winter season
-
గొంతులో గర గర వేధిస్తోందా? ఈ చిట్కాలతో ఉపశమనం
వాతావరణంలో మార్పులు మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రధానంగా శీతాకాలంలోచల్లగాలులు, మంచు ప్రభావంతో జలుబు, జ్వరం, అలెర్జీ,గొంతు నొప్పి లాంటి సమస్యలకు దారి తీస్తాయి. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడతాయి. మరి ఇలాంటి సమస్యలకు ఇంటి వైద్యం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా గొంతు నొప్పి వేధిస్తుంది. దీంతో పాటు, కళ్లు, ముక్కులలో కూడా దురదగా ఉంటుంది. మరి ఈ గొంతు గరగరను, ఎలర్జీతో బాధపడుతోంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఉపశమనం కోసం పాటించాల్సిన చిట్కాలు తెలుసుకుందామా.చలికాలంలో పిల్లలు, పెద్ద వయసు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.చలికాలంలో అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలి. జలుబు, ఫ్లూ, తలనొప్పి, సైనసైటిస్, దగ్గు వంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా గొంతు చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా గొంతులో గరగర, మింగుతున్నప్పుడు ఇబ్బంది లాంటి సమస్యలు అన్ని రకాల వయస్సుల వారిలోనూ తలెత్తుతుంటాయి.బయటికి వెళ్లినపుడు శరీరం వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి. చెవులలోకి చల్లగాలి వెళ్లకుండా, స్కార్ఫ్లు, మఫ్లర్లను ధరించాలి.వేడి వేడి పదార్థాలను తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తాజాగా వంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఫ్రిజ్లోంచి తీసిన వంటకాలను అలానే తినకుండావేడి చేసుకుని తినాలి.కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు లాంటి చల్లని పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. గొంతు సమస్య ఉన్నప్పుడు పూర్తిగా దూరం పెట్టాలి. గోరు వెచ్చటి నీటిని తాగటం మంచిది. సూప్స్, పండ్ల రసాలను తాగటంవల్ల కూడా గొంతులో ఇబ్బందిగా ఉంటే తగ్గిపోతుంది.రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు టమిన్ సి నిండిన పండ్లను తినాలి. వీటిల్లో యాంటీ హిస్టమైన్ ఉంటుంది. నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి లాంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే డాక్టర్ సలహా మేరకు యాంటీ హిస్టమైన్ ట్యాబ్లెట్ల రూపంలో కూడా వాడవచ్చు.ఉపశమనం కోసం అల్లం,శొంఠి,మిరియాలు, కొద్దిగా తులసి దళాలు వేసి కషాయంలా చేసుకొని తాగాలి. గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు వేసి తాగాలి. ఇలా చేస్తే గొంతులో గరగర మాయమవుతుంది.కొద్దిగా అల్లం, దాల్చిన చెక్క ముక్క కలిపి చేసిన టీ తాగాలి. ఇలా పొద్దున్న, సాయంత్రం చేస్తే ఫలితం ఉంటుంది. అల్లాన్ని మెత్తగా నూరి, టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగినా మంచి ఫలితం ఉంటుంది.పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి, రుచికి కొద్దిగా తేనె, లేదా బెల్లం కలుపుకొని తాగవచ్చు.అల్లం, తులసి ఆకులు నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి నోటిలో పుకిలిస్తే మంచిది.అల్లం, తులసి, వామ్ము ఆకులు వేసి మరగించిన టీని తాగితే గొంతు నొప్పి, జలుబుకు మంచి ఉపశమనం లభిస్తుంది.ఇవి పిల్లలకు కూడా కొద్ది మోతాదులో తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవీ చదవండి: అపుడు వాచ్మెన్గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీతేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?నోట్ : తరచుగా జలుబు, జ్వరం, గొంతు నొప్పి, మింగడంలో సమస్యలొస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. చిన్న పిల్లల్లో అయితే టాన్సిల్స్, అడినాయిడ్స్ లాంటి సమస్యలేమైనా ఉన్నాయోమో గుర్తించి మందులును వాడాలి -
చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ‘సూపర్ పండు’ ఎన్ని లాభాలో!
ప్రకృతి చాలా మహమాన్వితమైంది. సీజన్కు తగ్గట్టు మనకు ఎన్నో అద్భుతమైన ఫలాలను అందిస్తుంది. అందుకే ఏ కాలంలో దొరికే పళ్లు, కూరగాయలు ఆకాలంలో విరివిగా తినాలని పెద్దలు చెబుతారు. మరి శీతాకాలంలో మాత్రమే దొరికే ఒక అద్భుతమైన చిట్టి పండు గురించి తెలుసుకుందాం. రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమిటా పండు? దాని లాభాలేంటి? చూద్దామా. శీతాకాలంలో మాత్రమే దొరికే రేగి పండు(jujube fruit)తీపి పులుపు కలగలిపిన అద్భుతమైన రుచి. చూడ్డానికి చిన్నగా కనిపించినా పోషక విలువలు మాత్రం మెండుగా లభిస్తాయి. అందుకే ఆయుర్వేద చికిత్సలో, ఔషధాల్లో ప్రాముఖ్యత కూడా ఉంది. రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. తలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.ఈ పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతగానో ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా రేగు పళ్లతో చేసే ఒడియాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కసారి అలవాటు పడితే తినకుండా ఉండలేం. వీటి రుచి మహాగమ్మత్తుగా ఉంటుంది. రేగి పళ్ళపై ఉప్పు కారం చల్లుకుని తింటారు. ఇంకా వీజామ్లూ, జెల్లీలూ, జ్యూస్, టీ, వినెగర్, క్యాండీలూ లాంటి వాటిని కూడా తయారు చేస్తారు. రేగుపళ్లలో పురుగులు బాగా ఉంటాయి. చూసుకొని తినాలి రేగు పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. రేగిపండులో ఉన్న పోటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.రక్తహీనతతో బాధపడేవారికి రేగుపళ్లు చాలా మేలు చేస్తాయి. గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే వేవిళ్లు, వాంతుల సమయంలో రేగుపళ్లుతో తయారు చేసిన రేగుపళ్లను కొద్ది కొద్దిగా చప్పరిస్తూ ఉంటే నోటికి పుల్లగా బావుంటుంది. అలాగే వాంతులు కూడా తగ్గే అవకాశాలున్నాయి. అద్బుతమైన ప్రయోజనాలురేగిపండులోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పళ్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వైరస్లు, బాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి శీతాకాలంలో వచ్చే సీజనల్ జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సహజసిద్ధమైన చక్కెరలు , బీ విటమిన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.రక్తహీనతను (Anaemia) నివారిస్తుంది. రేగిపండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది. అనీమియాసమస్యలతో బాధపడేవారు కొన్ని రేగిపండ్లను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.రేగిపండులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పాడతాయి. ముఖంపై మచ్చలు, ముడతలు , తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి,చర్మానికి మెరుపునిస్తుంది. సౌందర్యం కోసం రేగిపండును ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగిస్తారు.అంతేనా...ఇంకాదీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడితో బాధపడేవాళ్లకి రేగుపండ్లు ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు తింటే డిప్రెషన్ దూరం అవుతుంది. అలాగే నిద్రలేమి (Insomnia) సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ మతిమరుపూ ఆల్జీమర్స్ రాకుండానూ అడ్డుకుంటుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ (Phytochemicals) వల్ల రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రేగిపండును (మితం) తీసుకోవచ్చు.రేగిపండులో కూడా క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కనుక బరువు పెరుగుతామనే బెంగ అవసరం లేదు. పైగా ఇది కడుపుని తేలికగా,తృప్తిగా ఉంచుతుంది. రేగిపండులో కేల్షియం, ఫాస్పరస్, మ్యాగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి. ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సమస్యలకు ఉపశమనం పనిచేస్తాయి.రేగిపండులో యాంటీ-క్యాన్సర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నియంత్రిస్తాయి . ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ , లివర్ క్యాన్సర్ ముప్పును తగ్గించే అవకాశం ఉంది.ఎవరు తినకూడదుయాంటీ డిప్రెసెంట్ మందులువాడేవారుమూర్చ వ్యాధితో బాధపడుతున్న వారుస్కిన్ అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నవారు.ఆస్తమా వ్యాధితోబాధపడుతున్నారు కూడా రేగుపళ్ళను అతిగా తినకూడదు.ఎక్కువగా తింటే విరేచనాలు అయ్యే ప్రమాదముంది గనుక, ఇప్పటికే ఈ సమస్యతో బాధపడేవారు కూడా దూరంగా ఉండాలి. నోట్: ఇది అవగాహన కోసం అందించిన మాత్రమే. ఏదైనా అతిగా తినకూడదు. అతిగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. గొంతులో కఫం పెరగడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. -
భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!
శీతాకాలం ప్రారంభం కాగానే కొన్ని రకాల శ్వాసకోస వ్యాధులు, కీళ్లు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. అందుకే ఈ సీజన్లో రుచితో పాటు,ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి ఒక గొప్ప సూపర్ ఫుడ్ అవిశె, నువ్వుల లడ్డు. పోషకాలతోపాటు అనేక రకాలుగా మనకు లాభాలను చేకూర్చే అవిశె గింజలు, నువ్వుల లడ్డూ(Flax Seeds And Sesame Seeds Laddu) ఎలా తయారు చేయాలో చూద్దాం.ఈ లడ్డూలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. అంతేకాకుండా, వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. నువ్వులలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, భాస్వరం, జింక్, మాలిబ్డినం, సెలీనియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ఇక అవిశె గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులకు అద్భుతమైన మూలం. పోషకాలకు శక్తివంతమైనది కూడా. వీటి ద్వారా విటమిన్ బి, సి, డైటరీ ఫైబర్, సోడియం, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. బెల్లంతో మంచి ఐరన్ లభిస్తుంది. అంతటి శ్రేష్టమైన వీటికి దేశీ నెయ్యి , సేంద్రీయ బెల్లంతో కలిసి లడ్డూలను తయారు చేసుకుంటే అది సూపర్ ఫుడ్ కాక ఏమవుతుంది.అవిశె గింజలు - నువ్వుల లడ్డు తయారీకావాల్సిన పదార్థాలునువ్వులు, అవిశెగింజలు, బెల్లం, కొద్దిగా బాదం, జీడింపప్పులు, బెల్లం, కొద్దిగా నెయ్యి, చిటికెడు యాలకుల పొడిముందుగా రెండు కప్పుల అవిశె గింజలు( Flax Seeds) దోరగా వేయించిన, అలాగే ఒక కప్పు నువ్వులను కూడా దోరంగా వేయించుకోవాలి. దీంతోపాటు బాదం, జీడి పప్పులను కూడా నూనె లేదా నెయ్యి లేకుండానే వేయించుకోవాలి. ఇవి గోరు వెచ్చగా ఉండగానే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ,రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి (Ghee) ఒకటిన్నర కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము వేసి పాకం పట్టుకోవాలి. పాకం వచ్చినాక, ముందుగా పొడి చేసిపెట్టుకున్న అవిశె, నువ్వుల పొడిని వేసుకుంటూ బాగా కలపాలి. కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇందులో చిటికెడ్ యాలకుల పొడి, బాదం, జీడిపప్పుల పొడి వేసుకోవాలి. కొద్దిసేపాక దింపేసుకుని కొంచెం వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ లడ్డూ వలన ఎముకలు బలోపేతమవుతాయి. ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రేఅవిశె గింజలు - నువ్వుల లడ్డు లాభాలుశీతాకాలంలో చలి నుండి రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.బరువు నిర్వహణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా రెండు విషయాల్లోనూ ప్రయోజనకరంగా ఉంటుంది.క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అధిక రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో సాధారణ బీపీ నిర్వహణలో సహాయపడుతుంది.కడుపుకు చాలా ప్రయోజనకరం. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . జీవక్రియను కూడా పెంచుతుంది.ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ,మంచి కొలెస్ట్రాల్ ( HDL)ను పెంచడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.ఎముకలు ,కండరాలను బలపరుస్తుంది.మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .నిద్ర సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.అలసటను తొలగించి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.అనేక చర్మ, జుట్టు సమస్యలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇంకా మోకాళ్లు , కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని మోకాళ్ళ నొప్పులు(Knee Pain) వేధిస్తున్నాయి. అలాంటి వారికి ఇది చాలా మేలు చేస్తుంది.(37 కిలోలు తగ్గి, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన గృహిణి)నోట్: వయసుతోపాటు వచ్చే మోకాళ్ల నొప్పులకు జీవన శైలిమార్పులు, కండరాలను బలోపేతం చేసే కొన్ని రకాల వ్యాయామాలు తప్పనిసరి. దీంతోపాటు వైద్యుల సలహా ప్రకారం అవసరమైతే కొన్ని మందులను వాడాల్సి ఉంటుంది. -
చలికాలంలో కీళ్ల నొప్పులా? ఇవిగో ది బెస్ట్ టిప్స్!
చలికాలం రాగానే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దీంతో జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి వివిధ వ్యాధుల బారిన పడటం సాధారణంగా. అలాగే చల్లని వాతావరణం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని, ఆర్థరైటిస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయని కూడా నమ్ముతారు. అయితే ఇందులో నిజమెంత? చలికాలానికి, మోకాళ్ల నొప్పులకు సంబంధం; మరి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో మన జీవన పరిస్థతులకనుగుణంగానే శారీరక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. జర్నల్ సెమినార్స్ ఇన్ ఆర్థరైటిస్ , అండ్ రుమాటిజంలో ప్రచురించిన 2024 అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పులు నేరుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ , ఇతక కీళ్ల నొప్పులను పెద్దగా ప్రభావితం చేయవని వెల్లడించింది.అయితే చల్లని వాతావరణం కీళ్లను గట్టిపరుస్తుంది ,రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, చిన్న కదలికలను కూడా కష్టతరం చేస్తుంది. తక్కువ తేమతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు గౌట్ మంట ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయని అధ్యయనం కనుగొంది. ఆర్థరైటిస్తో బాధపడే వ్యక్తులు శీతాకాలంలో వాతావరణ ఒత్తిడి మార్పు వల్ల కీళ్ళు సాధారణం కంటే ఎక్కువగా ఉబ్బి, నొప్పి పెరగడానికి దారితీస్తుందని తేలింది.తక్కువ బారోమెట్రిక్ పీడనం శరీరంలోని కణజాలాలు నరాలపై ఒత్తిడిని పెంచుతుంది.మరి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి?వింటర్ సీజన్లో శారీరక శ్రమ తగ్గడం వల్ల ఎముకల మధ్య కదలిక తగ్గిపోతుంది. దీంతోపాటు విటమిన్ డి లోపం కూడా కీళ్ల నొప్పులకు మరో కారణం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కండరాలు దృఢంగా ఉండే వ్యాయామాలను ఎంచుకోవాలి.వేడి నీటి కొలనులో ఈత కొట్టడం లేదా ఇంట్లోనే సైక్లింగ్ చేయడం వంటి తక్కువ-ప్రభావ వ్యాయామాలు ఉత్తమం.ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా, కదలిక ఉండేలా చూసుకోండి. .యోగ, ధ్యానం లాంటివి చేయాలి. కీళ్లలో నొప్పినుంచం ఉపశమనం కలిగే , దృఢత్వాన్ని పెంచే ఆసనాలు తెలుసుకొని ఆచరించాలి. చలికాలం కదా అశ్రద్ధ చేయకుండా, తగినంత నీరును తాగాలి. చలికాలం వచ్చిందంటే వృద్ధులకే కాదు, యుక్తవయస్సులో ఉన్నవారిలో కూడా కొంతమందికి మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి , దృఢత్వాన్ని తగ్గించడానికి వెచ్చని బట్టని ధరించాలి. వేడి నీటి స్నానం మంచిది.నొప్పి ఉన్న ప్రదేశంలో ఉపశమనం కోసం హీట్ ప్యాడ్లను వాడవచ్చు.కీళ్ల నొప్పులకు మరో చక్కటి ఉపశమన ప్రక్రియ మసాజ్. ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.నువ్వుల నూనె, కొబ్బరి నూనె, లేదా కొన్ని ఆయుర్వేద తైలాలతో పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నోట్: శారీరకంగా చురుకుగా ఉండటం, హీట్ థెరపీ, చక్కటి ఆహారం ద్వారా చాలావరకు సమస్యలనుంచి తప్పించుకోవచ్చు. దీంతో పాటు సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు -
HousewifeDermatitis గురించి విన్నారా? చలి చేతికి చిక్కొద్దు!
ఈ చర్మవ్యాధిని గృహిణులకు వచ్చే సమస్యగా ప్రత్యేకంగా పేర్కొంటారు. ఎందుకంటే ఇంటి గచ్చును శుభ్రం చేస్తుండటం, బట్టలు ఉతికే సమయంలో సబ్బు (డిటెర్జెంట్) వీళ్ల చేతుల్ని ప్రభావితం చేస్తుండటం, ఇంటిపనుల్లో ఇంకవైనా రసాయనాలు తగిలి చేతులు ఇరిటేషన్కు లోనవ్వడం వంటివి జరుగుతుంటాయి కాబట్టి దీన్ని ‘హౌజ్ వైఫ్ డర్మౖటెటిస్’ అంటారు. దాంతోపాటు చెయ్యిపై దుష్ప్రభావాలు పడతాయి కాబట్టి దీన్ని ‘హ్యాండ్ ఎక్సిమా’, ‘హ్యాండ్ డర్మటైటిస్’ అని కూడా అంటారు. నిజానికి ఇది కేవలం గృహిణులనే కాకుండా పలు రకాల రసాయనాలు వాడే వృత్తుల్లో ఉండే వారందరికీ వస్తుంది. ముఖ్యంగా శుభ్రం చేసే వృత్తుల్లో ఉన్నవారూ, కేటరింగ్, బ్యూటీ కేర్ సెలూన్లలో హెయిర్ డ్రస్సింగ్ చేసేవారూ, హెల్త్కేర్ ఇండస్ట్రీలో ఉన్నవారు... వీళ్లంతా ఏదో ఒక డిటర్జెంట్ లేదా రసాయనం చేతుల్లోకి తీసుకొని పనిచేస్తుంటారు కాబట్టి వీళ్లందరినీ ఈ ఎగ్జిమా లేదా డర్మటైటిస్ ప్రభావం చూపుతుంది. పైగా చలి పెరిగే ఈ సీజన్లో ఇది మరింత బాధిస్తుంటుంది. మహిళలను ఎక్కువగా బాధించే ఈ సమస్య గురించి తెలుసుకుందాం. ఈ వింటర్ సీజన్లో మామూలుగానే చర్మం పొడిబారడం ఎక్కువ. దీనికి తోడు రసాయనాలూ చేతులపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ సమస్య మరింతగా అరచేతులూ, చేతివేళ్లూ, గోళ్ల చుట్టూ ఉండే చర్మం (పెరీ ఉంగ్యువల్) ప్రభావితమయ్యే భాగాల్లో ఈ సమస్య తీవ్రంగా మారినప్పుడు అక్కడ నీటిపొక్కుల్లా రావడాన్ని పామ్ఫాలిక్స్’ అని అంటారు. ఒక్కోసారి కొందరిలో ఈ సమస్య అనువంశీకంగానూ కనిపిస్తుంది. తమ సొంత వ్యాధి నిరోధక శక్తే తమ చర్మాన్ని దెబ్బతీయడం వల్ల ఇలా జరుగుతుంది. కొన్ని అలర్జిక్ రియాక్షన్స్, ఆహారం వల్ల కలిగే అలర్జీలు, చాలాసేపు నీళ్లలో ఉండటం వంటి అంశాలూ దీన్ని మరింత పెచ్చరిల్లేలా చేస్తాయి. డ్రై స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ ఇన్ఫెక్షన్లా కూడా మారి మరింత ఇబ్బంది కలిగించే అవకాశముంది. నివారణ / మేనేజ్మెంట్ / చికిత్స... ఇంటి పనులు అయిన వెంటనే ఘాటైన సువాసనలు లేని మంచి క్లెన్సర్ను గోరు వెచ్చని నీటిలో వేసి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. (ఇందుకు వేడి నీళ్లు ఉపయోగించకూడదు. కేవలం గోరువెచ్చని నీళ్లే వాడాలి). ఇక క్లెన్సర్ను ఎంపిక చేసే విషయంలో వాటిల్లో ఘాటైన లేదా చేతికి హానిచేసే తీవ్రమైన రసాయన సాల్వెంట్స్ లేకుండా జాగ్రత్తపడాలి. ∙చేతులకు ఈ సమస్యను తెచ్చిపెట్టే డిటర్జెంట్లు / రసాయనాలు కలిపిన నీళ్లు... వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం లేదా తప్పనప్పుడు ఈ ఎక్స్పోజర్ వ్యవధిని వీలైనంతగా తగ్గించడం. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం (హ్యాండ్ హైజీన్ను పాటించడం). ఇందుకోసం ఘాటైన సబ్బులను కాకుండా గ్లిజరిన్, ఆల్కహాల్ బేస్డ్ మైల్డ్ శానిటైజర్లు వాడటం. (కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్గా కీర్తి ఏం చేసిందో తెలుసా?)ఇల్లు శుభ్రం చేసే సమయంలో లేదా ఇంటి పనులప్పుడు శుభ్రమైన కాటన్ గ్లౌజ్ వాడటం. ఇంటికి సంబంధించిన కాస్తంత మురికి పనులు (డ్రైయిన్లు శుభ్రం చేయడం వంటివి) చేసేటప్పుడూ గ్లౌజ్ ధరించడం. చర్మ సంరక్షణ కోసం వాడే వాసన లేని ఎమోలియెంట్స్ (చేతులకు హాయిగొలిపే లేపనాల వంటివి) వాడటం. అరచేతులు, చేతివేళ్లు తేమ కోల్పోకుండా ఉండేందుకు చేతికి కొబ్బరి నూనె లేదా చేతులు తేమ కోల్పోకుండా చేసే ఆయింట్మెంట్స్ / క్రీమ్స్ వాడటం. చేతులకు తగిలే చిన్న చిన్న దెబ్బలు, గీరుకుపోవడం వంటి వాటినీ నిర్లక్ష్యం చేయకుండా వాటికి తగిన బ్యాండ్ఎయిడ్ వంటివి వేయడం. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా ఇంకా చేతులు పొడిబారిబోయి, చర్మం లేస్తుండటం, పొట్టురాలుతుండటం, పగుళ్లు వస్తుండటం జరుగుతుంటే డర్మటాలజిస్టుకు చూపించాలి. వారు తగిన పూతమందులు, ఇతరత్రా చికిత్సలతో సమస్యను తగ్గిస్తారు. లక్షణాలు... చేతులపై చర్మం బాగా పొడిగా మారడం, ఇంతగా పొడిబారడంతో పొట్టు లేస్తుండటం చేతివేళ్లపై పగుళ్లు, ఈ పగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న పుండ్లలా మారడం (బ్లిస్టర్స్) చర్మం ఊడిపోతూ ఉండటం , చర్మం ఎర్రబారడం ఒక రకమైన నొప్పితో కూడిన ఇబ్బంది. -డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్ -
మందపాటి రగ్గు కప్పుకున్నా చలి తగ్గడంలేదా.. కారణమిదే..
శీతాకాలంలో చలిగా అనిపించడం సహజం. దీంతో చలి నుంచి తప్పించుకునేందుకు ఉన్ని దుస్తులు ధరిస్తారు. రాత్రిపూట మందపాటి రగ్గులు కప్పుకుంటారు. అయినప్పటికీ కొందరు తమకు ఏమ్రాతం చలి తగ్గలేదని చెబుతుంటారు. పైగా కాళ్లు చేతులు, చల్లబడిపోతున్నాయని, చలికి తట్టుకోలేకపోతున్నామని అంటుంటారు. అయితే ఇందుకు వారి శరీరంలో వివిధ విటమిన్లు, పోషకాల లోపం కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇవి కూడా చలికి కారణమే..మెగ్నీషియం లోపం: మెగ్నీషియం లోపం వల్ల కండరాల తిమ్మిర్లు, నొప్పులు తలెత్తుతాయి. రక్త ప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా ఇది చేతులు, కాళ్లు చల్లబడేందుకు కారణంగా నిలుస్తుంది. తృణధాన్యాలు, ఆకు కూరలు వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం లేదా మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.ఇనుము: శరీరంలో ఐరన్ లేనప్పుడు, అది రక్తహీనతకు కారణమవుతుంది. ఫలితంగా అలసట, నీరసంతోపాటు చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి. ఆహారంలో లీన్ మీట్, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, ఆకు కూరలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వలన ఐరన్ లోపాన్ని నివారించవచ్చు.ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రక్త ప్రసరణలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల లోపం రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. ఫలింగా చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది.విటమిన్ బీ12: విటమిన్ బీ12 శరీరంలో రక్త కణాలను తయారు చేయడంలో, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీ 12 లోపం కండరాల దృఢత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈ లోపాన్ని తగ్గించేందుకు చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులతోపాటు బలవర్థకమైన తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి.విటమిన్ డి: ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీరంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం బలహీనమైన రక్త ప్రసరణకు కారణమవుతుంది. ఈ లోపం చేతులు, కాళ్లు చల్లబడేలా చేస్తుంది. ఎండలో బయట కాస్త సమయం గడపడం, చేపలు, గుడ్లు, బలవర్థకమైన పాల ఉత్పత్తులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. తద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయి కొనసాగుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: విమాన ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు -
చలికాలంతో జాగ్రత్త.. ఆరోగ్యం, ప్రమాదాలు నుంచి రక్షణ కోసం.. (ఫొటోలు)
-
మౌంట్ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం
జైపూర్: రాజస్థాన్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. పలు జిల్లాల్లో గడ్డకట్టేంత చలి ఉంటోంది. రాజధాని జైపూర్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల దిగువకు పడిపోయింది. ఇక్కడి హిల్ స్టేషన్ మౌంట్ అబూలో ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇంతటి చలిలోనూ మౌంట్ అబూను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇంతకీ మౌంట్ అబూలో చూసేందుకు ఏమున్నాయి?రాజస్థాన్లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. అక్కడి సంస్కృతి, ప్రజల జీవనశైలి, సంప్రదాయ వారసత్వం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోని మౌంట్ అబూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది రాజస్థాన్లోని ఏకైక హిల్ స్టేషన్. నిత్యం ఇక్కడ పర్యాటకుల సందడి కనిపిస్తుంది. చరిత్రలోని వివరాల ప్రకారం సిరోహి మహారాజు ఒకప్పుడు మౌంట్ అబూను బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చాడు. దీంతో బ్రిటీషర్లు మౌంట్ అబూను తమ వేసవి విడిదిగా మార్చుకుని, అభివృద్ధి చేశారు. అచల్ఘర్ కోటమౌంట్ అబూలోని అచల్ఘర్ కోట ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. హిల్ స్టేషన్కు ఈ కోట అందాన్ని తీసుకువస్తుంది. ఈ కోటను మావద్ రాణా కుంభ్ నిర్మించాడు. ఈ కోట ఒక కొండపై ఉంది. ఇక్కడ నుండి కిందనున్న పట్టణాన్ని చూడవచ్చు. కోటలో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఆలయంలో కొలువైన శివునికి ఇక్కడికి వచ్చే పర్యాటకులు పూజలు నిర్వహిస్తుంటారు.సన్సెట్ పాయింట్హిల్ స్టేషన్లలో సూర్యోదయం- సూర్యాస్తమయం పాయింట్లు ఎంతో ముచ్చటగొలుపుతాయి. ఇదేవిధంగా మౌంట్ అబూపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం మధురానుభూతులను అందిస్తుంది. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.టోడ్ రాక్మౌంట్ అబూలో తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి టోడ్ రాక్. ఇదొక భారీ రాయి. ఈ రాయి ఆకారం కప్ప మాదిరిగా ఉంటుంది. ఈ రాతికప్ప నదిలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. టోడ్ రాక్ను చూసినవారు ఆశ్చర్యానికి గురవుతుంటారు. నక్కీ సరస్సుఈ సరస్సును దేవతలు స్వయంగా తవ్వారని చెబుతుంటారు. ఈ సరస్సులోని నీరు శీతాకాలంలో ఘనీభవిస్తుంది. నీటిపై మంచు ఒక షీట్ మాదిరిగా విస్తరించివుంటుంది. ఎత్తైన కొండపై ఉన్న ఈ సరస్సు ఇక్కడి ప్రకృతి అందాలకు పరాకాష్టగా నిలుస్తుంది. సాయంత్రం సమయాన ఈ సరస్సును చూడటం ప్రత్యేక అనుభూతని అందిస్తుంది.ఎలా వెళ్లాలి?మౌంట్ అబూకు పలు రవాణా మార్గాలలో చేరుకోవచ్చు. ఇక్కడికి 185 కి.మీ దూరంలో ఉదయపూర్ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీని పట్టుకుని మౌంట్ అబూను చేరుకోవచ్చు. అలాగే ఇక్కడికి సమీపంలో అబూ రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఢిల్లీ నుంచి నేరుగా మౌంట్ అబూకు బస్సులు ఉన్నాయి. ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
వింటర్ ఎంటరైంది..అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!
