tsunami
-
ఆయనో స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్! మీనా పెళ్లిలో మాత్రం భావోద్వేగంతో..
సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే.. డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరున్న రాధాకృష్ణన్కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు. ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు. ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం గమనార్హం. -
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు. -
2 లక్షల మందిని మింగేసిన రాకాసి అల
-
20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..
సరిగ్గా 20 ఏళ్ల క్రితం తమిళనాడు తీరంలో సముద్రపు రాకాసి అలలు సృష్టించిన బీభత్సాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేరు. 2004 డిసెంబర్ 26న ఏకంగా 6,605 మందిని బలిగొన్న సునామీ మిగిల్చిన విషాదం ఇప్పటికీ స్థానికులను వెంటాడుతూనే ఉంది. నాటి సునామీ బాధితులలో నమితా రాయ్ ఒకరు. ఆనాడు ఆమెకు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. దానిని తలచుకున్నప్పుడల్లా ఆమె నిలువెల్లా వణికిపోతుంటుంది.ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఉంటున్న నమితా రాయ్ నాటి సునామీ అనుభవాలను మీడియాకు తెలిపారు. అవి ఆమె మాటల్లోనే.. ‘2004లో నేను కుటుంబంతోపాటు అండమాన్, నికోబార్లోని హాట్బే ద్వీపంలో ఉండేవాళ్లం. ఆ సమయంలో నేను గర్భవతిని. ఆ రోజు నేను రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నాను. అకస్మాత్తుగా హట్ బే ద్వీపం దిశగా సముద్రపు అలలు ఎగసిపడుతూ వచ్చాయి. వాటిని చూసిన వారంతా పెద్దగా కేకలు పెడుతూ, కొండపైకి పరుగులు తీశారు. దీనిని చూసిన నేను భయంతో స్పృహ కోల్పోయాను.నేను తేరుకుని కళ్లు తెరచి చూసేసరికి దట్టమైన అడవిలో ఉన్నాను. నా చుట్టూ చాలామంది ఉన్నారు. అంతకుముందు అపస్మారక స్థితిలో ఉన్న నన్ను నా భర్త, పెద్ద కుమారుడు ఇక్కడికి తీసుకువచ్చారు. భీకరమైన అలల తాకిడికి హాట్బే ద్వీపమంతా ధ్వంసమయ్యిందని చెప్పారు. ఆ మాట వినగానే షాక్కు గురయ్యాను. ఆరోజు రాత్రి 11.49 గంటల సమయంలో నాకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దగ్గర్లో డాక్టర్లెవరూ లేరు.పురిటి నొప్పులతో బాధపడుతూ మెలికలు తిరిగిపోయాను. దీనిని గమనించిన నా భర్త నన్ను ఒక చదునైన బండరాయిపై పడుకోబెట్టారు. సహాయం కోసం వైద్యులకు కాల్ చేశారు. ఎంత ప్రయత్నించినా వైద్య సహాయం అందలేదు. వెంటనే నా భర్త.. నేను పడుతున్న పురిటినొప్పల గురించి అక్కడున్న మహిళలకు చెప్పి,సాయం అర్థించారు. వెంటనే వారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నాకు పురుడు పోశారు. అంతటి విపత్కర సునామీ పరిస్థితుల మధ్య నేను నా కుమారునికి జన్మనిచ్చాను. ఆ ఆడవిలో లెక్కకు మించిన విష సర్పాలు ఉంటాయి. వాటి మధ్యనే నేను పురుడు పోసుకున్నాను. నా కుమారునికి ‘సునామీ’ అని పేరు పెట్టుకున్నాను.అయితే అధిక రక్తస్రావం కారణంగా నా ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అతికష్టం మీద నా బిడ్డకు పాలు తాగించాను. అయితే అంతకుమందు నేను ఏమీ తినకపోవడంతో నా పిల్లాడికి కావాల్సినంత పాలు ఇవ్వలేకపోయాను. దీనిని గమనించిన చుట్టుపక్కల మహిళలు నా కుమారుని చేత కొబ్బరి నీళ్లు తాగించారు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో అదే ప్రాంతంలో మేము నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది. తరువాత రక్షణ సిబ్బంది అక్కడికి వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి నన్ను వైద్య చికిత్స కోసం పోర్ట్ బ్లెయిర్లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకెళ్లారు.కోవిడ్ -19 మహమ్మారి సమయంలో నా భర్త లక్ష్మీనారాయణ కన్నుమూశారు. ప్రస్తుతం నేను నా కుమారులు సౌరభ్, సునామీలతో పాటు హుగ్లీలో ఉంటున్నాను. పెద్ద కొడుకు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండవవాడు సునామీ భవిష్యత్లో సముద్ర శాస్త్రవేత్త కావాలని అనుకుంటున్నాడు’ అని నమితా రాయ్ తెలిపారు.అనంతరం ఆమె కుమారుడు సునామీ మీడియాతో మాట్లాడుతూ ‘మా అమ్మే నాకు సర్వసం. మా నాన్నగారు మరణించాక అమ్మ మమ్మల్ని పెంచిపెద్ద చేసేందుకు ఎంతో శ్రమించింది. సునామీ కిచెన్ను నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకువచ్చింది. భవిష్యత్లో నేను సముద్ర శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాను’ అని తెలిపారు.ఇది కూడా చదవండి: Veer Bal Diwas: మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా.. -
భాగ్య నగర కీర్తి ‘కెరటం’.. ఇంకాయిస్
హిందూ మహాసముద్రంతో అనుబంధం ఉన్న 28 దేశాలకు సునామీ హెచ్చరికలు మన భాగ్యనగరం నుంచే వెళ్తుంటాయి. సముద్రాల్లో ఏర్పడే భూప్రకంపనల నుంచి సునామీ రాక, సముద్రపు అలల ఎత్తు, వేగం, వాటి తీవ్రత ఏమేర ఉంటుందో క్షణాల్లో భారత్తోపాటు ఆయా దేశాలకు చేరవేసే విజ్ఞాన వాహిని భాగ్యనగర సొంతం. నగర కీర్తి కెరటంగా ‘ఇంకాయిస్’ (భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం) పరిఢవిల్లుతోంది.సనత్నగర్ (హైదరాబాద్): ప్రపంచంలో మూడు దేశాల్లో సునామీ హెచ్చరిక కేంద్రాలు ఉంటే అందులో హైదరాబాద్లోని ఇంకాయిస్ ఒకటి. మిగతా రెండు ఇండోనేసియా,ఆ్రస్టేలియాలో ఉన్నాయి. 2004 హిందూమహాసముద్ర సునామీ 20వ వార్షికోత్సవాన్ని గురువారం ప్రగతినగర్లోని ఓషన్ వ్యాలీలో గల ఇంకాయిస్లోజరపనున్నారు. దీనికి కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. నాటి సునామీలో ప్రాణాలు విడిచిన వారికి నివాళులు అర్పించనున్నారు.ఈ సందర్భంగా ఇంకాయిస్ అందిస్తున్నసేవలపై ప్రత్యేక కథనం.తొలుత మత్స్యకారుల సేవల కోసం..1999లో మత్స్యకారులకు సేవలు అందించేందుకు పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ (పీఎఫ్జెడ్)గా ఇంకాయిస్ ఆవిర్భవించింది. సముద్రంలో చేపలు ఎక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి సమాచారాన్ని వారికి చేరవేసే కేంద్రంగానే ఉండేది. ఆ తరువాత కొద్దికాలానికి సముద్రంలో వాయు దిశ, అలల వేగం, వాటి ఎత్తు, ఉష్ణోగ్రత వివరాలను అందిస్తూ ఓషియన్ స్టేట్ ఫోర్కాస్ట్ సేవలకు అంకురార్పణ చేసింది. 2004కు ముందు వరకు సునామీ అంటే భారత్కు పరిచయం లేని పదం. 2004లో వచ్చిన సునామీతో 2,40,000 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. 14 దేశాలపై సునామీ ప్రభావం పడింది. ఆ సమయంలోనే సునామీ అంటే ఏంటో అందరికీ తెలిసింది. అప్పటివరకు సునామీ వస్తుందన్న ముందస్తు సమాచారం ఇచ్చే కేంద్రం ప్రపంచదేశాల్లో ఎక్కడా లేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా తేరుకుని సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అప్పటికే ఇంకాయిస్ ద్వారా మహాసముద్ర సమాచార సేవలు అందుతుండటంతో దీనికి అనుబంధంగానే సునామీ హెచ్చరిక కేంద్రం నెలకొల్పింది. 2005లో ప్రక్రియ ప్రారంభించి 2007లో పూర్తిస్థాయిలో హిందూ మహాసముద్ర సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రంగా అవతరించింది.సునామీలు ఎలా ఏర్పడతాయంటే..? సముద్రంలో భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం, కొండచరియలు విరిగిపడటం వంటి కారణాలతో సునామీలు ఉత్పన్నమవుతాయి. అయితే ఎక్కువ శాతం భూకంపాల ద్వారానే సునామీలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. భూకంప తీవ్రత 6.5 కంటే ఎక్కువ ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ సమయంలో సముద్రం మధ్య భాగంలో వాయువేగం గంటకు 800 కి.మీ., కెరటాల ఎత్తు ఒక మీటరు కంటే తక్కువగా ఉంటాయి. అదే తీరప్రాంతాన్ని తాకే సమయంలో వాయువేగం గంటకు 30 కి.మీ.కు పడిపోయి అలల ఎత్తు మాత్రం 30 మీటర్లకు పెరిగిపోతుంది. అందుకే సునామీ వచ్చే ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉండాలని నిపుణులు హెచ్చరిస్తారు. తీరాన్ని తాకుతున్న కొద్దీ అలల ఎత్తు పెరుగుతుంది. సునామీ రాకను సామాన్య ప్రజలు కూడా గుర్తించవచ్చు. ఆ సమయంలో సముద్రం వెనుకకు వెళ్లిపోతుంది. అలల శబ్ద తరంగాల్లో మార్పు గమనించవచ్చు. ఇంకాయిస్ ఎలా గుర్తిస్తుందంటే.. సునామీకి ముందు మొదట సముద్రంలో భూమి కంపిస్తుంది. అలా భూప్రకంపనలు జరిగిన 5–6 నిమిషాలకు ఇంకాయిస్కు సమాచారం అందుతుంది. సముద్ర భూభాగంలో అమర్చిన సిస్మో మీటర్ల ఆధారంగా శాటిలైట్ ద్వారా భూప్రకంపనలు జరిగిన సమాచారం ఇంకాయిస్కు చేరుతుంది. ఆ తరువాత భూకంపం ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై దృష్టిసారిస్తారు. సముద్ర జలాలకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన ‘సునామీ బోయ్ నెట్వర్క్’ పరికరాల ఆధారంగా కెరటాల ఎత్తు, వాయు దిశను పరిశీలించి సునామీని గుర్తిస్తారు. సాధారణ రోజుల్లో బోయ్ నెట్వర్క్ పరికరాలు శాటిలైట్ ద్వారా 15 నిమిషాలకో మారు అలలు, సముద్ర స్థితిగతులకు సంబంధించిన సమాచారం ఇంకాయిస్కు చేరవేస్తుంది.అదే సునామీ వస్తుందంటే నిమిషానికోమారు సందేశం పంపుతుంది. దాని ఆధారంగా సునామీని పసిగడతారు. ఒక్కో బోయ్ నెట్వర్క్ పరికరం రూ.6 కోట్ల వరకు ఉంటుంది. నిమిషాల్లో సమాచారం...ఇంకాయిస్ సేకరించిన సమాచారాన్ని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉండే విపత్తు నిర్వహణ కేంద్రాలకు, భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖకు వెబ్సైట్, మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా కేవలం పది నిమిషాల లోపే చేరవేస్తుంది. మూడుస్థాయిల్లో ఇంకాయిస్ సమాచారం అందిస్తోంది. వార్నింగ్, అలర్ట్, వాచ్ స్థాయిల్లో సందేశం పంపుతుంది. వార్నింగ్ అని సందేశం పంపారంటే తీవ్రత అధికంగా ఉన్నట్లు అర్ధం. సాధారణంగా భూ ప్రకంపనలు జరిగిన తరువాత సునామీ తీరాన్ని చేరుకోవడానికి రెండు గంటలు పడుతుంది.ఆ లోపు సునామీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే అవకాశం ఉంటుంది. ఒక్క అండమాన్ దగ్గర సునామీ ఏర్పడితే మాత్రం 20 నిమిషాల వ్యవధిలోనే తీరాన్ని దాటే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యునెస్కో ఆదేశాల మేరకు 2011 నుంచి సునామీకి సంబంధించిన సమాచారాన్ని హిందూ మహాసముద్రానికి అనుబంధంగా ఉన్న 28 దేశాలకు ఇంకాయిస్ చేరవేస్తుంది. ఆయా దేశాల ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. -
సునామీ @20 ఏళ్లు: అలా జరిగి ఉంటే పెను విధ్వంసం తప్పేది!
ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. హహాకారాలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెడుతూ చెల్లాచెదురైన జనం.. రెప్పపాటులో వాళ్లను ముంచేసిన రాకాసి అలలు.. నేలకూలిన భవనాలు-ముక్కలైన జీవనాధారాలు.. వెతికేకొద్దీ బయటపడ్డ శవాలు.. వెరసి ఎటుచూసినా కన్నీళ్లే!. సరిగ్గా.. 20 ఏళ్ల క్రితం సునామీ(Tsunami) సృష్టించిన విధ్వంసపు జ్ఞాపకాలివి. అప్పటిదాకా సాగర ఆటుపోట్లను ఆహ్లాదంగా భావించిన తీర ప్రాంత ప్రజలు.. ఘోర విపత్తును చూసింది మాత్రం అదే తొలిసారి!. ఇంతకీ ఆరోజు అసలేం జరిగింది? వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే విలయాన్ని పసిగట్టడంలో శాస్త్రవేత్తలు, అధికారుల అంచనాలు ఎక్కడ తప్పాయి?.డిసెంబర్ 26, 2004.. సమయం ఉదయం 7.58నిమిషాలు. ఇండోనేషియాలోని సుమత్రా ఉత్తర వైపున్న సముద్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే.. ‘రింగ్ ఆఫ్ ఫైర్’(పసిఫిక్ మహాసముద్రం) ప్రాంతమది. దీంతో అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు షరామాములుగా మారిందక్కడ. ఆ పూట సంభవించిన వాటిని కూడా తేలికపాటి ప్రకంపనలుగానే అధికారులు భావించి తేలికగా తీసుకున్నారు. కానీ, ఆ ప్రకంపనలు ఒక ప్రళయాన్నే తీసుకొచ్చాయి. 🌊తీవ్ర భూకంప ప్రభావంతో.. సముద్రంలో 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి అలలు. ఆ అలలు తీర ప్రాంతం నుంచి ఐదు కి.మీ పాటు భూభాగంలోకి చొచ్చుకొచ్చేశాయి.ఇండోనేషియా.. అచె ప్రాంతంలోనే లక్షా యాభై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.శ్రీలంక.. సుమత్రాకు 1,700 కిలోమీటర్ల దూరంలోని శ్రీలంక తీర ప్రాంతాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది. వివిధ తీర ప్రాంతాల్లో రాకాసి అలల ధాటికి 35 వేల మంది మరణించారు.భారత్.. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్లోనూ నష్టం జరిగింది. కేరళకు స్వల్ప నష్టం వాటిల్లింది. మొత్తంగా 16, 389 మంది మరణించారు.థాయ్లాండ్.. భూకంప కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖావో లాక్లో తీవ్ర నష్టం వాటిల్లింది. 8 వేలమంది మరణించారు. వీళ్లలో క్రిస్మస్, న్యూఇయర్ సెలవులకు వచ్చిన టూరిస్టులే అధికంగా ఉన్నారు.🌊2004 హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ కారణంగా.. మొత్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు విడిచారు. చెల్లాచెదురైనవాళ్లు లెక్కలేనంత మంది. నిరాశ్రయులైనవాళ్లు ఇంకొందరైతే.. జీవనాధారాలను కోల్పోయారు మరికొందరు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఆయా దేశాల పర్యాటక రంగం కుదేలు కావడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపెట్టింది. ఏకంగా 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. మానవతా ధృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా అందించిన సాయం.. చరిత్రలోనే అతిపెద్ద సాయంగా నిలిచిపోయింది. అయినప్పటికీ.. తీర ప్రాంతాలు, మానసికంగా అక్కడి ప్రజలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పట్టింది.10 నిమిషాల భూకంపం!రిక్టర్ స్కేల్పై 9.1-9.3 మధ్య తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూమి పది నిమిషాలపాటు కంపిస్తూనే ఉంది. ఆ కారణంతోనే సముద్రపు అలలు రాకాసి రూపం సంతరించుకున్నాయి. తీర ప్రాంతాలను క్షణాల్లో చుట్టుముట్టాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయ్లాండ్, మాల్దీవులు.. ఇలా 14 దేశాలను సముద్రపు అలలు ముంచెత్తాయి. అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఎక్కడో 9వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా స్టేట్ ఓక్లాహామాలోనూ దీని ప్రభావం కనిపించిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సునామీ అనే పేరు మనవాళ్లు విన్నది అప్పుడే తొలిసారి!.ఆసియాలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డు21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన భూకంపంప్రపంచంలో ఇప్పటిదాకా సంభవించిన భూకంపాల్లో మూడో శక్తివంతమైందిఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం!2004 సునామీ 21వ శతాబ్దంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తుగా చరిత్రకెక్కింది*భూకంపాల కొలమానం.. సిస్మోగ్రఫీ అనేది 1900 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. చదవండి: ఆధునిక చరిత్రలోనే అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?. 🌊సునామీ.. మనిషి నిలువరించలేని ఓ ప్రకృతి విపత్తు!. తక్షణ స్పందన, సహాయక చర్యలతో ఈ విపత్తుల వల్ల కలిగే నష్టాలను, పర్యవసాలను కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే సునామీని ముందుగానే గుర్తించగలిగే గ్లోబల్ వార్నింగ్ వ్యవస్థ మాత్రం ఒకటి ఉంది. సముద్ర భూగర్భంలో చెలరేగే అలజడులు.. అలల తీవ్రత ఆధారంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇందుకోసం ‘సునామీ వార్నింగ్ సిస్టమ్’(TWS) పని చేస్తుంది. 🌊ప్రపంచంలోనే తొలి సునామీ హెచ్చరికల వ్యవస్థ.. 1920లో హవాయ్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంభవించిన విపత్తుల ఆధారంగా దానిని ఆధునీకరించుకుంటూ వచ్చారు. ఫసిఫిక్ సముద్రం, నార్త్ అమెరికా సంబంధిత వ్యవస్థలు తర్వాతి కాలంలో ఏర్పాటయ్యాయి. కానీ.. 2004 దాకా హిందూ మహాసముద్రంలో సునామీల హెచ్చరికలకు సంబంధించి ఇలాంటి వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ లేకపోవడం.. ఇంతటి విషాదానికి కారణమైందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తుంటుంది.🌊2004 బాక్సింగ్ డే సునామీ తర్వాత.. ఆ మరుసటి ఏడాది IOTWMSను యునెస్కో ఏర్పాటు చేసింది. భారత్ తరఫున Indian Tsunami Early Warning Centre (ITEWC), ఈ IOTWMSతో సమన్వయం జరుపుతోంది. హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో ITEWCను 2007లో ఏర్పాటు చేశారు. సముద్ర గర్భంలో చోటు చేసుకునే మార్పులు, సునామీల మీద అధ్యయనాలు.. పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడ. 🌊ప్రపంచంలో.. దాదాపు అన్ని సముద్ర రీజియన్లలో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి వ్యవస్థలు కచ్చితత్వం విషయంలోనూ కొన్ని లోపాలు బయటపడ్డాయి. దీంతో విపత్తులకు తగ్గట్లుగా మార్పులు చేస్తూ వస్తున్నారు. 2018 డిసెంబర్లో అగ్నిపర్వతం బద్ధలై సునామీ ముంచెత్తింది. దీంతో.. ఆ గ్యాప్ను భర్తీ చేయడానికి సముద్ర మట్టం స్థాయికి సెన్సార్లను ఏర్పాటు చేశారు. అలా.. అప్పటినుంచి సునామీ హెచ్చరికలు తరచూ జారీ అవుతుండడం చూస్తున్నాం. అయితే ఇలాంటి వ్యవస్థ 20 ఏళ్ల కిందట ఉండి ఉంటే.. ఆనాడు అంతటి విధ్వంసం తప్పేది ఏమో!.🌊సునామీ అంటే?.. Tsunami అనే పదం Tsu(Harbour), nami(waves) అనే జపాన్ పదాల కలయిక. తీరపు అల(రాకాసి అల) అని దీనర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 'సునామీ'అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సాధారణంగా.. భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4 వేల మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500- 700 కి.మీ ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది. సాధారణంగా సునామీలు అలల లాగే కన్పిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు చాలా తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. ఈ రాకాసి అలలు కలిగించే నష్టం కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి.. 2004, 2011లో వచ్చిన సునామీల వల్ల వాటిల్లిన విధ్వంసమే ఇందుకు ఉదాహరణ.:::సాక్షి వెబ్డెస్క్ -
అది చూశాక.. జీవితంలో మొదటిసారిగా నాకు నోట మాటరాలేదు!
