Siddharth
-
ప్రియురాలి మెడలో మూడు ముళ్లు.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి వేడుక (ఫోటోలు)
-
అలాంటివి చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడిని.. నేనే వదిలేశా!: సిద్దార్థ్
సిద్దార్థ్.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరో.. కానీ ఆ క్రేజ్ను అలాగే కాపాడుకోలేకోయాడు. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, .. ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇటీవలి కాలంలో కోలీవుడ్పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అయితే తన కెరీర్లో కొన్ని పనులు చేయకపోవడం వల్లే స్టార్ కాలేకపోయానంటున్నాడు.అలాంటివి రిజెక్ట్ చేశా..ఇటీవల హైదరాబాద్ సాహిత్య వేడుకకు హాజరైన హీరో సిద్ధార్థ్ (Siddharth) సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా దగ్గరికి చాలారకాల స్క్రిప్టులు వచ్చేవి. అమ్మాయిలను కొట్టడం, ఐటం సాంగ్స్ చేయడం, నడుము గిల్లడం.. నేను చెప్పినట్లుగా అమ్మాయిలు నడుచుకోవడం.. ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలన్నది నేనే ఆదేశాలివ్వడం.. ఇలాంటి కంటెంట్తో కొన్ని కథలు వచ్చాయి. వాటిని నేను రిజెక్ట్ చేశాను. బహుశా అవి ఒప్పుకుని ఉంటే ఈరోజు నేను పెద్ద స్టార్ అయ్యుండేవాడినేమో! కానీ నేను నా మనసుకు నచ్చినవే చేసుకుంటూ పోయాను.ఆ సంతోషాన్ని, అభిమానాన్ని వెలకట్టలేంచాలామంది నా దగ్గరకు వచ్చి మీరు ఆడవాళ్లకు చాలా గౌరవం ఇస్తారని చెప్తూ ఉంటారు. మహిళలకే కాదు, పేరెంట్స్కు, పిల్లలకు.. ఇలా అందరికీ గౌరవప్రాధాన్యతలిస్తారని అంటుంటారు. అంతేకాదు వారి పిల్లలు పదిహేనేళ్లుగా నా సినిమాలు చూస్తున్నారని చెప్తుంటారు. ఇంతకంటే సంతోషకరమైనది ఇంకేముంటుంది? ఈ అభిమానానికి కోట్లల్లో కూడా వెలగట్టలేం. చాలామంది హీరోలు యాక్షన్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మగవాళ్లు బాధను బయటకు చూపించకూడదన్నట్లుగా ఉంటున్నారు. కానీ నేనలా కాదు.. స్క్రీన్పై ఏడవడాన్ని కూడా సంతోషంగా చేస్తాను అని చెప్పుకొచ్చాడు.(చదవండి: Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ)చేసిందంతా చేసి సుద్దపూసలా..అయితే ఈయన మాటలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆట (Aata Movie), గృహం సినిమా (Gruham Movie)లో నువ్వు చేసిందేంటి? అని ప్రశ్నిస్తున్నారు. చేసిందంతా చేసి ఇలాంటి నీతులు చెప్పడం అవసరమా? అని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరేమో.. ఈ మార్పు ఎప్పుడు మొదలైందో చెప్పుంటే బాగుండేది.. ఎందుకంటే గతంలో సిద్దార్థ్ కూడా హీరోయిన్స్తో హద్దుమీరి రొమాన్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక బుద్ధి వచ్చినట్లుంది.. అందుకే ఈ మార్పు అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు.సినిమాసిద్దార్థ్ సినిమాల విషయానికి వస్తే.. 2023లో చిత్తా (చిన్నా) సినిమాతో హీరోగా, నిర్మాతగా విజయం అందుకున్నాడు ఈయన చివరగా ఇండియన్ 2, మిస్ యు మూవీలో యాక్ట్ చేశాడు. త్వరలోనే ఇండియన్ 3, టెస్ట్ చిత్రంలో భాగం కానున్నాడు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే హీరోయిన్ అదితిరావు హైదరిని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ రెండో పెళ్లితెలంగాణలోని వనపర్తిలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయంలో వీరి వివాహం జరిగింది. తర్వాత రాజస్థాన్లోని అలీలా ఫోర్ట్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరికిద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం గమనార్హం! ఇకపోతే వీరిద్దరికీ మహాసముద్రం సినిమా సమయంలో పరిచయం, స్నేహం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. దాన్ని పెళ్లితో ముందుకు తీసుకెళ్లారు.చదవండి: 19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్కి వస్తారన్నాడు: హీరోయిన్ -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన సిద్దార్థ్ మూవీ
హీరో సిద్దార్థ్ (Siddharth).. ఒకప్పుడు టాప్ హీరో! ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు! తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ఇతడు ఈ మధ్యకాలంలో మాత్రం హిట్లు లేక అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్లుగా సక్సెస్కు దూరంగా ఉన్న సిద్దార్థ్ రెండేళ్లక్రితం చిత్తా (చిన్నా) మూవీతో విజయం అందుకున్నాడు. అయినప్పటికీ ఈ సినిమాకు తమిళంలో వచ్చినంత ఆదరణ తెలుగులో రాకపోవడం గమనార్హం.ఓటీటీలో సిద్దూ మూవీసిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యూ. గతేడాది డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన మిస్ యు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా మిస్ యు మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. జనవరి 10 నుంచి మిస్ యు.. అమెజాన్ ప్రైమ్లో తమిళ, తెలుగు భాషల్లో ప్రసారమవుతోంది. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ్, ఆషిక రంగనాథ్ జంటగా నటించారు. శామ్యూల్ మాథ్యూస్ నిర్మించారు. గిబ్రాన్ సంగీతం అందించారు.(గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)సిద్దార్థ్ కెరీర్ అలా మొదలైందిబాయ్స్ సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టాడు సిద్దార్థ్. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో సెన్సేషన్ అయ్యాడు. బొమ్మరిల్లుతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్లోనూ అడుగుపెట్టాడు. అతడు హిందీలో నటించిన తొలి చిత్రం రంగ్ దే బసంతి. బాలీవుడ్ స్ట్రైకర్, చష్మే బద్దూర్ సినిమాలు చేశాడు. హిందీలోనూ లక్ పరీక్షించుకున్న సిద్దార్థ్కానీ అక్కడ పెద్దగా గుర్తింపు లేకపోవడంతో సౌత్లోనే తన స్టార్డమ్ను కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొన్ని విజయాలను సాధించగా మరికొన్ని అపజయాలను మూటగట్టుకున్నాడు. తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, మహా సముద్రం సినిమాలు చేశాడు. గత కొన్నేళ్లుగా తమిళంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం టెస్ట్, ఇండియన్ 3 సహా మరో తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాడు.సింగర్ కూడాసిద్దార్థ్ హీరో మాత్రమే కాదు.. నిర్మాత, సింగర్ కూడా! లవ్ ఫెయిల్యూర్, జిల్ జంగ్ జుక్, చిత్తా (చిన్నా) చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఇతడు ఎన్నో పాటలు పాడాడు. అపుడో ఇపుడో ఎపుడో.. (బొమ్మరిల్లు మూవీ), నిను చూస్తుంటే.. (ఆట), ఓయ్ ఓయ్ (ఓయ్ మూవీ), మా డాడీ పాకెట్స్.. (ఓ మై ఫ్రెండ్), ఎక్స్క్యూజ్ మీ రాక్షసి.. (నిను వీడని నీడను నేనే) ఇలా ఎన్నో పాటలు ఆలపించాడు.గతేడాది పెళ్లిసిద్ధార్థ్ 2024 సెప్టెంబర్లో తన ప్రేయసి, హీరోయిన్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో మొదటగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే!చదవండి: భార్య కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్న కమెడియన్ -
అదితిరావు- సిద్ధార్థ్ పెళ్లి.. ప్రపోజల్ ఫోటో వైరల్
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరిద్దరికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.(ఇది చదవండి: అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?)తాజాగా అదితిరావు హైదరీ న్యూ ఇయర్ సందర్భంగా పోస్ట్ చేసింది. గతేడాది జరిగిన మధుర జ్ఞాపకాలను షేర్ చేసింది. హీరామండిలో నటన, సిద్ధార్థ్ ప్రపోజల్ ఫోటోతో పాటు అతనితో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ఓ వీడియో రూపంలో తన ఇన్స్టాలో పంచుకుంది. ఇందులో తన ఎంగేజ్మెంట్, పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి. థ్యాంక్యూ యూ 2024.. వెల్కమ్-2025 అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు. జూన్లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్ల్యాండ్లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్లోని ఓ రిసార్ట్లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
నువ్వునువ్వుగా,నేనునేనుగా..నా చేయి పట్టుకో ప్రియతమా: అదు-సిద్ధూ ఫోటోషూట్ అదిరిందిగా (ఫొటోలు)
-
రెండోసారి పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ - అదితీ (ఫొటోలు)
-
మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్-అదితీ
హీరో సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అవును మీరు సరిగానే విన్నారు. హీరోయిన్ అదితీతో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఇతడు.. సెప్టెంబరులో ఈమెని పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణలోని వనపర్తిలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయం దీనికి వేదికైంది. ఇప్పుడు మరోసారి వివాహమాడాడు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)సెప్టెంబరులో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్లోని అలీలా ఫోర్ట్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అదితీ, సిద్ధార్థ్ తమ తమ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో తోటీ నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే రంగనాథ్ స్వామి ఆలయండో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ కోరిక ప్రకారం రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్) -
చాన్నాళ్ల తర్వాత ప్రేమకథతో వస్తున్నాను: సిద్ధార్థ్
‘‘మిస్ యు’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. రాజశేఖర్ ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. చాన్నాళ్ల తర్వాత ‘మిస్ యు’ లాంటి ఒక అందమైన ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఈ సినిమాని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనిపిస్తోంది’’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. ఎన్. రాజశేఖర్ దర్శకత్వంలో సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం ‘మిస్ యు’. శామ్యూల్ మాథ్యూస్ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఎల్ఎల్పీ సంస్థ ఈ నెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ‘మిస్ యు’ ప్రీ రిలీజ్ వేడుకలో సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘నేటి యువతరానికి మా మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ‘మిస్ యు’ తర్వాత నాకు మరిన్ని మంచి ప్రేమకథలు వస్తాయి.గిబ్రాన్ ఈ సినిమా కోసం ఎనిమిది అద్భుతమైనపాటలు ఇచ్చారు. శామ్యూల్గారు ΄్యాషన్ ఉన్న నిర్మాత. ఈ సినిమాను మంచి ప్రొడక్షన్ విలువలతో నిర్మించారు. మా సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ ఎల్ఎల్పీ సంస్థకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
