవీలను పరిచయం చేయనుంది. వీటిలో ఎలివేట్ ఎలక్ట్రిక్ మోడల్ సైతం ఉందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయా సుమురా తెలిపారు. మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఎలివేట్ సాయంతో కంపెనీ తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిటీ, అమేజ్ సెడాన్లను భారత్లో విక్రయిస్తున్నాం. మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో సెడాన్ల వాటా 10 శాతమే. ఈ విభాగంలోనే కంపెనీ పోటీపడుతోంది. అలాగే ఈ మోడళ్లు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాయి. ఎలివేట్ను తొలిసారిగా భారత్లో ప్రవేశపెట్టాం. రానున్న రోజుల్లో ఈ మోడల్ ప్రధాన ఉత్పాదనగా ఉంటుంది. కొత్తగా వచ్చే మోడళ్లు ప్రీమియం సెగ్మెంట్లో పోటీ పడతాయి. ఎలివేట్ ఎగుమతి కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దుతాం. ఇక 2022–23లో 1.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశాం. 2024–25లో దీనిని 1.7 లక్షల యూనిట్లకు చేరుస్తాం’ అని వివరించారు. 2040 నాటికి బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ వాహనాలను మాత్రమే విక్రయిస్తామని హోండా మోటార్ కో ఆసియా హెడ్ తోషియో కువహర తెలిపారు. -
మహీంద్రా థార్ లాంచ్పై కీలక అప్డేట్
మహీంద్రా థార్ (5-డోర్) దేశంలో అత్యంత ఎదురుచూస్తున్న ఎస్యూవీ(SUV)లలో ఒకటి. ఇప్పటి వరకు ఈ ఏడాది ఆగస్టు 15న ఈ ఎస్యూవీ లాంచ్ అవుతుందని పుకారు ఉండేది. అయితే థార్ 5-డోర్ లాంచ్ ఎప్పుడనేది కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాహన ప్రియులను మరింత నిరీక్షణలోకి నెట్టేసింది. మహీంద్రా థార్ 5-డోర్ 2024లో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ సంవత్సరం కంపెనీకి సంబంధించిన కొత్త ఉత్పత్తులేవీ లేవని మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటో & ఫార్మ్ సెక్టార్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో రాజేష్ జెజురికర్ తెలిపారు. ఇప్పటికే 50,000లకుపైగా బుకింగ్లు 5-డోర్ థార్కు చాలా డిమాండ్ ఉందని, ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ బుకింగ్లు వచ్చాయని జెజురికర్ పేర్కొన్నారు. కస్టమర్ల నిరీక్షణకు తెర దించుతూ 2024 సంవత్సరంలో 5-డోర్ థార్ను లాంచ్ చేయనున్నట్లు వివరించారు.పెంచాలి మరియు ఇప్పుడు మేము 2024లో వచ్చే థార్ 5-డోర్లను చూస్తున్నాము”, జోడించారు. మహీంద్రా థార్కు దేశంలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ ఎస్యూవీ డెలివరీ పొందాలంటే కస్టమర్లు మరికొంత కాలం వేచి ఉండాలి. కాగా మహీంద్రా ఈ సంవత్సరం ప్రారంభంలో థార్లో RWD 4X2 వెర్షన్ను కూడా ప్రారంభించింది. ఇక మహీంద్రా థార్ 5-డోర్ డిజైన్, ఇతర ప్రత్యేకతల విషయానికి వస్తే పొడవైన స్తంభాలతో బాక్స్ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. వాహనం ముందు, వెనుక భాగాలు ప్రస్తుత థార్ మాదిరిగానే ఉంటాయని తెలిసింది. అయితే కొత్త 5-డోర్ థార్లో పొడవైన డోర్లు, వీల్బేస్తో మరింత విశాలమైన క్యాబిన్ ఉంటుంది. సరికొత్త అల్లాయ్ వీల్స్, హుడ్ కింద 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉంటాయని వెల్లడైంది. ఇదీ చదవండి: మెర్సిడెస్ కొత్త వర్షన్స్ భారత్కు వచ్చేశాయ్! ధరలు ఇవే.. -
జిమ్నీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. లాంచింగ్ మే నెలలో కాదు!
మారుతి సుజుకి జిమ్నీ ప్రియులకు నిరాశ తప్పేటట్లు కనిపించడం లేదు. మహీంద్రా థార్ కు పోటీగా వస్తున్న మారుతి సుజుకి జిమ్నీ కోసం కొనుగోలుదారులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే జిమ్నీ భారత్ లో మే నెలలో విడుదల కావడం లేదని తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో అరంగేట్రం చేసింది. ఈ SUV మే నెలలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావించారు. అయితే తాజా నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి జిమ్నీ లాంచ్ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 24,500 పైగా బుకింగ్లు దేశంలో జిమ్నీ కోసం ఇప్పటి వరకు 24,500 కుపైగా బుకింగ్లు వచ్చాయి. జూన్ మొదటి వారంలో లాంచ్ అయిన వెంటనే డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 5-డోర్ల జిమ్నీ కంపెనీ.. మారుతి సుజుకి గుర్గావ్ ప్లాంట్లో తయారవుతోంది. ఆటోమొబైల్ సమాచార సంస్థ కార్టాక్ ప్రకారం, దేశీయ, విదేశీ డిమాండ్కు అనుగుణంగా ప్రతి నెలా 7,000 యూనిట్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో ఆల్ఫా ట్రిమ్ వేరియంట్ను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. జిమ్నీ రంగుల విషయానికి వస్తే కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లూయిష్ బ్లాక్ కలర్లను చాలా మంది ఇష్టపడుతున్నారు. రూ. 10 లక్షల నుంచి ప్రారంభం లీక్ అయిన డీలర్ ఇన్వాయిస్ ప్రకారం.. భారత్ లో మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ భారత్ లో నెక్సా షోరూమ్ల ద్వారా బుకింగ్లకు అందుబాటులో ఉంది. రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
‘ఎలివేట్’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా
జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా భారత్లో ఎస్యూవీ మార్కెట్ విభాగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మిడ్ రేంజ్ ఎస్యూవీ వాహనాలైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటార’ తరహాలో మిడ్ సైజ్ ఎస్యూవీ కార్ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల జూన్ 6న ‘ఎలివేట్’ పేరుతో ఎస్యూవీని విడుదల చేయనున్నట్లు హోండా అధికారికంగా ప్రకటించింది. హోండా ఎలివేట్ ఇంజన్ ఉందంటే ఎలివేట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లో మార్కెట్కు పరిచయం కానుంది. ఇందులో ట్రాన్స్మిషన్ ఆప్షన్తో పాటు మ్యాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. సీవీటీ గేర్ బాక్స్లు ఉన్నాయి. కార్ సౌకర్యంగా ఉండేలా అప్రైట్ స్టాన్స్, డ్రైవింగ్ సమయంలో కాంతివంతంగా ఉండేలా స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ప్రయాణ సమయంలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి వాహనంలోని ప్రయాణికుల్ని సంరక్షించేలా మెటల్ బార్స్ గ్రిల్స్తో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి. దేశీయ కంపెనీలతో పోటీపడలేక భారత్లో ఎస్యూవీలకు మంచి గిరాకీ నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎస్యూవీల వాటా 47 శాతం. కానీ 2020లో ఎస్యూవీ మార్కెట్ వ్యాల్యూ 28 శాతంగా ఉంది. కోవిడ్-19తో ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. హ్యుందయ్, దేశీయ వాహన తయారీ సంస్థలైన టాటా మోటార్స్, మారుతి సుజికిల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ వరుస విపత్కర పరిణామాలతో హోండా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ నోయిడాలో తయారీ ప్లాంటును రాజస్థాన్కు తరలించింది. దీంతో పాటు సివిక్ సెడాన్, సీఆర్- వీ ఎస్యూవీ తయారీని నిలిపింది. 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ మరుసటి ఏడాది అంటే 2021లో భారత్లో కొత్త ఎస్యూవీ కారును విడుదల చేయాలని హోండా గట్టి ప్రయత్నాలే చేసింది. 7 సీట్ల ఎస్యూవీ కోసం ‘ఎలివేట్’ పేరుతో ట్రేడ్ మార్క్ను రిజిస్టర్ చేసింది. కానీ ఆ కార్ ఎలా ఉండబోతుంది. ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై స్పష్టం చేయలేదు. తిరిగి మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎలివేట్ ఎస్యూవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది .కాగా, హోండా కార్స్ ఇండియా ప్రస్తుతం భారత్లో సిటీ , అమేజ్ అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. చదవండి👉 చాట్జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
భారత్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ కారు - ఇదే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఈ ఏడాది భారత్లో విడుదల చేయనున్న చిన్న ఎస్యూవీకి ఎక్స్టర్గా నామకరణం చేసింది. ఈ మేరకు టీజర్ను విడుదల చేసింది. జూలైలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆగస్ట్ నుంచి మార్కెట్లో అడుగు పెట్టనుందని సమాచారం. దక్షిణ కొరియాతోపాటు పలు దేశాల్లో అమ్ముడవుతున్న ఏఐ3 (క్యాస్పర్) మోడల్కు స్వల్ప మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఈ వాహనం భారత్ కోసం తయారు చేస్తున్నారు. భవిష్యత్లో పొరుగున ఉన్న దేశాలకూ ఎగుమతి చేస్తారు. గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్ఫామ్పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. 1.0 లీటర్ టీ–జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో తయారు కానుంది. -
భారత్లో విడుదలైన ఇటాలియన్ సూపర్ కారు - ధర అక్షరాలా..
Lamborghini Urus S: ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని 2022లో 'ఉరుస్ ఎస్' (Urus S) SUV గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన తరువాత ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి అంతకంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. ధర: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ ఎస్యువి ధర రూ. 4.18 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది ఉరుస్ పెర్ఫార్మంటే కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఇది ఉరుస్ లైనప్లో ఉన్న రెండవ మోడల్. డిజైన్ & ఫీచర్స్: లంబోర్ఘిని ఉరుస్ ఎస్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇది కొత్త బంపర్, కూలింగ్ వెంట్స్తో కూడిన కొత్త బానెట్తో కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందుతుంది. కానీ బయట కనిపించే కార్బన్-ఫైబర్ బానెట్, కార్బన్-ఫైబర్ రూఫ్ మాత్రం పెర్ఫార్మంటే మోడల్ని గుర్తుకు తెస్తుంది. ఫీచర్స్: కొత్త ఉరుస్ ఎస్ లోపలి భాగంలో ఉరుస్ ఎస్ ఉరుస్ పెర్ఫార్మంటే మాదిరిగానే అదే డిజైన్ కలిగి ఉన్నప్పటికీ కొంత విభిన్నమైన మెటీరియల్ చూడవచ్చు. పెర్ఫార్మంటే బ్లాక్ ఆల్కాంటారా ఇంటీరియర్ను స్టాండర్డ్గా కలిగి చోట ఉరుస్ ఎస్లోని ఇంటీరియర్ లెదర్ను స్టాండర్డ్గా పొందుతుంది. (ఇదీ చదవండి: ChatGPT: మీరు చేసే ఈ ఒక్క పని మిమ్మల్ని లక్షాధికారుల్ని చేస్తుంది.. డోంట్ మిస్!) ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ సూపర్ SUV 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్ పొందుతుంది. ఇది 666 హెచ్పి పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ సూపర్ కారు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ చేస్తుంది. ఉరుస్ ఎస్కి శక్తినివ్వడం ఉరుస్ పెర్ఫార్మంటే వలె అదే 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8, 666hp మరియు 850Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఉరుస్ పెర్ఫార్మంటే క్లెయిమ్ చేయబడిన 3.3 సెకన్లలో గంటకు 0-100కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు, ఉరుస్ ఎస్ దానిని 3.5 సెకన్లలో (క్లెయిమ్ చేయబడింది) నిర్వహిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు పంపబడుతుంది. (ఇదీ చదవండి: బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ) ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ జర్మన్ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్, ఆడి RSQ8, ఆస్టన్ మార్టిన్ DBX 707, పోర్స్చే కయెన్ టర్బో జిటి, మసెరటి లెవాంటే ట్రోఫియో వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్.. వట్టి చేతుల్తో కారును పక్కకు జరిపేశాడు..