డిసెంబర్ 26వ తేదీ వచ్చిందంటే విషాద ఛాయలు ఆవ రిస్తాయి. సునామీ (2004 Tsunami) మన దేశపు సముద్రపు తీరప్రాంతాన్ని 2004 డిసెంబర్ 26 నాడు ఎంత గట్టి దెబ్బ కొట్టిందో... ఆ క్రమంలో చోటుచేసుకున్న అన్ని దృశ్యాలూ నా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.నేను కెనడియన్ హైకమిషన్ ఢిల్లీ కార్యాలయంలో సీనియర్ సలహాదారునిగా పనిచేసి 2015లో పదవీ విరమణ చేశాను. నా ఉద్యోగ బాధ్యతల్లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన పని ఒక కీలక భాగం. విశాలమైన మన దేశంలో ఏడాదంతా ప్రకృతి వైపరీత్యాలు పలురూపాల్లో (వరదలు, కరువు, అకాల వర్షాలు, భూకంపాలు, తుఫానులు, అడవి కార్చిచ్చులు, (Wild Fire) వేడి–చలిగాలులతో చావులు) జీవజాలాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ప్రాణనష్టంతో పాటు మౌలిక వసతుల్ని నాశనంచేసి... సవాళ్లను ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగాలకు వదిలేసి వెనుదిరిగి పోతాయి.ప్రకృతి వైపరీత్యాలతో నా బంధం 1999 అక్టోబర్ 29 నాడు ఒరిస్సాలో వచ్చిన సూపర్ సైక్లోన్తో (Super Cyclone) మొదలయ్యింది. అదొక పెద్ద విషాదం. ఇరవై వేలకి పైగా జనాన్ని పొట్టన పెట్టుకొంది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకే అంటే 2001 జనవరి 26న (రిపబ్లిక్ డే) గుజరాత్లోని భుజ్ ప్రాంతాన్ని కుదిపిన బలమైన భూకంపం వచ్చింది. ఉద్యోగ రీత్యా ఫీల్డ్ విజిట్ కోసం వెళ్ళాను. వందశాతం నెలకొరిగిన గ్రామాలను చూసి చలించిపోయాను. విధ్వంసపు తీవ్రతని కళ్ళారా చూశాక, జీవితంలో మొదటిసారిగా నాకు నోట మాటరాలేదు. బాంబుల దాడికి సంపూర్ణంగా నాశనమైన గ్రామాల మధ్యలో నడుస్తున్న భావన. కూలిన ఇండ్లు, విసిరి పడేసినట్టుగా ఇంటి సామాన్లు, పిల్లల వస్తువులు, చెల్లాచెదురుగా పడి ఉన్న దేవుళ్ళ పటాలు, పెళ్లి ఫోటోలు... ఎనభై సెకండ్ల భూకంపానికి చిన్నా భిన్నమైన జన జీవన దృశ్యాలు! నాలోని రచయిత ఏదైనా రాద్దాం (కథో, నవలో...) అనే ఆలోచనల్లో పడి ఓ వైపు సామగ్రినంతా చక్కగా అమర్చి పెట్టుకొన్నాను. కథలో మరణమృదంగం ఇమడలేదు. బలమైన వస్తువు కదా... నవల రాద్దాం అంటే సమయం దొరకలేదు. గుజరాత్ భూకంపపు (Gujarat Earthquake) ప్రాజెక్టుల్ని పూర్తిచేసి కాస్త ఊపిరి పీల్చుకొంటున్నామో లేదో, 2004 డిసెంబర్ రానే వచ్చింది. సునామీతో మనదేశపు తూర్పుతీర ప్రాంతాన్ని చావుదెబ్బ కొట్టింది. మన దేశంతో సహా పదమూడు దేశాల్లో మహా బీభ త్సాన్ని వదిలి వెళ్లింది సముద్రం. మనదేశంలో ఇరవై వేలకి పైగా చనిపోయారంటారు. కానీ అంత కంటే ఎక్కువే అని అనధికారికంగా చెబుతుంటారు. జనవరి (2005) మొదటి వారంలో ఫీల్డ్ విజిట్ మొదలు పెట్టి రెండువారాలు మూడు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ) దెబ్బ తిన్న ప్రదేశాల్ని చూస్తూ తిరిగాను. ఎన్నో కష్టాల కోర్చి అంకిత భావంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థలను కలిశాను. ప్రభావితులైన వారి స్థితి ఏంటి? తక్షణ అవసరాలేమిటి? ఎవరు ఎలాటి సహాయ కార్యక్రమాలను చేపట్టారు? దాతలు సహాయాన్నందించడానికి ఎలా ముందుకు వస్తు న్నారు వంటి విషయాలపై ఒక అవగాహన కోసం ఎందరినో కలిశాను. మూడు రాష్ట్రాలూ పుస్తకాల్లో దొరకని జ్ఞానపు గనుల్ని నా ముందుకు తెచ్చాయి. 2009 వరకు కెనడా దేశం ఆర్థిక సహాయాన్నిచ్చిన ప్రాజె క్టులు పూర్తయ్యాయి.చదవండి: బాలికా విద్యపై ఇంకా వివక్షా?ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ నాలోని రచయిత ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే ఊపు అందుకొంటున్న ‘నానీల’ ప్రక్రియ పట్ల ఆకర్షితుడనై, ‘సునామీ నానీలు’ అనే 45 పేజీల పుస్తకాన్ని వంద నానీలతో ప్రచురించి సునామీ వచ్చి సంవత్సరం పూర్తికాకముందే ప్రచురించాను. నాకు గొప్ప తృప్తినిచ్చింది. తరువాత ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి అనువదింపబడి రెండు భాషల సాహితీ ప్రియులకీ చేరింది. ఈ చిరు పుస్తకాల అమ్మకాలతో వచ్చిన డబ్బుని (రూ. 37,000) రెండు స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చాను.చదవండి: ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట!ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఫైళ్లని మూసేశాము. మళ్ళీ ఆ ప్రదేశాల్ని తిరిగి చూసే అవకాశాలు రావు. అయిదేళ్లుగా తరచుగా వెళ్లి తిరిగిన ప్రాజెక్టు ప్రాంతాల్లో ఇరవై సంవత్సరాల్లో చాలా మార్పులు తప్పక వచ్చి ఉంటాయి. అప్పటి పిల్లలు యువకులైపోయుంటారు. మధ్య వయస్కులు అరవై దాటి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టి ఉంటారు. పిల్లల్ని కోల్పోయిన తల్లులు మళ్ళీ పిల్లల్ని కని ఉంటారు. వారందరి మోహాలపై నవ్వుల్ని చూసే అవకాశం రాదు. రానే రాదు. అందరూ సునామీ తమకి మిగిల్చిన విషాదాన్ని పీడకలగా భావించి ఆశావాదంతో నెమ్మదిగా నిలదొక్కుకొంటూ, కాలక్రమేణా ముందుకు దూసుకుపోయి ఉంటారని ఊహించుకొంటూ ప్రతి డిసెంబర్ చివరివారం గడుపుతుంటాను.- డాక్టర్ టి. సంపత్ కుమార్ ఢిల్లీలోని కెనడియన్ హైకమిషన్లో మాజీ సీనియర్ సలహాదారు(2004 నాటి సునామీకి రేపటితో ఇరవై ఏళ్లు) -
జపాన్లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
టోక్యో: జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం త్లెలవారుజామున రిక్టార్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించటంతో.. జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా పెద్దగా ప్రకంపనలు చోటుచేసుకొనప్పటికీ.. భూకంపం సంభవించిన 40 నిమిషాల్లోనే ఇజు దీవుల్లోని హచిజో ద్వీపంలో దాదాపు 50 సెంటీమీటర్ల అతి చిన్న సునామీ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, సముద్రపు నీరు ఒక మీటరు ఎత్తులో ఎగసిపడితే సునామి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.All tsunami warnings lifted for Japan's Izu and Ogasawara islands after earlier 5.6 magnitude earthquake https://t.co/bWfknc7WAj— Factal News (@factal) September 24, 2024క్రెడిట్స్: Factal Newsఈ క్రమంలోనే అధికారులు.. ముందస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తరచూ భూకంపాలు సంభవించే జపాన్లో గత రెండు నెలల్లో అనేక చిన్న భూకంపాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబరు 23న తైవాన్లో 4.8 తీవ్రత, సెప్టెంబర్ 22న ఎహిమ్లో 4.9 తీవ్రత, సెప్టెంబర్ 21న చిబాలో 4.6 తీవ్రతతో చిన్న భూకంపాలు సంభవించాయి.చదవండి: వింత శబ్దాల మిస్టరీ వీడింది -
వింత శబ్దాల మిస్టరీ వీడింది
సరిగ్గా ఏడాది క్రితం ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా ప్రపంచమంతటా 9 రోజులపాటు తరచుగా వినిపించిన వింత శబ్దాల రహస్యం వీడిపోయింది. ఈ శబ్దాలకు భూప్రకంపనలు కారణం కాదని పరిశోధకులు తేల్చారు. గ్రీన్లాండ్లోని మారుమూల ప్రాంతం డిక్సన్ ఫోర్డ్లో భారీగా మంచు చరియలు విరిగిపడడం వల్ల భూమి స్వల్పంగా కంపించడంతో ఉత్పత్తి అయిన శబ్దాలుగా గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్లో ప్రచురించారు. భూకంపాలను అధ్యయనం చేసే పరిశోధకులు 2023 సెపె్టంబర్లో రహస్య శబ్ద సంకేతాలను గుర్తించారు. గతంలో ఇలాంటి సంకేతాలు ఎన్నడూ కనిపెట్టలేదు. ఇవి సాధారణ భూప్రకంపనల్లాంటివి కాకపోవడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఒకే వైబ్రేషన్ ప్రీక్వెన్సీతో శబ్దాలు వినిపించాయి. దీనిపై అధ్యయనం కొనసాగించి, గుట్టు విప్పారు. డిక్సన్ ఫోర్డ్లో మంచు కొండల నుంచి విరిగిపడిన మంచు, రాళ్లతో 10 వేల ఒలింపిక్ ఈత కొలనులు నింపవచ్చని తెలిపారు. మంచు చరియల వల్ల మెగా సునామీ సంభవించి, సముద్రంలో 200 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడ్డాయని చెప్పారు. లండన్లోని బిగ్ బెన్ గడియారం కంటే రెండు రెట్ల ఎత్తుకు అలలు ఎగిశాయని వెల్లడించారు. భారీ అలల ప్రభావం ఏకంగా 9 రోజులపాటు కొనసాగిందని అన్నారు. దీనికారణంగానే వింత శబ్దాలు వినిపించినట్లు స్పష్టంచేశారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రీన్లాండ్లో మంచు కరుగుతోంది. సముద్రంలో దశాబ్దాలపాటు స్థిరంగా నిలిచి ఉన్న భారీ మంచు పర్వతాలు సైతం చిక్కిపోతున్నాయి. అవి బలహీనపడి, మంచు ముక్కలు జారిపడుతున్నాయి. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల హిమానీనదాలు గత కొన్ని దశాబ్దాల్లో పదుల మీటర్ల పరిమాణంలో చిక్కిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ ధ్రువ ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడడం, సునామీలు ఇక సాధారణ అంశంగా మారిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కడం ఇంకా కొనసాగితే అవాంఛనీయ పరిణామాలు సంభవించడం తథ్యమని పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సునామీలో కొట్టుకుపోయిన భార్య, 13 ఏళ్లుగా వెతుకులాట!
మనకు అత్యంత ప్రియమైన వాళ్లను ఏదైన దుర్ఘటనలో కోల్పోతే ఆ బాధ మాటలకందనిది. ఇది అలాంటి ఇలాంటి ఆవేదన కాదు. అందులోనూ తల్లి బిడ్డలు, భార్యభర్తల్లో ఎవ్వరైన కానరాని లోకలకు వెళ్తే ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేంది. బతుకున్నన్ని రోజులు ఆ శోకాన్ని మోస్తుంటాం. అయితే కొన్నేళ్లుకు మాములు మనుషులుగా అవుతాం. రాను రాను వారి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తాం. కానీ జపాన్కి చెందిన వ్యక్తిని చూస్తే ఓ దుర్ఘటనలో గల్లంతైన వ్యక్తి కోసం ఇంతలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని అన్వేషిస్తారా అని ఆశ్యర్యపోతారా. ప్రేమంటే ఇది కదా అనే ఫీల్ వస్తుంది. ఎవరతను? అతడి గాథ ఏంటంటే..జపనీస్ వ్యక్తి యసువో టకామట్సుకి 2011లో సంభవించిన ప్రకృతి విపత్తు భార్యను దూరం చేసి, తీరని ఎడబాటు మిగిల్చింది. అయితే ఆ భయానక సునామీలో భార్య కోల్పోయినప్పటికీ ఇప్పటి వరకు ఆమె అవశేషాలు కనిపించలేదు. ఆమెకు అంత్యక్రియలు మంచిగా చేయాలనే ఆశతో ఆ నాటి నుంచి నేటి వరకు ఆమె అవశేషాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. నిజానికి ఆ సునామీలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక యుసువో భార్య యుకో ఓ బ్యాంకులో పనిచేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆమె ఎగిసిన రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో తకామాట్సు ఆమె అవశేషాల కోసం ఒక వాలంటీర్ సహాయంతో అన్వేషించడం మొదలుపెట్టాడు. అంతేగాదు తన భార్య అవశేషాలు దొరక్కపోతాయా..? అని డైవింగ్ నేర్చుకుని మరీ మురికినీటిలో ముమ్మరంగా గాలిస్తున్నాడు. మంచు జలాలతో అపారమైన సవాళ్లు ఉన్నప్పటికీ తన భార్య అవశేషాల కోసం ఆ ఇరువురు వెతకడం విశేషం. ఇక యుకో చివరిగా తన భర్త కోసం ఫోన్లో రెండు సందేశాలను పంపింది. ఒకటి పంపేలోపు దుర్ఘటన భారిన పడగా ఇంకొకటి ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు పంపించింది. ఆమె చివరి సందేశం మీరు బాగున్నారా..? ఇంటికి వెళ్లాలనుకుంటున్నా అని పంపించింది. పంపాలనుకున్న సందేశం.. సునామీ అత్యంత వినాశకరమైనద అని నాటి దుర్ఘటనను వివరించే యత్నం చేసింది. కాగా, తకామట్సు ఈ అన్వేషణ ఫలించడం కష్టమని తెలుసు కానీ తాను చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఆమె అవశేషాల కోసం అన్వేషించడం మాత్రమే అని ఆవేదనగా చెప్పాడు. అంతేగాదు ఈ సముద్రంలో వెతుకుతూ ఉంటే తాను ఆమెకు దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దంపతులు ప్రేమకు అసలైన అర్థం ఇచ్చారు కదా..!. అంతేగాదు భార్యభర్తలు ఒకరికొకరుగా ఉండటం అనే పదానికి అసలైన భాష్యం ఇచ్చారు ఈ ఇరువురు.(చదవండి: ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్ సోదరి ఎవరో తెలుసా..) -
జపాన్లో భారీ భూకంపం
జపాన్లోభారీ భూకంపం సంభవించింది. దక్షిణ ద్వీపం క్యుషు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్స్కేల్పై తొలిసారి 6.9 తీవ్రతతో, రెండోసారి 7.1 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది . జపాన్ వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ జపాన్లోని క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉంది.ఈ భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.అదే విధంగా జపాన్కు వాతావరణ శాత సునామీ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దీవులైన క్యుషు, షికోకులోని పసిఫిక్ తీరంలో సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సముద్రం, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్లోని మిండనావో ద్వీపం తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 10 కిమీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్జెడ్) వెల్లడించింది.యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ భూకంపం అనంతర కూడా ప్రకంపనలు వస్తాయని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం తీరంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపాలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. -
పెరూలో భారీ భూకంపం
పెరూ: దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో శుక్రవారం(జూన్28) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డవారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది అనే దానిని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని ప్రధాని గుస్తావో అడ్రియన్జెన్ తెలిపారు. -
పేలిన అగ్ని పర్వతం.. సునామీ ముప్పు?
ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలడంతో స్థానికుల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పేలుడు దరిమిలా సునామీ ముప్పు పొంచివుంది. పేలుడు కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడిపోనున్నదని, ఫలితంగా 1871లో సంభవించిన మాదిరిగా భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియాలోని రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్గా ఉంది. బూడిద, పొగను వెదజల్లుతోంది. అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా మారిందని, అది ఎప్పుడైనా సముద్రంలో పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జరిగితే, ఇది భారీ సునామీ సంభవిస్తుందని, ఇది సమీపంలోని తీర ప్రాంతాలలో భారీ విధ్వంసం కలిగించవచ్చని స్థానిక అధికారులు అంటున్నారు. ALERT: Indonesia volcano eruption sparks tsunami fears, alert level raised to highest — Officials worry that part of the volcano could collapse into the sea and cause a tsunami, as happened in 1871. pic.twitter.com/idTYAjuImo — Insider Paper (@TheInsiderPaper) April 17, 2024 సునామీ ముప్పు నేపధ్యంలో తీర ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అలాగే బీచ్లను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం లాంటి పనులు చేయకూడదని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. -
వీడియోలు: భూకంపంతో తల్లడిల్లిన తైవాన్.. సునామీ హెచ్చరిక జారీ
తైపీ: తైవాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తైవాన్లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల వివిధ ప్రాంతాల్లో 7 మంది మృతి చెందగా.. సుమారు 730 మంది గాయపడినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఆస్తి నష్టం జగరినట్లు సమాచారం. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. గత 25 ఏళ్లలో ఇదే భారీ భూకంపమని అధికారులు తెలిపారు. 🚨🇹🇼 Building Collapse in Taiwan Due to Earthquakes | Visible Structural Damage Source: @northicewolf https://t.co/cpytWyIx4y pic.twitter.com/Qc0XS4ZXXx — Mario Nawfal (@MarioNawfal) April 3, 2024 మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిపడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. JUST IN: 7.5 magnitude earthquake strikes Taiwan, rocking the whole island and even causing several buildings to collapse. The earthquake triggered a tsunami warning of up to 10 feet from Japan. "Tsunami is coming. Please evacuate immediately. Do not stop. Do not go back,"… pic.twitter.com/E1783aoN3k — Collin Rugg (@CollinRugg) April 3, 2024 భూకంపం కారణంగా తైవాన్ రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయి. జపాన్లోని కొన్ని దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూప్రకంపనాలు సంభవిస్తున్న సమయంలో ఓ స్విమ్మింగ్ పూల్ నీళ్లు.. సముద్రంలో అలల్లా స్విమింగ్ పూల్లో అలజడికి గురయ్యాయి. స్మిమింగ్పూల్ ఉన్న భయభ్రాంతులకు గురయ్యాడు. దీనికిసంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. This is not just another funny video on social media. These visuals capture the scary moment a 7.4 earthquake hit Taiwan, even affecting a swimming pool. Prayers for Taiwan & Japan. 🙏 #Taiwan #Japan pic.twitter.com/iuGtutTeMo — Prayag (@theprayagtiwari) April 3, 2024 -
చరిత్రలో అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?
అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యం!. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో 2004 డిసెంబర్ 26వ తేదీన సునామీ విధ్వంసం సృష్టించే వరకు సునామీ అనే ఓ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా జపాన్లో.. అదీ కొత్త సంవత్సరం నాడే సునామీ అలజడి రేగింది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఇప్పటిదాకా నమోదు అయిన అత్యంత భీకర సునామీలను.. అవి కలగజేసిన నష్టాల్ని ఓసారి తిరగేద్దాం. 🌊ఎన్షునాడా సముద్రం, జపాన్, 1498 రిక్టర్ స్కేల్పై 8.3 తీవ్రతతో కూడిన భూకంపం దెబ్బకు సంభవించిన ఈ సునామీ జపాన్లోని పలు తీర ప్రాంతాల్ని ముంచెత్తింది. సుమారు 31 వేల మందిని బలితీసుకుంది. 🌊ఐస్ బే జపాన్, 1586 రిక్టర్ స్కేల్పై 8.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏర్పడిన ఈ సునామీలో సముద్ర అలలు 6 మీటర్ల ఎత్తుమేర ఎగిసిపడి పలు పట్టణాల్ని ధ్వంసం చేశాయి. బివా అనే సముద్రం ఐస్ బే పట్టణం ఆనవాళ్లు కనిపించనంత స్థాయిలో ముంచెత్తింది. ఇందులో 8 వేల మంది మరణించారు. 🌊నాంకైడో, జపాన్, 1707 8.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ దెబ్బకు సముద్ర అలలు 25 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 30 వేల మంది చనిపోగా, భారత్లోని కొచ్చిలో బలమైన సముద్ర అలలు తీరాన్ని దాటుకుని చొచ్చుకొచ్చాయి. 🌊లిస్బన్, పోర్చుగల్, 1755 8.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పోర్చుగల్ పశ్చిమ తీరం, స్పెయిన్ దక్షిణ తీరాల్లో సునామీ వచ్చింది. కొన్నిచోట్ల సముద్ర అలలు 30 మీటర్ల ఎత్తుకు లేచాయి. పోర్చుగల్, మొరాకో, స్పెయిల్ దేశాల్లో సుమారు 60 వేల మంది చనిపోయారు. 🌊రైకూ దీవులు, జపాన్, 1771 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఏర్పడిన సునామీ వల్ల ఈ ప్రాంతంలోని పలు దీవులు దెబ్బతిన్నాయి. ఇషిగాకి దీవిలో 85.4 ఎత్తు మేర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 3 వేల ఇళ్లు ధ్వంసం కాగా, 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సునామీ అనేది జపనీస్ భాషకు చెందింది. దానికి అర్థం హార్బర్ కెరటం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్తో ఇది సమానం.ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5వ తేదీన సునామీ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. 🌊ఉత్తర చిలీ, 1868 8.5 తీవ్రతతో సంభవించిన రెండు వేర్వేరు భూకంపాల వల్ల ఈ సునామీ ఏర్పడింది. 21 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన అలల మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించాయి. ఇందులో సుమారు పాతిక వేల మంది చనిపోగా, 300 మిలియన్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. 🌊క్రకటోవా, ఇండోనేసియా, 1883 క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ సునామీ సంభవించింది. 37 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు అంజీర్, మెరాక్ పట్టణాల్లో విధ్వంసం సృష్టించాయి. బాంబేలో తీరం నుంచి సముద్రం వెనక్కిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సునామీలో సుమారు 36 వేల మంది చనిపోయారు. 🌊సాంక్రికు, జపాన్, 1896 జపాన్లోని సాంక్రికు తీరంలో సంభవించిన భూకంపం దెబ్బకు ఏర్పడిన సునామీ వల్ల 38.2 మీటర్ల ఎత్తు మేర సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో 11 వేల ఇళ్లు నేలమట్టం కాగా, సుమారు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాలో సంభవించిన సునామీలో 4 వేల మంది చనిపోయారు. 🌊సుమత్రా, ఇండోనేసియా, 2004 9.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీ ఇండోనేసియాతో పాటు శ్రీలంక, భారత్ తీర ప్రాంతాల్లో పెను ప్రళయం సృష్టించింది. 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన సముద్ర అలలు తీర ప్రాంతం నుంచి 5 కి.మీ దూరం వరకు చొచ్చుకొచ్చాయి. సుమారు 2 లక్షల మంది మృత్యువాత పడగా, 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు తెలిసిన అత్యంత భీకర సునామీ ఇదేనని భావిస్తున్నారు. దీని ప్రభావంతో అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం. 🌊ఉత్తర పసిఫిక్ తీరం, జపాన్, 2011 పది మీటర్లకు పైగా ఎగిసిపడిన రాకాసి అలలు 18 వేల మందిని బలిగొన్నాయి. అంతకుముందు, 24.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇప్పటి వరకు వచ్చిన నాలుగో అతి పెద్దదని భావిస్తున్నారు. ఈ దెబ్బకు సుమారు 4.50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భూ ప్రకంపనలకు ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియోధార్మిక వాయువులు లీకు కావడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అధిగమించడానికి జపాన్కు ఐదేళ్లు పట్టింది. -
జపాన్ను తాకిన సునామీ
కొత్త సంవత్సరం తొలిరోజే.. తూర్పు ఆసియా ద్వీప దేశం జపాన్ భారీ భూ కంపం, సునామీతో వణికిపోయింది. సోమవారం కేవలం గంటన్నర వ్యవధిలోనే 21సార్లు భూమి కంపించింది అక్కడ. సునామీ ధాటికి అలలు ఎగిసి పడడంతో.. తీర ప్రాంత ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరిన్ని ప్రకంపలు వచ్చే అవకాశం.. సునామీ ముప్పు ఇంకా తొలగిపోకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు సునామీ తీర ప్రాంతాలన్నింటికి తాకవచ్చని అక్కడి ప్రభుత్వం టీవీ ఛానెల్స్ ద్వారా హెచ్చరించింది. ఇషికావాలో ఐదు మీటర్ల ఎత్తులో అలలు ఎగసి పడొచ్చని అంచనా వేసింది. అంతకు ముందు.. తీర ప్రాంత ప్రజలు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ అలలు ఎగసిపడే పరిస్థితులు కనిపిస్తే వెంటనే పరుగులు తీయాలని ప్రజలకు సూచించింది. మరోవైపు భూకంపం తర్వాత టయోమా, ఇషికావా, న్నిగాటాలో దాదాపు 35 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇతర నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. HAPPENING NOW: First visuals of HUGE wave hitting Suzu City in Japan#Earthquake #Japan #tsunami pic.twitter.com/1KH8D5yCTw — JAMES - ONTHERIGHT (@Jim_OnTheRight) January 1, 2024 భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. మొదట 5.7 తీవ్రతతో ఆ ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక దశలో తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. A #tsunami warning was issued after the #earthquake in #Japan. And warnings are being made that the western coastal areas should be evacuated and everyone should move to higher ground. pic.twitter.com/QLp5ImoSxe — Daenerys Targaryen (@ve95153819) January 1, 2024 ఉత్తర కొరియా, రష్యా కూడా.. ఈ భారీ భూకంపంతో జపాన్తో పాటు ఉత్తర కొరియా, రష్యాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలను రష్యా అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది. జపాన్కు సమీపంలో ఉన్న సఖాలిన్ ద్వీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రి వెల్లడించారు. ఇంకోవైపు రెండు మీటర్ల ఎత్తునన అలలు ఎగసి పడే అవకాశం ఉండడంతో ఉత్తర కొరియా తన రేడియో ఛానెల్ ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. Strange behaviour of birds at time of earthquake in #Japan. #Tsunami #石川県 #緊急地震速報 #地震 #震度7 #津波#SOS pic.twitter.com/qY3wLcDM7r — Yamaan Shahid (@realYamaan) January 1, 2024 I am deeply saddened by the news of the earthquake and the tsunami warning in Japan. I hope the people of Japan are safe and supported in this time of crisis.#Japan #Tsunami #earthquake #Ishikawa pic.twitter.com/SKfK1OtMhX — Darshan Ahirrao (@Darsh_D_Ahirrao) January 1, 2024 భారత్ ఎమర్జెన్సీ నెంబర్లు జపాన్లోని భారత రాయబార కార్యాలయం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. సహాయం కోసం ఆయా నెంబర్లను సంప్రదించాలని సూచించింది. Embassy has set up an emergency control room for anyone to contact in connection with the Earthquake and Tsunami on January I, 2024. The following Emergency numbers and email IDs may be contacted for any assistance. pic.twitter.com/oMkvbbJKEh — India in Japanインド大使館 (@IndianEmbTokyo) January 1, 2024 రేడియో ఆక్టివిటీ ఛాయల్లేవ్ సునామీ ఆందోళన నేపథ్యంలో.. అక్కడి న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రాల నుంచి అణుధార్మికత విడుదలై ఉంటుందా? అనే ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే.. ఇంకా భూకంప భయం వీడకపోవడంతో ఏదైనా జరగవచ్చే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Frightening visuals from Japan as it begins new year suffering a massive 7.6 magnitude earthquake. pic.twitter.com/e3gyiVkq8f — Science girl (@gunsnrosesgirl3) January 1, 2024 -
ఇండోనేషియా: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్
బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్కు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించింది. ఇక భూ అంతర్భాగంలో 518 కిలోమీటర్లు దిగువన కదలికలు సంభవించాయని సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. అయితే ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. మరోవైపు యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రత 7.1గా పేర్కొంది. ఇక.. సముద్ర గర్భంలో చాలా లోతులో కదలికలు సంభవించడంతో సునామీ (Tsunami) వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. Notable quake, preliminary info: M 7.1 - Bali Sea https://t.co/nBlmJ2rQia — USGS Earthquakes (@USGS_Quakes) August 28, 2023 ఇదిలా ఉంటే.. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలసీ (NCS) పేర్కొంది. అలాగే.. మంగళవారం వేకువజామున 3.50 గంటలకు అండమాన్ సముద్రంలో (Andaman Sea) కూడా భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. Earthquake of Magnitude:4.1, Occurred on 29-08-2023, 10:13:33 IST, Lat: 28.95 & Long: 83.26, Depth: 10 Km ,Location: 244km NW of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/xaeC85fU3v@Dr_Mishra1966@KirenRijiju@ndmaindia@Indiametdept pic.twitter.com/cTUd6bvz6h — National Center for Seismology (@NCS_Earthquake) August 29, 2023 -
ఫ్యుకుషిమా నుంచి అణు జలాల విడుదల
ఒకుమా: జపాన్ను 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం, సునామీతో దెబ్బ తిన్న ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య గురువారం నాడు తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ప్రకటించింది. వివిధ దశల్లో శుద్ధి చేసిన జలాలు అణు ప్లాంట్లోని కంట్రోల్ రూమ్ నుంచి విడుదల ప్రారంభానికి సంబంధించిన వీడియో కవరేజ్ను జపాన్ మీడియా లైవ్లో చూపింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నీటి విడుదల కార్యక్రమం మొదలైనట్టుగా అణుప్లాంట్ ఆపరేటర్ చెప్పారు. ఈ అణు జలాల విడుదలపై సొంత దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. నీటి విడుదలతో సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపదకు అపార నష్టం చేకూరుతుందని జపాన్, చైనా, దక్షిణకొరియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని జపాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే జపాన్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అణు ప్లాంట్ను మూసేయాలంటే జలాలు విడుదల చేయక తప్పదని స్పష్టం చేసింది. 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు వెయ్యి ట్యాంకుల్లో భద్రపరిచామని, ఆ ట్యాంకులకు ప్రమాదమేదైనా జరిగితే మరింత ముప్పు వాటిల్లుతుందని టెప్కో పేర్కొంది. అణు జలాలను శుద్ధి చేసి అవి సురక్షితమని తేలాక విడుదల చేస్తున్నట్టు సెంటర్ ఫర్ రేడియేషన్ రీసెర్చ్ డైరెక్టర్ టోనీ హూకర్ చెప్పారు. జపాన్ సీఫుడ్పై నిషేధం: చైనా జపాన్ది పూర్తిగా స్వార్థపూరిత, బాధ్యతారహిత చర్య అని చైనా మండిపడింది. జపాన్ నుంచి సీఫుడ్పై నిషేధం విధించింది. జపాన్ చేస్తున్న పనితో సముద్రంలో మత్స్య సంపదకి, వాతావరణానికి ఎంత ముప్పు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరని ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. జపాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ వివిధ దేశాలు జలాల విడుదలను ఖండిస్తున్నాయి. -
7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
అలస్కాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో యూఎస్లోని పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భూకంప తీవ్రత భూమిలోపల 9.3 కిలోమీటర్ల మేర సంభవించినట్లు పేర్కొన్నారు. అలస్కా ద్వీపకల్పంతో సహా అలూటియన్ దీవులు, కుక్ ఇన్లెట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇప్పుడే అంచనా వేయలేమని వెల్లడించారు. అలస్కా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా ఉంది. తరచూ భూకంపాలకు నిలయంగా మారుతోంది. Notable quake, preliminary info: M 7.4 - 106 km S of Sand Point, Alaska https://t.co/ftepDWDKb7 — USGS Earthquakes (@USGS_Quakes) July 16, 2023 అలస్కాలో చివరిసారిగా అత్యధికంగా 1964లో 9.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. అలస్కా ద్వీపకల్పం, యూఎస్ పశ్చిమ తీరం, హవాలీని సునామీ అతలాకుతలం చేసింది. 250 మందికి పైగా ప్రాణనష్టం జరిగింది. ఇదీ చదవండి: America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
ఉత్తరకొరియా మళ్లీ అణ్వస్త్ర డ్రోన్ పరీక్ష
సియోల్: అణుధార్మిక సునామీని సృష్టించగల అండర్వాటర్ డ్రోన్ను మరోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా తెలిపింది. ఈ కొత్త రకం డ్రోన్ హెయిల్–2ను శుక్రవారం తీర నగరం టంచోన్ వద్ద సుముద్ర జలాల్లో ప్రయోగించినట్లు వెల్లడించింది. నీటి అడుగున ఇది 71 గంటలకు పైగా ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని తెలిపింది. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను హెయిల్–2 తుత్తునియలు చేయగలదని అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. -
జపాన్లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.1 తీవ్రత..