బాక్సాఫీస్ బరిలో పుష్ప-2.. అలా జరిగితే వాళ్లే భయపడాలన్న హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ పెళ్లి తర్వాత తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది చిన్నాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం మిస్ యూ. ఈ మూవీలో నాసామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమైంది. ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో మిస్ యూ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ను నిర్వహించారు. ఈ మీట్లో బాక్సాఫీస్ వద్ద పోటీపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ సినిమా విడుదల తర్వాత వారం రోజుల్లోనే పుష్ప-2 రిలీజవుతోంది.. ఈ ఎఫెక్ట్ మీ చిత్రంపై ఉంటుంది కదా? మీరేందుకు డేర్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..' ఇక్కడ నా కంట్రోల్లో ఉన్నదాని గురించే నేను మాట్లాడతా. ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఎంత ఖర్చు పెట్టారనేది సినిమా స్థాయి నిర్ణయించదు. మీరు చెప్పింది కూడా కరెక్టే. రెండోవారం కూడా ఆడాలంటే ముందు నా సినిమా బాగుండాలి..ప్రేక్షకులకు నచ్చాలి. అప్పుడే నా మూవీ థియేటర్లో ఆడుతుంది. తర్వాత వేరే సినిమా గురించి వాళ్లు ఆలోచించాలి. వాళ్లు భయపడాలి. అంతేకానీ ఒక మంచి సినిమాను థియేటర్లో నుంచి ఎవరూ తీయలేరు. ఈ రోజుల్లో చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఇది 2006 కాదు.. ఇప్పుడున్నంత సోషల్ మీడియా అవేర్నెస్ అప్పట్లో లేదు. సో మంచి సినిమాను ఎవరూ థియేటర్ నుంచి తీయలేరు కూడా' అని అన్నారు. సిద్ధార్థ్ నటించిన మిస్ యు నవంబర్ 29న విడుదల కానుండగా.. అల్లు అర్జున్ పుష్ప -2 ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. మిస్ యూ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. -
నా జీవితంలోకి ఒక దేవత వచ్చింది: పెళ్లిపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్
కోలీవుడ్ హీరీ సిద్ధార్థ్ మరోమూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది చిన్నా మూవీతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మిస్ యూ అంటూ వచ్చేస్తున్నారు. ఈ చిత్రంలో నా సామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈవెంట్లో హాజరైన సిద్ధార్థ్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆదితి రావు హైదరీతో పెళ్లి తర్వాత వస్తోన్న మీ మొదటి చిత్రం.. మీ లైఫ్ ఎలా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా లైఫ్ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇలాంటి వరం దొరికినందుకు నేను చాలా గ్రేట్ఫుల్. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. అంతేకాదు నా లైఫ్లోకి నా దేవత వచ్చింది. 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్. ఏంటి మంచి జరిగిందా? అనేది. సెకండ్ రిలీఫ్. హమ్మయ్య ఆ దేవుడి దయతో అంతా మంచి జరిగిందని.. అలాంటి టైమ్లో మనం బతుకుతున్నాం కాబట్టి.. నాకైతే నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు' అంటూ తన పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు.కాగా.. కోలీవుడ్ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. అగ్రతారలతో అరుదైన ఫోటోలు
-
అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ ఇటీవలే వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాదిలోనే వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వనపర్తి ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవీ కాస్తా వైరల్ కావడంతో అభిమానులు, సినీతారలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.అయితే వీరి పెళ్లి తర్వాత నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. ఇంతకీ వీరి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆదితిరావు హైదరీ రాజవంశానికి చెందిన కుటుంబం కావడంతో అభిమానులు ఆస్తులపై ఆరా తీస్తున్నారు.అయితే ప్రస్తుతం గణాంకాల ప్రకారం అదితి రావు హైదరీ ఆస్తులు రూ.60కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటుందని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. జాగరణ్ ఇంగ్లీష్ నివేదిక ప్రకారం నిర్మాత, హీరోగా రాణిస్తున్నసిద్ధార్థ్ ఆస్తులు కూడా దాదాపు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ లెక్కన ఇద్దరికీ కలిపి సుమారు రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లకు మధ్య ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముంబయిలోని వర్సోవాలో అదితికి ఓ అపార్ట్ మెంటు కూడా ఉంది. మార్చి 2024న సిద్ధార్థ్- అదితి నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. ఆ ఆలయంలోనే పెళ్లి ఎందుకంటే?ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ వనపర్తిలోని ఆలయంలోనే పెళ్లి చేసుకోవడంపై కూడా చర్చ మొదలైంది. దాదాపు 400ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి అదితి కుటుంబానికి ముఖ్యమైదని సమాచారం. ఆ సెంటిమెంట్తోనే వీరి పెళ్లి అక్కడే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదితి తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు కావడం విశేషం. అదితిరావు చివరిసారిగా హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్లో కనిపించింది. సిద్ధార్థ్ ఇటీవల విడుదలైన ఇండియన్-2లో కనిపించారు. -
అదితి-సిద్ధార్థ్ ఒక్కటైంది ఇక్కడే (చిత్రాలు)
-
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అదితి-సిద్ధార్థ్ (ఫొటోలు)
-
ఐఫోన్ లాంఛ్ ఈవెంట్లో కాబోయే టాలీవుడ్ కపుల్.. ఫోటోలు
-
కాబోయే భర్తకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. పిక్స్ షేర్ చేసిన హీరోయిన్!
హీరోయిన్ అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ ఈ ఏడాదిలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ ఆలయంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు. అయితే తాజాగా తనకు కాబోయే భర్తకు అవార్డులు రావడం పట్ల ఆదితిరావు సంతోషం వ్యక్తం చేసింది. ఈ గెలుపు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.తాజాగా సిద్ధార్థ్ తన ఫిల్మ్ఫేర్ అవార్డులు పక్కన పెట్టుకుని నిద్రిస్తున్న ఫోటోను అదితి రావు హైదరి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో సిద్ధార్థ్ నటించిన చిత్తా(చిన్నా) సినిమా ఏకంగా ఏడు అవార్డులు సాధించింది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్తా మూవీకి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), లీడ్రోల్లో ఉత్తమ నటి (మహిళ), ఉత్తమ సహాయ పాత్ర (ఫీమేల్), ఉత్తమ సంగీత ఆల్బమ్, ఉత్తమ నేపథ్య గాయని (ఫీమేల్) విభాగాల్లో అవార్డులు దక్కాయి. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
Hyderabad: అపార్ట్మెంట్లోకి దూసుకొచ్చిన తూటా
మణికొండ: బైరాగిగూడలో ఓ అపార్ట్మెంట్ బెడ్రూం కిటికీ అద్దాల్లోంచి దూసుకువచ్చి గోడకు తగిలిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బైరాగిగూడలోని ఓ అపార్ట్మెంట్ అయిదో అంతస్తులో సాఫ్ట్వేర్ ఉద్యోగి సిద్ధార్థ్ ఉంటున్నారు. శనివారం ఆయన ఉదయం తన భార్యతో కలిసి కిందకు వెళ్లి వాకింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఓ తూటా వీరి ఇంట్లోని బెడ్రూం కిటికీ అద్దాలను చీల్చుకుంటూ వచ్చి గోడకు తగిలింది. ఆ శబ్దానికి ఇంట్లోని పెంపుడు కుక్క పెద్దగా అరవటంతో వాకింగ్ చేస్తున్న సిద్ధార్థ్ ఇంట్లోకి వచ్చారు. కిటికీకి రంధ్రం ఉండటం, బెడ్రూంలో తుపాకీ తూటా కింద పడి ఉండటాన్ని గమనించి ఎవరో తన ఇంటిపై కాల్పులు జరిపారని భయాందోళనకు గురయ్యారు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి సీఐ హరికృష్ణారెడ్డి పరిశీలించారు. పక్కనే ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి వచ్చి ఉంటుందని, వారు శుక్రవారం నుంచి ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. పక్కనే ఉన్న ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింగ్ రేంజ్లకు సమీపంలో అపార్ట్మెంట్లకు అనుమతులు ఇవ్వటం, ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఇబ్రహీంబాగ్ రెజిమెంట్ నుంచి మణికొండ క్వార్టర్స్లోకి బుల్లెట్లు వచ్చి పడ్డాయని స్థానికులు గుర్తు చేశారు. -
భారతీయుడు 2 మూవీ స్టిల్స్ HD
-
ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్బాస్ భోలే షావలి
కమల్హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2 థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కమల్ హాసన్ నటన, సిద్దార్థ్ ఫర్మామెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ వీక్షించిన బిగ్బాస్ ఫేమ్ భోలే షావలి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారతీయుడు-2 మూవీతో సిద్ధార్థ్ జన్మ ధన్యమైపోయిందని అన్నారు.భోలే షావలి మాట్లాడుతూ..' ఈ సినిమాతో సిద్ధార్ధ్ జన్మ ధన్యమైపోయింది. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. సినిమా చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయా. కళ్లు తుడుచుకుంటూనే సినిమా చూశా. ఇక్కడ ఇండియన్-3 గురించి చిన్న హింట్ ఇచ్చారు. స్వాతంత్ర్య పోరాటం మళ్లీ మన కళ్ల ముందు కనిపించేలా ఉండనుంది' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్గా ఇండియన్-2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. #Kalki2898AD రేంజ్ లో #Bharateeyudu2 ఎంజాయ్ చేస్తారు - Audience ReactionWatch Full public response here ▶️ https://t.co/rez0iLsFFFRead review here 🔗 https://t.co/8I8RV7o8em#KamalHaasan #Shankar #Indian2 #TeluguFilmNagar pic.twitter.com/XnxlwRPuXr— Telugu FilmNagar (@telugufilmnagar) July 12, 2024 -
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్: భారతీయుడు 2(ఇండియన్ 2)నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్,సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్కరన్ కథ, దర్శకత్వం: ఎస్.శంకర్సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్రఫీ: రవి వర్మన్విడుదల తేది: జులై 12, 2024కమల్ హాసన్ నటించిన బెస్ట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్(సిద్దార్థ్), హారతి(ప్రియాభవాని శంకర్) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో య్యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో షేర్ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్బ్యాక్ ఇండియా(Comeback India) హ్యాష్ట్యాగ్తో సేనాపతి(కమల్ హాసన్) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌంట్ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్ప్లే కూడా చాలా రొటీన్గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్ లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఇక సెకండాఫ్లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో మర్మకళను ఉపయోగించి సీక్స్ ఫ్యాక్తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్ హాసన్కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్ ఫ్యాక్స్తో కమల్ చేసే యాక్షన్ సీన్కి థియేటర్లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ప్రియురాలు దిశగా నటించిన రకుల్కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్గా ఎస్ జే సూర్యకి పార్ట్ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Bharateeyudu 2 X Review: ‘భారతీయుడు 2’ టాక్ ఎలా ఉందంటే.. ?