మహా నగరాల్లో డ్రైవింగ్ చేయడమంటే కత్తి మీద సాములాంటిదే! రహదారులు, ఇరుకైన రోడ్లు ఇలా ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లే కనిపిస్తాయి. ఇక పార్కింగ్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో బైక్, కారు పార్కింగ్ చేసేందుకు స్థలమే దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ ఎలాగోలా పార్కింగ్ స్థలం దొరికినా.. కొంతమంది సరిగా తమ వాహనాలను పార్క్ చేయరు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తుతోంది. తాజాగా కారు పార్కింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారును ఓ వ్యక్తి తన రెండు చేతులతో అమాంతం ఎత్తి పక్కకు జరిపాడు. అసలేం జరిగిందంటే.. ఇరుకుగా ఉన్న రోడ్డు మీద వరుసగా కొన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో మారుతీ సుజుకీ వ్యాగనార్ కారును ఎవరో అడ్డదిడ్డంగా పార్క్ చేశారు. దీంతో అటుగా వెళుతున్న వాహనాలకు ఇబ్బంది ఎదురైంది. కారును దాటుకుంటూ వెళ్లడం కష్టంగా మారింది. దీనిని ఎస్యూవీ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగి తప్పుగా పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లాడు.. ఎవరి సాయం లేకుండానే దాదాపు 850 కిలోల బరువున్న కారును కేవలం తన రెండు చేతులతో ఎత్తి పక్కకు జరిపాడు. దీనిని మల్టీవీల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేయడంతో వైరలవుతోంది. View this post on Instagram A post shared by MULTI WHEELS (@multiwheelss) -
న్యూగ్రాండ్ విటారా ఎక్స్పీరియన్స్ డ్రైవ్: థ్రిల్ అయిన కస్టమర్లు
హైదరాబాద్: దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన ఎస్యూవీ ఆల్ న్యూ గ్రాండ్ విటారాతో ‘‘ఎక్స్పీరియన్స్ డ్రైవ్’’ను నిర్వహించింది. సుమారు 300 మందికి పైగా కస్టమర్లు ర్యాలీలో పాల్గొని ఆల్ న్యూ గ్రాండ్ విటారా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ డ్రైవ్లో వినియోగదారులు గ్రాండ్ విటారా అద్భుతమైన అనుభవం, సామర్థ్యాలతో పులకించి పోయారనీ, ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ నెక్సా డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సుజుకీ పేటెంట్ కలిగి ఆల్గ్రిప్ సెలెక్ట్ ట్రిమ్ ధర రూ.16.89 లక్షలు ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ డ్రైవ్ ద్వారా గ్రాండ్ విటారాకు సుమారు 100 బుకింగ్లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఈ వేరియంట్ లీటరుకు 19.38 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. -
ఎస్యూవీలతో పర్యావరణ ముప్పు
బెర్లిన్: పెద్ద కార్లతో పర్యావరణానికి సమస్య పెరుగుతోంది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం’ అని ప్యారిస్కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఎస్యూవీ సగటు సైజు తగ్గించడం, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలు పెంచడం, వినూత్న బ్యాటరీ సాంకేతికతల్లో పెట్టుబడులు ఇందుకు పరిష్కారమని స్పష్టం చేసింది. ‘2022లో ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) 100 కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వెదజల్లాయి. ఇది జర్మనీ వంటి పారిశ్రామిక దేశ వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువ. పెద్ద కార్ల వైపు మార్కెట్ మళ్లడం, తక్కువ ఇంధన సామర్థ్యం గల సంప్రదాయ వాహనాలతో చమురు డిమాండ్తోపాటు కర్బన ఉద్గారాలు అధికం అవుతాయి. ఎస్యూవీలు మినహా సంప్రదాయ కార్లు వినియోగించిన చమురు 2021, 2022లో దాదాపు సమానం. ఎస్యూవీల విషయంలో చమురు వాడకం రోజుకు 5 లక్షల బ్యారెల్స్ దూసుకెళ్లింది. 2022 అమ్మకాల్లో చిన్న కార్లు 10 లక్షల యూనిట్లు, ఎస్యూవీలు 10 లక్షల యూనిట్లు తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు రెండింతలై 1 కోటి యూనిట్లకు చేరాయి. గతేడాది ఎలక్ట్రిక్ నాన్–ఎస్యూవీలు 53 లక్షల యూనిట్లు అమ్ముడైతే, ఎలక్ట్రిక్ ఎస్యూవీలు 55 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. పెరుగుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్తో బ్యాటరీ సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడి ఉంటుంది. బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన క్లిష్ట ఖనిజాల కోసం డిమాండ్ను మరింత పెంచుతుంది’ అని ఏజెన్సీ వివరించింది. -
ఎస్యూవీలపై మారుతీ సుజుకీ గురి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంపై దృష్టిసారించింది. ఈ సెగ్మెంట్లో 2023–24లో 33 శాతం వాటా చేజిక్కించుకోవడం ద్వారా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బ్రెజ్జా, గ్రాండ్ వితారా ఎస్యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. మార్చి నుంచి జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్లు రోడ్డెక్కనున్నాయి. జిమ్నీ ఇప్పటికే 17,500 యూనిట్లు, ఫ్రాంక్స్ 8,500 యూనిట్ల బుకింగ్స్ను కైవసం చేసుకోవడం విశేషం. భారత ప్యాసింజర్ వాహన రంగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వాటా 42.5 శాతం ఉంది. 2022–23లో ఇది 45 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ విభాగంలో మారుతీ సుజుకీ వాటా 11.5 శాతం. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో సంస్థకు ఏకంగా 45 శాతం వాటా ఉంది. దీనిని 50 శాతానికి పెంచుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 2023 జనవరిలో ఎస్యూవీల విపణిలో మారుతీ సుజుకీ 15 శాతం వాటా దక్కించుకుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ విభాగంలో 2021–22లో టాటా మోటార్స్కు 18 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రాకు 15 శాతం వాటా ఉన్నట్టు సమాచారం. -
తగ్గని డిమాండ్! హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతి జిమ్నీ
2023 ఆటో ఎక్స్పోలో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచిన 5-డోర్స్ 'మారుతి సుజుకి జిమ్నీ' ప్రారంభం నుంచి భారత్లో మంచి బుకింగ్స్ పొందుతోంది. ఇప్పటికి ఈ ఆఫ్-రోడర్ 16,500 కంటే ఎక్కువ బుకింగ్స్ కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ప్రతి రోజూ 700 మందికంటే ఎక్కువ కస్టమర్లు ఈ ఎస్యువీ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా తన 5 డోర్స్ జిమ్ని ఆవిష్కరించిన రోజు నుంచి రూ. 11,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన రెండు రోజులకే 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన జిమ్ని బుకింగ్ ప్రైస్ రూ. 25,000 కు పెరిగింది. బుకింగ్ ప్రైస్ పెరిగినప్పటికీ బుక్ చేసుకునే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్లోని K15B పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్పి పవర్, 135 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్లో లభిస్తుంది. సుజుకి యొక్క లెజెండరీ ఆల్ గ్రిప్ ప్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కొత్త మారుతి జిమ్నీ కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. ఈ ఎస్యువీ లాడెర్ ఫ్రేమ్ ఛాసిస్ కలిగి ఉండటం వల్ల నాలుగు మూలల్లో కాయిల్ స్ప్రింగ్లతో 3-లింక్ రిజిడ్ యాక్సిల్ టైప్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఆఫ్ రోడర్ బాద్షా జిమ్నీ డిజైన్, ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేసే 9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ పొందుతుంది -
మారుతి జిమ్నీ హవా మామూలుగా లేదుగా, 2 రోజుల్లోనే
సాక్షి, ముంబై: ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి ఆవిష్కరించిన లైఫ్స్టైల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ జిమ్నీ బుకింగ్స్లో దూసుకుపోతోంది. ఆవిష్కరించిన రెండు రోజుల్లోనే, 3వేల యూనిట్ల బుకింగ్లను పొందింది. రాబోయే రోజుల్లో జిమ్నీకి బలమైన ఆర్డర్లు వస్తాయని కంపెనీ భావిస్తోంది. దీంతో జిమ్నీ వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికే మూడు నెలల వరకు పెరిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి జిమ్నీని 5 డోర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజీన్తో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికి దీనిని వినియోగదారులకు అందించనుంది. ఈ జిమ్నీ ధర రూ. 10-12.5 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. -
భారత్కు స్కోడా ఎన్యాక్ ఐవీ
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న చెక్ కంపెనీ స్కోడా.. భారత మార్కెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎన్యాక్ ఐవీ మోడల్ను ప్రవేశపెట్టనుంది. పూర్తిగా తయారైన కారును దిగుమతి చేసుకుంటామని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెటర్ సాక్ తెలిపారు. అమ్మకాలు పెరిగిన తర్వాత దేశీయంగా తయారీ చేపడతామన్నారు. ‘కంపెనీకి టాప్–3 మార్కెట్లలో భారత్ ఒకటి. యూరప్ వెలుపల అతిపెద్ద మార్కెట్ కూడాను. మరిన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాలతోపాటు ఈవీలను సైతం భారత్కు పరిచ యం చేస్తాం. గతేడాది దేశంలో 57,721 యూ నిట్లు విక్రయించాం. 2021తో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి సాధించాం. 2023లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’ అని వివరించారు. -
డ్రైవర్కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గాంధీనగర్: గుజరాత్ నవసారీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఎస్యూవీ ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెస్మా గ్రామంలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. బస్సులోని ప్రయాణికులు సూరత్లో ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్లో పాల్గొని తిరిగివస్తున్నారు. టొయోటా ఫార్చునర్ డ్రైవర్కు గుండెపోటు వచ్చి వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. దీంతో ఎస్యూవీలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులోని 28 మందికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన 11 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎస్యూవీలో ప్రయాణించిన వారిని అంకలేశ్వర్కు చెందినవారిగా గుర్తించారు. వస్లాద్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి. రూ.2లక్షల పరిహారం.. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రూ.2లక్షలు పరిహారంగా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు సాయంగా అందించనున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాాలని ఆకాంక్షించారు. అమిత్షా దిగ్భ్రాంతి.. ఈ దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. క్షతగాత్రులకుు స్థానిక అధికారులు చికిత్స అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. చదవండి: షిర్డీకని వెళ్లి అనంతలోకాలకు.. పాపం గాయాలతో చిన్నారి -
కేంద్రం కీలక నిర్ణయం, వీటి ధరలు పెరగనున్నాయా?
