TTD Trust Board
-
ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 214 గదుల వసతి గృహ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విడతల వారిగా హాస్టల్ నిర్మాణం చేపట్టాలని బోర్డు సూచించింది. టీటీడీ బంగారు నగలు, డిపాజిట్లతోపాటు పలు విషయాలపై పాలకమండలి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షార్ట్ టర్మ్ డిపాజిట్ చేయడం వల్ల తక్కువ వడ్డీ వస్తుందని, లాంగ్ టర్మ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందన్న సభ్యులు తెలిపారు. అలాగే హుండీ ద్వారా రద్దయిన నోట్లు వస్తున్నాయని, ఇప్పటి వరకు రూ.50 కోట్లు పాత నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయంపై రిజర్వు బ్యాంకుకు అనేకసార్లు లేఖ రాసినట్లు పాలకమండలి సభ్యులు వెల్లడించారు. మరోసారి కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. (దేవుడు కూడా చట్టానికి అతీతం కాదు) బంగారు డిపాజిట్ పై చర్చించిన సాలక మండలి వాటిని 12 సంవత్సరాలు లాంగ్ టర్మ్ డిపాజిట్ చెయ్యాలని నిర్ణయించారు. పాలకమండలి సభ్యుడు పార్థసారథి అభ్యర్థన మేరకు విజయవాడ, పోరంకిలో కళ్యాణమండపం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అలాగే తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలపై చర్చించారు. తిరుమలలో పెరుకుపోయినట్లు 7 టన్నులు వ్యర్థాలను తరలించడానికి టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి ఆర్థిక విరాళం అందింంచారు. వీటితోపాటు టీటీడీ ఎలక్రికల్ విభాగంలో పని చేస్తున్న 53 కార్మికుల కాంట్రాక్టు మరో రెండు సంవత్సరాల పెంపుకు ఆమోదం తెలిపింది. సింగరాయకొండ ఆలయం ప్రాంగణంలో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. (ఆస్తుల విక్రయ ఆలోచన విరమించుకున్నాం) శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం అధిక మాసం సందర్భంగా ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం కరోనా ఉధృతి తగ్గితే అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు వెలుపల నిర్వహణ కరోనా కారణంగా వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించలేని పరిస్థితి బర్డ్ ఆస్పత్రిలో రూ.5.5కోట్లతో అదనపు గదుల నిర్మాణం: టీటీడీ ఛైర్మన్ చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం -
టీటీడీ పాలక మండలి సభ్యులు వీరే
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం దాని చట్టంలో సవరణలు చేసిన నేపథ్యంలో 24 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం గతంలోనే నియమించింది. తాజాగా నియమించిన సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు కూడా ప్రాతినిథ్యం కల్పించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, దేవాాదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవో పాలక మండలిలో ఎక్స్ అఫిషీయో సభ్యులుగా కొనసాగుతారు. 28 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సమాజ సేవకులకు చోటు కల్పించింది. టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా.. 1. కే.పార్థసారథి (ఎమ్మెల్యే) 2. యూవీ రమణమూర్తిరాజు (ఎమ్మెల్యే) 3. ఎం.మల్లికార్జునరెడ్డి (ఎమ్మెల్యే) 4. పరిగెల మురళీకృష్ణ 5. కృష్ణమూర్తి వైద్యనాథన్ 6. నారాయణస్వామి శ్రీనివాసన్ 7. జే.రామేశ్వరరావు 8. వి. ప్రశాంతి 9. బి.పార్థసారథిరెడ్డి 10. డాక్టర్ నిచిత ముప్పవరకు 11 నాదెండ్ల సుబ్బారావు 12 డీ.పీ.అనంత 13 రాజేష్ శర్మ 14 రమేష్ శెట్టి 15 గుండవరం వెంకట భాస్కరరావు 16 మూరంశెట్టి రాములు 17 డి.దామోదర్రావు 18 చిప్పగిరి ప్రసాద్కుమార్ 19 ఎంఎస్ శివశంకరన్ 20 సంపత్ రవి నారాయణ 21 సుధా నారాయణమూర్తి 22 కుమారగురు (ఎమ్మెల్యే) 23 పుత్తా ప్రతాప్రెడ్డి 24 కె.శివకుమార్ ఎక్స్ అఫీషియో సభ్యులు.. 1 రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్) 2 దేవాదాయ శాఖ కమిషనర్ 3 తుడా చైర్మన్ 4 టీటీడీ ఈవో -
టీటీడీపై పిటిషన్; హైకోర్టును ఆశ్రయించండి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టీటీడీ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆయన వీటిపై సీబీఐ విచారణ చేపట్టాలని సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. కాగా, కోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి ట్విటర్లో స్పందించారు. ‘తిరుపతి విషయంలో నేను దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు నేను హైకోర్టును ఆశ్రయిస్తాను. ఇది ఒక మంచి ప్రారంభం’ అని ఆయన పేర్కొన్నారు. -
శ్రీవారి దర్శనం రద్దు చేసే యోచనలో బోర్డు
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ నెల 14న అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. గత కొంత కాలంగా టీటీడీలో చెలరేగుతున్న వరుస వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలో ఆసక్తి రేకిత్తిస్తోంది. ఇక ఆగష్టు 12 నుంచి 16 వరకూ మహా సంప్రోక్షణ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ సమయంలో స్వామి వారి దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో పాలక మండలి ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీవారి నగలు మాయం చేస్తున్నారంటూ మాజీ టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఘాటు విమర్శలు చేస్తున్న సమయంలో, పాలక మండలి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
టీటీడీపై సుప్రీంకోర్టులో పిటిషన్ : స్వామి
న్యూఢిల్లీ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో గత కొంతకాలం నుండి వివాదాలు కొనసాగుతున్నాయి. ఓవైపు ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో టీటీడీ వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 19న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీని తొలగించాలన్నదే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ సారాంశమని సమాచారం. ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేయాలని డిమాండ్, దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేదంటే లూటీ ఇలాగే కొనసాగుతుందని గతంలో స్వామి వ్యాఖ్యానించారు. బోర్డులో జరుగుతున్న వివాదంపై టీటీడీ సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపగా, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డులో పొరుగు రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రి భార్యకు చోటు కల్పించడం, టీడీపీ ఎమ్మెల్యే అనితకు సైతం బోర్డు మెంబర్గా నియమించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనిత చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఏపీ ప్రభుత్వం ఆమె విషయంలో వెనక్కి తగ్గింది. -
బాబు లేఖపై తీవ్రంగా స్పందించిన ఐవైఆర్
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆభరణాల అంశంలో హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖపై రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత విచారణ అవసరం ఉందా.. లేదా అని నిర్ణయించుకోవాలని సూచించారు. శ్రీవారి ఆభవరణాల విషయంలో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డిలపై పరువు నష్టం వేయడం అర్థరహితమని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. కేవలం రాజకీయ దుమారం నుంచి తమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇది చేసి ఉంటే వారికి మంచిది కాదని హితవు పలికారు. న్యాయస్థానం తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో హైకోర్టు జడ్జి న్యాయ విచారణ కోరారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆ స్థాయిలో విచారణ అవసరమని భావించి కోరితే అది వేరే విషయం. అటువంటప్పుడు దీక్షితులు, విజయసాయి గారి మీద పరువునష్టం దావాలు కూడా అర్థరహితం అవుతాయి’, ‘ఆ విధంగా కాకుండా కేవలం రాజకీయ దుమారం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం న్యాయ విచారణ కోరుకుంటే అది అర్ధ రహితం అవుతుంది. ఉన్నత న్యాయస్థానం తమ అమూల్య సమయాన్ని దానికోసం వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే రాజకీయంగా దానిని ఎదుర్కొనవలసి ఉంటుందని’ ఐవైఆర్ కృష్ణారావు వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఐవైఆర్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో హైకోర్టు జడ్జి న్యాయ విచారణ కోరారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆ స్థాయిలో విచారణ అవసరమని భావించి కోరితే అది వేరే విషయం. అటువంటప్పుడు దీక్షితులు విజయసాయి గారి మీద పరువునష్టం దావా లు కూడా అర్థరహితం అవుతాయి. — IYRKRao , Retd IAS (@IYRKRao) 28 June 2018 ఆ విధంగా కాకుండా కేవలం రాజకీయ దుమారం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం గా న్యాయ విచారణ కోరుకుంటే అది అర్ధ రహితం అవుతుంది. ఉన్నత న్యాయస్థానం తమ అమూల్య సమయాన్ని దానికోసం వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే రాజకీయంగా దానిని ఎదుర్కొనవలసి ఉంటుంది. — IYRKRao , Retd IAS (@IYRKRao) 28 June 2018 -
పింక్ డైమండ్ పగిలిపోయే ఆస్కారం లేదు
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు చిత్తూరు జిల్లా తిరుపతిలో పీఠాధిపతులు సమావేశమయ్యారు. అనంతరం శ్రీ విద్యాగణేషానంద భారతీ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై టీడీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామివారి సన్నిధిలో ఉన్న పింక్ డైమండ్ పగిలిపోయే ఆస్కారమే లేదని స్వామీజి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టీటీడీలో తలెత్తుతున్న వివాదాలు, అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలతో శ్రీవారి భక్తులు సైతం ఆందోళన చెందుతున్నారని విద్యాగణేషానంద భారతీ స్వామి తెలిపారు. -
దీక్షితులుపై లీగల్గా ముందుకెళ్తాం: టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుమల: టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవల ఉద్వాసనకు గురైన దేవస్థాన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవస్థాన వ్యవహరాలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న దీక్షితులుపై లీగల్గా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సుధాకర్ యాదవ్, ఈవో సింఘాల్ మంగళవారం మీడియాతో తిరుమలలో మాట్లాడారు. 24 ఏళ్లపాటు ప్రధాన అర్చకుడిగా ఉన్న దీక్షితులు దేవస్థాన వ్యవహారాలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఛైర్మన్ మండిపడ్డారు. ఆరోపణలు చేసేముందు పాలక మండలి దృష్టికి తేవాల్సిందని అన్నారు. శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకు పెడతామనీ, దీనిపై ఆగమ శాస్త్ర పండితుల సలహాలను తీసుకుంటామని ఈవో సింఘాల్ తెలిపారు. ఆభరణాల పూర్తి భద్రత టీటీడీదేనని అన్నారు. టీటీడీ పాలక మండలి తీసుకున్న పలు నిర్ణయాలను వారు వెల్లడించారు. రాష్ర్ట వ్యాప్తంగా దళిత, గిరిజన వాడలు, మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో ఒక్కోటి 10 లక్షల రూపాయల వ్యయంతో ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలోని నాగలాపురంలో వేద పాఠశాల ఏర్పాటు చేయనున్నామని వివరించారు. తిరుమలలో 70 ఎకరాల విస్తీర్ణంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
అర్చకులకు రిటైర్మెంట్ మంచిది పద్ధతి కాదు : ఐవైఆర్
సాక్షి, చిత్తూరు : టీటీడీ అర్చకులకు రిటైర్మెంట్ అనేది మంచిది పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆదివారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అభివృద్ధి వికేంద్రీకరణ, సామాజిక న్యాయంపై చర్చించారు. ఈ సదస్సుకు జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పాల్గొన్నారు. సదస్సులో ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘అమరావతి ఎవరి రాజధాని’ పుస్తకాన్నా ఈశ్వర్రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఐవైఆర్ మాట్లాడుతూ.. టీటీడీ మ్యానిఫెస్టోలో అర్చకుల పదవీ విరమణ అన్నది ఉండదని ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు పదవీ విరమణ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. అర్చకుల పదవీ విరమణ అనేది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. తిరుమలలో పూజా కైంకార్యాలు సరిగా జరగడం లేదని రమణ దీక్షితుల భావన అని, ఇందుకు పరిపాల విభాగమే కారణమని ఆయన పేర్కొన్నారని ఐవైఆర్ గుర్తుచేశారు. ఆరోపణలపై విచారణ చేస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. నేను ఈవోగా ఉన్నపుడు గొల్ల మండపం పగలగొట్టాలని కొందరు సలహా ఇచ్చారు.. కానీ నేను అందుకు అభ్యంతరం వ్యక్తం చేశానని ఐవైఆర్ గుర్తుచేశారు. శేఖర్రెడ్డి టీటీడీ సభ్యుడుగా ఉంటూ కోట్ల రుపాయలతో పట్టుబడటంతో అన్యమతస్తురాలైన అనితను బోర్డు సభ్యురాలిగా నియమించిపుడు టీటీడీ ప్రతిష్ట దెబ్బతినలేదా.? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు రమణ దీక్షితులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే.. టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఐవైఆర్ మండిపడ్డారు. -
‘విచారణ అంటే చంద్రబాబు భయపడుతున్నారు’
సాక్షి, తిరుపతి : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగల మీద సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. అయితే విచారణకు మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఆయన తెలిపారు. టీటీడీ వివాదంపై ఎంపీ వరప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అయితే టీటీడీలో జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తిన రమణ దీక్షితులను తొలగించడం దారుణమని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన వారికి చట్ట ప్రకారం ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సూచించారు. తిరుమల పోటులో అర్చకులకు తెలియకుండా తవ్వకాలు జరిపారని చచెప్పారు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో.. చివరికి అధికారులకు కూడా తవ్వకాల గురించి తెలియదని చెబుతున్నారు. తిరుమల స్వామి వారి నగల మీద ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ టీటీడీ వివాదంపై విచారణకు డిమాండ్ చేస్తుందన్నారు. రమణ దీక్షితులకు, మాకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ నేత వరప్రసాద్ స్పష్టం చేశారు. -
లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా
సాక్షి, అమరావతి: శ్రీవారికి చెందిందిగా ప్రచారంలో ఉన్న గులాబీ వజ్రం అసలు లేనేలేదని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తిరుమల ఆలయంలో నగల మాయం, అర్చకుల తొలగింపు, విబేధాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన ఈ భేటీకి టీటీడీ ఈవో సింఘాల్ సహా ఇతర ఉన్నతాధికులు హాజరయ్యారు. (చదవండి: చంద్రబాబు పదేపదే అదే చెప్పారు: సింఘాల్) ‘‘శ్రీవారి ఆభరణాల రికార్డుల్లో గులాబీ వజ్రం అనేది లేనేలేదు. రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా? ఎక్కడి నుంచి తెస్తాం? అసలు రమణదీక్షితులు ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?’’ అని టీటీడీ చైర్మన్ ప్రశ్నించారు. కొద్దిరోజులుగా జరుగుతోన్న వ్యవహారాలపై సీఎం వివరాలు అడిగారని, అన్ని విషయాలూ సవివరంగా చెప్పామని, రమణదీక్షితులుగానీ మరొకరుగానీ చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ ఈవో సింఘాల్ సైతం మీడియాతో మాట్లాడుతూ.. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శిస్తామని అన్నారు. వేంకటేశ్వరుడికి చెందిన గులాబీ వజ్రంతోపాటు కొన్ని ఆభరణాలు కనిపించకుండా పోయాయని, పోటు(వంటశాల)ను మూసివేసి స్వామివారిని పస్తులు ఉంచారని శ్రీవారి ఆలయం మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమధ్య జర్మనీలో వేలం వేసిన గులాబీ వజ్రం శ్రీవారిదే అయి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు కూడా. -
నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు
సాక్షి, తూర్పుగోదావరి : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను టీడీపీ ప్రభుత్వం మంటకలుపుతుదని తణుకు వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు మడిపండ్డారు. స్వామి సన్నిధిలో ఎన్నో తరాలు నుంచి ఒక యాదవ కులానికి చెందిన వారసులే తొలిత తలుపులు తీసే ఆనవాయితీ ఉండగా దాన్ని ఇప్పుడు సీఎం మంటగలుపుతున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, ఛైర్మన్ సుధాకర్ యాదవ్ అనే వ్యక్తిని అడ్డు పెట్టుకొని యాదవులకే అన్యాయం చేయడం చాలా బాధాకమన్నారు. రెవెన్యూ మినిస్టరు ఇప్పుడు టీటీడీ అర్చకులపై కేసులు పెడుతాం, ఎంక్వెరీ చేయిస్తామంటున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని, ఐయినా టీటీడీ వ్యవస్థలో కూడా రాజకీయం చేయటం సిగ్గు చేటన్నారు. టీటీడీని భంగ పరుచాలనుకుంటే నిన్ను ఆ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు. ఇప్పటికైనా సన్నిధిలో ఆచారం కొనసాగాలి అర్చకులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే నిర్ణయాన్ని మానుకోవాలని లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పుదని, ఈ నిర్ణయాన్ని విరమించకుంటే ప్రజలు ఉద్యమాలకు దిగుతారని హెచ్చరించారు. -
టీటీడీ బోర్డుపై బ్రాహ్మణ సంఘాలు ఫైర్
సాక్షి, విజయవాడ: ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పట్ల టీటీడీ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. టీటీడీ బోర్డు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశాయి. టీటీడీలో జరుగుతున్న అవకతవకలను బయల పెట్టినందుకే బోర్డు రమణ దీక్షితులును తొలగించడానికి కుట్ర పన్నుతోందని తెలిపారు. ఏ హక్కుతో ఆయనను విధుల నుంచి తొలగిస్తారని బోర్డుని ప్రశ్నించారు. వెంటనే రమణ దీక్షితులుపై చర్యలను వెనక్కి తీసుకొవాలని బోర్డుని కోరారు. టీటీడీ వ్యాపార కేంద్రంగా, రాజకీయ పునరావాసంగా మారిందని బ్రాహ్మణ సంఘాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 19, 20న గుంటూరులో బ్రాహ్మణ సంఘాలు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. తొందరలోనే దీనికి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఈ ప్రభుత్వం హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పారు. అందుకే ఓ వివాదస్పద వ్యక్తిని చైర్మన్గా పెట్టారని మండిపడ్డారు. -
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన బుధవారం స్థానిక అన్నమయ్య భవన్లో 17 మంది సభ్యలతో ఈ సమావేశం జరిగింది. కొత్తగా పాలకమండలి ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న సమావేశం కావడంతో అందరూ హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు బోర్డు సభ్యులు తీసుకున్నారు. సమావేశం అనంతరం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘65 ఏళ్లు పైబడితే అర్చకులు పదవీ విరమణ చేయాలి. వంశపారంపర్యంగా వారి కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తాం. ఢిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సలహా మండలి ఏర్పాటు చేస్తున్నాం. టీటీడీ డిపాజిట్లపై సబ్కమిటీ నియమించాం. గత ఏడాది కాలంగా తీసుకున్న 200 తీర్మానాలుకు సంబంధించి 55 తీర్మానాలుకు ఆమోదం తెలిపాం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, చంద్రగిరిలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రతీనెల పున్వరసు నక్షత్రాన ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహిస్తాం. జూన్ 5వ తేదీన మరోసారి టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహిస్తాం. తిరుమలలో శుభ్రత పర్యవేక్షణకు కమిటీ వేస్తున్నాం. అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై చర్చ జరిగింది. ఆయన అరోపణలపై వివరణ కోరుతాము. వివరణ ఇచ్చాక తగిన చర్యలు తీసుకుంటాము. ప్రతి ఏడాది ఆభరణాలను గ్రాములతో సహా లెక్కిస్తాం. 65 సంవత్సరాల పైబడిన వారు పదవీ విరమణ అమలు చేస్తే.. రమణ దీక్షితులు కూడా పదవి విరమణ చెయ్యాల్సిదే. 1997లోని చట్టం ప్రకారం సన్నిధి గొల్లలు టీటీడీ ఉద్యోగులుగా మారారు. ప్రస్తుతం 43 మంది మిరాశి అర్చకులు ఉన్నారు’ అని ఆయన వెల్లడించారు. -
ఏడాది తర్వాత కొలువు
ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ధర్మకర్తల మండలి కొలువుదీరింది. ఏడాది తర్వాత ఏర్పడిన ఈ మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్ సుధాకర్యాదవ్, 12మంది సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఆది నుంచి బోర్డు విషయంలో టీడీపీ నాన్చుడు ధోరణి అవలంబిస్తూ వచ్చింది. దీంతో అసంతృప్తి స్వరం పెరిగింది. మరోపక్క మిత్రులుగా ఉన్న బీజేపీతో అంతరం పెరిగింది. తప్పని పరిస్థితుల్లో సీఎం బోర్డు ఏర్పాటుచేసినా పలు వివాదాలు చుట్టుముట్టాయి. బోర్డులో అవకాశం దక్కిన ఒక సభ్యురాలు అన్యమత వివాదంతో పక్కకు తొలగాల్సి వచ్చింది. కొత్త బోర్డు నియమించాక టీడీపీలో అసంతృప్తుల స్వరం పెరిగింది. అలకలూ పెరిగాయి. సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ధర్మకర్తల మండలి కొలువుదీరింది. శనివారం చైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్తోపాటు మరో 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త బోర్డు నియామకంతో ఏడాది నిరీక్షణకు తెర పడింది. గత బోర్డు పదవీ కాలం గత ఏడాది ఏప్రిల్ 26వ తేదీతో ముగిసింది. దాదాపు ఏడాది కాలం అధికారుల పాలనలో గడిపేశారు. తెలుగుదేశం ప్రభుత్వ నాలుగేళ్ల హయాంలో కేవలం రెండేళ్లు్ల మాత్రమే బోర్డు పనిచేసింది. మరో రెండేళ్లు ఖాళీగా ఉంచారు. ఏడాదిగా అధికారుల పాలన ఉండడంతో రూ.2,894 కోట్ల వార్షిక బడ్జెట్తో కూడిన టీటీడీలో కీలక నిర్ణయాలు అమ లులో లేవు. రూ.500 కోట్ల మేరకు ఏటా మార్కెటింగ్ కొనుగోళ్లు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటివి బోర్డు అనుమతులు కోసం ఎదురుచూస్తున్నాయి. శ్రీవారి దర్శనం, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం సరికొత్త పథకాలు, కీలక నిర్ణయాల అమలుకు మార్గం ఏర్పడింది. ఇదే టీటీడీ కొత్త బోర్డు టీటీడీ చైర్మన్గా పుట్టా సుధాకర్యాదవ్, సభ్యులుగా రాయపాటి సాంబశివరావు (ఎంపీ), జీఎస్ఎస్. శివాజీ (ఎమ్మెల్యే), బోండా ఉమామహేశ్వరరావు (ఎమ్మెల్యే), బీకే పార్థసారథి (ఎమ్మెల్యే), చల్లా రామచంద్రారెడ్డి , పొట్లూరి రమేష్బాబు, ఇ. పెద్దిరెడ్డి (తెలంగాణ),రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, డొక్కా జగన్నాథం ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫి షియో సభ్యులుగా ఎండోమెంట్, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ,టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ బోర్డులో సలహా మండలి సభ్యుడి హోదాలో హైదరాబాద్కు చెందిన బోదనపు అశోక్రెడ్డి కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర బీజేపీకి చెందిన స్వప్న, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సంఘ సేవకురాలు సుధానారాయణమూర్తి, ఎండోమెంట్ కమిషనర్ హాజరుకాలేదు. కాగా, పాయకరావు పేట ఎమ్మెల్యే అనితను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ప్రైవేట్ బ్యాంకు రూ.వెయ్యికోట్లపై నిర్ణయం ఎటో? ఇటీవల టీటీడీ రూ.3వేల కోట్లు ఆంధ్రాబ్యాంకు, రూ.వెయ్యికోట్లు ఇండస్ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఎక్కువ కోట్ చేసిన తమబ్యాంకును కాదని, ఆంధ్రా బ్యాంకుకు టెండర్ కేటాయించారని విజయాబ్యాంకు ప్రతినిధులు ఆరోపించారు. ఏకంగా రూ.వెయ్యి కోట్లమేర భక్తుల కానుకలతో వచ్చిన డిపాజిట్లను ప్రైవేట్ బ్యాంకు అయిన ఇండస్లో డిపాజిట్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై భక్తుల్లో ఆందోళన ఉంది. ఈవిషయంలో టీటీడీ బోర్డు ఎలాంటి వైఖరి తీసుకుంటోందోనని అందరూ వేచిచూస్తున్నారు. దీనిపై త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో తప్పనిసరిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు సభ్యుడు బోండా ఉమాతోపాటు మరికొంతమంది తెలి పారు. శ్రీవారి లడ్డూ ధరలు, సేవా టికెట్ల ధరల పెంపు అని వార్యమవుతోంది. చాలా కాలంగా చర్చ సాగుతోంది. ధరల పెంపు అంశంపై బోర్డు ఎలాంటి వైఖరి అవలంభిస్తోందనని భక్తులు ఎదురుచూస్తున్నారు. -
గవర్నర్కు వీహెచ్పీ బహిరంగ లేఖ
-
ఆమెకు పదవి ఇవ్వడం నా పర్సనల్: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగటివర్ సతీమణి సప్నకు సభ్యత్వం ఇవ్వడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రికి భార్యకు అవకాశం ఇవ్వడం తన వ్యక్తిగత (పర్సనల్) విషయమని అన్నారు. ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలని, అంతేకాకుండా సదరు మంత్రితో తనకు చాలా ఏళ్లుగా వ్యక్తిగత అనుబంధం ఉందని అందుకే మండలిలో సభ్యత్వం ఇచ్చానని పేర్కొన్నారు. పైగా ఇందులో తప్పేముందని పాత్రికేయులను తిరిగి ప్రశ్నించారు. రిటైర్ అయ్యి ఉద్యోగాలు రాని వారు తనపై విమర్శలు చేస్తూ.. పుస్తకాలు రాస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వాళ్లు తమ పని చూసుకోకుండా ఇలా ప్రవర్తించడం మంచిది కాదంటూ హితవు పలికారు. ఇటీవల తనకు ఏదైనా జరిగితే ప్రజలు రక్షణ కవచంలా ఉండమని చెప్పిన బాబు ఇప్పుడు మాట మార్చారు. తాను అలా చెప్పలేదని తనపై కుట్రలకు పాల్పడుతున్నారని, పోలవరం, ప్రత్యేక హోదా, నిధులపై జరిగే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించానంటూ చెప్పుకొచ్చారు. తనపై చాలా మంది చాలా కుట్రలు చేస్తున్నారని, కేసులు పెట్టాలని చూసినా ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు అన్నారు. గవర్నర్ వ్యవస్థ వల్ల టీడీపీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, దీనిపై చాలాసార్లు గవర్నర్కు చెప్పామని, కానీ ఇప్పటికీ గవర్నర్ అలాగే ప్రవర్తిస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమతో మాట్లాడిన అనంతరం గవర్నర్ ఢిల్లీ వెళితే అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్లను వాళ్ల పనుల కోసమే పెట్టుకుంటారని విమర్శించారు. తాను పవన్పై కానీ, ఇతరులు ఎవ్వరిపైనా బురద చల్లే ప్రయత్నం చేయనని అన్నారు. 2014లో సమన్యాయం కోసం మాట్లాడానని చంద్రబాబు తెలిపారు. కేంద్రం చాలా నాటకాలు ఆడుతోందని, తమిళనాడులా చేయాలనుకుంటోందని ఆయన మండిపడ్డారు. కొత్త రాష్ట్రం కోసం బీజేపీతో కలిసి నాలుగేళ్లు ఉన్నామని కానీ కేంద్రం తమను పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలని, అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో తొలిసారి మూడో ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీయే అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 సీట్లు వస్తే తామే ప్రధానిని నిర్ణయిస్తామని వెల్లడించారు. -
టీటీడీ బోర్డు నుంచి అనిత ఔట్
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అనిత నియామకంపై అటు ప్రజల్లో, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. గతంలో అనిత ఓ ప్రవేట్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సైతం బయటకు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్యే ఇచ్చిన లేఖ ఆధారంగా బోర్డ్ మెంబెర్ గా తొలగించినట్లు సర్కార్ పేర్కొంది. మంత్రి పదవికోసం ఆశించిన అనితకు రెండుసార్లు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆశాభంగం ఎదురైంది. దీంతో అనిత గత కొద్దికాలం పార్టీ కార్యక్రామాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ విషయంపై పలుసార్లు ఎమ్మెల్యేను బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగానే టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల 20న జీవో జారీ చేసింది. అయితే అనిత నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనిత నియామకాన్ని సమర్ధిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం, ఎమ్మెల్యే సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. అంతేకాకుండా గతంలో ఓ వెబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని సైతం నెట్జన్లు బయటపెట్టడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దీంతో స్వచ్చందంగా తప్పుకోవాలంటూ అధిస్టానం ఇచ్చిన సూచన మేరకు అనిత తనను పాలకమండలి నుంచి తప్పించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో అనిత సభ్యత్వం రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
టీటీడీ వివాదంలో కొత్త మలుపు
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ధార్మిక సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు, ఇతర వర్గాల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వెనక్కి తగ్గారు. టీటీడీ పాలకమండలిలో తనను సభ్యురాలిగా నియమించడం వివాదానికి దారి తీసిందని భావించిన అనిత.. బోర్డు నుంచి తనను తప్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు చంద్రబాబుకు ఎమ్మెల్యే అనిత లేఖ రాశారని సమాచారం. టీటీడీ బోర్డు సభ్యురాలుగా నియమితులైన అనిత విషయంలో హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. వీడియో సోర్స్: వనిత టీవీ సౌజన్యం.. -
టీటీడీ బోర్డు కూర్పు అహంకార పూరిత చర్య
సాక్షి, అనంతపురం : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. మడకశిరలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పాలకవర్గ సభ్యుల్లో అర్హులు కానీ వారిని, అన్యమతస్తులను నిమమించి ప్రభుత్వం అపచారం చేసిందని అన్నారు. ఇది పొరపాటు కాదని, అహంకార పూరిత చర్యని ఆయన వాఖ్యానించారు. తాను ఇతర మతాల వారిని, వారి ఆచారాలను గౌరవిస్తానని, ఇది భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. భేషజాలకు పోకుండా వివాదాస్పదులను తొలగించి, అర్హులైన వారిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు బీజేపీతో బహిరంగ కాపురం చేసిన ప్రాంతీయ పార్టీలు, నేడు దొంగ చాటుగా కాపురం చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ మంత్రి భార్యకి టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించడమే ఇందుకు నిదర్శనమని రఘవీరా ఆరోపించారు. -
టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రి భార్యకు స్థానం
-
భగ్గుమంటున్న హిందూ సంఘాలు