ఆస్తమా, అలర్జీ వేర్వేరనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఆస్తమా కూడా అలర్జీ తాలూకు వ్యక్తీకరణల్లో ఒకటి అని అంటున్నారు నిపుణులు. అలర్జీ వల్ల అప్పర్ ఎయిర్ వే అనే విండ్ పైపులోని పై భాగం ప్రభావితమైతే ‘అలర్జిక్ రైనైటిస్’ అనీ, అదే కింది భాగమైన లోయర్ రెస్పిరేటరీ ఎయిర్ వే ప్రభావితమైతే అయితే అది ఆస్తమా అని పేర్కొంటారన్నది నిపుణుల మాట. అందుకే తరచి చూసినప్పుడు మన జనాభాలోని బాధితుల్లో 60% నుంచి 70% మందిలో అలర్జీలూ, అస్తమా ఈ రెండూ ఉంటాయి. చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమాల గురించి తెలుసుకుందాం. సరిపడని పదార్థమేదైనా ఒంట్లోకి ప్రవేశించినప్పుడు... ఒంట్లోని వ్యాధి నిరోధకశక్తి దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో వ్యాధినిరోధక శక్తి చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. ఆ తీవ్రత కారణంగా దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ‘అలర్జీ’ అంటారు. ఆ అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్’ అంటారు. ఈ అలర్జీ అన్నది ఏ పదార్థం లేదా కారణం వల్లనైనా రావచ్చు. ఉదాహరణకు... కొందరిలో గోధుమలతో లేదా పాలతో చేసిన పదార్థాలు సరిపడకపోవచ్చు. ఇక ఆహారాలు కాకుండా పొగ, దుమ్ము ధూళి, ఫుడ్పై పడి, దోమల మందులు... ఇలా ఏ కారణాలతోనైనా రావచ్చు. అలాగే కొన్ని మందులు సరిపడకపోవడంతోనూ అలర్జీలు వచ్చే అవకాశముంది. అలర్జీ వచ్చినప్పుడు... అలర్జెన్స్ లోపలికి రాగానే కొందరికి అప్పర్ ఎయిర్వేలోని సున్నితమైన ప్రాంతాలు ఎర్రబారతాయి. అక్కడి ప్రాంతాలను రక్షించుకునేందుకు స్రావాలు వెలువడతాయి. ముక్కు, కళ్లు ఎరుపెక్కడం, దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలర్జీ కేవలం ముక్కు, దాని పరిసరాలూ, శ్వాస వ్యవస్థలో పైభాగానికే పరిమితమైతే దాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా చెబుతారు, ఒకవేళ కింది భాగమూ ప్రభావితమైతే మాటిమాటికీ దగ్గు వస్తుండటం (రికరెంట్ కాఫ్), పిల్లికూతలు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం (బ్రీతింగ్ డిఫికల్టీ) కనిపిస్తాయి. ఆస్తమా అంటే...? అదే మరింత తీవ్రమై లోవర్ ఎయిర్వేస్ ప్రభావితం కావడం... అంటే ఊపిరితిత్తులూ, గాలిగదుల తోపాటు కాస్త పైన ఉండే గాలి పీల్చుకున్నప్పుడు ప్రవహించే నాళాలైన (బ్రాంకై) వాచి, బాగా సన్నబారి΄ోయి శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. అలా ఊపిరి తీసుకోవడం కష్టమై΄ోయే సమస్యను ‘ఆస్తమా’ అంటారు. కొందరిలో దీని తీవ్రతతో ఆయాసపడే స్థితి మరింత ఎక్కువైనప్పుడు అది ‘ఎనైఫిలాక్సిస్’’ అనే ప్రమాదకరమైన స్థితికి దారి తీయవచ్చు. ఆస్తమా లక్షణాలు... ఊపిరి అందడంలో ఇబ్బందితో ఆయాసం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ఒక్కోసారి దగ్గు ఆయాసడుతున్నప్పుడు శ్వాస సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం. ఆస్తమాను ప్రేరేపించే (ట్రిగర్ చేసే) అంశాలు... అలర్జిక్ ఆస్తమా : అలర్జీ తీవ్రతరమైనప్పుడు ఆస్తమాకి దారితీయవచ్చు. సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా సరిపడని అంశానికి ఎక్స్΄ోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. వ్యాయామం : కాస్త కష్టమైన వ్యాయామం మొదలుపెట్టగానే కొందరిలో అది ఆస్తమాకు దారితీయవచ్చు. దాన్నే ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా’ అంటారు. అజీర్తి / పులితేన్పులుతో : కొందరిలో తిన్న ఆహారం గొంతులోకి రావడమేనే సమస్య ఉంటుంది. దీన్నే ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ ఇంటస్టినల్ డిసీజ్’ (జీఈఆర్డీ) అంటారు. వీళ్లలో ఆహారం తీసుకున్న తర్వాత వాళ్ల కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడే యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఆ యాసిడ్ గొంతులోకి తన్నినప్పుడు కడుపు/గొంతులో మంట కనిపిస్తుంది. అది పులితేన్పుల రూపంలో గొంతులోకి రాగానే యాసిడ్ కారణంగా గొంతు మండుతుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. చాలామందిలో రాత్రి భోజనం కాస్త ఎక్కువగా తింటే కడుపు బరువుగా మారి, ఆయాసంగా ఉండటం, తర్వాత నిద్రలో సమస్య తీవ్రమై మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. పెరిమెనుస్ట్రువల్ ఆస్తమా: మహిళల్లోని కొందరికి రుతుస్రావం మొదలుకాబోయే ముందుగా కెటామేనియల్ ఆస్తమా లేదా ప్రీ/పెరీమెనుస్ట్రువల్ ఆస్తమా అని పిలిచే ఆస్తమా కనిపిస్తుంది. ఇతర కారణాలతో : పొగాకు, పొగ, కట్టెల పొయ్యినుంచి వెలువడే పొగ, రంగులూ (పెయింట్స్) లేదా అగరుబత్తీల వంటి ఘాటైన వాసనలు సరిపడక΄ోవడంతో కూడా ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం తమకు సరిపడక΄ోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్ప్లేస్ ఆస్తమా’ అంటారు. నిర్ధారణ పరీక్షలు... అలర్జీలో ముక్కు కారడం, దగ్గు, కొందరిలో చర్మం మీద ర్యాష్, ముక్కు/కళ్లు ఎర్రబారి బాగా రుద్దుకోవాలనిపించడం, దురదగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలతో ఆస్తమాను తెలుసుకోవచ్చు. కొన్ని అలర్జీలను ‘స్కిన్ ప్రిక్ టెస్ట్’ అనే పరీక్షతో నిర్ధారణ చేస్తారు. స్పైరోమెట్రీ/పీఎఫ్టీ (PFT) అనే పరీక్ష ఆస్తమా నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో బాధితులతో ఓ పరికరం ద్వారా గాలి ఊదేలా చేస్తారు. బాధితులు ఏమేరకు ఊదగలుగుతున్నారనే అంశం ఆధారంగా వాయునాళాలు ఏమేరకు ముడుచుకుపోయాయనే అంశాన్ని తెలుసుకుని, దాని ఆధారంగా రూపొందించిన గ్రాఫ్ సహాయంతో ఆస్తమా తీవ్రతను తెలుసుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు : ఆస్తమా నిర్ధారణతో పాటు, దాని తీవ్రతను తెలుసుకోవడం కోసం ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు ముడుచుకు΄ోయేలా చేస్తారు. ఇందులో ‘మెథాకైలైన్’ అనే రసాయనాన్ని ఉపయోగించడం గానీ... లేదా కొందరితో వ్యాయామం చేయించి ఆయాసపడేలా చేస్తారు. అటుతర్వాత ‘పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో టెక్నిక్’ అనే ప్రక్రియతో ఆస్తమాను తెలుసుకుంటారు. ఎవరికైనా ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటే ఈ పరీక్ష సహాయంతో అది ప్రారంభం కాకముందే తెలుసుకోవచ్చు. నిశ్వాసలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ పరీక్ష (FENO): గాలి వదిలే నిశ్వాస ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ను వదిలే సమయంలో ఆస్తమా బాధితుల్లో ఇజినోఫిల్స్ అనే తెల్ల రక్తకణాల వృద్ధి కారణంగా వారి నిశ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఆస్తమా బాధితుల్లో... మందులు ఏ మేరకు పనిచేస్తున్నాయి, ఊపిరితిత్తుల్లో వాపు, మంట, ఎర్రబారడం (ఇన్ఫ్లమేషన్) ఏమేరకు ఉన్నాయి అని తెలుసుకోడానికి ఈ పరీక్ష చేస్తారు. రక్తపరీక్ష : ఆస్తమా వచ్చినవారి రక్తంలో ఇజినోఫిల్స్ అనే తెల్లరక్తకణాలు ఎక్కువ. అవి రక్తంలో ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోడానికి ఈ పరీక్ష చేస్తారు. అలాగే ఓ వ్యక్తిలో ఏ నిర్దిష్టమైన పదార్థం వల్ల ఆస్తమా వచ్చిందనేది తెలుసుకోవడం కోసం కూడా కొన్ని సెన్సిటివిటీ రక్త పరీక్షలు చేస్తారు. ఎక్స్–రే : ఆస్తమా వ్యాధి నిర్ధారణలో ఎక్స్–రే కీలకం. సీటీ స్కాన్ : కొందరిలో సీటీస్కాన్ (ఛాతీ) అవసరం కావచ్చు. ఆస్తమా నిర్ధారణలో కేవలం... ఆయాసం, పిల్లికూతలు అనే రెండు ప్రధాన అంశాలతో ఆస్తమాను నిర్ధారణ చేయకూడదు. ఇవే లక్షణాలు గుండెజబ్బులు, కేన్సర్, సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), వోకల్ కార్డ్ లకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించే అవకాశమున్నందున ఆస్తమా నిర్ధారణలో నిశితమైన పరిశీలన అవసరం.నివారణ / చికిత్స... అలర్జీ అయినా లేదా ఆస్తమా అయినా దాన్ని ప్రేరేపించే ‘అలర్జెన్స్’కు దూరంగా ఉండటం అన్నది మంచి నివారణ మార్గం. కొంత వయసు పైబడినవారికి డాక్టర్ సలహా మేరకు ఫ్లూ, నిమోకోకల్ వ్యాక్సిన్లు ఇప్పిస్తూ ఆస్తమాను నివారించవచ్చు.అలర్జీలకు చికిత్స ఇలా... అలర్జీలను నెమ్మదింపజేయడానికి ‘అలర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ’ (సిట్) చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు... అలర్జీ సమయంలో బాధితుల దేహంలో వెలువడే జీవరసాయనాలను బట్టి ఆయా వ్యక్తులకు వ్యక్తిగతమైన మందులు అంటే ‘హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ’ల పరిశోధనలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. అయితే వాటి ప్రభావాలు అందరి విషయంలో ఒకేలా ఉండక΄ోవచ్చు. ఉదాహరణకు ఒమాలిజుమాబ్ వంటివి మాస్ట్ సెల్స్, బేసోఫిల్స్ మీద... ఇక రెస్లిసుమాబ్, మె΄÷లిజుమాబ్, బెర్నాలిజుమాబ్ వంటివి ఐఎల్–5ల సహాయంతో ఇజినోఫిల్స్ వెలువడటాన్ని అరికడుతూ... అలా తీవ్రమైన ఆస్తమాతో బాధపడే వారి విషయంలో ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. ఆస్తమా చికిత్స ఇలా..!ఆస్తమాను నివారించేందుకు ‘ప్రివెంటార్స్’ అనే ఇన్హేలర్లూ, ఆస్తమా వచ్చిన సమయంలో దాన్ని తగ్గించేందుకు ‘రిలీవర్స్’ అనే ఇన్హేలర్లు వాడుతుంటారు. ఈ ఇన్హేలర్లు హానికరమనే అ΄ోహ కొందరిలో ఉంటుంది. నిజానికి అవి పూర్తిగా సురక్షితమైనవి. ముందస్తు నివారణ కోసం నెబ్యులైజర్లలాంటి పీల్చే చికిత్స (ఇన్హెలేషన్ థెరపీ) కూడా చేస్తుంటారు. నేసల్ స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి, తేలిగ్గా గాలి ఆడేలా చేస్తాయి. ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్లో వచ్చిన వాపు, మంట, ఎర్రబారడాన్ని (ఇన్ఫ్లమేషన్ను) తగ్గించే యాంటీ హిస్టమైన్ వంటి మందుల్ని వాడతారు.ఇప్పుడు అలర్జీలనూ, ఆస్తమానూ వేర్వేరుగా చూడటం సరికాదని డాక్టర్లు చెబుతుంటారు. ఇందుకు ‘ఏరియా’ అనే అంశాన్ని ప్రమాణంగా చూపుతారు. ఇక్కడ ‘ఏరియా’ అంటే... ‘ఏ.. ఆర్... ఐ.. ఏ’ అనే స్పెలింగ్తో ‘అలర్జిక్ రైనైటిస్ అండ్ ఇంటర్మిట్టెంట్ ఆస్తమా’ అని అర్థం. అందుకే అలర్జీలనూ, ఆస్తమానూ కలిపి ‘ఒన్ ఎయిర్వే డిసీజ్’గా పరిగణిస్తూ... అవసరాన్ని బట్టి శ్వాసవ్యవస్థ పైభాగంలోని రైనైటిస్కూ, కింద ఆస్తమాకూ చికిత్స చేయాలన్నది ఇప్పుడు ఆధునిక దృష్టికోణంలో అవసమన్నది డాక్టర్లు చెబుతున్న మాట. ఇక అలర్జీ అంటే ఏమిటో, ఆస్తమా అని దేన్ని అంటారో చూద్దాం. డా. ఏ. రఘుకాంత్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ (చదవండి: ఆ నాలుగు 'వైట్ ఫుడ్స్'ని నివారిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
శీతాకాలం : స్నానానికి వేడి నీళ్లా? చన్నీళ్లా?
వేసవి కాలంలో చన్నీటి స్నానం ఎంతో హాయినిస్తుంది. అయితే శీతాకాలం వచ్చింది అనగానే స్నానానికి దాదాపు అందరూ వేడి నీళ్లే వాడతారు. ఎందుకంటే చల్లనీటితో స్నానం చేస్తే జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలొస్తాయనే భయం కూడా దీనికి ప్రధాన కారణం. మరోవైపు కార్తీకస్నానాలు, అయ్యప్పమాల ధరించిన భక్తులు ఎంత చలిగా ఉన్నా సరే చన్నీటి స్నానాలే ఆచరిస్తారు. అసలు స్నానానికి ఏ నీళ్లు వాడితే మంచిది? తెలుసుకుందాం. అయితే ఏ కాలంలో అయినా స్నానానికి మరీ వేడినీళ్లు కాకుండా, గోరువెచ్చని నీళ్లు వాడాలి అనేది నిపుణుల మాట. రోజూ ఎక్కువ వేడి నీటి స్నానంతో చర్మానికి కొన్నిఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ముందుగా వేడి నీటి స్నానం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.వేడి నీటి స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?వేడి నీటి స్నానంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలసట తీరుతుంది. చర్మానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. శరీరంలో బీపీ తగ్గుతుంది. శరీర నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో కుచించుకు పోయిన కండరాలకు, ఎముకలకు వేడి నీటి స్నానంతో రిలీఫ్ లభిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల (గుండె జబ్బు) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే హాట్ టబ్ బాత్, ఆవిరిస్నానంతో ఈ ప్రయోజనాలు మరింత మెరుగ్గా ఉంటాయంటున్నారు. అసలే శీతాకాలంలో చర్మంలో తేమ శాతం తక్కువగా చర్మం పొడిగా మారిపోతుంది. దీనికి వేడి నీటి స్నానం మరింత ఆజ్యం పోస్తుంది. సేబుమ్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. చర్మంలోని సహజమైన ఆయిల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా మంట, దురదలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సోరియాసిస్, ఎగ్జిమా, రోసాసియా లాంటి సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. జుట్టుకు చేటువేడి, వేడి నీళ్లతో తల స్నానం అస్సలు మంచిది కాదు. వెంట్రుకలు బలహీనంగా మారతాయి. జుట్టులోని కెరాటిన్, లిపిడ్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది.చన్నీటితో స్నానం వల్ల కలిగే లాభాలుమరీ గడ్డ కట్టేంత చల్లని నీరు కాకుండా, ఒక మాదిరి చన్నీటిస్నానం వల్ల శరీరానికి ఉపశమనం లభిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. జుట్టు, చర్మానికి మంచిది. బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా చెబుతారు. తలకు కూడా చల్ల నీటి స్నానం మంచిదే.నోట్: చిన్న పిల్లలకు, వృద్ధులకు, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఇతర అనారోగ్యంతో ఉన్నవారికి చన్నీటి స్నానం మంచిది కాదు. ఏ వయసు వారికైనా గోరు వెచ్చటి స్నానం ఉత్తమం. అటు వాటు ఉన్నవారు, తట్టుకోగల శక్తిఉన్నవారు చన్నీటి స్నానం చేయవచ్చు. లేదంటే గోరు వెచ్చని నీటితో స్నానం బెటర్. స్నానానికి ముందు శరీరానికి నూనెతో మసాజ్ చేసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే స్నానం తరువాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడాలి. -
‘వినియోగం’ గణనీయంగా తగ్గింది!
దాదర్: ముంబైలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత వారం దాకా ఉక్కపోతతో సతమతమైన ముంబైకర్లకు ఇప్పుడు చలి కారణంగా కొంతమేర ఊరట లభించినట్లైంది. పగలు కొంత ఉక్కపోత భరించలేకపోయినప్పటికి రాత్రుల్లో వాతావరణంలో ఆకస్మాత్తుగా మార్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇళ్లలోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం చాలా శాతం వరకు తగ్గింది. దీంతో ముంబైలో గత వారం కిందట మూడు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడది 2,500 మెగావాట్లకు పడిపోయింది. చలికాలం ప్రారంభంలోనే సుమారు 500 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. మరికొద్ది రోజుల్లో ఇది 1,500 మెగావాట్లకు చేరడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. వేసవికాలంలో 4,550 మెగావాట్లపైనే.... వేసవి కాలంలో ఎండలు మండిపోవడంతో ఉదయం 10 గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకుతారు. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులు ఉక్కపోత భరించలేక సతమతమవుతారు. నిరంతరంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పనిచేసినప్పటికీ వాతావరణం చల్లబడదు. దీంతో వేసవి కాలంలో ముంబైలో విద్యుత్ వినియోగం ఏకంగా 4,500 మెగావాట్లకు పైనే చేరుకుంటుంది. ఏటా విద్యుత్ వినియోగం రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంటుంది. వేసవి కాలం మినహా మిగిలిన సీజన్లలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇళ్లు, షాపులు, కార్యాలయాల్లో విశ్రాంతిలేకుండా ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడంతో రెండు రోజుల కిందట విద్యుత్ వినియోగం 2,500 మెగావాట్లకు చేరుకుంది. టాటా పవర్ నుంచి 382 మెగావాట్లు, అదాణీ డహాణు విద్యుత్ కేంద్రం నుంచి 288 మెగావాట్లు, ముంబై ఎక్చేంజ్ నుంచి 1,971 మెగావాట్లు విద్యుత్ సరఫరా జరిగింది. ముంబైలో భిన్నంగా... ఇదిలాఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైనప్పటికీ అనేక జిల్లాల్లో వాతావరణం ఇంకా వేసవి ఎండలు తలపిస్తున్నాయి. రోజు ఏకంగా 31,001 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో మహానిరి్మతి కంపెనీ నుంచి 6,252 మెగావాట్లు, ప్రైవేటు కంపెనీల నుంచి 8,728 మెగావాట్లు, ఎక్చేంజి నుంచి సుమారు 8 వేల మెగావాట్లు విద్యుత్ సేకరించి ఈ డిమాండ్ను పూరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలతో పోలిస్తే ముంబైలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్ధలు అధికంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. వీటితోపాటు జంక్షన్ల వద్ద, ప్రధాన రహదారులపై, పర్యాటక ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార ప్రకటనల బోర్డులు, హోర్డింగులు అడుగడుగున ఉంటాయి. వీటిలో కొన్ని ఎల్రక్టానిక్, డిజిటల్ బోర్డులుంటాయి. రాత్రుల్లో వాటికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాధారణ బోర్డులకు ప్లడ్ లైట్లు వెలుగుతాయి. దీంతో రాత్రి వాతావరణం చల్లిబడినప్పటికి విద్యుత్ వినియోగం పగలు మాదిరిగానే జరుగుతుంది. అయితే కొద్ది నెలల కిందట ఘాట్కోపర్లోని చడ్డానగర్ జంక్షన్ వద్ద భారీ హోర్డింగ్ కూలడంతో సుమారు 17 మంది చనిపోగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, బోర్డుల అంశం తెరమీదకు వచి్చంది. వివిధ రంగాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కళ్లు తెరచిన ప్రభుత్వం, బీఎంసీ పరిపాలన విభాగం తనిఖీలు ప్రారంభించింది. అక్రమంగా ఏర్పాటుచేసిన హోర్డింగులు, సైన్ బోర్డులతోపాటు వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్న కనెక్షన్లను కూడా తొలగిస్తున్నారు. ఆ ప్రకారం ముంబైలో కొంత శాతం విద్యుత్ వినియోగం తగ్గాలి. కానీ ఇవేమీ విద్యుత్ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. -
చలికాలంలో మీ స్కిన్ మృదువుగా ఉండాలంటే.!
చలికాలం చర్మం పొడిబారి, జీవం కోల్పోయినట్టు కనపడుతుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు సంబంధించి కొన్ని టిప్స్ మీకోసం. టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు రాసి మసాజ్ చేయాలి. స్నానం చేసేముందు నాలుగు చుక్కల బాదం నూనె బకెట్ నీటిలో కలపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది. స్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి చలికాలం నూనె శాతం అధికంగా ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి, మర్దనా చేయాలి. మృతకణాలు తొలగి పోయి చర్మం మృదువుగా మారుతుంది. -
వెలుగు స్తంభాలు
నేల నుంచి నింగికి వేసిన కాంతి నిచ్చెనల్లా ఉన్నాయి కదూ! పశ్చిమ కెనడాలో మైనస్ 30 డిగ్రీల చలితో వణికిపోతున్న ఆల్బర్టా ప్రాంతంలో దర్శనమిస్తున్న ఈ నిట్టనిలువు వెలుతురు స్తంభాల సోయగాలు చూపరుల మనసు దోస్తున్నాయి. ఇవి ఏర్పడాలంటే పర్యావరణపరంగా పలు అంశాలు కలిసి రావాల్సి ఉంటుంది. –10 నుంచి –40 డిగ్రీల మధ్యలో వాతావరణం అతి శీతలంగా, హెచ్చు తేమతో, గాలన్నదే వీయకుండా స్తబ్ధుగా ఉండాలి. అలాంటి వాతావరణంలో 0.02 మి.మీ. మందంతో కూడిన బుల్లి మంచు రేణువులు నిట్టనిలువుగా కాకుండా నేలకు కాస్త సమాంతరంగా కిందకు పడుతూ ఉండాలి. వాటి గుండా కాంతి నిర్దిష్ట కోణాల్లో ప్రసరిస్తే ఆ మంచు రేణువులు లక్షలాది బుల్లి అద్దాలుగా మారతాయి. వాటిపై పడుతూ కాంతి ఊహాతీతమైన తీరులో పరావర్తనం చెందుతుంది. ఫలితంగా ఇలాంటి నిలువు వెలుగులు సాక్షాత్కరిస్తాయి. ఆ కాంతికి మూలం వీధి దీపాలు మొదలుకుని చంద్ర కిరణాల దాకా ఏదైనా కావచ్చు. కెనడాతో పాటు అలస్కా, రష్యా తదితర చోట్ల అతి శీతల ప్రాంతాల్లో ఇవి తరచూ ఏర్పడుతుంటాయి. ఇవి నిజానికి కేవలం ఓ దృశ్య భ్రాంతి మాత్రమేనని సైంటిస్టులు అంటారు. వాళ్లేం చెప్పినా స్థానికులు వీటిని మానవాతీత శక్తి తాలూకు విన్యాసాలుగా నమ్ముతుంటారు. ఎగిరే పళ్లేల్లాగే ఇవి కూడా గ్రహాంతరవాసుల వాహనాలని భావిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ చేతి ఉన్నివస్త్రం
‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ. పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్మేన్ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది. వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది. చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు. కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త. మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్ సారోయాన్ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్కోట్ అమ్మి చలితో చచ్చిపోతాడు.పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు! -
శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!
చలికాలం వచ్చేసింది. కీళ్లు బిగుసుకుపోతుంటాయి. నువ్వులతో దేహాన్ని వెచ్చబరచాలి. ఎముకలకు తగినంత శక్తినివ్వాలి. బ్రేక్ఫాస్ట్లో పాటు ఒక ఓట్స్ లడ్డు. ఈవెనింగ్ స్నాక్గా డేట్స్ లడ్డు. రాత్రి భోజనంలోకి వేడిగా నువ్వుల రైస్. చలికాలం పేజీలను నవ్వుతూ తిప్పేద్దాం. డేట్స్ లడ్డు. కావలసినవి: కర్జూరాలు – 300 గ్రాములు (సీడ్లెస్ అయితే 280 గ్రాములు చాలు); నువ్వులు – కప్పు; నువ్వులు – పావు కప్పు (పైన చల్లడానికి); జీడిపప్పు పలుకులు – పావు కప్పు; యాలకులు – 4.తయారీ: ∙మంద పాటి బాణలిలో నువ్వులను (అన్నింటినీ) వేయించాలి (నూనె వేయకూడదు). చల్లారిన తర్వాత పావు కప్పు విడిగా తీసి పెట్టుకుని మిగిలిన నువ్వులను, యాలకులకు మిక్సీలో పొడి చేయాలి ∙కర్జూరాలను గింజలు తొలగించి వెడల్పు పాత్రలో వేసి చిదమాలి. అందులో నువ్వుల పొడి వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదుముతూ కల పాలి. బాగా కలిసిన తరవాత జీడిపప్పు పలుకులను వేసి పెద్ద నిమ్మకాయంత సైజులో లడ్డులు చేయాలి. వేయించి పక్కన తీసి పెట్టిన నువ్వులను ఒక ప్లేట్లో పలుచగా వేయాలి. లడ్డును ఆ నువ్వుల మీద పెట్టి రోల్ చేయాలి. లడ్డుకు అంటుకున్న నువ్వులు రాలిపోకుండా ఉండడానికి రెండు అర చేతుల్లో పెట్టి గట్టిగా అదమాలి. ఇవి వారం పాటు తాజాగా ఉంటాయి. ఓట్స్ సెసెమీ లడ్డు కావలసినవి: ఓట్స్ – పావు కేజీ; నువ్వులు – పావు కేజీ; యాలకులు – 4; బెల్లం తురుము – ఒకటిన్నర కప్పులు; జీడిపప్పు పలుకులు – 20తయారీ: ∙మంద పాటి పాత్రలో ఓట్స్ వేసి మీడియం మంట మీద వేయించాలి (నూనె లేకుండా). చిటపటలాడుతుంటే సమంగా వేగినట్లు గుర్తు. చిటపటలాడేటప్పుడు ఒకసారి గరిటెతో కలియతిప్పి దించేయాలి. వేగిన ఓట్స్ను ఒక ప్లేట్లోకి మార్చి అదే పాత్రలో నువ్వులను వేయించాలి. నువ్వులు కూడా చల్లారిన తర్వాత ఓట్స్, నువ్వులు, యాలకులను కలిపి మిక్సీలో పొడి చేయాలి. అందులో బెల్లంపొడి వేసి మరోసారి తిప్పాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పోసి చేత్తో చిదిమినట్లు కలిపి, జీడిపప్పు పలుకులు కలిపి పెద్ద నిమ్మకాయంత లడ్డులు చేయాలి. ఇవి వారం రోజులు తాజాగా ఉంటాయి.నువ్వుల రైస్కావలసినవి: నువ్వులు – వంద గ్రాములు; బియ్యం – పావు కేజీ; ఎండుమిర్చి – 6; మినప్పప్పు – టీ స్పూన్ ; నువ్వుల నూనె– టేబుల్ స్పూన్; ఉప్పు పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి. పోపు కోసం: నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు.తయారీ: ∙బియ్యం కడిగి అన్నాన్ని కొంచెం పలుకుగా వండుకోవాలి. వెడల్పు పాత్రలోకి మార్చి చల్లారనివ్వాలి. అందులో ఉప్పు, టీ స్పూన్ నువ్వుల నూనె వేసి గరిటెతో జాగ్రత్తగా కల పాలి మిగిలిన నూనె బాణలిలో చేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి వేయించాలి. అవి వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు చిట్లుతున్న శబ్దం వచ్చిన తర్వాత ఒక అరనిమిషం పాటు బాగా కలియబెట్టి స్టవ్ ఆపేయాలి నువ్వులు, ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీలో ముందుగా ఎండుమిర్చి వేసి పొడి చేయాలి. అవి గరుకుగా మెదిగిన తర్వాత బాణలిలో ఉన్న అన్నింటినీ వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని అన్నం మీద పలుచగా చల్లాలి అదే బాణలిలో పోపు కోసం తీసుకున్న నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించాలి. ఈ పోపును అన్నంలో వేయాలి. నువ్వుల పొడి, పోపు సమంగా కలిసే వరకు గరిటెతో కలపాలి. రుచి చూసుకుని అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. -
పెట్ లవర్స్.. బీ కేర్ఫుల్..!
పెంపుడు జంతువులు.. మన జీవన శైలిలో ఓ భాగం. అయితే ఆ మూగ జీవాలను ప్రాణప్రదంగా భావించేవారు కోకొల్లలు. కంటికి రెప్పలా కాస్తూ.. విడదీయరాని మైత్రి బంధాన్ని కొనసాగించే వారు మరికొందరు. మనుషుల్లానే చలికాలంలో వాటికీ రక్షణ అవసరమే.. అందుకే జంతు ప్రేమికులు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటిపట్ల జాగ్రత్తగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల మాదిరిగానే వాటికీ సీజనల్ వ్యాధులు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వాటి ఆరోగ్యానికీ ఢోకా ఉండదని చెబుతున్నారు కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా, తెలంగాణలోని సనత్ నగర్కి చెందిన కెనైన్ అసోసియేషన్ కార్యదర్శి విశాల్ సూదం. మనుషులకే కాదు.. పెంపుడు జంతువులకూ చలికాలంలో వేడి పుట్టించే వివిధ రకాల యాక్సెసరీస్ అందుబాటులోకి వచ్చాయి. కుక్కలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు వాష్ చేసుకునేందుకు వీలుగా ఫ్లాట్ బెడ్, రౌండ్ బెడ్లు దొరుకుతున్నాయి. కుక్కలు, పప్పీస్ చలి తీవ్రతను వీటి ద్వారా అరికట్టవచ్చు. దీంతోపాటు ప్రత్యేక స్వెట్టర్లు జంతువులకు రక్షణ నిలుస్తున్నాయి. అన్ని సైజుల కుక్కలకూ అనువుగా ఉండేలా వివిధ మోడళ్లతో ఊలుతో తయారుచేసిన స్వెట్టర్లు లభిస్తున్నాయి. ఇవి కూడా వాటి సైజు, నాణ్యత ఆధారంగా వివిధ ధరల్లో లభిస్తున్నాయి. అలాగే. కాళ్లకు రక్షణ కలిగించే రీతిలో శీతాకాలంలో షూష్ అందుబాటులో ఉన్నాయి.శీతాకాలంలో మంచు కారణంగా గాలిలో తేమ శాతం కారణంగా గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. దీంతో పెంపుడు జంతువులు వాయు కాలుష్యం బారిన పడి శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే బయటకు తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. పెట్స్ ఆరోగ్యంగా ఉండడానికి రెగ్యులర్గా గ్రూమింగ్ చేయడం అవసరం. నీళ్లు తాగించేందుకు ఉపయోగించే గిన్నెలు, పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సీజనల్ వ్యాధులు.. శీతాకాలలో వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ. చలి కాలంలో ఫ్లీస్, టిక్, మైట్స్ (గోమర్లు) అనే బాహ్య పరాన్నజీవులు కుక్కల చర్మంపై చేరతాయి. దీంతో జుట్టు రాలిపోవడం, టిక్ ఫీవర్ రావడం, బ్లడ్ లాస్ కావడం, దురదలు కారణంగా కుక్కలు వాటంతట అవే శరీరాన్ని కొరుక్కుంటాయి. గాలి సంక్రమణ ద్వారా ఒక కుక్క నుంచి మరో కుక్కకు పాకుతుంటాయి. అందుకోసం ముందుగానే నిపుణుల సలహా మేరకు బెల్టు టైపులో ఉండే యాంటీ టిక్ కాలర్ ఏర్పాటు చేయడం రక్షణగా ఉంటుంది. అలాగే తరచూ యాంటీ రాబీస్, సెవన్ ఇన్ వన్ వంటి టీకాలను వేయించాలి. షాంపో, పౌడర్, స్ప్రేస్తో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రత్యేక శ్రద్ధ అవసరం..శీతాకాలంలో మంచుకురిసే అవకాశం ఉన్నందున సాధ్యమైంత వరకూ పెంపుడు జంతువులకు ప్రత్యేక షెల్టర్ గానీ, ఇంట్లో వెచ్చని ప్రదేశాన్ని గానీ కేటాయిస్తే బాగుంటుంది. ముఖ్యంగా పప్పీస్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాటి దినచర్యలో ఏవైనా మార్పులు వస్తే.. వైద్యుల సలహా పాలించాలి. – విశాల్ సూదం, కెనైన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది) -
మంచు కురిసిన వేళ: కశ్మీర్ సొగసు చూడ తరమా!