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు(1996)’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి(కమల్ హాసన్) చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదలైన 28 ఏళ్ల తర్వాత సీక్వెల్గా భారతీయుడు 2(ఇండియన్ 2) వచ్చింది. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న శంకర్.. మరోసారి తనదైన మార్క్ సందేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.Bharateeyudu 2 Telugu Review: ‘భారతీయుడు 2’ మూవీ ఎలా ఉందంటే..?ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘భారతీయుడు కథేంటి?, సేనాపతిగా మరోసారి కమల్ ఆకట్టుకున్నాడా? లేదా? శంకర్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. . ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్లో ‘భారతీయుడు 2’కి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. అంతగా ఆకట్టుకోలేకపోయిందని మరికొంత మంది ట్వీట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా వరకు నెగెటివ్ టాకే వినిపిస్తోంది. కొంతమంది అయితే ఈ చిత్రానికి నిజంగానే శంకర్ దర్శకత్వం వహించాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. #Bharateeyudu2 Movie Review 🔥🔥🔥 1/2Hats off to director #Shankar for his top level direction.#KamalHassan is steel the complete show. Social Message of the movie will reach to every audience.Overall movie wins normal audience heart💐💐#Bharateeyudu2Review#Indian2Review pic.twitter.com/tRB6cidHsV— Movie Muchatlu (@MovieMuchatlu1) July 12, 2024 డైరెక్టర్ శంకర్కి హాట్సాఫ్. అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు. కమల్ హాసన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సోషల్ మెసేజ్ ప్రతి ఆడియన్కి రీచ్ అవుతుంది. నార్మల్ ఆడియన్స్ మనసును కూడా ఆకట్టుకునేలా సినిమా ఉంది’ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. Genuine #Indian2Review/#Bharateeyudu2ReviewDISASTER👎Rating 1.5/5Impactless,Dragged, Boring,Outdated,Cringe Movie👎#Siddharth #KamalHaasan (Less Screen time) &Director #Shankar gone Outdated👎#Indian2 #Bharateeyudu2#Hindustani2Review #Hindustani2 https://t.co/3c9WuK58GK— #Kalki2989AD ❤ (@TheWarriorr26) July 12, 2024 భారతీయుడు 2 డిజాస్టర్ మూవీ. బోరింగ్, ఔడేటెడ్ స్టోరీ. సాగదీశారు. ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. డైరెక్టర్ శంకర్ పని అయిపోయింది’ అంటూ మరో నెటిజన్ కేవలం 1.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. first half: movie starts well, but follows conventional shankar sir’s screenplay making it very predictable and boring.. no gripping/exciting sequences.. needs a very strong second half #Indian2 #Bharateeyudu2 https://t.co/fgOf5prfHJ— movie buff (@newMovieBuff007) July 12, 2024 ఇప్పుడే ఫస్టాఫ్ కంప్లీట్ అయింది. మూవీ ప్రారంభం బాగానే ఉంది. కానీ కథ ముందుగు సాగుతున్నకొద్ది బోరింగ్గా అనిపించింది. శంకర్ స్క్రీన్ప్లే ఆకట్టుకోలేకపోయింది. గ్రిస్పింగ్గా, ఎగ్జైట్మెంట్ చేసే సీక్వెన్స్లేవి లేవు. సెకండాఫ్ బాగుండాల్సి ఉంది’అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.. #Indian2 Review 1.5/5Fully disappointed Bad screenplay Emotions lackIndian 3 kastame... pic.twitter.com/fcaOB7vPHX— 👥𝕳𝖆𝖗𝖘𝖍𝖆💫 (@Harsh___07__) July 12, 2024 ‘సినిమా నిరుత్సాహపరిచింది. స్క్రీన్ప్లే అస్సల్ బాగోలేదు. ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కాలేదు. ఇండియన్ 3 కష్టమే’ అని ఒకరు ట్వీట్ చేశారు.#Indian2 is an outdated and tedious movie. Though the movie tries to give honest messages, it’s done in a boring way with no proper emotion and drama at all. Shankar tried to repeat the screenplay of his old movies but fails to recreate the magic big time. All of the emotions…— Venky Reviews (@venkyreviews) July 12, 2024#Indian2 #Bharateeyudu2 #indian2review Telugu review:It’s just an average to below average movie. There is no story it is just like a set up to Indian3. Yes Indian3 trailer was played after the rolling titles and Indian3 seems pretty interesting and I think Indian3 would be…— Vijay (@vijay827482) July 12, 2024#Bharateeyudu2 #Indian2 Stil remember the first part can't say whether the sequel could match it as the bench mark was high it releases today but there is no buzz at least in Hindi. Why aren't films being promoted ##Kalki2898AD too was released in a similar way. WOM will decide.— Bhaskar Agnihotri (@BHASKARAGNIHOT) July 12, 2024#Indian2 #Bharateeydu2 #Indian2Review #Bharateeydu2Review #Review *Not Engaging at all*No shankar mark*No emotional ConnectDid Shankar directed this movie for real ?— Raju (@rsofficial18) July 12, 2024Finally Kamal Hassan's entry.. But it has zero impact in the audience with 30 mins of lag boring scenes. Even Kamal Hassan's entry failed to excite the mass audience. Till now, there is not even a single scene of Shankar's calibre #Indian2 #Bharateeyudu2 pic.twitter.com/gztpLV2iwJ— Taran Adarsh (@tarann_adarshh) July 12, 2024 -
'భారతీయుడు 2' టీమ్కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కమల్ హాసన్ 'భారతీయుడు 2' చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా వేశారు. అయితే ఓ సినిమా కోసం సీఎం రేవంత్ ఇలా ట్వీట్ ఎందుకు చేశారు? అసలేంటి విషయం?(ఇదీ చదవండి: నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్)కొన్నిరోజుల క్రితం సినిమా టికెట్ రేట్ల గురించి ఓ సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇకపై ఎవరికైనా సరే రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే 'భారతీయుడు 2' టీమ్ నుంచి కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రఖని, డైరెక్టర్ శంకర్.. ఓ వీడియో రిలీజ్ చేశారు.దీనికి రిప్లై ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. 'భారతీయుడు 2 బృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా.. శ్రీ కమల్ హాసన్, శ్రీ శంకర్, శ్రీ సిద్దార్, శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం' అని రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: 'ఈ జనరేషన్లోనే వరస్ట్ హీరో'.. అందుకే 4 జాతీయ అవార్డులు!)భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు.డ్రగ్స్ రహిత సమాజం కోసం…ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా…శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ…శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో…రూపొందించడం హర్షించదగ్గ విషయం.#DrugFreeTelangana #SayNoToDrugs pic.twitter.com/MDkT95sqze— Revanth Reddy (@revanth_anumula) July 9, 2024 -
నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్
-
నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్
ఇండియన్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని.. నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వానికి తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని సిద్ధార్థ్ అన్నారు. మన పిల్లల భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని తెలిపారు. వారి కాపాడాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. బెటర్ సొసైటీ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. నా కెరీర్లో సామాజిక బాధ్యతను తనవంతుగా భావిస్తానని పేర్కొన్నారు. కాగా.. సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించిన ఇండియన్-2 జూలై 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.అంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా పేరు సిద్ధార్థ్. నేను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నా.. తెలుగు సినిమాలో ఒక చేతిలో కండోమ్ పట్టుకుని బిల్ బోర్డ్స్లో నా ఫోటో వచ్చేలా గతంలోనే ప్రభుత్వానికి సహకరించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005 నుంచి 2011 వరకు ఎక్కడా హోర్డింగ్ కనిపించినా కండోమ్ పట్టుకుని మీకు సిద్ధార్థ్ కనిపిస్తాడు. ఆ సామాజిక బాధ్యత నాది. ఒకరు చెబితే నాకు గుర్తుకు రాదు. ఎవరైనా చెప్తే చేయాల్సిన అవసరం నాకు రాలేదు. మాకు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇది చేస్తేనే అది చేస్తాం అని చెప్పలేదు' అని అన్నారు. -
భారతీయుడు 2 తీయడానికి 25 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే..
-
ఇండియన్ 2 అమ్ముతున్నాం అందరూ కొనండి ప్లీజ్
-
Kamal Haasan: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
Indian 2: 103 ఏళ్ల సేనాపతి ఫైట్స్ ఎలా చేస్తాడు..? శంకర్ సమాధానం ఇదే
హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో విడుదలైన బ్లాక్బస్టర్ సినిమా ‘ఇండియన్’కి సీక్వెల్స్గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలు రూసొందాయి. కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్స్లో ముందు ‘ఇండియన్ 2’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్లో సేనాపతిగా కమల్హాసన్ కొన్ని మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లు చేశారు. అయితే ‘ఇండియన్’ సినిమాలో సేనాపతికి 75 సంవత్సరాలు. ఈ ప్రకారం 2024లో ఆయన వయస్సు 103కి చేరుతుంది. అలాంటప్పుడు అంత వయసులో సేనాపతి మార్షల్ ఆర్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఎలా చేయగలుగుతున్నాడు అనే సందేహాలను వ్యక్తపరచారు కొందరు నెటిజన్లు. ఈ విషయంపై ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో శంకర్ స్పందించారు. ‘‘నా దృష్టిలో సేనాపతి ఓ సూపర్ హీరో. ‘భారతీయుడు’ కథ రాసుకున్నప్పుడు సేనాపతిని ఓ స్వాతంత్య్ర సమరయోధుడిగా చూపించాలని అప్పుడు సేనాపతికి 75 సంవత్సరాలు అన్నట్లుగా చూపించాం. అప్పుడు సీక్వెల్ ఆలోచన లేదు. ఇప్పుడు ‘భారతీయుడు 2’లో చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్గా సేనాపతి కనిపిస్తాడు. అత్యధిక వయసు కలిగిన ఫైటర్స్ చైనాలో ఉన్నారు. 108 సంవత్సరాలు ఉన్న లు జీజీయన్ అనే చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారు. వారి సాధన, క్రమశిక్షణ వారిని అలా తీర్చిదిద్దుతుంది. సేనాపతి కూడా అలాంటివాడే’’ అని చెప్పుకొచ్చారు శంకర్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, ఎస్జే సూర్య, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ‘ఇండియన్ 3’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. -
కమల్హాసన్ 'భారతీయుడు 2' మూవీ స్టిల్స్
-
సోనాక్షి పెళ్లి.. రిసెప్షన్లో మెరిసిన కాబోయే వధూవరులు!