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుమల/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులను, రౌడీయిజం చేసే వారిని, ఆధ్యాత్మిక–సేవా భావం లేనివారిని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించారని హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏడాది పాటు అధికారుల పాలనలో సాగిన టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్పై అన్యమత ప్రచార కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన నియామకంపై హిందూ పీఠాధిపతులు, మఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం లెక్కచేయలేదు. అలాగే బోర్డులో సభ్యురాలుగా నియమితులైన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విషయంలోనూ హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కొత్త బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాయపాటి సాంబశివరావు అసంతృప్తి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. అలాగే తనను టీటీడీ సభ్యుడిగా నియమించడంపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కినుక వహించారు. తాను టీటీడీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వకుండా, సభ్యుడిగా నియమించి అవమానించారని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నా మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగటివర్ సతీమణి సప్నను టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించడం గమనార్హం. రాజకీయ లబ్ధి కోసమే ఆమెకు టీటీడీ బోర్డులో చోటు కల్పించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బోర్డులో తమకు అవకాశం కల్పిస్తారని టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆశించారు. అవకాశం రాని వారు పార్టీకి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు టీటీడీ బోర్డులో తమిళనాడుకు ప్రాతినిధ్యం లేకపోవడం దారుణమని ఆ రాష్ట్రానికి చెందిన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. -
చంద్రబాబు చెంపదెబ్బలు వేసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడి సాక్షిగా చెంపదెబ్బలు వేసుకోవాలని.. హిందువులు, దేశ ప్రజలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచంలో హిందువులందరూ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన టీటీడీ బోర్డులో తాను క్రిస్టియన్ అని చెప్పుకున్న అనితను సభ్యురాలిగా నియమించడం హిందువులను అవమానించడం కాదా? హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? ఇది వేరే మతాల వాళ్ల ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుశ్చర్యగా చెప్పకతప్పదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. అనిత స్వయంగా ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ప్రభుత్వం హిందువులు, దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పుకుని, దేవుడి సాక్షిగా చెంపదెబ్బలు వేసుకుని ఈ తప్పిదం మళ్లీ చేయనని ప్రజలకు చెప్పాలి..’ అని నరసింహారావు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్ర చేస్తోందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘ఇది ధర్మపోరాటం అని చెప్పి కోట్లలో డబ్బులు ఖర్చు చేయడం తప్ప వారు చేసిందేమీ లేదు. మానసిక ఒత్తిళ్లకు.. రకరకాల భయాందోళనలకు సీఎం గురయ్యారు. నిన్న జరిగిన తంతు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా దూషించడానికి వాడుకున్నారు తప్పితే ఒక మర్యాద కలిగిన పార్టీ, ఒక హోదా ఉన్న వ్యక్తులు చేసే వ్యవహారంలా లేదు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కుటుంబ ప్రతిష్టను, ఎన్టీయార్ పేరును, తెలుగు ప్రజల గౌరవాన్ని పూర్తిగా మంటగలిపారు. ఆయన క్షమాపణ చెప్పాలి’ అని నరసింహారావు డిమాండ్ చేశారు. -
టీటీడీ వ్యవహారం.. తలపట్టుకున్న చంద్రబాబు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు మెంబర్లపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన ఆడియో, వీడియో క్లిప్లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడ్డారు. అనిత వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేని చంద్రబాబు సందిగ్దంలో పడ్డారు. ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర మతాలకు చెందిన వారిని టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎలా నియమిస్తారంటూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన వీడియోను ఏపీ ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం. అనిత వ్యవహారంపై అధికారులను చంద్రబాబు నివేదిక కోరారు. నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. హిందూ మత విశ్వాసాలకు ఇబ్బంది లేకుండానిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో టీటీడీ బోర్డులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. నిజానికి టీటీడీ పాలక మండలిని నియమించడానికి ముందుగానే ప్రభుత్వం సభ్యులకు సంబంధించి అన్ని వివరాలను సేకరిస్తుంది. బొండా ఉమా హిట్లర్.. అతడు అనర్హుడు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అనర్హుడని బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు విజయవాడ బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. బ్రాహ్మణులను తొక్కి ఉమాకు పదవి ఇవ్వడం సరికాదన్నారు. బొండా ఉమా ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం బ్రాహ్మణ సంఘాలే. కానీ గెలిచినప్పటి నుంచి బ్రాహ్మణ సంఘాలకు ఆయన చేసిన మేలు శూన్యమని ఎద్దేవా చేశారు. బొండా ఉమాకు ఆలయ వైదిక ధర్మాలు తెలుసా అని ప్రశ్నించారు. ఆలయాల్లో నియమాలు తెలియని వ్యక్తికి టీటీడీ పదవులు కట్టబెట్టడం బ్రాహ్మణులను కించపరచడమే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బొండా ఉమా ఒక హిట్లర్ అని.. ఆయనకు అన్ని పదవులు కట్టబెట్టడం దుర్మార్గమని బ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. కాగా, టీటీడీ ఛైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ను... బోర్డు సభ్యులుగా టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, బోండా ఉమా సహా మరికొందరిని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. వీడియో సోర్స్: వనిత టీవీ సౌజన్యం.. -
తితిదే బోర్డు మెంబర్ల నియామకం..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం చేపట్టింది. టీటీడీ ఛైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సభ్యులుగా ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీఎస్ఎస్ శివాజీ, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్యే అనిత, ఎమ్మెల్యే పార్థసారధి, ఎమ్మెల్యే చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మేడా రామచంద్రా రెడ్డి, డొక్కా జగన్నాధం, సండ్ర వెంకట వీరయ్య(తెలంగాణ), ఇనుగాల పెద్దిరెడ్డి(తెలంగాణ), సుధా నారాయణ మూర్తి(కర్ణాటక), సప్న (మహారాష్ట్ర) నియమితులయ్యారు. -
యాదవుల నిరసన ర్యాలీ
ఏలూరు (వన్టౌన్) : టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్ అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తుండడం దారుణమని, అది పూర్తిగా అసత్యమని యాదవ సంఘం నేతలు స్పష్టం చేశారు. సుధాకర్యాదవ్పై అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ చేశారు. స్థానిక ఫైర్స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు యాదవులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నగర యాదవ సంఘం కన్వీనర్ మల్లిపూడి రాజు ఆధ్వర్యంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం నాయకులు ఊక్కుసూరి గోపాలకృష్ణ, మల్లిపూడి రాజు, కీలరపు జగదీష్, కీలారు బుజ్జి, తలారి గోపి యాదవ, పిలకల ప్రకాశరావు పాల్గొన్నారు. -
తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద ఉద్రిక్త చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించడాన్ని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శైవక్షేత్ర ముట్టడికి యాదవ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం ఉదయం నుంచి ఇక్కడికి చేరుకున్న యాదవులు శైవక్షేత్రాన్ని ముట్టడించే యత్నం చేశారు. ముందు జాగ్రత్తగా శైవక్షేత్రం వద్ద భారీగా మోహరించిన పోలీసులు యాదవ సంఘాలను అడ్డుకున్నారు. అయినా శైవక్షేత్రంలోకి ప్రవేశించేందుకు యత్నించిన కొందరు యాదవులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాదవ సంఘ నాయకులను పోలీసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. శైవ క్షేత్రంపై జరగబోయే దాడి యావత్తు హిందూ ధర్మం, హిందువుల మీద దాడిగా పరిగణిస్తున్నామని, పుట్టా సుధాకర్ యాదవ్ కాకుండా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న ఏ యాదవ సోదరుడిని నియమించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని పీఠాధిపతి శివస్వామి ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. (టీటీడీ చైర్మన్గా ఆయన తప్ప, ఎవరైనా సరే!) -
టీటీడీ చైర్మన్గా ఆయన తప్ప, ఎవరైనా సరే!
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ జిల్లా టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టీటీడీ బోర్డు చైర్మన్గా ఆయన నియామకాన్ని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యతిరేకిస్తున్నారు. ‘హిందు దేవాలయ పరిరక్షణను దెబ్బ తీయడం కోసమే పుట్టా సుధాకర్ యాదవ్ను టీటీడీ బోర్డు చైర్మన్గా నియామకం చేసినట్లు అనిపిస్తోంది. 'ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తున్నందుకు రేపు (ఆదివారం) యాదవ సోదరులు శైవక్షేత్రం ముట్టడి చేయబోతున్నట్లు మాకు సమాచారం అందింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాం. శైవ క్షేత్రంపై జరగబోయే దాడి యావత్తు హిందూ ధర్మం, హిందువుల మీద దాడిగా పరిగణిస్తున్నాం. పుట్టా సుధాకర్ యాదవ్ కాకుండా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న ఏ యాదవ సోదరుడిని నియమించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని' పీఠాధిపతి శివస్వామి తెలిపారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి పుట్టా సుధాకర్ యాదవ్ వియ్యంకుడన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి మైదుకూరు టిక్కెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైదుకూరు సీటు ఆశిస్తున్న పుట్టా సుధాకర్ను రేసు నుంచి తప్పించేందుకే టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని సమాచారం. -
'ఆ వార్తల్లో నిజం లేదు'
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తాను భాద్యతలు చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఖండించారు. గత రెండు మూడు రోజులుగా కొన్ని పత్రికల్లో, సోషల్ మీడియాలో రాఘవేంద్రరావు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సన్నిహితులు అభినందనలు తెలిపారు. అయితే ఈ విషయంపై బయట వస్తున్న వార్తల్లో నిజం లేదని రాఘవేంద్రరావు వెల్లడించారు. ఎస్వీఎస్సీ ఛానల్ ద్వారా స్వామివారి సేవ చేస్తున్నానని.. మరిన్ని వైవిధ్యమైన కార్యక్రమాలతో అలరిస్తూ స్వామి సేవలో తరలించాలన్నదే తన కోరిక అని దర్శకేంద్రుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
టీటీడీ చైర్మన్ పదవికి ఆ నలుగురి పైరవీలు!
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కోసం బీజేపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందువల్లే ఇన్నాళ్లు టీటీడీ పాలకమండలి ఏర్పాటు కాలేదని విశ్వసనీయ సమాచారం. బీజేపీ, టీడీపీ అధిష్ఠానాల మధ్య చర్చలు కొలిక్కిరావడంతో త్వరలోనే పాలక మండలి ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు నారావారిపల్లెలో ప్రకటించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు పాలకమండలిలో చోటుకోసం పోటీ పడుతున్నారు. బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిందే. కొన్నాళ్ల పాటు రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నా తరువాత దూరం పెరిగింది. మనస్పర్ధలు లేనన్ని రోజులు టీటీడీ పాలకమండలిలో బీజేపీ వేలు పెట్టలేదు. టీడీపీ నేతలు బీజేపీని దూరం పెట్టినప్పటి నుంచి టీటీడీ పాలకమండలి ఏర్పాటుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అందులో భాగంగానే పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే పాలకమండలిని ప్రకటించింది. అది కూడా మొదటి సారి ఎంపిక చేసిన పాలక మండలినే రెండవ సారి కూడా కొనసాగించాల్సి వచ్చింది. కొత్తగా చైర్మన్, సభ్యులను ఏర్పాటు చేసే సాహసం చేయలేకపోయింది. పాలకమండలి పదవీ కాలం పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త బోర్డును ఏర్పాటు చేయలేదు. బోర్డులో ప్రాధాన్యత కోసం బీజేపీ పట్టు టీటీడీ పాలకమండలిలో తమకు ప్రాధాన్యం ఉండాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. గత పాలకమండలిలో బీజేపీ నుంచి భానుప్రకాష్రెడ్డికి మాత్రం అవకాశం ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఈ సారి ఐదుగురికి అవకాశం కల్పించాలని, లేనిపక్షంలో ఊరుకునేది లేదని హెచ్చరించనిట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు టీడీపీ అధిష్టానం ససేమిరా అనడంతో ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. మండలిలో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని బీజేపీ అధిష్టానం గట్టిగా చెప్పినట్టు తెలిసింది. రెండు పార్టీల మధ్య నెలకొన్న వివాదంతో టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేయడానికి టీడీపీ ప్రభుత్వం సాహసించలేదు. ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లిన సమయంలో పాలక మండలి విషయంపైనా బీజేపీ నేతలతో చర్చించినట్లు సమాచారం. అందులో భాగంగానే మంగళవారం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే పాలకమండలి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పోటా పోటీ సీఎం ప్రకటనతో పాలక మండలి చైర్మన్, బోర్డు మెంబర్ల కోసం పలువురు బీజేపీ, టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. చైర్మన్ పదవి కోసం వైఎస్సార్ కడప జిల్లా నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, నెల్లూరు నుంచి బీదా మస్తాన్రావు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్తో పాటు తాజాగా సినీ దర్శకులు రాఘవేంద్రరావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బోర్డు మెంబర్ కోసం టీడీపీ జిల్లా యువత అధ్యక్షుడు శ్రీధర్వర్మ లేదా ఆయన తండ్రి ఎన్టీఆర్ రాజు పేరు ముందు వరుసలో ఉంది. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నారనే కారణంతో ఆ ఇద్దరిలో ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే నీలం బాలాజి, డాక్టర్ సుధారాణి, మందలపు మోహన్రావు కూడా బోర్డులో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మందలపు మోహన్రావు 2004లో కాంగ్రెస్లో చేరి తిరిగి 2009లో టీడీపీలో చేరారు. దీంతో మందలపు మోహన్రావుకి బోర్డులో అవకాశం ఇచ్చే అవకాశం లేదని పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన ముగ్గురిలో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. బీజేపీ నుంచి భానుప్రకాష్రెడ్డి, కోలా ఆనంద్, చల్లపల్లి నరసింహారెడ్డి, తెలంగాణ, తమిళనాడుకు చెందిన మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. అందులో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా భానుప్రకాష్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ద్వారా కోలా ఆనంద్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కోరినట్లు ఐదుగురికి బోర్డు మెంబర్లుగా ఇస్తే తమ పరిస్థితి ఏమిటని టీడీపీ ముఖ్య నేతలు అధినాయకుడిని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ సారి కూడా ఒకరికి అవకాశం కల్పిస్తే సరిపోతుందని సీఎంపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాలకమండలిని ఏర్పాటు చేస్తారా? ఎందుకీ తలనొప్పులని గతంలోలా వాయిదా వేస్తారా? అనేది వేచి చూడాలి. -
టీటీడీ చైర్మన్గా రవిశంకర్ ?