టోక్యో: జపాన్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. ఉత్తర్ జపాన్లోని అమోరిలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే భూకంపం కారణంగా ఏమైనా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందా? అనే విషయాలపై మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. భూకంప తీవ్రత భారీగా నమోదైనప్పటికీ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. చదవండి: అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు' -
ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..
సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. దీని సాయంతో భారీ సునామీలు పుట్టించి తీరంలో నౌకాశ్రయాలనూ, సముద్ర మధ్యంలో శత్రు నౌకలను నాశనం చేయగల సామర్థ్యం తమకు సమకూరిందని అది చెబుతోంది. అదే నిజమైతే రష్యా తర్వాత ఈ సామర్థ్యమున్న రెండో దేశమవుతుంది. ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తే సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతుంది. దీనితో సముద్ర మధ్యంలో అయితే శత్రు నౌకలను నీట ముంచవచ్చు. అదే తీర ప్రాంతంలో ప్రయోగిస్తే సమీప నౌకాశ్రయాలతో పాటు నగరాలు, జనావాసాలు కూడా నామరూపాల్లేకుండా పోయే ప్రమాదముంది! కాకపోతే హెయిల్ను రష్యా అండర్ వాటర్ డ్రోన్ పొసెయ్డాన్తో ఏ మాత్రమూ పోల్చలేం. ఎందుకంటే అత్యాధునిక హంగులతో కూడిన పొసెయ్డాన్ను జలాంతర్గాముల నుంచీ ప్రయోగించవచ్చు. స్వయంచాలిత న్యూక్లియర్ ప్రొపెల్షన్ వ్యవస్థ సాయంతో ఎంతకాలమైనా ప్రయాణం చేయగల సత్తా దాని సొంతం. హెయిల్కు అంత సీన్ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న దక్షిణ కొరియాను బెదిరించేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉండఉండవచ్చన్నది వారి విశ్లేషణ. అణు డ్రోన్ను పరీక్షించాం: ఉత్తర కొరియా భారీ రేడియో ధార్మిక సునామీని పుట్టించగల అణుసామర్థ్యంతో కూడిన అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజ యవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది! ఈ ఆందోళనకర పరిణామం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ‘‘ఈ డ్రోన్ను తీరం వద్ద మోహరించవచ్చు. నౌకలపై సముద్రం లోపలికి తీసుకెళ్లీ ప్రయోగించవచ్చు. నీటి లోపల ఇది సృష్టించే పేలుడు దెబ్బకు పుట్టుకొచ్చే రేడియో ధార్మిక సునామీ నౌకాశ్రయాలతో పాటు నడి సముద్రంలో శత్రు యుద్ధ నౌకలను కూడా తుత్తునియలు చేయగలదు’’అని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ చెప్పుకొచ్చింది. ‘‘ఈ దిశగా మూడు రోజులుగా సాగుతున్న ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’అని తెలిపింది. టోర్పెడో వంటి పరికరం పక్కన కిమ్ నవ్వుతున్న ఫొటోను ఉత్తరకొరియా పత్రిక రొండొంగ్ సిన్మున్ ప్రచురించింది. ఆ పరికరమేమిటనేది వివరించలేదు. సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచి పడుతున్న ఫొటోలను కూడా ముద్రించింది. ‘‘ఈ అలలు డ్రోన్ మోసుకెళ్లిన అణ్వాయుధం పేలుడు ఫలితం. మంగళవారం ప్రయోగించిన ఈ డ్రోన్ నీటి అడుగున 60 గంటల పాటు ప్రయాణించి, 150మీటర్ల లోతులో లక్ష్యాన్ని ఛేదించింది’’అని పేర్కొంది. 2012 నుంచి అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్ను గత రెండేళ్లలో 50 సార్లకు పైగా పరీక్షించి చూసినట్లు తెలి పింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనలో విశ్వసనీయ తపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెయిల్ అంటే కొరియా భాషలో సునామీ. ఈ డ్రోన్ గురించి ఉత్తర కొరియా అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి! ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు మూల్యం తప్పదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ పరీక్ష గురించిన ప్రకటన వెలువడింది! కొరియా సముద్ర జలాల్లో విమానవాహక నౌకలను మోహరిస్తామని అమెరికా ప్రకటించడం తెలిసిందే. పొసెయ్డాన్.. రష్యా డ్రోన్.. ► ఇది అణు సామర్థ్యమున్న సూపర్ టోర్పెడో. చరిత్రలో అతిపెద్ద టోర్పెడో కూడా ఇదే! నాటో దళాలు దీన్ని కాన్యాన్గా పిలిచే పొసెయ్డాన్ను టోర్పెడో, డ్రోన్ రెండింటి క్రాస్ బ్రీడ్గా చెప్పవచ్చు. తొలి జత పొసెయ్డాన్ టోర్పెడోలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్టు గత జనవరిలో రష్యా స్వయంగా ప్రకటించింది. వీటిని బెల్ గొరోడ్ అణు జలాంతర్గామిలో మోహరిస్తామని పేర్కొంది. అయి తే పొసెయ్డాన్ తయారీ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018లోనే ప్రకటన చేశారు. ‘‘దీని రేంజ్ అపరిమితం. అంతేగాక సముద్రాల్లో అత్యంత అట్టడుగుల్లోకీ వెళ్లి దాడులు చేయ గల సత్తా దీని సొంతం. పైగా ప్రస్తుతమున్న అన్ని టోర్పెడోల కంటే కొన్ని రెట్లు ఎక్కువ వేగంతో, అదే సమయంలో ఏమా త్రం శబ్దం చేయకుండా దూసుకెళ్తుంది. తనంతతానుగా ప్రమాదాన్ని గుర్తించి ప్రయాణ మార్గాన్ని మార్చేసుకోగ లేదు. కనుక దీన్ని శత్రువు నాశనం చేయడం దాదాపుగా అసాధ్యం. సముద్రంలో దీన్ని ఎదుర్కోగల ఆయుధమే లేదు’’అని ధీమాగా పేర్కొన్నారు. రష్యాతో పాటు చైనా కూడా ఇలాంటివి తయారు చేసే పనిలో ఉందని అమెరికా అనుమానిస్తోంది. అయితే అమెరికా వద్ద ఇలాంటివి ఎప్పటినుంచో ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు! ► స్టేటస్–6 ఓషియానిక్ మల్టీపర్పస్ సిస్టంగా కూడా పిలిచే పొసెయ్డాన్ గురించి తెలిసింది చాలా తక్కువ. ► దాదాపు ఆరడుగుల వ్యాసార్థ్యం, 24 మీటర్ల పొడవు, 2 లక్షల పౌండ్ల బరువుండే దీన్ని అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. ► ఈ డ్రోన్లు ఎంత పెద్దవంటే అంతటి జలాంతర్గామిలో కేవలం ఆరంటే ఆరు మాత్రమే పడతాయట! ► ఇది అణు, సంప్రదాయ ఆయుధాలు రెండింటినీ మోసుకెళ్లగలదు. ► ఇందులో ఏకంగా ఓ అణు రియాక్టరే ఉంటుంది. దాని సాయంతో ఇది స్వయం చాలితంగా పని చేస్తుంది. ► పొసెయ్డాన్ శత్రు యుద్ధ నౌకలను, తీర ప్రాంతాల్లోని లక్ష్యాలను నాశనం చేస్తున్నట్టున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. ► అమెరికాలోని దాదాపు అన్ని తీర ప్రాంత నగరాలూ దీని పరిధిలోకి వస్తాయని రష్యా చెబుతోంది! ఏమిటీ అండర్ వాటర్ డ్రోన్? ► వీటిని ఒకరకంగా చిన్నపాటి మానవరహితజలాంతర్గాములుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సముద్ర గర్భంలో వరుస పేలుళ్ల ద్వారా అతి పెద్ద రాకాసి అలల్ని పుట్టించి పరిసర ప్రాంతాలను నీట ముంచేస్తాయి. ఇవి స్వయంచాలితాలు. యుద్ధనౌకలు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కంప్యూటర్లు, సెన్సర్ల ద్వారా వీటిని నియంత్రిస్తుంటారు. ఇలాంటి అండర్వాటర్ డ్రోన్లు 1950ల నుంచే ఉనికిలో ఉన్నట్టు్ట్ట బార్డ్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ద డ్రోన్ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ఇలాంటి డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అంచనా. మిలిటరీ డాట్కామ్ వివరాల మేరకు వీటిని జలాంతర్గాముల ద్వారా అమెరికా నేవీ 2015లో తొలిసారిగా మోహరించింది. ‘‘ఇది ప్రమాదకరమైన పనులెన్నింటినో అండర్వాటర్ డ్రోన్ గుట్టు గా చక్కబెట్టగలదు. ఒకవైపు వీటిని ప్రయోగించి శత్రు లక్ష్యాలను ఛేదించవచ్చు. శత్రువు దృష్టిని అటువైపు మళ్లించి ప్రధాన జలాంతర్గామి తన ప్రధాన లక్ష్యం మీద మరింత మెరుగ్గా దృష్టి సారించవచ్చు. అంటే రెట్టింపు ప్రయోజనమన్నమాట’’అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. -
విశాఖపట్నం : గంగమ్మా.. చల్లంగా చూడమ్మ (ఫొటోలు)
-
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
వామ్మో.. వందల అణు బాంబుల ఎఫెక్ట్తో బద్ధలైందా?
హుంగా టోంగా-హుంగా హాపై.. పదిరోజుల క్రితం దాకా పసిఫిక్ మహాసముద్రంలోని జనావాసరహిత దీవిగా ఉండేది. మరి ఇప్పుడో?.. ఏకంగా మ్యాప్ నుంచే కనుమరుగు అయిపోయింది. కారణం.. ఆ దీవిలోని అగ్నిపర్వతం భారీ శబ్ధాలతో బద్ధలైపోవడమే!. జనవరి 15వ తేదీన చిన్న దీవి దేశం టోంగాకు దగ్గర్లో ఉన్న ‘హుంగా టోంగా-హుంగా హాపై’ అగ్నిపర్వత దీవి.. మహాసముద్రం అడుగులోని అగ్నిపర్వతం బద్ధలుకావడంతో పూర్తిగా నాశనమైంది. ఆ ప్రభావం ఎంతగా ఉందంటే.. సముద్రం ముందుకు వచ్చి పెద్ద పెద్ద అలలతో సునామీ విరుచుకుపడింది. టోంగా రాజధాని నుకువాలోఫాపై దట్టమైన మందంతో విషపూరితమైన బూడిద అలుముకుంది. తాగే నీరు కలుషితం అయ్యింది. పంటలు దెబ్బతిన్నాయి. రెండు గ్రామాలు ఏకంగా జాడ లేకుండా సముద్ర గర్భంలో కలిసిపోయాయి!. ఈ ప్రకృతి విలయంపై నాసా సైంటిస్టులు ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు. టోంగా అగ్నిపర్వతం బద్ధలైన ఘటన.. వంద హిరోషిమా అణు బాంబు ఘటనలకు సమానమని నాసా పేర్కొంది. ఐదు నుంచి ముప్ఫై మెగాటన్నుల టీఎన్టీ(ఐదు నుంచి 30 మిలియన్ టన్నుల) పేలితే ఎలా ఉంటుందో.. అంత శక్తితో ఆ అగ్నిపర్వతం పేలింది. అందుకే అగ్ని పర్వత శకలాలు 40 కిలోమీటర్ల ఎత్తులో ఎగసిపడ్డాయి అని నాసా సైంటిస్టుల జిమ్ గార్విన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే 1945, ఆగష్టులో హిరోషిమా(జపాన్) పడిన ఆటం బాంబు 15 కిలోటన్నుల(15 వేల టన్నుల) టీఎన్టీ డ్యామేజ్ చేసింది. కేవలం ఒక్క నగరాన్ని మాత్రమే నామరూపాలు లేకుండా చేసింది. ఇప్పుడు అగ్నిపర్వతం ధాటికి సముద్రం కదిలి.. ఎక్కడో వేల కిలోమీరట్ల దూరంలోని తీరాల దగ్గర ప్రభావం చూపెట్టింది. ఇక టోంగాలో సునామీ ధాటికి ప్రాణ నష్టం పెద్దగా సంభవించకపోయినా!(స్పష్టత రావాల్సి ఉంది).. ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. జపాన్, న్యూజిలాండ్తోపాటు పసిఫిక్ తీరంలోని చాలా దేశాలు సునామీ అలర్ట్ జారీ చేసి.. 48 గంటల పరిశీలన తర్వాత విరమించుకున్నాయి. సంబంధిత వార్త: సునామీకి ఎదురీగిన తాత.. అందుకే ప్రపంచం జేజేలు -
ఏం సాహసం చేసినవ్ తాతా.. నీ తెగువకు సలాం
పిడుగులు పడ్డట్లు భారీ శబ్ధం.. ఆపై భూ ప్రకంపనలు.. హఠాత్తుగా ముందుకొచ్చిన సముద్రపు అలలతో సునామీని కళ్లారా వీక్షించింది టోంగా. పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వతం బద్ధలైన ఘటనతో ఆ చిన్న ద్వీప దేశానికి తీరని నష్టం వాటిల్లింది. అయితే సముద్రపు అలల్లో 27 గంటలపాటు ఈది.. ప్రాణాలతో బయటపడ్డ ఓ పెద్దాయన సాహసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత శనివారం పసిఫిక్లోని భారీ అగ్నిపర్వతం హుంగా టోంగ-హుంగ హాపయ్ అగ్నిపర్వతం బద్ధలైంది. ఆ ధాటికి సునామీ చెలరేగగా.. ఆ మహాసముద్రం అలలు వేల కిలోమీటర్ల దూరంలోని తీరాలను సైతం తాకాయి. ఇదిలా ఉంటే దగ్గర్లో ఉన్న టోంగాను అతలాకుతలం చేసింది ఈ ఘటన. అయితే సముద్రపు అలల్లో చిక్కుకుపోయిన 57 ఏళ్ల లిసలా ఫోలావ్.. తన చావు ఖాయమని అనుకున్నాడు. అలాగని చావుకి లొంగిపోలేదు. ఎలాగైనా బతకాలన్న తాపత్రయంతో వైకల్యాన్ని లెక్కచేయకుండా ప్రయత్నించి గెలిచాడు. టోంగా రాజధాని నుకువాలోఫాకు ఈశాన్యంవైపు 8 కి.మీ. దూరంలోఉంది అటాటా అనే ఓ చిన్న దీవి. ఈ దీవి జనాభా 60 మంది. లిసలా ఫోలావ్ తన కొడుకుతో పాటు ఆ దీవిలో జీవిస్తున్నాడు. వైకల్యం ఉన్న ఆ పెద్దాయన సరిగా నడవలేడు కూడా. సునామీ ఒక్కసారిగా విరుచుకుపడడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా నేల ప్రాంతం వైపు పరుగులు తీశారు. కానీ, ఆ పెద్దాయన మాత్రం పాపం నీటి ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. మొదట ఒడ్డులోని ఓ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడిన ఆ పెద్దాయన.. ఆ టైంలో దూరంగా కనిపిస్తున్న తన కొడుక్కి తన అరుపుల్ని వినిపించాలని ప్రయత్నించాడు. ఇంతలో రెండో అల భారీగా రావడంతో ఆయన సముద్రంలోకి కొట్టుకునిపోయాడు. ఇక తన పని అయిపోయిందని నీళ్లలో మునిగిపోతున్న ఆయన.. వచ్చిన కొద్దిపాటితో ఈతతో ప్రాణాల్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ప్రాణ తీపి ఆయన్ని అలా 27 గంటలపాటు ముందుకు తీసుకెళ్లింది. మధ్యలో తొమ్మిదిసార్లు నీటి అడుగుభాగానికి చేరుతూ జీనవర్మణ పోరాటం చేశాడట ఆ పెద్దాయన. చివరికి ఏడున్నర కిలోమీటర్లు ఆపసోపాలు పడుతూ ఈదాక.. టోంగాటపు నేల భాగానికి చేరుకున్నాడు. ఆ టైంలో రెస్క్యూ టీం ఆయన్ని గుర్తించి.. ఆస్పత్రికి తరలించింది. అలా పెద్దాయన మృత్యుంజయుడిగా బయటపడడంతో పాటు సోషల్ మీడియాలో హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అంత ఓర్పుతో ఆయన చేసిన ప్రయత్నం గురించి చర్చించుకుంటున్నారు. ఇంకొందరైతే రియల్ లైఫ్ అక్వామ్యాన్గా ఈ పెద్దాయన్ని అభివర్ణిస్తున్నారు. ప్రయత్నించకుండా ఫలితం ఆశించడం మనిషి నైజం. అది మారనంత వరకు జీవితంలో ముందుకు వెళ్లలేరన్న విషయం ఈ పెద్దాయన కథ ద్వారా స్పష్టమవుతోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. So this happened in Tonga today! Massive Underwater volcanic eruption sending shockwave across South Pacific as captured by Himawari Satellite! Tsunami just hit Tonga and some region of Fiji Island! Prayers for people there!#Tsunami pic.twitter.com/7Q4mRhNcVQ — Vishal Verma (@VishalVerma_9) January 15, 2022 ఇదిలా ఉంటే సునామీ ధాటికి లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా ద్వీపదేశం కుదేలు అయ్యింది. ముగ్గురు చనిపోయారని అధికారులు ప్రకటించగా.. తీర ప్రాంతంలోని నివాసాలు, రిసార్టులు ఘోరంగా దెబ్బతిన్నాయి. బయటి ప్రపంచంతో కమ్యూనికేషన్ పునరుద్ధరణ కోసం నెల టైం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
టోంగా సముద్రగర్భంలో.. అగ్నిపర్వతం పేలుడు
వెల్లింగ్టన్: దక్షిణ ఫసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పమైన టోంగాలో సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం శనివారం బద్దలవడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. సముద్రం లోపల ఉన్న హుంగా టోంగా హాపై అనే అగ్నిపర్వతం వరసగా రెండు రోజులు పేలడంతో టోంగా వ్యాప్తంగా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ బూడిద 19 కి.మీ.ఎత్తువరకు వ్యాపించినట్లు టోంగా జియోలాజికల్ సర్వే తెలిపింది. అమెరికా నుంచి జపాన్ వరకు తీరప్రాంతంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎంత నష్టం జరిగిందనేది తెలియలేదు. లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా తీరప్రాంతంలో భారీగా అలలు ముంచెత్తుతున్న వీడియోలను ప్రజలు సోషల్మీడియాలో షేర్చేశారు. ముప్పు తొలగిపోవడంతో అమెరికాలో సునామీ హెచ్చరికల్ని వెనక్కి తీసుకున్నారు. -
పసిఫిక్లో అల్లకల్లోలం.. భారీ శబ్ధాలతో సునామీ హెచ్చరికలు
పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు అలుముకున్నాయి. భారీ ప్రకంపనల కారణంగా.. సముద్ర జలాలు ముందుకు చొచ్చుకునిరాగా.. కొన్ని దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పసిఫిక్లో అనేక ద్వీపదేశాలు.. మహాసముద్ర అంతర్భాగంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. టోంగాకు సమీపాన అగ్నిపర్వతం హుంగా టోంగా-హుంగా హాపై హఠాత్తుగా బద్దలైంది. ది హుంగా టోంగా హాపై అగ్నిపర్వతం.. టోంగాన్ రాజధాని నుకువాలోఫాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. విస్ఫోటనం తాలూకు శబ్దాలు 8 నిమిషాల పాటు కొనసాగాయి. విస్ఫోటనం తీవ్రత ఎంతగా ఉందంటే, అక్కడికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దీవుల్లోనూ శబ్దాలు వినిపించాయట!. Stay safe everyone 🇹🇴 pic.twitter.com/OhrrxJmXAW — Dr Faka’iloatonga Taumoefolau (@sakakimoana) January 15, 2022 కాగా సముద్రంలో అగ్నిపర్వతం పేలుడును పలు శాటిలైట్లు చిత్రీకరించాయి. హిమావరీ శాటిలైట్ చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి న్యూజిలాండ్, టోంగా, ఫిజీ వంటి దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల వాసులు తమ నివాసాలను వదిలి వెళ్లాలని, ఎత్తయిన ప్రదేశాలకు చేరుకోవాలని పలు దేశాల్లో అప్రమత్తం చేస్తున్నాయి. శుక్రవారం సునామీ హెచ్చరికలు వెనక్కి తీసుకున్న కొన్ని గంటలకే.. ఈ పరిణామంతో మళ్లీ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. మరోవైపు కొన్ని పాత, ఫేక్ వీడియోలు సైతం సునామీ పేరిట వైరల్ అవుతున్నాయి. The volcanic eruption in Tonga captured by #Himawari satellite.. Massive!😳 pic.twitter.com/1qy4FJgpvM — Raj Bhagat P #Mapper4Life (@rajbhagatt) January 15, 2022 A second tsunami event near Tonga has triggering warnings for Australia, Fiji, New Zealand, Vanuatu, Samoa, Lord Howe and Norkfolk Island. https://t.co/j72Me4KLjv pic.twitter.com/JrnMkKH6wX — The Australian (@australian) January 15, 2022 -
విశాఖ సురక్షితం.. ఉపద్రవం ఉత్తదే
సాక్షి, విశాఖపట్నం: ‘‘దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో అత్యంత సురక్షిత నగరాల్లో విశాఖ ముందు వరుసలో ఉంటుంది. వందేళ్ల తర్వాత ఒకటి రెండు అడుగులు సముద్రమట్టం పెరిగినా ముంపునకు గురవుతుందన్న ఆందోళనైతే ఏమాత్రం లేదు..’’ ఇదీ జాతీయ సముద్ర అధ్యయన సంస్థ(ఎన్ఐఓ) విశ్రాంత శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు తేల్చి చెబుతున్న మాట. ‘నాసా’ అధ్యయనం ప్రకారం సముద్ర మట్టం పెరుగుతుందన్న ఆందోళన ఉన్నప్పటికీ అది స్వల్పంగా ముందుకు చొచ్చుకు వచ్చే వరకు మాత్రమే ప్రభావం ఉంటుంది కానీ విశాఖకు ముంపు ముప్పు ఉందన్న అవాస్తవ ప్రచారాలను ఎవరూ విశ్వసించవద్దని సూచిస్తున్నారు. భూతాపంతో.. నానాటికీ పెరుగుతున్న భూతాపం మానవాళిని అంపశయ్యపై ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ (ఐపీసీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. భూతాపం వల్ల ఉత్తర ధృవంలోని ఆర్కిటిక్ సముద్రంలో పలకలు క్రమంగా కరుగుతూ నీరుగా మారి సముద్రంలో చేరుతున్నాయని, దీనివల్ల నీటి మట్టాలు క్రమంగా పెరుగుతాయని పేర్కొంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల 2100 సంవత్సరంలో దేశంలోని కొచ్చి, భావ్నగర్, ముంబై, మంగళూరు, చెన్నైతో పాటు విశాఖపట్నంలోనూ సముద్ర మట్టాలు పెరిగే ముప్పు ఉందని హెచ్చరించింది. అయితే దీన్ని పట్టుకుని విష కథనాలు వండి వార్చేస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు నాసా చెప్పిన నిజమేంటి..? విశాఖకు నిజంగానే ఉపద్రవం ఉందా? అనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం.. నాసా ఏం చెప్పిందంటే..? 1988 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు, సముద్ర స్థితిగతులు, కర్బన ఉద్గారాలు మొదలైన అంశాలపై ఐపీసీసీ అధ్యయనం చేసి ఐక్యరాజ్యసమితికి నివేదిక అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా భూతాపం పెరుగుతుండటం వల్ల భవిష్యత్తులో మానవాళికి పెనుముప్పు ఎదురుకానుందని ఈ ఏడాది సర్వేలో హెచ్చరించింది. హిమనీ నదాలు కరిగి సముద్రంలో కలుస్తుండటం ఒక పరిణామమైతే, రుతుపవనాల్లో మార్పులు, భారీ తుపాన్లు కారణంగా వరదనీరు సముద్రంలోకి భారీగా చేరి నీటి మట్టాలు పెరగనున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్నంలో రానున్న వందేళ్లలో 1.77 అడుగుల ఎత్తున సముద్ర నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నది సారాంశం. విశాఖలో వాస్తవమేంటి..? నాసా చెప్పింది నిజమే. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రం ఉప్పొంగనుంది. ఫలితంగా మట్టాలు పెరిగి ముందుకు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. 