బాలీవుడ్ భామ సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్, దక్షిణాది సినీతారలు సందడి చేశారు. బాంద్రాలో జరిగిన ఈ ఫంక్షన్లో కాబోయే వధూవరులు అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ మెరిశారు.కాగా.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ ఈ ఏడాది మార్చి 27న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట తమ బంధాన్ని అఫీషియల్గా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా సోనాక్షి పెళ్లికి వీరిద్దరు జంటగా హాజరయ్యారు. అయితే ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్లో ఆదితిరావు కీలక పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్లో సోనాక్షి సిన్హాతో కలిసి నటించింది. వీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లే రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. 2021 తెలుగు సినిమా మహా సముద్రం సెట్స్లో సిద్ధార్థ్, అదితి మొదటిసారి కలుసుకున్నారు. -
సెల్ఫీ అడిగిన అభిమాని.. ఓవర్ యాటిట్యూడ్ చూపించిన హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చిన్నా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ చిత్రం ఇండియన్-2 లో కనిపించనున్నారు. తాజాగా సిద్ధార్థ్ ముంబయిలోని బాంద్రాలో సందడి చేశారు.సిద్ధార్థ్ తన కారు వద్దకు వెళ్తుండగా ఫోటో దిగేందుకు యత్నించాడు. దీంతో అతనిపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇక్కడ సౌండ్ చేయొద్దంటూ అతన్ని వారించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు. అభిమానులతో ఇలాంటి ప్రవర్తన సరికాదని సూచిస్తున్నారు.కాగా.. ఈ ఏడాదిలోనే సిద్ధార్థ్, ఆదితి రావు హైదరీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వనపర్తిలోని ఓ ఆలయంలో ఈ జంట సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆదితి రావు హైదరీ ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్లో మెరిసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
చాలా కాలం తరువాత లవ్స్టోరీతో వస్తున్న సిద్ధార్థ్
తమిళసినిమా: ఇటీవల చిత్తా వంటి విజ యవంతమైన చిత్రంలో నటించిన నటుడు సిద్ధార్థ్. తాజాగా మరోసారి ప్రేమ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి మిస్యూ అనే టైటిల్ను నిర్ణయించారు. తమిళనాడులో బ్రాండింగ్, డిజిటర్ మార్కెటింగ్ రంగాల్లో పేరు గాంచిన 7 మైల్స్ ఫర్ సెకండ్ సంస్థ అధినేత సామ్యువేల్ మ్యాధ్యూ ఈ చిత్రం ద్వారా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. కాగా ఇందులో తెలుగు, కన్నడం భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న నటి ఆషికా రంగనాథ్ కథానాయకిగా కోలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు.నటుడు జేపీ, పొన్వన్నన్, కరుణాకరన్, నరేన్, అనుపమ, రమ, బాలా శరవణన్, లొల్లు సభ మార న్, సస్టిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా మాప్పిళై సింగం, కళత్తిల్ సంధిప్పోమ్ వంటి సక్సెస్పుల్ చిత్రాల దర్శకుడు ఎన్.రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం, కేజీ.వెంకటేశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది హీరో హీరోయిన్లకు మాత్రమే ప్రాముఖ్యత ఉండేలా కాకుండా, అందరికీ ప్రాధాన్యత ఉండేలా కథ, కథనాలు ఉంటాయన్నారు. వినోదంతో కూడిన ప్రేమ కథా చిత్రంగా మిస్యూ ఉంటుందన్నారు. చాలా కాలం తరువాత నటుడు సిద్ధార్థ్ పూర్తిగా ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాంటిక్ లవర్ బాయ్గా నటిస్తున్నట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 చిత్రంలో సిద్ధార్థ్ ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. -
'భారతీయుడు 2' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
త్వరలో పెళ్లి.. వెకేషన్లో చిల్ అవుతున్న సిద్దార్థ్- అదితి (ఫోటోలు)
-
కొత్త కబురు చెప్పిన సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ కొత్త కబురు చెపారు. తన కెరీర్లోని 40వ సినిమాను ప్రకటించారు. ‘8 తోట్టాకళ్’ ఫేమ్ శ్రీ గణేశ్ దర్శకత్వం వహించనున్న ఈ ద్విభాషా (తెలుగు– తమిళం) చిత్రాన్ని ‘మావీరన్’ ఫేమ్ అరుణ్ విశ్వ నిర్మించనున్నారు. శనివారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘చాలా స్క్రిప్ట్స్ విన్న తర్వాత శ్రీగణేశ్ చెప్పిన ఈ సినిమా కథ నచ్చడంతో ఓకే చెపాను. అరుణ్ విశ్వలాంటి మంచి నిర్మాతతో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాను అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టినప్పుడు యూత్తో పాటు పరిణితి గల నటుడు కావాలనుకున్నాను. అందుకే సిద్ధార్థ్ కరెక్ట్ అనుకున్నాను. ఆయన కొన్ని సూచనలు పంచుకున్నారు’’ అన్నారు శ్రీ గణేశ్. ‘‘దర్శకుడు కథ చెప్పినప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, భాషలకు అతీతంగా ఆకట్టుకునే చిత్రం అవుతుందని నేను బలంగా నమ్మాను. జూన్లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు అరుణ్ విశ్వ. -
సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ పై తొలిసారి స్పందించిన అదితిరావు హైదరీ
-
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ అదితిరావ్ హైదరీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన భారీబడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండిలో నటించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో సిద్ధార్థ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై స్పందించింది. సిద్ధార్థ్తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది.అదితి మాట్లాడుతూ.. 'నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను. మా ఇద్దరి రిలేషన్పై రూమర్స్ రావడం సహజమే. కానీ మేం మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం. వారు మా కంటే ఎంతో ప్రైవేట్గా ఉంటారు. మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్ను బయటకు చెప్పేశాం. ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం'అని తెలిపింది.ఆమె ఇంకా మాట్లాడుతూ..'నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. నా గోప్యత, పవిత్రతను నేను నమ్ముతా. నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని' తెలిపింది.కాగా.. హీరో సిద్దార్థ్తో డేటింగ్లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్లో ఉన్నారు. వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో బిబో జాన్ పాత్రలో అదితి రావ్ హైదరీ నటించింది. -
Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్
-
ఎంగేజ్మెంట్ తర్వాత సిద్దార్థ్ ఫస్ట్ బర్త్డే.. ప్రియురాలి విషెస్ (ఫోటోలు)
-
తన లవర్బోయ్కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ఎంగేజ్మెంట్ సీక్రెట్గా జరగలేదు, మా పెళ్లెప్పుడంటే?
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. ఒకప్పుడు సూపర్ హిట్లతో అలరించిన ఇతడికి ఈ మధ్య తెలుగులో విజయాలే కరువయ్యాయి. సినిమాల సంగతి ఎలా ఉన్నా తెలుగు హీరోయిన్ అదితిరావు హైదరితో డేటింగ్ చేస్తూ, షికార్లకు వెళ్తూ అందరి కంట్లో పడ్డాడు. కానీ తన ప్రేమ విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. పెళ్లి కాస్తా ఎంగేజ్మెంట్ అయింది! ఈ క్రమంలో మార్చి 17న సడన్గా వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలో ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. తమిళనాడు నుంచి పురోహితులను తీసుకొచ్చి మరీ ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. కానీ ఆలయ అధికారులకు, పండితులకు అది సినిమా షూటింగ్ అని చెప్పి బురిడీ కొట్టించారు. తర్వాత ఆ డెకరేషన్, సెలబ్రేషన్స్ చూస్తే అది పెళ్లని అందరూ పొరబడ్డారు. దీంతో సిద్దార్థ్ సోషల్ మీడియా వేదికగా తానింకా పెళ్లి చేసుకోలేదని, జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమేనని వెల్లడించాడు. సీక్రెట్ కాదు.. తాజాగా ఓ ఈవెంట్కు వెళ్లిన అతడికి ఎందుకు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు? పెళ్లి ముహూర్తాలు పెట్టించారా? అని వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సిద్దార్థ్ స్పందిస్తూ.. చాలామంది మేమేదో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నామంటున్నారు. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. మేము మా కుటుంబసభ్యులతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ చేసుకున్నాం. ఏ ఒక్కరినీ పిలవకుండా, చెప్పాపెట్టకుండా చేసుకుంటే అది సీక్రెట్ అంటారు. మరి మా వాళ్లందరి సమక్షంలో జరిగిన నిశ్చితార్థం సీక్రెట్ ఎలా అవుతుంది? పెళ్లి వారి చేతుల్లోనే.. ఇకపోతే అదితికి ప్రపోజ్ చేసినప్పుడు ఏం సమాధానం వస్తుందా? అని ఎదురుచూశాను. నా టెన్షన్ పోగొడుతూ తను నాతో జీవితాన్ని పంచుకోవడం సమ్మతమే అని అంగీకరించడంతో సంతోషపడిపోయాను. పెళ్లి విషయానికి వస్తే అది మా పెద్దలు నిర్ణయిస్తారు. నేను డిసైడ్ చేయడానికి ఇదేమీ షూటింగ్ డేట్ కాదు కదా.. పెద్దవాళ్లే ముహూర్తాలు చూసి ఓ మంచిరోజు డిసైడ్ చేస్తారు. అప్పుడే పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. చదవండి: అతడిని ఎంతో ప్రేమించా.. పెళ్లి దగ్గర్లో ఉందనగా నేనంటే ఇష్టం లేదన్నాడు! -
పెళ్లిపై స్పందించిన సిద్దార్థ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరో!
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. డేటింగ్ను ఓపెన్గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. తాజాగా మార్చి 27న అదితిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. అయితే తన పెళ్లిపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందిచాడు. తాజాగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 'ఆమె ఓకే చెప్పింది.. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయిందని ఫ్యాన్స్ భావిస్తుంటే సిద్ధార్థ్ సడన్ షాకిచ్చాడు. ఎంగేజ్మెంట్ పోస్ట్తో అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి పడేశాడు. మరి వీళ్లద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
Siddharth-Aditi Rao Marriage: సిద్దార్థ్ పెళ్లిలో ట్విస్ట్.. వారికి అబద్ధం చెప్పారా?
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్ను ఓపెన్గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. వీళ్ల ప్రేమ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న(మార్చి 27న) అదితిని సీక్రెట్గా పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. షూటింగ్ అని చెప్పి వనపర్తే ఎందుకంటే? అదితిరావు హైదరి పూర్వీకులు వనపర్తి సంస్థానాధీశులు. అందుకనే ఆ సంస్థానానికి చెందిన ఆలయంలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆలయంలో పని చేసే స్థానిక పూజారులకు సినిమా షూటింగ్ అని చెప్పి గుడిని అందంగా ముస్తాబు చేశారట! వారిని లోపలకు రానివ్వకుండా తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పెళ్లి తంతు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి మండపం, గుడిని డెకరేట్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కన్ఫమ్ చేసిన హోస్ట్ అదితి రావు హైదరి హీరామండి: ద డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని ముంబైలో బుధవారం నిర్వహించారు. సిరీస్లో నటించిన అందరూ స్టేజీపై మెరిశారు, ఒక్క అదితి తప్ప! ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సచిన్ కుంబర్ మాట్లాడుతూ.. అదితి ఇక్కడ ఎందుకు లేదో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఆమె పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి అని తెలిపారు. దీంతో సిద్దార్థ్- అదితి పెళ్లి నిజమేనని అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. చదవండి: గతంలో విడాకులకు దరఖాస్తు.. ఇప్పుడేమో ఇంకో ఆప్షన్ లేదంటూ.. -
Siddharth-Aditi Rao Photos: ఆ వార్తల్లో నిజమెంత?.. ట్రెండింగ్ లో సిద్దార్థ్ ,అదితిరావు హైదరీ
-
అదితిని పెళ్లాడిన సిద్ధార్థ్.. ఆ విషయంపైనే అందరి చర్చ!
ఎట్టకేలకు టాలీవుడ్ హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరిని పెళ్లాడారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో వీరిద్దరి పెళ్లికి జరిగింది. రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021)చిత్రంలో నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు ఈ జంటపై వస్తున్న రూమర్స్ను నిజం చేస్తూ.. ఒక్కసారిగా వాటన్నింటికీ తెరదించారు. పెళ్లి జరిగిపోవడంతో వీరిద్దరి గురించి అభిమానులు తెగ వెతికేస్తున్నారు. అయితే ఈ జంట వయస్సు గురించి అభిమానులు చర్చ మొదలెట్టారు. ఈ జంటకు ఏజ్ గ్యాప్ ఎంత ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. మరీ మీరు ఈ విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలు ఏంటో చూసేయండి. (ఇది చదవండి: హీరో సిద్దార్థ్ మాజీ భార్య గురించి తెలుసా?) అదితి రావు హైదరి అక్టోబర్ 28న 1986న ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 37 సంవత్సరాలు. మరోవైపు హీరో సిద్దార్థ్ 1979 ఏప్రిల్ 17న చెన్నైలో జన్మించారు. వీరిద్దరి మధ్య దాదాపు 7 సంవత్సరాల వయస్సు తేడా కనిపిస్తోంది. కాగా.. గతంలో అదితి సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. అతను ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ సైతం మొదట మేఘనా నారాయణ్ను పెళ్లాడారు. ఆమెతో 2007లోనే సిద్ధార్థ్ విడాకులు తీసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అదితి రావు హైదరీ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన అదితి.. తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్లో హీరోయిన్గా మెరిసింది. మరోవైపు సిద్ధార్థ్.. కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ -2లో నటించనున్నారు. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్, ఓ మై ఫ్రెండ్ చిత్రాలతో మెప్పించారు. -
హీరో సిద్దార్థ్ మాజీ భార్య గురించి తెలుసా?