శీతాకాలం మంచు అనగానే ఇండియాలో తొలుతగా గుర్తొచ్చే ప్రదేశం జమ్ము కశ్మీర్. రాష్ట్రంలో లోని పలు ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. #WATCH | J&K: Upper reaches of Bandipora, including border areas of Gurez, Tulail & Kanzalwan, covered under a white sheet of snow as snowfall continues in the region. pic.twitter.com/UL23aw4xwX— ANI (@ANI) November 16, 2024 కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతం, స్కీయింగ్కు ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్లో శనివారం తొలి మంచు ప్రవాహమై మెరిసింది. ఇంకా కుప్వారా జిల్లా , బందిపొరా జిల్లా, గురెజ్ , కంజల్వాన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంద. కొండలపై ఎటు చూసిన వెండి వెన్నలలా మంచుకురుస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్లోని ఎగువ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి మంచు కురుస్తుందని, మైదాన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసిందని అధికారులు ఇక్కడ తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . Snowing heavily over Sonamarg, almost 1-2 inches snowfall accumulated in the area. pic.twitter.com/RTAGuMPGaP— Kashmir Weather Forecast (@KashmirForecast) November 16, 2024 -
చలికాలంలో చిటపటలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శీతాకాలం ప్రారంభం వేళ విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొన్నది. చలి పెరగాల్సిన సమయంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. చలికాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాల్సి ఉండగా.. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దాదాపు వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నది. ప్రస్తుత సీజన్లో నమోదు కావాల్సిన దాని కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, వేగంగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. మెదక్, నిజామాబాద్లో 3 డిగ్రీలు, హైదరాబాద్, అదిలాబాద్, భద్రాచలంలో 2 డిగ్రీలు, వరంగల్, హన్మకొండలో ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 34.5 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 16 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం ఉంటుంది.వాతావరణంలో మార్పులతో..సాధారణంగా సీజన్ మారుతున్న సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం ఈశాన్య రుతుపవన కాలం మధ్యస్థానికి చేరుకుంది. రుతుపవనాల ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, దీనికి తోడు సీజనల్ యాక్టివిటీస్తో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్రభావం ఉష్ణోగ్రతలపై పడినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్లనే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి కాస్త అటుఇటుగా నమోదవుతున్నాయి.ఈ ప్రభావం మరో వారం రోజులపాటు ఉండొచ్చని అధికారులు అంటున్నారు. నవంబర్ నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుముఖం పడతాయి. దీంతో చలి తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ ఏడాది చలికాలంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. డిసెంబర్ నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతాయని, ఆ సమయంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.కాస్త ఎక్కువగానే గరిష్ట ఉష్ణోగ్రతలురాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు వాయుకాలుష్యం పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. డిసెంబర్ నెలతో పాటు జనవరి నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటె తక్కువగా నమోదవుతాయని అంచనాలున్నాయి. – శ్రావణి, వాతావరణ శాఖ అధికారి -
భారత్లో విచిత్రమైన వాతావరణం!! 123 ఏళ్ల తర్వాత..
ఢిల్లీ: భారత్లో దాదాపు 120 ఏళ్ల తర్వాత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్ నెల వచ్చేసింది. అయినా చలి జాడ లేకుండా పోయింది. దీంతో ఈ నెల కూడా సూర్యతాపం తప్పదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.భారత్లో నెలకొన్ని ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులపై ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ(IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనలు తరచూ ఏర్పడడం, తూర్పు గాలుల ప్రభావం, పశ్చిమ దిశ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకపోవడం.. తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా వాతావరణం వెచ్చగా ఉంటోందని వెల్లడించారు. అలాగేవాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది అక్టోబర్ అత్యంత వెచ్చని నెలగా రికార్డయ్యింది. సాధారణం కంటే.. 1.23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. అలాగే దేశవ్యాప్తంగా సరాసరి ఉష్ణోగ్రత చూసినా.. 1.84 డిగ్రీల సెల్సియస్(20.01 డిగ్రీల సెల్సియస్ బదులు 21.85 డిగ్రీల సెల్సియస్ నమోదైంది) అధికంగానే రికార్డు అయ్యింది. ఈ గణాంకాలను బట్టి నవంబర్ నెల కూడా ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే.. రాబోయే రెండు వారాలు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని చెబుతోంది.అంటే.. ఈసారి నవంబర్ చలితో వణికించదని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర చెబుతున్నారు. అలాగే.. డిసెంబర్ నుంచి మొదలయ్యే చలి జనవరి, ఫిబ్రవరి నెలలపాటు కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు.. దక్షిణ భారతంలో నవంబర్ నెలలో రుతుపవనాల తిరోగమనం సమయంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారాయన. -
మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి!
'చిన్నపిల్లల చర్మం చాలా కోమలంగా ఉంటుంది. చలికాలంలో వారి చర్మం పొడిబారడంతో అనేక సమస్యలు వస్తాయి. మొదటే మృదువైన చర్మం. దానికి తోడు చలికాలంలో పొడిబారి పగలడం, చిట్లడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘అటోపిక్ డర్మటైటిస్’ అంటారు. ఈ సీజన్లో నెలల పిల్లలు మొదలు.. ఎదిగిన పిల్లల్లోనూ అనేక వయసు చిన్నారులో కనిపించే అటోపిక్ డర్మటైటిస్ సమస్యలు, వాటికి పరిష్కారాలను తెలిపే కథనమిది.' అటోపిక్ డర్మటైటిస్లో మొదట్లో చర్మం పొడిబారి, దురదతో ఎర్రగా మారుతుంది. పిల్లలు ఆ ప్రాంతంలో పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘లైకెనిఫికేషన్’ అంటారు. ఇది జరిగాక దురద ఇంకా పెరుగుతుంది. దాంతో మరీ ఎక్కువగా గీరడం, దేనికైనా రాస్తుండటంతో చర్మం మరింత మందమవుతుంది. ఈ ప్రక్రియలు ఒకదాని తర్వాత మరొకటి ఒక సైకిల్లా (ఇచ్ అండ్ స్క్రాచ్ సైకిల్) సాగుతుంటాయి. కొందరిలో ఇదొక దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా కూడా మారవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే.. చలికాలంలో చెమ్మ (తేమ) ఇగిరిపోతూ ఉండటంతో చర్మం పొడిబారడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఇలాంటప్పుడు చర్మం పొడిబారి, ఎర్రబారుతుంది. కుటుంబ ఆరోగ్య చరిత్రలో ఆస్తమా, డస్ట్ అలర్జీలు ఉండేవారిలో అటోపిక్ డర్మటైటిస్ సమస్య ఎక్కువ. వివిధ వయసుల పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఇలా.. రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు.. ఈ వయసు పిల్లల్లో చర్మం ఎర్రబారడం ప్రధానంగా ముఖంపైన, మెడ దగ్గర కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో దేహంలోని ఏ ప్రాంతంలోనైనా ఇలా జరిగే అవకాశముంది. ఉదాహరణకు పాకే పిల్లల్లో వాళ్ల మోకాళ్లు నేలకు ఒరుసుకుపోతుండటం వల్ల మోకాళ్ల దగ్గర ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్తో చర్మం ప్రభావితం కావడమన్నది చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో ఎక్కువ. అంటే.. మోచేతులు, మోకాళ్ల వెనక భాగం, మెడ పక్కభాగాలు, ముంజేయి, పిడికిలి, మడమ వంటి ప్రాంతాల్లో అన్నమాట. ఈ వయసు పిల్లల్లో చర్మం ముడుత వద్ద ఒక గీతలా (స్కిన్లైన్) ఉన్నచోట్ల దురద వచ్చి, అది పగులు బారుతున్నట్లవుతుంది. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో చర్మం పొడిబారడం కాస్త ఎక్కువ. పైగా ఈ పొడిబారడమన్నది మోకాళ్ల కింది భాగంలో ఎక్కువ. అందుకే ఈ వయసు పిల్లల కాళ్లు.. పొడి బారినప్పుడు బయట ఆడి వచ్చినట్లుగా తెల్లగా కనిపిస్తుంటాయి. ముఖం పెద్దగా పగలదు. కానీ... పెదవులు పొడిబారి, పగుళ్లలాగా వస్తుంది. పెదవుల చుట్టూ చర్మమంతా పగుళ్లుబారి ఓ సరిహద్దులా స్పష్టంగా కనిపిస్తూ, ఆ భాగం మంట పుడుతుంటుంది. దీన్ని ‘పెరీ–ఓరల్ డర్మటైటిస్’ అంటారు. ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో.. ఏడేళ్ల వయసు నుంచి (అంతకంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే) పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ఈ వయసునుంచి లక్షణాల తీవ్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. అయితే ఈ వయసు పిల్లల్లోనూ చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యలతో పాటు కొందరిలో సైనుసైటిస్ కూడా ఉండవచ్చు. చికిత్స / మేనేజ్మెంట్ తొలి దశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్): అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు తొలి దశల్లో చికిత్స చాలా తేలిక. చర్మంపై పొడిదనాన్ని తగ్గించడానికి వైట్ పెట్రోలియమ్ జెల్లీ, లిక్విడ్ పారఫీన్ ఆయిల్ వంటివి రాస్తే చేస్తే చాలు. పగుళ్లు, దురద, పొడిదనం తగ్గుతాయి. దాంతో గీరుకోవడం తగ్గుతుంది. రాత్రి నిద్రపడుతుంది. అలర్జీని ప్రేరేపించే అంశాలను నివారించడం: సబ్బులు, డిటర్జెంట్లు.. అలర్జీని ప్రేరేపిస్తున్నాయా అన్నది చూసుకోవాలి. అలా జరుగుతుంటే.. సబ్బులను, డిటర్జెంట్లను మార్చాలి. ఘాటైన సబ్బులకు బదులు మైల్డ్గా ఉండే క్లెన్సెర్స్ తో శుభ్రం చేసుకోవాలి. పిల్లల్ని పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. పిల్లల్లో అలర్జీ కలిగించే ఆహారాన్ని గుర్తించి (ముఖ్యంగా నట్స్, సీ ఫుడ్), ఒకవేళ ఆ ఆహారాలతో అలర్జీ వస్తుంటే వాటి నుంచి దూరంగా ఉంచాలి. పూత మందులతో చికిత్స: పిల్లలకు ఎమోలియెంట్స్ అని పిలిచే.. లిక్విడ్ పారఫీన్, గ్లిజరిన్, మినరల్ ఆయిల్ వంటివి పూయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్నానం చేయించిన వెంటనే ఎమోలియెంట్స్ పూయాలి. తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎమోలియెంట్స్ పూశాక వాటిపైన పూతమందుగా వాడే స్టెరాయిడ్స్ కూడా వాడవచ్చు. పైపూతగా వాడే స్టెరాయిడ్స్ను ఎక్కువ రోజులు వాడకుండా ఉండేందుకు టాపికల్ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్ క్రీమ్ వాడవచ్చు. డాక్టర్ల సలహా మేరకు పైపూత యాంటీబయాటిక్, స్టెరాయిడ్ కాంబినేషన్స్ను వాడవచ్చు. నోటిద్వారా తీసుకోవాల్సిన మందులు: నిద్రకు ముందు డాక్టర్ సలహా మేరకు నాన్ సెడెటివ్ యాంటీహిస్టమైన్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. రెండోదశ చికిత్స: మొదటిదశ చికిత్స (ఫస్ట్లైన్ ట్రీట్మెంట్)తో అంతగా ఫలితం లేనప్పుడు స్టెరాయిడ్ డోస్ పెంచడమూ, అప్పటికీ గుణం కనిపించకపోతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ చికిత్స: కొంతమంది పిల్లలకు అల్ట్రావయొలెట్ బి– కిరణాలతో చికిత్సతో మంచి ఫలితాలు వస్తాయి. మూడో దశ చికిత్స (థర్డ్ లైన్ ట్రీట్మెంట్): నోటిద్వారా కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం లాంటి ఈ థర్డ్ లైన్ ట్రీట్మెంట్ అంతా పూర్తిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే జరగాలి. వెట్ ర్యాప్ టెక్నిక్.. అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ‘వెట్ ర్యాప్ టెక్నిక్’తో మంచి ఫలితాలుంటాయి. చర్మమంతా పగుళ్లు ఉన్న పిల్లలకు మొదట ఎమోలియెంట్స్ పూయాలి. ఆ తర్వాత ఒంటిపైన బ్యాండేజ్ను ఒక పొరలా కట్టి, దాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. దానిపైన మరో పొరలా పొడి బ్యాండేజ్ వేయాలి. ఇలా వేసిన బ్యాండేజీని ప్రతి పన్నెండు గంటలకు ఒకమారు మార్చాలి. దీన్నే వెట్ ర్యాప్ టెక్నిక్ అంటారు. దీంతో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రతను తగ్గించవచ్చు. లక్షణాలు.. చర్మం పొడిబారి దురదలు వచ్చాక గుల్లలు, నీటిగుల్లలూ రావచ్చు. ఎర్ర బారినచోట చర్మం పొట్టు కట్టినట్లు అవుతుంది. మందంగానూ (లైకెనిఫికేషన్) మారుతుంది. కొన్నిసార్లు కాస్తంత పొట్టు రాలడంతోపాటు అక్కడ గాటు కూడా పడవచ్చు. మందంగా తెట్టుకట్టిన చర్మం పై పొర లేచిపోయినప్పుడు అక్కడ ద్రవం ఊరుతుండవచ్చు (ఊజింగ్). ఈ దశలోనూ చికిత్స అందకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ ఇవి చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..! -
చలికాలంలో ఇలా ఎందుకవుతుందంటే..? కారణం ఇదే!
'చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారికి ఓ పీడకల. కీళ్లలో ఇన్ఫ్లమేషన్ వచ్చి నొప్పి కలిగించే ‘ఆర్థరైటిస్’ సమస్య చలికాలంలో పెచ్చుమీరడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కారణాలవుతాయి. అవేమిటో, చలికాలంలో ఈ కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందడం ఎలా.. వంటి అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం.' చలికాలంలో ఆర్థరైటిస్తో బాధపడేవారి వెతలు మరింతగా పెరుగుతాయి. అందుకు కారణాలు ఈ కింది విధంగా ఉంటాయి. చలికాలంలో కీళ్లనొప్పులు పెరిగేదెందుకంటే.. మానవ శరీరంపై వాతావరణం ప్రభావం తప్పక ఉంటుంది. దేహంలో జరిగే చాలా జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థ వాతావరణంలోని తేడాలకు తగ్గట్లుగా మార్పులకు లోనవుతుంటాయి. దాంతో ఆర్థరైటిస్ కీళ్లనొప్పులతో బాధపడేవారి కండరాలు మరింతగా బిగుసుకుపోవడం, బాధలు పెరగడం జరుగుతాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ బాధలూ పెరుగుతాయి. ఇందుకు దోహదపడే అంశాలివి.. చలికాలంలో చేయి లేదా కాలి వేళ్లకు రక్తప్రసరణ కాస్త మందగిస్తుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘రెనాడ్స్ ఫినామినా’ అంటారు. అప్పటికే ఆర్థరైటిస్తో బాధపడుతున్న వారిలో ఇది మరింత ఎక్కువ. ఇది మరింత తీవ్రతరం అయినప్పుడు కొందరిలో చేతివేళ్లు, కాలివేళ్లు కుళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’ అంటారు. ఆర్థరైటిస్ వల్ల లంగ్స్ ప్రభావితం అయినప్పుడు ఐఎల్డీ అనే జబ్బు వచ్చి, చలికాలంలో తీవ్రత మరింత పెరిగి బాధితుల్లో దగ్గు, ఆయాసం పెరుగుతాయి. మయోసైటిస్ అనే రకం కీళ్లవాతంతో బాధపడేవారిలో ఈ కాలంలో కండరాలకి రక్తప్రసరణ తగ్గడంతో వాటి కదలికలు మరింత తగ్గుతాయి. ఫలితంగా తగినంత వ్యాయామం సమకూరక.. వ్యాధి లక్షణాలు పెరిగి, ఇబ్బందికరంగా మారతాయి. అందుకే కీళ్లనొప్పులతో బాధపడుతుండేవారు చలికాలం వస్తుందంటేనే ఆందోళన చెందుతుంటారు. ఈ కాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఆర్థరైటిస్తో బాధపడుతున్నవారు కొన్ని చిన్న చిన్న సూచనలు పాటించడం ద్వారా చలికాలంలో పెరిగే తమ బాధలను చాలావరకు అధిగమించడం సాధ్యమే.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఉన్ని దుస్తులు, కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌవ్స్ ధరించాలి. వెచ్చదనం వల్ల నొప్పిని కలిగించే రసాయనాల తొలగింపు ప్రక్రియ, వాటిని బయటకు పంపడం మరింత వేగవంతమవుతుంది. వెచ్చదనం కారణంగా రక్తప్రవాహమూ మెరుగుపడుతుంది. కండరాలు బిగుసుకు పోవడమూ తగ్గుతుంది. చలికాలంలో కండరాల కదలికలు ఇబ్బందికరంగా మారడం, నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో బాధితులు తమ దేహ కదలికలను బాగా తగ్గిస్తారు. తగినంత వ్యాయామం సమకూరకపోవడంతో బాధలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వీరు తమకు శ్రమ కలగని రీతిలో ఎంతోకొంత వ్యాయామం చేయాలి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువ. ఫలితంగా ఒంట్లో విటమిన్–డి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా వ్యాధి లక్షణాల పెరిగి, బాధలు మరింత పెచ్చరిల్లుతాయి. అప్పటికే ఆర్థరైటిస్తో బాధపడుతున్నవారు డాక్టర్లు నిర్ణయించిన మోతాదులో, వారు సూచించిన కాలానికి విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవాలి. ఈ కాలం వైరస్, బ్యాక్టీరియాల మనుగడకు అనుకూలంగా ఉండటంతో అంటువ్యాధులు పెరిగే ప్రమాదం ఉంటుంది. కీళ్లవాతాల తీవ్రతా పెరగవచ్చు. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు చలికాలం రాకముందే డాక్టర్లు సూచించిన వ్యాక్సిన్లు తీసుకోవాలి. అంటువ్యాధుల వల్ల వయోవృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు తప్పనిసరిగా వ్యాక్సిన్లు తీసుకోవాలి. చలికాలంలో నీళ్లు, ద్రవాహారాలు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఒంట్లో ద్రవాలు తగ్గి, డీ–హైడ్రేషన్ ముప్పు పెరుగుతుంది. అందుకే ఈ కాలంలో అందరూ తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థరైటిస్ కోసం వాడే మందుల్ని డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తల ద్వారా ఆర్థరైటిస్ బాధితులు చలికాలంలో ఎదుర్కొనే బాధలను చాలావరకు నివారించవచ్చు. ఇవి చదవండి: వింటర్లో సెల్యులైటిస్తో సమస్యా..? అయితే ఇలా చేయండి! -
వింటర్లో సెల్యులైటిస్తో సమస్యా..? అయితే ఇలా చేయండి!
'సెల్యులైటిస్ అనేది ఓ చర్మవ్యాధి. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో చర్మంపై పగుళ్లు రావడం, ఎర్రబారడం, కొద్దిపాటి వాపు మంట వంటి లక్షణాలతో బాధించే ఈ వ్యాధి తాలూకు బాధలు చలికాలంలో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువవుతాయి. అసలు సెల్యులైటిస్ రావడానికి ఏయే అంశాలు కారణమవుతాయి, లక్షణాలేమిటి, చలికాలంలో ఇది ఎందుకిలా మరింత ఎక్కువగా బాధిస్తుంది వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.' చర్మం పగుళ్లుబారినట్లుగా కనిపిస్తూ, కొద్దిపాటి వాపు, ఎర్రబారడం వంటి వాటితో వ్యక్తమయ్యే ఈ వ్యాధి స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. చర్మంపై ఒకచోట వస్తే మిగతా చోట్లకు పాకుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. ఒకరినుంచి మరొకరికి వ్యాపించదు. ప్రేరేపించే అంశాలు.. స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినప్పటికీ... కొన్ని అంశాలు దీన్ని తీవ్రతరం చేస్తాయి. అవి.. కాళ్లు, చేతుల్లోని రక్తనాళాల్లో ఏమైనా సమస్యలతో రక్తసరఫరాలో తేడాలు, ఊబకాయం, కాళ్లవాపులు, డయాబెటిస్, మద్యం తాగే అలవాటు కారణాలతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనం కావడం. లక్షణాలు.. ఈ ఆరోగ్య సమస్యలో కనిపించే ఓ కీలకమైన అంశం ఏమిటంటే.. సాధారణంగా సెల్యులైటిస్ దేహంలోని ఒకవైపునే కనిపిస్తుండటం విశేషం. ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి.. ఈ వ్యాధి సోకిన ప్రాంతంలో చర్మం దురద పెడుతుండటంతో పాటు ఈ దురదలు క్రమంగా పక్కలకు వ్యాపిస్తూ ఉంటాయి. వ్యాధిసోకిన చర్మపు ప్రాంతంలో వాపు, ముట్టుకోనివ్వకపోవడం (టెండర్నెస్) నొప్పి, వేడిగా అనిపించడం జ్వరంతో పాటు అది కొందరిలో చలిజ్వరంగా వ్యక్తం కావడం సెల్యులైటిస్ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతో పాటు నీటి పొక్కుల్లా (బ్లిస్టర్స్) రావడం. కొందరిలో చర్మంపై గుంటల్లా పడుతూ, చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపించడం (స్కిన్ డింప్లింగ్) చలికాలంలో బాధలు ఎందుకు పెరుగుతాయంటే.. సెల్యులైటిస్ లక్షణాలతో వచ్చే బాధలు చలికాలంలో పెరగడానికి, ఈ సీజన్లో చర్మంపై కనిపించే కొన్ని అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు.. చర్మం పొడిబారడం (డ్రైస్కిన్): ఈ సీజన్లో తేమ తగ్గడంతో చర్మం బాగా పొడిబారిపోతూ ఉండటం చాలామందికి అనుభవంలో వచ్చే విషయమే. పైగా చలిగాలులకు వెళ్లినప్పుడు మరింతగా పెరుగుతుంది. ఇలా పొడిబారిన చర్మం బ్యాక్టీరియా చేరడానికి అనువుగా ఉంటుంది. దాంతో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ సీజన్లో మాయిశ్చరైజర్లతో చర్మాన్ని తేమగా ఉంచుకుంటే ఇలా పగుళ్లుబారడంతో పాటు సెల్యులైటిస్నూ నివారించవచ్చు. వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడటం / వ్యాధినిరోధక శక్తి తగ్గడం: చలికాలంలో మామూలుగానే వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు కాస్త మందగించే అవకాశముంది. దీనికి తోడు డయాబెటిస్ ఉండటం, మద్యం అలవాట్ల వంటివి ఉంటే అది వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత మందకొడిగా మార్చవచ్చు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సమతులాహారం తీసుకోకపోవడం, ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు తక్కువగా ఉండటం లాంటి అంశాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశముంది. సెల్యులైటిస్ నివారణ ఇలా... చర్మాన్ని శుభ్రంగా, తేటగా ఉంచుకోవాలి. ఘాటైన రసాయనాలతో కూడిన వాసన సబ్బులు కాకుండా, మైల్డ్ సోప్ వాడాలి. మిగతా చర్మంతో పోలిస్తే.. మేనిపై పొడిగా ఉండే భాగాలైన మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల మాయిశ్చరైజర్ వంటివి రాసి, తేమగా ఉండేలా చూసుకోవడం మంచిది. చర్మం పగుళ్లు బారి, తోలు రేగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, లాగడం చేయకూడదు. గోళ్లు, చర్మంతో గోళ్లు ముడిపడే భాగాల్ని శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అక్కడి నుంచి బ్యాక్టీరియా చర్మంపై దాడి చేసే అవకాశాలుంటాయి. చలికాలంలో చర్మానికి మంచి రక్షణ కలిగేలా, ఒళ్లంతా కప్పి ఉంచేలాంటి దుస్తులు వాడటం మేలు. చలిగాలులు వేగంగా తాకకుండా ఉండేలా దుస్తులు ఉండాలి. తమ వ్యక్తిగత దుస్తులు, సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు. ఇల్లు శుభ్రం చేసుకోవడం, తోటపని వంటి మన రోజువారీ కార్యక్రమాల్లో చర్మానికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడైనా చర్మం తెగినా, గాయపడ్డా డాక్టర్ సలహా మేరకు తగిన యాంటీబయాటిక్ క్రీమ్స్ వంటివి రాస్తూ, గాయాలు వేగంగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. పాదాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బాగా పొడిబారి పగుళ్లకు అవకాశం ఉండే మడమలు, అలాగే వేళ మధ్యభాగాలు తేమతో, ఆరోగ్యంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాధినిరోధక వ్యవస్థ చురుగ్గా ఉండేందుకు అన్ని పోషకాలూ, విటమిన్లు, మినరల్స్తో కూడిన మంచి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, తమ జబ్బులను అదుపులో పెట్టుకునేలా క్రమం తప్పకుండా మందులు వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చివరగా.. చలికాలంతో కొన్ని సౌకర్యాలున్నప్పటికీ.. దాంతోపాటు మరికొన్ని ఆరోగ్యసమస్యలనూ తీవ్రం చేసే సీజన్ అది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్మాన్నీ, దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకుంటే ఈ సీజన్ నిరపాయకరంగా గడిచిపొతుంది. ఇవి చదవండి: వింటర్లో ముఖం తేటగా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి! -
ఖాళీ కడుపుతో నారింజ తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బొంగురుపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. అయితే చలికాలంలో రోజూ పండ్లు తింటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదీ పుల్లటి నారింజ పండు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. అదెలాగో చూద్దామా.. అసలే చలికాలం కదా... నారింజ తింటే జలుబు వస్తుందనే భయంతో ఎక్కువ మంది తినడం లేదు. అయితే చలికాలంలో నారింజ పండ్లు తినడం చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. జలుబు–దగ్గు మొదలైన వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులలో కఫం ఉంటే నారింజ మీకు ఔషధం.శీతాకాలంలో నారింజ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శరీరం లోపల నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ రెండు నారింజలను తింటే, మీ రోజువారీ మోతాదుకు తగ్గ విటమిన్ సి లభిస్తుంది. ఫలితంగా శరీరం లోపల బలం పెరుగుతుంది. ఇది కాకుండా, నారింజలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ శరీరంలో మంట లేదా ఇన్ఫెక్షన్ వంటి వాటికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. నారింజ పండ్లను తినడం వల్ల ముఖం, ముఖంపై ఉండే మొటిమలు మాయమవుతాయి. ఇది శరీరాన్ని ఎక్కువసేపు తేమగా ఉంచుతుంది. ముఖంపై పగుళ్లు, పొడిబారడం వంటి సమస్యలను ఇది సరిచేస్తుంది. నారింజ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఇది మీ శరీరంలో ఎసిడిటీకి దారితీస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మధ్యాహ్నం పూట ఈ పండును తినడం మంచిది. అయితే మంచిది కదా అని రోజుకు రెండు పండ్ల కంటే ఎక్కువ తినకూడదు. అలా తినడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. -
చలికాలంలో నగ్నంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదట
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం మాత్రమే కాదు, నిద్ర కూడా అంత కంటే ఎక్కువే అవసరం. ఈ చలికాలంలో సాధారణం కంటే ఎక్కువ గంటలు నిద్రపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మందపాటి దుప్పటి ఉంటేనే హాయిగా నిద్రపడుతుంది. అయితే చలికాలంలో బట్టలు లేకుండా నగ్నంగా పడుకోవడం వల్ల మీ అందం మరింత రెట్టింపు అవుతుందని మీకు తెలుసా? దీనివల్ల అనేక చర్మ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చట. చలికి బట్టలు లేకుండా పడుకోవడమంటే చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ఈ కాలంలో నగ్నంగా నిద్రించడం వల్ల నిజంగానే అన్ని లాభాలున్నాయా చూసేద్దాం. ►శీతాకాలంలో వెచ్చదనాన్ని పొందడానికి పెద్ద పెద్ద దుప్పట్లను వేసుకొని నిద్రపోతుంటారు. అయితే వింటర్ సీజన్లో ఒంటిపై నూలిపోగు కూడా లేకుండా పడుకోవడం వల్ల బాగా నిద్రపట్టడంతో పాటు ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుందట. ► రాత్రిపూట బిగుతుగా ఉండే బట్టలు ధరించడం వల్ల చాలా మందిలో రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. దీని కారణంగా కొందరిలో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అదే నగ్నంగా నిద్రపోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ► నగ్నంగా నిద్రించడం వల్ల బాడీ టెంపరేచర్ను కూడా రెగ్యులేట్ చేస్తుందట. దీని వల్ల శరీరంలో అధిక చెమటను నివారించడంలో సహాయపడుతుంది ► వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాలను ఎదుర్కొనే శక్తి సహజంగానే శరీరం సంతరించుకుంటుందట. ► నగ్నంగా పడుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్, పోషకాల స్థాయిలు కూడా పెరుగుతాయి. దీనివల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుందట.అంతేకాకుండా ముడతలు, వృద్దాప్య సంకేతాలను నివారిస్తుంది. ► నిద్రలేమి సమస్యకు కూడా ఇది మంచి పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ► నగ్నంగా నిద్రించడం వల్ల మీరు ఎక్కువ కేలరీలను కూడా కరిగిస్తుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ► అంతేకాకుండా కొన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కూడా శరీరాన్ని కాపాడుతుంది. ► నగ్నంగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. -
ఇలా చేస్తే..కేవలం 24 గంటల్లో జలుబును తగ్గించుకోవచ్చు
జలుబు వచ్చిందంటే ఓ పట్టాన వదలదు. ఇప్పటివరకు జలుబును తగ్గించేందుకు ఎలాంటి ఇన్స్టంట్ మెడిసిన్స్ లేవు. కొందరికి వారం రోజుల్లో తగ్గితే, మరికొందరికి నెల రోజులైనా తగ్గదు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. పెద్దలకు ఏడాదిలో మూడు సార్లు, చిన్నపిల్లలకు అయితే ఏడాదిలో పది లేదా అంతకంటే ఎక్కువ సార్లు జలుబుతో బాధపడుతుంటారని ఓ అధ్యయనంలోవెల్లడైంది. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండానే ఇంట్లోనే దొరికే వస్తువులతో కేవలం 24 గంటల్లో జలుబుకు చెక్ పెట్టొచ్చు ఇలా.. ►ఏ కాలంలో అయినా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది చలికాలంలో సరిగా నీళ్లు తాగరు. ఇలా అస్సలు చేయకూడదు. జలుబు చేసినప్పుడు తేనెతో కలిపిన నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ► వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. పసుపులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి కోలుకోవడంలో ఉపయోగపడతాయి. ► తేనె, నిమ్మరసం వాడటం వల్ల జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఒక చెంచాడు నిమ్మరసం, రెండు చెంచాల తేనెను వేడి నీళ్లు లేదా వేడి పాలలో కలిపి తాగండి. ► అల్లం టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో మీరు అల్లం టీ తాగితే రిలీఫ్ గా ఉంటుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని అల్లం ముక్కలు తీసుకోని వాటిని నీటిలో లేదా పాలలో కలిపండి. తరువాత దాన్ని బాగా మరిగించి తాగండి. ► ఒక గ్లాసు నీళ్లలో పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు కలిపిన నీళ్లతో బాగా పుక్కిలిస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జింక్ లాజెంజెస్ అనే పెప్పర్మెంట్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి జలుబును చాలా త్వరగా తగ్గించగలవు. ఇందులో బెర్రీ, లెమన్.. ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అయితే మీరు యాంటీబయాటిక్స్ వాడితే మాత్రం తప్పకుండా డాక్టర్ను సంప్రదించి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, బాదం, చేపలు వంటి వాటిల్లోనూ జింక్ అధికంగా ఉంటుంది. జలుబులో వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ► బీట్రూట్ జ్యూస్లో డైటరీ నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరపు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. జలుబుతో బాధపడుతున్న 76మందిలో.. రోజుకు ఏడు కంటే ఎక్కువసార్లు బీట్రూట్ తాగిన వారిలో జలుబు లక్షణాలు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ► టాబ్లెట్లల కంటే నాజిల్ స్ప్రేలు మెరుగ్గా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి జలుబు తాలూకూ బాక్టీరియాను చంపి ఇన్స్టంట్ రిలీఫ్ ఇవ్వగలదు. వీటితో పాటు జలుబు అటాక్ అయినప్పుడు సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్లే తాగితే బెటర్. ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది విశ్రాంతి. ట్యబ్లెట్స్ వేసుకున్నా, హోమ్ రెమిడీలు ట్రై చేసినా సరైన విశ్రాంతి తీసుకున్నప్పుడే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. -
