bandla ganesh
-
బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తిరుపతి ప్రకాశ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఎన్నో చిత్రాల్లో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్ స్టార్ హీరోలైనా నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, బాలయ్య, మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్స్ అందరితో కలిసి పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్తో తప్ప దాదాపు అందరితో సినిమాలు చేశానని వెల్లడించారు. ప్రస్తుతం సీరియల్స్లో చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ కెరీర్లో తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు.తాను సినిమాల్లో నటించే రోజుల్లో బండ్ల గణేశ్, తాను ప్రాణ స్నేహితులమని ప్రకాశ్ తెలిపారు. ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించామని పేర్కొన్నారు. అయితే బండ్ల గణేశ్ నిర్మాత అయ్యాక ఆయన సినిమాల్లో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓ సినిమాకు డేట్స్ తీసుకుని నాకు అబద్ధం చెప్పారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.తిరుపతి ప్రకాశ్ మాట్లాడుతూ..'బండ్లగణేశ్ చేసిన ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఒక సినిమాకు డేట్స్ తీసుకున్నాడు. దాదాపు 60 రోజులు షూట్ ఉంటుందని చెప్పాడు. రోజుకు 15 వేల పారితోషికం ఖరారు చేసుకున్నా. దీంతో వేరే సినిమాలకు నో చెప్పా. వినాయకచవితి పండగ మరుసటి రోజే కేరళలోని పొల్లాచ్చికి వెళ్లాలి. కానీ షూట్కు బయలుదేరాల్సిన ముందురోజే నాకు ఫోన్ కాల్ వచ్చింది. భారీ వర్షాలతో షూట్ క్యాన్సిల్ చేశామని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు. దీంతో షాక్ తిన్నా. మూడు సినిమాలు వదిలేశా. మూడు నెలలు ఖాళీగా ఎలా ఉండాలని ఆలోచించా. సరిగ్గా పది రోజుల తర్వాత శ్రీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. వెంటనే రాజమండ్రికి వెళ్లా. అక్కడ రోలర్ రవి నన్ను కలిశాడు. ఏం ప్రకాశ్ అన్న మంచి సినిమా వదిలేశావ్ అన్నాడు. ఏ సినిమా అని అడిగా. కల్యాణ్ బాబు మూవీ అన్నాడు. వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని చెప్పా. కానీ నాకంటే తక్కువకే ఎవరో దొరికారని నన్ను తీసేసినట్లు తెలిసింది. అప్పుడు నాకు బండ్ల గణేశ్పై కోపం వచ్చింది. ఆ తర్వాత మా నాన్న చనిపోయారని ఫోన్ చేశాడు. అవును అని చెప్పి వెంటనే పెట్టేశా' అని అన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టాలీవుడ్ ప్రముఖుల్లో బండ్ల గణేశ్ ఒకరు. వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరుగుతున్న ఘటనలపై తనదైన శైలీలో స్పందిస్తుంటాడు. ముఖ్యంగా రాజకీయాలపై ఆయన చేసే ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి. 2018 తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ టికెట్ దక్కలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.(చదవండి: యానిమేటెడ్ సిరీస్ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ)2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ పొలిటికల్ ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగుడుతూ చాలా ట్వీట్స్ చేశాడు. ఇక నిన్న (నవంబర్ 8) సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే టాలీవుడ్కి చెందిన ప్రముఖుల్లో చిరంజీవితో పాటు ఒకరిద్దరు మాత్రమే రేవంత్కి విష్ చేస్తూ ట్వీట్స్ పెట్టారు. పలువురు స్టార్ హీరోలతో పాటు బడా నిర్మాతలు సైతం శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ విషయంపై బండ్ల గణేశ్ స్పందిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశాడు.‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బండ్ల గణేశ్ ట్వీట్పై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.🙏 @revanth_anumula anna @TelanganaCMO— BANDLA GANESH. (@ganeshbandla) November 9, 2024 -
మా జీవితాలను మార్చింది: హరీష్ శంకర్
‘‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్లీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేశ్కి, సత్యనారాయణకి థ్యాంక్స్. ‘గబ్బర్ సింగ్’ మా జీవితాలను మార్చేసిన సినిమా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం 2012 మే 11న విడుదలైంది. ఈ నెల 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘గబ్బర్ సింగ్’ డబ్బింగ్ సమయంలోనే ఈ మూవీ పక్కా బ్లాక్బస్టర్ అన్నారు పవన్ కల్యాణ్గారు. నా అభిమానులు కోరుకునేది ఇవ్వబోతున్నావ్’’ అన్నారు. ‘‘నన్ను నేను నమ్మలేని పరిస్థితిలో పవన్ కల్యాణ్గారు నమ్మి, నన్ను నిర్మాతగా నిలబెట్టారు. నేను, హరీష్, దేవిశ్రీ ప్రసాద్... అందరూ ప్రేమించి ఈ సినిమా చేశాం. ఏడేళ్లుగా నేను సినిమా తీయకపోవడం బాధగా ఉంది... మళ్లీ సినిమాలు తీస్తా’’ అన్నారు బండ్ల గణేశ్. డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రమేశ్రెడ్డి మాట్లాడారు. -
ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్..!
టాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Tollywood producer Bandla Ganesh has been admitted to Apollo Hospital and is currently undergoing treatment for chest pain! pic.twitter.com/dFH5wBTMcs— Madhu (@offlinemadhu) June 3, 2024 -
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఫిలింనగర్: తన ఇంట్లో అద్దెకు ఉంటున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఇచ్చిన పిర్యాదు మేరకు సినీ నిర్మాత బండ్ల గణేష్పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలివీ... నౌహిరా షేక్ ఫిలింనగర్లోని తన ఇంటిని నిర్మాత బండ్ల గణేష్కు నెలకు రూ. లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చింది.అయితే గత కొంతకాలంగా గణేష్ అద్దె ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. అతను ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని, గుండాల సహాయంతో, రాజకీయ నాయకుల అండతో ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. నౌహీరా ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు బండ్ల గణేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బండ్ల గణేష్ కొడుకు కొత్త వివాదం..
-
గుడ్లు అమ్ముకునే బండ్లపై గుదిబండ..
-
చెక్ బౌన్స్ కేసులో గణేశ్కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష
-
బండ్లగణేశ్కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు బండ్లగణేశ్కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. అంతే కాకుండా శిక్షతో పాటు బండ్లగణేశ్కు రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో ఆరునెలల జైలు శిక్ష గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. -
కల్వకుంట్ల కవితపై బండ్ల గణేష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?.. పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మండిపడ్డారు. ఎప్పుడైనా బీసీల గురించి మీరు మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్.. ఆపార్టీని విమర్శించొద్దు. సీఎం ప్రజల్లోకి వెళితే మీకు ఇష్టం ఉండదు. గేటు బయటే ఆపేసి బతికున్న గద్దర్ను చంపేశారు. ఆయన పేరుమీద కాంగ్రెస్ అవార్డులు ఇస్తుంది. జానారెడ్డి తప్పుకుని కుమారుడికి అవకాశం ఇచ్చారు. మంత్రులను డమ్మీలను చేసింది మీరు కాదా ?. లిక్కర్ స్కాంలో అక్రమ సంపాదన చేయలేదా ?’’ అని బండ్ల గణేష్ ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంతో రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసింది మీరు కాదా ?. బీసీల కోసం మీ త్యాగం అవసరం లేదు. ఎంపీగా ఓడిపోతే ఏడ్చి ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. మీ పార్టీ ఆఫీసుకు స్థలం ఇస్తే కొండా లక్ష్మణ్ బాపూజీని మీరు పట్టించుకున్నారా ? సీఎం కావాలని మీరు.. కేటీఆర్ ఆశపడ్డారు. అది సాధ్యం కాలేదని.. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ముందు లిక్కర్ స్కాం నుంచి బయటపడండి. రెస్ట్ తీసుకోండి...ఏం తప్పు చేశారో తెలుసుకోండి. ప్రెస్ మీట్లు బంద్ చేయండి.. అసహ్యించుకుంటున్నారు’’ అంటూ బండ్ల గణేష్ విమర్శించారు. జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?... పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశావు కవితమ్మ..? -- కాంగ్రెస్ నేత సినీనిర్మాత, బండ్ల గణేష్ Did you remember now to put up a statue of Jyoti Rao Phule? Kavitha, what did you do after being in the government for ten years?… pic.twitter.com/tMaGTOeYbi — Congress for Telangana (@Congress4TS) February 3, 2024 -
బర్రె కరిసిందా ?
-
ఒక్కరోజే వంద దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మేరకు పార్టీకి శుక్రవారం ఒక్కరోజే వంద దరఖాస్తులు అందాయి. శుక్రవారం గాం«దీభవన్కు వచ్చిన పలువురు నేతలు తమ దరఖాస్తులను అందజేశారు. మహబూబాబాద్, నాగర్కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ దర ఖాస్తులు రాగా, హైదరాబాద్లో తక్కువగా వచ్చా యి. దరఖాస్తు చేసుకున్న వారిలో సినీ నిర్మాత బండ్ల గణేశ్ (మల్కాజిగిరి), మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్కర్నూల్), ఎంఆర్జీ వినోద్రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్) పెరిక శ్యామ్ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్కర్నూల్తో పాటు జనరల్ స్థానమైన మల్కాజిగిరి కోసం 4 దరఖాస్తులు అందజేశారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఇప్పటివరకు 141 దరఖాస్తులు రాగా, శనివారం సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఖమ్మం బరిలో గడల, వంకాయలపాటి హాట్సీట్గా మారిన ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టికెట్ కోసం శుక్రవారం ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్లు దరఖాస్తు చేసు కున్నారు. గడల సికింద్రాబాద్ స్థానానికి కూడా దర ఖాస్తు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉండి, అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. అప్పట్లో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఇటీవలే రేవంత్ ప్రభుత్వం గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసింది. ప్రస్తుతం లాంగ్లీవ్లో ఉన్న ఆయన ఉన్నట్టుండి గాం«దీభవన్లో దరఖాస్తులివ్వడం గమనార్హం. మెజార్టీ స్థానాలు గెలుస్తాం: బండ్ల గణేశ్ మల్కాజిగిరి స్థానం నుంచి పోటీకి అవకాశం కల్పించాలని కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్రావుకు దరఖాస్తు ఇచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్ ..విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు. -
ఎంపీ టికెట్ల కోసం బండ్ల, గడల దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తుల్లో ఇవాళ ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి. నటుడు కమ్ సినీ నిర్మాత, కాంగ్రెస్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఎంపీ సీటు కోసం దరఖాస్తు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన స్థానం కోసమే ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ ఏకంగా నాలుగు సీట్లకు నాలుగు దరఖాస్తులు సమర్పించారు. మరోవైపు నాగర్కర్నూల్ టికెట్ కోసం మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమార్తె చంద్రప్రియ కూడా అప్లికేషన్ సమర్పించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి.. ఇదిలా ఉంటే.. గాంధీభవన్లో ఇవాళ సమర్పించిన దరఖాస్తుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసిన అంశం.. గడల శ్రీనివాసరావు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే రాజకీయాంశాలతో చర్చనీయాంశంగా మారారాయన. సీఎంగా ఉన్న కేసీఆర్ కాళ్లు కూడా మొక్కుతూ వార్తల్లోకి ఎక్కారు కూడా. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ఇప్పుడు.. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకుని మరోసారి ఆయన హాట్ టాపిక్గా మారారు. తన సన్నిహితుల ద్వారా గాంధీ భవన్ లో దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికల్లో పోటీ చేయకుండానే.. జంప్ జిలానీగా గడల మారినట్లు చర్చ నడుస్తోంది. -
బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..
హైదరాబాద్: తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు ఫోన్ చేసిన అర నిమిషంలోనే ఓ యువతి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... భద్రాద్రి జిల్లాకు చెందిన బానోతు చందన (25)రమణ దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్నారు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తుండగా చందన భీమా జ్యువెలర్స్లో సేల్స్ ఉమెన్గా పనిచేస్తుంది. సోమవారం ఉదయం ఇద్దరి మధ్య స్వల్ప గొడవ జరిగింది. రమణ డ్యూటీకి వెళ్లిగా మధ్యాహ్నం చందన ఇంటి నుంచే ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. రమణ వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చి డ్యూటీ నుంచి బయలుదేరాడు. యజమాని పైకి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరుచుకోకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లిచూడగా అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించింది. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
TS: బండ్ల గణేష్కు కీలక బాధ్యతలు!
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన సచివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ పూలమొక్కను బహుమతిగా అందించారు. ఈ ఫొటోలు ఎక్స్లో వైరల్ అవుతుండగా.. ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. బండ్ల గణేష్ మొదటి నుంచి కాంగ్రెస్ హార్డ్కోర్ అభిమాని. ఎన్నికల్లో ప్రత్యక్షంగా మద్ధతు ఇస్తూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పి మరీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కు గురయ్యారు. ఈసారి ఎన్నికలకు ముందు.. రెండు రోజుల ముందే ఎల్బీ స్టేడియంకు వెళ్లి పడుకుంటానంటూ ప్రకటించడంతో.. మరోసారి ట్రోలింగ్ మెటీరియల్ అవుతారేమోనని కొందరు భావించారు. కానీ, ఈసారి బండ్ల గణేష్ జోస్యం తప్పలేదు. తెలంగాణలో బీఆర్ఎస్కు చెక్ పెట్టి.. కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. కాంగ్రెస్తో పదవులేం ఆశించకుండా చిత్తశుద్ధితో ఒక కార్యకర్తగా పని చేస్తానని బండ్ల గణేష్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విధేయతకు మెచ్చి త్వరలో కీలక బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే.. సంక్రాంతిలోపు తెలంగాణలో ఖాళీలుగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. బండ్ల గణేష్కు ఏదైనా కార్పొరేషన్ అప్పజెప్పొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కార్పొరేషన్లలో వీలు కాకుంటే.. సినీ రంగానికి-తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా బండ్ల గణేష్కు సరికొత్త బాధ్యతలు అప్పగించవచ్చనే చర్చా నడుస్తోంది. ఇవేవీ కాకుంటే.. పార్టీ తరఫున అయినా ఆయనకు కీలక పదవి కచ్చితంగా దక్కవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే బండ్ల గణేష్ మాత్రం పదవులక్కర్లేదనని.. పార్టీ కోసం పని చేస్తానంటున్నారు. మరి బండ్ల గణేష్కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా?.. లేదా.. స్పష్టత రావాలంటే.. ఇంకా కొన్నిరోజులు ఆగాల్సిందే. -
బండ్ల గణేష్ డబ్బులు ఎగ్గొట్టాడు.. ఒక మనిషి చెప్పడంతో..: డైరెక్టర్
టాలీవుడ్ హీరో నితిన్ 32వ సినిమా 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' తాజాగా విడుదలైంది. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బండ్ల గణేష్తో ఆయనకు ఉన్న ఆర్థిక లావాదేవిల గొడవను తెరపైకి తెచ్చాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2015లో 'టెంపర్' చిత్రం విడుదలైంది. జూ ఎన్టీఆర్, కాజల్ జోడీగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి కథను డైరెక్టర్ వక్కంతం వంశీ అందిస్తే.. బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కించాడు. కానీ ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని వక్కంతం వంశీ అప్పట్లో కోర్టుకెక్కాడు. ఆ సమయంలో ఇదొక సెన్సేషన్ వార్తగా నిలిచింది. తాజాగా ఇదే విషయంపై వంశీ ఇలా మాట్లాడాడు. 'టెంపర్ సినిమా విడుదల సమయంలో ఒక తేది వేసి చెక్కు ఇచ్చాడు. తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది కాస్త బౌన్స్ అయింది. అప్పటికే సినిమా కూడా విడుదల కావడంతో నేను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నేను ఎవర్ని కలవాలి..? ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు. నాకు డబ్బు ఇవ్వకూడదనే అతనలా చేశాడని మాత్రం అర్థం అయింది. ఆ సమయంలో వాడికి (బండ్ల గణేష్) ఏ ఇబ్బంది ఉందో నాకు తెలియదు... వాడిని కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఆ సమయంలో నేను కోర్టుక వెళ్లక తప్పలేదు. ఈ విషయంలో పలుమార్లు కోర్టు చుట్టూ బాగా తిరిగాను. కొన్ని రోజుల తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్దమనిషి వద్దకు నేను వెళ్లాను. ఆయన చెప్పడం వల్లనే వాడు డబ్బులు సెటిల్ చేశాడు. ఆ తర్వాత నుంచి నాతో వాడు బాగానే ఉన్నాడు. వాడిపై నాకు కోపం ఏం లేదు. మోసం చేశాడనే బాధ ఉంది. కొన్ని రోజుల తర్వాత టెంపర్ హిందీ రైట్స్ అమ్మేందుకు వాడు,నేను ఇద్దరం ఒకే ఫైట్లో వెళ్లాం. ఇలా బండ్ల గణేష్ మాదిరి డబ్బు విషయంలో చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. కొందరు ఇప్పటికి కూడా ఇవ్వలేదు.' అని అన్నాడు. గతంలో కోర్టు ఏం చెప్పింది బండ్ల గణేష్పై వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఒక తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా బండ్ల గణేష్కు విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్కు షరతులతో కూడిన బెయిల్ను అప్పట్లో న్యాయస్థానం మంజూరు చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కూర్చోని ఈ డబ్బులు విషయాన్ని సెటిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. -
అప్పుడు బ్లేడు..ఇప్పుడు దుప్పటి..‘భజన’ గణేష్
బండ్ల గణేశ్ గురించి తెలుగు ప్రజలకు తెలిసిందే. కమెడియన్గా కెరీర్ ప్రారంభించి.. తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగాడు. కానీ తన నోటి దురుసుతో తన కెరీర్ని తానే నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. దీంతో చిత్ర పరిశ్రమను పక్కన పెటి.. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు. అయితే అక్కడ కూడా రోజుకో పార్టీ.. పూటకో మాట మారుస్తూ.. బండ్ల గణేశ్ కమెడియన్గానే మిగిలిపోయాడు. మొన్నటికి మొన్న టీడీపీకి జై కొడుతూ.. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన బండ్లన్న.. ఇప్పుడు కాంగ్రెస్ భజన చేస్తున్నాడు. తన బ్లడ్లోనే కాంగ్రెస్ పార్టీ ఉందని.. గాంధీభవన్ తన పుట్టిల్లు అంటున్నాడు. భనజ గణేశ్.. భజన చేయడంలో గణేశ్ని మించిన వాడు లేడు. స్టేజ్పై మైక్ దొరికితే చాలు.. ఊగిపోతుంటాడు. అయితే ఆ భజన అనేది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో చేస్తే బాగుండేది. కానీ బండ్లన్న మాత్రం పూటకో పార్టీని, రోజుకో నాయకుడిని పొగిడేస్తుంటాడు. ఒకసారి పవన్ కల్యాణ్ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు.. మరోసారి చంద్రబాబు కోసం జైలుకు వెళ్తా అంటాడు. ఇప్పుడేమో తుదిశ్వాస వరకు కాంగ్రెస్తోనే ఉంటానంటున్నాడు. అంతేకాదు తెలంగాణలో కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని జోస్యం చెబుతున్నాడు. అప్పుడు బ్లేడు..ఇప్పుడు దుప్పటి బండ్ల గణేశ్ రాజకీయ ఎంట్రీ గత అంసెబ్లీ ఎన్నికల్లోనే జరిగింది. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. పార్టీ కండువా కప్పుకోవడమే ఆలస్యం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, లేకపోతే తాను 7 O’clock బ్లేడుతో గొంతు కోసుకుంటానని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. చివరకు గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాజయం ఎదురవ్వడంతో సైలెంట్ అయ్యాడు. అంతేకాదు తనకు రాజకీయాలు పడవని.. ఇక నుంచి పాలిటిక్స్కు దూరంగా ఉంటానని ప్రకటించాడు. కానీ మన బండ్లన్నకు మాటలు మార్చడం ఎంతసేపు? ఎన్నికల ప్రకటన రాగానే.. మళ్లీ రాజకీయల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తను పక్కా కాంగ్రెస్వాదినని.. గాంధీ భవన్ తన పుట్టినిల్లు అంటున్నాడు. అంతేకాదు ఈ సారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెబుతున్నాడు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని.. 7వ తేదినే తాను ఎల్బీ స్టేడియంకి వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకుంటానని అంటున్నాడు. మరి మీ దేవుడు పవన్ కల్యాణ్ పార్టీ కూడా పోటీ చేస్తుంది కదా? మద్దతు ఇవ్వరా అంటే.. అస్సలు ఇవ్వనని చెబుతున్నాడు. పవన్ అభిమానినే అయినా.. ఆయన పార్టీకి మాత్రం తాను మద్దతు ఇచ్చేదే లేదు అని తెగేసి చెబుతున్నాడు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసి.. బండ్ల.. ఓ పొలిటికల్ కమెడియన్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
స్టేజీపై బాగా నటించావ్.. శభాష్ బండ్ల గణేష్!
తెలుగు ఇండస్ట్రీలో నవ్వు పుట్టించగల ఎక్స్ట్రీమ్ కేరక్టర్లు బోలెడు మంది ఉన్నారు.. కానీ వారందరిలో బండ్ల గణేష్ చాలా స్పెషల్. సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. రంగం ఏదైనా సరే వివాదాల్ని ఇలా రేపడం, అలా వాటిని వదిలేయడం బండ్ల గణేశ్కు బట్టర్తో పెట్టిన విద్య. ఒక్కోసారి బండ్ల వ్యాఖ్యలు విన్నవారు చిన్నప్పుడే చిప్ కొట్టేసిందా, లేక చిప్ లేనేలేదా అంటూ కామెంట్లు చేస్తుంటారు. డేగల బాబ్జీకి ఇవన్నీ చాలా కామన్ ఎప్పుడైనా వేదిక ఎక్కినప్పుడు ఆయన చేసే ప్రసంగాలు చూస్తే, వింటే ఇండస్ట్రీ మీదే జాలేస్తుంది. ఎందుకంటే.. ఎలా భరించారో ఇలాంటి కమెడియన్ని అని. అంతెందుకు..? తను ఎంత సీరియస్గా మాట్లాడినా కూడా మీడియా ఓ జోకర్గానే పరిగణిస్తుంది. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు తనంతట తను నెత్తిమాశిన ట్వీట్లు వేసి, నెటిజన్లతో తిట్లు తింటుంటాడు. పాఫం, కొన్నాళ్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కూడా ఉద్దరించినట్టున్నాడు. పార్టీ కండువా కప్పుకోవడమే ఆలస్యం.. తమ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, లేకపోతే తాను 7 O’clock బ్లేడుతో గొంతు కోసుకుంటానని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్గా అప్పుడు నిలిచాడు. తీరా ఎన్నికల్లో ఓడిపోయాక, ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు బండ్ల. అప్పట్నుంచే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. పూర్తిగా రాజకీయాలకు గుడ్బై చెప్పేస్తున్నానని బండ్ల గణేష్ ట్విటర్(ఎక్స్) మాధ్యమంగా అప్పట్లో ప్రకటించాడు. తర్వాత తనకు కేవలం సినిమాల మాత్రమే తెలుసని వాటి మీదనే ఇకనుంచి దృష్టి పెడుతానని చెప్పాడు. కానీ మనోడి గురించి తెలిసిందే కదా పెద్ద కమెడియన్ పీస్ అని.. కనీసం ఏ కుర్ర హీరో కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో చేసేది ఏమీ లేక స్వీయ నటనతో 'డేగల బాబ్జీ' అనే ఒక తలమాశిన సినిమా తీసి ప్రేక్షకులపైన పగతీర్చుకున్నాడు. అలా సినిమాతో పాటు రాజకీయం కూడా ఫుల్స్టాప్ పడింది. భజనకు కేరాఫ్ బండ్ల భజన చేయడంలో బండ్లను మించినవాడు లేడు. స్టైజ్పై మైకు దొరికితే చాలు.. ఊగిపోతుంటాడు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో టీడీపీ ఏర్పాటు చేసిన ఒక సభలో 7 O’clock బ్లేడు లాంటి డైలాగ్లతో పాటు ఆస్కార్ను మించేలా నటించాడు. లేదు.. లేదు.. చంద్రబాబు కోసం గుక్కపెట్టి ఏడ్చాడు. అసలే బండ్ల పెద్ద కమెడియన్ అని తెలిసిందే.. ఆయనకు ఏడుపు ఎలా కనెక్ట్ అవుతుంది. అందుకే బండ్ల ఏడుస్తున్నా అక్కడ కూర్చొని ఉన్న వారందరీ ఫేసుల్లో నవ్వులు కనిపించాయి. తాజాగా ఆయన చంద్రబాబు కోసం చచ్చిపోతా.. ఆయనకు కమీషన్గా రక్తాన్ని ఇస్తా అంటూ తన కేరక్టర్కు ఏ మాత్రం సెట్ కాని వ్యాఖ్యలు చేశాడు.. గతంలో 7 O’clock బ్లేడుతో కోసుకుంటా అన్నాడు. ఒక్కోసారి పవన్ కల్యాణ్ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు. జూ ఎన్టీఆర్ కోసం ప్రాణాలకు తెగిస్తా అంటాడు. ఇన్నన్నీ సార్లు ఈ వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేస్తాడంటే వీరందరి నుంచి ఏదో ఒక లబ్ధి పొందేందుకే అని తెలిసిందే. ఈ భజన కేరక్టర్ గురించి తెలిసే జూ. ఎన్టీఆర్ ఎప్పుడో పక్కన పెట్టేశాడు. ఇక తనకు మిగిలింది పవన్,బాబు అండ్ కో బ్యాచ్ మాత్రమే.. వారిని ఇలా ప్రసన్నం చేసుకునేందుకే ఇలా దొంగ జపం చేస్తున్నాడు. బండ్లన్న కోళ్ల వ్యాపారం కోసం గతంలో చంద్రన్న అండగా నిలబడ్డాడట. ఆ రెస్పాన్సిబిలిటీతోనే బండ్ల ఇప్పుడు ప్రాణాలైనా ఇస్తానంటూ చంద్రబాబు గ్రాట్యుటీ చూపిస్తున్నాడని టాక్. రేపు ఎవరన్నా ఒక మంచి ఆఫర్ ఇస్తే ' నవ్వుతానే ఊరుకోండి సార్ స్టేజీపైన పూనకంతో ఎన్నో అంటుంటాం ఛీ.. ఛీ చంద్రబాబు కోసం నేను ప్రాణాలు ఇవ్వడం ఏంటి అనేస్తాడు.. అలాంటి కల్లర్స్ ఉన్న వూసరవెల్లి అని తెలిసిందే. తారక్, రవితేజ, పూరి ఆ లిస్ట్లో ఎందరో తన జీవితంలో ఎప్పుడూ రెండు నాల్కల ధోరణి చూపించే బండ్ల గణేశ్.. గతంలో తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులను తిట్టినతిట్టూ లేకుండా వాగాడు.. ఎప్పుడైతే తన రాజకీయం బెడిసికొట్టిందో వెంటనే వారందరినీ ఎడాపెడా పొగిడేశాడు. సినిమా ఇండస్ట్రీలో రవితేజ, పూరి జగన్నాథ్ను మోసం చేశానని చెప్పుకొచ్చాడు. టెంపర్ సినిమా సమయంలో తారక్తో రెమ్యునరేషన్ గొడవ కూడా అప్పట్లో వైరల్ అయింది. తర్వాత అన్నదమ్ముల మధ్య ఇలాంటివి సహజం అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తారక్ 'దేవర' సినిమా ప్రకటించిన తర్వాత ఆ టైటిల్ తనదని ఒక ట్వీట్ పడేశాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ బండ్లపై పెద్ద వార్కు దిగారు. ఆ దెబ్బకు తారక్ నాకు కూడా దేవరే అంటూ వారిని బతిమాలి ఆ గొడవ నుంచి బయటపడ్డాడు. ఇలా ఆయన జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బండ్ల గణేశ్ గ్యారేజీలోకి చంద్రబాబు వచ్చి ఆగాడు అంతే తేడా..! -
బండ్ల బాజాతో మూడు గుళికలు.. ఎంత ఊదినా అంతే!
తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్ను ఏదో చేసి 25 సంవత్సరాలైందని గచ్చిబౌలి స్టేడియంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో మామూలు సభలకే జనాలు రావడం లేదు. అలాంటిది ఈ సభకు జనాలను తరలించడంలో మ్యూజికల్ నైట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మొత్తానికి కాస్త జనాలను రప్పించారు నిర్వాహకులు. ఇదే సభలో ఏతా వాతా లేని టాలీవుడ్ నిర్మాత అయిన బండ్ల గణేష్ చంద్రబాబు గురించి బాకా ఊదుతూ ఓ రెండు, మూడు బ్రాండింగ్ గుళికలను వదిలారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. వాటిలో మొదట ప్రముఖంగా చెప్పుకోదగినది బండ్లగణేష్ చేసిన విచిత్ర ప్రతిపాదన.. అదే ఖైదీ మార్పిడి... అదేంటని విస్తుపోయారా? మీరే కాదు సభలో ఉన్న వారితో పాటు ఈ విషయం విన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుకు బదులు తనను జైల్లో పెట్టమని అభ్యర్ధించాడు. చంద్రబాబు వీరాభిమానిగా చెప్పుకుని బాకాలూదే బండ్ల గణేశుడు. జైల్లో పెట్టడం సరే అభిమానంతో అన్నాడని అనుకోవచ్చు. కానీ ఆ తరువాత అన్న మాటే విన్న వారందరూ విస్తుపోయారు. తనను జైల్లో పెట్టినా నా భార్య ఏమీ అనుకోదు అని గొప్ప గుళిక వదిలారు బండ్ల గణేశ్. ఇక బండ్ల గణేష్ వదిలిన రెండో గుళిక ఏంటంటే.. ఊర్లలో ఉన్న వాళ్లందరూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబులకు వెళ్తూ ఉంటే మన బండ్లకు కడుపు తరుక్కుపోయిందట. ఎందుకంటే చంద్రబాబు అనే వాడు లేకపోతే సాఫ్ట్వేర్ అనేది లేకుండా లక్షలాది మందికి ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చేవి కాదట. అసలు హైదరాబాదే ఉండేది కాదంట. అంతేకాదు వీరందరికీ చంద్రబాబు ఆదర్శప్రాయుడని బాగా బజాయించాడు బాకాలూదే బండ్లగణేశుడు. చిట్టచివరి బండ్ల గుళిక ఏంటంటే... మహానటి సినిమా మీకందరికీ గుర్తు ఉండే వుంటుంది. ఆ సినిమా మొదట్లో దర్శకుడు సావిత్రి వేషధారికి ఓ సన్నివేశం వివరిస్తూ ఈ సీన్లో ఓ కంట మాత్రం కన్నీరు రావాలి అని చెబితే మహానటి సావిత్రి ఆ సన్నివేశంలో ఓ కంట మాత్రం కన్నీరు కార్చి యూనిట్ సభ్యులనందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విధంగా చంద్రబాబు సభలో బండ్ల గణేష్ ఆవేదనతో గొంతు వణుకుతూ తన ఏడుపును వినిపించాడు కాని కనిపించలేదు. అదేమిటి ఏడుపు కనిపించలేదు అనుకుంటున్నారా? మీరే చెప్పండి ఎదుటి వ్యక్తి ఏడుస్తున్నాడు అని మనం ఎప్పుడు అనుకుంటాం? వచ్చే కన్నీళ్లని బట్టి అని కచ్చితంగా ఎవరైనా చెప్తారు. కాని మన నటనిర్మాత అయిన బండ్ల గణేష్ తన ఏడుపును గొంతుతోనే వినిపించి కంట చుక్క కన్నీరు కూడా కనిపించకుండా చేసిన ఆయన నిజంగా మహానటుడు. ఆఖరుగా ఒక్క మాట బండ్ల బాకా ఊదినా.. గచ్చిబౌలిలో గోల రేగినా.. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబు మీద జనాలకి వచ్చేది సింపతీకాదు, సీ(చి)రాకు మాత్రమే. -
కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పార్టీలో భారీ చేరికలు నెలకొన్ని నేపథ్యంలో పార్టీ గెలుపుపై హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సినీ నిర్మాత బండ్ల గణేష్కు కీలక స్థానం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. సినీ నిర్మాత బండ్ల గణేశ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా, కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం సినీ నిర్మాత బండ్ల గణేశ్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ఒక టికెట్ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆయన పేరును కూకట్పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు అధిష్ఠానం ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో, కూకట్పల్లిలో ఆయన బరిలో నిలుస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం విషయంలో పొంగులేటి, తుమ్మల మధ్య చర్యలు కొనసాగుతున్నట్టు సమాచారం. నిన్న రాత్రి జానారెడ్డి ఇంట్లో భేటీ అయిన ఇంఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, తుమ్మల నాగేశ్వరరావు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదురి. ఇదిలా ఉండగా.. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో నేడు 60 నుంచి 70 స్థానాలకు కమిటీ సీట్లు ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: అసమ్మతిపై హస్తం ముందుచూపు -
తానా సభల్లో తన్నులాట.. బండ్ల గణేష్ సీరియస్ రియాక్షన్
అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం Telugu Association of North america (TANA, తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరిగింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, ఈ ఘటనపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ఈ క్రమంలో టీడీపీ లీడర్లపై ఫుల్ సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన బండ్ల గణేష్.. ‘తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా.. సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పట్టా కష్టాన్ని గంగలో కలిపారు నిచుల్లారా 😡 https://t.co/R06P8Gq7bK — BANDLA GANESH. (@ganeshbandla) July 9, 2023 సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ 😡😡 https://t.co/R06P8Gq7bK — BANDLA GANESH. (@ganeshbandla) July 9, 2023 చదవండి: US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం? తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి పొలిటికల్ కామెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే, తాను రాజకీయాల్లో లేనంటూనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన మళ్లీ పొలిటికల్గా యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, భట్టి పాదయాత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో పాల్గొననున్నట్లు బండ్ల గణేశ్ తెలిపారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో ‘అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అని బండ్ల గణేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అన్నా వస్తున్నా అడుగులో అడిగేస్తా చేతిలో చెయ్యేస్తా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్… https://t.co/ZTmWiMcCaL — BANDLA GANESH. (@ganeshbandla) June 25, 2023 ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్.. ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ -
త్రివిక్రమ్పై బండ్ల గణేష్ సంచలన ట్వీట్!
కమెడియన్గా, నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. ఆయన పెట్టే పోస్టులు ప్రతిసారి నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఒక వ్యక్తిని పొగడాలన్నా లేదా విమర్శించాలన్నా.. ట్వీటర్ని ఆయుధంగా వాడతారాయన. ఆ మధ్య డైరెక్టర్ హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక తన ట్విటర్ అస్త్రాన్ని త్రివిక్రమ్పై ప్రయోగించాడు బండ్లన్న. అయితే అక్కడ త్రివిక్రమ్ పేరుని ప్రస్తావించకపోయినా.. ‘గురుజీ’ అంటూ పరోక్షంగా ఆయన్ను విమర్శించారు. (చదవండి: అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా!) అసలు విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బండ్ల గణేశ్ తాజాగా ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది’ అని ట్వీట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్గా మారింది. ‘గురూజీని కలవండి. ఖరీదైన బహుమతులు ఇవ్వండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక మరో నెటిజన్ ‘గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్క్రీన్ప్లే రాసి అసలు కథను షెడ్కు పంపిస్తాడని టాక్ ఉంది. నిజమేనా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా బండ్ల తనదైన శైలీలో స్పందించాడు. . ‘‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ను చాలామంది గురూజీ అని పిలుచుకుంటారు. దీంతో బండ్ల ట్వీట్ త్రివిక్రమ్ను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ 😝 https://t.co/P6J844y0fa — BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023 -
దేవర టైటిల్ నాదే.. కొట్టేశారు: బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
యంగ్ టైగర్ జూనియర్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ‘దేవర’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారనే టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దీంతో దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ చేసిన నెట్టింట్లో వైరలవుతోంది. ఆ టైటిల్ను కొట్టేశారంటూ ఆరోపిస్తూ ఆయన ట్వీట్ చేశారు. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) అయితే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ను మూవీ యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పేరునే ఖరారు చేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో తారక్ అభిమానులు సైతం ఈ పేరుతో ఇమేజ్లు తయారు చేసి షేర్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. బండ్ల గణేశ్ ట్వీట్లో రాస్తూ..'దేవర అనే టైటిల్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్ను కొట్టేశారు' అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే’ అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు టైటిల్ ఏదో తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?) దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34 — BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023 -
రాజకీయాల్లోకి రీఎంట్రీ? కన్ఫర్మ్ చేసిన బండ్ల గణేశ్
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం చాలా కష్టం. గతంలో రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన బండ్ల గతేడాది అక్టోబర్లో పాలిటిక్స్కు గుడ్బై చెప్తున్నట్లు ప్రకటించాడు. కుటుంబ బాధ్యతల వల్ల రాజకీయాలకు దూరమవుతున్నట్లు వెల్లడించాడు. పలు ఇంటర్వ్యూలలోనూ పాలిటిక్స్కు దూరంగా ఉంటానని కుండ బద్ధలు కొట్టిన ఆయన తాజాగా ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు బండ్ల గణేశ్ వరుస ట్వీట్లు చేశాడు. మొదటగా 'రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం..' అంటూ అభిమానుల్లో ఆసక్తిని రేపాడు. తర్వాత కాసేపటికే 'నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా' అంటూ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు. మరో ట్వీట్లో 'బానిసత్వానికి బైబై, నిజాయితీతో కూడిన రాజకీయాలకు జైజై.. రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం.. నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం 🔥🔥🔥🔥 — BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023 నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా 🔥 — BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023 రాజకీయాలంటే పౌరుషం.. రాజకీయాలంటే శ్రమ.. రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి, రావాలి. అందుకే వస్తా!' అని రాసుకొచ్చాడు. దీంతో బుర్ర గోక్కుంటున్న నెటిజన్లు 'ఇలా యూటర్న్ తీసుకున్నావేంటన్నా?', 'ఇంతకీ ఏ పార్టీలో చేరాలనుకుంటున్నావో.. ముందు అది చెప్పు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బండ్ల గణేశ్ ట్వీట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా🔥🔥🔥🔥🔥 — BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023 ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్సింగ్, టెంపర్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో హిట్ చిత్రాల నిర్మాతగా పేరు సంపాదించాడు బండ్ల గణేశ్. నటుడిగానూ పలు సినిమాలతో సత్తా చాటిన ఆయన చివరగా డేగల బాబ్జీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. చదవండి: లైగర్ నష్టాలతో నిరవధిక దీక్ష.. స్పందించిన చార్మీ -
వదినగా మీరున్నందుకు చాలా సంతోషం: బండ్ల గణేశ్
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. మెగా ఫ్యామిలీ పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. తాజాగా ఇవాళ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బండ్ల గణేశ్. ఈ మేరకు తన ట్విటర్లో చిరంజీవి దంపతుల ఫోటోను షేర్ చేశారు. బండ్ల గణేశ్ తన ట్విటర్లో రాస్తూ..'సీతాదేవి అంత ఓర్పు. భూదేవంత గొప్పతనం. లక్ష్మీదేవి లాంటి నవ్వు. రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా.. వజ్రం లాంటి బిడ్డకు తల్లిగా.. ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం. ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరున్ని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సురేఖ , చిరంజీవి దంపతులు ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సీతాదేవి అంత ఓర్పు భూదేవంత గొప్పతనం లక్ష్మీదేవి లాంటి నవ్వు రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా, వజ్రంలాంటి బిడ్డకు తల్లిగా, ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం.. ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరున్ని మనసారా కోరుకుంటూ.. @KChiruTweets pic.twitter.com/OWf6Gw69KY — BANDLA GANESH. (@ganeshbandla) February 18, 2023 -
బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్.. ఆ స్టార్ డైరెక్టర్ను ఉద్దేశించేనా?
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. కమెడియన్గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుసుకున్న బండ్ల గణేష్ తన స్పీచులతోనే సపరేట్ ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకున్నాడు. ఏ అంశంపైన అయినా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా బయటపెడుతుంటాడు. అలా తరచూ తన ట్వీట్స్తో ఆటం బాంబ్స్ పేలుతుంటాడు. ఈ క్రమంలో తాజాగా బండ్ల చేసిన ఓ ట్వీట్ నెట్టింట హాట్టాపిక్గా నిలిచింది. ఆయన చేసిన ఈ ట్వీట్ ఓ స్టార్ డైరెక్టర్ ఉద్దేశించేనా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ బండ్ల చేసిన ట్వీట్ ఏంటంటే.. ‘మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడుగానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా’ అంటూ ఫైర్ ఎమోజీని జత చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే బండ్ల ఎవరి మీదో ఫుల్ ఫైర్లో ఉన్నాడని అర్థమవుతుందో. ఇక ఆయన ట్వీట్పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు కదా? అన్న అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ మధ్య నటుడు పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ ఈవెంట్కు బండ్ల గణేష్ను పిలవలేదని, దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తనని మూవీ ఫంక్షన్కు రాకుండా అడ్డుకున్నారంటూ బండ్ల గణేష్ మాట్లాడినట్టుగా ఓ ఆడియో లీక్ కాగా.. అది తనది కాదని బండ్ల అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు. మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడు గానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా..🔥 — BANDLA GANESH. (@ganeshbandla) February 16, 2023 -
ప్రొద్దుటూరు కోర్టుకు బండ్ల గణేష్
ప్రొద్దుటూరు క్రైం : చెక్బౌన్స్ కేసుకు సంబంధించి సినీ నిర్మాత బండ్లగణేష్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వర్గాలు తెలిపిన మేరకు బండ్లగణేష్పై ప్రొద్దుటూరు కోర్టులో చెక్బౌన్స్ కేసులు ఉన్నాయి. వీటిలో ఒక కేసుకు సంబంధించి బుధవారం ఆయన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. తిరిగి ఈ కేసు విచారణ ఈ నెల 22కు వాయిదా పడినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. -
సూసైడ్ చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: 2018లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సేవనో క్లాక్ బ్లేడ్తో గొంతు కుసుకుంటానని చెప్పి వార్తల్లో నిలిచిన సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. తాజాగా తాను సూసైడ్ చేసుకునే వాడినని కామెంట్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి లేకపోతే తాను చనిపోయే వాడినని అన్నారు. ఎన్నో విధాలుగా తనకు అండగా నిలిచిన ‘నా అన్న, నా దేవుడి వెంట ఎప్పుడూ ఉంటా’.. రాజకీయాలు పక్కనపెట్టి రంజిత్ రెడ్డి కోసం పనిచేస్తానని బండ్ల గణేష్ అన్నారు. చదవండి: కాల్ గర్ల్ కోసం వెతికి వెతికి.. అడ్డంగా బుక్కయ్యాడు కాగా, కాంగ్రెస్ తరఫున 2018లో ప్రచారం చేసిన బండ్ల గణేష్.. ‘‘2018, డిసెంబర్ 11 ఉదయం 11 గంటల తర్వాత నా ఇంటికి రండి. వచ్చేటప్పుడు సేవనో క్లాక్ బ్లేడ్ తీసుకురండి. ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోతే.. బ్లేడ్తో నా పీక కోసుకుంటా. ఇదే నా ఛాలెంజ్. హెడ్ లైన్స్లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్ గా వేసుకుంటారో" అంటూ బండ్ల గణేష్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మహా కూటమి ఓటమి పాలైంది. సినీ నిర్మాతగా గుర్తింపు పొందిన ఆయన.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇక తాను ఏ పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు. -
అలా చేస్తే ధమాకా ఒక్కరోజే ఆడేది: బండ్ల గణేశ్ కామెంట్స్ వైరల్
మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘ధమాకా. ఈనెల 23న విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత బండ్ల గణేశ్ రవితేజపై ప్రశంసల వర్షం కురిపించాడు. రవితేజను పొగుడుతూ సక్సెస్ మీట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. టాలీవుడ్లో 12 మంది దర్శకులను పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ అని కొనియాడారు. నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. 'ధమాకా వేడుకకు నేను వస్తానని ముందే ఫోన్ చేసి చెప్పి మరీ వచ్చా. ఇప్పటివరకు ఆస్తమించిన రవిని చూశాం. ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి నేను మాట్లాడుదామని వచ్చా. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. నేను రవితేజ ఫ్యాన్ అని చెప్పుకోవాలంటే గర్వం ఉండాలి. 12 మంది దర్శకులను టాలీవుడ్కు పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ. అదృష్టం కలిసొచ్చిన వాళ్లు సూపర్స్టార్లు, మెగాస్టార్లు అవుతారు. పదేళ్లయినా రవితేజ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. కొంతమంది రవితేజ పని అయిపోయిందనుకుంటారు. ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. ఆయన ఒక అరాచకం. రవితేజను చూస్తే నల్లమల అడవుల్లో నిగనిగలాడే నల్లతాచులా ఉన్నాడు. ఫుట్బాల్లో అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ, క్రికెట్లో విరాట్ కోహ్లీలా రవితేజ వన్మ్యాన్ షో చూపించాడు. దటీజ్ రవితేజ. ఎప్పుడేం చేయాలో, ఎవరిని ఎప్పుడు పైకి తేవాలో తెలిసిన వ్యక్తి రవితేజ. ధమాకాలో ప్రతి ఫ్రేమ్లోనూ ఆయన అద్భుతంగా కనిపించాడు.' అని ఉద్వేగభరితంగా ప్రసంగింంచారు. -
CM Jagan Birthday: సీఎం వైఎస్ జగన్కు నాగార్జున, విశాల్ బర్త్డే విషెస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 21). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ సీఎం జగన్కు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Wishing dear @ysjagan garu a very happy birthday!!May you be blessed with health and happiness always!!💐 #HBDYSJagan — Nagarjuna Akkineni (@iamnagarjuna) December 21, 2022 కోలీవుడ్ హీరో విశాల్, టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా సీఎం జగన్కు బర్త్డే విషెస్ చెప్పారు. భగవంతుని ఆశిస్సులు వైఎస్ జగన్ గారికి ఉండాలని విశాల్, బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. Wishing AP CM Mr Jagan Mohan Reddy a Very Happy Birthday, God Bless #HBDYSJagan pic.twitter.com/2gym8Mr2EH — Vishal (@VishalKOfficial) December 21, 2022 Andhra Pradesh chief minister @ysjagan garu a very happy birthday!!May you be blessed with health and happiness always!!💐 #HBDYSJagan pic.twitter.com/q88XIbOZtN — BANDLA GANESH. (@ganeshbandla) December 21, 2022 సీఎం జగన్కు మోహన్ బాబు శుభాకాంక్షలు ఏపీ సీఎం జగన్కు ప్రముఖ నటుడు మోహన్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘షిర్డీ సాయి బాబా ఆశీర్వాదం తో జగన్ కు మంచి ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. Wishing Sri. @ysjagan many returns of the day May Shirdi Sai Baba’s blessing give him good health and happiness. — Mohan Babu M (@themohanbabu) December 21, 2022 -
తండ్రి మాట వినకపోతే అల్లుఅర్జున్ లా అవుతారు : బండ్ల గణేష్
-
తండ్రి మాట వినకపోతే బన్నీలా అవుతారు, బండ్ల వీడియో వైరల్
వివాదాలతో సావాసం చేసే సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. తాజాగా అల్లు ఫ్యామిలీ మీద ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొన్న బండ్ల గణేశ్ అల్లు బాబీతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ.. 'అందరికీ చెప్తున్నా, తండ్రి మాట వినొద్దు. తండ్రిని గౌరవించి ఆయన మాట వింటే మా బాబీగారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తే బన్నీగారిలా అవుతారు. బాబీగారిలా అవ్వాలా? బన్నీగారిలా అవ్వాలా? అనేది మీరే నిర్ణయించుకోండి' అన్నాడు. 'బాబీ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని మామూలుగా ఇలా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ పోయిన బన్నీ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. దయచేసి తండ్రి మాట వినొద్దు, సొంత నిర్ణయాలు తీసుకోండి. తండ్రి మాట విన్న బాబీని చూడండి, వినని బన్నీని చూడండి' అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బాబీ పాజిటివ్గా తీసుకుని సరదాగా నవ్వాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతుంగా నెటిజన్లు బండ్ల గణేశ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. పబ్లిక్లో ఏది పడితే అది వాగేయడమేనా? కాస్తైనా కామన్సెన్స్ ఉండక్కర్లా, దీన్నే నోటిదురుసు అంటారు, ఒకరిని కించపరిచేలా మాట్లాడటం నీకు సరదాగా ఉందా? ఏది పడితే అది వాగడం తగ్గించుకుంటే మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే.. తండ్రి మాట వినలేదని బన్నీ నీకొచ్చి చెప్పాడా? నోటికొచ్చినట్లు వాగుతున్నావ్ అంటూ బండ్ల గణేశ్ను ఏకిపారేస్తున్నారు. చదవండి: క్రికెటర్తో లవ్, ఇప్పుడు మాటల్లేవన్న నటి పాత ఇల్లు కొని సొంతింటి కల సాకారం చేసుకున్న కమెడియన్ -
రాజకీయాల వల్ల జీవితంలో చాలా నష్టపోయాను : బండ్ల గణేష్
నిర్మాత,నటుడు బండ్ల గణేష్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. కమెడియన్గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుసుకున్న బండ్ల గణేష్ మాట్లాడే స్పీచుకలే సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇక ఆయన చేసే ట్వీట్స్ కూడా ఆటం బాంబ్స్లా పేలుతుంటాయి. తాజాగా బండ్లగణేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఇటీవలె రాజకీయాలకు గుడ్డై చెప్పిన బండ్ల.. తాజాగా పాలిటిక్స్ వల్ల జీవితంలో చాలా నష్టపోయానని తెలిపారు. తనకు రాజకీయాలతో, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, అందరూ ఆత్మీయులే అంటూ ట్వీట్ చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీలో బండ్ల గణేష్.. కొంతకాలం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు తనకు సంబంధం లేదంటూ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. -
బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. ఇక రాజకీయాలకు గుడ్ బై
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా, బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా.. ‘నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, 2018లో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….2 — BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022 …..అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..🙏 — BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022 -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో ఆదిశేషగిరిరావు ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ క్లబ్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మరోసారి ఎఫ్ఎన్సీసీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్పై తుమ్మల రంగారావు విజయం సాధించారు. ప్రతీ రెండేళ్లకోసారి ఫిల్మ్ నగర్ క్లబ్కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మొత్తం 4 వేల 600మంది సభ్యులున్న ఈ సెంటర్లో 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లుఅరవింద్ , సురేష్ బాబు, కేఎల్ నారాయణ ప్యానెల్లోని సభ్యులే గెలుపొందారు. చదవండి: (డాటర్స్ డే స్పెషల్.. కూతురికి మహేశ్ స్పెషల్ విషెష్) -
తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు: రౌడీ హీరోకు బండ్ల కౌంటర్?!
విజయ్ దేవరకొండ బాక్సర్గా నటించిన చిత్రం లైగర్. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. రౌడీ హీరో భారీ కటౌట్ పెట్టి దానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నానా రచ్చ చేశారు. అటు సోషల్ మీడియానూ లైగర్ హ్యాష్ట్యాగ్తో ఓ ఊపు ఊపారు. అభిమానుల హడావుడి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విజయ్ మెంటల్ మాస్ స్పీచ్ ఇచ్చాడు. 'మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే మూవీ కాదు. అయినా ట్రైలర్కు ఈ రచ్చ ఏందిరా నాయన..' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే విజయ్ టాలీవుడ్లో మెగా హీరోలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా బండ్ల గణేశ్ దీనికి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్లా, మహేశ్బాబులా, రామ్చరణ్లా, ప్రభాస్లా.. గుర్తుపెట్టుకో బ్రదర్' అని ట్వీట్ చేశాడు. అయితే కొందరు ఇది రౌడీ హీరోకు కౌంటర్ ఇచ్చినట్లు ఉందని అంటుంటే మరికొందరు మాత్రం ప్రభాస్, రామ్చరణ్, మహేశ్బాబు, ఎన్టీఆర్లను విమర్శించినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅 — BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022 చదవండి: తెలుగు సినిమాలకు అవార్డుల పంట ఆడపిల్లకు జన్మనిచ్చిన నటి -
చీప్గా వాగొద్దు.. బండ్ల గణేశ్కు పూరీ జగన్నాథ్ కౌంటర్!
ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు, హీరో ఆకాశ్ పూరీ నటించిన తాజా చిత్రం చోర్ బజార్. జూన్ 24న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు పూరీ జగన్నాథ్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే! దీంతో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ వేదికపైనే పూరీపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దేశం మొత్తం కల్లాపు చల్లాడు. కానీ, ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదు, కన్న కొడుకు ఫంక్షన్కు వచ్చేంత టైం లేదా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా దీనిపై పూరీ జగన్నాథ్ పరోక్షంగా స్పందించాడు. 'గుర్తుపెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే లైఫ్లో ఎక్కువ టైం లిసనర్స్(వింటూ ఉంటే)గా ఉంటే చాలు. మీ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ జనాలు, ఆఖరికి కట్టుకున్న పెళ్లాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్గా వాగొద్దు, చీప్గా ప్రవర్తించొద్దు. మన వాగుడు మన కెరీర్ను, మన క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుంది. సుమతీ శతకం మీకు గుర్తుండే ఉంటుంది. నొప్పింపక తానొవ్వక.. తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ! తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. ఫైనల్గా ఓ మాట.. నీ బతుకు, నీ చావు నాలుక మీదే ఆధారపడి ఉంటుంది' అంటూ యూట్యూబ్లో ఓ ఆడియో వదిలాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. బండ్లన్నకు అదిరిపోయే పంచ్ ఇచ్చావంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మావాడికి నేను ఎక్స్పోజింగ్ చేస్తే నచ్చట్లే, అందుకే ఇలా.. ఇంట్లో వ్రతం.. భార్యకు ఏడువారాల నగలు కొనిచ్చిన కార్తీకదీపం నటుడు -
కొడుకు ఫంక్షన్కు వచ్చే టైం లేదా.. పూరీపై బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మందిని స్టార్ హీరోలుగా చేసిన పూరి జగన్నాథ్.. కన్నకొడుకు(ఆకాశ్ పూరీ) సినిమా ఫంక్షన్కి రాకపోవడం బాధగా ఉందన్నారు. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బండ్ల గణేశ్ పూరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఓ సామెత ఉంటుంది.. దేశం మొత్తం కల్లాపు చల్లాడు కానీ.. ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదనే పూరీని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది.ఎంతో మందిని స్టార్స్గా తయారు చేశాడు. డైలాగ్లు చెప్పడం రాని వాళ్లకి డైలాగ్లు నేర్పాడు. డాన్స్లు రాని వాళ్లకి డాన్స్లు నేర్పాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్కి మాత్రం రాలేదు. అదే నేనైతే నేను లండన్లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా కొడుకు కోసం.. నా భార్య కోసం.. నా పిల్లల కోసం.. మా అన్న(పూరి జగన్నాథ్) ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో.. ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయమాకు. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సింది వాళ్లే. మనం సంపాదిస్తే ఆస్తులు వాళ్లకే.. అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే. ఆకాశ్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్.. . ఎవర్నెవర్నో స్టార్లని చేశావ్.. నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ముంబాయిలో ఉన్నావ్.. ఇదెక్కడి న్యాయం అన్నా?.నువ్ నీ కొడుకుని స్టార్ని చేసినా చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు.. చోర్ బజార్ పెద్ద హిట్ అవుతుంది. నువ్ కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా రాస్కో.. నువ్ బ్యాంకాక్ పోయి కథ రాసుకుని.. ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురుచూసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. అలా జరక్కపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు. ఆరోజు వచ్చినరోజు.. ఆకాశ్ నువ్ డేట్లు ఇవ్వొద్దని చెప్తా’ అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు. -
మీరు లేకుండా నేను లేను నాన్నా..మహేశ్బాబు ఎమోషనల్ పోస్ట్
నేడు ఫాదర్స్ డే (జూన్ 19). ఈ సందర్భంగా టాలీవుడ్కి చెందిన పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఒక గొప్ప కొడుకుగా, గర్వించదగ్గ తండ్రిగా మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి అనారు. ఈ మేరకు ఆదివారం ఉదయం తండ్రి వెంకట్రావ్తో దిగిన ఫోటోని ట్విటర్లో షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. It is a great feeling to be a grateful son and a proud father! #HappyFathersDay to all!💐😍 pic.twitter.com/3n7OFwQ8Ka — Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2022 మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా నాన్న కృష్ణకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ..‘నాన్న అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. మీరు లేకుండా నేను లేను. హ్యాపీ ఫాదర్స్డే నాన్న’అని మహేశ్ ట్వీట్ చేశాడు. You led by example and showed me what it means to be a father.. I wouldn't be who I am without you.. Happy Father's Day Nanna! ❤️ pic.twitter.com/UYADkoKeOm — Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2022 ‘నాన్న నువ్వు నాకోసం తీసుకున్నా ప్రతి నిర్ణయం ప్రతి కష్టం ప్రతి శ్రమ ప్రతి అడుగు నా మదిలో వెంటాడుతూనే ఉంటాయి ఐ లవ్ యు నాన్న’అని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. నాన్న నువ్వు నాకోసం తీసుకున్నా ప్రతి నిర్ణయం ప్రతి కష్టం ప్రతి శ్రమ ప్రతి అడుగు నా మదిలో వెంటాడుతూనే ఉంటాయి ఐ లవ్ యు నాన్న ❤️ pic.twitter.com/j4eAgUct5S — BANDLA GANESH. (@ganeshbandla) June 19, 2022 View this post on Instagram A post shared by Nihaa Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Nanna, You had not only given me life but also all the qualities required to live it happily and successfully: The courage to face difficulty, The cheerfulness to savour every moment.. This is the first father's day without you and miss you badly nannaa.. Love you Forever ❤️ pic.twitter.com/ZNZNewlZke — Sreenu Vaitla (@SreenuVaitla) June 19, 2022 Thank you for guiding me in my best and worst. No one like you! #HappyFathersDay love u daddy❤️❤️ pic.twitter.com/krXxGZwh45 — nithiin (@actor_nithiin) June 19, 2022 View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థలు కామన్: బండ్ల గణేశ్
Bandla Ganesh About Clash With Director: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ డైరెక్టర్ హరీశ్ శంకర్కు ఖరీదైన వాచ్ బాహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచింది. కాగా గతంలో బండ్ల గణేశ్, హరీశ్ శంకర్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా బండ్ల గణేశ్, హరీశ్ శంకర్ను కలవడం, బాహుమతులు ఇచ్చుకోవడం హాట్టాపిక్గా నిలిచింది. దీంతో గతంలో బండ్ల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చదవండి: ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని: ‘షావుకారు’ జానకి హరీశ్ శంకర్తో గొడవపై ఓ ఇంటర్య్వూలో స్పందించిన బండ్ల గణేశ్ ఇలా వ్యాఖ్యానించాడు. ‘ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థాలు సాధారణమే. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. మళ్లీ సర్థుకుంటాయి. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు’ అన్నాడు. అనంతరం ‘గబ్బర్ సింగ్ మూవీ నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీతో నాకు అంత పెద్ద హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్కు నేను ఎప్పటికీ కృతజ్ఞతుడినే. నా జీవింతాంతం ఆయన నాకు మంచి స్నేహితుడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హరీశ్ శంకర్ కూడా మనసులో ఏం పెట్టుకోలేదని, ఆయన అంత వదిలేసి తనతో చాలా ఫ్రెండ్లిగా ఉంటున్నారని చెప్పాడు. అంతేగాక పవన్ కల్యాణ్ చాన్స్ ఇస్తే తనతో సినిమా చేసేందుకు ఆయన రెడీగా ఉన్నారని చెప్పాడు. చదవండి: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా? కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో బ్లాకబస్టర్గా నిలిచింది. దీంతో మే 12తో ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బండ్ల డైరెక్టర్ హరీశ్ శంకర్ కాస్ట్లీ వాచ్ను కానుకగా ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇదే మూవీ 8వ వార్షికోత్సవం సమయంలోనే హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మధ్య వాగ్వాదం నెలకొంది. 'గబ్బర్ సింగ్' 8వ వార్షికోత్సవం సందర్భంగా హరీశ్ శంకర్ అందరికీ థ్యాంక్స్ చెపుతూ ఒక లేఖను విడుదల చేశారు. అయితే, ఆ సినిమా నిర్మాత అయిన బండ్ల గణేశ్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో, రచ్చ మొదలైంది. హరీశ్ శంకర్ ఓ రీమేక్ డైరెక్టర్ అని, అతనితో మళ్లీ సినిమా చేసే ప్రసక్తే లేదంటూ బండ్ల అప్పట్లో ఫైర్ అయిన విషయం విధితమే. -
హరీష్ శంకర్కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్కు నిర్మాత బండ్ల గణేష్ ఖరీదైన వాచ్ను గిఫ్ట్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మీరు లేకపోతే ఈ సినిమా అంత వేగంగా పూర్తయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. కాగా హిందీలో సూపర్ హిట్గా నిలిచిన దబాంగ్ రీమేక్ చిత్రమే గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి పదేళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్కు సుమారు రూ. 5లక్షలు విలువచేసే వాచ్ను బండ్ల కానుకగా ఇచ్చారు. Successful Producer Bandla Ganesh gifted an expensive watch to Blockbuster Director Harish Shankar on the occasion of #DecadeForGabbarSingh #10YearsForGabbarSingh @harish2you @ganeshbandla pic.twitter.com/brxVrCRB6f — Vamsi Kaka (@vamsikaka) May 11, 2022 -
విజయ్పై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Bandla Ganesh Wishes On Vijay Devarakonda Birthday: స్టార్ హీరో విజయ్ దేవరకొండ బర్త్డే సందర్బంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సోమవారం(మే 9) విజయ్ పుట్టిన రోజున సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతడి విషస్ తెలిపారు. అలాగే బండ్ల గణేశ్ కూడా విజయ్కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు బండ్లగణేష్ ట్వీట్ చేస్తూ విజయ్ స్టార్ అవుతాడని అతడు పుట్టినప్పుడే వాళ్ల నాన్నతో అన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: బాలీవుడ్ నన్ను భరించలేదు: మహేశ్ బాబు షాకింగ్ కామెంట్స్ ‘నాకు ఇంకా గుర్తుంది. మే 9న మీ నాన్నగారు వచ్చి నాకు కొడుకు పుట్టాడు అని చెప్పారు. వెంటనే ఆ బాబు స్టార్స్తో ఆశీర్వదింపబడ్డాడు అని అన్నాను. డియర్ విజయ్ అన్ని స్టార్స్ కలిసి నిన్ను ఇండియన్ సినిమా సూపర్ స్టార్గా నిలబెట్టాయి. హ్యాపీ బర్త్డే విజయ్ దేవరకొండ’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ చూసిన విజయ్ ఫ్యాన్స్ బండ్ల గణేశ్కు ధన్యవాదాలు తెలుపుతుండగా.. మరికొందరు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా గతంలో విజయ్ తండ్రి టీవీ, సినిమా రంగంలో పనిచేశాడు. రచయితగా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ క్రమంలో విజయ్ తండ్రికి బండ్ల గణేశ్తో పరిచయం ఏర్పడి ఉంటుందని నెటిజన్లను అభిప్రాయ పడుతున్నారు. I still remember that may9th when your dad told me that he’s blessed with a son and immediately replied he’s blessed with a star. Dear Vijay, all the stars are aligned to make you the superstar of indian cinema. 🤗❤️@TheDeverakonda pic.twitter.com/uCKHMlLcBt — BANDLA GANESH. (@ganeshbandla) May 9, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4451453475.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రోజు నవరసాలు చూపిస్తానంటున్న బండ్ల గణేష్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం డేగల బాబ్జీ. వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా నుంచి రంజాన్ సందర్భంగా ఓ అప్డేట్ వచ్చింది. మే 20న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు బండ్ల గణేష్.. 'నవరసాలతో మీ డేగల బాబ్జీ' అంటూ రిలీజ్ డేట్తో కూడిన ఓ పోస్టర్ను ట్విటర్లో షేర్ చేశాడు. ఇందులో బండ్ల నిజంగానే నవరసాలు ఒలికిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించిన ఈ చిత్రంలో గణేష్ పలు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు. EAD MUBARAK 👏 pic.twitter.com/qjn2ZcSvmh— BANDLA GANESH. (@ganeshbandla) May 3, 2022 చదవండి: రాకింగ్ రాకేశ్కు కాస్ట్లీ ఫోన్ గిఫ్టిచ్చిన సుజాత 'మిర్చి' సినిమాకి చాలా కష్టపడ్డాం -
'భీమ్లా నాయక్' ఈవెంట్లో త్రివిక్రమ్ అందుకే మాట్లాడలేదా?
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. రేపు(ఫిబ్రవరి 25)న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయ్యింది. అయితే ఈవెంట్ మొత్తంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ లేకపోవడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అసలు ఆయన ఫంక్షన్కి వచ్చారా లేదా అన్న సందేహం కూడా ఫ్యాన్స్లో మిగిలిపోయింది. పవన్ సినిమా ఫంక్షన్కు అన్నీ తానై ముందుండి నడిపించే త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో మాత్రం బ్యాక్ స్టేజ్కే ఎందుకు పరిమితం అయ్యారన్నది ఇప్పడు చర్చనీయాంశమైంది. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో లీక్ అయిన బండ్ల గణేష్ ఆడియో కాల్తో త్రివిక్రమ్ అప్సెట్ అయ్యారని, దీనివల్లే త్రివిక్రమ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి త్రివిక్రమ్ పేరే హైలైట్ అవుతూ వచ్చింది. నిజానికి యంగ్ ఫిల్మ్ మేకర్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ సోషల్ మీడియాలోనూ త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఈవెంట్లో ఎలాంటి హడావిడి లేకుండా కావాలనే బ్యాక్ స్టేజ్కి పరిమితం అయ్యారని టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. చదవండి: త్రివిక్రమ్పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్పై స్పందించిన బండ్లగణేష్ -
త్రివిక్రమ్పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్పై స్పందించిన బండ్లగణేష్
Bandla Ganesh Clarity On Audio Leak : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్కల్యాణ్కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన సినిమా ఫంక్షన్లకి బండ్ల గణేష్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే రీసెంట్గా పవన్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తనను రాకుండా త్రివిక్రమ్ అడ్డకుంటున్నారంటూ బండ్ల గణేష్ మాట్లాడిన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో త్రివిక్రమ్ని దూషిస్తూ బండ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. అయితే తాజాగా ఈ ఆడియో క్లిప్పై స్పందించిన బండ్ల గణేష్.. అది తన గొంతు కాదని, ఎవరో కావాలనే ఇలా క్రియేట్ చేశారంటూ కొట్టి పారేశారు. అయితే దీనిపై అఫీషియల్గా ఓ స్టేట్మెంట్ ఇచ్చేందుకు మాత్రం ఆయన ఇష్టపడకపోవడం గమనార్హం. కాగా పవన్ కల్యాణ్, రానా మల్టీస్టారర్లుగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈనెల 25న రిలీజ్ కానుంది. -
Bandla Ganesh: మూడోసారి కోవిడ్ బారిన పడ్డ బండ్ల గణేష్
Bandla Ganesh Tested Corona Positive: టాలీవుడ్లో కరోనా కలకం రేపుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత మూడు రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు(ఆదివారం) స్వల్ప లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నా కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోండి. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇప్పటికే గతంలో రెండుసార్లు బండ్ల గణేష్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ సమయంలో కరోనా బారిన పడిన ఆయన ఆ సమయంలో ఐసీయూలో చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా మూడోసారి కోవిడ్ బారిన పడ్డారు. Last three days I was at delhi and I tested positive today evening . I have mild symptoms, and my family is tested negative . Please be careful and think before you travel I’m in isolation . Thank you #Besafe pic.twitter.com/9i4CIRI5XC — BANDLA GANESH. (@ganeshbandla) January 9, 2022 -
చిరు వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్.. అవి రిపీట్ చేస్తూ
Bandla Ganesh Interesting Reaction On Chiranjeevi Comments: తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్వవహరించాలనుకోవడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ తెలుగు సినీ కార్మికులకు హెల్త్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. ఈ సందర్భంగా 'నేను ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండాలనుకోవట్లేదు. ఆ హోదా నాకు అస్సలు వద్దు. ఇద్దరు గొడవపడుతుంటే పరిష్కరించడానికి నేను ముందుకు రాను. కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటా' అని తెలిపారు చిరంజీవి. ఈ వ్యాఖ్యలపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికరంగా స్పందించారు. చిరు వ్యాఖ్యలను బండ్ల గణేష్ సమర్థించారు. 'సూపర్ సర్' అంటూ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఆయన మాటలను రిపీట్ చేస్తూ ఈ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. అయితే 'మా' ఎన్నికల తర్వాత సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీకి సమస్య వున్నా, కార్మికులకు ఏ సమస్యా వున్నా ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధం గా వుంటాను ఇద్దరు కొట్టుకొని పంచాయితీ చెయ్యమంటే చెయ్యను @KChiruTweets Sir 👌 — BANDLA GANESH. (@ganeshbandla) January 2, 2022 మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ ఇండస్ట్రీ పెద్దరికం పదవి లో నేను వుండను ఆ స్థానం నాకు వద్దు అవసరం వస్తె తప్పకుండా అక్కడ వుంటాను ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు వద్దు @KChiruTweets sir — BANDLA GANESH. (@ganeshbandla) January 2, 2022 ఇదీ చదవండి: సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉండే ప్రసక్తే లేదు.. చిరంజీవి కీలక వ్యాఖ్యలు -
బండ్ల గణేష్కు అరెస్ట్ వారెంట్ జారీ.. కోర్టుకు హాజరు ?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదాల్లో చిక్కుక్నునారు. ఈ సారి ఆయన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. బండ్ల గణేష్పై ఏపీ ప్రకాశం జిల్లా ఒంగోలు రెండో మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జిల్లాలోని ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి గణేష్ రూ.1.25 కోట్ల చెక్కును అందించినట్లు సమాచారం. అయితే ఆ చెక్కు బౌన్స్ కావడంతో చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు వెంకటేశ్వర్లు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు ఆదేశించినా బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. బండ్ల గణేష్ సోమవారం కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది. గతంలో బండ్ల గణేష్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి తనకు రూ.13 కోట్లు ఇచ్చాడని, దానిని నటుడు తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. చివరికి కడపలో డబ్బులు చెల్లించకపోవడంతో బండ్ల గణేష్పై మహేష్ ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అదే తరహాలో బండ్ల గణేష్ విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో కడప మెజిస్ట్రేట్ ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు బండ్ల గణేష్ను అరెస్టు చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. -
నేపాలీ అమ్మాయిని దత్తత తీసుకున్న బండ్ల గణేష్
Bandla Ganesh Adopted Nepali Girl: కమెడియన్, నిర్మాతగా సత్తా చాటిన బండ్ల గణేష్..ఇటీవలె హీరోగానూ మారాడు. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే బండ్లగణేష్కు ప్రత్యేకమైన అభిమానులు సైతం ఉన్నారు. కరోనా సమయంలో సోషల్ మీడియాలో సాయం అడిగిన కొందరికి తనవంతు సాయం అందించిన మంచి మనసు చాటుకున్నాడు బండ్ల గణేష్. తాజాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవలె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకొని వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారని, తాను మాత్రం ఈ పాపను పెంచుకొని, గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ఆ పాట తమ ఇంట్లో మెంబర్ అయిపోయిందని, ఇప్పుడు తామందరినీ బెదిరించే స్థాయికి వచ్చిందని ఫన్నీగా పేర్కొన్నాడు. @ganeshbandla అన్న నిన్ను నిందించి అగౌరవ పారిచే అంతా స్థాయి, స్థానం ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికి సరిపోదు అన్న.....🙏💯 pic.twitter.com/w0FDBDDH68 — Rock ⭐ Rockey🔥👑 (@RavitejanaiduS2) November 27, 2021 -
చిరంజీవి సార్ మీరు సూపర్.. నోట మాట రావడం లేదు: బండ్ల గణేశ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో పాటు మెగా ఫ్యామిలీపై బండ్ల గణేశ్కు ఎంత ప్రేమ ఉంటుందో అందరికి తెలిసిందే. మెగా హీరోలపై ఎవరైన వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే.. బహిరంగంగానే ఇచ్చి పడేస్తాడు. అంతేకాదు సమయం దొరికితే చాలు మెగా హీరోలను, ముఖ్యంగా పవన్ కల్యాణ్ను పొగడ్తలతో ముంచేస్తాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మీరు సూపర్ సార్ అంటూ కామెంట్ చేశాడు బండ్ల. వివరాల్లోకి వెళితే.. బుధవారం అమీర్పేటలో యోదా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న కళాకారులకు ఏదైనా సహాయం చేయాల్సిందిగా యోదా డయాగ్నస్టిక్ సెంటర్ అధినేతకు విజ్ఞప్తి చేశాడు. మెగాస్టార్ చిరంజీవి వినయంగా అడగడంతో చలించిపోయిన యోదా డయాగ్నస్టిక్ సెంటర్ అధినేత.. 'మా' మెంబర్స్ తో పాటు 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వారందరికి తాము అందించే వైద్యంలో 50 శాతం డిస్కౌంట్ ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోని బండ్ల గణేశ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘మీరు సూపర్ సార్.. మీ గురించి మాటల్లో చెప్పలేకపోతోన్నా.. నోట మాట రావడం లేదు’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @KChiruTweets sir Meeru super ………No words about you sir 👌👌👌👌👌🙏🙏🙏🙏 pic.twitter.com/VNF5qa07XX — BANDLA GANESH. (@ganeshbandla) November 18, 2021 -
డేగల బాబ్జీ: ట్రైలర్ మొత్తం బండ్ల గణేష్ ఒక్కడే
Bandla Ganeshs Degala Babji Trailer Out: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటించిన సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే... మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గణేష్ను పరిచయం చేశారు. సినిమాలో బండ్ల గణేష్ పేరు డేగల బాబ్జీ. ట్రైలర్ అంతా ఆయన ఒక్కరే ఉండటం గమనార్హం.'యాభై దెయ్యాలు సార్... అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి', 'కోపం... కోపం... భరించలేనంత కోపం', 'పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టిన అప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను' అంటూ బండ్ల చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
పోలింగ్ కేంద్రం వద్ద గొడవలపై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న గొడవలపై విలేకరులు ప్రశ్నించగా దీనిపై బండ్ల ఆసక్తికర రీతిలో స్పందించారు. ఈ మేరకు బండ్ల గణేశ్ సమాధానం ఇస్తూ.. గొడవలే కదా హత్యలు, అత్యాచారాలు ఏమి జరగడం లేదు కదా అని సమాధానం ఇచ్చాడు. అనంతరం తాను ఓటు వేసిన సభ్యులే గెలుస్తారని, తప్పకుండా ఎవరో ఒకరూ గెలుస్తారంటూ చమత్కరించాడు. -
‘మా’ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్
-
‘మా’ ఎన్నికలు: పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో బండ్ల గణేశ్ ఊహించిన షాక్ ఇచ్చాడు. తాజాగా తాను వేసిన నామినేషన్ను వెనక్కి తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్లతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను 'మా' జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అంటూ ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ‘మా’ జనరల్ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్గా పోటీకి దిగుతూ బండ్ల గణేశ్ నామినేషన్ దాఖలు చేయగా, దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం మరోసారి చర్చకు దారి తీసింది. చదవండి: ప్రకాశ్ రాజ్ ట్వీట్పై రీట్వీట్ చేసిన బండ్ల గణేష్, నెటిజన్లు ఫిదా నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను. @actorsrikanth @prakashraaj 👍 pic.twitter.com/s6zx2MqCFL — BANDLA GANESH. (@ganeshbandla) October 1, 2021 -
ప్రకాశ్ రాజ్ ట్వీట్పై రీట్వీట్ చేసిన బండ్ల గణేష్, నెటిజన్లు ఫిదా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి పోటీ పడుత్ను ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు తమ ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సినీ నటుడు బండ్ల గణేష్ మాత్రం జనరల్ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా నామినేషన్ దాఖలు చేసి ప్రచారం మొదలు పెట్టాడు. అయితే ఎన్నికల ప్రచారాన్ని బండ్ల గణేష్ వినూత్నం ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చదవండి: MAA Elections 2021: ప్రచారంలో భాగంగా ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్ కాగా ప్రచారంలో భాగంగా ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తమకే ఓటు వేయాలని కోరిన సంగతి తెలిసిందే. తమ ప్యానల్ సభ్యులతో ఉన్న పాంప్లెట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘#MaaElections2021.. మీ ఓటే మీ గొంతు.. ‘మా’ హితమే మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. ‘మా’ ఆశయాలను గెలిపిద్దాం..’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రకాశ్ రాజ్ చేసిన పోస్ట్ చూసిన బండ్ల ఆయన ట్వీట్కు రీట్వీట్ చేస్తూ ‘జనరల్ సెక్రటరీకి వేసే ఓటును మాత్రం బండ్ల గణేశ్కు వేయండి’ అంటూ తనదైన శైలిలో ప్రచారం చేశాడు. దీంతో బండ్ల ట్వీట్ వైరల్గా మారింది. బండ్ల ట్వీట్కు నెటిజన్లు ఫిదా అవుతూ ‘ప్రచారంలో కూడా తన మార్క్ను చూపించాడంటూ’ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బాబూ మోహన్ Only one vote for @ganeshbandla for General secretary 🙏 https://t.co/UDmRIJ9ai6 — BANDLA GANESH. (@ganeshbandla) September 29, 2021 -
‘డేగల బాజ్జీ’గా బండ్ల గణేశ్, టైటిల్ ఖారారు
బండ్ల గణేశ్ హీరోగా ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈ మూవీకి ‘డేగల బాజ్జీ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా ఈ ఫస్టులుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. కను బొమ్మపై గాయం, ఒక్క కన్నుతో సీరియస్గా చూస్తున్న బండ్ల గణేశ్ ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి స్పందన వస్తోంది. ఈ ఫస్టులుక్ విడుదల చేసిన హరీశ్ శంకర్, బండ్ల గణేశ్తో పాటు, మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. Thank you so much my dear blockbuster @harish2you 🤝 https://t.co/xg4RkctMgN — BANDLA GANESH. (@ganeshbandla) September 17, 2021 -
పోరు మారుతోంది
-
అందరిని కలుపుకోవడానికే ఈ సమావేశం :ప్రకాష్ రాజ్
-