సిద్దార్థ్ తమిళ హీరో.. కానీ తెలుగులో కూడా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాయ్స్ సినిమాతో వరుస అవకాశాలు అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో తన నటనతో కట్టిపడేశాడు. బొమ్మరిల్లు మూవీతో స్టార్ హీరో అయిపోయాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆట, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు.. ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ నెమ్మదిగా తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో టాలీవుడ్కు దూరమయ్యాడు. ఆ మధ్య మహాసముద్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా హిట్ కొట్టలేకపోయాడు. గతంలో పెళ్లి కొంతకాలంగా హీరోయిన్ అదితిరావు హైదరితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాడు సిద్దార్థ్. మీడియా ముందు మాత్రం ఆమెతో కలిసి పోజివ్వడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఈరోజేమో సడన్గా అదితిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు.. అతడికి ఆల్రెడీ పెళ్లయిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిలాగే కనిపిస్తాడు కాబట్టి ఇది రెండో పెళ్లంటే నమ్మలేకపోతున్నారు. మూడేళ్లకే మనస్పర్థలు సిద్దార్థ్ 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఢిల్లీలో అతడి పక్కింట్లోనే ఉండేది. సిద్దార్థ్- మేఘన మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మూడేళ్లకే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కలిసుండటం కష్టమని భావించి 2007లో విడాకులు తీసుకున్నారు. హీరోయిన్ సోహా అలీ ఖాన్తో ప్రేమ వ్యవహారం నడపడం వల్లే దంపతుల మధ్య గొడవలు తలెత్తాయని అప్పట్లో మీడియా కోడై కూసింది. ఆమె వల్లే బ్రేకప్ వారు తరచూ కలుసుకుంటూ, సినిమాలకు వెళ్తూ కనిపించడంతో ఇది నిజమేనని పలువురు భావించారు. సదరు హీరోయిన్ మాత్రం తాము కేవలం స్నేహితులమేనని ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం సిద్దార్థ్.. సోహాతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. కొంతకాలానికి వీరు కూడా విడిపోయారు. చదవండి: తెలుగు హీరోయిన్ను పెళ్లాడిన సిద్దార్థ్.. ఇద్దరికీ రెండోదే! -
సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్
హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది. తమిళనాడు పురోహితులు దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించడం విశేషం. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్దార్థ్- అదితి పెళ్లి జరిగింది. జర్నీ ఎక్కడ మొదలైంది? అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021) మూవీలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఇద్దరూ వెకేషన్కు, ఈవెంట్స్కు కలిసే వెళ్తున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్, పెళ్లికి సైతం జంటగా హాజరవడంతో వీరి ప్రేమ నిజమేనని అభిమానులు భావించారు. ఓ షోలో మీతో జీవితాంతం కలిసి డ్యాన్స్ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అని సిద్దార్థ్కు ప్రశ్న ఎదురవగా.. 'అదితి' దేవో భవ అంటూ తన ప్రేమ గురించి చెప్పకనే చెప్పాడు. కానీ డైరెక్ట్గా తన ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని సిద్దార్థ్.. ఇప్పుడేకంగా సీక్రెట్గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎవరీ అదితి? అదితిరావు హైదరి.. అచ్చ తెలుగమ్మాయి. తన కెరీర్ మొదలైంది మాత్రం మలయాళ సినిమాతో! హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్లో హీరోయిన్గా మెరిసింది. గతంలో ఈమె సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది. 2012లో అతడికి విడాకులిచ్చింది. సిద్దార్థ్ కూడా గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లాడాడు. వీరి మధ్య బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. సినిమాల విషయానికి వస్తే బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్, ఓ మై ఫ్రెండ్.. ఇలా ఎన్నో సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు. చదవండి: తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్ -
Oy! Re Release: థియేటర్లో యువతి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్
ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి నెల నాలుగైదు పాత సినిమాలను మళ్లీ ఒక్కరోజు థియేటర్స్లో ప్రదర్శిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే రీరిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలన్నీ మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ప్రేమికుల రోజు ఏకంగా 9 సినిమాలను రీరిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయిన మూవీ ఓయ్. సిద్ధార్థ్, షామిలీ హీరోయిన్లుగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2009లో రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కానీ టీవీల్లోకి వచ్చిన తర్వాత విశేష ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని బాగా ఆదరించింది. అందుకే ప్రేమికుల రోజు ఈ మూవీని మళ్లీ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు థియేటర్ లో ఓయ్ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. దానికి ఈ వీడియోనే నిదర్శనం. రీరిలీజ్లో భాగంగా నిన్న వైజాగ్లోని ఓ థియేటర్స్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మూవీ చూసేందుకు వచ్చిన ఓ అమ్మాయి.. తన డ్యాన్స్తో అదరగొట్టేసింది. ఎల్లో శారీలో వచ్చిన ఆ యువతి.. ఓయ్ సినిమాలోని ప్రతి పాటకు ఊర మాస్ స్టెప్పులేసి ఆకట్టుకుంది. హీరోయిన్కు ఏ మాత్రం తీసిపోని విధంగా స్టెప్పులేస్తూ..అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. Finally lengthy video mikosam🌝 🤌 rampp asalu dance 🥵❤️#OyeReRelease #OyeMovie Thanks for the movie @AnandRanga 💥 pic.twitter.com/DEBKaMC3WV — Iconboy (@bunny_tweetz) February 14, 2024 -
వేసవిలో మ్యాచ్ను ప్లాన్ చేసుకున్న నయనతార
‘ది టెస్ట్’ను పూర్తి చేశారు నయనతార. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సింగర్ శక్తి శ్రీగోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు, ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాను గత ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. వీడియో వైరల్!
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్ఠ్. గతేడాది చిన్నా సినిమాతో అభిమానులను అలరించారు. అయితే సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్ ఆదితి రాయ్ హైదరతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరు జంటగా కనిపించారు. ఇప్పటికే చాలాసార్లు జంటగా కనిపించిన వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా రూమర్ జంట మరోసారి కెమెరాలకు చిక్కింది. ముంబైలో ఓ ఫంక్షన్కు హాజరైన వీరిద్దరు ఫోటోలకు పోజులిచ్చారు. తాజాగా ముంబయికి చెందిన నటి నటాషా పూనావాలా తన నివాసంలో నిర్వహించిన కచేరీకి పార్టీకి ఈ జంట హాజరయ్యారు. ఈ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న అదితి, సిద్ధార్థ్ కెమెరాల కంటికి చిక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. వీరిని చూసిన ఫోటోగ్రాఫర్ 'ఆదితి జీ ఏక్ కపుల్ ఫోటో ప్లీజ్' అంటూ సరదాగా ఆమెను ప్రశ్నించారు. దీనికి నవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. వీరితో పాటు అక్కడే ఉన్న నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కనిపించారు. అయితే వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పట్ల ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. సినిమాల విషయానికొస్తే అదితి ప్రస్తుతం ఇండో-యుకె కో-ప్రొడక్షన్ 'లయనెస్'లో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అదితి.. సంజయ్ లీలా భన్సాలీ 'హీరమండి' చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
బౌద్ధవాణి: సత్యం పలకడం చాలా అవసరం!
సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని.. ‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు. ‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’ ‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు. 'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.' ‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’ ‘‘చూశాను భగవాన్’’ ‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’ బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు.. ‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ.. ‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’ ‘‘ఖాళీగా ఉంది భగవాన్’’ ‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు. అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ముఖ స్తుతి -
సొంత ఫిన్టెక్ ఏర్పాటులో ఎల్ఐసీ
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా సొంత ఫిన్టెక్ విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. మరోవైపు, కార్యకలాపాల డిజిటలీకరణ కోసం ప్రాజెక్ట్ డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్, వేల్యూ ఎన్హాన్స్మెంట్)ను చేపట్టామని, దీనికి కన్సల్టెంట్ను నియమించుకున్నామని పేర్కొన్నారు. కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా కస్టమర్లు తమ ఇంటి దగ్గరే మొబైల్ ఫోన్తో అన్ని సరీ్వసులను పొందగలిగేలా వివిధ ప్రక్రియలను సులభతరం చేస్తున్నట్లు మహంతి పేర్కొన్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధార్థ్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొన్ని సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించే కంటెంట్ ఉంటుంది. కానీ రాంగ్ టైంలో రిలీజ్ కావడం వల్ల.. థియేటర్లలోకి రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. తీరా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇదే సినిమా జనాలకు నచ్చేయొచ్చు. అలా హీరో సిద్ధార్థ్కి హిట్ వచ్చేలా చేసిన ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఏంటా సినిమా? తెలుగోడు కానప్పటికీ హీరోగా టాలీవుడ్లో సిద్ధార్థ్ మంచి క్రేజ్ సంపాదించాడు. కానీ రానురాను సరైన మూవీస్ చేయకపోవడంతో ఇతడిని తెలుగు ప్రేక్షకులు కూడా పక్కనబెట్టేశారు. అలా గత కొన్నాళ్ల నుంచి తమిళంలోనే నటిస్తూ, వాటిని తెలుగులో డబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది 'చిన్నా' అనే మూవీని నిర్మించి, లీడ్ రోల్ చేశాడు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల అనే సెన్సిటివ్ పాయింట్తో ఈ సినిమా తీశారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!) 'చిన్నా' కథేంటి? అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపతో కలిసి ఈశ్వర్ (సిద్ధార్థ్).. ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతడు ఉంటున్న ఊరిలో చిన్నపిల్లల్ని అహహరించి అత్యాచారం చేయడం, దారుణంగా చంపేయడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఈశ్వర్పై కూడా ఇలాంటి ఆరోపణలు వస్తాయి. మరోవైపు ఈశ్వర్ అన్న కూతురు కిడ్నాప్ అవుతుంది. మరి అన్న కూతుర్ని ఈశ్వర్ వెతికి పట్టుకున్నాడా? చివరకు ఏమైందనేదే 'చిన్నా' స్టోరీ. ఓటీటీ రిలీజ్ డేట్ అక్టోబరు 6న తెలుగులో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ నిలబడలేకపోయింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. నవంబరు 17 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) -
'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!
‘సమ్మోహనం’తో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా తన 37వ పుట్టినరోజును జరుపుకుంది. అక్టోబర్ 28న జన్మించిన ఈ హైదరబాదీ భామ తెలుగులో సైకో, అంతరిక్షం, హే సినామికా లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: పునీత్ రాజ్కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే కోలీవుడ్ హీరోతో మన హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మహా సముద్రం చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీని అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కించగా.. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చాలా సార్లు వార్తలొచ్చాయి. ఈ జంట లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా ఇద్దరు కలిసి పార్టీల్లో కనిపించడంతో వీరి రిలేషన్పై నిజమేనంటూ కథనాలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా అదితి బర్త్డే సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్స్టాలో విషెస్ చెప్పారు. ఈ ఒక్క పోస్ట్తో వీరిద్దరి రిలేషన్పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కోలీవుడ్ హీరో. అయితే ఈ ఫోటోను మహాసముద్రం డైరెక్టర్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీనంతటికీ కారణం నేనేనా? అంటూ కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ..' దీనికి కారణం నేనే అని అందరూ అనుకుంటున్నారు... అసలు ఏం జరుగుతోంది??' అంటూ అదితి, సిద్ధార్త్ ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. కాగా.. సిద్ధార్థ్ ఇటీవలే చిన్నా(చిత్తా) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అదితి ప్రస్తుతం గాంధీ టాక్స్, లయనీస్ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. (ఇది చదవండి: 'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్!) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔#Siddharth @aditiraohydari pic.twitter.com/vcXQcMrmvu — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2023 -
సిద్దార్థ్ ఎమోషనల్ మూవీ 'చిన్నా' ఓటీటీ పార్ట్నర్ ఇదే!