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్నీ రాష్ట్రాల్లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్పై ఒకే విధమైన పన్ను విధించాలని భావిస్తోంది. ఈ కొత్త మార్గ దర్శకాలు అమల్లోకి వస్తే ఎస్యూవీ వెహికల్స్ ధరలు పెరగడంతో పాటు ఆ వెహికల్స్పై అధిక పన్ను కట్టాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో 15 అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా.. కేవలం 8 అంశాలపై చర్చలు జరిపి అసంపూర్ణంగా ముగించారు. అయితే ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్ధిక మంత్రి, కౌన్సిల్ సభ్యులు ఎంయూవీ, ఎస్యూవీగా పరిగణలోకి తీసుకోవాలంటే కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలు ఉండాలని సూచించారు. ఎస్యూవీ అంటే? వాటిలో ఎస్యూవీకి ఈ ప్రమాణాలు ఉంటేనే ఆ వెహికల్ను ఎస్యూవీగా నిర్ధారించాల్సి ఉంటుందని వెల్లడించారు. కార్ ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీకి మించి ఉండాలి.వాహనం పొడవు 4000 మిమీల కన్నా ఎక్కువ ఉండాలి.170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి. ఈ ప్రమాణాలు ఉంటేనే అవి ఎస్యూవీ వెహికల్స్ అని స్పష్టం చేసింది. ఈ వాహనాలపై 28శాతం జీఎస్టీ, 22శాతం సెస్తో మొత్తంగా 50శాతం పన్ను విధించాలని ఆదేశించింది. కాగా, ఆర్ధిక శాఖ వర్గాల సమాచారం మేరకు.. ఇతర వాహనాలపై అసెస్మెంట్ 22శాతం చెల్లించాలనే విషయంపై సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్స్ అథారిటీ (ఫిట్మెంట్ కమిటీ) సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ అంటే ఏమిటి? జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్ధం జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్కు అధ్యక్షత వహించేది ఎవరు? కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్కు అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కేంద్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. -
లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: జర్మన్కు చెందిన లగ్జరీకారు మేకర్ బీఎండబ్ల్యూ మరో హైబ్రిడ్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం పేరుతో ఫ్లాగ్షిప్ ఎస్యూవీని తీసుకొచ్చింది. భారతదేశంలో దీని ధరను రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. (ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి) బవేరియన్ కార్మేకర్ ఎం బ్రాండ్ నుంచి వచ్చిన రెండో లగ్జరీ కారుగాను, ఎం బ్యాడ్జ్తో వచ్చిన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఎక్స్ఎం ప్లగ్-ఇన్హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించింది. అమెరికాలోని స్పార్టాన్స్బర్గ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఇంజీన్, ఫీచర్లు ఇందులో అమర్చిన ట్విన్-టర్బోఛార్జ్డ్ 4.4లీటర్ పెట్రోల్ ఇంజీన్ 653బీహెచచ్పీ పవర్ను, 800ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ ఎస్యూవీ కేవలం 4.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. అలాగే EV మోడ్లో గంటకు 140 కిమీ వేగంతో 88 కిమీ వరకు దూసుకెళుతుందని కంపెనీ పేర్కొంది. ఈ మాసివ్ ఎస్యూవీలోని కిడ్నీ షేప్డ్ ఫ్రంట్ గ్రిల్ , LED స్పిట్ హెడ్లైట్లు, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంకా 23-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-టిప్ ఎగ్జాస్ట్ ద్వారా డిజైన్ను ఆకర్షణీయంగా మార్చింది.రియర్లో వర్టికల్లీ స్టాకెడ్ ఎక్సాస్ట్ ఔట్లెట్స్,అడాప్టివ్ ఎం సస్పెన్షన్, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ డ్యాంపర్స్, కొత్త 48వీ సిస్టెమ్ ఉన్నాయి. ఇక ఇంటీరియర్గా హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), 15,000 వాట్ బోవర్స్ అండ్ విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్, ఐడ్రైవ్ 8 సాప్ట్వేర్, ఏడీఏఎస్ టెక్, యాంబియంట్ లైటింగ్, 4 జోన్ ఆటోమెటిక్ కంట్రోల్ లాంటి ఇతర ఫీచర్లున్నాయి. దీంతోపాటు బీఎండబ్ల్యూ ఎక్స్ 7 ఫేస్ లిఫ్ట్, బీఎండబ్ల్యూ ఎం 340ఐ ఎక్స్ డ్రైవ్ని కూడా లాంచ్ చేసింది. తద్వారా దేశంలో తన ఉత్పత్తి శ్రేణిని మరింత విస్తరిస్తోంది. BMW M340i xDrive ధర రూ. 69.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. -
ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్...స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ ప్రైస్!
సాక్షి,ముంబై: లగ్జరీ కార్ మేకర్ ఆడి తన ఎస్యూవీలో కొత్త స్పెషల్ ఎడిషన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఆడి క్యూ5 ఎస్యూవీలో స్పెషల్ ఎడిషన్ను కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో మిర్రర్ హౌసింగ్ ,బ్లాక్లో ఆడి లోగోలు, బ్లాక్లో రూఫ్ రెయిల్, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కొత్త బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ లాంటి అదనపు ఫీచర్లను ఇందులో జోడించింది. అలాగే ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ కిట్తో 2022 ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో రూ. 67.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందిస్తోంది. (ట్విటర్కు సవాల్: టాప్-...0 ఆల్టర్నేటివ్స్ ఇవిగో!) అంతేకాదురెండు స్పెషల్ కలర్స్తో (డిస్ట్రిక్ట్ గ్రీన్, ఐబిస్ వైట్) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ను ప్రత్యేక ధరతో,పరిమితి కాలానికి అందిస్తోంది. ఆడి క్యూ5 కస్టమర్ల కోసం ప్రత్యేక ఎడిషన్ను పరిచయం చేయడం సంతోషంగా ఉందనీ, ఇది పరిమిత యూనిట్లలో అందుబాటులో ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (SuperMeteor 650: రాయల్ఎన్ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ ఇంజీన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ (45 TFSI), 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అందిస్తోంది. ఇది 249 hpపవర్ను, 370Nm టార్క్ను అందిస్తోంది. కేవలం 6.3 సెకన్లలో 0-100కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 237కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ డంపింగ్ కంట్రోల్తో అడాప్టివ్ సస్పెన్షన్ను అందిస్తుంది. కంఫర్ట్; డైనమిక్, ఇండివిడ్యువల్, ఆటో, ఎఫిషియెన్సీ,ఆఫ్-రోడ్ వంటి ఆరు డ్రైవ్ మోడ్స్లో ఇది లభ్యం. సింగిల్ గ్రిల్లే, వర్టికల్, స్ట్రట్స్, పనోరమిక్ గ్లాస్ సన్రూఫ్, సెన్సార్-నియంత్రిత బూట్ లిడ్ ఆపరేషన్ , LED హెడ్లైట్ ఇందులో ఉన్నాయి. బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ ప్లస్తో ఎక్స్టీరియర్ మిర్రర్ హౌసింగ్, బ్లాక్లో ఆడి లోగోలు, బ్లాక్లో రూఫ్ రెయిల్స్, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ క్యాబిన్లో ఖరీదైన లెదర్, లెథెరెట్ కాంబినేషన్ అప్హోల్స్టరీ, 8 ఎయిర్బ్యాగ్లు, పార్కింగ్ ఎయిడ్ ప్లస్తో పార్క్ అసిస్ట్, 3-జోన్ ఎయిర్ కండిషనింగ్, యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్ 30 రంగులతో తీర్చి దిద్దింది. 755 వాట్స్ అవుట్పుట్తో 3D సౌండ్ ఎఫెక్టస్తో 19 స్పీకర్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే సపోర్ట్తో 25.65 సెం.మీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే లాంటి ఇంటీరియర్ ఫీచర్లున్నాయి. ధరలు: ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ రూ.67,05,000 (ఎక్స్ షోరూమ్) ఆడి క్యూ5 ప్రీమియం ప్లస్ ధర రూ. 60,50,000 (ఎక్స్-షోరూమ్) ఆడి క్యూ5 టెక్నాలజీ రూ. 66,21,000 (ఎక్స్-షోరూమ్) -
Viral Video: గన్తో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లారు
-
Live Video: గన్తో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో దొంగలు రెచ్చిపోయారు. తెల్లవారుజామునే జాతీయ రహదారిపై తుపాకులతో బెదిరించి రు.30లక్షలకుపైగా విలువైన ఎస్యూవీ కారును ఎత్తుకెళ్లారు ముగ్గురు దుండగులు. అంతా చూస్తుండగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 5.19 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర్ప్రదేశ్లోని మీరట్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల రాహుల్ అనే వ్యక్తి తన ఎస్యూవీ ఫార్చునర్ కారులో ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో ఝరేరా గ్రామంలో జాతీయ రహదారి-8పై రోడ్డు పక్కన కారును నిలిపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు తుపాకీ చూపించి బెదిరించాడు. మిగిలిన ఇద్దరు సైతం తుపాకులతో హల్చల్ చేశారు. కారును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 397, 34 ప్రకారం ఢిల్లీ కంటోన్మెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: అగ్నితో చెలగాటమా? దెబ్బకు ముఖం కాలిపోయిందిగా..! -
అమానుషం: నన్నే ఆపుతారా అంటూ... కారుతో తొక్కించి....