సాక్షి, అమరావతి: గత కొంత కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ పదవికోసం పోటీపడుతున్న నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు షాక్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ గా వ్యాపారవేత్త సీఎం రవిశంకర్ నియామకం దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. శనివారం జరిగే కేబినెట్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించి జీవో విడుదల కానుంది. రవి శంకర్ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బడా వ్యాపారవేత్త. ఏడాది కాలం పాటు ఆయన టీటీడీ చైర్మన్ గా కొనసాగుతారు. దీంతోపాటు 19 మంది సభ్యలతో కూడిన టీటీడీ పాలకమండలిని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. బోర్డు సభ్యులుగా.. సుధా నారాయణ మూర్తి, కృష్ణమూర్తి, కోలా ఆనంద్, చింతల రామచంద్రా రెడ్డి, రాఘవేంద్ర రావు, ఎమ్మెల్యే కొండబాబు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్ మోహన్ సింగ్, ఎండోమెంట్ కమిషనర్ వై.వి. అనూరాధ, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇందులో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై నందమూరి హరికృష్ణ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి పార్టీ సీనియర్ నేతలను రంగంలోకి దించారు చంద్రబాబు. ఈసారి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి నామినేట్ చేస్తామని నాయకుల ద్వారా వర్తమానం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
టీడీపీలో టీటీడీ చైర్మన్ పదవి చిచ్చు
అమరావతి: ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో అప్పుడే చిచ్చు మొదలైంది. చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు పట్టుబడుతున్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధం అయ్యారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు పది రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అంతకు ముందు కూడా రాయపాటి తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ పట్టుబట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకు దక్కుతుందనుకున్న టీటీడీ ఛైర్మన్ పదవి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు కనుమూరి బాపిరాజుకు దక్కడంతో అప్పట్లోనే ఆయన పార్టీ వీడాలనుకున్నారు. తర్వాతి పరిణామాలలో రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు ఆశాభంగం తప్పలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన చదలవాడ కృష్ణమూర్తికి ఆ ఛాన్స్ దక్కింది. దాంతో మరోసారి రాయపాటి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఆ పదవి దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న రాయపాటి సాంబశివరావుపై ఈసారి అయినా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కటాక్షం లభిస్తుందో లేదో మరి. మరోవైపు ఇదే పదవిపై కన్నేసిన ఎంపీ మురళీమోహన్ కూడా తెరవెనుక యత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్న విషయం తెలిసిందే. ఇందు కోసం మురళీమోహన్.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక టీటీడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు పాలకవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త పాలకవర్గాన్ని ప్రభుత్వాన్ని నియమించనుంది. కాగా ప్రస్తుతం చదలవాడ కృష్ణమూర్తి రాయలసీమ నేత కావడంతో ఈసారి టీటీడీ చైర్మన్ పదవి కోస్తా జిల్లాల వారికే కేటాయించాలని డిమాండ్ తెరమీదకు వస్తోంది. మరి వెంకన్న స్వామి ఎవరిని కరుణిస్తాడో చూడాలి. -
భక్తుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాం: టీటీడీ
తిరుమల: భక్తులకు, ఉద్యోగులకు సమస్యలు లేకుండా చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. టీటీడీ పాలకమండలికి నేటితో రెండేళ్ల పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా బోర్డు చివరి సమావేశం మంగళవారం జరిగింది. తమ జీవితాల్లో ఇది మరచిపోలేని అనుభూతి అని ఆయన అన్నారు. జూన్ మొదటి వారం నుంచి శ్రీవారి అనుగ్రహం పేరుతో సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ లక్కీ డ్రిప్ ద్వారా భక్తులకు అందిస్తామని చెప్పారు. లడ్డూల తయారీ కార్మికులకు రూ. 3 వేల మేర జీతం పెంచామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సైన్సు మ్యూజియం ఏర్పాటుకు భూమి లీజుకు ఇవ్వడానికి, తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల రాజగోపురాల నిర్మాణ అభివృద్ధికి రూ.8 కోట్లకు పైగా మంజూరుకు బోర్డు ఆమోదం తెలిపింది. -
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
వైభవంగా ధ్వజారోహణ ఒంటిమిట్ట రామాలయం (రాజంపేట): వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట (ఏకశిలానగరం)లో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. ముత్యాల తలంబ్రాల ఊరేగింపు శ్రీసీతారాముల కల్యాణానికి టీటీడీ తీసుకొ చ్చిన ముత్యాల తలంబ్రాలను ఊరేగించారు. టీటీడీ చైర్మన్ చదల వాడ కృష్ణమూర్తి, ప్రభు త్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ముత్యాల తలంబ్రా లను ఆలయంలోని మూలవర్ల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. 10న కల్యాణోత్సవం ఒంటిమిట్ట రామాలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ప్లాన్ అమలు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. ఆలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విçస్తృతంగా ఏర్పాట్లు చేసిందన్నారు. ఈనెల 10న సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కల్యాణానికి గవర్నర్, ముఖ్యమంత్రి హాజరవుతారని చెప్పారు. -
ప్రారంభమైన టీటీడీ బోర్డు సమావేశం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం సోమవారం జరిగింది. సేవా టిక్కెట్లు, వసతి గదుల ధరల పెంపు, సబ్సిడీ లడ్డూల ఎత్తివేతపై పాలకమండలి చర్చించింది. అయితే బోర్డు చివరి సమావేశంలో ధరల పెంపు నిర్ణయాన్ని పాలకమండలి సభ్యులు వ్యతిరేకించారు. సమావేశం కొనసాగుతోంది. -
ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం
తిరుపతి: టీటీడీ పాలక మండలి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈవో సాంబశివరావుతో పాటు అధికారులు, పాలకమండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ నమో వెంకటేశాయ.. చిత్ర యూనిట్ తరపున రూ. 4 లక్షల విరాళాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు పాలక మండలికి అందించారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు.. - శ్రీవారికి 30 కేజీల బంగారంతో లక్ష్మీ కాసులమాల తయారీకి ఆమోదం - సర్వ దర్శనం భక్తులకు నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి 5 కోట్లు మంజూరు. - గదులలో ఎల్ఈడీ బల్పుల ఏర్పాటుకు రూ. 4.5 కోట్ల మంజూరు - హరిద్వార్ లో ఆలయం నిర్మాణం.. దానికి నిర్మల్ షెతియా పౌండేషన్ రూ.12 కోట్ల విరాళం - అప్పలాయ గుంటలోని తిరుత్చి, కళ్యాన మండప నిర్మాణానికి ఆమోదం. - నెల్లూరు జిల్లా గూడూరి గ్రామం చిన్న కేశవాలయం పునరుద్దరణకు అమోదం. - తలనీలాల ఈ-వేళం ద్వారా 33.14 లక్షల ఆదాయం. - టీటీడీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోళ్లకు అమోదం. - టీటీడీ వార్షిక బడ్జెట్ రూ. 2858.48 కోట్ల ఆమోదం - వకులామాత ఆలయం నిర్మాణానికి రూ. 2 కోట్లు ఆమోదం. -
మహాక్షేత్రంగా ‘తిరుపతి’ వికాసానికి చేయూత
టీటీడీ చైర్మ¯ŒS చదలవాడ కృష్ణమూర్తి శృంగారవల్లభుని సన్నిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం తిరుపతి(పెద్దాపురం) : పురాతన శృంగార వల్లభస్వామి దేవాలయం ఉన్న పెద్దాపురం మండలం తిరుపతి గ్రామాన్ని మహా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మ¯ŒS చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. పురాతన దేవాలయాల ను కాపాడాల్సిన బాధ్యత టీటీడీదేనన్నారు. తిరుపతిలోని శృంగార వల్లభ స్వామి పురాతన దేవాలయాన్ని ఇటీవల టీటీడీ దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో సుమారు కోటి రూపాయలతో తలపెట్టిన అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మ¯ŒS బందిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో చదలవాడ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో వేంచేసిన శృంగార వల్లభుడు సాక్షాత్తు వెంకటేశ్వరస్వామిని పోలి ఉన్నాడన్నారు. టీటీడీ ఆదాయంతో పేదలకు వైద్య సౌకర్యంతో పాటు సుమారు 40 వేల మంది విద్యార్థుల విద్యాభ్యాసానికి సహకరిస్తున్నామన్నారు. ప్రస్తుతం వేదాలపై ఆసక్తిని పెంచేందుకు ఉచితంగా విద్యార్తులకు వేదాలు నేర్పిస్తున్నట్టు చెప్పారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావులు మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తొలి విడతగా మంజూరైన రూ.25 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు కృష్ణమూర్తి భూమిపూజ చేయగా ఆలయ చైర్మ¯ŒS బందిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఈవో రాంబాబురెడ్డిల ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రంగనాథ్, ఏఎంసీ చైర్మ¯ŒS ముత్యాల రాజబ్బాయి, జెడ్పీటీసీ సభ్యుడు సుందరపల్లి శివ నాగరాజు, ఎంపీపీ గుడాల రమేష్, సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు కోత్తెం కోటి, జగదీష్, కమ్మిల సుబ్బారావు, గొరగపూడి చిన్నయ్యదోర, మెయిళ్ళ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీ చైర్మన్ ఇంటి ముట్టడి
తిరుపతి : టీటీడీ చైర్మన్ ఇంటిని కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. పద్మావతి నగర్లోని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. నెల జీతం పెంచాలని, లేబర్ యాక్ట్ ప్రకారం కనీసం రూ.18 వేల జీతం ఇవ్వాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఆందోళన చేస్తున్న సమయంలో టీటీడీ చైర్మన్, నాయుడుపేటలో జరుగుతున్న సీఎం సభలో ఉన్నారు. దీంతో అక్కడివారు ఫోన్లో టీటీడీ చైర్మన్తో మాట్లాడించడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన విరమించారు. -
తిరుమలలో పోలీసులపై బండబూతులు
తిరుపతి: తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బంధువులమంటూ కొందరు రెచ్చిపోయారు. పోలీసులను సైతం వారు లెక్క చేయలేదు. ఒక వ్యక్తి అయితే.. 'నేను జడ్జీ కుమారుడిని. నన్ను నడిచి వెళ్లమంటావా' అంటూ పోలీసుల మీదకుపోయి వారిపై చేయి చేసుకునేంత పని చేశారు. ఇంకా చెప్పాలంటే గుండాగిరికి దిగి అనకూడని మాటలు అన్నారు. కానిస్టేబుల్ను దుర్భాషలాడటంతోపాటు సీఐని కూడా తోసేశారు. 'నువ్వేమన్న చేయగలవా.. మేం ఎవరో తెలుసా' అంటూ సినిమా డైలాగ్లు పేల్చారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిని రికార్డు చేస్తున్న మీడియావాళ్లను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టారు. వివరాల్లోకి వెళితే.. ముక్కోటి ఏకాదశి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. ఈ సందర్బంగా శంకుమెట్ట సర్కిల్ వద్ద ట్రాఫిక్ను పక్కకు మళ్లించారు. ఇంతలో ఓ కారులో వచ్చిన వ్యక్తులు తాము చైర్మన్ బంధువులం అని, తమను వెళ్లనివ్వాలని, జేఈని కలవాలని అడిగారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున కారును పక్కు పార్కింగ్ చేసి నడిచి వెళ్లండని అన్నారు. దాంతో వారంతా ఇక దౌర్జన్యానికి దిగారు. వరప్రసాద్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్పై దుర్భాషలాడారు. అది చూసి సీఐ శ్రీనివాసులు వెళ్లగా ఆయనపైకి కూడా దూసుకెళ్లారు. అంతుచూస్తామంటూ పెచ్చరిల్లిపోయారు. ఈ సంఘటన అనంతరం మీడియాతో సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ 'ఓ నలుగురు వ్యక్తులు టీటీడీ చైర్మన్ బంధువులమంటూ వచ్చారు. పార్కింగ్ చేసి వెళ్లమన్నందుకు దుర్భాషలాడారు. మా కానిస్టేబుల్ను తిడుతుంటే నేను వెళ్లగా.. నువ్వేం చేస్తావ్ అంటూ తోసేశారు. ఈ విషయం డీఎస్పీకి చెప్పగా నేను మాట్లాడుతానులే అని చెప్పి పంపించేశారు' అని చెప్పారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పందిస్తూ 'నేను జడ్జీ కొడుకును నడిచి పోవాలా అంటూ ఒకతను మీదకొచ్చాడు. నలుగురైదుగురు కొట్టబోయారు.. ఎవరు ఆపినా వారు ఆగలేదు' అని చెప్పాడు. -
తిరుమలలో టీటీడీ చైర్మన్ బంధువుల హల్చల్
-
'నీళ్లు ఎత్తుకెళ్లిన దొంగ చదలవాడ'
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు ప్రస్తుత చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిపై వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చదలవాడకు దమ్ముంటే చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. శనివారం తిరుపతి ప్రెస్క్లబ్లో భూమన మీడియాతో మాట్లాడారు. 'దర్శనాల టికెట్లు అమ్ముకున్న నీచ చరిత్ర చదలవాడది. టీటీడీ చైర్మన్ కావడానికి కొన్నేళ్లముందు ఆయన మున్సిపాలిటీ నీళ్లను దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అలాంటి చరిత్ర ఉన్న ఆయనా నన్ను విమర్శించేది? నిజానికి టీటీడీలో చదలవాడ స్థానం స్వీపర్కు ఎక్కువ, గుత్తేదారుకు తక్కువ. అక్రమాలకు పాల్పడటం ఆయన అలవాటు. నాపై చేసిన ఆరోపణలపై చర్చకు ఎల్లప్పుడూ నేను సిద్ధం. దమ్ముంటే ఆరోపణలు రుజువుచేయాలి. లేదంటే తప్పు ఒప్పుకోవాలి' అని భూమన అన్నారు. -
టీటీడీలో 447 అర్చక, పరిచారిక పోస్టులు
ఉద్యోగాల భర్తీకి అనుమతి కోసం ఏపీ ప్రభుత్వానికి టీటీడీ బోర్డు వినతి సాక్షి, తిరుమల: టీటీడీ ప్రధాన ఆలయాలు, అను బంధ ఆలయాలు, కొత్తగా విలీనమైన ఆలయాల్లో మొత్తం 447 మంది అర్చకులు, పరిచారకుల పోస్టులు భర్తీ చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వానికి విన్నవిస్తూ మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించినట్టు చైర్మన్ చదల వాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు అన్నారు. సమావేశంలోని మరికొన్ని తీర్మానాలు... ► తిరుపతి నగర సుందరీకరణలో భాగంగా రేణి గుంట జంక్షన్ నుంచి కాలూరు క్రాస్ వరకు 200 అడుగుల రోడ్డు నిర్మాణం, విద్యుదీకరణ కోసం తుడాకు రూ.10 కోట్లు మంజూరు. ► టీటీడీ రవాణా విభాగంలో కన్సాలిడేటెడ్ ప్రాతిప దికన పనిచేస్తున్న 150 మంది డ్రైవర్లకు 2015లో సవరించిన వేతనం ప్రకారం నెలకు రూ.15,189 నుంచి రూ.25.500 వేతనం పెంపు. ► తిరుమల అదనపు పోటులో పనిచేస్తున్న 176 మంది కార్మికుల కాంట్రాక్టు కాలపరిమితి మరో ఏడాది పొడిగింపు. ► రూ.86.46 లక్షలతో 11 లక్షల కొబ్బరికాయలు, రూ.1.16 కోట్లతో 1.25 లక్షల కిలోల ఎస్ గ్రేడ్ జీడిపప్పు, రూ.6.12 కోట్లతో 15.30 లక్షల కిలోల సోనామసూరి బియ్యం ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కొనుగోలుకు నిర్ణయం. సామాన్యులకే ముక్కోటి దర్శనం వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలో పర్వదినాల్లో బస, దర్శనం విషయాల్లో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యతని, వేకువజాము 4 గంటలకే సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామని చైర్మన్ తెలిపారు. -
శేఖర్రెడ్డి అక్రమాలపై బాబు నోరు విప్పాలి!