అందుకే ఆడవాళ్లకు ఎక్కువగా కీళ్లనొప్పులు.. తేలిగ్గా తీసుకోవద్దు
చలికాలం వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు,ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. చాలామందికి చలికాలంలో కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు చలికాలంలో కీళ్ల నొప్పుల నుండి, ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. చలికాలంలో వాతావరణంలోని చల్లదనానికి కీళ్లమధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్ కుచించుకుపోతుంది. చర్మం, కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే చాలామందికి చలికాలంలో కీళ్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లలో రక్తహీనత కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కీళ్ల నొప్పులను తేలిగ్గా తీసుకోకూడదు. చలికాలంలో వచ్చే సాధారణ కీళ్ల నొప్పులను తగ్గించడానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడదు. అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడుస్తుండాలి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ వ్యాయామాలు లాంటివి ఉపయోగపడతాయి. కీళ్ల అరుగుదల, కీళ్లవాతం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు చలికాలంలో డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. కీళ్లు మరీ వీక్గా ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు క్యాల్షియం, విటమిన్ డి మాత్రలు వేసుకోవచ్చు. ఇక వీటితో పాటు చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్–డి, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కీళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు మందపాటి బట్టలు వేసుకోవాలి. శరీరాన్ని చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్–డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మరీ మంచిది.చలికాలంలో మనకు తెలియకుండానే తక్కువ నీటిని తీసుకుంటాం కాబటి బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. దానివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అందువల్ల అది గుర్తుంచుకుని కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరం డీ హైడ్రేట్ కాకుండా తగినంత నీటిని తాగడం మంచిది. -
కేదార్నాథ్ ఆలయం మూసివేత
కశ్మీర్: హిమాలయాల్లోని కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు బుధవారం మూతపడ్డాయి. కేదార్నాథ్ ఆలయ తలుపులు ఉదయం 8:30 గంటలకు, యమునోత్రి తలుపులు 11:57 గంటలకు మూసివేయబడ్డాయి. విపరీతమైన చలిలో కూడా కేదార్నాథ్లో జరిగిన ముగింపు కార్యక్రమానికి 2,500 మందికి పైగా యాత్రికులు హాజరయ్యారని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. ఈ ఆలయం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. కేదార్నాథ్ సమీప ప్రాంతాలు ఇప్పటికే మంచుతో కప్పబడ్డాయి. కేదార్నాథ్ శివున్ని'పంచముఖి డోలీ' ఉఖిమత్లోని ఓంకారేశ్వర్ ఆలయానికి పూజారులు తీసుకువెళ్లారు. శీతాకాలం ముగిసేవరకు అక్కడే పూజలు నిర్వహించనున్నారు. శీతాకాలంలో 19.5 లక్షల మంది యాత్రికులు కేదార్నాథ్ను సందర్శించారని అధికారులు తెలిపారు. ఛార్దామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. శీతాకాలం ముగిసేవరకు ఉత్తరకాశీ జిల్లాలోని ఖర్సాలీ గ్రామంలోని ఖుషిమత్లో ఆరు నెలల పాటు పూజిస్తారు. భద్రినాథ్ దామ్ను కూడా నవంబర్ 18న మూసివేయనున్నారు. శీతాకాలంలో హిమాలయాల్లో తీవ్ర మంచు కారణంగా ఛార్దామ్ యాత్రను ప్రతి ఏడాది అక్టోబర్-నవంబర్లో నిలిపివేసి మళ్లీ ఏప్రిల్-మే నెలల్లో ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి -
చలికాలంలో వెచ్చగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
చలికాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చలి తీవ్రత పెరిగినప్పుడు గాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దరిచేరనీయకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు చాలామంది ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువే. చలికాలంలో వచ్చే వ్యాధులను నివారించడంలో ఆకుకూరలు చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల హెమోగ్లోబిన్ పెరగడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది. కాల్షియం స్థాయి ఎక్కువగా ఉండటంతో కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. పసుపు పాలు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపును వేసుకొని ప్రతిరోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి కావల్సిన వెచ్చదనాన్ని అందిస్తుంది. అజీర్ణం, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ గోల్డెన్ మిల్క్ను తీసుకోవాల్సిందే. హెర్బల్ గ్రీన్టీ తులసి, అల్లం, లెమన్గ్రాస్తో చేసిన హెర్బల్ గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు రెండుసార్లు ఈ హెర్బల్ టీని తాగితే చాలా మంచిది. నెయ్యి చలికాలంలో నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని పాలలో 3 స్పూన్ల నెయ్యిని కలుపుకుని తీసుకోవటం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. నెయ్యితో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరనియ్యవు. నువ్వులు ఈ సీజన్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెచ్చదనం కోసం నువ్వులను తీసుకోవాలి. నువ్వుల్లో వేడిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ దానిమ్మలో ఎర్ర రక్తకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. బెల్లం బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంతో పాటు శరీరంలో వేడిని పెంచుతుంది. వేరుశనగ ఇందులో విటమిన్ బీ 3, విటమిన్ ఈ వంటి కీలక పోషకాలు ఉంటాయి. మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండెకు మేలు చేస్తాయి. చర్మంలో తేమ శాతాన్ని పెంచే గుణం వేరుశనగలో ఉంటుంది. రాత్రి నానాబెట్టుకొని ఉదయాన్నే వీటిని తీసుకోవడం మంచిది. సిట్రస్ పండ్లు చలికాలంలో వీటిని తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జొన్నలు జొన్నల ద్వారా శరీరానికి పుష్కలమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో జొన్నతో చేసిన రొట్టెలు తింటే చాలా మంచిది. -
Hyderabad: ‘ముంపు’ పేరిట ముంచేస్తూ.. రూ. 37 కోట్ల పనుల్లో అక్రమాలెన్నో
సాక్షి, హైదరాబాద్: పూడికతీత పనుల నుంచి రోడ్ల పనుల దాకా అన్నింటా కుమ్మక్కవుతున్న జీహెచ్ఎంసీ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వానాకాలంలో ముంపుసమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేసిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్(ఎంఈటీ)లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. ఒకే రకమైన పనికి ఒక్కోచోట ఒక్కోరేటు ఉండగా, కొన్ని చోట్ల ఒక్క శాతం కంటే తక్కువకే కాంట్రాక్టర్లకు కేటాయించగా, కొన్ని చోట్ల 40 శాతానికి మించి లెస్కు పనులప్పగించారు. గత సంవత్సరం వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా వెంటనే తోడిపోయడానికి 326 టీమ్స్ ఏర్పాటు చేశారు. వాటిల్లో 160 స్టాటిక్ టీమ్స్ కాగా, మిగతావి మొబైల్ టీమ్స్. మైబైల్ టీమ్స్లో డీసీఎం, ట్రాక్టర్, టాటా ఏస్, జీప్ వంటి వాహనంతో పాటు నలుగురు కార్మికులుంటారని చెబుతున్నా, చాలా ప్రాంతాల్లో ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులనే పనులకు వినియోగించారు. ఉంచాల్సిన వాహనాల బదులుగా ఆటోలనుసైతం వినియోగించారు. ఇక కార్మికులకు ఇవ్వాల్సిన రేడియం జాకెట్లు, షూస్, రెయిన్కోట్లు, గొడుగులు, టార్చిలు వంటివి మాటలకే పరిమితమయ్యాయి. ఈ టీమ్స్ ఏర్పాటు పేరిట రూ. 37.42 కోట్ల పనులు చేశారు. కొందరు కాంట్రాక్టర్లే ఎక్కువచోట్ల పనులు పొందడం.. వాటిల్లో కొన్ని చోట్ల తక్కువలెస్కు టెండర్ దక్కించుకోగా, మరికొన్ని చోట్ల చాలా ఎక్కువ లెస్కు వేయడం అనుమానాలకు తావిస్తోంది. రూ. 14 లక్షల పని రూ.6 లక్షలకే .. ఒక కాంట్రాక్టు ఏజెన్సీ ఈ టీమ్స్ ఏర్పాటుకు సంబంధించి మలక్పేట సర్కిల్లో ఒక్కొ క్కటి రూ.14.20 లక్షల విలువైన రెండు పనులను దాదాపు రూ. 6.75 లక్షలకే చేసింది. అంటే ఎంత ఎక్కువ లెస్కు పనిచేసిందో అంచనా వేసుకోవచ్చు. అలాగే ఖైరతాబాద్ సర్కిల్లో ఒక కాంట్రాక్టర్ రూ.17.30 లక్షల విలువైన ఒక పనిని 48.58 శాతం లెస్తో, రూ.17.35 లక్షల విలువైన మరో పనిని 48.99 శాతం లెస్తో చేసేశారట. అలాగే ఫలక్నుమా సర్కిల్లో రూ.12.80 లక్షల విలువైన పనిని 48.01 శాతం లెస్తో, రూ.12.80 లక్షల విలువైన పనిని 47.99 శాతం లెస్తో పూర్తిచేశారు. ఇంత ఎక్కువ లెస్కు పనులు చేశారంటే, టీమ్లు అన్నివేళలా పని చేయకపోవడమైనా ఉండాలి. లేదా ఒకే యూనిట్ను(వాహనం,వర్కర్లు ) రెండు చోట్లా చూపి ఉండాలి. లేదా వర్కర్లను తగ్గించి ఉండాలి. ఈ ఉదాహరణలు కేవలం మచ్చుకు మాత్రమే. ఇలా అత్యధికంగా 40 శాతం, అంత కంటే ఎక్కువ లెస్తో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. ఒక్క శాతం లోపునే.. ఇక అత్యల్పంగా ఒక్క శాతం కంటే తక్కువ లెస్తోనే పనులు చేసిన వారు సైతం ఉన్నారు. హయత్నగర్ సర్కిల్లో రూ.13 లక్షల విలువైన పనిని చాంద్రాయణగుట్ట సర్కిల్లో రూ. 15 లక్షల విలువైన పనిని కేవలం ఒక్కశాతం కంటే తక్కువ లెస్కే చేశారు. రూ. 10 కోట్ల అవినీతి..? వీటిని చూస్తుంటే కొన్ని సర్కిళ్లలో అధికారులు అంచనా వ్యయం అత్యధికంగా వేసి కాంట్రాక్టర్లతో ఎక్కువ లెస్ వేయించారా? లేక పనులు మేం చూసుకుంటాంలే అని పనులు చేయకున్నా బిల్లులు చెల్లిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సర్కిళ్లలో అంచనా వ్యయం రూ.20 లక్షలుంటే కొన్ని సర్కిళ్లలో కోటిరూపాయల వరకుంది. వాహనాలు ఎక్కడైనా ఒకటే. సిబ్బంది సంఖ్యలో తేడా ఉంటే అంచనా వ్యయంలో ఆమేరకు కొంత తేడా ఉండవచ్చుకానీ రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటానికి కారణం సంబంధిత ఇంజినీర్లకే తెలియాలి. ఇంజినీర్లు, కాంట్రాక్టరు కుమ్మక్కై జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొట్టడానికి వారి ఇంజినీరింగ్ ప్రతిభాపాటవాలు ప్రదర్శించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడులా కొందరు స్థానిక కార్పొరేటర్లకు సైతం వాటాలంది ఉంటాయని జీహెచ్ఎంసీ వ్యవహారాలు తెలిసిన వారు చెబుతున్నారు. ఈ ముంపు పరిష్కార పనుల్లో దాదాపు రూ. 10 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.. అవకతవకలపై ఫిర్యాదులున్నాయని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు. కొందరికే ఎక్కువ పనులు.. ∙కొందరు కాంట్రాక్టర్లు ఎక్కువ పనులు దక్కించుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. ఎల్బీనగర్ జోన్లోని ఉప్పల్,హయత్నగర్ రెండు సర్కిళ్ల పనులు చేసిన ఒక కాంట్రాక్టర్ ఒక చోట 7.25 శాతం లెస్తో చేయగా, మరోచోట 29.09 లెస్తో చేశారు. అంటే ఒక చోట తగ్గించింది మరోచోట పూడ్చుకున్నారన్న మాట. ఇదే కాంట్రాక్టర్ అల్వాల్, మల్కాజిగిరి సర్కిళ్లలోనూ చేశారు. అక్కడ మాత్రం కేవలం 0.09 శాతం, 0.56 శాతం లెస్కు మాత్రమే చేయడం విశేషం. ►అదే జోన్లో ఇద్దరు కాంట్రాక్టర్లు హయత్నగర్, ఎల్బీనగర్ రెండు సర్కిళ్లలోనూ , మరో కాంట్రాక్టర్ ఉప్పల్, సరూర్నగర్ రెండు సర్కిళ్లలో పనులు చేశారు. హయత్నగర్, ఎల్బీనగర్ సర్కిళ్లలో పనులు చేసిన ఒక కాంట్రాక్టరే కూకట్పల్లి, అల్వాల్, రాజేంద్రనగర్,బేగంపేట సర్కిళ్లలోనూ పనిచేశారు. ►చందానగర్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలోని ఆరు పనుల్లో నాలుగింటిని ఒక్క కాంట్రాక్టరే చేశారు. మరో కాంట్రాక్టర్ జూబ్లీహిల్స్తోపాటు కార్వాన్, గోషామహల్లోనూ పనులు చేశారు. ► గోషామహల్లోని కాంట్రాక్టర్ మూడు పనుల్ని 45 శాతం లెస్కు చేశారు. ►రాజేంద్రనగర్లోని పనులన్నింటినీ రెండు సంస్థలే దక్కించుకున్నాయి. ►ఇలా చెప్పుకుంటూ పోతే మాన్సూన్ ఎమర్జెన్సీటీమ్స్ పేరిట జరిగిన మాయాజాలానికి అంతే లేదు. -
TS: చలి తీవ్రత.. బడి ‘వణికిపోతోంది’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి విద్యార్థులు వణికిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గత నాలుగు రోజులుగా విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. హాజరయ్యే విద్యార్థులు కూడా ఏదో ఒక సీజనల్ వ్యాధితో బాధపడుతున్నారని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. కొన్ని బడుల్లో కనీస హాజరు శాతం కూడా ఉండటం లేదని, దీంతో బోధన చేపట్టలేకపోతున్నారని చెప్పా యి. అనేకచోట్ల టీచర్లు కూడా చలి ప్రభావానికి లోనవుతున్నారు. మూడు రోజులుగా దాదాపు 3 వేల మంది టీచర్లు సీజనల్ వ్యాధితో సెలవు పెట్టినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పాఠశాలల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, తరగతి గదిలో వెచ్చదనం లేకపోవడంతో విద్యార్థులు గజగజ వణికిపోతున్నట్టు విద్యాశాఖాధికారులు చెప్పారు. అంతటా అనారోగ్యం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో సోమవారం 45 శాతం హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మంగళవారం ఇది 35 శాతానికి తగ్గింది. స్కూల్కు రాని ప్రతీ విద్యార్థి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. విద్యార్థుల్లో జలుబు, దగ్గు, జ్వరం, నీరసం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ జిల్లా విద్యాశాఖాధికారి చెప్పారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, ములుగు, నల్లమలకు అనుకుని ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎండ కూడా రావడం లేదు. దీంతో శరీర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి, విద్యార్థులు శ్వాస సమస్యలకు లోనవుతున్నట్టు అధికారులు చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లల్లోని విద్యార్థులు చాలా వరకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. హాస్టళ్లకు కిటీకీలు లేకపోవడం, పడుకునే నేల మంచును తలపించేలా ఉండటంతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదే క్రమంలో చలికి స్నానం చేసే పరిస్థితి ఉండటం లేదని, దీంతో చర్మవ్యాధులూ సోకుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇది కీలక సమయమే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులొచ్చాయి. దీనికి అనుగుణంగా పిల్లల శరీరం ఇప్పటికిప్పుడు అలవాటు పడే అవకాశం ఉండదు. ఇలాంటి సీజ న్లలో వారిలో వ్యాధి నిరోధక శక్తి అంత చురుకుగా పనిచేయదు. ఫలితంగా చలి తీవ్రతకు జలుబు, జ్వరం వంటి వ్యాధులతో నీరసపడే ప్రమాదం ఉంది. చల్లదనానికి నీళ్లు ఎక్కువగా తీసుకోనందున డీ హైడ్రేషన్ సమస్యలూ ఉంటాయి. మరో వారంపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్న స్కూల్కు పంపకపోవడమే మంచిది. దీనివల్ల ఇతర విద్యార్థులకు వైరస్ సోకకుండా నియంత్రించవచ్చు. విద్యార్థుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఆకు కూరలు, ఇంట్లో చేసిన వంటలు ఎక్కువగా ఇవ్వాలి. గోరు వెచ్చని నీరు తాగించాలి. – డాక్టర్ ఎస్.కవిత, పిల్లల వైద్య నిపుణురాలు, నిలోఫర్ ఆసుపత్రి ముందే సెలవులివ్వాలి.. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గింది. చలికాలం ఇబ్బంది పెడుతోంది. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సెలవులు ఇచ్చారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండే పాఠశాలల్లో ఈ తర హా ఆలోచన చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. ఈ దిశగా వైద్యరంగం తోడ్పా టు తీసుకోవాలి. సంక్రాంతి సెలవుల తర్వాత కూడా సీజనల్ వ్యాధుల బారిన పడే పిల్లల వల్ల వైరస్ మరింత వ్యాప్తి జరగకుండా చూడాలి. – జి సదానందంగౌడ్, ఎస్టీయూటీఎస్, రాష్ట్ర అధ్యక్షుడు -
వణుకుతున్న ఉత్తరాది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వరుసగా నాలుగో రోజూ శీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఆదివారం అత్యల్పంగా 1.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత రెండేళ్లలో జనవరిలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండీ తెలిపింది. హరియాణాలోని హిస్సార్లో 1.4 డిగ్రీలు, రాజస్తాన్లోని చురులో మైనస్ 0.5 డిగ్రీలు, పిలానీలో 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశ ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు 480కి పైగా రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. 335 రైళ్లు ఆలస్యం కాగా, 88 రైళ్లను రద్దు చేసి, మరో 33 రైళ్ల ప్రయాణాలను కుదించినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పొగమంచు కారణంగా ఆదివారం ఉదయం 25 విమానాలు ఆలస్యంగా నడిచాయని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ట్వీట్ చేసింది. ప్రయాణికులు అప్డేట్ చేసే విమానాల రాకపోకల సమాచారాన్ని సరి చూసుకోవాలని కోరింది. పొగమంచు కారణంగా పంజాబ్లోని భటిండా, యూపీలోని ఆగ్రాల్లో ఆదివారం దృగ్గోచరత 25 మీటర్లకు, అమృత్సర్, లూథియానా, వారణాసి తదితర నగరాల్లో 50 మీటర్లకు దృగ్గోచరత పడిపోయిందని ఐఎండీ పేర్కొంది. అతి శీతల వాతావరణం కారణంగా ఢిల్లీలో శుక్రవారం రికార్డు స్థాయిలో 5,526 మెగావాట్ల విద్యుత్ను వినియోగించారు. ప్రజలు సాధ్యమైనంత మేర ఇళ్లలోనే ఉండిపోవాలని ఐఎండీ సూచించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతానికి ఐఎండీ ఆరంజ్ అలెర్ట్ ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని అంచనా వేసింది. -
Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను (Bomb Cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, తుఫాన్లు, మంచు ధాటికి మంగళవారం కూడా దేశమంతా అతలాకుతలమైంది. 4,000 పై చిలుకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 60 దాటింది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే కనీసం 30 మంది దాకా చనిపోయారు. ఇక్కడి బఫెలో కౌంటీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎటు చూసినా కనీసం 50 అంగుళాల మేర మంచు పరుచుకుపోయింది. 1880ల తర్వాత ఈ ప్రాంతం ఈ స్థాయిలో హిమపాతాన్ని చూడటం ఇదే తొలిసారి! నిత్యావసరాల కొరత పలుచోట్ల లూటీలకు కూడా దారితీస్తోంది. అయితే గత ఆరు రోజులతో పోలిస్తే మంగళవారం పరిస్థితి కాస్త మెరుగైందని, పలు ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. న్యూయార్క్ రాష్ట్రంలోని ఎల్మ్వుడ్లో మంచుమయమైన రహదారి పొంచి ఉన్న వరద ముప్పు ఉష్ణోగ్రతలు పెరిగితే ఇప్పటిదాకా పేరుకుపోయిన అపారమైన మంచు ఒక్కసారిగా కరిగి ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ముప్పు చాలా ఎక్కువని పేర్కొంది. దాంతో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని ఇప్పట్నుంచే సిద్ధం చేస్తున్నారు. -
వణుకు ఆయనకు రావట్లే.. యాత్ర గురించి చెప్పినప్పుడల్లా మీకు వస్తోంది..!
వణుకు ఆయనకు రావట్లే.. యాత్ర గురించి చెప్పినప్పుడల్లా మీకు వస్తోంది..! -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 20 రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ/శ్రీనగర్: ఢిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. మంచు కారణంగా 20 వరకు రైళ్లు 1.30 గంటల నుంచి 4.30 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీలోని పాలం, సఫ్దర్జంగ్ విమానాశ్రయాల్లో 200 మీటర్ల దూరం పైబడి ఉన్న వస్తువులు కనిపించలేదని పేర్కొంది. జమ్మూకశ్మీర్లో 40 రోజులపాటు కొనసాగే తీవ్రమైన శీతాకాల సీజన్ ‘చిల్లా–ఇ–కలాన్’ప్రభావం గురువారం కనిపించింది. లోయలోని చాలా ప్రాంతాల్లో మంచి నీటి పైపులు, దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టుకుపోయాయి. బుధవారం రాత్రి శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రత –5.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. ఈ సీజన్లో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి –4.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపుల్లో ఒకటైన పహల్గాంలో అత్యల్పంగా –6.8 డిగ్రీలు, గుల్మార్గ్లో –5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం లేదా తేలిక పాటి మంచు కురియవచ్చని ఐఎండీ అంచనా వేసింది. డిసెంబర్ 21న మొదలైన ఈ చిల్లా–ఇ–కలాన్ సీజన్ జనవరి 30వ తేదీ వరకు ఉంటుంది. -
పెరగనున్న చలి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి బలంగా గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో చలి తీవ్రత కాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని, గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని స్పష్టం చేసింది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 13.1 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. -
చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..!
చలికాలంలో చాలా ముప్పులు ΄పొంచి ఉంటాయి. దెబ్బ చిన్నగా తగిలినా నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. అలర్జీలు కనిపిస్తాయి. చర్మం ΄పొడిబారి పగులుతుంటుంది. కీళ్లనొప్పులు పెరుగుతాయి. నిజానికివన్నీ చాలా చిన్న సమస్యలు. కానీ చాలా పెద్ద సమస్య... అందునా మెదడుకు సంబంధించిన ముప్పు ఒకటి ΄పొంచి ఉంటుంది. అదే మెదడుకు కలిగే రిస్క్. దాని పేరే ‘సెరెబ్రో వాస్కులార్ యాక్సిడెంట్’, సంక్షిప్తంగా దీన్ని ‘సీవీఏ’గా చెబుతారు. సెరిబ్రో వాస్కులార్ యాక్సిడెంట్ (సీవీఏ) అంటే ఏమిటి, అదెందుకు వస్తుంది, దాని వల్ల వచ్చే అనర్థాలు, దాని నివారణ వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. చలికాలంలో కొన్ని సమస్యలు బాగా పెరుగుతాయి. ఉదాహరణకు వాతావరణంలో తేమ తగ్గడం... చర్మం నుంచి ఆ తేమను వాతావరణం లాక్కోవడంతో చర్మం పగుళ్లు, అలర్జీలు ఎక్కువ. అలాగే చలి కారణంగా చర్మం ఉపరితలంలో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణ తగ్గడం (వాసో కన్స్ట్రిక్షన్) మాత్రమే కాదు... చర్మంలో ఉండే నాడీ కణాలు బాగా ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో చిన్న చిన్న దెబ్బలకు సైతం నొప్పి తీవ్రంగా తెలుస్తుంటుంది. ఇవన్నీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టని మామూలు సమస్యలు. కానీ సెరెబ్రో వాస్కులార్ యాక్సిడెంట్స్ అనే ముప్పు వల్ల మాత్రం పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్), మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్) వంటి తీవ్రమైన సమస్యలు వచ్చి అరుదుగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకూ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. సెరెబ్రో–వాస్కులార్ యాక్సిడెంట్స్ ఎందుకంటే...? ముందుగా చెప్పుకున్నట్లుగా వాతావరణంలో తేమ (హ్యుమిడిటీ) తగ్గిపోవడంతో దాన్ని భర్తీ చేసుకునేందుకు పర్యావరణం మన దేహాల్లోని తేమను లాగేస్తుంది. (ఈ కారణంగానే చర్మం΄పొడిబారినట్లుగా కనిపించడం, గీరితే చారలు పడటం వంటివి సంభవిస్తాయి). అంతేకాదు వాతావరణం చల్లగా ఉండటంతో నీళ్లు తాగడమూ తగ్గిపోతుంది. ఇంకా సాయంత్రాలు, రాత్రుళ్లు, తెల్లవారుఝామున బాగా చల్లగా ఉండటంతో రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. ఇది మెదడులో రక్తస్రావానికి (బ్రెయిన్ హెమరేజ్)కి కారణం కావచ్చు. ఇక శీతకాలం బాగా చల్లగా ఉండటం వల్ల మనం నీళ్లు తాగడం బాగా తగ్గిపోతుంది. దాంతో రక్తం పలుచగా కాకుండా, చిక్కగా మారడంతో΄ాటు రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్) పెరుగుతాయి. ఫలితంగా ఈ క్లాట్స్ రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్), మరికొన్ని సార్లు మెదడులో కీలకమైన భాగాలకు రక్తం అందక పక్షవాతం రావచ్చు. (ఇవే క్లాట్స్ గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో వస్తే గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంటుంది). ముప్పును మరింత పెంచే అంశాలు... దీనికి తోడు ‘సీవీఏ’ ప్రమాదాన్ని మరింత పెంచడానికి కొన్ని అంశాలు దోహదం చేస్తాయి. అవి... డయాబెటిస్, హైబీపీ, హై కొలెస్ట్రాల్, మూత్రపిండాల జబ్బులు, ΄పొగతాగే అలవాటు వంటివి ఈ ముప్పును మరింత పెంచే అంశాలని చెప్పవచ్చు. రెండు రకాలుగా ‘సీవీఏ’ అనర్థాలు... మెదడులో ఏయే ప్రాంతాల్లో, ఏ రకంగా అనర్థాలు ఏర్పడ్డాయనే అంశం ఆధారంగా ‘సీవీఏ’ని రెండు రకాలుగా చెప్పవచ్చు. మెదడులో రక్తస్రావమైతే దాన్ని ఇంట్రాసెరెబ్రల్ హేమరేజ్ (ఐసీహెచ్) అని, మెదడులోని రక్తనాళాల్లో రక్తపు ఉండలు ఏర్పడటం వల్ల పక్షవాతం వస్తే దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని అంటారు. నివారణ / చికిత్స : ఇంతటి ప్రాణాపాయం తెచ్చిపెట్టే ఈ ‘సీవీఏ’కు నివారణ చాలా తేలిక. ఈ సీజన్లో అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది నీళ్లు బాగా తాగుతూ ఉండటమే. దీనివల్ల దేహానికి హైడ్రేషన్ సమకూరుతుంది. వాటితో ΄ాటు... ∙గదిలో వెచ్చని వాతావరణంలో ఉండటం (ఒంటిని వెచ్చగా ఉంచుకోవడం) ∙సమయానికి టాబ్లెట్లు (డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్, గుండెజబ్బుకు వాడే మందులు) తీసుకోవడం ∙ పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడం ∙అన్ని పోషకాలు ఉన్న సమతులాహారం తీసుకోవడం ∙చక్కెరలు చాలా తక్కువగా తీసుకోవడం ∙ఉప్పు చాలా చాలా పరిమితంగా మాత్రమే వాడటం ∙క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్కు వెళ్తుండటం ∙మెదడుకు సంబంధించిన ఏ లక్షణం కనిపించినా తక్షణం హాస్పిటల్కు వెళ్లాలి. అక్కడ లక్షణాలను గమనించి, అవసరాన్ని బట్టి వైద్యులు తగిన చికిత్స అందిస్తారు. లక్షణాలు: తలలో తీవ్రమైన నొప్పి, వాంతులు∙ తల తిరగడం (డిజ్జీనెస్)∙ పూర్తిగా స్పృహ కోల్పోవడం. ఇవేగాక మరికొన్ని లక్షణాలను (బీఈఎఫ్ఏఎస్టీ) అనే ఇంగ్లిష్ అక్షరాల కలబోతతో ‘బీఫాస్ట్’ గా చెప్పవచ్చు. అంటే... ∙‘బీ’ ఫర్ బ్యాలెన్స్ అంటే సరిగ్గా నడవలేక బ్యాలెన్స్ కోల్పోవడం ∙‘ఈ’ ఫర్ ఐస్ (కళ్లు) అంటే కళ్లు మసకలు బారడం ∙‘ఎఫ్ ఫర్ ఫేస్ అంటే... ముఖంలో ఏదో ఒక వైపు జారిపోయినట్లుగా కావడం (పక్షవాతం లక్షణాల్లో ఒకటి) ∙‘ఏ’ ఫర్ ఆర్మ్స్ (భుజాలు) అంటే రెండు చేతుల్లో ఏదో ఒకటి బలహీనంగా మారడం పనిచేయకపోవడం ∙‘ఎస్’ ఫర్ స్పీచ్ అంటే మాట్లాడలేకపోవడం లేదా మాట ముద్దగా రావడం ∙‘టీ’ ఫర్ టైమ్ అంటే... అది ఆంబులెన్స్ అవసరమైన సమయం (టైమ్) అని అర్థం. -డా‘. ఎస్.పి.మాణిక్ ప్రభు సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ -
బాబోయ్ చలి.. ఈ డివైజ్ చేతుల్లో పట్టుకుంటే చాలు, క్షణాల్లో..
అసలే ఇది చలికాలం. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా పడిపోతుంటాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అరచేతులు చల్లబడిపోవడం అందరికీ ఎదురయ్యే సమస్యే! చేతులు వెచ్చబరచుకోవడానికి చలిమంటల ముందు కూర్చుంటుంటారు. పనుల మీద బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటే, చలిమంటల ముందు గంటల తరబడి కూర్చోవడం సాధ్యం కాదు కదా! ఈ ఆలోచనతోనే చేతులు వెచ్చగా ఉంచడానికి తగిన పరికరాన్ని అమెరికన్ కంపెనీ ‘ఒకూపా’ అందుబాటులోకి తెచ్చింది. ఇది రీచార్జబుల్ హ్యాండ్ వార్మర్. దీనిని చేతుల్లో పట్టుకుంటే చాలు, అరచేతులు క్షణాల్లోనే వెచ్చబడతాయి. అరచేతుల్లో పట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే, గ్లోవ్స్లో దీనిని పెట్టేసుకున్నా సరిపోతుంది. ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, దాదాపు ఆరుగంటల వరకు పనిచేస్తుంది. మోడల్స్ బట్టి దీని ధర 28.99 నుంచి 42.99 డాలర్ల వరకు (రూ.2389 నుంచి రూ.3543)వరకు ఉంటుంది. చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
వింటర్ జోరు: హీటింగ్ ఉత్పతుల హాట్ సేల్!
