affidavit
-
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ‘తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా? అన్నీ నిజాలే చెప్తాను.. అని ప్రమాణం చేసి అబద్ధాలు ఎలా ఆడతారు ? క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలా..’అని సుందిళ్ల బరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) గంగం వేణుబాబుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా మంగళవారం 16 మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. అఫిడవిట్లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏ డిజైన్, డ్రాయింగ్స్ ఉన్నాయా? ..అని విచారణ ప్రారంభంలో ఈఈ గంగం వేణుబాబును కమిషన్ ప్రశ్నించింది. బరాజ్లో నిర్మించిన ఇతర బ్లాకుల డిజైన్లు, డ్రాయింగ్స్ ఆధారంగా బ్లాక్–2ఏను నిర్మించాలని నాటి రామగుండం సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని వేణుబాబు బదులిచ్చారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ ఆమోదించిన డిజైన్లతోనే బ్లాక్–2ఏ కట్టామని అఫిడవిట్లో మీరు పొందుపరిచిన అంశం అబద్ధమా? ఆమోదిత డ్రాయింగ్స్ లేకుండానే బ్లాక్–2ఏ నిర్మించారా? అఫిడవిట్లో అబద్ధాలు ఎలా చెప్తారు? అని ఈ సందర్భంగా ఆయనపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పొరపాటైంది.. అఫిడవిట్లో పొందుపరిచిన అంశం వాస్తవం కాదు’అని వేణుబాబు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. మీరు ఒక ఇంజనీర్ ? బాధ్యత లేదా? ఏ బ్లాకును కట్టాకా దాని డిజైన్ల ఆధారంగా ఏయే బ్లాకులు కట్టారు? బ్లాక్ –1, 2 కట్టిన తర్వాత బ్లాక్–2ఏ కట్టారా? అని కమిషన్ నిలదీయగా, సమాధానం ఇవ్వలేక వేణుబాబు ఇబ్బందిపడ్డారు. తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం నేరం.. క్రిమినల్ కేసు పెట్టాలా? అని కమిషన్ మందలించింది. బ్లాక్–2, 3ల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారని తదుపరిగా కమిషన్ ప్రశ్నించగా, వేణుబాబు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు. తేదీలు తెలియకపోతే కనీసం ఏ సంవత్సరమో తెలపాలని కమిషన్ కోరగా, 2016 నిర్మాణం ప్రారంభమైందని బదులిచ్చారు. బ్లాక్–2, 3, 2ఏల నిర్మాణం 2017లో ప్రారంభించినట్టు రికార్డుల్లో ఉందని మళ్లీ కమిషన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఎన్సీ ఆదేశాలతోనే బ్లాక్–2ఏ నిర్మాణం సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏకి సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ లేవని రిటైర్డ్ డీఈఈ బండారి భద్రయ్య వెల్లడించారు. బ్లాక్–2, బ్లాక్–3 మధ్య దూరం పెరగడంతో అదనంగా బ్లాక్–2ఏ నిర్మించాల్సి వచి్చందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డ్రాయింగ్స్ లేకుండానే ఇతర బ్లాకులను ఎలా కట్టారో బాక్–2ఏను సైతం అదే తరహాలో కట్టాలని రామగుండం మాజీ సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని తెలియజేశారు. డ్రాయింగ్స్ లేకుండా ఎలా కట్టారు? అని కమిషన్ నిలదీయగా, ఆయన పైవిధంగా బదులిచ్చారు. సుందిళ్ల బరాజ్ పూర్తయినట్టు తాను ధ్రువీకరణ పత్రం జారీ చేశానని మరో డీఈఈ సునీత కమిషన్కు వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తనకు సంబంధం లేదని చొప్పదండి ఈఈ శ్రీధర్ బదులిచ్చారు. సుందిళ్ల పునరుద్ధరణ పూర్తి అఫిడవిట్లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? నిజం తప్ప మరేమీ చెప్పను.. అని చేసిన ప్రమాణానికి అర్థం తెలుసా? అని రామగుండం ఎస్ఈ సత్యరాజుచంద్రను కమిషన్ ప్రశ్నించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర సిఫారసుల ఆధారంగా సుందిళ్ల బరాజ్కు అత్యవసర మరమ్మతులను నిర్మాణ సంస్థ నవయుగ సొంత ఖర్చులతో చేపట్టిందని, బ్లాక్–8కి ఎదురుగా ఉన్న కాంక్రీట్ బ్లాకుల పునరుద్ధరణ తప్ప మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయని ఏఈఈ చెన్న అశోక్కుమార్ తెలిపారు. ఏ రోజు పనిని అదేరోజు పరిశీలించి ప్లేస్మెంట్ రిజిస్టర్లో నమోదు చేసి సంతకాలు చేశారా? అని ఏఈఈ హరితను కమిషన్ అడగ్గా, అవును అని ఆమె బదులిచ్చారు. క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరైన మిగిలిన ఇంజనీర్లు బరాజ్ల నిర్మాణంతో తమకు సంబంధం లేదని బదులిచ్చారు. -
కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు: పట్నం నరేందర్రెడ్డి
-
మహారాష్ట్ర ఎన్నికలు: పూజా ఖేద్కర్ తండ్రి అఫిడవిట్లో.. మరో సందేహం?
ముంబై: త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అహ్మద్ నగర్ సౌత్ నుంచి మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.దీనిలో దిలీప్ ఖేద్కర్ తాను విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో ఇచ్చిన సమాచారానికి భిన్నమైన వివరాలు దీనిలో ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ తాను మనోరమ ఖేద్కర్ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.2024 లోక్సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ అహ్మద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ టిక్కెట్పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. నాడు లోక్సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో దిలీప్ ఖేద్కర్.. మనోరమ ఖేద్కర్ను తన భార్యగా పేర్కొన్నారు. నాటి అఫిడవిట్లో దిలీప్ ఖేద్కర్ తమ ఉమ్మడి ఆస్తుల వివరాలను తెలిపారు. తన కుటుంబాన్ని అవిభక్త హిందూ కుటుంబంగా పేర్కొన్నారు.దిలీప్, మనోరమ ఖేద్కర్ 2009లో పూణే ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఒక మీడియా సంస్థ తెలిపింది. వారిద్దరూ 2010, జూన్ 25న విడిపోయారు. విడాకులు తీసుకున్నప్పటికీ, ఈ జంట పూణేలోని బానర్ ప్రాంతంలోని మనోరమా ఖేద్కర్ బంగ్లాలో సహజీవనం కొనసాగించారు.కాగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2022) కోసం ఆమె చేసిన దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు పూజా ఖేద్కర్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సస్పెండ్ చేసింది. అయితే ఆమె ఈ ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో పూజా ఖేద్కర్ తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లితోపాటు ఉంటోంది. అయితే, లోక్సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేద్కర్ దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల విలువను రూ.40 కోట్లగా చూపారు. ఇది కూడా చదవండి: లింగ సమానత్వంలో భారత్ ముందడుగు -
మరీ ఇంత బరితెగింపా?
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండేవారు వివాదాస్పదులవుతారో, లేక అలాంటివారినే ఆ పదవికిఎంపిక చేస్తారో గానీ మరోసారి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్కుమార్ సక్సేనా వార్తల్లోకెక్కారు. ఈసారి ముఖ్యమంత్రితో వచ్చిన జగడం వల్లకాక సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ వల్ల ఆయన పేరు మార్మోగింది. ఢిల్లీ మహానగరంలో రోడ్ల వెడల్పు కోసం 1,100 వృక్షాలు నేల కూల్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్కు జవాబిస్తూ సక్సేనా వింత వాదన చేశారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల కోసం కేంద్రం నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాల సముదాయానికి వున్న అప్రోచ్ రోడ్డును వెడల్పు చేయటం కోసం రిట్జ్ ప్రాంతంలో చెట్లను కూల్చారు. రూ. 2,200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రగతి ఎలావుందో పరిశీలించటానికి గత ఫిబ్రవరిలో వెళ్లిన ప్పుడు అక్కడున్న అధికారులెవరూ చెట్ల కూల్చివేతలకు అనుమతి అవసరమని తనతో చెప్ప లేదన్నది ఆయన వాదన. 1994లో తీసుకొచ్చిన ఢిల్లీ వృక్ష సంరక్షణ చట్టం (డీపీటీఏ) కింద అటవీ విభాగం కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకుందనీ, ఢిల్లీ సీఎం, తానూ కూడా అందుకు అంగీకరించామనీ సక్సేనా వివరించారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకోనట్టయితే కోర్టు ధిక్కారమవుతుందని తనకు తెలియదని ఆయన చెబుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నవారికి అన్నీ తెలియాలని లేదు. నిజమే. కానీ తెలుసుకోవటం, తెలియజెప్పటం రివాజుగా సాగిపోవాలి. ఢిల్లీ సీఎం ఏదైనా నిర్ణయం తీసుకోగానే ఫలానా నిబంధన ప్రకారం ఇది చెల్లదని బుట్టదాఖలు చేయటం అలవాటైనవారికీ, అన్ని చట్టాలూ శోధించి ఆధిక్యతను చాటుకునేవారికీ నిబంధనలు తెలియలేదంటే ఎవరైనా నవ్విపోరా? చెట్లు కూల్చడం ఫిబ్రవరి 16న మొదలైతే, జూన్ 10న ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వైస్ చైర్మన్ చెప్పేవరకూ తెలియదనటం ఆశ్చర్యకరం. గురువారం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సూటిగా ప్రశ్నించింది. ఏప్రిల్ 10నే లెఫ్టినెంట్ గవర్నర్కు చెప్పినట్టు రికార్డులు చూస్తే వెల్లడవుతోందని ధర్మాసనం తెలిపింది. పోనీ తెలియదనే అనుకుందాం... చట్ట నిబంధన తెలియక పొరపాటు చేశానని పౌరుడె వరైనా అంటే చెల్లుతుందా? అధికారులు నిబంధనలను సరిగా అర్థం చేసుకోకపోవటంవల్ల పొర పాటు జరిగిందని, ఇది ప్రజా ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేసిన పని అని లెఫ్టినెంట్ గవర్నర్ అఫిడవిట్ చెప్పటమూ సరికాదు. సక్సేనా కార్పొరేట్ రంగంలో, వివిధ సామాజిక రంగాల్లో విశేషానుభవం కలవారని అంటారు. ఒక కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తిని లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించటం ఇదే ప్రథమం. అలాంటి వ్యక్తి సైతం నిబంధన ఉల్లంఘిస్తే ఎలా?అసలు ఆ రోడ్ల వెడల్పు ప్రాజెక్టు వెనక మరింత వివాదం ఉన్నదని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆగస్టు 2022లో డీడీఏ ఆమోదించిన ప్లాన్కూ, అనంతర కాలంలో సవరించిన ప్లాన్కూ మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయని ఆ కథనాలు వివరిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉండే ఫార్మ్ హౌస్లకూ, శ్రీ జ్ఞానానంద ఆశ్రమం, ఇతర ప్రైవేటు ఆస్తులకూ నష్టం కలుగుతున్నదన్న కారణంతోనే ముందనుకున్న ప్లాన్ కాస్తా సవరించారన్నది అభియోగం. పర్యవసానంగా అక్కడి అటవీ భూముల్లోని చెట్లు కూల్చేయాల్సి వచ్చిందని ఆ కథనాలు చెబుతున్నాయి. ముందు రూపొందిన మ్యాప్ ప్రకారం రోడ్లు వెడల్పు చేస్తే 50 చెట్లకు మించి నష్టం ఉండేది కాదని లెక్కేస్తున్నారు. పైగా మార్చిన ప్లాన్ వల్ల సాధారణ పౌరుల నివాస గృహాలకు నష్టం జరిగిందని మీడియా కథనాలు వివరిస్తున్నాయి. అంటే నోరూ వాయీ లేని వారికి ఎంత నష్టం కలిగినా ఫర్వాలేదు... సంపన్నులకు మాత్రం తేడా రావొద్దన్నది అధికారుల ఉద్దేశం. ఈ విషయంలో గోశాల రోడ్కు చెందిన పౌరుడు నీరజ్ కుమార్... ప్రధాని మొదలుకొని లెఫ్టినెంట్ గవర్నర్ వరకూ ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సుప్రీంకోర్టు ముందు దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లో తాను కూడా కక్షిదారుగా ఉండదల్చుకున్నట్టు దరఖాస్తు చేసుకున్నాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆ ప్రాంతాన్ని సందర్శించటానికి సంబంధించిన రికార్డు ఉందో లేదో తెలియదని, అందుకు వ్యవధి కావాలని కూడా డీడీఏ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఇంత చిన్న సమాచారం కోసం ఎన్నాళ్లు వెదుకుతారని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించటంతో, అక్షింతలేయటంతో లెఫ్టినెంట్ జనరల్ జవాబివ్వటం తప్పని సరైంది. కింది స్థాయిలో జరిగిన లాలూచీలు సక్సేనాకు తెలియలేదనుకున్నా ఫిర్యాదు వచ్చినప్పుడైనా ఆరా తీయలేదంటే ఏమనుకోవాలి? దేశంలో అభివృద్ధి పేరుతో జరిగేదంతా ఇలాగే ఉంటున్నది.సంపన్నుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అధికారులు పేదలకు నిలువ నీడ లేకుండా పోతున్న దన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తుంటారు. ప్రశ్నించినవారిపై కేసులు బనాయించటం, జైళ్లలో పెట్టడం సర్వసాధారణమైంది. ఇప్పుడు డీడీఏ నిర్వాకం కారణంగా భారీయెత్తున చెట్లు కూలి పోవటం మాత్రమే కాదు... 43 ఏళ్లుగా ఆ ప్రాంతంలో చిన్నా చితకా ఇళ్లలో నివసిస్తున్నవారిని నిర్దాక్షి ణ్యంగా ఖాళీ చేయించారు. దేశంలోని కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన చోటే ఇంతగా నియమోల్లంఘనలు చోటుచేసుకుంటే ఏ ఛత్తీస్గఢ్ అడవుల్లోనో, ఇతర మారుమూల ప్రాంతాల్లోనో సక్రమంగా జరుగుతున్నాయని ఎలా అనుకోగలం? ఇలాంటి దురన్యాయాలుంటే తిరుగుబాట్లు రావా? సమస్య మూలాలు వదిలి పరిష్కారాలు వెదికే తెలివితక్కువతనం మరిన్ని సమస్యలకు దారితీయటం లేదా? ప్రభుత్వాలు ఆలోచించాలి. తామే చట్టాలు ఉల్లంఘిస్తే, మానవీయతను మరిస్తే సామాన్య పౌరు లను చట్టబద్ధంగా నడుచుకొమ్మని చెప్పే నైతికార్హత ఉంటుందా? -
‘సెంటర్లవారీగా ఫలితాలు వెల్లడించండి’.. సుప్రీంకోర్టులో నీట్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ పేపర్ లీక్పై సుప్రీం కోర్టులో విచారణ సోమవారానికి(జులై 22కి) వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ ముగించే ముందు.. సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. శనివారం మధ్యాహ్నాం కల్లా ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచాలన్న ధర్మాసనం.. విద్యార్థుల పేర్లు మాత్రం బయటపెట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణలో ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఇవాళ్టి విచారణ టైంలోనూ సీజేఐ త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్.. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్కు ఆదేశించగలమని మరోసారి స్పష్టం చేసింది. ‘‘సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు మేం ప్రాముఖ్యత ఇస్తాం. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. అలాగే.. మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?అని న్యాయవాదుల్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.‘‘పరీక్ష రాసిన 23 లక్షల మందిలో లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే.. రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక.. నీట్ ప్రశ్నపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్న తెలిసిందే.ల -
‘నీట్ పరీక్షను రద్దు చేయం’.. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ యూజీ పరీక్షపై సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్లో నీట్-యూజీ 2024 పరీక్షలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేనందున, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. పరీక్షను రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పింది. ఈ మొత్తం అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ను కోరినట్లు చెప్పిన కేంద్రం.. నీట్ పరీక్ష లీకేజీ నిందితుల్ని అరెస్ట్ చేశామని పేర్కొంది. -
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి మంగళవారం(మే14) నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్కు అఫిడవిట్లో సమర్పించారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని మోదీ అఫిడవిట్లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లని వెల్లడించారు. తన ఆస్తిలో రూ.2.86 కోట్లు స్టేట్ బ్యాంక్ ఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నాయని తెలిపారు. సేవింగ్స్ ఖాతాలో రూ.80,304, తన చేతిలో రూ. 52,920 నగదు ఉందని పేర్కొన్నారు. ఇవి కాకుండా రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నట్లు తెలిపారు.2018-19లో రూ.11.14 లక్షలుగా ఉన్నవార్షిక ఆదాయం 2022-23లో రూ.23.56లక్షలకు పెరిగినట్లు తెలిపారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లో తెలిపారు. జూన్1న తుది దశలో భాగంగా వారణాసిలో పోలింగ్ జరగనుంది. -
పవన్ కళ్యాణ్ అఫిడవిట్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు
-
మాస్టారూ.. ఎవరీమె?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేతగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల వేళ సత్యాన్ని సమాధిచేసి తన రాజకీయ పదవి కోసం తాళి కట్టిన భార్యనే కాదనుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నారాయణతో మూడు దశాబ్దాల పాటు అన్యోన్య దాంపత్య జీవితం పంచుకున్న ఆమె ప్రస్తుతం ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఎన్నికల అఫిడవిట్లో తనకు ఒక భార్య, కుమార్తెను మాత్రమే చూపారు. రెండో భార్య ఆమె కుమార్తెను చూపించకపోవడంతో గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నారాయణ మహిళలను వంచించిన విషయంలో సింహపురి మహిళలకు ఏమని సమాధానం చెబుతారు.తప్పుల కుప్ప.. ఆ ‘అఫిడవిట్’ టీడీపీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ చిక్కుల్లో పడ్డాడు. భారత ఎన్నికల సంఘం నిబంధనలను సవాల్ చేస్తూ తన నామినేషన్ పత్రంతో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఒక భార్య ఉన్న వారే రాజ్యాంగబద్ధ పదవులకు అర్హులు. ఇంకో భార్య ఉన్నప్పటికీ విడాకులు అయినా ఇచ్చి ఉండాలి. అయితే నారాయణ విద్యా సంస్థల అధినేతగా నారాయణ వ్యక్తిగత జీవితం ‘తెరిచిన పుస్తకం’. నారాయణకు ఇద్దరు భార్యలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో ఇలా.. 2014లో ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన భార్య పి. రమాదేవిగా, శారిణి (రెండో భార్య ఇందిర కుమార్తె), కుమారుడు నిషింత్ను డిపెండెంట్లుగా చూపించారు. వీరు కొడుకు, కూతురు అయినప్పటికి మిగతా ఐఐఐలోవారు తన సంతానంగా సృష్టంగా పేర్కొనకపోవడం విశేషం. 2019 ఎన్నికల్లో ఇలా.. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడివిట్లో కేవలం తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. అయితే అంతకు ముందే కుమారుడు నిషాంత్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుమార్తె శారిణిని అఫిడవిట్లో సంతానంగా, డిపెండెంట్లుగా పేర్కొనకపోవడం గమనార్హం. 2024లో (ప్రస్తుతం)ఇలా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. కానీ ఎక్కడా కుమార్తెలు ఉన్నట్లుగా చూపించకపోగా, శారిణి, సింధూర వద్ద అప్పులు తీసుకున్నట్లు అఫిడవిట్లో చూపించడం గమనార్హం. ఇందిర నారాయణ రెండో భార్యే? పొంగూరు ఇందిర రెండో భార్యే అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. 1996లో ఏర్పాటు చేసిన నారాయణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంస్థలో ఇందిర భర్త పొంగూరు నారాయణగా ఆమె చైర్మన్ హోదాతో ఉన్నట్లు ట్రస్ట్ బోర్డులో రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు నిర్థారణ చేస్తున్నాయి. ఇందిర నిర్వహణ కమిటీలో కూడా కోశాధికారిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో మాత్రం ఎన్నికల కోసం ఆమెతో రాజీనామా చేయించారు.2011 నుంచి 2020 వరకు నారాయణ ఎడ్యుకేషన్ సోసైటికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లో లావాదేవీల విషయంలో కూడా ఇందిర సంతకం ఉంది. అయితే ఆమెతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లు ఎప్పుడు, ఎలా, ఎక్కడ అనే ఆధారాల్లేవు. ఆమె పాస్పోర్టు పరిశీలించినా నారాయణ భార్యగా తేటతెల్లం అవుతుంది. ఆమె పేరుతో ఉన్న ఆస్తుల రిజిస్టర్ డాక్యుమెంట్లను పరిశీలించినా ఇదే విషయం ప్రస్ఫుటం అవుతుంది.ఇందిర కుమార్తె శారిణి పాస్పోర్ట్లో తన తండ్రి నారాయణగా ఉన్నట్లు సమాచారం. అయితే నారాయణ మంత్రి అయ్యాక వీకీపీడియాలో మాత్రం భార్య రమాదేవి, కుమార్తెలు సింధూర, శారిణి, కుమారుడు నిషాంత్ (లేట్) అనే విషయాలు నమోదు చేసి ఉండడం విశేషం. కన్యాదానం చేసి.. తర్వాత మసి పూసి నారాయణ గతంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత కొంత కాలానికి కుమారుడు హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తర్వాత కొన్నాళ్లకు తన కుమార్తె శారిణి (రెండో భార్య కుమార్తె)కి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజతో వివాహం జరిగింది.ఆ వివాహ సందర్భంలో నారాయణ, ఇందిర దంపతులుగా వ్యవహరించి కన్యాదానం చేశారు. అలాగే నారాయణ ఎడ్యుకేషనల్ సోసైటీ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా శారిణి, రవితేజగా వ్యవహరిస్తున్నారు. అన్ని సందర్భాల్లో ఇందిరను భార్యగా చూపిస్తున్న నారాయణ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం చూపించకపోవడం విశేషం. టీడీపీకి ఆర్థిక దన్ను టీడీపీకి నారాయణ ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తూ చంద్రబాబు అండతో రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడ్డారు. అనేక అవినీతి బాగోతాల్లో నారాయణ పాత్రధారుడుగా ఉన్నారు. ఇక విద్యా సంస్థల్లో అయితే పేపర్ల లీకేజీల నుంచి అనేక అడ్డదారులు తొక్కారు. వీటి నుంచి బయటపడాలని 2019లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారాయణ అవినీతి బాగోతాలన్నీ బయటపడ్డాయి. ఈ కేసులన్నీ మెడకు చుట్టుకోవడంతో కేసుల నుంచి బయటపడేందుకు ఈ ఎన్నికల్లో గెలవాలని రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి సైతం దాదాపు రూ.900 కోట్ల ఎన్నికల ఫండ్ను అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.నెల్లూరు సిటీలో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టిన ఒక సామాన్యుడిపై ఓడిపోతాననే భయంతో రూ.100 కోట్లు వరకు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడడం లేదని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అక్రమాలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నారాయణ ఎన్నికల అక్రమాలపై ఇప్పుడు వైఎస్సార్సీపీ దృష్టి సారించింది. 2014లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్పై అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉండడంతో వైఎస్సార్సీపీ నేతలు దృష్టి సారించలేదు. 2019 ఎన్నికలప్పుడు కూడా ఆయన వ్యక్తిగత అఫిడవిట్పై దృష్టి కేంద్రీకరించలేదు.తాజాగా జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్సీపీ గతంలో, ఇప్పుడు సమర్పించిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తన అఫిడవిట్లలో తనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు సంతానం ఉన్నట్లు ఎక్కడా చూపించకపోవడంపై నిశితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ప్రధానంగా నారాయణ భార్యగా రికార్డుల్లో ఉన్న ఇందిరతో విడాకులు తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు.ఆయనకు ముగ్గురు సంతానం అనేదానికి సైతం ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం కుమారుడు చనిపోయినప్పటికీ ముగ్గురు సంతానం అనే నిబంధన నారాయణకు వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ నియమావళి చెబుతోంది. వీటిపై దృష్టిసారించిన వైఎస్సార్సీపీ నారాయణ అఫిడవిట్పై పోరాటం చేయడానికి సిద్ధమైంది. ఆస్తుల్లోనూ తప్పుడు సమాచారమే? దేశ వ్యాప్తంగా నారాయణ విద్యాసంçస్థలను నెలకొల్పి వేలకోట్ల ఆస్తులను సొంతం చేసుకున్న నారాయణ ఎన్నికల ఆఫిడవిట్లో ఆస్తులపై తప్పుడు సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కుటుంబ ఆస్తులు విలువ రూ.824.05 కోట్లుగా చూపారు. ఆయన తోపాటు మొదటి భార్య రమాదేవి పేరిట ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. వారిద్దరి పేర్లతో అప్పులు కూడా రూ.189.59 కోట్లుగా చూపారు. కానీ దేశ వ్యాప్తంగా వేల కోట్ల ఆస్తులు పోగేసుకున్న నారాయణ అఫిడవిట్లో కొన్నింటినే చూపారని చెప్పుకోవాలి. కేసుల్లో దిట్ట నారాయణపై అఫిడవిట్లో చూపిన ప్రకారం ఎనిమిది కేసులు నమోదయిన్నాయి. నారాయణ తమ్ముడు భార్య నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ స్టేషన్లో వరకట్నం, వేధింపుల కేసు నమోదు చేయించింది. అలాగే చిత్తూరులో ప్రశ్నాపత్రాల లీక్ చేసిన అభియోగంతో కేసు నమోదయింది.అలాగే నారాయణ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసులో కడప జిల్లా బి కోడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. మిగిలిన ఐదు కేసులు అమరావతితో భూముల విషయంలో సీఐడీ కేసులు నమోదు చేసింది.. అమరావతి భూముల మాస్టర్ డిజైనింగ్ అక్రమాలు, దళితుల భూములు కొనుగోలు, మంత్రిగా తన విధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై సీఐడీ కేసులు నమోదు చేసినట్లు చూపారు. నామినేషన్ స్క్రూట్నిలో అభ్యంతరాలు నెల్లూరులోని శుక్రవారం జరిగిన నామినేషన్ల స్క్రూట్ని సమయంలో నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి నారాయణ నామినేషన్ సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్పై స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పలు అభ్యంతరాలను తెలిపారు. నారాయణకు రెండు పెళ్లిళ్లు అధికారికంగా అయినట్లు పలు ఆధారాలతో సహ రిటర్నింగ్ అధికారికి చూపించారు. అఫిడవిట్లో రెండో భార్యను ఎక్కడ చూపించలేదని. రెండో భార్య కుమార్తె శారిణి ఉన్నట్లు చూపించారు.నారాయణ ఎడ్యుకేషన్ సోసైటీ ఏర్పాటు నుంచి ఆయన భార్యగా ఇందిరను చూపించారని, కుమార్తె శారిణి కూడా సోసైటి మేనేజ్మెంట్ మెంబర్గా ఉందని, వారి పాస్పోర్ట్లు పరిశీలించినా వాస్తవాలు తెలుస్తాయయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయా అభ్యంతరాల ఆధారంగా నారాయణ నామినేషన్ను తిరస్కరించాలని ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి ఆ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
సుజనా చౌదరి అఫిడవిట్ పై అనుమానాలు..కేశినేని నాని డిమాండ్
-
అ‘సామాన్యులు’ వైఎస్సార్సీపీ తరఫు అభ్యర్థుల్లో నిరుపేదలు..