ధ్వజమెత్తిన సీపీఐ రాష్ట్ర సమితి సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల అండతో టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్రెడ్డి వంటి నల్లకుబేరులు రూ.వందల కోట్లను తెల్లడబ్బుగా మార్చుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపకపోవడం విస్మయం కలిగిస్తోందని సీపీఐ రాష్ట్ర సమితి ధ్వజమెత్తింది. ఏ ప్రభుత్వ అధినేత అండతో శేఖర్రెడ్డి రూ.70 కోట్ల కొత్త కరెన్సీని సంపాదించారో చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇలాంటి ఘరానా మోసగాళ్లకు చంద్రబాబు ఎలా పదవులు కట్టబెట్టారో చెప్పాలని నిలదీసింది. రెండు రోజులుగా విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం మీడియాకు విడుదల చేశారు. శేఖర్రెడ్డి ఇంట్లో వందల కోట్ల డబ్బు, కిలోల కొద్దీ బంగారం దొరికిన తర్వాత టీటీడీ బోర్డు నుంచి తీసేసినంత మాత్రాన చంద్రబాబు పాపం ప్రక్షాళన అయిపోదని, ఆ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. టీటీడీ బోర్డులో వ్యాపార, వాణిజ్యవేత్తలను నియమించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. -
టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. చైర్మన్ చదలవాడ కష్ణమూర్తి అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్ అతిథిగహంలో ఈ సమావేశం జరుగుతోంది. దేవస్థానం పరిపాలన సంబంధిత అంశాలు, ఆలయాల పునరుద్ధరణకు సహకారంతోపాటు తిరుమల ఆలయం, అనుబంధ ఆలయాలు, నిత్యాన్నప్రసాద కేంద్రానికి అవసరమైన సరుకుల కొనుగోళ్లకు అనుమతులపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, భాస్కర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. -
స్విమ్స్ ఆస్పత్రికి ఏటా రూ.24 కోట్లు మంజూరు
– టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం – విదేశాల్లోనూ వైభవోత్సవాలు – 36.67 కోట్ల కొనుగోళ్లకు ఆమోదం సాక్షి, తిరుమల: తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు, మౌళిక వసతుల కల్పన కోసం ఇకపై ఏటా రూ.24 కోట్లు కేటాయించాలని మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. ప్రస్తుతం ఏటా రూ.12 కోట్లు ఇస్తున్న మొత్తాన్ని రూ.24 కోట్లు పెంచుతూ తీర్మానించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. మరికొన్ని నిర్ణయాలివి..., – విదేశాల్లో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. నిర్దేశిత ప్రాంతాల్లో రెండు రోజులపాటు జరిగే ఈ వైభవోత్సవాలకు పూర్తి ఖర్చును దాతలే భరించాల్సి ఉంటుందని, లభించే హుండీ కానుకల మొత్తం టీటీడీకే చెందుతాయని తీర్మానించారు. – ధర్మప్రచారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మత్సకార ప్రాంతాల్లో 500 ఆలయాల నిర్మాణంకోసం రాష్ట్ర దేవాదాయశాఖకు రూ.25 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ ఇది వరకే తీర్మానించింది. ఇందులో భాగంగానే మంగళవారం రూ.5 కోట్లు నిధులు విడుదలకు ఆమోదించింది. – గుజరాత్రాష్ట్రం అహ్మదాబాద్లోని టీటీడీ కల్యాణ మండపం, ఆడిటోరియం నిర్మాణాకి రూ.3.45 కోట్లు, చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి రూ.1.25 కోట్లు, గుంటూరు జిల్లా ఎడ్లపాడులో కల్యాణ మండపం నిర్మాణానికి రూ.1.25 కోట్లు మంజూరు. – చిత్తూరు జిల్లా పాకాల మండలం ఉట్లవారిపల్లెలోని సుబ్రమణ్యస్వామి ఆలయం చెంత డార్మిటరిహాలు, అదనపు గదుల నిర్మాణానికి రూ.95 లక్షలు, తూర్పుగోదావరి జిల్లా కరప మండలం జడృభవరం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం పుననిర్మాణం కోసం రూ.20.70 లక్షలు, విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో రాయాలయం పునర్నిర్మాణం కోసం రూ.22.50 లక్షలు మంజూరు. – కడప జిల్లా ఖాజీపేట మండలం పుల్లూరు గ్రామంలో నాగేశ్వరస్వామివారి ఆలయంలో ఆలయ మరమ్మతులకు రూ.19.80 లక్షలు, మైదుకూరు మండలం వనిపెంట గ్రామంలోని చెన్నకేశవస్వామి వారి ఆలయ గోపురం, సాలహారం నిర్మాణం కోసం రూ.22.50 లక్షల మంజూరు. – టీటీడీ ఆస్థాన సిద్దాంతిగా మూడు సంవత్సరాల కాలపరిమితితో తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ నియామకం. – 2017 సంవత్సరానికి 10 లక్షల డైరీల ముద్రణకు ప్రయివేట్ ముద్రణకు ఆమోదం. – టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల దంత చికిత్స నిమిత్తం నిర్దేశిత ఆస్పత్రుల జాబితాలో కృష్ణతేజ సూపర్స్పెషాలిటీ దంతవైద్యశాలకు అనుమతి. రూ.36.67 కోట్ల కొనుగోళ్లకు ఆమోదం 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.36.67 కోట్ల కొనగోళ్లకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఇందులో రూ.3.01 కోట్లతో టీటీడీ ఆస్పత్రులకు మందుల కొనుగోలు. రూ.8.46 కోట్లతో హర్యానలోని కర్నాల్ మిల్క్ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా 2.25 లక్షల కిలోలు ఆవు నెయ్యి కొనుగోలు. రూ.6.52 కోట్లతో ఏపీ, తెలంగాణ రైస్మిల్లర్ల ద్వారా 16.32 లక్షల కిలోల సోనమసూరి పాత బియ్యం కొనుగోలు. రూ.3.05 కోట్లతో 2 లక్షల కిలోల ఎండుద్రాక్ష కొనుగోలు. రూ.1.50 కోట్లతో 1.80 లక్షల కాటన్ ఉత్తరీయాలు కొనుగోలు. రూ.1.47 కోట్లతో 3.60 కోట్ల పేపర్ కప్పులు కొనుగోలు. రూ. 1.38 కోట్లతో 2.50 లక్షల కాటన్ బ్లౌజ్ఫీసులు కొనుగోలు. రూ.11.28 కోట్లతో 39.32 లక్షల లీటర్ల టోన్డ్పాలు కొనుగోలు. అలాగే, చింతపండును హిందూపురం చింతపండి మండీ వర్తకుల సమైఖ్యద్వారా, బెల్లం అనకాపల్లి వర్తకుల నుండి కొనుగోలుకు ఆమోదించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు వివరాలతో కూడిన బుక్లెట్ను టీటీడీ చైర్మన్,ఈవో , సభ్యులు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట – మీడియాతో చైర్మన్,ఈవో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆలయ వీధుల్లో వాహన సేవలతోపాటు ఆలయంలో మూలమూర్తి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల్లో కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని, వారి సిఫారసులకు ఉండబోవని స్పష్టం చేశారు. ఉత్సవాల రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఇటీవల నిర్వహించిన ఈ–వేలం ద్వారా టీటీడీకి జూలై,2016లో రూ.11.88 కోట్లు, ఆగస్టులో రూ.5.94 కోట్లు ఆదాయం లభించిందన్నారు. -
చదలవాడపై అట్రాసిటీ కేసు
నిండ్ర: ఫ్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీలో తలెత్తిన వివాదాలకు సంబంధించి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుధవారం నమోదైంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కొప్పేడు దళితవాడకు చెందిన షణ్ముగం ఫిర్యాదు మేరకు... చదలవాడ కృష్ణమూర్తి తన అనుచరులతో ఈ నెల 25న కర్మాగారంలో గొడవ సృష్టిస్తుంటే తాము అడ్డుకున్నామని, ఆ సమయంలో తనను చదలవాడ అనుచరులు కులం పేరుతో దూషించారంటూ అదే రోజున షణ్ముగం నిండ్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అనంతరం బుధవారం చదలవాడ కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు నిండ్ర ఏఎస్ఐ దేవదాసు తెలిపారు. -
జూబ్లీహిల్స్లో వెంకన్న ఆలయానికి శంకుస్థాపన
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అరికెల నర్సారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, చింతల రామచంద్రరారెడ్డి హాజరయ్యారు. -
రాయల చెరువు గుట్టపై ఆంజనేయుడు
– భారీ విగ్రహ నిర్మాణానికి టీటీడీ తీర్మానం –వరలక్ష్మి వ్రతం పోస్టర్ల ఆవిష్కరణ –పుష్కరాల ప్రాముఖ్యతపై ఎస్వీబీసీలో ప్రోమో సాక్షి, తిరుమల: రామచంద్రాపురం మండలం రాయలచెరువు గుట్టపై ఆంజనేయుడు కొలువుదీరనున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు టీటీడీ బోర్డు సిద్ధమైంది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జరిగిన బోర్డు సమావేశంలో దీనిపై తీర్మానం చేశారు. దాదాపు రూ.32 లక్షల ఖర్చుతో 46 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. దీనివల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే పాదచారులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భక్తి భావం పెంపొందించే అవకాశం ఉంటుందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. వరలక్ష్మి వత్రం పోస్టర్ల అవిష్కరణ తిరుచానూరు పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఈ నెల 12వ తేదీన జరగనుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు, తిరుచానూరు ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆవిష్కరించారు. శ్రావణ మాసంలో అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 12న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో జరుగుతుందని చైర్మన్, ఈవో వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు బంగారు రథంపై అమ్మవారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు. కష్ణాపుష్కరాల్లో సేవలందించనున్న టీటీడీ సిబ్బందికి భారత్ బయోటెక్ రూపొందించిన టైఫాయిడ్ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పుష్కరాల ప్రాముఖ్యతపై ఎస్వీబీసీలో ప్రోమో కృష్ణా పుష్కరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎస్వీబీసీ తయారు చేసిన ప్రోమోను టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు ప్రారంభించారు. ఐదున్నర నిమిషాల నిడివి గల ఈ ప్రోమోలో కృష్ణానది ప్రాముఖ్యత, సంపద, వివిధ నదులు, వివిధ కళలకు చెందిన ప్రముఖులు, రచయితలు, వాగ్గేయకారులు, సినీ పరిశ్రమ, తదితర రంగాల ప్రాముఖ్యతను తెలియజేసే అంశాలు ఉన్నాయి.. ప్రముఖ దర్శకులు, టీటీడీ బోర్డు సభ్యుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ ప్రోమోను చిత్రీకరించారు. పుష్కరాలు పూర్తయ్యేవరకు ఈ ప్రోమో ఎస్వీబీసీలో ప్రసారం కానుంది. -
ఎస్సీ, ఎస్టీ వాడల్లో శ్రీవారి ఆలయాలు
– తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణకు 74 సెంట్ల స్థలం బదలాయింపు – టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం – రూ.33.49 కోట్ల కొనుగోళ్లకు ఆమోదం సాక్షి,తిరుమల: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు రూ.8 లక్షలు కేటాయిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది. గతంలో ఉండే మ్యాచింగ్గ్రాంట్ పద్దతి రద్దు చేస్తూ, ఆలయాల నిర్మాణం కోసం అయ్యే ఖర్చు వందశాతాన్ని ధార్మిక సంస్థే భరించేలా మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానం చేసినట్టు చైర్మన్ చదలవాడ కష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలివి.. – తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ, అభివద్ధి కోసం టీటీడీకి చెందిన 2.19 ఎకరాల స్థలాన్ని రైల్వే విభాగానికి గతంలో కేటాయించారు. అందులోనే 74 సెంట్ల స్థలాన్ని తక్షణమే మార్కెట్ ధర కింద రైల్వే విభాగానికి బదిలీ చేయాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఏడాదిలోపే పనులు పూర్తి చేసే నిబంధనతో బోర్డు ఆమోదముద్ర వేసింది. – ద్వారకా తిరుమలలో శ్రీవేంకటేశ్వర వికలాంగులు మరియు పునరావాస సంస్థకు మూలనిధిగా రూ.10 కోట్లు విడుదల చేస్తూ బోర్డు తీర్మానం. – రూ.5.5 కోట్ల విలువైన వెండితో 5,10 గ్రాముల డాలర్లు తయారు చేసి విక్రయించేందుకు అమోదం – చిత్తూరుజిల్లా రాయలచెరువు వద్ద రూ.32 లక్షలతో 46 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం – 2017వ సంవత్సరంలో 18 లక్షల 12 షీట్ల కేలండర్ల ముద్రణకు ఆదమోదం – టీటీడీ విద్యాసంస్థల్లో పీజీ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టళ్లలో భోజన సదుపాయం కల్పించేందుకు ఆమోదం. మెస్చార్జీలను ఫీజు రీ ఎంబర్స్మెంట్ నుండి వసూలుకు నిర్ణయం. – టీటీడీలోని సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డులుగా పునర్ నియామకం పొందిన సైనిక పింఛను దారుల భార్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన పింఛను ఉత్తర్వులను అమలు చేయాలని నిర్ణయం – గుంటూరుజిల్లా తాడికొండ గ్రామంలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయానికి రూ.31.25 లక్షలు, వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు మండలం చనంపల్లె గ్రామయంలోని చెన్నకేశవ ఆలయంలో నూతన మహారథాలు తయారికి బోర్డు అనుమతి – విజయగనరం జిల్లా కొత్త వలస మండపం వీర భద్రాపురం గ్రామంలోని వీరేశ్వరి ఆలయంలో రూ.25 లక్షలతో మరమ్మతు. రూ.33.49 కోట్లతో సరుకుల కొనుగోళ్ల తిరుమల ఆలయం, టీటీడీ అవసర కోసం మొత్తం రూ.రూ.33.49 కోట్లతో సరుకుల కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో రూ.20.32 కోట్లతో 24 లక్షల శెనగపప్పు కొనుగోలు, రూ.4.32 కోట్లతో 36వేల కిలోల యాలకులు, రూ. 1.34 కోట్లతో లక్ష కిలోల ఉద్దిపప్పు, రూ.4.48 కోట్లతో 3.50 కిలోల కందిపప్పు,1.56 కోట్లతో 22 లక్షల కొబ్బరికాయలు, రూ.78.18 లక్షలతో 9500 కిలోల మిరియాలు, రూ.69.49 లక్షలతో 45వేల కిలోల ఎండుమిరప కొనుగోలుకు నిర్ణయించారు. -
చినజీయర్ను కలిసిన టీటీడీ చైర్మన్
సీతానగరం (తాడేపల్లిరూరల్): జీయర్ ఆశ్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సోమవారం రాత్రి కలిశారు. చినజీయర్స్వామిని ఆయన తిరుపతికి రావాలని ఆహ్వానించారు. వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని తెలిపారు. అహోబిల రామానుజ జీయర్ స్వామి, జెట్ కార్యదర్శి చక్రధర్ ఉన్నారు. -
ఒంటిమిట్టను అభివృద్ధి చేస్తాం