2019లో ఎన్ఐవో నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2100 నాటికి ప్రస్తుత సముద్ర మట్టం కంటే 70 సెంటీమీటర్లు పెరిగే సూచనలున్నాయని వెల్లడించింది. ఇదే విషయాన్ని ఐపీసీసీ స్పష్టం చేసింది. ఇదే జరిగితే కోస్తా తీరంలో వందల కిలోమీటర్లు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే మరో 500 లేదా 600 ఏళ్ల వరకూ విశాఖకు ముంపు ముప్పు లేదన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే విశాఖ నగరం సముద్ర మట్టానికి 25 మీటర్ల ఎత్తులో ఉంది. వందేళ్ల తర్వాత నీటి మట్టం పెరిగేది కేవలం 1.77 అడుగులు. అంటే 0.532 మీటర్లు మాత్రమే. . దీనివల్ల విశాఖ మునిగిపోయే ప్రమాదం ఏమాత్రం లేదని శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు స్పష్టం చేస్తున్నారు. తీరం కోతకు గురవడం సాధారణమని పేర్కొంటున్నారు. విశాఖకు భూకంపాలు, సునామీలు వచ్చే ప్రమాదాలు లేవు. టెక్టానిక్స్ ప్రకారం లక్షల సంవత్సరాలకు జరగవచ్చన్నది ఒక అంచనా మాత్రమేనని చెబుతున్నారు. తీరం ఎందుకు కోతకు గురవుతుంది..? పరిశ్రమలు, వాహనాలు, యంత్రాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి వాయువులు భూ ఉపరితల వాతావరణంలో వలయంలా ఏర్పడ్డాయి. ఈ వలయం భూమి నుంచి బయటకు వెళ్లాల్సిన ఉష్ణోగ్రతను బంధించేయడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వాతావరణం వేడెక్కుతోంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని చెబుతారు. పోర్టులు, రిగ్గులు, హార్బర్లు కారణంగా సముద్రంలో సహజసిద్ధంగా ఉన్న నీటి గమనంపై ప్రభావితం చూపుతున్నాయి. దీనివల్ల ఇసుక ప్రవాహానికి అవరోధం ఏర్పడి కొన్ని తీరాల్లో మేట వేయడం, మరికొన్ని తీరాలు కోతకు గురవడం జరుగుతున్నాయి. దీంతో పాటు వరదలు, హిమనీ నదాల నుంచి నీటి ప్రవాహం పెరుగుతుండటం వల్ల సముద్ర మట్టం పెరుగుతోంది. ఆ నివేదిక ఓ అంచనా మాత్రమే.. ఐపీసీసీ నివేదికలు కేవలం వాతావరణంలో మార్పులను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయే కానీ శాస్త్రీయపరంగా రుజువైనవి కాదన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగే అవకాశాలున్నాయి. అదంతా దీర్ఘకాలిక ప్రభావం. ఇప్పటికిప్పుడు విశాఖ మునిగిపోయేంత ప్రమాదమేమీ లేదు. పైగా సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల అలాంటి భయాందోళనలు అనవసరం. హిమనీ నదాలు కరగడం వల్ల వచ్చే నీరు మయన్మార్ తీరంపై ముందుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఇబ్బంది ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై ప్రభావం తక్కువగా ఉంటుంది. ఓ సంస్థ నివేదికను పట్టుకుని ఇప్పటికిప్పుడు విశాఖ మునిగిపోతుందని ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదు. – ప్రొ.సునీత, డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రాలాజీ, ఓషనోగ్రఫీ పూర్వ హెచ్ఓడీ తీర భద్రతకు ప్రమాదం లేదు కోస్తా తీరంలో 2000 మీటర్ల వరకూ జరుగుతున్న పరిణామాలు, సముద్రంలో మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఏటా కొద్ది సెం.మీ. మేర సముద్ర మట్టం పెరుగుతుంది. దీనివల్ల తీరం కోతకు గురవుతుంది తప్ప నగరం మునిగిపోయేంత ప్రమాదం ఉండదు. ఎప్పుడో వందేళ్లకు సముద్రం కొంత ముందుకు వచ్చినా బీచ్ రోడ్డు వరకూ వచ్చే ఆస్కారం ఉంది తప్ప నగరంలోకి చొచ్చుకు రాదన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. గ్లోబల్ వార్మింగ్ మూలంగా తీరంలోని పారాదీప్, బంగ్లాదేశ్ తీరాలు ఎక్కువ కోతకు గురవుతాయి. తూర్పు కనుమలు ఉండటం వల్ల విశాఖ నగరానికి, తీర భద్రతకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు. – డా. కేఎస్ఆర్ మూర్తి, ఎన్ఐఓ రిటైర్డ్ సైంటిస్ట్ కోతను నియంత్రించే అవకాశాలున్నాయా? తీరం కోతను నియంత్రించేందుకు అనేక అవకాశాలున్నాయి. దీనిపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఆ ప్రాంత తీరం, భౌగోళిక, సముద్రం పరిస్థితులను అనుసరించి వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. ప్రస్తుతం విశాఖ తీరంలో డ్రెడ్జింగ్ చేపడుతున్నారు. కోతకు గురికాకుండా చాలా ప్రాంతాల్లో సీ వాల్స్ (సముద్రపు గోడలు) నిర్మిస్తున్నారు. బీచ్ ఫ్రంట్ రీ డెవలప్మెంట్లో భాగంగా ఆర్కే బీచ్లో 3 కి.మీ. మేర సీవాల్ నిర్మించేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సీఆర్జెడ్ అనుమతులు రావాల్సి ఉంది. కోతను నియంత్రించేందుకు అనుసరిస్తున్న వివిధ పద్ధతులు ఇవీ.. గ్రోయెన్స్: సముద్ర ప్రవాహ అవక్షేప కదలికలను పరిమితం చేస్తూ కోతకు గురవుతుండగా ఏర్పాటు చేసే దృఢమైన హైడ్రాలిక్ నిర్మాణమిది. చెక్క, కాంక్రీట్ లేదా రాతితో గ్రోయెన్స్ నిర్మిస్తారు. స్పెయిన్లోని కేటలోనియా, నెదర్లాండ్స్, ఇంగ్లండ్, బ్రిటిష్ కొలంబియా, పోలాండ్ బీచ్లలో ఏర్పాటు చేశారు. కర్వ్డ్ సీ వాల్: అలల తీవ్రతను తగ్గించి తీరం కోతకు గురికాకుండా కర్వ్డ్ సీ వాల్స్ నిర్మిస్తారు. వక్రంగా ఉండే ఈ గోడలు కెరటాల తీవ్రతను బలహీనపరచడం ద్వారా ఇసుక కొట్టుకుపోకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా తీరం కోతకు గురికాదు. యూకే, పోలాండ్లోని బీచ్లలో వీటిని నిర్మించారు. మౌండ్ సీవాల్: కాంక్రీట్ బ్లాక్స్, రాళ్లతో తక్కువ ధరతో వీటిని నిర్మించవచ్చు. ఈ బ్లాక్స్ను అలలు తాకి.. బ్లాక్స్ మధ్యలో ఉన్న ఖాళీల్లోకి వెళ్లడం వల్ల వాటి తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా తీరం కోతకు గురికాకుండా ఉంటుంది. ఇవి నెదర్లాండ్స్, ఇంగ్లండ్ తీరాల్లో ఉన్నాయి. బ్రేక్ వాటర్: అలలను ఒడ్డుకు చేరకముందే చీల్చడం వల్ల వాటి తీవ్రత తగ్గి సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా కోత సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇందుకు బ్రేక్వాటర్ సిస్టమ్ను అవలంబిస్తున్నారు. రాళ్లు, కాంక్రీట్ దిమ్మెలతోనూ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇవి విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోనూ, పోర్టు పరిసరాల్లో ఉన్నాయి. వెర్టికల్ సీ వాల్: సముద్రంలో ఆటుపోట్ల సమయంలో తరంగాల ఉధృతిని తట్టుకునేందుకు వీటిని నిర్మిస్తారు. భారీ అలలను కూడా నియంత్రించగల సామర్థ్యం వెర్టికల్ సీ వాల్స్కి ఉంటుంది. ఇవి ప్రస్తుతం ఆస్ట్రేలియా, ముంబై తీరాల్లో ఉన్నాయి. -
అంతరిక్షంలో అంతుచిక్కని సునామీ..
వాషింగ్టన్: అంతరిక్షంలో అంతుచిక్కని సునామీని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సునామీలు బ్లాక్హోల్స్ వల్ల సంభవిస్తున్నాయని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ స్టిమ్యులేషన్ ఆధారంగా ఈ సునామీలను గుర్తించినట్లు వారు వెల్లడించారు. బ్లాక్హోల్స్ గురుత్వాకర్షణ నుంచి వాయువులు తప్పించుకోవడం, రేడియేషన్ వల్ల భారీ స్థాయిలో సునామీ ఏర్పడుతుందని తేల్చారు. ఇది దాదాపు పది కాంతి సంవత్సరాల వరకూ విస్తరించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతరిక్షంలో చాలా బ్లాక్హోల్స్ ఇలాంటి సునామీలను సృష్టిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. -
Yaas Cyclone: తుపానా ? సునామీనా ?
సునామీని మించిన బీభత్సం సృష్టిస్తోంది బంగళాఖాతం. యాస్ తుపాను దాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు, హోరున వినిపిస్తున శబ్ధాలు 2004 నాటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. పౌర్ణమి , చంద్ర గ్రహణం ఏర్పడిన రోజే యాస్ తుపాను తీరానికి చేరువగా రావడంతో రాకాసి అలలు తీరాన్ని ముంచెత్తాయి. సముద్రానికి, తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల మధ్య సరిహద్దులు చెరిపేశాయి.తీరం దాటేప్పుడు ప్రళయాకారంగా మారిన సముద్రం వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. తుపాను తీరం దాటుతున్నప్పుడు సముద్రం ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ వీడియోలో చూడండి చదవండి: yaas cyclone ప్రచండ గాలులు yaas cyclone తుపాను బీభత్సం #YaasCyclone video. pic.twitter.com/Jcta8Bh3KN — Mr Logician #Maskup 🇮🇳 (@MrLogician_) May 26, 2021 -
న్యూజిలాండ్లో భారీ భూకంపం
ఆక్లాండ్: న్యూజిలాండ్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ మీద దీని తీవ్రత 7.3గా నమోదయ్యింది. శుక్రవారం తెల్లవారుజామున న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి తూర్పుగా భూకంపం సంభవించినట్లు పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం (పీటీడబ్ల్యూసీ) వెల్లడించింది. అమెరికన్ జియోలాజికల్ సర్వే ప్రారంభంలో ఈ భూకంపం తీవ్రతను 7.3గా పేర్కొన్నది.. ఆ తరువాత దానిని 6.9కి సవరించింది. 10 కిలోమీటర్ల (6 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని తెలిపింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని పీటీడబ్ల్యూసీ తెలిపింది.. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. చదవండి: ఊగిపోయిన రాహుల్ గాంధీ గది! -
భారీ భూకంపం
-
జపాన్లో భూకంపం..
టోక్యో : జపాన్ దేశ తూర్పుతీర ప్రాంతం మియాగీలో సోమవారం తెల్లవారుజామున 5:30 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైందని అధికారులు ప్రకటించారు. 50 కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించింనట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే భూ ప్రకంపనల తర్వాత సునామీ హెచ్చరికలు రాలేదని స్పష్టం చేశారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా తక్కువే అని పేర్కొన్నారు. అయితే గతంలో 2011లో మియాగి ప్రాంతంలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా సునామి ఏర్పడి భారీ నష్టాన్ని మిగిల్చింది. దీని వల్ల దాదాపు 16,000 మంది ప్రాణాలు కోల్పోయారు. -
దరికి రాబోకు సు'నా'మీ!
కడలి తీరంలో సునామీ విలయతాండవం సృష్టించి నేటికి సరిగ్గా 15 ఏళ్లు. 2004 డిసెంబర్ 26న సంభవించిన జలప్రళయం.. ఆ రాకాసి అలల చేదు జ్ఞాపకాలు నేటికీ తీర ప్రాంతవాసులను వెంటాడుతూనే ఉన్నాయి. ఉవ్వెత్తున ఎగసి, ఉప్పెనలా వచ్చి మత్స్యకారుల గ్రామాలను అతలాకుతలం చేసిన సునామీ తీరంలో నిలిపిన బోట్లు, వలలను తనలో కలిపేసు కుంది.జిల్లాలో 36 మందిని పొట్టన పెట్టుకుంది. చీరాల: సునామీ కెరటాల బీభత్సానికి 15 ఏళ్లు నిండాయి. 2004 డిసెంబర్ 26న సునామీ సృష్టించిన జలప్రళయం జిల్లాలో 36 మందిని పొట్టనపెట్టు కుంది. 2004 డిసెంబర్ 25న అర్ధరాత్రి ఇండోనేషియాలో వచ్చిన భూకంపం సముద్రంలో సునామీకి కారణమైంది. దీని ప్రభావంతో జిల్లాలో 102 కిలోమీటర్ల పొడవు ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో భయోత్పాతం సంభవించింది. ఉదయం 7 గంటల సమయంలో ఒకసారి, 9 గంటల సమయంలో మరోసారి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసి, ఉప్పెనలా వచ్చి మత్స్యకారుల గ్రామాలను అతలాకుతలం చేశాయి. తీరంలో నిలిపిన బోట్లు, వలలు, ఇంజన్లను తనలో కలిపేసు కుంది. ఇళ్ళల్లోకి చొచ్చు కొచ్చిన సముద్ర జలాల నుంచి ప్రాణాలను దక్కించుకునేందుకు మత్స్యకారులు ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని మెరక ప్రాంతాలకు పరుగులు తీశారు. వేటపాలెం మండలంలోనే అత్యధిక మరణాలు: అత్యధికంగా వేటపాలెం మండలంలో 12 మంది మృత్యువాత పడ్డారు. పొట్టి సుబ్బయ్యపాలెం, రామాపురం, కఠారివారి పాలెం, రామచంద్రాపురం సముద్రతీర మత్స్యకార గ్రామాల్లో అది ఒక విషాధ దినం. ఆరోజు ఉదయాన్నే మత్స్యకారులు వేటకెళ్లి తమ వలల్లో పడిన చేపలను సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి వేరు చేస్తున్నారు. అది ఆదివారం కావడంతో తల్లిదండ్రులతో వారి పిల్లలు సముద్రతీరంలో ఆడుకోవడానికి వెళ్లారు. మత్స్యకారులు చేపలను గ్రేడింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు ఇరవై అడుగుల ఎత్తులో కెరటం సముద్రం నుంచి తీరానికి భీకర శబ్ధం చేసుకుంటూ వచ్చి పైన పడింది. ఇది గమనించని మత్స్యకారులు, వారిపిల్లలు ఆ కెరటం తాకిడికి నీటిలో కొట్టుకు పోయారు. అంతేగాక తీరం వెంట ఉంచిన పడవలు, బోట్లు గల్లంతయ్యాయి. నిమిషాల వ్యవధిలో ఈఘోర కలి జరిగింది. జిల్లాలో అత్యధికంగా ఈ జలప్రళయానికి వేటపాలెం మండలంలో పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామంలో పది మంది, రామాపురంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రెండు కుటుంబాల్లో మాత్రం ఇద్దరిద్దరు మృతి చెందారు. పొట్టిసుబ్బయ్య పాలెంలో మృతిచెందిన వారిలో కొండూరి చిట్టిబాబు, వాయిల శ్రీనివాసరావు, కొండూరి నారాయణమ్మ, వాయిల అన్నపూర్ణ, వాయిల రాములమ్మ, వాయిల అంకమ్మ, చిన్న పిల్లలు ఆవుల రాజేశ్వరి, బుచ్చంగారి విజయ, బుచ్చంగారి నరసయ్య, కొండూరి తిరుపాలు మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వాయిల శ్రీనివాసరావు, ఈయన కూతురు అంకమ్మ ఉన్నారు. బుచ్చంగారి విజయ, నరసయ్య ఉన్నారు. వీరు కాక మరో ఇద్దరు రామాపురం తీరంలో మృతి చెందారు. పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రతీరం వద్ద సునామీకి గుర్తుగా మృతవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. దీని వద్ద ఏటా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు, గ్రామప్రజలు శ్రద్ధాంజలి ఘటిస్తుంటారు. ఉలవపాడు మండల పరిధిలో.. ఉలవపాడు: మండల పరిధిలో సుమారు 12 కిలోమీటర్లు మేర తీరప్రాంతం ఉంది. 14 గ్రామాలు తీరం వెంబడి ఉన్నాయి. సునామీ రూపంలో ఉదయం సముద్రం బయటకు వస్తుందన్న సమాచారం వచ్చిన వెంటనే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వెనుకకు వచ్చేశారు. ఈ మండలంలో గ్రామాలు కాస్త దూరంగా ఉండడంతో బకింగ్హామ్ కెనాల్ వరకు సముద్రపు నీరు వచ్చి వెనుకకు వెళ్లిపోయింది. పగలు ఈ ప్రమాదం రావడం వల్ల కాస్త ప్రాణ హాని జరగనప్పటికీ తీరప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోయారు. ఎవరూ గ్రామాల వద్దకు వచ్చే పరిస్థితి లేదు. అధికారులు సైతం నీరు వచ్చి వెళ్లిన తరువాత వచ్చారు కానీ ముందుగా ఎవరూ రాలేదు. ఇప్పుడు తలచుకున్నా...భయమేస్తుంది: సునామీ అనే పేరును ఎప్పుడు తలచుకున్నా నాటి జ్ఞాపకాలు భయపెడతాయి అంటున్నారు తీరప్రాంత ప్రజలు. ఆ సమయంలో భోజనం లేక చాలా ఇబ్బందుల పడ్డాం. తరువాత ఆయా గ్రామాల నుంచి ఉలవపాడుకు లారీల్లో తరలించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతులు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో మత్స్యకార గ్రామాలకు అండగా పలు సంస్థలు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోర్టు సునామీ కాలనీ పేరుతో బట్టి సోమయ్య పాలెంలో లాయర్లు మత్స్యకారులకు గృహాలు నిర్మించారు. కాసా సంస్థ ఆధ్వర్యంలో తీర ప్రాంతంలో ఉన్న గిరిజన కాలనీల్లో పక్కా భవనాలను నిర్మించారు. సునామీ వచ్చిన రోజును తలచుకుంటేనే అంతా నిశబ్ధ వాతావరణం, భయం మత్స్యకారుల్లో కనిపిస్తుంది. మరొక్కమారు తమ దరికి రాబోకు సునామీ అంటున్నారు తీరప్రాంత గ్రామ ప్రజలు. పాకల, ఊళ్లపాలెం తీరంలో13 మంది దుర్మరణం సింగరాయకొండ: కనీవిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా రాకాసి అలలు తీరాన్ని ముంచెత్తటంతో 13 మంది మృత్యువాత పడి నేటికి 15 సంవత్సరాలు. 2004 డిసెంబరు 26వ తేదీ వరకూ సునామి అంటే ఎవరికీ ఏమీ తెలియదు. మత్స్యకారులు పరిగెత్తుకుంటూ వచ్చి అలలు తాటి చెట్టంత ఎగసి పడుతున్నాయని చెబితే అందరు చెప్పిన వ్యక్తిని పిచ్చివాడిలాగా చూశారు. చివరికి వాస్తవం తెలుసుకుని హడలిపోయారు. ఇది జరిగి ఒకటిన్నర దశాబ్ధం అవుతున్నా నేటికీ మత్యకారులు ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ పలువురు కన్నీటి పర్యంత మవుతున్నారు. సముద్ర స్నానానికి వచ్చి ఎనిమిది మందిమృత్యువాత: మండలంలో పాకల తీరం 15 ఏళ్ల క్రితం అభివృద్ధి చెందలేదు. అప్పటికి కందుకూరుకు చెందిన ముస్లింలు 8 మంది సముద్రస్నానానికి తీరానికి వచ్చారు. వారి దురదృష్టం ఒక్కసారిగా రాకాసి అలలు వారి ప్రాణాలను హరించివేశాయి. ఇది జరిగిన తరువాత చాలా రోజుల పాటు ఎవరూ తీరానికి సముద్ర స్నానానికి వెళ్లలేదు. కానీ ప్రస్తుతం బీచ్ బాగా అభివృద్ధి చెందటంతో ఆదివారం కాగానే తీరానికి భారీగా పర్యాటకులు సముద్రస్నానానికి వస్తున్నారు. ఐదుగురిని బలిగొన్న రాకాసి అలలు:రాకాసి అలల తాకిడికి ఊళ్లపాలెంనకు చెందిన గొల్లపోతు ఆదిలక్ష్మి ఇద్దరు కూతుళ్లతో పాటు మరో ముగ్గురు కన్నా మంగమ్మ, కన్నా స్వాములమ్మ, అయిల శ్రావణిలు కూడా మృతి చెందారు. వీరు ముగ్గురు తమ భర్తలు ఎండ్రకాయలు వేటాడితేగా వారికి భోజనం తీసుకుని వెళ్లారు. తమవారు ఎండ్రకాయలు వల నుంచి వేరు చేయడాన్ని చూస్తూ ఒడ్డున ఉండగా ఒక్కసారి వచ్చిన అలలు ఆ ముగ్గురిని నెట్టి వేశాయి. దీంతో తీరం వద్ద చేపలు నిల్వ చేసుకునేందుకు వీలుగా నిర్మిస్తున్న షెడ్డు ఇనుప చువ్వలు గుచ్చుకుని వీరు ముగ్గురు చనిపోయారు. అయితే వారి భర్తలు మాత్రం అలల నుంచి తమను తాము రక్షించుకుని బయటపడగలిగారు. పెనుప్రమాదం తప్పింది: వాస్తవానికి ఆరోజు ఆదివారం కావటంతో సింగరాయకొండకు చెందిన ఆర్యవైశ్యులు ఉలవపాడు మండలం కరేడు తీరానికి విహార యాత్రకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ కార్యక్రమం రద్దయింది. అదే కనుక విహారయాత్రకు వెళ్లుంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదోనని ఆర్యవైశ్యులు నేటికి చర్చించుకుంటున్నారు. నా ఇద్దరు బిడ్డలను మింగేసింది ఆరోజు మా ముగ్గురు కుమార్తెలు రాజ్యం, అపర్ణ, అనితలను తీసుకుని భర్తతో కలిసి నేను ఉప్పు కొఠారుల్లో పనికి వెళ్లాను. ఆ సమయంలో నా భర్త గోపాల్ పనిమీద వేరే చోటికి వెళ్లాడు. నేను కొద్ది దూరంలో ఉన్న ఆయిల్ ఇంజన్లో డీజిల్ పోయడానికి వెళ్లి ఆయిల్ క్యాన్ కోసం ముందుకు వంగాను. అంతే ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలలు మాపై విరుచుకుపడ్డాయి. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోగా గుంటలో పడిపోయాను. తరువాత కొంతసేపటికి మరో అల వచ్చి ముందుకు నెట్టడంతో గుంటలో నుంచి పైకివచ్చాను. ఆ సమయంలో అలలకు సమీపంలో ఉన్న ఈత చెట్టు ముందుకు వంగటంతో వెంటనే చీరె సాయంతో ఈత చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాను. తరువాత నా కూతుళ్ల కోసం చూడగా సమీపంలోని కాలువ గట్టు మీద చిన్నమ్మాయి అనిత నించుని కనిపించింది. ఆ సంఘటనలో మిగిలిన ఇద్దరు కూతుళ్లు చనిపోయారు (అంటూ గతాన్ని గుర్తు చేసుకుని విలపించింది). అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మా కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అయితే మా చిన్నకూతురు అలల నుంచి ఏవిధంగా బతికి బయటపడిందో ఇప్పటికీ మిస్టరీగా ఉంది. తర్వాత నా భర్త చనిపోయాడు. కూతురుకు వివాహం చేశాను. కొడుకు ఒంగోలులో ఉంటున్నాడు. గొల్లపోతు ఆదిలక్ష్మి, ఊళ్లపాలెం,ఉలవపాడు మండలం -
ఫిలిప్పీన్స్ను వణికించిన భారీ భూకంపం
-
ఫిలిప్పీన్స్ను వణికించిన భారీ భూకంపం
మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలోని మిండనావ్ ద్వీపంలో ఈ భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. దక్షిణ భాగంలో పెద్ద నగరమైన దావావోకు 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైందని, అయితే సునామీ వచ్చే సూచనలేమీ లేవని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టంచేసింది. ప్రకంపనల ధాటికి పడాడా నగరం భారీగా దెబ్బతింది. కాగా భూకంపం సంభవించినప్పుడు ఆరేళ్ల చిన్నారి ఇంట్లో ఉండిపోయింది. భూ ప్రకంపనలకు భవనం కూలిపోవడంతో ఆమె మృతి చెందినట్లు ప్రావిన్స్ గవర్నర్ డగ్లస్ కాగాస్ తెలిపారు. ఈ క్రమంలో శిథిలాల కింద చిక్కుకొని మరణించిన ఆ చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. అలాగే పాడడలోని ఒక మార్కెట్లో భవనం కూలి ఇద్దరు మృతి చెందినట్లు ఫైర్ సర్వీస్ డైరెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్ శామ్యూల్ టాడియో ధ్రువీకరించారు. ఇక భూకంపంతో నగరంలోని ఆస్పత్రుల నుంచి రోగులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నించారు. పలు షాపింగ్ మాల్స్లోని ప్రజలు కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. కూలిపోయిన భవనాల కింద ఉన్నవారిని అధికారులు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే కూడా భూకంపంలో చిక్కుకున్నారని, అయితే గాయాలేమీ కాలేదని అధికారులు స్పష్టంచేశారు. దేశ ప్రథమ మహిళ కూడా ఆ సమయంలో ప్రయణంలో ఉన్నారని, అయితే ఆమెకూ ఏమీ కాలేదని తెలిపారు. ఫిలిప్పీన్స్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం మూలాన ఆ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. గత అక్టోబర్లో కూడా ఫిలిప్పీన్స్ను భారీ భూకంపం తాకింది. మరోవైపు భూకంపం వచ్చినప్పుడు ఓ హోటల్లోని స్విమ్మింగ్ ఫూల్ నుంచి నీళ్లు బయటకు వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
గోడను అడ్డుపెట్టి సునామీని ఆపగలరా?