ఇటీవల కాలంలో పలువురు వ్యక్తులు చిన్నవాటికే విసుగుపోయి చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడోక వ్యక్తి కూడా చిన్న గొడవకే ఆగ్రహంతో చాలా దారుణంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని అలీపూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... ఒక వ్యక్తి ఎస్యూవీ కారుతో ఒక ఇరుకైన గల్లీ గుండా వెళ్తున్నాడు. అక్కడే తన ముందు ఉన్న ఒక బైకర్తో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే చుట్టుపక్కల వాళ్లు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఐతే కారు డ్రైవర్ మాత్రం కోపంతో యాక్సిలరేటర్ నొక్కి ఒక్కసారిగా ప్రజలపైకి దూసుకుని పోనిచ్చి... ఇక ఆగకుండా అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు. దీంతో ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే సదరు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో వైరల్ అవుతోంది. (చదవండి: ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు) -
స్పోర్టీ డిజైన్తో స్కోడా ఎలక్ట్రిక్ ఎస్యూవీ: అదిరిపోయే ఫీచర్స్
సాక్షి,ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఎన్యాక్ ఐవీ వీఆర్ఎస్' (Enyaq iV vRS) పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల లాంచ్ చేసింది. స్పోర్టీ-డిజైన్తో వస్తున్న ఈ కారు కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందు కుంటుందని కంపెనీ తెలిపింది. గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. అంతేకాదు ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని స్కోడా ఆటో ప్రకటించింది. ఈ కారు ధర విషయానికి వస్తే మన దేశంలో సుమారు రూ. 48.6 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎన్యాక్ ఐవీ వీఆర్ఎస్ స్పెసిఫికేషన్స్ ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ట్రాక్షన్ అనే ఐదు డ్రైవింగ్ మోడ్లతో ఎలక్ట్రిక్ ఎస్యూవీని తీసుకొచ్చింది. తమ డ్రైవింగ్కి అనుగుణంగా వినియోగ దారులు ఈ వెహికల్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులోని 82 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 296 బీహెచ్పీ పవర్ని అందిస్తుంది. కేవలం 36 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే గ్లాసీ-బ్లాక్ ఫ్రంట్ ఏప్రాన్లు, డోర్ మిర్రర్లు, రియర్ డిఫ్యూజర్ తో పాటు మరిన్ని స్పోర్టీ ఫీచర్లను జోడించింది. ఇంటీరియర్గా ఫాక్స్ లెదర్ ఫినిషింగ్, డ్యాష్ బోర్డ్ ను కార్బన్ ఫైబర్తోనూ రూపొందించింది. 13 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 'క్రిస్టల్ ఫేస్' ఫ్రంట్ గ్రిల్, ముందువైపు ఎల్ఈడీ లైట్లు, క్రోమ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్లోయ్ వీల్స్, రూఫ్ రైల్స్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
భారత్కు నిస్సాన్ గ్లోబల్ మోడల్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ నిస్సాన్.. అంతర్జాతీయంగా విక్రయిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ను (ఎస్యూవీ) భారత మార్కెట్లో పరిచయం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో మాగ్నైట్, కిక్స్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్–ట్రయల్, జూక్, కష్కాయ్ మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఎక్స్–ట్రయల్, కష్కాయ్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత రోడ్లపై ఈ రెండు మోడళ్ల పరీక్ష మొదలైందని వెల్లడించింది. భారతీయ రోడ్లు, విభిన్న భూభాగాలకు ఈ వాహనాలు అనుకూలమా కాదా అన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని ఈ పరీక్షలు అంచనా వేస్తాయని కంపెనీ తెలిపింది. పరీక్షలు పూర్తి అయ్యాక సానుకూల ఫలితాలు వస్తే తొలుత ఎక్స్–ట్రయల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత కష్కాయ్ కూడా రోడ్డెక్కనుంది. ఉద్గారాలను బట్టి పన్ను..: వాహనాల పొడవు, ఇంజన్ పరిమాణం కంటే ఉద్గారాల ఆధారంగా ప్రయాణికుల వాహనాలపై పన్ను విధించడాన్ని భారతదేశం పరిగణించాలని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ రాకేష్ శ్రీవాస్తవ అన్నారు. ‘ఆటోమొబైల్స్ ద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి హైబ్రిడ్ల వంటి బహుళ సాంకేతికతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్గారాల స్థాయిని బట్టి వేర్వేరు పన్ను స్లాబ్లు ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే నాలుగు మీటర్ల లోపు, నాలుగు మీటర్ల కంటే పొడవు, ఇంధనం పరంగా భిన్నమైన పన్ను నిర్మాణాన్ని కలిగి ఉంది. జీఎస్టీ విధానం ప్రకారం కార్లపై 28 శాతం పన్నుతోపాటు సెస్ విధిస్తున్నారు. 4 మీటర్ల కంటే పొడవు ఉండే కార్లు, ఎస్యూవీలకు 50 శాతం, హైబ్రిడ్ వాహనాలకు 43 శాతం, ఎలక్ట్రిక్ వెహికిల్స్కు 5 శాతం జీఎస్టీ ఉంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
భారత్లో బీవైడీ అటో–3
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత్లో తాజాగా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ అటో–3 ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్తో 521 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 7 ఎయిర్బ్యాగ్స్ పొందుపరిచారు. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్–కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, రెండు వైపులా కొలీషన్ వార్నింగ్, ఏబీఎస్, ఈఎస్సీ, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను జోడించారు. ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బీవైడీ భారత్లో మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ వెహికిల్ ఈ6ను విక్రయిస్తోంది. 2030 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహన విపణి 55 లక్షల యూనిట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని బీవైడీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. ఆ సమయానికి 30 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. చెన్నై ప్లాంటులో ఎస్యూవీని అసెంబుల్ చేస్తామన్నారు. మార్కెట్ డిమాండ్నుబట్టి తయారీ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. బీవైడీ తయారీ 800లకుపైగా ఎలక్ట్రిక్ బస్సులు భారత్లో 11 నగరాల్లో పరుగెడుతున్నాయని వివరించారు. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్తో షాకైన కంపెనీ! -
బిగ్ డే..మంచి పేరు కావాలి చెప్పండబ్బా: ఆనంద్ మహీంద్రా
సాక్షి, ముంబై: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎం అండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక సంతోషకరమైన వార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల మహీంద్రా లాంచ్ చేసిన స్కార్పియో-ఎన్ తన చేతికి వచ్చిన ముచ్చటను ట్విటర్లో షేర్ చేశారు. నిజంగా ఇది నాకు బిగ్ డే.. స్కార్పియో ఎన్ ను రిసీవ్ చేసుకున్నా. అయితే దీనికి ఒక మంచి పేరు కావాలి. ఎవరైనా పేరు సూచించే వారికి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. స్కార్పియో-ఎన్ ఎస్యూవీని భారత మార్కెట్లో మహీంద్రా ఇటీవల లాంచ్ చేసింది. ఈ పండుగ సీజన్లో స్కార్పియో-ఎన్ డెలివరీలను ప్రారంభించింది. ఈ క్రమంలో మహీంద్ర ప్రతినిధి ఆనంద్ మహీంద్రకు స్కార్పియో-ఎన్ తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర, తన స్కార్పియోకు పేరు సూచించమని అభిమానులను అడగడం విశేషంగా నిలిచింది. స్కార్పియో-ఎన్ ఎస్యూవీ క్యాబిన్ ప్రీమియం లుక్తో, 3D సరౌండ్ 12-స్పీకర్ సోనీ సిస్టమ్, విశాలమైన సన్రూఫ్, రిచ్ కాఫీ బ్లాక్ లెథెరెట్ సీట్లు, సిక్స్-వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు, 70+ కనెక్టెడ్ కార్ ఫీచర్లతో లాంచ్ చేసింది. స్కార్పియో-ఎన్ ఎస్యూవీ ధర Z2 పెట్రోల్ MT వేరియంట్ రూ. 11.99 లక్షల నుండి ప్రారంభం. అలాగే Z8 L డీజిల్ MT వేరియంట్ ధర రూ. 19.49 లక్షల వరకు ఉంటుంది. 5 వేరియంట్లు, ఏడు రంగుల్లో లభ్యం. ఈ ఏడాది జూలై 31న బుకింగ్లు ప్రారంభమైన తొలి నిమిషంలోనే 25 వేలకు పైగా వాహనాలు బుక్ అయ్యాయి. అంతేకాదు ఈ మోడల్ దేశంలో అత్యంత వేగంగా లక్ష బుకింగ్స్ నమోదు చేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Big day for me; received my ScorpioN…. Need a good name for it…Recommendations welcome! pic.twitter.com/YI730Eo9uh — anand mahindra (@anandmahindra) October 7, 2022 -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ బంపరాఫర్
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొనుగోలు దారులకు టాటా టియాగో, టైగోర్,టైగోర్ సీఎన్జీ, హారియర్, సఫారీ కార్లపై పలు ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో రెండో స్థానంలో టాటా హారియర్పై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ ,రూ.5000 కార్పొరేట్ బెనిఫిట్ను అందిస్తుంది. దీంతో పాటు టైగోర్ సీఎన్జీపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.15,000 , రూ.10 వేలు డిస్కౌంట్ అందిస్తున్నట్లు టాటా ప్రతినిధులు తెలిపారు. అన్ని టాటా సఫారీ వేరియంట్లపై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. టైగోర్పై ఎక్స్ఛేంజ్ బోనస్గా రూ.10 వేలు, క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 బెనిఫిట్ లభిస్తుంది. టాటా టియాగోపై ఎక్స్చేంజ్ బోనస్గా రూ.10వేలు, క్యాష్ డిస్కౌంట్గా రూ.10 వేలు బెనిఫిట్ పొందవచ్చు. హ్యాచ్బ్యాక్ టియాగోపై కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ.3000 అందిస్తున్నది. -
మహీంద్రా, బీఐఐ రూ.4,000 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభా గం కోసం మహీంద్రా గ్రూప్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్(బీఐఐ) రూ.4,000 కోట్లు పెట్టు బడి చేయాలని నిర్ణయించాయి. మహీంద్రా ఈవీ విభా గం అయిన ఈవీ కో కంపెనీలో బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇద్దరు భాగస్వాముల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్ర ణాళికాబద్ధమైన ఉత్పత్తులకు 2023–24 నుంచి 2026–27 మధ్య నూతన ఎలక్ట్రిక్ వాహన కంపెనీ మొత్తం రూ.8,000 కోట్ల మూలధనాన్ని కలిగి ఉంటుంది. వ్యాపారాన్ని పటిష్టం చేయడం కోసం ఈవీ కో కంపెనీలోకి మరింత మంది పెట్టుబడిదార్లను తీసుకు వస్తామని మహీంద్రా గ్రూప్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాటా 25 శాతం.. ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన ఎక్స్యూవీ 400 మోడల్ను మహీంద్రా ఇటీవలే ఆవిష్కరించింది. అయిదు రకాల ఈ–ఎస్యూవీలను భారత్తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం పరిచయం చేస్తామని యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్స్యూవీతోపాటు బీఈ పేరుతో పూర్తి ఎలక్ట్రిక్ బ్రాండ్ శ్రేణి లో ఈ నూతన మోడళ్లను పరిచయం చేయనుంది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు లేదు. అయితే ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహ న విభాగంలో సంస్థకు ఏకంగా 70% వాటా ఉంది. 2027 నాటికి సంస్థ విక్రయించే అన్ని ఎస్యూవీల్లో ఎలక్ట్రిక్ వాటా 25% ఉంటుందని భావిస్తోంది. -
ఎస్యూవీల్లోకి హోండా రీ–ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్యూవీలైన సీఆర్–వి, బీఆర్–వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్–వి, జాజ్ ఎస్యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది. నిష్క్రమించే ఆలోచనే లేదు.. హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది. -
ఫోక్స్వ్యాగన్ టైగన్ యానివర్సరీ ఎడిషన్: అదరిపోయే ఫీచర్స్, కలర్స్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీ తొలి వార్షికోత్సవ ఎడిషన్ లాంచ్ చేసింది. టైగన్ ఎస్యూవీని లాంచ్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా కొన్ని స్పెషల్ ఫీచర్లతో ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్గా సరికొత్తగా లాంచ్ చేసింది. రైజింగ్ బ్లూ కలర్, ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్లో ఇది అందుబాటులో ఉంది. స్టాండర్డ్ టైగన్తో పోలిస్తే ఇందులో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ , ఇతర ఫీచర్లతో తీసుకొచ్చింది. డైనమిక్ లైన్లో తీసుకొచ్చిన ఫోక్స్వ్యాగన్ టైగన్ స్పెషల్ ఎడిషన్ రెండు ఇంజీన్లతోరానుంది. 1.0 TSI MT & ATలో అందుబాటులో ఉన్న టాప్లైన్ వేరియంట్. "1" వార్షికోత్సవ బ్యాడ్జింగ్తో స్పోర్టియర్ లుక్స్తో అదరగొడుతోంది. ఇందులో హై లగ్జరీ ఫాగ్ ల్యాంప్స్, బాడీ-కలర్ డోర్ గార్నిష్, బ్లాక్ సి-పిల్లర్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్ ఫాయిల్, డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్, బ్లాక్ ORVM క్యాప్స్, విండో వైజర్లతో సహా ప్రత్యేకంగా డిజైన్చేసిన 11 అంశాలు ఉన్నాయి. సెఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే టైగన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 వరకు ఎయిర్ బ్యాగ్లు, మల్టీ-కొలిజన్ బ్రేక్లు, రివర్స్ కెమెరా, ISOFIX, టైర్ ప్రెజర్ డిఫ్లేషన్ వార్నింగ్ సిస్టమ్ లాంటి పూర్తి స్థాయి 40+ భద్రతా ఫీచర్లను జోడించింది. అదనంగా 3 పాయింట్ సీట్ బెల్ట్లతో పాటు వెనుకవైపు 3 ఎడ్జస్టబుల్ హెడ్రెస్ట్ కూడా ఉంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్తో కూడిన 1.0L TSI ఇంజన్, 5000 నుండి 115PS (85 kW) గరిష్ట శక్తిని, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక. 5500 ఆప్పిఎం వద్ద గరిష్ట టార్క్ 178 టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5L TSI EVO ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ , 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ ఆప్షన్తో అమర్చబడి ఉంటుంది, ఇది 150PS (110 kW) గరిష్ట శక్తిని 5000, 6000 rpm వద్ద, 5000 టార్క్ అందిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన ధరలు రూ. 15.40 లక్షలు- రూ. 16.90 లక్షల వరకు ఉంటాయి. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్లో టాప్ 3 ఫైనలిస్ట్గి నిలిచి ప్రపంచస్థాయిలో టైగన్ ఖ్యాతిగడించిందని ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ఈ సందర్బంగా టైగన్ కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. టైగన్ ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 40 వేల కంటే ఎక్కువ ఆర్డర్లను సాధించగా , 22వేల టైగన్లను డెలివరీ చేసింది. -