MAA Elections: బండ్ల గణేశ్ మాటలు విని షాకయ్యాను: ప్రకాశ్ రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. రోజుకో ట్విస్ట్తో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారం ముమ్మరం చేశారు. అధ్యక్ష బరిలో అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు(ఆదివారం) ప్రకాశ్ రాజ్ ‘మా’ కళాకారలను విందుకు ఆహ్వానించాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే దీనిని నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా ఖండించాడు. (చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ విందు ఆహ్వానంపై బండ్ల గణేశ్ కౌంటర్) ‘దయచేసి ‘మా’ కళాకారులను విందులు, సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు. ఎందుకంటే గత రెండేళ్లలో అందరు కరోనా భయంతో బ్రతుకుతున్నారు. చాలా మంది చావు దాకా వెళ్లొచ్చారు. అందులో నేను ఒకడిని. ఓటు కావాలంటే ఫోన్ చేసి, మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమడోద్దని నా మనవి’ అని పరోక్షంగా ప్రకాశ్ రాజ్ విందును విమర్శించారు. ఇక బండ్ల గణేశ్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చాడు. అసోసియేషన్ ఎన్నికలు అన్నాక అందరితో చర్చలు, క్యాంపెయిన్ చేయడం జరుగుతుందని కామన్ అన్నారు. అందులో భాగంగానే ఈ రోజు కొంతమంది ఆర్టిస్టులను లంచ్కు పిలిచానని, వారితో సమస్యల గురించి చర్చించామని తెలిపారు. ఇప్పటి వరకు ‘మా’లో జరిగిన పనులు, మున్ముందు జరగాల్సిన పనుల గురించి దాదాపు 3 గంటల పాటు అందరితో మాట్లాడడం జరిగిందన్నారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలను తాను నిజంగానే షాకయ్యానని తెలిపాడు. గుజరాత్తో పాటు మరికొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడికి అందరు వెళ్తున్నారు.. మరి దాని గురించి బండ్ల గణేశ్ ఏం మాట్లాడుతారు? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు. ‘మా’ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 19న వస్తుందని, ఆ తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తానని తెలిపారు. కరోనా రూల్స్ పాటిస్తూ ఈ సమావేశం జరిగింది: జీవితా రాజశేకర్ కరోనా నియమాలను పాటిస్తూనే ప్రకాశ్ రాజ్ సమావేశం జరగిందన్నారు నటి, దర్శకురాలు జీవితా రాజశేకర్. కరోనా భయంలో ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని ఉంటామని ఆమె ప్రశ్నించారు. కోవిడ్ నియమాలను పాటిస్తూ పెళ్లిళ్లు, సభలు, సమావేశాలు జరుగుతున్నాయని, తాము కూడా అవే నియమాలను పాటిస్తూ విందు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. బండ్ల గణేశ్ ప్రతిసారి తన గురించే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ విందు ఆహ్వానంపై బండ్ల గణేశ్ కౌంటర్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుంచి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రకాశ్ రాజ్కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్లో సభ్యుడుగా ఉన్న నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. చదవండి: MAA Elections 2021 : మసకబారుతున్న 'మా' ప్రతిష్ట.. ఇందులో భాగంగా తమ ప్యానల్ సభ్యులతో ప్రకాశ్ రాజ్ శనివారం సమావేశయ్యారు. ఇక ఆదివారం ‘మా’ సభ్యులందరిని విందుకు ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ పంపారు. దీంతో బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ట్వీటర్లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ‘మా’ సభ్యులను విందుకు ఆహ్వానించడంపై బండ్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి ‘మా’ కళాకారులనువిందులు, సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు.. ఎందుకంటే గత రెండేళ్లలో అందరు కరోనా భయంతో బ్రతుకుతున్నారు.. చాటా మంది చావు దాకా వెళ్లొచ్చారు. చదవండి: సాయి తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, హెల్త్ బులెటిన్ విడుదల అందులో నేను ఒకడిని. ఓటు కావాలంటే ఫోన్ చేసి, మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమడోద్దని నా మనవి’ అని పేర్కొన్నాడు. ఇక ముందుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. అనూహ్యంగా జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీకి దిగడంతో బండ్ల రంగంలోకి దిగి.. జీవితపై తను పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తా అంటూ బయటకు వచ్చిన సంగతి విదితమే. అయితే ఈ సారి మా ఎన్నికల బరిలో దిగబోతున్న మంచు విష్ణు ఇప్పటికీ తన ప్యానల్ సభ్యులను ప్రకటించకలేదు. It’s my humble request 🙏 pic.twitter.com/fFaXAiEK4g — BANDLA GANESH. (@ganeshbandla) September 12, 2021 -
"మా " సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు పై బండ్ల గణేష్ కౌంటర్
-
నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్
Srikanth Comments On Sai Dharam Tej Accident: మెగా హీరో సాయిధరమ్ తేజ్కు జరిగిన రోడ్డు ప్రమాదంపై పలువురు సినీనటీనటులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేశ్ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ తన కొడుకు నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరగడానికి ముందు సాయి, నవీన్ తమ ఇంటి నుంచే ఇద్దరూ కలిసి బయలుదేరారని, బైక్పై వద్దని చెబుదామనుకున్నా కానీ ఆలోపే వెళ్లిపోయారన్నాడు. అంతేగాక తన కుమారుడు, సాయి తరచూ బైక్ రేసులో పాల్గొంటారని చెప్పాడు. దీంతో నరేశ్ వ్యాఖ్యలను తప్పు బడుతూ పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. విషయం పూర్తిగా తెలుసుకోకుండానే ఎందుకు మాట్లాడతారని అంటున్నారు. ఇప్పటికే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఈ సమయంలో రాజకీయాలు చేయొద్దంటూ సోషల్ మీడియాలో వీడియో వదలగా.. తాజా హీరో శ్రీకాంత్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశాడు. చదవండి: నరేశ్ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ అభ్యంతరం నరేశ్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘సాయి ధరమ్ తేజ్కు జరిగిన యాక్సిడెంట్ చాలా చిన్నది. రోడ్డుపై ఇసుక ఉండటం వల్లే అతడి బైక్ స్కిడ్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ రాష్గా వెళ్లే వ్యక్తి కాదు. నరేశ్ పెట్టిన వీడియో బైట్ నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. కుటుంబ సభ్యులంతా టెన్షన్ పడుతుంటారు. ఈ సమయంలో ఆయన చనిపోయిన వాళ్ల గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేది. దయ చేసి ఎవరూ ఇలాంటి బైట్స్ పెట్టొద్దని కోరుకుంటున్నా’అని అన్నాడు. కాగా నరేశ్ వేగం విషయంలో యువత కంట్రోల్లో ఉండాలని, కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్, కోమటి రెడ్డిల కుమారులు ఇలాగే ప్రమాదాల్లో మరణించి వారి కటుంబాలను శోక సంద్రంలో ముంచారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: Sai Dharam Tej's Accident : సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేశ్ -
నరేశ్ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ అభ్యంతరం
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నిన్న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెగా మేనల్లుడి ప్రమాద విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా, సాయిధరమ్ తేజ్ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి ముందు సాయి తమ ఇంటి నుంచే బయలు దేరారని, సాయి ధరమ్ తేజ్ ఆయన అబ్బాయి నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. చదవండి: మరో విషాదం: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య అంతేగాక వారు క్రమంగా బైక్ రేసుల్లో పాల్గొంటున్నారంటూ నరేశ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నరేశ్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదు’ అనే క్యాప్షన్తో ఆయన తన ట్విటర్లో ఓ వీడియో వదిలారు. అంతేగాక వీడియోలో ‘సాయి ధరమ్ తేజ్ మంచి వ్యక్తి. చక్కగా షూటింగ్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఆయన గురించి ఏవేవో మాట్లాడటం సరైనది కాదు. ఆయన కోలుకుని పూర్తి ఆరోగ్యం తిరిగి రావాలని దేవుడిని కోరుకోవాలి. అంతేకాని ఏవోవే వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. చదవండి: Sai Dharam Tej's Accident : సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేశ్ నరేశ్ గారు మీరు ఇలాంటి సమయంలో ఆయన కోలుకోవాలని పరమేశ్వరుని పార్థించండి. అంతేగాని బైక్ రేసులు చేశాడు అవి ఇవి అని ఎందుకు మాట్లాడటం సర్. ఈ సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు’ అంటూ బండ్ల వ్యాఖ్యానించారు. కాగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ రోజు ఉదయం వైద్యులు వెల్లడించగా ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారంటూ ఓ వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయనను డాక్టర్ తట్టిలేపుతుండగా సాయి చేయి కదిల్చిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. It’s True .please don’t do politics In this time it’s not correct it’s my humble request🙏 pic.twitter.com/ckFXWwKEE7 — BANDLA GANESH. (@ganeshbandla) September 11, 2021 -
ఇండిపెండెంట్గా బరిలోకి బండ్ల.. స్పందించిన జీవిత, ప్రకాశ్రాజ్
-
MAA Elections 2021: బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై స్పందించిన జీవిత
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఇన్నాళ్లు ప్రకాశ్ రాజ్కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్లో సభ్యుడుగా ఉన్న బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకుసున్నాడు. తాను ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని, ప్యానల్ అధికార ప్రతినిధిగా కొనసాగలేనని స్పష్టం చేశాడు. అంతేకాదు ప్రకాశ్రాజ్ ప్యానల్లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడం తనకి నచ్చలేదని.. అందుకే ఆమెకు వ్యతిరేకంగా జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నానంటూ వెల్లడించాడు. (చదవండి: జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తా..నేనెంటో చూపిస్తా: బండ్ల గణేష్) బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలపై జీవిత స్పందించారు. తాజాగా ఆమె ఓ చానల్తో మాట్లాడుతూ..బండ్ల గణేశ్తో తనకెలాంటి విభేదాలు లేవని అన్నారు. . ‘మా’లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆమె మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా లేదా ఓడినా ‘మా’ అభివృద్దికి పనిచేసి తీరతానన్నారు. బండ్ల గణేశ్ కూడా ‘మా’అభివృద్ది కోసం పోటీ చేస్తున్నట్టు భావిస్తున్నానని, అంతేకాని తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదన్నారు. కాగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి జీవిత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తా..నేనెంటో చూపిస్తా: బండ్ల గణేష్
-
MAA Elections 2021: ప్రకాష్రాజ్కు షాకిచ్చిన బండ్ల గణేష్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని, ప్యానల్ అధికార ప్రతినిధిగా కొనసాగలేనని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్లోకి జీవిత రావడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. త్వరలో జరిగే 'మా' ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా 'మా' ఎన్నికలకు సంబంధించి ఆయన చేసిన వరుస ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మాట తప్పను ... మడమ తిప్పను నాది ఒకటే మాట -ఒకటే బాట నమ్మడం -నమ్మినవారికోసం బతకడం నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను - నేను ఎవరిమాట వినను త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను - పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను……. — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ అందరికీ అవకాశం ఇచ్చారు ఒకేఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా ... — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 నా పరిపాలన ఎంటో తెలియచేస్త వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం దానికోసం పోరాడతా... వారి సొంత ఇంటి కల నిజం చేస్తా ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు... ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు… — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు అందరి ఆశీస్సులు కావాలి -మా ను బలో పేతం చేద్దాం ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం అదే మా నిజమైన అభివృద్ది... చిహ్నం - ఇట్లు మీ బండ్ల గణేష్ — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 -
అమ్మతోడు నాకు ఆ కేసుతో సంబంధం లేదు : బండ్ల గణేశ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యాడు. దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నాడు. అయితే కేవలం మూడు గంటలు మాత్రమే అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. బ్యాంక్ లావాదేవీల పైనే దృష్టి సారించిన ఈడీ.. విదేశీ లావాదేవీలపై ఆరా తీశారు. పూరీకి సంబంధించిన మూడు బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్స్ను పరిశీలించారు. ఇవన్నీ వాంగ్మూలం రూపంలో నమోదు చేసుకున్న ఈడీ అధికారులు.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని పూరీకి చెప్పి పంపారు. (చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఆమూడు ఖాతాలపై ఈడీ ఆరా) ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయానికి వెళ్లడంతో ఆయనపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. పూరీ విచారణలో వెలుగులోకి వచి్చన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు బండ్ల గణేశ్కు సమన్లు జారీ చేశారని వార్తలు వినిపించాయి. అయితే ‘అమ్మతోడు.. నాకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. కనీసం వక్కపొడి కూడా వేసుకోని నన్ను ఈడీ వాళ్లు ఎందుకు పిలుస్తారు. పూరీగారు ఇక్కడికి ఉదయం వచ్చారు. ఇంతసేపు కావడంతో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి నా అంతట నేనే వచ్చా..’ అని గణేష్ వివరణ ఇచ్చారు. -
'ఎన్టీఆర్తో గొడవలు'..స్పందించిన బండ్ల గణేష్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్గా తెలుగు తెరకు పరిచయం అయిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. బ్లాక్ బస్టర్ సినిమాలతో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్తో కలిసి 'బాద్ షా', 'టెంపర్' వంటి చిత్రాలను నిర్మించాడు. అయితే టెంపర్ మూవీ అనంతరం రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్కి, బండ్ల గణేష్తో గొడవ జరిగినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్యా దూరం పెరిగిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. మిస్ కమ్యునికేషన్ వల్ల అలా జరిగింది. దాన్ని గొడవ అనలేం. ఎన్టీఆర్తో నాకు ఎలాంటి విభేదాలు లేవు అని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. కాగా టెంపర్ మూవీ అనంతరం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా ట్రాక్లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్తో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన పూరి జగన్నాథ్ Varudu Kaavalenu Teaser: అమ్మా.. వీళ్లెవరు నాకు కనెక్ట్ అవ్వట్లేదే -
పవన్ ఫ్యాన్స్కు బండ్ల గణేశ్ గుడ్ న్యూస్.. థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2011 మే 11న విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. దబాంగ్ సినిమాకు రిమేక్ అయినా.. కానీ పవన్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేశ్కు కూడా గుర్తింపు అందుకున్నాడు. (చదవండి: హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూతురు!) కాగా, ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ విడుదల చేయనున్నారట. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా థియేటర్లలో మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా విడుదల చేయనున్నారట. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించిన బండ్ల గణేశ్.. ‘సెప్టెంబర్ 2న బాస్ బర్త్ డే స్పెషల్ గా గబ్బర్ సింగ్ సినిమా చూడండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 షోలు వేస్తున్నాను, మనం మన బాస్ పుట్టినరోజు థియేటర్లో జరుపుకుందాం, జై పవర్ స్టార్, జై దేవర ’అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. -
ఒక్క రోజు లేట్ అయితే చచ్చిపోయేవాడ్ని.. చిరంజీవి కాపాడాడు : బండ్ల గణేశ్
బండ్ల గణేశ్ మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అని అందరికి తెలిసిందే. ఏ చిన్న సందర్భం దొరికినా చాలు మెగా హీరోలను ఓ రేంజ్లో పొగిడేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటాడు ఈ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్. ఇక పవన్ కల్యాణ్ విషయంలో అది కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తనకు చిరంజీవి చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తాను రెండోసారి కరోనా బారిన పడిన సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఒక్క రోజు ఆలస్యమైనా ప్రాణాలు పోయేవని, అలాంటి సమయంలో చిరంజీవి తనకు అండగా నిలిచారని బండ్ల గణేశ్ అన్నారు. (చదవండి: చిరు సాయం లేకుంటే హేమ చనిపోయేది.. రాజా రవీంద్ర షాకింగ్ కామెంట్) ‘రెండోసారి కరోనా బారిన పడినప్పుడు నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఒక్క రోజు లేట్ అయితే చనిపోయేవాడిని. ఆ సమయంలో ఆస్పత్రిలో బెడ్ కూడా దొరకని పరిస్థితి. నాతో పాటు మా కుటుంబం అంతా కరోనా బారిన పడింది. మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. పవన్ కల్యాణ్కు ఫోన్ చేద్దామనుకున్నా. కానీ అప్పటికే ఆయన కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నాడని తెలిసి చేయలేకపోయాను. ఎవరికి చేయాలో తెలియక చివరకు చిరంజీవికి ఫోన్ చేశా. ఫస్ట్ రింగ్కే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు గణేశ్ అన్నాడు. నోట మాట కూడా రాని ఆ పరిస్థితుల్లో చిరంజీవి సాయపడ్డారు. చిరంజీవి సాయంతోనే నేను ఈ రోజు బతికి ఉన్నా. లేదంటే ఎప్పుడో నేను చనిపోయేవాడ్ని. పవన్ కల్యాణ్ నాకు జీవితాన్ని ఇస్తే.. చిరంజీవి నాకు ప్రాణం పోశారు. ఆయన రుణం తీర్చుకోలేను. అందరికి ముందు ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను. జీవితాంతం ఆయనకు నేను రుణపడి ఉంటాను’ అంటూ బండ్ల గణేశ్ ఎమోషన్ అయ్యాడు. (చదవండి: బుల్లెట్ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?) -
అవార్డు విన్నింగ్ రీమేక్లో బండ్ల గణేశ్ హీరో!
Bandla Ganesh: క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా వెండితెరపై నవ్వులు పూయించిన బండ్ల గణేశ్ తర్వాత పలు సినిమాలు నిర్మించి నిర్మాతగా సెటిలైపోయాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తూ ప్రేక్షకులకు దర్శనమిస్తున్న ఆయన ఇటీవల మళ్లీ నటుడుగా తన కెరీర్ ప్రారంభించాడు. ఈ క్రమంలో తాజాగా బండ్ల హీరోగా మారబోతున్నాడు. తమిళంలో ఆర్.పార్తిబన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన ‘ఒత్త సెరప్పు సైజ్ 7’ మూవీ రీమేక్లో బండ్ల గణేశ్ హీరోగా నటిస్తున్నాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో స్వాతీ చంద్ర నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. హీరో పాత్ర కోసం బండ్ల గణేష్ ప్రత్యకంగా మేకోవర్ అవుతున్నాడు. తమిళ హిట్, జాతీయ అవార్డులు సాధించిన ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు ఇది తెలుగు రీమేక్. చదవండి: నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు -
‘మా’ కు బిల్డింగ్ అవసరం లేదు.. బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడు లేనంతగా ఈ సారి అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. వీరిలో ప్రకాశ్ రాజ్ అయితే ఒక అడుగు ముందుకేసి ‘సినిమా బిడ్డలు’పేరుతో తన ప్యానల్ను కూడా ప్రకటించాడు. (చదవండి: మనసు మార్చుకున్న బండ్ల గణేష్..ఆనందంలో ఫ్యాన్స్) ప్రకాశ్ రాజ్ ప్యానల్కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ముందు నుంచి మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ఎన్నికలు, భవనం నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ‘మా’కు శాశ్వత భవనం అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిఒక్కరూ ‘మా’కు శాశ్వత భవనం నిర్మించడమే ప్రధాన అజెండాగా బరిలోకి దిగుతున్నారు. నిజం చెప్పాలంటే నేను ‘మా’ బిల్డింగ్కు వ్యతిరేకిని. దానికంటే ముందు చేయాల్సిన పనులో ఎన్నో ఉన్నాయి. ‘మా’లో ఉన్న 900 మందిలో చాలా వరకు దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నారు. సరైన ఆర్థిక స్థోమతలేక ప్రతి నెలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం.. బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే బాగుంటుంది. ఇలాంటి పని కోసం మన హీరోలు కూడా ముందుకు వస్తారు. ప్రస్తుతం ‘మా’కి బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు. సినిమా షూటింగ్స్ నిలిచిపోవు. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు’అని బండ్ల గణేశ్ అన్నారు. (చదవండి : ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ) -
మనసు మార్చుకున్న బండ్ల గణేష్..ఆనందంలో ఫ్యాన్స్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ఒక సెన్సేషన్. ఆయన పెట్టే పోస్టులు ఎప్పుడూ కాంట్రవర్సరీలు అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ట్విట్టర్కు గుడ్బై చెప్పబోతున్నానంటూ బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా’అని బండ్ల చేసిన ట్వీట్ ఆయన అభిమానులకు, ఫాలోవర్లకు షాకిచ్చింది. అయితే తాజాగా బండ్ల గణేష్ మనసు మార్చుకున్నారు. ఓ జర్నలిస్టు సూచన మేరకు ట్విటర్లో తిరిగి కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బండ్ల నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్న ఆయన అభిమానులు వెల్కం బండ్లన్నా అంటూ రీట్వీట్లు చేస్తున్నారు. పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు ఈరోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇవ్వటం వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందు కి మళ్ళీ వస్తున్నాను 🙏 — BANDLA GANESH. (@ganeshbandla) August 17, 2021 Welcome anna 🥁🥁🤩🤩 pic.twitter.com/8SRpyfVU42 — Shaik Irfan (@ShaikIr79901454) August 17, 2021 చదవండి : కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాను: లేడీ కమెడియన్ ముంబైకి పయనమైన ప్రభాస్ -
త్వరలోనే గుడ్బై చెప్పేస్తా.. బండ్ల గణేశ్ సంచలన నిర్ణయం
బండ్ల గణేశ్.. ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా మాట్లాడతాడో అంచనా వేయడం కూడా కష్టమే. ఆయన మాటలతో పాటు ఎదుగుదల కూడా అందరికి ఆశ్చర్య కలిగించింది. కమెడియన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల.. ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు. అంతేకాదు ప్రొడ్యూసర్గా స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి.. అక్కడా సెన్సేషనల్ కామెంట్స్ చేసి, తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. ఇక ఈ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్తుంటాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. చాలా సార్లు ఆయన చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. అయితే హఠాత్తుగా బండ్ల గణేశ్ ట్వీటర్కు గుడ్బై చెప్పబోతున్నానని ప్రకటించి షాకిచ్చాడు. . త్వరలోనే ట్విటర్ గుడ్ బై చెప్పేస్తా. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా’అని బండ్ల ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అతని అభిమానులు, ఫాలోవర్స్ షాక్కు గురయ్యారు. ఎందుకు గుడ్బై చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏమైందో చెప్పండి’అంటూప్రశ్నలు వేస్తున్నారు. మరి బండ్ల గణేశ్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడానకి బలమైన కారణం ఏంటో తెలియాలంటే.. ఆయన చెప్పేవరకు వేచి చూడాల్సిందే. త్వరలో కి ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా No controversies. I don’t want any controversies in my life 🙏 — BANDLA GANESH. (@ganeshbandla) August 14, 2021 -
చిరంజీవిపై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు, ట్వీట్ వైరల్!
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా బండ్ల మెగా అభిమాని అని అందరికి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అంటే బండ్లకు బాగా ఇష్టం. ఇటీవల పవన్కు దేవర అనే పేరును కూడా పెట్టుకున్నాడు. అలా ఏ వేడుక అయినా స్టేజ్ ఎక్కాడంటే చాలు సమయం సందర్భంగా లేకుండా దేవర, దేవర అంటూ పవన్ భజన చేస్తుంటాడు. కానీ ఈ సారి మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని కురిపించాడు. చిరు ఫొటోను షేర్ చేస్తూ.. ‘మా దేవరకి అన్న.. అందరికి నేను అనే నమ్మకం. మనిషి అంటే ఇలా ఉండాలి.. అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న మెగాస్టార్’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశాడు. అయితే ఈ ట్వీట్ను బండ్ల ఏ సందర్భంగా చేశాడన్నది మాత్రం స్పష్టం చేయలేదు. అయితే బండ్ల గణేశ్ ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా సామాజిక మాధ్యామాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా.. పేద ప్రజలకు సాయం అందించేందుకు వాడుతున్నాడు. ట్విటర్ ద్వారా తనను అభ్యర్థిస్తే చాలు... వెంటనే స్పందించి, తోచిన సాయం అందిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతుందని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ, వీలైన సాయం చేయాల్సిందిగా ట్వీటర్ ద్వారా అందరినీ అభ్యర్థించాడు. దీనిపై బండ్ల స్పందిస్తూ.. `మీ గూగుల్ పే నంబర్ ఇవ్వండి. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడేందుకు ప్రయత్నిద్దామ`ని ట్వీట్ చేశాడు. మా దేవర కి అన్న అందరికీ నేను అనే నమ్మకం మనిషి అంటే ఇలా ఉండాలి అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న 🙏మెగాస్టార్ @KChiruTweets pic.twitter.com/sGhU18D0zQ — BANDLA GANESH. (@ganeshbandla) August 10, 2021 -
అరెరె అచ్చం బండ్లన్నలాగే ఉన్నాడే.. జూనియర్ బండ్ల ఫోటో వైరల్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. ఆయన పెట్టే పోస్టులు ప్రతిసారి నెట్టింట వైరల్ అవుతుంటాయి. అందుకు కారణం యూత్లో బండ్లన్న ఉన్న క్రేజీయే. తాజాగా బండ్ల గణేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో మరెవరిదో కాదు.. మన బండ్లన్న పెద్ద కుమారుడు హితేష్ నాగన్ బండ్లది. అచ్చ అచ్చుగుద్దినట్లు బండ్ల గణేశ్లా ఉన్న ఈ ఫోటోని ఆయన షేర్ చేస్తూ.. ‘ఇతను నా పెద్ద కొడుకు హితేష్ నాగన్ బండ్ల’.. అంటూ నెటిజన్స్కి పరిచయం చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్ అవుతోంది. బండ్ల గణేశ్ కుర్రాడిగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలాగే ఇది ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు.‘అచ్చు మీ జిరాక్స్లా ఉన్నాడు. డిట్టో దిగిపోయాడు. హీరోని చేస్తారా..?’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారా’ అనే ప్రశ్నకి ‘అంతా దేవుడి దయ’ అంటూ రిప్లై ఇచ్చారు బండ్ల గణేశ్. My elder son Hitesh Nagan bandla 🙌🏻 pic.twitter.com/RV3CvznC4F — BANDLA GANESH. (@ganeshbandla) August 2, 2021 -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న బండ్ల గణేశ్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. అయితే సోషల్ మీడియాని ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా... పేద ప్రజలకు సాయం అందించేందుకు వాడుతుంటాడు. ట్విటర్ ద్వారా తనను అభ్యర్థిస్తే చాలు... వెంటనే స్పందించి, తోచిన సాయం అందిస్తుంటాడు. అలా ఇప్పటికే చాలా మందికి సాయం అందించిన బండ్లన్న.. తాజాగా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ నెటిజన్ అభ్యర్థన గమనించిన ఆయన స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఓ నెటిజన్ తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతుందని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ, వీలైన సాయం చేయాల్సిందిగా ట్వీటర్ ద్వారా అందరినీ అభ్యర్థించాడు. దీనిపై బండ్ల గణేశ్ స్పందిస్తూ.. `మీ గూగుల్ పే నంబర్ ఇవ్వండి. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడేందుకు ప్రయత్నిద్దామ`ని తెలిపారు. దీంతో బండ్ల గణేశ్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
బండ్ల గణేష్ ఔదార్యం..గూగుల్ పే నెంబర్ అడిగి
నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఉన్నట్లుండి నిర్మాతగా మారి, ఆ వెంటనే స్టార్ హీరోలతో సినిమాలు తీసి, సూపర్ హిట్లు అందుకుని ఎంతో మందిని ఆశ్చర్యపరిచాడు. అయితే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే బండ్లకు పాపులారిటీ ఎక్కువ. తాజాగా ఓ వ్యక్తి సహాయం కోరుతూ బండ్లను సంప్రదించడం, ఆయన వెంటనే ఆర్థకసహాయం చేయడం చకచకా జరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. 'నమస్కారం అన్నా. మా అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగింది. ఆపరేషన్ చేసి 48 కుట్లు వేశారు. 6నెలల వరకు డాక్టర్లు ఇంట్లోనే ఉండమన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరూ స్పందించడం లేదు. మీరైనా కొంచెం ఆదుకోండా గణేష్ అన్నా. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు' అంటూ ఓ వ్యక్తి బండ్ల గణేష్ను సంప్రదించాడు. ఈ ట్వీట్కు వెంటనే స్పందించిన బండ్ల గణేష్.. అతనికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. గూగుల్ పే నెంబర్ పంపించమని సదరు వ్యక్తిని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సాయం కోరిన వెంటనే బండ్ల గణేష్ ముందుకు రావడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సాయం కోరిన వ్యక్తి ఇంటిపేరు కూడా బండ్ల ఉండటం విశేషం. Please send me BANDLA Lingaiah google pay number https://t.co/mZcRqmymkP — BANDLA GANESH. (@ganeshbandla) July 14, 2021 -
బండ్ల గణేష్కు వార్నింగ్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్
కమెడియన్గా తెలుగు తెరకు పరిచయం అయిన బండ్ల గణేష్.. ఆ తర్వాత నిర్మాతగా మారాడు. బ్లాక్ బస్టర్ సినిమాలు సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు. అయితే టెంపర్ మూవీ అనంతరం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా ట్రాక్లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్తో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఇక పవన్ కల్యాణ్కు బండ్ల గణేశ్ ఎంతటి వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఏ కార్యక్రమంలో అయినా ఆయన మాట్లాడేటప్పుడు తప్పనిసరి పవన్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన తన దేవుడంటూ కొనియాడుతుంటాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే ఫ్యాన్స్లోనూ అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇది వరకే పవన్ నటించిన గబ్బర్సింగ్, తీన్మార్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో మరోసారి వస్తున్న నేపథ్యంలో.. బండ్ల గణేష్కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్కు హిట్ ఇవ్వకపోతే బండ్ల గణేష్పై పవన్ కత్తి పెట్టినట్లు కాటమరాయుడులోని ఓ ఫోటోను ఎడిట్ చేశారు. హిట్ ఇవ్వకపోతే రిజల్ట్ ఇలానే ఉంటుందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి బండ్ల గణేశ్.. ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం పవన్కల్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. Ok 👍 https://t.co/2Nxo91d5AP — BANDLA GANESH. (@ganeshbandla) July 11, 2021 -
హీరోగా మారనున్న బండ్ల గణేష్!.. ఇక దబిడిదిబిడే..