సునామీ అంటే... సముద్రంలో ఒక విస్ఫోటం జరిగితే ఏమవుతుంది? అంతెత్తు నుంచి ఒక పర్వత శిఖరం సముద్రంలోకి ఒరిగిపోతే ఏం జరుగుతుంది? సముద్ర తీర ప్రాంతంలో ఉండే అగ్ని పర్వతాలు హఠాత్తుగా బద్దలైతే ఫలితమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. అదే సునామీ. సముద్రపు అలలు నోరు తెరుచుకున్న రాకాసిలా విరుచుకుపడి ఊళ్లకు ఊళ్లను ముంచేయడాన్ని సునామీ అంటారు. 2004లో తొలిసారిగా భారత్ సునామీని కళ్ల చూసింది. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై కూడా ప్రభావం పడింది. ఇండోనేసియా సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం తీవ్రతకి సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు ఎగిసిపడి క్షణాల్లో మనుషుల్ని మింగేశాయి. సునామీల చుట్టూ నెలకొని ఉన్న వాస్తవాలేంటో ఓ సారి చూద్దాం. సునామీ నాలుగు రకాలుగా ముంచుకొస్తుంది. సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు, కొండచరియలు సముద్రంలో విరిగిపడినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, ఉల్కాపాతం సంభవించినప్పుడు (ఇది అత్యంత అరుదు) సునామీలు ఏర్పడతాయి. సునామీ అన్న పదం జపనీస్ భాషకు చెందింది. హార్బర్ కెరటం అని దీని అర్థం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్తో ఇది సమానం. ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది.2004లో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ చరిత్రలోనే అత్యంత భయంకరమైంది. ఇండోనేసియా కేంద్రంగా సుమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం. ఈ భూకంపంతో సముద్రంలో నింగికెగిసిన మృత్యు కెరటాలు తీర ప్రాంతంలో ఉన్న 11 దేశాలను ముంచేశాయి. 2 లక్షల 83 వేల మందిని రాకాసి అలలు పొట్టన పెట్టుకున్నాయి. గోడను అడ్డుపెట్టి సునామీని ఆపగలరా? తుపాను ముందు సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. కానీ కొన్ని గంటల్లోనే అంతా నాశనమైపోతుంది. సునామీలు అంతే. సునామీ రావడానికి ముందు సముద్రపు ఘోష వినిపించదు. ఎటు చూసినా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. మొదట నెమ్మదిగా ముందుకొచ్చే అలలు క్రమక్రమంగా తీవ్రరూపం దాలుస్తాయి. రాకాసి అలలుగా మారి క్షణాల్లో అంతా ముంచేస్తాయి. జపాన్లో ఇలా నిశ్శబ్దంగా భయం పుట్టించే సునామీలు సర్వసాధారణం. సునామీలు సంభవించడంలో ఆ దేశం రికార్డు సృష్టించింది. సునామీ హెచ్చరికలు రాగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జపాన్లో పిల్లలకు ఉగ్గుపాలతో నేర్పిస్తారు. కేవలం సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ నిర్వహణ కోసమే ఆ దేశం 2 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. ఆనకట్ట కట్టకపోతే ఏ నదికి చరిత్ర ఉండదన్న సామెతను జపాన్ ప్రభుత్వం ఎలా ఆకళింపు చేసుకుందో ఏమో కానీ, గోడలు కట్టేసి సునామీని ఆపేయాలనుకుంది. జపాన్లో రేవు పట్టణమైన అనోయ్లో సముద్ర తీరం వెంబడి 4.5 మీటర్ల గోడను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించింది. ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవ నిర్మాణాలు ఎగిరిపోవడం ఎంతసేపు. అదేవిధంగా ఈ సముద్రపు గోడని 1993లో జపాన్ని ముంచెత్తిన సునామీ ధ్వంసం చేసింది. అయినా పట్టు వదలని జపనీయులు తీర ప్రాంతాల్లో కాంక్రీట్ గోడల్ని కట్టే కార్యక్రమంలోనే ఉన్నారు. ఇక జపాన్ తీరప్రాంతమైన టొహోకూలో 2011లో వచ్చిన భూకంపం ఆ తర్వాత వచ్చిన సునామీ ప్రపంచ విపత్తుల చరిత్రలోనే భారీగా ఆర్థిక మూల్యం చెల్లించుకుంది. ఈ సునామీతో 23,200 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. సునామీల కారణంగా జపాన్ అణు విద్యుత్ ప్లాంట్లన్నింటినీ మూసివేసింది. సునామీ.. పర్యావరణ పాఠాలు 2004, డిసెంబర్ 26. ఆ రోజు బాక్సింగ్ డే. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భీకరంగా విరుచుకుపడిన సునామీ 11 దేశాలతో ఆటాడుకుంది. సముద్రానికి 50 కి.మీ. దూరంలో ఉన్న ఊళ్లను ముంచేసింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టమే కాదు పర్యావరణానికి కూడా చెప్పలేనంత నష్టం జరిగింది. దాని ప్రభావం నుంచి చాలా దేశాలు ఇంకా కోలుకోలేని దుస్థితి. మంచినీళ్లు ఉప్పగా మారిపోయాయి. భూములు ధ్వంసమయ్యాయి. అడవులు కనుమరుగయ్యాయి. వ్యవసాయ భూములు, మడ అడవులు, పగడపు దిబ్బలు నాశనమయ్యాయి. అన్నింటిని మించి సునామీ ఊళ్లకు ఊళ్లనే నాశనం చేయడంతో ఏర్పడిన శిథిలాలను తొలగించడం అన్ని దేశాలకు శక్తికి మించిన సమస్యగా మారింది. ఈ శిథిలాలను, వ్యర్థాలను పర్యావరణాన్ని కలుషితం చేయకుండా రీ సైక్లింగ్ చేయడంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. ఈ శిథిలాల నుంచి విడుదలయ్యే గ్యాస్, రసాయనాలు వాయు కాలుష్యాన్ని పెంచేశాయి. ఇక భూములన్నీ ఉప్పుగా మారడంతో సునామీ ప్రభావిత ప్రాంతాల్లో పంటలు పండటమే గగనంగా మారింది. నదులు, సరస్సులు, బావులు, చెరువుల్లో నీళ్లు ఉప్పుగా మారడంతో తాగు నీటి సమస్య కూడా తలెత్తింది. మాల్దీవులు, శ్రీలంక, ఇండోనేసియాలో చమురు కేంద్రాలు ధ్వంసం కావడం కూడా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ సునామీ వచ్చి 15 ఏళ్లు అవుతున్నా పలు తీర ప్రాంతాల్లో పర్యావరణం సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు సహాయం అందించంపైనే దృష్టి ఉంటుంది. అయితే సునామీ తర్వాత మాత్రం పర్యావరణాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి ఉంచాలన్నది నిపుణుల మాట. ఇందుకోసం బాధితులు, అక్కడ ప్రభుత్వాల్లో అవగాహన పెంచాలి. విపత్తుల నుంచి బయట పడ్డాక పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక సహకారంతో జీవ వైవిధ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. -
కోల్డ్ బ్లాస్ట్...మంచుసునామీ
సునామీ సృష్టించే విధ్వంసాన్ని మనమెరుగుదుం. కానీ చల్లటి మంచు కూడా సునామీని సృష్టించగలదని ఊహించలేం. ఉన్నట్టుండి తెల్లటి మంచుకొండ మనఇళ్లను తొలుచుకొని లోపలికి చొచ్చుకొస్తుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులే మంచు సునామీకి కారణం. గుట్టలుగా కొట్టుకొచ్చే ఈ మంచు మరో మంచుపర్వతాన్ని తలపించేలా కుప్పగా పడుతుంది. ఈ మంచుతుపానుని మించిన మంచు సునామీ ఇళ్లనూ, ఊళ్లనూ కమ్మేస్తుంది. మంచు సునామీ ఎత్తు 30 అడుగులకి మించి కూడా ఉంటుంది. సాధారణంగా శీతాకాలంలో ధృవప్రాంతాల్లో ఈ మంచు సునామీలు వస్తుంటాయి. మంచు సునామీలను 1822లోనే గుర్తించారు. మంచు సునామీలనే ‘‘ఐస్ షక్షవ్స్’’, ఇవూ అని కూడా పిలుస్తారు. దాదాపు గంటకు 74 మైళ్ల వేగంతో ఈ మంచు సునామీ వస్తుంది. ఇటీవల నార్త్ అమెరికా, కెనడాల్లో మంచు సునామీ కారణంగా తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఎరీ సరస్సు, ఓంటారియో సరస్సుల్లో వచ్చిన మంచు సునామీ కారణంగా ఇళ్లు కొట్టుకుపోయాయి. 30 అడుగుల ఎత్తువరకు మంచు వరసగా గోడకట్టినట్టు కుప్పలుగాపడిపోయింది. న్యూయార్క్ స్టేట్లోని హూవర్ బీచ్లో వచ్చిన మంచు సునామీ ఆ ప్రాంతంలోని ప్రజల ఇళ్లను, ఆస్తులను ధ్వంసం చేసింది. -
భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
జకార్తా: ఇండోనేసియాలో శుక్రవారం భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదైంది. దీంతో అక్కడి ప్రభుత్వం ముందుస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. బాంటన్ కోస్ట్, జావాలాంటి సముద్ర తీర ప్రాంతాల్లో నివశించే ప్రజలు.. అక్కడి ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లాలని సునామీ హెచ్చరికల కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇండోనేసియాను ఇటీవల కాలంలో వరుస భూకంపాలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలను ప్రారంభించారు. తీర ప్రాంత ప్రజలను మైదాన ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
స్విమ్మింగ్ పూల్లో కృత్రిమ సునామీ
-
వైరల్ : విరుచుకుపడిన ‘సునామీ’ అలలు..!
బీజింగ్ : ఓ తెలుగు సినిమా పాటలో చెప్పినట్టు.. ‘జలకాలటాలలో.. గలగల పాటలలో.. ఎంత హాయిలే హలా.. ఏమేమీ హాయిలే హలా’అన్నట్టుగా ఉంటుంది నీటి కొలనులో ఈదులాడటం. దక్షిణ చైనాలోని సముద్రం ఒడ్డున ఉన్న ఓ వాటర్ పార్కులో చాలా మంది జనం గత ఆదివారం అలాంటి పాటే పాడుకుంటూ.. జలకాల్లో మునిగిపోయారు. కానీ.. ఉన్నట్టుండీ ఓ ఉపద్రవం ముంచుకొచ్చింది. అంతెత్తున ‘సునామీ‘ కెరటాలు వారిని ముంచెత్తాయి. నీటిలో చాలా మంది కిందామీద పడ్డారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒడ్డున ఉన్నవారు బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు. ఓ 10 సెకన్ల పాటు అక్కడ బీతావహ వాతావరణం నెలకొంది. అయితే, అది సునామీ కాదని తేలిపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వాటర్ పార్కులో అలలు సృష్టించే మెషీన్ తప్పిదం వల్ల భారీ ఎత్తున నీటి కెరటాలు వారిపై విరుచుకుపడ్డాయని తెలిసింది. ఘటనకు చింతిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తీవ్రమైన అలల తాకిడికి కొలనులో ఉన్న 44 మంది గాయపడ్డారు. ఒడ్డున ఉన్న ఓ మహిళ పరుగెత్తబోయి కిందపడటంతో గాయాలపాలయ్యారు. పార్కు నిర్వాహకులపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ కొనసాగుతోంది. పార్కుని మూసివేశారు. ఈ ‘సునామీ’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఒక్కసారిగా ‘సునామీ’.. జనం పరుగో పరుగు..!
-
భూ ప్రకంపనలు: సునామీ హెచ్చరికలు
టోక్యో: జపాన్లో సంభవించిన భూకంప ప్రకంపనలు ఆ దేశ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తూర్పు జపాన్ ప్రాంతంలో 6.5 తీవ్రతతో సోమవారం భూకంపం సంభవించినట్టు ఆ దేశ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. దీంతో ముందస్తుగా తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అయితే ఈ ప్రకంపనల వల్ల జరిగిన నష్టం, గాయపడిన వారి సమాచారం తెలియరాలేదు. కాగా మియాజి ప్రాంతంలో 1.6 అడుగుల మేర అలలతో కూడిన సునామీ వచ్చినప్పుట్లు జపాన్ మెటరలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అయితే హవాయి, అమెరికా పశ్చిమ తీరంలో సునామీకి సంబంధించిన ఎలాంటి జాడలు లేవని అమెరికా, ఫసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. జపాన్లో స్థానికి కాలమానం ప్రకారం సోమవారం 7.23 కి హోన్స్ తూర్పు తీర ప్రాంతాల్లో భూప్రకంపనాలు చోటుచేసుకున్నట్లు, 5.9 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా 2011 మార్చి 11న జపాన్ ఈశాన్య తీరంలో 9తీవ్రతతో సంభవించిన తీవ్రమైన విపత్తు సుమారు 18,000 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. -
సునామీ...ఇక ఎన్నికలుండవ్!
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటల్లేవు ..మాట్లాడు కోల్లేవు అన్నరీతిలో 2019 ఎన్నికల తర్వాత ఇక దేశంలో ఎన్నికలే ఉండవంటూ జోస్యం చెప్పారు. 2014లో మొదలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా 2019నాటికి సునామిలా మారిపోయింది.. దీంతో ఈ ఎన్నికల్లో ముందుకంటే మెరుగైన ఫలితాలుంటాయి. ఇక మోదీని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని ఆయన వ్యాఖ్యానించారు 2019లో 'మోదీ సునామీ' నేపథ్యంలో దేశంలో ఇక ఎన్నికలు జరగవు. 2024లో ఎన్నికలుండవని తాను భావిస్తున్నానన్నారు. శుక్రవారం నిర్వహించిన ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ తాము పూర్తి నిజాయితీతో దేశంకోసం పోరాడుతున్నామని సాక్షిపేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు చాలామంది చాలారకాల ఎత్తులు వేస్తున్నారు.. మోదీ ఉంటేనే దేశం ( మోదీ హైతో దేశ్ హై) అని దేశంలోని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకగాంధీని రంగంలోకి దింపినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మోదీ సునామీని అడ్డుకోవడం వారి తరం కాదని వ్యాఖ్యానించారు. కాగా 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ వాద్రాను కాంగ్రెస్ నియమించింది. అలాగే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ బిజెపిని ఓడించే లక్ష్యంతో ముందస్తు ఎన్నికల పొత్తులో ప్రవేశించిన సంగతి తెలిసిందే. -
భయంకర సునామీకి 14 ఏళ్లు
-
థాయ్ గుహ నుంచి అందరూ క్షేమంగా..