ఒంటిమిట్ట: టీటీడీకి అనుబంధంగా ఉన్న వైఎస్సార్జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని, సకల వసతులు కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తలమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఒంటిమిట్లలో ఆలయం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయానికి బుధవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఒంటిమిట్టలో రూ.4.60కోట్లతో వసతి సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఏడాదిలోగా మూడు అంతస్తుల కాటేజ్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 22 గదులతో పాటు 700మంది భక్తులకు సరిపడా భోజనశాల ఉంటాయన్నారు. మరో నాలుగు డార్మెటరీల నిర్మాణానికి, అనుబంధ ఆలయాల్లో తెప్పోత్సవాలు నిర్వహించేందుకు, అన్నప్రసాద వితరణను ప్రవేశపెట్టేందుకు త్వరలో బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఒంటిమిట్టలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రతియేటా శ్రీసీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు ఒంటిమిట్ట రామాలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్న టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు పుట్టా సుధాకర్యాదవ్, రమణ పాల్గొన్నారు. ప్రోటోకాల్ను విస్మరించిన అధికారులపై ఆగ్రహం ఒంటిమిట్టలో నూతనంగా నిర్మించనున్న వసతిగృహానికి సంబంధించిన ప్రోటోకాల్ను టీటీడీ అధికారులు పూర్తిగా విస్మరించారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ పేర్లను టీటీడీ అధికారులు విస్మరించారు. దీనిపె కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులు చైర్మన్ను కోరారు. కోదండరాముడిని దర్శించుకున్న చదలవాడ కాటేజీ భూమిపూజకు ముందు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డిలు ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్నారు. వీరికి ఆలయంలో పూర్ణకుంభం, మేళతాళాలలో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చైర్మన్ను స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
వెంకన్న కొలువులో మరో ఏడాది
► టీటీడీ ధర్మకర్తల మండలికి మరో ఏడాది పొడిగింపు ► సోమవారం జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలికి మరో ఏడాది పొడిగింపు ఇచ్చారు. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీ వరకు పదవిలో కొనసాగనుంది. టీఆర్ఎస్ పార్టీలో చేరి ట్రస్టుబోర్డు సమావేశాలకు గైర్హాజరైన టీడీపీ ఎమ్మెల్యే సాయన్నను తొలగిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఎండోమెంట్ చట్టం, తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి చట్టం ప్రకారం ధర్మకర్తల మండలి పదవీ కాలం రెండేళ్లు. తొలి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. 2014 జూన్లో టీడీపీ అధికారపగ్గాలు చేపట్టింది. 11నెలలు టీటీడీకి బోర్డు లేకుండానే గడిపింది. గత ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ధర్మకర్తల మండలిని నియమించారు. ఏప్రిల్ 28వ తేదీతో గడువు ముగిసింది. దీన్ని ముందే గుర్తించిన దేవాదాయ శాఖ పొడిగింపు ఉత్తుర్వుల ఫైలు నెల ముందే సిద్ధం చేసింది. రాజకీయ కారణాలతో అనేక ఊగిసలాటల మధ్య ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులిచ్చింది. సమావేశాలకు గైర్హాజరైన సాయన్న తొలగింపు టీటీడీ ట్రస్టు బోర్డులో తెలుగుదేశం పార్టీ తెలంగాణా కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి.సాయన్నకు అవకాశమిచ్చారు. ఆయన ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ట్రస్టుబోర్డు పదవికి రాజీనామా చేయలేదు. పైగా గత ఏడాది డిసెంబరు నుంచి వరుసగా ఐదు సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఆ మేరకు ఆయన సభ్వత్వాన్ని రద్దు చేశారు. ఆయన స్థానంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన వారినే నియమించే అవకాశముంది. నెల రోజుల చర్చకు సోమవారంతో ముగింపు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏడాది కాలం మాత్రమే టీటీడీ ధర్మకర్తల మండలి పదవిలో ఉంటుందని అంద రూ భావించారు. టీటీడీ చైర్మన్ పీఠం కోసం రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్ , గోకరాజు గంగరాజుతో పాటు రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు పోటీ పడ్డారు. ఇచ్చిన గడువు తర్వాత కొత్త బోర్డు వస్తుందని ప్రచారం విస్తృతంగా సాగింది. ఆలయ ధర్మకర్తల మండళ్లకూ పదవీ కాలం ఏడాది ఇచ్చినా రెండు నెలల ముందు రెండేళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సంప్రదాయాన్ని టీటీడీకి వర్తింపజేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
సాయన్న టీటీడీ బోర్డు సభ్యత్వం రద్దు
హైదరాబాద్ : టీటీడీ చైర్మన్ అనుమతి లేకుండా వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాక పోవడంతో టీటీడీ బోర్డు సభ్యుడు జి. సాయన్న సభ్యత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దుచేస్తూ సోమవారం ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే సాయన్నను ఏడాది క్రితం టీటీడీ సభ్యునిగా నియమించారు. అయితే ఆయన ఒక్కసారి కూడా తిరుమలలో జరిగే టీటీడీ ట్రస్టు బోర్డు సమావేశాలకు హాజరుకాలేదు. గైర్హాజరుపై టీటీడీ చైర్మన్కు సమాచారం కూడా ఇవ్వలేదు. దాంతో ప్రభుత్వం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. కాగా తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలిని మరో ఏడాది పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి?
ఎటూ తేలని టీటీడీ ధర్మకర్తల మండలి భవితవ్యం జీవో ప్రకారం ముగిసిన ఏడాది పదవీ కాలం ప్రమాణస్వీకారం ప్రకారం మే ఒకటి వరకు కొనసాగే అవకాశం పొడిగింపుపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి మార్పులపై సీఎం కసరత్తు, పెరిగిన ఆశావహుల ఒత్తిడి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొనసాగింపుపై సందిగ్ధం వీడడం లేదు. నిబంధనల ప్రకారం గత బుధవారంతోనే టీటీడీ బోర్డు పదవీకాలం ముగిసింది.అయితే ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేస్తుందా..? లేక పాత పాలకమండలినే కొనసాగిస్తుందా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఇదిలా ఉండగా బోర్డులో చోటు దక్కించుకునేందుకు అధికారపార్టీ నాయకులతో పాటు, పారిశ్రామిక వేత్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి నియామక ఉత్తర్వులు గత ఏడాది ఏప్రిల్ 26న వెలువడ్డాయి. టీటీడీ చైర్మన్గా తిరుపతికి చెందిన చదలవాడ కృష్ణమూర్తితోపాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. ఆమేరకు మే 1వ తేదీన చైర్మన్తోపాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది పాటు ధర్మకర్తల మండలి పదవిలో కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ప్రకారం ఈ దర్మకర్తల మండలి పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే ప్రమాణం స్వీకారం చేసింది మే 1న కాబట్టి ఈ ఏడాది మే 1 వరకు వీరు కొనసాగే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తోంది. అందువల్లే జీవో ప్రకారం పదవీ కాలం ముగిసినా ప్రమాణస్వీకారం తేదీని దృష్టిలో ఉంచుకుని చైర్మన్తోపాటు సభ్యులకు అందాల్సిన మర్యాదలన్నీ గురువారం కూడా కొనసాగించారు. సాయన్నతోపాటు పలువురి మార్పులపై కసరత్తు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలినే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్థానిక ఆలయాల కమిటీలకు రెండేళ్లు పొడిగించారు. అదే నిర్ణయానే టీటీడీకి కూడా వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సభ్యుల్లోని తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయన్న ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశాలకు వరుసగా నాలుగుసార్లు హాజరుకాలేదు. ఈయన తొలగింపుపై టీటీడీ, ఎండోమెంట్ చట్టంతోపాటు న్యాయ సలహా తీసుకున్నారు. పనిలో పనిగా ఒకరిద్దరు సభ్యులు మార్పుపై కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి? టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్న సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గురువారం సీఎం చంద్రబాబును కలిసి చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. అలాగే, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు చర్చ సాగుతోంది. ఇక బీజేపీ తరపున నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. తాజా బోర్డు ఉత్తర్వులు ఇంకా రాకపోవడంతో కొత్త బోర్డుపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. గురువారం రాత్రి వరకు దీనిపై ఎటువంటి స్పష్టమైన నిర్ణయం వెలువడ లేదు. పాత బోర్డు కొనసాగింపా? కొత్త బోర్డు నియామకమా? అన్నది శుక్రవారం తేలిపోనుంది. అలా రానిపక్షంలో మే రెండో తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. -
బంజారాహిల్స్లో రూ. 18కోట్లతో వెంకన్న ఆలయం
హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో రూ. 18 కోట్లతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో కొత్త ముత్యపు పందిరి, సర్వభూపాల వాహనం తయారీకి రూ. 3.86 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. అర్చకుల సంక్షేమ నిధికి రూ. 25 కోట్లు మంజూరు చేశారు. స్వామివారి శఠగోపాల తయారీకి రూ. 72 లక్షలు కేటాయించారు. కెన్యా రాజధాని నైరోబీలో మే 22న వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట ఆలయంలో కొత్త కళ్యాణమండపం నిర్మిస్తారు. యాత్రకుల ఉచిత సముదాయానికి రూ. 4.6 కోట్లు కేటాయించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు రూ. 50 లక్షలు మంజూరుచేశారు. తిరుమల వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం, కొత్త వంటపాత్రల కొనుగోలుకు రూ. 30 లక్షలు మంజూరు చేశారు. -
ఒంటిమిట్టలో టీటీడీ చైర్మన్
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సందర్శంచారు. మంగళవారం ఉదయం ఆయన ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం వచ్చే నెల 12 వ తేదీ నుంచి జర గబోయే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చదలవాడ పరిశీలించారు. -
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
తిరుపతి: శ్రీవారి సేవా టిక్కెట్లు, అద్దె గదులు, కల్యాణ మండపాల ధరల పెంపు నిర్ణయాన్ని టీటీడీ బోర్డు వాయిదా వేసింది. శుక్రవారం జరిగిన సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాల తయారీకి టీటీడీ ఆమోదం తెలిపింది. తిరుపతి రైల్వే స్టేషన్ కు 2.7 ఎకరాల భూమి లీజుకు అంగీకారం తెలిపింది. టీటీడీ కాంట్రాక్టు కార్మికుల పదవీకాలం మరో ఏడాది పొడిగించింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతులకు రూ. 2.8 కోట్లు మంజూరు చేసింది. వారి ఆలయంలో జయ, విజయ వద్ద వాకిలిని బంగారు తాపడం చేయించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. -
తిరుమలలో ప్రారంభమైన టీటీడీ సమావేశం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. తిరుమల అన్నమయ్య భవన్లో అతిథి గృహంలో ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేయనున్నారు. తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో కొత్తగా సహస్ర కలశాభిషేకం సేవనును ప్రారంభించడంతోపాటు టీటీడీ మార్కెటింగ్ విభాగం కొనుగోళ్లపై కూడా తీర్మానాలు చేయనున్నారు. అలాగే తిరుపతిలోని రైల్వే స్టేషన్ విస్తరణ కోసం టీటీడీ స్థలం అప్పగింత అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సేవా టికెట్ల ధరల పెంపుపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంచేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి సబ్ కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసింది. దీని గత ఇప్పటికే రెండు సమావేశాల్లో సుధీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న సమావేశంలో సబ్ కమిటీ సిఫార్సులపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
శ్రీవారు.. ‘సిరి’వారు
♦ రికార్డు స్థాయిలో వెంకన్న ఆదాయం ♦ ఈ ఏడాది రూ. వెయ్యి కోట్లు దాటిన హుండీ కానుకలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరుని హుండీ ఆదాయం ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక ఆదాయం చరిత్రలో తొలిసారిగా రూ. వెయ్యి కోట్లు దాటింది. 2015-2016 వార్షిక బడ్జెట్లో రూ. 905 కోట్లు మాత్రమే రావచ్చని అంచనా వేయగా ఇప్పటికే రూ. 1,010 కోట్లు వచ్చాయి. 2003-2004 వార్షిక బడ్జెట్ రూ. 590 కోట్లు ఉండగా పదమూడేళ్ల తర్వాత సుమారు నాలుగున్నర రెట్లతో 2016-2017కు రూ. 2,678 కోట్లకు పెరిగింది. అలాగే హుండీ ఆదాయం అప్పట్లో రూ. 227 కోట్లు ఉండగా ప్రస్తుతం సుమారు ఐదు రెట్లు రూ. 1,010 కోట్లకు పెరిగింది. అలాగే అప్పట్లో 2003-2004లో డిపాజిట్లపై వచ్చే వడ్డీ సుమారు రూ. 50 కోట్లు ఉండగా (డిపాజిట్లు సుమారు రూ.12వేల కోట్లు), 2016-2017 ఆర్థిక సంవత్సరానికి 15 రెట్లు పెరిగి రూ. 778.93 కోట్లు రావచ్చని అంచనా వేశారు. రూ. 1.34 లక్షలతో మొదలై... 1951 నవంబర్ నెల మొత్తంగా స్వామివారికి ఆలయ హుండీ ద్వారా లభించిన కానుకలు 1,34,256 రూపాయల 9 అణాల 11పైసలు మాత్రమే. ప్రస్తుతం రోజుకు రూ. 2 నుంచి 3 కోట్లు దాటుతుండటం విశేషం. ఏప్రిల్, మే నెలల్లో హుండీ ద్వారా నెలకు రూ. 80 కోట్లు లభిస్తుండగా, మిగిలిన నెలల్లో సరాసరిగా రూ. 55 నుంచి రూ. 60 కోట్లు లభిస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు లభిస్తుండటం ఇటీవల పెరిగింది. ఆర్థిక సంవత్సరం చివరి నె లలైన ఫిబ్రవరి, మార్చిలో ఆదాయ పన్ను పద్దులు చూపించే సమయం కావటం వల్ల సంపన్నులు ఆ మొత్తాలను హుండీలో సమర్పిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. పసాదాల ధరలు పెంచబోం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సాక్షి, న్యూఢిల్లీ: ధరల పెరుగుదల కారణంగా తిరుమల లడ్డూ, ఇతర ప్రసాదాల ధర కూడా పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ధరలు పెంచబోమని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. ఆదివారమిక్కడ శ్రీ వేంకటేశ్వర కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళ నానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ ధర తక్కువగా ఉండటం వల్ల టీటీడీపై ఏటా రూ. 160 కోట్ల భారం పడుతోందని చెప్పారు. ఆర్జిత సేవల టిక్కెట్ల ధరలు కూడా పెంచాలన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. వీటిపై భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే టీటీడీ అందిస్తున్న కొన్ని ఉచిత సౌకర్యాలను భక్తులు వినియోగించుకోవడం లేదని, అలాంటి వాటిని తొలగించడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకుంటామని తెలిపారు. ఢిల్లీలోని ఎస్వీ కళాశాలలో బాలికలకు హాస్టల్ వసతి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. టీటీడీ అనుబంధ విద్యాసంస్థలకు కూడా భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తామన్నారు. సిబ్బంది పిల్లలకు టీటీడీ విద్యాసంస్థల్లో ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. -