సాక్షి నెట్వర్క్: అటుపక్క.. ఒక్కో అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్ చూస్తే కళ్లు చెదిరే స్థిరాస్తులు.. మతిపోయే చరాస్తులు. వేలకోట్ల ధనికస్వాములూ ఉన్నారు. దేశంలోనే అపర కుబేర అభ్యర్థుల్లోని వారూ ఆ బ్యాచ్లో కొలువుదీరారు. ఇలా పెత్తందారులంతా ఒక్కటై టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి తరఫున రాష్ట్ర ఎన్నికల కదనరంగంలో మోహరించారు. వీరికి దన్నుగా కోటానుకోట్ల సంపద ఉన్న ఐశ్వర్యవంతులు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడెక్కడి నుంచో వారి తరఫున రాష్ట్రంలో వాలిపోయారు. వైఎస్సార్సీపీ అభిమానులను ‘వెధవలు’ అంటూ సంభోదిస్తూ కుటుంబానికి రూ.3–4 లక్షలు వెదజల్లయినా వారిని లోబరుచుకునేందుకు వీరంతా బరితెగిస్తున్నారు.కానీ, ఇటుపక్క చూస్తే పేదలకు కొమ్ముకాసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా సై అంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఈ పార్టీ బలగం. ఈ పార్టీ ఎంపిక చేసిన అనేకమంది అభ్యర్థుల ఆర్థిక స్థోమత కూడా అంతంతమాత్రమే. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులున్న వారేమీ కాదు. కేవలం కోటి రూపాయలు అంతకన్నా తక్కువ ఆస్తి ఉన్న వారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలా వైఎస్సార్సీపీ తరఫున పోటీచేస్తూ రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరంటే.. ► శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎస్ఎల్ ఈరలక్కప్ప రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి. ఈయన అఫిడవిట్లోని వివరాలను పరిశీలిస్తే.. ఈరలక్కప్పకు సొంత ఇల్లు, కారు కూడా లేదు. ద్విచక్ర వాహనం మాత్రమే ఉంది. ఆయన పేరు మీద వ్యవసాయ భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు లేవు. బ్యాంకు బ్యాలెన్స్ రూ.27,883 మాత్రమే ఉంది.గుడిబండ కెనరా బ్యాంకులో రూ.41, ఇదే మండలంలోని మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో రూ.26,950 , అగళి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.11, మడకశిర యూనియన్ బ్యాంకులో రూ.881 బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అదే విధంగా అప్పు రూ.1,13,050 ఉంది. గుడిబండ కెనరా బ్యాంకులో వ్యక్తిగత రుణం రూ.86,100, మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో రూ,26,950 అప్పు ఉంది. రూ.99,883 విలువ చేసే చరాస్తులు ఈరలక్కప్పపేరు మీద ఉన్నాయి. అలాగే చేతిలో రూ.10 వేలు ఉన్నట్లు అఫిడవిట్లో ఈరలక్కప్ప పేర్కొన్నారు. ► అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎం.వీరాంజనేయులు కూడా అత్యంత నిరుపేద. సెంటు స్థలం కానీ, తులం బంగారం కానీ లేదు. నామినేషన్లో ఈయన సమర్పించిన అఫిడవిట్ను పరిశీలిస్తే రాష్ట్రంలో అత్యంత పేద అభ్యర్థుల్లో ఒకరన్న విషయం స్పష్టమవుతోంది. ఈయన పేరున విలువైన చరాస్తులు రూ.1,06,478 ఉన్నాయి.ఇందులో చేతిలో నగదు రూ.50 వేలు, అనంతపురం ఎస్బీఐలో రూ.11,193, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కొత్తూరు బ్రాంచ్)లో రూ.10,002 నగదు నిల్వ ఉంది. అలాగే, 2020లో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం ఉంది. దీని విలువ రూ.35 వేలు. ఇక ఆయన భార్య పేరున శింగనమలలోని కెనరా బ్యాంక్లో కేవలం రూ.283 నగదు ఉంది. ► పాడేరు అసెంబ్లీ అభ్యర్థి ఎం. విశ్వేశ్వరరాజు పేరు మీద రూ.20,39,512లు, భార్య పేరున రూ.16,20,320లు, ఇద్దరు పిల్లల పేరున రూ.7,25,927లు, రూ.7,12,606లు కలిపి మొత్తం రూ.50,98,365ల ఆస్తులున్నాయి. రూ.1,20,000 గోల్డ్లోన్ అప్పు ఉంది. ► రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మొత్తం ఆస్తి రూ.53,45,321లు. ఈమె చేతిలో ఉన్న నగదు రూ.2,50,000. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నది రూ.23,72,821లు. ఇన్నోవా కారు రూ.11,22,500, బంగారు ఆభరణాల విలువ రూ.16,00,000, బ్యాంకులో అప్పు రూ.1,76,223లు ఉంది. ► కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మొత్తం ఆస్తి రూ.4,27,066లు. స్థిర, చరాస్తులు రూ.1,89,642లు. తన పేరుతో మైలవరం సెంట్రల్ బ్యాంకు అకౌంట్లో రూ.88, మైలవరం కెనరా బ్యాంకులో రూ.1000, మైలవరం మండల పుల్లూరు ఎస్బీఐ అకౌంట్లో రూ.9,823లు.. రూ.73,531 విలువ గల 2016 మోడల్ బైకు.. రూ.55,200 విలువ గల 8 గ్రాముల బంగారు ఉంగరం.. చేతిలో క్యాష్ రూపంగా రూ.50వేలు ఉన్నాయి. ఇందులో ఆయన భార్య పేరున మైలవరం యూనియన్ బ్యాంకులో రూ.1,624లు.. రూ.55,200 విలువ గల 8 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు.. రూ.1,65,600 విలువ గల 24 గ్రాముల బంగారు చైను.. చేతిలో క్యాష్ రూపంగా రూ.15వేలు ఉన్నాయి. -
ఎన్నికల వేళ.. పవన్ సంపద సృష్టి
సాక్షి, అమరావతి: సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ హైదరాబాద్, మంగళగిరిలో దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆదాయ, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో ఆయన నెలన్నర క్రితం 2024 మార్చి 4న రూ.16.14 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 1,060 చదరపు గజాల స్థలంలో 15,709 చదరపు అడుగుల్లో ఉన్న ఇంటిని కోనుగోలు చేసినట్లు చూపగా.. 2024 ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో మంగళగిరి పట్టణ పరిధిలోని 5,517.6 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్లు పవన్ అందులో పేర్కొన్నారు. అంతేకాక.. వ్యక్తిగతంగా తన పేరిట రూ. 209.13 కోట్లు స్థిర చరాస్తులుగానూ, రూ.65.76 కోట్లు అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. తన భార్య అన్నా లెజినోవా, అఫిడవిట్లో పేర్కొన్న నలుగురు పిల్లల పేరిట మరో రూ.28.47 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ఇక మొత్తం ఆస్తుల్లో 10 శాతానికి పైగా ఆస్తులు ఎన్నికలకు రెండు నెలల ముందు కొనడం గమనార్హం. ఆ పిల్లలకు ఒక రకంగా.. ఈ పిల్లలకు మరో రకంగా.. ఇదిలా ఉంటే.. అఫిడవిట్లో పవన్ తన పిల్లలు దేశాయి అకీరా నందన్, దేశాయి ఆద్య (వీరిద్దరూ రేణుదేశాయి–పవన్కళ్యాణ్ పిల్లలు)తో పాటు పోలీనా అంజని, మార్క్ శంకర్ (పవన్కళ్యాణ్–అన్నా లెజినోవా పిల్లలు) పేర్లతో ఉన్న ఆస్తులూ వెల్లడించారు. ఆ అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వీరికి ఆస్తుల కేటాయింపులో పవన్ వ్యత్యాసం చూపించారు. విడాకులిచ్చిన రేణుదేశాయి పిల్లలకు ఒక రకంగా, ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న లెజినోవా పిల్లలకు మరో రకంగా వారి పేరిట తన ఆస్తులు బహుమతుల రూపంలో ఇవ్వడం గమనార్హం. చదివింది పదో తరగతే.. ఇక పవన్ పదో తరగతి వరకే చదువుకున్నారు. అది కూడా ఎస్ఎస్ఎల్సీ (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) రద్దయి, దాని స్థానంలో ఎస్ఎస్సీ (సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎస్ఎస్ఎల్సీ చదవడం గమనార్హం. ఇంటర్లో మేథమేటిక్స్ మొదలు ఎకనామిక్స్ వరకు దాదాపు అరడజను సబ్జెక్టులు చదివినట్లు సందర్భాన్ని బట్టి చెప్పే పవన్.. అవన్నీ హంబక్ అని అఫిడవిట్లో కుండబద్దలు కొట్టారు. 1984లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెన్త్ ఉత్తీర్ణులైనట్లు అఫిడవిట్లో వివరించారు. తనపై మొత్తం 8 కేసులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొనగా.. తన ప్రస్తుత చిరునామా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీగా చెబుతూ.. మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని 197 పోలింగ్ బూత్ 1120 నెంబరుగా తనకు ఓటు ఉన్నట్లు తెలిపారు. పవన్, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో తనకెలాంటి ఆదాయం లేకపోగా, రూ.1,10,62,939 నష్టం వచ్చిందని.. అయితే, 2019–20లో రూ.4.51 కోట్లు, 2020–21లో రూ.12.86 కోట్లు, 2021–22లో 30.09 కోట్లు, 2022–23 ఆర్థిక ఏడాదిలో 12.20 కోట్లు మాత్రమే తన ఆదాయంగా ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, తన భార్య, పిల్లల ఆదాయాలకు సంబంధించి ఎలాంటి ఐటీ రిటరŠన్స్ వివరాలు లేవు. చరాస్తులు.. ► పవన్కళ్యాణ్ చేతిలో ఈ ఏడాది ఏప్రిల్ 19 నాటికి తన చేతిలో నగదు రూపంలో రూ.3.15 లక్షలు ఉన్నాయని.. బ్యాంకుల్లో డిపాజిట్లుగా రూ.16.48 కోట్లు.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.15.48 లక్షలు.. ఇన్సూరెన్స్ తదితర పెట్టుబడులుగా మరో రూ.3.02 కోట్లు.. ఇతరులకు అప్పు రూపంలో ఇచ్చిన మొత్తం రూ.3.65 కోట్లు.. అలాగే, రూ.14.01 కోట్లు విలువ చేసే కార్లు, వాహనాలున్నాయని.. రూ.2.34 కోట్ల బంగారు ఆభరణాలు.. రూ.14.51 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు.. ఇతర రూపాల్లో మరో రూ.1.79 కోట్లు కలిపి మొత్తం చర ఆస్తుల రూపంలో రూ.41.65 కోట్లుగా చూపించారు. ► తన వద్ద రూ.32 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్తో పాటు పది కార్లు (రెండు బెంజి, మూడు మహీంద్రా స్కార్పియాలు, రేంజ్ రోవర్, రెండు టయోటాలు, జీపు, టాటా పికప్ ట్రక్ వాహనాలున్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ఇక తన భార్య అన్నా లెజినోవా పేరిట నగదు రూపంలో రూ.19,340లు.. బ్యాంకు డిపాజిట్లు రూపంలో రూ.86.05 లక్షలు.. రూ.13.97 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు కలిపి మొత్తంగా రూ.ఒక కోటి చరాస్తులున్నాయి. ► పిల్లలు దేశాయి అకీరా నందన్ పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.89.38 లక్షలు.. దేశాయి ఆద్య పేరిట రూ 87.77 లక్షల బ్యాంకు డిపాజిట్లు.. పోలీనా అంజని పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.85.92 లక్షలు.. మార్క్ శంకర్ పేరిట రూ.86.25 లక్షలు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆకీరా నందన్కు తన తల్లి 2022లో ఆడి కారు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ► మరోవైపు.. మొత్తం రూ.65.76 కోట్ల మేర తాను బ్యాంకులు లేదా వివిధ వ్యక్తులకు చెల్లించాలని పవన్ పేర్కొంటూ, అందులో రూ.17.56 కోట్లు బ్యాంకులకు, మరో రూ.46.70 కోట్లు 15 మంది వ్యక్తులు లేదా సంస్థలకు అప్పులుగా చెల్లించాల్సి ఉందని ఆయన తన అఫిడవిట్లో వివరించారు. స్థిరాస్తులు.. ► హైదరాబాద్ శంకరపల్లి మండలం జొన్నవాడ గ్రామంలో 18.02 ఎకరాల వ్యవసాయ భూములున్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ. 10.42 కోట్లు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ప్రస్తుత మార్కెట్ విలువ అంచనాల ప్రకారం రూ.52.85 కోట్ల విలువచేసే ఏడుచోట్ల స్థలాలు (శేరిలింగంపల్లి మండల పరిధిలో రెండు, మంగళగిరి మండల పరిధిలో నాలుగు, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒకటి స్థలాలు ఉన్నట్లు తెలిపారు. మంగళగిరిలో పేర్కొన్న నాలుగు స్థలాల్లో ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో కోనుగోలు చేసినట్లు వివరించారు. ► ఆ ఏడింటిలో ఒకటి మంగళగిరిలోని స్థలం తన తల్లి బహుమతి రూపంలో ఇచ్చారని.. మిగిలినవి తను కొనుగోలు చేసినవన్నారు. ► హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రూ. 3.14 కోట్లు విలువచేసే రెండు ఇళ్లు ఉన్నట్లు తెలిపారు. è రూ.1.95 కోట్లు విలువచేసే హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇంటిని భార్య అన్నా లెజినోవాకు బహుమతిగా ఇచ్చానన్నారు. è రూ.22 కోట్లు విలువ చేసే హైదరాబాద్ జూబీహిల్స్లోని ఇంటిని తన భార్య అన్నా లెజినోవా పిల్లలు పోలీనా అంజని, మార్క్ శంకర్ ఇద్దరికీ చేరి సగం వాటాగా బహుమతిగా అందజేసినట్లు పవన్ పేర్కొన్నారు. పవన్కళ్యాణ్ నామినేషన్ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోదరుడు నాగబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలను వారు బేఖాతరు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి ఉండగా అంతకుమించి లోపలకు అనుమతించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థుల అనుచరులు ఉండాలన్న నిబంధననూ లెక్కచేయలేదు. అక్కడ నినాదాలూ చేశారు. బీజేపీ నేతలకు పరాభవం.. కూటమిలో సభ్యులైన టీడీపీ నేతలకు మాత్రమే విలువనిచ్చిన పవన్కళ్యాణ్.. అప్పటివరకూ ర్యాలీలో తనతో పాటు తిప్పుకున్న బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజుకు నామినేషన్ కేంద్రంలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. తనను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కృష్ణంరాజు అసహనానికి గురయ్యారు. తరువాత పోలీసులు వర్మ కుమారుడు గిరీష్ వర్మతో పాటు ఆయన్ను లోపలకు పంపించారు. ఇక నామినేషన్ వేసేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి ఒకసారి ర్యాలీగా పిఠాపురం చేరుకోవడానికే పవన్ అనుమతి తీసుకున్నారు. అయితే, రెండుసార్లు తిరగడం గమనార్హం. -
చంద్రబాబు, లోకేశ్ ప్రకటించిన ఆస్తులు రూ.1,474 కోట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వారి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. అపారమైన ఆస్తులు ఉన్నా చాలా తక్కువ ఆస్తుల్ని మాత్రమే వారు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా లోకేశ్ విడివిడిగా ఆస్తులు చూపించారు. కానీ వారు కలిసే ఉంటున్నారు. ఆస్తుల్ని మాత్రం పక్కాగా పంచుకున్నారు. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నప్పటికీ, విడివిడిగా ఆస్తుల్ని చూపించడం ద్వారా తక్కువ ఆస్తిపరులని ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అఫిడవిట్లలో అధికారికంగా వారు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,474 కోట్లు. చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.931.83 కోట్లు కాగా, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా చూపారు. వారి ఆస్తుల్లో ఎక్కువ హెరిటేజ్ షేర్ల రూపంలో ఉన్నాయి. స్థిరాస్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా ఉండగా, కొన్ని తమిళనాడులోనూ ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం నామమాత్రంగా రెండు స్థలాలున్నాయి. వారు తమదిగా చెప్పుకునే అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో మాత్రం ఈ కుటుంబంలోని ఐదుగురిలో ఎవరికీ ఒక్క ఆస్తి కూడా లేదు. వారి సొంతిల్లు హైదరాబాద్లోనే ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్, భువనేశ్వరి హెరిటేజ్ షేర్ల విలువే రూ.1102 కోట్లు చంద్రబాబు ఆస్తుల్లో ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్కి ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల విలువే రూ.1102.11 కోట్లు. భువనేశ్వరికి రూ.763 కోట్ల విలువైన షేర్లు ఉండగా, లోకేశ్కి రూ.339.11 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు, భువనేశ్వరి పేరు మీద రూ.121.41 కోట్ల స్థిరాస్తులు, రూ.815.17 కోట్ల చరాస్తులుగా చూపించారు. అలాగే భువనేశ్వరికి రూ.1.84 కోట్ల విలువైన బంగారం, రూ. 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా చూపారు. లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్కు కలిపి రూ.394 కోట్ల చరాస్తులు ఉండగా, స్థిరాస్తులు రూ.148.07 కోట్ల విలువైనవి ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణికి 2500.338 గ్రాముల బంగారం, 97.441 కిలోల వెండి, రూ.1.48 కోట్లు విలువైన వజ్రాభరణాలు ఉండగా, దేవాన్స్ వద్ద 7.5 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆస్తుల విలువ తగ్గించి చూపారు చంద్రబాబు కుటుంబం అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించింది. హైదరాబాద్ మదీనగూడలో లోకేశ్, భువనేశ్వరి పేరు మీద ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూమి విలువను రూ.100 కోట్లుగా చూపించారు. నిజానికి అక్కడ ఎకరం రూ.50 కోట్లకు పైనే ఉంటుంది. ఆ లెక్కన ఆ భూమి విలువ రూ.500 కోట్లకు పైమాటే. అలాగే ఈ భూమి వ్యవహారాన్ని చంద్రబాబు గతంలో రహస్యంగా ఉంచారు. 10 ఎకరాల్లో 5 ఎకరాలు లోకేశ్కి ఉన్నట్లు బయటపడినప్పుడు అది ఎలా వచ్చిందనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. నానమ్మ అమ్మణ్ణమ్మ నుంచి లోకేశ్కి గిఫ్ట్గా రాసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కుప్పంలో ఉండే అమ్మణ్ణమ్మకు ఖరీదైన ప్రాంతంలో అంత భూమి ఎలా వచ్చిందనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. మదీనగూడలోనే మరో 5 ఎకరాలను భువనేశ్వరి కొన్నట్లు చూపారు. రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల ఆస్తి కొన్న దేవాన్ష్ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల విలువైన ఆస్తిని కొన్నట్లు చూపడం విశేషం. జూబ్లీహిల్స్లో తల్లి బ్రాహ్మణితో కలిపి ఉన్న వాణిజ్య భవనాన్ని దేవాన్ష్ 2017లో కొన్నట్లు పేర్కొన్నారు. అతను పుట్టింది 2015లో. పిల్లలకు వారసత్వంగా ఆస్తి ఇవ్వడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఆ వయసులో కొన్నట్లు చూపడమే కొసమెరుపు. చంద్రబాబు పేరుతో ఉన్న స్థిరాస్థులు 1. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కొడుకు లోకేశ్తో కలిపి 1,285 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.70.20 కోట్లుగా చూపారు. 2. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి. విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. 3. నారావారిపల్లె శేషాపురంలో ఇల్లు. విలువ రూ.43.66 లక్షలుగా పేర్కొన్నారు. భువనేశ్వరి పేరుతో స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి (ఫామ్ హౌస్). దాని విలువ రూ.55 కోట్లుగా చూపారు. 2. తమిళనాడు కాంచీపురం జిల్లా సెన్నేర్ కుప్పం గ్రామంలో 2.33 ఎకరాల వాణిజ్య భూమి. విలువ రూ.30.10 కోట్లుగా చూపారు. లోకేశ్ స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో నానమ్మ గిఫ్ట్గా ఇచ్చిన 5 ఎకరాల వ్యవసాయ భూమి. దాని విలువ రూ.57.21 కోట్లుగా చూపారు. 2. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తండ్రి చంద్రబాబుతో కలిపి (50 శాతం వాటా) 1285 గజాల్లో నివాస భవనం. విలువ రూ.35.10 కోట్లుగా పేర్కొన్నారు. బ్రాహ్మణి స్థిరాస్థులు 1. హైదరాబాద్ మాదాపూర్లో 924 గజాల స్థలం. విలువ రూ.4.15 కోట్లుగా పేర్కొన్నారు. 2. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్లో 4 వేల గజాల స్థలం. విలువ రూ.90.39 లక్షలుగా చూపించారు. 3. హైదరాబాద్ మణికొండలో 2,440 గజాల స్థలం. విలువ రూ.3.66 కోట్లుగా చూపారు. 4. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కొడుకు దేవాన్ష్తో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల్లో వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా చూపారు. 5. చెన్నైలో 383 గజాల స్థలం. విలువ రూ.6.69 కోట్లుగా పేర్కొన్నారు. దేవాన్ష్ స్థిరాస్థులు 21. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తల్లి బ్రాహ్మణితో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా పేర్కొన్నారు. -
గంటా దొంగ లెక్కలు ఒక భార్య.. రెండు పాన్ కార్డుల కథ
-
అధికారంలో ఉన్నా, లేకున్నా ఆస్తుల పెంపులో చంద్రబాబు తగ్గేదేలే !