సిద్దార్థ్.. తమిళ హీరోనే అయినా తెలుగువారికి ఎంతో దగ్గరయ్యాడు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాలతో బాక్సాఫీస్ హిట్లు కొట్టి ఇక్కడ స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అతడు ప్రేక్షకులకు కొంత దూరమయ్యాడనే చెప్పాలి. సరైన హిట్ కోసం అతడు చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఎమోషనల్ కథను సెలక్ట్ చేసుకుని నటించడమే కాక నిర్మాతగానూ మారాడు. ఇటీవల అతడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చిత్తా'. ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 28న రిలీజైంది. తమిళనాడులో హిట్ కొట్టిన ఈ మూవీ తెలుగులో చిన్నా పేరుతో అక్టోబర్ 6న రిలీజైంది. అయితే తెలుగులో ఈ చిత్రానికి ఆశించినంత కలెక్షన్స్ రాలేదు. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో చిన్నా చిత్రం ఓటీటీలోకి రానుంది. ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నిమిష సజయాన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ ముఖ్య పాత్రలు పోషించారు. చదవండి: రైతుబిడ్డ పేరు జపం చేసిన అశ్విని.. ఈ వారం నామినేషన్స్లో ఎవరున్నారంటే? -
డబుల్ ఎలిమినేషన్.. ప్రోమోలో ఆ జంటనే లేపేశారుగా!
బిగ్బాస్ షోకి ఉన్న ప్రధాన సమస్య లీక్స్.. ఎపిసోడ్ ప్రారంభం అయ్యే సమయానికే ఆరోజు ఏం జరగబోతుంది? ఎవరు గొడవపడతారు? ఎవరు ఆడుతారు? ఎవరు గెలుస్తారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇలా అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. ఫలితంగా బిగ్బాస్ ఎపిసోడ్లో పస లేకుండా పోతోంది. ఈసారి కూడా అదే జరిగింది. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని ప్రచారం జరిగింది, జరుగుతూనే ఉంది. అయినా మీరు చెప్పేదేంటి? నేనే చెప్తేస్తే ఓ పనైపోతుంది అనుకున్నారో ఏమో కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇద్దరు కంటెస్టెంట్లనే లేపేశారు. డాక్టర్బాబు గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురు ఇద్దరూ ప్రోమోలో ఒక్కచోట కూడా లేకపోవడంతో వీరి ఎలిమనేషన్ దాదాపు ఖరారైపోయింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయింది ఇద్దరే కానీ, ఒకరిని నిజంగానే అవతలకు పంపించేయలేదని లేటెస్ట్ టాక్! గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్లి ఎపిసోడ్ అంతా అయ్యాక తిరిగి హౌస్ లోపలకు పంపిస్తారట! మరి ఈ సీక్రెట్ రూమ్ వ్యవహారం నిజమే అయితే అది ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! ఇకపోతే సిద్దార్థ్ హౌస్లో చేసిన హంగామా మామూలుగా లేదు. అటు మాస్ మహారాజ రవితేజ సైతం రంగంలోకి దిగాడు. వీరి రచ్చ రంబోలా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామెడీ ఫిలిం.. రెట్టింపైన కలెక్షన్స్.. ఓటీటీ పార్ట్నర్ ఏదంటే? -
సురేశ్ కొండేటికి సిద్ధార్థ్ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే?
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్. ఈ చిత్రంలో జెనీలియా అతనికి జంటగా నటించింది. ప్రస్తుతం ఆయన చిత్తా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాగా.. తెలుగు ఈనెల 6న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్కు ఆయన హాజరయ్యారు. (ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే? ) అయితే ఈ ప్రెస్ మీట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సినిమా ఈవెంట్స్లో కాంట్రవర్సీ ప్రశ్నలకు కేరాఫ్గా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి కూడా హాజరయ్యారు. ఆయన ప్రశ్నలు అడిగేముందే హీరో సిద్ధార్థ్.. అతనిపై సీరియస్ కామెంట్స్ చేశారు. మీరు కాస్తా పద్ధతిగా ప్రశ్నలు అడిగితే బాగుంటుందని మీకు చెప్పమని నాకు ఇంటర్నెట్లో సలహా ఇచ్చారంటూ సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. 'కొండేటి సురేశ్కు ఒక వార్నింగ్. మొత్త ఇంటర్నెట్ నీకు వార్నింగ్ ఇవ్వమంది. ఆయనను పిలిస్తే పద్ధతిగా కూర్చొని, పద్ధతిగా ప్రశ్నలు అడగమని చెప్పండి. అలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని సలహా ఇచ్చారు. అయితే నేను వారికి కూడా ఒకటి చెప్పాను. సురేశ్ కొండేటి నా ఫ్రెండ్ అయ్యా. అతనికి రైట్స్ ఉన్నాయి అని చెప్పా' అని నవ్వుతూ అన్నారు. ఈ వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!) Sariponu....... pic.twitter.com/DBYIHOGOAl — Arehoo_official (@tweetsbyaravind) October 3, 2023 -
ప్రభాస్ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్
-
గేటు బయట నిలబెట్టి మాట్లాడారు.. సిద్ధార్థ్ ఎమోషనల్
హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినా.. తెలుగు హీరోలతో సమానంగా ఆయన సినిమాలు ఇక్కడ విజయం సాధించాయి. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం తదితర సినిమాలు సిద్ధార్థ్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం సిద్ధార్థ్కి సరైన హిట్ పడలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ టాలెంటెడ్ హీరోని పక్కన పెట్టేశారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇటీవల టక్కర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ ఆ సినిమా రిలీజైన విషయమే చాలా మందికి తెలియదు. ‘చిన్నా’తో కమ్బ్యాక్ చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతవుతున్న సిద్ధార్థ్కి తాజాగా ఓ సూపర్ హిట్ పడింది. ఆయన నటిస్తూ నిర్మించిన ‘చిట్టా’ చిత్రం తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడే ఇదే చిత్రాన్ని ‘చిన్నా’పేరుతో తెలుగులో అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. అంజలీ నాయర్, నిమిష సజయన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 28నే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సింది. కానీ ఆ రోజు ఇక్కడ చాలా సినిమాలు విడుదల కావడంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. దీంతో అక్టోబర్ 6న వాయిదా వేశారు. రిలీజ్కు ఎవరూ ముందుకు రాలేదు ‘చిన్నా’చిత్రాన్ని తమిళ్తో పాటు కన్నడ, మలయాళంలో కూడా సెప్టెంబర్ 28 నాడే రిలీజ్ చేశారు. కానీ తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు. దానికి గల కారణం ఏంటో తాజాగా జరిగిన తెలుగు ప్రెస్మీట్ సిద్ధార్థ్ వెల్లడించాడు. ‘నా సినిమా బాగుందని ఉదయనిధి స్టాలిన్ తమిళ్లో కొన్నాడు. కేరళ కూడా అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ గోకులమ్ గోపాలన్ మా సినిమాను తీసుకున్నాడు. కన్నడలో కేజీయఫ్ నిర్మించివారు విడుదల చేశారు. కానీ తెలుగులో మాత్రం చిన్నా రిలీజ్కు ఎవరూ ముందుకు రాలేదు. కొంతమంది అయితే ‘సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారని’అడిగారట. (చదవండి: హీరో సిద్ధార్థ్ భావోద్వేగం.. ఇక్కడికి ఇకపై రానంటూ!) మా సినిమా చూసి విడుదల చేయండి అని కొంతమంది దగ్గరకు వెళ్తే.. గేటు బయటే నిలబెట్టి మాట్లాడారు. ఇన్నేళ్ల నా సినీ కెరీర్లో ఇలాంటి అవమానం జరగలేదు. నేను తెలుగు సినిమాలు చేయకపోవడానికి కూడా కారణం ఉంది. 2013 నుంచి 2022 వరకు నా దగ్గరకు కేవలం మూడు కథలు మాత్రమే టాలీవుడ్ నుంచి వచ్చాయి. అందులో ‘మహా సముద్రం’ ఒకటి. నేనొక నటుడిని మాత్రమే. నాకు ఒక ప్రాంతం అంటూ ఉండదు. మంచి కథలు వస్తే ఎక్కడైనా నటిస్తాను. ఇప్పుడు ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చా. చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. -
కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!
హీరో సిదార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలారోజుల తర్వాత తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఇతడు.. స్టేజీపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తనని, తన సినిమా అవమానించారని చెబుతూ బరస్ట్ అయిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది? సిద్ధార్థ్ ఏం చెప్పాడు? ఏం జరిగింది? స్వతహాగా తమిళ నటుడు అయినప్పటికీ పలు సూపర్హిట్ తెలుగు సినిమాలతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటిది గత కొన్నేళ్ల నుంచి ఇక్కడ ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. చాన్నాళ్ల తర్వాత 'మహాసముద్రం' అనే సినిమాలో నటిస్తే అది ఘోరంగా ఫ్లాప్ అయింది. అలా సక్సెస్ లేక అల్లాడుతున్న సిద్ధార్థ్.. తానే నటిస్తూ, నిర్మిస్తూ 'చిట్టా' అనే సినిమా తీశాడు. గత వారం తమిళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఐదు రోజుల్లో రూ.11 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో 'చిన్నా' పేరుతో రిలీజ్ చేద్దామని చూస్తే.. సినిమాని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని చెబుతూ బాధపడ్డాడు. (ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన నిహారిక మాజీ భర్త!) సిద్ధార్థ్ కామెంట్స్ 'ఇంతకన్నా గొప్ప సినిమా నేను చూడలేదు' అని ఉదయనిధి స్టాలిన్, తమిళంలో నా సినిమాను కొన్నారు. కేరళలోనూ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ నా సినిమా తీసుకున్నారు. కన్నడలో 'కేజీఎఫ్' నిర్మించిన వాళ్లు రిలీజ్ చేశారు. తెలుగులోకి వచ్చేసరికి.. 'సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారు?' అని అన్నారట. నేనో మంచి మూవీ తీస్తే ప్రేక్షకులు చూస్తారని నా నమ్మకం. ఆ టైంలో నా దగ్గరకొచ్చి.. మేం మీతో ఉన్నామని ఏషియన్ సునీల్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. వాళ్లకు చాలా థ్యాంక్స్. నా సినిమాలో అది ఉంది, ఇది ఉందని చెప్పి అడుక్కు తినే బ్యాచ్ కాదు. మీకు సినిమాలపై నమ్మకం, ఇష్టం ఉంటే థియేటర్కి వెళ్లి 'చిన్నా' చూడండి. ఇది చూసిన తర్వాత 'తెలుగులో సిద్ధార్థ్ సినిమాలు చూడం' అనిపిస్తే.. ఇక తెలుగులో ప్రెస్మీట్స్ పెట్టను. ఇక్కడికి రాను అని చెబుతూ సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. (ఇదీ చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?) On of my friend Said #Chithha movie is very good and he praised #Siddharth in this movie. Hope Telugu Audience will encourage this good movie 👍#Chinna releasing on October 6thpic.twitter.com/HIq8I35sFp — ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) October 3, 2023 -
క్షమించమని సిద్ధార్థ్ను కోరిన శివరాజ్ కుమార్
కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. కర్ణాటకలో ప్రతిచోటా పోరు కొనసాగుతోంది. కావేరి కోసం శాండల్వుడ్ తారలు కూడా తమ గళాన్ని పెంచారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇప్పటికే కర్ణాటక బంద్కు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో తమిళ హీరో సిద్ధార్ధ్కు నిరసన సెగ తగలింది. తను నటించిన 'చిన్నా' చిత్రం విడుదల సందర్భంగా బెంగళూరులో ప్రమోషన్ కార్యక్రమం చేపట్టాడు. దీనిని పలువురు కన్నడ అనుకూల వ్యక్తులు అడ్డుకున్నారు. అక్కడి మీడియా సమావేశం నుంచి సిద్ధార్థ్ను బయటకు పంపించేశారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్ ) వారు చేసిన ఈ పనిని చాలామంది తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ చర్య సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. తాజాగా సిద్దార్థ్కు జరిగిన అవమానంపై కన్నడ నటుడు శివ రాజ్కుమార్ ఇలా ప్రస్తావించారు. 'నిన్న జరిగిన ఈ ఘటన నిజంగా బాధాకరం.. మా ఇండస్ట్రీ తరపున సిద్ధార్థ్కి క్షమాపణలు చెబుతున్నా.. సిద్ధార్థ్ క్షమించండి.. చాలా బాధపడ్డాం.. ఈ తప్పు ఇంకెప్పుడూ జరగదు' అంటూ నటుడు సిద్ధార్థ్కి శివన్న సారీ చెప్పాడు. అలాగే కన్నడ ప్రజలు చాలా మంచివారు.అన్ని భాషలను ఇష్టపడతారు. కర్ణాటకకు చెందిన వారు మాత్రమే అన్ని భాషల సినిమాలను చూస్తారు.ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అని ఆయన అన్నారు. చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ప్రకాశ్ రాజ్ ఇదే వివాదంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. 'దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకుండా.. సామాన్యులను, కళాకారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా చేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటకకు చెందిన మనిషిగా ఇక్కడి ప్రజలందరి తరపున సిద్ధార్థ్కు క్షమాపణలు చెబుతున్నాను.' అని సోషల్ మీడియా ద్వార ప్రకాశ్ రాజ్ తెలిపారు. దీనికి రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీలను పెట్టారు. Instead of questioning all the political parties and its leaders for failing to solve this decades old issue.. instead of questioning the useless parliamentarians who are not pressurising the centre to intervene.. Troubling the common man and Artists like this can not be… https://t.co/O2E2EW6Pd0 — Prakash Raj (@prakashraaj) September 28, 2023 -
ఇక్కడి నుండి వెళ్ళిపో.. హీరో సిద్ధార్థ్ ను తరిమేసిన కన్నడ సంఘాలు
-
బొమ్మరిల్లు విడుదల రోజులను గుర్తు చేసుకున్న సిద్ధార్థ
-
ఎన్ని సినిమాలు తీసిన..తెలుగు వారి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను
-
ప్రేమకథ విన్నారా?