తిరుమల లడ్డూ ధర యథాతథం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూ ధరను పెంచడం లేదు. ఈ విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 2,678 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది. శ్రీవారి వైభవోత్సవాలను 8 రోజుల నుంచి 5 రోజులకు కుదించారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి బంగారు తాపడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో అమవాస్య నాడు హనుమంత వాహన సేవ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే.. శనగపప్పు, ఏలకులు, నెయ్యి, పెసరపప్పు, చింతపండు కొనుగోళ్లకు ఆమోదం తెలిపారు. రూ. 3.30 కోట్లతో రెండో ఘాట్ రోడ్డు మరమ్మత్తులకు ఆమోదం లభించింది. ఆర్జిత సేవ, అద్దె గదులపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అలాగే తిరుమలలో రూ. 4.5 కోట్లతో ఆక్టోపస్ భద్రతాదళానికి భవన నిర్మాణం చేపట్టేందుకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. -
చతుర్వేదాలతో ధ్వనించిన సప్తగిరులు
♦ తొలిసారిగా 1500 మందితో నిర్వహణ ♦ గరుడ వాహనంపై దర్శనమిచ్చిన వేదోద్ధారకుడు సాక్షి, తిరుమల: చతుర్వేద పారాయణంతో ఆదివారం సప్తగిరులు ధ్వనించాయి. పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఆదివారం రాత్రి గరుడ వాహనంపై మలయప్పస్వామి ఆలయ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులోనే తొలిసారిగా 1,500 మంది వేద పారాయణదారులతో వేద మహోత్సవం పేరుతో నాలుగు వేదాలను పారాయణం చేశారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లోని ఒక్కో మాడ వీధిలో ఒక్కో వేదాన్ని పండితులు సామూహికంగా పారాయణం చేశారు. ఒకవైపు గరుడ వాహనంపై స్వామివారు దర్శనమిస్తూ ఊరేగుతుండగా, మరోవైపు పండితుల సామూహిక వేద పారాయణ ధ్వనులు ఏడుకొండల్లో ప్రతిధ్వనిస్తుండటంతో భక్తకోటి పులకించిపోయింది. వాహన సేవ ఊరేగింపు పూర్తి అయిన తర్వాత వాహన మండపం వద్ద పారాయణదారులు చతుర్వేదాలు పారాయణం చేశారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, అసోం, గోవా వంటి రాష్ట్రాల నుంచి 4 వేదాల పారాయణదారులు పాల్గొన్నారు. కాగా, వేద పరిరక్షణ, వ్యాప్తి, వేద పారాయణదారుల సమస్యలు, పరి ష్కారంపై టీటీడీ అనుసరించాల్సిన తీరు వంటి అంశాలపై ఆదివారం సర్వే చేశారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ సి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
భారీ వర్షాలతో తిరుమలకు జలకళ
వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలు.. నీటి ఎద్దడితో అల్లాడుతున్న తిరుమలకు స్వాంతన నిచ్చాయి. తిరుమలలోని జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. మంగళవారం ఆకాశగంగ, గోగర్భం డ్యాములు పొంగి పొర్లాయి. పాపవినాశనం, కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల్లో 70శాతం నీరు చేరింది. ఈ వర్షాల పుణ్యమా అని ఏడాదికి సరిపడా తాగునీరు చేరింది. శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరి అవసరాలతోపాటు ఆలయం, నిత్యాన్న ప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. ప్రస్తుతం ఐదు జలాశయాల్లో చేరిన నీరు ఏడాదికి సరిపోతుందని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక తిరుపతి కల్యాణీ డ్యాంలోనూ 35 శాతం నీరు చేరింది. దాంతో పాటు తెలుగుగంగ నీరు రోజూ 7 నుంచి 8 ఎంఎల్డీలు అందుతోంది. అవసరాన్ని బట్టి వినియోగించుకుంటే ఏడాదిన్నర కాలానికి ఎలాంటి ఢోకా లేదని ఇంజినీర్ల అభిప్రాయం. కాగా, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మంగళవారం జలాశయాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. -
టీటీడీ చైర్మన్పై పోలీసు కేసు నమోదు
పుత్తూరు : నిండ్రలోని ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను బెదిరించారనే ఆరోపణతో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిపై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. చదలవాడ కృష్ణమూర్తి శుక్రవారం రాత్రి తన అనుచరులతో కలసి ఫ్యాక్టరీలోకి ప్రవేశించారు. అక్కడ విధుల్లో ఉన్న కార్మికులను బయటకు వెళ్లాలని ఆగ్రహించా రు. విశ్రాంతి భవనం వద్దకు వెళ్లి ఫ్యాక్టరీకి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ ఏజెన్సీ చైర్మన్ నందకుమార్పై దురుసుగా ప్రవర్తించారు. దీనిపై శనివారం కేసు నమోదు చేసినట్టు నిండ్ర ఎస్ఐ బాలకృష్ణయ్య తెలిపారు. నేను దౌర్జన్యానికి పాల్పడలేదు : చదలవాడ ఈ సంఘటనపై చదలవాడ కృష్ణమూర్తిని సాక్షి ప్రతినిధి వివరణ కోరగా ‘‘నేను గానీ, నా అనుచరులు గానీ ఎటువంటి దౌర్జన్యానికీ పాల్పడలేదు. ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీలో నేనూ షేర్ హోల్డర్ను. ఫ్యాక్టరీ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఎవరూ పనులు చేయకూడదు. రాత్రి 7.30 సమయంలో పనులు చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లాను. నాతో పాటు రైతులకు కూడా అన్యాయం జరుగుతోందనీ, ఇంతకీ ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఫ్యాక్టరీలోకి వెళ్లాను. దీనిపై ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగాను’’ అని తెలిపారు. -
తిరుమల లడ్డూ ప్రత్యేకత తగ్గింది: టీటీడీ చైర్మన్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూ నాణ్యత గురించి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రత్యేకత తగ్గిందని, గతంలోలాగ ఆ లడ్డూ ఇప్పుడు నిల్వ ఉండట్లేదని ఆయన అన్నారు. లడ్డూ కౌంటర్లో ఉండే సిబ్బంది.. భక్తులను మోసగిస్తున్నారని చెప్పారు. సిబ్బందికి జీతాలు తక్కువగా ఉండటంతో వాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో తిరుమల లడ్డూ నాణ్యతపై పలు రకాల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. -
వేయికాళ్ల మండపం నమూనాలు సిద్ధం
సాక్షి, తిరుమల: పునః నిర్మాణానికి వేయికాళ్ల మండపం నమూనాల చిత్రాలు సిద్ధమయ్యాయి. శ్రీవారి ఆలయం వద్ద చారిత్రాత్మక కట్టడమైన వేయికాళ్ల మండపాన్ని 2003లో కూల్చివేసిన సంగతి తెలిసిందే. అనేక వివాదాల అనంతరం ఈ మండపాన్ని ఆలయానికి నైరుతి దిశలోని నారాయణగిరి ఉద్యావనంలో పున ః నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కొత్త వేయికాళ్ల మండపంలోనే శ్రీపద్మావతి పరిణయోత్సవం వంటి ఉత్సవాల నిర్వహిస్తారు. మండపం చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక, భక్తి భావాలు స్పృశించేలా నిర్మించాలని అధికారులు సంకల్పించారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థలతో పలు నమూనాలు రూపొందింపచేశారు. దీనిపై శనివారం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, చీఫ్ ఇంజినీరు చంద్రశేఖరరెడ్డి తదితరులు చర్చించారు. తుది నమూనాను త్వరలోనే ఖరారు చేయనున్నారు. -
బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.10 ఫ్రీ టాక్టైం
ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ఆఫర్ యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశంలోని ప్రతి వ్యక్తి మొబైల్కు రూ. 10 ఉచిత టాక్టైమ్ అందిస్తోంది. బుధవారం నుంచి ఈనెల 24 వరకు ఇది వర్తిస్తుందని ఆ సంస్థ చైర్మన్ ప్రమోద్ సస్రేనా పేర్కొన్నారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో బుధవారం ఈ సౌకర్యాన్ని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క భక్తుడూ గోవిందనామ స్మరణ చేయాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామన్నారు. మొబై ల్ వినియోగదారులు ఫోన్లో గోవింద అనే పదాన్ని టైప్ చేసి తర్వాత స్పేస్ ఇచ్చి ఆపరేటర్ పేరును టైప్ చేసి 9963900600కి ఎస్ఎంఎస్ చేస్తే వెంటనే రూ.10 రీచార్జ్ లభిస్తుందన్నారు. ఉదాహరణకు ఎయిర్టెల్ వినియోగదారులు GOVINDA AIRTEL అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలని కోరారు. -
వెయ్యేళ్లు నిలిచేలా వెయ్యికాళ్ల మండపం
టీటీడీ చైర్మన్ చదలవాడ సాక్షి, తిరుమల: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో వెయ్యేళ్లు నిలిచేలా వేయికాళ్ల మండపాన్ని పునఃనిర్మిస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పునాది రాయి వేయిస్తామని చెప్పారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా మండపం నిర్మాణ ఆకృతులపై ఇప్పటికే ఈవో సాంబశివరావు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి, తిరుపతిలో వకుళమాత ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. సోమవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో బోర్డు తీర్మానాలను చైర్మన్ వెల్లడించారు. * సెప్టెంబరు 16 నుంచి 24 వరకు వార్షిక, అక్టోబరు 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సమయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ దర్శనాలు రద్దు చే స్తారు. * ఆలయానికి అవసరమైన సరుకులు రూ.61.24 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. ఆవునెయ్యి ట్యాంకర్ల ద్వారా కిలో రూ.276 చొప్పున రూ. 46.92 కోట్లతో 17 లక్షల కిలోలు, డబ్బాల ద్వారా కిలో రూ.278 చొప్పున రూ. 6.65 కోట్లతో 2.25 లక్షల కిలోలు కొనుగోలు చేయనున్నారు. ఎండుద్రాక్ష కిలో రూ. 177.30 చొప్పున రూ. 3.54 కోట్లతో 2 లక్షల కిలోలు, తాండూరు రకం కందిపప్పు కిలో రూ.118 చొప్పున రూ. 4.13 కోట్లతో 3.5 లక్షల కిలోలు కొనుగోలు చే యనున్నారు. * తిరుమలలోని జలాశయాల నుంచి సరఫరా అయ్యే తాగునీటిని శుద్ధిచేసి, సరఫరా చేసేందుకు రెండేళ్లకు రూ. 4.3 కోట్ల టెండర్ను ఆమోదించారు. బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్, బ్రోచర్ను చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆవిష్కరించారు. -
విజయవాడ, రాజమండ్రిల్లో శ్రీవారి ఆలయాలు
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు విజయవాడ, రాజమండ్రిలలో శ్రీవారి ఆలయ నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని భద్రాచలం క్షేత్రంలాగానే వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. అదే విధంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. టీటీడీలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుమలలో పెట్రోల్ బంకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చదలవాడ వివరించారు. -
తిరుమల శ్రీవారి ఆలయంలో నామాల గొడవ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నామాల గొడవ... ముదురుతోంది. ప్రతి శుక్రవారం ములవిరాట్కు అభిషేకం, నిజపారద్శకం కాగానే... అర్చకులు ఏకాంతంగా స్వామివారిని అలంకరిస్తారు. అలకరణకు ముందుగా స్వామివారి నామాన్ని పచ్చకర్పూరం, కస్తూరితో తీర్చిదిద్దుతారు. అయితే ఈ నామాలను ఊర్ధ్వపుండ్రాలుగా కాకుండా రూపంలో మార్పు చేస్తున్నట్లు పెదజీయంగారు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నిఘా పెట్టిన అధికారులు శ్రీవారి సేవల్లో నిర్లక్ష్యం జరుగుతోందని గుర్తించారు. ఈ అపచారానికి రమణదీక్షితులు కుమారుడు రాజేష్ దీక్షితులే బాధ్యులని భావించి అతడిని ఆరు నెలలపాటు శ్రీవారి అభిషేకం సేవల నుంచి దూరం చేశాయి. దీనిపై ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులను సంప్రదించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అవగాహన లేనివారు చెప్పిన మాటలు వినడం మంచిది కాదన్నారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంపై సంఘ విద్రోహ శక్తుల ముప్పు ఉందని రమణ దీక్షితులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీటీడీలో కొంతమంది కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. శ్రీవారి నామాలలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. నామాల వివాదంపై న్యాయపోరాటం చేస్తామని రమణదీక్షితులు తెలిపారు. -