కొరియాలో శాంతి గీతాలాపన, సౌదీ అరేబియాలో స్టీరింగ్ చేతపట్టి మహిళల స్వేచ్ఛాగానం, హాలీవుడ్ సినిమాను తలపించేలా థాయ్ గుహలో ఆపరేషన్, పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ కొత్త ఇన్నింగ్స్, తమకు తిరుగే లేదని నిరూపించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అంగరంగవైభవంగా ప్రిన్స్ హ్యారీ వివాహం, వీల్ చైర్ నుంచే విశ్వరహస్యాలపై ప్రయోగాలు చేసిన స్టీఫెన్ హాకింగ్ అస్తమయం, ఇండోనేసియాపై మరోసారి విరుచుకుపడిన సునామీ లాంటి మర్చిపోలేని ఘటనలను మిగిల్చింది 2018. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన కొన్ని ఘటనలను మరోసారి గుర్తుచేసుకుందాం.. ట్రంప్, కిమ్ శిఖరాగ్ర సదస్సు నా టేబుల్ మీద అణుబాంబుని పేల్చే మీట ఉందని ఒకరంటే నా టేబుల్పై అంతకంటే పెద్ద అణుబాంబు బటన్ ఉందంటూ మరొకరు మాటల తూటాలు పేలుస్తూ ప్రపంచ దేశాల గుండెల్లో అణుబాంబుల్ని పేల్చారు. చివరికి ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్జాంగ్ ఉన్ జూన్లో సింగపూర్లో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాయని నేతలిద్దరూ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కొరియాలో శాంతిస్థాపన దిశగా అడుగులు పడతాయన్న ఆశలు చిగురించాయి. విశ్వ శోధకుడు హాకింగ్ అస్తమయం అరుదైన వ్యాధితో బాధపడుతూ వీల్చైర్కే పరిమితమైనా ఆత్మవిశ్వాసంతో విశ్వరహస్యాల్ని నిరంతం శోధించిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ మార్చి 14న కన్నుమూశారు. ఏ క్షణంలోనైనా మృత్యుదేవత దరిచేరవచ్చని తెలిసినా స్టీఫెన్ విశ్వానికి సంబంధించి రోజుకో కొత్త విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. కృష్ణ బిలాలకు సంబంధించి ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసిన హాకింగ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి తరతరాలకి పదిలం. మనిషి భూమిని వదిలి కొత్త గ్రహాలకు వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ తాను అనంతలోకాలకు తరలిపోయారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్తో దూకుడు ప్రదర్శించిన ఇమ్రాన్ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆగస్టు 18న పాక్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయనకు ఈ విజయం అంత సులభంగా దక్కలేదు. కేవలం ఒక్క సీటుతో మొదలు పెట్టి 22 ఏళ్ల కృషితో తాను కన్న కలల్ని సాకారం చేసుకున్నారు ఇమ్రాన్. పాక సైన్యం చెప్పుచేతల్లో ఉంటారన్న ఆరోపణలు ఉన్న ఇమ్రాన్ ప్రధాని పీఠంపై కూర్చోగానే కశ్మీర్ విషయంలో భారత్ అడుగు ముందుకేస్తే తాము రెండడుగులు వేస్తామంటూ ప్రకటించి శాంతి మంత్రం ఆలాపించారు. నాలుగోసారీ.. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ప్రస్థానం 2018లోనూ అప్రతిహతంగా కొనసాగింది. ఈ ఏడాది మేలో ఆయన వరసగా నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. గత పద్దెనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయన మరో ఆరేళ్ల పాటు రష్యా పీఠంపై కొనసాగుతారు. జిన్పింగ్.. శాశ్వత అధ్యక్షుడు ఒక వ్యక్తి చైనా దేశ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధనల్ని చైనా పార్లమెంటు తిరగరాసింది. అధ్యక్షుడు జిన్పింగ్ శాశ్వతంగా దేశాధ్యక్షుడిగా కొనసాగడం కోసమే కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. దానికి చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయడంతో జిన్పింగ్ శాశ్వత అధ్యక్షుడిగా మారారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడు జిన్ పింగ్. క్షమాపణలు చెప్పిన జుకర్బర్గ్ ఫేస్బుక్ డేటా లీకేజీ వ్యవహారంతో ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్బర్గ్ అమెరికా కాంగ్రెస్ విచారణ ఎదుర్కొన్నారు. సెనేటర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక జుకర్బర్గ్ సారీ చెప్పారు. ఫేస్బుక్ నుంచి సమాచారం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీనియర్ బుష్ కన్నుమూత వృద్దాప్యం కారణంగా 94ఏళ్ల వయసులో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ నవంబర్ 30న కన్నుమూశారు. అమెరికాలో కీలక పరిణామాల సమయంలో ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. కువైట్ యుద్ధం ఆయన నేతృత్వంలోనే జరిగింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన సమయంలోనూ, ప్రచ్ఛన్న యుద్ధం చివరి రోజుల్లో బుష్ అధ్యక్ష పీఠంపై ఉన్నారు. సౌదీలో డ్రైవింగ్ చేసిన మహిళలు సౌదీ అరేబియాలో మహిళలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. స్టీరింగ్ చేతపట్టి ఆత్మవిశ్వాసంతో రయ్ రయ్మంటూ కార్లు నడిపే అవకాశాన్ని 2018 ఏడాది వారికి బహుమతిగా ఇచ్చింది. తరతరాలుగా మహిళల డ్రైవింగ్పై ఉన్న నిషేధాన్ని సౌదీ ప్రభుత్వం జూన్ 24న ఎత్తివేసింది. దీంతో అర్ధరాత్రి అని కూడా చూడకుండా చాలా మంది సౌదీ మహిళలు రోడ్లపైకి వచ్చి కార్లలో షికారు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. థాయ్ గుహలో చిన్నారుల రెస్క్యూ అందరూ క్షేమంగా ఉన్నారు.. ఈ ఒక్క మాట ఈ ఏడాది కోట్లాది మందిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. 12 మంది ఫుట్బాల్ యువ క్రీడాకారులు, వారి కోచ్ 18 రోజులు థాయ్లాండ్ గుహలో చిక్కుకుపోయిన ఘటన నరాలు తెగేలా ఉత్కంఠకు కారణమైంది. అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసి, వరద నీరు గుహ ద్వారాన్ని ముంచేసింది. గుహలోపల నిద్రాహారాలు లేకుండా బిక్కుబిక్కుమన్న చిన్నారుల క్షేమసమాచారాల కోసం ప్రపంచం యావత్తూ కోట్ల కళ్లతో ఎదురు చూసింది. గుహ నుంచి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రపంచంలోని అసాధారణ నేవీ బృందాలు, థాయ్ నేవీ సీల్స్ చేసిన సాహసానికి ప్రపంచ దేశాలు సెల్యూట్ చేశాయి. జర్నలిస్టు ఖషోగ్గి హత్య సౌదీలో ప్రముఖ జర్నలిస్టు, వాషింగ్టన్ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్ ఖషోగ్గి దారుణ హత్య ఈ ఏడాది సంచలనం సృష్టించింది. అక్టోబర్లో వ్యక్తిగత పనుల నిమిత్తం టర్కీలోని ఇస్తాంబుల్లో సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లాక ఆయన అదృశ్యమయ్యారు. సౌదీ ప్రభుత్వ ఏజెంట్లు ఆయనను హత్య చేసి శవాన్ని ముక్కలు చేసి రాయబార కార్యాలయంలోనే యాసిడ్లో కరిగించారని వార్తలు వచ్చాయి. ఖషోగ్గి అదృశ్యం, హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. ఒక్కటైన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కల్ ప్రపంచమంతా ఆ పెళ్లి కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూసింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్కల్ ఈ ఏడాది మే 19న ఒక్కటయ్యారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రాజవంశానికి హాలీవుడ్ గ్లామర్ జతకూరడంతో ఈ పెళ్లిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. వీరిద్దరి వివాహానికి అంతర్జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యత కల్పించింది. శ్రీలంక సంక్షోభం శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఈ ఏడాది సెగలు పొగలు కక్కింది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాత్రికి రాత్రే ప్రధాని కుర్చీ నుంచి రణిల్ విక్రమసింఘేను దింపేసి మహిందా రాజపక్సను కూర్చోబెట్టారు. కానీ రాజపక్స రెండు సార్లు విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. దీంతో పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. కానీ పార్లమెంటును రద్దు చేయడం చెల్లదంటూ శ్రీలంక సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో సిరిసేనకు ఎదురుదెబ్బ తగిలింది. రాజపక్స రాజీనామా చేయడం, తిరిగి విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణం చేయడం వెంటవెంటనే జరిగాయి. అమెరికా షట్డౌన్ అమెరికాలో ఈ ఏడాది మూడుసార్లు షట్డౌన్ జరిగింది. ట్రంప్ వలస విధానాలతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి అమెరికా, మెక్సికో సరిహద్దు పొడవునా గోడ నిర్మాణం కోసం 500 కోట్ల డాలర్లు వెచ్చించాలంటూ ట్రంప్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ ఆమోదించకపోవడం తాజాగా డిసెంబర్లో పాలన స్తంభించింది. జనవరి, జూన్ నెలల్లోనూ కొన్నాళ్లు షట్డౌన్ జరిగింది. ఒకే ఏడాదిలో మూడు సార్లు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడమనేది గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇండోనేసియాపై విరుచుకుపడిన సునామీ 2018 వెళ్లిపోతూ వెళ్లిపోతూ తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇండోనేసియాపై సునామీ మరోసారి విరుచుకుపడింది. ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం భారీ స్థాయిలో బద్దలై పర్వతంలోని ఒక భాగం సముద్రంలో కుప్పకూలింది. దీంతో భారీ అలల మొదలై సునామీగా మారి జావా, సుమత్రా తీర ప్రాంతంలో ఊళ్లను ముంచెత్తింది. ఈ ప్రకృతి విలయంలో దాదాపుగా 500 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బ్రెగ్జిట్.. థెరిసాకి సవాల్ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన ఒప్పందం(బ్రెగ్జిట్ డీల్)పై సంక్షోభం నెలకొంది. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఒకే చేసిన ముసాయిదా ఒప్పందంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత నెలకొంది. ప్రస్తుతం ఉన్నట్టుగా ఆ ఒప్పందం పార్లమెంటులో ప్రవేశపెడితే ఆమోదం పొందడం కష్టమేనన్న అనుమానాలు మొదలయ్యాయి. అందుకే బ్రెగ్జిట్ ఒప్పందానికి మార్పులు చేర్పులు చేసి పార్లమెంటుకు సమర్పించే యోచనలో థెరిసా ఉన్నారు. కొత్త సంవత్సరంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. సిరియాపై అమెరికా వార్ గత ఏడేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాపై అమెరికా నేరుగా యుద్ధాన్ని ప్రకటించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆధీనంలోని సైనిక స్థావరాలపై క్షిపణి దాడులకు దిగింది. అసద్ గద్దె దిగితేనే సిరియాలో శాంతిస్థాపనకు ఆస్కారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ దాడుల్లో చిన్నారులు మరణించిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. జీరో టాలరెన్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరించిన జోరో టాలరెన్స్ వలస విధానం వివాదాస్పదంగా మారింది. సరిహద్దుల్లో శరణార్థుల పడిగాపులు, తల్లీ బిడ్డల్ని వేరు చేసిన దృశ్యాలు మనసుల్ని పిండేశాయి. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి వచ్చారని 2000 మంది పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి హోమ్స్కి తరలించారు. చివరికి ట్రంప్ సర్కార్పై ఒత్తిడి పెరగడంతో తల్లీ బిడ్డల్ని వేరు చేయొద్దంటూ ఉత్తర్వులిచ్చారు. -
‘ఆ దేవుడు నిన్నూ నన్నూ కలిపాడు.. విడదీసాడు కూడా’
తరచుగా ప్రకృతి విలయాల బారిన పడే ఇండోనేషియాలో సునామీ మృత్యు పాశమై అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి సముద్ర గర్భంలోని ఆనక్ క్రకటోవా అనే అగ్నిపర్వతం బద్ధలై.. సుమత్ర, జావా ద్వీపాల తీరాలపై సునామీగా విరుచుకుపడటంతో ఇప్పటివరకు దాదాపు 429 మంది మరణించారు. ఈ ప్రకృతి ప్రకోపానికి గురై నిరాశ్రయులైన వారు కొందరైతే... ప్రాణాలతో మిగిలి ఉన్నా తమ వారిని కోల్పోయి జీవచ్ఛవాలుగా మారామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సునామీ ధాటికి తన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు స్నేహితులను, తన భార్య ఙ్ఞాపకాలను తలచుకుంటూ ‘సెవెంటీన్’ అనే పాప్ గ్రూప్ లీడ్ సింగర్ రిఫియన్ ఫజార్షా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ‘దిలాన్ సహారా... నువ్వు లేకుండా ఎలా బతకాలి. అత్యుత్తమ భార్యగా ఉండేందుకు నువ్వు ఎల్లవేళలా కృషిచేశావు. నిజానికి నువ్వు అలాగే ఉన్నావు కూడా. అందుకే ఇక దేవుడిని నేను అడగాల్సింది ఏమీ లేదనే నిర్ణయానికి వచ్చాను. కానీ ఈ రోజు అంతా తలకిందులైంది. ఇప్పుడు నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం తప్ప నేనేం చేయగలను. మంచికో చెడుకో తెలియదు గానీ ఆ దేవుడు నిన్నూ నన్నూ కలిపాడు.. విడదీసాడు కూడా. అయితే నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, నిన్నెంత మిస్సవుతున్నానో ఆ భగవంతునికే తెలుసు. నువ్వు నాతో పాటు ఉంటే ఈరోజు నీ పుట్టిన రోజు వేడుకలు జరిగేవి కదా. నా వల్లగానీ, నా భార్య వల్లగానీ ఎవరికైనా ఎప్పుడైనా ఇబ్బంది కలిగి ఉంటే అందుకు నేను క్షమాపణ కోరుతున్నాను’ అని తన భార్యను గుర్తు చేసుకుంటూ రిఫియన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా శనివారం ‘సెవెంటీన్’ అనే పాప్ గ్రూప్ ప్రదర్శన ఇస్తుండగా, భారీ ఎత్తున్న నీటి అల వెనుకవైపు నుంచి వేదిక మీదకు వచ్చి పడింది. దీంతో వేదికపైనున్న కళాకారులు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో తన భర్త కన్సర్ట్ను చూసేందుకు అక్కడి వచ్చిన రిఫియన్ భార్య సహా... ఈ గ్రూపులోని ముగ్గురు సభ్యులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో రిఫియన్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇండోనేషియా రాజకీయవేత్త కూతురైన సహారా(25) టీవీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని ఆమె నిర్ణయించుకున్నారని.. ఈలోపే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని స్థానిక మీడియా పేర్కొంది. -
ఇండోనేషియా సునామీ : 429కి చేరిన మృతుల సంఖ్య
జకర్తా : ఇండోనేషియాలో సునామీ మృతుల సంఖ్య 429కి చేరుకోగా, మరో 154మంది జాడ తెలియాల్సి ఉందని ఇండోనేషియా డిజాస్టర్ ఏజెన్సీ అధికారులు ప్రకటించారు. వారి కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో సురక్షిత నివాసాల కోసం పడిగాపులు కాస్తున్నారు. తాగడానికి కనీసం మంచినీరు కూడా లేకపోవడంతో బాధిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది చిన్నపిల్లలు జ్వరంతో బాధపడుతున్నారు. సముద్రంలో, తీరానికి దగ్గరగా ఉన్న ఒక అగ్నిపర్వతం పేలిన కారణంగా ఇండోనేసియాలో సునామీ సంభవించిన విషయం తెలిసిందే. సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధిలోని చిన్న దీవిలో ఉన్న ఆనక్ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలిన కారణంగా గత శనివారం సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరం, జావా దీవి పశ్చిమ తీరాలపై ఈ సునామీ విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించింది. సాధారణంగా అగ్నిపర్వతాల కారణంగా వచ్చే సునామీలు చాలా అకస్మాత్తుగా, ఉన్నట్టుండి తీరాలను ముంచెత్తుతాయి. దీంతో ప్రజలను సురక్షిత తరలించేంత తరలించేంత సమయం ఉండదు. అగ్ని పర్వతాలు పేలిన కారణంగా సునామీలు చాలా అరుదుగా వస్తుంటాయి. -
సునామీలు రావడానికి గల 4 కారణాలు!
వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే సునామీలు రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలుంటాయి. భూకంపాలు: ఎక్కుసార్లు సునామీలు సముద్రంలో భూకంపాల వల్లే వస్తాయి. రిక్టర్ స్కేల్పై 7.5 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో సముద్రంలో సంభవించే భూకంపాల వల్ల సముద్రం అడుగున ఉన్న భూ ఫలకాల్లో కదలికలు సంభవిస్తుంటాయి. అప్పుడు ఆ భాగంలో ఉన్న నీరు అస్థిరతకు లోనై, ఆ తర్వాత భూమ్యాకర్షణ శక్తి వల్ల ఆ నీరంతా మళ్లీ కిందకు రావడం తదితర కారణాలతో సునామీలు సంభవిస్తాయి. మంచుపర్వతాలు విరగడం సముద్రం మధ్యలో ఉండే కొండచరియలు విరిగిపడటం, భారీ మంచుపర్వతాలు పర్వతాలు విరిగిపోవడం వల్ల కూడా భూకంపాలు వస్తాయి. 1980ల్లో ఫ్రాన్స్లో సముద్ర తీరంలో రన్వే నిర్మిస్తుండగా, సముద్రంలో మంచుపర్వతం విరిగింది. దీంతో థేబ్స్ నౌకాశ్రయం సమీపంలో సునామీ సంభవించింది. అగ్నిపర్వతాలు పేలడం సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలినప్పుడు భారీ మొత్తంలో నీరు స్థానభ్రంశం చెంది సునామీ అలలు ఏర్పడతాయి. అలాగే అగ్నిపర్వతం పైభాగం విరిగి సముద్రంలోకి పడినప్పుడు భారీ మొత్తంలో నీరు అగ్నిపర్వంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏర్పడే అలజడుల కారణంగా కూడా సునామీలు వస్తాయి. గ్రహశకలాలు పడటం అప్పుడప్పుడు భూమిపైకి గ్రహశకలాలు, ఉల్కలు రావడం తెలిసిందే. అయితే వీటిలో అత్యధిక శాతం భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆకాశంలో మండి బూడిదవుతాయి. అలాకాకుండా భారీ ఆకారంలో ఉండే గ్రహశకలాలు, ఉల్కలు సముద్రంలో కూలినా సునామీ అలలు వస్తాయి. ఇలా జరగడం అత్యంత అరుదు. సముద్రం వెనక్కు ఎందుకు వెళ్తుంది? సునామీకి ముందు కొన్నిసార్లు సముద్రం కొన్ని వందల మీటర్లు వెనక్కు వెళ్తుంది. అయితే సునామీ వచ్చే ప్రతీసారీ ఇలాగే జరగదు. ప్రతీ అలకూ రెండు దశలుంటాయి. ఒకటి ముందుకు రావడం, రెండోది వెనక్కు వెళ్లడం. సునామీ అలా ఎక్కడో తీరానికి దూరంలో, సముద్రం మధ్యలో ముందుగా మెల్లగా మొదలవుతుంది. ఆ తర్వాత అది దశలవారీగా పరిమాణం పెంచుకుంటూ తీరంపై భారీ ఎత్తున ఎగసిపడుతుంది. తీరానికి వచ్చే అల ముందుగా ముందుకు వచ్చి తర్వాత వెనక్కు వెళ్లేది అయితే సముద్రం వెనక్కు వెళ్లదు. ఒక్కసారిగా సునామీ వచ్చి మీదపడుతుంది. అదే తీరానికి వచ్చే అలా ముందు వెనక్కు వెళ్లి తర్వాత ముందుకు వచ్చేది అయితే సముద్రం సాధారణం కన్నా బాగా వెనక్కు వెళ్లి మళ్లీ పెద్ద అలగా వస్తుంది. ఎప్పుడైనా సముద్రం ఎక్కువ దూరం వెనక్కు వెళ్లడాన్ని గమనిస్తే అక్కడే చూస్తూ నిల్చోకుండా వెంటనే పరుగెత్తుతూ వెనక్కు వచ్చేయాలి. అక్కడే ఎందుకు ? జకార్తా: ఇండోనేసియాలో తరచుగా అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు, సునామీలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోనే భూకంపాలు ఎక్కవగా సంభవించే పసిఫిక్ మహాసముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఇండోనేసియా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. దీనికితోడు వాతావరణ మార్పులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. కరువు కాటకాలు, ఆర్థిక వనరుల కొరత, అవినీతి వల్ల ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా మౌలిక వసతుల నిర్మాణం అక్కడ జరగడం లేదు. అంతేకాకుండా పోడు వ్యవసాయానికి తోడు ఇండోనేసియాలో విస్తారంగా అడవులను నరికివేస్తున్నారు. దీంతో సునామీ లేదా భూకంపం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం విపరీతంగా ఉంటోంది. అంతేకాకుండా ఇండోనేసియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 129 క్రీయాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. యురేసియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఇండో–ఆస్ట్రేలియన్ ప్లేట్ల మధ్య రాపిడి కారణంగా ఇక్కడి భూపొరల్లో ఒత్తిడి పెరిగి తరచూ అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇండోనేసియాలో 50 లక్షల మంది ప్రజలు అగ్నిపర్వతాల ‘డేంజర్ జోన్’లో ఉంటున్నారు. 10 అత్యంత భీకర సునామీలు సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యమేనని ఇండోనేసియా సునామీ మరోసారి రుజువు చేసింది. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో సునామీ విధ్వంసం సృష్టించే వరకు ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. వాటిల్లిన ఆస్తి, ప్రాణ నష్టం ఆధారంగా చరిత్రలో నమోదైన 10 అత్యంత భీకర సునామీల వివరాలిలా ఉన్నాయి. 1. సుమత్రా, ఇండోనేసియా, 2004 9.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీ ఇండోనేసియాతో పాటు శ్రీలంక, భారత్ తీర ప్రాంతాల్లో పెను ప్రళయం సృష్టించింది. 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన సముద్ర అలలు తీర ప్రాంతం నుంచి 5 కి.మీ దూరం వరకు చొచ్చుకొచ్చాయి. సుమారు 2 లక్షల మంది మృత్యువాత పడగా, 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు తెలిసిన అత్యంత భీకర సునామీ ఇదేనని భావిస్తున్నారు. దీని ప్రభావంతో అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. 2.ఉత్తర పసిఫిక్ తీరం, జపాన్, 2011 పది మీటర్లకు పైగా ఎగిసిపడిన రాకాసి అలలు 18 వేల మందిని బలిగొన్నాయి. అంతకుముందు, 24.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇప్పటి వరకు వచ్చిన నాలుగో అతి పెద్దదని భావిస్తున్నారు. ఈ దెబ్బకు సుమారు 4.50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భూ ప్రకంపనలకు ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియోధార్మిక వాయువులు లీకు కావడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అధిగమించడానికి జపాన్కు ఐదేళ్లు పడుతుందని అప్పట్లో ప్రపంచ బ్యాంక్ అంచనావేసింది. 3.లిస్బన్, పోర్చుగల్, 1755 8.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పోర్చుగల్ పశ్చిమ తీరం, స్పెయిన్ దక్షిణ తీరాల్లో సునామీ వచ్చింది. కొన్నిచోట్ల సముద్ర అలలు 30 మీటర్ల ఎత్తుకు లేచాయి. పోర్చుగల్, మొరాకో, స్పెయిల్ దేశాల్లో సుమారు 60 వేల మంది చనిపోయారు. 4. క్రకటోవా, ఇండోనేసియా, 1883 క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ సునామీ సంభవించింది. 37 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు అంజీర్, మెరాక్ పట్టణాల్లో విధ్వంసం సృష్టించాయి. బాంబేలో తీరం నుంచి సముద్రం వెనక్కిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సునామీలో సుమారు 36 వేల మంది చనిపోయారు. 5.ఎన్షునాడా సముద్రం, జపాన్, 1498 8.3 తీవ్రతతో కూడిన భూకంపం దెబ్బకు సంభవించిన ఈ సునామీ జపాన్లోని పలు తీర ప్రాంతాల్ని ముంచెత్తింది. సుమారు 31 వేల మందిని బలితీసుకుంది. 6.నాంకైడో, జపాన్, 1707 8.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ దెబ్బకు సముద్ర అలలు 25 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 30 వేల మంది చనిపోగా, భారత్లోని కొచ్చిలో బలమైన సముద్ర అలలు తీరాన్ని దాటుకుని చొచ్చుకొచ్చాయి. 7.సాంక్రికు, జపాన్, 1896 జపాన్లోని సాంక్రికు తీరంలో సంభవించిన భూకంపం దెబ్బకు ఏర్పడిన సునామీ వల్ల 38.2 మీటర్ల ఎత్తు మేర సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో 11 వేల ఇళ్లు నేలమట్టం కాగా, సుమారు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాలో సంభవించిన సునామీలో 4 వేల మంది చనిపోయారు. 8.ఉత్తర చిలీ, 1868 8.5 తీవ్రతతో సంభవించిన రెండు వేర్వేరు భూకంపాల వల్ల ఈ సునామీ ఏర్పడింది. 21 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన అలల మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించాయి. ఇందులో సుమారు పాతిక వేల మంది చనిపోగా, 300 మిలియన్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. 9.రైకూ దీవులు, జపాన్, 1771 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఏర్పడిన సునామీ వల్ల ఈ ప్రాంతంలోని పలు దీవులు దెబ్బతిన్నాయి. ఇషిగాకి దీవిలో 85.4 ఎత్తు మేర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 3 వేల ఇళ్లు ధ్వంసం కాగా, 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 10. ఐస్ బే జపాన్, 1586 రిక్టర్ స్కేల్పై 8.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏర్పడిన ఈ సునామీలో సముద్ర అలలు 6 మీటర్ల ఎత్తుమేర ఎగిసిపడి పలు పట్టణాల్ని ధ్వంసం చేశాయి. బివా అనే సముద్రం ఐస్ బే పట్టణం ఆనవాళ్లు కనిపించనంత స్థాయిలో ముంచెత్తింది. ఇందులో 8 వేల మంది మరణించారు. సునామీ నుంచి ఇలా తప్పించుకోవచ్చు! సునామీల సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సెంట్రల్ అమెరికా సెస్మలాజికల్ సెంటర్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. సునామీ వచ్చేముందు ఏర్పడే పరిస్థితులపై తీరప్రాంత ప్రజలు అవగాహన కలిగిఉండాలని వ్యాఖ్యానించారు. సాధారణంగా తీరప్రాంతాల్లో భూకంపాలు సంభవించినప్పుడు భారీ రాకాసి అలలతో సునామీలు విరుచుకుపడతాయని వెల్లడించారు. అలాగే సునామీ వచ్చేముందు సముద్రంలో నీరు బాగా వెనక్కి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. ఒకవేళ మీరు తీరప్రాంతంలో ఉన్నప్పుడు భూకంపం వస్తే ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. è భూకంపం రాగానే కంగారుపడకుండా సురక్షితంగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ► అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఎత్తైన ప్రాంతం, లేదా ఎత్తైన భవనం పైకి చేరుకోండి. ఈ ప్రాంతం లేదా భవనం సముద్రమట్టం కంటే 30 మీటర్ల ఎత్తులో ఉండేలా చూసుకోండి. ► సముద్రంలో నీరు వెనక్కు వెళుతున్నట్లు గమనిస్తే వెంటనే అక్కడి నుంచి వీలైనంత దూరంగా వచ్చేయండి. ► ఒకవేళ తీరప్రాంతాల్లో ఎత్తైన భవనాలు లేకుంటే అటవీ ప్రాంతంలోకి వెళ్లాలి. ► సునామీల ప్రభావంతో నదులు సైతం కొన్ని కిలోమీటర్ల మేర ► వెనక్కు చొచ్చుకొస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాగులు, వంకలకు దూరంగా ఉండండి. ► అధికారులు చెప్పేవరకూ తిరిగి ప్రభావిత ప్రాంతాలకు రాకండి. ఇది క్రకటోవా పిల్లనే... జకర్తా: ఇండోనేసియన్ భాషలో ఆనక్ అంటే బిడ్డ, శిశువు అని అర్థం. క్రకటోవా అనే మరో అగ్నిపర్వతం నుండి ఏర్పడింది కాబట్టి దీనిని ఆనక్ క్రకటోవా అని పిలుస్తారు. సుండా జలసంధిలోనే క్రకటోవా అగ్నిపర్వతం ఉండేది. 1883లో అది పేలి ఏకంగా 36 వేల మంది చనిపోయారు. ఆ అగ్నిపర్వతం అవశేషాల నుంచే మళ్లీ 1928లో ఆనక్ క్రకటోవా ఏర్పడింది. అందుకే దీనిని పిల్ల క్రకటోవా అంటారు. ఇక్కడ మనుషులెవరూ నివసించకపోయినప్పటికీ ఇదో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. ‘ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతంలో మార్పుల కారణంగానే సముద్రంలో భూ పొరలు స్థానభ్రంశం చెందాయి. ఇది సరిగ్గా పున్నమి నాడు జరగడంతో ఈ భారీ విధ్వంసం సంభవించింది’ అని ఇండోనేసియా జాతీయ విపత్తు స్పందన దళం అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రోహో చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచే అగ్నిపర్వతం అప్పుడుప్పుడు లావాను, బూడిదను వెదజల్లుతోంది. భారీ మొత్తంలో బూడిద ఆకాశంలోకి వెళ్లడం కనిపిస్తుండేది. అక్టోబర్ నెలలో లావా ఎగిరొచ్చి ఓ టూరిస్ట్ బోట్కు అతి సమీపంలో పడింది. అగ్నిపర్వతం తీరానికి సమీపంలోనే ఉండటంతో ఇప్పుడు చాలా తొందరగా అలలు వచ్చి తీరప్రాంతాలపై విరుచుకుపడ్డాయని ‘ది ఓపెన్ యూ నివర్సిటీ’ ప్రొఫెసర్ డేవిడ్ రోథరీ తెలిపారు. తీరానికి దగ్గర్లో ఉన్నందునే సునామీ ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసే పరికరాలు సముద్రంలో ఉంటాయనీ, ఇలాంటి పరికరం అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నప్పటికీ.. అగ్నిపర్వతం కూడా తీరానికి దగ్గర్లోనే ఉండటంతో పరికరం నుంచి వచ్చిన సంకేతాలను అందుకునేలోపే భారీ అలలు ఎగసిపడ్డాయని డేవిడ్ వివరించారు. రెండు మూడేళ్లకోసారి ఈ అగ్నిపర్వతం అప్పుడప్పుడూ చిన్నగా పేలుతూనే ఉందని ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు. ఇప్పుడు కూడా అగ్నిపర్వతం పేలుడు తీవ్రత చాలా తక్కువగానే ఉంటుందనీ, అయితే అప్పుడే భూ ఫలకలు కదలడం వంటి చర్యల కారణంగా సునామీ సంభవించి ఉండొచ్చని ఆయన చెప్పారు. ఇండోనేసియాలో దాదాపు 130 వరకు క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకే దీన్ని పసిఫిక్లో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. -