కమెడియన్గా తెలుగు తెరకు పరిచయం అయిన బండ్ల గణేష్.. ఆ తర్వాత నిర్మాతగా మారాడు. బ్లాక్ బస్టర్ సినిమాలతో నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత నటుడిగా దూరమైన ఆయన ఇటీవలి కాలంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు. మహేష్బాబుతో కలిసి ట్రైన్ ఎపిసోడ్లో కనిపించి మరోసారి బండ్ల గణేష్ నవ్వులు పంచాడు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇకపై అలాంటి పాత్రలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇటీవలె ఆయనకు తమిళ రీమేక్లో నటించిన అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్హిట్ అయిన మండెల రీమేక్లో హీరోగా నటించాలని దర్శకుడు బండ్లను అప్రోచ్ అవగా, అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తమిళంలో ప్రముఖ కమెడియన్ యోగిబాబు చేసిన పాత్రలో నటించేందుకు సిద్ధంగా లేనని చెప్పారట. అయితే తాజాగా మరోసారి బండ్ల గణేష్కు హీరోగా ఛాన్స్ వచ్చిందట. వెంకట్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథతో బండ్ల గణేష్ సంతృప్తి చెందారని, దీంతో ప్రధాన పాత్ర పోషించేందుకు ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీలో నటించేందుకు బండ్ల ఓకే చెప్పారని, అంతేకాకుండా ఈ సినిమాను స్వయంగా ఆయనే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అన్నది త్వరలోనే చూడాలి మరి. -
పేద ప్రజల దైవం మా బావగారు: మోహన్బాబు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం మహానేత జయంతిని పురస్కరించుకుని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. మరికొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రాజన్నకు నివాళులర్పిస్తున్నారు. ‘స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం,పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీనియర్ నటుడు మంచు మోహన్బాబు ట్వీట్ చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, రచయిత కోన వెంకట్, దర్శకుడు గోపిచంద్ మలినేని ట్విటర్ వేదికగా వైఎస్సార్కు నివాళులర్పించారు. Remembering former chief minister of #AndhraPradesh Shri YSR garu on his birth anniversary. #YSR 🙏#YSRJayanthi #YSRajasekharaReddy pic.twitter.com/XYYDHDD2TV — BANDLA GANESH. (@ganeshbandla) July 8, 2021 Remembering Dynamic leader #YSRajasekharaReddy Garu on his birth anniversary 🙏🙏 pic.twitter.com/yJczHRjBXo — Gopichandh Malineni (@megopichand) July 8, 2021 Dr. Y.S.R 🙏 A legendary leader who became immortal with his services to the people through various innovative schemes and welfare programs. Let’s remember him on his Birth Anniversary 🙏#YSRJayanthi pic.twitter.com/mGQ0cFYXpH — Kona Venkat (@konavenkat99) July 8, 2021 -
అంతరిక్షంలోకి ‘బండ్ల’ ఫ్యామిలీ.. గణేశ్ ట్వీట్ వైరల్
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపనుంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్తోపాటు ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష ఒకరు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం శిరీష. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం శిరీషపై ప్రశంసలు జల్లు కురిపిస్తోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ఓ ట్వీట్ కొత్త చర్చకు దారితీస్తోంది. బండ్ల కుటుంబానికి చెందిన శిరీష్ అంతరిక్షంలోకి వెళ్తునందుకు గర్వంగా ఉందని అంటున్నాడు గణేశ్. ‘మా బండ్ల ఫ్యామిలీ మరో ఘనత సాధించినందుకు గర్వంగా ఉందని’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల శిరీష్ గణేశ్కి సోదరి అవుతుందా? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి బండ్ల శిరీష నిజంగానే గణేశ్కి బంధువు అవుతుందా? లేదా ఇంటిపేరు ఒకే రకంగా ఉన్నందుకు అలా ట్వీట్ చేశారా అనేది సస్పెన్స్గా మారింది. దీనిపై బండ్ల గణేశే క్లారిటీ ఇవ్వాలి. Sirisha Bandla daughter of Dr. Muralidhar Bandla and Anuradha Bandla is going into space on July11th, 9 am. We are all proud of you, Sirisha! @SirishaBandla “Astronaut 004” Congratulations! We are all really proud of you !💐💐💐 pic.twitter.com/L615JQD3lV — BANDLA GANESH. (@ganeshbandla) July 2, 2021 -
వైరల్: పవన్ కల్యాణ్ చిన్ననాటి ఫొటో షేర్ చేసిన బండ్ల గణేష్
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ పవన్ స్టార్ పవన్ కల్యాణ్కు ఎంతటి వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఏ కార్యక్రమంలో అయినా బండ్ల మాట్లాడేటప్పుడు తప్పనిసరి పవన్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన తన దేవుడంటూ కొనియాడుతుంటాడు. ఇటీవల పవన్ను బండ్ల కొత్తగా దేవర అని పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ చిన్ననాటి ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా హల్చల్ చేస్తోంది. పొట్టి నిక్కరు, కాటన్ షర్ట్ ధరించి ఉన్న పవన్ ఫొటోను తాజాగా బండ్ల గణేశ్ షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘ఈ పసివాడే నా దేవర’ అంటూ సర్ప్రైజ్ ఇచ్చాడు. అది చూసి అభిమానులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పవన్కు సంబంధించిన ఈ రేర్ పిక్ షేర్ చేసినందుకు బండ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో ‘హరిహర వీరమల్లు’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ మూవీ నుంచి ఇటీవల మేకింగ్ వీడియో బయటకు రాగా అది వైరల్గా మారింది. ఇందులో పవన్ పోరాట యుద్ద వీరుడిలా కనిపించనున్నాడు. పవర్ స్టార్ ఇలాంటి పాత్రల్లో నటించడం ఇదే మొదటి సారి కావడంతో ఈ సినిమాపై అంచానాలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇక అభిమానులైతే తమ హీరోని సరికొత్తగా చూడబోతున్నందున ఈ మూవీ విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పసివాడే నా దేవర @PawanKalyan 🙏 pic.twitter.com/LNly8GzUo1 — BANDLA GANESH. (@ganeshbandla) June 30, 2021 -
ఆ వార్తల్లో నిజం లేదు, ఫైనల్ అయితే నేనే చెప్తా : బండ్ల గణేశ్
వకీల్ సాబ్ చిత్రంలో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం పుల్ జోరు మీద ఉన్నాడు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినీ కెరీర్లో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరశంకర్ అనే చిత్రంతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్లో కూడా నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమాల షూటింగ్ ఆగిపోయింది. ఈ రెండు చిత్రాల తర్వాత హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ కాంబినేషన్లో రాబోతోన్న సినిమా కోసం సిద్దంగా ఉన్నారు. ఆ తరువాత బండ్ల గణేశ్తో ఓ సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని బండ్ల కూడా కన్ఫాం చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ఖిలాడి చిత్ర డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడని ఆ వార్త సారాంశం. దీనిపై బండ్ల గణేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సినిమా ఫైనల్ అయ్యాక తనే అఫీషియల్గా ప్రకటిస్తాని స్పష్టం చేశాడు. చదవండి: రేపు అభిమానులకు ఆర్ఆర్ఆర్ సర్ప్రైజ్ నా కల నిజమైంది: ప్రియదర్శి -
తండ్రికి హెయిర్ కటింగ్ చేస్తున్న బండ్ల గణేష్
-
సూపర్ బండ్ల గణేశ్ అన్నా...వీడియో వైరల్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. చాలా సార్లు ఆయన చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. సెలూన్కి వెళ్లి కటింగ్ చేయించుకుంటే ఎక్కడ కరోనా మహమ్మారి సోకుతుందో అనే భయంతో చాలా మంది అలాగే గడ్డాలు, మీసాలు పెంచేస్తున్నారు. కొందరు మాత్రం ఇంట్లోనే కత్తెర పట్టి కటింగ్ చేసుకుంటున్నారు. తాజాగా ఇదే పని బండ్ల గణేశ్ చేశాడు. తన తండ్రికి తానే స్వయంగా కటింగ్ చేశాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ‘సూపర్ అన్నా’, ‘గుడ్ జాబ్..మంచి కొడుకువని నిరూపించుకున్నావు’, మల్టీ టాలెంటెడ్ పర్సన్ని నువ్వు’ అంటూ బండ్ల గణేశ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వైరల్: టీకా తీసుకుంటూ ఏడ్చేసిన నటి ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక.. -
Bandla Ganesh: తమిళ మూవీ రీమేక్, హీరోగా బండ్ల గణేశ్
ఒకప్పుడు కమెడియన్గా తెలుగు వెండితెరపై నవ్వులు పూయించిన బండ్ల గణేశ్ తర్వాత పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి సినిమాల్లో నటించడం తగ్గించిన బండ్ల నిర్మాతగా సెటిలైపోయాడు. అయితే వెండితెరపై మాయమైన బండ్ల అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తూ ప్రేక్షకులకు దర్శనమిస్తున్నాడు. గత ఏపీ ఎన్నికల సమయంలో బ్లేడ్ వ్యవహరంతో ఆయన వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పూర్తిగా సినిమాలు తగ్గించిన ఆయన ఇటీవల మహేశ్ బాబు ‘సరిలేరు నీకేవ్వరు’ సినిమాతో మరోసారి కెమెరా ముందుకు వచ్చాడు. ఇదే జోష్లో ఉన్న బండ్ల గణేశ్ తాజాగా తెరపై హీరోగా అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఓ తమిళ మూవీని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాలీవుడ్లో టాక్. అంతేకాదు ఇందులో ఏకంగా లీడ్ రోల్ పోషించేందుకు బండ్ల సన్నాహాలు చేస్తున్నాడట. తమిళంలో వచ్చిన ‘మండెల’ మూవీ విడుదలైన తర్వాత పలు వివాదాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఎంతటి స్థాయిలో నెగిటివ్ టాక్ వచ్చిందో అంతే రేంజ్లో సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీని బండ్ల తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఎలాగైన ఈ మూవీని తెలుగు తెరపైకి ఎక్కించేందుకు తెలుగు హక్కుల కోసం ఆయన కాస్తా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇక తమిళంలో వచ్చిన ఈ ‘మండెల’ మూవీలో హీరోగా తమిళ నటుడు యోగిబాబు నటించాడు. అయితే ఈ పాత్రకు తెలుగులో బండ్ల గణేశ్ అయితే కరెక్ట్ సరిపోతారని ఓ దర్శకుడు ఇచ్చిన సలహా విని తానే హీరోగా నటించాలని బండ్ల ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. బండ్ల గణేశ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీలో ఆయన హీరోగా నటిస్తారా లేక వేరే నటుడిని తీసుకుంటారో తెలియాలంటే కోద్దిరోజుల ఆగాల్సిందే. అయితే దీనిపై ఇంతవరకు బండ్ల గణేశ్ స్పందించకపోవడం గమనార్హం. చదవండి: Bandla Ganesh: మళ్లీ తప్పులో కాలేసిన బండ్ల గణేష్, నెటిజన్ల కౌంటర్ అడ్డంగా దొరికిన బండ్ల గణేష్: నెట్టింట్లో నవ్వులపాలు -
Bandla Ganesh: మళ్లీ తప్పులో కాలేసిన బండ్ల గణేష్, నెటిజన్ల కౌంటర్
బండ్ల గణేష్.. ప్రస్తుతం ఈ పేరు సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. స్టేజ్ ఎక్కితే చాలు ఆపకుండా తన వాక్ చాతుర్యం ప్రదర్శించే గణేష్ తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. ట్విటర్లో క్లారిటి లేని పోస్టులు పెట్టి తప్పులో కాలేస్తుంటాడు. అలా నెటిజన్లకు దొరికిపోవడంతో ఈ పోస్టులను డిలీట్ చేస్తుంటాడు. తాజాగా మరోసారి బండ్ల గణేష్ తప్పులో కాలేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తాను ఇన్స్టాగ్రామ్లోకి అడుగుపెడుతున్నట్టు ఆయన ప్రకటించాడు. తాను ఇన్స్టాలోకి ఎంట్రీ ఇస్తున్నానని ఇన్స్టా ఐడీ ఇదేనంటూ ట్వీట్ చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఆయన ఇన్స్టా ప్రొఫైల్కు సంబంధించిన లింక్ మాత్రం షేర్ చేయడం మరిచిపోయాడు. అది గమనించి ఆయన ఆ ట్వీట్ను డిలీట్ చేసి మళ్లీ పోస్టు చేశాడు. రెండోసారి కూడా లింక్ షేర్ చేయడం మరచిపోయి మళ్లీ ఆ ట్వీట్ చేశాడు. ఇక మూడోసారి కూడా అదే తప్పు చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. దీంతో నెటిజన్లు బండ్ల గణేశ్ను తమదైన శైలిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ఏం చేస్తున్నావ్ అన్నా? ఇన్స్టాగ్రామ్ లింక్ ఏది.. ఎందుకు ట్వీట్స్ డిలీట్ చేస్తున్నావ్.. మళ్లీ ఎందుకు ట్వీట్లు పెడుతున్నావ్’ అంటూ కామెంట్లు పెడుతు కౌంటర్లు వేస్తున్నారు. -
నిలకడగా బండ్ల గణేష్ ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న నిర్మాత బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం జ్వరం, తదితర లక్షణాలు ఉండటంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం బండ్ల గణేష్ను ప్రత్యేక గదిలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: ఆస్పత్రిలో బెడ్ అయినా ఇవ్వండి లేదా చంపేయండి కరోనా విలయం: కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత -
బండ్ల గణేశ్కి మళ్లీ కరోనా.. ఐసీయూలో చికిత్స!
ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేశ్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇటీవల వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వెళ్లి వచ్చిన ఆయన..మరుసటి రోజు నుంచే జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతేడాది జూన్లో కరోనాని జయించిన బండ్ల గణేశ్, మళ్లీ ఇప్పుడు రెండోసారి కరోనా బారిన పడటంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కరోనా కలకలం: దిల్ రాజు ఎంత పనిచేశావ్.. -
వకీల్సాబ్ : ట్రైలర్కే అద్దాలు పగిలితే.. ఇక సినిమా రిలీజైతే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఏప్రీల్9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం అభిమానుల మధ్య ట్రైలర్ను విడుదల చేశారు. వైజాగ్ థియేటర్లో ట్రైలర్ చూసేందుకు పవన్ అభిమానులు ఎగబడ్డారు. కిక్కిరిసిన జనంతో అద్దాలు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన పలువురు పవన్ అభిమానులు...'కేవలం ట్రైలర్ కే అద్దాలు పగలకొట్టేస్తే రేపు సినిమా రిలీజ్ కు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. చాలా ఆకలి మీదున్నాం' అని అంటున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ను సినీ నిర్మాత బండ్ల గణేష్..తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోను అభిమానులు రీట్వీట్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా ‘పింక్’కు రీమేక్గా వస్తున్న సినిమా ఇది. హిందీలో అమితాబ్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై పవన్ను చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజ్, శిరీశ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చదవండి : వకీల్సాబ్ ట్రైలర్ లాంఛ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ వకీల్ సాబ్ ట్రైలర్పై రామ్ చరణ్ కామెంట్ -
అడ్డంగా దొరికిన బండ్ల గణేష్: నెట్టింట్లో నవ్వులపాలు
టాలీవుడ్లో బండ్ల గణేష్ ప్రస్థానం ఓ పట్టాన అర్థం కాదు. కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఉన్నట్లుండి నిర్మాతగా మారి, ఆ వెంటనే స్టార్ హీరోలతో సినిమాలు తీసి, సూపర్ హిట్లు అందుకుని ఎంతో మందిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అతడు తక్కువ కాలంలోనే యూటర్న్ తీసుకుంటూ పాలిటిక్స్కు గుడ్బై చెప్పాడు. తిరిగి సినిమాల బాట పట్టాడు, కానీ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టు నెట్టింట్లో నవ్వులపాలైంది. ఒకసారి కాదు, రెండుసార్లు తప్పులో కాలేయడంతో అతడిని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ముఖాన మాస్కు లేకపోతే ఫైన్లు వేస్తూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మాస్కు ధరించకపోతే రూ.2 వేల రూపాయల ఫైన్ వేస్తున్న ఫొటోను ఆయన ట్విటర్లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా అందరూ మాస్క్ ధరించాలని సూచించాడు. ఆయన ఉద్దేశ్యం బాగానే ఉన్నా వాక్యంలో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. Wear Mask అని రాయాల్సింది పోయి Where Mask అని ట్వీట్ చేశాడు. దీన్ని చాలామంది వేలెత్తి చూపించడంతో వెంటనే దాన్ని డిలీట్ చేశాడు. ఈసారి Ware Mask అంటూ మరోసారి తప్పు ట్వీట్ చేసి మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు. మనది ఏ స్కూల్ అన్నా.. అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 'ఈయన దెబ్బకు మాకు వచ్చిన స్పెల్లింగ్ కూడా మర్చిపోయేలాగా ఉన్నామే', 'అది ware, where, ware కాదు, wear' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 1at easdu😁 pic.twitter.com/6pOHLQgwBI — DILEEP (@superstar811995) March 29, 2021 Ware mask 😷 @besafe @CPHydCity @DCPWZHyd pic.twitter.com/v8DEWaeP1T — BANDLA GANESH. (@ganeshbandla) March 29, 2021 చదవండి: రోడ్డు మీద మహిళ ఇబ్బందులు: సన్నీలియోన్ భర్త సాయం ముక్కు అవినాష్ తల్లికి అనారోగ్యం: CMRF నుంచి చెక్ -
జోకర్ని కాదు.. ఫైటర్ని : బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార టీఆర్ఎస్ పార్టీపై అనేక విమర్శలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేయని విమర్శలు ఆయన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి బండ్ల గణేష్ పేరు పొలిటికల్ తెరపైకి వచ్చింది. (చదవండి : ‘మీకో దండం.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు’) ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన కామెడీలా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి బండ్ల గణేష్ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ స్పందించారు. ‘నేను జోకర్ని కాదు.ఫైటర్ని. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అయింది. -
మీకో దండం.. నాకేం సంబంధం లేదు: బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్: తను మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు వస్తున్న వదంతులను నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొట్టి పారేశారు. ఏ పార్టీలో చేరడం లేదని, రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగినట్లు స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా బండ్ల గణేష్ తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపించాయి. త్వరలోనే భారతీయ జనతా పార్టీలో(బీజేపీ) పార్టీలో చేరబోతున్నట్లు వదంతులు వ్యాపించాయి. కాగా ఈ రూమర్లను ఖండిస్తూ రెండు రోజుల క్రితం బండ్ల గణేష్ తన ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు. ‘నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్’ అంటూ పేర్కొన్నారు. కాగా 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం తన పౌల్ట్రీ వ్యాపారాన్ని చూసుకుంటూ, సినిమాలపైన ఫోకస్ పెట్టారు. చదవండి: దయచేసి నా కడుపు మీద కొట్టకండి నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్ 🙏🙏🙏 — BANDLA GANESH. (@ganeshbandla) November 22, 2020 అయితే ఎంత చెప్పినప్పటికీ బండ్ల గణేష్ రాజకీయ పునఃప్రవేశంపై పుకార్లు ఆగడం లేదు. కొందరు పనిగట్టుకుని మరీ బండ్ల గణేష్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఊరుకోండి సార్ మీరు ఇలాగే అంటారు. మరి కాసేపటికి మనుసు మార్చుకుంటారు. ఎన్నిసార్లు చూడలేదు’ అంటూ రచ్చ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది బీజేపీలోకి చేరుతున్నారని, బండ్ల గణేష్ కూడా త్వరలో కాషాయ కండువా కప్పుకోబుతున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రూమర్లపై మరోసారి స్పందించిన నిర్మాత.. ‘నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం.’ అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీ షేర్ చేశారు. మరి ఇప్పటికైనా ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి. చదవండి: అద్భుతమైన వార్త, బాస్ ఓకే : బండ్ల గణేష్ నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం. 🙏 — BANDLA GANESH. (@ganeshbandla) November 26, 2020 -
దయచేసి నా కడుపు మీద కొట్టకండి : బండ్ల గణేష్
బండ్ల గణేష్.. ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా మాట్లాడతాడో అంచనా వేయడం కూడా కష్టమే. ఆయన మాటలతో పాటు ఎదుగుదల కూడా అందరికి ఆశ్చర్య కలిగించింది. కమెడియన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్.. ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు. అంతేకాదు ప్రొడ్యూసర్గా స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో తానూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇటీవల కరోనా నుంచి కోలుకున్నాక తన ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఇకపై ఎవరిని తక్కువ చేసి మాట్లాడనని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఇప్పటి వరకు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కరోనా నుంచి కోలుకున్నాక బండ్ల దాదాపు పాజిటివ్ విషయాలనే ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఆయన 'నా బాస్ ఓకే చెప్పారు. నా కలలు మరోసారి నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్కి ధన్యవాదాలు' అంటూ గణేష్ ఇటీవల ట్వీట్ చేయడంతో మరోసారి గణేష్, పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మెగాభిమానులు కూడా బండ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ.. మంచి డైరెక్టర్ని సెట్ చేయమంటూ సలహాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో తనపైన వస్తున్న వార్తల పైన బండ్ల గణేష్ స్పందిస్తూ‘ వీపుమీద కొట్టండి .కానీ నీ దయ చేసి కడుపు మీద కొట్టకండి .ఇది నా విన్నపం.నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన’ అని ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ వెనుక ఉన్న విషయం ఏమిటనేది మాత్రం బండ్ల గణేష్ తెలియజేయలేదు. -
అద్భుతమైన వార్త, బాస్ ఓకే : బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్ : నిర్మాత బండ్ల గణేష్కు మరోసారి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే చెప్పేసినట్టు కనిపిస్తోంది. దీంతో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తన కల నెర వేరబోతోందంటూ కొత్త ప్రాజెక్టును పవన్ వీరాభిమాని ప్రకటించారు. ఈ విషయాన్ని సోమవారం ఉదయం బండ్ల గణేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బాస్ ఓకే చెప్పారు. మరోసారి కల నెరవేరుతోంది. ఇందుకు దేవుడు పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. (నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మార్వలెస్ లవ్ స్టోరీ) ‘‘నా భవిష్యత్తును ఈరోజు 11.23 గంటలకు ప్రకటిస్తాను. నా శ్రేయోభిలాషులకు ఇదొక అద్భుతమైన వార్త’’ అని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్తో తీసుకున్న ఒక ఫొటోను కూడా పోస్ట్ చేయడం విశేషం. దీంతో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ లాంటి మరో బ్లాక్ బస్టర్ సిద్ధం కానుందంటూ పండుగ చేసుకుంటున్న అభిమానులు ఆ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనిపై అధికారికంగా వివరాలు ప్రకటించాల్సి ఉంది. విరామం తరువాత ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్న పవన్ కళ్యాణ్ పింక్ సినిమా రీమేక్ ‘వకీల్ సాబ్’ లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు బోనీ కపూర్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. My boss said okay and once again my dreams come true . Thank you my god @PawanKalyan 🙏. pic.twitter.com/x0s1nQy3Fy — BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2020 -
ఎట్టకేలకు మెత్తబడ్డ బండ్ల గణేష్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాకు అవకాశమిచ్చినా తనను గుర్తుకు పెట్టుకోలేదని కొద్ది రోజుల కిత్రం దర్శకుడు హరీష్ శంకర్పై విమర్శలకు దిగిన నిర్మాత బండ్ల గణేష్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఈ చిన్న జీవితంలో పోట్లాటలు, శత్రుత్వాలు అవసరం లేదని ట్విటర్లో పేర్కొన్నారు. హరీష్ తనకు కాల్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తనకు కాల్ చేసి మట్లాడినందుకు ఆయనకు బండ్ల గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ఇద్దరు దర్శకనిర్మాతల కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘గబ్బర్సింగ్’ విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ఆ సినిమాకు పని చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ హరీష్ శంకర్ ట్విటర్లో ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: గణేష్-హరీష్ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు) అయితే, అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. నిజానికి ఆయన మరిచిపోయారో లేక కావాలనే చెప్పలేదో తెలియదు కాని ఈ విషయంపై బండ్ల గణేష్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ‘అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసింది నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయి’అని బండ్ల గణేష్ గతంలో ఏకి పారేశాడు. (పొరపాటు జరిగింది.. క్షమించడంటూ బండ్ల ట్వీట్) @harish2you thank you so much brother for your concern. Felt really happy after your call , this is a small life no fights no enemies.🙏 — BANDLA GANESH. (@ganeshbandla) July 26, 2020 -
ఒట్టు పొరపాటున జరిగింది: బండ్ల గణేష్
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం పవర్స్టార్. శనివారం ఉదయం 11 గంటలకు వర్మ ఈ చిత్రాన్ని ఆర్జీవి వరల్డ్ థియేటర్లో విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్తో పాటు చాలా మంది నటీ,నటులను పోలిన వ్యక్తులతో ఈ సినిమా తెరకెక్కించారు. ఇంతవరకు బాగానే ఉన్నా వర్మ తాజాగా విడుదల చేసిన `బ్రదర్స్ వీడియో`కు బండ్ల గణేష్ ట్విట్టర్లో రియాక్ట్ అవుతూ లైక్ కొట్టారు. ఇది పవర్ స్టార్ అభిమానుల్ని షాక్కి గురిచేసింది. (వర్మ ఆఫీస్పై జనసేన కార్యకర్తల దాడి) కాగా ఆ వీడియోలో పవన్, చిరంజీవి పోలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వర్మ పోస్ట్ చేసిన ఈ వీడియోకి బండ్ల గణేష్ లైక్ చేయడం, ఆ వెంటనే ఓ అభిమాని 'గదంతా కాదు బండ్లన్నా.. ఈ వీడియోను ఎందుకు లైక్ చేసినవ్` అని అడిగగా.. వెంటనే స్పందించిన బండ్ల `ఒట్టు ఏదో పొరపాటున జరిగింది. నేనెప్పుడూ ఇలా చేయను. జరిగిన దానికి క్షమించండి` అంటూ బదులిచ్చాడు. (రెండు రోజుల తర్వాత కరోనా అంటూ ఫోన్..!) -
రెండు రోజుల తర్వాత కరోనా అంటూ ఫోన్..!
సనత్నగర్: కనిపించే శత్రువుతో యుద్ధం చేయడానికి ముందుగా అవసరమైన ఆయుధాలన్నింటినీ సమకూర్చుకుంటాం. మరి కనిపించని శత్రువు కరోనాతో యుద్ధం చేయడానికి ఏం చేయాలి. పౌష్టికాహారంతో ఇమ్యూనిటీ పెంచుకోవడమే కరోనాపై యుద్ధానికి సరైన ఆయుధం అంటారు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్. బండ్ల గణేష్కు కరోనా వచ్చిందంట కదా? అనేది ముఖ్యం కాదు. జాగ్రత్తలతో మసులుకోవాలి. 14 రోజుల పాటు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా హోం క్వారంటైన్లోకి వెళ్లి కరోనాను జయించిన బండ్ల గణేష్తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ... సాక్షి: కరోనాను ముందుగా ఎలా గుర్తించారు..? లక్షణాలు ఏమైనా కనిపించాయా? బండ్ల గణేష్: కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు నాలో లేవు. ఒక రోజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు జూబ్లీహిల్స్లోని ఓ క్లినిక్కు వెళ్లాను. అక్కడ డాక్టర్ కరోనా టెస్ట్ చేయించుకోండని సలహా ఇచ్చారు. దాంతో టెస్ట్ చేయించుకున్నాను. రెండు రోజుల తర్వాత కరోనా పాజిటివ్ అంటూ ఫోన్లో సమాచారం. అంతే కంగుతిన్నాను. సాక్షి:కరోనా పాజిటివ్ అని తెలియగానే ఎలా రియాక్ట్ అయ్యారు? బండ్ల గణేష్: ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. నేను ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను కదా? అనిపించింది. కరోనాపై టీవీల్లో ప్రసారమయ్యే కథనాలు చూస్తుండేవాణ్ణి. దీంతో భయమేసింది. నన్ను కరోనా నుంచి బయట పడేయమని ఆ భగవంతుణ్ణి వేడుకున్నాను. సాక్షి: కరోనాకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు? బండ్ల గణేష్: కరోనా అని తెలియగానే ఇంటి పైగదిలో హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయాను. తెలిసిన డాక్టర్ల సలహా తీసుకుని ఆ మేరకు మందులు వాడాను. ఉదయం, సాయంత్రం గుడ్లు తినేవాణ్ణి. వేడి నీటిని పుక్కిలించేవాణ్ణి. ఆవిరి పట్టుకునేవాణ్ణి. బ్రీథింగ్ వ్యాయామాలు బాగా చేశాను. విటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నాను. విడిచిన దుస్తులు కూడా వేడి నీటిలో వేసి పంపించేవాణ్ణి. మొత్తం మీద నా గదిని మెడిటేషన్ రూమ్గా మార్చేశాను. 14 రోజుల పాటు గది నుంచి బయటకు రాలేదు. సాక్షి:కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యేవారు? బండ్ల గణేష్: నా వద్దకు రాకపోయినా అవసరాలన్నింటినీ సమకూర్చేవారు. సాక్షి:కరోనా మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందంటారు? బండ్ల గణేష్:మనిషి దేనికీ అతీతం కాదు. కరోనా సోకడంతో ఎంతో బాధపడ్డాను. బతికినంతకాలం గొడవలు, వివాదాలు లేకుండా ఎంత మంచిగా బతికామన్నదే ముఖ్యం. అదే శాశ్వతం. సాక్షి: కరోనా విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి? బండ్ల గణేష్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య మంత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇది ఊహించని విపత్తు. ప్రభుత్వాలు కరోనా కట్టడికి వ్యూహాలన్నీ అమలు చేస్తున్నాయి. సాక్షి: కరోనా విషయంలో ప్రతిపక్షాల విమర్శలను ఎలా తీసుకుంటారు? బండ్ల గణేష్:కరోనా అనేది ప్రపంచ విపత్తు. ఈ సమయంలో విమర్శలు సరికాదు. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని అంతం చేయవచ్చు. సాక్షి:కరోనాను జయించిన వ్యక్తిగా కరోనాతో పోరాడున్న వారికి ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధమా? బండ్ల గణేష్: ప్లాస్మా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా వల్ల ఒకరి ప్రాణాలు నిలబడతాయంటే అంతకంటే భాగ్యం మరొకటి ఉంటుందా. సాక్షి:కరోనా సోకిన వారికి ఎలాంటి సందేశం ఇస్తారు? బండ్ల గణేష్:కరోనా సోకిన వారు ధైర్యంగా ఉండాలి. ఇమ్యూనిటీ పెంచుకోవాలి. వైద్యులు సూచించిన విధంగా మందులు, విటమిన్ ట్యాబెట్లు, మెడిటేషన్, ఆహార నియమాలను పాటించాలి. కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలి. సాక్షి:కరోనా దృష్ట్యా సినిమా రంగం ఎలా ఉండబోతుంది? బండ్ల గణేష్: కరోనా పోయాక ప్రజలు ఆటోమేటిక్గా థియేటర్ల వైపు వస్తారు. సినిమా రంగానికి మళ్లీ మామూలు రోజులు తప్పక వస్తాయి. -
కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలాగే భగవంతునికి ధన్యవాదాలు తెలిపారు. అపోలో డయోగ్నోస్టిక్స్లో కరోనా నిర్దారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ను కూడా షేర్ చేశారు. అందులో ఆయనకు కరోనా తగ్గినట్టుగా తేలింది. కాగా, ఇటీవల బండ్ల గణేష్కు కరోనా పాజిటివ్గా తేలడంతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను కలిసిన వారిలో కూడా ఆందోళన మొదలైంది. అయితే గణేష్ మాత్రం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అభిమానులకు చెబుతూ వచ్చారు. (చదవండి : నిర్మాత బండ్ల గణేష్కు కరోనా పాజిటివ్!) Thanks god 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/XLNv57nVEr — BANDLA GANESH. (@ganeshbandla) June 30, 2020 -
నిర్మాత బండ్ల గణేష్కు కరోనా పాజిటివ్!