మారుతీ సుజుకీ కొత్త ప్లాన్స్: మారుతీ మిడ్-ఎస్యూవీ
న్యూఢిల్లీ: దేశంలో కంపెనీ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగాన్ని కీలకంగా పరిగణిస్తున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో ప్రస్తుతం సంస్థ వాటా 45 శాతంగా ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది మారుతీ సుజుకీ లక్ష్యం. ‘ఎస్యూవీయేతర విభాగంలో కంపెనీ వాటా 65 శాతం పైచిలుకు. ఎస్యూవీల్లో అంత పెద్దగా లేదు. దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం ఇది. ఇందులో మారుతీ సుజుకీ తప్పనిసరిగా సుస్థిర స్థానం సంపాదించాలి. ప్రారంభ స్థాయి ఎస్యూవీల విపణి వార్షిక పరిమాణం 6.6 లక్షల యూనిట్లు. ఇందులో సంస్థకు 20 శాతం వాటా ఉంది. 5.5 లక్షల యూనిట్ల వార్షిక పరిమాణం ఉన్న మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో కంపెనీకి ఒక్క మోడల్ కూడా లేదు. ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరులో మిడ్ సైజ్ ఎస్యూవీ ఆవిష్కరించనున్నాం. 4 మీటర్ల లోపు పొడవు ఉండే ఎస్యూవీలపైనా దృష్టిసారిస్తాం’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
2023 స్కోడా కొడియాక్ లాంచ్: ఆ లగ్జరీ కార్లకు షాక్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ఫ్టాగ్షిప్ కొడియాక్ 2023 వెర్షన్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,49,000 (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ-లెవల్ లగ్జరీ 4×4 SUV స్టైల్, స్పోర్ట్లైన్ , ఎల్ అండ్ కే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే 2023 స్కోడా కొడియాక్ ధర రూ. టాప్-ఎండ్ ఎల్ అండ్ కే వేరియంట్ ధర 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి ఆఫర్ ధరలు మాత్రమే. 2023, మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం బుకింగ్లు అందుబాటులో ఉన్నాయి. 50వేలు చెల్లించి అన్ని స్కోడా డీలర్షిప్లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య డెలివరీలు అవుతాయి. గత జనవరిలో లాంచ్ చేసిన స్కోడా మోడల్ 2022 ఎస్యూవీ 48 గంటల్లో మొత్తం 1,200 యూనిట్లు రికార్డ్ స్థాయి సేల్స్ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మోడల్తో పోలిస్తే దాదాపు లక్షన్నన్నర రూపాయల రేటు పెంచింది. 2023 స్కోడా కొడియాక్ ఇంజన్, ఫీచర్లు వోక్స్వ్యాగన్ గ్రూప్ 2-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ను అమర్చింది. ఇది 187.7 HP , 320 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రామాణిక 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించింది. ఇది 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుంది. 6 డ్రైవింగ్ మోడ్లలో ఇది లభ్యం. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) CANTON 12-స్పీకర్ 625W సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి కొన్ని కూల్ సెగ్మెంట్-ఎక్స్క్లూజివ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లైండ్లు, బ్లాంకెట్స్,అంబరిల్లా, హోల్డర్, పనోరమిక్ సన్రూఫ్ వంటి అనేక సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 2023 స్కోడా కొడియాక్ జీప్ కంపాస్, మెరిడియన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్క్రాస్, వోక్స్వ్యాగన్ టిగువాన్,2023 హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
హఠాత్తుగా పెరిగిన నది ఉధృతి... ఏకంగా 14 కార్లు గల్లంతు
మధ్యప్రదేశ్: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో సుక్ది నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఐతే కొన్ని కుటుంబాలు ఆదివారం కదా అని సరదాగా గడుపుదామని సుక్ది నదికి సమీపంలోని కట్కూట్ అడవికి వచ్చారు. అకస్మాత్తుగా నది ఉప్పెనలా ప్రవహించడంతో దాదాపు 50 మంది ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆ నది ప్రవాహధాటికి సుమారు 14 కార్లు కొట్టకుపోయాయి. దీంతో మహిళలు పిల్లలతో సహ 50 మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ తలదాచుకున్నారు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు వ్యక్తులను రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు ఈ నది అకస్మాత్తుగా ఉధృతంగా ప్రవహించడం మొదలైందని పోలీస్ అధికారి జితేందర సింగ్ పవార్ పేర్కొన్నారు. ఎస్యూవీ కార్లతో సహా సుమారు 14 కార్లు ఈ నది ఉదృతికి కొట్టుకుపోయాయిని చెప్పారు. అంతేకాదు వాటిలో ఒక ఎస్యూవీ కారుతో సహ దాదాపు 10 కార్లను ట్రాక్టర్ సాయంతో బయటకు తీశామని చెప్పారు. అంతేకాదు మూడు కార్లు సుదూర ప్రాంతాలకు కొట్టుకుపోయాయని, మరో కారు వంతెన వద్ద ఉన్న హోలులో ఇరుక్కుపోయిందని చెప్పారు. ఐతే ఆ కార్ల లోపలికి నీళ్లు చేరిపోవడంతో పనిచేయకుండా మోరాయించాయిని తెలిపారు. దీంతో తాము వారిని వేరే వాహనాల్లో ఇళ్లకు పంపించినట్లు వెళ్లడించారు. అంతేకాదు సదరు పర్యాటకులు ఇలాంటి ప్రదేశాల్లో ఈ సుక్ది నది ఉప్పెనలా ముంచేస్తుందని హెచ్చరిక బోర్డులను కూడా పెట్టాల్సిందిగా స్థానిక పోలీసులను కోరినట్లు అదికారులు తెలిపారు. (చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో?) -
మారుతి ఆల్ న్యూ గ్రాండ్ విటారా: సరికొత్త టెక్నాలజీతో
సాక్షి, ముంబై: మారుతితి సుజుకి గ్రాండ్ విటారాను ఎట్టకేలకు ఈ రోజు (జూలై 20) ఇండియాలో పరిచయం చేసింది. అర్బన్ క్రూయిజర్, గ్లాంజా తరువాత టయోటా సుజుకి భాగస్వామ్యంతో తయారైన కొత్త మోడల్ ఎస్యూవీ గ్రాండ్ విటారా. 28 కిలోమీటర్ల మైలేజీ ఎస్యూవీగా కంపెనీ వెల్లడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు మారుతి డీలర్షిప్ వద్ద లేదా ఆన్లైన్లో రూ. 11,000తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. 2020 మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్యూవీ ధర రూ.9.50 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఉండనుంది. డిజైన్, ఫీచర్లు, ఇంజన్ గ్రాండ్ విటారా ఎస్యూవీ కూడా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్యూవీ మాదిరిగానే ఉన్నా. SUV క్రోమ్ స్ట్రిప్, ట్రైఎల్ఈడీ టెయిల్ లైట్ల పొడవైన బంపర్, స్పోర్టి ఎయిర్ డ్యామ్, పూర్తి-LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ స్పెషల్. ప్రత్యేకమైన 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుపర్చింది. 27.97km మైలేజీని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల విషయానికి వస్తే,వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హెడ్స్-అప్-డిస్ప్లే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా , అనేక ఇతర స్మార్ట్ కార్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగూ ఆల్గ్రిప్ AWD సాంకేతికతను కూడా జోడించింది. AllGrip సిస్టమ్లో ఆటో, స్పోర్ట్, స్నో, లాక్ అనే నాలుగు మోడ్లు అందుబాటులో ఉంటుంది. ఏడబ్యూడీ టెక్నాలజీని అందించిన మారుతి సుజుకీ ఏకైక కారు గ్రాండ్ విటారా. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 6-ఎయిర్బ్యాగ్లు, ESP, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణీకులకు 3 పాయింట్ సీట్బెల్ట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్లు, హిల్ డిసెంట్ కంట్రోల్ లాంటి సెక్యూరిటీ ఫీచర్లున్నాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం. ఇందులో ఒకటి 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్. ఇది 92hp , 122Nm టార్క్ను, 79hp, 141Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్తో అందుబాటులో ఉంటుంది. కొత్త బ్రెజ్జా, XL6 , ఎర్టిగాలో ఇదే ఇంజన్ను అమర్చింది.ఇది 103hp , 137Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
స్టైలిష్ లుక్తో..హ్యుందాయ్ నుంచి ఎస్యూవీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త టుసో ఎస్యూవీని ఆవిష్కరించింది. వచ్చే నెల ప్రారంభంలో ఈ కారు మార్కెట్లోకి రానుంది. పెట్రోల్ వేరియంట్ 6 స్పీడ్, డీజిల్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, 2 లీటర్ పవర్ట్రైయిన్స్, అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్తో రూపుదిద్దుకుంది. కెమెరా, రాడార్ సెన్సార్స్తో ఆటోమేటిక్ సెన్సింగ్ టెక్నాలజీని పొందుపరిచారు. ఈ విభాగంలో తొలిసారిగా 29 రకాల ఫీచర్లను జోడించారు. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది కస్టమర్లు టుసోను సొంతం చేసుకున్నారు. 2021లో అంతర్జాతీయంగా 4.85 లక్షల టుసో కార్లు అమ్ముడయ్యాయి. భారత్లో ఏటా సుమారు 40,000 యూనిట్లు రోడ్డెక్కుతున్నాయి. 2025 నాటికి ఇది 55,000 యూనిట్లకు చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. -
సరికొత్త ఫీచర్లతో అదరగొడుతోన్న..నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ షురూ!
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్ను పరిచయం చేసింది. జులై 8 ( నిన్న శుక్రవారం) నుంచి ఈ కార్ బుకింగ్స్ను ప్రారంభించినట్లు తెలిపింది. జులై 18న ఈ కారును విడుదల చేయనుంది. మాగ్నైట్ ఎక్స్వీ వేరియంట్ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైఫై కనెక్టివిటీ, 7 అంగుళాల ఫుల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, డైమంట్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. మూడు వేరియంట్లలో నిస్సాన్ సంస్థ మ్యాగ్నైట్ రెడ్ పేరుతో మూడు వేరియంట్లలో మ్యాగ్నైట్ టర్బో ఎక్స్వీ ఎంటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ టర్బో ఎక్స్వీ సీవీటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ ఎక్స్వీ ఎంటీ రెడ్ ఎడిషన్ కార్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్ల వినియోగదారులకు మెమోరబుల్ జర్నీని అందించేందుకు బోల్డ్ డిజైన్, పవర్ ప్యాక్డ్ పర్మామెన్స్, కంఫర్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లను జత చేసినట్లు నిస్సాన్ ప్రతినిధులు వెల్లడించారు. నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఫీచర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్లలో కారు గ్రిల్స్(కారు హెడ్లైట్స్ మధ్యలో ఉండే డిజైన్),ఫ్రంట్ బంపర్ క్లాడింగ్,వీల్ ఆర్చ్, బాడీ సైడ్ క్లాడింగ్లు ఉన్నాయి. వీటితో పాటు రెడ్ ఎడిషన్లో బోల్డ్ బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్,టైల్ డోర్ గ్రానిషన్ పొందుపరిచింది. యాంబినెట్ మూడ్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్,7.0 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రామెంట్ క్లస్టర్, వైఫై కనెక్టివీటి, స్టార్ట్, స్టాప్ కోసం పుష్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, బ్రేక్ అసిస్ట్ వంటి సదుపాయం ఉంది. కార్లపై డిస్కౌంట్ ఇటీవల నిన్సాన్ ప్రతినిధులు నిస్సాన్ మ్యాగ్నైట్ సీవీటీ వేరియంట్ ఎక్స్, ఎక్స్వీలపై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ కార్ల ప్రైస్ రేంజ్ రూ.5.88లక్షల నుంచి రూ.10.56లక్షల మధ్య ఉంది. -
ఎంఅండ్ఎం ఎలక్ట్రిక్ ఎస్యూవీల్లో బీఐఐ పెట్టుబడులు
ముంబై: బ్రిటన్కు చెందిన ఆర్థిక సంస్థ బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (బీఐఐ) తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) గ్రూప్లోని ఎలక్ట్రిక్ ఎస్యూవీల తయారీ వ్యాపార విభాగంలో రూ. 1,925 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయనుంది. ఎంఅండ్ఎం కూడా అదే స్థాయిలో రూ. 1,925 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనుంది. ఎస్యూవీల కోసం ఈవీ కంపెనీ పేరిట ఎంఅండ్ఎం అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. 2024–2027 మధ్య కాలంలో ఈ సంస్థకు దాదాపు రూ. 8,000 కోట్ల వరకూ పెట్టుబడులు సమకూర్చే ప్రతిపాదనలు ఉన్నాయి. సెప్టెంబర్లో తమ ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఎక్స్యూవీ 400 వాహనాలను సెప్టెంబర్లో ఆవిష్కరించే అవకాశం ఉందని, 2023 జనవరి–మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కావచ్చని కంపెనీ ఈడీ (ఆటో, ఫార్మ్ సెక్టార్) రాజేశ్ జేజూరికర్ వివరించారు. -
మార్కెట్లోకి అదిరిపోయే టయోటా ఎస్యూవీ!
ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ శుక్రవారం కొత్త ఎస్యూవీ ‘అర్బన్ క్రూయిజర్ హైరైడర్’’ను ఆవిష్కరించింది. టయోటా డీలర్షిప్లలో లేదా అధికారిక వెబ్సెట్లలో రూ. 25,000 చెల్లించి ముందుస్తు బుకింగ్ చేసుకోవచ్చు. వచ్చేనెలలో డెలివరీలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో 1.5–లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ 5–స్పీడ్ మాన్యువల్ లేదా 6–స్పీడ్ ఆప్షనల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఆరు ఎయిర్బ్యాగ్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్–హోల్డ్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రియర్ ప్యాసింజర్ల కోసం సీట్బెల్ట్స్ సౌకర్యం ఉంది. దేశీయ మార్కెట్లోని టాటా సఫారీ, హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ తదితర ఎస్యూవీలకు ప్రత్యర్థిగా ఉంటుంది. -
పండుగల సీజన్లో ఎస్యూవీల సందడే సందడి!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్ బహుళ ప్రయోజాలతో కూడిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీలు) పెద్ద ఎత్తున ఆవిష్కరణకు సాక్ష్యంగా నిలవనుంది. సుమారు డజను ఎస్యూవీ మోడళ్లను కంపెనీలు విడుదల చేయనున్నాయి. వీటి ధరలు రూ.5.5 లక్షల నుంచి రూ.65 లక్షల మధ్య ఉండనున్నాయి. మిగతా సంవత్సరాలకు ఈ ఏడాది భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే కంపెనీలు సాధారణంగా ఏడాదిలో వివిధ సందర్భాల్లో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తుంటాయి. కానీ, ఈ విడత రానున్న పండుగల సీజన్ను ఆవిష్కరణలకు లక్ష్యంగా పెట్టుకోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2020–21లో ఎనిమిది కొత్త కార్లు విడుదల కాగా.. వీటి ఆవిష్కరణలు ఏడాది వ్యాప్తంగా కొనసాగాయి. 2021–22లో ఏడు కొత్త మోడళ్లు విడుదలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లోనూ కొత్త కార్ల ఆవిష్కరణలు ఐదు లేదా ఆరు స్థాయిలో ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మాత్రం పదికి పైగా కొత్త ఎస్యూవీలు వినియోగదారులను పలకరించనున్నాయి. దేవీ నవరాత్రులతో పండుగల సందడి తారా స్థాయికి చేరి, దీపావళితో ముగుస్తుంటుంది. ఆటో కంపెనీలకు ఈ పీరియడ్ చాలా కీలకమైనది. ఏడాదిలో నమోదయ్యే విక్రయాల్లో 20% ఈ 3 నెలల కాలంలోనే నమోదవుతుంటాయి. కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురావడం అసాధారమేమీ కాదు. కానీ, ఈ ఏడాది పండుగల సీజన్ సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ఎస్యూవీలు (ఒకే తరహా బాడీతో కూడినవి) ఆవిష్కరణ చేస్తుండడమే ప్రత్యేకం. ముందుగా మారుతీ.. మొదటిగా మారుతీ సుజుకీ నుంచి కొత్త జెనరేషన్ బ్రెజ్జా ఆవిష్కరణ ఉండనుంది.గత సోమవారం మారుతి సుజుకీ ఇందుకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడంతోపాటు, బుకింగ్లు తీసుకోవడాన్ని ప్రారంభించింది. జూన్ 30న విడుదల కానుంది. మిడ్సైజు ఎస్యూవీ అయిన టయోటా హైరైడర్ జూలై 1న మార్కెట్లోకి రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్కు పోటీనివ్వనుంది. టయోటా అర్బన్ క్రూయిజర్ (బ్రెజాకు రీబ్రాండింగ్)ను కూడా ఆవిష్కరించనుంది. -
లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో, ధరెంతో తెలుసా?
కన్నడ స్టార్ దర్శన్ కొత్త కారు కొనుగోలు చేశాడు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్యూవీని తన గ్యారేజీలోకి తెచ్చుకున్నాడు. దీని ధర దాదాపు రెండున్నర కోట్ల పైమాటే ఉంటుందని తెలుస్తోంది. కాగా సన్నీడియోల్, అర్జున్ కపూర్, ప్రకాశ్ రాజ్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ యజమానులే! ఇకపోతే దర్శన్కు కార్ల మీద మోజు ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడికి లంబోర్గిని ఉరుస్, హ్యురాకాన్ సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో మరో ఖరీదైన కారు చేరడంతో ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు నెట్టింట శుభాకాంక్షలు చెప్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ పెంపుడు కుక్కకి ఫ్లైట్ టికెట్స్ డిమాండ్ చేసిన రష్మిక? నటి రియాక్షన్! -
సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆపీ... : వీడియో వైరల్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రోడ్షోలో ప్రజలను పలకరిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఎస్యూవీ కారులో నుంచుని ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇంతలో ఒక నల్లని టీషర్టు ధరించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాన్యాయ్ని ఆపాల్సిందిగా చేతులు ఊపాడు. దీంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆ వ్యక్తితో మాట్లాడేందుకు తన కారుని ఆపారు. సదరు వ్యక్తి మొదటగా ముఖ్యమంత్రికి కరచలనం చేసి అగ్నిపథ్ గురించి మాట్లాడాడు. ఈ అగ్నిపథ్ పథకాన్ని అమలు చేసే ముందు నాయకులంతా సమావేశమై చర్చించి ఉంటే బావుండేది కదా అని అడిగాడు ఆ వ్యక్తి. దీంతో భగవంత్ మాన్ సదరు వ్యక్తి చేతిని పట్టుకుని అగ్నిపథ్ గురించి చర్చించడానికి ఎంపీలంతా సమావేశమైతే...తానే స్వయంగా వెళ్లి మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. మరోవైపు సాయుధ దళాల రిక్రూట్మెంట్లో సమూల మార్పులను ప్రకటించే ముందు ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఇతర నాయకుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని ఉండాల్సిందని ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. అంతేకాదు ఈ విషయమై చర్చలకు కూర్చొవల్సిందే అంటున్న జౌత్సాహిక నిరసనకారులకు వంత పాడుతున్నాయి ప్రతిపక్షాలు. ఐతే ప్రభుత్వం ఇంకా కొన్ని చోట్ల నిరసనలు జరుగుతుండటంతో దిద్దుబాటు చర్య చేపట్టడమే కాకుండా పలు రాయితీలను కూడా ప్రకటించింది. ఈ మేరకు కోస్ట్గార్డు, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో సహా మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్లో విస్తరించి ఉన్న రక్షణ మంత్రిత్వశాఖ ఉద్యోగాల్లో 10 శాతం కోటా కల్పించింది. ఈ రిజర్వేషన్ మాజీ సైనికులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్కు అదనంగా ఉంటుంది. The reason why Punjab loves @BhagwantMann ❤️ Punjab CM STOPPED his roadshow for #SangrurBypoll to listen to a youth protesting against #AgnipathScheme pic.twitter.com/PVXiTU0MYI — AAP (@AamAadmiParty) June 19, 2022 (చదవండి: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్) -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్టార్.. కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెర్సీడెస్కు చెందిన ఎస్యూవీ లగ్జరీ మెర్సీడెస్-ఏంఎంజీ జి 63ని రూ. 2.45కోట్లు పెట్టి కొన్నాడు. అయ్యర్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయ్యర్ కొనుగోలు చేసిన కారు కేవలం 4.5 సెకన్లలో 100కిమీ వేగాన్ని అందుకుంటుంది. కాగా అయ్యర్ కారుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన మెర్సిడెస్ లగ్జరీ కార్ల కంపెనీ ట్వీట్ చేసింది. ''కంగ్రాట్స్ టూ టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. అలాగే మా మెర్సిడెస్ బెంజ్ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. మెర్సిడెస్ బెంజ్లో కొత్త మోడల్ కారును కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు. మీ బ్యాటింగ్లో కవర్ డ్రైవ్స్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం.. ఇప్పుడు మీరు మా కారు డ్రైవింగ్ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో కేకేఆర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. బ్యాటింగ్లోనూ అంతగా రాణించని శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్గానూ మెరవలేదు. రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్ ఐపీఎల్ 15వ సీజన్ను ఏడో స్థానంతో ముగించింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా సిరీస్కు శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు. సీనియర్ల గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు కీలకం కానున్నాడు. ఈ సిరీస్ ద్వారా శ్రేయాస్ తన ఫామ్ను తిరిగి అందుకుంటాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బిగ్స్క్రీన్పై చారిత్రక టెస్టు సిరీస్.. రోమాలు నిక్కబొడుచుకునేలా ట్రైలర్ Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! -
అదిరిపోయే లుక్తో విడుదలైన ఎస్యూవీ, ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: స్టెలాంటిస్ గ్రూప్లో భాగమైన జీప్ ఇండియా తాజాగా తమ కొత్త ఎస్యూవీ మెరీడియన్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 29.9 లక్షల నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం తొలిసారిగా మూడు వరుసల సీటింగ్తో ఈ ఎస్యూవీని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆల్–వీల్ డ్రైవ్ వెర్షన్తో పాటు ఇది అయిదు వేరియంట్లలో లభిస్తుందని పేర్కొంది. ప్రారంభ ధరలు రూ. 29.9 లక్షల నుంచి రూ. 36.95 లక్షల వరకూ ఉంటాయని జీప్ బ్రాండ్ ఇండియా హెడ్ నిపుణ్ జె మహాజన్ తెలిపారు. జీప్ మెరిడియన్కి ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 50,000 డౌన్పేమెంట్ కట్టి మెరీడియన్ను తమ వెబ్సైట్లో బుక్ చేసు కోవచ్చని, జూన్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు. బుకింగ్స్ ప్రారంభించడానికి ముందే 67,000 పైచిలుకు ఎంక్వైరీలు వచ్చినట్లు, 5,000 మందికి పైగా కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు మహాజన్ చెప్పారు. -
వాటివల్లే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి! కారణమేంటీ?