-
గంటా.. ఒక భార్య.. రెండు పాన్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు చట్టం తెలియదా? లేకపోతే తననెవరేం చేస్తార్లే అన్న ధీమానా? ఎందుకంటే ఏ వ్యక్తికైనా రెండు పాన్ నెంబర్లుండటం చట్టరీత్యా నేరం. శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్లు మూసేసుకుని... తననెవ్వరూ చూడటం లేదనుకునే బాపతు. అందుకే... గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తన భార్య పాన్ నంబరును మార్చేశారు. భార్య శారద పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్కు, ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్కు సంబంధం లేకపోవటంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అనుచరులే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు.... నాటి అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే అలవాటున్న గంటా ఈ సారి పట్టుబట్టి, చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరీ భీమిలి టికెట్టు సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్లో భార్య శారద పాన్ నంబరును మాత్రం ఏబీపీపీజీ2216ఏగా పేర్కొన్నారు. అంటే... 2215ఏ, 2216ఏ నంబర్లతో దాదాపు ఒకేసారి రెండు పాన్ నంబర్లను తీసుకున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. అంతా నగదు రూపంలోనే...! ఆదాయపన్నుశాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే, గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నపుడు పెద్దమొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. రూ.92,98,000ను నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో రూ.25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి సర్వే నంబరు టీఎస్ నంబరు 1,490, బ్లాక్ నంబరు 17, వార్డు నంబరు 24లోని 1,936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబరును పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్లు దాఖలు చెయ్యలేదు. వాస్తవానికి ఆ పాన్ నెంబర్లను చూసినపుడు రెండూ ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఐటీ రిటర్నుల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయపు పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలావరకూ బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా రెండు పాన్ నెంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియనిదేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై ఏడు కేసులున్నాయి. భార్యాభర్తలిద్దరి పేరిటా మొత్తం రూ.23.36 కోట్ల స్థిర, చరాస్తులున్నాయని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు. ఆస్తుల కొనుగోలుకు మరో పాన్ అసలు కథేమిటంటే... 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నంబర్ను ఏబీపీపీజీ2216ఏగా గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. అంటే... అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే సతీమణి పేరుతో కొనసాగించిన గంటా.. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్ను కూడా దాఖలు చెయ్యలేదు. ఈ వ్యవహారాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నంబర్ను అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. నిజానికి ఒకే వ్యక్తికి రెండు పాన్ నంబర్లు ఉండటం చట్టరీత్యా నేరమని, అంతేగాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఎన్నికల అఫిడవిట్లో వివరాలివ్వటం కూడా ఎన్నికల కోడ్కు విరుద్ధమని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. -
బాలయ్య కుటుంబ ఆస్తులు రూ.465.35 కోట్లు.. అయ్యన్నపై కేసులు 17
సాక్షి నెట్వర్క్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 2022–23లో ఆదాయం రూ.10 కోట్లు, స్థిరాస్తులు రూ.103 కోట్లు, చరాస్తులు రూ.82 కోట్లు కలిపి బాలయ్యకు మొత్తం రూ.185 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. క్రిమినల్ కేసులు ఏవీ లేవని పేర్కొన్నారు. నందమూరి హిందూ అవిభాజ్య కుటుంబంలో బాలకృష్ణకు స్థిరాస్తులు రూ.28.91 కోట్లు, చరాస్తులు రూ.2.41 కోట్లుగా చూపారు. బాలయ్య సతీమణి వసు«ంధర పేరిట రూ.179.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. అందులో స్థిరాస్తులు రూ.38.90 కోట్లు, చరాస్తుల విలువ రూ.140.38 కోట్లుగా చూపారు. కుమారుడు మోక్షజ్ఞ పేరిట స్థిరాస్తులు రూ.11.11 కోట్లు, చరాస్తులు రూ.58.64 కోట్లు కలిపి బాలకృష్ణ కుటుంబానికి మొత్తం ఆస్తుల విలువ రూ.465.35 కోట్లుగా చూపారు. అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరిట రూ.5,04,61,500, అతని భార్య పేరిట రూ.10,84,63,200 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు దళితులపై దూషణలు చేయడం.. అధికారులపై చిందులు వేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అతనిపై 17 కేసులు సైతం నమోదయ్యాయి. ఉమ్మడి విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు ఉన్నాయి. మాగుంట వద్ద ఉన్నది రూ.18 వేలేనట దేశవ్యాప్తంగా పేరున్న మద్యం వ్యాపారి. కానీ.. ఆయన చేతిలో ఉన్న నగదు రూ.18,529 మాత్రమేనట. టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన చేతిలో ఉన్న నగదుతో పాటు భార్య వద్ద రూ.6,68,134, ఉమ్మడి కుటుంబ సభ్యుల (హెచ్యూఎఫ్) వద్ద రూ.67,854 నగదు ఉందని తెలిపారు. చరాస్థుల కింద తనకు రూ.4,58,30,319 ఉండగా.. భార్య పేరిట రూ.17,98,70,139, ఉమ్మడి కుటుంబం కింద రూ.4,24,94,762 ఉన్నట్టు తెలిపారు. తన పేరిట రూ.1.09 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. భార్య పేరిట రూ.30,04,44,600, ఉమ్మడి కుటుంబ సభ్యుల కింద రూ.4,29,44,876 ఉన్నట్టు పేర్కొన్నారు. కేసుల చిట్టా విప్పిన బొండా ఉమా విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు (ఉమా) ఎన్నికల అఫిడవిట్లో తన కేసుల చిట్టా విప్పారు. 2006 నుంచి 2024 ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో తనపై 23 కేసుల నమోదైనట్టు వెల్లడించారు. 2006 నుంచే తనపై కేసులు ఉన్నప్పటికీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల వీటి ప్రస్తావన తేలేదు. భార్య, కుమారుడితో పాటు తన పేరిట మొత్తంగా రూ.98.53 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు వివరించారు. కావలి అభ్యర్థికీ కారు లేదట! కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) ఆస్తుల విలువ రూ.153.27 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అతని పేరున రూ.115.67 కోట్లు, భార్య శ్రీలత పేరిట రూ.31.92 కోట్లు, కుమార్తె వెన్నెల పేరిట రూ.5.67 కోట్లు చర, స్థిరాస్తులున్నట్టు చూపారు. కృష్ణారెడ్డి కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తులు విలువ రూ.715.62 కోట్లుగా ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్రెడ్డి పేరుతో రూ.639.26 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.17 కోట్లు ఉండగా.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. ఆ దంపతులిద్దరికీ రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నట్టు తెలిపారు. -
తిరువనంతపురం ఫైట్.. కేంద్ర ఐటీ మంత్రిపై ‘ఈసీ’కి ఫిర్యాదు
తిరువనంతపురం: కేరళలోని కీలక సీటు తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆస్తులు దాచారని ఎన్నికల కమిషన్(ఈసీ)కి వామపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఫిర్యాదు చేసింది. నామినేషనన్ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్లో గత ఏడాది ఆదాయాన్ని ఆయన చాలా తక్కువగా చూపించారని ఫిర్యాదులో ఎల్డీఎఫ్ నేతలు పేర్కొన్నారు. జూపిటర్ క్యాపిటల్ అనే కంపెనీలో ఆయనకు ఉన్న సింహభాగం వాటాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించలేదని ఆరోపించారు. ఇంతకముందు ఇదే విషయమై రాజీవ్ చంద్రశేఖర్పై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజీవ్చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి ప్రధానంగా యూడీఎఫ్ అభ్యర్థి శశిథరూర్తో పోటీపడుతున్నారు. ఇదీ చదవండి.. ప్రచార హోరు..తృణమూల్పై ప్రధాని మోదీ ఫైర్ -
రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్.. ఆస్థులకంటే అప్పులే ఎక్కువ!
కేరళలోని తిరువనంతపురం లోక్సభ స్థానానికి 'రాజీవ్ చంద్రశేఖర్' నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, అప్పులు వంటి వాటిని వెల్లడించారు. ఆస్తులకు సంబంధించి.. చంద్రశేఖర్ వద్ద రూ.52,000 నగదు, చరాస్తులతో పాటు మొత్తం రూ.9.26 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ.10.38 కోట్లు బ్యాంకు డిపాజిట్లు, రూ.45.7 కోట్ల రుణాత్మక ఆస్తులు, వ్యక్తిగత రుణాలు రూ.41.2 కోట్లు ఉన్నట్లు సమాచారం. రాజీవ్ చంద్రశేఖర్ వద్ద రూ. 10000 విలువ చేసే స్కూటర్, రూ. 3.35 లక్షల విలువైన నగదు ఉన్నట్లు సమాచారం. కాగా ఆయన భార్యకు రూ. 12.47 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద ఐటీ మంత్రి స్థిరాస్థులురూ. 14.4 కోట్లుగా ప్రకటించారు. అప్పులు దాదాపు రూ. 19.42 కోట్లు ఉన్నట్లు సమాచారం. తిరువనంతపురం నుంచి మూడుసార్లు కాంగ్రెస్ అధిపతి 'శశి థరూర్' & సీపీఐకి చెందిన పన్నియన్ రవీంద్రన్పై చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో శశిథరూర్ నాలుగోసారి గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేసారు. -
రాహుల్ గాంధీ కోటీశ్వరుడేనా?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన అదే స్థానం నుంచి ఈసారి లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం... ఆయన వద్ద స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు రూ.3.81 కోట్లు, బ్యాంకు ఖాతాలో రూ.26.25 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం తన వద్ద రూ. 55,000 నగదు ఉందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1,02,78,680 ఆర్జించినట్లు పేర్కన్నారు. #Congress leader Rahul Gandhi's Asset and Liability!!👇👇 Assets worth 20,29,52,000. Liability- 49,70,000. Also Invested in Stocks-Mutual Fund and Gold Bond.#stockmarkets #stockmarkets #RahulGandhi #BJP #NarendraModi pic.twitter.com/tx6eCcrWrf — House of Stocks~NISM certified (@CommonInsan) April 4, 2024 రాహుల్ గాంధీ వద్ద రూ.15.2 లక్షల విలువైన బంగారు బాండ్లు కూడా ఉన్నాయి. అలాగే జాతీయ పొదుపు పథకాలు, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో రూ. 61.52 లక్షల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. ఇక ఆయన దగ్గరున్న ఆభరణాల విలువ రూ.4.2 లక్షలు. రాహుల్ గాంధీ చరాస్తుల మొత్తం విలువ రూ.9.24 కోట్లు కాగా, స్థిరాస్తుల మొత్తం విలువ దాదాపు రూ.11.14 కోట్లు. ఆయన నామినేషన్తోపాటు అందించిన వివరాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగా ఉంది. అదే సమయంలో సుమారు రూ.49.7 లక్షల అప్పు కూడా ఉంది. -
‘తప్పయింది.. నన్ను క్షమించండి’, సుప్రీం కోర్టులో బాబా రాందేవ్
న్యూఢిల్లీ : ప్రముఖ యోగా గురు, పతంజలి ఆయర్వేద కో-ఫౌండర్ బాబా రాందేవ్, ఆ కంపెనీ సీఈఓ ఆచార్య బాలకృష్ణలను సుప్రీం కోర్టు మందలించింది. పతంజలిపై కేంద్రం సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉందని ప్రశ్నించింది. బాబా రాందేవ్ గతంలో.. కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకున్న కొందరు మరణిస్తున్నారు. అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయలేదనడానికి ఇదే నిదర్శనమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత వైద్య సంఘం (ఐఎంఎ) గత ఏడాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై అత్యున్నత న్యాయ స్థానం పలు మార్లు విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేయాలంటూ చివరిసారి ఫిబ్రవరిలో జరిపిన విచారణలో భాగంగా పతంజలి తప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశించింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఒక్కో ఉత్పత్తిపై రూ.కోటి జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మెడికల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ తగదు తాజాగా, అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణలు స్వయంగా సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. విచారణ సమయంలో సుప్రీం కోర్టు జస్టిస్ హిమ కోహ్లీ, జస్టీస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం మరోసారి బాబారామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణలు న్యాయాస్థానాన్ని ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారని తెలిపింది. అంతేకాదు ఆధునిక వైద్యం కోవిడ్-19 వైరస్లను నయం చేయలేవన్న బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలపై కేంద్రం కళ్లు మూసుకుని కూర్చుందని వ్యాఖ్యానించింది. అఫిడవిట్ ‘అవాస్తవం’,‘మోసం’ గత నెలలో యాడ్స్కు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేసినందుకు రాందేవ్, బాలకృష్ణపై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ను ‘అవాస్తవం’,‘మోసం’గా అభివర్ణించింది. అంతేకాదు, పతంజలి గత ఏడాది తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఇవ్వడంపై స్పందించింది. తాము (కోర్టు) ఇచ్చిన ఆదేశాల గురించి పతంజలి మీడియా యూనిట్(pmpl) కు తెలియదన్న వాదన తోసిపుచ్చింది. #WATCH | Yog Guru Ramdev leaves from Supreme Court. He appeared before the court in the misleading advertisement case filed against the Patanjali Ayurveda. He tendered an unconditional apology before the Supreme Court for violating the apex court's order for misleading… pic.twitter.com/y9oz8vl1IL — ANI (@ANI) April 2, 2024 నన్ను క్షమించండి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పతంజలి ఆయుర్వేద్ తరపు న్యాయవాది, బాబా రాందేవ్లు అత్యున్నత న్యాయస్థానాన్ని క్షమాపణలు కోరారు. క్షమాపణలతో దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వును గౌరవించాలి. కోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేశారు. ఇది ధిక్కారమే అవుతుందని అని జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మీకిదే చివరి అవకాశం బాబా రాందేవ్, బాలకృష్ణలకు చివరి అవకాశంగా ఒక వారంలో సరైన పద్ధతిలో అఫిడవిట్లను దాఖలు చేయాలి. ఏప్రిల్ 10న కోర్టు విచారణకు మీరిద్దరూ తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ సుప్రీం కోర్టు జస్టిస్ హిమ కోహ్లీ, జస్టీస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం అనుమతి ఇచ్చింది. -
నాలుగు సార్లు ఎమ్మెల్యే, మాజీ ఆర్ధిక మంత్రి.. ఆయన ఆస్తులెంతో తెలుసా?
తిరువనంతపురం: ఎన్నికల నేపథ్యంలో కేరళ మాజీ ఆర్ధిక శాఖ మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఎల్డిఎఫ్ నేత, పతనంతిట్ట అభ్యర్థి డా. థామస్ ఐజాక్ వార్తల్లో నిలిచారు. అప్పుడప్పుడు అమెరికా పర్యటనలు, డిజైనర్ కుర్తాలంటే ఇష్టపడే థామస్ ఐజాక్ సాధారణ జీవనశైలితో తోటి నేతలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ నేతగా పేరొందిన థామస్ ఐజాక్ అఫిడవిట్ను సమర్పించారు. ఐజాక్ పేరిట రూ. 9.6 లక్షల విలువైన 20,000 పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని తెలుస్తోంది. అద్దె ఇంట్లోనే బ్యాంక్ సేవింగ్స్లో రూ.6,000, సహా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ.1.31 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత అయినప్పటికీ ఐజాక్ తిరువనంతపురంలో తన సోదరుడి ఇంట్లో అద్దెకి నివసిస్తున్నారు. 10వేల విలువ చేసే షేర్లు పెన్షనర్ల ట్రెజరీ ఖాతాలో రూ.68,000, ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలో రూ.39,000, కేఎస్ఎఫ్ఈ సుగమా ఖాతాలో రూ.36,000 ఉన్నాయి. అంతేకాకుండా, అతను కేఎస్ఎఫ్ఈలో చిట్ ఫండ్ను వివిధ వాయిదాలలో మొత్తంగా రూ.77వేలు చెల్లించారు. అదనంగా, మలయాళం కమ్యూనికేషన్స్లో రూ.10వేలు విలువ చేసే షేర్లు మాత్రమే ఆయన పేరు ఉండటం గమనార్హం. -
భార్య కన్నా గడ్కరీ ఆదాయం తక్కువ.. భూములు కూడా లేవు!
మహారాష్ట్రలోని నాగ్పూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో ఆయన తన ఆస్తిపాస్తుల వివరాలు తెలియజేశారు. ఆదాయం విషయంలో నితిన్ గడ్కరీ తన భార్య కంచన్ నితిన్ గడ్కరీ కంటే చాలా వెనుకబడివున్నారు. అఫిడవిట్లోని వివరాల ప్రకారం నితిన్ గడ్కరీ 2022-23లో రూ. 13,84,550 ఆదాయం సంపాదించారు. ఆయన భార్య కంచన్కు 2022-23లో రూ.40,62,140 ఆదాయం అందుకున్నారు. నితిన్ గడ్కరీ ఆస్తుల విలువ రూ. ఒక కోటీ 32 లక్షల 90 వేల 605. ఆయన భార్య కంచన్ ఆస్తుల విలువ రూ. ఒక కోటీ 24 లక్షల 86 వేల 441. నితిన్ గడ్కరీ కుటుంబానికి రూ.95,46,275 విలువైన చరాస్తులు ఉన్నాయి. గడ్కరీ పేరు మీద మూడు కార్లు ఉన్నాయి. వీటిలో అంబాసిడర్ కారు ఒకటి. 1994లో కొనుగోలు చేసిన ఈ కారు ధర రూ.10 వేలు. గడ్కరీ దగ్గర హోండా కంపెనీకి చెందిన కారు ఉంది. దీని ధర 6,75,000. గడ్కరీకి ఎల్సుజు కంపెనీకి చెందిన మరో కారు ఉంది. దాని విలువ రూ.12,55,000. నితిన్ గడ్కరీ భార్య కంచన్ పేరు మీద మూడు కార్లు ఉన్నాయి. అవి రూ.5,25,000 విలువైన ఇన్నోవా, రూ.4,10,000 విలువైన మహీంద్రా కంపెనీ కారు, రూ.7,19,843 విలువైన టాటా కంపెనీ కారు. బంగారం, ఆభరణాల విషయంలో భార్య కంచన్ కంటే నితిన్ గడ్కరీ ముందున్నాడు. నితిన్ గడ్కరీ వద్ద రూ.31,88,409 విలువైన బంగారం లేదా ఆభరణాలు ఉన్నాయి. అదే సమయంలో కంచన్ వద్ద రూ.24,13,348 విలువైన ఆభరణాలు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికొస్తే నితిన్ గడ్కరీ పేరు మీద వ్యవసాయ భూమి లేదు. ముంబైలో అతని పేరు మీద ఓ ఇల్లు ఉంది. 960 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి ధర రూ.4.95 కోట్లు. కంచన్కు ఇల్లు, భూమి ఉన్నాయి. వీటి ధర రూ.7 కోట్ల 99 లక్షల 83 వేలు. నితిన్ గడ్కరీ కుటుంబానికి రూ.11 కోట్ల 55 లక్షల 11 వేల విలువైన స్థిరాస్తి ఉంది. నితిన్ గడ్కరీకి రూ. ఒక కోటీ 66 లక్షల 82 వేల 750 రుణం, ఆయన భార్య కంచన్కు రూ.38 లక్షల 8 వేల 390 రుణం ఉంది. -
SBI: మొత్తం 22,217 ఎన్నికల బాండ్లు జారీ
ఢిల్లీ: ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎట్టకేలకు ఆ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. మంగళవారం సాయంత్రమే కోర్టు ఆదేశాల మేరకు వివరాలు ఇవ్వగా.. ఇవాళ సమ్మతి అఫిడవిట్(compliance affidavit) సమర్పించింది. అందులో.. ఈసీకి ఇచ్చిన పెన్ డ్రైవ్ వివరాలను అఫిడవిట్లో ప్రస్తావించింది. పెన్డ్రైవ్లో రెండు పీడీఎఫ్ ఫైల్స్ ఉన్నాయని.. వాటికి పాస్వర్డ్ ఉన్నాయని పేర్కొంది. అలాగే.. ఏప్రిల్ 2019 నుంచి.. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా(అంటే.. ఎన్నికల బాండ్లు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చేదాకా ) మొత్తం 22, 217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఈ మొత్తంలో రాజకీయ పార్టీలు 22, 030 బాండ్లను తీసుకున్నాయని తెలిపింది. అలాగే.. మిగిలిన 187 తాలుకా బాండ్ల నగదు ప్రధాని రిలీఫ్ ఫండ్కు జమ అయినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకం కింద.. దాతలు తమ ఇష్టపూర్వకంగా విరాళాలను ఎస్బీఐ నుంచి ఎన్నికల బాండ్ల రూపేణా కొనుగోలు చేసి ఆయా పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ.. 15 రోజుల్లో గనుక పార్టీలు ఆ బాండ్లను స్వీకరించకపోతే ఆ డబ్బు ప్రధాని రిలీఫ్ ఫండ్కు వెళ్తుంది. కానీ, ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రద్దు చేస్తూ ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: 26 రోజులేం చేశారు?.. ఎస్బీఐపై సుప్రీం కన్నెర్ర -
సోనియా గాంధీ ఆస్తుల విలువెంతో తెలుసా?
ఢిల్లీ: ఏడు సార్లు లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ సారి రాజ్యసభకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. రాయ్బరేలీ సీటును వదులుకొని రాజస్థాన్ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను ఆమె ప్రకటించారు. ప్రస్తుతం తన వద్ద రూ. 90,000 నగదు ఉందని, తన మొత్తం ఆస్తుల విలువ రూ. 12,53,76,822 (రూ.12.53 కోట్లు)గా పేర్కొన్నారు తనకు రూ.12.53 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇటలీలో తన తండ్రికి చెందిన రూ.27 లక్షల విలువైన ఆస్తిలో వాటా ఉందని, వీటితో పాటు 88 కిలోల వెండి, 1,267 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నట్లు సోనియా తెలిపారు. ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో మూడు బిగాల వ్యవసాయ భూమి ఉందని, ఎంపీగా వచ్చే వేతనం, రాయల్టీ ఆదాయం, మూలధన లాభాలను ఆదాయంగా ఆమె పేర్కొన్నారు. తన వద్ద రూ.90 వేల నగదు ఉందని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో తనకు మొత్తం రూ. 11.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా సొంత కారు కూడా లేదన్న సోనియా.. సోషల్ మీడియాలో తనకు ఖాతా లేదని తెలిపారు. ఇదీ చదవండి: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక -
ఆస్తుల వివరాలు వెల్లడించిన జయా బచ్చన్
అమితాబ్ బచ్చన్- జయా బచ్చన్.. బీటౌన్లో మోస్ట్ పాపులర్ అండ్ సీనియర్ జంట. ఇద్దరిదీ సినిమా బ్యాక్గ్రౌండే.. కాకపోతే బిగ్బీ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్గా కొనసాగుతుండగా జయా బచ్చన్ మాత్రం పాలిటిక్స్లో రాణిస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత ఈమె ఈ మధ్యే రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీలో ఓ ముఖ్య పాత్రలో మెరిశారు. ఇకపోతే జయా బచ్చన్ వరుసగా ఐదోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమాజ్ వాదీ పార్టీ తరపున ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2022 - 2023వ సంవత్సరానికి గానూ జయ వ్యక్తిగత నికర విలువ రూ.1.63 కోట్లు కాగా, ఆమె భర్త అమితాబ్ నికర విలువ రూ.273.74 కోట్లుగా ఉంది. తన బ్యాంకులో రూ.10 కోట్లు ఉన్నాయన్న ఆమె అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ రూ.849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ రూ.729 కోట్లుగా ఉంది. ఆమె దగ్గర రూ.40.97 కోట్ల విలువైన నగలతో పాటు రూ.9.82 లక్షల విలువ చేసే కారు ఉంది. అమితాబ్ దగ్గర రూ.54.77 కోట్ల ఆభరణాలతో పాటు రూ.17.66 కోట్లు విలువ చేసే 16 వాహనాలున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా బిగ్బీతో కలిసి రూ.1578 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు జయా బచ్చన్ ప్రకటించారు. చదవండి: Valentine's Day 2024: ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి! -
పుతిన్ సంపాదన ఇంత తక్కువా?
వ్లాదిమిర్ పుతిన్ ఆరేళ్లుగా రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు సంబంధించిన ఆదాయ వివరాలు వెల్లడి కావడం.. ఆ వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆయన తన ఎన్నికల అఫిడవిట్ పత్రాల్లో ఆదాయం, ఆస్తుల వివరాలు పొందుపరిచారు. తాజాగా ఆయన అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పబ్లిష్ చేసింది. గత ఆరేళ్ల నుంచి ఆయన ఆస్తుల విలువ 67.6 మిలియన్ రెబెల్స్ (7,53,000 ఆమెరికన్ డాలర్లు)గా పుతిన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. 2018 నుంచి 2024 వరకు పుతిన్ సంపాధించిన ఆస్తుల విలువ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ పత్రాల వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ డిపాజిట్లు, మిలిటరీ పెన్షన్, పలు స్థలాల అమ్మకం ద్వారా లభించిన మొత్తంగా తెలుస్తోంది. ఇక అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి వార్షిక జీతమే 4,00,000 అమెరికన్ డాలర్లు. ఈ లెక్క ప్రకారం రష్యా అధ్యక్షుడి వార్షిక ఆదాయం అమెరికా అధ్యక్షుడి కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం. రష్యా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. పుతిన్ పది వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో 54.5 మిలియన్ రెబెల్స్( 606,000 అమెరికన్ డాలర్లు) నగదు కలిగి ఉన్నారు. ఆయన ఐదు సొంత వాహనాలు కూడా ఉన్నాయి. అందులో రెండు పాతకాలం సోవియట్ యూనియన్ కార్లు GAZ M-21s ఉన్నాయి. 2009లో రష్యా తయారైన 4x4 కారు, 1987 నాటి క్యాంపింగ్ ట్రైలర్ ఉన్నాయి. పుతిన్ మాస్కోలో ఒక అపార్టుమెంట్, సెయింట్ పిరట్స్బర్గ్లో ఒక అపార్టుమెంట్, గ్యారేజ్ కలిగి ఉన్నారు. అయితే పుతిన్ ఫిన్లాండ్ సరిహద్దుల్లో రహస్య నివాసం ఉందని స్థానిక మాస్కో టైమ్స్ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం ప్రచురించిన ఒక్క రోజు తర్వాత పుతిన్ ఆదాయ, ఆస్తుల విషయాలు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వెల్లడికావటంపై చర్చ జరుగుతోంది. కరేలియాలోని లేక్ లడోగా నేషనల్ పార్క్లో పుతిన్ అత్యధునిమైన రహస్య నివాసాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొంది. వివాలవంతమైన సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది. ఇక.. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 15 నుండి 17 వరకు మూడు రోజుల్లో జరుగనున్నాయి. 2020లో వివాదాస్పద రాజ్యాంగ సంస్కరణను అనుసరించి పుతిన్(71) కనీసం 2036 వరకు అధికారంలో కొనసాగవచ్చు. -
చిట్టా విప్పాల్సిందే..! లేదంటే న్యాయపరమైన చిక్కులు!
సాక్షి, మెదక్: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమపై ఉన్న కేసుల చిట్టాను బయట పెట్టాల్సిందే.. ఎవరిపై ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎన్ని కేసులు ఉన్నాయి? అనే విషయాలు ప్రజలకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే. దాని కోసం అభ్యర్థులు కూడా సిద్ధమయ్యారు. నామినేషన్లు వేసిన సమయంలో తమ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని ప్రముఖ దినపత్రికల్లో ప్రకటిస్తున్నారు. పారదర్శకంగా వ్యవహరించాలి.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి నేరచరిత్ర ఉన్నా బయట పెట్టాలన్న సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అభ్యర్థులు తమపై ఉన్న కేసులను బయట పెడుతున్నారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ నియోజకవర్గం బరిలో 13 మంది అభ్యర్థులు ఉండగా, నర్సాపూర్ బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాలి. రాజకీయంగా పారదర్శకత పాటించే ఏ నాయకుడికీ ఈ ప్రకటనలు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రాజకీయ నాయకుడు అన్నాక కేసులు ఉండడం సర్వసాధారణమే. ప్రజా సమస్యల పోరాటంలో భాగంగా.. ఏదో ఒక సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసే సమయంలో కేసులు నమోదవుతుంటాయి. తెలంగాణ ఉద్యమంలో దాదాపు అన్ని పార్టీల నాయకులపైనా కేసులు నమోదయ్యాయి. అందులో చాలా వరకు కొట్టివేయగా.. ఇంకొన్ని విచారణ దశలో ఉన్నాయి. రాజకీయ జీవితం మొదలు కాకముందు, రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత కారణాలతో నమోదైన క్రిమినల్ కేసులు కొందరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ముగ్గురు అందజేత.. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు పత్రికా ప్రకటనల ద్వారా కేసుల వివరాలు వెల్లడించారు. తర్వాత ఆ పేపర్ కటింగ్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఒకవేళ సదరు అభ్యర్థులపై కేసులు ఉండి పత్రికల ద్వారా వెల్లడించకపోతే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసుల్లో ప్రజాసమస్యలపై పోరాటాలు చేసిన వారికి ఇది కలిసొచ్చే అంశం కాగా, ఉద్దేశపూర్వక నేరచరిత్రులకు మాత్రం ఇబ్బంది కలిగే అంశమని అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: వస్తారా.. రారా..? -
అప్పుకోసం రాజేశ్ హడావుడి
-
కోట్లున్నా..కారుండదు..ఎందుకు?