మృత్యు సునామీ.. 222 మంది మృతి
ఇండోనేసియాను మరో జల విలయం ముంచెత్తింది. ప్రకృతి ప్రకోపాలకు తరచూ గురయ్యే ఈ ద్వీప సముదాయ దేశంలో తాజాగా ఓ సునామీ మృత్యు పాశమై పెను విధ్వంసం సృష్టించింది. శినివారం రాత్రి సముద్ర గర్భంలోని ఒక అగ్ని పర్వతం బద్ధలై.. సుమత్ర, జావా ద్వీపాల తీరాలపై సునామీగా విరుచుకుపడింది. సముద్రం నుంచి దూసుకొచ్చిన మృత్యు అలలు క్షణాల్లో 222 మందిని బలి తీసుకున్నాయి. మరెంతో మందిని గాయాలపాలు చేశాయి. బలమైన అలల తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. కెరీటా ఇండోనేసియాలో మరో భారీ ప్రకృతి విలయం సంభవించింది. సముద్రంలో, తీరానికి దగ్గరగా ఉన్న ఒక అగ్నిపర్వతం పేలిన కారణంగా సునామీ రావడంతో 222 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది క్షతగాత్రులుగా మారారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధిలోని చిన్న దీవిలో ఉన్న ఆనక్ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలిన కారణంగా స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.30 గంటలకు (భారత కాలమానంలో శనివారం రాత్రి 8 గంటలు) సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరం, జావా దీవి పశ్చిమ తీరాలపై ఈ సునామీ విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించింది.సాధారణంగా అగ్నిపర్వతాల కారణంగా వచ్చే సునామీలు చాలా అకస్మాత్తుగా, ఉన్నట్టుండి తీరాలను ముంచెత్తుతాయి. దీంతో ప్రజలను సురక్షిత తరలించేంత తరలించేంత సమయం ఉండదు. అగ్ని పర్వతాలు పేలిన కారణంగా సునామీలు చాలా అరుదుగా వస్తుంటాయని అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం తెలిపింది. కాగా, ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో ఇండోనేసియాకు సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘ఇండోనేసియాలో సునామీ కారణంగా జరిగిన విధ్వంసం గురించి తెలుసుకుని చింతిస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఐరోపా దేశాల నేతలు ఇండోనేసియాకు సానుభూతి తెలిపారు. సెవెంటీన్ పాప్ గ్రూప్పై.. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపడుతున్నామనీ, మొత్తంగా 28 మంది గల్లంతయ్యారని ఇండోనేసియా జాతీయ ప్రకృతి విపత్తుల స్పందన సంస్థ అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రొహో చెప్పారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం సునామీ కారణంగా 222 మంది మరణించగా, మరో 843 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చన్నారు. సుండా జలసంధి సమీపంలోని తీరాల్లో, జావా ద్వీపంలోని పాండెగ్లాంగ్ జిల్లాలో 163 మంది చనిపోయారనీ, అత్యధిక మరణాలు రెండు హోటళ్లలో సంభవించాయని నుగ్రోహో చెప్పారు. సెరంగ్లో 11 మంది, సుమత్రా దీవిలోని దక్షిన లంపుంగ్లో 48 మంది చనిపోయారన్నారు. ఈ సునామీకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వెలువడిన ఓ వీడియో భీతి గొల్పేలా ఉంది. ‘సెవెంటీన్’ అనే పాప్ గ్రూప్ ప్రదర్శన ఇస్తుండగా, భారీ ఎత్తున్న నీటి అల వెనుకవైపు నుంచి వేదిక మీదకు వచ్చి పడింది. వేదికపైనున్న కళాకారులు చెల్లాచెదురయ్యారు. అనంతరం అల ప్రేక్షకులను ముంచెత్తింది. సునామీ కారణంగా వందలాది చెట్లు, విద్యుత్ స్తంభా లు నేలకూలాయి. శిథిలాలు, చెత్త, చెదారమంతా బీచ్ల్లోకి చేరింది. జావా ద్వీపంలోని కెరీటా బీచ్లోకి ఓ ఇంటి పైకప్పుకు అమర్చిన రేకులు, మొద్దులు, ఇతర శిథిలాలు కొట్టుకొచ్చాయి. సునామీ సమయంలో అగ్ని పర్వతం ఫొటోలు తీస్తున్న ఓయ్స్టీన్ అండర్సన్ తన అనుభవాన్ని వివరిస్తూ ‘అకస్మాత్తుగా ఓ పెద్ద అల వచ్చింది. అది తీరం దాటి దాదాపు 20 మీటర్లు ముందుకొచ్చింది. నేను పరుగెత్తడం మొదలుపెట్టాను. ఆ తర్వాత వచ్చిన అల తీరంలోని హోటల్ ప్రాంతాన్ని ముంచేసింది. కార్లు, కంటెయినర్లు 10 మీటర్లకు పైగా దూరం కొట్టుకుపోయాయి’ అని చెప్పారు. మొత్తం మృతుల సంఖ్య అప్పుడే చెప్పలేం సునామీ మృతుల సంఖ్య స్పష్టంగా తెలిసేందుకు కొన్ని రోజులు లేదా వారాలు పట్టొచ్చని రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీస్ అంతర్జాతీయ సమాఖ్యకు చెందిన కేథీ ముల్లర్ తెలిపారు. శిథిలాలను పూర్తిగా తొలగించేంత వరకు మృతుల సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పలేమనీ, రాబోయే కొన్ని రోజులు, వారాల పాటు ఈ సంఖ్య మారుతూ ఉంటుందని ఆమె అన్నారు. సహాయక బృందాలు గాయపడిన వారిని వైద్యశాలలకు తరలిస్తున్నాయి. తమ సంస్థల తరఫున సహాయక శిబిరాలు నెలకొల్పి ప్రజలకు తాత్కాలిక వసతిని, ఆహారాన్ని అందజేస్తున్నట్లు కేథీ చెప్పారు. సునామీ కారణంగా వచ్చే వ్యాధులను ఎదుర్కొనేందుకు, జబ్బులు రాకుండా నివారించేందుకు తమ బృందాలు సిద్ధమవుతున్నాయన్నారు. కాగా, ఇండోనేసియాలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగానే సంభవిస్తుంటాయి. ఈ ఏడాదే సెప్టెంబర్ నెలలోనూ సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో సునామీ వచ్చి వేలాది మంది చనిపోయారు. 2004 డిసెంబర్ 26న రిక్టర్ స్కేల్పై 9.3 తీవ్రతతో సముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా సునామీ సంభవించి వివిధ దేశాల్లో మొత్తంగా 2.2 లక్షల మంది చనిపోగా, వారిలో ఇండోనేసియా ప్రజలే 1.68 లక్షలు ఉన్నారు. పేలిన అగ్నిపర్వతం సుమత్రా, జావా ద్వీపాల మధ్యలో పేలిన ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం వీధి విధ్వంసం సునామీలో పూర్తిగా ధ్వంసమైన వీధి, వాహనాలు శవాల దిబ్బ కవర్లలో చుట్టిన మృతదేహాల్లో తమ వారి కోసం వెతుకుతున్న ప్రజలు -
ఇండోనేషియాలో సునామీ విధ్వంసం
-
ఇండోనేషియాపై మరోసారి విరుచుకుపడిన సునామీ
-
సునామీ ప్రతాపం.. 228 మంది మృతి
జకార్తా: దీవుల దేశం ఇండోనేషియాను సునామీ మరోసారి ముంచెత్తింది. శనివారం అర్థరాత్రి సమయంలో సంభవించిన సునామీ ధాటికి 228 మంది మరణించగా, 700మంది గాయాలపాలయ్యారు. ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సునామీ ప్రతాపాన్ని చూపించింది. అలలు తీవ్రంగా విరుచుకుపడడంతో వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.మృతుల్లో అత్యధికులు విదేశీ పర్యాటకులేనని అధికార వర్గాలు వెల్లడించాయి. దక్షిణ సుమ్రతా, జావా దీవుల్లో సునామీ వచ్చినట్లు ఆదేశ విపత్తు నిర్వహణ అధికారి పుర్వో నుర్గోహో తెలిపారు. సునామీ ధాటికి కొంతమంది గల్లంతయ్యారని వారికోసం గాలింపుచర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటూ, న్యూ కలెడోనియా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6 గా నమోదైంది. దీంతో అస్ట్రేలియాకు తూర్పువైపున్న దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలెడోనియాకు చెందిన లాయాలిటీ దీవులకు ఆగ్నేయంవైపున 155 కిమీటర్ల దూరంలో 10 కిమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల పరిధిలో సునామీ ప్రభావం ఉండొచ్చని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
2వేలకు చేరిన ఇండోనేసియా మృతులు
పలూ: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో సునామీ, భూకంపం సంభవించి పది రోజులు గడిచినప్పటికీ మృతుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు పలూ పట్టణంలో సుమారు 2వేల మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. తొలుత 5వేలకు పైగా గల్లంతు అయ్యారని భావించిన్పటికీ.. ప్రస్తుతమున్న పరిస్థితి చూస్తుంటే అంచనాకు అందటం లేదన్నారు. హోటల్ మొత్తం జల్లెడపట్టామని, ఇక్కడ 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1,944కు చేరుకుంది. ఈ నెల 11 వరకు అధికారికంగా గాలింపుచర్యలు చేపడతామని స్థానిక మిలటరీ ప్రతినిధి తోహిర్ తెలిపారు. -
చావు అంచులదాకా వెళ్లా : ప్రీతి జింటా
‘సునామీ సృష్టించిన బీభత్సానికి దాదాపు చావు అంచుల దాకా వెళ్లాను. ఆరోజు ఫుకెట్లో ఉన్నాం. నా కళ్ల ముందే నాతోపాటే వచ్చిన ఎంతో మంది స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. నేనొక్కదాన్నే బతికి బయటపడ్డాను. వారందరి ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా అది చాలా దుర్దినం’ అంటూ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు నటి ప్రీతి జింటా. ఇండియాటుడే కాన్క్లేవ్ ఈస్ట్ 2018 సమ్మిట్లో పాల్గొన్న ప్రీతి... 2004, డిసెంబరు 26 తనకు మిగిల్చిన చేదు ఙ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చారు. ‘ నిజంగా ఆరోజు చనిపోతానేమో అనుకున్నా. కానీ ఆ దేవుడి దీవెనలు నాకు ఉన్నాయి. నాతో పాటు తీర ప్రాంతాల అందాలను చూడటానికి వచ్చిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా బతికి బయటపడ్డానంటే ఏదో కారణం ఉంటుందని బలంగా నమ్మాను. పునర్జన్మ పొందినందుకు గుర్తుగా ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. ఐపీఎల్ ప్రాంఛైజీ ఓనర్గా, నటిగా ప్రస్తుతం ఇలా మీ ముందున్నాను’ అంటూ ప్రీతి భావోద్వేగానికి లోనయ్యారు. కాగా 2004, డిసెంబరు 26న హిందూ మహాసముద్రంలో సునామీ చెలరేగిన విషయం తెలిసిందే. 14 దేశాల్లోని దాదాపు 2 లక్షల ముప్పై వేల మందిని ఆ రాకాసి అలలు పొట్టనబెట్టుకున్నాయి. -
ఇంకా 1000మంది జాడ తెలియదు
పలూ: గతవారం ఇండోనేసియా దేశాన్ని కుదిపేసిన భారీ భూకంపం, సునామీ విలయంలో ఇంకా జాడ తెలియని వారి సంఖ్య వెయ్యిమందికి పైగా ఉన్నట్లు తాజాగా తేలింది. తీవ్ర భూకంపంతో పాటుగా సునామీ ధాటికి సులావేసి ద్వీపంలోని పలు నగరంలో మరణించిన వారి సంఖ్య 1,558కు చేరుకుంది. అక్కడి నివాస గృహాలు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది ప్రజలు ఆ ప్రాంతంను వదిలి వెళ్ళిపోయారు. ఈమేరకు శుక్రవారం ఇండోనేసియా ప్రభుత్వ ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. సునామీ ఘటనలో మరణించిన వారికి బలరోవా ప్రాంతంలో ప్రభుత్వమే సామూహిక అంత్యక్రియలను నిర్వహించింది. -
సునామీ బాధితుల కోసం ‘ఆపరేషన్ సముద్ర మైత్రి’
న్యూఢిల్లీ: భారీ భూకంపం, సునామీ ధాటికి సర్వంకోల్పోయిన ఇండోనేసియా ప్రజల కోసం భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. సహాయక సామగ్రి, మందులతో నింపిన రెండు నేవీ నౌకలు, రెండు విమానాలను ఇండోనేసియాకు పంపినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. వైద్యసిబ్బందితోపాటు తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన సామగ్రినీ తరలించారు. చెన్నై నుంచి 25 బ్యారెళ్ల కిరోసిన్ను విమానంలో పంపారు. 1,400 మందికిపైగా మృతిచెందిన ఇండోనేసియాలోని పలూ పట్టణంలో సహాయక చర్యలను వేగవంతం చేశారు. -
తేరుకోని ఇండోనేసియా
ఇండోనేసియాలో భూకంపం, సునామీ ధాటికి పూర్తిగా ధ్వంసమై మరుభూమిని తలపిస్తున్న పలూ పట్టణం. ఈ ప్రకృతి విలయంలో సజీవసమాధి అయినవారి సంఖ్య తాజాగా 1,200కు చేరిందని అనధికార వార్తలొచ్చాయి. దాదాపు 1,91,000 మంది తక్షణ అవసరం కోసం ఎదురుచూస్తున్నారని సోమవారం ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సహాయకచర్యలను ముమ్మరంచేశారు. మరోవైపు, అసువులుబాసిన వందలాది మందిని ఒకేచోట ఖననంచేసేందుకు పలూ పట్టణంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సునామీ విలయ విధ్వంసం
పలూ: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం, సునామీ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించింది. తొలుత భూకంపంతో భవనాలు నేలకొరగడం, అంతలోనే 6 మీటర్ల ఎత్తులో రాకాసి అలలు విరుచుకుపడటంతో సులవేసి ద్వీపంలో ఆదివారం సాయంత్రం నాటికి 832 మంది చనిపోయారు. ద్వీపంలోని ఇళ్లన్నీ ధ్వంసం కావడంతో ప్రజలు ఆకలి తీర్చుకునేందుకు దుకాణాలతో పాటు తాగునీటి ట్యాంకర్లను సైతం లూటీ చేస్తున్నారు. ప్రజలు భారీగా మృత్యువాత పడిన నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించకుండా అధికారులు శవాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్ కల్లా మాట్లాడుతూ..భూకంపం సంభవించిన ఉత్తర సులవేసి ప్రాంతంలో మృతుల సంఖ్య వేలలో ఉండొచ్చని తెలిపారు. చాలామంది ప్రజలు ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని వెల్లడించారు. భూకంపం–సునామీతో తీవ్రంగా దెబ్బతిన్న చాలా ప్రాంతాలకు సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదన్నారు. కాగా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఆదివారం సాయంత్రం సులవేసిలోని పలూ పట్టణాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. భూకంపం–సునామీ నేపథ్యంలో ఇండోనేసియాలో చిక్కుకున్న 71 మంది విదేశీ పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఫ్రాన్స్కు చెందిన ముగ్గురు, దక్షిణ కొరియాకు చెందిన ఓ పర్యాటకుడి జాడ తెలియరాలేదని వెల్లడించారు. వాయుసేనకు చెందిన సీ–130 హెర్క్యులస్ విమానం ద్వారా ఆహార పదార్థాలను చేరవేస్తున్నట్లు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్న ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఆపద్బాంధవుడిగా ఫేస్బుక్ భూకంపం–సునామీ తాకిడికి అతలాకుతలమైన సులవేసి ద్వీపంలో ప్రజలకు ఫేస్బుక్ సహాయకారిగా మారింది. చాలామంది తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల వివరాలను ఫేస్బుక్లో పంచుకుంటున్నారు. సంబంధిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. మరికొందరేమో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఫొటోలు తీసి ఫేస్బుక్ గ్రూపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారనీ, సాయం చేయాలని కోరుతూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరైతే తమ కుటుంబ సభ్యుల మృతదేహాలు దొరికితే సామూహిక ఖననం చేయవద్దనీ, వాటిని తాము తీసుకువెళతామంటున్నారు. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ ఇండోనేసియాలో భూకంపం–సునామీతో 832 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో మిత్రుడైన ఇండోనేసియాకు తోడుగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది. పని చేయని హెచ్చరిక వ్యవస్థ ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సులవేసి ద్వీపంలో మృతుల సంఖ్య 832కు చేరుకుందని నిపుణులు ఆరోపిస్తున్నారు. 2004 సునామీ సృష్టించిన భయానక విధ్వంసం తర్వాత పసిఫిక్ ప్రాంతంలో సునామీలను గుర్తించేందుకు సెన్సార్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, బోయెలతో ఓ ప్రోటోటైప్ వ్యవస్థను అమెరికా–జర్మనీ– మలేసియా–ఇండోనేసియా శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఇందుకోసం అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ రూ.21.75 కోట్లను కేటాయించింది. ఈ హెచ్చరిక వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు కేవలం రూ.50 లక్షలు కావాల్సి ఉండగా, ఆర్థికస్థితి బాగోలేదంటూ ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. సరైన నిర్వహణ లేకపోవడంతో సముద్ర గర్భంలోని ప్రకంపనలను పసిగట్టే చాలా బోయెలు చెడిపోగా, మరికొన్ని చోరీకి గురయ్యాయి. అలాగే సునామీని ముందుగా హెచ్చరించే ‘టైడ్ గేజ్’లు కూడా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యాయి. ఈ ఏడాది జూన్లో ఫైబర్ కేబుల్స్ కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఏ విభాగం కూడా ముందుకు రాలేదు. రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపానికి ప్రజలు కకావికలమయ్యారనీ, ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సునామీ హెచ్చరిక సైరన్లను అధికారులు మోగించలేకపోయారని నిపుణులు గుర్తించారు. భూకంపాలు సంభవించినప్పుడు ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్లిపోవాలన్న అవగాహన ప్రజల్లో లేకపోవడంతో సునామీలో చిక్కుకుని చాలా మంది దుర్మరణం చెందారన్నారు. రియల్ హీరో ఏటీసీ ఉద్యోగి భూకంపం సందర్భంగా తన ప్రాణాలను కోల్పోయినా వందలాది మందిని కాపాడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ) ఆంథోనియస్ గునవన్ అగుంగ్(21)ను స్థానిక మీడియా హీరోగా కీర్తిస్తోంది. పలూలోని మురియారా ఎస్ఐఎస్ అల్ జుఫ్రీ విమానాశ్రయంలో ఆంథోనియస్ శుక్రవారం విధులు నిర్వహిస్తుండగా శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. దీంతో మిగతా ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందిని బయటకు పంపిన ఆంథోనియస్ తాను మాత్రం అక్కడే ఉండిపోయాడు. వరుస ప్రకంపనలు భవనాన్ని కుదిపేస్తున్నా అక్కడే ఉండి ఎయిర్పోర్టులోని విమానాలకు క్లియరెన్స్ ఇవ్వసాగాడు. ఎయిర్పోర్ట్లోని చిట్టచివరి విమానం టేకాఫ్ అయిన తర్వాత బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. దీంతో నాలుగంతస్తుల భవనం నుంచి ఒక్కసారిగా దూకేశాడు. అంతర్గత రక్తస్రావంతో పాటు కాలు విరిగిన ఆంథోనియస్ను సహోద్యోగులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే ఎయిర్ అంబులెన్స్(హెలికాప్టర్) అక్కడకు చేరుకునేలోపే ఆంథోనియస్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఆంథోనియస్ ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తుగా ఆయన ర్యాంకును రెండు లెవల్స్కు పెంచినట్లు ఎయిర్ నావ్ కంపెనీ తెలిపింది. సునామీలో ధ్వంసమైన దుకాణం నుంచి సరుకులను ఎత్తుకెళ్తు్తన్న స్థానికులు -
ఇండోనేసియాలో సునామీ బీభత్సం
-
సునామీ బీభత్సం.. 800కు చేరిన మృతుల సంఖ్య
జకార్తా : సునామీ దాటికి దీవుల దేశం ఇండోనేషియా చిగురుటాకులా వణికుతోంది. శుక్రవారం సంభవించిన భారీ భూకంపంతోపాటు, సునామీ ప్రకంపనలకు మృతుల సంఖ్య 800 మందికి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువగా సులవేసి సమీపంలోని పలూ పట్టణంలో అత్యధికంగా ప్రజలు మరణించినట్లు అధికారులు తెలిపారు. పలూ పట్టణంలో వీదేశి పర్యాటకులు బీచ్ ఫెస్టివల్కు సిద్దమవుతున్న తరుణంలోనే సునామీ రావడంతో ప్రాణ నష్టం భారీ సంఖ్యలో వాటిల్లింది. సునామీ ధాటికి వేల మంది గల్లంతయ్యారని, వారి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రులను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ.. హెలికాఫ్టర్లు, సైనిక దళాల సహాయంతో చర్యలు చేపడుతున్నారు. సునామీ ధాటికి రోడ్లు, భవనాలు, తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకృతి ప్రతాపానికి అనేక మంది ప్రజలు నిరాశ్రయులైనారు. కాగా ఇండోనేషియాను భారత్ తరఫున తగిన సహాయం అందిస్తామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితి వేదికగా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. -
భారీ భూకంపం.. 400 మంది మృతి
జకార్తా/పలూ: ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి పగబట్టింది. 2004 నాటి సుమత్రా సునామీ దుర్ఘటనను, రెండు నెలల క్రితం నాటి భూకంపాన్ని మరిచిపోకముందే మరోసారి భూకంపం, సునామీ రూపంలో ప్రకృతి కన్నెర్రజేసింది. సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో దేశ, విదేశీ పర్యాటకులు బీచ్ ఫెస్టివల్కు సిద్ధమవుతున్న తరుణంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం, ఆ వెంటనే 4–6 మీటర్ల ఎత్తు రాకాసి అలలతో సునామీ విరుచుకుపడటంతో 400 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆసుపత్రులు కూలిపోవడంతో ఆరుబయటే క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్నారు. సముద్రతీరంలోని పలూ పట్టణం దాదాపుగా నేలమట్టమైంది. సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన సైన్యం, అధికారులకు ఎటు చూసినా శవాల గుట్టలే కనబడుతున్నాయి. బీచ్లో ఇసుకలో కూరుకుపోయి సగం బయటకు కనబడుతున్న మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. శనివారం రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం 384 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూ ఉపరితలానికి పదికిలోమీటర్ల లోతులో శుక్రవారం సాయంత్రం సమయంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, సునామీ బారిన పడిన ఇండోనేసియాను ఆదుకుంటామని ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. హృదయ విదారక దృశ్యాలు భూకంపం తీవ్రతకు చాలాచోట్ల ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుని పలువురు చనిపోగా వేల మంది క్షతగాత్రులయ్యారు. ఆసుపత్రులూ కూలడంతో ఆసుపత్రుల ఆరుబయటే చికిత్సనందిస్తున్నారు. బీచ్లో కూరుకుపోయిన వారు కొందరైతే.. అలల ధాటికి కొట్టుకొచ్చి బలమైన గాయాలతో చనిపోయిన వారు మరికొందరు. బురదలో కూరుకుపోయిన ఓ చిన్నారి మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీసి బంధువులకు అప్పజెబుతున్న దృశ్యాలు కంటతడిపెట్టించాయి. నిరాశ్రయులు లక్షల్లోనే.. భూకంపం తాకిడికి ఇళ్లన్నీ కూలి వేల మంది నిరాశ్రయులయ్యారు. భూమి కంపిస్తున్న సమయంలో స్థానికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లు, రిసార్టులనుంచి బయటకు పరుగులు తీస్తున్న సమయంలోనే సునామీ విరుచుకుపడింది. సముద్ర తీరంలో ఉన్న ఓ మసీదు ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి ధ్వంసమవగా.. సమీపంలోని ఇళ్లలోకి కార్లు, ఇతర వాహనాలు చొచ్చుకొచ్చాయి. ఓ ఎత్తైన భవనంపై ఏర్పాటుచేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. రోడ్లు, వీధి దీపాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఈ పట్టణమంతా శుక్ర, శనివారాల్లో రాత్రంతా చీకట్లోనే మగ్గింది. ‘అలలు అంతెత్తున ఎగసిపడుతుండటాన్ని చూసి పరిగెత్తాను. అందుకే ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఓ స్థానికుడు పేర్కొన్నారు. రంగంలోకి సైన్యం ఈ ఏడాది జూలై, ఆగస్టులో లోంబోక్ ద్వీపంలో వచ్చిన దానికంటే ఈసారి వచ్చిన భూకంప తీవ్రతే ఎక్కువని అధికారులు తెలిపారు. కాగా, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైన్యాన్ని రంగంలోకి దించారు. విద్యుత్, సమాచార వ్యవస్థతోపాటు మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పనిలో సైన్యం ఉంది. శనివారం కూడా పలూలో భూమి పలుమార్లు స్వల్ప తీవ్రతతో కంపించింది. కాగా పలూకు సమీపంలోని దొన్గాలా ప్రాంతంపైనా సునామీ విరుచుకుపడినట్లు సమాచారం అందిందని.. అయితే అక్కడి పరిస్థితేంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ‘భూకంపం, సునామీల బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండటం బాధ కలిగించింది. నీటి తీవ్రతకు కొట్టుకుపోయారని ప్రత్యక్షసాక్షులు, అధికారులు చెబుతున్నారు’ అని సేవ్ ద చిల్డ్రన్ ఎన్జీవో చీఫ్ టామ్ హోవెల్ పేర్కొన్నారు. పలూ పట్టణానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు కూడా వారి ప్రాంతాల్లో ఒకసారి భారీ కుదుపు వచ్చిందని పేర్కొన్నారంటే భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమత్రాలో మొదలై.. ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ఇండోనేసియాపై 2004 నుంచి ప్రకృతి పగబట్టింది. ఆ ఏడాది బాక్సింగ్ డే (డిసెంబర్ 26) సంబరాల్లో పర్యాటకులు ఉన్నపుడు 9.3 తీవ్రతతో వచ్చిన భూకంపం, ఆ తర్వాత 24 మీటర్ల ఎత్తులో వచ్చిన రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇండోనేసియా వ్యాప్తంగా లక్షా 68వేల మంది చనిపోయారు. నాటి సునామీ భారత్సహా పలు దేశాలపై ప్రభావాన్ని చూపింది. 2005 మార్చిలో 8.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 900 మంది చనిపోయారు. 2006 మేలో జావా ద్వీపంలో వచ్చిన భూకంపం 6వేల మందిని బలిగొంది. 2009లో సుమత్రా ప్రధాన ఓడరేవైన పడాంగ్లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం 1,100 మందిని చంపేసింది. ఆ తర్వాత అడపా దడపా వచ్చిన భూకంపం, సునామీలు ఇండోనేసియాపై విరుచుకుపడుతూ వందల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. రవాణా వ్యవస్థ ధ్వంసం పలూ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఓ భారీ బ్రిడ్జి ధ్వంసమైంది. ఈ నగరానికి మిగిలిన ప్రపంచంతో అనుసంధానం చేసే రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. కొండచరియలు పడి దార్లు మూసుకుపోయాయి. ప్రార్థనలకోసం తీరంలోని మసీదుకు వచ్చిన వారు మొదట భూమి కంపించగానే పరుగులు తీశారు. అంతలోనే వరుసగా భూమి కంపించడంతో చాలా మంది మసీదు శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించినట్లు తెలుస్తోంది. బురదలో కూరుకుపోయిన చిన్నారి మృతదేహాన్ని తరలిస్తున్న సహాయక సిబ్బంది దాదాపు పూర్తిగా నేలమట్టమైన పలూ నగరంలోని ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న భూకంప బాధితులు -
ఇండోనేషియా మరోసారి భూకంపంతో సునామీ
-
సునామీ దాటికి వణికిన దీవుల దేశం..!