న్యూఢిల్లీ: వాటర్ హీటర్లు, గీజర్లు, రూమ్ హీటర్లు తదితర ఉత్పత్తుల అమ్మకాలు ప్రస్తుతం శీతాకాలంలో (వింటర్) జోరుగా ఉంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం అమ్మకాలకు దన్నుగా నిలవనుంది. రెండంకెల స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాలతో, కంపెనీలు ఇప్పటికే తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం గమనార్హం. వింటర్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కొత్త ఉత్పత్తులను కూడా మార్కెట్కు పరిచేయం చేస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతికతతో కూడిన గీజర్లను కూడా తీసుకొచ్చాయి. ట్యాంక్ రహిత ఇన్స్టంట్ వాటర్ హీటర్లను కూడా తీసుకొచ్చాయి. ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లతో కూడిన ఖరీదైన రూమ్ హీటర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. సామాన్య వినియోగదారుల నుంచి, సంపన్న వినియోగదారుల వరకు అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా.. సౌకర్యం, మన్నిక, డిజైన్లతో కూడిన ఉత్పత్తులను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) 20 శాతం వృద్ధిపై క్రాంప్టన్ కన్ను.. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (సీజీసీఈఎల్) అయితే, ఇన్స్టంట్, స్టోరేజ్ వాటర్ హీటర్ల అమ్మకాల్లో 20 శాతం మేర వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. గతేడాదితో పోలిస్తే రూమ్ హీటర్ల అమ్మకాల్లో 70 శాతం వృద్ధి ఉండొచ్చని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కంపెనీ ఏడు కొత్త మోడళ్లను పరిచయం చేసింది. సోలారియం క్యూబ్ ఐవోటీ సిరీస్, సోలారియం కేర్ సిరీస్ నుంచి ఈ ఉత్పత్తులు ఉన్నాయి. బేబీ కేర్, హెయిర్ కేర్, హైజీన్ కేర్ అనే ఫీచర్లు వీటిల్లో ఉన్నాయి. ఈ ఏడాది వాటర్ హీటర్ల మార్కెట్ సైజ్ 10 శాతం వృద్ధితో 42.5 లక్షలుగా ఉంటుందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజా తెలిపారు. రూమ్ హీటర్ల మార్కెట్ 40 లక్షల యూనిట్లు కాగా, ఈ ఏడాది వృద్ధి చలి తీవ్రతపై ఆధారపడి ఉంటుందన్నారు. ముందే సన్నద్ధం.. ‘‘వింటర్ సీజన్పైనే వ్యాపార వృద్ధి ఆధారపడి ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువైతే ఉత్పత్తులకు డిమాండ్ సహజంగానే అధికమవుతుంది. మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా సరఫరా కొరత ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ముందే తయారీ పరంగా తగినంత సన్నద్ధతతో ఉన్నాం’’అని బజాజ్ ఎలక్ట్రికల్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీవోవో రవీందర్ సింగ్ నేగి వెల్లడించారు. రూమ్ హీటర్ల విభాగంలో ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లు, కార్బన్ రూమ్ హీటర్లు, ఫ్యాన్ రూమ్ హీటర్లు, హాలోజెన్ రూమ్ హీటర్లు ఇలా అన్ని రకాల ఉత్పత్తులను తాము ఆఫర్ చేస్తున్నట్టు నేగి తెలిపారు. హింద్వేర్ హోమ్ ఇన్నోవేషన్ ఈ విభాగంలో గడిచిన రెండేళ్లుగా రెండంకెల వృద్ధిని చూస్తున్నట్టు కంపెనీ సీఈవో రాకేశ్ కౌల్ చెప్పారు. ఈ ఏడాది 20 వరకు వాటర్ హీటర్, రూమ్ హీటర్ మోడళ్లను విడుదల చేయడం ద్వారా తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించినట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అమ్మకాల్లో 30 శాతం వృద్ధి కనిపించినట్టు చెప్పారు. (సామాన్యుడికి ఊరట: 11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం) -
చలికాలం వచ్చేసింది.. నిశ్శబ్దంగా వెచ్చదనం ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకం
అసలే చలికాలం వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో చలి మరీ వణికించేస్తుంది. అతిగా చలి వణికించే ప్రాంతాల్లో చలి నుంచి రక్షణ కోసం జనాలు రూమ్హీటర్లను వాడుతుంటారు. వీటి వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది. పైగా వీటి నుంచి వెలువడే సన్నని రొద సరిగా నిద్రపట్టనివ్వదు. అలాంటి ఇబ్బందులేవీ లేని అధునాతన పోర్టబుల్ రూమ్ హీటర్ను రష్యన్ బహుళ జాతి సంస్థ ‘బల్లూ గ్రూప్’ అందుబాటులోకి తెచ్చింది. ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ‘అపోలో బల్లు కన్వెక్షన్ హీటర్’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ 1500 వాట్ల రూమ్ హీటర్ను తేలికగా ఎక్కడికైనా తీసుకుపోయిన కోరుకున్న చోటు అమర్చుకోవచ్చు. సాధారణ రూమ్ హీటర్లతో పోలిస్తే, ఇది వినియోగించుకునే విద్యుత్తు దాదాపు సగానికి సగం తక్కువ. మూడువందల చదరపు అడుగుల గదిని ఇది వెచ్చగా ఉంచగలదు. ఇందులో 24 గంటల టైమర్ కూడా ఉంది. గదిలో ఎంతసేపు వెచ్చదనం కావాలో ఈ టైమర్లో సెట్ చేసుకోవచ్చు కూడా. దీని ధర 179.99 డాలర్లు (సుమారు రూ.15 వేలు) మాత్రమే! చదవండి: సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు! -
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా
-
Fashion: ఈవెనింగ్ పార్టీల్లో ఫ్లోరల్ డిజైనర్ వేర్తో మెరిసిపోండిలా!
Winter Fashion: వింటర్ సీజన్ ఈవెనింగ్ పార్టీలతో బ్రైట్గా వెలిగిపోతుంది. గెట్ టు గెదర్ కాన్సెప్ట్స్ గెట్ రెడీ అంటుంటాయి. ఇలాంటప్పుడు నలుగురు కలిసే చోట న్యూ లుక్తో కనిపించాలని కోరుకుంటుంది నవతరం. ఇండో–వెస్టర్న్ లుక్తో అట్రాక్ట్ చేయాలనుకుంటుంది. వారి అభిరుచులకు తగినట్టు డిజైన్ చేసిన డ్రెస్సులు ఇవి... ఈ డ్రెస్సులన్నీ దాదాపుగా ఫ్లోరల్ కాన్సెప్ట్గా డిజైన్ చేశాం. ప్లెయిన్ శాటిన్, రా సిల్క్, జార్జెట్, ఆర్గంజా మెటీరియల్ని డ్రెస్ డిజైనింగ్లో వాడాం. ఫ్లోరల్ డిజైన్ కోసం హ్యాండ్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశాం. ఇండోవెస్ట్రన్ లుక్కి పలాజో, ధోతీ, లాంగ్ ఫ్రాక్స్, లెహంగా మోడల్స్ తీసుకున్నాం. – తరుణి శ్రీగిరి , ఫ్యాషన్ డిజైనర్ చదవండి: Aishwarya Lekshmi: పెళ్లి కూతురి కలెక్షన్స్కు పెట్టింది పేరు ఈ బ్రాండ్! ఐశ్వర్య ధరించిన డ్రెస్ ధర ఎంతంటే! Winter Sweater Trendy Designs: శీతాకాలం.. ఆధునికతకు అద్దం పట్టేలా ఊలుదారాల అల్లికలు -
చంపుతున్న చలి.. గుండె జబ్బులున్నవారు వాకింగ్ చేస్తున్నారా!
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దినదినం రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వణికించే చలి కారణంగా వ్యాధులు చుట్టుముట్టే అవకాశముంది. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులున్నవారికి ప్రమాదం పొంచి ఉంది. ఉదయం, రాత్రివేళలో బయటకు వెళ్తే చర్మం పొడి బారి బిగుసుగా మారనుంది. కాళ్ల మడిమలు, పాదాలు పగులుతాయి. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి అధిగవిుంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ సంరక్షణ ఇలా.. చలికాలంలో శరీరానికి మాయిశ్చరైజర్లు తప్పనిసరి. క్రీమ్ టేస్ట్ మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. చలికి పెదాలు పగిలి రక్తం కారకుండా వ్యాజిలిన్, లిప్బామ్ రాసుకోవాలి. చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండేందుకు గ్లిజరిన్ సబ్బులు వాడాలి. స్నానానికి ముందు ఆలీవ్ ఆయిల్, కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఖర్చు తగ్గించుకోవాలనుకునేవారు ఇంట్లోనే అందుబాటులో ఉండే శనగపిండితో స్నానం చేయాలి. వివిధ పనుల కోసం బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా ఉన్ని దస్తులు ధరించాలి. బైక్పై వెళ్లేవారు మంకీ క్యాప్, కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌస్లు వాడాలి. ఎండకు వెళ్లాలనుకుంటే సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. రాత్రివేళ నిద్రించే ముందు మోచేతులు, మోకాళ్లు పగలకుండా నూనె, లేపనం రాసుకుంటే మంచిది. థైరాయిడ్ తరహా సమస్యలున్నవారు పైజాగ్రత్తలతో పాటు ఇంట్లో సాక్స్లు ధరించడం మేలు. దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం ఉంటే ఇంటి వ ద్దనే విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. మధుమేహం, గుండెజబ్బులున్నవారు శరీరంపై గీతలు పడకుండా జాగ్రత్తపడాలి. చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. పాదాలు పగిలితే.. చలికాలంలో చాలామందికి పాదాలు పగులుతాయి. ఉప్పునీరు కలిసిన గోరు వెచ్చని నీటిలో పది నిమిషాల పాటు పాదాలు ఉంచాలి. ఆ తర్వాత సబ్బుతో శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్ రాయాలి. విటమిన్–ఈ క్రీమ్ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలు పాటించాలి. అస్తమా ఉంటే.. చలికాలంలో అస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను అందుబాటులో ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. గాలికి తిరగవద్దు. డాక్టర్ సలహా మేరకు మందులు, ఇన్హేలర్, నెబ్యులైజర్ లాంటివి వాడాలి. గుండె జబ్బులుంటే.. చలికాలంలో గుండెజబ్బులున్న వారు, గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ చేయవద్దు. చలిలో ఎక్కువగా తిరిగితే రక్త నాళాలు సంకోచించి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్ ఉన్న వారు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఆహారంలో మార్పులు అవసరం చలికాలంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా జామ, దానిమ్మ, బొప్పాయి, సంత్ర, అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ‘సీ’ ఉన్న పండ్లు జలుబు, ఫ్లూ వంటి జబ్బుల నుంచి కాపాడుతాయి. మరీ పచ్చిగా ఉన్నవి, బాగా పండినవి కాకుండా మధ్యస్తంగా ఉన్న పండ్లు ఎంపిక చేసుకోవాలి. చలికాలంలో సహజంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, వంటివి త్వరగా వస్తాయి. ఆహారం అరుగుదల తక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషి శరీరానికి యాంటీ యాసిడ్స్ ఎంతో అవసరం. గుడ్లు, చేపల్లో ఇవి అధికంగా లభిస్తాయి. జింక్ ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. రోగకారక క్రిములతో పోరాడే పెరుగును తీసుకోవడం ఉత్తమం. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. మార్కెట్లో లభిస్తున్న నల్లద్రాక్ష చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. వీటిలో విటమిన్ ఏ, బీ1, బీ2 ఉంటాయి. పిల్లల్లో కడుపునొప్పికి నివారణిగా పని చేస్తాయి. జాగ్రత్తలు తప్పనిసరి చలికాలంలో శరీరానికి వేడిచేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అల్కహాలి క్ పానీయాలను స్వీకరించొద్దు. పొడి దుస్తులను ధరించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా చూడాలి. సూర్యోదయం తర్వాతే జాగింగ్, వ్యా యామం చేయాలి. ఏదైన ఆరోగ్య సమ స్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – రత్నాకర్, జనరల్ ఫిజీషియన్, నిర్మల్ జిల్లా ఆస్పత్రి -
తెలంగాణను వణికిస్తున్న చలి.. అతితక్కువ కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పతనమవుతున్నాయి. సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో అతితక్కువగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రామలక్ష్మణ్పల్లిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదిలాబాద్లో 9.2, మెదక్లో 10 డిగ్రీల సెల్సీయస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 31.6 డిగ్రీల సెల్సీయస్గా రికార్డయ్యింది. సాధారణంగా ఈ సమయంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న మూడురోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
Telangana: చలి.. చలి!
సాక్షి, హైదరాబాద్: చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పతనమవుతున్నాయి. నాలుగైదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం నాటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో 33.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 11 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. చాలాచోట్ల సాధా రణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదు కావడం రాష్ట్రంలో చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది. రా నున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని, తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతటా తక్కువే.. ప్రస్తుతం సీజన్లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధా రణ కనిష్ట ఉష్ణోగ్రతలతో పోలిస్తే గురు వారం హన్మకొండలో 4.4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. మెదక్లో 4.9 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్లో 3.5 డిగ్రీల సెల్సియస్, నల్లగొండలో 3.3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిజామాబాద్, అదిలాబాద్, రామగుండంలోనూ సాధారణం కంటే రెండు డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. జాగ్రత్తగా ఉండాలి.. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తు లో వేగంగా గాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు ఈశాన్య దిశల నుంచి వచ్చే గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. దూర ప్రయాణాలు చేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, హృద్రోగులు, గర్భిణులు, చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. -
తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
-
గడ్డ కట్టే చలి..బైక్ స్టార్ట్ అవ్వడం లేదా..! అయితే ఈ జాగ్రత్తలను పాటించండి..!
చలికాలం వచ్చిందంటే చాలు.. అటు ఆరోగ్య, చర్మ సమస్యలతో పాటు.. ఇతర సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. పైగా గత కొద్ది రోజుల నుంచి చలి మరింత తీవ్రమైంది. ఈ సీజన్ లో పొద్దున్నే లేచి ఏదైనా పని కోసం బయటకు వెళ్లాలని బైక్ స్టార్ట్ చేస్తే తొందరగా స్టార్ట్ కాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ గడ్డ కట్టే చలిలో మీరు తీసుకున్న జాగ్రత్తలను మీ బైక్స్కు కూడా అందిస్తే పలు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తోంది. ఈ జాగ్రత్తలను పాటిస్తే మీ బైక్ మొరాయించకుండా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. ► మీ బైక్ను కవర్తో కప్పేయండి తీవ్రమైన చలిని తట్టుకోవడం కోసం మీరు ఎలాగైతే స్వెటర్లు, జాకెట్లు ధరిస్తారో మీ మోటార్సైకిల్కు కవర్తో కప్పేయడం తప్పనిసరి. బయట పార్క్ చేసి ఉంటే కవర్తో కచ్చితంగా కప్పేయాలి. బైక్ ఎప్పుడూ తేమ లేకుండా ఉండేందుకు వాటర్ రిపెల్లెంట్ స్ప్రేస్ వాడితే బైక్ ఎప్పుడూ తేమ లేకుండా ఉంటాయి. ► టైర్ల పట్ల అదనపు జాగ్రత్త అవసరం శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు టైర్ ఒత్తిడిలో తగ్గుదలకి కారణమవుతాయి. కాబట్టి, మీరు బైక్ను రోడ్డుపైకి తీసుకెళ్లినప్పుడల్లా టైర్ ప్రెజర్ని చెక్ చేస్తూ ఉండాలి. ► బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోండి ఆధునిక సీల్డ్ డ్రై బ్యాటరీలకు ఛార్జింగ్ తప్ప మరే ఇతర నిర్వహణ అవసరం లేదు. అయితే, పాత బ్యాటరీలకు కొన్ని అదనపు జాగ్రత్తలు అవసరం వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ఉష్ణోగ్రత బ్యాటరీ స్నిగ్ధతను పెంచుతుంది. దీంతో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా బైక్ ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది.దాంతో పాటుగా బ్యాటరీ టెర్మినల్స్ శుభ్రంగా ఉండేలా తనిఖీ చేయాలి. ► ఆయిల్ చేంజ్ చాలా ముఖ్యం పాత ఇంజిన్ ఆయిల్ బైక్ ఇంజిన్ను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, నిర్ణీత సమయంలో ఎప్పటికప్పుడు ఆయిల్ మార్చడం మంచింది. ► స్పార్క్ ప్లగ్ చెక్ చేయండి బైక్ అసలు స్టార్ట్ కాకపోతే వెంటనే ఒకసారి స్పార్క్ ప్లగ్ తీసి శుభ్రం చేయాలి. బైక్ను స్టార్ట్ చేసేటప్పుడు చోక్ ఆన్ చేసి స్టార్ట్ చేస్తే వెంటనే స్టార్ట్ అవుతుంది. ► చైన్, ఇతర కదిలే భాగాలను లూబ్రికేట్ చేయండి చైన్, ఇతర కదిలే భాగాలు మీ బైక్ లూబ్రికేషన్ సాఫీగా నడిచేలా చేస్తోంది. చలికాలంలో సరైనా లుబ్రికేషన్ లేకపోవడంతో బైక్లోని పలు భాగాలు తుప్పు పట్టే అవకాశం లేకపోలేదు. ► వర్క్ ఫ్రమ్ హోంతో ఆఫీసులకు వెళ్లే పని అంతగా లేదు. దీంతో ఎక్కువగా బైక్ను బయటకు తీసే పని ఉండకపోవచ్చును. బైక్ను మూలన పడేయకుండా బైక్ను రెండు మూడు రోజుల కొకసారి ఆన్ చేస్తూ ఉండడం ఉత్తమం. చదవండి: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఓలా ఎలక్ట్రిక్ కారు..! -
సీజనల్ వ్యాధులు.. కిచెన్ ఫార్మసీతో చెక్ పెట్టండి
ఈ సీజన్ పిల్లలకు పరీక్ష కాలమనే చెప్పాలి. స్కూలు పరీక్షల కంటే ముందు వాతావరణం సీజనల్ టెస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జలుబు, దగ్గు, వాటి తీవ్రత పెరిగితే ఒళ్లు వెచ్చబడడం తరచూ పలకరించే సమస్యలే. ఏది ఒమిక్రాన్ జలుబో తెలియని ఆందోళన కాలం. అందుకే కిచెన్ ఫార్మసీని సిద్ధంగా ఉంచుకోవాలి. ►జలుబు తగ్గాలంటే.. నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. చిన్నారులకు ఆ ఆవిరిని పట్టిస్తే జలుబుతోపాటు దగ్గు తీవ్రత కూడా తగ్గుతుంది. ►పసుపు యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు రోజుకు రెండుసార్లు తాగించాలి. ►జలుబుతోపాటు గొంతునొప్పి ఉంటే... గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు కలిపి, ఆ నీటితో గార్గిలింగ్ చేయాలి. నొప్పి తీవ్రతను బట్టి రోజుకు రెండు – మూడు సార్లు చేయవచ్చు. ►పదేళ్లు నిండిన పిల్లలకు ముక్కులు బ్లాక్ అయిపోయి గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపి 10–15 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ►ఆరోగ్య సమస్య వచ్చిందంటే పిల్లలకు జీర్ణశక్తి మందగిస్తుంది. ఆహారం సరిగా తీసుకోలేకపోతారు. ఈ కారణంగా నీరసం దరి చేరకుండా ఉండాలంటే... రోజులో రెండు– మూడు సార్లు తేనె చప్పరించాలి. ►జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు గాలిపీలుస్తుంటే ఊపిరితిత్తుల నుంచి గుర్...మనే శబ్దం వస్తుంది. అప్పుడు ఛాతీ మీద ఆవనూనె, వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. అలాగే దేహంలో నీటిశాతాన్ని తగ్గనివ్వకుండా ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. -
చలికాలంలో ‘ఫన్నీ’ స్నానం.. వీడియో వైరల్
శీతాకాలంలో సాధారణంగా స్నానం చేయడానికే ఇష్టపడరు కొంతమంది! పైగా చన్నీటి స్నానం అంటే ఆమడ దూరం పరిగెడతారు. అలాంటి చలికాలంలో చలిని తప్పించకుంటూ చన్నీటి స్నానం చేసే ట్రిక్కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకెళ్తే.. ఆ వీడియోలో ఒక వ్యక్తి నది లేదా చెరువులో స్నానం చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఆ వ్యక్తి చలిని తప్పించుకునే నిమిత్తం ముందు ఒక పెద్దప్లేటులో చలిమంట ఏర్పాటు చేసుకున్నాడు. నదిలో ఒక మునక వేస్తూ గజగజ వణికిపోతున్నాడు. మళ్లీ తన ముందున్న చలిమంట వైపు చేతులు చాచి చలి కాచుకుంటూ మళ్లీ ఇంకో మునక.. ఇలా ఫన్నీ ఫన్నీగా స్నానం చేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోకి ‘మై ఇండియా ఈజ్ గ్రేట్... ప్రామిసింగ్ ఇండియా’ అనే క్యాప్షన్ని జోడించి మరీ ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ‘ఇది చన్నీటి ట్రిక్’ అని ఒకరు, మరోకరేమో ‘భారతీయులను ట్రిక్స్లో ఎవరూ ఓడించలేరు’ అంటూ రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. Mera Bharat Mahaan.....☺️😊 होनहार भारत.....☺️☺️😊😊😊😊 pic.twitter.com/Ixnq5H1YY3 — Rupin Sharma (@rupin1992) January 11, 2022 (చదవండి: సెల్ఫీలతో మిలీనియర్ అయిన స్టూడెంట్.. ఎలా ఎదిగాడో తెలుసా?) -
Feet Care Tips: విటమిన్ ‘ఈ’ క్యాప్య్సూల్స్తో ఇలా అందంగా..
Winter Feet Care Tips: కొందరికి పాదాలు విపరీతంగా పగిలి చూడటానికి వికారంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు శరీరం తట్టుకోగలిగినంత వేడినీళ్లల్లో కొన్ని చుక్కల షాంపూ, కొద్దిగా నిమ్మరసం, టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ నీళ్లలో పాదాలను ఉంచి, పదినిమిషాల తరువాత పమిస్ స్టోన్ లేదా పాత టూత్ బ్రష్ తీసుకుని పాదాలనుంచి అరికాళ్ల దాకా నెమ్మదిగా రుద్ది కడగాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. కడిగిన పాదాలను తడిలేకుండా శుభ్రంగా తుడవాలి. తెల్లగా ఉండే టూత్ పేస్టును అర టేబుల్ స్పూను తీసుకుని దానిలో రెండు విటమిన్ ఈ క్యాప్య్సూల్స్లోని మిశ్రమాన్ని వేసి రెండింటిని బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని పగుళ్లపై రాసి సున్నితంగా మర్దనా చేయాలి. తరువాత సాక్సులు వేసుకుని పడుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గి పువ్వుల్లా మృదువుగా ముద్దుగా తయారవుతాయి. చదవండి: Legs Swelling Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే... -
హలో గురూ.. జర జాగ్రత్త! అంతా తెలుసు అని కొట్టిపడేయొద్దు.. చిట్కాలివిగో..
చలి తీవ్రతకు జనం గజగజ వణుకుతున్నారు. ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. చలిలో సైతం కొందరు మైదానాల్లో జాగింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ కాలంలో అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణుల సలహాలు, సూచనలు మీకోసం. ఆస్తమా, అలర్జీ ప్రమాదంపొంచి ఉంది చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఆస్తమా, అలర్జీ ఉన్నవారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఎప్పుడూ వెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరే తాగాలి. చలికి దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ఎప్పటికప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. దాని వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఆస్తమా రోగులు ఆయాసానికి గురి కాకుండా ఉంటారు. మంచి పోషకాలు ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నందున వృద్ధులు, పిల్లలు, గర్భిణులు అసలే బయటికి రావద్దు. రెండు రోజులకు మించి దగ్గు, జలుబు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ రవిప్రసాద్, ఎండీ, పలమనాలజిస్టు , నల్లగొండ చదవండి: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల చర్మ వ్యాధులు ఉన్నవారు చలికాలం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో చర్మం పొడిబారి పోతుంది. చర్మ వ్యాధులు కూడా ఎక్కువవుతాయి. ఈసారి చలి మరింత ఎక్కువగా ఉన్నందున సోరియాసిస్ ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సోరియాసిస్ వ్యాధి చలికి తీవ్రమవుతుంది. ఒల్లంతా పొలుసుల మాదిరిగా మారుతుంది. శరీరంలో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కువైతే శరీరం, కాళ్లు పగిలినట్లు అవుతాయి. పెద్ద వయస్సువారు, పుట్టుకతోనే పొడి చర్మం ఉండేవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. పెదాలు, కాళ్లు కూడా పగులుతుంటాయి. కొందరిలో చలికి తల వెంట్రుకలు రాలిపోతుంటాయి. గాయాలైనా కూడా మానని పరిస్థితి. దురద కూడా ఎక్కువగా ఉంటుంది. చర్మవ్యాధి పెరిగి కొందరిలో శరీరం, కాళ్లు, పగిలిపోతాయి. అలాంటివారు వైద్యులను సంప్రదించాలి. చదవండి: 2021 గుణపాఠాలు.. ఇప్పుడైనా కొత్త నిర్ణయాలు తీసుకుందామా.. చర్మం పొడిబారకుండా కొబ్బరి నూనె మంచిది చలికాలం ఆయిల్ శాతం ఎక్కువగా ఉన్న సబ్బులను వాడాలి. గ్లిజరిన్తో తయారు చేసిన సబ్బులను వాడడం వల్ల చర్మం వాడిపోకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు మ్యాయిశ్చరైజ్ క్రీమ్లను వాడుకోవాలి. అవి కొనుగోలు చేయలేనివారు కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. ఫ్యారాఫిన్ నూనె కూడా తక్కువ ధరలో ఉంటుంది. దాన్ని కూడా వాడొచ్చు. చలికాలం నీరు తక్కువగా తాగుతారు. దానివల్లన చర్మం పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా నీరు తాగాలి. సాధ్యమైనంత వరకు చిన్న చిట్కాలతో, ఎప్పటికప్పుడు ఆయిల్తో మాయిశ్చరైజ్ చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. – డాక్టర్ అనితారాణి, చర్మవ్యాధుల వైద్య నిపుణులు, నల్లగొండ చదవండి: అకస్మాత్తుగా వాంతి ,ఫిట్స్ రావడం జరుగుతుందా.. ఆలస్యం చేయకండి నీరు ఎక్కువ తాగాలి.. బయటి పదార్థాలు తినొద్దు వారం రోజులుగా చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చిన్న పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. చల్లటి గాలులు వీస్తుండడంతో చిన్నపిల్లలు దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. పెద్దలతో పోల్చితే చిన్నపిల్లల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల చలి కాలంలో పిల్లలను వెచ్చని ప్రదేశాల్లోనే ఉంచాలి. నెలలోపు పిల్లలకు చలిగాలి తగలకుండా దుప్పట్లు కప్పి ఉంచాలి. గదుల్లో ఫ్యాన్లు, ఏసీలు వేయొద్దు. నెలలు ఉన్న పిల్లలకు ఎప్పుడూ సాక్సులు, గ్లౌజ్లు, స్వెర్టర్లు వేయాలి. సంవత్సరం దాటిన పిల్లలకు కూడా స్వెర్టర్లు వేసి ఉంచాలి. చిన్నారుల చర్మం పొడి బారిపోకుండా మెత్తగా ఉంచుకునేలా క్రీమ్స్ రాయాలి. చల్లటి గాలికి జలుబు, దగ్గు వస్తుంది. పిల్లలను బయటికు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలపై తిప్పకపోవడమే మంచిది. ఎదిగిన పిల్లలకు మాస్క్ వాడాలి. పిల్లలకు వేడివేడిగా ఆహార పదార్థాలు పెట్టాలి. గోరువెచ్చని నీరు తాగించాలి. ఈ కాలంలో బయటి ఆహార పదార్థాలు తినకూడదు. శీతల పానియాలు తాపొద్దు. చాక్లెట్స్, ఐస్క్రీమ్స్ తినకుండా చూడాలి. –డాక్టర్ తేజావత్ విద్యాసాగర్ , సూర్యాపేట ‘షుగర్’ బాధితులూ.. జర జాగ్రత్త గతంలో ఎప్పుడూలేని విధంగా ఈసారి చలి తీవ్రత బాగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 10డిగ్రీల వరకు పడిపోతున్నాయి. చలి కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చలికి రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ బయటికి రావొద్దు. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే మాస్కు ధరించడంతోపాటు తగు జాగ్రతలు తీసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. గోరువెచ్చని నీరు తాగుతూ వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి. చలికి జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. రెండు రోజులు అవి తగ్గకపోతే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఒమిక్రాన్కు కూడా ఇవే లక్షణాలతోపాటు ఒల్లు నొప్పులు ఉంటున్నాయి. అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అప్పటి వరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటే మంచిది. షుగర్ వ్యాధికి, కీళ్ల నొప్పులు, స్టెరాయిడ్స్ వాడేవారు మరింత జాగ్రతగా ఉండాలి. ఈ రెండు నెలలపాటు చాలా జాగ్రత్తగా ఉండకపోతే చలి కారణంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పుదు. – డాక్టర్ విజయ్కుమార్, జనరల్ ఫిజీషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నల్లగొండ మెడికల్ కాలేజీ వ్యాయామం మరువొద్దు రామగిరి(నల్లగొండ) : చలికాలం వ్యాయామం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో వ్యాధిగ్రస్తుల్లో రక్త చిక్కబడే ప్రమాదం ఉంటుంది. దీంతో వారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేస్తుంటారు. ఈ కాలంలో మైదానాలన్నీ మార్నింగ్ వాకర్స్తో కిటకిటలాడుతుంటాయి. చిన్నా పెద్ద అని తారతమ్యం లేకుండా వృద్ధులు సైతం వ్యాయామం చేయాలి. -
Liquor Sales: ‘కిక్కెక్కిస్తున్న’ చలి!.. అమ్మకాలు అదుర్స్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. గత వారం, పది రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో చలి తీవ్రమైంది. దీంతో మద్యం ప్రియులు లిక్కర్ వినియోగాన్ని పెంచారు. కొత్త మద్యం పాలసీ ఆరంభంలోనే అమ్మకాలు పెరగడంతో మద్యం దుకాణాలు సైతం కళకళలాడుతున్నాయి. రెస్టారెంట్లు, బార్లలోనూ మద్యం వినియోగం పెరిగినట్లు ఆబ్కారీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే ఊపు న్యూ ఈయర్ జోష్ వరకు ఉంటుందని భావిస్తున్నారు. గతేడాది కోవిడ్ కారణంగా చాలా మంది కొత్త సంవత్సర వేడుకలకు దూరంగానే ఉన్నారు. పబ్బులు, బార్లు వెలవెలబోయాయి. కొద్ది రోజులుగా ఒమిక్రాన్ ఆందోళనలు నెలకొన్నప్పటికీ కోవిడ్ తీవ్రత అంతగా లేకపోవడంతో కొత్త సంవత్స వేడుకల సందర్భంగా మద్యం వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో ఇందుకు అనుగుణంగా టార్గెట్లపైన దృష్టి సారించే అవకాశం ఉంది. చలితో పాటే... గతంలో కోవిడ్ ఆంక్షల దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే మద్యం వినియోగించారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వినియోగం పెరిగింది. దానికి తోడు వారం, పది రోజులుగా పెరిగిన చలి వాతావరణం మందుబాబులను మరింత ఉత్సాహపరుస్తోంది. కొత్త మద్యం పాలసీ మేరకు గ్రేటర్లో 615 మద్యం దుకాణాలకు అను మతులనిచ్చిన సంగతి తెలిసిందే. నగరంలోని అన్ని చో ట్ల కొత్త దుకాణాల్లో పూర్తిస్థాయిలో అమ్మకాలు మొదలయ్యాయి. ఆరంభంలోనే లి క్కర్ సేల్స్ భారీగా పెరగడం పట్ల వైన్స్ నిర్వాహకులు సైతంసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..) 109 శాతం పెరిగిన విక్రయాలు గతేడాది డిసెంబర్తో పోల్చితే ఈ డిసెంబర్లో మద్యం అమ్మకాలు 109.29 శాతం పెరిగినట్లు ఎక్సైజ్శాఖ అంచనా. లిక్కర్కు పోటీగా బీర్ల అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. ఉదాహరణకు గత సంవత్సరం హైదరాబాద్–1 డిపో పరిధిలో 8.96 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరుగగా ఈ సారి 10.55 లక్షల కేసులకు పెరి గింది. అలాగే బీర్ల అమ్మకాలు గతేడాది 5.91 లక్షల కేసులు అయితే ఈ డిసెంబర్ నాటికి 8.58 లక్షల కేసులకు పెరిగాయి. గతేడాది కోవిడ్ కాలంలో బీర్ల వినియోగం తగ్గడం గమనార్హం. ఈ ఏడాది సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరిగి అమ్మకాలు పెరిగాయి. -
Winter Temperature Peaks: కోడి కూసినా తెల్లారట్లే..