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సమయంలో ఓ అంశం సాధారణ ప్రజల్లో కొత్త ఆలోచనను రేపుతుంటుంది. మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర కీలక పదవుల్లో ఉన్న కొందరు ‘నాకు సొంత కారు లేదు’ అని నామినేషన్ల అఫిడవిట్లో చూపుతుంటారు. వారి ఆస్తులు మాత్రం రూ.కోట్లలో ఉంటాయి. ఇంత ఆస్తి పరులకు సొంత వాహనం ఎందుకు ఉండదు..?? కోట్లకు పడగలెత్తిన బడా నేతలు సొంత వాహనాన్ని కొనుక్కునే పరిస్థితిలో లేరా..?? వారి ఇళ్ల ఎదుట డజనుకుపైగా కనిపించే ఖరీదైన విలాసవంతమైన కార్లు ఎవరివి..?? ఈ అనుమానాలు చాలా మంది బుర్రలను తొలిచేస్తూంటాయి. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కొందరు మంత్రులు సహా పలు పార్టీలకు చెందిన బడా నేతలు సొంత కారు లేదని ప్రకటించారు. ఇలా ఎందుకంటే.. ఏ కేసు పెట్టినా.. వెళ్లాల్సిందే... ఆ వాహనం ఏదైనా వివాదంలో చిక్కుకున్నా, ప్రమాదానికి గురైనా న్యాయపరమైన అంశాల్లో యజమాని పేరు నమోదవుతుంది. ప్రమాదానికి గురైన సందర్భాల్లో యజ మాని వాహనంలో ప్రత్యక్షంగా లేకున్నా, కేసులను మాత్రం స్వయంగా ఎదుర్కొనక తప్పదు. పోలీసులు, న్యాయస్థానం ముందు యజమాని ప్రస్తావన రావటంతోపాటు, నేరుగా హాజరు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వాహన యజమానులు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు ఇవి ఇబ్బందికరంగా మారుతాయి. ఇక వాహనాలు నేతల పేర్లతో లేకున్నా, కొన్ని సందర్భాల్లో వాటిపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్టిక్కర్లు ఉంటుంటాయి. అలా ఉన్న కార్లు ప్రమాదాలకు గురైనా, ఇతర వివాదాల్లో చిక్కుకున్నా.. ఆ స్టిక్కర్ల వల్ల నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు ఎన్నో. కేవలం స్టిక్కర్ల ద్వారానే అలాంటి పరిస్థితి ఎదురైతే, వాహన రిజిస్ట్రేషన్లో యజమానిగా నేతల పేర్లు ఉంటే వారికి మరిన్ని ఇబ్బందులు సహజం. ఈ పరిణామాలను ముందుగా ఊహించే కొందరు బడా నేతలు తమ పేర్లతో వాహనాలు కొనటం లేదు. ఇది కేవలంనేతలకే పరిమితం కాలేదు. పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థలవారు, బడా వ్యాపారులు, సినిమా నటులు.. ఇలా చాలా రంగాలకు చెందిన వారిలో ఈ ధోరణి ఉంది. నామినేషన్ వేసిన ఓ మంత్రి తన అఫిడవిట్లో సొంత వాహనం లేదని చూపించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయన విద్యా సంస్థల అధిపతిగా ఉన్నారు. అప్పుడు గానీ, ఇప్పుడు గానీ ఆయన వాహనాలను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లేదు. ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సి రావటం.. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో యజమాని ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సి ఉండటం కూడా దీనికి మరో కారణం. అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ తంతు పూర్తి చేసే వరకు ఉండటం ఇబ్బందిగా భావిస్తున్నారు. నామ బలం.. అభిమానంతో కొంతమంది.. వాహనాన్ని కొనేప్పుడు ఎవరి పేరుతో కొంటే మంచి జరుగుతుందో అన్న నమ్మకాలు కొందరిలో ఉంటాయి. ప్రతి పనికీ ముహూర్తాలు, నామ బలం చూసుకునే అలవాటు ఉన్నవారు దీనికి ప్రాధాన్యం ఇస్తారు. తమ పేరుతో కలిసి రాదని భావిస్తే వేరేవారి పేరుతో కొంటుంటారు. ఇక కొందరు ఆప్తులుగా భావించే వారిపై ఉన్న అభిమానంతో వారి పేరుతో వాహనాలు కొంటుంటారు. ఇది కూడా వాహనాలు యజమాని పేరుతో కాకుండా ఇతరుల పేరుతో ఉండటానికి కారణమవుతోంది. ఆదాయ పన్నుల భారం లేకుండా.. ఆయనో పారిశ్రామికవేత్త.. రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఇంటి ఆవరణలో డజనుకుపైగా విలాసవంతమైన కార్లు ఉంటాయి.. కానీ ఏదీ ఆయన పేరుతో ఉండదు. వాటి ఖర్చు, బ్యాంకు లోన్ల వ్యవహారం ఆయనకు సంబంధం లేదు. అన్నీ ఆయన సంస్థల నుంచే భరిస్తున్నట్టు చూపుతున్నారు. దీంతో ఆదాయపన్నులో ఆ కార్ల ఖాతా ఉండటం లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలు, విద్యా సంస్థల అధిపతులు దాదాపు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. -గౌరీభట్ల నరసింహమూర్తి -
కేసీఆర్కు కోటి అప్పు ఇచ్చిన వివేక్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల అఫిడవిట్లలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అ భ్యరి్థగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్.. సీఎం కేసీఆర్కు రూ.కోటి అప్పు ఇచ్చినట్టుగా తన అఫిడవిట్లో పేర్కొన్నా రు. అదేవిధంగా రామలింగారెడ్డికి రూ.10లక్షలు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి రూ.1.50కోట్లు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. మొత్తంగా రూ.23.99 కోట్లను వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లుగా పేర్కొన్న వివేక్ ఆయనకు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆస్తుల విషయంలో ఈ మాజీ ఎంపీ రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయన సతీమణి జి.సరోజ పేరుతో రూ.377కోట్లు ఉండగా, విశాఖ కంపెనీతో సహా పలు కంపెనీలు, మీడియా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు. రెండో స్థానంలో పొంగులేటి: ఆ తర్వాత పాలేరు స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రూ.460కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎ కేసీఆర్ తన అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తులు రూ.59కోట్లు ఉన్నట్లు, సొంత కారు కూడా లేదని పేర్కొనడం తెలిసిందే. అయితే తాను మాజీ ఎంపీ వివేక్కు రూ.1.06కోట్లు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్కు మ«ధ్య లావాదేవీలు జరిగినట్లు, గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఈ డబ్బులు ఇచి్చనట్లు పార్టీ నాయకులు అనుకుంటున్నారు. చదవండి: తెలంగాణకు మోదీ గ్యారంటీలు -
ఎన్నికల అఫిడవిట్ లో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాలు..ఎన్ని కొట్లో తెలుసా ?
-
దర్శన్ అఫిడవిట్ పీఎంవో పనే: మహువా మొయిత్రా
ఢిల్లీ: మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్ వ్యవహారంపై ఎంపీ మహువా మొయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం దర్శన్పై ఒత్తిడి చేసి తెల్లకాగితంపై సంతకం చేయించారని ఆరోపించారు. పీంవోనే ఓ తెల్లకాగితంపై రాసి మీడియాకు లీక్ చేశారని అన్నారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి సమర్పించిన అఫిడవిట్ విశ్వసనీయతపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అఫిడవిట్ లెటర్ హెడ్ లేని తెల్ల కాగితంపై ఉందని అన్నారు. అధికారికంగా విడుదల చేయలేదని చెప్పారు. 'వ్యాపార వేత్తగా కొనసాగుతున్న దర్శన్కు పీఎంతో పాటు మంత్రులందర్ని కలవగల సమర్ధత ఉంది. అలాంటప్పుడు పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి మొదటిసారి ప్రతిపక్ష ఎంపీగా కొనసాగుతున్న నాకు ఎందుకు లంచం ఇస్తారు? ఇది పూర్తిగా అసత్యం. ఈ లేఖను దర్శన్ కాకుండా పీఎంవోనే రాసింది. దర్శన్, ఆయన తండ్రిపై పీఎంవో బెదిరింపులకు పాల్పడింది. లేఖపై సంతకం చేయడానికి 20 నిమిషాలు సమయం ఇచ్చారు.' అని పేర్కొంటూ తాను దర్శన్ నుంచి లంచం తీసుకున్నాననే ఆరోపణలను మహువా మొయిత్రా ఖండించారు. అదానీ వ్యవహారాన్ని లేవనెత్తకుండా తన నోరు మూయించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడిందని మహువా మెుయిత్రా ఆరోపించారు. అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు హాస్యాస్పదమైన అంశాలుగా పేర్కొన్నారు. బీజేపీ ఐటీ సెల్లో మంచి రచనా నైపుణ్యం కలిగిన మందబుద్ధిగల వ్యక్తిచే ఈ లేఖను రాయించారని దుయ్యబట్టారు. దర్శన్ తనపై నిజంగా ఆరోపణలు చేయాలనుకుంటే మీడియా ముందుకు వస్తారు కానీ ఇలా ఏదో ఒక ఛానల్కు లీక్ చేయరని అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీఎంసీ నేత మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్ సంతకం చేసిన అఫిడవిట్ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. దర్శన్ అఫిడవిట్లో ఏముందంటే..? ► నాకు అనుకూలమైన ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ అయిన మొయిత్రా నుంచి పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను తీసుకున్నాను ► ఇందుకుగాను ఆమె చాలా విలాసవంతమైన ప్రతిఫలాలు పొందారు. లగ్జరీ ఐటెమ్ అడిగేవారు. ఢిల్లీలోని ఆమె తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనులు చేయించుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రయాణ ఖర్చులను భరించాలని డిమాండ్చేశారు. ► జాతీయస్థాయి నేతగా ఎదగాలని మొయిత్రాకు ఆశ. అందుకే ప్రధాని మోదీ, గౌతమ్ అదానీలను అప్రతిష్టపాలు చేసి ప్రతిష్ట పెంచుకుందామని స్నేహితులను ఉపాయాలు అడిగేవారు. ► పార్లమెంట్లో ఆమె ప్రశ్నలు అడిగేందుకు తగిన సమాచారాన్ని ఆమె పార్లమెంటరీ మెయిల్ ఐడీకి పంపేవాడిని. తర్వాత నేనే నేరుగా ప్రశ్నలు అప్లోడ్ చేసేవాడిని. ► ఆమెకు రాహుల్ గాందీ, శశి థరూర్, పినాకీ మిశ్రా వంటి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో నాకూ లాభం ఉంటుందని భావించా. ► ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ ఇలా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థలకు చెందిన జర్నలిస్టులతో ఆమె మాట్లాడేవారు ► సుచేతా దలాల్, శార్దూల్ ష్రాఫ్లతోపాటు మాజీ అదానీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ప్రశ్నలు అడిగేవాళ్లం. ఇలా ఉండగా, తన పరువుకు భంగం కలిగేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ మొయిత్రా వేసిన పిటిషన్ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. లేఖ ఇంకా అందలేదు.: ఎథిక్స్ కమిటీ చీఫ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ లేఖ తనకు ఇంకా అందలేదని ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకర్ శుక్రవారం తెలిపారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే అంశం తీవ్రమైనదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో సాక్ష్యాలను కమిటీ పరిశీలిస్తోందని సోంకర్ చెప్పారు. ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలను కోరామని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: ప్రయోజనం పొంది ప్రశ్నలడిగారు -
అఫిడవిట్లో అలసత్వం వద్దు
తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందువల్లే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, ఉన్న కేసులు, జైలు జీవితం అనుభవిస్తే ఆ వివరాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ నామినేషన్ సందర్భంగా లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలపాలని పేర్కొంది. అయితే కొందరు అభ్యర్థులు అఫిడవిట్లో అన్ని వివరాలు తెలపడంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై 2013లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దాని ప్రకారం అఫిడవిట్లో ఏ ఒక్క కాలమ్ను నింప కుండా ఖాళీగా ఉంచవద్దంటూ పేర్కొంది. ఎవరైనా అభ్యర్థి పొరపాటున ఎక్కడైనా ఖాళీగా వదిలేస్తే దాన్ని పూర్తిగా నింపాలంటూ తేల్చి చెప్పింది. ఓటర్ల హక్కు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సతీమణి వనమా పద్మావతి పేరిట ఉన్న ఇన్నోవా వాహనంపై హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.135 ట్రాఫిక్ చలాన్ పెండింగ్లో ఉంది. ఆయన కుటుంబం పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3,120 వాటర్ బిల్లు బకాయి ఉంది. వీటితో పాటు వివిధ ఆస్తులు, తనపై నమోదైన పోలీసు కేసుల వివరాలను 2018 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా వనమా అఫిడవిట్లో పేర్కొనలేదు. పారదర్శకత పాటించడంలో విఫలమైనందున వనమా ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించి చుక్కలు చూపించారు. చిన్న ట్రాఫిక్ చలానాయే కదా అనే నిర్లక్ష్యం, ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై పోలీసు కేసులు సహజమే అనే ఏమరుపాటు ఇబ్బంది తెచ్చి పెట్టగా కేసు ఇంకా సుప్రీంలో కొనసాగుతోంది. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ప్రతీ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందే. ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల వెల్లడిలో అలసత్వముంటే ఇబ్బందులు ఎదురవుతాయనేందుకు వనమా ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. వనమా తరహాలోనే నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలతో మంత్రి శ్రీనివాస్గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సైతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. పత్రికా ప్రకటనలు అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పోలింగ్కు రెండు రోజుల ముందులోపు స్థానికంగా ఉన్న పేపర్లు/టీవీల్లో ప్రకటనల ద్వారా క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ మూలనో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం –1951 ప్రకారం అనర్హతకు గురవుతారు. బీ ఫామ్ అందుకోగానే బీ ఫామ్ అందుకోవడమే ఆలస్యం నామినేషన్ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ (లిఖిత వాంగ్మూలం) విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అక్కడ రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. -
ఇక పక్కాగా అఫిడవిట్!
సాక్షి, హైదరాబాద్: అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్లోని ప్రతికాలమ్ను ఇకపై తప్పనిసరిగా పూరించాల్సిందే. కుటుంబ సభ్యుల వివరాలు, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యార్హతలు తదితర వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిత నమూనాలోని అఫిడవిట్లో పొందుపరచాల్సిందే. ఏ ఒక్క కాలమ్ను ఖాళీగా ఉంచినా సంబంధిత అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించనున్నారు. నామినేషన్ల పరిశీలనలో అభ్యర్థి తన అఫిడవిట్లో ఏదైనా కాలమ్ను ఖాళీగా ఉంచినట్టు నిర్ధారిస్తే, సదరు అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసు జారీ చేసి ఆ కాలమ్ను నింపాలని కోరుతారు. అయినా కాలమ్ను నింపడంలో విఫలమైతే ఆ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్రాజ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు నేరచరిత్రను పత్రికల్లో ప్రకటించాలి రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో అదనపు సీఈఓ లోకేష్కుమార్, పోలీసు నోడల్ అధికారి సంజయ్కుమార్ జైన్, జాయింట్ సీఈఓ సత్యవతితో కలిసి మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికల్లో ప్రకటించాలని, నేర చరిత్ర గల అభ్యర్థులకు ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అన్న అంశంపై కారణాలు తెలుపుతూ రాజకీయ పార్టీలు సైతం పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇక ఈసీ పరిధిలోకి అధికార యంత్రాంగం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చేశారని, వారు ఈసీకి డిప్యుటేషన్పై పనిచేస్తున్నట్టు పరిగణిస్తామని వికాస్రాజ్ స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6, ఓటర్ల వివరాల మార్పు కోసం ఫారం 8 దరఖాస్తుల ïస్వీకరణకు గడువు ఈ నెల 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆలోగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఓటర్లకు ఎన్నికల్లో ఓటేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతో సోమవారం తర్వాత అందనున్న ఫారం–7 దరఖాస్తులను ఎన్నికలు ముగిసే వరకు పెండింగ్లో పెడతామని వివరించారు. వారికి ఇంటి నుంచే ఓటు హక్కు దివ్యాంగులు, 80ఏళ్లు పైబడిన ఓటర్లకు తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వికాస్రాజ్ తెలిపారు. ఇందుకోసం ఫారం 12డీ దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు. పోలింగ్ కేందాల్లో టాయిలెట్లు, తాగునీరు, ర్యాంపులు, వీల్చైర్ వంటి కనీస సదుపాయాలు కల్పిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఈవీఎం బ్యాలెట్లలో సైతం అభ్యర్థుల ఫొటోలు ముద్రిస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలన కోసం తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామని చెప్పారు. మీడియా సర్టిఫికేషన్ కమిటీ నుంచి ధ్రువీకరణ పొందిన తర్వాతే వాణిజ్య ప్రకటనలు జారీ చేయాలని రాజకీయ పార్టీలను కోరారు. లెక్కలు చూపితే నగదు విడుదల... రూ.50వేలకు పైగా నగదు తీసుకెళ్తుంటే తనిఖీల్లో జప్తు చేస్తారని, ఆ నగదుకు సంబంధించిన లెక్కలను చూపిస్తేనే విడిచి పెడ్తారని వికాస్రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీలు ముందుగా సమాచారమిచ్చి నగదును తరలిస్తే వారికి అనుమతి జారీ చేస్తామని వెల్లడించారు. పక్కాగా నిబంధనలు అమలు చేయాలి రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాలను నిక్కచ్చిగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు(డీఈఓ), జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు. రాష్ట్ర వ్యయ పరిశీలన నోడల్ అధికారి మహేశ్ భగవత్, కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారి స్వాతి లక్రా, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి సంజయ్కుమార్ జైన్తో కలిసి సోమవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలపాలని, వెబ్సైట్లలో సైతం ఆలస్యం చేయకుండా మార్పులు చేస్తుండాలని ఆదేశించారు. -
కులగణన సర్వేపై నాలుక కరుచుకున్న కేంద్రం
పాట్నా: బీహార్లో ఇటీవల జరిగిన కులగణనకు వ్యతిరేకంగా సోమవారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కులగణన చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుందని పేర్కొంది. కానీ అంతలోనే పొరపాటు జరిగిందని చెబుతూ అఫిడవిట్లో కేంద్రానికి తప్ప ఇతర సంస్థలకు కులగణన, సర్వే చేసే అధికారం లేదన్న మాటను తొలగించి మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో సవరణలపై బీహార్లోని రాజకీయ వర్గాల్లో అగ్గి రాజుకుంది. బీహార్ ప్రభుత్వం కులగణన చేయడం కేంద్రానికి ఇష్టం లేదని దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న వారి కుటిలబుద్ధి మరోసారి బట్టబయలైందని చెబుతూ విమర్శలు చేశారు జేడీయు,ఆర్జేడీ నేతలు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజల హక్కులను హరించాలన్న బీజేపీ, సంఘ్ పరివార్ వక్రబుద్ధికి ఇది నిదర్శనమని, ఇది అనుకోకుండా జరిగింది కాదని ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ఇదే కొనసాగితే అగ్నిపర్వతం బద్దలవుతుంది జాగ్రత్తని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అసలు రంగు బయటపడింది. బీజేపీకి అసలు కులగణన చేయాలన్న ఉద్దేశ్యమే లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేడీయు నేత విజయ్ కుమార్ చౌదరి స్పందిస్తూ బీహార్ ప్రభుత్వం ఎప్పటినుంచో తాము చేస్తోంది కులగణన కాదని సర్వే అని చెబుతూనే ఉంది. అయినా కేంద్రం దీన్ని వివాదాస్పదం చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ తాము కులగణనకి వ్యతిరేకమని ఏనాడూ చెప్పలేదని, మేము కోరుతుంది ఒక్కటేనని.. ఒకవేళ కులగణన పూర్తయితే ఆ వివరాలను 24 గంటల్లో ప్రకటించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. చివరిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. మేము మొదటి నుంచీ సర్వే మాత్రమే చేస్తున్నామని చెబుతూనే ఉన్నాము. ఆయా కులాల్లో ఎంతమంది ఉన్నారన్నది మేము లెక్కపెట్టడం లేదు. వారి ఆర్థిక స్థితిగతులను మాత్రమే లెక్కపెడుతున్నామని.. దీనివలన అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశముంటుందని అన్నారు. ఈ సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వం సర్వేలో సేకరించిన డేటా భద్రతపై హామీ ఇచ్చిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే తడవు బీహార్ ప్రభుత్వం కులగణనను పూర్తిచేసింది. ఇది కూడా చదవండి: ఎయిర్పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత -
120 టీఎంసీలు తరలించేలా ‘పాలమూరు’ పనులు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తాగునీటి అవసరాలకు కేవలం 7.15 టీఎంసీలు అవసరం కాగా, శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీలు చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల తరలింపునకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణ పనులు కొనసాగిస్తోందని కృష్ణా బోర్డు సుప్రీంకోర్టుకు నివేదించింది. శ్రీశైలం నుంచి తరలించుకోవడానికి ప్రతిపాదించిన నీటి పరిమాణంతో పోల్చితే తాగునీటి అవసరాలు చాలా స్వల్పమేనని పేర్కొంది. 7.15 టీఎంసీల తాగునీటిని తరలించుకోవాలనుకున్నా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన అన్ని జలాశయాల్లోకి కలిపి 67.97 టీఎంసీలను ఎత్తిపోయాల్సి ఉంటుందని పేర్కొంది. వాస్తవ తాగునీటి అవసరాల కంటే తరలించే జలాలు ఎక్కువ అని తెలియజేసింది. ఈ మేరకు తనతో పాటు కేంద్ర జలశక్తి శాఖ తరఫున కృష్ణా బోర్డు తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. 3.4 టీఎంసీలకే 65 టీఎంసీలు నింపాలి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా మొత్తం 6 రిజర్వాయర్లను ప్రతిపాదించగా, చివరి కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులను ఇంకా ప్రారంభించలేదు. తొలి 5 రిజర్వాయర్లలో పూర్తి నిల్వ సామర్థ్యం మేరకు మొత్తం 65.17 టీఎంసీలను నింపిన తర్వాతే, ఈ ఐదింటి కింద తాగునీటి అవసరాలకు ప్రతిపాదించిన మొత్తం 3.4 టీఎంసీలను (కేపీ లక్ష్మీదేవిపల్లి కింద తాగునీటి అవసరాలు 4.11 టీఎంసీలు) తరలించుకోవడానికి వీలు కలిగే రీతిలో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని సుప్రీంకోర్టుకు బోర్డు తెలిపింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అఫిడవిట్లోని ప్రధానాంశాలు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. దీని కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మీదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను ప్రతిపాదించింది. ఈ ఎత్తిపోతల ద్వారా తరలించే 120 టీఎంసీల్లో తాగునీటికి కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజర్వాయర్ కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద ఇప్పటిదాకా పనులు చేపట్టలేదు. ఇప్పటిదాకా పూర్తయిన ఐదు రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామంటూ తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్ను సమరి్పంచింది. కానీ ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులపై బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు డీపీఆర్ను మదింపు చేయలేమని గతంలోనే తిప్పి పంపాం. పనులు ఆపాలని గతంలో బోర్డు సమావేశాల సందర్భంగా తెలంగాణను కోరాం. కేసు నేపథ్యం ఇదీ...: పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పనులను ఆపాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశించింది. అయినా ప్రభుత్వం పనులు ఆపకపోవడంతో ఎన్టీటీ రూ.920.85 కోట్ల జరిమానా విధించింది. దీనిపై రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించగా ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. అలాగే తాగునీటి కోసం 7.15 టీఎంసీలను తరలించేలా పాలమూరు ఎత్తిపోతల పనులకు 2023 ఫిబ్రవరి 17న అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అదే సమయంలో ఎత్తిపోతలను తమ అనుమతి ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో లేదో చెప్పాలని కేంద్రాన్ని, కృష్ణా బోర్డును ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, బోర్డు అఫిడవిట్ దాఖలు చేశాయి. వాస్తవానికి ఈ నెల 4న కేసు విచారణ జరగాల్సి ఉండగా అక్టోబర్ 6కి వాయిదా పడింది. -
మణిపూర్ వీడియోపై నేడు సుమోటో విచారణ