కెరీర్లో హీరోయిన్గా మంచి ఫామ్లో ఉన్నారు మృణాళ్ ఠాకూర్. నార్త్ అండ్ సౌత్ అనే తేడాలను పక్కన పెడితే ఈ బ్యూటీ హీరోయిన్గా నటించిన ఐదు సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయంటే ఆమె ఏ స్పీడ్తో దూసుకెళ్తున్నారో ఊహించవచ్చు. ఇదే స్పీడ్ను కొనసాగించాలనుకుంటూ బాలీవుడ్ కొత్త సినిమాకు సై అన్నారట మృణాళ్. శ్రీదేవి టైటిల్ రోల్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘మామ్’ తీసిన దర్శకుడు రవి ఉడయార్ ఇటీవల ఓ లవ్స్టోరీ స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారట. ఆయన ఈ కథను మృణాళ్కు వినిపించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రాంరంభం కానుందని బీ టౌక్ టాక్. -
థ్రిల్లర్ మూవీతో వస్తోన్న సిద్ధార్థ్.. ఇప్పుడైనా కమ్ బ్యాక్ ఇస్తాడా?
తమిళ స్టార్ నటుడు సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం చిత్తా. ఈ మూవీకి ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇటకీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సిద్ధార్థ్ నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నిమిషా నటించగా.. అంజలీ నాయర్ ముఖ్యపాత్రలో కనిపించనుంది. దీపు నినన్, థామస్, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. తమిళంలో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్, దర్శకుడు అరుణ్కుమార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది కిడ్నాప్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చాలా సహజత్వంగా అదే సమయంలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. తాను 25 ఏళ్లుగా ఇలాంటి చిత్రం కోసమే ఎదురు చూశానన్నారు. ఇది తనకు కమ్ బ్యాక్ చిత్రం అవుతుందన్నారు. బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే కథా చిత్రంగా చిత్తా ఉంటుందన్నారు. దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని సిద్ధార్థ్ అన్నారు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. కాగా.. ఈ నెల 28వ తేదీన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. -
యువత గెలవాలి – సిద్ధార్థ్
‘‘రామన్న యూత్’ టైటిల్ బాగుంది. అభయ్ నాకు ఇష్టమైన నటుడు. ఈ సినిమాలో ఒక కథను కాకుండా తన జీవితంలో చూసిన ఊరి అనుభవాలను తెరకెక్కించాడు. ట్రైలర్లో వినోదం, భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా యువత గెలవాలి.. అలా ఈ ‘రామన్న యూత్’ కూడా గెలవాలి’’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ను సిద్ధార్థ్ విడుదల చేశారు. అభయ్ నవీన్ మాట్లాడుతూ– ‘‘ఒక ఊరిలో రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుని రాజు అనే యువకుడు చేసిన ప్రయత్నాలు అతని జీవితాన్ని ఎలా మార్చాయి? అనేది సినిమాలో చూపిస్తున్నాం. గ్రామీణ నేపథ్యంలో సాగే పోలిటికల్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: ఫహాద్ అబ్దుల్ మజీద్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: శివ ఎంఎస్కే. -
తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!
మరాఠీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ చందేకర్. 'జెండా', 'క్లాస్మేట్స్', 'బాలగంధర్వ' లాంటి చిత్రాల్లో నటించారు. మధుర దేశ్పాండే, స్వప్నిల్ జోషి, అమృతా ఖాన్విల్కర్తో కలిసి 'జీవ్లగా' షోలో కూడా కనిపించారు. ఇటీవలే నాగేష్ కుకునూర్ దర్శకత్వంలోని 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్లో నటించాడు. తాజాగా సిద్ధార్థ్ చేసిన పనికి నెటిజన్స్ మనసులను గెలుచుకున్నారు. ఇటీవల తన తల్లిని రెండవ వివాహం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తల్లి కోసం ఉద్వేగభరితమైన నోట్ రాసుకొచ్చారు. అంతేకాకుండా తల్లి సీమా చందేకర్ రెండో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. (ఇది చదవండి: నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!) సిద్ధార్థ్ నోట్లో రాస్తూ.. ' అమ్మా.. హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్. నీ బిడ్డలతో పాటు నీ జీవితం ఇంకా ఉంది. నీకు స్వతంత్రమైన అందమైన ప్రపంచం ఉంది. ఇప్పటివరకు మా కోసం చాలా త్యాగం చేశారు. ఇప్పుడు మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ విషయంలో మీ పిల్లలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. మీరు నా పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు నేను అదే చేశా. నా జీవితంలో అత్యంత ఎక్కుగా ఆనందపడే పెళ్లి. ఐ లవ్ యూ అమ్మ.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తున్నారు. (ఇది చదవండి: జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్) View this post on Instagram A post shared by Siddharth Seema Chandekar (@sidchandekar) -
Brahmanandam Son Siddharth: బ్రహ్మనందం కుమారుడి పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
Shamirpet: పిల్లల కోసం కాల్పులు.. ఇదొక హైప్రొఫైల్ ట్విస్టుల స్టోరీ
సాక్షి, రంగారెడ్డి: శామీర్పేట కాల్పుల వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. భర్త సిద్దార్థ్తో(42) విడిపోయిన స్మిత గ్రంథి.. మనోజ్తో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. సిద్ధార్థ్, స్మితలకు ఒక కొడుకు కూతురు ఉండగా.. పిల్లలను తనకు అప్పగించాలని కొంతకాలంగా సిద్ధార్థ్ పోరాటం చేస్తున్నాడు. పిల్లలపై మనోజ్ దాడి చేశారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్పై స్మిత కొడుకు ఫిర్యాదు మనోజ్పై స్మిత కొడుకు సైతం సంచలన ఆరోపణలు చేశాడు. మనోజ్ చిత్రహింసలు పెట్టాడని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. స్మిత కొడుకు కూకట్పల్లిలోని ఫిడ్జ్ కళాశాలలో 12వ తరగతి చదువుతుండగా, కుమార్తె శామీర్పేటలోని శాంతినికేతన్ రెడిసెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం పిల్లలిద్దరూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉన్నారు. పిల్లల కోసం రావడంతో ఈ క్రమంలో తన పిల్లల కోసం సిద్ధార్థ్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్లోని సెలబ్రిటీ క్లబ్లో ఉంటున్న స్మిత దగ్గకు వెళ్లాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్ను చూసి ఆగ్రహించిన మనోజ్.. ఎయిర్ గన్తో అతనిపై కాల్పులు జరిపాడు. మనోజ్ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదుతో శామీర్పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మనోజ్ మౌన పోరాటం, కార్తీక దీపం వంటి పలు సీరియల్లో నటించాడు. సిద్ధార్థ్, స్మిత మధ్య విడాకుల కేసు సిద్ధార్థ్ అతని భార్య స్మితకు 2019 నుంచి విభేదాలు ఏర్పడ్డాయని మేడ్చల్ డీసీపీ సందీప్ తెలిపారు. దీంతో సిద్ధార్థ్ నుంచి విడాకులు కావాలని అదే ఏడాది కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో స్మిత విడాకులు ధరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. సిద్ధార్థ్ వైజాగ్లో హిందూజా థర్మల్ పవర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడని చెప్పారు. సిద్ధార్థ్తో విడిపోయిన తర్వాత స్మిత మనోజ్తో ఉంటుందని, గత మూడేళ్ళుగా సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో కలిసి ఉంటున్నారని చెప్పారు. నేడు సిద్ధార్థ్ తన పిల్లలను చూడటానికి రిసార్ట్కు రాగా మనోజ్ ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడని తెలిపారు. చదవండి: పెళ్లైన 15 నెలలకే విషాదం.. గుండెపోటుతో లహరి మృతి -
ఓటీటీకి వచ్చేస్తోన్న 'టక్కర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్, దివ్యాన్షా జంటగా నటించిన తాజా చిత్రం 'టక్కర్'. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కార్తీక్ క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. నెలరోజులు కాకముందే ఓటీటీకి వచ్చేస్తోంది. (ఇది చదవండి: టక్కర్ మూవీ ట్విటర్ రివ్యూ, సిద్దార్థ్ హిట్ కొట్టాడా?) ఈనెల 7 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో యోగిబాబు, అభిమన్యు సింగ్, మునిశ్కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్, అరుణ్ వైద్యనాథన్, విశ్వ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ నటుడు.. ఫోటో వైరల్!) -
సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. ఇటీవలే తాను హీరోగా నటించిన చిత్రం ‘టక్కర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. (ఇది చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..) చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్లో సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సిద్ధార్థ్.. బాలీవుడ్ భామ ఆదితి రావు హైదరితో డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ జంట చాలాసార్లు ఫంక్షన్లలో తళుక్కున మెరిశారు. గతంలో ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ కలిసి టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్కు కూడా హాజరయ్యారు. ఇటీవలే రాజస్థాన్లో జరిగిన పెళ్లిలోనూ జంటగా పాల్గొన్నారు. దీంతో ఈ జంట పీకల్లోతు డేటింగ్లో ఉన్నట్లు మరోసారి వార్తలు వైరలయ్యాయి. అయితే తాజాగా ఓ టీవీ షోలో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చూస్తే ఈ రూమర్స్ నిజమనే తెలుస్తోంది. ఇంతకీ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఓ టీవీ షోలో పాల్గొన్న సిద్ధార్థ్ను యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. జీవితాంతం మీతో కలిసి డ్యాన్స్ చేయాలనుకునే ఆమె ఎవరైనా ఉన్నారా? అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ..'మా ఊర్లో అందరూ 'ఆదితి దేవో భవ అంటారు' కదా అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో అతిథిని ఆదితి పేరుతో పిలవడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సిద్ధార్థ్ సమాధానంతో ఆదితి రావు హైదరీతో డేటింగ్ ఖాయమని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) Awwww did he just accept?? CUTE. ❤️❤️🧿#Siddharth pic.twitter.com/x9pVfv8SHT — Shravani (@shravd05) June 9, 2023 -
టక్కర్ మూవీ ట్విటర్ రివ్యూ, సిద్దార్థ్ హిట్ కొట్టాడా?