సామాన్య భక్తులకే పెద్ద పీట..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం చైర్మన్ విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... టీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. దీంతో నెలకు రూ. 6 కోట్ల అదనపు భారం పడుతుంది. భగవంతుని సంపదకు ఎటువంటి పరిస్థితుల్లో నష్టం వాటిల్లకుండా వస్తువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయా సీజన్లలో వస్తువులను కొనుగోలు చేసేలా 6 నెలల టెండర్ల వ్యవధిని 3 నెలలకే తగ్గించారు. తిరుపతిలో నీటి సమస్య నివారణలో భాగంగా బాలాజీ రిజర్వాయర్ నిర్మిస్తారు. సామాన్య, నడక దారి భక్తులకు ఇబ్బంది కలగకుండా 300 రూపాయల ఆన్లైన్ టికెట్లు శని, ఆదివారాల్లో తగ్గించారు. వీలైనంతవరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించి పాతపద్ధతిలోనే దర్శనభాగ్యం కల్గించేలా ఆలోచన ఉంది. తిరుపతిలోని హోటళ్లలో ఆన్లైన్ టికెట్లు ఇచ్చే విషయాన్ని పరిశీలించనున్నారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులతో పాటు టీటీడీ ఈవో సాంబశివరావు పాల్గొన్నారు. ధర్మకర్తలమండలి ముఖ్యమైన నిర్ణయాలు: ♦ విశాఖ జిల్లా ఉపమాక, గుంటూరు జిల్లాలోని అనంతవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు టీటీడీలో విలీనం. ♦ వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసే ప్రతిపాదన. ♦ పలమనేరులో 450 ఎకరాల్లో గోశాలను నిర్మించి అక్కడ అన్ని రకాల ఆవులను పెంచాలని నిర్ణయం. ♦ తిరుపతిలో విద్యుత్ అవసరాల నిమిత్తం తంబళ్లపల్లిలో 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్, తిరుమలలోని నారాయణగిరిలో 7 మెగావాట్ల విండ్పవర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ♦ తిరుమల అడవుల్లో 400 హెక్టార్లలో 1.50 లక్షల ఎర్రచందనం మొక్కలను నాటాలి. వచ్చే ఏడాది నాటికి 12 లక్షల ఎర్రచందనం మొక్కలను పెంచాలని ప్రతిపాదన. ♦ తిరుమలలో నందకం విశ్రాంతి గృహం పక్కన 26 కోట్ల రూపాయలతో వకుళాదేవి విశ్రాంతి గృహం నిర్మించేందుకు ఆమోదం. ఇందులో 220 రూములు ఏర్పాటు చేసి, 1,225 మంది భక్తులకు వసతి కల్పిస్తారు. ♦ స్విమ్స్లో రూ. 4.26 కోట్లతో 96 ప్రత్యేక గదులను నిర్మించి డయాలసిస్ విభాగం విస్తరణ. తానా సభల సందర్భంగా అమెరికాలోని 4 ప్రదేశాల్లో ప్రవాసాంధ్రుల ఖర్చుతో శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు ఆమోదం. -
అమెరికాలో నాలుగు చోట్ల శ్రీనివాస కళ్యాణాలు
తిరుమల: అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాలు జరపాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తానా సహకారం అందిస్తుందని తెలిపారు. మంగళవారం తిరుమలలో చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశమైంది. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. తిరుమలలో వకుళామాత అతిథి గృహ నిర్మాణానికి రూ. 25 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అలాగే విశాఖపట్నం జిల్లాలోని ఊపమాత గ్రామంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని తిరుమల, తంబళ్లపల్లిలో సోలార్ సిస్టమ్ ద్వారా 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. తిరుమలలో 1.50 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచడానికి... మరో 400 హెక్టార్లలో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాదికి 12 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచుతామన్నారు. రూ.22 లక్షలతో ఆరునెలలకు సరిపడా కొబ్బరికాయాలు కొనడానికి కూడా పాలక మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. -
నేను ఎందుకు కాదంటాను: నాగార్జున
సాక్షి, తిరుమల: ‘‘ఆ వేంకటేశ్వర స్వామి టీటీడీ ధర్మకర్తల మండలిలో చోటు కల్పిస్తే స్వీకరిస్తా’’ అని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ..‘ టీటీడీ ధర్మకర్తల మండలిలో అవకాశం వస్తే మీరు స్వీకరిస్తారా?’’అని విలేకరులు అడిగిన ప్రశ్నకు నాగార్జున నవ్వుతూ పైవిధంగా బదులిచ్చారు. ‘నేను ఎందుకు కాదంటాను.. తప్పకుండా స్వీకరిస్తా’’అన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిపై అపారమైన భక్తి విశ్వాసాలు కలిగిన రాఘవేంద్రరావుకు టీటీడీ ధర్మకర్తల మండలిలో మరోసారి అవకాశం రావటం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో తాము కూడా పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాఘవేంద్రరావు చాలా చక్కగా మాట్లాడారన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావును నాగార్జున కరచాలనంతో అభినందించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన నాగార్జునను తిరుమల ఆలయం వద్ద నాగార్జునను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓ మహిళ నాగార్జున చేయిపట్టుకుని ముద్దుపెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
రాఘవేంద్రరావు ప్రమాణ స్వీకారానికి నాగ్
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాఘవేంద్రరావు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం ఆయన శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయగా, ఈ కార్యక్రమానికి హీరో నాగార్జున హాజరయ్యారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటానని రాఘవేంద్రరావు అన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుమలకు వచ్చే భక్తులకు సేవలందించి మనన్నలు పొందుతాని తెలిపారు. కాగా అన్నమయ్య చిత్రాన్ని తీసినందుకే సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి తనకు టీటీడీ ధర్మకర్తల మండలిలో అవకాశం కల్పించాడని రాఘవేంద్రరావు పేర్కొన్న విషయం తెలిసిందే. -
టీటీడీ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
-
టీటీడీ చైర్మన్గా చదలవాడ ప్రమాణం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. ఆలయ సన్నిధిలో ఉదయం 11గంటలకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, అనంతరం బోర్డు సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అన్నమయ్య భవన్ అతిథిగృహంలో ధర్మకర్తల మండలం తొలి సమావేశం నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుల వివరాలు చదలవాడ కృష్ణమూర్తి (చైర్మన్) కోళ్ల లలిత కుమారి (ఎమ్మెల్యే విజయనగరం జిల్లా శృంగవరపుకోట) పిల్లి అనంతలక్ష్మి (ఎమ్మెల్యే కాకినాడ రూరల్-తూర్పుగోదావరి జిల్లా) డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి (ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా కొండేపి) పుట్టా సుధాకర్ యాదవ్ (మైదుకూరు, వైఎస్ఆర్ జిల్లా) ఏవీ రమణ (హైదరాబాద్) జె.శేఖర్ (తమిళనాడు) సుచిత్ర ఎల్లా, సంపత్ రవి నారాయణన్ (తమిళనాడు) పి.హరిప్రసాద్ (తిరుపతి) రాఘవేంద్రరావు (సినీ దర్శకుడు) సాయన్న -
రైల్వే కాంట్రాక్టుల కోసం రేణిగుంటకు వచ్చా
తిరుపతి: ఆధ్యాత్మిక నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమితులైన చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుపతిలోని ఆయన స్వగృహంలో గురువారం మధ్యాహ్నం ‘సాక్షి’ ప్రతినిధితో పలు విషయాలపై ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నగర ప్రజలకు అందుబాటులోకి వైద్యం నగరంలో ప్రతి ఒక్కరికీ ఆర్యోగాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తా. ప్రాణదాన ట్రస్టును ప్రవేశ పెట్టడంలో కీలకపాత్ర పోషించా. దానికి మొదటి దాతను నేనే. అదే అలిపిరి ఘటనలో నా ప్రాణాలను కాపాడింది. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తా. శాంతి భద్రతలు కాపాడేందుకు తమవంతు ప్రయత్నం చేస్తా. తిరుపతి టీటీడీలో అంతర్భామే కాబట్టి అందంగా తీర్చిదిద్దుతా. అవినీతికి దూరంగా...అన్ని వర్గాలకు అందుబాటుగా అవినీతికి దూరంగా ఉంటూ తిరుపతి ప్రజ లకు సేవ చేస్తాను. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సక్రమంగా నిర్వర్తించేలా ఓ భక్తునిగా ఆ దేవదేవుని కోరుకుంటున్నా. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ హిందూ మత ప్రచారాన్ని కొనసాగిస్తా. ఇక్కడికి ఆయన్ను నమ్ముకొని వచ్చా.. నేను సామాన్యుడిని. నాకు దేవుడు అన్నీ ఇచ్చారు. నాకు కావల్సింది ఏమీ లేదు. ఆయన్ను నమ్నుకొని వచ్చాను. తిరుపతి ప్రజలు నన్ను అక్కున చేర్చుకొని ఆదరించారు. వెంకటేశ్వరస్వామి అలిపిరి ప్రమాదంలో కాపాడి ప్రాణాన్ని నిలబెట్టారు. నేను నమ్ముకొన్న పార్టీ, నాయకుడు పదవి ఇచ్చారు. చైర్మన్గా కాకుండా ఓ సేవకుడిగా నా బాధ్యతను నెరవేరుస్తా. ఆయన ఆస్తులను కాపాడే వ్యక్తిగా.. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎంతోమంది పెద్దలు గతంలో పనిచేశారు. వారి కోవలో సామాన్య భక్తులకు దగ్గరగా, ఆయన ఆస్తులను కాపాడే వ్యక్తిగా పనిచేస్తాను. శేష జీవితాన్ని పుణ్యక్షేత్రంలో, ధర్మానికి దగ్గరగా గడుపుతాను. ప్రజాస్వామ్యా న్ని, సామాన్యుల హక్కులను సంరక్షిస్తాను. రేణిగుంటకు రైల్వే కాంట్రాక్టర్గా.. నాకు రాజకీయ భిక్ష పెట్టింది తిరుపతే. మాది నెల్లూరు జిల్లా నాయుడుపేట. 1973లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశా. నాయుడుపేట సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా పనిచేశా. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, వెంగళరావు, శివశంకర్తో సన్నిహిత సంబంధాలుండేవి. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుతో దగ్గర సంబంధాలు ఉండేవి. 1977లో రైల్వే కాంట్రాక్టులు చేసుకునేందుకు రేణిగుంటకు వచ్చాను. 1994లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పోటీచేసి స్వల్ప మెజారిటీ ఓడిపోయాను. 1999లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఈ సందర్భంగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
రేపు టీటీడీ బోర్డు ప్రమాణ స్వీకారం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ ) కొత్త ధర్మకర్తల మండలి శుక్రవారం కొలువుదీరనుంది. ఆలయ సన్నిధిలో ఉదయం 8.20 గంటలకు చైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
గంటాకు అయ్యన్న ఝలక్!?
బండారుకు దక్కని టీటీడీ పదవి ఆడారికి చెక్ పెట్టనున్న ప్రభుత్వం! సర్కారు చేతికి డెయిరీ పగ్గాలు ? ఆధిపత్యం సాధిస్తున్న అయ్యన్న విశాఖపట్నం: ఆధిపత్య పోరులో మంత్రి గంటాపై సహచర మంత్రి అయ్యన్న వ్యూహాత్మకంగా పైచేయి సాధిస్తున్నారు. గంటాను నేరుగా లక్ష్యంగా చేసుకోకుండా ఆయన అనుచరవర్గాన్ని ఒక్కొక్కటిగా దెబ్బతీస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారుకు టీటీడీ పాలకమండలి పదవి రాకుండా అయ్యన్న చక్రం తిప్పారు. మరో ప్రధాన అనుచరుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావును తదుపరి లక్ష్యంగా చేసుకున్నారు. ఆడారి అడ్డా అయిన విశాఖ డెయిరీ వ్యవహారాలను నేరుగా ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేలా అయ్యన్న పావులు కదుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరులో అయ్యన్న స్పష్టమైన ఆధిక్యత సాధించారనడానికి నిదర్శనంగా నిలుస్తున్న తాజా ఉదంతాలివిగో... తదుపరి లక్ష్యం ఆడారి!: గంటాకు ప్రధాన మద్దతుదారైన విశాఖడెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుపై అయ్యన్న గురిపెట్టారు. 27ఏళ్లుగా ఆయన ఆధిపత్యంలో ఉన్న విశాఖ డెయిరీపై దృష్టిసారించారు. అయ్యన్న ప్రధాన మద్దతుదారుడైన జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి జిల్లా కొన్ని రోజుల క్రితం బహిరంగంగానే తులసీరావు అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. విశాఖ డెయిరీని అడ్డంపెట్టుకుని రూ.500కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆడారిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాక్ట్-64 ప్రకారం ఈ డెయిరీని స్థాపిస్తే డెరైక్టర్లకు ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడానికి సంస్థను యాక్ట్- 95 యాక్ట్ కిందకు తీసుకువచ్చారని దుయ్యబట్టారు. తాజాగా కంపెనీ యాక్టు-55ని వర్తింపజేస్తూ నిబంధనలు మార్చడాన్ని కూడా గవిరెడ్డి ప్రశ్నించారు. డెయిరీలో అక్రమాల చిట్టాను రూపొందించి గవిరెడ్డి సీఎంచంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమచారం. డెయిరీ వ్యవహారాలను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చే అంశాన్ని సీఎం కార్యాలయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక అధికారిని నియమించి డెయిరీ పాలనావ్యవహారాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదన రూపొందిస్తున్నట్లు అధికారవర్గాలు చెప్పుకుంటున్నాయి. అదే జరిగితే జిల్లాలో గంటా వర్గాన్ని అయ్యన్న పూర్తిగా దెబ్బతీసినట్లే అవుతుంది. బండారుకు చుక్కెదురు గంటా వర్గంలో కీలక నేత, ఎమ్మెల్యే బండారు సత్యాన్నారాయణమూర్తిని మంత్రి అయ్యన్న అదను చూసి దెబ్బకొట్టారు. తనకు మంత్రి పదవి రాకుండా సైంధవ పాత్ర పోషించడానికి బండారును మంత్రి గంటా ప్రయోగించిన విషయాన్ని అయ్యన్న ఇంకా మరచిపోలేదు. సమయం కోసం వేచి చూసిన ఆయన టీటీడీ పాలకమండలి నియామక సమయంలో తన అస్త్రాన్ని ప్రయోగించారు. పాలకమండలిలో బండారుకు స్థానం కల్పించాలన్న గంటా వర్గం విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు మొదట సానుకూలంగా స్పందించారు. రెండువారాల క్రితం బండారును నియమాకం దాదాపు ఖాయమైందని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయ్యన్న వ్యూహాత్మకంగా వ్యవహరించి బండారు అవకాశాలను దెబ్బకొట్టారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ ద్వారా పావులు కదిపినట్లు తెలుస్తోంది. బండారు సామాజికవర్గానికే చెందిన ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేరును తెరపైకి తెచ్చారు. ఉత్తరాంధ్రకే చెందిన వెలమ సామాజికవర్గం నుంచి లలిత కుమారికి స్థానం ఇవ్వడంతో అదే వర్గానికి చెందిన బండారుకు దారులు మూసుకుపోయాయి. -
కృష్ణమూర్తి మనోడే అనేలా పనిచేస్తా..
హైదరాబాద్ : టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఛైర్మన్గా తనకు దేవుడికి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తన వంతుగా టీటీడీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుమలలో చంద్రబాబు మార్కు పాలనను తీసుకు వస్తానని ఈ సందర్భంగా చదలవాడ అన్నారు.ప్రతి ఒక్కరికీ మనవాడు కృష్ణమూర్తి అనేలా పని చేస్తానని చదలవాడ అన్నారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆయన తెలిపారు. తాను టీటీడీ ఛైర్మన్ అయ్యేందుకు సాయం, సహకారం అందించిన ప్రతి ఒక్కరికి చదలవాడ మీడియా సమక్షంలో కృతజ్ఞతలు తెలిపారు.