మణిపూర్ అల్లర్ల విషయంలో కేంద్రం సీరియస్గానే ఉంది. మరీ ముఖ్యంగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను మరింత తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించబోం. కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఇక విచారణనే మణిపూర్ వెలుపలా.. అదీ కాలపరిమితిలో పూర్తయ్యేలా ఆదేశించండి: కేంద్రం హోం శాఖ ఢిల్లీ: మణిపూర్లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుమోటోsuo motoగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. నిన్న గురువారం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించిన కేంద్రం హోం శాఖ.. మరోవైపు ఈ కేసు ట్రయల్ కాలపరిమితితో(ఆరు నెలల గడువు) జరగాలని.. అదీ మణిపూర్ వెలుపలే జరగాలని అఫిడవిట్లో సుప్రీంను కోరింది. సీబీఐకి దర్యాప్తు బదిలీ అయ్యింది. కేంద్రం మాత్రం దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తవుతుందని నమ్ముతోంది. అయితే విచారణ మాత్రం కాలపరిమితితో పూర్తి కావాలని, ఆ విచారణ మణిపూర్ వెలుపలే జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును కేంద్ర హోం శాఖ కోరింది. శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అయినా.. కేంద్రం తమ వంతుగా న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సదరు అఫిడవిట్లో స్పష్టం చేశారు. లైంగిక దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చాక.. కేంద్రం ఎప్పటికప్పుడు కేసు పురోగతిని పర్యవేక్షిస్తోందని తెలియజేసింది. దీంతో నేటి విచారణలో కేంద్రం అఫిడవిట్పై సుప్రీం ధర్మాసనం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో.. మీడియా ద్వారా మణిపూర్ వైరల్ వీడియోను సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు. జులై 20వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీవ్ర స్థాయిలో కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను ఉద్దేశిస్తూ.. ‘‘యావత్ దేశమే కాదు.. ఈ న్యాయస్థానాన్ని ఆ వీడియో బాధించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయయారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి. ప్రభుత్వాలు గనుక చర్యలు చేపట్టకపోతే మేమే రంగంలోకి దిగుతామ’’ని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. జులై 28(నేటికి) విచారణ వాయిదా వేసింది. -
నాలుగేళ్ల తర్వాత.. సీబీఐ చిలుక ‘కొత్త పలుకు’
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. లోపల ఉన్నదంతా పచ్చ కుట్రేనని వెల్లడైంది. టీడీపీ పాడుతున్న పాత పాటనే సీబీఐ న్యాయస్థానంలో తన అఫిడవిట్లో శుక్రవారం వినిపించింది. సీబీఐలో కొందరు అధికారులు పదవీ విరమణ, స్థాన చలనానికి ముందు టీడీపీ ముఖ్య నేతల ప్రలోభాలకు గురై వారు చెప్పినట్టుగా అఫిడవిట్ పేరుతో కుట్రకు తెరతీసింది. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి అందరికంటే ముందు గుర్తించారన్నది నాలుగేళ్లుగా ముక్తకంఠంతో చెబుతున్న మాట. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నియమించిన సిట్ కూడా అదే విషయం చెప్పింది. కానీ టీడీపీ ఆరు నెలలుగా కుట్రపూరితంగా ఓ వాదనను తెరపైకి తెచ్చింది. వివేకా మృతి చెందిన విషయం ఆయన పీఏ కంటే ముందే ఎంపీ అవినాశ్ రెడ్డి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెప్పారని దు్రష్పచారం చేస్తోంది. సరిగ్గా అదే అసంబద్ధ ఆరోపణను సీబీఐ శుక్రవారం తన అఫిడవిట్లో పేర్కొనడం విస్మయ పరుస్తోంది. పైగా ఏమాత్రం సాంకేతికంగా చెల్లుబాటుగాని ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డ్) నివేదిక అంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు యత్నించింది. ఐపీడీఆర్ నివేదిక అంటూ సీబీఐ చెప్పడమే ఆ అఫిడవిట్ పూర్తిగా కట్టు కథ అని... అభూతకల్పనలు, నిరాధార అభియోగాలేనని నిపుణులే స్పష్టం చేస్తున్నారు. 2019 మార్చి 14 రాత్రే కాదు... అంతకు 20 రోజుల ముందు 20 రోజుల తర్వాత కూడా ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ ఐపీడీఆర్ డేటా అదేరీతిలో చూపిస్తోంది. అర్ధరాత్రి వేళల్లో కూడా ఆయన ఫోన్కు సంబంధించి ఐపీడీఆర్ డేటా పనిచేస్తునే ఉన్నట్టుగా వెల్లడిస్తోంది. రోజూ ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడేవారి ఐపీడీఆర్ డేటా అలానే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోన్కు సంబంధించి బైట్స్ అప్లోడ్, డౌన్లోడ్లకు ఆ సమయం తీసుకుంటూ ఉంటుంది. మరి సీబీఐ ఆ ముందు 20 రోజులు, తర్వాత 20 రోజులు ఐపీడీఆర్ డేటాను ఎందుకు ప్రస్తావించ లేదు? ఎందుకంటే అది చాలా సాధారణమైన విషయం కాబట్టి ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. సునీత, నర్రెడ్డి, బీటెక్ రవిల ఐపీడీఆర్ డేటా కూడా అంతే.. ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ ఐపీడీఆర్ డేటానే కాదు.. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి, ఆయన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి ఫోన్ల ఐపీడీఆర్ డేటా కూడా అలానే చూపించింది. 2019 మార్చి 14న రాత్రి కూడా వారి ఫోన్లు పని చేస్తున్నట్టుగానే ఐపీడీఆర్ వెల్లడిస్తోంది. అంటే వివేకా హత్యకు వారు కుట్ర పన్నినట్టు భావించ వచ్చు కదా. అందులోనూ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. బీటెక్ రవితో రాజకీయ విభేదాలు, ఎర్ర గంగిరెడ్డితో భూవివాదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. వారంతా సన్నిహితులు కూడా. మరి సీబీఐ అధికారులు సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బీటెక్ రవి, ఎర్ర గంగిరెడ్డిల ఫోన్ల ఐపీడీఆర్ డేటా గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఆ డేటా ఆధారంగా వారే వివేకా హత్య చేయించి ఉంటారని ఎందుకు భావించడం లేదు? అంటే సీబీఐ అధికారులు ఏవో అదృశ్య శక్తుల ప్రభావానికి లోనై కేసు విచారణ కంటే ముందే ఓ నిర్ణయానికి వచ్చి ఆ దిశగానే ఎంపీ అవినాశ్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైంది. ఫోన్ చేశారా.. మెసేజ్ చేశారా అన్నది కూడా నిర్ధారించలేం.. ఫోన్లో వాడిన మొబైల్ డేటాను బట్టి ఒక ఫోన్ నుంచి మరొకరికి ఫోన్ చేశారా? మెసేజ్ చేశారా అన్నది కూడా నిర్ధారించడం సాధ్యం కాదు. మొబైల్ డేటా ఆధారంగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ డేటాను విభజించి, విశ్లేషిం చే పరిజ్ఞానం 2020 వరకు లేనే లేదు. ఇప్పటికీ సాధికారికంగా లేదు. మరి సీబీఐ ఫోన్ మొబైల్ డేటాను బట్టి ఎంపీ అవినాశ్ రెడ్డి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేసినట్టు ఎలా నిర్ధారణకు వచ్చింది? సీబీఐ ఫోన్ నంబర్లు ఎందుకు చెప్పలేకపోయింది? 2019 మార్చి 15 తెల్లవారు జామున ఎంపీ అవినాశ్ రెడ్డి ఏ మొబైల్ నంబర్ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన ఏ మొబైల్ నంబర్కు ఫోన్ చేశారో సీబీఐ ఎందుకు వెల్లడించ లేకపోయింది? ఫోన్ చేసి ఉంటే ఆ రెండు నంబర్లు చెప్పాలి కదా? ఆ నంబర్లు చెబితే వాటి కాల్ రికార్డ్ డేటా ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. అందులో పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. దీన్నిబట్టి ఆ రోజు తెల్లవారుజామున ఎంపీ అవినాశ్.. వైఎస్ జగన్కు ఫోన్ చేయలేదన్న వాస్తవం వెల్లడవుతుంది. అందుకే సీబీఐ ఆ ఫోన్ నంబర్లను తన అఫిడవిట్లో ప్రస్తావించలేకపోయింది. ఆధారాలు ధ్వంసం చేయాలంటే అర్ధరాత్రే చేసేవారు కదా.. వైఎస్ వివేకా హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను ఉదయ్కుమార్ రెడ్డి ద్వారా ఎంపీ అవినాశ్ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 7.30 గంటల సమయంలో ధ్వంసం చేయించారంటూ సీబీఐ మరో నిరాధార అభియోగాలు మోపింది. వివేకా హత్య తర్వాత తెల్లవారు జామున 4గంటలకు ఉదయ్కుమార్ రెడ్డి.. ఎంపీ అవినాశ్రెడ్డిని కలిశారని సీబీఐ పేర్కొంది. ఐపీడీఆర్ డేటా ద్వారా ఆ విషయాన్ని నిర్ధారించామని చెప్పింది. పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ రెండు అంశాలను పరిశీలిస్తే సీబీఐ అభియోగాలు పూర్తి అవాస్తవం అన్నది తేటతెల్లమవుతోంది. సీబీఐ చెప్పేదే నిజమైతే అప్పుడే ఆధారాలు ధ్వంసం చేయమని అవినాశ్ చెప్పేవారు కదా.. అసలు ఉదయ్కుమార్ రెడ్డి ఆరోజు తెల్లవారుజామున అవినాశ్ని కలవనే లేదు. తీవ్రంగా పరిగణిస్తున్న వైఎస్సార్సీపీ టీడీపీ కుట్రలో భాగస్వాములై కొందరు సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. ఏమాత్రం హేతుబద్ధంగాని ఐపీడీఆర్ నివేదిక పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మేందుకు బరితెగించిన అధికారులపై.. సాంకేతికంగా ఐపీడీఆర్ హేతుబద్ధత, టెలికాం మార్గదర్శకాలు వెల్లడిస్తున్న అంశాల ఆధారంగా న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఐపీడీఆర్ ఎలా పనిచేస్తుందో తెలియదా? వివేకానందరెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత అవినాశ్ రెడ్డి ఫోన్ కాల్స్ ఉన్నాయంటూ సీబీఐ చేసిన అభియోగాలు పూర్తి అహేతుకం. ఫోన్ కాల్స్ ఉన్నాయంటూ ఐపీడీఆర్ డేటా పేరిట సీబీఐ ఏకంగా న్యాయస్థానాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించడం విస్మయ పరుస్తోంది. అసలు ఐపీడీఆర్ ఎలా పని చేస్తుందనే కనీస సాంకేతిక అవగాహన కూడా సీబీఐకి లేదా అనే సందేహం కలుగుతోంది. ఐపీడీఆర్ ఫోన్ బైట్స్ను నిరంతరం అప్లోడ్, డౌన్లోడ్ చేస్తూనే ఉంటుంది. ఫోన్ ఆన్లో ఉన్నంతసేపు మనం ఫోన్ మాట్లాడుతున్నా లేకపోయినా సరే అది బైట్స్ను అప్లోడ్, డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనం మొబైల్ యాప్లు వాడకపోయినాసరే అవి నిరంతరం పని చేస్తునే ఉంటాయి. సర్వర్ ఆ డాటాను తీసుకుంటూనే ఉంటుంది. సాధారణంగా రాత్రి వేళల్లో సర్వర్ డాటాను తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఫోన్లు వాడరు కాబట్టి, ఆ ఫోన్లకు సంబంధించిన బ్యాకప్ తీసుకుంటూ ఉంటుంది. రోజూ ఎక్కువ సేపు ఫోన్లు మాట్లాడేవారు, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కువుగా వాడేవారి ఫోన్ డాటాను అర్ధరాత్రి వేళల్లో మరింత ఎక్కువసేపు ఐపీడీఆర్ అప్లోడ్, డౌన్లోడ్ చేస్తూ ఉంటుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి డాటా బర్న్ అవుతునే ఉంటుంది. ఆ సమయంలో ఐపీడీఆర్ నివేదిక తీసుకుంటే ఫోన్లో మొబైల్ డాటా బర్న్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. అంత మాత్రాన ఫోన్ మాట్లాడినట్టు కాదు. కాబట్టి ఐపీడీఆర్ డాటాను బట్టి ఒక ఫోన్ను ఓ నిర్ణీత సమయంలో ఉపయోగించినట్టుగాని, ఆ సమయంలో వారు ఫోన్ మాట్లాడారని చెప్పడంగానీ సాధ్యం కాదు. ఇది టెలీకమ్యూనికేషన్ల ప్రొటోకాల్ వెల్లడిస్తున్న వాస్తవం. అటువంటిది ఎంపీ అవినాశ్ రెడ్డి 2019 మార్చి 14 రాత్రి వివేకా హత్యకు ముందు.. ఆ తర్వాత కూడా ఫోన్లో మాట్లాడారని ఐపీడీఆర్ డేటా ఆధారంగా సీబీఐ చెప్పడం విడ్డూరం. 2019 మార్చి 15 తెల్లవారుజామునే వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడారని ఐపీడీఆర్ నివేదిక ద్వారా తెలుసుకున్నామని చెప్పడం అహేతుకం. ఇది అసంబద్ధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐపీడీఆర్ డేటాను బట్టి ఒకరు ఆ సమయంలో ఫోన్ మాట్లాడారని చెప్పడం సాధ్యం కాదని, కేవలం సీబీఐ దురుద్దేశ పూరితంగానే ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించిందన్నది స్పష్టమవుతోంది. కమిట్మెంట్కు కట్టుబడి కట్టు కథ! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావితం చేసేందుకు టీడీపీ మొదటి నుంచీ పన్నాగం పన్నుతూనే ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంతపాడే బీజేపీలోని టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే పచ్చ మీడియా అందులో ప్రధాన పాత్రధారులుగా మారారన్నది సుస్పష్టం. రిటైర్ అవ్వబోతున్న కొందరు సీబీఐ అధికారులను ప్రలోభాలకు గురి చేశారన్నది సర్వత్రా బహిరంగ రహస్యంగా మారింది. ఆ ప్రకారం ఎంపీ అవినాశ్ రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయించాలన్నది ఒప్పందం. అందుకోసం టీడీపీ భారీగా నిధులు వెదజల్లినట్టు సమాచారం. అందుకే సీబీఐ ఇటీవల హఠాత్తుగా దూకుడు పెంచింది. ఎంపీ అవినాశ్ రెడ్డి దర్యాప్తునకు ఎంతగా సహకరిస్తున్నాసరే ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి ఆయన ఏడుసార్లు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయినా సరే ఆయన విచారణకు సహకరించడం లేదంటూ సీబీఐ అధికారులు అసంబద్ధ అభియోగాలు చేస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యతి్నస్తున్నారు. గత మూడు రోజుల్లో ఎలాగైనా సరే ఎంపీ అవినాశ్ను అరెస్టు చేయాలని కొందరు సీబీఐ ఉన్నతాధికారులు ప్రయతి్నంచారు. అందుకు తగ్గట్టుగానే టీడీపీ అనుకూల పచ్చ మీడియా చానళ్లు రోజుల తరబడి టీవీలలో చర్చలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కానీ ఎంపీ అవినాశ్రెడ్డిని అరెస్టు చేయలేమని ఓ ఉన్నతాధికారి గుర్తించారు. కానీ టీడీపీతో కుదుర్చుకున్న కమిట్మెంట్కు న్యాయం చేసేందుకు ఆయన కొత్తకుట్రకు తెరతీశారు. ‘మీరు ఉండగా ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయలేకపోతే... కమిట్మెంట్కు లోబడి మరొకటి చేయండి’ అని టీడీపీ పెద్దల నుంచి ఆయనకు సందేశం అందినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వివేకా మృతి గురించి ఎంపీ అవినాశ్ రెడ్డికి.. ఆయన ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉంటుందని సీబీఐ తన అఫిడవిట్లో పేర్కొంది. ఒప్పందంలో భాగంగా రాజధానిలో పేదలకు ప్రభుత్వ ఇళ్ల స్థలాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, టీడీపీ మహానాడులో ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు ఓ అంశాన్ని అందించేందుకే సీబీఐ అధికారి ఇంతటి దుర్మార్గానికి పాల్పడినట్టు స్పష్టమవుతోంది. దీనిని వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణిస్తూ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. అది హత్య అని డాక్టరైన సునీతకు తొలుత తెలీదా? స్వయంగా డాక్టర్ అయిన సునీత వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించడం విస్మయ పరుస్తోంది. ఆమె తరఫు న్యాయవాదులు వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలను న్యాయస్థానానికి చూపిస్తూ వాటిని చూస్తే ఎవరికైనా అది హత్య అని తెలుస్తుంది కదా.. అని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆయన టైపిస్ట్ ఇనయతుల్లా ఫొటోలు తీశారు. ఆ ఫొటోలను పీఏ కృష్ణారెడ్డి.. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలకు పంపారు. ఆ ఫొటోలు చూసిన తర్వాత కూడా వారు అది హత్య అని చెప్పనే లేదు. పైగా తాము వచ్చే వరకు వివేకా రాసిన లేఖ, ఆయన సెల్ఫోన్ దాచిపెట్టమని చెప్పారు. మరి డాక్టర్ అయిన సునీత తన తండ్రి మృతదేహం ఫొటోలను చూసి అది హత్యేనని వెంటనే ఎందుకు చెప్పలేదు? సునీత తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి శుక్రవారం చూపిన ఫొటోలు మృతదేహం పోస్టుమార్టం టేబుల్పై ఉన్నప్పటి ఫొటోలు. ఆ ఫొటోలను టీడీపీ బాగా రిజల్యూషన్ పెంచి ఒక బుక్లెట్లో ప్రచురించింది. ఈ ఫొటోలు చూపుతూ.. ఎవరికైనా అది హత్య అని తెలీదా అని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అవినాశ్ రెడ్డి వెళ్లేసరికి వివేకా మృతదేహం బాత్రూమ్లో కమోడ్ వద్ద గోడకు చేరబడి ఉంది. ఆ కోణంలో గాయాలు ఏవీ కనిపించనే లేదు. ఆయన వెంటనే బయటకు వచ్చేశారు. వివేకా మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు ఫోన్లు చేశారు. అవినాశ్ ఫోన్ చేసింది 2019 మార్చి 15 ఉదయం 6.30కే.. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారనే విషయాన్ని చెప్పేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 6.30 గంటలకే తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయకుడి నంబరుకు ఫోన్ చేసి చెప్పారు. ఆ కాల్ రికార్డులు ఉన్నాయి కూడా. ఆ రోజు ఉదయం 6.10 గంటలకి పీఏ కృష్ణారెడ్డి తొలిసారిగా వివేకానందరెడ్డి మరణించారన్న విషయాన్ని గుర్తించారు. ఆ వెంటనే ఆయన భార్య సౌభాగ్యమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డిలకు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. అనంతరం నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి ఉదయం 6.20 గంటల సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి మృతి చెందారనే విషయాన్ని చెప్పారు. వెంటనే వివేకా నివాసానికి వెళ్లిన అవినాశ్ రెడ్డి ఆయన మృతదేహాన్ని చూసి వెంటనే బయటకు వచ్చారు. ఆ తర్వాత 6.30 గంటల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయకుడి ఫోన్కు కాల్ చేసి వివేకా మృతి చెందిన విషయాన్ని తెలిపారు. అంటే వివేకా మృతి చెందారనే విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాతే ఎంపీ అవినాశ్ రెడ్డికి.. ఆ తర్వాతే ఎంపీ ద్వారా వైఎస్జగన్మోహన్రెడ్డికి తెలిసింది. ఈ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి, అవినాశ్ రెడ్డి కాల్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. వాస్తవం ఇలా ఉంటే.. వివేకా మృతి చెందిన విషయం పీఏ కృష్ణారెడ్డి కంటే ముందే వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు తెలుసంటూ సీబీఐ అభూతకల్పనలు సృష్టించి దు్రష్పచారానికి పాల్పడటం వెనుక టీడీపీ ప్రలోభాలు, కుట్ర ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. -
‘అందుకే కేరళ స్టోరీ ప్రదర్శన ఆగిపోయింది’: తమిళనాడు సర్కార్
ఢిల్లీ: ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధాజ్ఞాలను వ్యతిరేకిస్తూ ఆ చిత్రనిర్మాతలు దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ నడుస్తోంది. అయితే గత విచారణలో సీజేఐ నేతృత్వంలోని బెంచ్.. పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు ప్రభుత్వానికి వివరణ కోరుతూ నోటీసులు అందించగా.. ఆ నోటీసులకు తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ది కేరళ స్టోరీ సినిమాను నిషేధించారనే వాదనను తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధించిందని చెబుతూ ఆ చిత్ర నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ప్రేక్షకుల స్పందన సరిగా లేకపోవడంతో థియేటర్లలో సినిమా ప్రదర్శనను నిలిచిపోయిందే తప్ప.. ఆ విషయంలో తమ ప్రమేయం ఏమీలేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో.. ‘‘మే7వ తేదీ నుంచి జనాలు థియేటర్లకు రాకపోవడం వల్లే ఎగ్జిబిటర్లు వాళ్లంతట వాళ్లే సినిమాను ప్రదర్శించడం ఆపేశారు. సినిమా థియేటర్లకు భద్రత కల్పించడం తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేద’’ని అఫిడవిట్లో పేర్కొంది. అంతేకాదు.. సినిమాలో చెప్పుకోదగ్గ నటులు ఎవరూ లేకపోవడమో/ అందులోవాళ్ల నటన బాగా లేకపోవడమో.. ఏ కారణాలవల్లనో చిత్ర ప్రదర్శన ఆపేసి ఉంటారని అభిప్రాయపడింది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ థియేటర్ యజమానులపై, మల్టీప్లెక్స్ నిర్వాహకులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. సినిమా ఆగిపోవడంలో ప్రభుత్వ పాత్ర కూడా ఏం లేదు అని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఈ మేరకు మల్టీప్లెక్స్ నిర్వాహకుల నుంచి తీసుకున్న స్టేట్మెంట్ను సైతం అఫిడవిట్లో పొందుపర్చింది తమిళనాడు ప్రభుత్వం. ఇదీ చదవండి: ప్రధానికి అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు -
కోట్ల ఆస్తిని ప్రభుత్వ పరం చేసిన వృద్ధుడు! ఎందుకంటే..
ఒక వ్యక్తి తన కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి ధారాదత్తం చేశాడు. ఆఖరికి తన మృతదేహాన్ని సైతం వైద్య పరిశోధనలకు ఉపయోగించమని అధికారులును కోరాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ముజఫర్ నగర్లో 85 ఏళ్ల నాథూ సింగ్ అనే వ్యక్తికి సొంత ఇల్లు, కొంత భూమి ఉంది. వాటి విలువ సుమారు రూ. 1.5 కోట్లు. అతనికి ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సహరాన్పూర్లో స్కూల్ టీచర్గా పనిచేసేవాడు. ఐతే ఇటీవలే అతడి భార్య మరణించడంతో ఒంటరివాడైనా ఆ పెద్ద మనిషి ఓల్డేజ్ హోంకి వెళ్లిపోయాడు. గత ఏడు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. తనను చూసేందుకు తన కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో ఆయన తన ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిస్తూ.. వాటిని ఆస్పత్రి, పాఠశాల నిర్మించేందుకు వినియోగించమని కోరాడు. ఈ వయసులో తన బాగోగులు చూసుకోవాల్సిన కొడుకు, కోడలు తనను సరిగా పట్టించుకోకపోవడంతో తన ఆస్తిని ఇలా ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఆఖరికి తను చనిపోయాక తన మృతదేహాన్ని వైద్య పరిశోధనల కోసం ఇచ్చేయాలని చెప్పాడు. ఎందుకంటే తన అంత్యక్రియల సమయం అప్పుడూ కూడా తన కొడుకు, కూతుళ్లు తనను చూసేందుకు రాకూడదని చెప్పాడు. ఈ మేరకు ఆ ఓల్డేజ్ హోం మేనేజర్ రేఖా సింగ్ మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా ఇక్కడే ఉంటున్నాడని, కానీ తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరూ తనను చూసేందుకు రాలేదని చెప్పారు. దీంతో నాథూ సింగ్ బాగా కలత చెంది ఇలా చేసినట్లు వివరించారు. కాగా, నాథూ సింగ్ వీలునామా మాకు అందిందని, ఆయన మరణాంతరం అది అమలులోకి వస్తుందని సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పేర్కొంది. (చదవండి: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్) -
ఓ ఎమ్మెల్యే.. ఆస్తి విలువ 70,000
రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తి రాజప్రాసాదాల్లాంటి ఇళ్లు కట్టుకున్న ఎందరో ప్రజాప్రతినిధులను ఇప్పటిదాకా మనం చూశాం.. కానీ మూడంతస్తుల అధికారిక నివాసాన్ని కేటాయించినందుకే కృతజ్ఞతతో ఓ ఎమ్మెల్యే కన్నీటిపర్యంతం కావడం మీరెప్పుడైనా చూశారా?!! బిహార్లో ఎమ్మెల్యే (అలౌలీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున)గా గెలిచిన రామ్వృక్ష్ సదా తాజాగా తన అధికారిక ఇంటి తాళాలను అందుకుంటూ కంటతడి పెడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. బిహార్లోని అత్యంత పేద ఎమ్మెల్యే అయిన రామ్వృక్ష్ ఇప్పటివరకు తన ఐదుగురు కుమారులు, కుమార్తెతో కలసి ఇందిరా ఆవాస్ యోజనలో భాగంగా కట్టిన ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కోసం రాజధాని పట్నాలో నిర్మించిన అధికారిక గృహ సముదాయంలో ఆయనకు సైతం ఇంటిని కేటాయించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా ఇంటి తాళాలు అందుకున్న ఆయన ఈ క్రమంలో భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. కంటతడి పెట్టారు. ‘పేదవాడు ఏదైనా పొందడం అంటే అది అతనికి దీపావళి పండుగ లాంటిదే.. నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి ఇంట్లో ఉంటానని.. ఇది నాకు దీపావళే’ అని ఎమ్మెల్యే రామ్వృక్ష్ పేర్కొన్నారు. ఇటుకల బట్టీలో కూలీగా పనిచేసే ఈయన 1995లో ఆర్జేడీలో చేరారు. 2000లో ఆర్జేడీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన స్థిరాస్తుల విలువ రూ. 70 వేలు!!. "हम मुसहर समाज से आते हैं! मा० @laluprasadrjd जी ने हमें नेता बनाया, MLA बनाया, देश से जोड़ा, आज उसका फल है.... अलौली के जनता मालिक को प्रणाम करते हैं!" - सुसज्जित सरकारी आवास पाकर मा० MLA श्री रामवृक्ष सदा भावुक हुए। लालू जी ने ग़रीबों को आवाज़ दी, @yadavtejashwi जी ताकत देंगे! pic.twitter.com/7PUoZR7dfi — Rashtriya Janata Dal (@RJDforIndia) October 27, 2022 (చదవండి: ఫోన్ ట్యాపింగ్పై భారీగా ఫిర్యాదులు?) -
రాజాసింగ్కు ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే రాజాసింగ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో రాజాసింగ్ క్రిమినల్ కేసులు పొందుపరచలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ జేబీ పార్డీవాలా ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న ధర్మాస నం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. నవంబర్ 1 లోగా సమాధానం ఇవ్వాలంది. -
ఫ్రీ బీస్ కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సీపీ
-
2001లో కేవలం రూ.6,300.. 2022లో కోట్లకు చేరిన మంత్రి సంపద..