జకార్తా : దీవుల దేశం ఇండోనేషియా మరోసారి భూకంపంతో వణికిపోయింది. శుక్రవారం సంభవించిన భూకంపంతో ప్రజలు భయాందోళలకు గురైయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదవ్వడంతో ప్రజలు ఇళ్లలోంచి భయటకు పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు ముందుగా హెచ్చరించినట్లుగానే తీర ప్రాంతంలో సునామీ అలలు ఎగసిపడ్డాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఎగసిపడడంతో ప్రజలు ఉరుకులుపరుగులు తీశారు. సునామీ దాటికి తీర ప్రాంతంలోని ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్ద విపత్తు సంభంవించే అవకాశం ఉన్నందున అధికారులంతా సిద్దంగా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఎంతా అనేది ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. కాగా గతనెల ఇండోనేషియాలోని లాంబోక్ దీవిలో సంభవించిన భూకంపంలో 500కి పైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. -
ఏషియన్ గేమ్స్: ఇండోనేషియాలో భూకంపం
జకార్త: ఏషియన్ గేమ్స్ ఆతిథ్య దేశం ఇండోనేషియాలో మంగళవారం భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంప దాటికి ఎలాంటి ప్రమాదాలు, ప్రాణనష్టం జరగలేదు. సునామీ వచ్చే అవకాశం కూడా లేదని, భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2 గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఈ భూకంప దాటికి 18వ ఏషియా గేమ్స్ జరుగుతున్న జకార్త, పలేంబాగ్ ప్రాంతాల్లోతో పాటు టీమర్ ఐస్లాండ్, కుపాంగ్ల్లో భూమి కొంతమేర కంపించింది. ఇటీవల లంబోక్ దీవుల్లో సంభవించిన భూకంప తీవ్రతకు 80 మందికి పైగా మృతి చెందగా, వేలాది పౌరులు తీవ్ర గాయలపాలయ్యారు. ఈ ఏడాది వరుసగా సంభవించిన భూకంపాలతో ఇండోనేషియాలో సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. Prelim M6.2 Earthquake Timor region, Indonesia Aug-28 07:08 UTC, updates https://t.co/3jkUFHLFjy — USGS Big Quakes (@USGSBigQuakes) August 28, 2018 -
ఇండోనేషియాలో భూకంపం..10 మంది మృతి
జకార్తా : ఇండోనేషియాలోని లోమ్బాక్ దీవిలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో పది మంది చనిపోగా, సుమారు 33 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.4 గా నమోదైంది. భూకంపం ధాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సుమారు 40 సార్లు భూ ప్రకంపనలు నమోదైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పెద్ద ఆపద ఏదో సంభవించబోతుందని ముందే భావించామని భూకంప కేంద్రానికి సమీపంలో నివసిస్తున్న ఓ వ్యక్తి తెలిపారు. భూకంప తీవ్రత ఎక్కవగా ఉండటంతో తమ ఇంట్లో ఉన్నవాళ్లంతా భయంతో బయటికి పరుగులు పెట్టారని జుల్కిఫ్లి అనే స్థానికుడు పేర్కొన్నాడు. ఇండోనేషియా దేశం చిన్న చిన్న దీవుల సమూహం. ఈ దేశం పసిఫిక్ రింగ్ ఆఫ్ పైర్ అనే భూఫలకాల మీద ఉంది. వీటిని భూకంపాన్ని సూచించే హాట్స్పాట్స్ అని పిలుస్తారు. -
భారీ మంచుకొండ.. భయం గుప్పిట్లో గ్రామం..
ఇనార్సూట్, గ్రీన్లాండ్ : కేవలం 170 మంది జనాభా కలిగిన గ్రీన్లాండ్లోని ఇనార్సూట్ గ్రామం సునామీ భయంతో వణికిపోతోంది. ఇందుకు కారణం దాదాపు 100 మీటర్లు(330 అడుగులు) ఎత్తైన భారీ మంచుకొండ సదరు గ్రామాన్ని సమీపిస్తుండటం. దాని నుంచి మంచు చరియ గనుక విరిగితే భారీ ఎత్తున అలలు గ్రామంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. అయితే, కొందరు స్థానికులు మాత్రం ఈ తరహా భారీ మంచు తునకలు గ్రామానికి సమీపంలో కనిపించడం కొత్తేమీ కాదని అంటున్నారు. గతంలో దీని కంటే అతి పెద్ద మంచు చరియలు అటువైపుగా పయనించాయని వెల్లడించారు. మంచు చరియకు భారీ స్థాయిలో పగుళ్లు ఉండటమే మాత్రం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించే స్టేషన్, ఇంధన వనరు ప్రదేశం తీరానికి అతి చేరువలో ఉన్నాయి. మంచు చరియ దాదాపు కోటి 10 లక్షల టన్నుల బరువు ఉంటుందని భావిస్తున్నారు. నీటిపై భాగంలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకూ మంచుకొండ ఉంది. అప్పుడప్పుడూ చిన్నచిన్న మంచు ముక్కలు విరిగి నీళ్లలో పడిన శబ్దాలు సైతం స్థానికులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. -
స్పెయిన్ను వణికించిన మినీ సునామీ
-
హడలెత్తించిన మినీ సునామీ
మాడ్రిడ్, స్పెయిన్ : దేశంలో టూరిజానికి ప్రసిద్ధిగాంచిన మజోర్కా, మెనోర్కా ద్వీపాల బీచ్లపై మినీ సునామీ విరుచుకుపడింది. మెనోర్కా పశ్చిమ తీరంలో గల సిటడెల్లా బీచ్ వద్ద ఆరు అడుగులు ఎత్తైన అలలు తీరాన్ని తాకాయి. దీంతో యాత్రికులు బెంబేలెత్తిపోయారు. సిటడెల్లాతో పాటు దగ్గరలోని పలు బీచ్లపై సైతం మినీ సునామీ ప్రభావం కనిపించింది. భీకర గాలుల కారణంగానే తీరంపైకి భారీ అలలు వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీన్ని శాస్త్రీయ పరిభాషలో ‘మెటిరియలాజికల్ సునామీ’గా పిలుస్తారని వెల్లడించారు. పెనుగాలుల తాకిడికి నీటిపై అధిక ఒత్తిడి కలిగి భారీ ఎత్తున అలలు ఎగసిపడతాయని వివరించారు. దీన్నే వాతావరణ ప్రేరిత సునామీగా చెప్పొచ్చని తెలిపారు. అయితే, అల ఎంత ఎత్తుకు ఎగసేది సదరు ప్రదేశంలో ఉన్న లోతును బట్టి ఉంటుందని చెప్పారు. ఈ తరహా సునామీలు తరచుగా మధ్యదరా సముద్రంలో సంభవిస్తుంటాయి. బ్రిటన్ తీరంలో కూడా కనిపిస్తుంటాయి. స్పెయిన్ తీరంలో వచ్చిన మినీ సునామీ ధాటికి తీరంలో ఉన్న రిసార్టులు, బార్లలోకి నీరు చొచ్చుకెళ్లింది. కొన్ని చోట్ల సముద్రపు నీరు రోడ్లపైకి చేరింది. తీరంలో ఉన్న బోట్లను రక్షించుకునేందుకు యజమానులు పడరానిపాట్లు పడ్డారు. ఏంటీ మెటిరియలాజికల్ సునామీ..? సముద్ర గర్భంలో భూకంపాలు, భూపాతాలు, అగ్నిపర్వత ఉద్భేదనాల వల్ల సహజంగా సునామీ సంభవిస్తుందని అందరికీ తెలుసు. అయితే, మెటిరియలాజికల్ సునామీ ఇందుకు విభిన్నం. ఇది సముద్ర గర్భంలో సంభవించదు. గాలి ఒత్తిడి కారణంగా మెటిరియలాజికల్ సునామీ వస్తుంది. వాతావరణం కల్లోలంగా(ఉరుములు, పిడుగులు, పెనుగాలులు, భీకర వర్షం తదితరాలు) ఉన్న సమయంలో గాలి తీవ్ర ఒత్తిడి వల్ల తీరం వైపునకు నీరు వేగంగా నెట్టబడుతుంది. ఇదే సమయంలో నీటి కణాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకుని పెద్ద ఎత్తున ఎగసిపడతూ తీరాన్ని తాకుతాయి. శాస్త్రవేత్తలు సైతం మెటిరియలాజికల్ సునామీలను అర్థం చేసుకునేందుకు ఇంకా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. గ్రేట్ లేక్స్, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అట్లాంటిక్ తీరం, మధ్యదరా, అడ్రియాటిక్ సముద్రాల్లో తరచుగా ఈ మినీ సునామీలు సంభవిస్తుంటాయి. -
తీరప్రాంతంలో అల్లకల్లోల పరిస్థితులు
-
ఉత్తరాంధ్ర తీరంలో అలజడి.. సునామీ హెచ్చరికలు!
సాక్షి, కాకినాడ, విశాఖపట్నం: భారత తూర్పు తీరప్రాంతంలో అల్లకల్లోల పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అలజడి నెలకొంది. ఈ నెల 25 నుంచి వాతావరణంలో మార్పులు ఉంటాయని, ఒకటిన్నర మీటరు నుంచి రెండు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడతాయని భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్కాయిస్) తెలిపింది. ఇన్కాయిస్ జారీచేసిన సునామీ హెచ్చరికలు తూర్పు గోదావరి జిల్లా కేంద్రానికి చేరడంతో సిబ్బంది అప్రమత్తమైంది. సముద్రంలోని అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో తూర్పు గోదావరిలోని రాజమండ్రిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కుర్తుస్తోంది. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లాకు పిడుగు హెచ్చరిక జిల్లాలో శంఖవరం, ప్రత్తిపాడు, మారేడుమిల్లి, రౌతులపడి, వరరామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని సూచనలు చేసింది. తుఫానుల హెచ్చరికల కేంద్రం కీలక ప్రకటన విశాఖ: తూర్పు గోదావరి జిల్లాకు సునామీ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం స్పందించింది. సముద్రంలో భూకంపాలు వచ్చినప్పుడు మాత్రమే సునామీ హెచ్చరికలు జారీచేస్తారని, ప్రస్తుతం సముద్రంలో భూకంపాలు రాలేదని స్పష్టం చేసింది. హిందూ మహాసముద్రంలో గాలుల తీవ్రత వల్లే కెరటాల ఉధృతి 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు మరో 24 గంటలపాటు ఎగిసిపడే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉత్తర కోస్తాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. -
జపాన్లో భూకంపం
టోక్యో: జపాన్లో సోమవారం వేకువజామున 1.32 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. జపాన్ మెటియోరాలాజికల్ ఏజెన్సీ(జేఎంఏ) ప్రకారం..భూకంపకేంద్రం 35.2 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 132.6 డిగ్రీలు తూర్పు రేఖాంశాల మధ్య 10 కి.మీల లోతున ఓడా పట్టణంలో సంభవించింది. ఈ ఘటనతో పట్టణంలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అలాగే నీటి సరఫరా సమస్య కూడా తలెత్తింది. ఈ భూకంపం వల్ల పట్టణంలో పలు భవనాలకు, రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ న్యూక్లియర్ పవర్ స్టేషన్లకు ఎటువంటి ప్రమాదం కలగలేదు..యథావిధిగా పనిచేస్తున్నాయి. ఎటువంటి సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేయలేదు. -
జపాన్ సునామీ బీభత్సానికి ఏడేళ్లు
-
భారీ భూకంపం : సునామీ హెచ్చరిక
పెరూ : దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3 నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పుక్వికో పట్టణానికి ఈశాన్యంలో 124 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ సంభవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. -
రష్యాలో భారీ భూకంపం
-
రష్యాలో భారీ భూకంపం
- ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ చేసిన రష్యా ప్రభుత్వం బేరింగ్ ఐలాండ్: రష్యాలోని బేరింగ్ ఐలాండ్ సముద్రతీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నయోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తొలుత 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం.. కొద్ది క్షణాల్లోనే 7.8 తీవ్రతకు చేరుకుందని తెలిపాయి. సముద్రంలో పది కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పాయి. అయితే, నికోల్కోయ్ నగరానికి తీరం 200 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో భారీ నష్టం తప్పిందని పేర్కొన్నాయి. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో భారీ సునామీ సంభవించొచ్చని సునామీ హెచ్చరికల కేంద్ర అలర్ట్ జారీ చేసినట్లు తెలిపాయి. న్యూజిలాండ్పై భూకంప ప్రభావం ఏమి ఉండకపోవచ్చని చెప్పాయి. -
సునామీని పసిగట్టింది..!
పర్యాటకులు అందరూ ఖాళీ చేసిన కొద్దిసేపటికే మకావ్ బీచ్ తీరాన్ని సునామీ తాకింది. కానీ ముందుగానే సునామీని పసిగట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 2004లో వచ్చిన సునామీలో ప్రాణనష్టం నమోదుకాని అతికొద్ది బీచ్ల్లో మకావ్ బీచ్ ఒకటి. టిల్లీ సమయస్ఫూర్తి వల్ల తామంతా ప్రాణాలతో బయటపడ్డామని పర్యాటకులంతా బాలికను ప్రశంసలతో ముంచెత్తారు. ఇంగ్లాండ్కు చెందిన పెన్నీ స్మిత్, కొలిన్ స్మిత్లకు 1994లో టిల్లీ స్మిత్ జన్మించింది. చిన్నప్పటి నుంచే టిల్లీ చదువులో ఎప్పుడూ ముందుండేది. అంతేకాదు నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆసక్తి చూపుతూ ఉండేది. తన తరగతిలో ఎప్పుడూ మొదటి ర్యాంకులోనే నిలిచేది. టీచర్లు చెప్పే పాఠాలను ఆమె ఆసక్తిగా వినేది. విన్న పాఠాలను ప్రకృతి పరిసరాలను గమనిస్తూ అర్థం చేసుకునేది. టిల్లీకి మిగతా సబ్జెక్టులకన్నా జాగ్రఫీ అంటే ఎంతో ఇష్టం ఉండేది. మాష్టార్లు చెప్పిన పాఠాల్లోలా భౌగోళిక పరిస్థితులు ఉన్నాయో లేదో పరిశీలించేది. తరగతి గదిలో నేర్చుకున్న విషయాలు వాతావరణంలో జరుగుతున్న మార్పులపై అవగాహన పెంచుకునేది టిల్లీ. తరగతి గదిలో ఉన్నప్పుడు కూడా స్నేహితులతో ఎప్పుడు వాన వస్తుందో చెప్పేది. వాతావరనంలో కలిగే మార్పులు తేమలో వ్యత్యాసాలను ఇట్టే కనిపెట్టేది. ఈ రోజు పెద్దవాన పడుతుందని ఇంట్లోవాళ్లతో ముందే చెప్పేది. ఆ మాటలను తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. సముద్రంలో మార్పులను చూసి.. 26 డిసెంబర్ 2004లో పదేళ్ల వయసులో ఉన్న టిల్లీ కుటుంబంతో కలిసి థాయ్లాండ్లోని మకావ్ బీచ్ను సందర్శించేందుకు వెళ్లింది. సరదాగా బీచ్లో తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు అక్కడున్నవారంతా. కొందరు సముద్రంలోదిగి ఈతకొడుతుండగా మరికొందరు బీచ్లోని ఇసుకలో ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఒక్కటై సరదాగా గడుపుతున్నారు. టిల్లీ కూడా సముద్రంలో ఈతకొడుతూ స్నేహితులతో ఆడుకుంటోంది. అయితే ప్రకృతి పరిసరాల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనించే టిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలా ఆమె ఉలిక్కిపడటానికి కారణం వాతవరణంలో సంభవించిన మార్పే. తీరప్రాంతంలో ఉన్న నీటిమట్టం నెమ్మదిగా తగ్గుతుండటాన్ని టిల్లీ గమనించింది. అంతేకాదు సముద్ర నీటి ఉపరితలంపై చిన్న చిన్న బుడగలు రావడాన్ని గమనించింది. మరికొద్దిసేపట్లో ఇక్కడ సునామీ రాబోతుందని టిల్లీ పసిగట్టింది. ఇక్కడే ఉంటే ఈ బీచ్లో ఉన్నవారందూ సునామీలో కొట్టుకుపోవడం ఖాయం అనుకున్న టిల్లీ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. మామూలుగా అయితే టిల్లీ మాటలను లెక్కచేయని తల్లిదండ్రులు సముద్రంలో మార్పులను చూసి ఆందోళన చెందారు. అక్కడున్న వారందరినీ ఒప్పించి అక్కడ నుంచి ఖాళీ చేయించగలిగారు. రెండువారాల ముందే... జాగ్రఫీ అంటే అమితంగా ఇష్టపడే టిల్లీ ఆ పాఠాలు విన్నవెంటనే దానికి సంబంధించిన ప్రకృతి మార్పులను ఎప్పటికప్పుడు గమనించేది. అలానే మకావ్ బీచ్ను సందర్శించే రెండువారాల ముందే పాఠశాలలో సునామీలు ఎలా వస్తాయి....? అన్న అంశంపై బోధన జరిగింది. టీచర్లు చెప్పిన అంశాలను జాగ్రత్తగా విన్న టిల్లీ మాయాకావ్ బీచ్లో వస్తున్న మార్పులను గమనించింది. టీచర్లు చెప్పిన అంశాలు, సముద్రంలో వస్తున్న మార్పులు ఒకేలా ఉండటంతో సునామీ రాబోతుందిని అక్కడున్నవారిని అప్రమత్తం చేసి వందలామంది ప్రాణాలు కాపాడింది టిల్లీ. వందలాది మంది ప్రాణాలు కాపాడిన టిల్లీకి ద మెరైన్ సోసైటీ సీ కాడెట్స్ ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. టిల్లీని 2005లో ఐరాస విపత్తు అధికారులు సత్కరించారు. మీడియా ప్రతినిధులు ఇంటర్వూ చేయడానికి వచ్చిన టిల్లీ తల్లిదండ్రులు అందుకు అనుమతించలేదు. – సాక్షి స్కూల్ ఎడిషన్