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం బండ్ల గణేష్ను క్వారంటైన్కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.. బండ్ల గణేష్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా టెస్టులు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్కు కరోనావైరస్ అనే విషయం బయటపడగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఇటీవల ఆయనను ఎవరు కలిశారు..ఆయనతో ఎవరు భేటీ అయ్యారు.. అనే కోణంలో అధికారులు తెలుసుకుంటున్నారు. -
చీల్చి చెండాడటానికి ‘ఫైటే’ అక్కర్లేదు..
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్పై ప్రముఖ నిర్మాత పీవీపీ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ ట్యాలెంట్ను అభినందించిన పీవీపీ ఎంతో మంది నిర్మాతలు ఆయనతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయింటింగ్. తమ్ముడు స్టార్ట్ యూవర్ కుమ్ముడు’ అని పేర్కొన్నారు. పీవీపీ ట్వీట్పై స్పందించిన హరీష్.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల హరీష్ నైపుణ్యాన్ని తక్కువ చేసేలా నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీపీ తన ట్వీట్ ద్వారా హరీష్ ట్యాలెంట్ను గుర్తుచేయడంతోపాటు బండ్ల గణేష్కు గట్టి కౌంటర్ ఇచ్చాడని అభిమానులు అంటున్నారు. (చదవండి : వర్మ మరో సంచలనం.. క్లైమాక్స్ ట్రైలర్) కాగా, మే 11తో గబ్బర్సింగ్ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్ను గుర్తుచేసుకుంటూ హరీష్ శంకర్ ఒక లేఖను విడుదల చేశారు. అయితే అందులో బండ్ల గణేష్ పేరు మిస్సయింది. జరిగిన పోరపాటును గుర్తించిన హరీష్ మరో ట్వీట్లో బండ్ల గణేష్ గురించి ప్రస్తావించారు. అయితే అప్పటికే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా హరీష్పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. హరీష్కు తను అవకాశం ఇవ్వకపోతే సినిమాలే లేవని కామెంట్ చేశాడు. మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం.🙏🙏🙏🙏 Thank you for acknowledging my work Sir https://t.co/md0YjnZjqi — Harish Shankar .S (@harish2you) May 18, 2020 -
సూపర్స్టార్ లుక్పై బండ్ల గణేష్ కామెంట్స్
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పిల్లలతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మహేశ్ తన స్టైలీష్ లుక్తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. పిల్లలకు అతను అన్నయ్యాల ఉన్నడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సెలబ్రెటీలు సైతం ఎవరి శైలిలో వారు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ కూడా తనదైన స్టైల్లో మహేష్ తాజా లుక్పై స్పందించాడు. ‘మహేష్ సర్ మీరు హాలీవుడ్ సూపర్ స్టార్ లా ఉన్నారు’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చివరగా బండ్ల గణేష్ మహేశ్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అందులో తన రియల్ లైఫ్ కాంట్రవర్సీలపై కూడా గణేష్ సెటైర్స్ వేసుకోవడం జనాలను ఆకట్టుకుంది. ‘చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది’, ‘జాగ్రత్త మిత్రమా, వెంట ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు’ అంటూ మరో రెండు ట్వీట్లు చేయడంతో ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్లు చేశారో అని నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైనది. @urstrulyMahesh sir your looking @urstrulyMahesh from Hollywood superstar 💫💫💫 pic.twitter.com/MBFB78XCMA — BANDLA GANESH (@ganeshbandla) May 17, 2020 చదవండి: సమంత కోసం ‘మైత్రీ’ భారీ ప్లానింగ్! ప్రియా షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్ -
హరీష్పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ దర్శకనిర్మాతుల హరీష్ శంకర్, బండ్ల గణేష్ల మధ్య వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇరువురు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరు దర్శకనిర్మాతల కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘గబ్బర్సింగ్’ విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ హరీష్ శంకర్ ట్విటర్లో ఓ లేఖ విడుదల చేశారు. అయితే ఆ లెటర్లో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. అయితే నిజానికి ఆయన మరిచిపోయారో లేక కావాలనే చెప్పలేదో తెలియదు కాని.. దీనిపై బండ్ల గణేష్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ‘అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయి. అంతాక్ష్యరి ఎపిసోడ్ పవన్ సలహానే. హీరోయిన్ శృతి హాసన్ ఎంపిక కూడా పవర్స్టార్దే. అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడంలో డైరెక్టర్గా హరీష్ విజయం సాధించాడు’ అని ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ ధీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. ‘గబ్బర్ సింగ్’ విజయంలో ఎవరి పాత్ర ఏంటిదో అందరికీ తెలుసని తన సన్నిహితుల దగ్గర హరీష్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో వేచిచూడాలి. Thanks again for the overwhelming appreciations and celebrations.... 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg — Harish Shankar .S (@harish2you) May 11, 2020 చదవండి: భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్ -
ఏదో తెలిసో.. తెలియకో టంగ్ స్లిప్పై..
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ నవ్వులు కురిపించాడు. ఈ సినిమాలో తాను బ్లేడ్ గణేష్ పాత్ర పోషించానని, కానీ, ఈ సినిమా తర్వాత దయచేసి ఎవరూ తనను బ్లేడ్ గణేష్ అని పిలువద్దని వేడుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలువకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని ప్రకటించి అప్పట్లో బండ్ల గణేష్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘ఏదో తెలిసో తెలియకో టంగ్ స్లిప్ అయ్యాను. అందరూ కలిసి ఎర్రీ బీప్ అంటున్నారు కాబట్టి.. బండ్ల గణేష్గానే మీ అందరి ముందు ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో పది నిమిషాలు నేనుకూడా చింపేసా. ఇకముందు కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తా. సినిమాలు తీస్తా. సినిమానే నా జీవితం. ఇంకా వేరేవాటితో నాకు సంబంధం లేదు. అమ్మతోడు.. 30 ఏళ్ల నుంచి సినిమాల్లోనే ఉన్నాను. ఇంకో 30 ఏళ్లూ ఇక్కడే ఉంటాను’అని చెప్పుకొచ్చారు. సూపర్స్టార్ మహేశ్బాబు సినిమా ఈవెంట్కు చిరంజీవి రావడం ఆయన సంస్కారానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మహేశ్, చిరు అన్నదమ్ములుగా నటిస్తే చూడాలని ఉందన్నారు. చిరంజీవి మళ్లీ యాక్ట్చేయాలని బలంగా కోరుకున్నది తానేనని, కానీ ఆయన ఇప్పుడు తనను మరిచిపోయి అన్ని సినిమాలు వాళ్ల అబ్బాయికే చేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు తీసిన ఈ సినిమా రూ. 250 కోట్లు కలెక్ట్చేయాలని, అన్ని రికార్డులు చెరిపేయాలని కోరుకున్నారు. -
అప్పులోల్ల నెత్తిన బండ్ల.. 66 చెక్బౌన్స్ కేసులు
సిరిపురిపై సినిమా వాళ్లు కన్నుపడింది..సినీ అవకాశాలు, అధిక వడ్డీల ఆశ కల్పించారు. ఫైనాన్సియర్ల నుంచి రూ. కోట్లలో అప్పులు తీసుకొని తీర్చకుండా ‘సినిమా’ చూపిస్తున్నారు. ఓ బడా నిర్మాత ఏకంగా 66 చెక్బౌన్స్ కేసులలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అప్పులోల్ల నెత్తిన బండ మోపి తాపీగా సినీ షూటింగ్కు వచ్చినట్లు కోర్టుకు వచ్చి వెళుతున్నాడని బాధితులు వాపోతున్నారు. ప్రొద్దుటూరు క్రైం : సిరిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు సినీ ఫైనాన్షియర్లకు కూడా ప్రసిద్ధి. ఇక్కడున్న పలువురు చాలా కాలం నుంచి సినీ నిర్మాతలకు పెట్టుబడికి గాను అప్పు ఇస్తున్నారు. మార్కెట్లో కంటే ఎక్కువ వడ్డీ వస్తుండటంతో ఎక్కువ మంది సినీ ఫైనాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. సినీ ఫైనాన్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు. సినీ రంగంలోని వ్యక్తులకు గతంలో అప్పు ఇచ్చేవారు కొందరు మాత్రమే ఉండేవారు. అయితే లాభాలు బాగా వస్తుండటంతో ఇటీవల అప్పు ఇచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో హైదరాబాద్లోని పలువురు నిర్మాతలు ప్రొద్దుటూరుకు వచ్చి రూ. కోట్లలో అప్పు తీసుకొని వెళ్తున్నారు. స్థానికంగా ఉన్న కొందరు మధ్య వర్తుల ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఫైనాన్స్ ఇచ్చే వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అధికంగా ఉండటం విశేషం. సుమారు 7 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన ఒక నిర్మాతకు ఇక్కడి ఫైనాన్షియర్లు రూ. కోట్లలో అప్పు ఇచ్చారు. అయితే అతను ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో రుణదాతలు కోర్టులో కేసు వేశారు. అతను డబ్బు ఇవ్వకపోవడంతో చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ సంఘటన మరచిపోక ముందే మరో సినీ నిర్మాత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన సినీ నిర్మాత బండ్ల గణేష్బాబుకు ప్రొద్దుటూరుకు చెందిన అనేక మంది రూ. లక్షల్లో అప్పు ఇచ్చారు. అతను ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. చెక్బౌన్స్ కేసుకు బండ్లగణేష్ ప్రతి నెలా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరు అవుతున్నారు. 66 చెక్బౌన్స్ కేసులు బండ్లగణేష్పై ప్రొద్దుటూరు కోర్టుల్లో సుమారు 66 కేసులు ఉన్నాయి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 21, ఫస్ట్ ఏడీఎం కోర్టులో 66 చెక్ బౌన్స్లు నమోదు అవుతున్నాయి. ఫైనాన్షియర్లు ఇచ్చిన డబ్బుకు గాను ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లక పోవడంతో వారందరూ 2017లో కోర్టును ఆశ్రయించారు. నిర్మాత బండ్ల గణేష్బాబు పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పేరుపై ప్రొద్దుటూరులో అప్పు తీసుకున్నాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి అతను రూ. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. 66 మందికి సంబంధించి బౌన్స్ అయిన చెక్కుల విలువ సుమారు రూ.8 కోట్ల వరకు ఉంటుందని కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ ఐదు సార్లు నిర్మాత బండ్ల గణేష్ వాయిదా నిమిత్తం ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చారు. అయితే ఈ నెల 18న 35 కేసులకు సంబంధించిన చెక్బౌన్స్ కేసులో బండ్లగణేష్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అతను రాలేదు. తిరిగి ఈ కేసును నవంబర్ నెలకు కోర్టు వాయిదా వేసింది. అదో రంగుల ప్రపంచం.. సినిమా హీరోలు, హీరోయిన్లు ఎప్పుడైనా మన ప్రాంతానికి వస్తే వారిని చూడటానికి ఎగబడి పోతారు. ఎంత కష్టమైనా సరే వాళ్లను ఒక్కసారైనా కళ్లారా చూడాలని పరితపిస్తారు. అలాంటిది హీరోలు, హీరోయిన్లను దగ్గరగా చూసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్లకు ఫైనాన్షియర్లకు ఆహ్వానాలను పంపిస్తారు. వీరికి హీరోలు, హీరోయిన్లతో కలసి ఫొటోలు తీసుకోవడం, భోజనం చేసే అవకాశాలు కూడా లభిస్తుంటాయి. బాగా పేరున్న ఫైనాన్షియర్లకు కొత్త సినిమా ప్రీమియర్ షోకు వెళ్లే ఆఫర్లు కూడా వస్తుంటాయి. ఎక్కువ వడ్డీతో పాటు చిత్ర పరిశ్రమలోని అనేక మంది సెలెబ్రెటీలు పరిచయం అయ్యే అవకాశాలు ఉండటంతో కొంత మంది ఈ కారణంతో పెట్టుబడులు పెడుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా నిర్మాత బండ్ల గణేష్ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు రావాల్సి ఉండటంతో వస్తుందో రాదో అని బాధితులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు. -
బండ్ల గణేష్కు రిమాండ్, కడప జైలుకు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత బండ్ల గణేష్కు న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు కడప జైలుకు తరలించారు. కాగా కేసు విచారణ నిమిత్తం బండ్ల గణేష్ను పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి కడపకు తీసుకువచ్చి జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్ ముప్పుతిప్పలు పెట్టాడు. చెక్ కూడా బౌన్స్ కావడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. అయితే కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో బండ్ల గణేష్పై కోర్టు సెప్టెంబర్ 18న అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఇక ఈ నెల 5న బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్ -
పోలీసుల అదుపులో నిర్మాత బండ్ల గణేష్
-
నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్
బంజారాహిల్స్: పోలీసుల కళ్లు గప్పి చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ను ఎన్బీడబ్ల్యూ కింద బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఓ చెక్ బౌన్స్ కేసులో కడప ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అఫెన్సెస్ న్యాయమూర్తి సెప్టెంబర్ 18న గణేష్కు అరెస్ట్ వారంట్ జారీ చేశారు. ఫిలింనగర్లో నివసించే గణేష్కు వారెంట్ జారీ చేసేందుకు పోలీసులు ప్రయతి్నస్తుండగా తప్పించుకు తిరుగుతున్నాడు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పేందుకు పోలీస్స్టేషన్కు రాగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని గురువారం కడప కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. 2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్ ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. ఈ నెల 5న బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్లో నివసించే ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే గణేష్కు నోటీసులు జారీచేశారు. వీటికి సమాధానం చెప్పేందుకు ఆయన పోలీస్స్టేషన్కు రాగా పోలీసులు అరెస్ట్ చేశారు. -
సినీ నిర్మాత బండ్ల గణేశ్ అరెస్ట్
-
సినీ నిర్మాత బండ్ల గణేశ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సినీ నిర్మాత బండ్ల గణేశ్ను బుధవారం జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు నాన్బెయిబుల్ వారెంట్ జారీ చేయడంతో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన మహేష్ అని వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 13 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. తిరిగివ్వకపోవడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. విచారణకు హాజరుకాకపోవడంతో బండ్ల గణేశ్పై కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో రేపు ఆయనను హాజరుపరచనున్నారు. తన అనుచరులతో కలసి ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ)ను బెదిరించిన కేసులోనూ బండ్ల గణేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్ల గణేశ్ పంపించారని ఈనెల 5న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో పీవీపీ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండ్ల గణేశ్, అతడి అనుచరుడు కిశోర్పై ఐపీసీ సెక్షన్ 420, 448, 506, 109 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. బండ్ల గణేశ్ గతంలోనూ పలు కేసులు ఎదుర్కొన్నారు. నీ జతగా నేనుండాలి సినిమా విషయంలో తనను బండ్ల గణేశ్ మోసం చేశాడని మూడేళ్ల క్రితం హీరో సచిన్ జోషి ఫిర్యాదు చేశారు. సినిమా లాభాల్లో వాటా ఇస్తానని చెప్పి మాట తప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నీ జతగా నేనుండాలి సినిమాకు గణేష్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పటికీ ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది సచిన్ జోషినే. ఈ సినిమా విషయంలో గణేష్ తనని మోసం చేశాడని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని సచిన్ తరపున వైకింగ్ మీడియా అప్పట్లో ఫిర్యాదు చేసింది. (చదవండి: బండ్ల గణేశ్ తోడేలు లాంటివాడు) చెక్కు బౌన్స్ కేసులో బండ్ల గణేశ్కు 2017 నవంబర్లో ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. (చదవండి: ఇది ‘టెంపర్’ చిత్ర వివాదం) -
సినీ నిర్మాత బండ్ల గణేశ్పై క్రిమినల్ కేసు
బంజారాహిల్స్: సినీ నిర్మాత బండ్ల గణేశ్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్లగణేశ్ పంపించారని ప్రముఖ సినీనిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ) జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండ్లగణేశ్, అతడి అనుచరుడు కిశోర్పై ఐపీసీ సెక్షన్ 420, 448, 506, 109 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ రోడ్ నంబరు 82లో ఉండే ప్రసాద్ వి. పొట్లూరి ఇంటికి శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురు ఆగంతకులు ఇంట్లోకి చొరబడి అసభ్యపదజాలంతో దూషిస్తూ బండ్లగణేశ్తో ఉన్న ఆర్థిక వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై తన కార్యాలయంలో మాట్లాడుకుందామని చెబుతుండగానే తనపట్ల దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. టెంపర్ సినిమా నిర్మాణం కోసం బండ్ల గణేశ్ 2013లో తన వద్దకు వచ్చాడని, అందుకోసం రూ.30 కోట్లు రుణం ఇవ్వాల్సిందిగా అడిగాడని చెప్పారు. దీనికి తాను ఒప్పుకుని ఆమేరకు ఒప్పందం చేసుకుని రుణం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇందులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించి మిగిలిన రూ.7 కోట్లను మాత్రం ఇవ్వకుండా ఇప్పటి వరకూ నెట్టుకొచ్చాడన్నారు. 3 నెలల్లో ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఇవ్వకపోగా ఆమొత్తానికి సంబంధించి ఇచ్చిన పోస్టుడేటెడ్ చెక్కులు కూడా బౌన్స్ అయినట్లు తెలిపారు. తనపై హత్యాయత్నం చేయాలనుకున్నారని, తనకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాల్సిందిగా పీవీపీ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా బండ్లగణేశ్ శుక్రవారం రాత్రి పీవీపీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా అనంతరం ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపారు. -
బండ్ల గణేష్ది క్రిమినల్ మైండ్
-
సినీ నిర్మాత బండ్ల గణేష్పై కేసు
-
పీవీపీని బెదిరించిన బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్ : నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. వైఎస్సార్ సీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)ను బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి గతరాత్రి బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రానికి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్ చేశారు. గత కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి దాటాక కొంతమంది వ్యక్తులతో కలిసి పీవీపీ నివాసంపై బండ్ల గణేష్ మనుషులు బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపై పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 448, 506, రెడ్విత్ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ బండ్ల గణేష్పై చీటింగ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. -
రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్బై
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, నిర్మాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తాను చేసిన విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టినవారిని పెద్ద మనసుతో క్షమించమని బండ్ల గణేష్ కోరారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని బండ్ల గణేష్ తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొత్తలో హడావుడి చేసిన ఆయన రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ టికెట్పై ఆశలు పెట్టుకున్నా.. అడియాశే అయింది. దీంతో బండ్ల గణేష్ డీలా పడటంతో, కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపుల్లో భాగంగా ఆయనకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో బండ్ల గణేష్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు బండ్ల గణేష్ అతి చేష్టల వల్లే ఆయనను కాంగ్రెస్ కూడా దూరం పెట్టిందని భోగట్టా. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలనేదే తన చిరకాల కోరిక అని ... ప్రజాసేవ చేయాలనిపించి రాజకీయాల్లో వచ్చినట్టు చెప్పిన బండ్ల గణేష్ రాజకీయ ప్రస్థానం కొద్దిరోజుల్లోనే ముగిసినట్లు అయింది. అయితే బండ్ల గణేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్ చేయడం వెనుక మరేదో... వ్యూహం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పవన్ కల్యాణ్పై చేసిన ట్వీట్ అందుకు బలం చేకూరుస్తోంది. ‘నిజాయితీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు....నా దైవం, నా బాస్..పవన్ కల్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి అంటూ’ బండ్ల గణేష్ గురువారం ట్వీట్ చేశారు. దీంతో బండ్ల గణేష్ గాలి....జనసేనకు మళ్లిందేమో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మీ ఇష్టదైవం పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని సమాధానమిచ్చారు. తనకు పవన్ కల్యాణ్ తండ్రిలాంటి వారని చెప్పుకొచ్చిన విషయం విదితమే. దీంతో బండ్ల గణేష్ ...రాజకీయ నిష్క్రమణ వెనుక ఏదో మతలబు ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. నా వ్యక్తిగత కారణాల తో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదు. — BANDLA GANESH (@ganeshbandla) 5 April 2019 కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను. మీ బండ్ల గణేష్🙏🏻 — BANDLA GANESH (@ganeshbandla) 5 April 2019 కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను. -
గొంతు కోసుకోవడంపై స్పందించిన బండ్ల గణేష్
సాక్షి, తిరుపతి : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది బండ్ల గణేశ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హడావుడి చేసిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఫలితాలనంతరం మీడియా ముందుకు రాకుండా ఉండిపోయారు. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ సరిగ్గా ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పార్టీలో చేరేదే ఆలస్యం టీవీ చానళ్ల చుట్టూ తిరుగుతూ హల్చల్ చేశారు. పలు టీవీ చానెళ్ల ఇంటర్వ్యూల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని సవాల్ కూడా విసిరారు. అయితే ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో సదరు టీవీచానెళ్లు బండ్ల గణేశ్ను సంప్రదించే ప్రయత్నం చేశాయి. కానీ అతను మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చిన ఆయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ‘అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో లేను. మా పార్టీ గెలుస్తుందని ఎన్నో ఊహించుకున్నాం. కానీ ప్రజలు మా పార్టీని తిరస్కరించారు. టీఆర్ఎస్కు పట్టం కట్టారు. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉండాల్సి వచ్చింది. అరే కోపంలో వంద అంటాం సార్.! అవన్నీ నిజం అవుతాయా! మీరు కోసుకోమంటే కోసుకుంటా. చాలా అంటాం ఇవన్నీ మాములే. ఉరికే మావాళ్ల ఉత్సాహం కోసం అలా మాట్లాడాను. ఇప్పుడేం చేయమంటారు. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది దానికి ఏం చెబుతాం.’ అని గొంతు కోసుకోవడంపై తనదైన శైలిలో స్పందించారు. అంతేకాకుండా ఓటమి రేపు విజయానికి పునాదని చెప్పుకొచ్చారు. -
అరే కోపంలో వంద అంటాం సార్.!
-
బండ్ల గణేశా.. ఎక్కడా?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది బండ్ల గణేశ్పై సోషల్మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ముందు నుంచి టీవీ చానెళ్లలో హడావుడి చేస్తూ అందరిదృష్టిని ఆకర్షించిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఇప్పుడు కనబడటం లేదేందని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ సరిగ్గా ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న గణేశ్.. పార్టీలో చేరేదే ఆలస్యం టీవీ చానళ్ల చుట్టూ తిరుగుతూ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నట్లు హల్చల్ చేశారు. రాజేంద్ర నగర్ టికెట్ ఆశించిన బండ్ల గణేశ్కు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పదవితో సరిపెట్టింది. అయినా అసంతృప్తి చెందని బండ్ల గణేశ్.. పార్టీ తరఫున ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరడిగా జోరుగా ప్రచారం నిర్వహించారు. గెలుస్తామనే అతి విశ్వాసమో ఏమో కానీ పలు టీవీ చానెళ్ల ఇంటర్వ్యూల్లో ప్రజాకూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని సవాల్ విసిరారు. ఫలితాలు కాంగ్రెస్ అనుకూలంగా రాకుంటే కత్తులు, బ్లేడ్స్ పట్టుకు రావాలని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులకు సూచించారు. తీరా ఫలితాలు.. టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటం.. ప్రజాకూటమి తుడిచిపెట్టుకుపోవడంతో బండ్లను నెట్టింటి పోరగాళ్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్ ఏదైనా.. స్టేటస్లు ‘బండ్ల గణేశ్ ఎక్కడా?.. కత్తులు సిద్దంగా ఉన్నాయ్.. గొంతు కోసుకోవడానికి సిద్దమా?’ అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేస్తున్నారు. కుళ్లు జోకులతో మీమ్స్ను వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా బండ్లను ఇంటర్వ్యూ చేసిన సదరు చానెల్ జర్నలిస్ట్.. స్వీట్ బాక్స్ బ్లేడ్తో ఆయన ఇంటికి వెళ్లగా.. బండ్ల గణేశ్ బయటకు రాకపోవడం గమనార్హం. Bandlanna after seeing telangana election results..😂😂#TelanganaElectionResults #TelanganaElections2018 #TelanganaResults #TRS #Congress #BandlaGanesh pic.twitter.com/RHmTZbiHHW — manikanta nadipudi (@its_me_nmk) December 11, 2018 Waiting for #BandlaGanesh Anna mass entry after elections result #TelanganaElections2018 #TelanganaElectionResults #TelanganaWithKCR pic.twitter.com/w9zO7jJHf3 — ARYAN Surya 📌™ (@AryanSurya6) December 11, 2018 -
బండ్ల గణేశ్కు కీలక పదవి!
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ సినీ నిర్మాత బండ్ల గణేశ్ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఆయనకు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. పార్టీలో చేరినప్పటి నుంచి పలు టీవీ చానళ్లలో హడావుడి చేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు, రాజేంద్ర నగర్ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఓ చానెళ్లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అంతేకాకుండా తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. మహాకూటమి ఒప్పందంలో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో గణేశ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆ పార్టీ తరపున గణేశ్ గుప్తా బరిలోకి దిగుతున్నారు. దీంతో బుజ్జగింపుగా పార్టీ అధికార ప్రతినిధి పదవి కేటాయించింది. అయితే బండ్ల గణేశ్ ఈ పదవితో సంతృప్తి చెంది పార్టీ ప్రచారంలో పాల్గొంటాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఓవర్ యాక్షనే కొంప ముంచిందా? మరోవైపు బండ్ల గణేష్ ఓవర్ యాక్షన్ కొంప ముంచిందన్న ప్రచారం జోరు అందుకుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చేసిన హడావుడే టికెట్ రాకుండా చేసిందని, ఆయన అత్యుత్సాహమే కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాణస్వీకారానికి సంబంధించిన వీడియోలు.. ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన కొన్ని కామెంట్లూ విపరీతంగా వైరల్ కావడం అతనిపట్ల అధిష్టానానికి ప్రతికూల సంకేతాలు వెళ్లాయని తెలుస్తోంది. -
బండ్ల గణేశా.. టికెట్ దక్కెనా?
సాక్షి, హైదరాబాద్ : పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే సినీ నిర్మాత బండ్ల గణేశ్.. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. పలు టీవీ చానళ్లలో హడావుడి చేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, రాజేంద్ర నగర్ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. సుదీర్ఘ కసరత్తుల అనంతం అర్థాత్రి విడుదల చేసిన తొలి జాబితాలోను.. తాజాగా 10 మందితో ప్రకటించిన రెండో జాబితాలోను అతని పేరును ప్రకటించలేదు. అంతేకాకుండా గణేష్ ఆశిస్తున్న రాజేంద్ర నగర్ స్థానాన్ని పెండింగ్లో ఉంచింది. (చదవండి: కాంగ్రెస్ రెండో జాబితా) గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ బరిలోకి దిగి గెలిచారు. అనంతరం ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక మహాకూటమిలో మిత్రపక్షమైన టీడీపీ తమకే ఆ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతోంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తిక్ రెడ్డికి ఈ స్థానం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఫ్యామిలీకి ఒకే టికెట్ సిద్ధాంతమన్నా కాంగ్రెస్.. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, కోమిటి రెడ్డి బ్రదర్స్, మల్లు బ్రదర్స్లకు టికెట్లు ఇచ్చింది. దీంతో ఆమె ఈ టికెట్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. మరి అధిష్టానం బండ్ల గణేశ్కు అవకాశం ఇస్తుందా..? లేక టీడీపీకి వదిలేస్తుందో వేచి చూడాల్సిందే. ఎన్నికల నగార మోగినప్పటి నంచి హడావుడి చేస్తున్న బండ్ల గణేశ్కు టికెట్ దక్కపోతే పరిస్థితి ఏంటని.. ఆయన రాజకీయాల్లో కొనసాగుతాడా? లేక ఇతర పార్టీలవైపు చూస్తాడా? అనే చర్చ జోరు అందుకుంది. (చదవండి: 65 మందితో కాంగ్రెస్ తొలి జాబితా) -
రాజేంద్రనగర్ రేసులో నిర్మాత బండ్ల గణేశ్?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాసేపట్లో ఉత్కంఠ వీడనుంది. కాంగ్రెస్ గెలుపుగుర్రాలేవో తేలనుంది. ఖరారు చేసిన అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ఆ పార్టీ విడుదల చేయనుంది. ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న సెగ్మెంట్లను ప్రస్తుతానికి పక్కనపెడుతున్న ఏఐసీసీ.. ఆదివారం ప్రకటించే మలివిడత జాబితాలో అభ్యర్థులను ప్రకటించనుంది. ఒకరే పోటీపడుతున్న స్థానాలకు మొదటి జాబితాలో పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ జాబితా విడుదలతో పెండింగ్ స్థానాలపై కూడా స్పష్టత రానుంది. అదేసమయంలో పొత్తులో భాగంగా టీడీపీ, టీజేఎస్లకు కేటాయించే సెగ్మెంట్లేవనేది తేలనుంది. నేటి జాబితాలో మహేశ్వరం, కల్వకుర్తి, పరిగి, షాద్నగర్, ఎల్బీనగర్, కొడంగల్, వికారాబాద్, మేడ్చల్ నియోజకవర్గాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సబితకు లైన్క్లియర్! మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం)కి టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనయుడి కోసం టికెట్ను త్యాగం చేసిన ఆమెకు ఈసారి తొలి లిస్టులోనే చోటు లభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొడంగల్, పరిగి, కల్వకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, వంశీచంద్రెడ్డి అభ్యర్థిత్వాలకు కూడా ఆమోదముద్ర పడింది. ఎల్బీనగర్ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్, షాద్నగర్లకు కూన శ్రీశైలంగౌడ్, చౌలపల్లి ప్రతాప్రెడ్డిలను ఓకే చేసినట్లు సమాచారం. వికారాబాద్పై సస్పెన్స్ వికారాబాద్ అభ్యర్థిగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్కు లైన్క్లియరైంది. ఇదే టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్తో స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. మొదట ఆయనకు చేవెళ్ల ఇవ్వాలని భావించినా.. ఆయన సున్నితంగా తిరస్కరించడంతో ఈ సీటును కేఎస్ రత్నంకు కేటాయించేందుకు కమిటీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకొని రాహుల్గాంధీ జోక్యంతో వెనక్కితగ్గిన ప్రసాద్కు టికెట్పై అప్పట్లోనే హామీ లభించిందనే ప్రచారం జరిగింది. అదేసమయంలో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడమేగాకుండా.. ఎమ్మెల్సీగా బరిలో దిగి ఆర్థికంగా నష్టపోయిన చంద్రశేఖర్కు కూడా న్యాయం చేయాలని, ఆయనకు ఎక్కడి నుంచైనా టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సోనియాగాంధీ నేతృత్వంలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. దీంతో వికారాబాద్ అభ్యర్థి ఎవరనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. సామాజిక సమీకరణలతో.. తాండూరు స్థానం నుంచి పైలెట్ రోహిత్రెడ్డి పేరును ఖరారు చేసిన అధిష్టానం.. స్థానికంగా నెలకొన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో మొదటి జాబితాలో ప్రకటించకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీటుపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఇండిపెండెంట్గా పోటీచేస్తానని ఇప్పటికే ప్రకటించగా.. డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డితో అధిష్టానం మాట్లాడి బుజ్జగించింది. ఇక మేడ్చల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ పేరుకు ఆమోదముద్ర పడ్డట్లు ప్రచారం జరుగుతున్నా నేటి జాబితాలో ఆయన పేరు ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్గా ఉంది. ఇదే స్థానాన్ని ఆశిస్తున్న తోటకూర జంగయ్యయాదవ్.. సామాజికవర్గాల సమీకరణల్లో భాగంగా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీనికితోడు ఇరువురు నేతలు పోటాపోటీగా ప్రయత్నిస్తుండడంతో ఈ సీటును టీజేఎస్కు ఇచ్చే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సింగిరెడ్డి హరివర్దన్రెడ్డి ఇటీవల టీజేఎస్ తీర్థంపుచ్చుకున్నారు. దీంతో ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా వదిలివేయాలని కోదండరామ్.. కాంగ్రెస్ హైకమాండ్కు ఇచ్చి ప్రతిపాదనల్లో పేర్కొనడం చర్చానీయాంశంగా మారింది. రెండో విడతలో పట్నం? ఇబ్రహీంపట్నం అభ్యర్థిపై ఖరారుకు ఇంకా ఉత్కంఠ వీడలేదు. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సోదరుడు రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఈ స్థానం కోసం పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నారు. వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఈ త్రయం.. ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా గడుపుతున్నారు. ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా నెలకొనడంతో స్క్రీనింగ్ కమిటీ మల్లేశ్, మల్రెడ్డి బ్రదర్స్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డిని చర్చలకు ఆహ్వానించింది. ఈ సమావేశానికి మల్రెడ్డి సోదరులు గైర్హాజరుకాగా.. కోదండరెడ్డి, మల్లేశ్లు హాజరై తమ వాదన వినిపించినట్లు తెలిసింది. రాజేంద్రనగర్ రేసులో బండ్ల గణేశ్ రాజేంద్రనగర్ సీటును టీడీపీకి వదిలేస్తారా? కాంగ్రెస్సే బరిలో దిగుతుందా? అనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతుండగా, ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున సినీ నిర్మాత బండ్ల గణేశ్ పేరు తెర మీదకు రావడం ఆసక్తికరంగా మారింది. సీమాంధ్ర ఓటర్లు అత్యధికంగా ఉండడం.. కమ్మ సామాజికవర్గానికి గ్రేటర్లో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో గణేశ్కు టికెట్ ఇవ్వాలని మాజీ ఎంపీ లగడపాటి, మరికొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ టికెట్ తనకేనని ధీమాతో ఉన్న మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్రెడ్డికి కొంత ఇబ్బందికరంగా మారింది. -
చంద్రబాబును కలసిన ఒంటేరు, బండ్ల గణేశ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలు ఒంటేరు ప్రతాప్రెడ్డి, బండ్ల గణేశ్ శనివారం ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తూంకుంట నర్సారెడ్డి, రాములు నాయక్ శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఒంటేరు ఢిల్లీ వచ్చారు. ఏపీ భవన్లో బస చేసిన చంద్రబాబును ఒంటేరు గణేశ్తో వచ్చి కలిశారు. తెలంగాణలో ఏపీ పోలీసులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ప్రచారం ఊపందుకోవడం, పలుచోట్ల ఆ తరహా ఘటనలు బహిర్గతమైన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఒంటేరుకు కాంగ్రెస్ టికెట్ ఖరారైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతుండటంతో ఈసారి ఎలాగైనా కేసీఆర్ను ఓడించేందుకు బాబు ఆశీస్సులు తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబుతో సమావే శం అనంతరం బయటకొచ్చిన ఒంటేరు, బండ్ల ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ ఎంపీలతో కాసేపు ముచ్చటించారు. -
పవన్ కల్యాణ్కు బండ్ల గణేశ్ ఝలక్!
సాక్షి, ఢిల్లీ: సినీ నిర్మాత బండ్ల గణేశ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ్ల గణేశ్కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండ్ల గణేశ్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది చేస్తానని, ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. మీ ఇష్టదైవం పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని సమాధానమిచ్చారు. తనకు పవన్ కల్యాణ్ తండ్రిలాంటి వారని పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలనేదే తన చిరకాల కోరిక అని చెప్పారు. ప్రజాసేవ చేయాలనిపించి రాజకీయాల్లో వచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా... బేషరతుగా పార్టీలో చేరానని సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ వద్ద ఈ విషయం ప్రస్తావించలేదన్నారు. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు. సినిమా రంగం తనకు ప్రాణమని.. రాజకీయాలు వేరు, సినిమా రంగం వేరని చెప్పుకొచ్చారు. అయితే తానెంతో అభిమానించే పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరకుండా కాంగ్రెస్లోకి ఆయన రావడం చర్చనీయాంశంగా మారింది. -
కాంగ్రెస్లో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేశ్
-
బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి వేడుక
-
బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లికి ‘చిరు’
కమెడియన్ నుంచి బడా ప్రొడ్యుసర్ దాకా ఎదిగారు బండ్ల గణేష్. స్టార్ ప్రొడ్యుసర్గా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించిన గణేష్.. ఈ మధ్య సినిమాలను తగ్గించినట్టు కనిపిస్తోంది. బండ్ల గణేష్కు మెగా ఫ్యామిలీతో ఉన్న సన్నిహిత సంబంధం తెలిసిందే. రాంచరణ్తో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను కూడా ఆయన నిర్మించారు. నిన్న (ఆగస్టు 22) చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా గణేష్ చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు హైదరాబాద్లో జరిగిన బండ్ల గణేష్ సోదరుడి కుమార్తె పెళ్లికి చిరంజీవి హాజరయ్యారు. చిరు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి ఎస్ ఎస్ రాజమౌళి, కృష్ణంరాజు, గోపిచంద్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. -
అభివృద్ధిపై విమర్శలొద్దు
నారాయణపేట (మహబూబ్నగర్): ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది.. దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. ప్రం ద్రాగస్టున సీఎం కేసీఆర్ నేతృత్వంలో శ్రీకారం చుట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి వస్తే పరీక్షలు చేయించి కళ్లు తెరిపిస్తాం.. జరిగిన అభివృద్ధి చూయిస్తాం.. అని రాజ్యసభ సభ్యుడు బండ్ల ప్రకాశ్, పార్లమెంట్ సభ్యుడు జితేందర్రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నీళ్లు..నియామకాలు.. నిధుల పేరు తో 14 సంవత్సరాలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం నంబర్ వన్ స్థానానికి అడుగులు వేస్తున్నదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం అన్ని విధాలుగా నష్ట పోయిందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 24 గంటల కరెంట్ను ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని, రైతులకు పెట్టుబడిసాయం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇస్తూ ఏడాదికి ఖరీఫ్, రబీలో రూ.12 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించామన్నారు. మత్స్యకారుకలకు ఉపాధి కల్పించేందుకు చెరువుల్లో చేపలు వదలడం, కురవలకు గొర్రెలు, యాదవులకు గేదేలు ఇస్తున్నామని తెలిపారు. 46 వేల చెరువులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టి ఇప్పటికి 4 విడతల్లో 18 వేల చెరువులను పూర్తి చేసిందన్నారు. పేటకు కాటన్మార్కెట్ నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కాటన్ మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎంపీ జితేందర్రెడ్డి భరోసానిచ్చారు. తెలంగాణ రాష్ట్రం 17.20 శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ప్రపంచపుటాల్లోకి ఎక్కిందన్నారు. నేడు రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు రైతుబంధు చెక్కులు ఇస్తూ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. నాలుగు రోజుల్లో నారాయణపేటకు మిషన్భగీరథ నీళ్లు వస్తాయన్నారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైతుకు బాసటగా నిలిచాం దేవరకద్ర: రైతును అన్ని విధాలా ఆదుకుని వ్యవసాయాన్ని పండగ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచిందని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం దేవరకద్ర మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి పెద్దపీట వేసిందని, సాగునీటి వనరులను పెంచడానికి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రైతుకు అండగా నిలిచిందన్నారు. పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు రూ.35 వేల కోట్లను కేటాయించి 8 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి కృషి చేస్తోందన్నారు. కాకతీయుల కాలంలో తవ్విన చెరువులు, కుంటలకు గత రాష్ట్రంలోని 46 వేల చెరువులను, కుంటలను పునరుద్ధరించే పనులను చేపట్టిందన్నారు. గత 60 ఏళ్లలో రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరిపోయే గోదాములు ఉండగా నాలుగేళ్లలో 19 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు అందుబాటులోకి తెచ్చామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం బృహత్తర కార్యక్రమమన్నారు. రిజర్వేషన్ల వల్లే.. ప్రభుత్వం అన్నివర్గాలకు అధికారం పంచాలనే ఉద్దేశ్యంలో మార్కెట్ యార్డుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించి అందరికి అవకాశం కల్పించిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. దేవరకద్ర మార్కెట్ ఎస్సీలకు రిజర్వు చేయడం వల్ల ఒక దళితునికి చైర్మన్ అయ్యే అవకాశం వచ్చిందన్నారు. నూతన పాలక వర్గం రైతులకు అండగా ఉంటూ వారికి న్యాయం చేసే విధంగా చూడాలని కోరారు. ప్రమాణ స్వీకారోత్సవం.... నారాయణపేట, దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా సరాఫ్ నాగరాజు, దేవరకద్ర చైర్మన్గా దొబ్బలి ఆంజనేయులు, వైస్ చైర్మన్గా డోకూర్ రాములు ప్రమాణస్వీకారం చేశారు. దేవరకద్రలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ ఇవీ.గోపాల్, చిన్నచింతకుంట ఎంపీపీ క్రాంతి, మాజీ మార్కెట్ చైర్మన్ జట్టి నర్సింహారెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్, హర్షవర్దన్రెడ్డి, నాయకులు కొండ శ్రీనివాస్రెడ్డి, భాస్కర్రెడ్డి, కుర్వ శ్రీను, వెంకటేశ్, బాలస్వామి, నరేందర్రెడ్డి, శివరాజు, సత్యనారాయణ పాల్గొన్నారు. -
బండ్ల గణేష్పై అట్రాసిటీ కేసు నమోదు
-
బండ్ల గణేష్పై అట్రాసిటీ కేసు నమోదు
ఇటీవల వరుస వివాదాలతో హల్చల్ చేస్తున్న టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్లగణేష్, అతని సోదరుడు శివబాబులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్కు చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు భూమిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేష్ గతంలో ఒప్పందం చేసుకున్నారు. ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో ఉన్న ఈ పౌల్ట్రీ ఫామ్లను ఒప్పందం ప్రకారం బ్యాంకు రుణాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే బ్యాంక్ ఇచ్చిన గడువులోగా రుణాలను గణేష్ తిరిగి చెల్లించకపోవటంతో ఆ పౌల్ట్రీ ఫామ్లతో పాటు దిలీప్ చంద్రకు చెందిన ఇంటిని కూడా బ్యాంకు అధికారులు సీజ్ చేసి, వారి ద్వారానే ఆ ఆస్తులను సీజ్ చేశారు. తరువాత తమకు రావాల్సిన డబ్బుల కోసం దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి గణేష్ పౌల్ట్రీ ఫామ్ ఆఫీసుకు వెళ్లారు. ఆసమయంలో గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో తమను దూషించారంటు కౌన్సిలర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిరువురిపై అట్రాసిటీ కేసు నమోదైంది. -
బండ్ల గణేశ్కు ఆంధ్రా రాజకీయాలు ఎందుకు?
సాక్షి, విజయవాడ : టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోజాపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బండ్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బండ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం విజయవాడ పోలీస్ కమీషనరేట్లో వారు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత బండి పుణ్యశీల నేతృత్వంలోని బృందం కమీషనర్ను కలిసి ఫిర్యాదును అందించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. బండ్ల గణేష్ కు ఆంధ్రా రాజకీయాలతో అసలు అవసరం ఏంటని? వారు ప్రశ్నించారు. మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదని.. దమ్ముంటే విజయవాడ వచ్చి మాట్లాడాలని ఆమె సవాల్ విసిరారు. ఓ మహిళా నేతపై అసభ్యపదజాలం వ్యాఖ్యలు చేయటం దారుణమని.. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆమె కోరారు. మహిళా శాసనసభ్యురాలిపై అనుచిత వ్యాఖ్యల అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆమె డీజీపీకి విజ్ఞప్తి చేశారు. నటి మీరా చోప్రా, నటుడు సచిన్ జోషి గతంలో బండ్ల వ్యక్తిత్వం ఎలాంటి చెప్పటం చూశామని పుణ్యశీల గుర్తు చేశారు. తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఎమ్మెల్యే రోజాకు క్షమాపణలు చెప్పాలని మహిళా నేతలు బండ్లను డిమాండ్ చేశారు. -
ఇది ‘టెంపర్’ చిత్ర వివాదం
సాక్షి, సినిమా: ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ విషయంపై బండ్ల గణేష్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘ 2015 టెంపర్ చిత్రం వివాదం ఇది. కోటి నాలుగు లక్షల రూపాయలకు టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ నుంచి కొనడం జరిగింది. సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక నిర్మాత అయిన రోహిత్ సెట్టికి సంయుక్తంగా విక్రయించాము. కానీ, నాకు తెలియకుండా టెంపర్ నవలా హక్కులను రచయిత వంశీ మరొకరికి అమ్మారు. దీనివలన నేను తీవ్ర మనస్తాపానికిలోనై ఈ విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టికి తీసుకు వచ్చాను. అదే సమయంలో టెంపర్ చిత్ర కథకి ఇచ్చిన బ్యాలన్స్ డబ్బుల చెక్ను నిలిపివేశాను. ఈ వివాదం ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నప్పటికీ వంశీ చెక్ను పట్టుకొని కోర్టుకి వెళ్లాడు. నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను. ఈ విషయంపై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్కు వెళ్తున్నాను. రచయిత వంశీపై నా న్యాయ పోరాటం సాగిస్తాను. టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో, ఏమిటో నాకు, నా సినిమా యూనిట్ సహాయ రచయితలకు, వంశీ మనస్సాక్షికి తెలుసు. సినిమా రంగంలో నటులకు, దర్శకుల, సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమ్మిది లక్షల రూపాయల చెల్లించలేని స్థితిలో లేనా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకొనగలరు’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. -
బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష
-
బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
అవార్డులపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై నిప్పు రాజుకుంటోంది. అవార్డుల ఎంపికలో పారదర్శకత లేదని సోషల్ మీడియా నెట్జన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం బన్నీవాసు అవార్డుల జాబితాను విమర్శించగా, తాజాగా మరో మెగా అభిమాని బండ్ల గణేష్ సైతం అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు పారదర్శకంగా లేవని తీవ్ర ఆరోపణలు చేశారు. సగటు సినీ అభిమానులు ఈ అవార్డుల గురించే మాట్లాడుకుంటున్నారని, అవార్డుల జాబితాలో మెగా హీరోలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇచ్చినవి నంది అవార్డులు కాదని, సైకిల్ అవార్డులంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, జ్యూరీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఉత్తమ నటుడి అవార్డు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కంటితుడుపు చర్యగా చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారని ఆరోపించారు. మగధీర సమయంలోనూ ఇలానే చేశారని గణేష్ ఆరోపించారు. 2016 అవార్డుల కమిటీలో అల్లు అరవింద్ జ్యూరీ సభ్యుడిగా ఉన్నా మెగా హీరోలకు అవార్డులు ఇవ్వాలని ఏనాడు అడగలేదని అన్నారు. తను టీడీపీ వ్యతిరేకిని కాదని, తనకు ఏపార్టీతో సంబంధం లేదని తనకు అన్యాయం అనిపిస్తే వెంటనే ప్రశ్నిస్తాన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయనిపిస్తే వెనక్కి తీసుకుంటానని అన్నారు. -
శ్రీశైలంలో సినీ నిర్మాత బండ్ల గణేశ్
శ్రీశైలం టెంపుల్: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మంగళవారం కుటుంబ సమేతంగా శ్రీశైలం వచ్చి శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అ«ధికారులు ప్రధాన రాజగోపురం వద్ద ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. -
'జైలవకుశ'పై బండ్ల గణేశ్ కామెంట్
హైదరాబాద్ : త్రిపాత్రాభినయంతో అందరినీ మెప్పించి మరోసారి తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయవంతంగా దూసుకెళుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ నటన తీరుతో మైమరిచిపోయారు. మనసులో ఏం అనిపించినా వెంటనే పైకి చెప్పే అలవాటున్న బండ్ల గణేష్ రాత్రి జైలవకుశ చిత్రాన్ని చూసిన వెంటనే ట్విట్టర్ వేదిక ద్వారా తన మనసులో మాట చెప్పారు. 'జై లవకుశ రాత్రి చూశా.. నిద్ర పట్టలేదు! ఎన్టీఆర్.. ఎస్వీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ స్థాయిలో నటించిన మా బాద్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు. జై లవ కుశ సినిమా రాత్రి చూసా నిద్ర పట్టలేదు! ఎన్.టి.ఆర్......,ఎన్.వి.ఆర్ ...,తరవాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో @tarak9999 — BANDLA GANESH (@ganeshbandla) 27 September 2017 ఆ స్థాయిలో అద్భుతంగా నటించిన మా బాద్ షాకి హ్రుదయపూర్వక ధన్యవాదాలు.....,@tarak9999 — BANDLA GANESH (@ganeshbandla) 27 September 2017 -
అతను తోడేలు: సచిన్
ఎవరి నమ్మకం గెలిచింది? చేతులు సాఫ్ట్గా ఉండేవాడు మర్డర్ చేయడని నమ్మే పోలీసాఫీసర్.. చంపడం చేతుల్లో ఉండదు మైండ్లో ఉంటుందని నమ్మే ప్రేమికుడు.. నచ్చిన అమ్మాయిని దక్కించుకునేందుకు చంపడం తప్పు కాదని నమ్మే విలన్. వీరిలో ఎవరి నమ్మకం గెలిచింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘వీడెవడు’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు తాతినేని సత్య. సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా రైనా జోషి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘ఎస్.ఎమ్.ఎస్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘శంకర’.. ఈ మూడూ రీమేక్ చిత్రాలే. ఇన్ని రోజుల తర్వాత స్ట్రైట్గా చేస్తున్న చిత్రం ఇది. సచిన్ అద్భుతంగా నటించారు. థమన్ మంచి సంగీతం అందించారు. మేలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘అందరూ ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. అందుకే అవుట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు సచిన్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కెమేరా: బినేంద్రమీనన్. అతను తోడేలు: సచిన్ నటుడు–నిర్మాత బండ్ల గణేశ్, హీరో సచిన్ మధ్య మనస్పర్థలు నెలకొన్న విషయం తెలిసిందే. ‘వీడెవడు’ ప్రెస్మీట్లో గణేశ్ గురించి సచిన్ దగ్గర ప్రస్తావించగా ఆయన ఘాటుగా స్పందించారు. ‘‘బండ్ల గణేశ్తో నేను పోరాడను. ఎందుకంటే నా స్థాయితో పోల్చితే అతను చాలా తక్కువ. నా దృష్టిలో బండ్ల గణేశ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు బండ్ల గణేశ్ ఏదో ఇంటర్వ్యూలో సచిన్ జోషి ఎవరు? అని అన్నాడంట. నాకు మాత్రం ‘వీడెవడు’ అనిపిస్తోంది. ప్రపంచంలో కుక్కలు ఉంది మొరగడానికే. వాటి అరుపులకు బెదరనవసరం లేదు. నా దృష్టిలో బండ్ల గణేశ్ కుక్కగా కూడా పనికి రాడు. కుక్కలు విశ్వాసంగా, నిజాయితీగా ఉంటాయి. అతను తోడేలు లాంటివాడు. అతను ఏం సాధించాడన్నది నాకు అనవసరం. దేశంలో ఉన్న న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. చట్టం తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. నేను అతని గురించి, తాను నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’’ అని సచిన్ అన్నారు -
'బండ్ల' మనిషి కాదు... తోడేలు...
హైదరాబాద్: సినీ నటుడు సచిన్ జోషి, నిర్మాత బండ్ల గణేష్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇటీవల సచిన్ జోషి తనను చంపడానికి గ్యాంగ్స్టర్ నయీమ్కు డబ్బు ఇచ్చాడని, నయీమ్ చనిపోవడంతో ప్రాణాలతో బ్రతికి పోయానని బండ్ల గణేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సచిన్ జోషి బండ్ల ఆరోపణలపై స్పందించారు. సచిన్ ముఖ్యపాత్ర పోషించిన చిత్రం వీడెవడు టీజర్ విడుదల కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సచిన్, బండ్ల ఆరోపణలపై స్పందించారు. "బండ్ల మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న తోడేలు,. ఒరేయ్ పండు సినిమా సమయంలో తినడానికి తిండిలేదన్నాడు. నమ్మించి మోసం చేశాడు. అలాంటి వాడితో కలిసి వ్యాపారం చేశాను. కోర్టులో 18 కేసులు వేశాం, సుమారు 27 కోట్లు ఇవ్వాలి. తీరా అరెస్టు చేసే సమయంలో బండ్ల తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో వదిలేయాల్సి వచ్చింది". కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో ఆరోపణలు చేయడం తగదని సచిన్ విమర్శించారు. -
మంత్రి అచ్చెన్నాయుడికి నయీమ్తో సంబంధాలు
-
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి నయీమ్తో సంబంధాలు
- సంచలన విషయాలు బయటపెట్టిన సినీ నిర్మాత నట్టికుమార్ - ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ సర్కారే నయీమ్ను పోషించింది - నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్కుమార్, శివరామకృష్ణలకు కూడా నయీమ్తో సంబంధాలు సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో గ్యాంగ్స్టర్ నయీమ్ను పెంచి పోషించింది తెలుగుదేశం ప్రభుత్వమేననీ, అతడి దుర్మార్గాలకు పలువురు టీడీపీ నాయకులు అండగా నిలిచారని సినీ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. టీడీపీ నేత, ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకి నయీమ్ గ్యాంగ్తో సత్సం బంధాలున్నాయన్నారు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నట్టికుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఓ పవర్ప్లాంట్కు సంబంధించి నయీమ్తో అచ్చెన్నాయుడు చేతులు కలిపారన్నారు. కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయిస్తే.. నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ‘‘నర్సన్నపేటలోని నా థియేటర్ వెంకటేశ్వరా మహల్ను నయీమ్ అనుచరులు అజీజ్, అంజిరెడ్డిలు అక్రమంగా లాక్కున్నారు. ఓ స్థలం వివాదంలో రెండు నెలల క్రితం నయీమ్ గ్యాంగ్ నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని నా మిత్రుడితోపాటు ఓ ఎమ్మెల్యే ద్వారా సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయ్యాను. నన్ను నేను కాపాడుకోగలిగాను. ఓ రోజు ఫ్లైట్లో కలిసిన అచ్చెన్నాయుడితో ఈ విషయాలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. నయీమ్తోనే సెటిల్ చేసుకోమన్నారు. నయీమ్ అండతో ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు ప్రత్యేక పాలన కొనసాగించారు. మొన్నటివరకూ విశాఖ ఏసీపీగా పనిచేసిన రమణమూర్తి, నర్సన్నపేట సీఐ చంద్రశేఖర్, డీఎస్పీ, ఎస్పీల దగ్గరకు వెళ్లాను. న్యాయం చేయమని కోరాను. ఏం చేయలేమన్నారు. రివర్స్లో సీఐ చంద్రశేఖర్ నన్నే బెదిరించారు’’ అని నట్టికుమార్ చెప్పారు. థియేటర్లన్నీ నయీమ్ డబ్బుతోనే.. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న థియేటర్లన్నీ నయీమ్ డబ్బుతోనే కడుతున్నారని నట్టికుమార్ పేర్కొన్నారు. ‘‘నయీమ్ అనుచరుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఈ థియేటర్ల దందా నడుస్తోంది. అక్కడ థియేటర్లన్నిటిలో జగ్గిరెడ్డి క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం రూ.5 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఒక్క రూపాయికి కూడా లెక్కలు ఉండవు. నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, తెలుగులో కొన్ని చిత్రాలు చేసిన బాలీవుడ్ నటుడు-నిర్మాత సచిన్ జోషిలతోనూ నయీమ్కు సంబంధాలున్నాయి. సచిన్ జోషి డబ్బుతో బండ్ల గణేశ్ సినిమాలు నిర్మించారు. తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నయీమ్ మనుషులతో వసూలు చేసేందుకు సచిన్ జోషి ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నయీమ్ అండతోనే విశాఖలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అశోక్కుమార్ సంపాదించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డికి అల్వాల్లో ఓ గెస్ట్హౌస్ ఉంది. ఆయుధాలతో సహా నయీమ్ అనుచరులు అందులో ఉన్నారు. నయీమ్ ఒక్కడే మరణించాడు. అతడి అనుచరులు, సైన్యం మరణించలేదు’’ అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నయీమ్ గ్యాంగ్పై కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సిట్పై తనకు నమ్మకం ఉందని చెప్పారు. నయీమ్ ఆగడాలపై ఏపీ సీఎం చంద్రబాబు నిజాయితీగా విచారణ జరిపించాలన్నారు. -
'ఆ నిర్మాతతో సినిమా చేస్తే, రిలీజ్ కానివ్వను'
సినీ రంగంలో వివాదాలు సాధరణమే అయినా, బహిరంగంగా విమర్శలు చేసుకోవటం మాత్రం చాలా అరుదు. తాజాగా ఓ నిర్మాత, నటుడి మధ్య వచ్చిన వివాదం ట్వీట్టర్లో బెదిరింపుల వరకు వెళ్లింది. టాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేసే హీరో సచిన్ జోష్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్గా పేరున్న బండ్ల గణేష్కు పుట్టిన రోజు కానుకగా ఓ వార్నింగ్ ఇచ్చాడు. అతడితో ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమాను రిలీజ్ కానివ్వను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు. 'నా ప్రియమైన నమ్మకద్రోహికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. త్వరలోనే నిన్ను జైల్లో కలుస్తాను. అతనితో ఎవరైనా సినిమా చేస్తే రిలీజ్ కానివ్వను జాగ్రత్త' అంటూ ట్విట్టర్లో కామెంట్ చేశాడు. సచిన్ జోషి ఇంత ఘూటుగా పోస్ట్లు పెట్టినా.., బండ్ల గణేష్ మాత్రం స్పందించలేదు. ఒక సినిమా నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం ఈ ఇద్దరు సెలబ్రిటీలను ఇలా బహిరంగంగా బెదిరింపులకు దిగేలా చేసింది. సచిన్ జోషి హీరోగా ఆషిఖీ 2 సినిమాను నీ జతగా నేనుండాలి పేరుతో రీమేక్ చేశాడు బండ్ల గణేష్. టెంపర్ సినిమా రిలీజ్ సమయంలో సచిన్ జోషి బండ్ల గణేష్కు ఆర్థికంగా సాయం చేశాడు. ఆ తరువాత ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా గణేష్ ఇబ్బంది పెడుతున్నాడంటూ సచిన్ కోర్టు నోటిసులు కూడా పంపాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే బండ్ల గణేష్ పుట్టిన రోజు సందర్భంగా తన కోపాన్ని ట్విట్టర్ వేదికగా చూపించాడు సచిన్ జోషి. Happy Birthday My Dearest Fraud @ganeshbandla Will soon visit you in jail#Bandlaganesh — Sachiin Joshi (@sachiinjoshi) March 10, 2016 #Bandlaganesh Whoever will make a film with @ganeshbandla be warned that I won't let it release — Sachiin Joshi (@sachiinjoshi) March 10, 2016 #Bandlaganesh Whoever will make a film with @ganeshbandla be warned that I won't let it release — Sachiin Joshi (@sachiinjoshi) March 10, 2016 -
డబ్బింగ్ రైట్స్కు 25 కోట్లు
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న బండ్ల గణేష్ కొన్నాళ్లుగా నిర్మాణ రంగానికి దూరంగా ఉంటున్నాడు. తిరిగి ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని భావించినా స్టార్ హీరోల డేట్స్ లేకపోవటంతో విరమించుకున్నాడు. అయితే తాజాగా డబ్బింగ్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడ్డుతున్నాడు గణేష్. ఇప్పటికే మళయాల సూపర్ హిట్ సినిమా 'టు కంట్రీస్' రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న బండ్ల గణేష్, తెలుగులో ఓ స్టార్ హీరోతో ఆ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీంతోపాటు మరో తమిళ సినిమా డబ్బింగ్ రైట్స్ను కూడా భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు గణేష్. లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భైరవ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ను 25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నాడు. ముని, కాంచన, గంగ సినిమాలతో కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా మంచి విజయాలు నమోదు చేసిన లారెన్స్, అదే జానర్లో భైరవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గంగ సినిమా తెలుగులో 18 కోట్లకు పైగా బిజినెస్ చేయటంతో నెక్ట్స్ సినిమాకు అంతకుమించి కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే భారీ మొత్తానికి ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ను తీసుకున్నాడు. -
నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది...