కోల్కతా: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు మొత్తం రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని కోట్లున్న మాజీ మంత్రి వద్ద పదేళ్ల క్రితం కేవలం రూ.6,300 ఉన్నాయంటే నమ్మగలరా? 2011 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్థ చటర్జీ సమర్పించిన అఫిడవిట్లో ఆయన వద్ద రూ.6,300 నగదు మాత్రమే ఉందని పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ మొత్తం 23 రెట్లు పెరిగింది. ఈసారి అఫిడవిట్లో తన వద్ద రూ.1,48,676 నగదు ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు అవినీతి కేసులో మంత్రి సన్నిహితుల ఇంట్లో కోట్ల రూపాయలు లభించడం రాజకీయంగా కలకలం రేపింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీలోని అని పదవుల నుంచి తప్పించింది. ఇంకా పార్థ చటర్జీ, ఆయన సన్నిహితులకు సంబంధించిన నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన మాత్రం తనపై కుట్ర చేస్తున్నారని అంటున్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందనడం గమానార్హం. చదవండి: ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని ఇంటి తాళమిచ్చిన యజమాని.. రూ.10కోట్లతో చెక్కేసిన వ్యక్తి -
మంత్రి శ్రీనివాస్గౌడ్కు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్చిట్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీనివాస్గౌడ్ (ప్రస్తుత మంత్రి) సమర్పించిన అఫిడవిట్ను తర్వాత మార్చినట్టుగా అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపామని, ఎలాంటి తప్పిదం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన కలెక్టర్కు సమాచారం ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పూర్తిస్థాయిలో విచారించాం ‘2018 ఎన్నికల్లో శ్రీనివాస్గౌడ్ సమర్పించిన అఫిడవిట్ను తర్వాత మార్చారని చలువగాలి రాఘవేంద్రరాజు 2021 ఆగస్టు 2న, అదే ఏడాది డిసెంబర్ 16న ఫిర్యాదు చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిని నివేదిక కోరాం. ఆయన మహబూబ్నగర్ జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ సహా 25 మంది అభ్యర్థులు మొత్తం 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీనివాస్గౌడ్ 2018 నవంబర్ 14న మూడు సెట్లు, నవంబర్ 19న మరో సెట్ నామినేషన్ వేశారు. చదవండి👉🏻 Telangana: త్వరలో 13వేల పోస్టులు భర్తీ మొత్తం 51 సెట్లలో 10 తిరస్కరణకు గురయ్యాయి. ఆరు సెట్లకు సంబంధించి అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద 14 మంది అభ్యర్థులకు గాను 35 సెట్ల నామినేషన్లు మిగిలాయి. ఒక్కో అభ్యర్థికి ఒక్క సెట్ (సక్రమమైన) నామినేషన్ చొప్పున 14 పోగా.. మిగిలిన 21 మల్టిపుల్/డూప్లికేట్ సెట్లు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో వెబ్జెనెసిస్ అప్లికేషన్ విధానం ప్రకారం మల్టిపుల్/డూప్లికేట్ నామినేషన్లు, వాటికి అనుసంధానమైన అఫిడవిట్లు పబ్లిక్ డొమైన్లో కనిపించే ఆప్షన్ లేదు. ఈ మేరకు 2018 నవంబర్ 14న శ్రీనివాస్గౌడ్తో పాటు ఇతర అభ్యర్థులకు సంబంధించిన మల్టిపుల్/డూప్లికేట్ నామినేషన్లు, అఫిడవిట్లు కనిపించకుండా పోయాయి. వెబ్జెనెసిస్ అప్లికేషన్ విధానంలో ఈ అఫిడవిట్లు కనిపించకుండా పోయినందున దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేం.. చర్యలు తీసుకోలేం..’అని ఎన్నికల ప్రధాన అధికారి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఫిడవిట్లు మార్చారనే ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపామని, అలాంటివేమీ జరగలేదని తేలడంతో ఫిర్యాదులు డిస్పోజ్ చేస్తున్నామని తెలిపారు. ధ్రువీకరించిన కలెక్టర్ ఈ విషయాన్ని మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావ్ ధ్రువీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించాయని, రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు, అధికారుల నైతిక బలాన్ని, ఐక్యతను కాపాడేలా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిందని ఆయన చెప్పారు. చదవండి👉 దక్షిణ డిస్కంలో తొలి లైన్ఉమెన్గా శిరీష -
రాజధాని అభివృద్ధి.. ఆరు నెలల్లో అసాధ్యం
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయడం తమకు, సీఆర్డీఏకు అసాధ్యమని.. ఇందుకు ఏళ్ల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాజధాని ప్రాంత పురోగతి, అభివృద్ధి అన్నది అస్పష్టమైనదని, అది ఓ నిరంతర ప్రక్రియలా కొనసాగుతూ ఉంటుందని తెలిపింది. నిర్ణీత కాల వ్యవధిలోపు రాజధాని ప్రాంత అభివృద్ధిని పూర్తిచేస్తామని చెప్పడం సాధ్యం కాదని పేర్కొంది. రాజధాని నగరం, ఆ ప్రాంతం అభివృద్ధికి తీర్పులో నిర్దేశించిన నిర్ణీత కాల వ్యవధులను తొలగించాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. లేదా తీర్పులో భూ యజమానులకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఆరు నెలల్లో అభివృద్ధిచేసి ఇచ్చే ప్రక్రియ గడువును ఐదేళ్లకు పెంచాలని అభ్యర్థించింది. చదవండి: AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే? అంతేకాక.. భూ యజమానులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిని మాత్రమే చేపట్టేందుకు తమను, సీఆర్డీఏను అనుమతించాలని కోరింది. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నామని.. ఈ నేపథ్యంలో నిధుల లభ్యత, ఇతర ప్రాధాన్యతలు, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. భూసమీకరణలో భూములిచ్చిన యజమానులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధి ప్రక్రియకు సంబంధించిన వివరాలకు మాత్రమే ప్రస్తుత ఈ అఫిడవిట్ను పరిమితం చేస్తున్నట్లు ఆయన తన అఫిడవిట్లో తెలిపారు. అఫిడవిట్ ఎందుకంటే.. రాజధాని అమరావతి వ్యవహారంలో ఇటీవల హైకోర్టు తీర్పునిస్తూ, రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే, రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచి్చన యజమానులకు ప్లాట్లను అన్ని మౌలిక వసతులతో నివాసయోగ్యమైన రీతిలో అభివృద్ధిచేసి మూడు నెలల్లో అప్పగించాలని కూడా ఆదేశించింది. అంతేకాక.. రాజధాని అభివృద్ధికి సంబంధించిన పురోగతితో ఎప్పటికప్పుడు అఫిడవిట్లు వేయాలని ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫున సమీర్శర్మ శుక్రవారం అఫిడవిట్ను దాఖలు చేశారు. ఆ అభిప్రాయం రాకూడదనే.. రాజధాని అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు.. కాంట్రాక్టర్లకు, బ్యాంకులకు, ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన యజమానులకు రాసిన లేఖలు.. నిధుల కోసం కేంద్రానికి, నీతి ఆయోగ్కు రాసిన లేఖలు వంటి పలు డాక్యుమెంట్లను జతచేస్తూ 190 పేజీల అఫిడవిట్ను సీఎస్ కోర్టు ముందుంచారు. ఇందులో.. రాజధాని విషయంలో గతనెల 3న ఇచ్చిన తీర్పు పర్యవసానాలను, న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని సమీర్శర్మ పేర్కొన్నారు. న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకునే ముందు ఈ తీర్పు అమలులో ఉన్న ఇబ్బందులను, ఆచరణ సాధ్యంకాని పరిస్థితులను వివరించేందుకే ఈ అఫిడవిట్ దాఖలు చేస్తున్నామన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న అభిప్రాయం రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ అఫిడవిట్ను సదుద్దేశంతో దాఖలు చేస్తున్నామని వివరించారు. సమీర్శర్మ కౌంటర్లోని ముఖ్యాంశాలు ఏమిటంటే.. కనీసం 60 నెలలు పడుతుంది ♦ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (భూ యజమానులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధి) కోసం కనీసం 60 నెలల గడువు అవసరం. ♦కాంట్రాక్టుల గడువు పెంపు, అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనల సమర్పణ, అనుమతుల మంజూరు, అనుబంధ ఒప్పందాలకు రెండు నెలల సమయం పడుతుంది. ♦పరిశీలనలు, సర్వే, డిజైన్ల పూర్తికి నాలుగు నెలలు.. మనుషులు, యంత్రాల సమీకరణకు రెండు నెలలు.. పనులన్నీ మొదలు కావడానికి 8 నెలల సమయం పడుతుంది. ♦రోడ్ల నిర్మాణానికి 16 నెలలు.. నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు 36 నెలల సమయం పడుతుంది. ♦వీటన్నింటినీ పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల సేకరణ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు అఫిడవిట్ల ద్వారా తెలియజేస్తాం. కేంద్రం ఇచ్చింది రూ.1,500 కోట్లే.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, ఐఏఎస్ టవర్లలో పనులు తిరిగి ప్రారంభించాం. 31.11.2022 వరకు పనుల గడువును పొడిగించాం. పనులు చేస్తున్న ఏజెన్సీకి చెల్లించాల్సిన బిల్లులన్నీ చెల్లించాం. ఎన్జీఓ అపార్ట్మెంట్స్, గెజిటెడ్ ఆఫీసర్లు టైప్–1, టైప్–2 అపార్ట్మెంట్స్, గ్రూప్–డి అపార్ట్మెంట్స్లో మిగిలిన పనులు సమయానుకూలంగా మొదలవుతాయని ఆశిస్తున్నాం. కాంట్రాక్టర్ ఇటీవలే పనుల పూర్తికి గడువు పెంచాలని అభ్యరి్థంచారు. రాజధాని నగర నిర్మాణం కోసం కేంద్రం రూ.1,500 కోట్లు ఇచ్చింది. రాష్ట్రం రూ.3,024 కోట్లు ఇవ్వగా, రుణాల కింద రూ.5,107 కోట్లు తీసుకున్నాం. మొత్తం పనుల అంచనా విలువ రూ.42,170 కోట్లు. మొదలైన పనుల విలువ రూ.41,678 కోట్లు. కన్సల్టెన్సీ చార్జీలు రూ.322 కోట్లు.. తిరిగి చెల్లించిన రుణాలు రూ.1,756 కోట్లు, భూ సమీకరణ, భూ సేకరణ వ్యయం రూ.1,989 కోట్లు. ఇక సీఆర్డీఏ తన వద్ద ఉన్న భూములు అమ్ముకోవచ్చు. అలా అమ్మడం ద్వారా వచి్చన నిధులే సీఆర్డీఏకు ప్రధాన ఆరి్థక వనరు. ఇక ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు మూడు బ్యాంకుల కన్సార్టియం రూ.2,060 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1,862 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. మిగిలిన రూ.198 కోట్ల విడుదలకూ అంగీకరించింది. యూనియన్ బ్యాంకు రూ.93 కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ.105 కోట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకులు త్వరలో విడుదల చేయనున్నాయి. మిగిలిన పనులకు రూ.42వేల కోట్లు ఖర్చు రాజధాని ప్రాంతంలో మిగిలిన పలు పనుల పూర్తికి రూ.42,231 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ విషయంలో నిధుల సమీకరణకు ఆయా ఆర్థిక సంస్థలతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొదటి దశ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సాయం మొత్తం రూ.51,687 కోట్లు. ఇందులో 2015–19 వరకు ఇచ్చింది రూ.1,377 కోట్లు. 2020–22 మధ్య ఇచ్చింది రూ.1,646 కోట్లు. సీఆర్డీఏ సేకరించిన రుణం రూ.5,122 కోట్లు. ల్యాండ్ పూలింగ్ కింద మౌలిక సదుపాయాల కల్పనకు, రాజధాని నగర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ను దశల వారీగా అమలుచేస్తాం. మాస్టర్ప్లాన్ దశల వారీ అభివృద్ధికి అవసరమైన రూ.3 వేల కోట్ల రుణ సేకరణకు సీఆర్డీఏకి గ్యారెంటీగా కూడా ఉన్నాం. అయితే, సీఆర్డీఏ నిధులను సమీకరించలేకపోయింది. ఈ నేపథ్యంలో.. గ్యారెంటీ కాలాన్ని పొడిగించాలని కోరింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేయనున్నాం. కాంట్రాక్టర్లతో, ఆర్థిక సంస్థలతో, కేంద్ర ప్రభుత్వంతో నిధుల గురించి మాట్లాడి నిధుల కొరతను ఓ కొలిక్కి తీసుకురావడానికి తగినంత సమయం పడుతుంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్కు లేఖలు పంపాం ఇక 22,276 రిటర్నబుల్ ప్లాట్లలో 17,357 ప్లాట్లను రిజిస్టర్ చేయాల్సి ఉంది. మిగిలిన 4,919 ప్లాట్లలో 1,598 ప్లాట్ల విషయంలో కేసులు నమోదై ఉన్నాయి. అసైన్డ్ భూముల చట్ట నిబంధనల ఉల్లంఘన, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూముల ఆక్రమణ, రికార్డుల తారుమారు, ఖజానాకు భారీ నష్టం తదితర అంశాలపై కేసులు నమోదు చేశాం. ఈ 17,357 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భూ యజమానులకు లేఖలు పంపాం. కానీ, ఇప్పటివరకు 231 నివాస, 107 వాణిజ్య ప్లాట్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తికావడానికి నెలల సమయం పడుతుంది. ఏపీ సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్–58లో ఆయా పనుల పూర్తికి నిర్ధిష్ట కాల వ్యవధులను నిర్ధేశించారు. ఒకవేళ ఆ కాల వ్యవధిలోపు పనులు పూర్తికాకుంటే, వాటన్నింటి విషయంలో ఏపీసీఆర్డీఏ తిరిగి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ స్కీం (ఎల్పీఎస్) నిబంధనల ప్రకారం.. తుది నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి మూడేళ్లలో మౌలిక సదుపాయాలన్నింటినీ పూర్తిచేసి ప్లాట్లను అప్పగించాల్సి ఉంటుంది. ఎల్పీఎస్ నిబంధనల్లో నిర్ధేశించిన గడువును 2024 జనవరి వరకు పొడిగిస్తూ 2020లోనే సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. రాజధానికి, మౌలిక సదుపాయాలకు రూ.1.09 లక్షల కోట్లు ఏపీ పునరి్వభజన చట్ట నిబంధనల ప్రకారం.. రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి తదితర భవనాల నిర్మాణానికి కేంద్రం ఆరి్థక సాయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రూ.1,500 కోట్లు ఇచ్చింది. వీటి కోసం రాష్ట్రం ఇప్పటివరకు రూ.1,632 కోట్లు ఖర్చుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,023 కోట్లను గ్రాంట్గా ఇచి్చంది. గతంలో ఇచి్చన అంచనా మొత్తాలు ఇప్పుడు పెరిగే అవకాశముంది. రాజధాని అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రూ.1.09 లక్షల కోట్లు కోరుతూ 2018లో కేంద్రానికి లేఖ రాశాం. ఇందులో భాగంగా రూ.62,625 కోట్లకు డిపీఆర్లు కూడా సమర్పించాం. కేంద్రం ఇటీవల వీటి విషయంలో కొన్ని స్పష్టతలు కోరింది. ఆ పనిలో రాష్ట్రం ఉంది. ఒప్పందాల పునరుద్ధరణకు సమయం పడుతుంది రాజధాని నగర అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణలో ఉన్నాం. అందులో భాగంగా గత నెల 23న పలు బ్యాంకులతో సమావేశం నిర్వహించాం. అవి పలు వివరాలు కోరాయి. వాటిని సమర్పించే పనిలో సీఆర్డీఏ ఉంది. రోడ్ల పనులను తిరిగి ప్రారంభించాల్సి ఉంది. అయితే, ఇందుకు అవసరమైన భూములు న్యాయ వివాదాల్లో ఉన్నాయి. కాంట్రాక్టర్లతో ఒప్పందాలను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. కాంట్రాక్టర్లు యంత్రాలు, మనుషులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సైతం సమయం పడుతుంది. వీలైనంత త్వరగా పనుల ప్రారంభానికి అనుమతులిచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. -
యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. తనకు కోటిన్నర విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, తన దగ్గర రివాల్వర్, రైఫిల్తో పాటు స్మార్ట్ఫోన్ ఉన్నట్టు వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ తన ఎన్నికల అఫిడవిట్లో రూ.1,54,94,054 ఆస్తులను ప్రకటించారు. ఇందులో చేతిలో నగదు, ఆరు బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్, సేవింగ్స్ ఉన్నాయి. తన వద్ద రూ. 12,000 విలువైన సామ్సంగ్ మొబైల్ ఫోన్, రూ. 1,00,000 విలువైన రివాల్వర్, రూ. 80,000 విలువైన రైఫిల్ ఉన్నట్లు తెలిపారు. తన పేరు మీద వ్యవసాయ, వ్యవసాయేతర భూములు లేవన్నారు. అలాగే సొంత వాహనం కూడా లేదని వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ వద్ద రూ.49,000 విలువైన 20 గ్రాముల బంగారు చెవి రింగు, రూ.20,000 విలువైన 10 గ్రాముల బంగారు గొలుసు, రుద్రాక్ష హారం ఉన్నాయి. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్లో యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. (చదవండి: పదేళ్లు కావొస్తున్నా.. మానని గాయం!) 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,20,653 ఆదాయం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 15,68,799 ఆదాయం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,27,639 ఆదాయం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,38,670 ఆదాయాన్ని ఆయన ప్రకటించారు. (క్లిక్: ఆయనే బలం, ఆయనే బలహీనత.. ఉప‘యోగి’కి పరీక్ష!) -
అఫిడవిట్ ట్యాంపరింగ్ ఆరోపణలు అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అఫిడవిట్ను ట్యాంపరింగ్ చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఇదే అంశంపై దాఖలైన పిటిషన్ను డిసెంబర్ 15న ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసిందని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీని వాస్గౌడ్ తెలిపారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యా లయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్నగర్లో రాజకీయంగా ఎదుగుతున్న తనపై కొందరు కక్షకట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై జరుగుతున్న కుట్ర వెనుక మహ బూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మరో నాయ కుడు ఉన్నారని, వారి పేర్లు త్వరలో బయట పెడతానని చెప్పారు. ట్రాఫిక్ చలాన్లు, బ్యాం కు రుణాల వివరాలను అఫిడవిట్లో చేర్చలేదని తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పిటిషన్దారులను తప్పుబడుతూ తప్పుడు కేసులు వేయొద్దని కోర్టు హెచ్చరించినా.. కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, ఇళ్లు కట్టుకోవడం, కారు కొనుక్కోవడాన్ని కూడా కొందరు రాజకీ యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్కు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను శ్రీనివాస్ గౌడ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తేలింది. అయితే లోపాలతో ఉన్న మొదటి అఫిడవిట్ను వెబ్సైట్ నుంచి తొలగించారని తేలింది. మళ్లీ సవరించిన అఫిడవిట్ను నెలన్నర తర్వాత అప్లోడ్ చేసినట్లు ఆరోపణ వచ్చింది. కాగా, స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్సైట్ను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో కేంద్ర ఎలక్షన్ కమిషన్ నివేదిక తెప్పించుకుంది. నివేదిక పంపిన కొద్దిరోజులకే కేంద్రానికి సీఈవో శశాంక్ గోయల్ బదీలీపై వెళ్లారు. ట్యాంపరింగ్ జరిగిన విషయం నిజమేనంటూ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ట్యాంపరింగ్ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరిపిస్తోంది. గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై ఇప్పడు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ట్యాంపరింగ్ను టెక్నికల్ బృందం ధృవీకరిస్తే ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అవకాశం కనిపిస్తోంది. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: టాప్లో జమున, ఆ తర్వాత రాజేందర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను ప్రభుత్వం, ప్రతిపక్షాలు సవాలుగా తీసుకుంటుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చ పెట్టి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయాపార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు రూ.వందల కోట్లు ఖర్చుపెట్టిన ఎన్నికగా హుజూరాబాద్ చరిత్ర తిరగరాయనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. (చదవండి: అంతర్జాతీయ మారథాన్లలో వరంగల్ ‘జ్యోతి’ ) అధికార, ప్రతిపక్షపార్టీలు ఖర్చుకు వెనుకాడకుండా ముందడుగు వేస్తున్నాయి. ప్రధానపార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఈటల దంపతులు అత్యధిక ధనవంతులుగా గుర్తింపు పొందారు. ఉపఎన్నిక నామినేషన్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున ఉండగా, ఆ తర్వాత స్థానంలో రాజేందరే ఉన్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్, చివరిస్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ నిలిచారు. అయితే, ప్రతి ఎన్నికలో ఈటల జమున సెంటిమెంట్ కోసం తన భర్త రాజేందర్ కంటే ముందు నామినేషన్ వేస్తుంటారు. రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తుండటంతో జమున నామినేషన్ను విత్డ్రా చేసుకోనున్నారు. జమున నామినేషన్ విత్డ్రా చేసుకుంటే ఈటల రాజేందర్ రూ.16.12 కోట్ల ఆస్తులతో హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడిగా నిలువనున్నారు. ధన ప్రవాహంతో జరగనున్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఈ నెల 30 తర్వాత తేలనుంది. (చదవండి: వారి వయసంతా 25 లోపే.. అన్నీ హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్లే) -
టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు
సాక్షి, హుజురాబాద్: ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్కు సొంత వాహనం లేదంట. ఒక్క గ్రాము బంగారం కూడా తన వద్ద లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఇక తన చేతిలో కేవలం రూ.10 వేలు ఉన్నాయని వెల్లడించాడు. శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించాడు. అయితే గెల్లు శ్రీనివాస్ అఫిడవిట్లో సమర్పించిన వివరాలు ఆసక్తికరంగా మారింది. తన వద్ద కేవలం రూ.10 వేలు, తన భార్య వద్ద రూ.5 వేల నగదు మాత్రమే ఉందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. బ్యాంకుల్లో రూ.2,82,402 డిపాజిట్లు అతడి వద్ద ఉన్నాయి. అదే విధంగా భార్యకు 25 తులాల బంగారం, బ్యాంకు డిపాజిట్ల కింద రూ.11,94,491 చూపించారు. వీటితోపాటు వీణవంకలో సొంతిల్లు, 10.25 గుంటల స్థలం విలువను రూ.20 లక్షలుగా చూపించారు. అలాగే గెల్లు శ్రీనివాస్కు సొంత వాహనం, కనీసం గ్రాము బంగారం కూడా లేకపోవడం గమనార్హం. పేరు : గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్హతలు : ఎంఏ, ఎల్ఎల్బీ భార్య : గెల్లు శ్వేత కేసులు : మూడు -
పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వానిది కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విరాళాల వరదతో నిండుతున్న పీఎం కేర్స్ ఫండ్.. రాజ్యాంగానికి లోబడి కేంద్ర ప్రభుత్వ అధీనంలో కార్యకలాపాలు నిర్వహించదని పీఎం కేర్స్ ఫండ్ ఉన్నతాధికారి స్పష్టంచేశారు. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం(పీఎంవో)లో ఉప కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ గౌరవ హోదాలో పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టు అత్యున్నత నిర్ణయక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ట్రస్టును కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలంటూ గతంలో ఢిల్లీ హైకోర్టులో సమ్యక్ గంగ్వాల్ ఒక పిటిషన్ వేశారు. ట్రస్టును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చి, పారదర్శకంగా కార్యకలాపాలు కొనసాగేలా ఆదేశాలు జారీచేయాలంటూ మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఉమ్మడి విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టింది. దీనిపై స్పందనగా ప్రదీప్ శ్రీవాస్తవ కోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించారు. పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టు లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ప్యానెల్ నేతృత్వంలో ఎంపిక చేసిన చార్టెడ్ అకౌంటెంట్తో ట్రస్టు ఆడిటింగ్ పూర్తయిందని అఫిడవిట్లో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద ‘థర్డ్పార్టీ’ వివరాలు ఇవ్వలేమన్నారు. తర్వాత పిటిషనర్ తరఫు లాయర్లు వాదించారు. ట్రస్టు కేంద్ర ప్రభుత్వానిది కానపుడు ట్రస్టు వెబ్సైట్ చిరునామాలో జౌఠి అనే ప్రభుత్వ డొమైన్ను, ప్రధాని మోదీ అధికారిక ఫొటోను, జాతీయ చిహ్నాన్ని వాడకుండా నిరోధించాలని కోర్టును కోరారు. -
Pegasus: బహిరంగ పర్చలేం
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై కోర్టులో సమగ్ర అఫిడవిట్ సమర్పించలేమని, ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తాము మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. పెగాసస్ హ్యాకింగ్ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. పిటిషన్లపై సుప్రీం బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో సమగ్ర ఆఫిడవిట్ దాఖలుపై ప్రభుత్వానికి పునరాలోచన ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. మరో 2–3రోజుల్లో మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని, అప్పటిలోగా స్పందించాలని పేర్కొంది. ‘ఈ అంశంపై నిజానిజాలను నిర్ధారించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ కోర్టుకు నివేదిక ఇస్తుందని మీరు(సొలిసిటర్ జనరల్) చెబుతున్నారు. అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్నంగా పరిశీలించి, మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తాం’ అని కోర్టు స్పష్టం చేసింది. దాచడానికి ఏమీ లేదు: కేంద్రం విచారణ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఒక నిర్ధిష్టమైన సాఫ్ట్వేర్ను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? లేదా? అనేది ప్రజల్లో చర్చ జరగాల్పినన అంశం కాదని అన్నారు. పెగాసస్ను కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తోందని, ఇందులో దాచడానికి ఏమీ లేదని తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. జాతి భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని తాము ఆశించడం లేదని ధర్మాసనం పేర్కొంది. దేశ పౌరులపై నిఘా పెట్టడానికి పెగాసస్ స్పైవేర్ను కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉపయోగించిందా? లేదా? అనేది మాత్రమే తాము తెలుసుకోవాలని కోరుకుంటున్నామని సొలిసిటర్ జనరల్కు తెలిపింది. అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పకుండా డొంకతిరుగుడు వైఖరి అవలంబించడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. చట్టం నిర్దేశించిన ప్రక్రియ మేరకే స్నూపింగ్ సమగ్ర అఫిటవిట్ దాఖలు చేస్తే పెగాసస్పై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తమకు తెలుస్తుందని కోర్టు వివరించింది. తమ గోప్యతకు(ప్రైవసీ) భంగం కలిగేలా కేంద్రం పెగాసస్ స్పైవేర్ను ఉపయోగిస్తోందని, ఫోన్లపై నిఘా పెట్టిందని జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఉద్ఘాటించింది. ‘‘చట్ట ప్రకారం ఒక ప్రక్రియ ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా అనుమానితులపై నిఘా పెట్టడానికి చట్టం కూడా అనుమతిస్తుంది’ అని పేర్కొంది. ఒకవేళ స్పైవేర్ను ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్లయితే చట్టం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారమే అది జరగాల్సి ఉంటుందని సూచించింది. చట్టం అనుమతించిన ప్రక్రియ కాకుండా ఇంకేదైనా ప్రక్రియను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? అనేది తెలుసుకోవాలని పిటిషనర్లు ఆశిస్తున్నారని ధర్మాసనం గుర్తుచేసింది. వాస్తవాలు చెప్పడం ప్రభుత్వం విధి: సిబల్ పిటిషనర్లు ఎన్.రామ్, శశి కుమార్ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అఫిడవిట్ దాఖలు చేయబోమని కేంద్రం తేల్చిచెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించడం ప్రభుత్వం విధి అని అన్నారు. స్పైవేర్ను ఉపయోగించే విషయంలో చట్టబద్ధమైన ప్రక్రియను ప్రభుత్వం పాటించలేదని మరో సారి తేలిపోయిందని చెప్పారు. మరో పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ వాదిస్తూ... స్పైవేర్తో పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యంపై ముమ్మాటికీ దాడేనని అన్నారు. విశ్వసనీయమైన దర్యాప్తు జరిపించాలని కోరారు. చట్టం అనుమతించదు ఫలానా సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నాం, ఫలానా సాఫ్ట్వేర్ను ఉపయోగించడం లేదు అని బయటకు చెబితే ఉగ్రవాద శక్తులు దాన్నొక అవకాశంగా మార్చుకొనే ప్రమాదం ఉందని సొలిసిటర్ జనరల్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సాఫ్ట్వేర్కు కౌంటర్–సాఫ్ట్వేర్ ఉంటుందన్నారు. కొన్ని కేసుల్లో ఇలాంటి వాటిని బహిర్గతం చేయడానికి టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అనుమతించవని వివరించారు. పెగాసస్పై ఏర్పాటు చేయబోయే కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఉండబోరని, ఐటీ రంగానికి చెందిన నిపుణులే ఉంటారని తెలిపారు. నివేదిక తమకు అందిన తర్వాత బహిర్గతం చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని తుషార్ మెహతా బదులిచ్చారు. దేశ భద్రత నేపథ్యంలో ఇలాంటివి ప్రజల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు. -
ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం: కేంద్రం
-
‘పెగాసస్ అంశంపై కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదు’
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ ప్రారంభం అయ్యింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా, పెగాసస్ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ఈ అంశంపై మరో అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. కేంద్రం ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించిందా లేదా అన్నది అఫిడవిట్లో చర్చించే అంశం కాదు అని స్పష్టం చేసింది. విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా వాటిని అఫిడవిట్లో పొందుపర్చాలని తాము అనుకోవడం లేదని కేంద్రం సుప్రీం కోర్టు ఎదుట తమ వాదనలను వినిపించింది. కాగా, దీనిపై స్పందించిన ధర్మాసనం దేశ భద్రత, శాంతి భద్రతల అంశాలలోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. అదే విధంగా డిఫెన్స్ తదితర విషయాలు అడగట్లేదని తెలిపింది. పెగాసస్ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని ధర్మాసనం కేంద్రానికి తెలిపింది. చదవండి: ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత బలగాలకు వ్యూహాత్మక శిక్షణ ! -
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
ఢిల్లీ: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. కోవిడ్ నివారణ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోర్టు ఆదేశాలకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. వేర్వేరు రోజుల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష గదిలో 15 నుంచి 18 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ప్రతి విద్యార్థికి 5 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని, భౌతిక దూరం, శానిటేషన్ తదితర అంశాలను కచ్చితంగా అమలు చేస్తామని అఫిడవిట్లో పేర్కొంది. విద్యార్థుల ఎంట్రీ, ఎగ్జిట్ వేర్వేరుగా ఉంటాయని అఫిడవిట్లో పేర్కొన్న ప్రభుత్వం .. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నట్లు సుప్రీంకు స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహణకు కోర్టు అనుమతి ఇవ్వాలని అఫిడవిట్లో పేర్కొంది. కాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఏపీలో టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతి: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం -
సాగర్ ఎన్నికలు: ఆ అభ్యర్థి పై అనర్హత వేటు వేయాలి!
హైదరాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తప్పుడు ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారని, ఆయనపై విచారణ జరిపి అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, జి.నిరంజన్, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి గురువారం ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) శశాంక్ గోయెల్ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 2009, 2018 ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లు, అసెంబ్లీ వెబ్సైట్లో ఆయన బయోడేటా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆయన సమర్పించిన కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్లను పరిశీలిస్తే ఆయన వివిధ సందర్భాల్లో తన విద్యార్హతల విషయంలో పొంతన లేని సమాచారం ఇచ్చారని తేలిందన్నారు. స్వీడన్లోని బీటీహెచ్ వర్సిటీ నుంచి బీటెక్, ఎంఎస్ చేసినట్టు తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపించారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ సర్టిఫికెట్ కోసం కనీసం 60 క్రెడిట్ పాయింట్లు కావాల్సి ఉండగా, రోహిత్ రెడ్డి సమర్పించిన సర్టిఫికెట్లో 30 పాయింట్లు మాత్రమే వచ్చినట్టు ఉందని, ఇది డిగ్రీగా చెల్లుబాటు కాదన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోపించారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ముఠాతో రోహిత్కు సంబంధాలున్నాయన్నారు. ఈ అంశంపై డీజీపీతో విచారణ జరిపించాలన్నారు. తమ ఫిర్యాదుపై స్పందించిన సీఈఓ శశాంక్ గోయెల్, జిల్లా కలెక్టర్తో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై త్వరలో గవర్నర్తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతంఫిర్యాదు చేస్తామన్నారు. -
కోటి రూపాయల్లేని ముఖ్యమంత్రి.. ఎవరాయన?
తిరువనంతపురం: అభివృద్ధి చెందిన రాష్ట్రంగా.. దేవభూమిగా పేర్కొనే కేరళలో రాజకీయం హాట్హాట్గా మారింది. ప్రధాన పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీపీఐ (ఎం) అభ్యర్థిగా కన్నూరు జిల్లా ధర్మాడం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్లో పినరయి సమర్పించిన అఫిడవిట్లో ఉన్న వివరాలు ఆసక్తికరంగా మారాయి. కోటి రూపాయల ఆస్తులు కూడా లేకపోవడం గమనార్హం. పినరయి ఆస్తులన్నీ కలిపితే కేవలం రూ.54 లక్షలు మాత్రమే ఉన్నాయి. 2020 21లో ఆయన వార్షిక ఆదాయం రూ.2.87 లక్షలుగా పేర్కొన్నారు. రెండు సొంత ఇళ్లు ఉన్నాయని, సొంత వాహనం లేదని ప్రకటించారు. పినరయి పేరిట రూ.51.95 లక్షల విలువైన స్థిరాస్తులు, 2.04 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. అయితే తన భార్య పేరిట రూ.35 లక్షల విలువైన స్థిరాస్తులు, రూ.29.7లక్షల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. అయితే ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైరయ్యారని ఈ సందర్భంగా అఫిడవిట్లో పినరయి స్పష్టంగా రాయించారు. అయితే వీరిద్దరికీ అప్పులు ఏమీ లేకపోవడం విశేషం. భార్య పేరిట రూ.3.3 లక్షలు విలువ చేసే 80 గ్రాముల బంగారం ఉంది. పినరయిపై రెండు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అఫిడవిట్లో ప్రస్తావించారు. పినరయి 2016 నుంచి కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్లీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయం సాధిస్తారని ప్రచారం సాగుతోంది. ఇక్కడ సీపీఐ (ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 2వ తేదీన విడుదల కానున్నాయి. చదవండి: హీరో కమల్హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..? చదవండి: ఎన్నికల వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళనాడు సీఎం -
పట్టభద్రుల పోరు.. బరిలో కోటీశ్వరులు
సాక్షి, నల్లగొండ: శాసనమండలి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కోటీశ్వరులే. నామినేషన్ల దాఖలు సందర్భంగా వీరు సమర్పించిన అఫిడవిట్లు అదే తేలుస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీరి చదువు, ఆస్తిపాస్తులు, కేసుల వివరాలు ఉన్న అఫిడవిట్లను తన వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి స్థిర, చరాస్తులు అన్నీ కలిపి రూ.31.70 కోట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ అభ్యర్ధి రాణి రుద్రమ, తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్, తదితర అభ్యర్థులందరికీ రూ. రెండు కోట్లు ఆపైననే ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్కు రూ.2కోట్ల లోపు ఆస్తులు ఉండగా, సీపీఐ అభ్యర్ధి జయ సారథిరెడ్డికి కేవలం రూ.లక్షల్లోనే ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇక, టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి సొంతకారు కూడా లేకపోవడం విశేషం. నల్లగొండ ప్రేమేందర్రెడ్డికి రూ.3.72 కోట్ల ఆస్తులు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి రూ.3,72,55,207 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.2,09,05,207 చరాస్తి కాగా, రూ.1,63,50,000లు స్థిరాస్తిగా చూపించారు. వరంగల్ అర్బన్ జిల్లా దామెరలో 13 ఎకరాల భూమి ఉంది. బీమారంలో తిరుమల సర్వీస్ సెంటర్ పేరుతో కమర్షియల్ బిల్డింగ్ ఉంది. ఆయనకు ఒక ఇన్నోవా వాహనంతోపాటు, అశోక్ లేల్యాండ్ ట్యాంకర్ ఒకటి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రూ.18.84లక్షల రొక్కం ఉందని, బ్యాంకులో డిపాజిట్ల రూపంలో మరో రూ.28 లక్షలు ఉన్నాయని, భార్యచేతిలో రూ.4.59లక్షల నగదు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పుల రూపంలో రూ.86.79లక్షల ఓడీ లోన్ ఉన్నట్లు పేర్కొన్నారు. పల్లా అప్పులు రూ.4.10కోట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.31,70,92,030. కాగా, ఇందులో చరాస్తులు విలువ రూ.13,15,98,390, స్థిరాస్తుల విలువ రూ.18,54,93,640గా పేర్కొన్నారు. ఇక, ఆయనకు సొంత కారు కూడా లేదు. కానీ, పల్లా భార్య పేరు మీద ఒక కారు (మారుతీ సెలిరీయో 2017 మోడల్) ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. ఇక ఆయనకు ఉన్న అప్పులు రూ.4,10,17,703. పల్లాకు వారసత్వంగా నాలుగు ఎకరాల భూమి రాగా, ఆయన తన సంపాదన నుంచి మరికొంత భూమి కొనుగోలు చేశారు. మొత్తంగా ఆయన పేరున 32.10 ఎకరాలు, ఆయన భార్య పేరున 10.27 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరు మీద 41.39 ఎకరాల భూములు ఉన్నాయి. రాణిరుద్రమ: యువ తెలంగాణ పార్టీ (వైటీపీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ అభ్యర్థి జి.రాణి రుద్రమకు రూ. 3,98,86,700 ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ. 58,06,700 చరాస్తి రూ.3,40,80,000 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆమెకు రూ.42.98లక్షల విలువైన 89 తులాల బంగారు నగలు, రూ.1.08లక్షల విలువైన. కేజిన్నర వెండి ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్: తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కూడా అయిన ప్రొఫెసర్ కోదండరామ్కు రూ.2,06,95,099 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.52,75,099 విలువైన చరాస్తి, రూ.1,54,20,000 విలువైన స్థిరాస్తి ఉంది. అంతే కాకుండా ఆయన పేరు మంచిర్యాలలో ఒక కమర్షియల్ గోదాము కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కోదండరామ్కు, ఆయన భార్యకు చెరో వాహనం ఉంది. సీపీఐ అభ్యర్థి జయ సారథిరెడ్డి: ఈయన పేరున రూ.4.08లక్షల చరాస్తి ఉండగా, ఆయన భార్యపేరున రూ.37.75లక్షల విలువైన చరా స్తి మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. సొంతంగా కొనుగోలు చేసిన స్థిరాస్తి రూ.15.95లక్షల విలువగలది ఆయన పేరున, రూ.33.88లక్షల విలువగల ఆస్తి భార్య పేరు ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్: ఈయనకు రూ.1.88 కోట్ల ఆస్తులు ఉన్నా యి. ఇందులో చరాస్తులు రూ.40,71,305లు కాగా, స్థిరా స్తులు రూ.1,47,61,580గా పేర్కొన్నారు. మొత్తంగా ఆయనకు రూ.1,8 8,32,885 విలువైన ఆస్తులు ఉండగా.. రూ.16,42,764 అప్పులున్నా యి. ఒక ఇన్నోవా కార్ కూడా ఉంది. ఇక, ఆయన భార్యకు రూ.4లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. తెలంగాణ ఇంటిపార్టీ (టీఐపీ) అధ్యక్షుడు, ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్కు రూ.3. 37కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.7 లక్షల విలువైన చరాస్తి, రూ.3.30కోట్ల విలువైన స్థిరాస్తి ఉంది. -
కేంద్రం తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణలో హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అయితే, అఫిడవిట్ దాఖలు చేయకుండా.. మెమో దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ కేంద్ర హోమ్ శాఖ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి వివరాలు రాబట్టలేకపోతే ఎందుకు మీ హోదాలు? అని హైకోర్టు ప్రశ్నించింది. పాత మెమోనే సమర్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జర్మనీ ఎంబీసీ నుంచి పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. -
ఆ కేసు విచారణ నుంచి జస్టిస్ రాకేశ్ కుమార్ తప్పుకోవాలి
సాక్షి, అమరావతి: మిషన్ బిల్డ్ ఆంధ్ర ప్రదేశ్లో భాగంగా సర్కారు ఆస్తులను వేలం ద్వారా విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖ లైన వ్యాజ్యాల్లో విచారణ నుంచి తప్పు కోవాలని న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ను అభ్యర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలను విచారించే ధర్మాసనంలో జస్టిస్ రాకేశ్ కుమార్ సభ్యుడిగా కొనసాగితే, తాము న్యాయం పొందే అవకాశం ఉండదని హైకోర్టుకు తెలిపింది. పక్షపాతంతో వ్యవ హరించేందుకు ఆస్కారం ఉందని సహేతుక ఆందోళన ఉన్నప్పుడు, కేసు విచారణ నుంచి తప్పుకోండని కోరవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం తన అఫి డవిట్లో ప్రస్తావించింది. కేసును పూర్తిగా విచారించడానికి ముందే ఓ నిర్ణయానికి వచ్చేసి ప్రభుత్వంపై ఆ న్యాయమూర్తి చేస్తున్న వ్యాఖ్యలే ఆయన పక్షపాతంతో వ్యవహరి స్తారనేందుకు నిదర్శనమని పేర్కొంది. విశాఖపట్నం, గుంటూరు తదితర జిల్లాల్లో ఆస్తుల వేలం నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై ఈ నెల 11న న్యాయ మూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ దొనడి రమేశ్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ రాకేశ్ కుమార్ ప్రభుత్వంపై పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తదుపరి ఈ నెల 17న గురువారం ఈ వ్యాజ్యాలు విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మిషన్ ఆఫ్ ఏపీ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ మంగళ వారం ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. అనవసర వ్యాఖ్యలవి.. ► వినియోగంలో లేని, ఆక్రమణలో ఉన్న, వివాదాల్లో చిక్కుకున్న తదితర ఆస్తులను వేలం ద్వారా విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉందా? లేదా? అన్న అంశంపైనే కోర్టు తేల్చాల్సి ఉంది. ఈ అంశంపై హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిర్ణయం వెలువరిస్తే, ఆ నిర్ణయంపై అభ్యంతరం ఉన్న వాళ్లు తగిన రాజ్యాంగ వేదికను ఆశ్రయిం చేందుకు ప్రత్యామ్నాయం ఉంది. అలా కాకుండా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫ ల్యం చెందిందని జస్టిస్ రాకేశ్కుమార్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం అవ సరం లేనివి. ఈ నేపథ్యంలో ఆయన ఈ కేసును విచారించడమంటే, న్యాయానికి విఘాతం కలిగినట్లే. ► కోర్టులో ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా,పత్రికల ద్వారా అవి దావానలంలా వ్యాపించాయి. ► ‘కోర్టులో జరిగే కేసుల విచారణ ప్రొసీ డింగ్స్ను గమనించేందుకు వీలుగా హై కోర్టు వెబ్సైట్లో ఆయా కోర్టు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉన్నాయి. నేను ఈ కేసు (ఆస్తుల వేలం) విచారణను గమని స్తుండగా, న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ ఈ నెల 11న చేసిన వ్యాఖ్యలను విన్నాను. ఆ వ్యాఖ్యలను కొన్ని పత్రికలు యథాతథంగా ప్రచురించాయి. వాటిని పరిశీలన నిమిత్తం కోర్టు ముందుంచుతున్నా’ అని ప్రవీణ్కుమార్ అఫిడవిట్లో వివరించారు. -
మారటోరియం వడ్డీ మాఫీ: విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: మారటోరియం సమయంలో రుణాల పై వడ్డీ మాఫీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం (అక్టోబర్, 5) దీనిపై వాదనలను విన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీని వదులుకోవాలని విజ్ఞప్తి చేసింది. వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి ఒక వారం సమయం మంజూరు చేసింది.రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు క్రెడాయ్, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలని సుప్రీం కోరింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే గత నెల 10న దాఖలు చేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అవసరమైన వివరాలను ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది.(మారటోరియం : భారీ ఊరట) కాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలో వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు కేంద్రం భారీ ఊరట లభించింది. కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరు నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ మేరకు ఆర్థిక శాఖ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
సివిల్స్ వాయిదా కుదరదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విస్తరిస్తున్న వేళ నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు చేపట్టిన రవాణా ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం యూపీఎస్సీని ఆదేశించింది. దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రబలంగా ఉండటంతోపాటు అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదల సమయంలో అక్టోబర్ 4వ తేదీన జరగబోయే సివిల్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఏ.ఎం. ఖాన్విల్కర్, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు పక్షాల వాదనలు వింది. పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం చేపట్టిన రవాణా ఏర్పాట్లపై మంగళవారంకల్లా వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని యూపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. బుధవారం మళ్లీ విచారణ చేపడతామని తెలిపింది. అంతకుముందు..మే 31వ తేదీనే ఈ పరీక్షల తేదీలు ఖరారు చేశామనీ, వాయిదా వేయడం కుదరదని ధర్మాసనానికి యూపీఎస్సీ తెలిపింది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఈ–అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొంది. పిటిషనర్లు వాసిరెడ్డి గోవర్దన సాయి ప్రకాశ్ తదితర 19 మంది తరఫున అలోక్ శ్రీవాస్తవ వాదనలు వినిపించారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి, వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టే వరకు సివిల్స్ పరీక్షలను కనీసం మూడు నెలలపాటు వాయిదా వేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న 72 నగరాల్లో 6 లక్షల మంది అభ్యర్థులు 7 గంటలపాటు ఈ పరీక్షలను రాయాల్సి ఉంటుందనీ, చాలా మంది అభ్యర్థులు కనీసం 300–400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ పరిస్థితుల్లో కోవిడ్, వరదల కారణంగా అభ్యర్థుల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు. -
అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే..