సాక్షి, నెట్వర్క్: కోడి కూయకముందే నిద్ర లేచే ఊర్లు.. ఎండపొడ మొదలైనా మబ్బు వీడటం లేదు. ఉదయం తొమ్మిదైనా కమ్ముకునే ఉంటున్న పొగమంచుతో.. ఇంట్లో ఉన్నా వణికిస్తున్న చలితో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమేకాదు పగటివేళ కూడా చలిగా ఉం టోంది. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటే భయపడుతున్న పరిస్థితి. రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయిన నేపథ్యంలో ఊర్లలో పరిస్థితి, జనం ఇబ్బందులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం దాకా పలు జిల్లాల్లో పరిస్థితిని గమనించింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం.. పశువులకు ‘గోనె సంచుల’ రక్షణ ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతుండటంతో మనుషులతోపాటు పశువులు కూడా ఇబ్బందిపడుతున్నాయి. చలి నుంచి వాటిని రక్షించేందుకు యజమానులు ప్రయత్నిస్తున్నారు. అలా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామంలో ఓ రైతు తన పశువులకు ఇలా గోనె సంచులు, వస్త్రాలు కప్పాడు. మంచు దుప్పటిలో అర్లి (టి) ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాలు మంచు దుప్పటిలో మునిగిపోయాయి. ఉదయం పది గంటల వరకూ పొగ మంచు కమ్ముకునే ఉంటోంది. బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇక్కడి భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామంలో కమ్ముకున్న పొగమంచు ఇది. దీనితోపాటు బోథ్ మండలం సొనాల, బేల మండల కేంద్రంలోనూ ఇలాగే పొగమంచు కమ్ముకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ నడి ఇంట్లో చలి మంటలు గజగజా వణికిస్తున్న చలి నుంచి ఉపశమనం పొందేందుకు నడి ఇంట్లోనే చలి మంటలు వేసుకున్న వృద్ధులు వీరు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి)లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. 2018లో ఈ గ్రామంలో 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా.. గత ఏడాది 4 డిగ్రీలు నమోదైంది. ఈసారి మంగళవారం 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత వచ్చింది. మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉండనుండటంతో.. ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని అంచనా వేస్తున్నారు. – తాంసి, బేల 30 ఏళ్లకింద ఇలా చూశా.. ఈ చిత్రంలోని వృద్ధురాలు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన శాకపురం గంగమ్మ. రెండు, మూడు రోజులుగా చలి భయపెడుతోందన్న ఆమె.. ఎప్పుడో 30 ఏళ్ల కింద ఇంత చలిని చూశానని చెప్పింది. పగలు రాత్రి తేడా లేకుండా చెద్దరి కప్పుకుని ఉండాల్సి వస్తోందంది. – సారంగపూర్ (జగిత్యాల) సాక్షి, కామారెడ్డి/గాంధారి: ఈ చిత్రంలోని రైతు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణ్పల్లికి చెందిన చాకలి సాయిలు. రోజూ తెల్లవారుజామునే పొలం వద్దకు వెళ్లేవాడు. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ఎనిమిది గంటలు దాటాకే ఇంట్లోంచి బయటికి వెళ్తున్నానని చెప్పాడు. మళ్లీ సాయంత్రం చీకటిపడేలోపే ఇంటికి వచ్చేస్తున్నామని తెలిపాడు.‘‘పొద్దటిపూట పొలం కాడికి పోవాలంటెనే భయమవుతోంది. చేతులు తిమ్మిరి ఎక్కుతున్నయి. ఎండ పొడ వచ్చినా చలి వదుల్తలేదు. ప్రతీ ఏడాది చలి ఉంటుందిగానీ ఈసారి చాలా ఎక్కువ అనిపిస్తోంది. చాలా ఇబ్బంది అవుతోంది..’’ అని సాయిలు పేర్కొన్నాడు. దారి వెంట చలిమంటలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో చెరుకు కోతల సీజన్ నడుస్తోంది. రైతులు చెరుకును ఎడ్ల బండ్లపై ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. చలికి తట్టుకోలేక.. దారి మధ్యలో రెండు, మూడు కిలోమీటర్లకోసారి ఆగి చలిమంటలు వేసుకుంటూ ప్రయాణిస్తున్నారు. 15 ఏళ్లుగా చెరుకు తరలిస్తున్నామని, కానీ ఎన్నడూ ఇంతగా చలిని చూడలేదని చెరుకు కొట్టే కూలీ రాజునాయక్ వాపోయారు. వణుకుతూ.. రోడ్లూడుస్తూ.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాలలో బుధవారం ఉదయం చలికి గజగజా వణుకుతూ రోడ్లు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికులు వీరు. రోజూ తెల్లవారకముందే విధుల్లోకి రావాల్సిన పరిస్థితిలో చలికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సోనాలలో రెండు మూడు రోజులుగా సగటున 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. – బోథ్ చలి దరువు.. బతుకు బరువు బుధవారం ఉదయం ఎనిమిది దాటుతున్నా వణికిస్తున్న చలిలో నడుచుకుంటూ వెళుతున్న చిరు వ్యాపారులు ఓ వైపు.. చలికి తట్టుకోలేక చలి మం టలు వేసుకుని ఉపశమనం పొందు తున్న పశువుల కాపరులు మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరంలో కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల జిల్లా మరిన్ని రోజులు వణుకుడే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. చాలాచోట్ల సాధారణం కంటే ఐదారు డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడంతో చలి పెరుగుతోందని పేర్కొంది. రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 4.6 డిగ్రీల అతితక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 5.8, బేల, అర్లి(టి)లో 5.9, సిర్పూర్లో 6, కోహీర్లో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రకటించింది. మరో మూడు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. -
చలిపులితో పోరాటం!
దేశమంతా గజగజ వణుకుతోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా డిసెంబర్ నాటికే చలి పులి చేతికి చిక్కి, జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన శీతల గాలులతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తత్ఫలితంగా తలెత్తుతున్న అనారోగ్య పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. దేశరాజధానిని చలి గాలి బలంగా తాకింది. ఢిల్లీలో ఈ సీజన్లోకెల్లా అతి తక్కువ ఉష్ణోగ్రత (3.1 డిగ్రీలు) సోమవారం నమోదైంది. కొద్దిరోజులుగా శ్రీనగర్లో వరుసగా రెండు రాత్రుళ్ళు మైనస్ 6 డిగ్రీల సెంటీగ్రేడ్కు పడిపోయింది. రాజస్థాన్లోని చురూలో ఏకంగా మైనస్ 0.5 డిగ్రీలకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలు చలితో గడగడలాడుతున్నాయి. శీతల, అతి శీతల గాలుల గుప్పెట్లో ఉత్తర భారతావని ఉందని భారత వాతావరణ శాఖ శనివారం ప్రకటించింది. కొద్ది రోజుల పాటు బాధలు తప్పవని హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము – కాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్ – బాల్టిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లు ఇప్పటికే తీవ్రమైన చలి గాలుల్లో చిక్కుకున్నాయి. మార్గశిర, పుష్య మాసాల హేమంత ఋతువులో శీతల పవనాలు, హిమ శీకరాలు సాధారణమే. కానీ, ప్రకృతి కోపించినట్లు ఇంతలేసి చలి మాత్రం ఇటీవలి అసాధారణం. 1991 నుంచి 2019 మధ్య మూడు దశాబ్దాల్లో శీతల గాలులు విజృంభిస్తున్నాయనీ, గత రెండు దశాబ్దాల్లో 4,712 మంది చనిపోయారనీ అధికారిక లెక్క. మానవ తప్పిదాల వల్ల ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, శీతకాలంలో చలి – మూడూ దుర్భరస్థాయికి ఎగబాకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఆందోళనకర పరిణామం. ఉష్ణోగ్రతల్లోని భారీ మార్పులు వ్యవసాయం, పశుసంపద, జీవనోపాధి, పర్యావరణం, ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. సాక్షాత్తూ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఆ మాట చెప్పింది. వర్ధమాన దేశాల్లో ఏటా పెద్ద సంఖ్యలో మరణాలూ సంభవిస్తున్నాయి. ఉత్తర భారతావనిలో కొండ ప్రాంతాలు, వాటిని ఆనుకొన్న మైదానాలతో 17 రాష్ట్రాలలో ‘ప్రధానమైన శీతల గాలుల జోన్’ విస్తరించి ఉంది. దాదాపు 90.90 కోట్ల జనాభా ఈ జోన్లోనే జీవిస్తోంది. వీరిని బాధిస్తున్న శీతల గాలులపై ఎక్కడికక్కడ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేసుకొనేందుకు ‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ (ఎన్డీఎంఏ) ఈ ఏప్రిల్లో మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని ఎవరు, ఎంత వరకు ఆచరణలో పెట్టారో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే. కనిష్ఠ ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాల్లో 10 డిగ్రీల కన్నా తగ్గినా, పర్వత ప్రాంతాల్లో సున్నా డిగ్రీల కన్నా తగ్గినా అది ‘శీతల గాలి’ పరిస్థితి అని భారతీయ వాతావరణ శాఖ లెక్క. మరోలా చెప్పాలంటే, సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 నుంచి 6.4 డిగ్రీలు తగ్గితే – కోల్డ్ వేవ్. 6.4 డిగ్రీలకు మించి తగ్గితే, తీవ్రమైన కోల్డ్ వేవ్. దేశంలో అనేక చోట్ల ఇప్పుడీ పరిస్థితే ఉంది. తలదాచుకొనే గూడు, ఒంటి నిండా వస్త్రాలు లేని అధిక శాతం మందికి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ వైద్య సంస్థలో వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబాలు పడకలు ఖాళీ లేక, చలిలో రోడ్డు మీద తాత్కాలిక గుడారాలు వేసుకొని, కాలక్షేపం చేస్తున్న దయనీయ దృశ్యాలు జాతీయ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్ళుగా ప్రతి ఏటా దర్శనమిస్తున్న ఈ దృశ్యాలు ఈసారీ షరా మామూలు కావడం విషాదం. ప్రభుత్వాలు, పాలకుల పాత్ర ఇక్కడే కీలకం. తలదాచుకొనేందుకు నీడ లేని నిర్భాగ్యులను ఎముకలు కొరికే చలికి వదిలేయడం ఏ రకంగా చూసినా ధర్మం కాదు. నిజానికి, నిరాశ్రయులకు దేశంలో మరే నగరంలోనూ లేనన్ని షెల్టర్లున్నది దేశ రాజధానిలోనే! ఈసారి కూడా నిరాశ్రయులను చలి కోరల నుంచి కాపాడేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ నవంబర్లోనే యాక్షన్ ప్లాన్ను ప్రకటించింది. మొన్న నవంబర్ 7 నుంచి వచ్చే మార్చి 15 వరకు ఆ ప్లాన్ను అమలులో పెడతామంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న 206 షెల్టర్లలో 7092 మందికి ఆశ్రయమిచ్చే అవకాశం ఉంది. కొత్తగా మరో 2 వేల మందికి, 250 తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కార్ సంకల్పించింది. చాపలు, దుప్పట్లు, లాకర్లు, కాలకృత్యాలకు వసతులు – అన్నీ కల్పిస్తా మన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో అనేక లోటుపాట్లున్నట్టు జాతీయ మానవ హక్కుల సంఘం సహా అనేక ఎన్జీఓల పరిశీలనలో వెల్లడైంది. నిరాశ్రయుల సంఖ్యకు తగ్గట్టు షెల్టర్లు లేవు. ఉన్నవి కూడా దయనీయావస్థలో ఉన్నాయి. అవసరార్థులకు సమీప షెల్టర్ల సమాచారం చెప్పే పరిస్థితి లేదు. తెలిసి వెళ్ళినా, రాత్రి 8 గంటల వేళకే జనంతో నిండిపోతున్నాయి. చాలామందికి జాగా లేని దుఃస్థితి. దాదాపుగా దేశంలోని ప్రతి నగరంలోనూ నిర్భాగ్యులకు ఎదురవుతున్నది ఇలాంటి నిర్లక్ష్యమే! అసలు ఇలాంటి అభాగ్యులకు నిలువ నీడ కల్పించడానికి ‘జాతీయ పట్టణప్రాంత జీవనోపాధి ప్రణాళిక – పట్టణప్రాంత నిరాశ్రయులకు ఆవాసం’ పేరిట ఓ జాతీయ ప్రణాళిక ఉంది. సుప్రీమ్ కోర్టు మార్గదర్శకాల ప్రకారమైతే, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిరాశ్రయుల కోసం గౌరవప్రదమైన, శాశ్వత షెల్టర్లను నిర్మించడం చట్టప్రకారం విధాయకం. కానీ, స్థానిక, రాష్ట్ర సర్కార్లు ఏ మేరకు చొరవ చూపుతున్నాయి? ఇప్పటికైనా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రభుత్వాలు కాగితంపై ఉన్న కేంద్రీయ విధానాన్నీ, కోర్టు మార్గదర్శకాలనూ తు.చ. తప్పక కార్యాచరణలో పెట్టాలి. అప్పుడే ఈ చలి పులి పంజా విసురు నుంచి నిర్భాగ్యులు తప్పించుకోగలుగుతారు. -
మన్యం ‘స్నో’గసులు పోతుంది..!
Snowfall In Visakhapatnam In Winter Season: మన్యం అందాలకు పుట్టినిల్లు.. సొగసుల మెట్టినిల్లు..శీతాకాలం వచ్చిందంటే ‘స్నో’గసులు పోతుంది. మంచు తెరలు మనసును మీటుతాయి. వెండిమబ్బుల్లాంటి మేఘాలు నిత్యం హాయ్ అంటూ పలకరిస్తాయి. శీతాకాలం సీజన్ ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో ముందస్తు భోగి మంటలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా చలి మంటలు స్వాగతం పలుకుతున్నాయి. చలి తట్టుకోవటం ఎవరికైనా చాలా కష్టం. ఎంతటి వారైనా చలికి గజగజ వణికిపోవల్సిందే.. ఎందుకంటే మన శరీరం 25 నుంచి 35 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. అంతకన్నా ఉష్ణోగ్రత తగ్గితే శరీరం వణకడం మొదలుపెడుతుంది. విశాఖ మన్యంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 6 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటోంది. అయితే చలిని తట్టుకుని నిత్య జీవనం గిరిజనుల సొంతం. అంతటి చలిలోనూ మన్యం వేకువనే నిద్ర లేస్తోంది. పిల్లలు సైతం గంట కొట్టకముందే పాఠశాలకు చేరుకుంటున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అన్ని వర్గాల వారూ చలిగింతల మధ్య నిత్యజీవనం కొనసాగిస్తున్నారు. – పాడేరు చదవండి: బరితెగింపు: ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో తగ్గేదేలే! -
Winter Tips: వేళ్ల నొప్పులు బాధిస్తుంటే.. మనకు మనమే ఇలా చేసుకుంటే..
Health Tips: చలికాలంలో ఎదురయ్యే సమస్యల్లో కీళ్లు పట్టేయడం ఒకటి. అయితే తుంటికీళ్లు, మోకాళ్లు పట్టేసినప్పుడు మాత్రమే కీళ్ల సమస్యగా పరిగణిస్తుంటాం. అంతకంటే ముందే చేతివేళ్లు బిగుసుకుపోయి వేళ్ల నొప్పులు మొదలవుతుంటాయి. ఇది వయసుతో సంబంధం లేకుండా కాలానుగుణంగా జరిగే ప్రక్రియ. ఈ సీజన్లో అరచేతి నుంచి వేళ్ల వరకు ఉండే కనెక్టింగ్ టిష్యూలు మందబారడం, సంకోచించడం వల్ల కదలికలు నెమ్మదిస్తాయి. బలవంతంగా కదిలించే ప్రయత్నం చేసినప్పుడు నొప్పి కలుగుతుంది. ఈ నొప్పులకు స్వయంగా మనకు మనంగా చేసుకునే ఫిజికల్ థెరపీనే చక్కటి వైద్యం. ►అరచేతిని టేబుల్ మీద కానీ చదునుగా ఉన్న నేల మీద కానీ పెట్టి మెల్లగా వేళ్లను చాచాలి. ►కీళ్ల మీద మరీ ఒత్తిడి కలిగించకుండా అరచేతిని వీలయినంత వెడల్పుగా చేసి వేళ్లను ఒక వేలికి మరొక వేలిని దూరంగా వచ్చేటట్లు చేయాలి. ►ఈ స్థితిలో అరచేయి మొత్తాన్ని నేలకు ఆన్చడానికి ప్రయత్నించగలగాలి. ►నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు సాధ్యం కాదు, కానీ చేయగలిగినంత వరకు ప్రాక్టీస్ చేయాలి. అరచేతిని నేలకు ఆన్చిన స్థితిలో 30 నుంచి 60 సెకన్ల పాటు అలా ఉంచిన ►తర్వాత చేతిని మెల్లగా పిడికిలి బిగించి వదలాలి. రోజూ నాలుగైదు సార్లు ఇలా చేస్తుంటే వేళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పై ఎక్సర్సైజ్ చేయడానికి సాధ్యం కానప్పుడు గంటకోసారి పిడికిలిని గట్టిగా బిగించి ఒక్కో వేలిని తెరుస్తూ అన్ని వేళ్లనూ తెరవాలి. ►అలాగే ఒక్కో వేలిని ముడుస్తూ పిడికిలి బిగించి వదలాలి. ►మామూలు సీజనల్ నొప్పులతోపాటు డయాబెటిక్ న్యూరోపతి కండిషన్కు కూడా ఈ ఎక్సర్సైజ్ ఉపకరిస్తుంది. ►ఒకవేళ వేళ్ల నొప్పులకు కారణం ట్యూమర్లు, ప్రమాదవశాత్తూ గాయపడడం, ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
గాడిద పాలకు మంచి డిమాండ్.. కప్పు పాల ధర ఎంతంటే..
Health Benefits With Donkey Milk, Huge Demand in Telangana, Rates For A Cup సాక్షి, పాల్వంచ(ఖమ్మం): ప్రస్తుతం సమాజంలో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది. గాడిదపాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం చేస్తూ పాలను విక్రయిస్తున్నారు. గాడిద పాలు కూడా తాగే వారి సంఖ్య పెరగడంతో ఈ పాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. కరము పాలు గరిటడైనా చాలు అన్నట్లుగా.. గాడిద పాలు తాగితే పలు రకాల మొండి వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని గాడిద పాల విక్రయదారులు అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలీదు కానీ, గాడిద పాలను కూడా అనేక మంది కొనుగోలు చేసి తాగుతున్నారు. మంచిర్యాలకు చెందిన కొంతమంది యువకులు మూడు గాడిదలతో ప్రతి సంవత్సరం ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు పాల్వంచ పట్టణ, మండలంలో ఊరూరా తిరుగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. పాలు కావాలంటే ఇంటివద్దనే గాడిదపాలను పితికి అక్కడిక్కడే ఇస్తారు. అర టీ కప్పు గాడిద పాలు చిన్న పిల్లలకు రూ.150, పెద్దలకు ఒక టీ కప్పు రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ గాడిద పాల విక్రయదారులు రోజుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. గిరాకీ ఉంటే అంతో ఇంతో ఆదాయం లభిస్తుందని, అది కూడా గాడిద పాల గురించి తెలిసిన వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో రకరకాల ఆహార పదార్థాలు వచ్చాయని దీంతో గాడిద పాలకు కాస్తా గిరాకీ తగ్గిందంటున్నారు. దగ్గు, దమ్ము, ఆస్తమా, గురక వంటి వ్యాధులను గాడిద పాలు తాగితే పూర్తిగా తగ్గిపోతుందని, ఈ పాలల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయని నిర్వాహకులు ప్రచారం చేస్తూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. గిరాకీ తగ్గింది ఆవు, గేదె, మేక పాలకు ఉన్న గిరాకీ గాడిద పాలకు ఉండటం లేదు. అయితే గాడిద పాలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని తాగడం ద్వారా చిన్నారులకు, పెద్దలకు పలు రకాల వ్యాధులు నివారణ అవుతాయి. చాలామందికి ఈ పాల వలన అనేక రకాల మొండి వ్యాధులు తగ్గిపోయాయి. – ఇరుగుదిండ్ల లక్ష్మి, మంచిర్యాల చదవండి: భార్య ఉసురుతీసిన భర్త వివాహేతర బంధం -
చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..!
winter tips: డిసెంబర్లోకి అడుగుపెట్టాం. వాతావరణం మరికొన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలను తగ్గించుకుని మనల్ని పరీక్ష పెట్టే స్థాయులను పెంచుకుంటుంది. వార్ధక్యంలో ఉన్న వాళ్లను హైపోథెర్మియా కండిషన్కు నెట్టేస్తుంటుంది కూడా. హైపోథెర్మియా అంటే వాతావరణంలో చల్లదనానికి– మన దేహం ఉత్పత్తి చేసుకునే ఉష్ణోగ్రతకు మధ్య భారీ తేడా రావడం. బయటి ఉష్ణోగ్రతలు పడిపోయిన స్థాయికి దీటుగా దేహం ఉష్ణోగ్రతలను పెంచుకోలేకపోవడం వల్ల దేహం చల్లబడడం. ఇది మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాల్సిన అత్యంత ప్రమాదకర స్థితి. వార్ధక్యానికి పరీక్ష పెట్టే ఈ కాలంలో హైపోథెర్మియాతోపాటు కీళ్ల నొప్పులు కూడా ఎక్కువవుతాయి. బారోమెట్రిక్ ప్రెషర్లో వచ్చే మార్పుల వల్ల కీళ్ల దగ్గర ఉండే టిష్యూలు ఉబ్బుతాయి. దాంతో కీళ్ల వాపు, నొప్పి కలుగుతుంది. వీటి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను చెబుతున్నారు గుర్గావ్లోని మేదాంత– ద మెడిసిటీ వైద్యసంస్థలో ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సుశీలా కటారియా. ►నడక, తేలికపాటి యోగాసనాలను రోజూ ప్రాక్టీస్ చేయాలి. ఈ కాలంలో వాతావరణం ఉదయం, సాయంత్రం రెండు వేళల్లోనూ వాకింగ్కి పెద్దగా సహకరించకపోవచ్చు. అందుకే వాకింగ్కి పదకొండు గంటల సమయం మంచిది. అప్పటికి చలి తీవ్రత తగ్గుముఖం పట్టి సూర్యుడు నడినెత్తి మీదకు వస్తుంటాడు. మధ్యాహ్నం తర్వాత మాత్రమే సాధ్యమయ్యే వాళ్లు కూడా నాలుగు గంటల లోపు వాకింగ్ పూర్తి చేసుకోవాలి. కీళ్లు నొప్పిగా ఉన్నాయని నడకను వాయిదా వేస్తే నొప్పులు తగ్గవు. సరికదా క్రమేపీ కీళ్లను కదిలించడం కూడా కష్టమవుతుంది. కాబట్టి నడిచి తీరాల్సిందే. నడకతో నొప్పులు మాయమవుతాయని మర్చిపోకూడదు. అరగంట నుంచి గంట సేపు సూర్య కిరణాలు దేహాన్ని తాకేటట్లు చూసుకుంటే పైన చెప్పుకున్న సమస్యలను దూరంగా ఉంచవచ్చు. ►దేహంలో నీటి శాతం తగ్గకుండా ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఒక పెద్ద కప్పు వెజిటబుల్ సూప్, ఈ సీజన్లో దొరికే కమలాల వంటి తాజా పళ్ల రసం ఒక పెద్ద గ్లాసు తీసుకోవాలి. అలాగే రోజుకు ఒకసారి మిరియాల టీ లేదా తులసి టీ తాగితే జలుబు, దగ్గు దరి చేరవు. ►సీనియర్ సిటిజెన్ కూడా చంటిబిడ్డలతో సమానమే. కాబట్టి పెద్దవాళ్లు ఉన్న ఇంట్లో రూమ్ హీటర్ కూడా ఉంటే మంచిది. ఈ కాలంలో చర్మం పగుళ్లుబారడం మామూలు వాళ్లకంటే అరవై ఐదు దాటిన వాళ్లలో ఎక్కువ. కాబట్టి పాదాలకు సాక్స్ ధరించడం శ్రేయస్కరం. వారానికి ఒకటి –రెండు సార్లు గోరువెచ్చటి ఆయిల్తో దేహానికి మసాజ్ చేసుకోవాలి. ►ధూమపానం, మద్యపానం అలవాటున్న వాళ్లు ఈ సీజన్లో అసంకల్పితంగానే మోతాదు పెంచేస్తుంటారు. నిజానికి ఈ సీజన్లో వాటిని పూర్తిగా మానేయాలి లేదా తగ్గించాలి. ►కాలేయ సమస్యలున్న వాళ్లు ఈ కాలంలో మాంసం వంటి వాటికి బదులు తేలికగా జీర్ణమయ్యే చేపలను తీసుకోవడం మంచిది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు, ఉడికించిన గుడ్డు ఒకటి లేదా రెండు తీసుకోవాలి. ►దేహం చురుగ్గా ఉండడానికి తీసుకోవాల్సిన పై జాగ్రత్తలోపాటు మెదడు చురుగ్గా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అందుకే సుడోకు, పదశోధనలు పరిష్కరించడంతోపాటు చెస్, అష్టాచెమ్మా వంటి ఏదో ఒక ఆటలతో కాలక్షేపం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చలికాలానికి భయపడాల్సిన పని లేదు, ఆ చలికే సవాల్గా మారవచ్చు. చదవండి: ఇండియన్ షకీరా! -
Health Tips: అలర్జీలు, ఆస్తమాను తగ్గించే ఆహారాలు ఇవే! టొమాటో, బ్రాకలీ ఇంకా
Winter Season: Asthma Diet Tips By Doctor What To Eat In Telugu: చలికాలం వచ్చిందంటే చాలు.. అలర్జీ, ఆస్తమా బెడద ఎక్కువవుతుంది. నిజానికి ఆస్తమా, అలర్జీ ఈ రెండూ వేర్వేరు కాదు. ఆస్తమా అన్నది కూడా అలర్జీ తాలూకు ఒక రకమైన వ్యక్తీకరణ అని చెప్పవచ్చు. మనకు ఏదైనా మనకు సరిపడని పదార్థం లోనికి ప్రవేశిస్తే... దాన్ని ఎదుర్కొనేందుకు మన వ్యాధి నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా స్పందించడం. కొందరిలో ఈ ప్రతిస్పందన చాలా ఎక్కువ! ఈ క్రమంలో ఒక్కోసారి... దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్నే ‘అలర్జీ’ అంటారు. మరి చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమా... తీవ్రతను తగ్గించే ఆహారాలు, వంట ప్రక్రియల గురించి తెలుసుకుందాం! అలర్జీ.... ఆస్తమాగా ఎప్పుడు మారుతుందంటే...? అలర్జీతో తొలుత ఏమవుతుందో అర్థం చేసుకోడానికి కళ్లను ఉదాహరణగా తీసుకుందాం. కళ్లలో దుమ్ముపడితే ఎర్రబారి, నీళ్లుకారినట్టుగా... నులుముకోవాలన్నంత దురదలాంటి ఫీలింగ్ వచ్చినట్లుగానే... సాధారణంగా అలర్జీ కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉన్న అప్పర్ ఎయిర్వేలోనూ అక్కడి సున్నితమైన ప్రాంతాలు ఎర్రబారతాయి. స్రావాలు వెలువడతాయి. ముక్కు , కళ్లు ఎరుపెక్కడం, దురద, మంట పెట్టడం వంటివి కనిపిస్తాయి. ముక్కు, దాని పరిసరాలూ, శ్వాస వ్యవస్థలో పైభాగానికి మాత్రమే అలర్జీ పరిమితమైనప్పుడు దాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా చెబుతారు. అదే అలర్జీ తీవ్రతరమై లోవర్ ఎయిర్వేస్తో పాటు ఊపిరితిత్తులూ, గాలిగదులు ఎర్రబారడం... గాలి పీల్చుకునే నాళాలు (బ్రాంకై) వాచి, బాగా సన్నబారిపోయి శ్వాసతీసుకోవడం కష్టం అయ్యే సమస్యను ‘ఆస్తమా’ అంటారు. కొందరిలో ఊపిరి అందని ఆయాసపడే స్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే... అది ‘ఎనైఫిలాక్సిస్’’ అనే ప్రమాదకరమైన స్థితికి దారి తీయవచ్చు. అప్పుడు ఆస్తమాకు గురైన వారి శరీరం నీలంగా మారిపోయి, వారు స్పృహ కోల్పోయే పరిస్థితి రావచ్చు. అలర్జీ / ఆస్తమా చికిత్స : ►అలర్జీ అయినా, ఆస్తమా అయినా దాన్ని ప్రేరేపించే ‘అలర్జెన్స్’కూ, ‘ఇరిటెంట్స్’కు దూరంగా ఉండటం మేలు. అలర్జీకి చికిత్సగా మందులు వాడాల్సి వస్తే... దాని తీవ్రతను తగ్గించేందుకు యాంటీ హిస్టమైన్స్, మాంటెలుకాస్ట్ లాంటి మందులు వాడతారు. ఇక ఆస్తమాను నివారించేందుకు ‘ప్రివెంటార్స్’ అనే ఇన్హేలర్లూ, ఆస్తమా వచ్చిన సమయంలో దాన్ని అరికట్టే ‘రిలీవర్స్’ అనే ఇన్హేలర్లు వాడటం తెలిసిందే. కొందరు ఈ ఇన్హేలర్స్ హానికరం అనుకుంటారుగానీ అవి పూర్తిగా సురక్షితమైనవి. ►ముందస్తు నివారణ కోసం నెబ్యులైజర్లలాంటి పీల్చే చికిత్స (ఇన్హెలేషన్ థెరపీ) కూడా చేస్తుంటారు. నేసల్ స్ప్రేలూ అందుబాటులో ఉన్నాయి. అవి బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి, గాలి తేలికగా లోపలికీ, బయటకూ వెళ్లేలా చేస్తాయి. ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్లో వచ్చిన ఇన్ఫ్లమేషన్ను తగ్గించే యాంటీ హిస్టమైన్ వంటి మందుల్ని వాడతారు. ►అలర్జీల విషయానికి వస్తే ‘అలర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ’ (సిట్) చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి తోడు అలర్జీ సమయంలో బాధితుల దేహంలో వెలువడే జీవరసాయనాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగతమైన మందులు అంటే ‘హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ’ల పరిశోధనలూ విజయవంతమయ్యాయి. అయితే వాటి ప్రభావాలు అందరి విషయంలో ఒకేలా ఉండకపోవచ్చు. అయితే అవి తీవ్రమైన ఆస్తమాతో బాధపడే కొందరిపైన ప్రభావపూర్వకంగానే పనిచేస్తాయి. అలర్జీలు / ఆస్తమాను తగ్గించే ఆహారాలు ►టొమాటో ►కాలీఫ్లవర్ ►బెల్పెప్పర్స్ ►బ్రాకలీ ►కివీ ఫ్రూట్స్, ►స్ట్రాబెర్రీలు ►అయితే నిమ్మజాతి పండ్లు సాధారణ వ్యక్తుల్లో అలర్జీలను తగ్గించి, ఆస్తమా వంటి వాటిని ఎదుర్కొనేలా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అయితే కొందరికి నిమ్మజాతి పండ్లలో ఉండే పులుపుతోనే అలర్జీ వస్తుంది. అదే ఆస్తమాను ప్రేరేపిస్తుంది. అలాంటివారు మాత్రం నిమ్మజాతి పండ్లకు దూరంగా ఉండాలి లేదా చాలా పరిమితంగా తీసుకోవాలి. అలర్జీలు / ఆస్తమాను తగ్గించే వంట ప్రక్రియలు ఆయిలీ ఫుడ్స్, నూనెలో బాగా వేయించే వేపుళ్లు (డీప్ ఫ్రైడ్, రోస్టెడ్) పదార్థాలు, మసాలాలు చాలా ఎక్కువగా ఉపయోగించి చేసే ఆహారపదార్థాలు చాలామందిలో అలర్జీ కలిగించడం కంటే ఆస్తమాను నేరుగా ప్రేరేపిస్తాయి. అందుకే ఉప్పు, మసాలాలూ, నూనెలు తక్కువగా ఉండేలాగా... అలాగే వేపుళ్లు కాకుండా ఉడికించి వండేవాటితో అలర్జీలు/ ఆస్తమాను చాలావరకు నివారించవచ్చు. --డాక్టర్ రఘుకాంత్..సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ -
చలికాలం సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాక్షి, తూర్పుగోదావది: జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నా సాయంత్రం 6 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల దారి పడుతుండడం ఇందుకు నిదర్శనం. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు డెంగీ, మలేరియా, చికెన్గున్యా బారిన పడుతున్నారు. గతంలో ఊపిరితిత్తులు, ఆస్తమా ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న వారికి చలి తీవ్రత కారణంగా ఎక్కువ అవుతోంది. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో పాటు అల్పపీడన ప్రభావాలతో ఈ ఏడాది నవంబర్ రెండోవారం నుంచి నమోదు అవుతున్న తక్కువ ఉష్ణోగ్రతలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ చలికాలంలో సీజనల్ వ్యాధులతో పాటు ఆయాసం, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం జాగింగ్, వాకింగ్కు వెళ్లే వారి చర్మం పొడిబారి బిరుసుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీటితో పాటు కాళ్ల మడమలు, పెదాలు పగలడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న పిల్లలపై చలి ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వివిధ రుగ్మతలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో వ్యాధులు బారిన పడకుండా రక్షించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. గ్లిజరన్ సబ్బుల వాడకం మేలు చలికాలంలో చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండడానికి గ్లిజరిన్ సబ్బుల వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుని తలస్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడి బారుతుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. పాదాలు పగిలే ప్రమాదం చలికాలంలో పాదాలు పగలడం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటిలో పాదాలను పది నిమిషాలు ఉంచాలి. నీటిలో ఉంచిన తరువాత సబ్బుతో కడుక్కుని పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్ రాయాలి. విటమిన్–ఈ క్రీమ్ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలను పాటించాలి. చిన్నారుల పట్ల జాగ్రత్తలు చలికాలంలో చిన్నారులకు చలి నుంచి రక్షణకు స్వెటర్లను తొడిగించాలి. వేడి నీటితో స్నానం చేయించాలి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. చలికాలంలో రాత్రి వేళ తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేవారు. పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు ఉన్ని దుస్తులు ధరించాలి. బ్రాండెడ్ దుస్తులు అయితే మంచిది. బైక్పై వెళ్లేవారు మంకీక్యాప్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజ్లు ధరించాలి. ఆస్తమా ఉంటే.. చలికాలంలో ఆస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. చల్లని గాలిలో తిరగవద్దు. శ్వాస నాళాలు మూసుకుపోకుండా వైద్యుడి సలహా మేరకు మందులు వాడాలి. ఇన్హేలర్, నెబ్యులైజర్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. గుండెజబ్బులు ఉన్న వారు, గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ చేయకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►చలిగాలులు వీస్తున్న సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి. ►శరీరానికి వేడిని కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ►పొలం పనులకు వెళ్లేవారికి చలి వల్ల కాళ్లు, చేతులు దురదలు పెడుతుంటాయి. వ్యాజిలిన్, చర్మ క్రీములు రాసుకోవడం ఉత్తమం. ►శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండేందుకు పొడి దుస్తులను ధరించాలి. ►చలి తీవ్రతతో జలుబు బాగా వచ్చి ఊపిరి తీసుకునే అవకాశం ఉండదు. అలాంటప్పుడు నెబ్యులైజర్ వినియోగించుకోవాలి. శ్వాసకోస వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి ఆస్తమా, టీబీ వ్యాధిగ్రస్తులు ఉదయం 8 గంటల వరకు సాయంత్రం 6 గంటల తరువాత బయటికి వెళ్లకూడదు. బయటికి వచ్చే సమయంలో మాస్కులు ధరించడం మేలు. గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే సమీప ప్రాంతాల్లోని వైద్య సిబ్బందిని ఆశ్రయించాలి. వేడి ఆహార పదార్థాలు, నీటిని స్వీకరించాలి. చిన్నపిల్లలకు న్యుమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి. చల్లటి వాతావరణంలో బయటకి వెళ్లకుండా చూడాలి. – డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా.. కనిష్టం గరిష్టం మంగళవారం 23 29 బుధవారం 22 29 గురువారం 22 32 శుక్రవారం 20 29 శనివారం 19 32 ఆదివారం 19 28 సోమవారం 19 28 -
చలి కాలంలో గుండెపోటు అవకాశాలు ఎక్కువ
గుంటూరు: చలికాలంలో గుండెపోటు ఎక్కువగా వస్తుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కార్డియాలజిస్ట్ డాక్టర్ బి. నాగరాజు సూచించారు. గుంటూరువారి తోట గౌడీయ మఠం పక్కనున్న అమ్మాజీ– పావని మెమోరియల్ హాస్పిటల్లో సోమవారం ఉచిత గుండెజబ్బుల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ గుండెజబ్బులకు కారణమయ్యే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని తెలిపారు. ఆధునిక జీవనశైలి వల్ల పెరుగుతున్న గుండెజబ్బులపై అవగాహన కల్పించి ప్రజల్లో భయాలను తొలగించేందుకు వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరేంద్ర వెంకటరమణ తెలిపారు. -
వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!!