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగులో విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ్. కానీ ఆ స్టార్డమ్ను అలాగే కాపాడుకోలేకయాడు. వరుస అపజయాలతో తెలుగు చిత్రసీమకు దూరమయ్యాడు. ఒరేయ్ బామ్మర్ది, మహాసముద్రం చిత్రాలతో మళ్లీ తెలుగు ఆడియన్స్ను పలకరించినప్పటికీ విజయం మాత్రం అందని ద్రాక్షే అయింది. తెలుగులో ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలన్న కసితో టక్కర్తో ముందుకు వచ్చాడు సిద్దార్థ్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శుక్రవారం (జూన్ 9న) తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో థియేటర్లో టక్కర్ చూసిన సినీ ప్రియులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి టక్కర్ సినిమా ఎలా ఉంది? సిద్దార్థ్ ఈసారైనా హిట్టు కొట్టాడా? అనే అంశాలను నెటిజన్ల మాటల్లో తెలుసుకుందాం. సిద్దార్థ్ తన పాత్రకు న్యాయం చేశాడు. యోగి బాబు కామెడీ బాగుంది. ఆర్జే విఘ్నేశ్కాంత్ పాత్ర పర్వాలేదు అని చెప్పుకొస్తున్నారు. ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ యావరేజ్ కంటే కూడా దారుణంగా ఉందంటున్నారు. సినిమా యావరేజ్ అని చెప్తున్నారు. Premier show🎬 ~ #Takkar @sathyamcinemas ... Sidharth done his role really gud, Yogi Babu comedy works gud & rj Vigneshkanth portion is okay ... But stry wise aracha maava aracha maari iruku 😮💨 1 word review - takkar knjm makkar 🥱 — 𝑁𝐾 (@_naviin_13) June 9, 2023 #Takkar first half So far so good except yogibabu comedy😀😀 — Poovanesh S (@poova4u) June 9, 2023 #TakkarReview Decent first half with below avg second half. Fight sequences good. Old template. Script could have been better in Second half. Cringe comedy. Siddharth🔥, Divyansha😍, yogibabu waste Decent BGM, Good visuals. Run time big plus. Overall - Average pic.twitter.com/WZhBHudCEi — Poovanesh S (@poova4u) June 9, 2023 Racy second half, @iYogiBabu's nonstop comedy,worked well, Feel good commercial movie after a longtime. #Takkar #TakkarFromJune9 #TakkarFromTomorrow — Karthick T (@karthickt) June 8, 2023 #TAKKAR - Didn't work for me. Dull 1st half, below par 2nd half. Mass moments & Love portions didn't work at all. Songs good. Yogi Babu scenes worked at some places. Climax 🤐🤧😷 Disappointed 💔🚶🏻 https://t.co/JjfJMuNWxu pic.twitter.com/vM7t608A0d — Kumarey (@Thirpoo) June 8, 2023 #Takkar Movie Review : ⭐⭐½ Strictly Average 1st half and decent 2nd Half Comedy Worked in bits and decent songs👍 But Action & Emotions didn't work well 👎 Overall another Below Par Movie from #Siddharth Hope he gives comeback soon🤞 — Thyview (@Thyveiw) June 8, 2023 చదవండి: కోలీవుడ్ నుంచి ఆఫర్, నో చెప్పిన హీరోయిన్ శ్రీలీల -
నా టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది
‘‘నేనో సినిమా తీయాలనుకుంటే ఆ సినిమాను తీసేంత స్వేచ్ఛ నాకు కావాలి. ఇదే నా డ్రీమ్. తమిళంలో నేను చేయగలుగుతున్నాను. కానీ తెలుగులో నాకు అంతగా సపోర్ట్ లభించలేదు. అయినా తెలుగు ఆడియన్స్కు, నాకు ఫుల్స్టాప్ కాదు కదా.. చిన్న కామా కూడా పడలేదు.. తెలుగు ప్రేక్షకులకు నాకు మధ్యలో ఉన్నది చిన్న టైమ్ గ్యాప్ మాత్రమే. ఇప్పుడు ‘టక్కర్’తో టైమ్ కలిసొచ్చినట్లుగా నాకు అనిపిస్తోంది’’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్ చెప్పిన విశేషాలు. ► ధనవంతుణ్ణి కావాలనే లక్ష్యంతో సిటీకి వస్తాడు ఓ కుర్రాడు. అయితే అన్నీ అతని ఊహలకు వ్యతిరేకంగా జరుగుతుంటే ఏం చేస్తాడు? ఎవరితో అతను ఘర్షణ పడాల్సి వస్తుంది? అన్నదే ‘టక్కర్’ కథాంశం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. హీరో, హీరోయిన్ రిలేషన్షిప్లోనూ చాలా షేడ్స్ ఉంటాయి. డబ్బు, అహం, లింగబేధం, వయసు.. ఇలాంటి అంశాలు కథలో చర్చకు వస్తాయి. కార్తీక్ క్రిష్ ఈ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. ► లవ్స్టోరీస్ సినిమాల గురించి చర్చకు వస్తే.. వాటిలో ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ సినిమాలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా నాకు లవ్స్టోరీ చెబితే, దాదాపు నో చెబుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లవ్స్టోరీ సినిమా చేసి, అది హిట్ అయితే నాకు మళ్లీ ఓ పదేళ్ల పాటు లవ్స్టోరీలే వస్తాయి. నేను లవ్స్టోరీస్ మాత్రమే చేయడానికి ఇండస్ట్రీకి రాలేదు. యాక్టర్గా డిఫరెంట్ సినిమాలు చేయాలి. ► రచయితగా ‘గృహం’ ఫ్రాంచైజీకి కథలు రెడీ చేస్తున్నాను. మా ప్రొడక్షన్ హౌస్లో కొత్తవారితో సినిమాలు నిర్మిస్తున్నాం. భవిష్యత్లో దర్శకత్వం చేస్తాను. ‘బొమ్మరిల్లు 2’ ఆలోచన ఉంది. కానీ అది పెద్ద చాలెంజ్తో కూడుకున్న పని.. చూడాలి. ► యాక్టర్గా నేను మంచి ఫామ్లోకి వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు కలుగుతోంది. మళ్లీ తెలుగులో నా టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ‘ఇండియన్ 2’లో కీలక పాత్ర, ‘ది టెస్ట్’లో ఓ లీడ్ రోల్, ‘చిన్నా’ సినిమా చేస్తున్నాను. ఓ స్ట్రయిట్ లవ్స్టోరీ ఫిల్మ్ షూటింగ్ పూర్తి కావొచ్చింది. కార్తీక్ క్రిష్తో మరో సినిమా చేయనున్నాను. ► మీకు ఇంకా మ్యారేజ్ చేసుకునే ఏజ్ రాలేదంటారా? అని ఓ విలేకరి అడగ్గా... ‘మ్యారేజ్ చేసుకునే ఏజ్ నాకు వచ్చినప్పుడు.. ఆ పెళ్లి భోజనం తింటున్నప్పుడు మీకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పెళ్లి భోజనం నాకు గొంతు దిగడం లేదు. సో.. దానికి ఓ టైమ్ ఉంది. డైరెక్షన్ నా డ్రీమ్. నా మ్యారేజ్ నా పేరెంట్స్ డ్రీమ్. నా పెళ్లి, రిలేషన్షిప్స్ గురించి వార్తలు వచ్చాయంటే అవి రాసిన వారిని అడగాలి’’ అని అన్నారు సిద్ధార్థ్. -
ఈ మూడు కారణాల వల్లే తెలుగులో రిలీజ్ అవుతున్న టక్కర్
‘‘తెలుగు కవిత్వం చదివి, చూసి అది నా లోపలకి వెళ్లిపోయింది. సో.. నేను చెప్పినా... చెప్పకపోయినా.. తెలుగు బిడ్డనే’’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్కర్’. ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘టక్కర్’ ఒక యాక్షన్ ఫిల్మ్. న్యూ ఏజ్ లవ్స్టోరీ కూడా ఉంటుంది. కొంతకాలం తర్వాత నేను చేసిన కమర్షియల్ సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా గురువుగారు శంకర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ, మీ హీరో సిద్ధార్థ్, దివ్యాంశ... ఈ మూడు కారణాల వల్లే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు కార్తీక్ జి. క్రిష్. ‘‘టక్కర్’ విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్. ‘‘విశ్వప్రసాద్, వివేక్గార్లు నాకు మంచి మిత్రులు. ‘టక్కర్’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత డి. సురేష్బాబు. ఈ వేడుకలో దర్శకులు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, తరుణ్ భాస్కర్, వెంకటేశ్ మహా తదితరులు పాల్గొన్నారు. -
జైపూర్లో అదితిరావు, సిద్ధార్థ్ సందడి..
-
శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!
యంగ్ హీరో సిద్దార్థ్తో హీరోయిన్ అదితి రావు హైదరీ డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కువగా పార్టీల్లో కనిపించడంతో అభిమానులు వీరి గురించే చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరి రిలేషిప్పై ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. గతంలో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ జంట జైపూర్లో జరిగిన శర్వానంద్ పెళ్లికి కూడా హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) శర్వానంద్ పెళ్లికి జైపూర్ వెళ్తూ అదితి, సిద్ధార్థ్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో జంటగా కనిపించారు. సిద్ధార్థ్, అదితి విమానాశ్రయం లోపలికి వెళ్తూ కనిపించారు. అంతే కాకుండా జైపూర్లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి కూడా వెళ్లారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా శర్వానంద్ పెళ్లికి జంటగా వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by Bina Kak (@kakbina) -
ఒక వర్ణం చేరెలే...
‘రెయిన్ బో చివరే.. ఒక వర్ణం చేరెలే...’ అంటూ కారులో వెళుతూ, దారిలో కలిసినవారితో సరదాగా గడుపుతూ పాడుకుంటున్నారు సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘టక్కర్’ చిత్రంలో పాట ఇది. సినిమాలో వచ్చే ఈ నాలుగో పాట వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. చిత్ర సంగీతదర్శకుడు నివాస్ కె. ప్రసన్న స్వరపరచిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. బెన్నీ దయాల్, వృషబాబు పాడారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘‘ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్తో కనిపిస్తారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. -
ఇండియన్ 2 చరిత్ర సృష్టిస్తుంది అందులో నా క్యారెక్టర్..!