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకుందామంటే ఇకపై కుదరదు. విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించనున్నట్లు ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఇలాంటి వాటిపై కేసుల వారీగా విచారణ చేపట్టాల్సిందిగా దర్యాప్తు సంస్థలకు పంపిస్తామని పేర్కొంది. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో భాగంగా అఫిడవిట్లలో తప్పుడు సమాచారంపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అఫిడవిట్ల బాగోతంపై ప్రజలు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 125ఏ కింద న్యాయస్థానాలకు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇకపై నేరుగా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయొచ్చు. తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిరూపణ అయితే సదరు అభ్యర్థులకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా.. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ విధించవచ్చని ఈసీ రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ శిక్ష సరిపోదని ఈసీ చెబుతోంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కనీసం రెండేళ్లు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణ చేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ప్రతిపాదన న్యాయశాఖ వద్ద పెండింగ్లో ఉంది. -
మున్సిపల్ స్టేల రద్దుకు నో
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. 78 మున్సిపాలిటీలపై సింగిల్ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి తోసిపుచ్చారు. మొత్తం 78 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేస్తే రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపల్ సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు బుధవారం హైకోర్టును కోరారు. రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ల పాలకవర్గాల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, స్టే ఉత్తర్వులు ఉన్న కేసుల్లోని అభ్యంతరాలనే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి తీర్పు చెప్పిందని తెలిపారు. ఆ అభ్యంతరాలను ధర్మాసనంతోసిపుచ్చింది కాబట్టి స్టేలను రద్దు చేసి ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు తొలగించాలని కోరారు. స్టేలున్న కేసులన్నింటినీ కొట్టివేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఈ వాదనలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద జీవో 459 గురించి మాత్రమే విచారణ జరిగిందని, ఆ జీవో వార్డుల పునరి్వభజనకు చెందిన అంశంపైనే ధర్మాసనం న్యాయ సమీక్ష చేసిందన్నారు. తాము జీవో 78ను కూడా సవాల్ చేశామని, వార్డుల్లో ఓటర్ల వ్యత్యాసం పది శాతం కంటే ఎక్కువ ఉండటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు వంటి అంశాలపై సింగిల్ జడ్జి దగ్గర కేసుల్లో సవాల్ చేశామని చెప్పారు. గుజరాత్ స్థానిక సంస్థల కేసులో గడువు ముగిసిన రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్నికలు జరిగాయని న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, మయూరిరెడ్డి, నరేష్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఎన్నికల ముందస్తు ప్రక్రియను సవాల్ చేసేందుకు వీల్లేదని, తాము ముందుగానే ఎన్నికల ముందస్తు ప్రక్రియలో చేసిన చట్ట వ్యతిరేక చర్యలపై హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఒక వార్డుకు మరో వార్డుకు ఓటర్ల సంఖ్య పది శాతం కంటే ఎక్కువ ఉండకూడదని జస్టిస్ నవీన్రావు తీర్పు చెప్పారని, ఈ విషయాన్ని ప్రభుత్వం వదిలిపెట్టి ధర్మాసనం అన్నింటిపైనా తీర్పు చెప్పిందనడం సబబుకాదని చెప్పారు. స్టే ఉత్తర్వులున్న కేసులకు ధర్మాసనం తీర్పు వర్తించబోదు కాబట్టి కేసుల వారీగా (73 కేసులనూ) విడివిడిగా విచారణ చేయాల్సిందేనని పేర్కొన్నారు. స్టేలు ఉన్న అన్ని మున్సిపాలిటీలపై ప్రభుత్వం ఒకే అఫిడవిట్ దాఖలు చేయడం చెల్లదని తెలిపారు. ఒక్కో కేసులో ఒక్కో తరహా ఆరోపణలు, అభ్యంతరాలు ఉన్నందున వేటికి వాటికే ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేయాలని చెప్పారు. స్టే ఉత్తర్వులు ఉన్న మున్సిపాలిటీలను మినహాయించి మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహిస్తామని ధర్మాసనం ఎదుట రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పిందని, ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా వాదిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందని సంఘం తరఫు సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ చెప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కేసుల వారీగా అన్నింటినీ విచారణ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్రెడ్డి ప్రకటించి ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అన్ని కేసుల విచారణ పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుందని అంటున్నారు. -
మళ్లీ విచారణ జరపండి
న్యూఢిల్లీ/ముంబై: ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు మంగళవారం సుప్రీంకోర్టు షాకిచి్చంది. 2014 ఎన్నికల సమయంలో ఫడ్నవిస్ ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ఆరోపిస్తూ దాఖలైన ఒక పిటిషన్ను మళ్లీ మొదటినుంచి విచారించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఆ ఎన్నికల్లో తనపై పెండింగ్లో ఉన్న రెండు క్రిమినల్ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో ఫడ్నవిస్ పేర్కొనలేదని పిటిషన్దారు ఆరోపించారు. ఆ ఆరోపణలను ట్రయల్ కోర్టు కొట్టేయగా, ట్రయల్ కోర్టు తీర్పును బొంబాయి హైకోర్టు సమర్థించింది. అయితే, సుప్రీంకోర్టు ఇచి్చన తాజా ఆదేశాలు ఈ నెల 21న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫడ్నవిస్ పోటీ చేయడానికి ఎలాంటి అడ్డు కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై విపక్ష కాంగ్రెస్ స్పందించింది. తక్షణమే ఫడ్నవిస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు, ఫడ్నవిస్కు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత, కేంద్రమంత్రి రామ్దాస్ అఠవలే మద్దతు పలికారు. ఎన్నికల సంఘానికి తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఇవ్వకుండా తప్పుడు అఫిడవిట్ ఇవ్వడంపై.. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫడ్నవిస్పై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ఏ కింద క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ నాగపూర్లోని మెజిస్టీరియల్ కోర్టును సతిశ్ ఉకే అనే లాయర్ ఆశ్రయించారు. కోర్టు ఆయన పిటిషన్ను కొట్టేయడంతో సెషన్స్ కోర్టుకెళ్లారు. ఈ పిటిషన్ను మళ్లీ విచారించాల్సిందిగా మెజిస్టీరియల్ కోర్టును ఆదేశిస్తూ సెషన్స్ కోర్టు తీర్పునిచి్చంది. సెషన్స్ కోర్టు తీర్పుపై ఫడ్నవిస్ హైకోర్టుకు వెళ్లారు. సెషన్స్ కోర్టు తీర్పును పక్కనపెడుతూ హైకోర్టు 2018న తీర్పునిచ్చింది. దీనిపై సతీశ్ ఉకే సుప్రీంను ఆశ్రయించారు. తనపై ఉన్న క్రిమినల్ కేసుల విషయం తెలిసీ.. ఫడ్నవిస్ వాటిని అఫిడవిట్లో పొందుపర్చ లేదన్నారు. తర్వాత హైకోర్టు ఇచి్చన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేసును మళ్లీ విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. నామినేషన్ సమయంలో తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు తెలపకుండా అభ్యర్థి అఫిడవిట్ దాఖలు చేస్తే 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధించే ప్రతిపాదన ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ లో ఉంది. -
కరణం బండారాన్ని బయట పెట్టిన ఆమంచి
కరణం బలరాం.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆయన ఏ పని చేసినా వివాదాస్పదమే.. తాజాగా బలరాం కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు.. అందులోంచి ఎలా బయటపడాలో తెలియక విలవిల్లాడుతున్నారు.. ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచిన వ్యవహారాన్ని ఆమంచి రట్టు చేసేశారు.. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేగా బలరాం ఎన్నిక చెల్లదంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల అఫిడవిట్లో కరణం తన కుమార్తె అంబిక పేరును చూపకుండా దాచి పెట్టారంటూ ఆమంచి వేసిన పిటిషన్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని చీరాల టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.. ఆమంచి ఆధారాలను బయటపెట్టడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితం ఆమంచి హైకోర్టులో పిటీషన్ వేసినా.. మంగళవారం విలేకర్ల సమావేశం పెట్టి మరీ బలరాం బండారాన్ని బయట పెట్టారు. ఇంత జరుగుతున్నా ఆ పెద్దాయన మాత్రం నోరు మెదపక పోవడంతో తప్పు చేయడం వల్లే మౌనంగా ఉన్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదని, చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంబిక కృష్ణ అనే కుమార్తె ఉన్నప్పటికీ బలరాం తన నామినేషన్లో ఆమె వివరాలు పొందుపరచలేదని పిటిషన్లో పేర్కొనడంతో ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన ఆమంచి హైకోర్టులో ఎన్నికల పిటీషన్ (ఈపీ) దాఖలు చేయడంతో చీరాల టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో గత మూడు రోజులుగా ఇదే చర్చ కొనసాగుతోంది. అంబిక కృష్ణ ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాల్లో తండ్రి పేరు కరణం బలరామకృష్ణమూర్తిగా నమోదైన దృశ్యాలు (సర్కిల్లో) హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడమే కాకుండా ఆమంచి విజయవాడలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలు బయటపెట్టడంతో కరణం వర్గీయులు అంతర్మథనం చెందుతున్నారు. అంబిక తన కుమార్తె కాదని బలరాం అంటే ఏ పరీక్షకైనా అంబిక సిద్ధంగా ఉందని ఆమంచి సవాలు చేసినా కరణం బలరాం మాత్రం ఈ వ్యవహారంపై ఇంత వరకూ నోరు మెదప లేదు. చిన్న ఆరోపణ వస్తేనే అంతెత్తు ఎగిరిపడే తమ నాయకుడు మూడు రోజులుగా తీవ్ర ఆరోపణలు వ్యక్తమౌతున్నా మౌనంగా ఉండిపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోన చెందుతున్నారు. మౌనం అర్ధాంగీకారమే కదా అనే చర్చా జిల్లాలో కొనసాగుతోంది. ఏదైనా రాజకీయపరమైన వివాదం అయితే పార్టీ తరఫున ఖండించే అవకాశమైనా పార్టీ నేతలకు ఉండేది. వ్యక్తిగతమైన వివాదం కావడంతో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని జిల్లా టీడీపీ నేతలు సైతం మిన్నకుండిపోతున్నారు. ఆమంచి ఆరోపణలు ఇవీ... ► కరణం బలరాంకు 1985లో ప్రసూన అనే మహిళతో శ్రీశైలంలో వివాహం జరిగింది. ► వీరిరువురికీ అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్లోని సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో జన్మించింది. ► అంబిక ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. ► అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టిన రోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. ► బలరాం తన నామినేషన్లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపర్చకుండా దాచిపెట్టారు. ► ఎన్నికల చట్ట నింబంధన ప్రకారం కరణం నామినేషన్ చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్గా పరిగణించడానికి వీల్లేదు. ► బలరాం ఎన్నికను రద్దు చేయాలి.. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి తాను(ఆమంచి) ఎన్నికైనట్లు ప్రకటించాలి. ► తన తండ్రి ఎవరనేది ప్రపంచానికి చెప్పాలని అంబిక కోరిక.. ఆమెకు న్యాయం చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నా.. పదవుల కోసం కాదు. ► అంబిక తన కూతురు కాదని బలరాం అంటే కనుక ఫోరెన్సిక్, డీఎన్ఏ వంటి ఏ పరీక్షకైనా అంబిక సిద్ధంగా ఉన్నారు. ► కన్న కూతురు పేరు ఎన్నికల అఫిడవిట్లో పెట్టని కఠినమైన వ్యక్తి కరణం బలరాం. -
సంతానంపై ఈసీకి బలరాం తప్పుడు అఫిడవిట్
విజయవాడ సిటీ: పిల్లలు ఎంతమంది అనే విషయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని అనర్హుడిగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల కమిషన్(ఈసీ)ను డిమాండ్ చేశారు. బలరాంకు నాలుగో సంతానంగా అంబికకృష్ణ ఉండగా, తనకు ముగ్గురు బిడ్డలేనంటూ ఈసీకిచ్చిన అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చారన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ తాను ఈనెల 4న హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేసినట్టు తెలిపారు. ఆమంచి మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బలరాం నాల్గవ సంతానానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. అన్నప్రాసన నుంచి ప్రతి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, సెయింట్ థెరిసా హాస్పటల్లో అంబిక తండ్రిగా బలరాం పేరుతో ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, ఎంసెట్ హాల్టిక్కెట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేయడానికిచ్చిన వినతిపత్రం, ఆధార్కార్డుసహా పలు పత్రాలను మీడియాకు చూపారు. బలరాం తన తండ్రి అని ఒక కుమార్తెగా తెలియజేసేందుకు ఇవి సరిపోతాయని, వీటిని కాదంటే.. డీఎన్ఏ పరీక్షలకు సైతం సిద్ధంగా ఉన్నానని అంబిక చెప్పిందన్నారు. అతి పిన్నవయసులో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం టీడీపీ ఆంధ్ర, తెలంగాణకు అధికార ప్రతినిధిగా ఉన్న కాట్రగడ్డ ప్రసూనకు, బలరాంకు కుమార్తెగానేగాక ప్రఖ్యాత రాజకీయవేత్త ఎన్జీ రంగాకు దగ్గర బంధువుగా ఆమె అందరికీ తెలుసన్నారు. సామాన్య మహిళగా తన తల్లి, తండ్రి ఎవరనేది ఈ సమాజానికి తెలియజేయడానికి డాక్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా తన మద్దతు కోరిందన్నారు. తాను బలరాంపై పోటీ చేసి ఓటమి చెందాను కాబట్టి ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిన విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమంచి చెప్పారు. హైకోర్టులో తాను దాఖలు చేసిన పత్రాలన్నింటిపై తనతోపాటు అంబిక సైతం సంతకాలు చేశారన్నారు. ఈ విషయమై బలరాం స్పందించడమేగాక చట్టానికి లోబడి రాజీనామా చేయాలని లేదా నైతికంగా సమాధానం చెప్పాలని ఆమంచి డిమాండ్ చేశారు. విలువల గురించి ఊదరగొట్టే ప్రతిపక్ష నేత చంద్రబాబు.. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన విషయంపై స్పందించి బలరాంపై ఏం చర్యలు తీసుకుంటారో జవాబు చెప్పాలన్నారు. చంద్రబాబుకు అంబిక బాగా తెలుసన్నారు. ఆమె రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు స్వయంగా ఆవిష్కరించారన్నారు. జన్మనిచ్చిన కుమార్తెను తన కూతురు కాదనే క్రూరమైన మనస్తత్వమున్న వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుంటే చంద్రబాబు సైతం తప్పు చేసిన వారవుతారన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికల్లో తప్పుడు ఆఫిడవిట్ సమర్పించారని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఈ మేరకు బలరాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బలరాం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు. బలరాంకు నలుగురు పిల్లలైతే ఆఫిడవిట్లో ముగ్గురని పేర్కొన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశామ’ని తెలిపారు. బలరాం నాలుగో సంతానంకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను, కొన్ని పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. తనను చెల్లిగా భావించి న్యాయం చేయాలని ఆ అమ్మాయి(బలరాం కూతురు) తనను ఆడిగినట్టు ఆమంచి పేర్కొన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టే కోర్టులో పిటిషన్ వేసినట్టు స్పష్టం చేశారు. -
ఆఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు
-
‘అచ్చెన్నాయుడి ఎన్నిక చెల్లదు’
సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నిక చెల్లదని ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెరాడ తిలక్ ఆరోపించారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి టీడీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు పోటీచేసిన గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అఫిడవిట్లో ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్ను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని తిలక్ డిమాండ్ చేశారు. 2007 జూలై 21న మైనింగ్ కార్యాలయంపై దాడి ఘటనలో హైరిహల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం 34/2007 కేసులో ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్ ఇంకా పెండింగ్లో ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. ఓబులాపురం మైనింగ్ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 21వ నిందితుడిగా అచ్చెన్నాయుడుపై అరెస్ట్ వారెంట్ కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో దాచినందుకు ఎన్నికల సంఘం ఆయనపై వెంటనే చర్యలు తీసుకుని.. ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై చివరి వరకూ న్యాయం పోరాటం చేస్తానని పేరాడ తిలక్ తెలిపారు. కాగా ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్రమంగా ఎన్నికయ్యారంటూ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు, శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ రెండు స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలోనే తెలిపిన విషయం తెలిసిందే. -
‘చినరాజప్పను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుంది’
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేసు నమోదు 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు. -
కరణం బలరాం భార్య, కుమార్తె వివరాలు దాచిపెట్టారు..
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఇందులో కరణంతోపాటు ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులను, రిటర్నింగ్ అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. వాస్తవాలు చెప్పకపోతే ఎన్నికను రద్దు చేయొచ్చు ‘కరణం బలరాం సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదు. చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించకపోయినప్పటికీ ఆయన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. కరణం బలరాం తన నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చారు. వాస్తవాలను దాచిపెట్టారు. భార్య, తనపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారు. నామినేషన్లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదు. తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారు. ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదు. పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగింది. కరణం బలరాం, ప్రసూనలకు అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్లోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించింది. అంబిక ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో, ఆధార్ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. అంబిక కృష్ణ ప్రస్తుతం ఎల్ఎల్బీ చదువుతోంది. బలరాం తన నామినేషన్లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపరచకుండా దాచిపెట్టారు. ఎన్నికల చట్ట నిబంధనల ప్రకారం.. కరణం నామినేషన్ను చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్గా పరిగణించడానికి వీల్లేదు. అందువల్ల ఆయన నామినేషన్ను చెల్లనిదిగా ప్రకటించాలి. బలరాం ఎన్నికను రద్దు చేయండి. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనట్లు ప్రకటించండి’ అని కృష్ణమోహన్ తన పిటిషన్లో వివరించారు. -
తప్పు చేస్తే అంగీకరించాలి
న్యూఢిల్లీ: రఫేల్ కేసులో తీర్పుకు చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించిన కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన తాజా అఫడవిట్పై సుప్రీంకోర్టు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్ నేరుగా తన తప్పును అంగీకరించకపోవడాన్ని తప్పు పట్టింది. తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘మా ఉత్తర్వులో ఎక్కడ మేం అలా చెప్పాం. ఇలాంటి ప్రకటనలన్నీ మీరు మాకెలా ఆపాదిస్తారు..?’ అని బెంచ్ నిలదీసింది. ఒక పక్క తప్పును అంగీకరిస్తున్న రాహుల్ మరోపక్క వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నట్టుగా పేర్కొంటున్నారని వ్యాఖ్యానించింది. అఫిడవిట్లో విచారం (రిగ్రెట్) అన్న పదాన్ని బ్రాకెట్లో పెట్టడంలోని అర్థం ఏమిటి? అని ధర్మాసనం రాహుల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది. ఈ అఫిడవిట్ ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారో తమకు అర్ధం కావడం లేదని న్యాయమూర్తులు ఎస్కే కౌల్, కేఎం జోసెఫ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విచారం (రిగ్రెట్), క్షమాపణ (అపాలజీకి) రెండూ ఒకటే అన్నట్టుగా నిఘంటువులో ఉందని సింఘ్వీ చెప్పారు. రాహుల్ నిజాయితీగానే కోర్టును క్షమాపణ కోరుతున్నారని తెలిపేలా మరో మెరుగైన అఫిడవిట్ దాఖలు చేసేందుకు వచ్చే సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరగా.. ధర్మాసనం అందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది. నాలుగు వారాలు కుదరదు రఫేల్ ఒప్పందంపై తాము ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మే నాలుగో తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం కోరినట్టుగా నాలుగు వారాల గడువు ఇచ్చేందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నిరాకరించింది. న్యాయమూర్తులు ఎస్కే కౌల్, కేఎం జోసెఫ్లతో కూడిన బెంచ్ తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. ఫ్రాన్స్ నుంచి 36 ఫైటర్ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ గత డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రూ.58 వేల కోట్ల ఒప్పందంలో అవకతవకల ఆరోపణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. ఈ తీర్పుపై కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హాలతో పాటు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 10న ఈ పిటిషన్లను ఆమోదించిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలుకు కేంద్రాన్ని ఆదేశించింది. రాహుల్కు కేంద్రం నోటీసులు రాహుల్ పౌరసత్వం వ్యవహారంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి గతంలో చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ హోం శాఖ రాహుల్కు తాజాగా నోటీసులు జారీ చేసింది. పక్షం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంది. దీనిపై రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ అమేథీలో స్పందించారు.‘ఈ ఆరోపణలన్నీ అర్థం లేనివి. రాహుల్ ఇక్కడే పుట్టారు. ఇక్కడే ఉన్నారు. ఇక్కడే పెరిగారు. ఆయన భారతీయుడన్న విషయం దేశానికంతటికీ తెలుసు’ అని అన్నారు. కాగా, రాహుల్ పౌరసత్వంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ 2015లో దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. -
ప్రధాని మోదీ ఆస్తులివే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు 2014 నుంచి 2019 వరకూ 52 శాతం పెరిగాయి. వారణాసిలో మోదీ శుక్రవారం నామినేషన్ వేసిన సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తన ఆస్తులను వెల్లడించారు. చరాస్తుల్లో అధిక భాగం ఎస్బీఐలోని రూ 1.27 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. అఫిడవిట్లో తన ఆస్తుల విలువ మొత్తం రూ 2.51 కోట్లుగా ప్రధాని వెల్లడించారు. వీటిలో చరాస్తులు రూ 1.41 కోట్లు కాగా, స్ధిరాస్తులను రూ 1.10 కోట్లుగా చూపారు. మోదీ చరాస్తులు 2014తో పోలిస్తే 114 శాతం పెరిగాయి. 2014లో ఆయన తన చరాస్తుల విలువ రూ 65.91 లక్షలుగా చూపారు. ప్రధాని ప్రధాన ఆదాయ వనరు వేతనం కాగా, పొదుపు ఖాతాపై వడ్డీల నుంచి ఆదాయం సమకూరుతోంది. ఇక తనపై ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు లేవని, అప్పులు కూడా లేవని అఫిడవిల్లో పేర్కొన్నారు. చరాస్తుల్లో రూ 38,750 చేతిలో నగదు కాగా, బ్యాంకులో కేవలం రూ 4,143 బ్యాలెన్స్ ఉన్నట్టు చూపారు. ఎస్బీఐలో రూ 1.27 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. ఇక 2014లో చేతిలో నగదు రూ 32,700, బ్యాంక్ బ్యాలెన్స్ రూ 26.05 లక్షలు, రూ 32.48 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు అఫిడవిట్లో మోదీ చూపారు. -
242 కేసులు.. నాలుగు పేజీల ప్రకటన!
కేరళలోని పత్తనంతిట్ట లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ సమర్పించిన అఫిడవిట్ చూసి ఎన్నికల అధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తనపై ఏకంగా 242 క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. వాటిలో 222 కేసులు శబరిమల ఆందోళనకు సంబంధించినవేనట. వందల సంఖ్యలో కేసులుండటం ఒక విశేషమైతే, ఆ కేసుల వివరాలను ప్రకటించడానికి వార్తా పత్రికలో నాలుగు పూర్తి పేజీలు కేటాయించాల్సి వచ్చిందట. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలను మూడు సార్లు పత్రికల్లో ప్రకటించాలి. టీవీల్లో కూడా మూడుసార్లు ప్రసారం చేయాలి. సురేంద్రన్ కేసుల వివరాలను పార్టీ పత్రిక ‘జన్మభూమి’లో ప్రకటించారు. అన్ని కేసుల వివరాలు ప్రకటించడానికి నాలుగు పేజీలు కావలసి వచ్చింది. ఇక టీవీ విషయానికి వస్తే మామూలుగా ఒక అభ్యర్థి కేసుల ప్రసారానికి ఎక్కువలో ఎక్కువ ఏడు సెకన్లు పడుతుంది. అయితే, మన హీరోగారి కేసులన్నీ చదవడానికి 60 సెకన్లు పట్టిందట. టీవీ ప్రకటన కూడా పార్టీకి చెందిన ‘జనం టీవీ’లోనే ఇచ్చారు. పార్టీ పత్రిక కాబట్టి సరిపోయింది కాని అదే వేరే వార్తా పత్రికలో ఆ ప్రకటన ఇవ్వాలంటే ఒకసారి ఇవ్వడానికే రూ.60 లక్షలకు పైగా చెల్లించాల్సి వచ్చేదని, ఇది ఎన్నికల సంఘం అభ్యర్థికి కేటాయించిన ఎన్నికల ఖర్చుకంటే ఎక్కువని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక టీవీ ప్రకటన ఖర్చుకూడా కలిపితే సురేంద్రన్ పరిమితికి మించి ఖర్చు చేసినందుకు కచ్చితంగా అనర్హుడవుతారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, సురేంద్రన్పై ఉన్న కేసులేవీ కోర్టులో నిలబడేవి కావని కేరళ బీజేపీ శాఖ ప్రతినిధి ఎంఎస్ కుమార్ అన్నారు. చాలా కేసులు ఎన్నికలకు కొన్ని రోజుల ముందే నమోదయ్యాయని తెలిపారు. శబరిమల ఆందోళన సందర్భంగా గత ఏడాది డిసెంబర్లో సురేంద్రన్ 22 రోజులు జైల్లో ఉన్నారు. -
స్థానిక సమరానికి సిద్ధమైన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ‘స్థానిక’ సమరానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా కో–ఆర్డినేటర్లను ఏర్పాటు చేసి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించిన పార్టీ.. ఇప్పుడు అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న ట్లుగా స్థానిక టికెట్లు కూడా గాంధీభవన్ నుంచే ఖరారు చేసే ఆనవాయితీని పక్కనపెట్టి సెలక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో టికెట్ ఖరారు బాధ్యతలను క్షేత్రస్థాయి నాయకత్వానికే కట్టబెట్టింది. ఈ మేరకు అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షు లు, కో–ఆర్డినేటర్లతో ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్సమావేశం నిర్వహించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మం త్రులు జానారెడ్డి, షబ్బీర్, దామోదర రాజనర్సింహ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఉపాధ్యక్షులు కుమార్రావు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్ణయించిన మేరకు 32 జిల్లాల పార్టీ అధ్యక్షులకు ఎన్నికలకు సంబంధించిన ఏ–ఫారాలు అందజేశారు. దీంతో డీసీసీ అధ్యక్షులే మండల స్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో నిర్ణయించిన అభ్యర్థులకు బీ– ఫారాలు ఇచ్చే బాధ్యతలను కట్టబెట్టారు. సోమవారం నుంచి జరిగే నామినేషన్లను దృష్టిలో పెట్టుకుని ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు జెడ్పీటీసీ అభ్యర్థులకు, మండల పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అఫిడవిట్ రెడీ పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న తర్వాతే బీ–ఫారాలు ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించిన నేపథ్యంలో ఆ అఫిడవిట్లను కూడా ఈ సమావేశంలో ఖరారు చేశారు. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు వేర్వేరుగా తయారు చేసిన హామీ పత్రాలకు సమావేశం ఆమోదం తెలిపింది. అభ్యర్థులంతా 20 రూపాయల బాండ్ పేపర్పై ఈ నమూనా అఫిడవిట్లలో పేర్కొన్న విధంగా హామీ పత్రం ఇవ్వనున్నారు. తాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని, గెలిచిన తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లబోమని ఈ అఫిడవిట్ ద్వారా అటు పార్టీకి, ఇటు ఆ ప్రాదేశిక నియోజకవర్గ ప్రజలకు అభ్యర్థులు హామీ ఇవ్వనున్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తానని, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంపీపీ లేదా జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేయబోనని, అలా చేసినట్టయితే తన నియోజకవర్గ పరిధిలోని ఎవరయినా తనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని అఫిడవిట్లో పొందుపరిచారు. ఈ అఫిడవిట్ న్యాయపరంగా కూడా చెల్లుబాటు అవుతుందని, భవిష్యత్తులో పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి పార్టీ మారినా, పార్టీ ఆదేశాలను పాటించకపోయినా న్యాయచర్యలకు దిగే విధంగా న్యాయ నిపుణులతో చర్చించిన మేరకు అఫిడవిట్లు తయారు చేశామని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. -
రాహుల్ అఫిడవిట్పై అనుమానాలు
అమేథీ/సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్హతలు, పౌరసత్వంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ పేర్కొంది. వీటిపై ఆయన వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. బ్రిటన్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నట్లు తెలిపే పత్రాలు రాహుల్ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనగా, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్స్లో ఎం.ఫిల్. చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్న రాహుల్ గాంధీ, ఆ తర్వాత డెవలప్మెంట్ స్టడీస్లో ఎం.ఫిల్.చేసినట్లు చెప్పడంపై అమేథీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధ్రువ్లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంపై బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ధ్రువ్లాల్ లాయర్తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాహుల్ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనే బ్రిటిష్ పత్రాలను లాయర్ మీడియాకు చూపారు. రాహుల్ గాంధీ 1994లో డిగ్రీ చేసి, 1995లో ఎం.ఫిల్. చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారని, డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎం.ఫిల్ ఎలా సాధ్యమన్నారు. ఆయనకే తెలియాలని విమర్శించారు. పైగా డెవలప్మెంట్ ఎకనామిక్స్ లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి, డెవలప్మెంట్ స్టడీస్లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి పేర్కొన్నారని విమర్శించారు. ఈ అనుమానాలపై వివరణ ఇచ్చేందుకు రాహుల్ లాయర్ సోమవారం వరకు గడువు కోరారని అమేథీ రిటర్నింగ్ అధికారి రామ్ తెలిపారు. -
నైతిక బాధ్యత కోసం అఫిడవిట్: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి నైతిక బాధ్యత కోసమే అఫిడవిట్ అడుగుతున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కూడా సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ అందరినీ నిర్వీర్యం చేసేలా కేసీఆర్ వ్యవహారశైలి ఉందన్నారు. మేము సెలక్ట్ అండ్ ఎలక్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.