శీతాకాలంలో స్నానం చేయాలంటే ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది. అందుకని స్నానం మానెయ్యలేం కదండి! చన్నీటికి కొంచెం వేడి నీళ్లు జోడించి ఎలాగోలా స్నానం కానిస్తాం.. ఐతే ఓ యువతికి అసలు స్నానం చేయడమే ఇష్టం ఉండదట. వారానికోసారి మాత్రమే చేస్తుందట. స్కూల్ విద్యార్ధులకు మంచి అలవాట్ల గురించి నేర్పించవల్సిన టీచర్ ఆమె. ఇంత బాధ్యతాయుతమైన వృత్తిలో పనిచేస్తూ కూడా అపరిశుభ్రతను పాటించడం వెనుక కారణం ఏమిటో.. ఎందుకో.. తెలుసుకుందాం.. ఇంగ్లాండ్కు చెందిన నటాలీ కింగ్ (49) అనే యువతి వృత్తిరిత్యా టీచర్. ఆమె భర్త జమీ ప్లంబర్. ఒక నివేదిక ప్రకారం సదరు మహిళ వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని, కనీసం శరీరం నుంచి దుర్గంధం రాకుండా డియోడరెంట్లను కూడా కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తుందని పేర్కొంది. ఇక ఆమె శరీరం నుంచి ఏ స్థాయిలో చెడు వాసన వస్తుందో ఊహించండి. అంతేకాదు ఆమె భర్త జమీ, భార్య ప్రతిరోజూ స్నానం చెయ్యాలని బాత్రూమ్ను కూడా అందంగా డిజైన్ చేయించాడట కూడా. అయినప్పటికీ ఆమె స్నానం చెయ్యడానికి ఆసక్తి చూపడం లేదు. దుస్తులకు పర్ఫ్యూమ్ కొట్టుకుని రోజువారి పనులు చేసుంటుంది. కానీ ఏ రోజు కూడా భార్యని స్నానం చెయ్యవల్సిందిగా ఒత్తిడి మాత్రం చెయ్యలేదు సదరు భర్తగారు. ఎంత విచిత్రమైన బంధమో వీళ్లది కదా! చదవండి: Senior Citizen Savings Scheme: బంపరాఫర్ ! పోస్టాఫీస్లో వెయ్యితో ఖాతా తెరిస్తే ఐదేళ్లలో రూ.14 లక్షలు!! పూర్తి వివరాలు.. -
Baby Massage: ఆవనూనె.. లేదంటే వెన్న, మీగడతో మసాజ్ చేస్తే..
Winter Care Tips In Telugu: Massage For Babies Helpful: శీతాకాలం ప్రతిఒక్కరికీ పరీక్ష పెడుతుంది. ఏడాదిలోపు చంటిపిల్లలను సంరక్షించడం అంటే తల్లికి చిన్న పరీక్ష కాదు. అనుక్షణం బిడ్డ ధ్యాసలోనే గడపాల్సి ఉంటుంది. పాపాయికి తినిపించే ఆహారం నుంచి స్నానం చేయించడం, దుస్తులు, ఒంటికి నూనెలు పట్టించి మసాజ్ చేయడం ప్రతిదీ అత్యంత జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా మసాజ్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించి తీరాలి. ►శీతాకాలంలో మసాజ్కు ఆవనూనె అయితే మంచిది. ఇది ఒంటికి సహజంగా వేడినివ్వడంతోపాటు ర్యాష్ వంటి చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఒకవేళ న్యాపీ ర్యాష్ వంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిస్తుంది. ఆవనూనె సాధ్యం కానప్పుడు వెన్న, మీగడలతో మసాజ్ చేయవచ్చు. ఇవి అన్ని కాలాల్లోనూ వాడదగినవే. ►మసాజ్ కోసం బిడ్డను చేతుల్లోకి తీసుకునే ముందు తల్లి తన చేతులను వేడి నీటితో కడుక్కోవాలి. ఈ కాలంలో చేతులు చల్లగా ఉంటాయి. చల్లటి చేయి ఒంటికి తగలగానే పాపాయి భయంతో ఉలిక్కిపడుతుంది. అందుకే ఈ జాగ్రత్త. ►మసాజ్కు వాడే నూనెను చిన్న స్టీలు గిన్నెలో తీసుకుని గోరువెచ్చగా చేసిన తర్వాతనే పాపాయి ఒంటికి పట్టించాలి. వేడి చేయడం వీలుకాకపోతే నూనెను రెండు చేతుల్లో వేసుకుని రుద్దుకుంటే చల్లదనం తగ్గుతుంది. పాపాయి చర్మానికి సౌకర్యంగా ఉంటుంది. గదిని వెచ్చబరచాలి.. ►నూనె పట్ల తీసుకునే జాగ్రత్తలతోపాటు మసాజ్ చేయడానికి ముందు దుస్తులు తొలగించడంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. వేసవిలో చేసినట్లు ఒకేసారి దుస్తులన్నీ తీసేయరాదు. ముందు సాక్స్, ప్యాంటు తీసి కాళ్లకు మసాజ్ చేయాలి. అప్పుడు కాళ్ల మీద మందపాటి టవల్ కప్పి ఆ తర్వాత చేతులకున్న మిటెన్స్, స్కార్ఫ్, చొక్కా తీసి పై భాగానికి మసాజ్ చేయాలి. ►వీటన్నింటికంటే ముందు గదిని వెచ్చబరచాలి. రూమ్ హీటర్లు అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. కాబట్టి చంటిబిడ్డ ఉన్న ఇంట్లో రూమ్ హీటర్ తప్పకుండా ఉండాలి. మసాజ్ మొదలు పెట్టడానికి పది నిమిషాల ముందు రూమ్ హీటర్ ఆన్ చేయాలి. హీటర్ నుంచి వచ్చే గాలిని నేరుగా పాపాయికి తగలనివ్వకూడదు. హీటర్ సాధ్యం కానప్పుడు సాంబ్రాణి పొగ లేదా ధూప్ స్టిక్తో గదిని వెచ్చబరచవచ్చు. నిజానికి జలుబుకు కారణం మసాజ్ కాదు ►సాధారణంగా చేసే పొరపాటు ఏమిటంటే... పక్క దుస్తులకు నూనె జిడ్డు అంటకుండా ఉండడానికి మసాజ్ చేసేటప్పుడు పాపాయిని ప్లాస్టిక్ షీట్ మీద పడుకోబెడుతుంటారు. ఈ సీజన్లో మాత్రం ఆ పని చేయనే చేయకూడదు. ప్లాస్టిక్ షీట్ చల్లగా ఉంటుంది. పాపాయికి జలుబు చేసే ప్రమాదం ఉంది. అందుకే పాతబడిన దుప్పటిని హీటర్ ముందు పెట్టి గోరువెచ్చగా చేసిన తర్వాత పాపాయిని పడుకోబెట్టాలి. ►పాపాయి చర్మ సంరక్షణకు, కండరాల వ్యాయామానికి మసాజ్ను మించిన ఔషధం మరొకటి ఉండదు. కాబట్టి శీతాకాలంలో కూడా చక్కగా మసాజ్ చేయవచ్చు. ఈ కాలంలో మసాజ్ చేస్తే జలుబు చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. పైన చెప్పుకున్న జాగ్రత్తలు పాటించకుండా వేసవిలో మసాజ్ చేసినట్లే పాపాయిని దుస్తులు లేకుండా ఎక్కువ సేపు చలిగాలికి ఉంచినప్పుడు జలుబు చేస్తుంది. ఈ జలుబుకి కారణం మసాజ్ కాదు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే. -
Winter: నువ్వుండలు, ఎండిన ఫలాలు.. పిల్లలకు ఇవి తినిపిస్తే
Winter Season: Avoid Giving These Foods To Kids What To Eat What Not Telugu: పిల్లలకు ఈ సీజన్లో ఇవ్వాల్సిన ఆహారంపై కూడా దృష్టిపెట్టాలి. ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను గణనీయంగా తగ్గిస్తూ, పోషకవిలువలను సమృద్ధిగా ఉండే ఆహారం ఇవ్వాలి. ►ముఖ్యంగా పీచుపదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజాఫలాలు, ఎండిన ఫలాలు ప్రతినిత్యం వారికి తినిపించాలి. ►నూనెలను మరిగించడం ద్వారా తయారు చేసే వంటకాలను దూరం చేయాలి. ►ఐస్క్రీమ్స్, కూల్డ్రింక్స్, చాక్లెట్లు, పిజ్జాల వంటి పదార్థాలకు బదులుగా ప్రకృతి సిద్ధమైన ఆహారాలను అలవాటు చేయడం మంచిది. ►ఉదాహరణకు కొబ్బరినీళ్లు, చెరకురసం, వెజిటబుల్ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి. మొత్తంమీద రోజూ 3 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తాగాలి. ►ప్రధానంగా నీరు, మజ్జిగ, బార్లీ మొదలైనవి. ►పిల్లలకు క్యాల్షియమ్ సమృద్ధిగా లభించాలంటే ప్రతిరోజూ ఉదయం అర చెంచా, సాయంత్రం అర చెంచా నువ్వులను నమిలి తినేలా అలవాటు చేయాలి. లేదంటే నువ్వుండలు తిన్నా మంచిదే. ►అలాగే మొలకెత్తే దినుసులను తినిపించడం అలవాటు చేయాలి. చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు... -
మంచు కురిసే వేళలో.... వణికే పెదవులు పలికే పాటలు విన్నారా?
Best Telugu Romantic Songs: చలి మొదలైంది. మంచు రాలడం మొదలవుతుంది. వణికే పెదవుల మీద పాటలు కూడా వస్తుంటాయి. చలిగాలిని, మంచు కురిసే వేళని సినీ కవులు సుందరంగా తీర్చిదిద్దారు. నాయికా నాయికులను తమ పదాలతో దగ్గరకు చేర్చారు. నేడు ఆదివారం. ఈ చలికాలపు ఉదయం ఈ పాటలు నెగళ్లుగా మారతాయేమో చూడండి. వింటే భారతం వినాలి అంటారు కానీ అది మాత్రమే కాదు. సాలూరి వారి పాట కూడా వినాలి. ‘చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి’... బహుశా అది చలికాలపు చలి కావచ్చు. ఆపై బరువుగా యమున ప్రవహిస్తుండవచ్చు. ఆ సమయాన శ్యామసుందరుడు మురళి ఊదితే వేరే ఏ వ్యాపకమూ పెట్టుకోబుద్ధి కాని ఆ వేళ అది మధురము. మరెంత వెచ్చదనమూ. ‘చలిచలిగా గిలి పుడుతుంటే’ అన్నాడు ఆత్రేయ. అఫ్కోర్స్. వానకు తడిసిన బి.సరోజాదేవిని చూసిన నాగేశ్వరరావు చేతే అనుకోండి. కాని ఇప్పుడు చలికాలంలో వానలు పడుతున్నాయి. వరదలూ వస్తున్నాయి. చలిజల్లును ఎదుర్కొనడానికి ఒకరి పక్కన ఒకరు ఒదిగి కూచోక తప్పదు. ఈ ఆత్రేయే ‘సోగ్గాడు’లో ‘చలివేస్తుంది చంపేస్తుంది’ అని రాశాడు. కాని ఒక కవిగా స్పందించి ‘మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో’... అంటే ఎంత బాగుంది. నిజానికి మల్లెలది వేసవి కాలం. మంచుతో తడిసే మల్లెను చూడటం కవికి రసాస్వాదన. అబ్బాయికీ అమ్మాయికీ హొయలు. పొగమంచులో పాట తీయడం అప్పట్లో కొత్త. తమిళం వాళ్లు చూపించారు. ‘పరువమా... చిలిపి పరుగు తీయకు’... జాగింగ్ చేస్తున్న సుహాసిని, మోహన్ను తెలుగు తెర మీద కొత్తగా చూశారు. బాపు గారు అదే పొగమంచును ‘ఏమని నే చెలి పాడుదును’లో అద్బుతంగా చూపారు. జంధ్యాల ‘రాగలీల’లో ‘చలికాలం ఇంకా ఎన్నాళ్లో’ పాటను రెహెమాన్, సుమలత మీద గొప్ప మంచులో చిత్రీకరిస్తారు. ‘మూడుముళ్లు’లో ఆయనే తీసిన ‘లేత చలిగాలులూ దోచుకోరాదురా’ పాట మిట్టమధ్యాహ్నం విన్నా మంచు తాకేలా ఉంటుంది. ‘సొమ్మొకడిది సోకొకడిది’లో ‘చలితో నీవు చెలితో నేను చేసే అల్లరులూ’ అని రాశాడు వేటూరి. ‘మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్లిపోయే’ అని ‘నిరంతరమూ వసంతములే’ పాటలో ఆయన మాత్రమే అనగలడు. చలికి ఒణికే హీరోయిన్కు హీరో ఉదారంగా తన కోటు తీసివ్వడం కద్దు. ‘క్షణక్షణం’లో ఆ జాక్పాట్ వెంకటేశ్కు దక్కింది వెంకటేశ్. మరి అతడు జీన్స్ జాకెట్ ఇచ్చింది శ్రీదేవికి కదా. చలికి చాలామంది ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. కాని ‘జామురాతిరి’ పాటలో శ్రీదేవి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడాలి. సావిత్రి మహానటి. శ్రీదేవి.. మహూహూ.. నటి. చలిని కొత్త సినిమాలు కూడా వదలుకోలేదు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ‘చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది మనసు’ పెద్ద హిట్. ప్రభాస్కు, కాజల్కు అదొక సుకుమారమైన చలిగీతం. నానికి కూడా ఇలాంటి హిట్ ఉంది. సిరివెన్నెల రాశాడు– జెంటిల్మెన్ కోసం. ‘చలిగాలి చూద్దు తెగ తుంటరి... గిలిగింత పెడుతున్నది’ అని ఒక పంక్తి ఉంటే తర్వాతి పంక్తి ‘పొగమంచు చూద్దు మహ మంచిది.... తెరచాటు కడుతున్నది’ అని ఉంటుంది. ఆ ప్రేయసీ ప్రియుల ఏకాంతానికి పొగ మంచు తెరచాటు కడుతున్నదట. ఎంత బాగుంది. రుతువులు వచ్చేది మార్పు ఉండాలి జీవితంలో అని చెప్పడానికి. ప్రకృతే మారి మారి ఆనందిస్తుంటే మనిషే రోజువారి రొడ్డకొట్టుడులో పడి ఆస్వాదనకు దూరమవుతున్నాడు. చీకటితో లేవండి. చలిని ఎంజాయ్ చేయండి. మంచులో తడిసినపూలను చూడండి. నెగళ్ల సెగను అనుభవించండి. ఆ సమయంలో టీ తాగడం మర్చిపోవద్దు. -
అసలే చలికాలం.. రాత్రి గజగజ వణకడమే.. మరి వారి సంగతేంటి?
ఇలాంటి అభాగ్యులెందరో.. ఈ ఫొటోను ఒక ఫౌండేషన్ వారు పోలీసులకు ట్విట్టర్లో షేర్ చేయగా, స్పందించిన మంత్రి కేటీఆర్ కూకట్పల్లి జోనల్ అధికారులను ఆదేశించడంతో.. ఫతేనగర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఈమెను షెల్టర్హోమ్కు తరలించారు. ఇలా ఏ నీడా లేకుండా ఉంటున్నవారు నగరంలో వందలు, వేలసంఖ్యలో ఉన్నారు. మంత్రిలాంటి వారి ఆదేశాలకు స్పందించిన అధికారులు.. అసలు ఇలాంటి వారెందరున్నారో సర్వే చేస్తే ఎక్కువ మందికి ఉపయోగం ఉంటుంది. అడపాదడపా చేసే సర్వేల్లోనూ చాలా తక్కువమంది మాత్రమే లెక్కల్లో ఉంటారు. కారణాలేమిటో తెలియదు. ఉన్న షెల్టర్హోమ్లనైనా అవసరమైన వారు అందరూ ఉపయోగించుకునందుకు జీహెచ్ఎంసీ నుంచి జరిగిన ప్రయత్నాలు లేవు. ప్రతి చలికాలంలో ఒక మొక్కుబడి కార్యక్రమంగా మాత్రమే స్పందిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అసలే శీతాకాలం.. రాత్రి వేళ చలి గజగజ వణికించే కాలం.. నగరంలో ఇప్పుడు ఎక్క డ చూసినా.. చలికి గిజగిజలాడుతున్న దేహాలు.. చిక్కి శల్యమైన శరీరాలు.. రోడ్ల మధ్య డివైడర్లపై, ఫుట్పాత్లతోపాటు ఎక్కడ పడితే అక్కడ విసిరేసినట్లు కనిపిస్తుంటాయి. చలి గాలులకు తట్టుకోలేక, మంచుకత్తులనెదుర్కొనేందుకు ఉన్న శక్తినంతా ముడుచుకోవడానికే వినియోగిస్తాయి. అయినా సంబంధిత యంత్రాంగానికి ఈ దృశ్యాలు కనిపించవు. గ్రేటర్ జనాభాకు అనుగుణంగా సుమారు 200 షెల్టర్హోమ్స్ ఏర్పాటు చేయాలి. చదవండి: వృద్ధురాలిపై పైశాచికం: మద్యం తాగించి.. లైంగిక దాడికి పాల్పడి.. కానీ.. 13 శాశ్వత, 5 తాత్కాలిక షెల్టర్ హోమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి సైతం అంకెల్లో చెప్పుకోవడానికి తప్ప వాటిలో ఉంటున్నది కొందరే. ఒకప్పుడు నైట్ షెల్టర్లుగా వ్యవహరించిన వీటిని కరోనా అనంతరం షెల్టర్ హోమ్స్గా పరిగణిస్తున్నారు. రాత్రివేళల్లోనే కాకుండా ఏ నీడా లేనివారికి రక్షణనిచ్చే షెల్టర్హోమ్స్గా వీటిని చెబుతున్నారు. అన్ని హోమ్లలో కలిపి 960 మందికి వసతి సదుపాయం ఉండగా.. ప్రస్తుతం 323 మంది ఉన్నారు. ఎందుకిలా..? ఠిఫుట్పాత్లపైనే రోజులు వెళ్లదీస్తున్నవారికి షెల్టర్హోమ్స్ ఉన్నట్లు తెలియదు. పైనుంచి ఆదేశాలందితే కానీ.. రోడ్లపై ఉన్నవారిని హోమ్స్లోకి బల్దియా యంత్రాంగం తరలించదు. ఇది ఓవైపు దృశ్యమైతే.. ఇలాంటివారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉండేదని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వంశీ పేర్కొన్నారు. వీటిని ఏర్పాటు చేసిన ప్రాంతాలకు చాలామంది వెళ్లలేకపోవడంతో అవి పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. చదవండి: ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె ఇదే తంతు.. ప్రభుత్వ ఉన్నతస్థాయిలోనూ ఇదే పరిస్థితి. నగరంలో షెల్టర్లు లేనివారికి ఆసరా కల్పించాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు. షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ (ఎస్యూహెచ్) ఏర్పాటు చేయాలని, వాటిల్లో తగిన సదుపాయాలుండాలని ఆదేశించారు. దాంతోపాటు వాటి గురించి తగినంత ప్రచారం చేయాలని, అందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. గత అనుభవాలతో కాబోలు అలాంటి వారు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, వాటిని హాట్స్పాట్స్గా పరిగణించి వారంలో రెండు పర్యాయాలు సర్వే నిర్వహించి, గుర్తించిన వారిని షెల్టర్హోమ్స్లోకి తరలించాలని, గుర్తించిన వారి వివరాలతో డేటాబేస్ నిర్వహించాలని సూచించారు. నైట్ షెల్టర్లున్న ప్రాంతాలివే.. ఉప్పల్ మార్కెట్, సరూర్నగర్, పేట్లబుర్జు, శివరాంపల్లి, టప్పాచబుత్రా, గోల్నాక, బేగంపేట ఫ్లై ఓవర్, యూసుఫ్గూడ, శేరిలింగంపల్లి, ఆర్కేపురం బ్రిడ్జి, బౌద్ధనగర్, మహవీర్ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, కోఠి మెటర్నిటీ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్, సయోధ్య ఇనిస్టిట్యూట్. ఎవరైనా కనిపిస్తే తీసుకొస్తాం.. కొందరు ఒక్కరోజు రాత్రి మాత్రమే ఉంటారు. ఉపాధి కోసం వచ్చేవారు రెండు మూడు నెలలు సైతం ఉంటారు. ఎవరు ఎన్ని రోజులనేది చెప్పలేం. కచ్చితంగా అవసరమైన వారు మాత్రం ఉంటారు. వారంతట వారే వచ్చేవారితోపాటు సమీపంలోని రైల్వేస్టేషన్లు, తదితర ప్రాంతాల్లో ఎవరైనా కనిపిస్తే.. షెల్టర్హోమ్కు రప్పిస్తాం. – విష్ణుసాగర్, శేరిలింగంపల్లి షెల్టర్హోమ్ మేనేజర్ -
Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..!
Why do heart attacks become common during winters? ప్రస్తుత కాలంలో గుండెపోటు కూడా అత్యంత సాధారణ మరణాల్లో ఒకటిగా చేరిపోయింది. ఒకప్పుడు 50 యేళ్లు దాటిన వారికి వచ్చే హార్ట్ అటాక్.. ఇప్పుడు 20, 30, 40 ఏళ్ల వారికి కూడా వస్తున్నాయి. అందుకు అనేకానేక కారణాలతోపాటు కాలానుగుణ మార్పులు కూడా మీ హృదయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాల వాతావరణం తరచుగా గుండెపోటులు రావడానికి కారణమౌతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కాలంలో కేవలం శ్వాసకోశ వ్యాధులు మాత్రమేకాకుండా గుండె జబ్బుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు హఠాత్తుగా తగ్గడం వల్ల ఆకస్మిక గుండెపోటులు సంభవిస్తాయట. కాబట్టి ఇతర సీజన్ల కంటే చలికాలం మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. చలికాలంలో గుండెపోటు సంభవించడానికి గల ప్రధాన కారణాలు శీతాకాలంలోనే ఎందుకు గుండెపోటు ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయనేదానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. చాలా మంది నిపుణులు గుండెపోటులు పెరగడానికి శరీర ఉష్ణోగ్రత కూడా ఒక కారణమనని అంటున్నారు. ఉష్ణోగ్రతల తగ్గుదల గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే చలికాలంలో స్ట్రోకులు, ఆకస్మికంగా గుండె ఆగిపోవడం, గుండె సమస్యలు, అరిథ్మియా.. వంటి రుగ్మతలు సంభవిస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. చలికాలంలో శరీరం నాడీ వ్యవస్థ క్రియాశీలతలో మార్పులు చోటుచేసుకోవటం వల్ల, రక్త నాళాలను కుచించుకుపోతాయి. దీనిని ‘వాసోకన్స్ట్రిక్షన్’ అని పిలుస్తారు. ఇది జరిగినప్పుడు రక్తపోటు స్థాయి పెరిగడంవల్ల, శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంప్ చేయడంలో గుండె ఎక్కువగా కష్టపడి పని చేస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, శరీరం వేడిని నియంత్రించడానికి గుండె రెట్టింపు కష్టపడాల్సి ఉంటుంది. ఇది గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. గుండెపోటు సమస్యలున్నవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో శరీరానికి ఆక్సిజన్ అవసరాలు కూడా పెరుగుతాయి. రక్తనాళాల సంకోచం వల్ల, తక్కువ మొత్తంలో ఆక్సిజన్ గుండెకు చేరుతుంది. ఇది గుండెపోటుకు ఆస్కారన్నిస్తుంది. ఈ జాగ్రత్తలు పాటించారంటే మీ హృదయ ఆరోగ్యం పదిలంగా.. ►ఈ కాలంలో శారీరకంగా చురుకుగా లేకపోవడం కూడా ఒక కారణమే. తేలికపాటి వ్యాయామాలు చేయడం మరచిపోకూడదు. ►కొలెస్ట్రాల్ను పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ధమనులపై ప్రభావం పడి గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ►మధుమేహం, బీపీ ఇతర సమస్యలున్నవారు తరచూ స్థాయిలను తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ►మద్యం, పొగాకు వినియోగాన్ని తగ్గించాలి. ►ఏదైనా చికాకు, ఛాతీలో భారం, చెమట, భుజం నొప్పి, దవడ నొప్పి, తల తిరగడం, వికారం వంటి వాటిని తేలికగా తీసుకోకూడదు. వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. చదవండి: World's Largest Cemetery: ఇది నగరంలోని శ్మశానం కాదు.. శ్మశానమే ఓ మహానగరంగా! ఎక్కడుందో తెలుసా? -
Delicious Winter Soup Recipes: స్పినాచ్ సూప్, బ్రకోలి ఆల్మండ్ సూప్ తయారీ ఇలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... స్పినాచ్ సూప్ కావల్సిన పదార్ధాలు లేత పాలకూర ఆకులు – రెండు కప్పులు క్యారెట్ – ఒకటి బంగాళదుంప – ఒకటి ఉల్లిపాయ – ఒకటి వెల్లుల్లి రెబ్బలు – నాలుగు మిరియాల పొడి – టీస్పూను ఆయిల్ – రెండు టీస్పూన్లు పంచదార – టీస్పూను వెజిటేబుల్ స్టాక్ – రెండు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా క్యారెట్ బంగాళ దుంపలను తొక్కతీసి కడిగి, సన్నగా తరుక్కోవాలి. ►ప్యాన్లో రెండు కప్పుల నీళ్లు, క్యారెట్, బంగాళ దుంపల ముక్కలు వేసి మీడియం మంట మీద ఉడికించాలి. ►ఇవి ఉడికాక ఈ ముక్కలను తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఈ వేడినీటిలో కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ►పాలకూర ఉడికిన తరువాత చల్లారనిచ్చి, క్యారెట్, దుంపలతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో వెజిటేబుల్ స్టాక్ వేసి ప్యూరీలా చేసుకోవాలి. ►ఇప్పుడు ఈ ప్యూరీని వడగట్టి రసం మాత్రమే తీసుకోవాలి. ►ఇప్పుడు బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి తరిగిన వెల్లుల్లిని వేసి గోల్డ్కలర్లోకి మారేవరకు వేయించాలి. ►తరువాత పంచదార, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ►ఇవన్నీ వేగాక వడగట్టిన పాలకూర రసం, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి బాగా మరిగించాలి. ►ఈ వేడివేడి సూప్లో క్రీమ్ లేదా బటర్ వేసి సర్వ్చేసుకోవాలి. బ్రకోలి ఆల్మండ్ సూప్ కావల్సిన పదార్ధాలు బ్రకోలి – ఒకటి ఉల్లిపాయలు – రెండు (ముక్కలుగా తరగాలి) వెల్లుల్లి రెబ్బలు – ఆరు (సన్నగా తరగాలి) బాదం పప్పులు – పదహారు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు బటర్ – టీ స్పూను పాలు – కప్పు మిరియాల పొడి – టీస్పూను ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా బ్రకోలిని ముక్కలుగా తరుక్కోవాలి. ►పాన్ వేడెక్కిన తరువాత బటర్, ఆయిల్ వేయాలి. ►బటర్ కరిగిన వెంటనే వెల్లుల్లి తరుగు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఇప్పుడు బాదం పప్పులు, బ్రకోలి వేసి రంగు మారేంత వరకు ఉడికించాలి. ►ఇవన్నీ ఉడికిన తరువాత, చల్లారానిచ్చి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ పేస్టును మరో పాన్లో వేసి నీరంతా ఇగిరేంత వరకు మరిగించాలి. ►ఇప్పుడు పాలు పోసి మరో రెండు నిమిషాలు మగ్గనిచ్చి, మిరియాల పొడితో గార్నిష్చేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: Viral Video: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
Delicious Winter Soups: గుమ్మడి సూప్, మటన్ సూప్ తయారీ ఇలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... గుమ్మడి సూప్ కావల్సిన పదార్ధాలు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ – ఒకటి (ముక్కలు తరగాలి) వెల్లుల్లి రెబ్బలు – రెండు గుమ్మడి తరుగు – రెండు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – అరటీస్పూను నీళ్లు – రెండు కప్పులు క్రీమ్ – గార్నిష్కు సరిపడా తయారీ విధానం ►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ►ఇవి కూడా వేగిన తరువాత గుమ్మడి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి రెండు కప్పులు నీళ్లు పోసి కలపి మూతపెట్టి 15 నిమిషాల పాటు మీడియం మంటమీద ఉడికించాలి. ►ఉడికిన తరువాత మిశ్రమాన్ని చల్లారనిచ్చి, మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పాన్లో వేసి ఐదు నిమిషాలు మరిగించి, క్రీమ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మటన్ సూప్ కావల్సిన పదార్ధాలు మటన్ – పావుకేజీ నీళ్లు – రెండు కప్పులు అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను పసుపు – అర టీస్పూను మిరియాల పొడి – అర టీస్పూను జీలకర్ర పొడి – పావు టీస్పూను గరం మసాలా – అర టీస్పూను కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను తయారీ విధానం ►మటన్ను చిన్నచిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడగాలి. ►ప్రెజర్ కుకర్ గిన్నెలో మటన్ ముక్కలు, అల్లం వెల్లుల్లిపేస్టు, మిరియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పులు నీళ్లుపోయాలి. ►వీటన్నింటిని కలిపి మూత పెట్టి ఆరు విజిల్స్ రానివ్వాలి. ►కుకర్ ప్రెజర్ పోయాక మూతతీసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడి మటన్ సూప్ రెడీ. చదవండి: Beauty Tips: ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తొలగించేందుకు.. ఆనప ఫేస్ ప్యాక్! -
రోజూ జుట్టుకు ఆముదం పట్టిస్తే చుండ్రు తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది!!