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెల్లడైంది. అమెరికాలో ఇటీవల నిర్వహించిన సర్వేలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. రోడ్డు ప్రమాదాలకు ఇటువంటి కారణాలు కూడా ఉంటాయా అనేట్టుగా నిజాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన ఇన్సురెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైవే సేఫ్టీ (ఐఐహెచ్ఎస్) సంస్థ ఇటీవల రోడ్డు ప్రమాదాలు, అందులో చనిపోతున్న వ్యక్తులకు సంబంధించిన డేటాను విశ్లేషించింది. రోడ్డు ప్రమాదాలో ఎక్కువగా మరణాలకు కారణం అవుతున్న వాహనాల్లో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ (ఎస్యూఈ), పికప్ వెహికల్స్ ఉన్నట్టుగా తేలింది. దీంతో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్, పికప్ వెహికల్స్పై మరోసారి పరిశీలన చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఎస్యూవీ, పికప్ వెహికల్స్లో ముందు వైపు ఇరుపక్కలా పెద్దగా ఉండే పిల్లర్స్ కారణంగా డ్రైవర్కి బ్లైండ్ స్పాట్స్ ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మూల మలుపులు తీసుకునే సమయంలో ఈ బ్లైండ్స్పాట్స్ డ్రైవర్ దృష్టి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్టుగా గుర్తించారు. ఎస్యూవీ, పికప్ వెహికల్ డ్రైవర్లకు ఏర్పడుతున్న బ్లైండ్స్పాట్ల వల్ల రోడ్డు కదులుతున్న లేదా నిలబడి ఉన్న వ్యక్తులను గుర్తించడంలో పొరపాట్లు జరుగుతున్నట్టుగా తేలింది. సాధారణ ప్యాసింజర్ వెహికల్స్లో ఈ సమస్య కొద్ది మొత్తంలోనే ఉండగా ఎస్యూవీ, పికప్ వెహికల్స్లో ఎక్కువగా ఉన్నట్టు ఐఐహెచ్ఎస్ పరిశీలనలో వెల్లడైంది. 2020లో రోడ్డు ప్రమాదాల కారణంగా అమెరికాలో 6,519 మంది చనిపోయారు. అంతుకు ముందు ఏడాదితో పోల్చితే ఇది నాలుగు రెట్లు అధికం. ఇక 2009 నుంచి 2019 రోడ్డు ప్రమాదాల గణాంకాలను పోల్చితే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఏకంగా 59 రెట్లు పెరిగింది. గత కొంత కాలంగా అమెరికాలో ఎస్యూవీ అమ్మకాలు పెరిగిపోయాయి. మరోవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ఒక్క ఎస్యూవీ, పికప్ వెహికల్స్నే బాధ్యులను చేయలేం, అదే సమయంలో ప్రమాదాల్లో ఎక్కువగా ఉన్న ఈ వాహనాల సంఖ్యను విస్మరించలేం. మరింత అధ్యయనం చేసి తగు విధమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఐఐహెచ్ఎస్ అంటోంది. -
మహీంద్రా థార్కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్ గుర్ఖా..!
ఆఫ్ రోడ్ కార్లలో మహీంద్రా థార్ అత్యంత ఆదరణను పొందింది. ఈ సెగ్మెంట్లో మహీంద్రా థార్, మారుతి సుజుకీ జిమ్నీ కార్లకు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్స్ మోటార్స్ గుర్ఖా ఎస్యూవీను లాంచ్ చేసింది. తాజాగా గుర్ఖాను సరికొత్తగా తెచ్చేందుకు ఫోర్స్ సన్నాహాలను చేస్తోంది. 5 డోర్ వెర్షన్లో సరికొత్తగా..! గత ఏడాది ఫోర్స్ మోటార్స్ ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో గుర్ఖాను తీసుకొచ్చింది.తొలుత 3 డోర్ వెర్షన్ గుర్ఖాను ఫోర్స్ మోటార్స్ లాంచ్ చేసింది. దీనికి అదనంగా మరిన్నీ సీట్లను యాడ్ చేస్తూ 5 డోర్ వెర్షన్ గుర్ఖాను త్వరలోనే లాంచ్ చేస్తామని ఫోర్స్ తెలియజేసింది. ఇప్పుడు తాజాగా 5 డోర్ వెర్షన్ గుర్ఖా టెస్టింగ్ మోడల్కు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో వైరల్గా మారాయి. ఈ ఎస్యూవీను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. నయా ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీలో 6-7 సీట్ల సదుపాయం ఉండనుంది. అదే డిజైన్..ఇంజిన్తో..! ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీ 5-డోర్ వెర్షన్ కారు అదే డిజైన్ , ఇంజిన్తో వచ్చే అవకాశాలున్నాయి. డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టూఐర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం బ్లాక్ థీమ్తో ఇంటీరియర్ రూపొందించారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలు వర్క్ చేస్తాయి. డ్రైవర్ డిస్ప్లేను సెమి డిజిటల్గా అందించారు. 2.6 ఫోర్ సిలిండర్ బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన డీజిల్ ఇంజన్ అమర్చారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. గూర్ఖా ఇంజన్ 90 బీహెచ్పీతో 250 ఎన్ఎం టార్క్ని విడుదల చేస్తుంది. చదవండి: అలా చేస్తే సగం ధరకే పెట్రోల్, డీజిల్..! -
క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..!
కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తాజాగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. హోళీ సందర్భంగా పలు కార్లపై మహీంద్రా భారీ తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా ఆయా మోడల్స్పై ఏకంగా రూ.3.02 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఆయా మోడల్స్పై మహీంద్రా అందిస్తోన్న ఆఫర్స్ ఇవే..! మహీంద్రా KUV100 NXT మహీంద్రా కాంపాక్ట్ ఎస్యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 20,000 వరకు కొనుగోలుదారులకు లభించనుంది. మహీంద్రా XUV300 మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు విలువైన ఉచిత యాక్సెసరీలను అందిస్తోంది. ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియో కారు కొనుగోలుపై ఎటువంటి నగదు తగ్గింపును అందించడం లేదు. అయితే కొనుగోలుదారులు రూ. 15,000 పైగా విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చు. ఈ కారు కొనుగోలుపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 15,000 కూడా అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా అల్టురాస్ మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై ఏకంగా రూ. 2.2 లక్షల భారీ తగ్గింపును అందిస్తోంది .దాంతో పాటుగా రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది.అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చును. మహీంద్రా మరాజ్జో మహీంద్రా మరాజో ఎస్యూవీ బేస్ M2 ట్రిమ్పై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, ఇతర ట్రిమ్ వేరియంట్స్పై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. వీటితో పాటుగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: సరికొత్త హంగులతో విడుదలైన ఎంజీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు..! -
జీప్ మెరిడియన్.. ఇది మేడ్ ఇన్ ఇండియా
ఎస్యూవీ సెగ్మెంట్లో మంచి పట్టున్న జీప్ సంస్థ 7 సీటర్ వెహికల్ను మార్కెట్లోకి తెస్తామంటూ ఎప్పటి నుంచో చెబుతోంది. టెస్ట్ రైడ్ సందర్భంగా పలుమార్లు జీప్ 7 సీటర్ ఎస్యూవీ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఎస్యూవీకి ఏ పేరు పెడతారనే ఆసక్తి మొబైల్ ఇండస్ట్రీలో నెలకొని ఉండేది. దాదాపు 70 పేర్లను పరిశీలించిన జీప్ ఇండియా చివరకు మెరిడియన్ పేరును ఫిక్స్ చేసింది. ఈ మెరిడియన్ పూర్తిగా మేడిన్ ఇండియా అని ఇది ఇండియన్ల కోసమే తయారు చేశామని చెబుతున్నారు. జీప్ మెరిడియన్ 7 సీటర్ ఎస్యూవీకి సంబంధించి కేవలం పేరు ఒక్కటే వెల్లడైంది. ఇంజన్ సామర్థ్యం, ఇన్ఫోంటైన్మెంట్, ఇతర ఫీచర్లకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ జీప్ మెరిడియన్లో కచ్చితంగా ఉండబోయే ఫీచర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల అంచనాలు ఇలా ఉన్నాయి - పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో వస్తుంది. 2.0 ఇంజన్ను ఉపయోగించే అవకాశం - 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బాక్స్ - 10.25 ఇంచ్ ఇన్ఫోంటైన్మెంట్ స్క్రీన్ - పనోరమిక్ సన్రూఫ్ - 4 జోన్ వెదర్ కంట్రోల్ - ఫ్రంట్ వెంటిలేడెట్ సీట్స్ - టయోటా ఫార్చునర, ఎంజీ గ్లూస్టర్ , స్కోడా కోడియాక్ రేంజ్లో రూ. 35 లక్షల దగ్గర జీప్ 7 సీటర్ ఎస్యూవీ ధర ఉండవచ్చని అంచనా -
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ కారు..!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ కారును ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ లాంచ్ చేయనుంది. ఆస్టన్ మార్టిన్ 2022 DBX ఎస్యూవీకు చెందిన టీజర్ను కంపెనీ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. లాంచ్ ఎప్పుడంటే..! ఆస్టన్ మార్టిన్ 2022 DBX ఎస్యూవీ కారును రేపు (ఫిబ్రవరి 1)న రిలీజ్ చేయనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లగ్జరీ ఎస్యూవీగా నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కారు లంబోర్ఘిని ఉరస్ కారుకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఈ కొత్త తరం డీబీఎక్స్ ఎస్యూవీ పలు మార్పులతో రానున్నట్లు కంపెనీ పేర్కొంది. సరికొత్తగా ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్..! ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్ను భారీ మార్పులతో, మరింత ఆకర్షణీయంగా రానుంది. రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త సెట్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ రీపోజిషన్ చేయబడ్డాయి. కొత్త వీల్ డిజైన్స్తో సరికొత్త కలర్ కాంబినేషన్తో రానుంది. ఇంజన్ విషయానికి వస్తే..! న్యూ ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్ ఎస్యూవీ అభివృద్ధి చేసిన కొత్త టర్బోఛార్జ్డ్ వీ12 ఇంజిన్తో రానుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 650 hp శక్తిని ఉత్పత్తి చేయనుంది. మునపటి మోడల్ కంటే 100 hp అధిక శక్తిని విడుదల చేయనుంది. 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో అందుకోనుంది. గరిష్టంగా 290 kmph వేగంతో ప్రయాణించనుంది. Change is coming. Power talks. The world’s most powerful luxury SUV. 01.02.22#AstonMartin#NewSeatOfPower — Aston Martin (@astonmartin) January 18, 2022 చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా కారు..! -
అడ్వాన్స్ బుకింగ్.. ముందుగా రూ.5 లక్షలు చెల్లించండి
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన నూతన వెర్షన్ ప్రీమియం ఎస్యూవీ ‘క్యూ7’కు బుకింగ్లు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. 3 లీటర్ల పెట్రోల్ ఇంజన్తో ఉండే ఈ కారు కోసం ముందుస్తుగా రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2021లో తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేశామని.. ఆడి క్యూ7 బుకింగ్లతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించం ఉత్సాహంగా ఉన్నట్టు పేర్కొంది. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, క్వాట్టో ఆల్వీల్ డ్రైవ్, పార్క్ అసిస్ట్ తదితర ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. -
బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ.. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐఎక్స్ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.16 కోట్లు. వచ్చే ఆరు నెలల్లో భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ ప్రవేశపెట్టబోయే మూడు ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ఇది మొదటిది. దీన్ని పూర్తి బిల్టప్ యూనిట్గా (సీబీయూ) దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. డెలివరీ ఎప్పుడంటే సరికొత్త బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆన్లైన్ ఆఫ్లైన్ పద్దతిలో విక్రయించాలని నిర్ణయించారు. డీలర్షిప్లతో పాటు షాప్డాట్బీఎండబ్ల్యూడాట్ఇన్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చని బీఎండబ్ల్యూ పేర్కొంది. 2022 ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు. ప్రారంభ ఆఫర్ కింద కాంప్లిమెంటరీగా స్మార్ట్ బీఎండబ్ల్యూ వాల్బాక్స్ చార్జర్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 11కేడబ్ల్యూ ఏసీ చార్జరుతో 7 గంటల్లో 100 శాతం చార్జింగ్ చేయవచ్చని, 2.5 గంటల్లో 100 కి.మీ.కు సరిపడేంత చార్జింగ్ వీలవుతుందని విక్రమ్ వివరించారు. చదవండి: బీఎండబ్ల్యూ దండయాత్ర.. 6 నెలల్లో 3 ఎలక్ట్రిక్ కార్లు! -
నిస్సాన్ బంపర్ ఆఫర్..! కారు కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!
వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్ ఎండ్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. కాగా ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ కూడా ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2021 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. నిస్సాన్ అందిస్తోన్న ఆఫర్స్ ఇవే..! నిస్సాన్ మిడ్-సైజ్ ఎస్యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్లైన్ బుకింగ్ బోనస్ను కూడా పొందవచ్చును. కిక్స్ ఫీచర్స్ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రోల్ ఇంజన్తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో వేరియంట్ 154 బీహెచ్పీతో 254 ఎన్ఎమ్ టార్క్ని రిలీజ్ చేస్తుంది. రెండో వేరియంట్ అయిన 1.5 లీటర్ వేరియంట్ 105 బీహెచ్పీతో 142 ఎన్ఎం టార్క్ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్లో లభిస్తున్నాయి. కిక్స్ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్ తెలిపింది. చదవండి: రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్ బైక్..! ఎగబడుతున్న జనాలు..! -
ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో
న్యూయార్క్: రోడ్డుపై పలు యాక్సిడెంట్ ఘటనలు చూసినప్పటికీ ఇంకా అలాంటి భయంకరమైన ఘటనలు పునరావృతమౌతునే ఉన్నాయి. అంతేకాదు వేగం తగ్గించమని ఎంతలా ట్రాఫిక్ యంత్రాంగం మొత్తుకున్న ప్రజల్లో సరైన మార్పు రాకపోవడం బాధకరం. కానీ యూఎస్లోని ఇండియానాలో జరిగిన అతి పెద్ద యాక్సిడెంట్ చూస్తే ఎవరికైనా భయం వేయాల్సిందే. (చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. వైద్య చరిత్రలో గుర్తిండిపోయే పనిచేశాడు.. హైస్కూల్ చదువుతోనే..!!) అసలు విషయంలోకెళ్లితే...ఇండియానాలోని ఇండియానాపోలిస్లో కనీసం మూడు స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ ఢీ కొన్నాయి. అయితే మొదట రోడ్డు ఖాళీగా ఉందని రెడ్ సిగ్నల్ పడినప్పటికీ ఒక ఎస్యూవీ కారు వేగంగా వచ్చేస్తుంది. అంతే మరో ఎస్యూవీ కారు దాన్ని గట్టిగా ఢీ కొడుతుంది. దీంతో అది గాల్లోకి లేచి రహదారికి మరోవైపు పడుతుంది. వెంటనే అటువైపేగా వస్తున్న ఎస్యూవీ కారు పై పడి అక్కడ ఉన్న ఆరు కారులను ఢీ కొడుతుంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదుగానీ, మొత్తం ఆరు కారులు దెబ్బతిన్నాయి. అంతేకాదు ఈ ఘటన జరిగినప్పుడు ఒక పాదచారి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అయితే అదృష్టమేమిటంటే అతనికి ఏం కాలేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?) -
ఆనంద్ మహీంద్రా చెప్పినట్లుగానే చేశారే..!
Anand Mahindra Gifts XUV700 To Neeraj Chopra Sumit Antil: ఒలింపిక్స్, పారాలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిన నీరజ్చోప్రా, సుమిత్ ఆంటిల్కు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వారికి బహుమతిగా లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా 700ఎక్స్యూవీ కార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనంద్ మహీంద్రా చెప్పినట్లుగానే తన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. పారాలింపియన్ సుమిత్ ఆంటిల్కు మహీంద్రా 700ఎక్స్యూవీ పర్సనలైజ్డ్ కారును మహీంద్రా కంపెనీ అక్టోబర్ 30న బహుకరించింది. ఈ విషయాన్ని సంస్థ ట్విటర్లో షేర్ చేసింది. కార్ డెలివరీ విషయంపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఆనంద్ మహీంద్రా తన ట్విట్లో...‘ మహీంద్రా 700ఎక్స్యూవీ జావెలిన్ ఎడిషన్ కారును మీతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. మే ద ఫోర్స్ విత్ యూ ’ అంటూ శుభాకాంక్షలను తెలిపారు. ఇదిలా ఉండగా...టోక్యో ఒలింపిక్స్ 2020లో గోల్డ్మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా కూడా తన ట్విటర్ హ్యండిల్లో జావెలిన్ ఎడిషన్ మహీంద్రా 700ఎక్స్యూవీ కార్తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రాకు నీరజ్ చోప్రా ధన్యవాదాలు తెలిపారు. జావెలిన్ త్రో..కార్పై..! నీరజ్ చోప్రాకు, సుమిత్ ఆంటిల్కు ఇచ్చిన మహీంద్రా 700ఎక్స్యూవీలో టోక్యోలో జరిగిన జావెలిన్ త్రో విభాగంలో వారు విసిరిన దూరాన్ని సూచిస్తూ జావెలిన్ సింబల్ను సూచించేలా కారును రూపొందించారు. మహీంద్రా 700ఎక్స్యూవీ రికార్డు...! మహీంద్రా 700ఎక్స్యూవీ ప్రి-బుకింగ్స్లో దుమ్మురేపింది. మహీంద్రా తన ఎక్స్యువి700 ఎస్యూవి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డు అని కంపెనీ పేర్కొంది. We are so proud of you @sumit_javelin Thank you for giving us the privilege of sharing our very own ‘Javelin’ with you! May the Force be with you …always. https://t.co/8iDwX6wa41 — anand mahindra (@anandmahindra) October 30, 2021 Thank you @anandmahindra ji for the new set of wheels with some very special customisation! I'm looking forward to taking the car out for a spin very soon. 🙂 pic.twitter.com/doNwgOPogp — Neeraj Chopra (@Neeraj_chopra1) October 30, 2021 చదవండి: కేవలం 4రోజుల్లో రూ.1000 పెట్టుబడితో రూ.3.45లక్షల్ని సంపాదించారు -
మహీంద్రా థార్కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...!
Maruti Suzuki Teases New Off Road Car: ఆఫ్ రోడ్స్ వాహనాల్లో మహీంద్రా థార్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మహీంద్రా థార్కు పోటీగా ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఆఫ్ రోడ్స్ ఎస్యూవీ కార్లపై ఫోకస్ పెట్టాయి. భారత మార్కెట్లలోకి థార్కు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ గుర్ఖా పేరుతో ఆఫ్ రోడ్ ఎస్యూవీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహీంద్రా థార్కు పోటీగా మారుతి సుజుకి భారత మార్కెట్లలోకి ‘జిమ్నీ’ పేరుతో ఆఫ్ రోడ్ ఎస్యూవీను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా థార్కు తీసిపోకుండా అదే స్టైల్తో జిమ్నీ రానుంది. మారుతి తీసుకువస్తోన్న ఆఫ్ రోడ్ ఎస్యూవీ కస్టమర్లను ఇట్టే కట్టిపడేస్తుంది. మారుతి సుజుకీ జిమ్నీకి సంబంధించిన టీజర్ను సోషల్ మీడియా హ్యాండిల్స్లో లాంచ్ చేసింది. అన్ని రకాల భూభాగాల్లో అడ్వెంచరస్ డ్రైవింగ్ అనుభూతిని వాహనదారులకు కచ్చితంగా అందిస్తోందని మారుతి సుజుకీ పేర్కొంది. చదవండి: డావో ఎలక్ట్రిక్ స్కూటర్.. భలే ఉంది కదూ! ఇండియా నుంచి ఇతర దేశాలకు... మారుతి సుజుకీ జిమ్నీ ఎస్యూవీ 3 డోర్ వెర్షన్తో రానుంది. ఈ కారును హర్యానాలోని మాన్నేసర్లో ప్లాంట్లో తయారుచేశారు. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు కూడా ఎగుమతికానుంది. భారతీయుల కోసం సపరేట్గా 5 డోర్ వెర్షన్తో రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఇంజన్ విషయానికి వస్తే..! మారుతి సుజుకీ జిమ్నీ ఇంటర్నేషనల్ వెర్షన్ 1.4-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో రానుంది. అయితే ఇండియన్ వెర్షన్ జిమ్నీ 1.5-లీటర్ కె 15 బి పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. ఇక్కడ విశేషమేమిటంటే..విటారా బ్రెజ్జా, సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 మోడల్స్లో ఇదే ఇంజిన్ను మారుతి అమర్చింది. 6000 ఆర్పిఎమ్ వద్ద 103 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది, 4400 ఆర్పిఎమ్ వద్ద 138 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అందిస్తోంది. ఈ ఎస్యూవీ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో పాటు ఆప్షనల్ 4-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్లో కూడా అందుబాటులో ఉంది. కాగా ఈ కారు ధర ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: రికార్డ్ సేల్స్, ప్రతిరోజు 400 అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు -
అరేవాహ్...! జాతీయ రికార్డును కొల్లగొట్టిన మహీంద్రా ఎక్స్యూవీ..!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సెప్టెంబర్ 30న భారత మార్కెట్లలోకి మహీంద్రా ఎక్స్యూవీ700 ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.మహీంద్రా ఎక్స్యూవీ 700 కార్లను కొనుగోలుదారులు ఎగబడి బుకింగ్ చేసుకున్నారు. కేవలం ఒక గంటలోపు 25 వేల మంది మహీంద్రా XUV700ను బుక్ చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డును మహీంద్రా ఎక్స్యూవీ రికార్డును నమోదుచేసింది. చదవండి: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత...! మహీంద్రా ఎక్స్యూవీ మరో రికార్డు...! తాజాగా మహీంద్రా ఎక్స్యూవీ700 మరో జాతీయ రికార్డును నెలకొల్పింది. చెన్నై సమీపంలోని కొత్త ఎస్యూవీ ప్రూవింగ్ ట్రాక్ (ఎమ్ఎస్పీటీ) లో జరిగిన 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్లో మహీంద్రా ఎక్స్యూవీ కొత్త జాతీయ రికార్డును సృష్టించింది.ఈ ఛాలెంజ్లోకి నాలుగు XUV700 SUV లు ఈవెంట్లో ఒక్కొక్కటి సుమారు 4000 కి.మీ. మొత్తంగా 17000 కిలోమీటర్ల మేర ప్రయాణించాయి. గతంలో ఈ రికార్డు 3161 కిలోమీటర్లతో ఉండేది. మహీంద్రా XUV700 నాలుగు వేరియంట్లలో డీజిల్ మాన్యువల్ వేరియంట్ 4384.73 కిమీలతో , డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ 4256.12 కిమీ, పెట్రోల్ మాన్యువల్ 4232.01 కిమీ చేయగా, పెట్రోల్ ఆటోమేటిక్ 4155.65 కి.మీమేర ప్రయాణించి రికార్డును సృష్టించాయి. ఈ వాహనాలు సగటున 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో నడిచాయి. చదవండి: 9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..!