Banking sector
-
బ్యాంకింగ్ సమ్మె సైరన్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా బ్యాంక్ సంఘాల ఐక్య సమాఖ్య (యూఎఫ్బీయూ) సారథ్యంలో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, కో–ఆపరేటివ్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులకు సంబంధించిన 9 బ్యాంకు యూనియన్లకు యూఎఫ్బీయూ ప్రాతినిధ్యం వహిస్తోంది. మొత్తం 8 లక్షల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. కాగా, సమ్మె సందర్భంగా రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని యూనియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల బ్యాంకు సేవలకు తీవ్ర విఘాతం కలిగి అవకాశం ఉంది. నియామకాలు పెంచాలి... పెరుగుతున్న ఖాతాదారులకు అనుగుణంగా బ్యాంకుల్లో తగినంత మంది సిబ్బందిని నియమించాలని యూనియన్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. గడిచిన దశాబ్దకాలానికి పైగా నియామకాలు సరిగ్గా జరగకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అంటున్నాయి. దీంతో ప్రస్తుత ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోందని, కస్టమర్లకు సరిగ్గా సేవలు అందించలేకపోతున్నామనేది యూనియన్ల వాదన. అనేక సర్కారీ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లకు ఇప్పుడున్న అరకొర సిబ్బంది ఏమాత్రం సరిపోరని, అన్ని క్యాడర్లలో నియామకాలు చేపట్టాలని బ్యాంకు సంఘాలు స్పష్టం చేశాయి. 2013లో 3,98,801 మంది క్లర్కులు ఉండగా.. 2024 నాటికి వారి సంఖ్య 2,46,965 మందికి పడిపోయిందని, అంటే ఏకంగా 1,51,836 మంది తగ్గిపోయారని వారు లెక్కలతో సహా చెబుతున్నారు. ఇక మొత్తం సిబ్బంది సంఖ్య 2013లో 8,86,490 మంది ఉంటే, 2024 నాటికి 7,46,679 మందికి (1,39,811 తగ్గుదల) చేరిందని యూఎఫ్బీయూ పేర్కొంది.ఇతర ప్రధాన డిమాండ్లు ఇవీ... → బ్యాంకింగ్ పరిశ్రమ అంతటికీ వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్కు ఏడాది క్రితం బ్యాంకు యాజమాన్యాలు అంగీకరించి, ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోలేదు, ఇక ఏమాత్రం జాప్యం లేకుండా దీన్ని అమలు చేయాలి. → సిబ్బంది పనితీరుకు సంబంధించి నెలవారీ సమీక్ష విషయంలో ప్రభుత్వ ఆదేశాలను, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల్లో మార్పులను తక్షణం ఉపసంహరించుకోవాలి. → బ్యాంకు అధికారులు/సిబ్బందిపై దాడులను అరికట్టేలా తగిన రక్షణ కల్పించాలి. → గ్రాట్యుటీ పరిమితిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుగుణంగా రూ.25 లక్షలకు పెంచడంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చేలా గ్రాట్యుటీ చట్టాన్ని సవరించాలి. → తాత్కాలిక సిబ్బందిని పర్మనెంట్ చేయడంతో పాటు పర్మనెంట్ ఉద్యోగాలకు అవుట్సోర్సింగ్ను నిలిపివేయాలి. → ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం కనీసం 51% వాటాను కొనసాగించాలి. -
మీ బ్యాంక్ డిపాజిట్ ఎంత భద్రం?
ముంబైకి చెందిన ధన్రాజ్ (50) ఉదయం నిద్రలేచి, పేపర్ చూడగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. న్యూ ఇండియా సహకార బ్యాంక్లో స్కామ్ జరిగిందనేది ఆ వార్త సారాంశం. చిరుద్యోగి అయిన ధన్రాజ్ తన కుమార్తె వివాహం కోసమని రూ.4 లక్షలను అదే బ్యాంక్లో కొన్నాళ్ల క్రితం డిపాజిట్ చేశాడు. కంగారుగా బ్యాంక్ శాఖకు చేరుకుని విచారించగా, డిపాజిట్లకు ఢోకా లేదన్న సమాచారం విని కాస్తంత కుదుటపడ్డాడు. రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుందని కస్టమర్లు చెప్పుకుంటుండగా విని.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. బ్యాంక్ డిపాజిట్.. దేశంలో చాలా మందికి తెలిసిన, ఇష్టమైన పెట్టుబడి సాధనం. చాలా మంది తమ పొదుపు సొమ్మును డిపాజిట్ రూపంలో మదుపు చేయడం కూడా చూస్తుంటాం. కానీ, ఇందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన ఉండదు. డిపాజిటర్లు అందరూ దీనిపై ఓసారి దృష్టి సారించాల్సిన అవసరాన్ని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ ఉదంతం గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ప్రతి కుటుంబ ఆర్థిక సాధనాల్లో బ్యాంక్ డిపాజట్ (ఎఫ్డీ) తప్పకుండా ఉండేది. కాలక్రమంలో ఇతర సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లు తదితర వాటిల్లో పెట్టుబడులు పెరుగుతూ, డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికీ 15 శాతం గృహ పొదుపులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలోకే (ఎఫ్డీలు/టర్మ్ డిపాజిట్లు) వెళుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్డీలు ఎంతో మందికి నమ్మకమైన, మెరుగైన సాధనం. దీర్ఘకాలంలో గొప్ప రాబడి రాకపోయినా సరే, అత్యవసరంలో వేగంగా వెనక్కి తీసుకునేందుకు అనుకూలంగా ఉండడం చాలా మందికి నచ్చే అంశం. పైగా డిపాజిట్ అంటే ఏ మాత్రం రిస్క్ ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ప్రభుత్వ గ్యారంటీ (సావరీన్) ఉంటే తప్పించి, బ్యాంక్ ఎఫ్డీ అయినా, ఏ ఇతర పెట్టుబడి సాధనంలో అయినా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. దీనిపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. మెరుగైన నియంత్రణలు ఎఫ్డీ ఎంతో ప్రాచుర్యానికి నోచుకోవడం వెనుక అందులోని సరళత్వం, భద్రత కీలకమని చెప్పుకోవాలి. ఏవో కొన్ని బ్యాంకు వైఫల్యాలను పక్కన పెడితే, మన దేశంలో బ్యాంకింగ్ రంగం పటిష్ట నియంత్రణల మధ్య కొనసాగుతుంటుంది. ప్రజల్లో నమ్మకం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. బ్యాంక్ యాజమన్యాలు/ఉద్యోగుల మోసపూరిత వ్యవహారం, రుణ వ్యాపారంలో దూకుడైన తీరు కొన్ని సందర్భాల్లో సమస్యలు, సంక్షోభాలకు దారితీయవచ్చు. ఎంత కట్టుదిట్టమైన నియంత్రణలు ఉన్నా కానీ, 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్, 2020లో యస్ బ్యాంక్, ఇప్పుడు న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్ సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాడ్ ఉదంతాలూ గుర్తుండే ఉంటాయి. కనుక బ్యాంక్ డిపాజిట్లలోనూ రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే మనదగ్గర ఆర్బీఐ పటిష్ట నియంత్రణల కారణంగా ఈ తరహా సంక్షోభాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.డిపాజిట్పై బీమా ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని బ్యాంకుల్లోనూ రూ.5 లక్షల వరకు డిపాజిట్కు బీమా రక్షణ ఉంటుంది. అసలు లేదా అసలుతోపాటు వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలకు మించి ఉన్నప్పటికీ బీమా రూ.5 లక్షలకే పరిమితం. బ్యాంక్ ఏదైనా సంక్షోభం పాలైతే అప్పుడు ఒక్కో డిపాజిట్ దారుడికి గరిష్టంగా రూ.5 లక్షలు వెనక్కి వస్తాయి. సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ ఇలా అన్ని డిపాజిట్లకూ ఈ రక్షణ వర్తిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూసేది ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (డీఐసీజీసీ). ప్రతి రూ.100 డిపాజిట్పై రూ.12 పైసలు చొప్పున ప్రీమియం కింద బ్యాంక్లు డీఐసీజీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్కు చెందిన ఒకటికి మించిన శాఖలో డిపాజిట్లు ఉన్నప్పటికీ.. ఒక్కో ఖాతాదారుని పేరు మీద గరిష్ట బీమా రూ.5 లక్షలుగానే ఉంటుంది. కనుక ఒక బ్యాంక్లో రూ.5 లక్షలకు మించి చేసే డిపాజిట్పై కచ్చితంగా రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే.. అప్పుడు విడిగా ఒక్కో బ్యాంక్ పరిధిలో సంబంధిత వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్కు బీమా రక్షణ వర్తిస్తుంది.బ్యాంక్ కుదుటపడితే.. బ్యాంకులో మోసం కావచ్చు. లేదా లిక్విడిటీ సంక్షోభం తలెత్తవచ్చు. రుణ ఎగవేతలతో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. తాత్కాలిక నిర్వహణ బాధ్యతల కోసం బోర్డ్ను ఏర్పాటు చేస్తుంది. బ్యాంక్ వ్యవహారాలను లోతుగా పరిశీలించి, చక్కదిద్దే వరకు డిపాజిట్ల ఉపసంహరణపై పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధిస్తుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్లో రుణ అవకతవకలు సంక్షోభానికి దారితీయగా, ఆర్బీఐ దాన్ని చక్కదిద్దింది. అది ఇప్పుడు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో భాగం అయింది. యస్ బ్యాంక్లోనూ రుణ మోసాలు బయటపడగా, కొత్త బోర్డ్ను ఏర్పాటు చేసి గాడిన పెట్టింది. రూ.5 లక్షలకు పైగా డిపాజిట్లు కలిగిన వారు.., రూ.5 లక్షలకు పైబడిన మొత్తాన్ని తిరిగి పొందడం కోసం బ్యాంక్ గాడిన పడే వరకు వేచి చూడాల్సిందే. అప్పటికీ పూర్తి మొత్తం వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఎంత కోత పడుతుందన్నది బ్యాంక్ ఆర్థిక పద్దుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.బ్యాంకు నుంచే చెల్లింపులు బ్యాంక్లో సమస్య తలెత్తినప్పుడు డిపాజిట్దారులు డీఐసీజీసీని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు చూసే బోర్డ్.. డిపాజిట్దారుల వివరాలతో జాబితాను డీఐసీజీసీకి పంపిస్తుంది. ఆ వివరాల వాస్తవికతను 30 రోజుల్లోపు డీఐసీజీసీ తేల్చాలి. అక్కడి నుంచి 15 రోజుల్లోపు డిపాజిట్దారులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బ్యాంక్కు డీఐసీజీసీ బదిలీ చేస్తుంది. అప్పుడు ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బంది చెల్లింపులు చేస్తారు. బ్యాంక్పై ఆంక్షలు విధించిన నాటి నుంచి 90 రోజుల్లో డిపాజిట్దారులకు బీమా మొత్తం వెనక్కి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. విచారించుకున్న తర్వాతే.. ఆర్బీఐ పరిధిలోని అన్ని బ్యాంక్లు తప్పనిసరిగా డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. అవి డిపాజిట్లపై బీమా ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందే. సందేహం ఉంటే డిపాజిట్ చేసే ముందు బ్యాంక్ అధికారిని అడిగి బీమా ఉందా? అని నిర్ధారించుకోవచ్చు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్లు, ప్రైవేటు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు, భారత్లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంక్లు, కో ఆపరేటివ్ బ్యాంక్లు, లోకల్ ఏరియా బ్యాంక్లు, రీజినల్ రూరల్ బ్యాంక్లు, పేమెంట్స్ బ్యాంక్లు, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్లు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్లు డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. ప్రైమరీ కో ఆపరేటివ్ సొసైటీలు మాత్రం దీని కిందికి రావు.అధిక వడ్డీ రేట్లు.. అన్నీ చూసాకే ప్రభుత్వరంగ బ్యాంక్లు, ప్రైవేటు యూనివర్సల్ బ్యాంకులతో పోల్చితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రుణాలపై అధిక రేట్లను చార్జ్ చేస్తుంటాయి. కనుక అవి డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ రేట్లను ఇస్తుంటాయి. ఏ బ్యాంక్ అయినా సరే అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటే, అందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రేషియోలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. సీఆర్ఏఆర్: క్యాపిటల్ టు రిస్క్ అస్సెట్ రేషియో అని, దీన్నే క్యాపిటల్ అడెక్వెసీ రేషియో అని కూడా అంటారు. ప్రభుత్వరంగ బ్యాంక్లకు ఇది కనీసం 12 శాతంగా, ప్రైవేటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లకు 9 శాతం మేర ఉండాలి. అదే స్మాల్ ఫైనాన్స్బ్యాంక్లకు 15 శాతం ఉండాలి. బ్యాంక్ తనకు ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలను ఎంత సమర్థంగా ఎదుర్కోగలదన్నది ఇది తెలియజేస్తుంది. ఎల్సీఆర్: లిక్విడిటీ కవరేజీ రేషియో 100 శాతం ఉండాలి. 30 రోజుల అవసరాలకు సరిపడా నిధులు బ్యాంకుల వద్ద ఉంచడం కోసం ఈ నిబంధన. దీనివల్ల లిక్విడిటీ షాక్లను బ్యాంక్లు సమర్థంగా ఎదుర్కోగలవు. అసలు రాబడి ఎంత? అత్యవసర నిధిని అట్టి పెట్టుకునేందుకు, స్వల్పకాలిక అవసరాలకు ఉద్దేశించిన నిధులను బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసుకుంటానంటే ఫర్వాలేదు. కానీ, దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, సంపద సృష్టికి బ్యాంక్ డిపాజిట్ మెరుగైన సాధనం కాబోదు. ఈక్విటీలపై దీర్ఘకాలంలో 12 శాతం, బంగారంలో 8 శాతం మేర సగటు రాబడి ఉంటోంది. ఈక్విటీ, బంగారంలో పెట్టుబడిని విక్రయించినప్పుడే లాభాలపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ డిపాజిట్లపై అలా కాదు. ప్రతి ఏటా ఆర్జించే వడ్డీ రాబడి అదే ఏడాది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. అవసరమైతే పన్ను చెల్లించాలి. ఎఫ్డీ రాబడిపై పన్ను చెల్లించగా, మిగిలే నికర రాబడి ద్రవ్యోల్బణ స్థాయిలోనే ఉంటుంది. కనుక డిపాజిట్లలో కాంపౌండింగ్ ప్రయోజనం పెద్దగా ఉండదు.బీమా మరింత పెంచేనా..? 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్లో సంక్షోభం తలెత్తిన తర్వాతే.. డిపాజిట్లపై రూ.లక్షగా ఉన్న బీమా పరిమితిని 2020 ఫిబ్రవరిలో రూ.5 లక్షలకు పెంచారు. ఈ బీమా రక్షణను మరింత పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ఇటీవల చేసిన ప్రకటన ఈ దిశగా డిపాజిటర్లలో అంచనాలను పెంచింది. ఇప్పటికిప్పుడు దీన్ని పెంచకపోయినా, భవిష్యత్తులో ఇందుకు తప్పక అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్బీఎఫ్సీ డిపాజిట్ల సంగతేంటి? బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితర డిపాజిట్లు స్వీకరించే ఆర్బీఐ అనుమతి కలిగిన ఎన్బీఎఫ్సీలు (ఎన్బీఎఫ్సీ–డీ) దేశంలో 25 ఉన్నాయి. వీటి పరిధిలో 2024 మార్చి నాటికి రూ.1,02,994 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మరి ఉన్నట్టుండి వీటిల్లో ఏదైనా ఎన్బీఎఫ్సీకి నిధుల సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? బ్యాంకుల్లో మాదిరి వీటిల్లో డిపాజిట్లకు డీఐసీజీసీ కింద ఎలాంటి బీమా రక్షణ లేదు. ఇవన్నీ ప్రజల డిపాజిట్లే కనుక వీటిని సైతం డీఐసీజీసీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిల్లో డిపాజిట్ చేసే ముందు ఇన్వెస్టర్లు రిస్క్ లను అర్థం చేసుకోవాలి. బ్యాంకులకూ రేటింగ్ ఉండాలి.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బాండ్లు, ఎన్సీడీలను జారీ చేస్తుంటాయి. సంబంధిత ఎన్బీఎఫ్సీ ఆర్థిక ఆరోగ్యం ఆధారంగా రేటింగ్ ఏజెన్సీలు క్రెడిట్ రేటింగ్ను ప్రకటిస్తాయి. నిబంధనల ప్రకారం రేటింగ్ తప్పనిసరి. బ్యాంక్లు సైతం బాండ్లను జారీ చేయాలంటే రేటింగ్ తీసుకోవాల్సిందే. కానీ బ్యాంక్ డిపాజిట్లకు వచ్చే సరికి ఈ తరహా రేటింగ్ విధానం లేకపోవడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ డిపాజిట్లకు సైతం రేటింగ్ను తప్పనిసరి చేయడం వల్ల పాలన మెరుగుపడుతుందని ఎన్ఎస్జీ అండ్ పార్ట్నర్స్ పార్ట్నర్ రవి భడానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల డిపాజిట్ చేసే సమయంలో ఆయా బ్యాంక్లకు సంబంధించి రిస్క్ ను ఇన్వెస్టర్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా చేస్తే అప్పుడు బలహీన బ్యాంక్ల నుంచి అధిక రేటింగ్ ఉన్న బ్యాంకుల్లోకి డిపాజిట్లు తరలిపోయే రిస్క్ ఏర్పడుతుందని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ సతీష్ మరాటే పేర్కొన్నారు. దీనికి బదులు మెరుగైన రేటింగ్ ఉన్న బ్యాంకులకు డిపాజిట్లపై బీమా ప్రీమియం తక్కువ వసూలు చేసే విధానం ఫలితమిస్తుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈఎంఐలు.. ఇప్పట్లో తగ్గేనా?
ఆర్బీఐ చాలా కాలం తర్వాత కీలకమైన రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హమ్మయ్య రుణ రేట్లు తగ్గుతాయని, నెలవారీ ఈఎంఐ చెల్లింపుల భారం దిగొస్తుందని ఆశపడే వారు.. కొంత కాలం పాటు వేచి చూడక తప్పేలా లేదు. రెపో రేటు కోత ప్రభావం రుణాలు, డిపాజిట్లపై పూర్తిగా ప్రతిఫలించేందుకు కొన్ని నెలల సమయం తీసుకోవచ్చని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత కొరత (లిక్విడిటీ) ఉండడాన్ని, డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంక్ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారంగా మంజూరయ్యే రుణాలతోపాటు, డిపాజిట్లపై రేటు తగ్గింపు వెంటనే అమల్లోకి రాకపోవచ్చని.. అదే సమయంలో రెపో ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపు వేగంగా బదిలీ అవుతుందని చెబుతున్నారు. కొంత సమయం తర్వాతే.. ‘‘తాజా రేటు తగ్గింపు ప్రయోజనం కొత్త రుణాలపై అమలయ్యేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిట్ల కోసం పోటీ కారణంగా నిధులపై బ్యాంకులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఆర్బీఐ రేటు తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుందన్నారు. బ్యాంకు రుణాల్లో 40 శాతం మేర రెపో ఆధారిత రుణాలు ఉన్నట్టు చెప్పారు. ఆర్బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగిరావడం తెలిసిందే. మరోవైపు సమీప భవిష్యత్లో లిక్విడిటీ పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడిటీ పెంచే అదనపు చర్యలను ఆర్బీఐ తీసుకోకపోతే మార్చి నాటికి వ్యవస్థ వ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల లోటు ఏర్పడొచ్చని అంటున్నారు. అప్పుడు ఆర్బీఐ రేట్ల తగ్గింపు బదిలీకి మరింత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపునకు రెండు త్రైమాసికాల సమయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ రుణాల రేట్లను బ్యాంక్లు ఆర్నెళ్లకోసారి సమీక్షించడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంక్లు జూలై లేదా వచ్చే డిసెంబర్లో ఈ రుణాల రేట్లను సవరించే అవకాశం ఉంటుంది.డిపాజిట్లపై.. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి తాజా రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రభా వం పడదు. కొత్తగా డిపాజిట్ చేసే వారికి రేటు తగ్గే అవకాశాలున్నాయి. కాకపోతే వెంటనే కాకుండా క్రమంగా డిపాజిట్లపై ఈ మార్పు కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ల కోసం బ్యాంక్ల మధ్య పోటీ ఉన్నందున రేట్లను వెంటనే తగ్గించకుండా, ఆర్బీఐ చర్యలతో లిక్విడిటీ మెరుగయ్యాకే డిపాజిట్లపై రేట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ‘‘ఎక్స్టర్నల్ బెంచ్మార్క్స్ అనుసంధానిత రుణాలపై రేట్ల మార్పు ప్రభావం వెంటనే అమల్లోకి రావచ్చు. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై అమలు కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. మానిటరీ పాలసీ రేట్ల ప్రభావం డిపాజిట్లపై ప్రతిఫలించేందుకు కూడా రెండు త్రైమాసికాలు పట్టొచ్చు’’అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ పేర్కొనడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రుణబంధం పెరుగుతోంది
నూగూరి మహేందర్: ఒకప్పుడు చేబదులు కావాలంటే బంధువునో, స్నేహితులనో అడగాల్సిందే. లేదంటే తెలిసినవారి నుంచి వడ్డీకి అప్పు తీసుకోవాల్సిందే. వ్యక్తులు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. ఇప్పుడు ఒకరి ముందు నిలబడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఛాయ్ తాగేలోపు అప్పు పుడుతోంది. డబ్బులు పడ్డాయహో అంటూ ఫోన్ మెసేజ్ మోగుతుంది. ఏదైనా వస్తువు కొనాలన్నా, పేమెంట్స్ చేయాలన్నా ఖాతాలో, జేబులో డబ్బులు ఉండక్కర్లేదు. క్రెడిట్ కార్డు ఉంటే చాలు. అంతే కాదు యూపీఐ యాప్ల ద్వారా చేసే లావాదేవీలను బట్టి ఇన్స్టంట్ రుణం ఇచ్చేందుకూ బ్యాంకులు క్యూ కడుతున్నాయి. సిబిల్ స్కోర్ లేకున్నా పర్వాలేదంటున్నాయి. అప్పు సరే.. తీర్చేదెలా అన్న సందేహమూ అక్కర్లేదు. సింపుల్గా సులభ వాయిదాల్లో (ఈఎంఐ) తీర్చేసే వెసులుబాటూ కల్పిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్లో క్రెడిట్ కార్డులు, రుణాల వృద్ధి చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఈ రుణాల జోరు అభివృద్ధికి సూచికగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన జీవితం కోసం.. దిగువ–మధ్యతరగతి వినియోగదారులలో రుణాలు తీసుకునే విధానంలో గణనీయ మార్పు వచ్చింది. గతంలో మనుగడ కోసమైతే ఇప్పుడు ఆకాంక్షలు, వ్యాపారం, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. ఈ మార్పు దేశంలో అభివృద్ధి చెందుతున్న సామాజిక–ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తోందని బ్యాంకింగ్ రంగ సంస్థలు అంటున్నాయి. కస్టమర్లు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని చెబుతున్నాయి. రుణ లభ్యత, డిజిటల్ ఆధారిత బ్యాంకింగ్ మారుమూల పల్లెలకూ చొచ్చుకుపోవడం లోన్ పోర్ట్ఫోలియో పెరుగుదలకు దోహదం చేస్తోంది. నడిపిస్తున్న ధోరణులు.. కోవిడ్–19 మహమ్మారి రాక షాపింగ్ తీరుతెన్నులను మార్చేసింది. కన్జ్సూమర్ ఫైనాన్స్ రంగంలో ఉన్న హోమ్ క్రెడిట్ అధ్యయనం ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ వాటా 2021లో 69% ఉంటే.. 2023లో ఇది 48%కి, 2024 నాటికి 53%కి చేరింది. మహిళా కస్టమర్లలో 60%, మిలీనియల్స్ 59%, జనరేషన్ జెడ్ 58%, మెట్రోలు, టైర్–2 నగరాల్లో 56% మంది ఆన్లైన్ ట్రెండ్ను నడిపిస్తున్నారు. యాప్–ఆధారిత బ్యాంకింగ్కు మిలీనియల్స్లో 69% శాతం సై అంటున్నారు. జెన్ జెడ్ 65%, జెన్ ఎక్స్లో 58% యాప్ బేస్ట్ బ్యాంకింగ్ కోరుకుంటున్నారు. దిగువ–మధ్యతరగతి రుణగ్రహీతలలో 43% మందికి ఈఎంఐ కార్డ్లు అత్యంత ప్రజాదరణ పొందిన క్రెడిట్ సాధనంగా మారాయి. క్రెడిట్ కార్డ్లను 24%, డిజిటల్ లెండింగ్ యాప్లను 12% మంది ఎంచుకుంటున్నారు. వృద్ధిలోనూ ‘క్రెడిట్’వాటికే.. 2024 డిసెంబర్ నాటికి దేశంలో జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య 10.8 కోట్లు.. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం ఐదేళ్లలో క్రెడిట్ కార్డులు దాదాపు రెండింతలు అయ్యాయి. డెబిట్ కార్డులు ఐదేళ్లలో 80.53 కోట్ల నుంచి 2024 డిసెంబర్ నాటికి 99.09 కోట్లకు చేరాయి. ఏడాదిలో క్రెడిట్ కార్డుల వృద్ధి 10.31 శాతం ఉంటే డెబిట్ కార్డుల విషయంలో ఇది 3.13 శాతమే. క్రెడిట్ కార్డులతో జరిపిన చెల్లింపులు 2024 డిసెంబర్లో రూ.1,88,086 కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబర్తో పోలిస్తే ఇది 13.9 శాతం ఎక్కువ. 2024 డిసెంబర్లో కార్డులతో చేసిన మొత్తం చెల్లింపుల విలువలో క్రెడిట్ కార్డుల వాటా 82.22 శాతం ఉండటం గమనార్హం. 2023 డిసెంబర్లో ఇది 77.5 శాతం. క్రెడిట్ కార్డుల విభాగంలో మొత్తం పోర్ట్ఫోలియోలో ప్రైవేటు బ్యాంకుల వాటానే 69.8 శాతంగా ఉంది. క్రెడిట్ కార్డు వినియోగదారులు 2024 మార్చి నాటికి చెల్లించాల్సిన మొత్తం 27.7 శాతం పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరింది. రుణాల వృద్ధి అభివృద్ధికి సూచిక! రుణాలు పెరుగుతుండటం అభివృద్ధికి సూచిక. బ్యాంకుల మద్దతు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. బ్యాంకింగ్ లేకుండా వ్యవస్థ లేదు. వ్యవస్థ తదుపరి స్థాయికి చేరితేనే ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరుగుతుంది. బ్యాంకులు లాభాల్లో ఉన్నాయంటే అందుకు కారణం అర్హతగల వారికి రుణాలు జారీ చేయడమే. రుణ మార్కెట్లో మొండి బాకీలు సహజం. అయితే సానుకూల ధోరణితోనే రికవరీ చేయాలి. ఆర్థిక స్థోమత చూసి క్రెడిట్ కార్డులు ఇచి్చనంత వరకు ఎటువంటి సమస్య లేదు. – వి.ఎస్.రాంబాబు, జాతీయ కార్యదర్శి, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
‘బ్యాంకింగ్’కు బూస్ట్ ఇస్తారా?
దేశ బ్యాంకింగ్ రంగం.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. రుణాల్లో వృద్ధి బలహీనపడింది. డిపాజిట్లకు కస్టమర్లు మొహం చాటేస్తున్నారు. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగ్గడంతో, అధిక రేట్లపై డిపాజిట్లను ఆకర్షించాల్సిన పరిస్థితి. ఫలితంగా బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిపోయాయి. వీటికి పరిష్కార చర్యలు బడ్జెట్లో ఉంటాయన్న ఆశలు బ్యాంకింగ్ వర్గాల్లో నెలకొన్నాయి. ముఖ్యంగా లిక్విడిటీ పెంపు, రుణాల వృద్ధికి ఉద్దీపన చర్యలను ఈ రంగం ఆశిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.4 శాతానికి సెపె్టంబర్ త్రైమాసికంలో (2024–25) పడిపోవడం తెలిసిందే. ఈ ప్రభావం బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యతపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అన్ సెక్యూర్డ్ రుణాల్లో స్థూల, నికర నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. వీటికి గణనీయమైన కేటాయింపులతో బ్యాంకుల లాభాలు తరిగిపోతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో రానున్న బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిపాజిట్లకు ప్రోత్సాహకాలు → ఇన్వెస్టర్లు అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీ తదితర సాధనాల వైపు మళ్లిపోతుండడంతో, తిరిగి సంప్రదాయ బ్యాంక్ డిపాజిట్ల వైపు వారిని ఆకర్షించేందుకు చర్యలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. గృహ ఆర్థిక ఆస్తుల్లో బ్యాంకుల డిపాజిట్లు 2019–20 నాటికి 56.4 శాతంగా ఉంటే, 2024 మార్చి నాటికి 45.2 శాతానికి పడిపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ డిపాజిట్లపై తక్కువ పన్ను రేటును ప్రవేశపెట్టాలని ఈ రంగం కోరుతోంది. పన్ను ఆదా ఎఫ్డీపై ఐదేళ్ల లాకిన్ పీరియడ్ను తగ్గించినట్టయితే ఆకర్షణీయంగా మారుతుందని బ్యాంకర్లు అంటున్నారు. → ఆదాయపన్ను ఉపశమనంతో ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుంది. ఇది డిపాజిట్లు, రుణాలకు డిమాండ్ను పెంచుతుందున్న అంచనాలున్నాయి.→ హోల్సేల్ రుణాలు, బ్యాంకింగ్ రంగం నుంచి నిరర్థక రుణ ఆస్తులను సొంతం చేసుకోవడంపైనా పన్ను రాయితీలు కల్పించాలని నిపుణులు కోరుతున్నారు.→ సూక్ష్మ రుణాల విభాగంలో రుణ ఎగవేతలు ఇటీవల ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రుణ, నిర్వహణ వ్యయాల భారం ఎగసింది. ఈ పరిస్థితుల్లో అందు బాటు రేట్లపై ప్రత్యేక నిధుల విండోను ప్రకటించొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ అనలిస్టులు భావిస్తున్నారు. → అంతేకాదు మౌలికరంగ వసతుల కల్పన ప్రాజెక్టులకు కేంద్రం గణనీయమైన ప్రాధాన్యం ఇస్తోంది. రోడ్లు, రైల్వేలు, పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం చేసే మూలధన వ్యయాలతో.. అన్ని రంగాల్లోనూ కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తాయని, ఇది బ్యాంకుల రుణ డిమాండ్ను పెంచుతుందని భావిస్తున్నారు. రానున్న బడ్జెట్లో 14 శాతం అధికంగా 11.3 లక్షల కోట్లను మూలధన వ్యయాల కింద కేటాయించొచ్చని ఎలారా క్యాపిటల్ పేర్కొంది.రిటైల్ కస్టమర్ల నుంచి డిపాజిట్ల సమీకరణ విషయంలో బ్యాంకులు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రోత్సాహకాలు కల్పించినట్టయితే బ్యాంక్లు తమ రుణ అవసరాలకు అనుగుణంగా తక్కువ వ్యయాలపై నిధులు సమీకరించగలుగుతాయి. ముఖ్యంగా లిక్విడిటీ కవరేజీ రేషియోలో ప్రతిపాదిత మార్పుల నేపథ్యంలో ఇది ఎంతో అవసరం.– సచిన్ సచ్దేవ, ఇక్రా ఫైనాన్షియల్ రంగం రేటింగ్స్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరం
భారత బ్యాంకింగ్ రంగంలో మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరమని ప్రముఖ ఆర్థికవేత్త, ఎన్వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న విరాల్.వి.ఆచార్య అన్నారు. భారత బ్యాంకింగ్ విధానాలను రూపొందించడంలో ఆర్థిక అవసరాలు, రాజకీయ అంశాలపై పరస్పర చర్చ జరగాలని చెప్పారు. ఐఐఎం బెంగళూరులో జరిగిన ఐఎంఆర్ డాక్టోరల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన్ పాల్గొని మాట్లాడారు.‘దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కేవలం ఆర్థిక కారకాల ద్వారా మాత్రమే కాకుండా రాజకీయ వ్యవస్థ ద్వారా కూడా ప్రభావితమవుతోంది. కొన్నేళ్ల కొందట జరిగిన బ్యాంకుల జాతీయకరణ కేవలం ఆర్థిక సమ్మిళితం కోసమే కాకుండా రాజకీయ లక్ష్యాలను కూడా నెరవేర్చింది. జనాకర్షక వ్యయాలను సాధించడానికి ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థను వాడుకుంటున్నారు. ఈ విధానం వల్ల మార్కెట్ ఆధారిత సంస్కరణలు లేకుండా పోయాయి. ఇప్పటికైనా వ్యవస్థలు తేరుకుని సంస్కరణల దిశగా అడుగులు వేయాలి. డిజిటల్ ఫైనాన్స్ పెరుగుదల, బ్యాంకింగేతర రుణదాతల నుంచి నెలకొన్న పోటీ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేస్తోంది. డిజిటల్ ఫైనాన్స్లో ఇండియా చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ, ముఖ్యంగా కోవిడ్ అనంతరం కార్పొరేట్ సంస్థల లాభాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇది ఆర్థిక ప్రయోజనాలు తగ్గడానికి దారితీసింది’ అన్నారు.ఇదీ చదవండి: రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలునిర్మాణాత్మక సంస్కరణలు..దీర్ఘకాలిక వృద్ధికి ప్రాధాన్యమిచ్చే నిర్మాణాత్మక సంస్కరణల ప్రాముఖ్యతను ప్రొఫెసర్ ఆచార్య నొక్కి చెప్పారు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన సంస్కరణలు రావాలన్నారు. సంస్థలకు అనుకూలంగా ఉండే స్నేహపూర్వక సంస్కరణలకు బదులుగా మార్కెట్కు అనుకూలంగా ఉండే విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. -
ఎస్బీఐ ఎండీగా రామ మోహన్ రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎండీగా తెలుగువారైన రామ మోహన్ రావు అమరను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్బీఐ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు. రామ మోహన్ రావు బాధ్యతలు స్వీకరిస్తే ఎండీల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. సంస్థ చైర్మన్ సి.ఎస్.శెట్టి కూడా తెలుగు వారు కావడం విశేషం. ఎస్బీఐ చరిత్రలో ఒకేసారి రెండు కీలక పదవులను తెలుగువారు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్ల పేర్లను సిఫార్సు చేసే ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఈ ఏడాది సెప్టెంబర్లో రామ మోహన్ రావును ఎస్బీఐ ఎండీగా ప్రతిపాదించింది. ఎస్బీఐ ఎండీ పోస్టుకు ఎఫ్ఎస్ఐబీ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదనలపై ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవోగా కూడా రామ మోహన్ రావు పనిచేశారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. -
బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు.. రాహుల్పై నిర్మల ఫైర్
ఢిల్లీ: యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తాము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందికి ఫోన్లు చేసి వేధించే వారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరుగా ఉపయోగిస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటరిచ్చారు.ఈ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మల మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడాలి. బ్యాంకుల్లో కష్టపడి పనిచేసే ఉద్యోగులపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి. ముందుగా ఆయన బ్యాంకింగ్ సెక్టార్పై అవగాహన పెంచుకోవాలి. యూపీఏ హయాంలోనే బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను యూపీఏ హయాంలో తమ బంధుమిత్రులు, చీకటి వ్యాపారుల కోసం ఏటీఎంలా ఉపయోగించుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకుల సిబ్బందికి ఫోన్లు చేసి మరీ వేధించేవారు. రుణాల ఇవ్వని పక్షంలో వారిని టార్గెట్ చేసేవారు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకులు, ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయన్నారు. పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రూ.3.26 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్తో ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసినట్టు చెప్పుకొచ్చారు. అలాగే, కేంద్రంలో బీజేపీ హాయంలోనే 54 కోట్ల జన్ధన్ యోజన ఖాతాలు, పీఎం ముద్ర రుణాలు, స్టాండ్-అప్ ఇండియా, పీఎంస్వానిధి వంటి స్కీమ్స్ తీసుకువచ్చినట్టు తెలిపారు. -
సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపు
దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దేశీయ కంపెనీలు విదేశాల్లోని వాటి అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు వివరాలు వెల్లడించింది.ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం..2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల సేవల ఎగుమతులు రూ.200.6 బిలియన్ డాలర్లు(రూ.16.8 లక్షల కోట్లు)గా ఉన్నాయి. 2023-24లో అది రూ.17.2 లక్షల కోట్లుకు పెరిగింది. దేశీయ కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. రూ.17.2 లక్షల కోట్ల నుంచి విదేశీ అనుబంధ సంస్థల సేవలను మినహాయిస్తే కేవలం దేశీయ కంపెనీలే రూ.16 లక్షల కోట్ల విలువైన సేవలను ఎగుమతి చేశాయి. ఇది గతేడాదితో పోలిస్తే 2.8 శాతం ఎక్కువ. భారత కంపెనీలు అధికంగా అమెరికాకు ఈ సేవలను ఎగుమతి చేస్తున్నాయి. మొత్తం భారత కంపెనీల ఎగుమతుల్లో అమెరికా వాటా 53 శాతం కాగా, యూరప్ వాటా 31 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయంఅంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతలు పెరగడం వల్ల యుద్ధ భయాలు నెలకొంటున్నాయి. దాంతో బ్యాంకింగ్ రంగ సంస్థలతోపాటు ఇతర కంపెనీలు సాఫ్ట్వేర్ సేవలను అప్డేట్ చేయడంలో కొంత వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు కొంత స్థిరంగా కదలాడుతోంది. దాంతో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఫలితంగా లోన్లు పెరిగి బ్యాంకింగ్ రంగ సంస్థలు తమ సాఫ్ట్వేర్ కేటాయింపులకు నిధులు పెంచే అవకాశం ఉంటుంది. దాంతో రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఎగమతులు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
తెలుగు అధికారికి ఎస్బీఐ పగ్గాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన చైర్మన్గా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిని ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) శనివారం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న దినేష్ కుమార్ ఖరా స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనివాసులు తెలుగువారు కావడం విశేషం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు ఆయన స్వస్థలం. ఎస్బీఐలో ప్రొబేషనరీ అధికారిగా 1988లో కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్ఎస్ఐబీ.. ఎస్బీఐ కొత్త చైర్మన్ కోసం జూన్ 29న ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి శ్రీనివాసులు పేరును ఖరారు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫార్సుపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
సదా అప్రమత్తంగా ఉండండి
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఎల్లప్పుడూ అన్ని అంశాలపై అప్రమత్తతతో ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఉదాసీనతకు చోటులేకుండా సవాళ్ల పట్ల జాగరూకత వహించాలన్నారు. పటిష్ట బ్యాంకింగ్కు సంబంధించి నిరంతర పరస్పర చర్యల్లో భాగంగా గవర్నర్ కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఎండీ, సీఈఓలతో సమావేశమయ్యారు. ఫైనాన్షియల్ విధుల నిర్వహణలో భారత్ బ్యాంకింగ్ చక్కటి పురోగతి సాధించిందని ఈ సందర్భంగా అన్నారు. అయితే చక్కటి బ్యాలెన్స్ సీట్స్ నిర్వహణ, వ్యక్తిగత రుణాలపై పర్యవేక్షణ, సహ–రుణ మార్గదర్శకాలను పాటించడం, ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల అందజేత, ద్రవ్య లభ్యత సవాళ్లు, ఐటీ– సైబర్ సెక్యూరిటీ, పాలనా వ్యవహారాల పటిష్ట నిర్వహణ, డిజిటల్ మోసాల నివారణ వంటి అంశాలపై అన్ని సమయాల్లో అప్రమత్తత పాటించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొంటూ... ఫైనాన్షియల్ వ్యవస్థ రక్షణ, స్థిరత్వలో ఇది కీలకమని అన్నారు. ఆర్బీఐ ఫిన్టెక్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి బ్యాంకులకు తగిన ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్రావు, స్వామినాథన్సహా నియంత్రణ, పర్యవేక్షణ కార్యక్రమాల ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. -
ఒకటే రీజన్.. 3500 మంది ఉద్యోగులు బయటకు..!
జర్మనీలో అతిపెద్ద లెండర్ 'డ్యుయిష్ బ్యాంక్' తాజాగా 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. 2023లో బ్యాంక్ లాభాలు భారీగా తగ్గిపోవడం వల్ల సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2022 కంటే కూడా 2023లో సంస్థ లాభాలు 16 శాతం తగ్గడం మాత్రమే కాకుండా, ఖర్చులు పెరగడం వల్ల డ్యుయిష్ బ్యాంక్ 3500 మందిని తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ఐరోపా సెంట్రల్ బ్యాంక్ అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆదాయం సంవత్సరానికి ఆరు శాతం పెరిగి 28.9 బిలియన్ యూరోలకు చేరుకుందని, అనిశ్చితి వాతావరణంలో కూడా బ్యాంక్ పనితీరు అద్భుతంగా ఉందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'క్రిస్టియన్ సివింగ్' ప్రశంసించారు. కానీ బ్యాంక్ మరింత లాభాలను పొందే క్రమంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని వెల్లడించారు. ఇదీ చదవండి: విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు! 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా డ్యుయిష్ బ్యాంక్ 85000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నంలో ఖర్చులను తగ్గించుకుని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి లేఆప్స్ చేస్తున్నట్లు సమాచారం. -
ఆప్కాబ్కు 60 ఏళ్లు
సాక్షి, అమరావతి: సహకార బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) 60 ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డీసీసీబీ, పీఏసీఎస్ల ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి కోసం ఆప్కాబ్ కృషి చేస్తోంది. పీఏసీఎస్లు స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్థిక చేయూత అందిస్తోంది. ఈ నెల 4వ తేదీన జరగనున్న వజ్రోత్సవ వేడుకలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. రూ.లక్ష కోట్ల వ్యాపారం 1963 ఆగస్టు 4న ఏర్పడిన ఆప్కాబ్ 1966లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి షెడ్యూల్డ్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. దీని పరిధిలో 18 శాఖలు ఉండగా.. ఆప్కాబ్ పర్యవేక్షణలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)ల పరిధిలో 425 బ్రాంచ్లు, 1,995 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఆప్కాబ్ ఆధునిక సాంకేతికతను సంతరించుకుంది. డీసీసీబీలు, పీఏసీఎస్లను కూడా కోర్ బ్యాంకింగ్ నెట్వర్క్ పరిధిలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. 2018–19 నాటికి రూ.13,322 కోట్ల వార్షిక టర్నోవర్తో ఉన్న ఆప్కాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో ఏకంగా రూ.36,732 కోట్ల వ్యాపార మైలురాయిని అధిగమించింది. రూ.251 కోట్ల లాభాలను ఆర్జించింది. సహకార వ్యవస్థ ద్వారా దేశంలోనే తొలిసారి రూ.లక్ష కోట్ల వ్యాపారంతో గ్రామీణ సహకార వ్యవస్థలో స్వర్ణయుగానికి నాంది పలికింది. నాలుగేళ్లలో వరుసగా రెండు సార్లు నాఫ్స్కాబ్ ద్వారా జాతీయ స్థాయిలో నంబర్–1 సహకార బ్యాంక్గా గుర్తింపు పొందింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఇండియాలోనే బెస్ట్ కో–ఆపరేటివ్ బ్యాంక్గా ఆప్కాబ్ బీఎఫ్ఎస్ఐ ద్వారా అవార్డు అందుకుంది. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా బ్యాంక్ నూతన లోగో, పోస్టల్ స్టాంప్తో పాటు విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనుంది. రైతు సేవలో 60 ఏళ్లు ఆప్కాబ్ రైతుల సేవలో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బ్యాంక్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులకు అభినందనలు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సహకార రంగం సీఏం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలతో బలోపేతమైంది. రికార్డుస్థాయి వ్యాపారంతో నష్టాల నుంచి గట్టెక్కి లాభాలను ఆర్జిస్తోంది. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
RBI Annual Report 2022-23: కట్టలు తెంచుకున్న కరెన్సీ!
ముంబై: చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ అలాగే పరిమాణం రెండూ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో (2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చి) వరుసగా 7.8 శాతం, 4.4 శాతం పెరిగాయి. అయితే 2021–22లో ఈ పెరుగుదల (2020–21తో పోల్చి) వరుసగా 9.9 శాతం, 5 శాతంగా ఉన్నాయి. మొత్తంగా పరిస్థితి చూస్తే, డిజిటలైజేషన్ మార్గంలో ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యవస్థలో బ్యాంకు నోట్ల విలువ, పరిమాణం పెరగడం గమనార్హం. అయితే పెరుగుదల శాతాల్లో తగ్గడమే ‘చెప్పుకోవడానికి’ కొంత ఊరటనిచ్చే అంశం. ఆర్బీఐ ఈ మేరకు విడుదల చేసిన వార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ♦ విలువ పరంగా చూస్తే, రూ. 500, రూ. 2,000 నోట్ల వాటా 31 మార్చి 2023 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 87.9 శాతం. 31 మార్చి 2022లో ఇది 87.1 శాతం. ♦ రూ. 500 డినామినేషన్ అత్యధికంగా 37.9% వాటాను కలిగి ఉంది. తరువాతి స్థానంలో రూ. 10 డినామినేషన్ బ్యాంక్ నోటు ఉంది. ఈ నోట్లు 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంక్ నోట్లలో రూ.10 నోట్ల పరిమాణం 19.2%గా ఉన్నాయి. ♦ 2023 మార్చి చివరి నాటికి రూ. 25,81,690 కోట్ల విలువ కలిగిన మొత్తం రూ. 500 డినామినేషన్ నోట్లు 5,16,338 లక్షలు. 2022 మార్చి చివరి నాటికి రూ. 500 నోట్ల సంఖ్య 4,55,468 లక్షలు. అంటే వ్యవస్థలో రూ.500 నోట్లు వార్షికంగా పెరిగాయన్నమాట. ♦ ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 డినామినేషన్లు ఉన్నాయి. చెలామణిలో ఉన్న నాణేలు 50 పైసలు, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 డినామినేషన్లను కలిగి ఉంటాయి. ♦ 2022–23 మధ్యకాలంలో ఆర్బీఐ లైవ్–పైలట్ ప్రాతిపదికన ఈ–రూపాయిని కూడా ప్రారంభించింది. 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న ఈ–రూపాయి–హోల్సేల్ అలాగే ఈ–రూపాయి–రిటైల్ విలువలు వరుసగా రూ. 10.69 కోట్లు రూ. 5.70 కోట్లుగా ఉన్నాయి. ♦ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు నోట్ల ఇండెంట్, సరఫరాలు రెండూ గత సంవత్సరంతో (2021–22) పోలిస్తే 1.6 శాతం స్వల్పంగా పెరిగాయి. రూ.2000 నోట్ల ప్రింటింగ్కు ఇండెంట్ లేదు. రూ.2000 నోట్ల సంగతి ఇదీ... ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే, 2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి. 2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది. తగ్గుతున్న మోసాల ‘విలువ’..: 2022–23లో బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుంది. అయితే విలువ మాత్రం దాదాపు సగానికి తగ్గి రూ. 30,252 కోట్లుగా ఉంది. కార్డ్, ఇంటర్నెట్ డిజిటల్ పేమెంట్లలోనే మోసాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
షార్ట్ కవరింగ్ లాభాలు
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు మార్చి సిరీస్కు లాభాలతో వీడ్కోలు పలికాయి. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల జరగడంతో బుధవారం సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కొలిక్కి వస్తుండంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభమైన తర్వాత మిడ్ సెషన్ వరకు సూచీలు స్థిరంగా కదలాడాయి. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా.., చివరి గంటలో కీలక రంగాల్లో కొనుగోళ్ల జోరు పెరగడంతో లాభాలు పెరిగాయి. ఉదయం సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప నష్టంతో 57,613 మొదలైంది. ఇంట్రాడేలో 57,524 వద్ద కనిష్టాన్ని, 58,124 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 346 పాయింట్లు ఎగసి 57,960 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్లు పతనమై 16,952 వద్ద మొదలైంది. రోజంతా 16,941 – 17,126 శ్రేణిలో ట్రేడైంది. చివరికి 129 పాయింట్ల లాభంతో 17,081 వద్ద నిలిచింది. అన్ని రంగాల షేర్లకు డిమాండ్ నెలకొంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు అధికాస్తకి చూపారు. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఎఫ్పీఐలు రూ.1,245 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.823 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు క్షీణించి 82.31 స్థాయి వద్ద స్థిరపడింది. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి శుక్రవారం ప్రారంభమవుతాయి. సూచీలు అరశాతానికి పైగా ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ.3.12 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఆసియా మార్కెట్లు ఒకశాతం, యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పెరిగాయి. యూఎస్ స్టాక్ సూచీలు ఒకశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుందనే స్పష్టం వచ్చేంత వరకు, బ్యాంకింగ్ రంగంలో అనిశ్చితులు సంపూర్ణంగా సద్దుమణిగే దాకా ఒడిదుడుకులు తప్పవు. సాంకేతికంగా నిఫ్టీ గత 5 రోజుల్లో గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఎగువన 17,207–17,255 శ్రేణిలో నిరోధాన్ని, దిగువ స్థాయిలో 16,985 వద్ద తక్షణ మద్దతు ఏర్పాటు చేసుకుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦కెన్ తన నివేదికలో నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలు చేసిందంటూ అదానీ గ్రూప్ వివరణతో ఈ కంపెనీల షేర్లు ర్యాలీ చేశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ తొమ్మిది శాతం, అదానీ పోర్ట్స్ ఏడుశాతం లాభపడ్డాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు ఐదుశాతం ఎగసి అప్పర్ సర్క్యూట్ వద్ద లాకయ్యాయి. ♦ ఇండస్ఇండ్ బ్యాంకుతో వివాదాలను పరిష్కరించుకున్నామని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ తెలపడంతో జీ మీడియా షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ 2% బలపడి రూ.1,056 వద్ద నిలిచింది. ♦ బైబ్యాక్ ఇష్యూలో పాల్గొనేందుకు అర్హత తేదీ ముగియడంతో సింఫనీ షేరు ఆరు శాతం పతనమైన రూ.1023 వద్ద ముగిసింది. -
సూచీలకు పన్ను పోటు
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టులపై కేంద్రం సెక్యూరిటీ లావాదేవీల పన్ను 25 శాతం(0.05% నుంచి 0.0625 శాతానికి)పెంపుతో స్టాక్ సూచీలు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో భయాలు దావానలంలా వ్యాప్తి చెందుతుండటం సెంటిమెంట్పై మరింత ఒత్తిడిని పెంచింది. అలాగే డాలర్ రికవరీతో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 398 పాయింట్లు నష్టపోయి 57,527 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 17 వేల దిగువన 16,945 వద్ద నిలిచింది. ఉదయం సెషన్లో లాభాలతో కదలాడిన సూచీలు మిడ్ సెషన్ ముందు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 57,423 – 58,066 పరిధిలో కదలాడింది. నిఫ్టీ 16,917–17,109 రేంజ్లో ట్రేడైంది. ఆ తర్వాత కొద్దిసేపు లాభనష్టాల మధ్య ట్రేడైన సూచీలు ఆఖర్లో అమ్మకాలు పోటెత్తడంతో వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, మీడియా, రియల్టీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1720 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2556 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 20 పైసలు క్షీణించి 82.40 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ రంగ సంక్షోభంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఏఎంసీ షేర్ల పతనం.. తాజా ఫైనాన్స్ బిల్లుతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)ల ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాలిక పెట్టుబడి లాభాల పన్ను వర్తించనుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనయ్యారు. ప్రధానంగా యూటీఐ 4.7 శాతం, ఆదిత్య బిర్లా 4.4 శాతం, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఇతర ఏఎంసీలు శ్రీరామ్ 3.2 శాతం, నిప్పన్ లైఫ్ ఇండియా 1.3 శాతం చొప్పున క్షీణించాయి. -
బ్యాంకింగ్ సంక్షోభం నేర్పే పాఠాలు
ప్రధానంగా అమెరికా కేంద్రంగా పనిచేసే కొన్ని బ్యాంకుల సంక్షోభం పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. దీంతో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా? ఇలా కుప్పకూలిపోయే బ్యాంకులు మరిన్ని ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఆ బ్యాంకుల సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు దేనికవే వేర్వేరు కావడం గమనార్హం. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో తగినన్ని ఏర్పాట్లు ఉన్నా రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీ ప్రాక్టీసుల విషయంలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. కేవలం పెట్టుబడులపై మాత్రమే కాకుండా, అప్పులపై కూడా దృష్టి పెట్టాలన్నది ఈ సంక్షోభం చెబుతున్న ఒక పాఠం. పెట్టుబడుల జాబితా మరీ కొండవీటి చాంతాడంత ఉండటమూ సరికాదన్నది మరో పాఠం. సిల్వర్గేట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ స్వీస్... ఇటీవలి కాలంలో పత్రికల పతాక శీర్షికలకు ఎక్కిన బ్యాంకుల పేర్లు. భారత్లో క్రెడిట్ స్వీస్ గురించి చాలామందికి తెలుసు కానీ... మిగిలిన మూడింటితో పరిచయం అంతంత మాత్రమే. ఎందుకంటే ఇవి ప్రధానంగా అమెరికాలో పనిచేసే బ్యాంకులు. అయినాసరే, వీటి గురించి బోలె డన్ని కథనాలు వరుసగా వస్తూండటం కొంత అసౌకర్యంగా అనిపించే విషయమే. ఇప్పుడు తలెత్తిన ప్రశ్న ఏమిటంటే, మన బ్యాంకింగ వ్యవస్థఎంత సురక్షితం? అన్నది. అమెరికాకు చెందిన లేహ్మ¯Œ బ్రదర్స్ దివాళా సంక్షోభం తరువాత ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్’ మూలధనానికి సంబంధించిన విధానాలను మరింత కఠినం చేసింది. బేసెల్ కమిటీ మార్గదర్శకాలు ఇందుకు కారణమయ్యాయి. అయినా ప్రస్తుత సంక్షోభాన్ని అది నివారించలేక పోయింది. ఇప్పుడు ఇంకో ప్రశ్న తలెత్తుతోంది. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా? లేక ఇలా కుప్పకూలిపోయే బ్యాంకులు మరిన్ని ఉన్నాయా? అయితే, ఈ బ్యాంకుల మూసివేతకు దారితీసిన పరిస్థితులు దేనికవే వేర్వేరు కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. దేని కారణాలు దానివే! ఈ మూడు బ్యాంకుల మూసివేతకూ, భారతీయ బ్యాంకులకూ నేరుగా సంబంధం లేకపోవచ్చు. సిల్వర్గేట్ బ్యాంకు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో ఉంది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి అంత ఆదరణ లేదు. ఇంకొన్నేళ్లు పోతే అసలు క్రిప్టో అన్న పదం కూడా వినిపించకపోవచ్చు. అదంత సుస్థిరమైంది కాదని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు కేవలం స్టార్టప్లపైనే ఎక్కువగా కేంద్రీ కరించింది. అందిన డిపాజిట్లు అత్యధికం స్టార్టప్ల నుంచి వచ్చినవే. కొంతమేరకు అప్పులూ ఇచ్చారు కానీ ఎక్కువ మొత్తం ప్రభుత్వాలకు అప్పు ఇచ్చింది. (మన బ్యాంకుల మాదిరిగానే ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లుల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టారన్నమాట.) ఇక సిగ్నేచర్ బ్యాంకు గురించి: ఇది అటు క్రిప్టో, ఇటు స్టార్టప్లు రెండు రంగాల్లోనూ పనిచేస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆదుకునేందుకు న్యూయార్క్ కమ్యూనిటీ బ్యా¯Œ కార్ప్ ఒక ప్రయత్నం చేస్తోంది. చివరగా క్రెడిట్ స్వీస్: ఇది స్విట్జర్లాండ్ బ్యాంక్. ఎవరికి రుణా లిచ్చారన్న విషయంలో ఈ బ్యాంకు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే రకరకాల వ్యాపార వ్యవహారాల కారణంగా నష్టాలు ఎదు ర్కొంది. ఆ దేశ కేంద్ర బ్యాంకు దీనికి బెయిల్ అవుట్ ఇస్తోంది. అలాగే యూబీఎస్ దీన్ని స్వాధీనం చేసుకుని కష్టాల నుంచి బయట పడేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నాలుగు ఘటనలు వేటికవే ప్రత్యేకం కానీ చరిత్ర పుటల్లో నిలిచిపోయేవి. లేహ్మన్ బ్రదర్స్ సంక్షోభం కంటే ప్రస్తుత సంక్షోభం భిన్నమైంది. ఎలాగంటే... ఇప్పుడు అన్ని నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఆర్బీఐ కూడా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగా ఉందన్న భరోసా ఇచ్చింది. యూరప్లోనూ కేంద్ర బ్యాంకులు క్రెడిట్ స్వీస్ సంక్షోభం ప్రభావాన్ని మదిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం ప్రభావం భారత్పై ఏమిటి? మనం నేర్చుకోవాల్సిన గుణపాఠా లేమిటి? అప్పుల గురించి కూడా యోచించాలి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం నేర్పించే మొదటి పాఠం... కేవలం పెట్టుబడులపై మాత్రమే కాకుండా, అప్పులపై కూడా దృష్టి పెట్టాలని! రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ముప్పు ఒక్క దగ్గర పోగు పడకుండా చూడటం వీటి ఉద్దేశం. అయితే డిపాజిట్లు పోగుపడటం వల్ల కూడా ముప్పు ఉంటుందన్నది వినూత్నమైన విషయం. డిపా జిట్లు ఎక్కువగా స్టార్టప్ల నుంచి రావడం వల్ల సంక్షోభం మరింత ముదిరింది. ఎందుకంటే డిపాజిట్లు చేసిన వారందరూ అకస్మాత్తుగా వాటిని ఉపసంహరించుకునే ప్రయత్నం చేశారు. భారతీయ బ్యాంకులు ఈ విషయమై ఆలోచన చేయాలి. చిన్న బ్యాంకులు మరీ ముఖ్యంగా. ఇక రెండో గుణపాఠం: పెట్టుబడుల జాబితా మరీ కొండవీటి చాంతాడంత ఉండటమూ సరికాదని చెబుతోంది. యూఎస్ ట్రెజరీ బాండ్లు కలిగి ఉండటం వాస్తవానికి చాలా సురక్షితం. కానీ వడ్డీ రేట్లు పెరిగిపోవడం వల్ల ఈ పెట్టుబడుల విలువల్లో తేడాలొస్తాయి. ఈ విషయాన్ని బ్యాంకులు గుర్తించాలి. రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీ ప్రాక్టీసెస్లను సమీక్షించుకోవాలి. ముచ్చటగా మూడో పాఠం: వాణిజ్య బ్యాంకింగ్లో నైపుణ్యం సాధించాలని బ్యాంకులకు తరచూ చెబుతూంటారు. ఇతర కార్య కలాపాలను అనుబంధ కంపెనీల ద్వారా నడపాలనీ, వాటి మూల ధన నిర్మాణం కూడా వేరుగా ఉండాలనీ అంటారు. క్రెడిట్ స్వీస్ విషయంలో ఈ రెండు లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో వచ్చిన నష్టాలు, వెల్త్ మేనేజ్మెంట్ విభాగపు నిధులను విత్డ్రా చేయడం కాస్తా వాణిజ్య బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్పై ప్రభావం చూపింది. భారత్లో ఈ బలహీనతను చాలాకాలం కిందటే గుర్తించారు. అందుకే ఇన్వెస్ట్మెంట్, మర్చెంట్ బ్యాంకింగ్, ఇన్సూరె¯Œ ్స, మ్యూచు వల్ ఫండ్స్ తదితరాలను అనుబంధ సంస్థల ద్వారా నడుపుతున్నారు. దీనివల్ల ముప్పు కొంచెం తక్కువవుతుంది. క్రిప్టో కరెన్సీని ఎలాగూ భారత్ గుర్తించలేదు. కాబట్టి రెండు బ్యాంకులు కుప్పకూలడం తాలూకూ ప్రభావం మనపై ఉండదు. వాస్తవానికి తాజా సంక్షోభం తరువాత ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ వ్యవహారాలను బ్యాంకింగ్కు దూరంగా ఉంచాలన్న అభి ప్రాయం బలపడటం గుర్తించాలి. ప్రత్యక్ష ప్రభావం లేదు అమెరికన్ బ్యాంకులు, క్రెడిట్ స్వీస్ సంక్షోభం తాలూకూ ప్రత్యక్ష ప్రభావం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఏమీ కనపడటం లేదు. కాకపోతే ఒక్కసారి పరిస్థితిని సమీక్షించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. బ్యాలెన్స్ షీట్లను ఒక్కసారి పరిశీలించుకుని డిపాజిట్లు, అప్పులు ఎలా విభజితమై ఉన్నాయో చూసుకోవడం మేలు. ట్రెజరీ డిపార్ట్మెంట్ కూడా రిస్క్ టీమ్స్తో కలిసి పెట్టుబడుల తీరు తెన్నులను మదింపు చేయాలి. అంతేకాకుండా... డెట్(రుణ) సర్వీస్ కవరేజి నిష్పత్తికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా? అన్నది పరిశీలించాలి. ఇది నిరంతర ప్రక్రియలా సాగాలి. ఆర్బీఐ కూడా డిపాజిట్లపై ప్రస్తుతం జారీ చేస్తున్న ఇన్సూరెన్స్ను సమీక్షించాల్సిన అవసరముంది. ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న ఐదు లక్షల గరిష్ఠ ఇన్సూరెన్స్ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాలి. ముప్పు తీవ్రత ఆధారంగా బ్యాంకులను వర్గీకరించే అంశాన్నీ పరిశీలించాలి. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఎదు ర్కొనేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశంపై త్వరలోనే చర్చ మొదలు కావచ్చు. ‘బేసిల్–4’ (సంస్కరణల కోసం) వంటివి ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. ఇది బ్యాంకులకు అవసరమైన మూలధనం మరింత పెరిగేందుకు దారితీసే అవకాశముంది. అంతేకాకుండా... మార్కెట్, క్రెడిట్ రిస్క్లను అంచనా వేసేందుకు మరిన్ని పరీక్షల్లాంటివి చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. మదన్ సబ్నవీస్, వ్యాసకర్త బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్, (‘ద బిజినెస్ లైన్’ సౌజన్యంతో). -
ఐటీకి బ్యాంకింగ్ షాక్!
రెండు వారాలుగా అమెరికా, యూరప్ ప్రాంతాల బ్యాంకింగ్ రంగంలో ఒకేసారి సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. పలు బ్యాంకులు మూత పడుతున్నాయి. దీంతో దేశీ ఐటీ రంగానికి సమస్యలు ఎదురుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిశ్రమ ఆదాయంలో అత్యధిక వాటాకు ప్రాతినిధ్యం వహించే బీఎఫ్ఎస్ఐ విభాగం ఇందుకు కారణం కానున్నట్లు అంచనా. సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్దిరోజులుగా అటు అమెరికా, ఇటు యూరప్ బ్యాంకింగ్ రంగాలలో ప్రకంపనలు పుడుతున్నాయి. అమెరికాలో ఉన్నట్టుండి సిల్వర్గేట్ క్యాపిటల్ మూతపడగా.. వైఫల్యాల బాటలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ను ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్(ఎఫ్డీఐసీ) టేకోవర్ చేసింది. ఈ బాటలో సిగ్నేచర్ బ్యాంక్ సైతం దివాలాకు చేరగా.. న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ ఆదుకుంది. అనుబంధ సంస్థ ఫ్లాగ్స్టార్ బ్యాంక్ ద్వారా ఆస్తుల కొనుగోలుకి అంగీకరించింది. ఇక మరోపక్క యూరోపియన్ బ్లూచిప్ క్రెడిట్ సూసీ దివాలా స్థితికి చేరడంతో స్విస్ కేంద్ర బ్యాంకు కల్పించుకుని ఫైనాన్షియల్ రంగ దిగ్గజం యూబీఎస్ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇక తాజాగా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును ఆదుకోవాలని జేపీ మోర్గాన్ ఇతర దిగ్గజాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 2008 తదుపరి మరోసారి ఫైనాన్షియల్ రంగంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ ప్రభావం దేశీ సాఫ్ట్వేర్ సేవల రంగాన్ని దెబ్బ తీసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కోలుకుంటున్న వేళ కోవిడ్–19 సవాళ్లలో ఊపందుకున్న సాఫ్ట్వేర్ రంగం ఇటీవల రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో కొంత అనిశ్చిత వాతావరణాన్ని చవిచూస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఉద్యోగ నియామకాలు మందగించగా.. వచ్చే ఏడాదిపై ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే ఇంతలోనే బ్యాంకింగ్ రంగ సంక్షోభం ద్వారా మరో షాక్ తగలనున్నట్లు పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో కుదుపుల కారణంగా దేశీ ఐటీ దిగ్గజాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నట్లు చెబుతున్నారు. బీఎఫ్ఎస్ఐ దెబ్బ దేశీ ఐటీ సేవల రంగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. సాఫ్ట్వేర్ రంగ సమాఖ్య నాస్కామ్ గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయంలో 20–40 శాతం వాటాను ఆక్రమిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈ వాటా 41 శాతాన్ని తాకనున్నట్లు అంచనా. ఇటీవల సవాళ్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు ప్రధానంగా దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్టీఐమైండ్ట్రీ, ఎంఫసిస్ సేవలు అందిస్తున్నాయి. ఉదాహరణకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసీ, యూబీఎస్లకు టీసీఎస్ ఐటీసర్వీసులు సమకూర్చుతోంది. ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం సైతం సేవలు అందిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనే ఈ కంపెనీలు ప్రొవిజన్లు చేపట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే 2008లో లేమన్ బ్రదర్స్ దివాలా తదుపరి బ్యాంకులు వ్యయాల తగ్గింపు, బిజినెస్ పెంపు ప్రాజెక్టులపై దృష్టి సారించడంతో దీర్ఘకాలంలో ఐటీ రంగం బలపడిన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి డీల్స్ తగ్గనుండగా.. కాంట్రాక్ట్ ధరలపై సైతం ఒత్తిడి తలెత్తవచ్చని అంచనా. దేశీ ఐటీ దిగ్గజాల ఆదాయాల్లో ఉత్తర అమెరికా, యూరోపియన్ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషించే సంగతి తెలిసిందే. వెరసి ఈ ఏడాది క్యూ4పై పెద్దగా ప్రభావం పడనప్పటికీ వచ్చే ఏడాది ప్రతికూలతలు కనిపించవచ్చని నిపుణులు తెలియజేశారు. మందగమనం అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగం సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో కొత్త డీల్స్ మందగించవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆధునిక ఆటోమేషన్ ప్రాసెస్, ట్రాన్స్ఫార్మేషన్ ప్రణాళికలు తదితరాలకు తాత్కాలికంగా బ్రేక్ పడే వీలున్నట్లు తెలియజేశారు. ఇది ఐటీ కాంట్రాక్టులు ఆలస్యమయ్యేందుకు కారణంకావచ్చని విశ్లేషించారు. తాజా ఐటీ వ్యయ ప్రణాళికలు వాయిదా పడవచ్చని, కొత్త ఆర్డర్లకు విఘాతం కలగవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీఎఫ్ఎస్ఐ అతిపెద్ద విభాగమని దీంతో దేశీ సాఫ్ట్వేర్ సేవలకు దెబ్బ తగలవచ్చని పేర్కొన్నారు. -
ఇది డిజిటల్ చెల్లింపుల విప్లవం
డిజిటల్ చెల్లింపుల ఆవిష్కరణ భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పును తీసుకొచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలన్నింటినీ పరివర్తన చెందించిన గొప్ప విప్లవ ఆవిష్కరణే ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. దేశీయంగా మొదలైన ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ కోట్లాదిమందిని సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ చట్రం నుంచి బయటకు లాగడమే కాదు... దేశీయ వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది ఒక గేమ్ ఛేంజర్లా పనిచేసింది. ప్రజా జీవితంలో,బ్యాంకింగ్ రంగంలో, నగదు లావాదేవీల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చిన భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు భారతదేశం అందించిన అధునాతన సాంకేతిక విప్లవం– డిజిటల్ పేమెంట్ సిస్టమ్. భారత్ రూపొందించిన దేశీయ తక్షణ చెల్లింపుల వ్యవస్థ వాణిజ్య కార్యకలాపాలను పునర్ని ర్మించడమే కాదు, కోట్లాదిమంది ప్రజలను సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేసింది. కేంద్ర ప్రభుత్వం దృఢమైన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని రూపొందించింది. ఇది రోజువారీ జీవితాన్ని సౌకర్యవంతం చేసింది. రుణాలు, పొదుపులు వంటి బ్యాంకింగ్ సేవలను మరింతగా విస్తరింపజేసింది. కోట్లాది మంది భారతీయులకు ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా అందు బాటులోకి తీసుకొచ్చింది. పన్నుల సేకరణను కూడా సులభతరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ జీ20 ఆర్థిక మంత్రులతో ముచ్చటిస్తూ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పాలనను మౌలికంగానే మార్చివేసిందని చెప్పారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ను అతి తక్కువ ఖర్చుతో ఏర్పర్చిన సాంకేతిక ఆవిష్కరణగా చూడవచ్చు. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఎలా ప్రభావితం చేయవచ్చో భారత్ నిరూపించింది. భౌతిక మౌలిక వసతుల వ్యవస్థ వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది. ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశాలను కూడా పైకి లేపేటటు వంటి ఆలోచనల ఇంక్యుబేటర్గా భారత్ ఎగుమతి చేయాలనుకుంటున్న పబ్లిక్–ప్రైవేట్ మోడల్ ఇది. భారత్ ప్రారంభించిన ఈ గొప్ప ఆవిష్కరణ కేంద్ర భాగంలో ‘జేఏఎమ్’ త్రయం ఉన్నాయి. అవి: జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్. ఈ మూడు మూలస్తంభాలూ భారత ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సమూలంగా విప్లవీకరించాయి. మొదటి స్తంభమైన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ప్రతి వయోజన భారతీయుడికి ఒక బ్యాంక్ ఖాతాను గ్యారంటీగా అందించే ఆర్థిక కార్యక్రమం. 2022 నాటికి, ఈ పథకం కింద 46.25 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిచారు. వీటిలో 56 శాతం మహిళల ఖాతాలు కాగా, 67 శాతం ఖాతాలు గ్రామీణ, అర్ధ పట్టణ ప్రాంతాల్లో తెరిచారు. ఈ ఖాతాల్లో రూ. 1,73,954 కోట్లు జమ అయ్యాయి. ఇక రెండో మూలస్తంభం: ఆధార్ పరివర్తిత ఐడెంటిటీ సేవలు. ఆధార్ ఐడీని రెండు అంశాల ప్రామాణీకరణ లేదా బయోమెట్రిక్ ద్వారా ఉపయోగించవచ్చు. ఆధార్ ప్రామాణీకరణ బ్యాంకులు, టెల్కో వంటి సంస్థలకు మూలాధారంగా మారింది. ఈరోజు దేశంలోని 99 శాతం వయోజనులు బయోమెట్రిక్ గుర్తింపు నంబర్ను కలిగి ఉన్నారు. ఇంతవరకు 1.3 బిలియన్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు బ్యాంక్ ఖాతాల రూపకల్పనను సరళతరం చేసి సత్వర చెల్లింపుల వ్యవస్థకు పునాదిగా మారాయి. ఇక మూడో మూలస్తంభం: మొబైల్. ఇది భారతీయ టెలికామ్ రంగంలో కీలకమైన డిజిటల్ ఆవిష్కరణ. 2016లో రిలయెన్స్ జియో టెలికామ్ రంగంలోకి దూసుకొచ్చిన తర్వాత డేటా ఖర్చు 95 శాతం వరకు పడిపోయింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ–కామర్స్, ఫుడ్ డెలివరీ, ఓటీటీ కంటెంట్ వంటి సమాంతర వ్యవస్థలకు జీవం పోసింది. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, అత్యంత మారుమూల ప్రాంతాల్లోని చిట్ట చివరి వ్యక్తికి కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అందుబాటు, స్మార్ట్ ఫోన్ల వ్యాప్తిని టెలిఫోన్ కంపె నీలు వేగవంతం చేయడం; ఆధార్ ప్రామాణీకృత జన్ ధన్ ద్వారా భారతీయ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ సమూల మార్పునకు గురైంది. ఈ సమూల మార్పు బ్యాంక్ ఖాతాకు నగదు రహిత చెల్లింపులను అనుసంధానించే ‘ఏకీకృత చెల్లింపుల మధ్యవర్తి’ (యూపీఐ) భావనకు దారితీసింది. యూపీఐ ఒక ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) వ్యవస్థ. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నేతృత్వంలో పనిచేసే వేదిక. ఈ వేదిక వందలాది బ్యాంకులు, డజన్లకొద్దీ మొబైల్ పేమెంట్ యాప్స్ నుంచి సేవలను అందిస్తుంది. దీనికి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు ఉండవు. ఫిన్ టెక్, బ్యాంకులు, టెల్కోలు ఈ వేదికను స్వీకరించాయి. పైగా ‘మర్చంట్ పాయింట్ ఆఫ్ సేల్స్’ (పీఓఎస్) వద్ద క్యూఆర్ కోడ్ ప్లేస్మెంట్ల వల్ల యుపీఐ భావన మరింత పురోగమించింది. ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బె ప్రకారం – ఈ యేడాది జనవరిలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన 800 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఈరోజు అన్ని రకాల చెల్లింపుల్లో 40 శాతం డిజిటల్గా జరుగుతున్నాయి. గత సంవత్సరం భారత్లో జరిగిన తక్షణ డిజిటల్ లావాదేవీల విలువ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మొత్తం డిజిటల్ లావాదేవీల కంటే ఎక్కువని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలిపారు. దేశంలోని 30 కోట్లమంది వ్యక్తులు, 5 కోట్లమంది వర్తకులు యూపీఐని ఉపయోగిస్తున్నారని దిలీప్ అస్బె తెలిపారు. అత్యంత చిన్న లావాదేవీలను కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారా చేస్తున్నారు. 10 రూపాయల విలువ చేసే కప్పు పాలు లేదా రూ.200 విలువ చేసే సంచీడు తాజా కూరగాయలు వంటి లావాదేవీలు కూడా డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి. సుదీర్ఘకాలంగా నగదు చెల్లింపులు సాగు తున్న ఆర్థికవ్యవస్థలో ఇది గణనీయమైన మార్పు. నల్లధనం నిర్మూ లనకు తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ మహమ్మారి కాలంలో సామాజిక దూరం పాటించడం వంటివి కూడా డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింతగా ముందుకు నెట్టాయి. భారత ప్రభుత్వం గోప్యత, సృజనాత్మక ఆవిష్కరణ మధ్య సరైన సమతూకాన్ని తీసుకొచ్చిందని జీ20 షేర్పా అమితాబ్ కాంత్ వ్యాఖ్యా నించారు. డిజిటల్ చెల్లింపులను ఇంకా అమలు పర్చని రంగాల్లో కూడా, ఉదాహరణకు కేరళలోని మత్స్య పరిశ్రమలో ఐడెంటిటీ సంఖ్య, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ యాప్ల వంటి డిజిటల్ ప్రాథమిక పునాదులు సేవల సులభ పంపిణీకి వీలు కల్పిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ విజయం డిజిటల్ పేమెంట్ మౌలిక వసతుల దృఢత్వంపై మాత్రమే ఆధారపడలేదు... అది నగదు నుంచి డిజిటల్కు మారడానికి ప్రజల్లో తెచ్చిన ప్రవర్తనాపరమైన ప్రోత్సాహంపై కూడా ఆధారపడి ఉంది. టీ స్టాల్స్ వంటి వాటి వద్ద అమర్చిన పేమెంట్ యాప్స్ ద్వారా అందించిన చిన్న వాయిస్ బాక్సుల వంటి ఆసక్తికరమైన ఆవిష్క రణల్లో కూడా వీటి విజయం దాగి ఉంది. వీటి ద్వారా ప్రతి చిన్న లావాదేవీ తర్వాత అమ్మకందారులు ఫోన్ మెసేజ్లు తనిఖీ చేస్తూ బిజీగా ఉంటున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి పేమెంట్తో తక్షణం అందుకునే డబ్బు ఎంతో సిరి వంటి వాయిస్ ప్రకటిస్తుంది. నగదు లావాదేవీలను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న వర్తకులలో ఏర్పడే అవిశ్వాసాన్ని తొలగించడంలో ఇది సాయపడుతుంది. ‘కౌంటర్పాయింట్’ ప్రకారం, భారత్లో 120 డాలర్ల సబ్ ఫోన్లకు మార్కెట్ వాటా రెండేళ్లకు ముందు 41 శాతం ఉండగా, 2022లో అది 26 శాతం పడిపోయింది. ఇదే కాలానికి 30 వేల రూపాయల (360 డాలర్లు) పైబడిన ధర కలిగిన ప్రీమియం ఫోన్ల వాటా రెట్టింపై 11 శాతానికి చేరుకుంది. ఫోన్లకోసం రుణాలు వంటి ఫైనాన్స్ ప్రొడక్ట్ ఆవిష్కరణలు ప్రీమియం ఫోన్లను చిన్న చిన్న పట్టణాలలోని సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆధార్ ప్రామాణికత, మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగంపై ఆధారపడిన సమీ కృత ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమైంది. ఇవన్నీ దేశంలో వ్యాపారాన్ని, ఆంట్రప్రెన్యూర్షిప్ని, వినియోగ నమూనాలను విప్లవీకరించి భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను గేమ్ ఛేంజర్గా చేయడమే కాకుండా, ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిపాయి. – బీఎన్/‘పీఐబీ’ రీసెర్చ్ వింగ్ -
కొనడం కష్టమేనా : రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. ఓ వైపు ఆర్ధిక మాద్యం..మరోవైపు బ్యాంకుల దివాళా వెరసీ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర సోమవారం రోజు 1శాతం పెరిగింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో పెరగడం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్యాంకుల్లో ఆర్ధిక అవకతవకలు జరిగి మూతపడుతున్నాయి. ఇప్పటికే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్లు దివాళా తీయగా.. అదే దారిలో మరికొన్ని బ్యాంకులు పయనిస్తున్నాయంటూ ఆర్ధిక వేత్తల అంచనాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ఇక దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒకే రోజు రూ.1400 పెరిగి రూ.61,100కు చేరింది. వెండి ధర సైతం రూ.1860 పెరిగి రూ.69,340కి చేరింది. ఇటీవల బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే పసిడి ధర రూ.56వేల స్థాయి నుంచి రూ.60వేల స్థాయికి చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1 శాతం పెరిగి ఔన్స్ బంగారం 2,007.30 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్లో 1శాతానికి పడిపోయింది. యూఎస్ మార్కెట్లో 2శాతం పెరిగి 2,012.50డాలర్లకు చేరింది. బ్యాంకులు షట్డౌన్ అవుతాయోమోనన్న భయాలతో మదుపర్లు..బ్యాంకుల్లో దాచిన డిపాజిట్లను తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు.లాభాదాయకమైన బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. చదవండి👉 చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..ఇప్పుడే ఇలా ఉంటే, మరి రాబోయే రోజుల్లో ఎలా? -
Credit Suisse: అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం!
సాక్షి, బిజినెస్ డెస్క్: దాదాపు పదిహేనేళ్ల క్రితం తరహాలో అంతర్జాతీయంగా మరో బ్యాంకింగ్ సంక్షోభం ముప్పు ముంచుకు రాబోతోందా? అమెరికా, యూరప్వ్యాప్తంగా బ్యాంకుల పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బ్యాంకులో మరింతగా ఇన్వెస్ట్ చేసేది లేదంటూ కీలక ఇన్వెస్టరు ప్రకటించడంతో క్రెడిట్ సూసీ షేర్లు బుధవారం 27 శాతం పతనమయ్యాయి. గత రెండేళ్లలో బ్యాంకు షేరు సుమారు 85 శాతం క్షీణించింది. డిఫాల్ట్ అయ్యే అవకాశాలు 40 శాతం మేర ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితులపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. సమస్యలతో సతమతం.. వాస్తవానికి క్రెడిట్ సూసీ గత కొన్నాళ్లుగా సమస్యలతో సతమతమవుతూనే ఉంది. 2019లో సంస్థ సీవోవో పియరీ ఆలివర్ కొందరు ఉన్నత స్థాయి ఉద్యోగులపై నిఘా పెట్టేందుకు ప్రైవేట్ డిటెక్టివ్ను నియమించుకున్నారు. అయితే సదరు డిటెక్టివ్ అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ఆలివర్ను క్రెడిట్ సూసీ తొలగించింది. ఇదంతా బ్యాంకు వ్యవహారంపై సందేహాలు రేకెత్తించింది. అటుపైన 2021లో ఆర్చిగోస్ క్యాపిటల్ అనే అమెరికన్ హెడ్జ్ ఫండ్ సంస్థ మూతబడటంతో దాదాపు 5 బిలియన్ డాలర్ల భారీ నష్టం మూటకట్టుకుంది. ఆ కంపెనీకి క్రెడిట్ సూసీ బ్రోకరేజి సర్వీసులు అందించేది. అటు పైన గ్రీన్సిల్ క్యాపిటల్ అనే మరో సంస్థ మూతబడటంతో.. దాని ప్రభావాల కారణంగా ఇన్వెస్టర్లు 3 బిలియన్ డాలర్ల దాకా నష్టపోయారు. గతేడాది ఫిబ్రవరిలో దాదాపు 100 బిలియన్ డాలర్ల పైగా డిపాజిట్లు ఉన్న 30,000 మంది పైచిలుకు ఖాతాదారులపై మనీలాండరింగ్, అవినీతి తదితర ఆరోపణలు రావడంతో సంస్థ ప్రతిష్ట మరింత మసకబారింది. దీంతో క్రమంగా డిపాజిట్ల విత్డ్రాయల్స్ మొదలయ్యాయి. 2019 నుంచి టాప్ లీడర్షిప్ ఇప్పటికి అనేక సార్లు మారింది. గతేడాది క్రెడిట్ సూసీ పెట్టుబడుల కోసం అన్వేషిస్తుండగా.. సౌదీ నేషనల్ బ్యాంక్ 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. సంస్థలో మరింతగా ఇన్వెస్ట్ చేసే యోచన లేదని సౌదీ నేషనల్ బ్యాంక్ చైర్మన్ అమ్మార్ అల్ ఖుదైరీ ప్రకటించడం తాజాగా క్రెడిట్ సూజీ షేర్ల పతనానికి దారి తీసింది. 2018లో 16 స్విస్ ఫ్రాంకులుగా ఉన్న షేరు ప్రస్తుతం 1.70 ఫ్రాంకులకు (ఒక స్విస్ ఫ్రాంక్ విలువ సుమారు రూ. 89). పడిపోయింది. మార్కెట్లలో ప్రకంపనలు.. ఇప్పటికే అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూతబడటం, తాజాగా క్రెడిట్ సూసీ పరిణామాలతో ఇతరత్రా బ్యాంకులపైనా ప్రభావం పడింది. బుధవారం పలు యూరోపియన్ బ్యాంకుల షేర్లు రెండంకెల స్థాయిలో క్షీణించాయి. ఫ్రాన్స్కు చెందిన సొసైటీ జనరల్ 12 శాతం, బీఎన్పీ పారిబా 10 శాతం, జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్.. బ్రిటన్ సంస్థ బార్క్లేస్ బ్యాంక్ మొదలైనవి సుమారు 8 శాతం పడిపోయాయి. రెండు ఫ్రెంచ్ బ్యాంకుల్లోనూ కొంత సమయం పాటు ట్రేడింగ్ను నిలిపివేశారు. అటు అమెరికాలో బ్యాంకులూ అదే బాటలో పయనించాయి. ప్రధానంగా డిపాజిటర్లు ఎకాయెకిన డిపాజిట్లను వెనక్కి తీసుకునే రిస్కులు ఉన్న చిన్న, మధ్య రకం బ్యాంకుల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 17 శాతం, ఫిఫ్త్ థర్డ్ బ్యాంకార్ప్ 6 శాతం, జేపీమోర్గాన్ చేజ్ 4 శాతం పతనమయ్యాయి. -
డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు సవాలే
ముంబై: మార్జిన్లపై ఒత్తిడి పడకుండా డిపాజిట్లను సమీకరించుకోవడం బ్యాంకులకు సవాలేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. రుణాలకు నిధుల కేటాయింపుల్లో కొత్త నమూనాకు మారుతుండడం కూడా వాటికి సవాలేనని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన బ్యాంకింగ్ రంగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) న్యూట్రల్ రేటింగ్ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. బ్యాలన్స్ షీట్లు బలంగా ఉండడంతోపాటు రుణాలకు వ్యవస్థలో అధిక డిమాండ్, వడ్డీ రేట్లలో స్థిరత్వంతో.. 2023–24లో బ్యాంకుల ఆర్థిక కొలమానాలు మెరుగుపడతాయని అంచనా వేసింది. డిపాజిట్లలో వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9–11 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. పోటీ వాతావరణంలో డిపాజిట్ల రేట్లను సవరించడం కొనసాగుతూనే ఉంటుందని, 2022 మార్చి నుంచి బ్యాంకులు రూ.5 లక్షల కోట్ల నగదు లభ్య తను సాధించాయని తెలిపింది. 2022 డిసెంబర్ నాటికి బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధి 18.8 శాతంగా ఉందని, కానీ, డిపాజిట్లలో వృద్ధి 11.8 శాతంగానే ఉండడం.. నిధుల అవసరాలను తెలియజేస్తోందని పేర్కొంది. రుణాల వృద్ధి కంటే, డిపాజిట్ల రాక తక్కువగా ఉండడంతో, ఇది రేట్ల పెరుగుదలకు దారితీస్తుందని అంచనా వేసింది. ఆర్బీఐ రేట్ల సవరణతో.. అటు డిపాజిట్లు, ఇటు రు ణాలపైనా 2 శాతం మేరకు బ్యాంకులు పెంపును అమలు చేసినట్టు తెలిపింది. గతేడాది మే నుంచి ఆర్బీఐ రెపో రేటును 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. బ్యాంకులు తమ రుణ వితరణ డిమాండ్ను చేరుకునేందుకు అవి హోల్సేల్ డిపాజిట్లు, బల్క్ డిపాజిట్లపై ఆధారపడుతున్నట్టు వెల్లడించింది. సూక్ష్మ రుణ సంస్థలకు రెండు సవాళ్లు... సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) కరోనా సమయంలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ నుంచి బయటకు వచ్చాయని, ఇండియా రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. అయి తే రానున్న 12–18 నెలల కాలంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్క్లు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇందులో ఒకటి ద్రవ్యోల్బణంకాగా, రెండవది ఎన్నికలకు సంబంధించి పరిణామాలని తెలిపింది. హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి మోస్తరుగా.. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు గడ్డు కాలం ఎదురైంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరలు గృహాల అందుబాటుపై ప్రభావం చూపిస్తోంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి కొంత తగ్గి 12.3 శాతానికి పరిమితం అవుతుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ అంశాలకు తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైతం రుణ గ్రహీతల నగదు ప్రవాహం (మిగులు)పై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. ఇది హెచ్ఎఫ్సీల రుణ ఆస్తుల నాణ్యతను కూడా దెబ్బతీయవచ్చని అంచనా వేసింది. సమస్యాత్మక రుణ ఖాతాలలో ఇప్పటికే స్వల్ప పెరుగుదల ఉన్నట్టు పేర్కొంది. 2022–23 ఆరంభం నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ‘‘12 హెచ్ఎఫ్సీల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) మొత్తం రుణాల్లో 2021 మార్చి నాటికి 2.9 శాతంగా ఉంటే, 2022 మార్చి నాటికి 2.8 శాతానికి తగ్గాయి. మొత్తం మీద రుణ ఎగవేతలు, పునరుద్ధరించిన రుణాలు కలిపి 2022 మార్చి నాటికి 4 శాతంగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 2023 మార్చి నాటికి 2.5 శాతానికి తగ్గుతాయి. మళ్లీ 2024 మార్చి నాటికి 2.67 శాతానికి పెరగొచ్చు. రుణ వ్యయాలు అతి స్వల్పంగా పెరిగినప్పటికీ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగొచ్చు’’అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. అందుబాటు గృహ రుణాల జోరు హెచ్ఎఫ్సీలు 2022–23లో 12.6 శాతం మేర వృద్ధిని చూసే అవకాశం ఉంటే, 2023–24లో 12.3 శాతంగానే ఉంటుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఇక 2021–22లో పరిశ్రమలో నమోదైన రుణాల వృద్ధి 10.4 శాతంగా ఉంది. పరిశ్రమలో అందుబాటు ఇళ్లకు సంబంధించి రుణాలు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని అంచనా వేసింది. మార్కె ట్లో పోటీ వాతావరణం హెచ్ఎఫ్సీలపై చూపిస్తోందని పేర్కొంది. దీంతో సంస్థలు నాన్ హౌసింగ్ రుణాలపై దృష్టి సారించడం ద్వారా ఈ పోటీపరమైన సవాళ్లను అధిగమించొచ్చని పేర్కొంది. -
నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు..ఖాతాదారులు గుర్తించుకోవాల్సిన అంశాలివే!
భారత్లో ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ సేవలకు గుడ్బై చెప్పింది. తన బ్యాంక్ను యాక్సిస్ బ్యాంక్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 120 ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న సిటీ బ్యాంక్ ఇక పాత జ్ఞాపకంగా మిగిలి పోనుంది. తాజా నెలకొన్న ప్రపంచ పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల బ్యాంక్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సిటీ బ్యాంక్ అకౌంట్ల కార్యకలాపాలు యాక్సిస్ బ్యాంక్లో కొనసాగనున్నాయి. భారత్లో నమ్మకం నుంచే మొదలయ్యే బ్యాంకింగ్ బిజినెస్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేక దేశీ, విదేశీ బ్యాంకులు పోటీ పడ్డాయి. వాటిలో అమెరికాకు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్కు చెందిన సిటీ బ్యాంక్ ఒకటి. సిటీ బ్యాంక్ సేవల్ని అందించేందుకు 1902లో కోల్ కతాలోని కనక్ బిల్డింగ్ ఆఫీస్లో తన మొదటి బ్యాంక్ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. అలా 120 ఏళ్లగా సేవలందిస్తున్న సిటీ బ్యాంక్ గత ఏడాది భారత్లోని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సేవల నుంచి వైదొలగినట్లు అధికారిక ప్రటకన చేసింది. సిటీ బ్యాంక్ను యాక్సిస్ బ్యాంక్కు అమ్ముతున్నట్లు తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అవసరమైన భారీ పెట్టుబడుల విషయంలో.. విలీనానికి సిద్ధపడినట్లు సమాచారం. తాజాగా యాక్సిస్ బ్యాంక్తో కుదురిన ఒప్పందంలో భాగంగా భారత్లో తన కార్యకలాపాలను సిటీ బ్యాంక్ పూర్తిగా ఆపేసింది. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం..రూ. 11,603 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. మార్చి 1(నేటి నుంచి) ఇండియాలో బ్యాంక్ సేవల నుంచి తప్పుకుంది. ఆందోళనలో సిటీ బ్యాంక్ కస్టమర్లు ఇక సిటీ బ్యాంక్ను..యాక్సిస్ బ్యాంక్లో విలీనం చేయడంతో కస్టమర్లు అందోళన వ్యక్తం చేశారు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా సిటీ బ్యాంక్ యాజమాన్యం తన వెబ్ సైట్లో కస్టమర్లకు పలు సూచనలు చేసింది. వినియోగదారులు ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలు, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ను ఉపయోగించడం కొనసాగించవచ్చని స్పష్టత ఇచ్చింది. సిటీ బ్యాంక్ శాఖలన్నీ యాక్సిస్ బ్యాంక్గా రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఏటీఎం, ఆన్లైన్ ట్రాన్స్క్షన్లతో పాటు ఇతర అంశాల గురించి చర్చించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిటీ బ్యాంక్ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు: ► సిటీ బ్యాంక్ మొబైల్ యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇప్పటికీ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ► అన్ని సిటీ బ్రాంచ్లు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లుగా రీబ్రాండ్ చేయబడతాయి. అప్పటి వరకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ► బ్యాంక్ అకౌంట్లు ఐఎఫ్ఎస్ఈ కోడ్, ఎంఐసీఆర్ కోడ్లలో ఎటువంటి మార్పు ఉండదు. ► సిటీ వినియోగదారులు తమ డెబిట్ ఏటీఎం కార్డ్,క్రెడిట్ కార్డ్లు, చెక్ బుక్లను యధావిధిగా ఉపయోగించుకోవచ్చు. ► క్రెడిట్, డెబిట్ కార్డ్లు రెండింటిలో రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. ► క్రెడిట్ కార్డ్ల ఫీజులు, ఛార్జీలు, బిల్లింగ్ సైకిల్, చెల్లింపు గడువు తేదీ, బిల్లు చెల్లింపు పద్ధతుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ► లోన్ చెల్లింపులు, బిల్లు చెల్లింపులు లేదా ఏదైనా ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ సంబంధించి అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ► సిటీ బ్యాంక్ వినియోగదారుల పెట్టుబడి పోర్ట్ఫోలియోలలో కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. ► సిటీ బ్యాంక్ డీమ్యాట్ అకౌంట్ కోసం అకౌంట్ నెంబర్తో పాటు డీపీ ఐడీ (Depository Participant Identification) అలాగే ఉండనుంది. లావాదేవీల కోసం జారీ చేసిన డీఐ స్లిప్లు (Delivery Instruction) చెల్లుబాటులో ఉంటాయి. ► సిటీ బ్యాంక్లో తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీల కోసం, పాలసీ నెంబర్, ప్రయోజనాలు, రెన్యువల్ తేదీల్లో ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. ► రుణాల కోసం, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫీజులు, ఛార్జీలు, రీపేమెంట్స్ యధావిధిగా కొనసాగుతాయని సిటీ బ్యాంక్ తన కస్టమర్లకు స్పష్టత ఇచ్చింది. -
మొండి బకాయిల కట్టడి చర్యలు ఫలితాలిస్తున్నాయ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకృత నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయినట్లు ఆమె పేర్కొన్నారు. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే.. ► రెండవ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)నికర లాభం భారీగా 74 శాతం ఎగసి రూ.13,265 కోట్లుగా నమోదయ్యింది. ► కెనరా బ్యాంక్ లాభం 89 శాతం వృద్ధితో రూ.2,525 కోట్లుగా నమోదయ్యింది. ► కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్ లాభం 145% పెరిగి రూ.504 కోట్లుగా ఉంది. ► బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో లాభం 59 శాతం పెరిగి రూ.3,312.42 కోట్లుగా ఉంది. ► కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) లాభాల్లో ఉన్నా, ఇవి 9–63 శాతం శ్రేణిలో క్షీణించాయి. అయితే మొండిబకాయిలకు అధిక కేటాయింపులు (ప్రొవిజినింగ్) దీనికి నేపథ్యం. పీఎన్బీ ప్రొవిజనింగ్స్ భారీగా రూ.2,693 కోట్ల నుంచి రూ.3,556 కోట్లకు చేరాయి. ఇక బీఓఐ విషయంలో ఈ కేటాయింపులు రూ.894 కోట్ల నుంచి రూ.1,912 కోట్లకు ఎగశాయి. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు 13 నుంచి 145 శాతం శ్రేణిలో ఉన్నాయి. యుకో బ్యాంక్ అత్యధికంగా 145 శాతం పెరిగితే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం 103 శాతం పెరిగింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికం ఇలా... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. మొదటి త్రైమాసికంలో కూడా పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, సమీక్షా కాలంలో (2022 ఏప్రిల్–జూలై) రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
దివాలా అంచున స్విస్ బ్యాంక్?
2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభానికి ముసలం బ్యాంకింగ్ రంగంలోనే మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో స్టాక్ మార్కెట్లు పేక మేడల్లా కుప్పకూలాయి. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగానికి అలాంటి షాక్ తగలబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనేక సమస్యలతో సతమతమవుతున్న స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్విస్... క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ స్వయంగా దాని సీఈఓ వెల్లడించడంతో దివాలా తీయొచ్చంటూ గగ్గోలు మొదలైంది. న్యూయార్క్: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సంస్థ సీఈవో ఉల్రిచ్ కోర్నర్ పేర్కొన్నారు. దీంతో తాజా పునర్వ్యస్థీకరణ చర్యలకు తెరతీయనున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించారు. తద్వారా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే బ్యాంక్ పటిష్టంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు షేరు పతనాన్ని చూసి కలత చెందొద్దని కూడా సిబ్బందికి సూచించారు. పటిష్ట స్థాయిలో మూలధన బేస్తోపాటు లిక్విడిటీ కూడా బాగానే ఉందని సీఈవో వివరించారు. అయితే, ఒకపక్క బ్యాంకు షేరు రోజుకో ఆల్టైమ్ కనిష్టాన్ని తాకుతుండటం... దివాలా వదంతుల నేపథ్యంలో ఉల్రిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల (అక్టోబర్) 27న బ్యాంక్ చేపట్టనున్న వ్యూహాత్మక సమీక్ష ఫలితాలు వెలువడేవరకూ సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు నిర్ణయించుకున్నట్లు సీఈవో లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఊహాగానాలకు స్పందించకుండా క్లయింట్లకు సేవలందించడంపై దృష్టిపెట్టాలని కూడా తమ సిబ్బందికి ఉల్రిచ్ సూచించినట్లు సమాచారం. కాగా, బ్యాంకు ఈ నెల 27న మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది. మూడు ముక్కలు... మూడేళ్లుగా వెలుగుచూస్తున్న రకరకాల స్కామ్లు... క్రెడిట్ స్విస్ను అతలాకుతం చేశాయి. మరోపక్క, యూరప్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం సెగలు, వడ్డీరేట్ల పెంపు ప్రభావం కూడా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రెడిట్ స్విస్ గ్రూపును మూడు సంస్థలుగా విడదీసేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. లాభదాయకంగా ఉన్న యూనిట్లను విక్రయించాలనేది బ్యాంకు యోచన. ప్రతిపాదనల ప్రకారం అడ్వయిజరీ బిజినెస్, అధిక ఒత్తిడిలోగల ఆస్తుల (హైరిస్క్ రుణాల)తో బ్యాడ్ బ్యాంక్లను విడదీయనుంది. వీటిని మినహాయించగా మిగిలిన బిజినెస్లతో మరో సంస్థ ఏర్పాటు కానుంది. అయితే ఈ అంశాలపై క్రెడిట్ స్వీస్ స్పందించకపోవడం గమనార్హం! ఇదీ నేపథ్యం... స్విట్జర్లాండ్లోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ స్విస్ గత మూడేళ్లలో రహస్య (స్పైయింగ్) కార్పొరేట్ కుంభకోణం, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల మూసివేత, రికార్డ్ ట్రేడింగ్ నష్టాలు, న్యాయపరమైన వ్యాజ్యాల పరంపర వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో బ్యాంక్ చైర్మన్ యాక్సెల్ లేమన్ వేసవిలో ఉల్రిచ్ కోర్నర్ను సీఈవోగా ఎంపిక చేసి బ్యాంకును గాడిలోపెట్టే బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అనుమతించారు. కాగా.. ఈ నెల మొదట్లో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 5,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇన్వెస్టర్లలో వణుకు..! గత కొద్ది నెలలుగా క్రెడిట్ స్విస్ ఎదుర్కొంటున్న సవాళ్లతో బ్యాంకు షేరు కుప్పకూలుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 9 డాలర్లుగా ఉన్న షేరు ధర తాజాగా సరికొత్త ఆల్టైమ్ కనిష్టానికి (3.9 డాలర్లు) దిగజారింది. మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా, సీఈఓ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బ్యాంక్ దివాలా తీయనుందంటూ ట్విటర్లో మారుమోగుతోంది. అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచడంతో మాంద్యం భయాలు వెంటాడుతున్న తరుణంలో క్రెడిట్ స్విస్ దివాలా వార్తలు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే జరిగితే మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు ఎలా స్పందిస్తాయోన్న ఉత్కంట సర్వత్రా నెలకొంది. -
పటిష్ట బాటన భారత్ ఎకానమీ..!
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14.2 శాతం నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 6 శాతం. గడచిన త్రైమాసికం (2022 జనవరి–మార్చి)లో ఈ రేటు 10.8 శాతంగా ఉంది. ఎకానమీ పురోగమన బాటలో ఉందనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ మే నెల నుంచి ఆగస్టు వరకూ 1.40 (ప్రస్తుతం 5.40 శాతం) పెంచింది. ఇందులో జూన్ వరకూ పెరిగిందే 90 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం). ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించింది. అయినప్పటికీ పటిష్ట స్థాయిలో రుణ వృద్ధి రేటు నమోదుకావడాన్ని చూస్తే, వ్యవస్థలో డిమాండ్ పరిస్థితులు బాగున్నాయని స్పష్టమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘జూన్ త్రైమాసిక రుణ, డిపాజిట్ వృద్ధి 2022’ శీర్షికన ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులుసహా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల నుంచి సమీకరించిన సమాచారం ఆధారంగా తాజా గణాంకాలు రూపొందాయి. ► దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రాతిపదికన రుణ వృద్ధి నమోదయ్యింది. ► గడచిన ఐదు త్రైమాసికాల్లో డిపాజిట్ వృద్ధి రేటు 9.5 శాతం నుంచి 10.2 శాతం శ్రేణిలో ఉంది. ► జూన్ త్రైమాసికంలోని దేశ వ్యాప్తంగా మొత్తం డిపాజిట్లలో కరెంట్, సేవింగ్స అకౌంట్ (సీఏఎస్ఏ) నిష్పత్తి 73.5 శాతం. గత ఏడాది ఇదే సమయంలో ఈ నిష్పత్తి 70.5 శాతం. ఒక్క మొట్రోపాలిటన్ బ్రాంచీల్లో ఈ నిష్పత్తి వార్షికంగా చూస్తే 84.3 శాతం నుంచి 86.2 శాతానికి పెరిగింది. లిస్టెడ్ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు 41 శాతం అప్ కాగా లిస్టెడ్ నాన్–ఫైనాన్స్ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో 41 శాతం పెరిగి రూ.14.11 కోట్లుగా నమోదయినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో ఈ అమ్మకాల్లో 60.6 శాతం వృద్ధి నమోదుకాగా, 2022 జనవరి–మార్చిలో ఈ రేటు 22.3 శాతంగా ఉంది. -
ఆయన ఐదు వేలు అప్పిచ్చి పదిసార్లు తిరుగుతుండు! అదే ఓ వంద కోట్లు తీసుకుంటే...
ఆయన ఐదు వేలు అప్పిచ్చి పదిసార్లు తిరుగుతుండు! అదే ఓ వంద కోట్లు తీసుకుంటే మాఫీ చేస్తారట మావా! -
భారత ఆర్థిక వ్యవస్థపై మూడీస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) పటిష్ట లాభాల బాటన పయనించనుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక ఒకటి తెలిపింది. మొండి బకాయిలు (ఎన్పీఏ) తగ్గడం, ప్రీ–పొవిజినింగ్ ఆదాయాల్లో (నష్టాన్ని భర్తీ చేసే విధంగా నికర వడ్డీ, వడ్డీయేతర ఆదాయాలు, తక్కువ వ్యయాలు నెలకొన్న పరిస్థితి) వృద్ధి దీనికి కారణంగా పేర్కొంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. మెరుగైన లాభదాయకత, రుణ వృద్ధిలో మంచి రికవరీ కారణంగా కేంద్ర మూలధన కల్పన అవసరం తగ్గుతుంది. ఇది అంతిమంగా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంలో తగిన మూలధన నిర్వహణ కొనసాగడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) వద్ద మూలధన నిష్పత్తులు గత సంవత్సరంలో గణనీయంగా మెరుగయ్యాయి. కేంద్రం నుంచి సకాలంలో తగిన మద్దతు దీనికి కారణం. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు లాభదాయకతను సద్వినియోగం చేసుకుంటూ, ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ నుండి మూలధనాన్ని సమీకరించడానికి చురుగ్గా ప్రయత్నించాయి. రేటెడ్ ప్రైవేట్ రంగ బ్యాంకులు అసెట్–వెయిటెడ్ సగటు సాధారణ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) రేషియో 2021 చివరి నాటికి 15.8 శాతం. మెరుగుపడిన ఆర్థిక పరిస్థితుల్లో రుణ వృద్ధిని పెంచుకోడానికి దీనిని ప్రైవేటు బ్యాంకింగ్ వినియోగించుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడ్డం– మార్కెట్ నుండి ఈక్విటీ మూలధనాన్ని సమీకరించడంలో సహాయపడుతుంది. ప్రభుత్వం నుండి మూలధన మద్దతుపై ఆధారపడటం తగ్గుతుంది. దేశీయ వడ్డీ రేట్లు క్రమంగా పెరగడం వల్ల నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయి. అయితే డిపాజిట్లపై వడ్డీలూ పెరగడం వల్ల సమీకరణ వ్యయాలూ కొంచెం పెరగవచ్చు. స్థిరమైన రుణ నాణ్యత, మొండి బకాయిల సవాళ్లను ఎదుర్కొనడానికి అమలు చేస్తున్న నిబంధనలు బ్యాంకుల ప్రొవిజనింగ్స్ (ఎన్పీఏలకు కేటాయింపులు) అవసరాలను తగ్గిస్తాయి. రుణాలపై ఆదాయాలు రేటెడ్ ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో 2021 డిసెంబర్ ముగిసే నాటికి 0.6 శాతం. ప్రైవేటు రంగ బ్యాంకుల విషయంలో 1.5 శాతం. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇవి వరుసగా 0.4 శాతం క్షీణత, 0.7 శాతాలుగా ఉన్నాయి. మొండి బకాయిల (ఎన్పీఎల్) రేషియోలు తగ్గుతాయి. రైటాఫ్ల నుంచి వసూళ్లు, ఆర్థిక పరిస్థితుల మెరుగుదల నేపథ్యంలో కొత్త ఎన్పీఎల్ల స్థిరత్వం వంటి అంశాలు దీనికి కారణం. కార్పొరేట్ ఆదాయాల్లో పెరుగుదల, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో నిధుల సమీకరణ ఇబ్బందులు తగ్గడం రుణ వృద్ధికి దారితీసే అంశం. 2020–21లో రుణ వృద్ధి రేటు 5 శాతం అయితే 2022–23లో ఈ రేటు 12 నుంచి 13 శాతం వరకూ పెరగవచ్చు. 2021–22లో వృద్ధి 9.3 % మూడీస్ నివేదిక ప్రకారం, వచ్చే 12 నుంచి 18 నెలల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన రికవరీని సాధిస్తుంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.3 శాతంగా నమోదవుతుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 8.4 శాతంగా ఉంటుంది. వినియోగ, వ్యాపార విశ్వాసాలు మెరుగుపరచడంతోపాటు దేశీయ డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. ఆయా అంశాలు ఆర్థిక పురోగతికి, రుణ వృద్ధికి దోహదపడతాయి. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఎకానమీకి తీవ్ర సవాళ్లను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా క్రూడ్ ధరలు, రూపాయి విలువ వంటి అంశాలపై ఈ ప్రభావం పడవచ్చు. ఇది సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపునకూ దారితీయవచ్చు. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..లాభాలు డౌన్...నిర్మాణ రంగంపై పెను ప్రభావం..! -
వైఎస్సార్ జిల్లా రికార్డు.. ప్రతి బ్యాంకు ఖాతాదారుడు...
సాక్షి, అమరావతి: రాష్ట్ర బ్యాంకింగ్ రంగంలో పూర్తిస్థాయి తొలి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ రికార్డు సృష్టించింది. వైఎస్సార్ జిల్లాలోని ప్రతి బ్యాంకు ఖాతాదారుడు అందుబాటులో ఉన్న డిజిటల్ లావాదేవీల్లో కనీసం ఏదో ఒకదాన్ని వినియోగించడం ద్వారా ఈ రికార్డు నమోదైంది. దేశంలో నగదు లావాదేవీలు తగ్గించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దశలవారీగా ఎంపిక చేసిన జిల్లాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో తొలి దశలో వైఎస్సార్ జిల్లా ఎంపికైంది. ఈ కార్యక్రమం కింద ఆ జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకు ఖాతాదారుడిని కనీసం ఏటీఎం కార్డు లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ల్లో ఏదో ఒకదాన్ని వినియోగించేలా ప్రోత్సహించారు. వైఎస్సార్ జిల్లాలో మొత్తం 377 బ్యాంకు శాఖలు ఉండగా.. అందులో 26,09,254 ఖాతాలు ఉన్నాయి. డిజిటల్ జిల్లాలో భాగంగా 88.39 శాతం మందికి రూపే/డెబిట్ కార్డు మంజూరు చేశామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అలాగే 24.19 శాతం మంది నెట్ బ్యాంకింగ్ వినియోగిస్తున్నారన్నారు. 38.39 శాతం మందిని మొబైల్, యూపీఐ లావాదేవీలు చేసేలా ప్రోత్సహించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు రెండో దశలో శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలను పూర్తి స్థాయి డిజిటల్ జిల్లాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రహ్మానందరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 333 బ్యాంకు శాఖలు ఉండగా 38.14 లక్షల ఖాతాలు, గుంటూరు జిల్లాలో 854 బ్యాంకు శాఖలు ఉండగా 102.46 లక్షల ఖాతాలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ఈ ఖాతాదారులందరూ ఏదో ఒక డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యం వినియోగించేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రతి నెలా లక్ష్యాలను నిర్దేశించి సమీక్షించుకోవడం ద్వారా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ రెండు జిల్లాలను డిజిటల్ జిల్లాలుగా మారుస్తామన్నారు. ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు కాగా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో తక్కువగా బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తున్న మూడు జిల్లాలను ఎంపిక చేసింది. అక్కడ బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా తొలి దశలో విజయనగరం, వైఎస్సార్, విశాఖ జిల్లాలను ఎంపిక చేసినట్లు బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 294 బ్యాంకు శాఖలు మాత్రమే ఉన్నాయి. వైఎస్సార్ జిల్లాలో 377 శాఖలు, విశాఖపట్నం జిల్లాలో 778 బ్యాంకు శాఖలు ఉన్నాయి. అయితే చాలా గ్రామాలు గిరిజన ప్రాంతాలు కావడంతో ఇంటర్నెట్తో అనుసంధానం వంటివి లేక స్థానిక ప్రజలకు బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు శాఖలు, ఇండియన్ పోస్ట్ లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి కొత్త జిల్లాలు రానుండటంతో మౌలిక వసతులు మెరుగుపడి ఇంటర్నెట్తో అనుసంధానం పెరుగుతుందన్న ఆశాభావాన్ని బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నారు. -
డిజిటైజేషన్తో బ్యాంకింగ్లో పెను మార్పులు
న్యూఢిల్లీ: డిజిటైజేషన్, కొంగొత్త టెక్నాలజీలు.. బ్యాంకింగ్ రంగంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెను మార్పులు తీసుకొస్తున్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఖర్చులు తగ్గించి, సర్వీసులను విస్తృతంగా అందించేందుకు తోడ్పడుతున్న డిజిటల్ విప్లవానికి దేశీ బ్యాంకులు అలవాటు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా సర్వీసులు అందించడంపై బ్యాంకులు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటోందని ఖారా చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీల వినియోగంపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయని డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ‘పరిశ్రమలు, వ్యాపారాల నిర్వహణ తీరుతెన్నులను డిజిటల్ ఆవిష్కరణలు మార్చేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఈ మార్పులు మరింత వేగవంతం అవుతున్నాయి. ప్రస్తుతం డిజిటైజేషన్, డిజిటల్ ఆవిష్కరణలనేవి బ్యాంకింగ్ పరిశ్రమకు వ్యూహాత్మక ప్రాధాన్యత అంశాలుగా మారాయి‘ అని ఖారా వివరించారు. మారే పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ విధానాలకు వేగంగా మళ్లాల్సిన అవసరాన్ని బ్యాంకులు గుర్తించాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడం, వినియోగించుకోవడం, నాణ్యమైన మౌలిక సదుపాయాలు వంటివి డిజిటల్ రుణాల వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఖారా పేర్కొన్నారు. రుణాల ప్రక్రియ కూడా డిజిటల్గా మారాలి.. ప్రస్తుతం పేమెంట్ వ్యవస్థ డిజిటల్గా మారిందని, ఇక రుణాల విభాగం కూడా డిజిటల్గా మారాల్సిన సమయం వచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా చెప్పారు. బ్యాంకులు దీనిపై కసరత్తు చేస్తున్నాయని వివరించారు. ఇప్పటికే కొన్ని రుణ ఉత్పత్తుల డిజిటైజేషన్ను మొదలుపెట్టాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్ పరిశ్రమలో టెక్నాలజీ, ఆవిష్కరణల వినియోగం క్రమంగా పెరుగుతోందని, కరోనా వైరస్ మహమ్మారి రాకతో ఇది మరింత వేగం పుంజుకుందని మెహతా తెలిపారు. మరోవైపు, భారత్ చాలా వేగంగా డిజిటల్ ఆధారిత ఎకానమీగా రూపాంతరం చెందుతోందని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) కంట్రీ హెడ్ (ఇండియా) వెండీ వెర్నర్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫిన్టెక్ వినియోగం భారత్లోనే ఉందని, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాలు కూడా ఈ విషయంలో ముందుంటున్నాయని పేర్కొన్నారు. భారత్లో ఫిన్టెక్ మార్కెట్ 50–60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని.. ఇది మరింతగా వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
హమ్మయ్యా!! బ్యాంక్ రుణాలు రికవరీ అవ్వనున్నాయ్, కారణం ఇదే?!
ఇదిలాఉండగా, భారత్ బ్యాంకింగ్ అవుట్లుక్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. పటిష్ట రుణ డిమాండ్, బ్యాలన్స్ షీట్స్ అంచనాలు తమ విశ్లేషణకు కారణమని తెలిపింది. బ్యాంకింగ్ రుణ వృద్ధి 10 శాతంగా నమోదయ్యే వీలుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటును 8.4 శాతంగా అభిప్రాయపడింది. రుణాల్లో స్థూల మొండి బకాయిల నిష్పత్తి 6.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన నిల్వలు అందుబాటులో ఉంటాయని అభిప్రాయపడింది. అన్ని రంగాల్లో వృద్ధి, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో రుణ రికవరీలు కూడా మెరుపడే వీలుందని తెలిపింది. ఇక రుణాలు, డిపాజిట్ల విషయంలో దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల మార్కెట్ వాటా పెరుగుతుందని అంచనా వేసింది. మూలధనం, పోర్ట్ఫోలియో నిర్వహణల విషయంలో ప్రైవేటు బ్యాంకులు మంచి పనితీరును కనబరిచే అవకాశం ఉందని విశ్లేషించింది. కాగా, కార్పొరేట్ ఎన్పీఏలు 2020–21లో 10.8%గా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10.4 శాతానికి తగ్గే వీలుందని అభిప్రాయపడింది. 2022–23లో రిటైల్ రంగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు 4.9 శాతానికి తగ్గుతాయని, ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లో ఈ పరిమాణం 16.7 శాతానికి పెరుగుతుందన్నది సంస్థ అంచనా. కార్పొరేట్ రంగం విషయంలో ఈ రేటు 10.3 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. -
ఎస్బీఐ లాభం జూమ్
ముంబై: బ్యాంకింగ్ రంగ పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 62 శాతంపైగా జంప్ చేసి రూ. 8,432 కోట్లను తాకింది. బ్యాంక్ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో ఇది అత్యధికంకాగా.. గతేడాది(2020–21) క్యూ3లో కేవలం రూ. 5,196 కోట్లు ఆర్జించింది. ఇందుకు ప్రొవిజన్లు తగ్గడం సహకరించింది. తాజా సమీక్షా కాలంలో ని కర వడ్డీ ఆదాయం 6.5 శాతం పుంజుకుని రూ.30 ,687 కోట్లకు చేరింది. దేశీయంగా నికర వడ్డీ మా ర్జి న్లు 3.34 శాతం నుంచి 3.4 శాతానికి బలపడ్డాయి. తగ్గిన ప్రొవిజన్లు ఈ ఏడాది క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.77 శాతం నుంచి 4.5 శాతానికి ఉపశమించాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.23 శాతం నుంచి 1.34 శాతానికి పెరిగాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్లుకాగా.. రికవరీ, అప్గ్రెడేషన్లు 59 శాతం నీరసించి రూ. 2,306 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 12,137 కోట్ల నుంచి రూ. 10,090 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 13.23 శాతంగా నమోదైంది. కోవిడ్ రిజల్యూషన్ ప్రణాళిక 1, 2లలో భాగంగా రూ. 32,895 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు బ్యాంక్ పేర్కొంది. ఇవి మొత్తం లోన్బుక్లో 1.2 శాతానికి సమానం. ఆరు ఖాతాల అమ్మకం ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీల(ఏఆర్సీలు)కు విక్రయించేందుకు ఆరు మొండి(ఎన్పీఏ) ఖా తా ల ను ఎంపిక చేసినట్లు ఎస్బీఐ వెల్లడించింది. వీటి వి లువ రూ. 406 కోట్లుకాగా.. జాబితాలో పాట్నా బ క్తియార్పూర్ టోల్వే(రూ. 231 కోట్లు), స్టీల్కో గు జరాత్(రూ. 68 కోట్లు), జీవోఎల్ ఆఫ్షోర్(రూ. 5 1 కోట్లు), ఆంధ్రా ఫెర్రో అలాయ్స్(రూ. 27 కో ట్లు), గురు ఆశిష్ ట్యాక్స్ఫ్యాబ్(రూ. 17 కోట్లు)లను పేర్కొంది. పలు అంశాల్లో ప్లస్ బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్ నిరవధికంగా మెరుగుపడుతోంది. ట్రెజరీ ఆదాయంలో స్వల్ప సమస్యలున్నప్పటికీ.. వడ్డీ, ఇతర ఆదాయాల్లో వృద్ధి సాధించింది. రుణ నాణ్యత తక్కువ ప్రొవిజన్లకు దారి చూపింది. అనిశ్చితుల కారణంగా భవిష్యత్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా అధిగమించేందుకు తగిన స్థాయిలో కంటింజెన్సీ కేటాయింపులు చేపట్టాం. రూ. 1,700 కోట్ల అదనపు ప్రొవిజన్లు చేపట్టాం. – ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా -
ఈ సారి బడ్జెట్లో బ్యాంకులకు ఉత్తచేయి!
ముంబై: కేంద్రం 2022–23 వార్షిక బడ్జెట్లో బ్యాంకులకు ఎటువంటి మూలధన కేటాయింపులూ జరిపే అవకాశం లేదని రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా అంచనా వేస్తోంది. దేశీయ బ్యాంకింగ్ సొంతంగా నిధులు సమీకరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడమే దీనికి కారణంగా తెలిపింది. గడచిన ఆరు సంవత్సరాల్లో కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.36 లక్షల కోట్ల మూలధనం సమకూర్చినట్లు కూడా తన నివేదికలో పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా వార్షిక బడ్జెట్లు ప్రవేశపెట్టే సందర్భంగా బ్యాంకులకు మూలధనం కేటాయింపుల పరిమాణంపై పెద్ద చర్చ జరిగే సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యలో విడుదలైన ఇక్రా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - బ్యాంకింగ్కు సొంతంగా నిధులు సమీకరించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే ప్రాతిపదికన ఈ దఫా బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరక్కపోతే, ప్రభుత్వ రంగ బ్యాంకులు అంతర్గత వనరులు, మార్కెట్ వర్గాల ద్వారా నిధులను సమీకరించుకునే వీలుంది. బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరక్కపోతే గడచిన దశాబ్ద కాలంలో ఈ తరహా చర్య ఇదే తొలిసారి అవుతుంది. - పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి బ్యాంకులకు గడచిన ఆరేళ్ల కాలంలో ప్రభుత్వం రూ. 3.36 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపులు జరిపిన నేపథ్యంలో, ప్రభుత్వ బ్యాంకుల నికర నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం సెప్టెంబర్ 2021 నాటికి (రుణాల్లో) 2.8 శాతానికి తగ్గింది. మార్చి 2018లో ఈ పరిమాణం 8 శాతం కావడం గమనార్హం. - ఎంతోకాలంగా పేరుకుపోయిన నిరర్ధక ఆస్తులపై అధిక కేటాయింపులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆదాయాలు మెరుగుపడినట్లు కనబడుతోంది. ఈ కారణంగానే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభదాయకతో ఉన్నాయని, అంతర్గతంగా నిధులు సమీకరణ సత్తాను సముపార్జించుకున్నాయని భావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. - ఎన్ఏఆర్సీఎల్(నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లేదా బ్యాడ్ బ్యాంక్) కార్యకలాపాలు ప్రారంభిస్తున్నందున, దీర్ఘకాలంగా తెగని సమస్యగా ఉన్న ఎన్పీఏల నుంచి రికవరీలు చోటుచేసుకునే వీలుంది. ఇది బ్యాంకుల లాభాలను మున్ముందు సంవత్సరాల్లో మెరుగుపరచే అంశం. - 2021–22 ఆర్థిక సంవత్సరం కాల్ ఆప్షన్ కోసం చెల్లించాల్సిన తమ అదనపు టైర్ 1 బాండ్లను ప్రభుత్వ రంగ బ్యాంక్లు రోల్ ఓవర్ చేయగలిగాయి. ఇది బ్యాంకుల ఇష్యూల కోసం పెట్టుబడిదారుల బలమైన కోరికను ప్రతిబింబిస్తుంది. బ్యాంకుల భవిష్యత్ ఇష్యూలకు కూడా ఇది శుభ సూచిక. ఇది వారి భవిష్యత్ జారీలకు మంచి సూచన అని పేర్కొంది. - బ్యాంకులు ఇటీవలి సంవత్సరాలలో చేసినట్లుగానే మున్ముందూ మార్కెట్ మార్గాల ద్వారా మూలధన సేకరణ జరిపే అవకాశం ఉంది. క్లీనర్ బ్యాలెన్స్ షీట్లు, మెరుగైన ఆదాయాలు ఇందుకు దోహదపడే అంశం. - ఆర్బీఐ నుండి శాశ్వత రీఫైనాన్స్ విండో కోసం బడ్జెట్లో కొంత కేటాయింపు ఉండే అవకాశం ఉంది. - నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు– ఎన్బీఎఫ్సీలకు (మౌలిక రంగం యేతర) సమీప కాల నిధుల లభ్యత కోసం కొన్ని ద్రవ్య పరమైన, హామీతో కూడిన పథకాలు బడ్జెట్లో చోటుచేసుకునే వీలుంది. ఈ రంగానికి మధ్య కాలానికి మద్దతు లభించే చర్యలను ప్రకటించే వీలుంది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది, ఈ రంగం స్థిరమైన పునరుద్ధరణకు దోహదపడుతుంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న పక్షంలో బ్యాంకుల స్థూల మొండిబాకీలు (జీఎన్పీఏ) 2022 సెప్టెంబర్ నాటికి ఏకంగా 8.1–9.5 శాతానికి ఎగియవచ్చని ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక హెచ్చరిస్తోంది. 2021 సెప్టెంబర్లో ఇవి 6.9 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జీఎన్పీఏలు 8.8 శాతంగా ఉండగా 2022 సెప్టెంబర్ నాటికి ఇవి 10.5 శాతానికి ఎగియవచ్చని అంచనా. అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో 4.6 శాతం నుంచి 5.2 శాతానికి, విదేశీ బ్యాంకుల్లో 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. విభాగాలవారీగా చూస్తే వ్యక్తిగత, హౌసింగ్, వాహన రుణాల్లో జీఎన్పీఏ పెరుగుతోంది. మరోవైపు, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు వంటి కొన్ని ఉప–విభాగాలు మినహాయిస్తే పారిశ్రామిక రంగంలో జీఎన్పీఏల నిష్పత్తి తగ్గుతోంది. -
ఆశలపల్లకీలో 2022
పారదర్శకత, సమాన అవకాశాలు ఉన్న ఏ రంగమైనా సక్సెస్ అవుతుంది. రియల్టీ పరిశ్రమకూ ఇదే వర్తిస్తుంది. గతేడాది ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వెంటాడితే.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్ను మాత్రం యూడీఎస్ భూతం మింగేసింది. అనధికారిక విక్రయాలతో ఆరోగ్యకరమైన మార్కెట్ దెబ్బతిన్నది. సిండికేట్గా మారిన కొందరు డెవలపర్లు.. నగర రియల్టీ మార్కెట్ను ప్రతికూలంలోకి నెట్టేశారు. ప్రభుత్వంతో పాటూ డెవలపర్ల సంఘాలు, స్టేక్ హోల్డర్లు, నిపుణులు ఒక్క తాటిపైకొస్తేనే హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి నూతన సంవత్సరం! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఐటీ, ఫార్మాలతో పాటూ బ్యాంకింగ్, సర్వీసెస్ రంగాలన్నీ బాగున్నాయి. కరోనా కాలంలోనూ ఆయా పరిశ్రమ లలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్థిరౖ మెన ఆదాయ వృద్ధి నమోదవుతుంది. మరోవైపు ఇతర నగరాల కంటే హైదరాబాద్లో జీవన వ్యయం తక్కువ. అందుబాటు ధరలు, కాస్మోపాలిటన్ సిటీ, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో వ్యక్తిగత ఇన్వెస్టర్లతో పాటు గ్లోబల్ కంపెనీలు హైదరా బాద్ వైపు ఆసక్తిగా ఉన్నాయి. ఇలాంటి శుభ పరిణామంలో సిండికేట్ డెవలపర్లు మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ దొరుకుతుందనే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ మార్కె ట్ను సృష్టిస్తేనే హైదరాబాద్ రియల్టీ మార్కెట్ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డారు. 2022 రియల్టీ మార్కెట్కు గృహ రుణ వడ్డీ రేట్లు కీలకం కానుందని.. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం ఇంట్రెస్ రేటే కొనసాగితే ఈ ఏడాది మార్కెట్ను ఎవరూ ఆపలేరని వివరించారు. 2 లక్షల యూనిట్ల వరకు అవసరం.. అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్ను ఏర్పరుస్తుందని ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్తో పాటూ షాద్నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, శామీర్పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్ రహదారి మార్కెట్ను పాడుచేశారని పేర్కొన్నారు. సగం ధర అంటే అనుమానించండి.. కరోనా తర్వాత నుంచి నైపుణ్య కార్మికుల కొరత ఏర్పడింది. స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు, లేబర్ చార్జీలు రెట్టింపయ్యాయి. దీంతో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.300–400 వరకు పెరిగింది. రెగ్యులర్ డెవలపరే నిర్మాణాన్ని పూర్తి చేయడమే సాహసంగా మారిన తరుణంలో.. మార్కెట్ రేటు కంటే 40–50 శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటే ఆ డెవలపర్ను అనుమానించాల్సిందే. నిర్మాణ అనుమతులు లేకుండా, రెరాలో నమోదు చేయకుండానే విక్రయిస్తున్నారంటే ప్రాజెక్ట్ను ఎలా పూర్తి చేయగలుగుతారనేది కొనుగోలుదారులే విశ్లేషించుకోవాలి. ►నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్ను చేపట్టే ఆర్థిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటూ కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారని ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్ ప్రొఫైల్ను పరిశీలించకుండా, తక్కువ ధరని తొందరపడి కొనొద్దు. ఒమిక్రాన్ ప్రభావం ఉంటుందా? కరోనా తర్వాత ఇంటి అవసరం పెరిగింది. సొంతిల్లు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో చాలా మంది గృహాల కోసం ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇంటి ఎంపికలోనూ మార్పులు వచ్చాయి. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ విధానం, ఆన్లైన్ క్లాస్ల నేపథ్యంలో ఇంట్లో ప్రత్యేకంగా గది ఉండాలని కోరుకుంటున్నారు. ప్రశాంత వాతావరణం, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాజెక్ట్లు, పెద్ద సైజు గృహాలను ఎంపిక చేస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంటుందే కానీ తీవ్రత పెద్దగా ఉండదని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో నమ్మకం ఏర్పడింది కాబట్టి ఒమిక్రాన్ ప్రభావం మానసికంగా ఉంటుందే తప్ప రియల్టీ మార్కెట్పై పెద్దగా భౌతిక ప్రభావం చూపించకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రిమెంట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు 100, 200 గజాలను కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ల కింద రిజిస్ట్రేషన్ చేయకూడదని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి సూచించారు. వేరే దేశంలోని వ్యాపారస్తులు తక్కువ ధరకు వస్తువులను మన దేశానికి ఎగుమతి చేసి విక్రయిస్తుంటే యాంటీ డంప్ డ్యూటీ ఎలాగైతే చెల్లిస్తారో.. అలాగే యూడీఎస్, ప్రీలాంచ్ డెవలపర్ల నుంచి కూడా అధిక పన్నులు వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. యూడీఎస్, ప్రీలాంచ్ డెవలపర్లను కూడా రెరా పరిధిలోకి తీసుకురావాలని కోరారు. -
కార్పొరేట్ల చేతుల్లో బ్యాంకులు వద్దు: రజనీష్కుమార్
ముంబై: బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్లను అనుమతించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. రిలేటెడ్ పార్టీ (బ్యాంకు యాజమాన్యాలతో సంబంధం కలిగిన వారితో లావాదేవీలు) లావాదేవీలు పరంగా ఉండే రిస్క్ నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు ‘‘నా వరకు భారత్ వంటి దేశంలో బ్యాంకులను కలిగి ఉండేందుకు కార్పొరేట్లను అనుమతిస్తే పెద్ద రిస్క్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన యాజమాన్యాలతో, నిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులే మనకు కావాలి’’ అని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ నిర్వహించిన ఒక వెబినార్లో భాగంగా రజనీష్కుమార్ పేర్కొన్నారు. -
ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల రుణం
ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. ఇలా పంటల సాగుకు కావాల్సిన వాటిని కొనుగోలు చేయడానికి రైతులకు అందుబాటులో ఆర్బీకేల్లో కియోస్క్లను పెట్టాం. అందులో రైతులు ఆర్డర్ చేస్తే నిర్దేశిత సమయంలోగా వారి గ్రామాల్లోనే వారి ఇంటి వద్దకే వారికి కావాల్సినవి అందుతాయి. ఈ వ్యవస్థ అంతా బ్యాంకింగ్ రంగంతో అనుసంధానం కావాలి. సంపూర్ణ డిజిటలైజేషన్కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు 35 వేల రూపాయల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లను కోరారు. ఇళ్ల లబ్ధిదారులందరూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలేనని, వీరికి బ్యాంకులు పావలా వడ్డీకి (3 శాతం) రుణాలు ఇస్తే, మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన 216వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటికి బ్యాంకులు సహకారం అందించడంపై మార్గనిర్దేశం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని, జియో ట్యాగింగ్ చేసి, వారి ఇంటి స్థలాన్ని వారికి చూపించి అప్పగించామని తెలిపారు. మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా నాలుగైదు లక్షల రూపాయల ఆస్తిని సమకూరుస్తున్నామన్నారు. సిమెంట్, స్టీలు తదితర వస్తువుల వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, పనులు కూడా విరివిగా లభిస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇళ్ల లబ్ధిదారులకు రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకు వేయాలని, చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కౌలు రైతులకు రుణాలు అందాలి ► కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు 4,91,330 క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ (సీసీఆర్సీలను) ఇచ్చాం. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు? వారి సర్వే నంబరు ఏంటి? తదితర వివరాలన్నింటినీ ఆర్బీకేల ద్వారా ఇ–క్రాపింగ్కు అనుసంధానం చేశాం. ► ఈ కౌలు రైతులంతా నిజంగా పంటను సాగు చేస్తున్న రైతులు. సీసీఆర్సీ కార్డుల ద్వారా వీరు కౌలు రైతులుగా ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్ధారిస్తున్నాం. వీరు ఎక్కడ పంటను సాగుచేస్తున్నారో ఇ–క్రాపింగ్ ద్వారా ధృవీకరిస్తున్నాం. అందువల్ల బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి. ► వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరికీ పంట రుణాలు కచ్చితంగా రుణాలు అందాలి. విత్తనం నుంచి విక్రయం వరకు.. ► రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. దాదాపు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఉంది. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి. సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్ చేసి మరీ ఇ– క్రాపింగ్ చేస్తున్నాం. ► పంటను సాగు చేస్తున్న రైతుకు డిజిటల్ రశీదే కాదు, భౌతిక రశీదు కూడా ఇస్తున్నాం. ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు, వ్యవస్థలను గ్రామాల్లో ఉంచాం. వీటిని వినియోగించుకోగలిగితే సమాజానికి బాగా మేలు జరుగుతుంది. ► ఇ– క్రాపింగ్ అనేది సీసీఆర్సీ కార్డులకే కాదు, వడ్డీ లేని పంట రుణాలకు, ఇన్పుట్ సబ్సిడీకి, ఇన్సూరెన్స్కు.. ఇలా అన్నింటికీ అనుసంధానం అవుతుంది. దీనివల్ల బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు భద్రత కూడా ఉంటుంది. అన్ని ఆర్బీకేల్లోనూ బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ► రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలకు గాను బ్యాంకర్లు ఇప్పటికే 9,160 ఆర్బీకేలను మ్యాపింగ్ చేసి అక్కడ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడం ముదావహం. ఇప్పటికే 6,538 కరస్పాండెంట్లను నియమించడం ప్రశంసనీయం. మిగిలిన 4240 చోట్ల కూడా వీలైనంత త్వరగా వారిని నియమించాలని కోరుతున్నాను. ► ప్రతి ఆర్బీకేలో ఒక బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండాలి. ఇతని సేవలను ఆర్బీకే వినియోగించుకోవాలి. ఇ– క్రాపింగ్ ప్రక్రియలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ భాగం కావాలి. ఇది అంతిమంగా డిజిటలైజేషన్ మార్గంలో పెద్ద అడుగు అవుతుంది. ► బ్యాంకింగ్ విషయంలో వైఎస్సార్ జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశామని చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ అంటే.. ఖాతాదారులందరికీ ఏటీఎం సదుపాయం కల్పించడం, క్రెడిట్ కార్డులు ఇవ్వడం, ఇంటర్నెట్/ఆన్లైన్ సదుపాయం కల్పించడం అని చెప్పారు. ఇది మంచిదే. కానీ సేవల పరంగా ఇంకా ముందుకెళ్లాలి. ► అంతిమంగా వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రతి వ్యక్తికీ రుణాలు అందాలి. ఆర్బీకేలు, అందులో కియోస్క్లు లాంటి వ్యవస్థలు ఇతర రాష్ట్రాల్లో లేవు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థలు మన రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఏపీని చూపించగలగాలి. ఆర్బీకేలను తమవిగా బ్యాంకర్లు భావించాలి. చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలి ► జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. 9.05 లక్షల మంది చిరు వ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టి సారించాలి. ► ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తోంది. వీరికి తగిన తోడ్పాటు అందించాలని కోరుతున్నాను. ► ఈ సమావేశంలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్చువల్గా ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ కె నిఖిల, యూబీఐ ఈడీ దినేష్ కుమార్ గార్గ్లు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు సహకరించాలి ► వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలు గణనీయంగా లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారైన మహిళ సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. క్రమం తప్పకుండా నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.18,750 చొప్పున మొత్తంగా రూ.75 వేలు అందుతాయి. ► వివక్షకు తావులేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ మొత్తం అందుతుంది. తద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారిని రిలయన్స్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్, హిందుస్థాన్ యూనిలీవర్, అమూల్ లాంటి కంపెనీలతో టై అప్ చేశాం. ► ఈ మహిళలకు సరైన మార్గనిర్దేశం చేస్తే.. ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టుకుని క్రమం తప్పకుండా ఉపాధి పొందుతారు. చేయూత కింద ఇప్పటికే రెండుసార్లు నగదు అందించాం. మరో రెండుసార్లు అందిస్తాం. బ్యాంకర్లు ఈ కార్యక్రమంపై ప్రత్యే శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను. ► మహిళ చేతిలో పెట్టే డబ్బు, బ్యాంకర్ల సహకారంతో ఆస్తులుగా మారి, వారికి ఉపాధి అందాలని కోరుతున్నాను. ఇప్పటికే 1.17 లక్షల పాలిచ్చే పశువులను పంపిణీ చేశాం. 72,179 మేకలు, గొర్రెల యూనిట్లను కూడా అందించాం. ఫేజ్ –2లో భాగంగా కిరాణా దుకాణాల కోసం 22 వేల మంది, మరో 35,898 మంది పాలిచ్చే పశువులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మహిళా సాధికారిత సాధన విషయంలో బ్యాంకర్ల సహకారం కోరుతున్నాం. కష్టకాలంలో మీ సేవలు భేష్ ► కోవిడ్ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఉపాధి మార్గాలు దెబ్బ తిన్నాయి. కోవిడ్ కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా ఇదే రకంగా దెబ్బతింది. ► గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38 శాతం తగ్గింది. దీని తదనంతర సంవత్సరం అంటే 2020–21లో కూడా కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి లాక్డౌన్, ఇరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది. ► దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25 శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 24.43 శాతం మేర జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు. ► 2020–21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో క్షీణత 2.58 శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను. ► గతేడాది ఇదే పీరియడ్తో పోలిస్తే టర్మ్ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయి. వ్యవసాయ రంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం. ఏపీ కార్యక్రమాల పట్ల ఉత్తరాది రాష్ట్రాల్లో ఆసక్తి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమిస్తున్నాం. రాష్ట్రంలో చేయూత మహిళలకు స్వయం ఉపాధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ముంబయిలో జరిగిన సమావేశాల్లో పలు ఉత్తరాది రాష్ట్రాలు ఏపీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని బ్యాంకర్లను కోరారు. పెద్ద సంస్థలతో కలిసి రిటైల్ దుకాణాలను మహిళలు నడుపుతున్న తీరు పట్ల బిహార్, యూపీ ఎంపీలు ఆసక్తి వ్యక్తం చేశారు. ఏపీ తరహాలోనూ తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జగనన్న తోడులో భాగంగా చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాల్లో దేశంలోనే ఏపీ నంబర్వన్గా నిలిచింది. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ డిజిటలైజేషన్తో సులువుగా సేవలు వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. తదుపరి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సంపూర్ణ డిజటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సులువుగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. – సుధీర్కుమార్ జన్నావర్, చీఫ్ జనరల్ మేనేజర్, నాబార్డ్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న కార్యక్రమాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ నిలబడ్డానికి దోహదపడ్డాయి. ఆర్బీకేలు కూడా వినూత్న వ్యవస్థ. వీటివల్ల రైతులకు చాలా ప్రయోజనం ఉంది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల అమ్మకం, కియోస్క్ల ద్వారా ఆర్డర్లు తీసుకోవడం ఇప్పటి డిజిటల్ ఏజ్లో ముందడుగుగా భావిస్తున్నాం. – దినేష్కుమార్ గార్గ్, యూబీఐ ఈడీ, ముంబయి -
బ్యాంకింగ్ అవుట్లుక్... స్టేబుల్
ముంబై: భారత బ్యాంకింగ్ రంగానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘స్టేబుల్’ అవుట్లుక్ను కొనసాగిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్ ప్రకటించింది. అయితే రిటైల్, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి బ్యాంకింగ్ 2022 మార్చి ముగిసే నాటికి కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా పేర్కొంది. బ్యాంకింగ్పై దేశీయ రేటింగ్ సంస్థ విడుదల చేసిన అర్థవార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎన్పీఏ) ఇచ్చిన రుణాల్లో 8.6 శాతంగా కొనసాగవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే రుణాల విషయంలో ఈ శాతం 10.3 శాతంగా ఉండే వీలుంది. - కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో బ్యాంకింగ్ పటిష్టంగా ఉండడం అవుట్లుక్ యథాతథ కొనసాగింపునకు కారణం. - బ్యాంకులకు తగిన మూలధనం అందే అవకాశం ఉంది. అందువల్ల వాటి ఫైనాన్షియల్ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతాయి. - మొండిబకాయిలకు సంబంధించి కూడా గత నాలుగు సంవత్సరంల్లో తగిన ప్రొవిజన్స్ (కేటాయింపులు) జరుగుతున్నాయి. - రుణాలు, డిపాజిట్ల విషయంలో ప్రైవేటు బ్యాంకుల మార్కెట్ షేర్ పెరుగుతుందని వాటికి సంబంధించి ‘స్టేబుల్’ అవుట్లుక్ సూచిస్తోంది. దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) గట్టి పోటీని ఇవ్వగలుగుతాయి. ఆయా బ్యాంకులు మూలధన నిల్వలను పెంచుకోగలుగుతున్నాయి. తమ పోర్ట్ఫోలియోను సానుకూలంగా, క్రియాశీలంగా నిర్వహించుకోగలుగుతున్నాయి. - భారీ మూలధన కేటాయింపుల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని భావిస్తున్నాం. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ.2.8 లక్షల కోట్ల మూలధనం అందించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 0.2 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి. - బ్యాంకింగ్ వ్యవస్థ డిపాజిట్లలో 6.5 శాతం వాటా కలిగిన ఐదు బ్యాంకుల విషయంలో ఇండియా రేటింగ్స్ ‘నెగిటివ్ అవుట్లుక్’ను కలిగిఉంది. బలహీన మూలధనం, ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితుల విషయంలో బలహీనతలు దీనికి కారణం. - రిటైల్ రంగంలో రుణ నాణ్యత విషయానికి వస్తే, ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో ఈ విలువ 2020–21తో పోల్చితే 2021–22లో 100 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇది 45 శాతానికి పరిమితం కావచ్చు. - గృహ రుణాలుసహా రిటైల్ రుణాల విషయంలో బ్యాంకులు రుణ పునర్వ్యవస్థీకరణ జరిపే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల తక్షణం డిఫాల్డ్లకు అవకాశం ఉండదు. ఈ విభాగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు, పునర్వ్యవస్థీకరణలో ఉన్న రుణాలు కలిపి 2021–22 ముగిసే నాటికి 5.8 శాతానికి (మొత్తం రుణాల్లో) చేరవచ్చు. - ఎంఎస్ఎంఈ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పెద్ద నోట్ల రద్దు నుంచీ ఈ సమస్య తలెత్తింది. దీనికితోడు జీఎస్టీ, ఆర్ఈఆర్ఏలూ ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ఇప్పడు కోవిడ్–19తో సవాళ్లు మరింత తీవ్రమయ్యాయి. అయితే సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అందుతోంది. ఇందులో అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద తగిన లిక్విడిటీ లభ్యం అవుతుండడం గమనార్హం. రుణ పునర్వ్యవస్థీకరణ కూడా ఆయా రంగాలకు ప్రయోజనం కలిగిస్తోంది. - ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్పీఏ) 2021–22 ముగిసేనాటికి 13.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2020–21 ముగిసే నాటికి ఈ రేటు 9.9 శాతం. ఇక ఇదే సమయంలో ఒత్తిడిలో ఉన్న రుణాల శాతం 11.7 శాతం నుంచి 15.6 శాతానికి చేరవచ్చు. కార్పొరేట్ రుణాల విషయంలో ఇది జీఎన్పీఏ 10.2 శాతానికి, ఒత్తిడి ఉన్న రుణాలు 11.3 శాతానికి ఎగసే వీలుంది. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రుణ వృద్ధి 8.9 శాతం 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ ఉండబోదని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ప్రభుత్వ వ్యయాలు ప్రత్యేకించి మౌలిక రంగంలోకి వెళుతున్న పెట్టుబడులు, రిటైల్ రుణాలకు డిమాండ్ పునరుద్దరణ వంటి అంశాలు దీనికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. స్టేబుల్ టూ ఇంప్రూవింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించి 2021–22 అవుట్లుక్ను గత వారమే ఇండియా రేటింగ్స్ ‘‘స్టేబుల్’’ నుంచి ‘‘ఇంప్రూవింగ్’’కు మార్చింది. నిర్వహణా పరమైన, తక్కువ వడ్డీరేటు చర్యల వల్ల నాన్ బ్యాంకింగ్ తగిన లిక్విడిటీ, మూలధన నిల్వలు, స్థిర మార్జిన్లు కలిగి ఉందని కూడా ఇండియా రేటింగ్స్ తెలిపింది. సవాళ్లను తట్టుకుని నిలబడగలిగిన స్థాయిలో నాన్స్ బ్యాంక్ ఉన్నాయని విశ్లేషించింది. చదవండి : టీప్లస్1 సెటిల్మెంట్కు సెబీ గ్రీన్సిగ్నల్ ఎకానమీ వృద్ధిరేటు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా) ఇటీవలే 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇంతక్రితం 9.1 శాతం ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ ( ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ ( జు) నమూనా రికవరీ అని సంస్థ పేర్కొంటోంది. వృద్ధి నుంచి కొందరు మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. -
ఆర్థిక సంస్థలు ఆర్బీఐ కీలక ఆదేశాలు
ముంబై: అంతర్జాతీయంగా, దేశీయంగా కొత్త ఫైనాన్షియల్ కాంట్రాక్టుల విషయంలో లండన్ ఇంటర్బ్యాంక్ ఆఫర్ చేస్తున్న రేట్ల (లిబార్)కు బదులుగా విస్తృత ప్రాతిపదికన ఆమోదనీయయోగ్యమైన ప్రత్యామ్నాయ రేటు (ఏఏఆర్)కు మారాలని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం స్పష్టం చేసింది. డిసెంబర్ 31వ తేదీలోగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కొత్త ఫైనాన్షియల్ కాంట్రాక్టులకు లిబార్ రేట్లు ఇకపై ప్రాతిపదికగా ఉండబోవని ఫైనాన్షియల్ కాండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) యూకే, ఈ ఏడాది మార్చి 5వ తేదీన చేసిన ప్రకటన నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలకు జారీ చేసింది. లిబార్ రేటును బెంచ్మార్క్గా తీసుకునే ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వార్డ్ అవుట్రైట్ రేటు ఎంఐఎఫ్ఓఆర్)కు కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఫైనాన్షియల్ సంస్థలకు ఆర్బీఐ సూచించింది. లిబార్ రహిత ఫైనాన్షియల్ లావాదేవీల సరళి అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలా ఉంటుందన్న అంశంపై తన పర్యవేక్షణ కొనసాగుతుంటుందని కూడా ఆర్బీఐ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. రుణాలకు ‘లిబార్’ ఇంటర్ బ్యాంక్ వడ్డీరేటుగా ఉంటుంది.అమెరికా క్యాపిటల్ మార్కెట్లకు ‘లిబార్’ను స్టాండెర్డ్ ఫైనాన్షియల్ ఇండెక్స్. ఈ పరిస్థితుల్లో 2023 జూన్ వరకూ అమెరికా డాలర్–లిబార్ సెట్టింగ్స్ (రేట్ల అనుసంధాన పక్రియ) అమల్లో ఉండనున్నాయి. -
ఆ బ్యాంకులకు రూ.14,500 కోట్లు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రంలో (పీసీఏ) ఉన్న బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వశాఖ రానున్న కొద్ది రోజుల్లో రూ.14,500 కోట్ల తాజా మూలధనం సమకూర్చే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు సూచించాయి. ఆయా బ్యాంకుల ఫైనాన్షియల్ పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో ఈ తాజా నిధులను అందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీసీఏ పరిధిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుకో బ్యాంక్లు ఉన్నాయి. రుణాలు, యాజమాన్య పరిహారం, డైరెక్టర్ల ఫీజుల వంటి అంశాల్లో ఆయా బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణలు ఉన్నాయి. ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్సహా పలు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ మార్కెట్ వనరుల ద్వారా ఇప్పటికే నిధులను సమీకరించుకున్నాయి. ఇప్పటికే రూ.5,500 కోట్లు... నియంత్రణా పరమైన అవసరాలకు వీలుగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.20,000 కోట్ల తాజా మూలధనాన్ని ప్రభుత్వం కేటాయించింది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్కు గత ఏడాది నవంబర్లో రూ.5,500 కోట్లు సమకూర్చింది. కాగా, ఐడీబీఐ బ్యాంక్ను తన తీవ్ర నియంత్రణా పర్యవేక్షణా పరిధి (పీసీఏ) నుంచి ఆర్బీఐ రెండు రోజుల క్రితమే తొలగించిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఫైనాన్షియల్ పరిస్థితులు మెరుగుపడ్డంతో ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: ఐడీబీఐ బ్యాంక్కు భారీ ఊరట) -
బ్యాంకింగ్ రంగం అంత బాగోకపోవచ్చు!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగం అవుట్లుక్ ఏప్రిల్ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం అంత బాగుండక పోవచ్చని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ అంచనా వేస్తోంది. క్తొత వ్యాపారాలు, ఆదాయ వృద్ధి, రుణ నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాకు వచ్చినట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే.. కోవిడ్-19 నేపథ్యంలో ఎకానమీలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, చిన్న వ్యాపారాలకు జరిగిన నష్టాలు, నిరుద్యోగం, ప్రైవేటు వినియోగంలో తగ్గుదల వంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్లో ప్రతిబింబించడంలేదు. ఆయా అంశాల ప్రతికూలతలు, రుణ నాణ్యతలో లోపాలు 2022 మార్చి నాటికి ముగిసే బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై ప్రభావితం చూపే అవకాశం ఉంది. భారత్ బ్యాంకులు ఫైనాన్షియల్ పరిస్థితులు, సవాళ్లపై అప్పటి వరకూ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. నిర్వహణా పరంగా తీసుకున్న కొన్ని చర్యల వల్ల మాత్రమే 2020 డిసెంబర్ వరకూ జరిగిన తొమ్మిది నెలల్లో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లలో కొంత మెరుగుదల కనిపించింది తప్ప, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంతకు ముందుకన్నా రుణ బలహీన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రుణ వృద్ధి రేటు కూడా అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకింగ్కు భారీగా మూలధనం అందించే విషయంలో కూడా ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయి. సమస్య తీవ్రతలో ఇది మరో కోణం. రుణ నాణ్యత సరిగాలేకపోవడం, ఆర్థిక రికవరీలో అస్పష్టత వంటి అంశాలు బ్యాంకింగ్ రంగం అవుట్లుక్ను బలహీనపరుస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగానికి 5.5 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.40,150 కోట్లు) మూలధనంగా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ఫిచ్ ‘అంచనా మూలధనం అవసరం’కన్నా ఇది చాలా తక్కువ. వివిధ పరిస్థితుల్లో బ్యాంకింగ్కు 15 బిలియన్ డాలర్ల నుంచి 58 బిలియన్ డాలర్ల వరకూ అవసరమవుతాయి. నియంత్రణా పరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గణాంకాలను లోతుగా విశ్లేషిస్తే, ఒత్తిడి తీవ్రతను గుర్తించవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 11శాతంగా నమోదుకావచ్చు. అయితే పలు రంగాలు సామర్థ్యానికి దిగువనే కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంది. రిటైల్ కస్టమర్లో ఒత్తిడి కొనసాగుతోంది. ప్రైవేటు వినియోగం తగ్గుదల, పట్టణ యుటిలిటీ బిల్లుల చెల్లింపుల్లో వైఫల్యాలు, సామాజిక భద్రతా పథకాల నుంచి ఉపసంహరణల వంటి అంశాలు దీనిని సూచిస్తున్నాయి. లఘు, మధ్య తరహా పరిశ్రమలకు 2021- 22 ఆర్థిక సంవత్సరం కూడా ఒక పరీక్షా కాలంగా నిలవనుంది. మొండిబకాయిల తీవ్రత... కోవిడ్-19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్పై మొండిబకాయిల(ఎన్పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) ఇటీవలే పేర్కొంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్పై ఉంటుంది. 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్పై ఎన్పీఏ భారం 7.5 శాతం. అప్పటి నుంచీ చూస్తే, కనీసమయినా ఎన్పీఏలు 600 బేసిస్ పాయింట్లు (6 శాతం) అయినా పెరుగుతుందన్నమాట. నివేదిక ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండి బకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో చూసినా 9.7 శాతం - 16.2 శాతాల శ్రేణిలో ఉండే వీలుంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఈ శ్రేణి 4.6 శాతం-7.9 శాతం శ్రేణిలో ఉండవచ్చు. ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శ్రేణి 2.5 శాతం - 5.4 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. ఇక తీవ్ర స్థాయిల్లో పీఎస్బీ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఎన్పీఏలు వరుసగా 17.6 శాతం, 8.8 శాతం, 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. రుణ నాణ్యత పటిష్టతపై ఇప్పుడే చెప్పలేం: క్రిసిల్ ఇదిలావుండగా, బ్యాంకింగ్ రుణ నాణ్యత పటిష్టత గురించి ఇప్పుడే ఏమీ నిర్థారణకు రాలేమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ అనుబంధ విభాగం క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంది. తన క్రెడిట్ రేషియోను 0.54 నుంచి 1 స్థాయికి చేర్చింది. -
‘నెవర్ బిఫోర్’ బడ్జెట్ లో బ్యాంకింగ్ !
‘‘ఈ దఫా ఇంతకు ముందెన్నడూ చూడని (నెవర్ బిఫోర్) విధంగా 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉండనుంది...’’ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో చేసిన వ్యాఖ్య ఇది. దీనితో ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్పై అన్ని రంగాలకు సంబంధించి ఉత్కంఠత నెలకొంది. ఎకానమీకీ వెన్నెముకగా భావించే బ్యాంకింగ్లోనూ ప్రస్తుతం ఇదే విషయమై చర్చ మొదలైంది. మొండిబకాయిల భారం నుంచి మూలధన సమస్యల వరకూ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన బ్యాంకింగ్కు రానున్న బడ్జెట్లో ఎటువంటి స్థానం లభించనుందన్నదే ఆర్థిక నిపుణుల్లో చర్చనీయాంశం. మొండిబకాయిల తీవ్రత... కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై అంతర్జాతీయ రేటింగ్, బ్యాంకింగ్ సేవల దిగ్గజాలు పలు సానుకూల విశ్లేషణలు చేస్తున్నాయి. అయితే ప్రతికూలతల విషయానికి వచ్చే సరికి బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య ముందు వరుసలో ఉంటోంది. భారత్ బ్యాంకింగ్పై మొండిబకాయిల భారం తీవ్రతరం కానుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్వయంగా ఇదే విషయాన్ని భారత్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ప్రస్తావించడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని ఆర్బీఐ ఇటీవలే విడుదల చేసిన ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొనడం గమనార్హం. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని నివేదిక వివరించింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ‘మొండి’ భారం బ్యాంకింగ్పై ఉంటుంది. నిధుల కొరత... తీవ్ర ఒత్తిడుల నేపథ్యంలో బ్యాంకింగ్ క్యాపిటల్ అడక్వెసీ రేషియో (సీఏఆర్) 2020 సెప్టెంబర్లో 15.6 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్ నాటికి కనీసం 14 శాతానికి పడిపోయే అవకాశం ఉందన్నది విశ్లేషణ. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే ఇది 12.5 శాతానికైనా పడిపోయే అవకాశాలూ ఉన్నాయి. వాటాదారులు ఎవ్వరూ ఎటువంటి మూలధనాన్ని అందించలేకపోతే 2021 సెప్టెంబర్ నాటికి నాలుగు బ్యాంకులు కనీస మూలధన స్థాయిని నిర్వహించడంలోసైతం విఫలమయ్యే అవకాశం ఉందని స్వయంగా ఆర్బీఐ నివేదిక పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఈ తరహా బ్యాంకుల సంఖ్య తొమ్మిదికి చేరవచ్చన్న అందోళనా ఉంది. నియంత్రణాపరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక డిపాజిట్లు పెరుగుతుండగా, రుణాలు తగ్గుతుండడం మరో సమస్య. ఎన్బీఎఫ్సీల స్థితీ అంతంతే! దేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ)ల పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. రుణ మార్కెట్లో ఎన్బీఎఫ్సీలు ప్రధాన మధ్యవర్తిత్వ సంస్థలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే గత కొంత కాలంగా ఇవి నిధుల లభ్యత, పాలనా, సాల్వెన్సీ (తీసుకున్న రుణాలు తీర్చే సామర్థ్యం) సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రానున్న బడ్జెట్లో ఈ ఒత్తిళ్లను తగ్గించే చర్యలు ఉంటాయని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ నుంచి నేరుగా ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల మద్దతు అవసరమన్న వాదనా ఊపందుకోవడం లిక్విడిటీ సవాళ్లకు అద్దం పడుతోంది. ‘బ్యాంకులు కనీసం 50 శాతం నిధులను చిన్న, మధ్య స్థాయి ఎన్బీఎఫీసీల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ తీసుకొచ్చిన టీఎల్టీఆర్వో 2.0కు స్పందన తగిన విధంగా లేదన్న విమర్శ ఉంది. ఇక ఎన్బీఎఫ్సీ వ్యవస్థ మరింత పటిష్టవంతం కావడానికి తగిన చొరవలు లక్ష్యంగా ఆర్బీఐ ఇటీవలే నాలుగు అంచెల నియంత్రణా వ్యవస్థను ప్రతిపాదించింది. బడ్జెట్లో ఆశిస్తున్న దేమిటి? బాసెల్ నిబంధనలు బ్యాంకింగ్ మూలధనానికి సంబంధించి అంతర్జాతీయంగా ఉన్న బాసెల్ నిబంధనలను మరో మూడు సంవత్సరాలు పక్కకు పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. దీనివల్ల లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకింగ్ నుంచి మరింత నిధుల లభ్యత సమకూరుతుందని విశ్లేషిస్తున్నారు. క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ పొడిగింపు చిన్న, లఘు మధ్య తరహా పరిశ్రమలు బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీల నుంచి అత్యవసర రుణ లభ్యత పొందడానికి కీలకమైన పథకం ఇది. 100 శాతం రుణ హామీ కేంద్రం నుంచి బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలకు దీనివల్ల లభిస్తోంది. ఆర్థికవ్యవస్థలో కీలక విభాగాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతున్న ఈ స్కీమ్ను మార్చి 31 తరువాతా పొడిగించేట్లు బడ్జెట్లో చర్యలు ఉండాలి. డిజిటలైజేషన్ భారత్ బ్యాంకింగ్ డిజిటలైజేషన్ ప్రక్రియ మెరుగుపడుతున్నా, ఇంకా పలు అడ్డంకులు ఉన్నాయి. బ్యాంకింగ్లో సాంకేతికత వినియోగం పెరిగేందుకు పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. డిజిటలైజేషన్ విధానాలు అనుసరించడం వల్ల తమ ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదని, సత్వర సేవలు పొందడానికి ఇదే ఒక మార్గమని వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. మార్కెట్ నుంచి నిధులు ఉద్దీపనల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక లిక్విడిటీ మార్కెట్లకు ఊతం ఇస్తున్న నేపథ్యంలో, బ్యాంకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తగిన చర్యలు ఉండాలి. ప్రభుత్వ క్లిష్ల ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకింగ్కు తగిన ద్రవ్య లభ్యతకు ‘మార్కెట్ ద్వారా నిధుల’ సమీకరణ కీలకాంశం. మరింత మూలధనం 2019–20 వరకూ గడచిన 12 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.3,85,000 కోట్లను సమకూర్చింది. కరోనా సవాళ్లు, తీవ్ర మొండిబకాయిల సమస్య నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంకులకు మరింత మూలధన మద్దతు అవసరం. తక్షణం బ్యాంకింగ్కు మరో రూ.లక్ష కోట్ల మూలధనం అవసరం అవుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రైవేటీకరణ – విలీనాలు కొత్త బడ్జెట్లో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాంకుల విలీనాల దిశగా చర్యలు ఉంటాయన్న అంచనాలూ ఉన్నాయి. సంస్కరణలకు పెద్దపీట బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణల విషయానికి వచ్చే సరికి ప్రైవేటీకరణ, విలీనాలతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాలతో ‘ఒక బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’ (హోల్డింగ్ కంపెనీ) ఏర్పాటు ఆవశ్యకతపై చర్చ జరుగుతోంది. దీనితోపాటు పటిష్ట మూలధనంతో కూడిన ఒక డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ (డీఎఫ్ఐ) ఏర్పాటు అవసరం ఉందన్నది నిపుణుల విశ్లేషణ. తద్వారా జాతీయ మౌలికరంగ పథకం (ఎన్ఐపీ)అవసరాలు తీర తాయని వారు సూచిస్తున్నారు. ఎన్ఐపీ కింద గుర్తించిన ప్రాజెక్టుల అమలుకు 2020–25 నాటికి రూ.111 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. -
బ్యాంకింగ్ రేస్లో... టాటా, బిర్లా, బజాజ్!
ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఆర్థిక రంగం ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం బలంగా ఉండాలి. అయితే ప్రస్తుతం మన దేశంలో బ్యాంకింగ్ రంగం బలహీనంగానే ఉంది. మన బ్యాంకింగ్ రంగంలో అధిక ప్రభావం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్లు మొండిబకాయిల భారంతో కునారిల్లుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదకత రంగాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మరిన్ని ప్రైవేట్ బ్యాంక్లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. భారీ కార్పొరేట్ సంస్థలను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించడం, రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్లుగా మారే వెసులుబాటును ఇవ్వడం, ప్రమోటర్ వాటాను 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలు వాటిల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయానికి మరో మూడు నెలలు పట్టవచ్చు. ముందు వరుసలో భారీ ఎన్బీఎఫ్సీలు... బ్యాంక్ లైసెన్స్లు పొందడానికి టాటా, బిర్లా, బజాజ్, పిరమళ్ సంస్థలు రేసులో ఉన్నాయి. ఈ దిగ్గజ సంస్థలకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్(ఎన్బీఎఫ్సీ) సంస్థలున్నాయి. రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్లుగా మార్చుకునే వెసులుబాటు ఉండటం ఈ సంస్థలకు కలసివస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన టాటా క్యాపిటల్ ఆస్తులు రూ.83,280 కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ ఆస్తులు రూ.46,807 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఆసక్తిగా ఉన్నామని టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్లకు సంబంధించి ప్రస్తుతానికి ప్రతిపాదనలే వెలువడ్డాయని, ఈ దశలో తమ బ్యాంకింగ్ ప్రణాళికలను వివరించడం సముచితం కాదని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్పష్టత వచ్చాక ఈ విషయమై పరిశీలన జరుపుతామని వివరించారు. 2012లో కూడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్లు ఇస్తామని ఆర్బీఐ ప్రకటించింది. అప్పుడు టాటా గ్రూప్ కూడా దరఖాస్తు చేసింది. అయితే నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయంటూ 2013లో తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఇక బిర్లా గ్రూప్నకు చెందిన ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆస్తులు రూ.70,015 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఈ సంస్థ కూడా రేసులో ఉంటుందని నిపుణులంటున్నారు. మరోవైపు పిరమళ్ గ్రూప్ కూడా బ్యాంక్ లైసెన్స్ రేసులో ఉంది. సంక్షోభంలో కూరుకుపోయిన డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ గ్రూప్ ఎన్బీఎఫ్సీ ఆస్తులు రూ.50,000 కోట్ల మేర ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో పిరమళ్ గ్రూప్నకు మంచి అనుభవం ఉంది. అయితే ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్స్పోజర్ బాగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని కొంతమంది నిపుణులంటున్నారు. డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తుల్ని కొనుగోలు చేస్తే, పిరమళ్ గ్రూప్నకు నిలకడైన క్యాష్ ఫ్లోస్ ఉంటాయని వారంటున్నారు. బ్యాంక్ లైసెన్స్ల కోసం 2012లోనే బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సంస్థలు ప్రయత్నాలు చేశాయి. కానీ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్లకు మాత్రమే అప్పుడు లైసెన్స్లు లభించాయి. తాజా ప్రతిపాదనల కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ తదితర సంస్థలు తమ ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేయవచ్చని నిపుణులంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్...! కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్లు ఇచ్చే దిశగా ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ సూచనలు చేసింది. అయితే ఈ కమిటీలో ఒక్క వ్యక్తి మినహా మిగిలిన వారందరూ కార్పొరేట్లకు బ్యాంక్ లైసెన్స్లు ఇవ్వొద్దనే సూచించారు. అయితే బ్యాంకింగ్ చట్ట సవరణ అంశాన్ని ఈ కమిటీ ప్రభుత్వ అభీష్టానికే వదిలేసింది. కాగా ఇవి సాహసోపేత ప్రతిపాదనలని నిపుణులంటున్నారు. అయితే కార్పొరేట్ హౌజ్లకు బ్యాంక్ లైసెన్స్లు లభించడం కష్టమేనని మాక్వెరీ క్యాపిటల్ పేర్కొంది. అంతే కాకుండా యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ల సంక్షోభం నేపథ్యంలో ఉదారంగా బ్యాంక్ లైసెన్స్లు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని వివరించింది. కాగా కార్పొరేట్ హౌజ్లకు బ్యాంక్ లైసెన్స్లు ఇవ్వడం ప్రమాదకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు సరికాదు..! రేటింగ్ దిగ్గజం ఎస్ అండ్ పీ ప్రకటన బడా కార్పొరేట్ సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) వ్యక్తం చేసింది. భారత్ కార్పొరేట్ పాలన బలహీనంగా ఉందని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా రుణ చెల్లింపుల్లో వైఫల్యం చెందుతున్నాయని సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తుందని తెలిపింది. కొత్తగా బ్యాంకులను నెలకొల్పడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన ఒక నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయానికి ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఎస్అండ్పీ ప్రకటనలో ముఖ్యాంశాలు ... ► కార్పొరేట్లే బ్యాంకింగ్ నిర్వహించే అంశంలో పలు క్లిష్టతలు ఉంటాయి. అంతర్గత గ్రూప్లకు రుణం, నిధుల మళ్లింపు, పరస్పర ప్రయోజనాల కోణంలో ప్రశ్నలు, ఆర్థిక స్థిరత్వం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. రుణ బకాయిల చెల్లింపుల్లో కార్పొరేట్ల వైఫల్యాల వల్ల ఫైనాన్షియల్ వ్యవస్థలో నెలకొనే ప్రతికూలతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలూ ఉంటాయి. ► 2020 మార్చి నాటికి మొత్తం కార్పొరేట్ రుణాల్లో దాదాపు 13% మొండిబకాయిలు(ఎన్పీఏ)గా మారడం ఇప్పుడు చర్చనీయాంశం. ఇతర దేశాలతో పోల్చితే భారత్లో ఎన్పీఏల సమస్య తీవ్రంగా ఉంది. ► అయితే రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 సంవత్సరాలకు పైగా చక్కటి వ్యాపార నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులగా మార్చే ప్రతిపాదన మంచిదే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. అది పిడుగుపాటే..! కార్పొరేట్ బ్యాంకింగ్పై రఘురామ్ రాజన్, విరాల్ ఆచార్య ఆర్బీఐ మాజీ గరవ్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యలు కూడా ఈ అంశంపై తీవ్ర ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని అమలుచేస్తే, అది బ్యాంకింగ్పై పిడుగుపాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు సంయుక్తంగా రాసిన ఒక ఆర్టికల్ సోమవారం రాజన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పోస్ట్ అయ్యింది. బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ సంస్థల జోక్యం ఎంతమాత్రం సమంజసం కాదని ఆర్టికల్ పేర్కొంది. ఇలాంటి క్లిష్ట రుణదాత–గ్రహీత అనుసంధాన వ్యవస్థ సజావుగా మనుగడ సాగించిన చరిత్ర ఏదీ లేదనీ పేర్కొంది. రుణ గ్రహీతే యజమానిగా ఉన్న ఒక బ్యాంక్ మంచి వ్యాపారం ఎలా చేయగలుగుతుందని ఆర్టికల్ రచయితలు ప్రశ్నించారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట జరిగే ‘పేలవ రుణ తీరు’ను ప్రతిసారీ కట్టడి చేయడం సాధ్యంకాదని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువయ్యిందని ఆర్టికల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్ ప్రతిపాదన మంచిదికాదని స్పష్టం చేసింది. ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ‘‘అసలు ఇప్పుడు ఈ అవసరం ఏమి వచ్చింది...’’ అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోందని ఆర్టికల్ పేర్కొంది. ఆర్బీఐ అధికారాల పెంపు అవశ్యం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారాలను మరింత పెంచాలన్న సూచించిన ఆర్టికల్, ఈ పరిస్థితి ఉన్నట్లయితే, మొండిబకాయిల సమస్య ఇంతలా పెరిగేది కాదనీ స్పష్టం చేసింది. ఆర్బీఐకి మరిన్ని అధికారాలు, మొండిబకాయల తగ్గింపునకు ఆర్బీఐ వర్కింగ్ కమిటీ చేసిన పలు ప్రతిపాదనలను తొలుత అమలు చేయాలని, ‘కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్’ను ప్రస్తుతం పక్కనపడేయాలనీ తమ ఆర్టికల్లో ఆర్థిక నిపుణులు సూచించారు. ప్రపంచంలో పలు దేశాల తరహాలోనే భారత్లో కూడా బ్యాంకింగ్ వైఫల్యం వల్ల ఖాతాదారులు నష్టపోయే పరిస్థితి ఉండదని వారు అన్నారు. ఇందుకు యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంకులను ప్రస్తావించారు. అందువల్ల బ్యాంకుల్లో తమ డబ్బుకు భద్రత ఉంటుందని డిపాజిటర్లు భావిస్తారని పేర్కొన్నారు. అందువల్లే బ్యాంకులు పెద్ద ఎత్తున డిపాజిట్లను సమీకరించగలుగుతున్నాయని కూడా విశ్లేషించారు. ప్రస్తుతం రాజన్, ఆచార్యలు ఇరువురూ అమెరికాలో ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ప్రొఫెసర్గా రాజన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, స్టెర్న్ స్కూల్ ప్రొఫెసర్గా ఆచార్య పనిచేస్తున్నారు. -
‘కార్పొరేట్’ బ్యాంకులకు సై..!
ముంబై: దేశంలో అంబానీ, అదానీ వంటి దిగ్గజ పారిశ్రామిక గ్రూపులు బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం కానుంది. స్వయంగా బ్యాంకులను తెరవడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ ఒకటి ప్రతిపాదించింది. ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు వీలుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949కు అవసరమైన సవరణలు చేయాలని సూచించింది. పటిష్ట నిఘా ఇక్కడ కీలకాంశమని స్పష్టం చేసింది. అంతర్గతంగా గ్రూప్ సంస్థలకు రుణాలు, పరస్పర ప్రయోజనాలకు విఘాతాలు వంటి పలు అంశాల నేపథ్యంలో ఒక భారీ స్థాయి కార్పొరేట్ సంస్థకు పూర్తిస్థాయి బ్యాంకింగ్ లైసెన్సు మంజూరు చేయడానికి ఆర్బీఐ ఇప్పటివరకూ వెనకడుగు వేస్తూ వస్తోంది. ఈ అడ్డంకులు తొలగాలంటే తప్పనిసరిగా బ్యాంకింగ్ యాక్ట్కు సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాను ప్రస్తుత 15% నుంచి 26%కి పెంచవచ్చని కూడా ఆర్బీఐ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు 15 సంవత్సరాల కాల వ్యవధిని సూచించింది. దీనివల్ల పెయిడ్ అప్ క్యాపిటల్కు సంబంధించి ఓటింగ్ హక్కులు పెరుగుతాయి. భారత ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించి కార్పొరేట్ నిర్మాణం, యాజమాన్య మార్గదర్శకాల సమీ క్షకు 2020 జూన్ 12న ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. బ్యాంకులుగా పెద్ద ఎన్బీఎఫ్సీలు: రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 ఏళ్లకు పైగా చక్కటి నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులుగా మార్చే అంశాన్ని పరిశీలించవచ్చని కూడా ఆర్బీఐ కమిటీ సూచించింది. కార్పొరేట్లు నిర్వహిస్తున్న ఎన్బీఎఫ్సీలకూ దీన్ని వర్తింపజేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై ఎన్బీఎఫ్సీలకు మరికొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను సూచించాలని సిఫారసు చేసింది. ఆదిత్య బిర్లా, బజాజ్, మహీంద్రా, టాటా గ్రూపులు ఇప్పటికే దశాబ్దానికి పైగా ఎన్బీఎఫ్సీలను నిర్వహిస్తున్నాయి. నిజానికి దేశంలో మధ్య మధ్య స్థాయి బ్యాంకులకన్నా ఈ ఎన్బీఎఫ్సీలు పెద్దవి కావడం గమనార్హం. కనీస ప్రారంభ మూలధనం పెంపు కొత్త బ్యాంకుల ఏర్పాటుకు కనీస ప్రారంభ మూలధన్నాన్ని పెంచాలని ఆర్బీఐ కమిటీ సూచించింది. బ్యాంకుల విషయంలో ఈ మొత్తాలను రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు... అలాగే చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు రూ.200 కోట్ల నుంచి రూ. 300 కోట్లకు పెంచాలని పేర్కొంది. పెరుగుతున్న ప్రైవేటు బ్యాంకింగ్ వాటా... మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో ప్రైవేటు రంగం వాటా గణనీయంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. 2000లో మొత్తం బిజినెస్లో ప్రైవేటు రంగం వాటా డిపాజిట్లకు సంబంధించి 12.63 శాతం ఉంటే, రుణాల విషయంలో ఈ రేటు 12.56 శాతంగా ఉండేదని వివరించింది. 2020లో ఈ శాతాలు వరుసగా 30.35 శాతం, 36.04 శాతానికి పెరిగాయని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా తమ మార్కెట్ వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులకు కోల్పోతున్నాయని తెలిపింది. మొండిబకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న ప్రభుత్వ రంగ బ్యాలెన్స్ షీట్లే దీనికి కారణమని నివేదిక వివరించింది. ప్రైవేటు రంగానికి మూలధనం కూడా పెద్ద సమస్యగా ఉండడం లేదని తెలిపింది. గడచిన ఐదేళ్లలో మార్కెట్ నుంచి ప్రైవేటు బ్యాంకులు రూ.1,15,328 కోట్లు సమీకరించగలిగితే, ప్రభుత్వ బ్యాంకుల విషయంలో ఈ మొత్తం రూ.70,823 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇందుకు అదనంగా ప్రభుత్వం నుంచి రూ.3,18,997 కోట్ల మూలధనం అందినట్లు వివరించింది. బ్యాంకింగ్ రంగంలో మార్పు! మొత్తంగా పరిశీలిస్తే, బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రూ.10 లక్షల కోట్లకుపైగా బ్యాలెన్స్ షీట్ల పరిమాణంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఆరేడు బ్యాంకులతో విలీనం అయ్యాయి. దీనికితోడు ఇప్పటికే 3–4 బడా ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్బీఐ బడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడమో లేక, వాటి ఎన్బీఎఫ్సీలను పూర్తి స్థాయి బ్యాంకులుగా మార్చడమో చేస్తే అవి మరింత పోటీని ఇస్తాయి. దేశంలో పలు మధ్య తరహా బ్యాంకులకన్నా పెద్దవిగా మారతాయి. పెద్ద ఎన్బీఎఫ్సీల్లో ఏదైనా ఆర్థిక సమస్యలు తలెత్తితే అది మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రభావం పడుతున్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం, ఆర్బీఐ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) వంటి సంస్థలు దివాలా తీయడం తెలిసిందే. -
ప్రభుత్వం ఆదుకోకపోతే బ్యాంకింగ్కు కష్టాలే..
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక మొండి బకాయిల (ఎన్పీఏ) భారం మోస్తున్న భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్కు కేంద్రం సహాయక చర్యలు అందకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన నలుగురు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఒక పుస్తకంలో ఈ వివరాలు వెల్లడికానున్నాయి. ‘మహమ్మారి: భారత ఘన బ్యాంకింగ్ కష్టాలు’ పేరుతో పబ్లిషింగ్ హౌస్– రోలీ బుక్స్ ఆవిష్కరించనున్న పుస్తక రచనలో భాగంగా రచయిత, ప్రముఖ పాత్రికేయులు తమల్ బందోపాధ్యాయ నలుగురు గవర్నర్లను ఇంటర్వ్యూ చేశారు. అసలు మొండిబకాయిల సమస్యలకు కారణాలపై గవర్నర్లు విభిన్నంగా స్పందించినప్పటికీ బ్యాంకింగ్ విలీనాలు, పరిపాలనా, బ్యాంకుల విషయంలో ప్రభుత్వ యాజమాన్యంపై ఒకే విధంగా స్పందించడం గమనార్హం. విలీనాలు, భారీ బ్యాంకింగ్ ఏర్పాటుతో సమస్య తీరిపోదని వారు పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలు తగ్గాలని, పాలనా వ్యవస్థ మెరుగుపడాలనీ సూచించారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం... ఈ ఇంటర్వ్యూల్లో నలుగురు గవర్నర్లూ ఏమన్నారంటే... అత్యుత్సాహమూ కారణమే కంపెనీల భారీ పెట్టుబడులు, రుణాలు అందించడంలో బ్యాంకర్ల అత్యుత్సాహం ఎన్పీఏలు భారీగా పెరిగిపోడానికి కారణమయ్యాయి. ఆర్థిక మందగమనం మొండిబకాయిల తీవ్రతకు ఒక కారణం అయితే, సత్వర చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కూడా సమస్యను మరింత జఠిలం చేసింది. మొండిబకాయిల సత్వర గుర్తింపు, తగిన భారీ మూలధన కల్పన, బ్యాంకింగ్ పాలనా వ్యవస్థ పటిష్టం తక్షణం అవసరం. ఈ దిశలో చర్యలు ఉండాలి. – డాక్టర్ రఘురామ్ రాజన్ (గవర్నర్గా.. 2013–2016) అతి పెద్ద సమస్య అవును. భారత్ బ్యాంకింగ్ మొండిబకాయిలు భారీ, వాస్తవ సమస్య. ఈ సమస్య సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అసలే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు మహమ్మారితో మరింత విషమించాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందే ప్రారంభమైన మొండిబకాయిల సమస్య, అటు తర్వాతా కొనసాగింది. కొన్ని అననుకూల పాలనాపరమైన సమస్యల వల్ల మొండిబకాయిలను తరువాత అదుపుచేయలేకపోవడం చోటుచేసుకుంది. – దువ్వూరి సుబ్బారావు (బాధ్యతల్లో.. 2008–2013) ఇతర ఇబ్బందులకూ మార్గం బ్యాంకుల్లో ఉన్న మొండిబకాయిల సమస్య కేవలం అక్కడితో ఆగిపోదు. ఇతర సమస్యలకూ ఇది దారితీస్తుంది. బలహీన ఫైనాన్షియల్ పరిస్థితులు, మొండిబకాయిలు వాస్తవ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. రుణాల పెంపునకు వచ్చిన ఒత్తిడులు కూడా మొండిబకాయిల భారానికి కారణం. 2015–16 రుణ నాణ్యత సమీక్ష తరువాత ఆర్థిక వ్యవస్థ విస్తృతమయినప్పటికీ, రుణాల్లో వృద్ధి లేకపోవడం ఇక్కడ గమనార్హం. – వై. వేణుగోపాల్ రెడ్డి (విధుల్లో.. 2003–2008) పెద్ద నోట్ల రద్దు... సంక్షోభం! బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ‘ప్రణాళికా బద్దంగా జరగని’’ నోట్ల రద్దుతో మరింత తీవ్రమయ్యాయి. నోట్ల రద్దు ఒక ఆర్థిక సంక్షోభంగా పేర్కొనవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యకు ఈ వ్యవస్థమాత్రమే కారణం కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అంశాలెన్నో ఇక్కడ ప్రతిబింబిస్తుంటాయి. పాలనాపరమైన లోపాలను సవరించడం ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని ఒక గాడిన పెట్టడం సాధ్యమవుతుంది. – సీ. రంగరాజన్ (పదవీకాలం..1992–1997) -
బ్యాంకింగ్ హవా- లాభాల ముగింపు
పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ప్రస్తావించ దగ్గ లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు బలపడి 39,758 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పుంజుకుని 11,669 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,335 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ఇక నిఫ్టీ 11,726- 11,557 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సెకండ్ వేవ్లో భాగంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతుండటంతో వారాంతాన అమెరికా, యూరోపియన్ మార్కెట్లు డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలినట్లు తెలియజేశారు. బ్యాంకుల జోరు ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 4.2 శాతం జంప్చేయగా.. రియల్టీ 3.2 శాతం ఎగసింది. అయితే ఐటీ, ఫార్మా 0.9-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ 6.5-2.2 శాతం మధ్య జంప్చేశాయి. ఇతర బ్లూచిప్స్లో క్యూ2 ఫలితాల కారణంగా ఆర్ఐఎల్ 9 శాతం పతనమైంది. ఇతర దిగ్గజాలలో దివీస్, ఐషర్, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, టీసీఎస్, బీపీసీఎల్, యూపీఎల్, ఐవోసీ, విప్రో 3-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఫైనాన్స్ భళా డెరివేటివ్ కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్, శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, హావెల్స్, బీవోబీ, ఎల్ఐసీ హౌసింగ్, పీఎఫ్సీ, పీవీఆర్, పీఎన్బీ, బంధన్ బ్యాంక్, అశోక్ లేలాండ్, డీఎల్ఎఫ్ 9- 4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. కోఫోర్జ్, టాటా కెమికల్స్, కేడిలా, ఇన్ఫ్రాటెల్, జీ, అపోలో హాస్పిటల్స్, పేజ్, అరబిందో, పెట్రోనెట్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.4 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.7 శాతం క్షీణించింది. ట్రేడైన షేర్లలో 1,563 నష్టపోగా.. 1,099 లాభపడ్డాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 871 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 631 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకులపై ‘మొండి’బండ!
ముంబై: భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టమైపోయాయి. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని శుక్రవారంనాడు విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఆర్థికాంశాలకు సంబంధించి ఆర్బీఐ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► పలు క్షేత్ర స్థాయి ఆర్థిక అంశాల ప్రాతిపదికన బ్యాంకింగ్ తాజా పరిస్థితిని అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధిరేటు, జీడీపీలో ద్రవ్యలోటు నిష్పత్తి, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వంటివి ఉన్నాయి. ► మార్చి నుంచి ఆగస్టు వరకూ రుణాల చెల్లింపులపై మారటోరియం అమలవుతోంది. ఈ మారటోరియం ప్రభావం బ్యాంకింగ్పై ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. దీని గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. ► ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే– జీఎన్పీఏ నిష్పత్తి 2021 మార్చి నాటికి 15.2 శాతానికి చేరే వీలుంది. 2020 మార్చిలో ఈ రేటు 11.3 శాతం. ► ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఈ రేటు 4.2 శాతం నుంచి 7.3 శాతానికి చేరవచ్చు. ► విదేశీ బ్యాంకుల విషయంలో జీఎన్పీఏల నిష్పత్తి 2.3 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చు. ► ఇక కనీస పెట్టుబడుల నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో –సీఆర్ఏఆర్) 2020 మార్చిలో 14.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి 13.3 శాతానికి తగ్గే వీలుంది. పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు 11.8 శాతానికీ పడిపోయే వీలుంది. కనీస పెట్టుబడుల నిష్పత్తిని కొనసాగించడంలో ఐదు బ్యాంకులు పూర్తిగా విఫలం కావచ్చు. ► నిజానికి 2018–19 తో పోల్చితే 2019–20 లో బ్యాంకింగ్ లాభదాయక నిష్పత్తులు బాగున్నాయి. అయితే 2019–20 ఒక్క ద్వితీయార్ధాన్ని పరిశీలిస్తే ఈ నిష్పత్తులు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభదాయక నిష్పత్తులు ఏ స్థాయిలో పడిపోయే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. ► ఒకపక్క తగ్గుతున్న డిపాజిట్లు, మరోపక్క మొండిబకాయిల భారం వెరసి బ్యాంకింగ్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలనూ ఎదుర్కొనే వీలుంది. ► ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే, కరోనా మహమ్మారి సవాళ్లు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి. లాక్డౌన్ ఇంకా పూర్తిస్థాయిలో ఎత్తివేయని పరిస్థితీ ఉంది. ఈ నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమన ఇబ్బందులే ఉంటాయని భావిస్తున్నాం. భారత ఆర్థిక మూలాలు పటిష్టం: శక్తికాంత్ దాస్ కోవిడ్–19 నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రభుత్వంతోపాటు ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని తగ్గించగలిగాయి. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వినియోగదారులు... ఇలా అందరికీ విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలంటే ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం అవసరం. ఈ స్థిరత్వం చెక్కుచెదరకుండా చూడడంపై మేము అధిక దృష్టి సారిస్తున్నాం. బ్యాంకింగ్ విషయానికి వస్తే, ఇబ్బందులను తట్టుకోగలిగిన స్థాయికి ఎదగాల్సిఉంది. ఇందుకు తగిన యంత్రాంగం సమాయత్తం కావాలి. మూలధనాన్ని తగిన స్థాయిల్లో నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రుణాల మంజూరీ విషయాల్లో మితిమీరిన అతి జాగ్రత్తలూ మంచిదికాదు. ఇలాంటి ధోరణీ ప్రతికూలతలకు దారితీస్తుంది. లాక్డౌన్ సమయాల్లోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి దేశీయ రంగాలు కొన్ని చక్కటి పనితీరునే ప్రదర్శించాయి. భారత్ ఆర్థిక వ్యవస్థలో మొత్తంగా రికవరీ జాడలు కనిపిస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉండడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దివాలా చట్టం నిర్వీర్య యత్నం వల్లే కేంద్రంతో విభేదించా: ఉర్జిత్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి 2018 డిసెంబర్లో మధ్యంతరంగా వైదొలగిన ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు ఇందుకు కారణాన్ని వెల్లడించారు. దివాలా చట్టం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నాలే కేంద్రంతో విభేదాలకు కారణమని శుక్రవారం ఆవిష్కరించిన తన పుస్తకంలో పేర్కొన్నారు. రీపేమెంట్లను ఆలస్యం చేస్తున్న డిఫాల్టర్లను తక్షణం డిఫాల్టర్లుగా వర్గీకరించాలని, అలాంటి వ్యక్తులు దివాలా చర్యల సందర్భంగా తిరిగి తమ కంపెనీలను బైబ్యాక్ చేయకుండా నిరోధించాలని బ్యాంకింగ్కు సూచిస్తూ ఆర్బీఐ జారీ చేసిన 2018 ఫిబ్రవరి సర్క్యులర్ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైందని తెలిపారు. అయితే దీనిని చట్టరూపంలో తీసుకురావడానికి కేంద్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించిందని సూచించారు. -
బ్యాంకింగ్ పుష్- 500 పాయింట్లు ప్లస్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత నెమ్మదిగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి పరుగందుకున్నాయి. ప్రధానంగా పీఎస్యూ, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో వెనుదిరిగి చూడలేదు. వెరసి సెన్సెక్స్ 499 పాయింట్లు జంప్చేసి 35,414 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 128 పాయింట్లు జమ చేసుకుని 10,430 వద్ద నిలిచింది. తద్వారా మార్కెట్లు ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలో స్థిరపడ్డాయి. సమయం గడుస్తున్నకొద్దీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఒక దశలో 35,467వరకూ ఎగసింది. తొలుత 34,927 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో తొలుత 10,300కు స్వల్ప వెనకడుగు వేసినప్పటికీ నిఫ్టీ ఆపై 10,447కు పెరిగింది. ఎఫ్ఎంసీజీ సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్ 3.6 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 2.7 శాతం చొప్పున జంప్చేయగా.. మీడియా 2 శాతం, ఎఫ్ఎంసీజీ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ఫార్మా, రియల్టీ 1-0.7 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, యూపీఎల్, బజాజ్ ఫిన్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, జీ 6.3-2.4 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో ఎన్టీపీసీ, నెస్లే, ఎల్అండ్టీ, శ్రీ సిమెంట్, సిప్లా, బ్రిటానియా, ఎంఅండ్ఎం, ఇన్ఫ్రాటెల్, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా 2-1 శాతం మధ్య నీరసించాయి. ఫైనాన్స్ జోరు డెరివేటివ్స్లో ఐబీ హౌసింగ్, ఉజ్జీవన్, బీవోబీ, భారత్ ఫోర్జ్, కెనరా బ్యాంక్, మణప్పురం, పీఎన్బీ 8-5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు జిందాల్ స్టీల్, ఐడియా, గ్లెన్మార్క్, కాల్గేట్ పామోలివ్, ఎంఆర్ఎఫ్ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1501 లాభపడగా.. 1281 నష్టపోయాయి. డీఐఐల పెట్టుబడులు నగదు విభాగంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) మంగళవారం రూ. 2000 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2051 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 1937 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1036 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
భారత్పై సైబర్ దాడులకు పాల్పడ్డ చైనా
ముంబై : చైనాకు చెందిన హ్యాకర్లు గత ఐదు రోజుల్లో ఐటీ, బ్యాంకింగ్ రంగాలపై నలభై వేలకు పైగానే సైబర్ దాడులకు ప్రయత్నించారని మహారాష్ట్ర పోలీసు సైబర్ వింగ్ అధికారి యశస్వి యాదవ్ మంగళవారం తెలిపారు. తూర్పులద్ధాఖ్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఆన్లైన్ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ను హైజాక్ చేయడం, ఫిషింగ్ వంటి సమస్యలను సృష్టించే లక్ష్యంతో ప్రధానంగా ఈ దాడులు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. గత ఐదు రోజుల్లోనే భారత సైబర్స్పేస్లోని వివిధ వనరులపై దాదాపు 40,300 సైబర్ దాడులు జరిగినట్లు యశస్వి యాదవ్ వెల్లడించారు. చైనాలోని చెంగ్డు ప్రాంతం నుంచే ఎక్కువగా సైబర్ దాడులకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. (వాస్తవాధీన రేఖ నిర్థారణ అసాథ్యమేమీ కాదు.. ) భవిష్యత్తులో మరిన్ని ఆన్లైన్ నేరాలు జరగడానికి అవకాశం ఉందని ఇంటర్నెట్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక వాస్తవాదీన రేఖ వద్ద ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనా దేశాలు కీలకమైన ముందడుగు వేశాయి. తూర్పు లద్ధాఖ్లోని అన్ని వివాదాస్పద, ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి వెనుదిరగాలని ఏకాభిప్రాయానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. (రష్యాలో వారిద్దరు భేటీ కావడం లేదు: భారత్ ) -
ప్రైవేటు బ్యాంకుల ప్రమోటర్ల వాటాలపై సమీక్ష
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వాటి కార్పొరేట్ స్వరూపం, యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సమీక్షించనుంది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ పీకే మొహంతి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల బృందం ఈ సమీక్ష చేపడుతుందని ఆర్బీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో యాజమాన్యానికి సంబంధించి నియంత్రణలు, లైసెన్స్ నిబంధనలను సమీక్షించాలని ప్యానెల్ను ఆర్బీఐ కోరింది. యాజమాన్యం అధిక నియంత్రణ, అంతర్గత విధానాలపైనా ప్యానెల్ దృష్టి సారించనుంది. అలాగే, తొలిదశలో/లైసెన్స్ మంజూరు చేసిన తర్వాత.. అనంతరం ప్రమోటర్ల వాటాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కూడా పరిశీలించి ప్యానెల్ తగిన సిఫారసులు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో ప్రమోటర్లకు నిబంధనల కంటే అధిక వాటా ఉండగా, దీనిపై ఆర్బీఐ, బ్యాంకు మధ్య కోర్టు వెలుపల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోటక్ బ్యాంకులో ప్రమోటర్లు 26 శాతం వాటా కొనసాగించేందుకు అనుమతిస్తూ ఓటింగ్ హక్కులను 15 శాతం వాటాలకే ఆర్బీఐ పరిమితం చేసింది. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లకు ప్రమోటర్ల వాటా 40 శాతానికి.. 10 ఏళ్లకు 20 శాతానికి, 15 ఏళ్లకు 15 శాతానికి తగ్గించుకోవాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. కోటక్ బ్యాంకు మాదిరే తామూ 26 శాతానికి వాటా పెంచుకునేందుకు అనుమతించాలని ఇండస్ఇండ్ బ్యాంకు ప్రమోటర్లు అయిన హిందుజా సోదరులు ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోగా.. అందుకు కేంద్ర బ్యాంకు నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన ప్యానెల్ ఈ అంశంపై దృష్టి సారించనుంది. -
సీఈవోకు 70 ఏళ్లు..!
ముంబై: బ్యాంకింగ్ రంగంలో గవర్నెన్స్ను మెరుగుపర్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు చర్యలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం బ్యాంకుల సీఈవోలు, హోల్టైమ్ డైరెక్టర్లకు గరిష్ట వయోపరిమితి 70 ఏళ్లుగా ఉండనుంది. అలాగే ప్రమోటర్ కుటుంబానికి చెందిన వారికి గరిష్టంగా 10 ఏళ్ల పదవీకాలం ఉంటుంది. ఆ తర్వాత నిర్వహణ సారథ్య బాధ్యతలను ప్రొఫెషనల్స్కు ప్రమోటర్ గ్రూప్ అప్పగించాలి. ‘బ్యాంకుల సీఈవో/హోల్టైమ్ డైరెక్టర్ల గరిష్ట వయో పరిమితి 70 ఏళ్లుగా ఉంటుంది. ఆ తర్వాత ఆ పోస్టులో కొనసాగడానికి వీల్లేదు. అంతర్గత విధానం కింద కావాలంటే అంతకన్నా తక్కువ వయోపరిమితి కూడా నిర్దేశించుకోవచ్చు. ఇక సీఈవో లేదా హోల్టైమ్ డైరెక్టరుగా ఉన్న ప్రమోటరు లేదా ప్రధాన షేర్హోల్డరుకు కార్యకలాపాలను చక్కబెట్టేందుకు, నిర్వహణ బాధ్యతలను ప్రొఫెషనల్స్కు అప్పగించేందుకు 10 ఏళ్ల కాలం సరిపోతుంది. దీనివల్ల యాజమాన్యం, నిర్వహణ ను విడదీయడం, ప్రొఫెషనల్ నిర్వహణ సంస్కృతిని పెంపొందించడం సాధ్యపడుతుంది’ అని ఆర్బీఐ పేర్కొంది. ఈ మేరకు చర్చాపత్రాన్ని విడుద ల చేసింది. దీనిపై జూలై 15లోగా సంబంధిత వర్గా లు ఆర్బీఐకి అభిప్రాయాలు తెలియజేయాలి. మూడేళ్ల విరామం తర్వాత మరో దఫా.. ఇక ప్రమోటరు లేదా ప్రధాన షేర్హోల్డరు కాకుండా మేనేజ్మెంట్లో భాగమైనవారు సీఈవో లేదా హోల్టైమ్ డైరెక్టరుగా (డబ్ల్యూటీడీ) వరుసగా 15 ఏళ్ల పాటు కొనసాగవచ్చని వివరించింది. అటుపైన మూడేళ్లు గడిచిన తర్వాత మాత్రమే మళ్లీ సీఈవో, డబ్ల్యూటీడీ హోదాల్లో పునర్నియామకానికి వారికి అర్హత లభిస్తుందని తెలిపింది. అయితే ఈ వ్యవధిలో వారు ఏ హోదాలోను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, సలహాదారు గా గానీ సదరు బ్యాంకుకు సేవలు అందించకూడ దు. తాజా ప్రతిపాదనలు నోటిఫై చేసేటప్పటికే ప దవీకాలం ముగిసిపోయి ఉంటే వారికి అదనంగా మరో రెండేళ్ల వ్యవధినివ్వాలని లేదా ప్రస్తుత పదవీకాలం తీరిపోయే దాకా (ఏది తర్వాతైతే అది) కొనసాగించవచ్చని తదుపరి ఆర్బీఐ తెలిపింది. బ్యాంకుల్లో ప్రమాణాలను మెరుగుపర్చాల్సిందే... దేశీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం, సంక్లిష్టత పెరిగిపోతుండటమనేది బ్యాంకుల్లో గవర్నెన్స్ ప్రమాణాలను పటిష్టపర్చుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని ఆర్బీఐ చర్చాపత్రంలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాలను అమల్లోకి తేవాలనే ఉద్దేశంతో ఈ చర్యలు ప్రతిపాదించింది. -
ప్యాకేజీపై మార్కెట్ దృష్టి
దేశీయ స్టాక్ మార్కెట్కు ఈవారంలో జరిగే పరిణామాలు కీలకం. లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నందున ఈ విషమ పరిస్థితుల్లో భారీ ఆర్థిక ప్యాకేజీని మోదీ సర్కార్ ప్రకటిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం (మే1) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ఏప్రిల్ సిరీస్ ముగింపు ఈవారంలోనే.. గురువారం (30న) ఏప్రిల్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. బుధవారం సమావేశంకానున్న అమెరికా ఫెడ్.. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది. మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్, హెక్సావేర్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అంబుజా సిమెంట్స్, అదానీ పవర్ ఫలితాలను ఈవారంలోనే ప్రకటించనున్నాయి. -
ఇంటి రుణంపై ‘టాపప్’
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించారు. ఆ తర్వాత అయినా లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తారన్న విషయమై స్పష్టత లేదు. ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. నిత్యావసరాలు మినహా మిగిలిన దుకాణాలను తెరిచే పరిస్థితి లేదు. లాక్డౌన్ క్రమంగా ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులు తిరిగి ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నదీ ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారు. వేతనాల్లో కోతలను కూడా చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా ఎదురయ్యే కష్టాల నుండి గట్టెక్కేందుకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి మూడు నెలల వేతనాన్ని ఉపసంహరించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మొత్తం చాలని వారు, ఈపీఎఫ్ అవకాశం లేని వారు బ్యాంకులు ఆఫర్ చేస్తున్న టాపప్ హోమ్లోన్ను పరిశీలించొచ్చు. పర్సనల్ లోన్ కంటే ఈ టాపప్ రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండడాన్ని పరిశీలించాలి. తక్కువ వడ్డీ రేటుకే లభిస్తున్న టాపప్ హోమ్ రుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే తీసుకున్న ఇంటి రుణానికి అనుబంధంగా ఇచ్చే రుణమే టాపప్ హోమ్ లోన్. గరిష్టంగా మంజూరు చేసే రుణం, కాల వ్యవధి అనేవి బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉండొచ్చు. ప్రస్తుతం తాము ఇంటి రుణం తీసుకున్న బ్యాంకు నుంచి టాపప్ హోమ్లోన్ తీసుకోవచ్చు. లేదా ఇతర బ్యాంకు నుంచి తీసుకోవాలనుకుంటే ప్రస్తుత బ్యాంకు నుంచి ఇంటి రుణాన్ని బదలాయించుకున్న తర్వాతే అందుకు వీలు పడుతుంది. ముఖ్యంగా ఈ రుణాలపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉండడం ఆకర్షణీయమని చెప్పుకోవాలి. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ టాపప్ హోమ్లోన్పై తక్కువ రేటును వసూలు చేస్తోంది. ఎస్బీఐలో టాపప్ హోమ్ లోన్పై రేటు 7.6 శాతంగా ఉంటే, ఇతర బ్యాంకుల్లో ఇది 7.85 శాతం నుంచి ప్రారంభమవుతోంది. రుణాన్ని వినియోగించుకునే విషయంలో షరతుల్లేకపోవడం మరో అనుకూల అంశం. ఈ మొత్తాన్ని పిల్లల విద్యావసరాలు, రోజువారీ అవసరాలు, ఇంటి నవీకరణ, వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం కోసం వినియోగించుకోవచ్చు. కనుక కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు ఈ టాపప్ లోన్ అనుకూలమనే చెప్పుకోవాలి. అయితే, ‘‘లాక్డౌన్ సమయంలో ఇంటి రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇందుకోసం న్యాయ, సాంకేతిక మదింపు అవసరం అవుతుంది’’ అని రిటైల్ లెండింగ్ డాట్ కామ్ డైరెక్టర్ సుకన్యకుమార్ తెలియజేశారు. లాక్డౌన్ కాలంలోనే రుణం కావాలంటే వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చని సూచించారు. అర్హతలు... ప్రస్తుత ఇంటి రుణ గ్రహీతలు టాపప్ హోమ్లోన్ తీసుకునేందుకు అర్హులు. ఇంటి మార్కెట్ విలువ, చెల్లింపుల చరిత్ర, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ రుణ అర్హతలను నిర్ణయిస్తాయి. టాపప్ హోమ్లోన్ తీసుకునేందుకు అప్పటికే కనీసం 9 నెలల నుంచి ఏడాది కాలానికి క్రమం తప్పకుండా రుణ చెల్లింపులు చేసిన చరిత్ర ఉండాలి. కొన్ని బ్యాంకులు నిర్మాణంలో ఉన్న వాటికి కాకుండా.. నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలపైనే టాపప్ హోమ్ లోన్ను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటి మార్కెట్ విలువలో అప్పటికే తీసుకున్న రుణ మొత్తాన్ని మినహాయించి, మిగిలిన విలువలో 80% వరకు బ్యాంకులు ఈ రుణాన్ని ఇస్తున్నాయి. అయితే, కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఆస్తుల ధరలు పడిపోయాయి. దీంతో ఇంటి మార్కెట్ విలువ తగ్గి ఉంటుంది కనుక అది రుణ అర్హతలను ప్రభావితం చేయగలదు. అన్నీ చూసిన తర్వాతే... టాపప్ హోమ్ లోన్ తీసుకోవడానికి ముందు.. వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల్లో ఎలా ఉన్నాయి, ప్రాసెసింగ్ ఫీజు, రుణ కాల వ్యవధి ఈ అంశాలన్నింటినీ చూడాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రస్తుతం మీ ఇంటి రుణం ఏ బ్యాంకులో తీసుకుని ఉంటే ఆ బ్యాంకు నుంచే తీసుకోవడం సౌకర్యం. లేదంటే ఇంటి రుణాన్ని వేరే బ్యాంకుకు బదలాయించుకున్న తర్వాత రుణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇందుకోసం సమయం తీసుకుంటుంది. ఇది లాక్డౌన్ కాలం కనుక బయటకు వెళ్లి అన్ని పనులు చేసుకునే అవకాశం లేదు. కనుక ఇంటి రుణం ఇచ్చిన బ్యాంకును సంప్రదించడమే సౌలభ్యం. ముఖ్యంగా కొన్ని బ్యాంకులు టాపప్ హోమ్ లోన్ను ఆస్తిపై ఇస్తున్న రుణంగా పరిగణిస్తూ అధిక రేటును వసూలు చేస్తున్నాయి. ఈ జాబితాలో మీ బ్యాంకు కూడా ఉందేమో పరిశీలించుకోవాలి. ఒక వేళ రేటు గరిష్ట స్థాయిలో ఉంటే అప్పుడు వేరే మార్గాన్ని పరిశీలించాలి. బ్యాంకు ఆఫర్ చేస్తున్న టాపప్ హోమ్లోన్లో లాకిన్ పీరియడ్ ఉందేమో కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే లాకిన్ పీరియడ్ ఉందనుకుంటే.. ఆ కాలంలో ముందుగానే రుణాన్ని తీర్చివేయాలనుకుంటే మిగిలిన రుణ బ్యాలన్స్ మొత్తంపై బ్యాంకులు 2 శాతం చార్జీని వసూలు చేయవచ్చు. అన్ని అంశాలు తెలుసుకోవాలి రుణం ఏదైనా కానీయండి.. అది మీ చివరి ఎంపికగానే ఉండాలి. ముఖ్యంగా వేతనాల్లో కోతలు, ఉద్యోగాల్లోంచి తొలగించే ప్రస్తుత పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రుణం తీసుకున్న తర్వాత నుంచి ఈఎంఐలు మొదలవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే ముందుగా అత్యవసర నిధి ఉంటే దాన్ని వినియోగించుకోవాలి. అది లేని సందర్భాల్లో ఈక్విటీ లేదా డెట్లో పెట్టుబడులు ఉంటే వాటిని విక్రయించుకోవాలి. లేదా బంగారం ఉన్నా కానీ విక్రయించి ఈ సంక్షోభ సమయాన్ని గట్టెక్కడం మంచిది. ఇవేవీ లేని సందర్భాల్లో ఈపీఎఫ్ నుంచి మూడు నెలల వేతనాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇంటి రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్ హోమ్లోన్ కాల వ్యవధి దీర్ఘకాలంతో ఉంటుంది. అయితే, ఓ ఏడాది రెండేళ్ల తర్వాత తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఏర్పడితే.. అందుకు బ్యాంకు అవకాశం ఇస్తుందా.. జరిమానాలు, పెనాల్టీలు ఏవైనా ఉన్నాయేమో విచారించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. -
బ్యాంక్లపై కరోనా పిడుగు
ముంబై: కరోనా వైరస్ కల్లోలంతో ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం కావడం.... మన దేశపు బ్యాంక్లపై ఈ ఏడాది తీవ్రమైన ప్రభావమే చూపనున్నది. మొండి బకాయిలు 2 శాతం, వడ్డీ వ్యయాలు 1.3 శాతం మేర పెరుగుతాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తాజా నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరిస్తుందని, మరింత కాలమే ఈ వైరస్ కల్లోలం కొనసాగుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయని ఈ సంస్థకు చెందిన క్రెడిట్ ఎనలిస్ట్ గావిన్ గన్నింగ్ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ► ఈ ఏడాది ఆర్థిక రంగ కష్టాలు అంచనాలను మించి ఉంటాయి. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. దీంతో ఆర్థిక స్థితిగతులు మరింత అస్తవ్యస్తమవుతాయి. ఇది బ్యాంక్ రుణాలపై తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. ► ప్రపంచ వ్యాప్తంగా బ్యాంక్ల వడ్డీ వ్యయాలు అదనంగా 30,000 కోట్ల డాలర్లు, మొండి బకాయిలు 60,000 కోట్ల డాలర్ల మేర పెరుగుతాయి. ► కరోనా కల్లోలం కారణంగా మొదటి దశలో కార్పొరేట్ రంగమే అధికంగా కుదేలైంది. బ్యాంకింగ్ రంగానికి సెగ పెద్దగా తగల్లేదు. ఈ వైరస్ ఉధృతి నానాటికీ తీవ్రమవుతుండటంతో బ్యాంకింగ్ రంగంపై ప్రభావం తీవ్రంగానే ఉండనున్నది. ► ఈ ఏడాది చైనా బ్యాంక్ల మొండి బకాయిలు కూడా 2 శాతం మేర పెరుగుతాయి. వడ్డీ వ్యయాలు మాత్రం 1 శాతం మేర మాత్రమే పెరుగుతాయి. -
వీడని వైరస్ భయాలు
ముంబై: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతుండడం, ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందోనన్న అనిశ్చితి ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించింది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా భారత బ్యాంకింగ్ రంగం పట్ల మూడీస్ తన దృక్పథాన్ని నెగెటివ్కు తగ్గించడం పెద్ద ప్రభావాన్నే చూపించింది. బ్యాంకు స్టాక్స్లో అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఈ ప్రభావంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి (2.06%) 8,084 వద్ద క్లోజయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 674 పాయింట్లు నష్టపోయి (2.39%) 27,591 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తరలించుకుపోతుండడం, ఫలితంగా డాలర్తో రూపాయి మారకం విలువ మరో విడత 76 స్థాయికి జారిపోవడం.. ఇన్వెస్టర్లను కొనుగోళ్ల విషయమై వేచిచూసే ధోరణి అనుసరించేలా చేసినట్టు ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 2,225 పాయింట్లు (7.46%), నిఫ్టీ 576 పాయింట్లు (6.65%) చొప్పున నష్టపోయాయి. ఈ వారంలో చివరి రెండు రోజుల్లో నష్టాల కారణంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.4,82,033 కోట్ల మేర తరిగిపోయి రూ.1,08,66,723 కోట్లకు పడింది. అమ్మకాలకు దారితీసిన అంశాలు ► కరోనా వైరస్ ప్రభావం కారణంగా భారత బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోవచ్చన్న అంచనాతో ఈ రంగం అవుట్లుక్ను స్థిరం నుంచి ప్రతికూలానికి మారుస్తూ మూడీస్ నిర్ణయం తీసుకుంది. ► కరోనా పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆర్థిక మాంద్యం వస్తుందన్న ఆందోళన నెలకొంది. ► కరోనా వైరస్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై 4.1 ట్రిలియన్ డాలర్ల భారాన్ని మోపుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది. ► డాలరుతో రూపాయి విలువ శుక్రవారం 53 పైసలు నష్టపోయి 76.13 వద్ద క్లోజయింది. బ్యాంకు స్టాక్స్ బేర్... మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ భారత బ్యాంకింగ్ రంగ రేటింగ్ను నెగెటివ్కు మార్చడం, అందులోనూ కొన్ని బ్యాంకుల రేటింగ్లను తగ్గించడం ఆయా స్టాక్స్కు ప్రతికూలంగా మారింది. అత్యధికంగా ఆర్బీఎల్ బ్యాంకు 15.5 శాతం, బంధన్ బ్యాంకు 13 శాతం చొప్పున నష్టపోయాయి. సూచీల్లోని బ్యాంకు స్టాక్స్ అయిన.. యాక్సిస్ బ్యాంకు 9 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 8.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 8 శాతం, ఎస్బీఐ 6 శాతం చొప్పున పడిపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకులు 2 శాతం చొప్పున నష్టపోయాయి. కరెన్సీ మార్కెట్ల పనివేళలు తగ్గింపు ముంబై: లౌక్డౌన్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ డెట్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను వచ్చే మంగళవారం (ఈ నెల 7వ తేదీ) నుంచి కుదిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఈ మార్కెట్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఈ నెల 7 నుంచి ఉదయం 10 గంటలకు మార్కెట్లు ప్రారంభం అయి, మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తాయి. -
బ్యాంకింగ్ మోసాలు రూ. 1.17 లక్షల కోట్లు!
ఇండోర్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్కు సంబంధించి 2019 ఏప్రిల్– డిసెంబర్ మధ్య జరిగిన మోసాల విలువ రూ.1.17 లక్షల కోట్లు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెల్లడైన అంశమిది. బ్యాంకుల వారీగా చూస్తే... ► 9 నెలల్లో 4,769 కేసుల వల్ల రూ.30,300 కోట్ల నష్టాలు ఎస్బీఐకి ఎదురయ్యాయి. ► పీఎన్బీ విషయంలో కేసుల సంఖ్య 294 అయితే, నష్టం విలువ రూ.14,929 కోట్లు. ► 250 కేసుల్లో రూ.11,166 కోట్ల మోసపూరిత నష్టాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుర్కొంది. ► ఇక అలహాబాద్ బ్యాంక్ కేసుల సంఖ్య 860 అయితే, విలువ రూ.6,782 కోట్లు. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.6,626 కోట్లకు సంబంధించి 161 కేసులను ఎదుర్కొంది. ► యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 292 కేసులను ఎదుర్కొంది. విలువ రూ.5,605 కోట్లు. ► ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 151 కేసులు (రూ.5,557 కోట్లు) ఎదుర్కొంటే, ఓబీసీ విషయంలో కేసుల సంఖ్య 282 అయితే, వీటి విలువ రూ.4,899 కోట్లు. -
ప్రభుత్వ బ్యాంకులపై తగ్గుతున్న ‘మొండి’ భారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులపై మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తగ్గుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 మార్చిలో రూ.8.96 లక్షల కోట్లు ఉన్న ఈ మొండిబకాయిల భారం 2019 సెప్టెంబర్ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపారు. దేశంలో బ్యాంకింగ్ రంగ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని అన్నారు. బ్యాంకింగ్లో పాలనా వ్యవస్థ మెరుగుదల, పర్యవేక్షణ, రికవరీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆమె ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► సెప్టెంబర్ 2019తో ముగిసిన ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.2.03 లక్షల కోట్ల రికార్డు స్థాయిలో రికవరీ జరిగింది. ► ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో మొత్తం 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12 లాభాలను నమోదు చేసుకున్నాయి. ► ఏడున్నర సంవత్సరాల్లో అత్యధిక ప్రొవిజన్ కవరేజ్ రేషియో (మొండిబకాయిలకు కేటాయింపుల నిష్పత్తి) కేటాయింపులు జరిగాయి. ► బ్యాంకింగ్ వ్యవస్థ కుదుటపడుతోందని డిసెంబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రచురించిన బ్యాంకింగ్ ట్రెండ్ రిపోర్ట్ పేర్కొంది. అలాగే 2019 మార్చిలో 14.3 శాతం ఉన్న వాణిజ్య బ్యాంకుల క్యాపిటల్ అడిక్వసీ రేషియో 2019 సెప్టెంబర్ నాటికి 15.1 శాతానికి పెరిగింది. ► రియల్టీ, ఎన్బీఎఫ్సీలుసహా వివిధ విభాగాల్లో మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి దివాలా పరిష్కార పక్రియసహా తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. ► రుణ చెల్లింపుల్లో వైఫల్యం, మోసాలు, ద్రవ్య లభ్యత వంటి సవాళ్లతో తాజా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కొంత సంశయించిన విషయం వాస్తవం. అయితే ఈ సవాళ్ల పరిష్కారం దిశలో తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. పారిశ్రామిక ప్రతినిధులతో భేటీ ప్రత్యక్ష పన్ను వివాదాలపై సమీక్ష ఆర్థికమంత్రి సోమవారం పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతిపాదిత ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకంపై వారితో చర్చించారు. పన్ను బకాయిల చెల్లింపు, ఇందుకు సంబంధించి వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపు వంటి అంశా లు ఈ పథకంలో ప్రత్యేకతలు. దాదాపు రూ. 9 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు ప్రస్తుతం వివాదాల్లో ఉన్నాయి. ఆయా వివాదాల పరిష్కార లక్ష్యంగా లోక్సభలో ప్రభుత్వం గత వారం ‘‘డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ బిల్లు, 2020’’ని ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత నోటిఫై అవుతుంది. తాజా సమావేశంలో ఈ బిల్లుపై పారిశ్రామిక వర్గాలు తమ సూచనలు, సలహాలు ఇచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. -
స్తంభించిన బ్యాంకింగ్ రంగం
సాక్షి, అమరావతి: వేతన సవరణతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో లావాదేవీలు స్థంభించాయి. రాష్ట్రంలోని 4,570 ప్రభుత్వరంగ బ్యాంకుల శాఖల్లో ఒక్క లావాదేవీ కూడా జరగలేదని, సమ్మెలో 45,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ప్రకటించింది. వేతన సవరణతో పాటు, ఐదురోజుల పని దినాల అమలు వంటి డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. విజయవాడ వన్టౌన్లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (అయిబాక్) రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ గత వేతన సవరణ గడువు పూర్తయి రెండేళ్లు దాటినా ఇంత వరకు నూతన వేతన సవరణ అమలు చేయలేదన్నారు. కనీసం 20 శాతం పెంచుతూ సవరణ చేయనిదే ఉద్యోగులు అంగీకారం తెలిపే ప్రసక్తి లేదన్నారు. శనివారం విజయవాడ ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టాలి
మొండిబాకీల సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కొంత గాడిలోకి వస్తున్న బ్యాంకింగ్ రంగం రానున్న బడ్జెట్లో భారీస్థాయి ఆశలేవీ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే మూలధన నిధులను అందించడం, బలహీన బ్యాంకులను విలీనం చేయడం తదితర చర్యలతో ప్రభుత్వం తన ప్రాధాన్యతలను చెప్పకనేచెప్పింది. అయితే, ఎన్పీఏ భయాలతో కార్పొరేట్ రంగానికి రుణాలను ఇచ్చేందుకు ఇప్పటికీ బ్యాంకులు జంకుతున్నాయి. ఈ తరుణంలో బడ్జెట్లో బ్యాంకులు ఏం కోరుకుంటున్నాయి? ఈ రంగంలో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం... హౌసింగ్కు ప్రోత్సాహకాలివ్వాలి... ‘ఆర్థిక రంగానికి బ్యాంకులు జీవనరేఖ లాంటివి. ఎకానమీ పుంజుకుంటే ముం దుగా లాభపడేవి బ్యాంకులే. అందుకే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలను బడ్జెట్లో చేపడతారని భావిస్తున్నాం. అయితే, నేరుగా బ్యాంకులకు సంబంధించి భారీ ప్రకటనలేవీ ఉండకపోవచ్చు’ అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శ్యామ్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. కీలకమైన రంగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే లక్ష్యంగా బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఇందులో విఫలమైతే మున్ముందు నిరుద్యోగం మరింతగా పెరుగుతుంది. నాన్బ్యాంకింగ్ సంస్థల ద్వారా నేరుగా రుణాలిచ్చిన తనఖాల్లేని రుణాలు(అన్సెక్యూర్డ్)తో బ్యాంకుల రిస్కులు మరింత తీవ్రం అవుతాయి’ అని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇప్పటికే మంచి కార్పొరేట్ కంపెనీల నుంచి రుణాలకు సంబంధించి డిమాండ్ ఘోరంగా పడిపోవడంతో దీన్ని భర్తీ చేసుకోవాడానికి రిటైల్ రుణాలపై బ్యాంకులు అత్యధికంగా దృష్టిసారిస్తున్నాయి. ‘వాహన, గృహ రుణాలకు సంబంధించి ఎలాంటి ఆందోళనా లేదు. అయితే, వ్యక్తిగత రుణాల చెల్లింపుల్లో మొండి బాకీలు గనుక పెరిగాయంటే బ్యాంకింగ్కు కొత్త సమస్యలు తప్పవు’ అని మరో బ్యాంక్ అధికారి అభిప్రాయపడ్డారు. ఇంకా ఏం ఆశిస్తున్నారంటే... ► హౌసింగ్ రంగానికి ప్రోత్సాహం ఇచ్చే చర్యలు తీసుకోవాలి. దీనివల్ల బ్యాంకింగ్కు పరోక్షంగా ప్రయోజం ఉంటుంది. ► నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.25,000 కోట్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి(ఏఐఎఫ్)ను మరింతగా పెంచాలి. దీనివల్ల రియల్టీ రంగం పునరుత్తేజంతో పాటు బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీల సమస్యలకు కూడా అడ్డుకట్టపడుతుంది. ► ద్రవ్యలోటు కట్టడితో పాటు బడ్జెట్లో ప్రకటించబోయే ఇతరత్రా విధానపరమైన చర్యల ఆధారంగానే... ఆర్బీఐ తదుపరి పాలసీ చర్యలు(వడ్డీరేట్ల విషయంలో) ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీరేట్ల తగ్గింపునకు గత పాలసీ సమీక్షలో ఆర్బీఐ విరామం ప్రకటించింది. తదుపరి సమీక్ష ఫిబ్రవరి 6న జరగనుంది. ► ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లకు సంబంధించి పాక్షిక హామీ పథకం(పీసీజీ)ని ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది. సంక్షోభంతో నిధుల సమస్యలను ఎదుర్కొంటున్న ఎన్బీఎఫ్సీలకు ద్రవ్య సరఫరా పెంచేందుకు కేంద్రం ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. -
క్యూ3, క్యూ4లలో బ్యాంకింగ్కు వెలుగురేఖలు!
ముంబై: భారత్ బ్యాంకింగ్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో చక్కటి ఫలితాలు నమోదుచేసుకునే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజ్నీష్ కుమార్ విశ్లేషించారు. భారీ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దీనికి ప్రధాన కారణమనీ వివరించారు. రుణాలకు సంబంధించి ఎడిల్వీస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. కొన్ని కీలక అంశాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే... రుణ వృద్ధి ‘పరుగు’ కష్టమే! ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలాన్ని (2019 ఏప్రిల్–సెప్టెంబర్) 2018లోని ఇదే కాలంతో పోలిస్తే ఎస్బీఐకి సంబంధించినంతవరకూ రుణ వృద్ధిలేకపోగా ప్రతికూలత నమోదయ్యింది. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ మాత్రం ఈ పరిస్థితి మెరుగుపడింది. వార్షిక ప్రాతిపదికన రుణ వృద్ధి దేశీయంగా 5 శాతానికి తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్కు సంబంధించి ఈ శాతం 7గా ఉంది. మరికొంత కాలం రుణ వృద్ధి మందగమనంలోనే ఉండే అవకాశం ఉంది. 2018–19లో మొత్తం బ్యాంకింగ్ రుణ వృద్ధిరేటు 13.3 శాతం. అయితే 2019 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో అంతకు ముం దటి ఏడాదితో పోలి్చచూస్తే పెరుగుదల 7.1 శాతం మాత్రమే. విలువ రూపంలో రూ.92.87 లక్షల కోట్ల నుంచి రూ.99.47 లక్షల కోట్లకు చేరింది. 2019–20లో రుణ వృద్ధిరేటు అరవై సంవత్సరాల కనిష్టస్థాయి 6.5 – 7 శాతానికి పడిపోయే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా ఇటీవలే ఒక నివేదికలో పేర్కొంది. రుణ మంజూరీల విషయం లో బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ►చమురు గ్యాస్, సోలార్, రహదారుల రంగాల నుంచి బ్యాంకులకు రుణాల డిమాండ్ వస్తోంది. ►అమెరికా–ఇరాన్ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీస్తాయి. ఇది కరెంట్ అకౌంట్లోటు, కరెన్సీ విలువపైనా ప్రభావం చూపే అంశం. ► కొన్ని ప్రతికూలతలు ఉన్నా మొత్తంగా ప్రభుత్వ ఫైనాన్షియల్ పరిస్థితులు బాగున్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు (జీడీపీలో 3.3 %) కట్టడిలో ఉండాలని డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ప్రభుత్వం పట్టంచుకుంటుందని భావించడం లేదు. 2019– 20 ఆరి్థక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3%) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు(బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి) చేరింది. -
ఇంటికే డబ్బులు తెచ్చిస్తారు
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు శుభవార్త. ఇకపై వీరంతా నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టాల్సిన పని లేదు. బ్యాంక్ పాస్బుక్, విత్ డ్రా ఫామ్, ఏటీఎం కార్డులూ అవసరం లేవు. ఇంట్లో ఉండే నగదు డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటారా?.. మీ మొబైల్ లేదా ల్యాండ్లైన్ ద్వారా పోస్టల్ టోల్ ఫ్రీ నంబర్ 155299కు ఫోన్ చేసి రిక్వెస్ట్ పంపితే చాలు. మీ ఏరియా పోస్ట్మేన్ ‘మొబైల్ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటికే వస్తారు. ఆయన అడిగిన వివరాలు అందిస్తే చాలు.. అవసరమైన మొత్తాన్ని కనీసం రూ.100 నుంచి రూ.10 వేల వరకు పొందవచ్చు. బ్యాలెన్స్, లావాదేవీల వివరాలూ తెలుసుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితమే.. సాక్షి, సిటీబ్యూరో : పోస్టల్ శాఖ ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడాకే పరిమితం కాకుండా.. మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొంటోంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. గతేడాది ‘ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్’ పేరుతో బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన తపాలా శాఖ పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా సేవలను అందిస్తోంది. ఇప్పటి వరకు పోస్టాఫీస్కు వెళ్లలేని మహిళలు, వృద్ధులు, దివ్యాంగులైన ఐపీపీబీ ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలందిస్తూ వచ్చిన తపాలా శాఖ ఇటీవల వివిధ బ్యాంక్ల ఖాతాదారులకు సైతం ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హెడ్, సబ్ పోస్టాఫీసుల ద్వారా కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్’ ద్వారా ఏ బ్యాంక్లో ఖాతా ఉన్నా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించిన తపాలా శాఖ తాజాగా ఇంటి ముంగిటకు ఆధార్ ఏటీఎం పేరుతో సేవలను విస్తరించింది. మొబైల్ మైక్రో ఏటీఎంలు తపాలా శాఖ హైదరాబాద్ నగర పరిధిలోని 950 మంది పోస్ట్మేన్లకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంపై శిక్షణనిచ్చింది. మొబైల్ ఫోన్లలో మైక్రో ఏటీఎం యాప్లను డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్లను సైతం అందజేసింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉత్తరాలు బట్వాడా చేసే వీరంతా అవసరమైన వారికి ఆధార్ ఏటీఎంల ద్వారా సేవలందిస్తున్నారు. ఆధార్ ఏటీఎం సేవలు ఇలా.. - 155299 నంబర్కు రిక్వెస్ట్ పంపగానే, ఆ ఏరియా పోస్ట్మేన్ ‘మొబైల్ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటి వద్దకు వస్తారు. - పోస్ట్మేన్ మీ పేరు, మొబైల్ నంబరు తీసుకుని ఎంటర్ చేయగానే, మీ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే ఆధార్ నంబర్ అడుగుతుంది. - అది నమోదు చేయగానే కావల్సిన నగదు, బ్యాంక్ పేరు అడుగుతుంది. నగదు మొత్తం ఎంటర్ చేసి, ఖాతా కలిగిన బ్యాంక్ పేరును ఎంపిక చేసుకోవాలి (ఆధార్తో ఆ బ్యాంక్ ఖాతా అనుసంధానమై ఉండాలి). - ఆపై బయోమెట్రిక్ అందిస్తే.. అది ఆమోదం కాగానే నగదు విత్ డ్రా, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ విచారణ, ఫుల్ మనీ ఆప్షన్లు వస్తాయి. - ఉదాహరణకు నగదు విత్ డ్రా ఆప్షన్ ఎంచుకుంటే.. నగదు మొత్తం ధ్రువీకరణ కోసం మరోమారు బయోమెట్రిక్ అందించాలి. - ఈ ప్రక్రియ పూర్తి కాగానే, పోస్ట్మేన్ ఆ నగదు అందజేస్తారు. ఏరియా పోస్ట్మేన్లను అడిగితే చెబుతారు ఏరియా పోస్ట్మేన్లను సంప్రందించి ఇంటి ముంగిటే ఆధార్ ఏటీఎంల సేవలు పొందవచ్చు. బ్యాంక్, ఏటీఎంలకు వెళ్లలేని వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండదు. టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే మీ ఏరియా పోస్ట్మేన్ అందుబాటులోకి వస్తారు. – జయరాజ్, చీఫ్ పోస్ట్మాస్టర్, జనరల్ పోస్టాఫీసు, హైదరాబాద్ -
‘అప్పు’డే వద్దు!
ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్ బలహీనంగా ఉందనడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనానికి బలమైన నిదర్శనంగా బ్యాంకింగ్ రుణ వృద్ధి ఘోరంగా పడిపోతోంది. సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి(15 రోజుల వ్యవధి) రుణ వృద్ధి రేటు సింగిల్ డిజిట్కు పరిమితమైంది. వృద్ధి ఈ స్థాయికి పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి (అప్పటికి వార్షిక ప్రాతిపదికన చూస్తే) బ్యాంకింగ్ రుణాలు 97.71 లక్షల కోట్లు. ► 2018 ఇదే కాలానికి రుణాల పరిమాణం రూ.89.82 లక్షల కోట్లు. ► అంటే వృద్ధి రేటు 8.79 శాతమన్నమాట. ► వృద్ధి రేటు సింగిల్ డిజిట్కు పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ► 2019 సెప్టెంబర్ 13 ముగిసిన పక్షం రోజులకు చూస్తే, రుణాల పరిమాణం రూ.97.01 లక్షల కోట్లుగా ఉంది. 2018 ఇదే కాలంలో పోల్చితే వృద్ధి రేటు 10.26 శాతంగా ఉంది. డిపాజిట్లూ మందగమనమే... ఇక బ్యాంకుల్లో డిపాజిట్ల విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా వృద్ధిరేటు మందగమనంలోకి జారిపోయింది. 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షం రోజులకు డిపాజిట్లు రూ. 129.06 లక్షల కోట్లు. 2018 ఇదే కాలానికి ఈ మొత్తం రూ.118 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 9.38 శాతంగా ఉంది. 2019 సెప్టెంబర్ 13తో ముగిసిన పక్షం రోజులకు చూస్తే, వృద్ధి రేటు 10.02 శాతంగా ఉంది. -
బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగానే ఉంది: ఆర్బీఐ
ముంబై: దేశ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా, సుస్థిరంగానే ఉందని, వదంతుల ఆధారంగా భయపడిపోవాల్సిన పని లేదని దేశ ప్రజలకు భరోసానిస్తూ ఆర్బీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకులో సంక్షోభంతోపాటు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రతికూల వార్తలు చలామణి అవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘కొన్ని బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకుల పట్ల వదంతులు చలామణి అవుతున్నాయి. ఇవి డిపాజిటర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగా, స్థిరంగా ఉందని, ఈ వదంతులను విని భయపడిపోవాల్సిన అవసరం లేదని సాధారణ ప్రజలకు ఆర్బీఐ హామీ ఇస్తోంది’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు మంగళవారం స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ రంగ స్టాక్స్ సైతం తీవ్ర నష్టాల పాలయ్యాయి. -
కస్టమర్ల దగ్గరకే బ్యాంకులు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ను పురస్కరించుకుని వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రుణ మేళాలు నిర్వహించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదేశించిన నేపథ్యంలో... 3వ తేదీ నుంచి తొలి దశలో 250 జిల్లాల్లో రుణ మేళాలు ఆరంభం కాబోతున్నాయి. ఎన్బీఎఫ్సీ సంస్థలతో కలసి బ్యాంకులు వీటిని నిర్వహించనున్నాయి. రిటైల్ కస్టమర్లు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (ఎంఎస్ఎంఈ).. వ్యవసాయ, వాహన, గృహ, విద్యా, వ్యక్తిగత రుణాలను ఈ మేళాల్లో భాగంగా ఆఫర్ చేయనున్నాయి. రెండో దశలో 150 జిల్లాల్లో ఈ నెల 21 నుంచి 25వ తేదీల మధ్య రుణ మేళాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 400 జిల్లాల్లో కస్టమర్లకు చేరువకానున్నాయి. బ్యాంకు సేవలను కస్టమర్లకు చేరువగా తీసుకెళ్లడంతోపాటు మార్కెట్లో రుణ లభ్యత పెంచడమే ఈ చర్యల వెనుకనున్న ఉద్దేశ్యం. దీనివల్ల వ్యవస్థలో వినియోగం పెరిగి దేశ వృద్ధి పుంజుకుంటుందని భావించిన కేంద్ర ఆర్థిక శాఖ రెండు వారాల క్రితం ప్రభుత్వరంగ బ్యాంకులకు ఈ దిశగా సూచనలు చేసింది. -
ఒక్క ఉద్యోగం కూడా పోదు..
న్యూఢిల్లీ: బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయన్న ఉద్యోగ సంఘాల వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. విలీనాలతో ఏ ఒక్క ఉద్యోగం కూడా పోదని స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే. గత శుక్రవారం ఏం చెప్పానో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ ఒక్క ఉద్యోగి తొలగింపు ఉండబోదని నేనప్పుడే స్పష్టం చేశాను‘ అని కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ఏ బ్యాంకు కూడా మూతబడదని, వినూత్నంగా కొత్త ప్రయోగాలేవో చేయాలంటూ బ్యాంకులనేమీ ఒత్తిడి చేయడం లేదన్నారు. ‘బ్యాంకులకు మరింత మూలధనం ఇస్తున్నాం. ఇప్పటిదాకా చేస్తున్న కార్యకలాపాలే ఇకపైనా చేయాల్సి ఉంటుంది. అంతే‘ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పది బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విలీనాలతో ఉద్యోగాలు పోతాయని, అలహాబాద్ బ్యాంకుతో విలీనం కారణంగా ఇండియన్ బ్యాంకు మూతబడుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మలా సీతారామన్ వీటిపై స్పందించారు. బ్యాంకులు మరింతగా రుణాలివ్వాలని, మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలనే వాటికి అదనపు మూలధనాన్ని సమకూరుస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని రంగాలూ పరిశీలిస్తున్నాం.. ఎకానమీ మందగమనంలోకి జారుకుంటోందా అన్న ప్రశ్నలపై స్పందిస్తూ.. ప్రభుత్వం ఒక్కో రంగం అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఏ రంగమైనా ప్రభుత్వం వద్దకు వస్తే.. సావధానంగా వింటాం. అవి కోరుకునే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుంటాం. తగు రీతిలో స్పందిస్తాం‘ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఇలా చేశామని, అవసరాన్ని బట్టి ఇది పునరావృతమవుతుందని మంత్రి చెప్పారు. సంక్షోభంలో కుదేలవుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఉదహరిస్తూ.. ఈ రంగం ప్రస్తుతం బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణమైన ఇంజిన్లు, ఆటోపరికరాల తయారీకి సంబంధించి పరిణామక్రమంలో ఉందని తెలిపారు. ఈ ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2020 మార్చి 31 తర్వాత బీఎస్–4 ప్రమాణాల వాహనాలేవీ ఉత్పత్తి చేయొద్దంటూ నిర్దేశించినది..సుప్రీం కోర్టని, ప్రభుత్వం కాదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక జీఎస్టీ తగ్గించాలన్న ఆటోమొబైల్ కంపెనీల విజ్ఞప్తిపై జీఎస్టీ మండలే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అన్ని రంగాల సమస్యలనూ ఒక్క దెబ్బతో పరిష్కరించేసే మంత్రదండమేదీ లేదని, రంగాలవారీగా ఆయా సంస్థల విజ్ఞప్తులను బట్టే ప్రభుత్వం స్పందిస్తోందని వివరించారు. ‘ఆటోమొబైల్ రంగం సమస్యలు వేరు.. వ్యవసాయ రంగం సమస్యలు వేరు. ఇలా ఒక్కో రంగం సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి. దానికి తగ్గట్లే స్పందన ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఊతం .. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం చేయడమనేది.. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. ‘తదుపరి దశ వృద్ధి సాధన కోసం దేశానికి పెద్ద బ్యాంకులు కావాలి. శుక్రవారం చేసిన మెగా బ్యాంకుల ప్రకటన ఆ లక్ష్య సాధన కోసమే. భారీ స్థాయిలో మూలధనం, వ్యాపార పరిమాణం, అధిక వృద్ధి సాధనకు తోడ్పడే భారీ బ్యాంకులు ఇప్పుడు మనకు ఆరు ఉన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం ఈ బ్యాంకుల విస్తృతి మరింత పెరుగుతుందని, రుణ వితరణ సామర్ధ్యం మెరుగుపడుతుందని, వినూత్న సాధనాలు ..టెక్నాలజీతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించగలవని రాజీవ్ కుమార్ తెలిపారు. పెద్ద బ్యాంకుల అవసరాలకన్నా 0.25 శాతం అధికంగానే ప్రభుత్వం మూలధనం సమకూర్చిందని పేర్కొన్నారు. ‘ఆయా బ్యాంకుల బోర్డుల సన్నద్ధతపైనే విలీన తేదీ ఆధారపడి ఉంటుంది. అది జనవరి 1న కావచ్చు.. లేదా ఏప్రిల్ 1న కావొచ్చు. ఏదైనా గానీ ఏప్రిల్ 1 లోగానే ఇది జరుగుతుంది‘ అని రాజీవ్ తెలిపారు. -
‘ఆంధ్రా బ్యాంక్ను విలీనం చేయొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంకును, యూనియన్ బ్యాంకులో విలీనం చేయవద్దంటూ మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా వుందన్నారు. స్వాతంత్ర్యం రాక మునుపే 90 ఏళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతానికి చెందిన పట్టాభి రామయ్య ఆంధ్ర బ్యాంకును స్థాపించారన్నారు. ఇంతటి ప్రాచీన చరిత్ర ఉన్న ఆంధ్రా బ్యాంకును వేరే బ్యాంకుతో కలపవద్దని లేఖలో విన్నవించారు. తెలుగు ప్రజల మనోభావాలకు అద్దం పట్టే ఈ సునిశితమైన అంశంపై నిర్మలా సీతారామన్ మరోసారి ఆలోచించాలని కోరారు. అదే విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రా బ్యాంకును విలీనం చేయాల్సి వస్తే.. విలీనమైన బ్యాంకుకు ‘ఆంధ్రా బ్యాంకు’గానే నామకరణం చేయాలని బాలశౌరి ప్రతిపాదించారు. అంతేకాక సదరు బ్యాంకు ప్రధాన కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే ఈ అంశంపై ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్తో పాటు బ్యాంకింగ్ సెక్రటరీని కలుస్తానన్నని బాలశౌరి పేర్కొన్నారు. (చదవండి: బ్యాంకింగ్ బాహుబలి!) -
బ్యాంకింగ్ రంగంలో భారీ విలీనాలు
-
బ్యాంకింగ్ బాహుబలి!
బంపర్ మెజారిటీతో రెండోసారి అధికార పగ్గాలు దక్కించుకున్న మోదీ సర్కారు.. సంస్కరణల మోత మోగిస్తోంది. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఇటీవలే ఉద్దీపనలతో చికిత్స చేసిన కేంద్రం... తాజాగా ‘ఎఫ్డీఐ 2.0’ ద్వారా దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బ్యాంకింగ్ రంగంలో మెగా విలీనాలకు తెరతీసింది. మొండి బాకీలతో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు దివ్యౌషధం లాంటి చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తం 10 బ్యాంకులను విలీనం చేసి 4 బ్యాంకులకు పరిమితం చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి ఇప్పుడు 12కు చేరనుంది. ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీయీకరణ జరిగి ఈ ఏడాదికి 50 ఏళ్లు అయిన తరుణంలో ప్రభుత్వ బ్యాంకులను భారీస్థాయిలో విలీనం చేసి వాటి సంఖ్యను పరిమితం చేసేలా కీలక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం చేపట్టడం గమనార్హం. మొత్తం మీద దాదాపు నెల రోజుల వ్యవధిలోనే అటు కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వంటి సంచలన నిర్ణయంతో పాటు ఇటు ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా సాహసోపేతమైన చర్యలు వెలువడటం విశేషం. న్యూఢిల్లీ: ఎస్బీఐ, బీవోబీల్లో ఇతర బ్యాంకుల విలీనాలకు కొనసాగింపుగా మరిన్ని భారీ బ్యాంకులు ఏర్పాటు చేస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా పది బ్యాంకుల విలీనాన్ని ప్రకటించింది. దీని ప్రకారం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) ఆరు విలీనం కానున్నాయి. దీంతో పీఎస్బీల సంఖ్య 12కి తగ్గనుంది. వీటి వ్యాపార పరిమాణం ఏకంగా రూ. 55.81 లక్షల కోట్లుగా ఉండనుంది. 2017లో పీఎస్బీల సంఖ్య 27గా ఉండేది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. అలాగే పీఎస్బీల్లో గవర్నెన్స్పరమైన పలు సంస్కరణలను కూడా ఆవిష్కరించారు. బోర్డులకు స్వయంప్రతిపత్తి ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘మేనేజ్మెంట్ జవాబుదారీతనాన్ని పెంచే దిశగా.. జీఎం నుంచి ఎండీ దాకా అందరి పనితీరు గురించి జాతీయ బ్యాంకుల బోర్డు కమిటీ మదింపు చేస్తుంది‘ అని ఆమె తెలిపారు. 10 బ్యాంకుల ఖాతాలను పటిష్టంగా మార్చేందుకు రూ. 52,250 కోట్ల మేర నిధులు అందించనున్నట్లు వివరించారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్, రాజీవ్ కుమార్ బ్యాంక్ల విలీనం నెక్ట్స్జెన్ బ్యాంకులతో వృద్ధికి ఊతం .. ‘దేశవ్యాప్తంగా పటిష్టమైన నెట్వర్క్, అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలుండే బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కార్యకలాపాల వృద్ధితో ఆయా బ్యాంకులకు మరిన్ని వనరులు అందుబాటులోకి వస్తాయి. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశం ఉంది. నెక్ట్స్జనరేషన్ బ్యాంకులను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద పన్ను సర్చార్జీల తొలగింపు, బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ పెంచడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. అలాగే, బొగ్గు మైనింగ్ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడి నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఉద్దీపన ప్యాకేజీలాంటిదేమైనా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఇవన్నీ కూడా ఎకానమీని మందగమనం కోరల నుంచి బయటపడేయగలవని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు.. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) లాభదాయకత మెరుగుపడుతోంది. పీఎస్బీల్లో అమలు చేస్తున్న సంస్కరణలు ఫలితాలివ్వడం మొదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 14 బ్యాంకులు లాభాలు నమోదు చేశాయి. ► 2018 డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 8.65 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం స్థూల మొండిబాకీలు 2019 మార్చి ఆఖరు నాటికి రూ. 7.9 లక్షల కోట్లకు తగ్గాయి. ► పాక్షిక రుణ హామీ పథకం అమలుతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణాల సంస్థల (హెచ్ఎఫ్సీ)కు నిధులపరమైన తోడ్పాటు మెరుగుపడింది. ఇప్పటికే రూ. 3,300 కోట్ల మేర నిధులు అందించగా, మరో రూ. 30,000 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. ► నీరవ్ మోదీ తరహా మోసాలను నివారించేందుకు స్విఫ్ట్ మెసేజింగ్ వ్యవస్థను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్కు (సీబీఎస్)కు అనుసంధానించడం జరిగింది. ► విలీనానంతరం వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆయా బ్యాంకుల బోర్డులు చీఫ్ జనరల్ మేనేజర్లను ఏర్పా టు చేసుకోవచ్చు. చీఫ్ రిస్క్ ఆఫీసర్లను కూడా నియ మించుకోవాల్సి ఉంటుంది. ► సమర్ధులను ఆకర్షించేందుకు మార్కెట్కు అనుగుణమైన ప్యాకేజీని ఇవ్వొచ్చు. స్వతంత్ర డైరెక్టర్ల సిటింగ్ ఫీజు నిర్ణయించుకునే వెసులుబాటు బ్యాంకు బోర్డులకు ఉంటుంది. మొత్తం మెగా బ్యాంకులు: 6 ఎస్బీఐ బీవోబీ పీఎన్బీ కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగిలిన చిన్న బ్యాంకులు: 6 బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూకో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ బందరు బ్యాంకు.. ఇక కనుమరుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించిన మన ఆంధ్రా బ్యాంకు తాజా బ్యాంకుల విలీన ప్రతిపాదనతో ఇక కనుమరుగు కానుంది. మరో నాలుగేళ్లలో వందేళ్లు పూర్తి చేసుకోనుండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. బందరు బ్యాంకు అని కూడా అభిమానంగా పిల్చుకునే ఆంధ్రా బ్యాంకును ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య .. 1923లో మచిలీపట్నంలో ప్రారంభించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్కు ప్రధాన కార్యాలయం మారింది. 1980లలో జరిగిన రెండో విడత బ్యాంకుల జాతీయీకరణతో ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. అయితే, కొన్నాళ్లుగా మొండిబాకీలు పేరుకుపోయి ఆంధ్రాబ్యాంకు అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. మరో బ్యాంకులో విలీనం చేస్తారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో విలీనంతో వాటికి తెరపడింది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్.. ఎస్బీఐలో విలీనం కావడంతో మొత్తానికి తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే రెండు బ్యాంకులు కనుమరుగయినట్లే. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రా బ్యాంకుకు 2,885 దాకా శాఖలు, 3,798 ఏటీఎంల నెట్వర్క్ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 2,19,853 కోట్లు. రుణాలు రూ. 1,58,848 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 2,54,044 కోట్లు. భారీ బ్యాంకుల సత్తా ఇది.. ‘5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సాధించే దిశగా భారీ బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్న విషయం ఈ విలీనాల ప్రతిపాదనలతో తెలుస్తోంది. వేగం గా వృద్ధి చెందుతున్న మనలాంటి దేశం.. రు ణాల అవసరాలను తీర్చేందుకు భారీ బ్యాం కులు మరింత సన్నద్ధంగా ఉంటాయి. పదే పదే ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతం గా నిధులను కూడా సమీకరించుకోగలవు‘ – రజనీష్ కుమార్, చైర్మన్, ఎస్బీఐ వారానికో సంస్కరణ టానిక్.. ‘బ్యాంకుల విలీన ప్రకటన నా వారాంతపు ప్రణాళికలను మార్చేసింది. చేయాల్సిన పని బోలెడంత ఉంది. అయితేనేం.. నేను చాలా ఆశావహంగా ఉన్నాను. విలీన ప్రతిపాదనలు స్వాగతిస్తున్నా. ప్రస్తుతం మనకు ’వారానికో సంస్కరణ’ టానిక్కు కావాల్సిందే‘ – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ ఆలనాటి ఆంధ్రాబ్యాంక్ విలీన బ్యాంకుల సంగతి ఇదీ... కార్పొరేషన్ బ్యాంకు సుమారు 113 ఏళ్ల క్రితం 1906లో కార్పొరేషన్ బ్యాంకు ఏర్పాటైంది. మంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం 2,600 పైచిలుకు సీబీఎస్ బ్రాంచీలు, 3,000 పైగా ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. రూ. 1,84,564 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,21,251 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 2,13,624 కోట్లు. యూనియన్ బ్యాంకు సుమారు 99 ఏళ్ల క్రితం 1919లో ఏర్పాటైంది. ముంబై కేంద్రంగా పనిచేస్తోంది. 4,300 పైగా శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 4,17,505 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 2,98,780 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 4,98,580 కోట్లు. కెనరా బ్యాంకు కెనరా బ్యాంక్ హిందు పర్మనెంట్ ఫండ్గా 1906లో ఏర్పాటైన ఈ బ్యాంకు 1910లో కెనరా బ్యాంక్ లిమిటెడ్గా మారింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకుకు సుమారు 6,310 శాఖలు, 8,851 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. రూ. 5,99,123 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 4,28,114 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 7,11,783 కోట్లు. సిండికేట్ బ్యాంకు కెనరా ఇండస్ట్రియల్ అండ్ బ్యాంకింగ్ సిండికేట్గా 1925లో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత సిండికేట్ బ్యాంక్గా మారింది. కర్ణాటకలోని మణిపాల్ కేంద్రంగా పనిచేస్తోంది. సుమారు 4,063 శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,59,883 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 2,05,044 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 3,12,971 కోట్లు. అలహాబాద్ బ్యాంకు సుమారు 154 ఏళ్ల క్రితం 1865లో ఈ బ్యాంకు ఏర్పాటైంది. కోల్కతా కేంద్రంగా పనిచేస్తోంది. గతేడాది మార్చి నాటి గణాంకాల ప్రకారం సుమారు 3,503 శాఖలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,14,330 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,42,212 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 2,49,577 కోట్లు. ఇండియన్ బ్యాంకు దాదాపు 112 ఏళ్ల క్రితం 1907లో ఏర్పాటైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది. 2,900 దాకా శాఖలు, 2,861 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 2,42,041 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,81,262 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 2,80,388 కోట్లు. పీఎన్బీ నూట పాతికేళ్ల క్రితం 1894లో పీఎన్బీ ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. గతేడాది అక్టోబర్ దాకా గల గణాంకాల ప్రకారం సుమారు 7,000 పైగా శాఖలు, 10,681 ఏటీఎంల నెట్వర్క్ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 6,81,874 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 4,62,416 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 7,89,266 కోట్లు. (కన్సాలిడేటెడ్ గణాంకాలు) ఓబీసీ స్వాతంత్య్రం రావడానికి కొన్నాళ్ల ముందుగా 1943లో లాహోర్లో ఏర్పాటైంది. ప్రస్తుతం గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దాదాపు 2,700 శాఖలు, 2,621 ఏటీఎంల నెట్వర్క్ ఉంది. మొత్తం డిపాజిట్లు రూ. 2,32,645 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 1,59,285 కోట్లు. మొత్తం అసెట్స్ రూ. 2,71,910 కోట్లు. యునైటెడ్ బ్యాంక్ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నాలుగు బెంగాలీ బ్యాంకుల విలీనంతో 1950లో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. కోల్కతా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం 1,999 శాఖలు, కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు రూ. 1,34,983 కోట్లు కాగా ఇచ్చిన రుణాలు రూ. 66,955 కోట్లు. మొత్తం అసెట్స్ రూ.1,51,530 కోట్లు. -
సహకార బ్యాంకుల ‘టెక్’ బాట!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరుగుతుండటంతో పట్టణ ప్రాంత సహకార బ్యాంకులు (యూసీబీ) కూడా డిజిటల్ బాట పడుతున్నాయి. స్మార్ట్ఫోన్లు, హైస్పీడ్ కనెక్టివిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ వంటివి ప్రాచుర్యంలోకి వస్తుండటంతో కేవలం శాఖలకు మాత్రమే పరిమితమైతే కుదరదని యూసీబీలు గ్రహిస్తున్నాయి. టెక్నాలజీ వైపు మళ్లక తప్పదని ఇప్పటికే గుర్తించినా... డిజిటల్ చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. 1966లో యూసీబీలను క్రమబద్ధీకరించి, నియంత్రణ సంస్థ పరిధిలోకి తెచ్చారు. అప్పటి నుంచీ అవి క్రమంగా సేవలు మెరుగుపర్చుకుంటూ వస్తున్నాయి. కానీ ఆర్థికంగా బలంగా లేని యూసీబీల సంఖ్య తగ్గుతోంది. గతేడాది రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2004లో 1,926 యూసీబీలుండగా.. 2018 మార్చి ఆఖరు నాటికి ఈ సంఖ్య 1,551కి పడిపోయింది. స్థూల మొండిబాకీలు 25 శాతం స్థాయి నుంచి 10 శాతం దిగువకు వచ్చాయి. ప్రక్షాళనతో సంస్థలు నిలదొక్కుకుంటున్నప్పటికీ.. భవిష్యత్లోనూ మనుగడ సాగించేందుకు టెక్నాలజీ బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది. దేశీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 2017లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏకంగా 19.1 బిలియన్ డాలర్ల మేర ఖర్చు పెట్టాయి. ఇప్పటికే ఉన్న ఇన్ఫ్రాను అప్గ్రేడ్ చేసుకోవడం, కొత్త ఇన్ఫ్రా ఏర్పాటుకు ఈ నిధులు వెచ్చించినట్లు 2017 నవంబర్లో గార్ట్నర్ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. అయితే యూసీబీ రంగానికి సంబంధించి ఇలాంటి గణాంకాలేమీ అందుబాటులో లేవు. కొత్త తరహా బ్యాంకింగ్ శరవేగంగా వాస్తవ రూపం దాలుస్తున్న నేపథ్యంలో యూసీబీలు సైతం వేగంగా డిజిటల్ వైపు మళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, ఈ క్రమంలో అనేక సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. చౌకగా హోస్టింగ్ సేవలు.. సాధారణంగా చిన్న బ్యాంకులకు సొంతగా క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్ను తయారు చేసుకునేంత ఆర్థిక సామార్ధ్యాలు ఉండవు. ఈ విషయం వాటిక్కూడా తెలుసు. అందుకే టెక్నాలజీ కంపెనీలు ఆఫర్ చేసే హోస్టింగ్ సర్వీసులపై మొగ్గు చూపుతున్నాయి. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) విధానంలో బ్యాంకులకు కావాల్సిన సొల్యూషన్స్ను టెక్నాలజీ సంస్థలు అందిస్తాయి. బ్యాంకులు ఎంచుకునే మాడ్యూల్కు సంబంధించి లావాదేవీకి ఇంతని టెక్ సంస్థలు చార్జ్ చేస్తాయి. సహకార బ్యాంకులకు ఈ విధానం అనువైనదిగా ఉండగలదని ఐ–ఎక్సీడ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఈడీ ఎస్ సుందరరాజన్ అభిప్రాయపడ్డారు. ఐ–ఎక్సీడ్ ప్రస్తుతం కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, డీబీఎస్ మొదలైన వాటికి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం సహకార బ్యాంకులతో కూడా చర్చలు జరుపుతోంది. ఇలాంటి థర్డ్ పార్టీ హోస్టింగ్ విధానంలో బ్యాంకులకు మౌలిక సదుపాయాల ఖర్చులు గణనీయంగా మిగిలిపోతాయి. అవి సొంతంగా సర్వర్లు లేదా విడిగా డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం వంటి వాటిపై ఖర్చు చేయనక్కర్లేదు. సింపుల్గా అన్ని శాఖలను, సర్వీస్ ప్రొవైడర్స్ను ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఒకటి అమలు చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఐటీ ఇన్ఫ్రా వ్యయాలు తగ్గడంతో పాటు సిస్టమ్స్ కూడా సురక్షితంగా ఉంటాయి. కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇప్పటికే ఐబీఎం లాంటి పేరొందిన టెక్నాలజీ ప్రొవైడర్స్ అప్లికేషన్స్ను ఉపయోగిస్తున్నాయి. ‘సాధారణంగా కొన్ని కోఆపరేటివ్ బ్యాంకులు.. చిన్న తరహా వ్యాపారుల ఖాతాలను తెరవడానికి సుమారు రెండు వారాల దాకా సమయం పట్టేస్తూ ఉంటుంది. అదే క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫాం ఎంచుకోవడం వల్ల ఈ సమయం రెండు రోజులకు తగ్గిపోయింది‘ అని ఐబీఎం ఇండియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నటరాజన్ పేర్కొన్నారు. ఎస్వీసీ బ్యాంక్, సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్ వంటి యూసీబీలు పేరుకు సహకార బ్యాంకులే అయినా పరిమాణంలో ఓ చిన్న స్థాయి కమర్షియల్ బ్యాంక్ స్థాయిలో ఉంటాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీవైపు వేగంగా మళ్లుతున్నాయి. ఇన్ఫోసిస్ రూపొందించిన ఫినాకిల్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్న సారస్వత్ బ్యాంక్.. ప్రత్యేకంగా ఐటీ అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం 70 శాతం పైచిలుకు లావాదేవీలు డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి. కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు రూపొందించేందుకు అనలిటిక్స్ సెల్ కూడా ఏర్పాటు చేసుకుంది. కాస్మోస్ బ్యాంక్, ఎర్నాకులం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ వంటివి కూడా క్రమంగా టెక్ వైపు మళ్లుతున్నాయి. సవాళ్లూ ఉన్నాయి.. ఈ బ్యాంకులు డిజిటల్ వైపు మళ్లుతున్నప్పటికీ.. వీటికి ఉండే సవాళ్లు వీటికీ ఉన్నాయి. ఉదాహరణకు కాస్మోస్ బ్యాంక్ విషయాన్నే తీసుకుంటే పుణె కేంద్రంగా పనిచేసే ఈ సహకార బ్యాంకు ఖాతాల్లో నుంచి ఏటీఎం లావాదేవీల రూపంలో రూ.94 కోట్ల మేర నిధులు చోరీకి గురయ్యాయి. 28 దేశాల్లో ఈ లావాదేవీలు జరిగాయి. దీనిపై అంతర్జాతీయ భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. దీనికి ఉత్తర కొరియాది బాధ్యతగా తేల్చింది. అత్యంత నైపుణ్యమున్న హ్యాకర్లకు.. ఇలాంటి చిన్న బ్యాంకులు సులువుగా టార్గెట్గా మారతాయనడానికి ఇదో నిదర్శనం. కాబట్టి ఈ తరహా బ్యాంకులకు సెక్యురిటీ ఇన్ఫ్రాను సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా ఉంటోంది. ఇక కొన్ని యూసీబీలు కొత్తగా మారడానికి ఇష్టపడటం లేదు. అలాగే, సహకార బ్యాంకులంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ఆర్బీఐ నియంత్రణలో పనిచేయాల్సి ఉంటుంది. దీంతో గవర్నెన్స్ పరమైన సమస్యలు వస్తున్నాయి. అటు రాజకీయ నేతల జోక్యం కూడా ఉంటోంది. దీంతో ఆయా బ్యాంకులు కొంగొత్త టెక్నాలజీలకు దూరంగా ఉంటే శ్రేయస్కరమని భావిస్తున్నాయి. -
బ్యాంకుల ‘ఫిజిటల్’ మంత్రం!
సాక్షి, బిజినెస్ విభాగం: డిజిటల్ మాధ్యమంలో ఆర్థిక లావాదేవీలు క్రమంగా ఊపందుకుంటున్నప్పటికీ.. బ్యాంకులు సంప్రదాయ బ్రాంచి బ్యాంకింగ్ను కూడా మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇటు మొబైల్, డిజిటల్ అటు బ్రాంచీల సాయంతో మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విధానాన్నే ముద్దుగా ఫిజిటల్గా (ఫిజికల్+డిజిటల్) వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు చీఫ్ ఉదయ్ కోటక్ తొలుత చేసిన ఈ పదప్రయోగం.. నెమ్మదిగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడటం, నెట్ అందుబాటులోకి రావడం వల్ల 2011 నుంచి మొబైల్, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అయితే, వీటితో పాటు శాఖలు కూడా కంటి ముందు కనిపిస్తుంటే ఖాతాదారులకు బ్యాంకుపై భరోసా ఉంటోందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు అటు ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా పోటాపోటీగా శాఖలు ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నాయి. సాధారణంగా అన్ని వర్గాలకూ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యతతో ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తృతంగా శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇపుడు ప్రైవేట్ బ్యాంకులు కూడా కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, డిపాజిట్లను పెంచుకునేందుకు శాఖలను పెంచుకుంటున్నాయి. డిజిటల్తో వినూత్న ప్రయోగాలు.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫాంల ద్వారా మరింత వినూత్నమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వీటికి ఖాతాదారుల నుంచి సానుకూల స్పందన కూడా వస్తోంది. అదే సమయంలో డిజిటల్కు సమానంగా ఫిజికల్ (భౌతికంగా) శాఖలూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయం బ్యాంకింగ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘బ్రాంచీలు ప్రధానంగా కస్టమర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయి. శాఖలపరంగా భారీ నెట్వర్క్ ఉంటే కస్టమర్లకు భరోసా ఉంటుంది. ఇక శాఖల నెట్వర్క్కు డిజిటల్ చానల్స్ అనుబంధంగా పనిచేస్తాయి. మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు, ఇంకొంత మంది కొత్త కస్టమర్స్కు చేరువయ్యేందుకు ఉపయోగపడతాయి. ఫెడరల్ బ్యాంక్ విషయం తీసుకుంటే శాఖల్లో జరిగే 75 శాతం పైగా లావాదేవీలు ప్రస్తుతం డిజిటల్ చానల్స్ ద్వారా జరుగుతున్నాయి. మాకు దేశవ్యాప్తంగా పటిష్టమైన శాఖల నెట్వర్క్ ఉంది. గడిచిన మూడేళ్లలో కొత్త శాఖలేమీ ప్రారంభించలేదు కానీ.. ఈ ఏడాదిలో దీనిపై మళ్లీ కసరత్తు చేసే అవకాశం ఉంది. ఇటు డిజిటల్తో పాటు అటు బ్రాంచీల తోడ్పాటుతో ఫిజిటల్ సేవలు కొనసాగిస్తాం‘ అని ఫెడరల్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (డిజిటల్ హెడ్) జితేష్ పీవీ తెలిపారు. శాఖల్లో ఎక్స్పీరియన్స్కు ప్రాధాన్యం.. డిజిటల్, మొబైల్ మాధ్యమాలు ఉన్నప్పటికీ.. ఖాతాదారులకు ప్రత్యేక ఎక్స్పీరియన్స్ను ఇవ్వటంలో బ్యాంకుల శాఖలు ముందుంటాయని ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ ప్రకాష్ సుందరం చెప్పారు. ‘‘సెల్ఫ్ సర్వీస్ డిజిటల్ కావొచ్చు.. అసిస్టెడ్ డిజిటల్ విధానం (బ్యాంకింగ్ సిబ్బంది సహాయంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవడం) కావొచ్చు.. శాఖ తీరు బాగుంటేనే ఆ బ్యాంకుతో లావాదేవీలు నిర్వహించేందుకు కస్టమరు ఇష్టపడతారు. కాబట్టి పరిమాణంలో చిన్నవైనా సరే శాఖల ప్రాధాన్యం తగ్గదు’’ అని ప్రకాష్ సుందరం చెప్పారు. యువతరం ఎక్కువగా మొబైల్, ఆన్లైన్ బ్యాంకింగ్ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ.. కొంత పాత తరం 45–50 ఏళ్ల వాళ్లు ఇప్పటికీ బ్యాంకు శాఖల ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రత్యేకంగా లాకరు సదుపాయం, వ్యక్తిగత ఆర్థిక సేవలు కోరుకునే సంపన్న వర్గాలకు కూడా బ్యాంకు శాఖలు అవసరమని ప్రకాష్ చెప్పారు. యాక్సిస్ ఏటా 400 శాఖలు.. వినూత్న డిజిటల్ సేవలు ఆవిష్కరించడంతో పాటు మరిన్ని శాఖల ఏర్పాటుపై దృష్టి పెడుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి చెప్పారు. ఏటా 400 శాఖలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం శాఖల సంఖ్య 5,500కు చేరే దాకా ఇదే విధానం కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాక్సిస్ ఈ ఏడాది మార్చిలో తమ 4,000వ శాఖను ఏర్పాటు చేసింది. ఆర్బీఎల్ వంటి చిన్న బ్యాంకులు కూడా శాఖలను పెంచుకుంటున్నాయి. 2018 మార్చి ఆఖరు నాటికి 265గా ఉన్న ఆర్బీఎల్ బ్రాంచీల సంఖ్య 2019 మార్చి 31 నాటికి 324కి పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల ఫిబ్రవరిలోనే తమ 5,000వ బ్రాంచీని ప్రారంభించింది. అయితే, బ్రాంచీల నెట్వర్క్పరంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్బీ) ఆధిపత్యం ఉంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం గతేడాది జూన్ ఆఖరు నాటికి పీఎస్బీ శాఖల సంఖ్య 90,821గా ఉంది. అదే ప్రైవేట్ బ్యాంకుల శాఖల సంఖ్య 28,805కి పరిమితమైంది. -
ప్రభుత్వం వైపు బ్యాంకింగ్ చూపు..
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బ్యాంకింగ్ రంగం... వచ్చే బడ్జెట్పై భారీ ఆశలు కాకపోయినా కనీసం కొన్ని కీలకమైన చర్యలు అయినా ఉంటాయని ఆశిస్తోంది. భారీ ఎన్పీఏలు, ఎన్పీఏ కేసుల దివాలా పరిష్కార ప్రక్రియల్లో జాప్యం వంటి సమస్యలను ఈ రంగం ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇన్ఫ్రా, సీŠట్ల్ రంగాలకు ప్రభుత్వరంగ బ్యాంకులే (పీఎస్బీలు) ఎక్కువ రుణాలు ఇచ్చి ఉండటంతో వీటికి అధిక ఎన్పీఏల సమస్య ఉంది. అయితే, రుణాలకు డిమాండ్ పెరుగుతుండటం, అదే సమయంలో కొత్తగా మొండి బాకీలుగా మారేవి తగ్గడం కాస్తంత ఊరట. కనుక గడ్డు పరిస్థితుల నుంచి గట్టేందుకు ప్రభుత్వం నుంచి అధిక మూలధన నిధుల సాయాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ఆశిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్ సాయం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పీఎస్బీలకు రూ.2.11 లక్షల కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఇందులో బ్యాంకులు తమ వంతుగా రూ.58,000 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఇందులో లోటు ఏర్పడితే ప్రభుత్వం అదనపు సాయం చేయనుంది. తదుపరి ఆర్థిక సాయాన్ని మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటిస్తుందని పీఎస్బీలు ఆశిస్తున్నాయి. మొండి బకాయిల సమస్యను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించొచ్చని పలువురు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు కూడా. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం అనంతరం ఎన్బీఎఫ్సీ రంగంలో ఏర్పడిన లిక్విడిటీ పరిస్థితులు ఇంకా పూర్తిగా సర్దుకోకపోవడంతో ఈ దిశగా చర్యలను కూడా ఆశిస్తున్నారు. బ్యాంకింగ్ రంగం కోర్కెలు ఇవీ.. ►బ్యాంకు ఖాతాలపై జీఎస్టీని హేతుబబ్ధీకరించాలి. రుణాలు, డాక్యుమెంట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకటే స్టాంప్ డ్యూటీని అమలు చేయాలి. ►బ్యాంకుల్లో రూ.లక్ష డిపాజిట్పై ప్రస్తుతం ఇన్సూరెన్స్ కవరేజీ ఉండగా, దీన్ని 5 లక్షలకు పెంచాలి. ►గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల ఏర్పాటుపై సబ్సిడీలు కల్పించాలి. ►సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్కు ఐదేళ్ల లాకిన్ ప్రస్తుతం ఉండగా, ఈ కాల వ్యవధిని తగ్గించాలి. ►ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 మించితే మూలం వద్దే పన్ను మినహాయించి బ్యాంకులు ఆదాయపన్ను శాఖకు జమ చేస్తున్నాయి. ఈ పరిమితిని రూ.30,000కు పెంచాలి. ►ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చేందుకు గాను పన్ను రహిత బాండ్ల ద్వారా నిధుల సమీకరణకు బ్యాంకులకు కూడా అవకాశం కల్పించాలి. ►కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలోని అన్ని కార్పొరేట్లకు, పీఎస్యూలు, ఎన్హెచ్ఏఐ, డిస్కమ్లకు ‘ట్రేడ్ రీసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్(టీఆర్ఈడీఎస్)’ను తప్పనిసరి చేయాలి. మూలధన నిధుల కొనసాగింపునకు ఇది అవసరం. ఇది లేకే ఎన్పీఏల సమస్య పెరుగుతోంది. ఎస్ఎంఈల డిమాండ్లు ►ఎస్ఎంఈలకు రుణ లభ్యతను పెంచడంతోపాటు ప్రోత్సాహం అవసరం. ►భారత్మాలా తరహా మరిన్ని ప్రాజెక్టులను రవాణా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ►రిటైల్ రంగానికి సంబంధించి జాతీయ విధానం తీసుకురావాలి. సంస్కరణలతో వినియోగం పెరుగుతుంది. రిటైల్కు పరిశ్రమ హోదా కల్పించాలి. ►గ్రామీణ రంగానికి, సాగుకు ఎక్కువ నిధుల కేటాయింపులు చేయాలి. ►భారత్ స్టేజ్–6 కాలుష్య విడుదల ప్రమాణాలకు మళ్లాల్సి ఉండడంతో ఆటోమొబైల్ వాహనాలపై జీఎస్టీ రేట్లు తగ్గించాలి. దీనివల్ల ఆటోమొబైల్పై ఆధారపడిన విడిభాగాల పరిశ్రమకూ చేయూత లభిస్తుంది. ►మెటల్స్, మైనింగ్లో దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం ఉండాలి. ►లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలి. ►పర్యావరణ పరిరక్షణ, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం దిగుమతి చేసుకునే క్యాపిటల్ గూడ్స్పై పన్నును పూర్తిగా ఎత్తివేయాలి. ►టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు ప్రభు త్వం నుంచి విధానపరమైన సహకారం కావాలి. తమ వ్యాపార అస్తిత్వానికి, వృద్ధికి టెక్నాలజీ ఎంతో అవసరమని అధిక శాతం ఎస్ఎంఈలు అభిప్రాయపడుతున్నాయి. -
పీఎస్యూ బ్యాంకుల చీఫ్లతో ఆర్బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో జరగున్న తదుపరి మానిటరీ పాలసీ సమీక్షకు ముందు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకులతో సమావేశమయ్యారు. బ్యాంకింగ్ రంగం నుంచి ఆర్బీఐ ఏమి కోరుకుంటుందన్నది వారికి ఆయన తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన చివరి ద్వైమాసిక పాలసీ సమీక్షను ఫిబ్రవరి 7న ప్రకటించనుంది. ‘‘బ్యాంకింగ్ రంగం నుంచి ఆర్బీఐ ఏమి ఆశిస్తుందో వారికి తెలియజేయడం, బ్యాంకింగ్ రంగ పరిస్థితులపై వారి అవగాహనను తెలుసుకోవడం, అలాగే, భవిష్యత్తుపై అవగాహన కోసమే భేటీ జరిగింది’’ అని పీఎస్యూ బ్యాంకుల సీఈవోలతో భేటీ తర్వాత శక్తికాంత దాస్ మీడియాకు తెలిపారు. రానున్న ఎంపీసీ భేటీలో కీలక రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. -
తక్షణమే బ్యాంకింగ్ రంగంపై దృష్టి - ఆర్బీఐ కొత్త గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 25వ గవర్నర్గా నియమితులైన శక్తికాంత్ దాస్ నూతన గవర్నర్గా తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్గా ఎంపిక కావడం గౌరవనీయమైన గొప్ప అవకాశమంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్బీఐ టీం తో కలిసి పనిచేస్తాం...భారతదేశ ఆర్థికవ్యవస్థ కోసం ప్రతిఒక్కరితో కలిసి పనిచేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. లిక్విడీటీ, ప్రధానంగా తాను బ్యాంకింగ్ రంగంపై దృష్టిపెట్టనున్నట్టు వివరించారు. ఆర్బీఐ విశ్వసనీయత, స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తామని, ఆర్బీఐ ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. జవాబుదారీతనానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థకవసరమయ్యే చర్యలను సమయానుసారంగా తీసుకోవాలని పేర్కొన్నారు. డిసెంబర్ 14, శుక్రవారం ఆర్బీఐ బోర్డు సమావేశం కానుందన్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణ ఆర్బీఐ తక్షణ కర్తవ్యమన్నారు శక్తికాంత్ దాస్. త్వరలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో ముంబైలో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నా మన్నారు. అనంతరం ప్రయివేటు రంగ బ్యాంకులతో కూడా సమావేశం కానున్నట్టు చెప్పారు. అలాగే ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య విదాదాల్లోకి తాను వెళ్ల దలుచు కోలేదని అయితే ప్రతి సంస్థ దాని స్వయంప్రతిపత్తిని కొనసాగించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. మరోవైపు డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య పదవిలో ఉన్నారా అని ప్రశ్నించినపుడు.. కొద్దిసేపటిక్రితమే ఆయనతో టీ తాగాను. నాకు తెలిసినంతవరకు ఆయన పదవిలోనే ఉన్నారంటూ మీడియా ప్రతినిధులతో ఉత్సాహంగా, నవ్వుతూ చమత్కారంగా సమాధానాలిచ్చారు. కాగా ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇటీవల రగిలిన వివాదాల నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను వైదొలగుతున్నట్టు ప్రకటించిన ఆయన తన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతో నూతన గవర్నర్గా శక్తికాంత్ దాస్ను అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినేట్ (ఏసీసీ) ఎంపిక చేసింది. మూడేళ్ల పాటు ఈ శక్తికాంత్ పదవిలో కొనసాగనున్నారు.1980 తమిళనాడు కేడర్ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శక్తికాంత దాస్ కేంద్ర కేబినేట్ సెక్రటరీ హోదాలో పలు శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో సహా కేంద్ర ప్రభుత్వంలోనూ పనిచేసిన అనుభవం ఉంది. -
బ్యాంకులు అలా రుణాలిస్తుంటే కళ్లు మూసుకున్నారా?
న్యూఢిల్లీ: పేరుకుపోయిన మొండిబాకీలతో బ్యాంకింగ్ రంగం పెను సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో నియంత్రణ సంస్థగా రిజర్వ్ బ్యాంక్ బాధ్యతలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాజీవ్ మహర్షి పలు ప్రశ్నలు లేవనెత్తారు. బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలు ఇచ్చేస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. అంతిమంగా ఈ రుణాలే మొండిబాకీలుగా మారి బ్యాంకింగ్ రంగంలో సమస్యలకు దారి తీశాయని పేర్కొన్నారు. ‘బ్యాంకింగ్ రంగం ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు సంబంధించి దీన్నుంచి ఎలా బైటపడాలన్న దానిపైనే అంతా చర్చిస్తున్నారు. సబ్సిడీల తరహాలో రీక్యాపిటలైజేషన్ దీనికి ఒక మార్గం. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరూ మాట్లాడనటువంటి విషయం ఒకటుంది. అదేంటంటే.. ఇంత జరుగుతుంటే నియంత్రణ సంస్థ (రిజర్వ్ బ్యాంక్) ఏం చేస్తున్నట్లు? దాని పాత్రేంటి, బాధ్యతలేంటి? వీటి గురించి చర్చించాల్సిన అవసరం ఉంది’ అని ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (ఐఎస్ఎస్పీ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహర్షి చెప్పారు. 2018 మార్చి 31 నాటికి బ్యాంకింగ్ రంగంలో రూ. 9.61 లక్షల కోట్ల మేర మొండిబాకీలు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం రూ. 7.03 లక్షల కోట్లు పారిశ్రామిక రంగం నుంచి రావాల్సినవి కాగా, రూ. 85,344 కోట్లు వ్యవసాయ, వ్యవసాయ సంబంధ సంస్థల నుంచి రావాల్సినవి. ప్రధాన కారణాలపై చర్చ జరగడం లేదు.. ఆస్తులు, అప్పులకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోవడమే ప్రస్తుత బ్యాంకింగ్ సంక్షోభానికి కారణమని, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆయన పేర్కొన్నారు. బాండ్ల మార్కెట్ ద్వారా నిధుల సమీకరణపై చర్చ జరగాలన్నారు. సంస్కరణల్లో రాష్ట్రాలూ పాలుపంచుకోవాలి: ఎన్కే సింగ్ ఆర్థిక సంస్కరణలను కేంద్రం ఒక్కటే అమలు చేయజాలదని, రాష్ట్రాలు కూడా ఇందులో పాలుపంచుకోవాలని 14వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, మాజీ రెవెన్యూ కార్యదర్శి ఎన్కే సింగ్ చెప్పారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి పైపై మెరుగులతో ఉపయోగం లేదని, వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో చేయగలవని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్వహణ మొదలైన అంశాల్లో ఏడాది ఫుల్ టైమ్ కోర్స్ను ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అందిస్తుంది. 2–3 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ కోసం ఇది ఉద్దేశించినది. -
ఎన్పీఏల నుంచి ఎన్బీఎఫ్సీల వరకూ...
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ మంగళవారం పలు కీలక అంశాలను సమీక్షించింది. మొండిబకాయిలు (ఎన్పీఏ) సహా బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్లో సంక్షోభం నేపథ్యంలో ఎన్బీఎఫ్సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యలను కూడా 18 మంది సభ్యుల బోర్డ్ సమావేశం చర్చించింది. గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్సీ గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్కుమార్సహా బోర్డ్లోని పలువురు సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్ మొదటివారంలో మరోసారి బోర్డ్ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది,. పేటీఎం లాంటి ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఉండాలన్న కేంద్రం ఆలోచనను ఆర్బీఐ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
బ్యాంకుల్లో తగ్గిన ఫండ్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: మార్కెట్లో కరెక్షన్ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు సెప్టెంబర్లో 21,600 కోట్ల మేర తగ్గిపోయాయి. సెప్టెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ.1,88,620 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెల ఆగస్టు నాటికి రూ.2,10,251 కోట్లుగా ఉండటం గమనార్హం. జూన్ నుంచి చూసుకుంటే ఇదే తక్కువ. జూన్లో బ్యాంక్స్టాక్స్లో ఫండ్స్ పెట్టుబడులు 1.87 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. శాతం వారీగా చూసుకుంటే ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో బ్యాంకింగ్ రంగంలో ఎక్స్పోజర్ సెప్టెంబర్ నాటికి 19.78 శాతంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల తగ్గింపు కంటే మార్కెట్ కరెక్షన్ కారణంగానే పెట్టుబడుల శాతం ఎక్కువగా తగ్గినట్టు ఫండ్స్ఇండియా రీసెర్చ్ హెడ్ విద్యాబాల తెలిపారు. సెప్టెంబర్లో బీఎస్ఈ బ్యాంకెక్స్ 12 శాతం పడిపోయిన విషయం గమనార్హం. అయినప్పటికీ ఫండ్ మేనేజర్లకు ఇప్పటికీ బ్యాంకింగ్ మిక్కిలి ప్రాధాన్య రంగంగానే కొనసాగుతోంది. ఆ తర్వాత ఫైనాన్స్ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫైనాన్స్ రంగ స్టాక్స్లో రూ.87,519 కోట్ల పెట్టుబడులు కలిగి ఉండగా, సాఫ్ట్వేర్ రంగ స్టాక్స్లో రూ.88,453 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. నాన్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్ రంగాలకు ఆ తర్వాత ప్రాధాన్యం ఇచ్చారు. -
ఎన్బీఐతో ఎస్బీఐ ఒప్పందం
ముంబై: ఖాట్మండు నేషనల్ బ్యాంకింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్బీఐ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. మౌలిక, పరిపాలనా సదుపాయాలను ఇరు సంస్థలు వినియోగించుకునేందుకు ఈ ఎంఓయూ వీలు కల్పిస్తుందని ఒక ప్రకటనలో వివరించింది. బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మానవ వనరులను సమకూర్చడం కోసం వ్యూహాత్మక కూటమి ఏర్పాటు ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొంది. -
ఇక గ్రామీణ బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో మరింత కన్సాలిడేషన్కి తెరతీస్తూ.. మరిన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్ఆర్బీ) కూడా విలీనం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రస్తుతం 56 ఆర్ఆర్బీలు ఉండగా.. ఈ సంఖ్యను 36కి తగ్గించాలని యోచిస్తోంది. ఆర్ఆర్బీల స్పాన్సరర్స్లో రాష్ట్రాలు కూడా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రతింపులు జరుపుతోంది. కేంద్ర ఆర్థిక శాఖలోని సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. ఒకే రాష్ట్రంలోని ఆర్ఆర్బీలను విలీనం చేసేందుకు సంబంధించి స్పాన్సర్ బ్యాంకులు కూడా మార్గదర్శ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని వివరించారు. ఉత్పాదకత పెంచుకోవడానికి, ఆర్థికంగా మరింత పటిష్టంగా మారడానికి, గ్రామీణ ప్రాంతాల్లో రుణ లభ్యతను పెంచడానికి ఆర్ఆర్బీల విలీనం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఆయా బ్యాంకులు వ్యయాలను తగ్గించుకోవడానికి, టెక్నాలజీ వినియోగంతో పెంచుకోవడంతో పాటు కార్యకలాపాలను విస్తరించుకోవడానికి కూడా ఉపయోగపడగలదని అధికారి తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ తర్వాత మరో మెగా బ్యాంకును ఏర్పాటు చేసే దిశగా ఇటీవలే బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా, దేనా బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా ఆర్ఆర్బీల విలీన ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. 2005 నుంచే కన్సాలిడేషన్..: గ్రామీణ ప్రాంతాల్లో సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారికి రుణ, బ్యాంకింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆర్ఆర్బీ 1976 చట్టం కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. కేంద్రం, రాష్ట్రాలు, స్పాన్సర్ బ్యాంకులతో పాటు ఇతరత్రా వనరుల నుంచి కూడా మూలధనాన్ని సమకూర్చుకునే వెసులుబాటు కల్పిస్తు 2015లో సంబంధిత చట్టాన్ని సవరించారు. ప్రస్తుతం ఆర్ఆర్బీల్లో కేంద్రానికి 50%, స్పాన్సర్ బ్యాంకులకు 35%, రాష్ట్రాల ప్రభుత్వాలకు 15% వాటాలు ఉంటున్నాయి. ఆర్ఆర్బీల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చే ఉద్దేశంతో 2005లోనే కన్సాలిడేషన్ ప్రయోగం జరిగింది. దీంతో 2005 మార్చి ఆఖరు నాటికి 196గా ఉన్న ఆర్ఆర్బీల సంఖ్య 2006 కల్లా 133కి తగ్గాయి. ఈ సంఖ్య ఆ తర్వాత 105కి, 2012 ఆఖరు నాటికి 82కి తగ్గింది. మరిన్ని విలీనాలతో ప్రస్తుతం 56కి దిగి వచ్చింది. సుమారు 21,200 శాఖలు ఉన్న ఆర్ఆర్బీలు 2016–17లో దాదాపు 17 శాతం వృద్ధితో రూ. 2,950 కోట్ల లాభాలు నమోదు చేశాయి. 2017 మార్చి ఆఖరుకి వివిధ పథకాల కింద ఆయా బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 3.5 లక్షల కోట్లకు చేరాయి. -
ఒక్కటవుతున్నాయ్!
-
రాజన్పై మరోసారి ఆరోపణల వెల్లువ
న్యూఢిల్లీ : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అందరికి సుపరిచితమే. ఆయన పనితీరుపై ఓ వైపు నుంచి ఆరోపణలు, విమర్శలు వచ్చినా.. మరోవైపు భేష్ అన్నవారు ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్గా రెండో సారి రాజన్ను కొనసాగించాలని మద్దతు కూడా తెలిపారు. కానీ రాజన్ ముక్కుసూటితనం, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు రెండో సారి ఆయనకు ఆర్బీఐ గవర్నర్ పదవి వరించకుండా పోయింది. తాజాగా రఘురామ్ రాజన్ మరోసారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృద్ధి రేటు పడిపోవడానికి కారణం రాజన్ అప్పట్లో తీసుకొచ్చిన విధానాలేనని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆరోపించారు. బ్యాంకింగ్ రంగంలోని ఎన్పీఏలు పెరగడంతో, వృద్ధి రేటు పడిపోయిందని కుమార్ అన్నారు. 2015 చివరి క్వార్టర్ నుంచి 2016 వరకు వృద్ధి రేటు క్షీణించిందని చెప్పారు. దీనికి గల కారణం రఘురామ్ రాజన్ అనుసరించిన విధానాలేనని, పెద్ద నోట్ల రద్దు కాదని వ్యాఖ్యానించారు. ఎన్పీఏలను గుర్తించడానికి ఆర్బీఐ కొత్త మెకానిజం తీసుకొచ్చిందని, ఆ మెకానిజంతో మొండిబకాయిలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎన్పీఏలు 4 లక్షల కోట్ల రూపాయలుంటే, 2017 మధ్యకు ఇవి రూ.10.5 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపారు. ఇక అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయన్నారు. కొన్ని కేసుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పరిశ్రమ క్రెడిట్ కూడా కిందకి పడిపోయిందన్నారు. కొన్నేళ్లలో నెగిటివ్ వృద్ధి కూడా నమోదైందని తెలిపారు. అయితే వృద్ది రేటు నెమ్మదించడానికి, పెద్ద నోట్ల రద్దుకు ఎలాంటి సంబంధం లేదని కుమార్ తేల్చేశారు. ఇక స్థూల తరహా పరిశ్రమ తీసుకున్నా.. వృద్ధి రేటు ఒక శాతం మేర పడిపోయిందని, కొన్ని నెలలు రెండున్నర శాతం తగ్గిందని, మరికొన్ని త్రైమాసికాలు నెగిటివ్ కూడా నమోదైందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన రిపోర్టుపై స్పందిస్తూ... డిమానిటైజేషన్ను బ్లాక్మనీ, బినామీ లావాదేవీలను నిర్మూలించడానికి తీసుకొచ్చామని పునరుద్ఘాటించారు. -
ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్!
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్లో 51% వాటా కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశిస్తున్న ఎల్ఐసీ... ఓపెన్ ఆఫర్ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఐడీబీఐ బ్యాంక్లో 51% వాటా కొనుగోలు కోసం బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్డీఏఐ ఇటీవలనే ఎల్ఐసీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎల్ఐసీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం కూడా పొందిన తర్వాత ఓపెన్ ఆఫర్కు అనుమతించాలంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీని ఎల్ఐసీ కోరవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టేకోవర్ కోడ్ నిబంధన ప్రకారం, 25 శాతం, అంతకు మించిన వాటా కొనుగోలు చేస్తే, ఆ తర్వాత తప్పనిసరిగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంకులో వాటా వద్దు.. ఎల్ఐసీ యూనియన్ల వ్యతిరేకత కాగా, ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్ఐసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ ఉద్యోగులు వ్యతిరేకించారు. ఇది పాలసీదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గతంలో ఎల్ఐసీ పెట్టుబడుల పనితీరును ఉదహరిస్తూ... ఈ బ్యాంకుల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో తుడిచిపెట్టుకు పోయిందని, అది తమ లాభాలపైనా ప్రభావం చూపుతుందని ఎల్ఐసీ క్లాస్–1 అధికారుల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఎల్ఐసీ చైర్మన్కు లేఖ రాసింది. -
సమీప భవిష్యత్తులోనే రెండంకెల వృద్ధి
ముంబై: ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు, బ్యాంకింగ్ రంగంలో సమస్యలు ఉన్నప్పటికీ స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయని బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ అన్నారు. ‘‘బ్యాంకుల పుస్తకాల ప్రక్షాళన జరుగుతోంది. ఎన్పీఏల గుర్తింపు పారదర్శకంగా మారింది. వృద్ధి చెందే జీడీపీకి తోడు, జీఎస్టీ, ఐబీసీ వంటి సంస్కరణలతో భారత వృద్ధి త్వరలోనే రెండంకెలకు చేరుతుంది’’ అని చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయాలు పెరగడంతో 2016 డిసెంబర్ నుంచి వృద్ధి వేగాన్ని అందుకుందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, చమురు ధరలతో ఐపీవోలపై ప్రభావం పడిందన్నారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా చూస్తే భారత ఎక్స్ఛేంజ్ల్లో అధిక ఐపీవో కార్యకలాపాలు ఉన్నాయని, 2018 మొదటి ఆరు నెలల్లో 90 ఐపీవోలు 3.9 బిలియన్ డాలర్ల (రూ.26,520 కోట్లు) మేర నిధులు సమీకరించాయని ఆయన తెలిపారు. -
బ్యాంకింగ్ రంగంలోకి ఎల్ఐసీ!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలన్న ఎల్ఐసీ చిరకాల స్వప్నం సాకారం కానున్నది. భారీ రుణ భారంతో కుదేలైన ఐడీబీఐ బ్యాంక్లో 51 శాతం వాటాను బీమా దిగ్గజం ఎల్ఐసీ కొనుగోలు చేయనున్నది. ఐడీబీఐలో ప్రస్తుతం 10.82 శాతంగా ఉన్న వాటాను 51 శాతానికి పెంచుకోవడానికి ఎల్ఐసీకి బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్డీఏఐ ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో జరిగిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) బోర్డ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదన మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ, బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ, ఆర్బీఐల ఆమోదం పొందాల్సి ఉంది. ఎల్ఐసీ వాటా కొనుగోలు కారణంగా ఐడీబీఐ బ్యాంక్కు రూ.10,000–13,000 కోట్ల రేంజ్లో పెట్టుబడులు లభిస్తాయని అంచనా. 7–10 ఏళ్లలో ఎల్ఐసీ తన వాటాను 15 శాతానికి తగ్గించుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. పెట్టుబడుల వివరాలు, 51% వాటాను 15 శాతానికి ఎంత కాలంలో తగ్గించుకుంటుందో వంటి అంశాలతో పాటు ఇతర విధి, విధానాలతో కూడిన ప్రణాళికను త్వరలోనే ఎల్ఐసీ సమర్పించనున్నది. ఎల్ఐసీ పోటీ బీమా సంస్థలకు సొంత బ్యాంక్లు ఉన్నాయి. ఇప్పుడు సొంత బ్యాంక్తో ఎల్ఐసీ మరింత విస్తరిస్తుందని నిపుణులంటున్నారు. ఎల్ఐసీకి మినహాయింపు... స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఆర్థిక సంస్థల్లో ఏ బీమా సంస్థ కూడా 15 శాతానికి మించి వాటా కొనుగోలు చేయకూడదని ప్రస్తుత నిబంధనలున్నాయి. ఐడీబీఐ బ్యాంక్లో వాటా కొనుగోలు కోసం ఈ నిబంధన నుంచి ఎల్ఐసీకి ఐఆర్డీఏఐ మినహాయింపునిచ్చింది. దీంతో ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలన్న ఎల్ఐసీ ప్రయత్నాలు ఫలించినట్లే. ఈ వాటా కొనుగోలు ద్వారా ఐడీబీఐ బ్యాంక్కు భారీగా మూలధన పెట్టుబడులు, 22 కోట్ల పాలసీదారుల ఖాతాలు లభిస్తాయి. ఇక ఎల్ఐసీ 2,000 బ్రాంచ్ల నెట్వర్క్తో తన పాలసీలను మరింత విస్తృతంగా విక్రయించుకునే అవకాశం దక్కుతుంది. ఎల్ఐసీ అనుబంధ సంస్థగా ఐడీబీఐ బ్యాంక్ కొనసాగే అవకాశాలున్నాయి. ఇప్పటికే హౌసింగ్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎల్ఐసీకి అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటాదారులకు మంచి విలువ.. ఈ ఏడాది మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంక్ మొండి బకాయిలు రూ.55,600 కోట్లకు చేరాయి. గత ఆర్థి క సంవత్సరం నాలుగో క్వార్టర్లో ఐడీబీఐ బ్యాంక్ నికర నష్టాలు రూ.5,663 కోట్లకు చేరాయి. ఐడీబీఐ బ్యాంక్లో ఎల్ఐసీ వాటా కొనుగోలు కారణంగా ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వం వాటా ప్రస్తుతమున్న 80.96 శాతం నుంచి 50 శాతం దిగువకు తగ్గుతుంది. ఈ వాటా విక్రయం వల్ల లభించే పెట్టుబడులు ప్రభుత్వ ఖజానాకు కాకుండా ఐడీబీఐ బ్యాంక్ పునరుజ్జీవనానికి వినియోగిస్తారు. ఎల్ఐసీ వాటా కొనుగోలు కారణంగా మొండి బకాయిల సమస్య తీరిపోయి ఐడీబీఐ బ్యాంక్ వాటాదారులకు మంచి విలువ చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదు బ్యాంకుల్లో ఎల్ఐసీకి వాటాలు.. ఇప్పటికే ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎల్ఐసీకి 10 శాతం చొప్పున వాటాలున్నాయి. ఎల్ఐసీకి ఎస్బీఐలో 9.98%, అలహాబాద్ బ్యాంక్లో 12.37%, కార్పొరేషన్ బ్యాంక్లో 13.03 శాతం చొప్పున వాటాలున్నాయి. ఒక బ్యాంక్లో నియంత్రిత వాటా ఉన్న కంపెనీకి, ఇతర బ్యాంక్ల్లో 5 శాతానికి మించి వాటా ఉండకూడదనే నిబంధనలున్నాయని, ఫలితంగా ఈ బ్యాంకుల్లో తన వాటాను ఎల్ఐసీ తగ్గించుకోవలసి రావచ్చని నిపుణులంటున్నారు. కాగా గత వారమే ఐడీబీఐ బ్యాంక్ సీఈఓగా ఎస్బీఐ ఎమ్డీ. బి. శ్రీరామ్ను ప్రభుత్వం నియమించింది. మూడు నెలల కాలానికే ఈ నియామకం జరిగినప్పటికీ, దీర్ఘకాలం పాటే ఆయన సీఈఓగా కొనసాగే అవకాశాలున్నాయి. 10 శాతం పెరిగిన ఐడీబీఐ బ్యాంక్ షేర్ ఎల్ఐసీ వాటా కొనుగోళ్ల వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ జోరుగా పెరిగింది. 10 శాతం లాభంతో రూ.54.90 వద్ద ముగిసింది. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.7,567 కోట్లు పెరిగి రూ.22,955 కోట్లకు చేరింది. ఎల్ఐసీకి వాటా విక్రయం వద్దు.... ఐడీబీఐ బ్యాంక్లో ఎల్ఐసీ వాటా కొనుగోలును ఆల్ ఇండియా బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్కు ఏఐబీఈఏ కార్యదర్శి సీహెచ్. వెంకటాచలం శుక్రవారం ఒక లేఖ రాశారు. ఐడీబీఐ బ్యాంక్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గకుండా చూస్తామని ఐడీబీఐను 2003లో ఐడీబీఐ బ్యాంక్గా మారుస్తున్న సందర్భంలో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీ వల్లే ఆ బిల్లు ఆమోదం పొందిందని ఈ లేఖలో ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఎల్ఐసీ భారీ నిరర్థక ఆస్తులతో నిండిపోయిందని, నష్టాల్లో ఉన్న సంస్థలన్నింటినీ ఎల్ఐసీ నిధులతో గట్టెక్కించడం సరికాదని ఆయన విమర్శించారు. మొండి బకాయిల పరిష్కారానికి గట్టి చర్యలు తీసుకోవాలని, అంతే కానీ మరిన్ని నిధులు గుమ్మరించడం సరైన పరిష్కారం కాదని ఆయన ఆక్షేపించారు. -
బ్యాంకుల్లో ప్రజల సొమ్ము పదిలమే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని (పీఎస్బీ) ప్రజల సొమ్ముకు ’అత్యంత భద్రత’ ఉంటుందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పీఎస్బీలకు నూటికి నూరు శాతం ప్రభుత్వ మద్దతుంటుందని ఆయన చెప్పారు. 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో మంగళవారం సమావేశమైన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలియజేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో (పీఎన్బీ) దాదాపు రూ.14,000 కోట్ల కుంభకోణం సహా బ్యాంకింగ్ రంగంలో పలు స్కామ్లు బయటపడుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రజల సొమ్ము భద్రంగానే ఉంటుందని.. కాకపోతే భారీగా ఆదాయ పన్ను బాకీలు పడ్డ ప్రైవేట్ కంపెనీల్లోకి మళ్లిన ప్రజల నిధులు ఎంత మేర భద్రంగా ఉంటాయన్నది తాను చెప్పలేనని గోయల్ వ్యాఖ్యానించారు. మోసాలు చేసినది ప్రైవేట్ కంపెనీలే తప్ప ప్రభుత్వ బ్యాంకులు కాదన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రజల సొమ్ముకు నూటికి నూరు శాతం భద్రత ఉంటుందని భరోసా ఇస్తున్నాను. పీఎస్బీలకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. రిజర్వ్ బ్యాంక్కు పూర్తి అధికారాలున్నాయి.. పీఎస్బీలను సమర్థంగా నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్కి అన్ని అధికారాలు ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆర్బీఐ కోరుతున్నట్లుగా మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. పీఎస్బీలను నియంత్రించేందుకు తమకు మరిన్ని అధికారాలు అవసరమని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇటీవల పార్లమెంటరీ కమిటీకి తెలిపిన సంగతి తెలిసిందే. ‘రిజర్వ్ బ్యాంక్కి పూర్తి అధికారాలు ఉన్నాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అయినప్పటికీ, మరిన్ని అధికారాలు అవసరమైతే ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఈ విషయాలపై ఆర్బీఐ, ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకుంటాయి‘ అని గోయల్ చెప్పారు. చిన్న సంస్థలకు రుణాలపై పీఎస్బీల దృష్టి.. పీఎస్బీలు ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థలపై దృష్టి సారిస్తున్నాయని గోయల్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా నిఖార్సయిన కార్పొరేట్ కంపెనీలకు కూడా తోడ్పాటునివ్వాలని బ్యాంకులు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ఎంఎస్ఎంఈలు, నిఖార్సయిన మంచి కంపెనీల వర్కింగ్ క్యాపిటల్ తదితర రుణ అవసరాలు తీర్చడంపై మళ్లీ దృష్టి పెట్టాలని పీఎస్బీలు నిర్ణయించాయి‘ అని మంత్రి పేర్కొన్నారు. రెండు దశల్లో దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. తొలి దశలో రూ. 200 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల దాకా రుణాలు ఉన్న కంపెనీలను, రెండో దశలో రూ. 200 కోట్ల దాకా రుణాలున్న కంపెనీల అవసరాలను పీఎస్బీలు పరిశీలించి, నిర్ణయం తీసుకుంటాయని గోయల్ చెప్పారు. మళ్లీ మొండిబాకీల సమస్య తలెత్తకుండా ఈ విషయంలో బ్యాంకులు విడివిడిగా గాకుండా కన్సార్షియంగా కలిసి పనిచేస్తాయని తెలిపారు.అసెట్ రీకన్స్ట్రక్షన్ లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటుపై పీఎన్బీ చైర్మన్ సునీల్ మెహతా సారథ్యంలో ఏర్పాటైన సబ్ కమిటీ త్వరలో నివేదిక సమర్పించనుందని ఆయన చెప్పారు. బ్యాంకర్లతో భేటీలో మొండిబాకీలపై చర్చ.. బ్యాంకింగ్ చీఫ్లతో మంత్రి భేటీ సందర్భంగా బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండిబాకీలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోని బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అనుబంధ బ్యాంకుల విలీనాల అనుభవాలను ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్కి సంబంధించిన లోటుపాట్ల గురించి కూడా చర్చించినట్లు సమావేశం అనంతరం విలేకరులకు ఆయన తెలిపారు. -
బ్యాంకింగ్ రంగంపై గీతంలో యూబీఐ అధ్యయన పీఠం
సాక్షి, సాగర్నగర్ : బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులపై నిరంతర అధ్యయానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) అధ్యయన పీఠాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కతూరియా హామీ ఇచ్చారు. యూబీఐ కార్పొరేట్ కార్యాలయం ఉన్నతాధికారుల బృందం బుధవా రం వర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా కతూరియా మాట్లాడుతూ దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.గంగాధరరావు మాట్లాడుతూ గీతం ప్రగతిని వివరించారు. వీసీ ప్రొఫెసర్ ఎం.ఎస్.ప్రసాద్ గాంధీయన్ అధ్యయన కేంద్రం, బ్యాంకింగ్ అధ్యయన కేంద్రం ప్రతిపాదనల గురించి వివరించారు. అనంతరం కతూరియాను వీసీ సత్కరించారు. కార్యక్రమంలో గీతం కార్యదర్శి బి.వి.మోహనరావు, పాలకవర్గ సభ్యుడు హమ్జాకె.మెహది, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ కె.వి.గుప్తా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గోపాలకృష్ణ, యూబీఐ జనరల్ మేనేజర్ ఎస్.ఎస్.చంద్రశేఖర్, ప్రాంతీయ అధికారి కె.ఎస్.ఎన్.మూర్తి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. -
మరో ‘మెగా’ బ్యాంకింగ్ విలీనం!!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో పెరిగిపోతున్న మొండిబాకీల సమస్యకి అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తోంది. నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసే అవకాశాలు పరిశీలిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ విలీనం గానీ సాకారమైన పక్షంలో ఏకంగా రూ. 16.58 లక్షల కోట్ల అసెట్స్తో దేశీయంగా రెండో అతి పెద్ద బ్యాంకు ఏర్పాటు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బలహీన బ్యాంకులు అనవసర వ్యయాలను తగ్గించుకోవడానికి, నష్టాల్లోని శాఖలను మూసివేయడానికి ఈ విలీనం తోడ్పడగలదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. ఆయా బ్యాంకుల ఖాతాల్లో పెరిగిపోతున్న మొండిబాకీలను కట్టడి చేసేందుకు కూడా ఇది దోహదపడగలదని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2017–18)లో ఈ నాలుగు బ్యాంకుల నికర నష్టాలు ఏకంగా రూ. 21,646.38 కోట్ల మేర ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ గ్రూప్నకు చెందిన అయిదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును గతేడాది ఏప్రిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ప్రభుత్వం విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కోవలో ఈ నాలుగు బ్యాంకులను కూడా కలపాలన్న ప్రతిపాదనలు పరిశ్రమలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐడీబీఐ బ్యాంక్లో వాటాల విక్రయ యోచన ఒకవైపు నాలుగు ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కసరత్తు చేస్తూనే మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో 51% వాటాల విక్రయ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. సుమారు రూ. 9,000–10,000 కోట్లకు ఈ వాటాలు కొనుగోలు చేసే వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు వాటాల విక్రయించే రూపంలో కూడా ఈ డీల్ ఉండొచ్చని పేర్కొన్నాయి. ఐడీబీఐ బ్యాంకులో వాటాలను 50 శాతం కన్నా దిగువకి తగ్గించుకోవాలని కేంద్రం యోచిస్తోందంటూ 2016 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించడం, ఇటీవల కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వార్తలకు ఊతమిస్తున్నాయి. బోర్డు సమావేశంలో అదనపు మూలధన సమీకరణకు సంబంధించి ప్రత్యేక తీర్మానాన్ని పరిశీలించనున్నట్లు ఐడీబీఐ బ్యాంకు స్టాక్ ఎక్సే ్చంజీలకు తెలియజేసింది. అధీకృత మూలధనాన్ని ప్రస్తుతమున్న రూ. 4,500 కోట్ల నుంచి రూ. 8,000 కోట్లకు పెంచుకోవాల్సి ఉంటుందని స్క్రూటినైజర్ ఒక నివేదిక ఇచ్చినట్లు కూడా ఆ తర్వాత పేర్కొంది. అధీకృత మూలధనం పెరిగితే, ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఇన్వెస్టర్లకు 51% లేదా అంతకు మించి వాటాలను విక్రయించడానికి వీలవుతుందనేది పరిశీలకుల అభిప్రాయం. అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించాయి. ‘ఎన్పీఏ’లకు ప్రణాళిక సిద్ధం చేయండి ♦ బ్యాంకులకు పార్లమెంటరీ కమిటీ ఆదేశం ♦ ‘యూపీఏ’ రుణాలపై ఆరా ♦ మొండిబాకీలపైవివరణనిచ్చిన బ్యాంకర్లు న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండి బాకీలను రాబట్టేందుకు తగిన మార్గదర్శక ప్రణాళికను రూపొందించాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. అయితే, కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినంత మాత్రాన కార్పొరేట్లందరినీ అదే గాటన కట్టరాదని అభిప్రాయపడింది. ఎంపీ వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం(ఆర్థిక).. సోమవారం బ్యాంకర్లతో నిర్వహించిన భేటీలో ఈ మేరకు సూచనలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యూపీఏ ప్రభుత్వాల హయాంలో దూకుడుగా రుణాలిచ్చే ధోరణులే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు భారీగా పెరిగిపోవడానికి దారి తీశాయా అన్న కోణంలో బ్యాంకర్లను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. కార్పొరేట్ల మోసాలు, ఎగవేతలతో పెరిగిపోతున్న మొండిబాకీలను భర్తీ చేయడానికి ప్రజాధనాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వస్తోందన్నది అర్ధం కాకుండా ఉందంటూ కమిటీలో సభ్యుడైన టీఎంసీ ఎంపీ దినేష్ త్రివేది వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నాయి. ఎస్బీఐ చైర్పర్సన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) డిప్యుటీ చైర్మన్ రజనీష్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ సునీల్ మెహతా, ఐబీఏ సీనియర్ అడ్వైజర్ అలోక్ గౌతమ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, ఎన్పీఏలకు సంబంధించిన వివిధ అంశాల గురించి కమిటీకి వారు వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్ చందా కొచర్ ప్రస్తావన.. ఐసీఐసీఐ సీఈవో చందా కొచర్పై వస్తున్న ఆరోపణలపైనా పార్లమెంటరీ కమిటీలోని కొందరు సభ్యులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కూడా ’ఆశ్రిత పక్షపాతం’ లావాదేవీలు జరుగుతున్నాయన్న కోణంలోనూ ఒక సభ్యుడు ప్రశ్నించారు. వీడియోకాన్కు రుణాలివ్వడం ద్వారా తన భర్త దీపక్ కొచర్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా చందా కొచర్ వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
బ్యాంకు డిపాజిట్లు తగ్గుతున్నాయ్!
న్యూఢిల్లీ: మోదీ సర్కారు కొలువు తీరాక బ్యాంకింగ్ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిపాజిట్లకు చిక్చొచ్చి పడుతోంది. 2017–18లో బ్యాంకు డిపాజిట్లలో పెద్దగా పెరుగుదల లేకపోవటం దీన్ని కళ్లకు కడుతోంది. ఈ సారి గడిచిన 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వృద్ధి చోటు చేసుకుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం... బ్యాంకుల్లోకి వెళ్లే డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, బీమా, ఇతర మార్గాలవైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్బీఐ గణాంకాలను గమనిస్తే... బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్ల వృద్ధి 2017–18 లో 6.7 శాతమే. 1963 తర్వాత ఇదే తక్కువ వృద్ధి. డీమోనిటైజేషన్ తర్వాత బ్యాంకుల్లో వేసిన డిపాజిట్లను వెనక్కి తీసుకోవటమే కాక... తిరిగి బ్యాంకుల్లో పొదుపు చేయడం తగ్గిందని ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘డీమోనిటైజేషన్ (2016 నవంబర్) తర్వాత డిపాజిట్లు పెరిగాయి. అందుకే ఆ సంవత్సరం బ్యాంకు డిపాజిట్ల వృద్ధి అధికంగా ఉంది. అయితే, ఈ డిపాజిట్లన్నీ గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ఇది బ్యాంకు డిపాజిట్ల వృద్ధిపై ప్రభావం చూపించింది’’ అని ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పీకే గుప్తా తెలిపారు. డీమోనిటైజేషన్ తర్వాత మార్పు 2016 నవంబర్–డిసెంబర్ నెలల్లో బ్యాంకుల్లోకి రూ.15.28 లక్షల కోట్లు డిపాజిట్లుగా వచ్చాయి. చలామణి నుంచి రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడమే దీనికి కారణం. దీంతో బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 15.8% వృద్ధితో రూ.108 లక్షల కోట్లకు చేరాయి. ఈ వృద్ధి తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు రూ.114 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ డిపాజిట్లు ఇతర ఆర్థిక సాధనాల వైపు మళ్లడం వృద్ధి క్షీణతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో 22% వృద్ధితో రూ.21.36 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. 2017 మార్చి నాటికి ఫండ్స్ ఆస్తుల విలువ రూ.17.55 లక్షల కోట్లుగానే ఉంది. ఇక 2016 మార్చికి ఫండ్స్ ఆస్తుల విలువ రూ.12.33 లక్షల కోట్లే. అంటే నాటి నుంచి 2017 మార్చికి 42% పెరిగినట్టు అర్థమవుతోంది. దీనికి తోడు ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చే పెట్టుబడుల్లోనూ పెరుగుదల అధికంగానే ఉంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్త పాలసీల ద్వారా మొదటి ప్రీమియం ఆదాయం రూ.1.93 లక్షల కోట్లకు చేరింది. ఇది 2016–17లో రూ.1.75 లక్షల కోట్లు, 2015–16లో రూ.1.38 లక్షల కోట్లుగానే ఉంది. -
ప్రైవేటు బ్యాంకుల మొండి బాకీలు రూ.లక్ష కోట్ల పైనే
న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్ రంగంలో అడ్డగోలుగా మంజూరై, వసూలు కాని మొండి రుణాల (ఎన్పీఏల) వ్యవహారం.. బ్యాంకు ఖాతాల ప్రక్షాళన కార్యక్రమం ఫలితంగా వెలుగు చూసింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో ఎన్పీఏలు బయటకు వచ్చాయి. వీటితో పోలిస్తే ప్రైవేటు బ్యాంకులు ఎన్పీఏల విషయంలో కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ, అలా అని దూరంగాను లేవు. ఎందుకంటే ప్రైవేటు బ్యాంకుల్లోనూ ఎన్పీఏలు పెరిగిపోతున్నాయి మరి. ఆరు ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2018 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు దాటాయి. 2015 సెప్టెంబర్లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత సమీక్ష చేపట్టే నాటికి ఆరు ప్రధాన ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు రూ.28,033 కోట్లుగా ఉంటే, అవి ఈ ఏడాది మార్చి ఆఖరుకి రూ.లక్ష కోట్లకు పెరిగిపోయాయి. వీటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు, యస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి. మొండి బకాయిలకు సంబంధించి ఆర్బీఐ నూతన కార్యాచరణను అమల్లో పెట్టడం వల్ల మార్చి క్వార్టర్లో ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు మరోసారి గణనీయంగా పెరిగిపోయాయి. మార్చి క్వార్టర్లో భారీగా పెరుగుదల గతేడాది డిసెంబర్ నాటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నింటి స్థూల ఎన్పీఏలు రూ.8.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే, మార్చి ముగింపు నాటికి ఇవి మరింత పెరిగిపోయాయి. కార్పొరేట్ రంగానికి అధికంగా రుణాలు ఇచ్చిన ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు ఎన్పీఏలను ఎక్కువగా చూపించాయి. మార్చి చివరికి ఐసీఐసీఐ బ్యాంకు స్థూల ఎన్పీఏలు 238 శాతం ఎగిసి రూ.54,063 కోట్లకు చేరాయి. అదే యాక్సిస్ బ్యాంకు విషయానికొస్తే స్థూల ఎన్పీఏలు 670 శాతం పెరిగి రూ.34,249 కోట్లకు చేరాయి. ఈ రెండు బ్యాంకుల స్థూల ఎన్పీఏల నిష్పత్తి భారీగా పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంకు స్థూల ఎన్పీఏ రేషియో 2015 సెప్టెంబర్ నాటికి మొత్తం రుణాల్లో 3.26 శాతంగా ఉండగా, 2018 మార్చి నాటికి అది 10 శాతానికి పెరిగిపోయింది. అటు యాక్సిస్ బ్యాంకు స్థూల ఎన్పీఏ రేషియో ఇదే కాలంలో 1.38 శాతం నుంచి 6.7%కి ఎగిసింది. 2015 సెప్టెంబర్ నాటి నుంచి చూస్తే యస్ బ్యాంకు ఎన్పీఏల రేషియా ఈ ఏడాది మార్చి చివరికి 434 శాతం పెరిగిపోయింది. ఆర్బీఐ నిబంధనల వల్లే... బ్యాంకుల ఎన్పీఏలు జనవరి–మార్చి త్రైమాసికంలోనూ పెరగడం ఆర్బీఐ నూతన కార్యాచరణ పర్యవసానమేనని ఏంజెల్ బ్రోకింగ్ అనలిస్ట్ సిద్ధార్థ్ పురోహిత్ పేర్కొన్నారు. ‘‘ఆర్బీఐ... రుణాలను తగిన విధంగా వర్గీకరించాలని, చెల్లింపులు ఆగిపోయిన రోజు నుంచి 180 రోజుల్లోపు వాటిని పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. అప్పటికీ సాధ్యం కాకపోతే వాటిని దివాలా చర్యల కింద సిఫారసు చేయాలని ఆదేశాలే జారీచేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు కొన్ని ఖాతాలను ఎన్పీఏలుగా తిరిగి వర్గీకరించాయి. ఈ ఖాతాలకు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బ్యాంకులు పరిష్కార ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ రెండు నెలలు కీలకం’’ అని సిద్ధార్థ్ పురోహిత్ పేర్కొన్నారు. మారిన ప్రాధాన్యం ఐసీఐసీఐ బ్యాంకు ఎదురుదెబ్బల ఫలితంగా రిస్క్తో కూడిన కార్పొరేట్ రుణాలకు దూరం జరిగింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకు కార్పొరేట్ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.7,008 కోట్లు మాత్రమే. గత మూడు సంవత్సరాలుగా ఐసీఐసీఐ బ్యాంకు లోన్బుక్ వార్షికంగా 3.3 శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని, ఇతర బ్యాంకుల కంటే ఐసీఐసీఐ బ్యాంకు ఎన్పీఏలు ఎక్కువగా పెరగడానికి కారణం ఇదేనంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా కార్పొరేట్ రంగాన్నే నమ్ముకున్న బ్యాంకులు ఎన్పీఏల షాక్తో రిటైల్ రుణాలపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో బ్యాంకుల రుణాల వృద్ధిలో ఎక్కువ భాగం రిటైల్ విభాగం నుంచే ఉంటోంది. యాక్సిస్ బ్యాంకు రిటైల్ లోన్బుక్ 2015 మార్చి నాటికి రూ1.1 లక్ష కోట్లుగా ఉండగా, 2018 మార్చి నాటికి రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం రుణాల్లో 47 శాతానికి చేరాయి. అటు ఐసీఐసీఐ బ్యాంకు మొత్తం రుణాల్లో రిటైల్ రుణాల వాటా 42.4 శాతం నుంచి 56.6 శాతానికి పెరిగింది. 2020 నాటికి 60 శాతం వాటా రిటైల్ రుణాలే ఆక్రమిస్తాయని బ్యాంకు అంచనా వేస్తోంది. బ్యాంకులు తమ పోర్ట్ఫోలియోను మార్చుకుంటున్నాయని, కార్పొరేట్ రుణాల్లో వృద్ధి ఒక అంకెకు పరిమితమైనా, 20 శాతం వృద్ధి ఉన్న రిటైల్ రుణాల నుంచి ప్రయోజనం పొందుతాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీనివాస్ అన్నారు. -
బ్లాక్చెయిన్ ప్రమాణాలపై ఐసీఐసీఐ కసరత్తు
ముంబై: దేశీ బ్యాంకింగ్ రంగంలో బ్లాక్చెయిన్ టెక్నాలజీని మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా ప్రమాణాల రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ తెలిపారు. ఇందుకోసం ఇతర బ్యాంకులు, భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆమె వివరించారు. ట్రేడ్ ఫైనాన్స్కి సంబంధించి కొనుగోలుదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్ సంస్థలు, బీమా సంస్థలు మొదలైనవన్నీ కూడా భాగస్వాములుగా ఉండే బ్లాక్చెయిన్ ఆధారిత వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చందా కొచర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిజిటల్ రూపంలో సత్వర ఆర్థిక లావాదేవీలకు తోడ్పడే తమ బ్లాక్చెయిన్ ప్లాట్ఫాంను ఇప్పటికే 250 కార్పొరేట్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. -
అవినీతి ఫిర్యాదుల్లో టాప్ రంగాలివే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని అవినీతి కుంభకోణాలు పట్టిపీడిస్తున్నాయి. ఈ కోవలో ముఖ్యంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలపై పెద్ద ఎత్తున అవినీతి ఫిర్యాదులు రావడం ఆందోళన పుట్టిస్తోంది. అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో రైల్వేలు, ప్రభుత్వరంగ బ్యాంకులు టాప్లో నిలిచాయి. తాజాగా సీవీసీ అందించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన నివేదికను సీవీసీ పార్లమెంట్కు సమర్పించింది. 2017 సంవత్సరానికి గానూ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ఈ సంచలన విషయాలను పార్లమెంటుకు నివేదించింది. అవినీతి నిరోధక విభాగానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సీవీసీ ఈ రిపోర్టును వెల్లడించింది. ఈ ఏడాది రైల్వే ఉద్యోగులపై 12,089, బ్యాకింగ్ ఉద్యోగులపై 8,018 ఫిర్యాదులు వచ్చినట్టు సీవీసీ నివేదికలో పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల మీద ఫిర్యాదులు గణనీయంగా పెరిగినట్టు చెప్పింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కు చెందిన ఉద్యోగులపై 2,730 ఫిర్యాదులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. అందుతున్న ఫిర్యాదుల్లో చాలా వరకు అస్పష్టంగా ఉంటున్నాయని సీవీసీ తెలిపింది. 2016తో పోలిస్తే 2017లో మొత్తం ఫిర్యాదుల సంఖ్య సగానికి తగ్గడం విశేషం. ప్రపంచంలోనే భారతీయ రైల్వేలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి విభాగంలో పనిచేసే ఉద్యోగులపై ఇంత పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం ఆ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోపక్క ఇటీవల దేశంలో కుంభకోణాలన్నీ కొందరు బ్యాంకింగ్ ఉద్యోగుల సహాకారంతోనే జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో వారిపై ప్రజలు ఈ స్థాయిలో ఫిర్యాదులు చేయడం గమనార్హం. -
ఆగని బ్యాంకుల దోపిడీ
టెక్నాలజీ ఆధునికతను సంతరించుకుంటున్నా దేశ బ్యాంకింగ్ రంగంలో మాత్రం భారీ మోసాలు జరిగిపోతూనే ఉన్నాయి. వీటికి పగ్గాలు వేసి, ఇకపై అవి జరగకుండా నిరోధించే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే బ్యాంకు ఉద్యోగులు సైతం మోసపూరిత శక్తులతో చేతులు కలుపుతుండటం ఈ రంగానికి పెద్ద సమస్యగా మారిపోయింది. 2012 – 2016 మధ్య మోసాల కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.22,743 కోట్లు నష్టపోయినట్టు ఐఐఎం, బెంగళూరు అధ్యయనం చెబుతోంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవలే పార్లమెంట్కు వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2017 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 21 నాటికి రూ.179 కోట్ల విలువైన 25,600 బ్యాంకింగ్ మోసాల కేసులు నమోదయ్యాయి. బడా స్కామ్లు... ♦ 2011లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, ఐడీబీఐ బ్యాంకుల్లో ఉద్యోగులు 10,000 ఖాతాలను కల్పితంగా సృష్టించారు. 150 కోట్ల విలువైన రుణాలను ఆయా ఖాతాల్లోకి బదిలీ చేసుకున్న విషయం వెలుగు చూసింది. సీబీఐ ఈ మోసాన్ని వెలుగులోకి తీసింది. ♦ 2014లో ముంబై పోలీసులు కొందరు ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులపై తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. రూ.700 కోట్ల మేర ఫిక్స్డ్ డిపాజిట్ల మోసానికి పాల్పడినట్టు అభియోగం. ♦ 2014లోనే ఎలక్ట్రోకెమ్ ఇండియా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాను రూ.436 కోట్ల మేర మోసం చేయగా, కోల్కతాకు చెందిన వ్యాపారి బిపిన్ వోహ్రా ఫోర్జింగ్ పత్రాలను ఇవ్వడం ద్వారా రూ.140 కోట్ల మేర రుణాలు తీసుకుని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు టోకరా వేశారు. ♦ ఇదే ఏడాది లంచాలు తీసుకుని రూ.8,000 కోట్ల మేర రుణాలను ఇచ్చిన స్కామ్లో సిండికేట్ బ్యాంకు నాటి చైర్మన్, ఎండీ పాత్ర వెలుగులోకి వచ్చింది. ♦ 2015లో జైన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ ఉద్యోగులు రూ.212 కోట్ల విలువ మేర సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మోసానికి పాల్పడ్డారు. ♦ ఇదే ఏడాది పలు బ్యాంకుల ఉద్యోగులు రూ.6,000 కోట్ల మేర ఫారీన్ ఎక్సేంజ్ను మోసగించారు. ♦ 2016లో 386 మంది నకిలీ చెక్కులు, లెటర్ ఆఫ్ క్రెడిట్, ఎల్ఐసీ పాలసీలతో సిండికేట్ బ్యాంకును రూ.1,000 కోట్ల మేర ముంచారు. ♦ 2017లో యునైటెడ్ బ్రేవరీస్ చైర్మన్ విజయ్మాల్యా, మరో పది మంది ఐడీబీఐ బ్యాంకుకు రూ.950 కోట్ల విలువైన రుణాలను చెల్లించనందుకు సీబీఐ చార్జ్షీటు సిద్ధం చేసింది. ♦ అలాగే, రూ. 1,161 కోట్ల ఉద్దేశపూర్వక నష్టానికి కారణమైనందుకు ఐదు ప్రభుత్వరంగ బ్యాంకులకు వ్యతిరేకంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్కు వ్యతిరేకంగా చార్జ్షీటు దాఖలు చేసింది. ♦ కోల్కతాకు చెందిన వ్యాపారవేత్త నీలేష్ పరేఖ్ను సీబీఐ అరెస్ట్ చేసింది. 20 బ్యాంకులకు నీలేష్ రూ.2,223 కోట్ల మేర నష్టం కలిగించారు. ♦ రెండు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.290 కోట్ల మేర మోసం చేసిన కేసులో అభిజీత్ గ్రూపు ప్రమోటర్లు, కెనరా బ్యాంకు మాజీ డీజీఎంను సీబీఐ 2017లో అరెస్ట్ చేసింది. ♦ రూ.836 కోట్ల మోసం కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ జోనల్ హెడ్తోపాటు సూరత్కు చెందిన ప్రైవేటు లాజిస్టిక్స్ కంపెనీ డైరెక్టర్పై సీబీఐ కేసులు నమోదు చేసింది. ♦ 2018లో రూ.500 కోట్ల మోసం కేసులో ఆంధ్రాబ్యాంక్ మాజీ డైరెక్టర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇందులో గుజరాత్కు చెందిన ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ పాత్ర కూడా ఉంది. -
రుణ ఎగవేతదారులకు చెక్
న్యూఢిల్లీ: రుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడడమే తరువాయి. దేశ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం ఐబీసీని గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఐబీసీలో పలు సవరణలు చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. అయితే, ఇందులో మార్పులు ఏంటన్నది ఆయన వెల్లడించలేదు. రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉన్నందున అప్పటి వరకు వివరాలు వెల్లడించడానికి లేదన్నారు. అయితే, ప్రభుత్వంలోని ఉన్నత వర్గాల సమాచారం మేరకు... రుణ ఎగవేతదారుల ఆస్తులను (స్ట్రెస్డ్ అసెట్స్/ఎన్పీఏ) వేలం వేసినప్పుడు... వాటిని రుణ ఎగవేత చరిత్ర ఉన్న ప్రమోటర్లు, మోసపూరిత చరిత్ర కలిగిన ప్రమోటర్లు సొంతం చేసుకోకుండా నిరోధించడమే ఆర్డినెన్స్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అలాగని, బ్యాంకులకు రుణ బకాయి పడిన కంపెనీల ప్రమోటర్లను వేలంలో పాల్గొనకుండా పూర్తి నిషేధం విధించడంగా దీన్ని చూడరాదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ‘‘కార్పొరేట్ పరిష్కార ప్రక్రియను అనుసరించేవారు, తమ బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకునే ప్రమోటర్లు కూడా ఉన్నారు. వీరిని ఐబీసీ కింద వేలం వేసే ఆస్తుల కొనుగోలుకు దూరంగా ఉంచడం లేదు’’ అని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఆర్డినెన్స్ స్థానంలో సవరణలతో కూడిన చట్టాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వారి ఆస్తులు వారికే దక్కుకుండా..! ఐబీసీ కింద ఇప్పటికే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో 300 కేసులు పరిష్కారం కోసం దాఖలయ్యాయి. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకు ఈ ఏడాది జూన్లో 12 భారీ ఎన్పీఏ ఖాతాలను ఐబీసీ కింద పరిష్కారం కోసం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసే ఉంటుంది. ఈ 12 ఖాతాలకు సంబంధించిన రుణ ఎగవేతల మొత్తం రూ.1.75 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఖాతాల్లో ఆమ్టెక్ ఆటో, భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, భూషన్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, మోనెత్ ఇస్పాత్, ల్యాంకో ఇన్ఫ్రాటెక్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, ఎరా ఇన్ఫ్రా, జైపీ ఇన్ఫ్రాటెక్, ఏబీజీ షిప్యార్డ్, జ్యోతి స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటిలో 11 కేసులు ఎన్సీఎల్టీలో దాఖలు కాగా, దివాళా ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్బీఐ 30 నుంచి 40 ఎన్పీఏ ఖాతాలతో ఐబీసీ కింద చర్యలు చేపట్టాలంటూ బ్యాంకులకు మరో జాబితా కూడా పంపించింది. అయితే, ఐబీసీ కింద కంపెనీల ఆస్తులను వేలానికి ఉంచినప్పుడు బిడ్ వేసే వారి అర్హతలు ఏంటన్నది చట్టంలో నిర్దేశించలేదు. దీంతో రుణాలు ఏగవేసిన ప్రమోటర్లే తిరిగి ఆస్తులను తక్కువ ధరలకు సొంతం చేసుకునే అవకాశం ఉందంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ఇందుకు ఎస్సార్ స్టీల్ కేసే ఉదాహరణ. ఎస్సార్ స్టీల్ రూ.37,284 కోట్ల బకాయిలు బ్యాంకులకు చెల్లించకుండా చేతులు ఎత్తేసింది. ఐబీసీ పరిష్కార ప్రక్రియ కింద ఎస్సార్ స్టీల్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఎస్సార్ గ్రూపు ఆసక్తి వ్యక్తీకరించడం గమనార్హం. ‘‘ఈ విధమైన ఆందోళనల నేపథ్యంలో దివాళా చట్టం కింద ఆస్తులకు అర్హత కలిగిన వారే బిడ్ వేసే విధంగా చూసేందుకు చట్టంలో సవరణలు ప్రతిపాదించాల్సి వచ్చింది’’ అని అధికార వర్గాలు తెలిపాయి. కేబినెట్ ఇతర నిర్ణయాలు... 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ సంఘం పన్నుల ఆదాయ వనరులను మదింపు వేసి వాటిని కేంద్రం, రాష్ట్రాల వారీగా ఏ విధంగా పంపిణీ చేయాలన్న విధానాన్ని రూపొందిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులను త్వరలోనే నియమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆర్థిక సంఘం తన సిఫార్సులను సమర్పించేందుకు రెండేళ్ల సమయం తీసుకోవడం సాధారణం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015 జనవరి 1 నుంచి 2020 మార్చి 31 వరకు కాలానికి అమల్లో ఉంటాయి. ఈబీఆర్డీలో సభ్యత్వం యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఈబీఆర్డీ)లో భారత సభ్యత్వం తీసుకునేందుకు కేబినెట్ ఇచ్చింది. దీంతో తయారీ, సేవలు సహా వివిధ రంగాలకు కావాల్సిన నిధుల సమీకరణ సులభం కానుంది. ఈబీఆర్డీలో సభ్యత్వం తీసుకునేందుకు అవసరమైన చర్యల్ని ఆర్థిక వ్యవహారాల విభాగం చేపడుతుందని జైట్లీ తెలిపారు. ఐఐసీఏకు రూ.18 కోట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ)కు రూ.18 కోట్ల సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకానికీ కేబినెట్ ఆమోదముద్ర పడింది. ఇక ఐటీ చట్టాల్లో భారీ మార్పులు! సమీక్ష కోసం అత్యున్నత స్థాయి కమిటీ న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు కేంద్రం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునర్ లిఖించడం, ముసాయిదా రూపకల్పన ఈ కమిటీ కర్తవ్యం. ఆరు నెలల్లో కమిటీ ఈ మేరకు తన నివేదికను సమర్పించాల్సి ఉంది. ఆరుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీ సభ్యులు (లెజిస్లేషన్) అరవింద్మోదీ కన్వీనర్గా ఉంటారు. గిరీష్ అహూజా (చార్డెడ్ అకౌంటెంట్), రాజీవ్ మెమానీ (ఈవై చైర్మన్ అండ్ రీజినల్ మేనేజింగ్ పార్ట్నర్) మాన్సీ కేడియా (కన్సల్టెంట్, ఐసీఆర్ఐఈఆర్) కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కమిటీకి శాశ్వత ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. వివిధ దేశాల్లో ప్రస్తుతం పన్ను వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలు ఏమిటి? దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎలా ఉండాలి? వంటి అంశాలను తన కర్తవ్య నిర్వహణలో కమిటీ పరిశీలిస్తుంది. -
ఓటీపీ ఉంటేనే..!
సాక్షి, సిటీబ్యూరో: ఓ యువకుడి నుంచి అమెరికాలో రూ.4 లక్షల జీతం వచ్చే ఉద్యోగమంటూ రూ.86 లక్షలు గుంజారు... ఫార్వర్డ్ ట్రేడింగ్లో పెట్టుబడి పేరుతో నగరానికి చెందిన జయరాజ్ నుంచి రూ.11 లక్షలు కాజేశారు... సికింద్రాబాద్కు చెందిన శ్రీనివాస్తో విత్తుల సరఫరా వ్యాపారమంటూ నేరగాళ్లు రూ.8.5 లక్షలు స్వాహా చేశారు.. వడ్డీ లేని రుణం పేరుతో నారాయణగూడకు చెందిన ఫారూఖ్ను రూ.62 లక్షలు ముంచారు... రూ.3.6 కోట్ల లాటరీ పేరుతో బంజారాహిల్స్ వాసి ఫిరోజ్ ఖాన్ నుంచి రూ.22 లక్షలు కాజేశారు... తమ ఆస్తిని ఇస్తామంటూ ఫేస్బుక్ ద్వారా ఎర వేసి ఓ వ్యక్తి నుంచి రూ.76 లక్షలు దండుకున్నారు... ఇటీవల కాలంలో నగర వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు వివిధ పేర్లతో కాజేసిన మొత్తాలివి. ఈ పంథాలో రెచ్చిపోతున్న క్రిమినల్స్ను కట్టడి చేసేందుకు బ్యాంకింగ్ రంగంలో కొత్త నిబంధనల అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వీటిలో ప్రతి లావాదేవీకి వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఏర్పాటు కీలకమని అభిప్రాయపడుతున్నవారు ఇదే విషయాన్ని త్వరలో జరుగనున్న సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. బ్యాంకు ఖాతాలే కీలకం... ఈ తరహా మోసాలను నైజీరియా, సోమాలియా తదితర దేశాల నుంచి వచ్చి మెట్రో నగరాల్లో స్థిరపడిన నల్లజాతీయులే ఎక్కువగా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, ఈ–మెయిల్ ద్వారా ఎర వేస్తున్న ఈ సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. అయితే వీరు అత్యంత అరుదైన సందర్భాలు మినహాయిస్తే బాధితులను నేరుగా కలవరు. కేవలం తమ మాటలు, తప్పుడు పత్రాలతో ఎర వేసి ఎదుటి వారిని పూర్తిగా తమ ముగ్గులోకి దింపుతారు. ఆపై వివిధ రకాలైన పన్నులు తదితరాల పేర్లు చెప్పి వారి నుంచి నగదును డిపాజిట్, ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఇందుకు వీరికి బ్యాంకు ఖాతాలు అత్యంత కీలకం. అయితే పోలీసులకు చిక్కే, బ్యాంకు సిబ్బంది అనుమానించే అవకాశం ఉండటంతో వీరు ఎప్పుడూ తమ బ్యాంకు ఖాతాలను నేరాలు చేయడానికి వినియోగించరు. ‘మనీమ్యూల్స్’ను ఏర్పాటు చేసుకుని... ఈ బ్యాంకు ఖాతాల కోసం సైబర్ నేరగాళ్లు మనీమ్యూల్స్ను ఏర్పాటు చేసుకుంటారు. నేరాలకు సంబంధించిన డబ్బు డిపాజిట్ చేసుకోవడానికి అవసరమైన బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ ఖాతాల్లో పడిన సొమ్మును డ్రా చేసి నేరగాళ్లుకు ఇవ్వడమో, డెబిట్ కార్డు వంటివి అందించడమే చేసే వారికి సాంకేతికంగా మనీమ్యూల్స్ అంటారు. ఇలా సహకరించినందుకు వీరికి సైబర్ నేరగాళ్లు కొంత కమీషన్ చెల్లిస్తుంటారు. ఈ మనీమ్యూల్స్లో అత్యధికులు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. ఆయా మెట్రో నగరాల్లో నివసించినప్పుడు వారిని మనీమ్యూల్స్గా మారుస్తున్న నైజీరియన్లు ఆ తర్వాత వారి ఖాతాలను వాడుకుంటున్నారు. ఇలాంటి మనీమ్యూల్స్లో కొందరికి ప్రస్తుతం సైబర్ నేరగాళ్లతో సంబంధాలు ఉండట్లేదు. ఓటీపీ పక్కా చేస్తే... బాధితుల ద్వారా మనీమ్యూల్స్కు చెందిన ఖాతాల్లో పడిన డబ్బును వారి నుంచి సేకరించిన డెబిట్కార్డు ద్వారా సైబర్ నేరగాళ్ళు డ్రా చేసుకుంటున్నారు. ఆన్లైన్ కార్యకలాపాల మాదిరిగా ఏటీఎంలో డ్రా చేయడానికి ఓటీపీ ఏర్పాటు చేస్తే ఇలాంటి వారిని కట్టడి చేసే ఆస్కారం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఖాతాలో పడిన డబ్బు డ్రా చేయాలంటూ ఓటీపీ తప్పనిసరి అయితే అప్పటికే వాడుతున్న మనీమ్యూల్స్ ఖాతాలు సైబర్ నేరగాళ్ళకు అక్కరకు రాకుండా పోతాయని పోలీసులు చెబుతున్నారు. అలాంటప్పుడు నేరగాళ్లు డబ్బు డ్రా చేయడానికి అవసరమైన ఓటీపీ కోసం ఖాతాదారులను సంప్రదిస్తే ఆ ఆధారాలను బట్టి వారిని పట్టుకోవడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజ్తో పాటు ప్రతి లావాదేవీకీ ఓటీపీని సైతం పక్కా చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్బీఐ అధికారులతో జరిగే త్రైమాసిక సమావేశంలో దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనలు చేయాలని యోచిస్తున్నారు. -
ఆ రంగంలో నియామకాలు పెరిగాయ్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగంలో నియామాకాలు పెరిగినట్టు తెలిసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో బ్యాంకింగ్ రంగంలో 21 శాతం వృద్ధి రేటు నమోదైందని జాబ్ పోర్టల్ నౌకరి.కామ్ రిపోర్టు చేసింది. దేశంలో ఉద్యోగ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్ నెలలో మొత్తం ఉద్యోగ మార్కెట్ 3 శాతం వృద్ధిని నమోదుచేసిందని పేర్కొంది. ఈ వృద్ధి కూడా బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఆటో, ఇంజనీరింగ్ వంటి రంగాల వల్ల సాధ్యమైందని నౌకరి.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వీ.సురేష్ పేర్కొన్నారు. వచ్చే కొన్ని నెలల వరకు ఉద్యోగ మార్కెట్లో ఈ అస్థిరత కొనసాగుతుందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో నియామకాలు 15 శాతం వృద్ధిని నమోదుచేశాయని చెప్పారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఉద్యోగాలు 32 శాతం, ఫైనాన్స్ ఉద్యోగాలు 15 శాతం వృద్ధి కనబర్చాయని నౌకరి.కామ్ పేర్కొంది. సాఫ్ట్వేర్ రంగంలో నియామకాలు మాత్రం ఆరు శాతం పడిపోయినట్టు తెలిసింది. మొత్తం 13 నగరాల్లో చేపట్టిన ఈ రిపోర్టులో 12 నగరాల్లో నియామకాలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ముంబై, కోల్కత్తాలో 15 శాతం వృద్ధి నమోదైంది. దేశరాజధానిలో మాత్రం నియామకాలు 9 శాతం తగ్గాయి. -
బ్యాంకులకు ముప్పు? అమెజాన్ వచ్చేస్తోంది..
-
బ్యాంకులకు ముప్పు? అమెజాన్ వచ్చేస్తోంది..
వాల్స్ట్రీట్కు గుండెకాయలా నిలుస్తున్న బ్యాంకులకు సరికొత్త ముప్పు వచ్చేస్తోంది. ఇప్పటికే వస్త్రాలు, బుక్స్, ఫుడ్ షాపింగ్పై తనదైన హవా సాగిస్తున్న అమెజాన్.కామ్ తన తర్వాతి ప్రాజెక్టుగా బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకుంటోంది. గత రెండేళ్లుగా ఈ దిగ్గజం ఆర్థిక ఆవిష్కరణ వంటి పలు విస్తృత విషయాలపై బ్యాంకింగ్ రెగ్యులేటర్లతో సంప్రదింపులు జరుపుతుందని అమెరికన్ బ్యాంకర్ బహిర్గతం చేసింది. 2011లోనే ఇది లెండింగ్ కార్యకలాపాలను ప్రారంభించిందని, తన మార్కెట్ప్లేస్లో విక్రయాలు జరుపుకోవడానికి మర్చంట్లకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఈ యూనిట్ ఇటీవల విపరీతంగా వృద్ధి చెందుతుందని, 12 నెలల కాలంలోనే 1 బిలియన్ డాలర్ల రుణాలను ఇచ్చింది. బ్యాంకింగ్ లావాదేవీలను జరుపుకోవడానికి నాన్ సంప్రదాయ సంస్థలను కూడా ప్రోత్సహించే విధంగా కొత్త అమెరికా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు సిద్ధమవుతున్నాయని తెలిసింది. ఆన్లైన్గా రుణాలు ఇవ్వడానికి, మార్కెట్ప్లేస్ లెండర్లకు ఇటీవల కాలంలో వృద్ధిని చూస్తున్నామని ది యాక్టింగ్ కంప్ట్రోలర్ ఆఫ్ ది కరెన్సీ కీత్ నోరేకా చెప్పారు. ఒకవేళ అమెజాన్ లేదా ఆల్ఫాబెట్ లాంటి కంపెనీలు ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ఫామ్ను లేదా సెక్యురిటీస్ ట్రేడింగ్ సిస్టమ్ను ఏర్పాటుచేస్తే ప్రస్తుత ఆర్థిక సంస్థలకు తీవ్ర పోటీ వాతావరణం నెలకొంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అమెజాన్కు విస్తృత లక్ష్యాలున్నాయని పీక్ఐక్యూ వ్యవస్థాపకుడు రామ్ అహ్లువాలియా చెప్పారు. ఒక్క అమెజాన్ మాత్రమే కాక పేపాల్, గూగుల్ సంస్థలు కూడా బ్యాంకింగ్ రంగంలోకి దిగాలని యోచిస్తున్నట్టు తెలిసింది. -
అక్కడా.. లైంగిక వేధింపులు!
ముంబై : బ్యాంకింగ్ రంగంలోనూ లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ముందటి ఏడాదితో పోలిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ లైంగిక వేధింపుల ఘటనలు బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్నట్టు తాజా డేటాలో వెల్లడైంది. బొంబై స్టాక్ ఎక్స్చేంజస్(బీఎస్ఈ)ల్లో లిస్టు అయిన 25 బ్యాంకుల్లో గత ఆర్థిక సంవత్సరం 210 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. 2015-16తో పోలిస్తే ఇది 5 శాతం అధికం. కాంప్లికారో సర్వీసెస్ ఈ డేటాను విడుదల చేసింది. లైంగిక వేధింపుల కేసుల్లో ఐసీఐసీఐ బ్యాంకు తొలి స్థానంలో ఉంది. ఈ బ్యాంకుకు సంబంధించి 95 కేసులు నమోదయ్యాయి. యాక్సిస్ బ్యాంకులో 32 కేసులు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 16 కేసులు నమోదైనట్టు ఈ డేటాలో వెల్లడైంది. ఈ కేసులను డీల్ చేయడానికి ఆర్గనైజేషన్లలో పారదర్శకత, ఉద్యోగుల మధ్య మంచి అవగాహన తీసుకురావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలు లేకుండా సౌకర్యవంతంగా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక బలమైన వ్యవస్థను బ్యాంకులు రూపొందించాలని ఈ రిపోర్టు సూచిస్తోంది. చాలా కంపెనీలు వేధింపులు, తప్పుడు ప్రవర్తన వంటి వాటికోసం జీరో-టోలరెన్స్ పాలసీని ప్రవేశపెట్టాయని నిపుణులు చెప్పారు. అయితే ఎక్కువ మొత్తంలో లైంగిక వేధింపులు ఫిర్యాదులు వెల్లువెత్తడం, అవన్నీ నిజం కావాల్సినవసరం కూడా లేదని కాంప్లికారో వ్యవస్థాపకులు విశాల్ కేడియా అన్నారు. పబ్లిక్ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. 9 పీఎస్యూ బ్యాంకుల్లో 2016-17లో 47 కేసులు నమోదయ్యాయి. ఆ ముందటి సంవత్సరం ఇవి 50గా ఉన్నాయి. కానీ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం 150 కేసుల నుంచి 163 కేసులకు పెరిగాయి. -
29% పెరిగిన ఆంధ్రాబ్యాంకు లాభం
6.21 నుంచి 8.09 శాతానికి చేరిన ఎన్పీఏలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఆంధ్రాబ్యాంకు జూన్ త్రైమాసికంలో ఉత్తమ ఫలితాలను నమోదు చేసింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో నికరలాభం 29 శాతం అధికమై రూ.40 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.4,855 కోట్ల నుంచి రూ.5,155 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం 13.55 శాతం పెరిగి రూ.1,441 కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లు 5.61 శాతం వృద్ధితో రూ.1,88,272 కోట్లకు, మొత్తం అడ్వాన్సులు 6.25 శాతం పెరిగి రూ.1,45,801 కోట్లకు చేరుకున్నాయి. కార్పొరేట్, మిడ్ కార్పొరేట్ అడ్వాన్సులు 6.90 శాతం తగ్గి రూ.59,918 కోట్లు నమోదు చేసింది. ఎంఎస్ఎంఈకి ఇచ్చిన అడ్వాన్సులు ఏకంగా 23.2 శాతం హెచ్చి రూ.28,637 కోట్లుగా నమోదయ్యాయి. గృహ రుణాలు 25.5 శాతం అధికమయ్యాయి. సూక్ష్మ తరహా కంపెనీలకు పెద్ద పీట వేస్తూ రూ.10,527 కోట్ల రుణాలను మంజూరు చేసింది. క్రితం ఏడాది జూన్ క్వార్టరుతో పోలిస్తే ఇది 55.11 శాతం అధికం. నికర ఎన్పీఏలు 6.21 నుంచి 8.09 శాతానికి చేరాయి. రాని బాకీల కోసం చేసిన కేటాయింపులు గతేడాది జూన్ త్రైమాసికంలో రూ.942 కోట్లు ఉండగా, 2017–18 క్యూ1లో ఇవి రూ.1,209 కోట్లకు చేరడం గమనార్హం. లార్జ్, మిడ్ కార్పొరేట్ల ఎన్పీఏలు అధికమయ్యాయి. ఈ కంపెనీలకు ఇచ్చిన అడ్వాన్సుల్లో 24.38 శాతం నిరర్ధక ఆస్తులుగా మారాయి. -
ఇక ప్రభుత్వ బ్యాంకుల ఎఫ్పీఓల జోరు!
► మొండిబకాయిల పరిష్కారానికి ప్రభుత్వ చర్యల ఆసరా... ► మార్కెట్ నుంచి నిధుల సమీకరణ వేగవంతం... ► ఆర్థిక శాఖ సీనియర్ అధికారి వెల్లడి న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగాన్ని పట్టిపీడీస్తున్న మొండి బకాయిల ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని చర్యలను ప్రకటించడంతో... ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నిధుల సమీకరణ ప్రయత్నాలు ఇక జోరందుకోనున్నాయి. ఎన్పీఏలకు అడ్డుకట్టకోసం రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కి మరిన్ని అధికారాలు కల్పించేలా బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘కేంద్రం ఎన్పీఏలపై తీసుకుంటున్న చర్యలు.. పీఎస్బీల బ్యాలెన్స్షీట్లు మెరుగుపడేందుకు దోహదం చేయనున్నాయి. దీనివల్ల షేరు విలువలు కూడా పుంజుకోవడానికి వీలవుతుంది. దీంతో మార్కెట్ నుంచి నిధుల సమీకరణ వేగవంతం కానుంది’ అని ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముంచుకొస్తున్న ‘బాసెల్’ గడువు... బాసెల్–3 అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మన బ్యాంకులు తగినంత మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాణాలు 2019 మార్చి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ లోగా భారతీయ బ్యాంకుల క్యాపిటల్అడిక్వషీ రేషియో(సీఏఆర్) బాసెల్–3 ప్రమాణాలకు అనుగుణంగా పెంచుకోవాలి. దీనికోసం పీఎస్బీలకు కేంద్రం ఇప్పటికే ఇంద్రధనుష్ పేరుతో ఒక ప్రణాళికను ప్రకటించింది. దీనిప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎస్బీలకు రూ.70 వేల కోట్ల మూలధనం అందుతుంది. ఇప్పటికే ఇందులో రూ.50 వేల కోట్లను పీఎస్బీలకు సమకూర్చింది. మిగతా మొత్తాన్ని కూడా 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇవ్వనుంది. కాగా, బాసెల్–3 అవసరాల నిమిత్తం మరో రూ.1.1 లక్షల కోట్లను ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీఓ) సహా ఇతరత్రా మార్గాల్లో మార్కెట్ నుంచి పీఎస్బీలు సమీకరించాల్సి ఉంటుందని ‘ఇంద్రధనుష్’లో నిర్ధేశించారు. ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం... ప్రస్తుత 2017–18 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సుమారు అరడజను బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులను సమీకరించే అవకాశం ఉంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) వంటివి ఈ ఏడాది ఎఫ్పీఓలను జారీచేయొచ్చని ఆర్థిక శాఖ అధికారి చెప్పారు. కాగా, ఈ ఏడాది ఎఫ్పీఓ సహా ఇతరత్రా మార్గాల్లో రూ.15,000 కోట్ల మేర నిధుల సమీకరణకు ఎస్బీఐ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర కూడా వేసింది. -
గుదిబండగా మారిన ఎన్పీఏలు
► భూసేకరణ, ఇతర ఇబ్బందులతో ఆగిన ప్రాజెక్టులు ► ముడి పదార్థాల సరఫరా సమస్యలు ► రుణాలు చెల్లించలేని పరిస్థితికి కార్పొరేట్ సంస్థలు ► దీంతో పెరిగిపోయిన ఎన్పీఏలు దేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభానికి గురి చేసిన వసూలు కాని మొండి బకాయిల (ఎన్పీఏలు/నిరర్థక ఆస్తులు) సమస్యకు చికిత్స చేసేందుకు ఎట్టకేలకు కేంద్రం నడుం బిగించింది. ఫలితమే బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఆర్డినెన్స్ను రూపొందించడం. దీనికి మార్కెట్లు కూడా చాలా సానుకూలంగా స్పందించాయి. బ్యాంకింగ్ షేర్లు గురువారం లాభాల్లో ముగియడమే ఇందుకు నిదర్శనం. నిజానికి ఎన్పీఏల సమస్య ఈ స్థాయికి చేరడం విధానాల్లో లోపంగానే కనిపిస్తోంది. కొంచెంగా మొదలై... గత ఐదేళ్లలోనే ఎన్పీఏల పెరుగుదల భారీగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2012 మార్చి నాటికి ఉన్న స్థూల ఎన్పీఏలు రూ.1.3 లక్షల కోట్లు. 2016 సెప్టెంబర్ నాటికి అవి రూ.6.7 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. నిరర్థక ఆస్తులన్నింటినీ గుర్తించి వాటికి కేటాయింపులు చేయడం ద్వారా 2017 మార్చి నాటికి తమ ఖాతా పుస్తకాలను ప్రక్షాళన చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తన హయాంలో నిర్దేశించారు. 2015 సెప్టెంబర్ నాటికి రూ.3.4 లక్షల కోట్లుగా ఉన్న స్థూల ఎన్పీఏలు ఏడాదిలోనే 2016 సెప్టెంబర్ నాటికి రెట్టింపు కావడం గమనార్హం. విధానపరమైన సమస్యలు ఎన్పీఏలకు ఓ కారణంగానూ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నో భారీ ప్రాజెక్టులు భూసేకరణ పరమైన అడ్డంకుల కారణంగా నిలిచిపోయాయి. దీనికితోడు ముడి పదార్థాల సరఫరా పరంగానూ ఇబ్బందులు తలెత్తడంతో ఆయా ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకున్న సంస్థలు ఇక్కట్ల పాలయ్యాయి. ఇక ఆర్థిక సంక్షోభం దరిమిలా క్షీణించిన డిమాండ్ తిరిగి పుంజుకోకపోవడంతో చాలా రంగాల్లో మిగులు ఉత్పత్తికి దారితీసింది. దీంతో రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం పడకేసింది. ఇక బ్యాంకులు సైతం కార్పొరేట్ సంస్థలకు రుణాలిచ్చే విషయంలో సరైన పరిశీలనలు చేపట్టకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గుడ్డిగా వ్యవహరించడం కూడా సమస్యను తీవ్రతరం చేసింది. రుణాలు తీర్చే సామర్థ్యం తగ్గుదల ఆర్బీఐ పలు పథకాలను ప్రకటించినప్పటికీ ఎన్పీఏల సమస్యకి పరిష్కారం లభించలేదు. మూలంలోనే సమస్య ఉండడంతో మొండి బకాయిలు కట్టలు తెంచుకున్నాయి. దేశీయ సంస్థల రుణ చెల్లింపుల సామర్థ్యం సైతం దెబ్బతిన్నది. ముఖ్యంగా విద్యుత్తు, స్టీల్ రంగాల్లోని ప్రముఖ కంపెనీలకూ ఈ పరిస్థితి ఎదురైంది. ఆర్బీఐ గత డిసెంబర్లో విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం భారీ రుణాలు తీసుకున్న సంస్థల వాటా బ్యాంకుల మొత్తం రుణాల్లో 56 శాతంగా ఉండగా... మొత్తం ఎన్పీల్లో ఈ సంస్థల వాటా 88 శాతం కావడం గమనించాల్సిన అంశం. 40–50 పెద్ద సంస్థలపై దృష్టి సారిస్తే చాలు ఎన్పీఏల సమస్య పరిష్కారమైపోతుందని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ కూడా ఇటీవలే పేర్కొన్నారు. బ్యాంకులకు కష్టాలు పెరుగుతున్న ఎన్పీఏలకు బ్యాంకులు తమ లాభాల్లోంచి కేటాయింపులు చేయాల్సి రావడం వాటికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్పీఏలకు కేటాయింపుల కారణంగా గత ఆరు నెలలుగా అవి నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇవి సమీప కాలంలోనూ పరిష్కారమయ్యేలా లేవు. ఎందుకంటే ఒత్తిడిని ఎదుర్కొంటున్న (సకాలంలో తీర్చలేని) మంచి రుణాలకు సైతం బ్యాంకులు కేటాయింపులు చేయాలని ఆర్బీఐ ఇటీవలే సూచించింది. ఈ విధమైన సమస్యలు 2019 నాటికి బాసెల్–3 మూలధన అవసరాలను చేరుకునే విషయంలో బ్యాంకులకు అవరోధంగా నిలుస్తున్నాయి. -
దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగమే వెన్నెముక
► ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి న్యూశాయంపేట: భారత దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగం వెన్నెముక అని, బ్యాంకింగ్ రంగంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం సామన్యుడు సైతం అర్థం చేసుకున్నప్పుడే సార్థకత అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి అన్నారు. గురువారం ఖిలావరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి కళాశాలలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రభావం బ్యాంకింక్ రంగంపై ఉందన్నారు. ఫలితంగా ప్రైవేటు బ్యాంకులు ఆవిర్భవించాయని, వినియోగదారులకు సేవలందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరిగిందన్నారు. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువైన నేపథ్యంలో సామాన్యులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ విద్యార్థులపై ఉందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శంకరయ్య మాట్లాడుతూ కంప్యూటరైజేషన్ వల్ల బ్యాంకింగ్ సేవలు వేగవంతమై వినియోగదారులు సులభమైన సేవలు పొందుతున్నారన్నారు. ఈ సదస్సులో తెలంగాణలోని వివిధ ఎంబీఏ విద్యాసంస్థల నుంచి 80 మంది అధ్యాపకులు, విద్యార్థులు పలు అంశాల్లో పత్ర సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కేయూ ప్రిన్సిపాల్ శర్మ, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం సూర్యనారాయణ, వాగ్దేవి విద్యాసంస్థలపాలనాధికారి సత్యపాల్రెడ్డి, డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ప్రిన్సిపాల్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ఆరంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో నామమాత్ర లాభాలతో మొదలైనా అంతలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 71 పాయింట్లు పతనమై 26,524 , నిఫ్టీ 17 పాయింట్లు క్షీణించి 8,163 వద్ద ట్రేడవుతోంది. భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోకి నష్టాలను మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ లూజర్స్ గా ఉన్నాయి. శాతం నష్టపోయాయి. నిఫ్టీ 0.6-1.4 శాతం క్షీణించింది. లెండింగ్ రేట్ల కోత దెబ్బతో బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ ఒకొక్కటీ 0.65-1.4 శాతం నష్టపోతుండగా. ఎన్ఎస్ఇ బ్యాంకింగ్ ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్ 0.67 శాతం పతనమైంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ 0.5-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి అటు డాలర్ తో పోలిస్తే రూపాయి నష్టాల్లో ఉంది. 13 పైసలు నష్టపోయి రూ. 68.13 దగ్గర ఉంది. సోమవారం నాటా ముగింపు. రూ.68.22 . బంగారం ధరలు మాత్రం కొత్త సంవత్సరంలో పుంజుకున్నాయి. ఎంసీఎక్స్ బంగారం ధరలు. రూ.123లు ఎగిసి రూ. పది గ్రా. రూ.27,568 వద్ద ఉంది. -
ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై సెబీ కొరడా
► స్టాక్ మార్కెట్ నుంచి నిధుల సమీకరణపై నిషేధం.. ► లిస్టెడ్ కంపెనీల్లో బోర్డు పదవులకూ చెక్... ► సవరించిన నిబంధనలను నోటిఫై చేసిన సెబీ న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యతో బ్యాంకింగ్ రంగం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా కఠిన చర్యలను చేపట్టింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల(విల్ఫుల్ డిఫాల్టర్లు) జాబితాలో ఉన్న సంస్థలు, వ్యక్తులు ఎవరైనా క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఇకపై నిధులను సమీకరించకుండా నిషేధం విధించింది. అదేవిధంగా సంబంధిత వ్యక్తులు లిస్టెడ్ కంపెనీల డెరైక్టర్ల బోర్డుల్లో కూడా ఎలాంటి పదవులూ చేపట్టడానికి అవకాశం లేనట్టే. ఈ మేరకు సవరించిన నిబంధనలను సెబీ నోటిఫై చేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా రుణాలను ఎగవేసి.. దేశం విడిచి పరారైన నేపథ్యంలో సెబీ చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పలు బ్యాంకులు ఇప్పటికే మాల్యాను విల్ఫుల్ డిఫాల్టర్గా ప్రకటించాయి కూడా. మరోపక్క, డియాజియోతో ఒప్పందం ప్రకారం యునెటైడ్ స్పిరిట్స్ కంపెనీ చైర్మన్, డెరైక్టర్ పదవి నుంచి తప్పుకున్న మాల్యా.. ఇంకా పలు ఇతర కంపెనీల డెరైక్టర్ల బోర్డుల్లో మాత్రం కొనసాగుతున్నారు. సెబీ సవరించిన నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, ఇలాంటి కంపెనీలకు మార్కెట్ నుంచి పూర్తిగా నిధుల సమీకరణ చేయకుండా నిషేధం విధించడం వల్ల ఇతర వాటాదారుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ► విల్ఫుల్ డిఫాల్టర్గా ప్రకటించిన కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్, బ్రోకరేజి సంస్థలు వంటి మార్కెట్ ఆధారిత సంస్థలను ఏర్పాటు చేయడాలికి వీల్లేదు. అదేవిధంగా ఇతర లిస్టెడ్ కంపెనీలను టేకోవర్ చేయడం కూడా కుదరదు. ► డిఫాల్ట్ అయిన కంపెనీ లేదా సంబంధిత ప్రమోటర్లు, డెరైక్టర్లు ఎవరూ పబ్లిక్ ఇష్యూల ద్వారా షేర్ల జారీ, డెట్ సెక్యూరిటీలు, నాన్-కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టకూడదు. ► ప్రస్తుత వాటాదారుల నుంచి(ప్రమోటర్లు సహా) రైట్స్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ రూపంలో ఇటువంటి కంపెనీలు నిధులను సమీకరిచేందుకు అవకాశం ఉంటుంది. అయితే, తమను ఏ బ్యాంకు విల్ఫుల్ డిఫాల్టర్గా ప్రకటించిందో.. ఎంత బకాయి చెల్లించాల్సి ఉందో ఇతరత్రా వివరాన్నింటినీ సంబంధిత కంపెనీ తెలియజేయాల్సి ఉంటుంది. ► ప్రమోటర్లు లేదా కీలకమైన యాజమాన్య పదవుల్లో ఉన్న వ్యక్తులు లేదా డెరైక్టర్లు విల్ఫుల్ డిఫాల్టర్గా ఉన్న కంపెనీల కొత్త రిజిస్ట్రేషన్లకు సెబీ అనుమతించదు. -
వచ్చే జనవరికల్లా తపాలా బ్యాంకు
న్యూఢిల్లీ: తపాలా శాఖ త్వరలో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టనుంది. వచ్చే జనవరి నాటికి పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూత్ర ప్రాయంగా అంగీకారాన్ని తెలిపిందని సీనియర్ అధికారి ఒకరు బుధవారం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికి గానీ, వచ్చే జనవరికి గానీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) ప్రారంభించి తీరుతాం. గత పదిహేనేళ్ల నుంచి వెస్ట్రన్ యూనియన్తో భాగస్వామిగా ఉన్నాం అని ఇండియా పోస్ట్ మెంబర్ ఫర్ బ్యాంకింగ్, హెచ్ఆర్డీ ఎంఎస్.రామానుజన్ తెలియజేశారు. ఈ బ్యాంకులకు అవసరమైన సిబ్బందిని తపాలా శాఖలో చేస్తున్న వారితోపాటు బయటినుంచి తీసుకుంటామన్నారు. పేమెంట్స్ బ్యాంకు కోసం తపాలా శాఖ ఇప్పటికే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు(పీఐబీ) నుంచి క్లియరెన్స్ పొందిందని. త్వరలోనే ఆర్థిక శాఖ ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘సంక్షేమం’ అమలులో బ్యాంకులు కీలకం
♦ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ♦ ముచ్చర్ల గేట్ వద్ద నూతన ఎస్బీహెచ్ శాఖను ప్రారంభం కందుకూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల అమలులో బ్యాంకింగ్ రంగం పెద్దన్న పాత్ర పోషిస్తోందని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని ముచ్చర్లగేట్ వద్ద ఏర్పా టు చేసిన స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ కార్యాలయాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం బ్యాంక్ ఎదుట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో బ్యాంకులదే కీలకపాత్రన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా బ్యాంకులకు తోడ్పాటునందిస్తామని తెలిపారు. బ్యాంకుల సేవలను అన్నదాతలతో పాటు వ్యాపారులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముచ్చర్లలో ఏర్పాటు చేసిన 1933వ శాఖ అన్నారు. మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో మొదట రంగారెడ్డిలోనే ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో పెట్టుబడి పెట్టే వారికి బ్యాంకులు తమ సహాయ సహకారా లు అందించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. కార్యక్రమం లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్, ఎస్బీహెచ్ ఎండీ శాంతన్ముఖర్జీ, జీఎం సీతాపతిశర్మ, డీజీఎంలు మ్యాత్యూ కుట్టి, ఏసీ సేతీ, ఏజీఎం సూర్యప్రకాష్రావు, ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, స్థానిక శాఖ మేనేజర్ దుర్గాప్రసాద్, ఎంపీపీ అనేగౌని అశోక్గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, సర్పంచ్లు పీ జయమ్మ, కాస నర్సింహ, ఎంపీటీసీ సభ్యులు నర్సింహ, టీ ఇందిర, ఈశ్వర్గౌడ్, ఉప సర్పంచ్ రామకృష్ణ, స్థానిక నాయకులు కుర్నమోని జయేందర్, దశరథ, జంబుల గణేష్రెడ్డి, జంగయ్య, అశోక్, రాంచంద్రారెడ్డి, రమణ, రవి, యాదయ్య, దయాకర్,విష్ణువర్ధన్రెడ్డి, చెన్నకేశ్వర్, చంద్రమోహన్రెడ్డి, సుభాష్రెడ్డి, సుభాష్చందర్రెడ్డి, ఆనంద్, కృష్ణ పాల్గొన్నారు. -
‘ఎన్పీఏలపై అతి చేయొద్దు’
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలోని మొండి బకాయిల(ఎన్పీఏ) అంశంపై అతి చేయడం మంచిది కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. దీంతో మొత్తం రుణ కార్యకలాపాలకు ఆటంకం కలగవచ్చని, వృద్ధికి విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. శనివారం రిజర్వు బ్యాంక్ బోర్డు భేటీ అనంతరం జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ అంశంపై రాద్ధాంతం మంచిది కాదు. ప్రజలు రక్షణాత్మక ధోరణితో వ్యవహరించడం వల్ల మొత్తం రుణ కార్యకలాపాలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే పరిస్థితులు దాపురించాయి’ అని జైట్లీ చెప్పారు. కొన్ని రంగాల్లో వృద్ధి మందగించడం వంటి వాటివల్ల ఎన్పీఏ సమస్య తలెత్తింద న్నారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాన్ని రూపొంది స్తున్నట్లు రాజన్ చెప్పారు. వీరికి సంబంధించిరిజిస్ట్రీ నిర్వహిస్తున్నామని, జరిమానాలను అధికం చేశామని పేర్కొన్నారు. గతేడాది మార్చి నాటికి 5.43 శాతంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల స్థూల మొండిబకాయిలు అదే ఏడాది డిసెంబర్నాటికి 7.30 శాతానికి పెరిగాయి. విలువ పరంగా రూ.2.67 లక్షల కోట్ల నుంచి రూ.3.61 లక్షల కోట్లకు పెరిగాయి. -
పేమెంట్ బ్యాంకులపై ఎస్బీఐ చీఫ్ ‘యూ-టర్న్’
- వ్యతిరే కించేందుకేమీ లేదని వ్యాఖ్య ముంబై: మొన్నటిదాకా పేమెంట్ బ్యాంకుల రాకకు ప్రతికూలంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తాజాగా యూ-టర్న్ తీసుకున్నారు. ఈ తరహా బ్యాంకులను వ్యతిరే కించేందుకేమీ లేదని పేర్కొన్నారు. పేమెంటు బ్యాంకుల వల్ల పోటీ పెరిగినా.. మొత్తం బ్యాంకింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు కూడా అదే విధంగా పెరుగుతాయని బ్యాంకర్ల సదస్సు ఎఫ్ఐబీఏసీలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఎస్బీఐకి రూ. 5,393 కోట్లు ప్రభుత్వం నుంచి పొందే రూ. 5,393 కోట్ల మూలధనానికి ప్రతిగా ఆ మేర విలువ చేసే ఈక్విటీ షేర్లను ఎస్బీఐ ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీ చేయనుంది. మంగళవారం ఈ విషయాన్ని బీఎస్ఈకి తెలియజేసింది. మరోవైపు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తాము పొందే మూలధనానికి బదులుగా ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు వెల్లడించాయి. షేరు ఒక్కింటికి రూ. 41.37 రేటుతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దాదాపు రూ. 2,009 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుంది. -
అందుకే.. ఆ 2 రంగాల్లో పరిమితులు మార్చలేదు
న్యూఢిల్లీ: కీలకమైన రక్షణ, బ్యాంకింగ్ రంగాల్లో సిసలైన ఇన్వెస్టర్లే పెట్టుబడులు పెట్టాలన్నది తమ అభిమతమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాత్రికి రాత్రి అమ్ముకుని బిచాణా ఎత్తేసే తరహా ఇన్వెస్టర్ల రాకను ప్రభుత్వం కోరుకోవడం లేదని తెలిపారు. అందుకే ఈ రెండు రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని ఇప్పటిదాకా ఉన్నట్లుగానే యథాతథంగా ఉంచినట్లు మంత్రి వివరించారు. వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితుల్లో కేంద్రం మార్పులు చేసిన నేపథ్యంలో ఆమె వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పలు రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్డీఐ, ఎఫ్ఐఐ, ఎన్నారై మార్గాల్లో వచ్చే వాటన్నింటికీ ఉమ్మడి పరిమితులను వర్తింపచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షం సహకారం లభించగలదని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
భారత బ్యాంకర్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్
దుబాయ్ : దోహా బ్యాంక్ సీఈఓ ఆర్. సీతారామన్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లభించింది. బ్యాంకింగ్ రంగంలో ఈ భారతీయ బ్యాంకర్ చేసిన సేవలు, మధ్య ప్రాచ్యం ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఆయన తన సేవల ద్వారా అందించిన తోడ్పాటుకు ఈ అవార్డ్ లభించింది. ఇక్కడ ఇటీవల జరిగిన ద బ్యాంకర్ మిడిల్ ఈస్ట్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2015 కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డ్ను ప్రదానం చేశారు. -
రిలయన్స్ క్యాపిటల్లో ఎస్ఎంటీబీకి వాటాలు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించే దిశగా తమ కంపెనీలో 2.77 శాతం వాటాలను జపాన్కు చెందిన సుమితోమో మిత్సుయి ట్రస్ట్ బ్యాంక్ (ఎస్ఎంటీబీ)కి విక్రయించే ప్రక్రియ పూర్తయినట్లు రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. షేరు ఒక్కింటికి రూ. 530 చొప్పున ఈ డీల్ విలువ రూ. 371 కోట్లని, ఏడాది లాకిన్ పీరియడ్ ఉంటుందని ఒక ప్రకటనలో వివరించింది. రిజర్వ్ బ్యాంక్ అనుమతులు వస్తే ఎస్ఎంటీబీ వ్యూహాత్మక భాగస్వామిగా కొత్త బ్యాంకును ఏర్పాటు చేయగలమని రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. రెండు దేశాల్లోని క్లయింట్లకు ఇరు కంపెనీలు సంయుక్తంగా సేవలు అందించనున్నట్లు సంస్థ సీఈవో శామ్ ఘోష్ తెలిపారు. జపాన్లో నాలుగో అతి పెద్ద గ్రూప్ అయిన ఎస్ఎంటీబీ సుమారు 682 బిలియన్ డాలర్ల అసెట్స్ను నిర్వహిస్తోంది. పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్లో భాగంగా రిలయన్స్ క్యాపిటల్ ఉంది. -
ప్రభుత్వ రంగ బ్యాంక్ చీఫ్లుగా ‘ప్రైవేటు’ ఎగ్జిక్యూటివ్లు!
న్యూఢిల్లీ: ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓల ఎంపికకు ఆర్థిక మంత్రిత్వశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్లు ఉన్నాయి. మూడు సంవత్సరాల నిర్దిష్ట కాలపరిమితికి ఈ దరఖాస్తులను ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెగ్యులర్ పబ్లిక్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్లతోపాటు ప్రైవేటు బ్యాంకర్లూ ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం (ప్రైవేటు బ్యాంకర్ల నుంచీ దరఖాస్తుల ఆహ్వానం) ప్రభుత్వ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇదే తొలిసారి. మార్చి 21వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్లు పెట్టుకునే వారు కనీసం 15 సంవత్సరాలు బ్యాంకింగ్ రంగంలో పనిచేసిఉండాలి. బోర్డ్ స్థాయిలో మూడేళ్లు పనిచేసి ఉండాలి. ప్రకటన తేదీ నాటికి 45-55 మధ్య వయసు వారై ఉండాలి. -
ఉద్యోగుల్ని కాపాడుకోండి
బ్యాంకులకు ఆర్బీఐ సూచన ముంబై: బ్యాంకింగ్ రంగంలోకి మరిన్ని ప్రైవేటు సంస్థలు అడుపెట్టనున్న నేపథ్యంలో నిపుణులైన ఉద్యోగులు వలసపోకుండా తగు చర్యలు చేపట్టాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ బ్యాంకింగ్ పరిశ్రమకు సూచించారు. పేమెంట్, చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు ఆర్బీఐ త్వరలో లెసైన్స్లు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీంతో భారీగా ఉద్యోగుల వలసలు ఉంటాయని.. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ వలసల సమస్యను ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు.సెబీ నేతృత్వంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీస్ మార్కెట్స్ శుక్రవారమిక్కడ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బ్యాంకింగ్ పరిశ్రమలోని నిర్దిష్ట విభాగాలకు చెందిన నిపుణులకు భారీగా డిమాండ్ పెరగనుంది. నైపుణ్యం, ప్రత్యేకతలు ఉన్న సిబ్బంది ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిపోవచ్చని బ్యాంకులకు మేం చెబుతూవస్తున్నాం. గతంలోమాదిరిగా.. ఒక క్యాడర్ను నిర్మించుకొని ఎల్లకాలం వారినే కొనసాగించే పద్ధతి మారిపోనుంది. వలసలు అనేవి ఈ రంగంలోనూ సాధారణం కానుంది’ అని గాంధీ పేర్కొన్నారు. అయితే, తాజా వలసల రేటు ఏస్థాయిలో ఉంటుందనేది చెప్పలేమని.. కొత్త బ్యాంకులు వస్తే అనుభవం, నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు కచ్చితంగా డిమాండ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
సెన్సెక్స్ 380 పాయింట్లు హైజంప్
నాలుగు వారాల గరిష్టం... నిఫ్టీ లాభం 111 పాయింట్లు మార్కెట్ అప్డేట్ ముంబై: సెలవుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు పనిచేయకపోవడంతో గత ఐదు రోజులుగా స్తబ్దుగా ఉన్న భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం పరుగులు పెట్టాయి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు చోటు చేసుకుంటాయన్న అంచనాలు, గత ఏడాది డిసెంబర్ తయారీ రంగ గణాంకాలు ప్రోత్సాహాకరంగా ఉండటంతో మార్కెట్లు వరుసగా ఆరో సెషన్లోనూ లాభాల్లోనే సాగాయి. 27,937-27,521 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడిన సెన్సెక్స్ చివరకు 380 పాయింట్లు లాభపడి 27,888 పాయింట్ల వద్ద ముగిసింది. 50 షేర్ల నిఫ్టీ 8,400 స్థాయిని దాటేసింది.చివరకు 111 పాయింట్ల లాభంతో 8,395 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా ఐదు సెషన్లలో 299 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఒక్క శుక్రవారం రోజే 380 పాయింట్లు ఎగసింది. నాలుగు వారాల గరిష్టానికి చేరింది. బ్యాంక్ షేర్లతో పాటు క్యాపిటల్ గూడ్స్, ఐటీ, విద్యుత్తు, టెక్నాలజీ, మౌలికరంగం, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.2 ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం గురువారం పెంచింది. ఈ పెంపు వల్ల సమకూరిన మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా 15,000 కిమీ, రహదారులను నిర్మించడానికి వినియోగిస్తామని పేర్కొంది. దీంతో సిమెంట్, నిర్మాణ రంగ షేర్లు పెరిగాయి. 3జీ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన వివరాలను మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వం వెల్లడించనున్నదన్న వార్తలతో టెలికం షేర్లు జోరందుకున్నాయి. కాగా, ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. చైనా, జపాన్, తైవాన్ స్టాక్ మార్కెట్లు సెలవు కావడంతో పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు నష్టాల్లోముగిశాయి. అమెరికా మార్కెట్లు తుది సమాచారం అంతే సరికి నష్టాల్లో ఉన్నాయి. ఈ ఏడాదీ బుల్న్ ్ర అసోచామ్ నివేదిక న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది కూడా జోరుగానే పెరుగుతాయని అసోచామ్ తాజా నివేదిక వెల్లడించింది. కంపెనీల పనితీరు మెరుగుపడడం, రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండడం, వీటికి తోడు సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ పోకడలు... వీటన్నింటి ఫలితంగా ఈ ఏడాది కూడా బుల్న్ ్రకొనసాగుతుందని పేర్కొంది. 2015 భారత క్యాపిటల్ మార్కెట్ అంచనాలు పేరుతో ఈ నివేదికను అసోచామ్ రూపొందించింది. అంతర్జాతీయ మార్కెట్లు రికవరీ బాట పడుతుండడం భారత స్టాక్ మార్కెట్లకు కలసివస్తుందని ఈ నివేదిక పేర్కొంది. 2014 తరహాలోనే ఈ ఏడాది మరింత స్థిరత్వంతో స్టాక్ మార్కెట్లు రాణిస్తాయని పేర్కొంది. సెకండరీ మార్కెట్ వృద్ధి మంచిగా ఉండటం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్స్ సానుకూలంగా ఉండటంతో ఐపీఓ మార్కెట్ కూడా మంచిగానే ఉండనున్నదని పేర్కొంది. గత ఏడాది బీఎస్ఈ స్మాల్-క్యాప్ ఇండెక్స్ 70 శాతం, మిడ్-క్యాప్ ఇండెక్స్ 50 శాతానికి పైగా బీఎస్ఈ సెన్సెక్స్ 35 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. గత ఏడాది పబ్లిక్ ఈక్విటీ మార్కెట్ రూ.39,127 కోట్లు సమీకరించిందని ఈ నివేదిక వివరించింది. ఎన్సీఎంఎల్ ఐపీవో గడువు పెంపు ముంబై: వంటనూనెల వ్యాపార సంస్థ ఎన్సీఎంఎల్ ఇండస్ట్రీస్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ గడువును జనవరి 9 దాకా పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ధర శ్రేణిని కూడా రూ. 100-120 నుంచి రూ. 80-90కి తగ్గిస్తున్నట్లు బీఎస్ఈకి తెలిపింది. మార్కెట్ వర్గాల నుంచి ఐపీవోకి ఆశించిన స్పందన రాకపోవడమే ఇందుకు కారణం. 60 లక్షల ఈక్విటీ షేర్ల విక్రయానికి సంబంధించి ఐపీవో డిసెంబర్ 29న ప్రారంభమైంది. -
విలీనం దిశగా పీఎస్యూ బ్యాంకులు
నేటి నుంచి బ్యాంకింగ్ సంస్కరణలపై పూణేలో రెండు రోజుల కీలక సదస్సు లిస్ట్ అయిన అనుబంధ బ్యాంకుల వీలీనంపై ఎస్బీఐ దృష్టి తొలి జాబితాలో యునెటైడ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో కీలకమైన సంస్కరణలకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం పూణే కేంద్రంగా జనవరి 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు ‘జ్ఞాన సంగం’ పేరుతో ఆర్థిక సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలతో పాటు, అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం, పేరుకుపోయిన మొండి బకాయీలను తగ్గించడం, బాసెల్ 3 నిబంధనలకు అనుగుణంగా కావల్సిన మూలధన ఏర్పాటు వంటి కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలే ప్రధాన అజెండా అయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల సీఎండీలు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో పాటు, ఐఆర్డీఏ, పీఎఫ్ ఆర్డీఏ చైర్మన్లు, పాల్గొననున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించే ఈ సమావేశాలు రెండో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగుస్తాయి. మోదీ ఈ సందర్భం గా బ్యాంకింగ్ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి ఒక ముసాయిదాను విడుదల చేయడం తో పాటు, పీఎస్యూ బ్యాంకుల పనితీరును మెరుగుపర్చడానికి ప్రభుత్వం, బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంకు సీఎండీలతో చర్చించనున్నారు. విలీనాలకే మొగ్గు జూలై బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించిన అరుణ్ జైట్లీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జ్ఞాన సంగం సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. దేశంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా వీటిని విలీనం చేయడం ద్వారా 7-8 పెద్ద బ్యాంకులుగా తీర్చిదిద్దాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది ఒకటి రెండు బలహీనమైన బ్యాంకులను బలమైన బ్యాంకులో విలీనం చేయడంతో పాటు, ఒక ఎస్బీఐ అనుబంధ బ్యాంకును విలీనం చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగా తొమ్మిది నెలలుగా సీఎండీ లేకుండా, రూ. 10 లక్షలు దాటి రుణాలు కూడా ఇవ్వడానికి వీలులేని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఈ ప్రక్రియ మొదలు పెట్టవచ్చని తెలుస్తోంది. యునెటైడ్ బ్యాంక్ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక బ్యాంకు ఉన్నతాధికారి పేర్కొన్నారు. దీని తర్వాత గత త్రైమాసికంలో నష్టాలు ప్రకటించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనా, విజయ, యూకో వంటి బ్యాంకుల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. -
నిర్మాణాత్మక సంస్కరణలే శరణ్యం...
అప్పుడే ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుంది... వచ్చే ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండొచ్చు... 2016 మార్చి నాటికి మొండిబకాయిలు 4%కి తగ్గొచ్చు ఆర్థిక స్థిరత్వ నివేదికలోరిజర్వ్ బ్యాంక్ అభిప్రాయం... ముంబై: ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే.. ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ఒక్కటే మార్గమని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పేర్కొంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, వృద్ధి రేటు అంచనాలు పెరగడం, ద్రవ్యోల్బణం దిగిరావడం వంటి పరిణామాలతో దేశీ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితికి అడ్డుకట్టపడిందని తెలిపింది. సోమవారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్ఎస్ఆర్)లో ఈ అంశాలను ప్రస్తావించింది. 2015లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దరిదాపుల్లో స్థిరపడొచ్చని అంచనా వేసింది. వడ్డీరేట్లపై పాలసీ నిర్ణయానికి ప్రధాన కొలమానంగా ఆర్బీఐ పరిగణిస్తున్న రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఈ ఏడాది నవంబర్లో 4.4%కి దిగిరావడం తెలిసిందే. కాగా, ఈ ఏడాది(2014-15)లో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం మందగించడం ప్రధానంగా ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. మొండిబకాయిలపై ఆందోళన... బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల(ఎన్పీఏ) పెరుగుదలపైనా ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఎఫ్ఎస్ఆర్ నివేదిక(2014 జూన్లో) నాటితో పోలిస్తే ఈ రంగంలో రిస్క్లు యథాతథంగానే ఉన్నాయని.. అంటే ఈ ఎన్పీఏల సమస్యకు చెక్ చెప్పాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోందని స్పష్టం చేసింది. గడచిన ఆరు నెలల్లో బ్యాంకుల స్థూల మొండి బకాయిలు(జీఎన్పీఏ) 0.4 శాతం మేర ఎగబాకాయని... సెప్టెంబర్ చివరికి మొత్తం రుణాల్లో 4.5 శాతానికి చేరినట్లు ఆర్బీఐ వివరించింది. ఇక నికర ఎన్పీఏలు మార్చిలో 2.2 శాతం ఉండగా... సెప్టెంబర్నాటికి 2.5 శాతానికి ఎగబాకాయని తెలిపింది. అయితే, ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాల నేపథ్యంలో 2016 మార్చి నాటికి ఈ పరిమాణం 4 శాతానికి మెరుగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. రుణాల పునర్ వ్యవస్థీకరణలు ఎగబాకడం మాత్రం తీవ్ర ఆందోళనకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. జీఎన్పీఏలు, రుణ పునర్వ్యవస్థీకరణలతో కలిపితే మొత్తం మొండి బకాయిల పరిమాణం ఈ ఏడాది మార్చిలో 10 శాతం కాగా.. సెప్టెంబర్ చివరికి 10.7 శాతానికి పెరిగాయని నివేదిక వెల్లడించింది. ‘బ్యాంకుల మధ్య అంతర్గత లింకుల కారణంగా కూడా మొండిబకాయిల రిస్క్లను పెంచుతోంది. ఒక బ్యాంకుకు సమస్య తలెత్తితే ఆ రిస్క్ ప్రభావం దానితో లింకున్న ఇతర బ్యాంకులపైనా పడేందుకు దారితీస్తోంది. దీన్ని కూడా నిశితంగా పర్యవేక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి’ అని ఆర్బీఐ నివేదిక తేల్చిచెప్పింది. ప్రమోటర్ల షేర్ల తనఖాపై కన్ను... మొండిబకాయిల పెరుగుదల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా వివిధ మార్గాల్లో షేర్ల తనఖాల ద్వారా ప్రమోటర్లు చేపడుతున్న నిధుల సమీకరణను నిశితంగా తనిఖీ చేయాలని సూచించింది. ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెట్టి ఎడాపెడా నిధులను సమీకరించడం వల్ల వాటాదారుల్లో భయాలు నెలకొనడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ఆందోళనకు దారితీస్తుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా ముఖ్యమని కూడా నివేదిక అభిప్రాయపడింది. మరోపక్క, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) ఇటీవలి కాలంలో దేశీ డెట్(బాండ్లు) మార్కెట్లో ఎడాపెడా పెట్టుబడి పెట్టడంపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఇతరత్రా పరిస్థితులు మారిపోతే ఈ నిధులు ఒక్కసారిగా వెనక్కివెళ్లే ప్రమాదం ఉందని.. దీనివల్ల దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రతికూలా ప్రభావానికి దారితీస్తుందని హెచ్చరించింది. -
ఉజ్వల కెరీర్.. బ్యాంకింగ్.
గెస్ట్ కాలమ్ ‘బ్యాంకింగ్ రంగం.. బ్యాంకుల్లో కొలువులు అంటే కేవలం మనకు కనిపించే క్లరికల్, ఆఫీసర్ పోస్ట్లు మాత్రమే కాదు. బ్యాంకింగ్ రంగంలో మరెన్నో విభాగాల్లో సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలోనూ టెక్నాలజీ ఆధారిత సేవలు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా బ్యాంకుల్లో ఐటీ విభాగంలో ఎన్నెన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి’ అంటున్నారు.. టెక్నాలజీ ఆధారిత బ్యాంకింగ్ సేవల ఆవశ్యకతను గుర్తించి ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్బీటీ) డెరైక్టర్ డాక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రి. బ్యాంకింగ్ రంగంలోనూ రీసెర్చ్ అవకాశాలకూ కొదవ లేదని ఆయన పేర్కొంటున్నారు. ఐఐటీ చెన్నైలో పీహెచ్డీ చేసి ఆర్బీఐలో పలు విభాగాల్లో మూడు దశాబ్దాలకుపైగా అనుభవం గడించి.. ప్రసుతం ఐడీఆర్బీటీ డెరైక్టర్గా వ్యవహరిస్తున్న రామశాస్త్రితో ప్రత్యేక ఇంటర్వ్యూ. అకడమిక్ + ప్రొఫెషనల్ అప్రోచ్ లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1995లో ఏర్పాటు చేసిన సంస్థ ఐడీఆర్బీటీ. దీనికి ప్రధాన కారణం ఆ రోజుల్లో బ్యాంకుల్లో టెక్నాలజీ వినియోగం, అవగాహన తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో బ్యాంకులు టెక్నాలజీని అనుసరించేందుకు, అవసరమైన విధానాలు, మార్గదర్శకాలు రూపొందించేందుకు ఐడీఆర్బీటీని ప్రారంభించింది. ఇన్స్టిట్యూట్ ఏర్పాటైన నాటి నుంచి బ్యాంకింగ్ టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దిశగా చర్యలు చేపడుతోంది. మరోవైపు ఎంటెక్ వంటి అకడమిక్ కోర్సులు, బ్యాంక్ ఆఫీసర్లకు శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్లోనూ రీసెర్చ్ అవకాశాలు రీసెర్చ్ అంటే కేవలం సైన్స్, ఇంజనీరింగ్కే పరిమితం కాదు. బ్యాంకింగ్లోనూ ఈ అవకాశం ఉంది. ఉదాహరణకు మ్యాథమెటిక్స్లోని క్రిప్టోగ్రఫీ ఫండమెంటల్ రీసెర్చ్ బ్యాంకింగ్లో ఆవిష్కరణలకూ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ రంగంలో మొబైల్ పేమెంట్స్, అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బయో మెట్రిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ మొదలైనవి ముఖ్యమైన రీసెర్చ్ అంశాలుగా ఉన్నాయి. బ్యాంకు కొలువులకు సరితూగే అకడమిక్స్ నేటి యువతలో బ్యాంకు కొలువులంటే ఎనలేని క్రేజ్ అనేది నిస్సందేహం. అకడమిక్స్ పరంగా ఎకనామిక్స్, బ్యాంకింగ్, కామర్స్, అకౌంటెన్సీ, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఆడిటింగ్ నేపథ్యం ఉంటే సంప్రదాయ బ్యాంకు కొలువులకు సరితూగుతారు. కానీ బ్యాంకులు అన్ని నేపథ్యాల అభ్యర్థులను నియమించుకుని తమకు అవసరమైన రీతిలో శిక్షణనిస్తున్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా బ్యాంకులు నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సేవల్లో సాంకేతికతను (ఉదా: ఏటీఎం, ఇంటర్నెట్ సేవలు, మొబైల్ బ్యాంకింగ్) అమలు చేస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. కొత్త టెక్నాలజీలను వినియోగించి మరిన్ని కొత్త సేవలు, ఉత్పత్తులు రూపొందించడంలో కృషి చేస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ రంగంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. జనరల్ పోస్ట్లతోపాటు ప్రత్యేకంగా ఐటీ విభాగాల్లో టెక్నాలజీ స్పెషలిస్ట్ల నియామకాలు చేపడుతున్నాయి. ఐడీఆర్బీటీలో అకడమిక్ ఎంట్రీ ప్రస్తుతం ఐడీఆర్బీటీ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఎంటెక్, పీహెచ్డీ కోర్సులను నిర్వహిస్తోంది. హెచ్సీయూ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా సీట్ల భర్తీ జరుగుతుంది. ఎంటెక్లో బ్యాంకింగ్ టెక్నాలజీ, పేమెంట్ సిస్టమ్స్ టెక్నాలజీ, క్వాంటిటేటివ్ మెథడ్స్ ఫర్ ఫైనాన్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన విద్యార్థులకు బ్యాంకులతోపాటు సాఫ్ట్వేర్ సంస్థలు, బ్యాంకింగ్ ప్రాజెక్ట్లు చేపడుతున్న ఐటీ సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. పీహెచ్డీ విషయానికొస్తే ఎన్నో అంశాలపై రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. బ్యాంకింగ్ అప్లికేషన్స్కు సంబంధించి రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుంది. భవిష్యత్తు ఉజ్వలం బ్యాంకింగ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. కారణం.. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులే. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, జన్ధన్ యోజన వంటి పథకాల ప్రారంభం కారణంగా బ్యాంకులు దేశంలో ప్రతి ఒక్కరికీ సేవలందించే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వీటి సమర్థ అమలుకు కార్యకలాపాల విస్తరణ ఆవశ్యకత... ఫలితంగా భారీఎత్తున మానవ వనరుల అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా కొత్త బ్యాంకులకు లెసైన్స్లు మంజూరు వంటివి కూడా ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు మార్గం వేస్తున్నాయి. మరెన్నో చిన్న బ్యాంకులు కూడా ఈ రంగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బ్యాంకుల్లో వేల సంఖ్యలో కొలువులకు మార్గం వేసేవే. కొత్తగా వచ్చే బ్యాంకులు కూడా టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు అధిక శాతం అవకాశాలు కల్పించనున్నాయి. కారణం.. అవి ప్రారంభంలో పూర్తి టెక్నాలజీ బ్యాంకులుగా రానుండటం. అవసరమైన నైపుణ్యాలు బ్యాంకులు ఇప్పుడు అన్ని నేపథ్యాలు ఉన్న అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఔత్సాహికులకు కావాల్సిందల్లా నిబద్ధతతో పని చేయాలనే దృక్పథం. ప్రస్తుతం బ్యాంకులు ఆప్టిట్యూడ్ టెస్ట్లలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ టెస్ట్లలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్లను పరీక్షిస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఈ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. అటు టెక్నాలజీ కోణంలోనూ డేటా సెంటర్స్, నెట్వర్క్స్, డేటా బేసెస్ తదితర విభాగాల్లో.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీపైనా బ్యాంకులు ఇప్పుడు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్స్, ఎథికల్ హ్యాకర్స్ వంటి నిపుణుల అవసరం ఏర్పడుతోంది. వీటికితోడు డేటా వేర్ హౌసింగ్, డేటా మైనింగ్, అనలిటిక్స్లో నైపుణ్యాలు కూడా బ్యాంకు కొలువులకు మార్గం వేస్తాయి. అకడమిక్స్, కమ్యూనికేషన్ రెండూ ఉంటేనే నేటి పోటీ ప్రపంచంలో ఏ రంగమైనా ఔత్సాహికులకు అకడమిక్స్తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానంగా మారాయి. దీంతో విద్యార్థులు ముందుగా అకడమిక్స్లో పట్టు సాధించాలి. తర్వాత కెరీర్ లక్ష్యంగా ఎంచుకున్న రంగానికి సంబంధించి ఆప్టిట్యూడ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా కష్టపడే తత్వం, నిరంతరం నేర్చుకునే నైపుణ్యాలు ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు! వృత్తిపరమైన సంతృప్తి దేశంలో బ్యాంకింగ్ రంగం నిరంతరం వృద్ధి చెందుతున్న రంగం. సమీప భవిష్యత్తులో మరింత వృద్ధి సాధిస్తుందని అంచనా. కెరీర్ పరంగా ఎంతో క్రేజ్ ఉన్న రంగం బ్యాంకింగ్. ఒకవైపు సుస్థిర భవిష్యత్తును, మరో వైపు సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎన్నో గ్రామాల్లో బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది.. అన్ని వర్గాల ఉన్నతికి ఎంతో కీలక పాత్ర వహిస్తున్నారు. అదే విధంగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ వంటి చర్యల కారణంగా పేద ప్రజలకు కూడా సహకారం అందించగలుగుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే బ్యాంకుల్లో పనిచేయడం వల్ల వ్యక్తిగత లబ్ధితోపాటు వృత్తిపరమైన సంతృప్తిని కూడా పొందొచ్చు. -
బ్యాంకింగ్ రంగానికి విఘాతం
సాక్షి, విశాఖపట్నం : హుదూద్ దెబ్బకు ఉత్తరాంధ్రలో బ్యాంకింగ్ రంగం కుదేలైంది. కొన్ని చోట్ల చెట్లు,విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలుబ్యాంకులు, ఏటీఎంలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కోర్ బ్యాంకిం గ్ వ్యవస్థ పనిచేయకపోఉడంతో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏటీఎంలపై ఉండే యాంటినాలు పెనుగాలులకు కొట్టుకుపోవడంతో 85శాతానికి పైగా ఏటీఎంలు మూడురోజుల పాటు పనిచేయలేదు. విద్యుత్ సరఫరా లేక బ్యాంకులు సైతం మూతపడడంతో లావాదేవీలు స్తంభించిపోయాయి. సోమ,మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్రలో రూ.1200కోట్ల మేర లావాదేవీలకు బ్రేకులుపడ్డాయి. ఉత్తరాంధ్రలో 62 సహకార, జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులకు సంబంధించి 1200 శాఖల వరకు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా విశాఖలో 250 శాఖలుండగా, జిల్లా పరిధిలోనే 750కు పైగా శాఖలున్నాయి. ఉత్తరాంధ్ర పరిధిలోని మూడు జిల్లాల్లో అన్ని బ్యాంకులద్వారా క్లియరింగ్ చెక్స్, ఇంటర్ బ్యాంక్ పేమెంట్స్, రెమిడెన్స్ వంటి సేవల ద్వారా ప్రతీరోజు రూ.500 నుంచి రూ.600 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంటుంది. తుఫాన్దెబ్బకు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థకు కీలకమైన యాంటినాలు ఎగిరిపోవడంతో సోమ,మంగళవారాల్లో బ్యాంకులు, ఏటీఎంలు పూర్తిగా మూత పడ్డాయి. బుధవారం జనరేటర్ల సాయంతో ప్రధాన బ్యాంకులు తెరిచిన ప్పటికీ సాంకేతిక సమస్యలతో పూర్తిస్థాయిలో లావాదేవిలు ప్రారంభం కాలేదు. మరొకపక్క సాధ్యమైంతత్వరగా ఏటీఎంలను పనిచే సేలా చూడాలని అవుట్సోర్సింగ్ సంస్థలయిన టాటా, ప్రిజమ్స్, బింక్స్ ఆరియా, సీఎంఎస్ సంస్థలకు ఆయా బ్యాం కులు ఉన్నతాధికారులు ఆదేశించ డంతో యుద్ద ప్రాతిపదికన పునర్ని ర్మాణ చర్యలు చేపట్టారు. బుధవారం ఏటీఎంలు పాక్షికంగా పనిచేసినప్పటికీ కోర్బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలడంతో చాలా చోట్ల ఏటీఎంల వద్ద నాట్ వర్కింగ్ బోర్డులే దర్శనమిచ్చాయి. విద్యుత్ లేమి సమస్య ఉన్నప్పటికీ జనరేటర్లసాయంతో గురువారం నుంచి పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలు మొదలయ్యాయి. 80శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి. కోర్ బ్యాంకింగ్ సమస్య వల్ల సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. హుదూద్ దెబ్బకు ఈమూడు జిల్లాల్లో ఆస్తుల ధ్వంసం వల్ల బ్యాంకింగ్ రంగానికి రూ.5కోట్ల వరకు నష్టంవాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
పాతవి చెల్లిస్తేనే కొత్త రుణాలు
* బ్యాంకర్ల స్పష్టీకరణ * రుణమాఫీపై ఏమీ మాట్లాడలేమని వ్యాఖ్య * గోల్కొండ ఎక్స్ప్రెస్లో ఆర్థిక సాక్షరత్పై ప్రచారం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పాత రుణాలు చెల్లించినవారికే కొత్త రుణాలు మంజూరు చేస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) వర్గాలు స్పష్టంచేశాయి. రుణమాఫీపై ఇప్పుడు తాము ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నాయి. బ్యాంకింగ్ రంగంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్థిక సాక్షరత (ఫైనాన్స్ లిటరసీ) ప్రచార కార్యక్రమాన్ని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గోల్కోండ ఎక్స్ప్రెస్ రైలులో ప్రారంభించింది. అంతకుముందు నాబార్డు ప్రాంతీయ కార్యాలయంలో ఆర్థిక సాక్షరతపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రాబ్యాంకు జనరల్ మేనేజర్, ఎస్ఎల్బీసీ-ఏపీ కన్వీనర్ సి.దొరైస్వామి మాట్లాడుతూ.. రిజర్వ్బ్యాంకు మార్గదర్శకాల మేరకు పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలను మంజూరు చేయగలమని స్పష్టంచేశారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి ప్రతీ ఇంట్లో ఒకరికి బ్యాంకు ఖాతా ఉండేలా చూడాలని కేంద్రం భావిస్తోం దని.. ఇందుకోసం ఆగస్టు 28న ప్రధాని నరేంద్రమోడీ ‘జన్ ధన్ యోజన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని నాబార్డు సీజీఎం మమ్మెన్ తెలిపారు. ఇందులో భాగంగానే నాబార్డు ఆర్థిక సాక్షరత ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోందని వెల్లడించారు. ఏపీలో 93 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండగా.. తెలంగాణలో ఇది 95 శాతానికిపైగానే ఉందన్నారు. -
అతిపెద్ద దేశీ బ్యాంక్గా ఎదుగుతాం
ముంబై: వ్యాపార పరిమాణం, పనితీరులో కూడా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్గా ఎదగనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ విశ్వాసం వ్యక్తం చేశారు. లాభదాయక విధానంలో బ్యాంకును అగ్రస్థానానికి చేర్చాలనేది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐసీఐసీఐ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుగా కొనసాగుతోంది. మొత్తం దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ విషయానికొస్తే.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ టాప్ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఐసీఐసీఐ నిలుస్తోంది. 2009లో ఐసీఐసీఐ పగ్గాలు చేపట్టిన కొచర్.. ప్రఖ్యాత ‘4సీ’ వ్యూహాన్ని అమలుచేస్తూ బ్యాంకును ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. ఈ వ్యూహం బాగానే విజయవతంమైందని.. పరిశ్రమ వృద్ధి రేటు కంటే ముందుండేందుకు ఇది తగిన పునాది వేసిందని కూడా కొచర్ పేర్కొన్నారు. అయితే, లాభాలను ఏమాత్రం త్యాగం చేయకుండానే, అదేవిధంగా అధిక రిస్క్లు ఉండే వ్యాపార విధానంలో కాకుండా వృద్ధిని పరుగులు పెట్టించేందుకు కృషిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) డిపాజిట్లలో వృద్ధి, వ్యయ నియంత్రణ, మొండిబకాయిల మెరుగుదల, సరైన మూలధన నిర్వహణ.. ఈ నాలుగు అంశాల సమర్థవినియోగమే 4సీ వ్యూహంగా పేరొందింది. దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ కంటే 2-3 శాతం అధిక వృద్ధి రేటును సాధించడంపై దృష్టిపెట్టినట్లు కొచర్ చెప్పారు. ఏదో నామమాత్రంగా అగ్రస్థానానికి చేరాలన్నది తన ధ్యేయం కాదని... నిలకడైన లాభాల వృద్ధితో క్రమంగా దేశంలో నంబర్ వన్ ర్యాంక్ను అందుకోవడానికి ప్రయత్నిస్తామని ఐసీఐసీఐ చీఫ్ వ్యాఖ్యానించారు. కేవలం బ్యాంకు పరిమాణం ప్రకారం కాకుండా మెరుగైన పనితీరు ఆధారంగా టాప్లోకి వెళ్లాలనేదే తమ లక్ష్యమన్నారు. అయితే, కచ్చితంగా ఈ స్థానాన్ని అందుకుంటామన్న నమ్మకం ఉందని ఆమె చెప్పారు. -
ప్రత్యామాయం ఉంది
నటి పరిణీతి చోప్రా ముంబై: బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన పరిణీతి చోప్రా ఇప్పటికీ ఓ ప్రత్యామ్నాయం ఉంచుకుంది. ఒకవేళ ఈ రంగంలో విజయం సాధించలేకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా బ్యాంకింగ్ సెక్టార్ను ఎంచుకున్నానని ఈ 25 ఏళ్ల తార తన మనసులో మాట బయటపెట్టింది. ప్రతి ఒక్కరూ తన మాదిరిగానే తప్పనిసరిగా ఎప్పటికీ ఓ ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని యశ్రాజ్ నిర్మించిన ‘లేడీస్ వర్సెస్ రికీ బెహల్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ సుందరి హితవు పలికింది. ‘ఒకవేళ నేను నటించిన సినిమాలు కనుక ఫ్లాప్ అయ్యే రోజు వస్తే బ్యాంకింగ్ రంగం వైపు అడుగులు వేస్తా. ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించుకోవాలంటే ఇదొక్కటే సరైన, సురక్షితమైన ఐచ్ఛికం’ అని తెలిపింది. బాలీవుడ్లోకి అడుగిడకముందు యశ్రాజ్ సినిమాలకు మార్కెటింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించింది. పరిణీతి నటించిన ‘ఇషక్ జాదే, హసీ తో ఫసీ, శుద్ధ్ దేశీ రొమాన్స్ తదితర సినిమాలు అందరి ప్రశంసలందుకున్నాయి. ‘మరిన్ని ఇబ్బందులు పడకుండానే సినిమా రంగంలోకి అడుగిడే అదృష్టవంతులు చాలామంది ఉన్నారు. నటనపై ఆసక్తి ఉంటే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాల్సిందే. ఒకవేళ ఇక్కడ నిలదొక్కుకునే పరిస్థితులు లేకపోతే ఇబ్బందులపాలు కాకుండా ఉండేందుకు ఎప్పటికీ ఓ ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. పరిశ్రమలో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం’ అని చెప్పింది. ప్రస్తుతం పరిణీతి ‘దావత్-ఇ- ఇష్క్, కిల్ దిల్’ సినిమాల్లో నటిస్తోంది. బ్యాంకింగ్ కోర్సును ఇండియాతోపాటు ఇటలీ లో కూడా అభ్యసించానని చెప్పింది. అయితే ఇంగ్లండ్లో ఆర్థికమాంద్య పరిస్థితులు నెలకొనడంతో స్వదేశానికి తిరిగి వచ్చానని తెలిపింది. యశ్రాజ్ ఫిలిమ్స్ సంస్థలో దరఖాస్తు చేయగానే ఉద్యోగం లభించిందని తెలిపింది. ఏడాదిన్నరపాటు అక్కడ పనిచేశానని చెప్పింది. -
బ్యాంకింగ్ రంగంలో ఉజ్వల భవిత
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్: బ్యాకింగ్ రంగంలో ఉజ్వల భవిత ఉందని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఏవీ రావు చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధానంపై ‘సాక్షి’ దినపత్రిక ఆదిత్య కాంపిటీషన్స్ సంస్థతో కలిసి నిర్వహించిన అవగాహన సదస్సుకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. స్థానిక శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం ఈ అవగాహన సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏవీ రావు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగ పరీక్షలకు దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పోటీ పడుతుండగా, వీరిలో సిన్సియర్గా శ్రమించేవారు 50 వేలమంది ఉన్నట్లు తెలిపారు. ఒకే శిక్షణతో వివిధ బ్యాంకులు నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులు గ్రాండ్ టెస్ట్లతో మేధస్సు పెంచుకోవచ్చని చెప్పారు. ఆప్టిట్యూడ్ టెస్ట్, న్యూమరికల్ టెస్ట్లో 8, 9, 10 తరగతుల గణితశాస్త్రం నుంచి ఎక్కువగా ప్రశ్నలుంటాయని తెలిపారు. ఆంగ్ల దినపత్రికలు చదవడం ద్వారా భావాలను వ్యక్తీకరించే తీరు, పదాల కూర్పుపై అవగాహన కలుగుతుందని చెప్పారు. నెలల తరబడి పడిన శ్రమను రాత పరీక్షతో పాటు, 15 నిముషాలు జరిగే ఇంటర్వ్యూ దశలో చక్కగా ప్రెజెంట్ చేయడం ద్వారా ఉద్యోగం సాధించవచ్చని సూచించారు. దళారులను నమ్మొద్దు... చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ అధికారి సి.బాలస్వామి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు డిమాండ్ చేసే దళారులు నమ్మవద్దని సూచించారు. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగం సాధించేందుకు అభ్యర్థి మేధస్సు పరిధి ఆ జిల్లాకు వరకూ ఉంటే సరిపోతుందన్నారు. అదే జాతీయ బ్యాంకులకు రాష్ట్ర, జాతీయస్థాయి అంశాలపై పట్టు ఉండాలని చెప్పారు. అంకితభావం లేకుండా వంద టెస్ట్లు రాసినా ప్రయోజనం ఉండదని తెలిపారు. విద్యార్థుల ‘భవిత’ కే అధిక ప్రాధాన్యం.. సాక్షి గుంటూరు బ్రాంచి మేనేజర్ ఆర్.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2008లో సాక్షి ప్రారంభమైన రోజు నుంచే విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. యువతకు మార్గదర్శనం చేస్తూ జాతీయస్థాయిలో ఉద్యోగాలు, విద్యావకాశాలను ‘భవిత’ ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. కాలానుగుణంగా ఉపాధిని చూపే కోర్సులు, ఉద్యోగాలపై వివిధ సంస్థలతో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు రోజూ దినపత్రికలు చదవడం ద్వారా సాధారణ పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చన్నారు. ప్రణాళికతో చదవాలి.: ఆదిత్య కాంపిటీషన్స్ డెరెక్టర్ కె.ప్రణయ్కుమార్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగం సాధించాలనే లక్ష్యం గల వారు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం సారధ్యంలో సిన్సియర్గా శ్రమిస్తే విజయం తథ్యమన్నారు. ఒక్క శిక్షణతోనే ఎస్బీఐ, ఐబీపీఎస్కు సన్నద్ధం కావచ్చని తెలిపారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ దశలో ఒక్క మార్కు తేడాతో విజయావకాశం చేజారే ప్రమాదముందని తెలిపారు. అర్ధమేటిక్, రీజనింగ్లో సమయం ఆదా చేసుకుంటే విజయం సాధించినట్లేనన్నారు. సంపూర్ణ సమాచారానికి ‘సాక్షి’ ఎడ్యుకేషన్ పోర్టల్ సబ్జెక్టు నిపుణులు ఆర్వీ రమణ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు విలువైన సమాచారాన్ని అందించడంలో ‘సాక్షి’ ఎడ్యుకేషన్ పోర్టల్ విశేష సహకారం అందిస్తోందని చెప్పారు. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్ విద్యార్థుల భవితను తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగ పడుతోందని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఆయన వివరించారు. -
24వేల మార్కు దాటిన సెన్సెక్స్
ముంబయి : స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 24వేల పాయింట్ల మార్కును దాటింది. మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. తొలిసారిగా సెన్సెక్స్ 24 వేల పాయింట్లు దాటగా, 7,100 పాయింట్లు నిఫ్టీ దాటింది. 500 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 150 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతోంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో జోరుమీదున్న ఆపరేటర్లు మరోసారి విజృంభించారు. దీంతో స్టాక్ బుల్ మళ్లీ కాలు దువ్వింది. ఫలితం.... వరుసగా మూడో రోజూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. -
డిఫాల్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండలా పెరిగిపోతున్న మొండి బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులకు గుదిబండగా మారాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలిసారిగా పీఎస్యూ బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐబీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. పీఎస్యూ బ్యాంకుల్లో మార్చి, 2013 నాటికి రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్న ఎన్పీఏలు సెప్టెంబర్, 2013 నాటికి 2.36 లక్షల కోట్లకు చేరాయని, ఇప్పుడివి రూ.3.50 లక్షలు దాటినట్లు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రుణం తీసుకొని చెల్లించని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారి ఆస్తులను జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఏఐబీఈఏ దేశంలో రుణాలు తీసుకొని చెల్లించని సంస్థలు, వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. రుణాలు ఎగ్గొట్టిన టాప్ 50 కంపెనీల్లో రాష్ట్రానికి చెందిన డెక్కన్ క్రానికల్ (రూ.700 కోట్లు), ఐసీఎస్ఏ ఇండియా (రూ.646 కోట్లు), ల్యాంకో హోస్టెక్ హైవే (రూ.533), ఎంబీఎస్ జ్యూయెలర్స్ (రూ.524 కోట్లు), రాజీవ్ స్వగృహ (రూ.385 కోట్లు), పోగ్రసివ్ కనస్ట్రక్షన్ (రూ.351 కోట్లు), సుజన యూనివర్సల్ (రూ.330 కోట్లు) ఉన్నాయి. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్యాంకుల ఆడిట్ కమిటీలో ఉద్యోగ సంఘాలకు చోటు కల్పిస్తే రుణాల మంజూరులో పారదర్శకత పెరిగి మొండి బకాయిలు తగ్గుతాయన్నారు. -
సెన్సెక్స్.... పోర్ట్ వాల్
కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో జోరుమీదున్న ఆపరేటర్లు మరోసారి విజృంభించారు. దీంతో స్టాక్ బుల్ మళ్లీ కాలు దువ్వింది. ఫలితం.... వరుసగా రెండో రోజూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. సెన్సెక్స్ 557 పాయింట్లు దూసుకెళ్లి తొలిసారి 23,551వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 155 పాయింట్ల హైజంప్తో అతి సులువుగా 7,000 పాయింట్లను అధిగమించింది. ఈ బాటలో బ్యాంక్ నిఫ్టీ కూడా 14,090 పాయింట్ల సరికొత్త రికార్డును చేరుకోవడం విశేషం! ఎగ్జిట్ పోల్స్ రాకముందే వరుసగా రెండో రోజూ బుల్ ఆపరేటర్లు పట్టు బిగించారు. ప్రధానంగా బ్లూచిప్స్పై దృష్టిపెట్టడం ద్వారా మరోసారి మార్కెట్లను పరుగెత్తించారు. శుక్రవారం 650 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ మరో 557 పాయింట్లు పుంజుకోవడం ద్వారా రెండు రోజుల్లో 1,200 పాయింట్లకుపైగా లాభపడింది. 2011 ఆగస్ట్ తరువాత ఈ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి! ఇక సెన్సెక్స్ ఇంట్రాడేలో 23,573కు చేరగా, నిఫ్టీ 7,020 పాయింట్లను అధిగమించడం విశేషం! వెరసి... కొత్త చరిత్ర సృష్టిస్తూ నిఫ్టీ 7,014 వద్ద ముగిసింది. కాగా, మార్కెట్లు ముగిశాక సాయంత్రం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏకు 290 సీట్ల వరకూ వచ్చే అవకాశమున్నట్లు వెల్లడికావడం గమనార్హం!! సుస్థిర ప్రభుత్వ ఆశలతోపాటు, విదేశీ మార్కెట్ల లాభాలు, డాలరుతో మారకంలో రూపాయి 60 దిగువకు బలపడటం వంటి అంశాలు కూడా సెంటిమెంట్కు జోష్నిచ్చినట్లు నిపుణులు తెలిపారు. బీఎస్ఈలో ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాలూ లాభపడటం విశేషం! ప్రధానంగా ఆయిల్, పవర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, మెటల్స్ 3-2.5% మధ్య బలపడ్డాయి. శుక్రవారం రూ. 1,269 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 1,218 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. బ్లూచిప్స్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరోమోటో, ఐటీసీ, సెసాస్టెరిలైట్, ఎస్బీఐ, ఆర్ఐఎల్, ఓఎన్జీసీ, భారతీ, భెల్, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ 5-2% మధ్య పురోగమించాయి. ఆటో దిగ్గజాలు టాటా మోటార్స్(4%), మారుతీ(4%), ఎంఅండ్ఎం(2%), టీవీఎస్ మోటార్(9%) కొత్త గరిష్టాలను తాకగా, అశోక్ లేలాండ్(6%) ఏడాది గరిష్టానికి చేరింది. ఇతర దిగ్గజాలలో కోల్ ఇండియా(7%), ఎల్అండ్టీ(3%), జేఎస్డ బ్ల్యూ స్టీల్, ఆర్ఈసీ, పీఎఫ్సీతోపాటు మొత్తం 189 షేర్లు ఏడాది గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్లో సన్ ఫార్మా, సిప్లా 1.5% స్థాయిలో నష్టపోయాయి. సోమవారం విద్యుత్ రంగ షేర్లు వెలుగులో నిలిచాయి. టొరంట్ పవర్ 18% దూసుకెళ్లగా, ఏబీబీ, పవర్గ్రిడ్, జేపీ, రిలయన్స్ పవర్, సీమెన్స్, పీటీసీ, ఎన్టీపీసీ 6-2.5% మధ్య పుంజుకున్నాయి. మిడ్ క్యాప్స్లో ఐఆర్బీ ఇన్ఫ్రా, కేఎస్కే ఎనర్జీ, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్, కేఈసీ, గుజరాత్ పిపావవ్, కల్పతరు పవర్, ఎన్సీసీ, పుంజ్లాయిడ్, జిందాల్ సా తదితరాలు 13-7% మధ్య జంప్ చేశాయి. అయితే ట్రేడైన షేర్లలో 1,408 లాభపడగా, 1,440 నష్టపోవడం గమనార్హం. -
కొంచెం ఊరట !
ముంబై: గతానికి భిన్నంగా... మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడ్డాయి. పాలసీరేట్లలో ఎటువంటి మార్పులూ జరగలేదు. దీనితో గృహ, కారు వంటి వాటిపై బ్యాంకింగ్ రుణ వినియోగదారుడిపై నెలసరి వాయిదా చెల్లింపు(ఈఎంఐ)ల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. మార్కెట్ అంచనాలకు భిన్నమైన నిర్ణయాలను గత రెండు పాలసీ సమీక్షల్లో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. ఈ దఫా ద్రవ్యోల్బణం పెరుగుదల వాతావరణం నెలకొని ఉండడమే రేట్లు తగ్గించకపోవడానికి కారణమని ఆర్బీఐ సూచించింది. అయితే తగ్గుదల ధోరణి కొనసాగినంతకాలం రేట్ల పెంపునకు కూడా అవకాశం ఉండదని పేర్కొంది. వెరసి మొదటి ద్వైమాసిక పరపతి సమీక్ష సందర్భంగా రెపో రేటు ప్రస్తుత 8% వద్ద, సీఆర్ఆర్ 4% వద్ద యథాతథంగా కొనసాగనున్నాయి. పరపతి విధాన సమీక్షలో ముఖ్యాంశాలు... స్వల్పకాలిక రుణ(రెపో-బ్యాంకులకిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ) రేటు యథాతథం. రెపో ప్రస్తుతం 8%గా ఉంది. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిర్దిష్ట మొత్తానికి సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)లో సైతం మార్పు లేదు. ఇది 4 శాతంగా కొనసాగనుంది. {దవ్యోల్బణం తగ్గుదల ధోరణి కొనసాగుతున్నంతకాలం రేటులో ఎటువంటి పెంపూ ఉండబోదు. 2014-15లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు అంచనా స్వల్పంగా 5.6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గింపు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ అంటే ఎఫ్ఐఐ, ఎఫ్డీఐ, ఈసీబీల మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య ఉన్న నికర వ్యత్యాసం) సైతం జీడీపీలో 2 శాతంగా ఉండే అవకాశం ఉంది. 2014లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉంటుందని అంచనా. బ్యాంకింగ్ విలీనాలకు ద్వారాలు. అయితే ఈ విషయంలో పోటీ, స్థిరత్వం అంశాల్లో రాజీ ప్రశ్నే ఉండబోదు. బ్యాంకుల విలీనం వల్ల మరింత విలువ సృష్టి జరిగే అవకాశం ఉంది. 7 రోజులు, 14 రోజుల రెపో పరిమితులను 0.50 శాతం నుంచి 0.75 శాతానికి పెంచడం జరిగింది. ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) పెరుగుదల అవసరాలకు ఈ అంశాలు దోహదపడతాయి. తదుపరి పాలసీ 0సమీక్ష జూన్3న జరుగుతుంది. కనీస బ్యాలెన్స్ లేకుంటే జరిమానాలొద్దు.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనలను పాటించని కస్టమర్లపై జరిమానానాలు విధించరాదని బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ఏదైనా సమస్యల వల్ల ఖాతాదారులు ఈ నిబంధన పాటించ లేకపోతుండవచ్చని, అంతమాత్రం చేత బ్యాంకులు దీన్నుంచి అనుచిత లబ్ది పొందాలని చూడకూడదని ఆయన పేర్కొన్నారు. కనీస బ్యాలెన్స్ పాటించని బేసిక్ సేవింగ్స్ ఖాతాలపై జరిమానాలు విధించడం కాకుండా...అవసరమైతే కొన్ని సర్వీసులను కుదించాలని రాజన్ సూచించారు. మళ్లీ ఖాతాలో బ్యాలెన్స్ నిర్దేశిత స్థాయికి వచ్చిన తర్వాత ఆయా సేవలను పునరుద్ధరించవచ్చని తెలిపారు. అలాగే, నిర్వహణలో లేని ఖాతాల విషయంలో కూడా మినిమం బ్యాలెన్స్ లేని వాటిపై పెనాల్టీ విధించొద్దని రాజన్ చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్బీఐ.. కనీస బ్యాలెన్స్ లేని ఖాతాలపై ఎటువంటి పెనాల్టీలూ విధించడం లేదు. అయితే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటివి మాత్రం త్రైమాసికానికి రూ. 750 మేర చార్జీలు విధిస్తున్నాయి. ఈ తరహా బ్యాంకులకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో మూణ్నెల్లకు రూ. 10,000, ఓ మాదిరి పట్టణ ప్రాంతాల్లో రూ. 5,000 కనీస బ్యాలెన్స్ పాటించాల్సి ఉంటోంది. మరోవైపు, చలన వడ్డీ రేటుపై రుణాలను ముందస్తుగా చెల్లించాలనుకునే వారిపై కూడా ఎలాంటి పెనాల్టీ విధించకుండా ఉండేలా చూసే అంశాన్ని కూడా బ్యాంకులు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. వడ్డీరేట్లు తగ్గిస్తేనే వృద్ధికి చేయూత: పరిశ్రమలు వృద్ధి రేటు పెరగడానికి వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించాల్సిందేనని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగివస్తున్న ధోరణిని పాలసీ రేట్లను తగ్గించడానికి అవకాశంగా ఆర్బీఐ తీసుకుంటే బాగుండేదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల పెట్టుబడుల పునరుత్తేజానికి అవకాశం ఉంటుందని అన్నారు. కేవలం పరపతి విధానంపై ఆధారపడి ద్రవ్యోల్బణం కట్టడి అసాధ్యమన్నది తమ అభిప్రాయమని ఫిక్కీ అధ్యక్షుడు సిద్దార్థ్ బిర్లా అన్నారు. దీనికి పాలనా పరమైన చర్యలు కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. పాలసీ రేటు తగ్గితే ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడే అవకాశం ఉంటుందని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ యథాతథ విధానం పారిశ్రామిక వృద్ధికి నిరుత్సాహకరమేనని, నిధుల కోసం అధికంగా వ్యయపర్చాల్సివుంటుందని పీహెచ్డీ చాంబర్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు. వడ్డీరేట్లలో మార్పుండదు: బ్యాంకర్లు ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్లలో ఎటువంటి మార్పూ ఉండకపోవచ్చని బ్యాంకర్లు పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారు నెలవారీ చెల్లింపులపై(ఈఎంఐలు) తక్షణం ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్ల విషయంలో మరికొంతకాలం ప్రస్తుత పరిస్థితే కొనసాగే అవకాశం ఉందని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ కేఆర్ కామత్ వ్యాఖ్యానించారు .రియల్టీ హర్షం... కాగా వడ్డీరేట్లు తగ్గించకపోయినా, పెంచకపోవడమూ ఒక సానుకూల అంశమేనని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ పేర్కొంది. వడ్డీరేట్లు అధిక స్థాయిలో ఉన్నాయని, భవిష్యత్తులో ఇవి తగ్గడానికే అవకాశం ఉందని పాలసీ సంకేతాలు ఇస్తోందని భారత రియల్డీ డెవలపర్ల సంఘం (క్రెడాయ్) చైర్మన్ లలిత్ కుమార్ జైన్ అన్నారు. యథాతథం... తప్పదు: రాజన్ ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించక తప్పదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. గత యేడాది సెప్టెంబర్, అలాగే 2014 జనవరి మధ్య రేట్ల పెంపు నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో తన లక్ష్యాలను నెరవేరుస్తోందని రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆహారం, ఇంధనాలను మినహాయిస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 8 శాతంగానే కొనసాగుతోందని ఆయన అన్నారు. డిమాండ్ ఇంకా అధిక స్థాయి వద్దే వున్న అంశాన్ని ఈ పరిస్థితి ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతం, అటుపై యేడాది 6 శాతం దిశగా కొనసాగుతుంటే మాత్రం రెపోరేటును పెంచబోమని గవర్నర్ స్పష్టం చేశారు. వృద్ధి సామర్థ ్యం 6 శాతం కంటే తక్కువే... పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆర్బీఐ స్థూల ఆర్థిక వ్యవస్థ, పరపతి పరిణామాలపై ఒక నివేదికను సైతం ఆవిష్కరించింది. భారత్ వృద్ధి సామర్థ్యం ప్రస్తుత పరిస్థితుల్లో 6 శాతంకన్నా తక్కువేనని ఈ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఇంతక్రితం 8 శాతం అంచనాలను సవరించింది. ఫైనాన్షియల్ పొదుపులు, పెట్టుబడులు తగ్గుతుండడం, అధిక ద్రవ్యోల్బణం, దిగువ స్థాయిలో వాణిజ్య విశ్వాసం వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. -
బ్యాంక్ కొలువుల జాతర
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో వచ్చే 5-10 ఏళ్లలో 20 లక్షల కొత్త కొలువులు వస్తాయని నిపుణులంటున్నారు. కొత్త సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్స్లు ఇవ్వనుండడం, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి భారత రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయనుండడం తదితర కారణాల వల్ల బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉద్యోగాలు భారీ స్థాయిలో వస్తాయని వారంటున్నారు. ఈ ఏడాది అత్యధిక ఉద్యోగాలిచ్చే రంగాల్లో బ్యాంకింగ్ కూడా ఒకటిగా నిలవనున్నది. ర్యాండ్స్టాడ్ ఇండియా మెరిట్ట్రాక్ సర్వీసెస్, మణిపాల్ అకాడెమీ ఫర్ బ్యాంకింగ్, మేరాజాబ్ ఇండియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం... {పభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు సగం సిబ్బంది సమీప భవిష్యత్తులో రిటైర్ కానున్నారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించుకోవడం ఆయా బ్యాంకులకు తప్పనిసరి. దీంతో ఒక్క పీఎస్ బ్యాంకుల్లోనే 5-7 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. బ్యాంకింగ్ రంగ విస్తరణ, నేరుగా నియామకాలు కారణంగా బ్యాంకింగ్ రంగంలో వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో కొలువులు వస్తాయి. ఈ ఏడాది ప్రథమార్థంలోనే కొత్త బ్యాంక్ లెసైన్స్లను ఆర్బీఐ జారీ చేయనున్నది. దీంతో సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలో అవకాశాలు పెరుగుతాయి. {పస్తుతం భారత దేశ జనాభాలో కేవలం 30 శాతం కంటే తక్కువ మందికే బ్యాంక్ అకౌంట్లున్నాయి. గ్రామీణ మార్కెట్లలో బ్యాంకుల విస్తరణ వల్ల లాభదాయకత, వృద్ధి పెరుగుతాయి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ప్రభుత్వ రంగ సంస్థలు 60,000-70,000 ఉద్యోగాలివ్వగా, ప్రైవేట్ బ్యాంకులు 40 వేల వరకూ ఉద్యోగాలిచ్చాయి. ముంబై, చెన్నై, ఎన్సీఆర్ రీజియన్లో బ్యాంక్ కొలువులు ఎక్కువగా వచ్చాయి. చిన్న నగరాల్లో అధిక సంఖ్యలో బ్యాంక్ కొలువులు రానున్నాయి. బ్యాంకు ఉద్యోగుల ఉత్పాదకత పెరగ్గా, ఉద్యోగుల వలస తగ్గింది. క్లర్క్లు, ప్రారంభ స్థాయి ఆఫీసర్ల ఉద్యోగాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
కొత్త ఏడాది.. కొలువుల మేళా
8.5 లక్షల ఉద్యోగాలు రావచ్చు... వివిధ నియామక సంస్థల వెల్లడి ఎఫ్ఎంసీజీ రంగంలో అత్యధికంగా జాబ్స్... తర్వాత స్థానాల్లో హెల్త్కేర్, ఐటీ న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం ఉద్యోగార్థులకు కొత్త ఆశలను రేపుతోంది. 2014లో భారీస్థాయిలో కొత్త ఉద్యోగాలొస్తాయని మైహైరింగ్క్లబ్డాట్కామ్, శాట్-ఎన్-మెర్క్ మ్యాన్పవర్ కన్సల్టెంట్లు అంటున్నాయి. ఈ ఏడాది అంచనాలకు తగ్గట్లుగా ఉద్యోగాలు రాలేదని శాట్-ఎన్-మెర్క్ మ్యాన్పవర్ కన్సల్టెంట్ పేర్కొంది. ఆదాయం పెంచుకోవాలంటే దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందేనని కంపెనీలు భావిస్తున్నాయని వివరించింది. మరోవైపు వచ్చే ఏడాది ఎనిమిదిన్నర లక్షలకు పైగా కొత్త కొలువులు వస్తాయని మైహైరింగ్క్లబ్డాట్కామ్ నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తం 12 రంగాల్లో 5,600 కంపెనీలపై ఈ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఎఫ్ఎంసీజీ, ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ కేటగిరీల్లో ఈ ఉద్యోగాలు వస్తాయంటున్న ఈ సర్వేలో ముఖ్యాంశాలు..., ఈ ఏడాది కొత్తగా వచ్చిన కొలువులు 7.9 లక్షలుగా ఉన్నాయి. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, వచ్చే ఏడాది ఇంతకంటే ఎక్కువగానే (8.5 లక్షలు) కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. అంచనా వేస్తున్న ఈ ఉద్యోగాలన్నీ వ్యవస్థీకృత రంగంలోనివే. ఎఫ్ఎంసీజీ రంగంలో అధికంగా (1.5 లక్షలు) కొత్త కొలువులు వస్తాయి. ఆరోగ్య సంరక్షణ(1.33 లక్షలు), ఐటీ, ఐటీఈఎస్(1.21 లక్షలు), రిటైల్(86,700), ఆతిథ్యం(83,400), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు(61,400), తయారీ, ఇంజనీరింగ్(51,500), విద్య, శిక్షణ, కన్సల్టెన్సీ (42,900), మీడియా, వినోదం(42,800), రియల్టీ(38,700) రంగాల్లో అధిక సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం చేయడానికి కావలసిన నైపుణ్యాలు, వాటిని అలవర్చుకోవడం, పని వాతావరణంలో ఇమడడం... వంటి సమస్యలున్నాయి. ఇవే వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
బ్యాంకింగ్ రంగం పరుగులు మా హయాంలోనే..
మదురై: గడచిన పదేళ్లలో బ్యాంకింగ్ రంగం వృద్ధిబాటలో పరుగులు తీసిందని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. ఇదంతా తమ యూపీఏ ప్రభుత్వ పాలనలో సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. సోమవారం ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 103వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా విత్తమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బ్యాంకింగ్ రంగంలో వృద్ధి జోరును అందరూ గుర్తించారు. ఇది కచ్చితంగా మా ప్రభుత్వం ఘనతే. దీన్ని సాధించేందుకు సర్కారు చాలా నిబద్ధతను కనబరిచింది. బ్యాంకుల చీఫ్లు, సిబ్బంది పాత్రకూడా ఎనలేనిది ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,10,000 బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఇందులో గత తొమ్మిదేళ్లలో ఏటా 7,000-8,000 శాఖలు కొత్తగా ఏర్పాటుకాగా, ఈ ఏడాది ఈ సంఖ్య 10,000 మార్కును చేరనుంది’ అని చిదంబరం పేర్కొన్నారు. శాఖలతోపాటు ఏటీఎం సదుపాయాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. గతంలో పరిమితంగా ఉన్న ఏటీఎంలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. కాగా, బ్యాంక్ తన 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని 103 కొత్త శాఖలు, 103 ఏటీఎంలను చిదంబరం ప్రారంభించారు. మొత్తంమీద ఈ సంవత్సరంలో 231 బ్రాంచ్లను సెంట్రల్ బ్యాంక్ ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారు. పలు అంశాలపై ఆయన ఇంకా ఏంచెప్పారంటే... విరివిగా రుణాలు... పదేళ్ల క్రితం విద్యా రుణాలు అందుకున్న విద్యార్థుల సంఖ్య వేలల్లో మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య లక్షల్లోకి పెరిగింది. కోట్లాది స్వయం సహాయక బృందాలకు చౌకగా రుణాలు లభిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవలు విస్తరించడం దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తోంది. బ్యాంకింగ్ విస్తరణ వల్ల మరో గొప్ప ప్రయోజనం ఉద్యోగాల కల్పన.. కొత్త శాఖల జోరుతో వేలాదిమందికి బ్యాంకు కొలువులు లభిస్తున్నాయి. రుణాల లభ్యత పెరగడంతో పలు రంగాల్లోనూ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయి. కొత్త కంపెనీల చట్టంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద కంపెనీలు తప్పకుండా తమ లాభాల్లో కొంత మొత్తాన్ని ఖర్చుచేయాలన్న నిబంధనలను చేర్చడం కూడా యూపీఏ సాధించిన మరో కీలక ఘనతే. సెంట్రల్ బ్యాంక్ కొత్త మొబైల్ యాప్ 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఒక కొత్త మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్(యాప్)ను అందుబాటులోకి తెచ్చింది. ఈఎంవీ(యూరోపే, మాస్టర్కార్డ్, వీసా) సౌలభ్యంతో ‘రూపే’ డెబిట్ కార్డును కూడా ప్రవేశపెట్టింది. ట్రేడర్లు రోజుకు రూ.40 వేల నగదును విత్డ్రా చేసుకునే అవకాశం ఈ కార్డు ప్రత్యేకత అని, అంతర్జాతీయ లావాదేవీలకైతే రూ. లక్ష పరిమితి ఉంటుందని బ్యాంక్ సీఎండీ రాజీవ్ రుషి పేర్కొన్నారు. కాగా, రూ.611 చెల్లింపుద్వారా 1.03 లక్షల పేద గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం కల్పించేవిధంగా చోళ ఆరోగ్యబీమా పథకాన్ని కూడా బ్యాంక్ ప్రారంభించింది. చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్తో భాగస్వామ్యంతో అందించే ఈ స్కీమ్లో వైద్య అవసరాల కోసం రూ.30,000 వరకూ బీమా కవరేజీ ఉంటుంది. ఇంకా 103 ప్రభుత్వ పాఠశాలలకు ఫ్యాన్లు ఇతరత్రా సౌకర్యాలను సెంట్రల్ బ్యాంక్ అందించనుంది. -
‘అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర’
నూజివీడు, న్యూస్లైన్ : భారతదేశ ఆర్థికాభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషిస్తోందని కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డీ సూర్యచంద్రరావు తెలిపారు. నూజివీడులోని ధర్మ అప్పారావు కళాశాలలో వాణిజ్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘భారత బ్యాంకింగ్ రంగంలో మార్పులు - పరిణామాలు - ఎదురయ్యే సమస్యలు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్ సోమవారం కళాశాల ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ మాట్లాడుతూ రాబోయే రోజులలో బ్యాంకింగ్ రంగంలో చాలా అధునాతన మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. రానున్న కాలంలో విదేశీ బ్యాంకులు కూడా కుప్పలుతెప్పలుగా దేశంలోకి ప్రవేశించనున్నాయన్నారు. ఈ సెమినార్కు కీలకోపన్యాసకులైన పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య జీ ఆంజనేయస్వామి మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు ప్రతి సామాన్యుడికి అందినప్పుడే వాటి లక్ష్యాలు నెరవేరతాయన్నారు. బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటు రంగంలో వస్తున్న బ్యాంకుల వల్ల ప్రస్తుతం దేశంలో ఉన్న బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోబోతోందన్నారు. రాబోయే కాలంలో యువతకు బ్యాంకింగ్ రంగంలో వేలాది ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సెమినార్లో రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి వచ్చిన 42 మంది అధ్యాపకులు పరిశోధనా పత్రాలు సమర్పించారు. సమన్వయకర్తగా వాణిజ్యశాస్త్ర అధ్యాపకులు రాజబాబు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఎంఎంఆర్వీ అప్పారావు, పీజీ కేంద్రం ప్రత్యేకాధికారి ఎంవీ బసవేశ్వరరావు, భీమవరం డీఎన్ఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ జే చంద్రప్రసాద్, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్రం విశ్రాంత ఆచార్యులు కే అప్పారావు, డీఏఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గొల్లు వెంకట రామారావు, విశ్రాంత ప్రిన్సిపాల్ కే రామారావు పాల్గొన్నారు. -
రూ.50వేల పైబడిన చెక్కులపై నగదు చెల్లింపులకు నో
ముంబై: మనీలాండరింగ్కి అడ్డుకట్ట వేసేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. రూ. 50,000 దాకా విలువ చేసే చెక్కులకు మాత్రమే నగదు రూపంలో చెల్లింపులు జరపాలని, అంతకు మించితే నగదు చెల్లింపులు జరపరాదని గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులను ఆదేశించింది. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి నగదు బదిలీ సర్వీసులను బ్యాంకులు వినియోగించుకోవాలని ఆర్బీఐ నోటిఫికేషన్లో సూచించింది. మరోవైపు, కరస్పాండెంట్ బ్యాంకింగ్ ఒప్పందాల విషయంలో బ్యాంకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. -
బేకార్ టెక్...!
‘‘అన్నా.. బీటెక్ అయిపోయి రెండేళ్లయ్యింది. కాలేజీలో నేర్చుకున్న అంతంత మాత్రం సబ్జెక్టు కూడా మరిచిపోతున్నా. హైదరాబాద్ వచ్చి కంపెనీల్లో ఉద్యోగం వెతుక్కునే స్తోమత లేదు. ఇక్కడే ఏదైనా కళాశాలల్లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించన్నా..’’ - పి.శ్రీనివాస్ అనే సీఎస్ఈ గ్రాడ్యుయేట్ వేడుకోలు ‘‘బీటెక్ పూర్తయింది. ఏడాది గడిచిపోయింది. కళాశాలలో నేర్చుకున్నదేమీ లేదు. హైదరాబాద్ వచ్చి ఓ సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలో రూ.17 వేలు చెల్లించి కోర్ జావా కోర్సు నేర్చుకున్నా. కానీ ఫ్రెషర్లకు ఎక్కడా ఉద్యోగాలు దొరకడం లేదు..’’ - బీటెక్ పట్టభద్రుడైన వెంకట్రెడ్డి ఆవేదన ...ఇది ఒకరిద్దరి పరిస్థితి కాదు.. రాష్ట్రంలో లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల దుస్థితి. చదువుల్లో గట్టెక్కినా, ఉద్యోగం మెట్టెక్కలేక తడబడుతున్న విద్యార్థుల వెతలివి. సాంకేతిక విద్య పూర్తి చేసినా ఉద్యోగం దొరకడం లేదంటూ లక్షలాది మంది తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. 2012-13 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని కాలేజీల నుంచి బయటికి వచ్చిన 1.25 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో కేవలం 25 వేల మందికే క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించాయి. మిగిలిన వారికి కొలువు తిప్పలు తప్పడం లేదు. బీటెక్ పూర్తయినవారిలో చాలా మంది తమ చదువులతో సంబంధం లేని చిన్నాచితక ఉద్యోగాల్లో చేరిపోతుండగా.. మిగతావారు అయిష్టంగానే పైచదువులకు వెళ్తున్నారు. 2012-13 విద్యా సంవత్సరానికి ముందు కూడా ఇదే పరిస్థితి. ఇలా ఏటా దాదాపు లక్ష మంది పట్టభద్రులు ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారు. చేరిన ఉద్యోగాల్లో పట్టుమని రూ.10 వేల వేతనం కూడా లేని పరిస్థితుల మధ్య ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మానసిక వేదనకు లోనవుతున్నారు. ఐటీ రంగంపై ఆశలు పెట్టుకున్న వారికీ నిరాశే మిగులుతోంది. ఐదారేళ్ల అనుభవం ఉన్న వారిని మినహా ఫ్రెషర్లను పట్టించుకున్న కంపెనీ ఒక్కటీ లేదు. 2012-13 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని జేఎన్టీయూహెచ్, జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, ఓయూ, ఏయూ, ఎస్వీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు 1.25 లక్షల మంది ఉత్తీర్ణులైనట్టు సాంకేతిక విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. లక్షల మంది కాలేజీల్లో చేరుతున్నా.. వారిలో ఉత్తీర్ణులై బయటకు వస్తున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువే ఉంది. అటు ల్యాబ్ వసతులు, ఇటు బోధనా ప్రమాణాలు లేకపోవడంతో ఫెయిల్ అవుతున్నవారు కొందరైతే.. పాసవుతున్నా ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేకపోతున్నవారు ఎందరో ఉన్నారు. అన్ని రంగాల్లో ఉద్యోగాలు కరువు.. రాష్ట్రంలో 710 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పటికీ క్యాంపస్ రిక్రూట్మెంట్లు దాదాపుగా 30-60 కళాశాలలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని విద్యార్థులకు ఐటీ రంగంలో 2004-05 నుంచి 2008-09 మధ్య ఏటా 50 వేలకు పైగా (ఇతర రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీ బ్రాంచీలతో కలిపి) కొత్త ఉద్యోగవకాశాలు దక్కేవి. 2010-11లో ఆ సంఖ్య 27 వేలకు పడిపోయింది. గడిచిన మూడేళ్లలో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో మాంద్యం ఏర్పడడంతో అటు సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు కూడా అవకాశాలు సన్నగిల్లాయి. నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడివక్కడ ఆగిపోవడం కూడా వీరి అవకాశాలకు గండికొట్టింది. రాష్ట్రంలో కొత్తగా నేదునూరు, శంకరపల్లి ప్రాంతాల్లో విద్యుత్తు ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన ఎలక్ట్రికల్ పట్టభద్రులకు నిరాశే మిగిలింది. అలాగే గడిచిన రెండేళ్లలో తీవ్ర విద్యుత్తు కోతలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులనే తొలగిస్తున్నాయి. కొత్త పట్టభద్రులు వైపు చూడడమే మానేశాయి. ఫ్యాబ్సిటీ, ఈ-సిటీ అంటూ ప్రభుత్వం నిరుద్యోగులను ఊరించినా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. బ్యాంకింగ్ రంగం వైపు చూపు.. రాష్ట్రంలో అటు ప్రభుత్వరంగ ఉద్యోగాలు భర్తీ అయ్యే పరిస్థితి లేకపోవడం, ఇటు ప్రైవేటు రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడంతో బీటెక్ పట్టభద్రులకు ఒక్క బ్యాంకింగ్ రంగమే ఆశాజనకంగా కనిపిస్తోంది. ‘‘రెండు మూడేళ్లు ఏటా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు పెద్ద ఎత్తున విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నాయి. త్వరలోనే కొత్త బ్యాంకులకు లెసైన్స్లు దక్కుతాయన్న వార్తలు వస్తుండడంతో బ్యాంకింగ్ ఉద్యోగాలపై తాజా పట్టభద్రులు ఆశలు పెంచుకుంటున్నారు’’ అని అమీర్పేట్లోని ఓ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇస్తున్న కె.శ్రావణ్ పేర్కొన్నారు. బ్యాంకు కొలువుల వైపు బీటెక్ పట్టభద్రులు మొగ్గు చూపుతుండడంలో రాజధానిలోని బ్యాంకింగ్ ఉద్యోగ శిక్షణ సంస్థలు విద్యార్థులతో నిండిపోయాయి. అయితే కోచింగ్కు రూ.7, 8 వేలు, హాస్టల్కు రూ.3 వేల చొప్పున వెచ్చించ గలిగే స్తోమత ఉన్న వారే ఈ శిక్షణ పొందుతున్నారు. అంత ఆర్థిక స్తోమత లేనివారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు ఇంటి వద్దే ఉంటూ నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖాళీగా ఉండలేక సమీప పట్టణాల్లో ఐదారు వేల వేతనంతో ఏ చిరుద్యోగంలోనే చేరిపోతున్నారు. పారిశ్రామిక అనుసంధానమే శరణ్యం: అజయ్జైన్, కమిషనర్, సాంకేతిక విద్య ‘‘విద్యా బోధనలో నాణ్యత లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (టెక్విప్)లో చేరిన కొన్ని కళాశాలలు నాణ్యమైన విద్య అందిస్తూ ప్లేస్మెంట్లు కూడా చూపాయి. పరిశ్రమలకు ఏ నైపుణ్యాలు అవసరం? మనం ఏం శిక్షణ ఇవ్వాలి? అన్న అంశాలను నిత్యం సమీక్షించుకునేందుకు పారిశ్రామిక అనుసంధానం ఉండాలి. నాణ్యతకు అర్థం ఇదే. ప్రతిష్టాత్మక సంస్థలన్నీ చేసేది ఇదే. థియరీలో ఉన్న నైపుణ్యాన్ని ప్రాక్టికల్గా పెంపొందించాలంటే పారిశ్రామిక అనుసంధానమే శరణ్యం’’ దేశీయంగా ప్రాజెక్టులు పెరగాలి: ఎన్.ఎల్.ఎన్.రెడ్డి, ప్లేస్మెంట్స్ ఆఫీసర్, సీబీఐటీ ‘‘ఇప్పటికీ మన దేశంలోని ఐటీ కంపెనీలన్నీ అమెరికా ప్రాజెక్టులపైనే ఆధారపడుతున్నాయి. మనదేశం ఇ-గవర్నెన్స్ అమలుచేస్తున్నప్పటికీ ఇది చాలా స్వల్పం. దీన్ని విస్తృతపరిస్తే దేశీయ ప్రాజెక్టులతో ఐటీ రంగం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయి’’ ఆ కాలేజీలపై ఉక్కుపాదం మోపాలి: డాక్టర్ పి.మధుసూదన్రెడ్డి, విద్యారంగ నిపుణులు ‘‘కాలేజీల్లో కనీస ప్రమాణాల నియంత్ర ణ కరువైంది. కొన్ని యాజమాన్యాలు ప్రమాణాలు పెంచకుండా సీట్లు పెంచుకోవడం ఎలా? వాటిని నింపుకోవడం ఎలా? అటెండెన్స్ లేని వారికి అటెండెన్స్ వేసి డబ్బులు సంపాదించడం ఎలా? వంటి చర్యలకు దిగజారాయి. ఇప్పటికైనా ప్రమాణాలు పాటించని కళాశాలలపై ఉక్కుపాదం మోపాలి. టాస్క్ఫోర్స్ కమిటీలు చేసిన తనిఖీ నివేదికలను బయటపెట్టాలి’’ బీటెక్ చదువు.. కానిస్టేబుల్ పోస్టు బీటెక్ పట్టాలు చేతిలో ఉన్నా ఎందరో అభ్యర్థులు కిందిస్థాయి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఇక సర్కారీ కొలువైతే అదే పదివేలు అనుకుంటున్నారు. ఎంత చిన్న పోస్టు అయినా అందులో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం శిక్షణలో ఉన్న 12 వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 10 శాతం మంది.. అంటే 1,200 మంది బీటెక్ అభ్యర్థులే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. బీటెక్ చదివినా ఇంటర్మీడియెట్ స్థాయితో భర్తీ అయ్యే పోస్టుల్లో చేరిపోయారు. వీరే కాదు.. ఈ 12 వేల మందిలో దాదాపు 6 వేల మంది పీజీ పట్టభద్రులు ఉండడం గమనార్హం. తమ వద్దకు వచ్చిన అభ్యర్థుల్లో తెలుగు కూడా సరిగ్గా రానివారు పెద్ద సంఖ్యలో ఉన్నారని పోలీస్ నియామకాలు చూసే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బీటెక్ సర్టిఫికెట్ పట్టుకొని బయటకు వస్తున్న వారిలో కేవలం 10 శాతం మందికే ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యం ఉంటోందని ఇటీవల నాస్కామ్ నిర్వహించిన సర్వేలో తేలింది. బయటకు వస్తున్న చాలా మందిలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని తెలిపింది. -
కొలువుల బ్యాంకింగ్
ముంబై: ఈ ఏడాది బ్యాంక్ కొలువులు భారీగా రానున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా జోరుగా విస్తరణ కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ఈ ఏడాది మొత్తంమీద కొత్తగా 80 వేల నుంచి లక్ష వరకూ బ్యాంక్ ఉద్యోగాలు నమోదుకానున్నట్లు పరిశ్రమ నిపుణులంటున్నారు. గత ఏడాది వచ్చిన ఉద్యోగాలతో పోల్చితే ఇది 30 శాతం అధికమని వారంటున్నారు. బ్యాంకులు తమ బ్రాంచీ, పోర్ట్ఫోలియో విస్తరణ, ఉద్యోగుల వలస, రిటైర్మెంట్, కొత్త బ్యాంకుల ప్రవేశం తదితర కారణాల వల్ల భారీ సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు రానున్నాయని టాలెంట్స్ప్రింట్ ఎండీ, సీఈవో శంతను పాల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోనే ఆర్బీఐ కొత్త బ్యాంకులకు లెసైన్స్లు ఇస్తుందని, ప్రభుత్వ రంగ బ్యాంకులు 8 వేల బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నాయని, ప్రైవేట్, గ్రామీణ, విదేశీ బ్యాంకులు తమ నెట్వర్క్ను విస్తృతం చేస్తున్నాయని, ఫలితంగా బ్యాంకింగ్ రంగంలో భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని వివరించారు. బ్యాంకింగ్ రంగంలో కొలువులు పెరుగుతుండటంతో గత ఏడాది 45గా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ల సంఖ్య ఈ ఏడాది 210కు పెరిగిందని తెలిపారు. ఐసీఐసీఐలో 6,000 ఉద్యోగాలు కాగా ఈ ఏడాది 5,000-6,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 300 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నామని 2,000-2,200 కొత్త ఉద్యోగాలివ్వనున్నామని ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ ఎం.ఒ. రెగో చెప్పారు. కొత్త బ్యాంకుల రాక కారణంగా తమ బ్యాంక్ నుంచి అధికంగా ఉద్యోగులు వలసపోతారని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భావిస్తోంది. అంతేకాకుండా ఈ ఏడాది 800 మంది రిటైరవుతున్నారని, అందుకే తమకు అవసరమైన దానికంటే 30 శాతం అధికంగా ఉద్యోగులను తీసుకోనున్నామని, ఈ ఏడాది 2,000 ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ సి.వి.ఆర్. రాజేంద్రన్ చెప్పారు. -
వాహన, గృహ రుణాలకు చౌక వడ్డీరేట్ల స్కీం?
న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో కస్టమర్లకు చౌకగా వాహన, గృహ రుణాలను అందించేందుకు అటు ఆర్బీఐ, ఇటు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ విధమైన కొత్త స్కీమ్పై దృష్టిసారిస్తున్నాయి. వాహన, గృహ నిర్మాణ రంగాలకు తక్కువ వడ్డీరేట్లకు రుణాలందించే విధంగా బ్యాంకులకు చౌకగా నిధులను అందించడమే ఈ స్కీమ్ ప్రధానోద్దేశం. గతేడాది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) ప్రవేశపెట్టిన ఇటువంటి తరహా పథకాన్ని ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా బ్యాంకులు, బిల్డింగ్ సొసైటీలకు చౌక రేట్లకు నిధులను అందించేలా బీఓఈ ఈ ‘ఫండింగ్ ఫర్ లెండింగ్ స్కీమ్’ను రూపొందించింది. దీని ప్రకారం రుణ వితరణకు బూస్ట్ ఇచ్చేందుకు బీఓఈ కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించింది. రుణాల జారీ పనితీరు ఆధారంగా ఏ రేటుకు, ఎంత మొత్తం నిధులను అందించాలనేది నిర్ణయిస్తారు. సరిగ్గా ఇలాంటి స్కీమ్ను ఆచరణలోపెట్టేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక మందగమనం, డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో ఆటోమొబైల్, రియల్టీ రంగాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం ఈ స్కీమ్ను అమలుచేస్తే... రుణ గ్రహీతలకు వాహన, గృహ రుణాలపై తక్కువ రేట్లకు నిధులు చేతికందేందుకు, ఈ రంగాలకు కాస్త చేయూతనిచ్చేందుకు దోహదం చేస్తుంది. రాజన్కు తొలి ‘పరీక్ష’ కఠినమే... ఆర్బీఐ కొత్త గవర్నర్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్... ఈ నెల 20న(శుక్రవారం) జరపనున్న తొలి పరపతి విధాన సమీక్షలోనే కఠిన పరీక్షను ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా నిత్యావసరాల ధరల మంటతో టోకు ధరల ద్రవ్యోల్బణం ఆగస్టులో ఆరు నెలల గరిష్టానికి(6.1శాతం) ఎగబాకిన సంగతి తెలిసిందే. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి అనూహ్యంగా వృద్ధిబాటలోకి వచ్చి జూలైలో 2.6 శాతం(జూన్లో ఇది మైనస్ 2.8 శాతం క్షీణత)గా నమోదవడం, డాలరుతో రూపాయి మారకం విలువ ఇటీవలి ఆల్టైమ్ కనిష్టం(68.80) నుంచి 63 స్థాయికి కోలుకోవడం జరిగాయి. మరోపక్క, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఏడాది(2013-14) తొలి త్రైమాసికంలో మరింత కిందికి జారి 4.4 శాతానికి(నాలుగేళ్ల కనిష్టం) పడిపోయింది. ఇవన్నీ చూస్తే వడ్డీరేట్ల తగ్గింపునకు దాదాపు అవకాశాలు లేవనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. పాలసీ నేపథ్యంలో ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ప్రధాని మన్మోహన్ సింగ్లతో రాజన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖతో ఆర్బీఐ తరచూ సంప్రదింపులు జరుపుతూనే ఉంటుందనీ, తాజా భేటీ కూడా అలాంటిదేనంటూ రాజన్ వెల్లడించారు కూడా. సర్వత్రా ఉత్కంఠ: రూపాయి పతనం, అధిక కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనలు శ్రుతిమించడంతో ఆర్బీఐ కఠిన పాలసీని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వడ్డీరేట్లను తగ్గించాలంటూ కార్పొరేట్లు ఎన్ని డిమాండ్లు చేసినా, ప్రభుత్వం తగ్గించమని పరోక్ష సూచనలు ఇచ్చినప్పటికీ... గత సమీక్షలో కీలక పాలసీ వడ్డీరేట్లను అప్పటి గవర్నర్ దువ్వూరి సుబ్బారావు యథాతథంగానే కొనసాగించిన విషయం విదితమే. దీంతో రెపోరేటు(బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే నిధులపై చెల్లించాల్సిన వడ్డీరేటు) 7.25 శాతంగా, సీఆర్ఆర్(బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నిధుల నిష్పత్తి) 4 శాతంగా కొనసాగుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, రూపాయి తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో పాలసీ సడలింపు రాజన్కు కత్తిమీదసామే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో రాజన్ తొలి పరీక్షలో ఎలా నెగ్గుకొస్తారనే ఉత్కంఠ అటు బ్యాంకింగ్ ఇటు కార్పొరేట్ వర్గాల్లో నెలకొంది. వృద్ధికి ఊతమివ్వాల్సిందే: కార్పొరేట్లు పెట్టుబడుల పెంపు, తద్వారా ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడేందుకు దోహదం చేసేలా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తొలి పాలసీ ప్రకటన ఉండాలని కోరుకుంటున్నట్లు కార్పొరేట్లు పేర్కొంటున్నారు. తద్వారా వడ్డీరేట్ల తగ్గింపు డిమాండ్ను మరోసారి లేవనెత్తారు. రుణాలు చౌకగా లభ్యమయ్యేందుకు వీలయ్యే కొన్ని విభిన్నమైన పరిష్కార మార్గాలను ఆర్బీఐ నుంచి ఎదురుచూస్తున్నామని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. ఇన్వెస్ట్ర్లలో విశ్వాసాన్ని నింపాలంటే అధిక ద్రవ్యోల్బణం, రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులు వంటి సమస్యలను పక్కనబెట్టి వడ్డీరేట్లను తగ్గించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. -
బ్యాంకింగ్ సేవలు భారత్లోనే భేష్
ముంబై: బ్యాంకింగ్ సేవలు భారత్లో భేషుగ్గా ఉన్నాయని శాప్ అధ్యయనంలో వెల్లడైంది. బ్యాంకింగ్ సేవలతో సంతృప్తి చెందిన ఖాతాదారుల విషయంలో భారత్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అగ్రస్థానంలో నిలిచిందని ఐడీసీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత్, ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్ల్లో మొత్తం 600 మంది బ్యాంకు ఖాతాదారుల నుంచి ఐడీసీ సేకరించిన వివరాలతో శాప్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ముఖ్యాంశాలు... ఆన్లైన్ బ్యాంకింగ్, సమర్థ లావాదేవీల నిర్వహణ, ఏటీఎంల అందుబాటు, సమర్థవంతంగా సేవలందించే బ్రాంచీలు... ఇత్యాది కారణాల వల్ల భారత్కు మొదటి స్థానం దక్కింది. 8.5 స్కోర్తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా(8.33 స్కోర్). న్యూజిలాండ్(8.27), చైనా(7.93)లు ఉన్నాయి. టెక్నాలజీపై బ్యాంకులు పెట్టిన పెట్టుబడికి ఫలితాలు దక్కుతున్నాయి. భారత బ్యాంకు ఖాతాదారులకు సంతృప్తికి ప్రధాన కారణం బ్యాంకులందిస్తున్న ఆన్లైన్ సర్వీసులు. ఆ తర్వాతి స్థానాల్లో సమర్థవంతంగా లావాదేవీల నిర్వహణ, అందుబాటులో బ్యాంక్ బ్రాంచీలుండడం నిలిచాయి. భారత్లో ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ ఆధారిత బ్యాంకింగ్ సేవలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ ప్రాధాన్యత ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.