సినిమా వెనుక స్టోరీ - 35 ఆ రోజు పవన్కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్. మొత్తం కుర్ర బ్యాచ్. కల్యాణ్ కటౌట్కి పాలాభిషేకం చేస్తున్నాడు ఓ కుర్రాడు. పేరు హరీశ్ శంకర్. పవన్కు అరివీర భయంకర ఫ్యాన్. ఎప్పటికైనా కల్యాణ్ని కలిసి ఓ ఫొటోగ్రాఫు, ఓ ఆటోగ్రాఫూ తీసుకోవా లనేది అతగాడి డ్రీమ్. నెరవేరుతుందా? ‘షాక్’తో షాక్ తిన్నాడు హరీశ్ శంకర్. రవితేజ లాంటి హీరోతో అలాంటి డిజాస్టర్ తీసినందుకు ఇంకొకడైతే హర్ట్ అయ్యి ఇండస్ట్రీ నుంచి తిరిగెళ్లిపోతాడు. కానీ హరీశ్ జగమొండి. పోయినచోటే వెతుక్కోవాలనే కసిలో ఉన్నాడు. ఎక్కడ పని దొరికితే అక్కడ వాలిపోయేవాడు. పూరి జగన్నాథ్, నల్లమలుపు బుజ్జి కాంపౌండ్లో స్టోరీ సిట్టింగ్స్లో కూర్చునే వాడు. రవితేజకు అతనంటే గురి. ఫ్లాపిచ్చిన ప్రతివాడూ పనికిరానివాడని కాదుగా! హరీశ్కు ఇంకో చాన్స్ ఇచ్చే ఉద్దేశం ఉంది రవితేజకు. హరీశ్ కూడా రవితేజకు కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ‘ఆంజనేయులు’ షూటింగ్ స్పాట్కెళ్తే నిర్మాత బండ్ల గణేశ్ కలిశాడు. సింగిల్ సిట్టింగ్లోనే క్లోజ్ అయిపోయారిద్దరూ. హరీశ్ బ్యాడ్లక్. రవితేజ రెండు ప్రాజెక్టులు ఒప్పేసుకున్నాడు... ‘శంభో శివ శంభో’, కృష్ణవంశీతో ‘కందిరీగ’. బండ్ల గణేశ్ నుంచి ఫోన్. ‘‘అర్జంట్గా ‘నందగిరి హిల్స్’కు రా.’’ నందగిరి హిల్స్ అంటే పవన్కల్యాణ్ ఇల్లు ఉన్న ఏరియా. ఆగమేఘాల మీద ఇంటి ముందు వాలిపోయాడు. గేట్లు తెరుచుకున్నాయి. లోపల నుంచి మూడు కార్లు దుమ్ము రేపుకుంటూ బయటికి వెళ్లిపోయాయి. హరీశ్ అయోమయంగా చూస్తున్నాడు. గణేశ్కి కాల్ చేస్తే ‘‘నేను కల్యాణ్తో ఫామ్హౌస్కి వెళ్తున్నా, నువ్వు నా కారులో అక్కడికొచ్చేయ్. అదిరిపోయే కథ చెప్పాలి’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. హరీశ్కి విపరీతమైన టెన్షన్. కల్యాణ్కి ఏ కథ చెప్పాలి? ఎలా చెప్పాలి? మంచి పొలిటికల్ బ్యాక్డ్రాప్ స్టోరీ చెబుదామా? ఇవే ఆలోచనలు. మళ్లీ గణేశ్ ఫోన్. ‘‘మంచి లవ్స్టోరీ ఉంటే... అదే చెప్పు.’’ ఇప్పటికిప్పుడు లవ్స్టోరీ ఎలా? ఓ బడ్డీకొట్టు దగ్గర కారు ఆపించాడు. సిగరెట్ ముట్టించి, గట్టిగా దమ్ము పీల్చాడు. రవి తేజ కోసం చేస్తున్న లైన్ చెప్పేద్దామా? కల్యాణ్ బాబుకి బావుంటుంది. అప్పటి కప్పుడు టైటిల్ కూడా అనేసుకున్నాడు ‘రొమాంటిక్ రిషి’. ఫామ్ హౌస్. కల్యాణ్ వర్కర్స్తో ఏదో మాట్లాడుతున్నాడు. పక్కనే బండ్ల గణేశ్. హరీశ్ అక్కడికెళ్లాడు. ‘‘ఈ రోజు నాకు మూడ్ సరిగ్గా లేదు. ఇంకోరోజు కథ వింటా’’ చెప్పాడు కల్యాణ్. ‘‘బాబూ! ఈ రోజు ఏకాదశి. మంచి రోజు. అతనికి సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక అయిదు నిమిషాలైనా కథ వింటే..?’’ అని గణేశ్ తటపటాయిస్తూ చెప్పాడు. ‘‘ఓకే... మీ సెంటిమెంట్స్ని నేనెందుకు కాదనాలి’’ అని అక్కడే చెట్టు దగ్గర కూర్చున్నాడు పవన్కల్యాణ్. హరీశ్ కథ చెబుతున్నాడు. గంటం పావు గడిచింది. అప్పటికి ఇంటర్వెల్ దాకా చెప్పడం పూర్తయింది. హరీశ్ కథ చెబుతున్నంతసేపూ పగలబడి నవ్వుతూనే ఉన్నాడు కల్యాణ్. ‘‘ఇక చాలు’’ అన్నాడు. హరీశ్ టెన్షన్గా చూస్తున్నాడు. ‘‘వియ్ డూ దిస్ ఫిల్మ్’’ అని హరీశ్కు షేక్హ్యాండ్ ఇచ్చి లేచాడు కల్యాణ్. కాస్సేపటి తర్వాత గణేశ్ వచ్చి హరీశ్ను హగ్ చేసుకుని కంగాట్స్ చెప్పాడు. హరీశ్ స్క్రిప్టు వర్క్ మొదలెట్టాడు. కల్యాణ్కు ఇంకా సెకండాఫ్ చెప్పాలి. ఛేంజెస్ చెప్పాలి. బెటర్మెంట్స్ చెప్పాలి. కానీ అక్కడేమో కల్యాణ్ ఫుల్ బిజీ. అపాయింట్మెంట్ కూడా దొరకని స్థితి. ఆ టైమ్లో ఓ న్యూస్. హిందీ సినిమా ‘లవ్ ఆజ్ కల్’ బేస్తో కల్యాణ్ ఓ సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. బండ్ల గణేశ్ ప్రొడ్యూసర్. త్రివిక్రమ్ స్క్రిప్టు రాస్తున్నాడు. డెరైక్టర్ ఎవరో తెలియదు. హరీశ్నే చేయమంటారని టాక్. కానీ జయంత్. సి.పరాన్జీ డెరైక్షన్లో ‘తీన్మార్’ మొదలెట్టారు కల్యాణ్. హరీశ్ పరిస్థితేంటి? కల్యాణ్ ప్రాజెక్ట్ కన్ఫ్యూజన్లో ఉన్న టైమ్లో రవితేజ నుంచి పిలుపు. అక్కడ ‘కందిరీగ’ ప్రాజెక్ట్ క్యాన్సిల్. హరీశ్ రెడీ అంటే ఇక్కడ సినిమా స్టార్ట్. కల్యాణ్ కోసం తీర్చిదిద్దిన ‘రొమాంటిక్ రిషి’ రవి తేజకు షిఫ్ట్. ‘‘మరీ క్లాస్ టైటిల్లా ఉంది. ‘మిరపకాయ్’ అని పెడదాం’’ రవితేజ సలహా. ఓకే. 2011 సంక్రాంతికొచ్చిన ఈ సినిమా హరీశ్ లైఫ్లో కొత్త క్రాంతి తీసుకొచ్చింది. వ్వాట్ నెక్స్ట్ హరీశ్? ఫిబ్రవరి 21... తన ఫేవరెట్ డెరైక్టర్ ఈవీవీ చనిపోవడంతో హరీశ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆయన డెడ్ బాడీని కొంత దూరం మోసి, విషాద హృదయంతో ఇలా ఇంటికొచ్చాడో లేదో... అలా ఫోన్ మోగింది. పవన్ కాలింగ్. స్నానం చేసి ఆదరాబాదరాగా కల్యాణ్ ఇంటికెళ్లేసరికి ఫొటో సెషన్ జరుగుతోంది. కల్యాణ్ పోలీసాఫీసర్ గెటప్లో ఉన్నాడు. హరీశ్కేం అర్థం కాలేదు. ‘దబంగ్’ను తెలుగులో చేస్తున్నాం, సినిమా పేరు ‘గబ్బర్సింగ్’, డెరైక్టర్వి నువ్వే’’ చెప్పాడు కల్యాణ్ తాపీగా. ‘‘ఎంత రెమ్యునరేషన్ కావాలి?’’ కల్యాణ్ డెరైక్ట్ క్వశ్చన్. ప్రొడ్యూసర్ కూడా ఆయనే మరి. హరీశ్ మాత్రం డబ్బుల గురించి మాట్లాడటం లేదు. పూనకం వచ్చినవాడిలా ఉన్నాడతను. ‘‘దబంగ్కి జిరాక్స్లా దీన్ని తీయకూడదు సార్. మీ ఇమేజ్కి తగ్గట్టుగా మార్పులూ చేర్పులూ, డైలాగ్స్ రాసే అవకాశమివ్వండి చాలు. అదే నాకు పెద్ద రెమ్యునరేషన్’’ చెప్పాడు నిజాయతీగా. కల్యాణ్ నవ్వుతూ అడ్వాన్స్ కవర్ అతని చేతికిచ్చాడు. నెక్స్ట్ మినిట్లో మీడియాకు న్యూస్ వెళ్లిపోయింది. హరీశ్ ఓ ఉన్మాదంలో ఉన్నాడు. గబ్బర్సింగ్ అంటే రెట్టమతంగా ఉండే పోలీసాఫీసర్. అతనా పేరెందుకు పెట్టు కున్నాడు లాంటి లాజిక్స్ మిస్ కాకుండా, కల్యాణ్ని మాస్ ఎలా చూడాలనుకుంటు న్నారో అలా స్క్రిప్ట్ని డిజైన్ చేసుకున్నాడు. కోల్కతాలో ‘పంజా’షూటింగ్ జరుగు తుంటే స్క్రిప్టు వినిపించడానికెళ్లాడు. కల్యాణ్ వెంటనే కనెక్టయిపోయాడు. టక టకా తన సజెషన్స్ చెప్పేశాడు. ‘‘పోలీస్ స్టేషన్లో రౌడీలతో అంత్యాక్షరి సీన్ పెడదాం. బాగా కామెడీ క్రియేట్ చేయొచ్చు. ‘పాడమంటే పాడేది పాట కాదు’ లాంటి మంచి మంచి పాటలు పెడదాం’’ అని హింట్ ఇచ్చాడు. ఓకే సార్ అన్నాడు హరీశ్. ‘గబ్బర్సింగ్’ స్టార్ట్. ప్రొడ్యూసర్ పవన్ కల్యాణ్ కాదు... బండ్ల గణేశ్. హీరో యిన్గా శ్రుతీహాసన్ను తీసుకుంటే? ఐరన్ లెగ్ అన్నారు చాలామంది. కల్యాణ్ మాత్రం ఆమెకే ఓటు. ఇంకెవరూ మాటా ్లడ్డానికి లేదు. 2011 డిసెంబర్ 4... మిట్ట మధ్యాహ్నం 12 గంటల 20 నిముషాలకు ఫస్ట్ షాట్ తీశారు. అవతల ‘పంజా’ డిజాస్టర్. ఫ్యాన్స్ నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. ‘గబ్బర్ సింగ్’ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని రకరకాల డౌట్లు. ఫ్యాన్స్కు ఓ భరోసా ఇవ్వాలంటే టీజర్ రిలీజ్ చేయాలి. ఇంకా ఓ షెడ్యూలు కూడా ఫినిష్ కాకుండా టీజర్ చేయడమంటే కష్టమే. హరీశ్కో ఐడియా వచ్చింది. కల్యాణ్తో ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించి, టీజర్ రిలీజ్ చేయిస్తే? ఐడియా బాగుంది. డైలాగ్ కూడా బాగా వచ్చింది. ‘‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది’’... ఇదీ డైలాగ్. ఇబ్బంది పడుతూనే కల్యాణ్ దగ్గరకు వెళ్లాడు. డైలాగ్ చెప్పగానే కల్యాణ్ సంబరపడిపోయి, క్లాప్స్ కొట్టేశాడు. టీజర్ రెడీ. ఆ ఒక్క టీజర్తో ‘గబ్బర్సింగ్’ ఎలా ఉండబోతోందో ఆడియన్స్ స్మెల్ చేసేశారు. ‘దబంగ్’లోని ‘మున్నీ బద్నామ్’ తరహాలో ఐటమ్ సాంగ్ కావాలి. మిగతా పాటలన్నీ చిటికెలో చేసిచ్చేసిన మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఈ సాంగ్కి రాత్రింబవళ్లూ తలకొట్టుకుంటున్నాడు. దేవి ఫాదర్, రైటర్ సత్యమూర్తి ఆ టైమ్కి అక్కడే ఉన్నారు. ‘‘ఎందుకురా టెన్షన్. ‘కెవ్వు కేక’ అని మొదలుపెట్టు’’ అన్నా రాయన. దేవి చెలరేగిపోయాడు. ‘అంత్యాక్షరి’ ఎపిసోడ్ గురించి చాలా కసరత్తులే చేశారు. డెరైక్షన్ డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసి 300 పాటలు సెలక్ట్ చేశారు. వాటిల్లోంచి కొన్ని ఎంచుకున్నారు. పోలీస్ స్టేషన్ సెట్లో రౌడీ గ్యాంగ్తో రోజంతా తీయాలని ప్లాన్ చేశారు. కట్ చేస్తే - 4 గంటల్లోనే అయిపోయింది. సినిమా మొత్తం చాలా స్మూత్గా జరిగి పోయింది. డబ్బింగ్ సెషన్ కూడా హ్యాపీనే. అంతా కంప్లీట్ అయ్యాక డబ్బింగ్ ఫ్లోర్కి దణ్ణం పెట్టి, ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవనుంది. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. టేక్ కేర్’’ అన్నాడు కల్యాణ్. 2012 మే 11. ఎండ దెబ్బకు రాళ్లు సైతం పగిలిపోతున్నాయి. ఇక్కడ ‘గబ్బర్సింగ్’ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి. ఆ థియేటర్ దగ్గర ఫుల్ ప్యాక్డ్గా జనం. పవన్ కల్యాణ్ కటౌట్కి క్షీరాభిషేకం చేస్తున్నారు. పక్కనే హరీశ్ శంకర్ కటౌట్. దానికీ క్షీరాభిషేకం. ఇదంతా చూసి హరీశ్ శంకర్ కళ్లు చెమర్చాయి. అతనికి తన ఫ్లాష్బ్యాక్ గుర్తొచ్చింది. హిట్ డైలాగ్స్ * ‘‘నేను ఆయుధాలతో చంపను. వాయిదాలతో చంపుతా’’ అనే బ్రహ్మానందం డైలాగ్ రాసింది ఈ సినిమా కో-డెరైక్టర్ శంకరమంచి రాజశేఖర్. అందుకే టైటిల్స్లో ఆయన పేరు వేశారు. * నేను ఆయుధాలతో చంపను... వాయిదాలతో చంపుతా * నేను ఆకాశం లాంటోణ్ణి. ఉరు మొచ్చినా మెరుపొచ్చినా ఇలానే ఉంటాను ఠి నేను ట్రెండ్ ఫాలో అవ్వను... ట్రెండ్ సెట్ చేస్తా * కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు - పులగం చిన్నారాయణ -
రీమేక్ సినిమాతో మళ్లీ వస్తున్నాడు
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఇలా టాలీవుడ్ టాప్ హీరోలతో వరుస సినిమాలు చేసిన స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కొంత కాలంగా బ్రేక్ తీసుకున్నాడు. గత ఏడాది రిలీజ్ అయిన టెంపర్ సినిమా తరువాత గణేష్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. స్టార్ హీరోలంతా బిజీగా ఉండటంతో పాటు మంచి కథ కూడా దొరక్క పోవటంతో ఇండస్ట్రీగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో రీమేక్ సినిమాల సీజన్ నడుస్తుండటంతో గణేష్ కూడా ఓ సక్సెస్ ఫుల్ రీమేక్తో తిరిగి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే మలయాళంలో సూపర్ హిట్ అయిన 2 కంట్రీస్ సినిమా రైట్స్ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. దిలీప్, మమతా మోహన్దాస్లు జంటగా నటించిన ఈ సినిమాను తెలుగులో స్టార్ హీరోతో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. -
పవన్ వీరాభిమాని vs పవన్ భక్తుడు
ఇటీవల ట్విట్టర్ వేదికగా సంచలనాలు సృష్టిస్తున్న రామ్గోపాల్వర్మ. మరోసారి తనదైన ట్వీట్లతో చెలరేగిపోయాడు. అయితే ప్రతిసారీ వన్ సైడెడ్గా వర్మ మాత్రమే కామెంట్లు చేస్తూ ఉండేవాడు. ఈసారి వర్మతో మరో సెలబ్రిటీ వాదనకు దిగటంతో టాపిక్ మరింత ఆసక్తికరంగా మారింది. గత కొతం కాలంగా పవన్ అభిమానులను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్న వర్మ, సోమవారం పవన్ అభిమానులు వరల్డ్ పవనిజం డేగా జరుపుకోవటం మీద సెటైర్లు వేశాడు. పవన్ సినిమాల్లోకి అడుగుపెట్టి 19 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అభిమానుల చేస్తున్న హడావిడిపై వర్మ ట్విట్టర్లో కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా ' ఓ పవన్ కళ్యాణ్ అభిమానిగా.. మిగతా అభిమానులందరికంటే పవన్ను నేనే ఎక్కువగా ఇష్టపడతాను. సర్దార్ గబ్బర్సింగ్ బాహుబలి కంటే పెద్ద విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ అర్జెంటినా, ఐలాండ్, ఆఫ్రికా మొత్తం అమెరికాలో చాలా ఫేమస్. వరల్డ్ పవనిజం డే సందర్భంగా కంగ్రాట్స్' అంటూ పవన్ అభిమానులకు చురకలంటించాడు వర్మ. ఇక్కడి వరకు రొటీన్ అయినా, పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ ఎంట్రీ తో ట్విట్టర్ లో మంచి ట్విస్ట్ వచ్చింది. ' మా పవన్ మీద వచ్చే విమర్శలు మాకు ఊరేగింపులో పడే మల్లెపూల లాంటివి. సూర్యుడి మీద ఉమ్మేస్తే ' అంటూ వర్మకు కౌంటర్ ఇచ్చాడు గణేష్. అంతటితో ఆగకుండా 'ఆర్జీవి, మీకు పవన్ ఫ్యాన్స్ మీద కోపం తగదు, మాలాంటి ఫ్యాన్స్కు ముందు నిలబడి మీరే మమ్మల్ని నడిపించాలి. ఇది నా రిక్వస్ట్, పవన్ కళ్యాణ్ మీద రాత్రి పూట ట్వీట్లు చేసి మా నిద్రని, పగలు ట్వీట్లు చేసి మా పనిని చెడగొట్టద్దు' అంటూ రిప్లై ఇచ్చాడు. బండ్ల గణేష్ ట్వీట్ల పై స్పందించిన వర్మ ' పవనిజం పుస్తకంలో రాసిన ఆర్దర్ స్కోపెన్ హెయిర్ ఫిలాసఫీ ఆధారంగానే నేను కామెంట్స్ చేశాను. నిరక్షరాస్యుల కోసం నేను తగ్గి మాట్లాడలేను' అంటూ కౌంటర్ ఇచ్చాడు. గణేష్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 'మీరు బాగా చదువుకొని ఉండొచ్చు, కానీ మాకు సంస్కారవంతమైన జీవితం ఇచ్చిన పవన్ వివేకవంతుడు'. అంటూ ట్వీట్ చేశాడు. వెంటనే వర్మ 'నువ్వు అనవసరంగా పవన్ అభిమానులను తప్పుదారి పట్టిస్తున్నావు.. నేను చెప్పినదంతా పవనిజం పుస్తకంలోదే' అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరోసారి గణేష్ 'మాకు పుస్తకాలు అక్కర్లేదు.. పవన్ లుక్ మాపై పడితే చాలు' అని మాటల యుద్ధం ముగించాడు. ఇప్పటివరకు తన మాటల తూటాలకు ఎదురులేదని భావిస్తున్న వర్మ బండ్ల గణేష్ కామెంట్లతో కాస్త షాక్ తిన్నా, ఫాలోవర్స్కు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. Congrats on #WorldPawanismDay because he's famous in whole world including Argentina,Iceland ,Africa and entire United States of America — Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2015 On this #WorldPawanismDay I truly believe that Sardar Gabbar Singh will reach out to the entire whole world more than Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2015 As a PK fan I care more about PK than PK fans care about PK caring about PK fans caring about PK — Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2015 Maa @PawanKalyan meeda vache vimarshalu maaku ureginpu lo pade malle poolu. @RGVzoomin sir. Suryudi meeda ummesthe...... — ganesh bandla (@ganeshbandla) October 12, 2015 Sir, @RGVzoomin my humble request. @PawanKalyan pai Raathri poota tweets tho nidra paaducheyyadhu. Pagalu tweets tho pani chedagottoddhu. — ganesh bandla (@ganeshbandla) October 12, 2015 Sir, @RGVzoomin naaku personal ga meeru @PawanKalyan gari vyathitwaniki yentha pedda fan annadi telusu. — ganesh bandla (@ganeshbandla) October 12, 2015 -
అఖిల్ కోసం కర్చీఫ్ వేసిన నిర్మాత
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న సినిమా అఖిల్.. అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను వివి వినాయక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మరో యంగ్ హీరో నితిన్... శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే అఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమా చర్చ మొదలైంది. కామెడియన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బడానిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఈ చర్చకు తెర తీశాడు. ఇప్పటికే అఖిల్ తన తదుపరి చిత్రానికి బండ్ల గణేష్కు డేట్స్ కూడా ఇచ్చాడన్న టాక్ వినిపిస్తుంది. అయితే సినిమా విడుదలకు ముందు భారీ బిజినెస్ చేయగలిగే క్రేజీ కాంబినేషన్లను సెట్ చేయటంలో గణేష్ స్పెషలిస్ట్. అందుకే రెండో చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మాణంలో అయితే ద్వితియ విఘ్నాన్ని ఈజీగా దాటేయవచ్చని ఫీల్ అవుతున్నాడట అఖిల్. బండ్ల గణేష్ కూడా ఓ సక్సెస్ఫుల్ డైరెక్టర్తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన కొరటాల శివతో అఖిల్ సినిమాను డైరెక్ట్ చేయించాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమంతుడు తరువాత ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయని కొరటాల ఈ ప్రాజెక్ట్ మీద సుముఖంగానే ఉన్నాడట. మరి ప్రభాస్, మహేష్ల కోసం ఫ్యామిలీ యాక్షన్ కథలను సెట్ చేసిన శివ... అఖిల్ ఎలా చూపిస్తాడో చూడాలి. -
కోర్టుకు బండ్ల గణేష్, బెయిల్ మంజూరు
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 14వ తేదీకి వాయిదా వేసింది. 'నీ జతగా నేనుండాలి' సినిమా వివాదంపై బండ్ల గణేష్ లీగల్ నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. వైకింగ్ మీడియా సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న హీరో సచిన్ జోషి ... బండ్ల గణేష్ తనని మోసం చేశాడని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆయనపై చీటింగ్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు పెట్టాడు. ఈ కేసు విచారణ నిమిత్తం బండ్ల గణేష్ ఇవాళ కోర్టుకు హాజరు అయ్యారు.