Castor Oil Benefits for Skin and Hair: చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చర్మంతోపాటు జుట్టుకూడా పొడిబారుతుంది. దీంతో చుండ్రు సమస్య మొదలవుతుంది. ఇప్పటికే చుండ్రు ఉంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యలేవి రాకుండా ఉండాలంటే చలికాలం ఉన్నన్ని రోజులు జుట్టుకు ఆముదం పట్టిస్తే మంచిది. ►టేబుల్ స్పూను ఆముదం, టేబుల్ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే..చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ►పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది. ►గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి. ►రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్లో ఆముదాన్ని పోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్బామ్లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్ కలర్లోకి మారుతాయి. చదవండి: ఆ హార్మోన్ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ.. -
శీతాకాలం చర్మ సమస్యలా? బాదం, పాలకూర, అవకాడో.. ఇవి తిన్నారంటే..
శీతాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పొడి చర్మం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో జుట్టు, చర్మానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తప్పక తీసుకోవాలి. సాధారణంగా చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో విటమిన్ ‘ఇ’నూనెలు వాడుతారు. ఐతే ఈ నూనెల్లో ఇతర కెమకల్స్ కూడా ఉంటాయి. సహజ పద్ధతుల్లో శరీరానికి ఈ విటమిన్ అందాలంటే.. విటమిన్ ‘ఇ’ అధికంగా ఉండే ఆహారాన్నితీసుకోవడం ఉత్తమ పద్ధతి. విటమిన్ ‘ఇ’తో ఎన్నో ప్రయోజనాలు ఈ విటమిన్ ఫ్రీ రాడికల్స్తో పోరాడి, చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పించే లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా వృద్ధాప్యఛాయలు, ఎండవల్ల కమిలిన చర్మానికి చికిత్సనందిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నిరోధించి ఇమ్యునిటీని పెంచడంతోపాటు చర్మ, కేశ ఆరోగ్యాన్నిపెంపొందిస్తుంది. విటమిన్ ‘ఇ’ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలను ప్రముఖ రేడియాలజిస్ట్ డా. మనోజ్ అహుజా సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. బాదం రాత్రి అంతా నానబెట్టిన ఐదు బాదం పప్పులను ఉదయాన్నే పరగడుపున తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా మంచిదేనని తరచుగా చెబుతారు ఎందుకంటే బాదంలో విటమిన్ ‘ఇ’ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనిలో ఇతర పోషకాలు కూడా నిండుగా ఉంటాయి. చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!! పాలకూర ఉదయం పూట అల్పాహారంగా ఆకు పచ్చ కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉడికించిన గుడ్డుతో లేదా తరిగిన పాలకూర ఆకులను గుడ్డులో కలిపి ఆమ్లేట్లా చేసుకుని తిన్నా మీ శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. పాలకూరతో రావియోలి కూడా తయారు చేసుకోవచ్చు లేదా పాలకూర, పనీర్లను శాండ్విచ్లో స్టఫ్ గా కూడా వాడొచ్చు. అవకాడో పండు అవకాడో పండు మెత్తగా క్రీమీగా ఉంటుంది. దీనిని టోస్ట్ లేదా గుడ్డు, మాంసం, కూరగాయలు దేనితోనైనా ఈ పండును మెత్తగా స్మాష్ చేసి కలుపుకుని బ్రెడ్లో స్టఫ్గా తినొచ్చు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! పొద్దుతిరుగుడు విత్తనాలు పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ‘ఇ ’ పుష్కలంగా ఉంటుంది. కాల్చిన పొద్దుతిరుగుడు గింజలను మార్నింగ్ కాఫీతో స్నాక్స్లా తినొచ్చు. లేదా ఓట్స్, పాన్ కేక్ వంటి ఇతర భోజనాలపై ఈ విత్తనాలను చల్లుకుని తినొచ్చు. వేరుశెనగ బ్రెడ్పై వేరుశెనగ వెన్న పూసి ఉదయం అల్పాహారంగా తినొచ్చు. ఉప్మా, పోహాలలో వేరుశెనగను జోడించి తిన్నా మంచిదేనని డా. మనోజ్ అహుజా సూచిస్తున్నారు. చదవండి: Lake of No Return: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
Health Tips: గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్!
శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి క్యారెట్ను ఖచ్చితంగా తీసుకోవాలి. క్యారెట్లో బీటా-కెరోటిన్ స్థాయిలు నిండుగా ఉంటాయి. ఈ బీటా-కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెంది రక్తంలోని చెడుకొవ్వులను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఇల్లినాయిస్ యూనివర్సిటీ అధ్యనాలు వెల్లడించాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంలతోపాటు బరువు తగ్గేందుకు, జీర్ణక్రియ, కంటి ఆరోగ్యం, చర్మ-ఆరోగ్యం.. వంటి ప్రయోజనాలను చేకూర్చే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్ను సలాడ్గా మాత్రమేకాకుండా ఈ కింది ప్రత్యేక రుచుల్లో కూడా తినొచ్చు. అవేంటో తెలుసుకుందాం.. క్యారెట్- ఆరెంజ్ డిటాక్స్ డ్రింక్ రెండు క్యారెట్లు, ఆరెంజ్ పండ్లు రెండు తీసుకుని విడివిడిగా జ్యూస్తయారు చేసుకోవాలి. తర్వాత రెండింటిని ఒక గ్లాసులో బాగా కలుపుకుని,దీనికి టేబుల్ స్పూన్ చొప్పున పసుపు, నిమ్మరసం, 2 స్పూన్ల అల్లం పేస్టు జోడించి బాగా కలుపుకోవాలి. ఈ ద్రావణాన్ని ఉదయాన్నేతాగితే శరీరంలోని వ్యర్ధాలను తొలగించడమేకాకుండా రోజంతా యాక్టీవ్గా ఉంచుతుంది. క్యారెట్-అల్లం సూప్ బాణీలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అరకప్పు తరిగిన ఉల్లి ముక్కలు , ముక్కలుగా కట్చేసిన క్యారెట్లను (6 పెద్దవి) వేసి, ఒక టీ స్పూన్ సాల్ట్, కప్పు నీళ్లు పోసి మెత్తబడేవరకు ఉడికించాలి. తర్వాత నీళ్లను ఒక గిన్నెలో ఒంపి క్యారెట్లను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒంపిన నీళ్లను ఈ మిశ్రమానికి కలిపి స్టౌ మీద చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఆర స్పూను చొప్పున మిరియాల పొడి, సాల్ట్ కలుపుకుంటే సూప్ రెడీ! వింటర్లో మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ సూప్ సహాయపడుతుంది. క్యారెట్ క్రాకర్స్ ఒక గిన్నెలో మైదా పిండి, ఆవాల పొడి, వెన్న, జీలకర్ర, క్యారెట్, జున్ను, నీరు, గుడ్డు సొన వేసి మెత్తగా పిండిని కలుపుకోవాలి. 30 నిమిషాలు తర్వాత, పిండిని మందంగా పరిచి, గుండ్రంగా బిస్కెట్ సైజులో కట్చేసుకోవాలి. 10-12 నిముషాల వరకు బంగారు రంగు వచ్చేవరకు బేక్ చేస్తే క్యారెట్ క్రాకర్స్ రెడీ! దీనిని స్నాక్స్ రూపంలో తినొచ్చు. చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! -
ఇంధన ధరలు తగ్గేది అప్పుడే: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో అయితే చమురు ధరలు సెంచరీ కూడా కొట్టేశాయి. దీంతో సామాన్య ప్రజానీకం బయటకి వాహనాలు తీయాలంటేనే భయపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు ధరల తగ్గింపు విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రజలు ఏదైనా ప్రకటన చేయకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు మాట్లాడుతూ.. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ముడి చమురును సరఫరా చేసే దేశాలు తమ స్వలాభం కోసం ధరలను పెంచుతున్నాయని తెలిపారు. ఫలితంగా వీటి ప్రభావం చమురు ఆధారిత దేశంలోని వినియోగదారులపై పడుతోందన్నారు. ఇదే అంశంపై ఆయా దేశాలతో చర్చించినట్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ‘అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. శీతాకాలం పోతే పెట్రోల్ ధరలు దిగి వస్తాయి. అయినా, ఇది అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శీతాకాలంలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ సీజన్ గడిస్తే ధరలు తగ్గుతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రం చమురు ఉత్పత్తులపై కేంద్రం, రాష్ట్రం విధించే పన్నులు అధికంగా ఉంటున్నాయని వారు తెలిపారు. వీలైనంతగా త్వరగా ప్రభుత్వాలు పన్నులను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. చదవండి: పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్ ఊరట: దిగొస్తున్న పుత్తడి ధరలు -
అర్లి(టి)లో చలి.. పొద్దెక్కని పల్లె
ఈ పల్లె కోడి కూయకముందే నిద్రలేస్తది.. రెండువారాలుగా ఉదయం 7 దాటినా.. ముసుగుతన్ని పడుకునే ఉంటోంది.. అర్లి(టి).. రాష్ట్రంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతం.. ఎప్పుడు చూసినా.. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల లోపే.. మనమేమో 12 డిగ్రీలు ఉన్నా.. గజగజవణుకుతున్నాం.. ఈ నేపథ్యంలో అసలు అక్కడి జనమేం చేస్తున్నారు.. పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఉన్న అర్లి(టి) గ్రామంలో ‘సాక్షి’ బృందం శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ‘ఫీల్డ్ విజిట్’ చేసింది. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు పెన్గంగా పరీవాహక ప్రాంతం.. పైగా దగ్గరలో అటవీ ప్రాంతం కూడా ఉండటంతో అర్లి(టి)లో చలి బాగా ఉంది.. దారంతా చలిమంటలు.. అందరూ శాలువాలు, దుప్పట్లు, చద్దర్లు కప్పుకొనే కనిపించారు. మనుషులే కాదు.. పశువులు కూడా.. ఉదయం 7 గంటలు దాటాకే.. నెమ్మదిగా ఇళ్లల్లో నుంచి జనం బయటకు రావడం ప్రారంభించారు.. మామూలుగా తెలవారకముందే ఇంటి పనులు మొదలుపెట్టే మహిళలు, రైతన్నలు అప్పుడే పనులకు ఉపక్రమిస్తూ కనిపించారు. ఎలా ఉంది ఇక్కడ అని బిల్లావార్ లక్ష్మిని పలకరించాం.. ‘‘చలి బాగా ఉంది.. పనులు చేసుకోలేకపోతున్నాం.. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు.. ఇంటి ముందు చలిమంట వేసుకుంటున్నాం.. ఉదయం లేచి పనులు చేయాలంటే.. చేతులు, కాళ్లు తిమ్మిరిపట్టినట్లు అవుతున్నాయి’’ అని చెప్పింది. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.. చలిగాలులు లోపలికి రాకుండా కిటికీలు, తలుపులను టార్పాలిన్ కవర్ల ద్వారా మూసివేయించారు. పశువులకు గోనెసంచులు, దుప్పట్లు కప్పి ఉంచారు.. రైతులు, కూలీలు అయితే సాయంత్రం 4 అయ్యేసరికే ఇంటికి చేరుకున్నారు. తన జీవితంలోనే ఇంత చలిని ఎప్పుడూ చూడలేదని 90 ఏళ్ల వృద్ధురాలు సంద భూమక్క చెప్పింది. ‘10 రోజులుగా చలి విపరీతంగా పెడుతోంది. ఇంటి నుంచి బయటకు పోతలేను. రోజంతా దుప్పటి కప్పుకొనే ఉంటున్న’ అని తెలిపింది. ఉత్తరాది నుంచి శీతల గాలులు వీయడం వల్ల కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు మరింత పతనమవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. – తాంసి (ఆదిలాబాద్ జిల్లా), ఫొటోలు: చింతల అరుణ్రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
చలి తక్కువ.. ఎండ ఎక్కువ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. సీజన్ మొదట్లో వణికించిన చలి.. ఇప్పుడు కాస్త తీవ్రత తగ్గించింది. గత నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా.. పగటి ఉష్ణోగ్రతలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల మొదటి వారంలో రాష్ట్రం లో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదు కాగా.. ఇప్పుడు 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ ఏడాది భారీ వర్షాల నేపథ్యంలో చలి ప్రభావం అదే స్థాయిలో ఉంటుందని భావించినా ప్రస్తుతం ఉష్ణోగ్రతల నమోదులో మాత్రం వ్యత్యాసం కనిపిస్తోంది. కనిష్టం 18.6 డిగ్రీలు.. గరిష్టం 34.8 డిగ్రీలు.. రాష్ట్రంలో వాతావరణ శాఖ 12 సెంటర్లలో ఉష్ణోగ్రతల నమోదును రికార్డు చేస్తోంది. ఈక్రమంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. దుండిగల్లో 18.6 డిగ్రీల కనిష్ట, ఆదిలాబాద్లో 34.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దుండిగల్, నల్లగొండ మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.3 డిగ్రీల నుంచి 3.7 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దుండిగల్, ఆదిలాబాద్, నల్లగొండ మినహాయిస్తే మిగతా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 5.1 డిగ్రీలు అధికంగా నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. నీటి వనరులు భారీగా ఉండటంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు మాత్రం అమాంతం పెరుగుతుండటం గమనార్హం.. రెండ్రోజులు పొడి వాతావరణమే.. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. హిందూ మహా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వలన దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో సుమారుగా నవంబర్ 23వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వివరించింది. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్య దిశగా శ్రీలంక–తమిళనాడు తీరాల వైపు ప్రయాణించే అవకాశమున్నట్లు తెలిపింది. -
చలికాలంలో కరోనా పంజా
ఢిల్లీ : కరోనా వేవ్లతో పాశ్చాత్య దేశాలు వణికిపోతున్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా బాధితులకు వైద్యం అందించడం ఆయా దేశాలకు పెను సవాల్గా మారడంతో విదేశీయులను వారి మాతృ దేశాలకు పంపిస్తున్నాయి. ఢిల్లీలో కరోనాతో రికార్డు స్థాయిలో ఒకేరోజు 131 మంది చనిపోయారు. కొన్ని మార్కెట్లు మూసివేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించగా తాజాగా మాస్కులు లేకుండా ప్రజలు బయట సంచరిస్తే రూ.2,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో రెండో దశను కూడా దాటి మూడో దశకు వైరస్ వ్యాప్తి చేరుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. మిగతా రాష్ట్రాల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గుజరాత్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా... కోవిడ్ సెకండ్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో గుజరాత్లో పంచాయితీ ఎన్ని కలను వాయిదా వేయడం గమనార్హం. అమెరికాలో కేసులు తగ్గక పోవ డంతో లాస్ ఏంజెలిస్లో మొదటిసారి రాత్రిపూట కర్ఫూ విధించడంతో పాటు.. మూడు వారాల లాక్డౌన్ దిశగా సన్నద్ధమవు తున్నారు. యూకే లాంటి దేశాల్లో క్రిస్మస్ వేడుకలను 5 రోజులకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ టీకాను ఆవిష్కరించినా మన దేశ పరిస్థితులకు అది ఎంతమేర సరిపోతుందనే సందేహాలున్నాయి. -
చలికాలంలో ఆరోగ్య సమస్యలు, పరిష్కారాలు
మనం ఇప్పుడు చలికాలం ముంగిట్లో ఉన్నాం. ఉక్కపోతల, ఉబ్బరింతల బాధలేమీ లేకుండా... కంబళిలో వెచ్చగా ముడుచుకుని పడుకునే హాయిని అనుభవింపజేసేంత ఆహ్లాదం ఉన్నప్పటికీ ఈ సీజన్ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను మాత్రం తెచ్చిపెడుతుంది. పైగా ఇది వైరస్లు మరింత బలపడేందుకు అనువైన కాలం కావడంతో కరోనా మళ్లీ విజృంభిస్తుందా అనే సందేహం ఎలాగూ ఓ పక్కన ఆందోళనపరుస్తూ ఉంది. దాంతోపాటు ఈ సీజన్ తెచ్చిపెట్టే సాధారణ ఆరోగ్య సమస్యలేమిటో ఓసారి చూద్దాం. వాటి నుంచి బయటపడే మార్గాలను తెలుసుకుందాం. చలికాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతూ ఉంటాయి. దాంతో చలి వాతావరణంలో వైరస్లూ, ఇతర సూక్ష్మజీవులూ చాలా చురుగ్గా ఉంటాయని, ఓ పట్టాన వాటిని అరికట్టడం కష్టమన్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో సాధారణంగా కనిపించే కొన్ని ఇతర సమస్యలనూ, వాటి పరిష్కారాలనూ చూద్దాం. జలుబు... దాని సంబంధిత వైరల్ జ్వరాలు దాదాపు రెండువందలకు పైగా రకాల వైరస్లతో మనకు జలుబు వస్తుంది. ఆ వైరస్లతో కనిపించే కొన్ని సమాన లక్షణాలను బట్టి గ్రూపులు చేస్తే అందులో ఆరు రకాల గ్రూపులతో జలుబులు వస్తుంటాయని తేలింది. అవే... 1) ఇన్ఫ్లుయెంజా, 2) పారాఇన్ఫ్లుయెంజా, 3) రైనోవైరస్, 4)ప్రస్తుతం లోకాన్నంతా వణికిస్తున్న కరోనా వైరస్ 5) ఎడినో వైరస్, 6) హ్యూమన్ రెస్పిరేటరీ నిన్సీషియల్ వైరస్. వీటి కారణంగా జలుబు చేసినప్పుడు కొద్దిగా జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు లేదా కళ్ల నుంచి నీరు కారడం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వైరస్ సోకాక 5–7 రోజుల్లో ఈ లక్షణాలన్నీ తగ్గిపోతాయి. అయితే అరుదుగా కొన్నిసార్లు మాత్రం ఈ వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి నిమోనియాను కలగజేస్తుంది. ప్రస్తుతం కరోనా కూడా అంతే. శ్వాసవ్యవస్థ పైన ఉంటే అది కూడా జలుబు లాగే తగ్గిపోతుంది. కానీ అదే వైరస్ కాస్తంత లోతుకు వెళ్లి శ్వాసవ్యవస్థ కింది భాగానికి వ్యాపిస్తే అది నిమోనియాకు దారితీస్తుంది. ఇలాంటప్పుడే సమస్య తీవ్రమవుతుంది. పరిస్థితి విషమించే అవకాశాలూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ముక్కు, శ్వాసకోశ వ్యవస్థలోని సన్నని ఎపిథీలియల్ పొర దెబ్బతినడం వల్ల బ్యాక్టీరియా చేరి సైనుసైటిస్, ఫ్యారింజైటిస్ మొదలైనవి వచ్చే అవకాశమూ లేకపోలేదు. నివారణ... ►మంచి పుష్టికరమైన సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దాంతో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దీనివల్ల జలుబే గాక మరెన్నో రుగ్మతలనుంచి రక్షణ లభిస్తుంది. ►జలుబు వచ్చినవారు సైతం నేరుగా తుమ్మడం, దగ్గడం చేయకుండా చేతిరుమాళ్లు, టిష్యుపేపర్లు వంటివాటిని అడ్డు పెట్టుకోవడం అవసరం. ఇదే జాగ్రత్త కరోనా వ్యాప్తినీ అరికడుతుందని గుర్తుపెట్టుకోవాలి. దీనికి తోడు చేతుల శానిటైజేషన్, భౌతికదూరం జాగ్రత్తలూ ఇటు జలుబునూ, అటు కరోనానూ నివారిస్తాయి. నివారణ... చికిత్స... చిట్కాలు... జలుబు తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) రుగ్మత. చికిత్సగా కేవలం ఉపశమనం (సపోర్టివ్ ట్రీట్మెంట్) మాత్రమే ఇస్తుంటారు. జలుబు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దాని లక్షణాలను తగ్గించడానికి (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్గా) జ్వరానికి పారాసిటమాల్, ముక్కులు పట్టేసినప్పుడు డీకంజెస్టెంట్స్, నేసల్ డ్రాప్స్ వాడవచ్చు. గొంతునొప్పి, గొంతులో గరగర వంటి వాటికి లోజెంజెస్ వాడవచ్చు. థ్రోట్ గార్గిల్ (గరగరా పుక్కిలించడం) చేయవచ్చు. ఒక్కోసారి జలుబుతో జ్వరం వచ్చి తగ్గిపోయాక కూడా నీరసం, నిస్సత్తువ ఉంటాయి. దాన్నే ‘పోస్ట్ పైరెక్సియల్ డెబిలిటీ’ అంటారు. అది తగ్గాలంటే మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. జలుబూ, కరోనాల నివారణకూ అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం, జింక్, విటమిన్–సి ఎక్కువగా ఉండే ఆహారాలు అవసరం. వ్యాధినిరోధక శక్తిని సమకూర్చుకునేందుకు వ్యాయామం తప్పనిసరి. కరోనా సెకండ్వేవ్కు అవకాశం... చలి వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని కరోనా తన సెకండ్వేవ్ను మొదలుపెడుతుందేమోననే సందేహం ఇప్పుడు దేశమంతటా ఉంది. ఇదే విషయాన్ని సీసీఎంబీ వంటి సంస్థలు సైతం నొక్కిచెబుతూ... తమ హెచ్చరికలతో అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనాను అరికట్టడానికి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్లు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజేషన్ వంటి ప్రక్రియలతో పాటు సమూహాల నుంచి దూరంగా ఉంటూ... ఇలా వెళ్లాల్సి వచ్చినప్పుడు భౌతిక దూరాలను పాటిస్తూ ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడంపై మనకు తగినంత అవగాహనే ఉంది. -
ఉష్ణోగ్రతలు మరింత పతనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు మరింత పడిపోతున్నాయి. వికారాబాద్ జిల్లా మోమీన్పేట్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో ఆదివారం రాత్రి అతి తక్కువగా 8.4 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 8.5, ఆదిలాబాద్ జిల్లా బేల, కామారెడ్డి జిల్లా మధ్నూర్, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.6 డిగ్రీల చొప్పున రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా 20కిపైగా మండలాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక వివిధ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్లో ఆదివారం రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 9.8 డిగ్రీ సెల్సియస్గా నమోదుకాగా.. హైదరాబాద్లో 13.6 డిగ్రీలు, నిజామాబాద్లో 14.4 డిగ్రీలు, దుండిగల్లో 14.6 డిగ్రీలు, మెదక్లో 14.8 డిగ్రీల చొప్పున రికార్డయింది. మెదక్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలో మరో రెండ్రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల ఉంటుందని, సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
బ్రిటన్లో ముందుంది విలయం!
లండన్: రానున్న శీతాకాలంలో కోవిడ్–19 కారణంగా బ్రిటన్లో కనీసం లక్షా ఇరవై వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. చలి కారణంగా ప్రజలు ఎక్కువగా ఇళ్లు, భవనాల్లో ఎక్కువ సమయం గడిపే అవకాశమున్నందున చలికాలంలో వైరస్ మరోసారి వ్యాప్తి చెందే అవకాశముందని పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చునని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఎంఎస్) స్పష్టం చేసింది. కేవలం 9 నెలల కాలంలో లక్షకుపైగా మరణాలు నమోదవుతాయని తెలిపింది. బ్రిటన్లో కోవిడ్–19 మహమ్మారి ఏ రూపం సంతరించుకుంటుందన్న విషయంపై ప్రస్తుతం చాలా అస్పష్టత ఉందని, ఒకరి నుంచి ఎంతమందికి వ్యాధి సోకుతుందన్న విషయాన్ని సూచించే ఆర్–నాట్ ప్రస్తుతమున్న 0.9 నుంచి సెప్టెంబర్కల్లా 1.7కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఏఎంఎస్ తెలిపింది. ఏఎంఎస్ నిర్వహించిన మోడలింగ్ ప్రకారం సెప్టెంబర్ 2020 నుంచి జూన్ 2021 మధ్యకాలంలో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లోనే 1,19,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారు. ఇది తొలిసారి వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువ. -
చలిరాత్రి
సాక్షి, హైదరాబాద్: ఉత్తర భారతం నుంచి చలిగాలులు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గత నెలలో ప్రవేశించాల్సిన చలి గాలులు ఆలస్యంగా రావడంతో పలు చోట్ల ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఇప్పటివరకు తూర్పు దిశ నుంచి తేమ గాలులు వచ్చాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదైన సంగతి తెలిసిందే. చలి గాలులు ప్రవేశించడంతో రాష్ట్రంలో పలుచోట్ల ఒక్కసారిగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా భీమ్పూర్ మండలం అర్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 5.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తంసిలో 6.2 డిగ్రీలు, కొమురం భీం జిల్లా సిర్పూరులో 6.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బరంపూర్లో 7 డిగ్రీలు, జైనాడ్, బేలాలలో 7.1 డిగ్రీల చొప్పున, భోరాజ్లో 7.2 డిగ్రీలు, ఆదిలాబాద్ పట్టణం, రాంనగర్లలో 7.3 డిగ్రీల చొప్పున, తలమడుగులో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. వచ్చే నెలలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. వాతావరణ మార్పుల కారణంగానే ఈసారి గతం కంటే చలి తీవ్రత తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నేడు పలు జిల్లాల్లో చలిగాలులు.. పొడి వాతావరణం కారణంగా సోమవారం ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని రాజారావు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
శీతాకాలంలో గొర్రెల, మేకల సంరక్షణ
పశువులకు శీతాకాలం ఒక గడ్డు కాలం. వీటి ఉత్పాదకత తగ్గకుండా చలి బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద పొట్ట పశువులే కాకుండా, గొర్రెలు, మేకలు కూడా శీతాకాలం ప్రభావానికి లోనవుతాయి. మెలకువలు పాటించడం శ్రేయస్కరం. శీతాకాలంలో గొర్రెల యాజమాన్యం: 1. గొర్రెలకు తప్పనిసరిగా గృహవసతి ఉండాలి. కనీసం చెట్టు నీడనన్నా ఉంచాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మంచు బారిన పడకుండా చూడాలి. 2. ఇటీవల ఉన్నిని కత్తిరించిన గొర్రెలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. చలి నుంచి రక్షణ ఇవ్వాలి. 3. అప్పుడే పుట్టిన గొర్రెపిల్లల మీద ఉన్న మాయ తాలూకు తడిని వెంటనే శుభ్రం చేయాలి. లేదంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి ‘హైపోధర్మియ’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. 4. ఈతకు వచ్చిన గొర్రెలను శ్రద్ధగా పర్యవేక్షించాలి. 5. రెండు నెలల వయస్సున్న గొర్రె పిల్లలు చలిని తట్టుకుంటాయి. కానీ షెడ్లలో తేమతో కూడిన వాతావరణం ఉన్నట్లయితే న్యూమోనియా ప్రబలే అవకాశముంది. 6. శీతాకాలంలో శరీర ఉష్ణాన్ని కాపాడుకునేందుకు శరీరంలో జీర్ణప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని గొర్రెలు బయటకు పంపవు. కాబట్టి శరీర ఉష్ణ నిర్వహణకు పీచు పదార్థం గల మేతను మేపాలి. 7. చూడి 15 వారాల సమయంలో సుమారు 2 కిలోల పచ్చిమేతను అందించాలి. జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటివన్నమాట. చివరి 4 వారాల చూడి దశలో వీటితోపాటుగా 500 గ్రాముల మొక్కజొన్న పిండిని ఇవ్వాలి. 8. గొర్రె ఈనిన తర్వాత 2.5 కిలోల పచ్చిమేతతోపాటుగా 15% ప్రొటీను గల సమీకృత దాణాను ఒక కిలో ఇవ్వాలి. 9. మంచి నీరు నిల్వ లేకుండా అవసరాన్ని బట్టి అందుబాటులో ఉంచాలి. మేకల యాజమాన్యం 1. మందమైన పొడవాటి వెంట్రుకలు చలి నుంచి కాపాడుతాయి. 2. పరిశుభ్రమైన వెచ్చటి గడ్డితో కూడుకున్న పక్కను ఏర్పాటు చేయాలి. 3. పెద్ద మేకలకు గృహవసతి లేకున్నా.. చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. 4. గొర్రెలకన్నా మేకలు ఎక్కువ పీచును జీర్ణం చేసుకోగలుగుతాయి. ఎక్కువ పీచు పదార్థాలు కలిగిన చెరకు పిప్పి, పొద్దుతిరుగుడు మొక్కలు, ఎండిన కంది కట్టె వంటి వాటిని మేపవచ్చు. 5. మేకల్లో ఈ సీజన్లో ఎక్కువగా పేలు కనబడతాయి. వాటి నుంచి రక్షణ అవసరం. 6. ఖనిజ లవణ ఇటుకలను షెడ్లలో గాని, చెట్లకు గాని వేలాడదీయాలి. – డా. ఎం.వి.ఎ.యన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ – అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి