birth day
-
IND VS AUS 2nd Test: పుట్టిన రోజున బుమ్రాకు చేదు అనుభవం
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇవాళ (డిసెంబర్ 6) 31వ పడిలోకి అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు నాడు బుమ్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఈ పుట్టిన రోజున బుమ్రా డకౌటయ్యాడు. భారత క్రికెట్ చరిత్రలో బుమ్రాకు ముందు కేవలం ముగ్గురు మాత్రమే తమ పుట్టిన రోజున డకౌటయ్యారు (టెస్ట్ మ్యాచ్ల్లో). 1978లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సయ్యద్ కిర్మాణి.. 1996లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో వెంకటపతి రాజు.. 2018లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఇషాంత్ శర్మ తమ పుట్టిన రోజున డకౌటయ్యారు. తాజాగా జస్ప్రీత్ బుమ్రా పై ముగ్గురి సరసన చేరాడు.అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బుమ్రా డకౌటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో బుమ్రా 8 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. కమిన్స్ బౌలింగ్ ఉస్మాన్ ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి బుమ్రా ఔటయ్యాడు.ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ తొలి రోజు టీమిండియాపై ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మిచెల్ స్టార్క్ (6/48) ధాటికి 180 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్గా నిలువగా.. కేఎల్ రాహుల్ (37), శుభ్మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఆసీస్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (13) ఔట్ కాగా.. మార్నస్ లబుషేన్ (20), నాథన్ మెక్స్వీని (38) క్రీజ్లో ఉన్నారు. -
యూట్యూబర్, నటి విరాజిత బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ప్రధాని మోదీ పుట్టినరోజు.. శుభాకాంక్షల వెల్లువ
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్మీడియాలో పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.Warm birthday wishes to the visionary leader & great son of Maa Bharati, Hon'ble Prime Minister Shri @narendramodi Ji. Your vision for a stronger, prosperous India resonates in every heart.May your dynamic leadership & unwavering dedication continue to transform India and… pic.twitter.com/PlzFdoIoGY— Prof.(Dr.) Manik Saha (@DrManikSaha2) September 16, 2024మోదీకి త్రిపుర సీఎం మాణిక్ సాహా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన జన్మదినం సందర్భంగా ఒడిశాలో 26 లక్షల పీఎం ఆవాస్ ఇళ్లను ప్రారంభించన్నారు.On the occasion of Hon’ble PM @narendramodi ji's birthday, my SandArt with installation of 2500 Diyas in New Delhi. Jai Jagannath! 🙏 pic.twitter.com/Rs0y3BPeah— Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2024 On the occasion of PM Modi's birthday, Maharashtra CM Eknath Shinde says, "My birthday wishes to Prime Minister Narendra Modi. I wish him good health and long life. Under the leadership of Prime Minister Modi, India is moving towards becoming an economic superpower, I wish him… pic.twitter.com/rXPBgTjrXX— ANI (@ANI) September 16, 2024మోదీకి ఉత్తరాఖండ్ సీఎం జన్మదిన శుభాకాంక్షలుఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్స్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.‘ రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది నివాసితుల తరపున, మీ ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, విజయవంతమైన జీవితం కోసం నేను మహాదేవ్ను ప్రార్థిస్తున్నాను. మీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కొనసాగించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.Uttarakhand CM Pushkar Singh Dhami extends birthday greetings to Prime Minister Narendra Modi."...On behalf of 1.25 crore residents of the state, I pray to the Lord Mahadev for your healthy, prosperous and successful life. I pray to the Lord that under your leadership, the… pic.twitter.com/a6BRUb1RnO— ANI (@ANI) September 17, 2024మోదీకి ఒడిశా సీఎం జన్మదిన శుభాకాంక్షలుమోదీకి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అసమానమైన నాయకత్వంలో, దేశం విక్షిత్ భారత్ వైపు అధిక వృద్ధి పథంలో పయనిస్తోంది. మీరు దేశ సేవలో దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.Odisha CM Mohan Charan Majhi extends birthday greetings to Prime Minister Narendra Modi. "...Under your unparalleled leadership, the Nation is moving on a high growth trajectory towards a Viksit Bharat. I wish you a long and healthy life in the service of the Nation..," his… pic.twitter.com/PHgcItiF9r— ANI (@ANI) September 17, 2024చదవండి: ఏడుపదుల వయసులోనూ కుర్రాడిలా ప్రధాని మోదీ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! -
ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!
పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన రోజు. ఎంతలా అంటే వాళ్ళకి ఉన్నంతలో బాగా జరుపుకోవాలి అనుకుంటారు. అయితే భార్యలకు బయటవాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ కంటే మనసుకి నచ్చిన వాళ్ళు ఇచ్చే కామెంట్ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. తాను పుట్టినరోజుని తన భర్త గుర్తుపెట్టుకుని విష్ చేస్తే వచ్చే ఆనందమే వేరు. ఎవరు ఎన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చిన భర్త ఇచ్చే బహుమతి కోసం ఎదురు చూస్తుంటుంది. భార్య ఎప్పుడు భర్త ఇచ్చే బహుమతిలో ఖరీదు చూడదు. అందులోని ప్రేమనే చూస్తుంది. అయితే భార్యలకి ఉన్న అదృష్టం ప్రతేకత ఉన్న రోజులని గుర్తు పెట్టుకోవడం. అందుకే భార్యలు భర్త పుట్టినరోజుని, పిల్లల పుట్టిన రోజుని, పెళ్లి రోజుని, అనుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళ పుట్టినరోజులు కూడా గుర్తుపెట్టుకోగలదు. కానీ భర్త తన భార్య పుట్టిన రోజుని గుర్తు పెట్టుకోవాలి అనుకున్నా.. పని హడావిడిలో మరిచిపోతుంటాడు.ఇలా భార్య పుటిన రోజుని మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది అని మీకు తెలుసా..? అది కూడా ఏకంగా ఐదేళ్లు. అవును ఇది నిజం. పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలో సమోవా అనే అందమైన ద్వీపం ఉంది. ఇక్కడ ఎవరైన పెళ్ళైన వ్యక్తి తన భార్య పుట్టిన రోజుని పొరపాటున మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది. తన భర్త తన పుట్టిన రోజుని మర్చిపోయారని భార్య గనుక ఫిర్యాదు చేస్తే.. తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఇక్కడ భార్య పుట్టిన రోజును మరిచిపోతే మాత్రం.. తప్పకుడా అది నేరం కింద లెక్క.ఇక్కడి రూల్ ప్రకారం.. అనుకుని మరిచిపోయాడా.. లేదంటే.. అనుకోకుండా మరిచిపోయాడా అనేది చూడరు. మరిచిపోయాడు అంతే.. దీనితో న్యాయపరమైన చిక్కుల్లో పడతాడు భర్త. అయితే ఈ చట్టంలో కాస్త వెసులుబాటు ఉంది. మెుదటిసారి భార్య పుట్టినరోజును మరిచిపోతే.. కాస్త చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు. మరోసారి అలా చేయోద్దని.. పోలీసులు హెచ్చరిస్తారు. మళ్లీ అదే రిపీట్ చేశారనుకో.. తప్పు అవుతుంది. జైలు రూపంలో శిక్ష పడుతుంది. మన దేశంలో ఇలాంటి చట్టాలు అమలులో ఉంటే.. చాలా మంది భర్తలు జైలుకే వెళ్తారేమో.(చదవండి: పచ్చి జామకాయ కంటే కాల్చిందే బెటర్! ఎన్ని ప్రయోజనాలంటే..!) -
ఆర్కిటెక్ట్ నిత్య ఆన్ సెట్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శర్వా 37’ (వర్కింగ్ టైటిల్). ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్గా సాక్షీ వైద్యని ఖరారు చేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఏజెంట్, గాండీవధారి అర్జున’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సాక్షీ వైద్య సుపరిచితురాలే. తాజాగా శర్వానంద్కి జోడీగా నటిస్తున్నారామె. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా బుధవారం(జూన్ 19) సాక్షీ వైద్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సెట్లోకి స్వాగతించింది యూనిట్. ‘శర్వా 37’లో ఆర్కిటెక్ట్ నిత్య పాత్రలో సాక్షీ వైద్య నటిస్తున్నారు. ‘‘పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్. -
CM Yogi Adityanath Birthday: యోగి ఆదిత్యనాథ్కు ఆ పేరెలా వచ్చిందంటే..
జూన్ 5.. అంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు. నేటితో ఆయనకు 52 ఏళ్లు నిండాయి. దేశంలో ఫైర్ బ్రాండ్ లీడర్గా యోగి ఆదిత్యనాథ్కు పేరుంది. అభిమానులు ఆయనను యోగి బాబా, బుల్డోజర్ బాబా అని కూడా పిలుస్తారు. యోగి ఆదిత్యనాథ్ రెండుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతో పాటు ఐదు సార్లు లోక్సభ ఎంపీగా కూడా ఉన్నారు.ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలో జన్మించారు. యోగి అసలు పేరు అజయ్ సింగ్ బిష్త్. యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ ఫారెస్ట్ రేంజర్. సీఎం యోగి గణితంలో బీఎస్సీ పట్టా పొందారు. 1990లో ఏబీవీపీలో చేరారు. 1993లో గోరఖ్నాథ్ పీఠానికి చెందిన మహంత్ అద్వైత్నాథ్తో పరిచయం ఏర్పడింది. 1994లో అజయ్ సింగ్ బిష్త్ సన్యాసం స్వీకరించారు. నాథ్ శాఖకు చెందిన సాధువుగా మారారు. ఆ తర్వాత ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్గా మారింది. 1994లో అద్వైత నాథ్ తన వారసునిగా యోగి ఆదిత్యనాథ్ను ప్రకటించారు.యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా 1998లో గోరఖ్పూర్ నుంచి బీజేపీ టికెట్పై తన 26 ఏళ్ల వయసులో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014లలో గోరఖ్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. మహంత్ అద్వైత్నాథ్ 2014లో కన్నుమూశారు. అనంతరం యోగి గోరఖ్నాథ్ పీఠానికి అధ్యక్షులయ్యారు.2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫలితాలు వెలువడే సమయంలో యోగి ఆదిత్యనాథ్ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బీజేపీ నేతలు ఎన్నికల ఫలితాల విడుదల వరకూ ఆగాలని ఆయనను కోరారు. ఆ సమయంలో మనోజ్ సిన్హా, కేశవ్ మౌర్య సహా పలువురు బీజేపీ నేతలు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యనాథ్ను ఢిల్లీకి పిలిపించి, యూపీలో అధికారం చేపట్టాలని కోరింది.యోగి సీఎం పదవి చేపట్టగానే ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న శాంతిభద్రతలు. దీనికి పరిష్కారం దిశగా ముందడుగు వేసిన ఆయన పోలీసు అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. యోగి నాయకత్వంలో 2022లో కూడా యూపీలో బీజేపీ విజయం సాధించింది. సీఎం యోగి బుల్డోజర్లతో నేరస్తుల ఇళ్లపై దండెత్తాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. అందుకే ఆయనకు బుల్డోజర్ బాబా అనే పేరు వచ్చిందంటారు. -
లీప్ ఇయర్లో జన్మించిన నాటి ప్రధాని జీవితం సాగిందిలా..
‘మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్’.. గాంధేయ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ నేత. ఆయన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఇందిరతో విభేదాల కారణంగా ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. మొరార్జీ దేశాయ్ తన కళాశాల జీవితంలోనే మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్.. తదితర కాంగ్రెస్ నేతల ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. ఇవి అతని జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ప్రారంభ జీవితం మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్లోని భడేలిలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంచోడ్జీ దేశాయ్, తల్లి పేరు మణిబెన్. తన తండ్రి తనకు జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పించారని, తండ్రి నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని మొరార్జీ దేశాయ్ అనేవారు. తనకు మతంపై విశ్వాసం ఉందని చెప్పేవారు. మనిషి అన్ని పరిస్థితులలోనూ ఓర్పుగా ఉండాలని బోధించేవారు. రాజకీయ జీవితం 1930లో మొరార్జీ దేశాయ్ బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. 1931లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సర్దార్ పటేల్ సూచనల మేరకు అఖిల భారత యువజన కాంగ్రెస్ శాఖను స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యాడు. 1932లో మొరార్జీ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 1952లో మొరార్జీ.. బొంబాయి (ప్రస్తుతం ముంబై) ముఖ్యమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయినప్పుడు, అంటే 1967లో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా, హోంమంత్రిగా పని చేశారు. 1977లో ప్రధానిగా.. నవంబర్ 1969లో కాంగ్రెస్లో చీలిక ఏర్పడటంతో మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)ని విడిచిపెట్టి కాంగ్రెస్ (ఓ)లో చేరారు. 1975లో జనతా పార్టీలో చేరారు. 1977 మార్చిలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ సమయంలో ప్రధానమంత్రి పదవికి చౌదరి చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ పోటీదారులుగా నిలిచారు. అయితే జయప్రకాష్ నారాయణ్ ‘కింగ్ మేకర్’ పాత్రను సద్వినియోగం చేసుకుని మొరార్జీ దేశాయ్కి మద్దతుగా నిలిచారు. 1977, మార్చి 24న తన 81 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. 1979, జూలై 28 వరకు ఈ పదవిలో కొనసాగారు. అవార్డులు, గౌరవ పురస్కారాలు మొరార్జీ దేశాయ్ భారత ప్రభుత్వం నుండి ‘భారతరత్న’, పాకిస్తాన్ నుండి ఉత్తమ పౌర పురస్కారం ‘తెహ్రీక్ ఈ పాకిస్తాన్’ను అందుకున్నారు. మొరార్జీ దేశాయ్ గాంధేయవాదానికి మద్దతుదారుగా నిలిచారు. అయితే దీనిలోకి క్షమాపణ స్ఫూర్తిని ఎప్పుడూ అంగీకరించలేదు. మొరార్జీ దేశాయ్ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన వ్యక్తిగా పేరొందారు. -
అక్కడ కవి పుట్టిన రోజు ఓ పండుగలా జరుపుకుంటారు!
మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతులు తప్పనిసరి తతంగాలుగా జరుగుతాయి. ఈ తప్పనిసరి తతంగాల్లో ఉత్సాహభరితమైన కార్యక్రమాలు ఉండవు. విందు వినోదాలు ఉండవు. కళా ప్రదర్శనలు ఉండవు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతుల కార్యక్రమాల్లో వక్తల ఊకదంపుడు ఉపన్యాసాలకు మించిన విశేషాలేవీ ఉండవు. యునైటెడ్ కింగ్డమ్లోని ఇంగ్లండ్, స్కాట్లండ్లలోనైతే, రాబర్ట్ బర్న్స్ పుట్టినరోజు కవితాభిమానులకు పండుగరోజు. ఆయన పుట్టినరోజు అయిన జనవరి 25న ఏటా ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. ‘బర్న్స్ నైట్’ పేరుతో విందు వినోదాలు, కవితా గోష్ఠులు, సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. బర్న్స్ కవిత్వాన్ని చదువుతూ అభిమానులు ఉర్రూతలూగిపోతారు. గాయనీ గాయకులు ఆయన గీతాలను ఆలపిస్తారు. వేడుకలు జరిగే వేదికలకు చేరువలోనే బర్న్స్ జ్ఞాపకాలను తలపోసుకుంటూ భారీస్థాయిలో విందు భోజనాలను ‘బర్న్స్ నైట్ సప్పర్’ పేరుతో నిర్వహిస్తారు. ఈ వేడుకలకు విచ్చేసే అతిథులను సంప్రదాయ బ్యాగ్పైపర్ వాయిద్యాలను మోగిస్తూ స్వాగతం పలుకుతారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా బర్న్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని వివిధ నగరాల్లోని అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన స్కాటిష్ కవి రాబర్ట్ బర్న్స్ 1759 జనవరి 25న పుట్టాడు. తన కవిత్వంతో స్కాటిష్ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. ఆయన 1796 జూలై 21న మరణించాడు. స్కాట్స్ భాషను, స్కాటిష్ కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవిదిగ్గజం రాబర్ట్ బర్న్స్ జ్ఞాపకార్థం నిర్వహించే ‘బర్న్స్ నైట్ సప్పర్’ కార్యక్రమాన్ని స్కాటిష్ పార్లమెంటు ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా పరిగణిస్తుంది. స్కాటిష్ పార్లమెంటు కూడా ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేస్తుంది. ఈ విందులో స్కాటిష్ బ్రోత్, పొటాటో సూప్, కల్లెన్ స్కింక్, కాక్–ఏ–లీకీ వంటి సూప్స్, గొర్రెమాంసంతో తయారుచేసే హ్యాగిస్ వంటి సంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. ఒక కవి పుట్టినరోజును మరే దేశంలోనూ ఇలా ఒక పండుగలా జరుపుకోవడం కనిపించదు. (చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..) -
North Koria : కిమ్ 40వ బర్త్ డే వేడుకలు ఎందుకు చేసుకోలేదు..?
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్కి 40 ఏళ్లు వచ్చాయి. ఆయన తన 40వ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా జరుపుకోలేదు. దీనికి పలు కారణలున్నాయని తెలుస్తోంది. ఇందులో ముఖ్య కారణం మాత్రం కిమ్ జాంగ్ ఉన్ తల్లేనట. ఎందుకంటే కిమ్ తల్లి జపాన్కు చెందిన మహిళ అవడంతో బర్త్డే వేడుకలు జరుపుకుంటే ఆమె ఉత్తర కొరియాకు చెందినది కాదనే చర్చ జరుగుతుందని కిమ్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఇది ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదని, అందుకే బర్త్డే వేడుకలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. అయితే తన తండ్రి, తాత తరహాలో బర్త్డే రోజు ప్రభుత్వ సెలవు ఇవ్వడంతో పాటు మిలిటరీ పరేడ్ నిర్వహించేత వయసు తనకు ఇంకా రాలేదని, తాను ఇంకా చిన్నవాడినని ఆయన అనుకుంటుంటారని సమాచారం. ఈ కారణాలతోనే కిమ్ తన బర్త్డే వేడుకలను జరుపుకోలేదని తెలుస్తోంది. అయితే బర్త్డే రోజు కిమ్ తన కూతురుతో కలిసి ఓ కోళ్ల ఫామ్ను సందర్శించినట్లు వార్తలొచ్చాయి. ఇదీచదవండి..ఎన్నికల్లో విజయం..బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన కుల్దీప్.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా
జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టును కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్లో 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్.. 17 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో కుల్దీప్కు ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం. టీ20ల్లో కుల్దీప్కు రెండో ఫైవ్ వికెట్ల హాల్. అంతేకాకుండా గురువారం(డిసెంబర్ 14) కుల్దీప్ యాదవ్ 29వ వసంతంలోకి అడుగుపెట్టాడు. తద్వారా కుల్దీప్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ టీ20 క్రికెట్లో పుట్టిన రోజున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా రికార్డులకెక్కాడు. అదే విధంగా టీ20ల్లో సేనా దేశాల్లో(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా) రెండు సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించిన తొలి భారత స్పిన్నర్గా కూడా కుల్దీప్ నిలిచాడు. చదవండి: Who Is Satheesh Shubha: అరంగేట్ర మ్యాచ్లోనే అదుర్స్.. ఆర్సీబీ జట్టుతో! ఎవరీ శుభా సతీష్? -
మహేష్ బాబు బర్త్ డే సప్రైజ్ ఫిక్స్.. ఇక ఫాన్స్ కి పూనకాలు లోడింగ్..!
-
నిఖిల్ స్వయంభూ
నిఖిల్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘స్వయంభూ’ అనే టైటిల్ ఖరారు చేశారు. గురువారం (జూన్ 1) నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్ను ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించనున్నారు. ‘‘నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆగస్టులో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస. ఇంకా.. నిఖిల్ బర్త్ డే సందర్భంగా వేరే చిత్రాల అప్డేట్స్ కూడా వచ్చాయి. నిఖిల్తో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాల తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ మరో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. అలాగే ‘ది ఇండియా హౌస్’ అనే మరో సినిమా కమిటయ్యారు నిఖిల్. ఇక నిఖిల్ హీరోగా నటించిన ‘స్పై’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. -
విషాదం.. కొడుకు పుట్టినరోజే.. తండ్రి ఆత్మహత్య..
ఉండవెల్లి: కొడుకు జన్మించిన రోజే ఓ తండ్రి బలవన్మర ణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో చోటు చేసు కుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాజు (29)కు కొన్నేళ్ల క్రితం గీతతో వివాహమైంది. వారిద్దరికి పాప, కుమారుడు ఉండగా.. ఆదివారం మూడో సంతానంగా మగ బిడ్డ అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించాడు. కుమారుడిని చూసి వచ్చిన రాజు.. మధ్యాహ్నం వేళ ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని అతని తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: జైలు నుంచి బయటకొచ్చిన నిహారిక -
ఈసారి బర్త్డేకి అలా కోరుకున్నా!
‘నిన్ను నిన్నుగా నువ్వు ప్రేమించుకోవడాన్ని మర్చి΄ోకు’’ అంటున్నారు శ్రుతీహాసన్. శనివారం (జనవరి 28) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతి. ‘‘నా జీవితం ఎంత గొప్పగా సాగుతోందో, మాటల్లో వర్ణించలేని ప్రేమను ఎంతగా ΄÷ందగలుగుతున్నానో (కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ని ఉద్దేశించి) అనే ఆనందమైన ఆలోచనలతో నిద్ర లేచాను. ప్రతి ఏడాదీ నా బర్త్ డే కేక్పై ఉన్న కొవ్వొత్తులను ఆర్పిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. కానీ ఈ ఏడాది మాత్రం నా కోసమే కాదు.. అందరి కోసం కోరుకున్నాను. అందరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలని, వారు కోరుకున్నది వారికి దక్కేలా పరిస్థితులు అనుకూలించాలని కోరుకుంటున్నాను. నిజం చె΄్పాలంటే... ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతూనే ఉంటుంది. ప్రతి బర్త్ డేకి వయసు సంఖ్య పెరగడం సహజం. ఆ అనుభవం రీత్యా కాస్త తెలివైనవాళ్ళం కూడా అవుతుంటాము (సరదాగా..). అలాగే ఈ ప్రపంచమనే యుద్ధంలో ప్రతిసారీ ఒంటరి సైనికుడిలా నెగ్గుకు రాలేమని కూడా అర్థం అవుతోంది. అయితే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో తెలివైనవారు, సానుకూల దృక్పథంతో ఉన్నవారు ఉన్నందుకు నేనే వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. సో.. నీ ప్రత్యేకతను నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి’’ అని రాసుకొచ్చారు శ్రుతీహాసన్. కాగా ఈ బర్త్ డేని శ్రుతీహాసన్ చాలా సందడిగా జరుపుకున్నట్లుగా ఫొటోలు చెబుతున్నాయి. ఈ వేడుకల్లో శ్రుతీ తల్లి సారిక, చెల్లి అక్షరాహాసన్లతో పాటు ఆమె బాయ్ఫ్రెండ్ శంతను హజారికా, బాలీవుడ్ నటి కాజోల్ కూడా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయాని వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ‘ది ఐ’ అనే ఇంగ్లిష్ ఫిల్మ్లో శ్రుతి ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. -
టీమిండియా కప్ కొడితే ఆ పని చేస్తా.. మనసులో మాట చెప్పిన కింగ్ కోహ్లీ
క్రికెట్లో రన్ మెషీన్, రికార్డుల రారాజు కింగ్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు(నవంబర్ 5). కింగ్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు విరాట్కు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా ప్లేయర్స్ కూడా కోహ్లీకి బర్త్డే విషెస్ చెబుతూ డ్రెస్సింగ్ రూమ్లో కేక్ కటింగ్ చేయించారు. కాగా, ప్రపంచకప్లో భాగంగా టీమిండియా రేపు(ఆదివారం) జింబాబ్వేతో జరగబోయే టీ20 మ్యాచ్ కోసం మెల్బోర్న్(ఎంసీజీ) క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా భారత్కు చెందిన పలువురు జర్నలిస్టులు విరాట్ కోహ్లీని కలిశారు. అనంతరం, గ్రౌండ్లోనే విరాట్తో కేక్ కటింగ్ చేయించారు. ఈ క్రమంలో జర్నలిస్టులు విరాట్కు శుభాకాంక్షలు చెబుతూ కోహ్లీతో కాసేపు సరదాగా ముచ్చటించారు. విరాట్ కూడా ఎంతో సరదాగా నవ్వుతూ వారికి సమాధానాలు ఇస్తూ హ్యాపీ మూడ్లో కనిపించాడు. అయితే, జర్నలిస్టులతో మాట్లాడుతున్న సందర్భంగా పుట్టినరోజు నాడు తన మనసులోని మాట బయటపెట్టాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు మీతో(జర్నలిస్టులతో) చిన్న కేక్ కట్ చేస్తున్నాను. కానీ.. నవంబర్ 13వ తేదీన టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిస్తే పెద్ద కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకుంటాను. కేక్ కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని ఎంతో సంతోషంతో కామెంట్స్ చేశాడు. ఇక, తనతో కేక్ కట్ చేయించిన జర్నలిస్టులకు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Virat Kohli celebrate his birthday with journalist . and BTW There were also those journalists who talked about removing him from the team#HappyBirthdayViratKohli pic.twitter.com/Rj9YaJHNfD — Rahul♦️ Virat (@mani_muzic) November 5, 2022 మరోవైపు.. విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) కూడా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక, కోహ్లీ బెస్ట్ దోస్త్ ఏబీ డివిలియర్స్ కూడా విరాట్కు వీడియో ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఏబీ డివిలియర్స్.. ‘హలో వి.. మై బిస్కట్.. ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలి. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నా.. నేను ఇక్కడ కూర్చొని బర్త్ డే విషెస్ పంపడం సరదాగా ఉంది. కోహ్లీ.. నువ్వు ఒక స్పెషల్ పర్సన్. అత్యుత్తమ క్రికెటర్వి. నీ స్నేహాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు. వరల్డ్ కప్లో నీకు..టీమిండియాకు ఆల్ ది బెస్ట్. టీమిండియా ఫైనల్ చేరాలి. ప్రపంచకప్ ఫైనల్లో ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఎదుర్కోవాలని ఆశిస్తున్నాను అని నవ్వుతూ డివిలియర్స్ విషెస్ తెలిపాడు. ఇక, టీ20 ప్రపంచకప్లో కింగ్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. టీమిండియా ఆడిన 4 మ్యాచ్లో కోహ్లీ మూడు అర్ధ సెంచరీలు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో 220 పరుగులు చేసి ఇప్పటి వరకు వరల్డ్కప్లో టాప్ రన్స్ సోర్కర్గా నిలిచాడు. కోహ్లీ ఇదే ఫామ్లో కొనసాగుతూ భారత్కు వరల్డ్కప్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. Dear @imVkohli, Here is a very special wish from a very special friend. 🥳🥹#PlayBold #HappyBirthdayViratKohli @abdevilliers17 pic.twitter.com/UT7wEdnde2 — Royal Challengers Bangalore (@RCBTweets) November 5, 2022 ఇది కూడా చదవండి: కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్లు.. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం...
షోపూర్: కునో నేషనల్ పార్కు. శనివారం ఉదయం 11.30 గంటలు. బోను తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఓ చీతా హుందాగా, నెమ్మదిగా బయటికొచ్చింది. తనకు బొత్తిగా అలవాటు లేని కొత్త వాతావరణం పలకరించడంతో తొలుత కాస్త అయోమయానికి లోనైంది. మెల్లిగా పరిసరాలను 360 డిగ్రీలూ స్కాన్ చేసింది. తర్వాత ఎదురుగా పరుచుకున్న తనకెంతో ఇష్టమైన గడ్డి మైదానంలోకి ఒక్కో అడుగే వేసింది. చూస్తుండగానే మెరుపు వేగంతో పరుగందుకుంది. కాస్త దూరం వెళ్లగానే ఓ చెట్టు దగ్గర ఆగింది. తలను చుట్టూ తిప్పుతూ పరిసరాలను మరోసారి నింపాదిగా పరికించి చూసింది. తర్వాత స్వేచ్ఛా సంచారం మొదలు పెట్టింది. అలా... 70 ఏళ్ల కింద భారత్లో అంతరించిన చీతా జాతి మళ్లీ దేశంలోకి అడుగు పెట్టింది. ఈ అపురూప క్షణాలను మీడియాతో పాటు బోన్ మీదుగా ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అత్యాధునిక డీఎస్ఎల్ఆర్ కెమెరాలో బంధించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయనే వాటిని కునో పార్కులోకి వదిలిపెట్టారు. ‘‘అవి మన అతిథులు. కొద్ది నెలల్లో కునో పార్కును తమ నివాసంగా మార్చుకుంటాయి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ‘మిషన్ చీతా’ పేరిట ఆఫ్రికాలోని నమీబియా నుంచి కేంద్రం రప్పించిన 8 చీతాలు ప్రత్యేక విమానంలో 10 గంటలు సుదీర్ఘ ప్రయాణం చేసి శనివారం ఉదయం గ్వాలియర్ చేరుకున్నాయి. అక్కడినుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లలో కునోకు తరలాయి. ప్రభుత్వాలు పట్టించుకోలేదు ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో చీతాల ఉనికిని పునరుద్ధరించేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. ‘‘ఇన్ని దశాబ్దాల తర్వాత మిత్రదేశమైన నమీబియా మద్దతుతో వాటిని రప్పించగలిగాం. ఇకనుంచి కునో పార్కు గడ్డి మైదానాల్లో చీతాలు పరుగులు తీస్తూ కనువిందు చేస్తాయి’’ అన్నారు. ‘‘కేంద్రం నిరంతర కృషి ఫలితంగా పులులు, ఏనుగులు, సింహాలు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ కూడా ప్రగతి సాధ్యమేనని ప్రపంచానికి మనం సందేశమిస్తున్నాం’’ అని చెప్పారు. ఇలా తరలించారు... నమీబియా నుంచి వచ్చిన 8 చీతాల్లో 3 మగవి కాగా 5 ఆడవి. వీటి వయసు 30 నుంచి 66 నెలలు. వాటికి మత్తు ఇంజక్షన్లిచ్చి ప్రత్యేక చెక్క బోన్లలో విమానంలో తరలించారు. 8,000 కిలోమీటర్ల సుదీర్ఘ ఖండాంతర ప్రయాణం కావడంతో వాంతులు చేసుకోకుండా ఖాళీ కడుపుతో తీసుకొచ్చారు. కునో పార్కులో ఎన్క్లోజర్లలోకి వదిలాక ఆహారమిచ్చారు. నెల రోజుల క్వారెంటైన్ అనంతరం మరో రెండు నుంచి నాలుగు నెలల పాటు చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. తర్వాత స్వేచ్ఛగా వదిలేస్తారు. చీతాల ఉనికిని నిరంతరం ట్రాక్ చేసేందుకు వాటికి రేడియో ట్యాగింగ్ చేశారు. చివరిసారిగా 1947లో నేటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలోస్థానిక రాజు మూడు చీతాలను వేటాడాడు. అంతటితో భారత్లో వాటి కథ ముగిసిపోయింది. ఇవేం తమాషాలు: కాంగ్రెస్ మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. సమస్యల నుంచి, భారత్ జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు చీతాల విడుదల పేరిట తమాషాకు తెర తీశారంటూ దుయ్యబట్టింది. చౌకబారు ట్రిక్స్లో బీజేపీ నేతలకు భారతరత్న ఇవ్వొచ్చంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. చీతాలను రప్పించే ప్రాజెక్టుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం 2009లో తెర తీసిందంటూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాంల్లో ప్రత్యేకంగా జోడో యాత్ర చేస్తామన్నారు. నన్ను కూడా రానివ్వొద్దు! తర్వాత ‘చీతా మిత్ర’ సిబ్బందితో ప్రధాని సరదాగా ముచ్చటించారు. ‘‘చీతాలను జాగ్రత్తగా చూసుకోండి. మనుషులకు, వాటికి అనవసర సంఘర్షణ తలెత్తకుండా చూడండి. కొత్త వాతావరణానికి అవి అలవాటు పడేదాకా ఎవరినీ వాటి దగ్గరికి పోనివ్వకండి. నాయకులు, బ్రేకింగ్ న్యూస్ కోసం వచ్చే మీడియా, అధికారులు, నా బంధువులు ఎవరినీ కునో నేషనల్ పార్కులోకి అనుమతించొద్దు. స్వయంగా నేనే వచ్చినా సరే, అడ్డుకోండి’’ అని సూచించారు! చీతాల పరిరక్షణకు, వాటిని గురించి పరిసర గ్రామాల వారికి అవగాహన కల్పించేందుకు 400 మంది యువకులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. గుజరాత్ సీఎంగా ఉండగా సింహాల సంఖ్య పెంచే చర్యల్లో భాగంగా ఇలాగే 300 మంది వన్యప్రాణి మిత్రులను నియమించినట్టు మోదీ గుర్తు తెచ్చుకున్నారు. -
అఫీషియల్: బాలకృష్ణ-అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్
బాలకృష్ణ మంచి జోరు మీదున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న ఆయన తాజాగా 108వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. శుక్రవారం బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా 108వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డబుల్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్లో ఎన్బీకే 108 సినిమా రూపొందనుంది. వినూత్న కథనంతో భారీ ఎత్తున ఈ చిత్రం తెరకెక్కనుంది. మాస్ పల్స్ తెలిసిన అనిల్ రావిపూడి.. మునుపెన్నడూ చూడని పాత్రలో బాలకృష్ణను చూపించేందుకు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రక్తంతో తడిసిన హృతిక్ రోషన్.. బర్త్డే స్పెషల్ ట్రీట్
Hrithik Roshan First Look As Vedha Out From Vikram Vedha: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన చిత్రం సూపర్ హిట్ చిత్రం 'విక్రమ్ వేద'. ఈ సినిమాకు అశేష ప్రేక్షధారణ లభించిన సంగతి తెలిసిందే. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈచిత్రాన్ని హిందీలో రీమెక్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి నటించిన వేద పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్గా పేరొందిన హృతిక్ రోషన్ అలరించనున్నాడని సమాచారం. జనవరి 10న హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. 'విక్రమ్ వేద' హీందీ రీమెక్ నుంచి హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్లో హృతిక్ రఫ్ లుక్లో అట్రాక్టీవ్గా కనిపిస్తున్నాడు. నల్లని కళ్లద్దాలు, గడ్డం, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిన 'వేద' పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను తమిళలో రూపొందించిన దర్శకుడు పుష్కర్ గాయత్రి ఈ హిందీ రీమెక్కు డైరెక్షన్ చేయనున్నాడు. ఈ సినిమాలో మాధవన్ నటించిన విక్రమ్ రోల్లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు సైఫ్ ఫస్ట్ లుక్ ఇంకా రాలేదు. అయితే ఇవాళ హృతిక్ బర్త్డే స్పెషల్ ట్రీట్గా వెద ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో మెరవనుంది. वेधा . VEDHA#vikramvedha pic.twitter.com/4GDkb7BXpl — Hrithik Roshan (@iHrithik) January 10, 2022 ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్తో జాన్వీ.. కరోనాగా అనుమానం -
బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ బర్త్డే.. జాన్ అబ్రహం స్టార్ కాకముందు
John Abraham Birthday Special On His Career: బాలీవుడ్ యాక్టర్, కండల వీరుడు జాన్ అబ్రహం పుట్టినరోజు నేడు. 1972 డిసెంబర్ 17న కేరళలో జన్మించిన జాన్ అబ్రహం తల్లి పార్సీ, తండ్రి మలయాళీ. మోడలింగ్తో కెరీర్ ప్రారంభించిన జాన్ అబ్రహంకు సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జాన్కు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. జాన్ నేటికి (డిసెంబర్ 17) 48 ఏళ్లు. మోడలింగ్ సమయంలో డబ్బు లేకపోవడంతో అతడు కొన్ని రోజులు మీడియా ప్లానర్గా పనిచేశాడు. ఈ విషయం అతి తక్కువ మందికి తెలుసు. జాన్ అనేక మ్యూజిక్ వీడియోలు, అడ్వర్టైజ్మెంట్స్ చేశాడు. అనంతరం 2003లో 'జిస్మ్' సినిమాతో బాలీవుడ్లో అరంగ్రేటం చేశాడు. తర్వాత 'సాయా', 'పాప్' సినిమాల్లో కనిపించాడు. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) 2004లో వచ్చిన 'ధూమ్' సినిమా జాన్ అబ్రహం సినీ కెరీర్ను మలుపుతిప్పింది. అభిషేక్ బచ్చన్ పోలీసు పాత్రలో నటించగా, జాన్ అబ్రహం దొంగ పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. తర్వాత పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేశాడు. గరం మసాలా, దోస్తానా, వెల్కమ్ బ్యాక్, ఫోర్స్-2, అటామిక్, సత్యమేవ జయతే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఎన్నారై ప్రియా రుంచల్ను 2014లో వివాహం చేసుకున్నాడు జాన్ అబ్రహం. అయితే ప్రియా ఒక బ్యాంకర్, సినిమాలను పట్టించుకోదని ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం చెప్పాడు. ఇద్దరూ పూర్తిగా విభిన్న రంగాలకు చెందిన వారైన జాన్ అలవాట్లంటే తనకు చాలా ఇష్టమని ప్రియా చెప్పుకొచ్చేది. జాన్ అబ్రహం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడని మెచ్చుకునేది ప్రియా. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) జాన్ అబ్రహంకు బైక్లంటే చాలా ఇష్టం. అతని దగ్గర రూ. లక్షల విలువైన ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వాటిలో బీఎండబ్ల్యూ, హోండా సీబీఆర్, అప్రిలియా, యమహా, ఎంవీ అగస్టా, డుకాటీ ఉన్నాయి. జాన్ 48 ఏళ్ల వయసులో కూడా ఫిట్నెస్కు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ 'ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్' అని నిరూపించాడు. జాన్ ఎలాంటి ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లు లేవు. అంతేకాకుండా అలాంటి ఏ పార్టీల్లో పాల్గొనడట. జాన్ అబ్రహం జంతు ప్రేమికుడు కూడా. వివిధ సామాజిక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ బీటౌన్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు ఈ హ్యాండ్సమ్ హంక్. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) -
‘ఎఫ్ 3’ అంతకుమించి ఉంటుంది
‘‘ఎఫ్ 2’ వల్ల వచ్చిన కిక్ వల్లో, ఎనర్జీ వల్లో వెంకటేశ్, వరుణ్ తేజ్గార్లు ‘ఎఫ్ 3’లో ఇరగదీశారు. ప్రేక్షకుల అంచనాలకు మించి ‘ఎఫ్ 3’ వారికి వినోదాన్ని పంచుతుంది’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. 2015లో వచ్చిన ‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి ఆ తర్వాత ‘సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ వంటి విజయాలతో హిట్ చిత్రాల దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నారు. మంగళవారం అనిల్ రావిపూడి బర్త్ డే (నవంబరు 23). ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. ► దర్శకుడిగా ఇది నా ఆరో బర్త్ డే. ఈసారి ‘ఎఫ్3’ సెట్స్లోనే నా పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. నా దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ముందుగా అనుకున్నట్లు ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 3’ రిలీజ్ అయితే హ్యాట్రిక్ అయ్యేది. సంక్రాంతి రిలీజ్ మిస్సయిందని బాధ ఉన్నప్పటికీ సోలో రిలీజ్ అయితే ఎక్కువమంది ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించి ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకుంటున్నాం. ఇప్పటికి ‘ఎఫ్ 3’ 80 శాతం షూటింగ్ పూర్తయింది. కొంత టాకీ, రెండు పాటలు చిత్రీకరించాలి. ► ‘ఎఫ్ 2’ సినిమా భార్యాభర్తల ఫ్రస్ట్రేషన్ నేపథ్యంలో ఉంటుంది. కానీ ‘ఎఫ్ 3’ కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇందులో వెంకటేశ్గారు రేచీకటి ఉన్న వ్యక్తిగా, వరుణ్ నత్తి ఉన్న వ్యక్తి పాత్రల్లో కనిపిస్తారు. హీరోల క్యారెక్టర్స్కు ఉన్న ఈ ప్రాబ్లమ్స్ కథను డిస్ట్రబ్ చేయవు. ‘ఎఫ్ 2’లో ఉన్న అందరూ ‘ఎఫ్ 3’లో ఉన్నారు. కొత్తగా సునీల్గారు, మురళీశర్మగారు కనిపిస్తారు. ‘ఎఫ్ 2’ సినిమా ఎండింగ్లో ‘ఎఫ్ 3’ అని వేశాం. కానీ అప్పుడు ‘ఎఫ్ 3’ కథ నా దగ్గర లేదు. కానీ మనకంటూ ఓ ఎంటర్టైన్మైంట్ ఫ్రాంచైజీ ఉంటే బాగుంటుందనుకుని ‘ఎఫ్ 3’ చేస్తున్నాం. ‘ఎఫ్ 4’ కూడా ఉండొచ్చేమో. ► చిన్న పిల్లలతో నేను మా ఇంట్లో చూసిన ఎలిమెంట్స్ అన్నీ ‘ఎఫ్ 3’లో ఉన్నాయి. థియేటర్లో ఫ్యామిలీ ఆడియ¯Œ ్స చూస్తే.. అరే మా ప్రాబ్లమ్స్ కూడా ఇవే కదా అనుకుంటారు. ‘ఎఫ్ 2’ అనేది నా బయోపిక్. ఆ మాటకొస్తే.. మగాళ్లందరి బయోపిక్ కూడా. ప్రతి ఒక్కరూ పని చేసే చోట, ఇంట్లో.. ఇలా ఎక్కడో చోట అలా ఫ్రస్టేట్ అవుతుంటారు. ► ‘ఎఫ్ 2’ సినిమా చేయడం వల్ల కావొచ్చు వెంకీ, వరుణ్ల మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదిరింది. వెంకీ, వరుణ్ల వల్ల కాదు కానీ హీరోయిన్లు (తమన్నా, మెహరీన్)ల వల్లే ఎక్కువ సమస్యలు వచ్చాయి (నవ్వుతూ). ‘ఎఫ్ 2’లో కన్నా ‘ఎఫ్ 3’లో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు 35మంది ఉన్నారు. రీసెంట్గా క్లైమాక్స్ను షూట్ చేశాం. అప్పట్లో ఈవీవీగారు సినిమాలో ఎక్కువమంది ఆర్టిస్టులను ఎలా మ్యానేజ్ చేసేవారా అని కొన్నిసార్లు అనిపించింది. ► ఇటీవల వెంకీగారు ఫస్టాఫ్ చూసి, ‘నేను ఒక్కడినే బాగా చేశాననుకున్నాను.. ఇదేంటమ్మా అందరూ ఇరగ్గొట్టేశారు’ అన్నారు. ‘ఎఫ్ 2’ చివర్లో కనిపించిన నేను ‘ఎఫ్ 3’లో ఓ సాంగ్లో కనిపిస్తా. ► ప్యాన్ ఇండియా అంటే ఆ స్థాయిలో కథ రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ (టాలీవుడ్) కుర్చీలో బాగున్నాను. ఒక ఏడాది అక్కడికి (బాలీవుడ్) వెళ్తే ఇక్కడున్న కుర్చీ సంగతి ఏంటి? ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు (నవ్వుతూ..). ‘ఎఫ్ 3’ చిత్రంలో పాన్ ఇండియన్ కంటెంట్ ఉంటుంది. ► ‘గాలి సంపత్’ నా జానర్ కాదు. కానీ స్క్రీన్ప్లే ఇచ్చాను. అయితే ఈసారి అలా చేయాలనుకోవడం లేదు. ప్రేక్షకులు నా నుంచి ఏం ఆశిస్తున్నారో అదే చేయాలనుకుంటాను. కానీ స్నేహితులకు నేను చేయాల్సింది చేస్తాను. అలాగే నా కథను ఎవరికీ ఇవ్వను. అన్ని కథలు నా దగ్గర లేవు. ► ‘దిల్’ రాజుగారికి ‘ఎఫ్ 3’ కథ పూర్తిగా వినిపించలేదు.. రెండు మూడు సీన్లు వినిపించాను. ఆయన బేనర్లో వరుసగా చేస్తున్నాను. ‘దిల్’ రాజుగారు నా రెమ్యూనరేషన్ పెంచారు. రీసెంట్గా కొత్త ఇల్లు కొనుక్కున్నాను. ఎంతిస్తారు? అని ఎప్పుడూ అడగను. ఎంతిస్తే అంతే (నవ్వుతూ). ► బాలకృష్ణగారితో సినిమా ఉంది. ఆయనతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయలేం. జనవరి నుంచి ఆ కథ వర్కౌట్ చేస్తాను. జూన్, జూలైలో సెట్స్ మీదకు వెళ్తాం. -
టీకా పంపిణీ చూసి కొన్ని పార్టీలకు జ్వరం పట్టుకుంది : మోదీ
-
ఒక్కరోజులో 2.26 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సినేషన్లో భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం దేశవ్యాప్తంగా 2 కోట్లకుపైగా టీకా డోసులు ప్రజలకు వేశారు. కో–విన్ పోర్టల్ గణాంకాల ప్రకారం దేశంలో శుక్రవారం ఒక్కరోజే 2.26 కోట్లకుపైగా డోసులు ఇచ్చారు. అత్యధికంగా కర్ణాటకలో 26.9 లక్షల డోసులు, బిహార్లో 26.6 లక్షల డోసులు, ఉత్తరప్రదేశ్లో 24.8 లక్షల డోసులు, మద్యప్రదేశ్లో 23.7 లక్షల డోసులు, గుజరాత్లో 20.4 లక్షల డోసులు ఇచ్చారు. ఈ రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ప్రధానమంత్రికి ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజల తరపున తాము అందజేసిన జన్మదిన కానుక అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.25 కోట్లకు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఒక్క రోజులో కోటికిపైగా డోసులు ఇవ్వడం గత నెల వ్యవధిలో ఇది 4వసారి కావడం విశేషం. ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ.. ప్రధానమంత్రి మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, టిబెట్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాలు శుభాకాంక్షలు తెలిపారు. సేవా ఔర్ సమర్పణ్.. ప్రధాని మోదీ జన్మదినంతోపాటు ఆయన గుజరాత్ సీఎంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా 20 రోజులపాటు సాగే ‘సేవా ఔర్ సమర్పణ్’ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 7 దాకా దేశవ్యాప్తంగా కొనసాగనుంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడతారు. 14 కోట్లకుపైగా రేషన్ కిట్లు పంపిణీ చేస్తారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లో జన్మించిన నరేంద్ర మోదీ తొలుత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. అనంతరం బీజేపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రతి భారతీయుడికి గర్వకారణం: మోదీ దేశంలో ఒక్కరోజులో 2.26 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్ను విజయవంతం చేయడంలో పాల్గొన్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్ల కృషి మరువలేనదని ప్రశంసించారు. -
కోడె దూడ ‘చింటూ’కు బర్త్డే
వెల్దుర్తి: సాధారణంగా చిన్న పిల్లల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా కోడె దూడకు జన్మదిన వేడుకలు నిర్వహించారు సిద్ధినగట్టు గ్రామ రైతు పెద్ద పుల్లయ్య. ఈయన వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో ఉండే ఎద్దులు, ఆవులను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ఏడాది క్రితం ఆవు కోడెదూడకు జన్మనిచ్చింది. దానికి చింటూ అని నామకరణం చేసి ఇంటిల్లపాది మురిపెంగా చూసుకునే వారు. జూలై 4 దాని జన్మదినం కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులు కోడె దూడను అలంకరించారు. చుట్టు పక్కల వారిని పిలిచి..కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. -
‘పక్కా కమర్షియల్’..పోస్టర్ రిలీజ్
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రంలోని స్టైలిష్ పోస్టర్ను గోపీచంద్ బర్త్డే (జూన్ 12) సందర్భంగా విడుదల చేశారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నలభై శాతం పూర్తయింది. కొత్త షెడ్యూల్ను వచ్చే నెల మొదటివారంలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: జేకేఎస్ బిజాయ్, సహనిర్మాత: ఎస్కేఎన్. -
సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు!
‘‘కోవిడ్ బాధితుల అవసరార్థం ఆక్సిజన్ సిలిండర్లు, రెమెడెసివిర్ ఇంజెక్షన్లు, ఆస్పత్రిలో బెడ్లు.. ఇలా నెల రోజుల నుంచి నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఎన్నో రిక్వెస్ట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో వాలంటీర్లు, నా ఫ్రెండ్స్, నా అభిమానులు నాకు సాయంగా ఉంటున్నారు’’ అని నిఖిల్ అన్నారు. నిఖిల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు చేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం షూటింగ్లు ఆగిపోయాయి.. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం? అందుకే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రస్తుతానికి ఎవరి వద్దా డబ్బు సహాయంగా తీసుకోవడం లేదు. నా సొంత డబ్బులతోనే సాయం అందిస్తున్నాను. చాలా మంది డబ్బులు పంపుతామని సంప్రదించారు. అయితే ఆ డబ్బుతో మీ ప్రాంతాల్లో అవసరమైన వారికి సాయపడండి అని చెబుతున్నాను’’ అన్నారు. వైవాహిక జీవితం గురించి నిఖిల్ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది మే 14న కోవిడ్ సమయంలోనే పల్లవితో నా పెళ్లి అయింది. హనీమూన్కి విదేశాలకు వెళ్లే పరిస్థితి అప్పుడు లేకపోవడంతో సిమ్లా, గోవాలకు వెళ్లాం. పల్లవి డాక్టర్ కావడంతో రోగులకు అవసరమైన మందులను ఫోనులో చెబుతుంటుంది. నేను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తను కూడా ఓ వాలంటీర్’’ అన్నారు. చేస్తున్న సినిమాల గురించి చెబుతూ – ‘‘ప్రస్తుతం ‘18 పేజెస్’, ‘కార్తికేయ 2’ చిత్రాలు చేస్తున్నాను. మరో మూడు సినిమాలకు సంతకం చేశాను’’ అన్నారు. -
నా తర్వాతి సినిమాలో తెలుగమ్మాయే హీరోయిన్
‘‘1990 వరకూ తెలుగు నుంచి చాలామంది హీరోయిన్లు వచ్చి స్టార్లు అయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రతిభావంతమైన తెలుగమ్మాయిలు వచ్చినా మంచి అరంగేట్రం దొరక్క, అనుకున్నంత స్థాయిలో మెరవలేక మరుగున పడిపోతున్నారు. నా తర్వాతి చిత్రానికి తెలుగమ్మాయినే కథానాయికగా పరిచయం చేస్తా. తను స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటే హ్యాపీ’’ అని దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్కమగాడు, సలీం, నిప్పు, రేయ్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు వైవీఎస్ చౌదరి. ఆదివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ – ‘‘చదువులో నేను ఫస్ట్ ర్యాంకర్ని. నందమూరి తారక రామారావుగారి స్ఫూర్తితో చదువును వదిలి చిత్రపరిశ్రమలోకి వచ్చాను.. సంతృప్తిగా ఉన్నాను. సినిమా ఓ అనిర్వచనీయమైన వ్యామోహం. ఈ రంగంలో ప్రతి శుక్రవారం సబ్జెక్టు మారుతుంది.. దానికి తగ్గట్లు సినిమాలు నిర్మించడం అన్నది పెద్ద ఛాలెంజ్. దర్శకునిగా నా కెరీర్ మొదలైన 23 ఏళ్లలో 10 సినిమాలే చేశా. రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఒత్తిడి లేకుండా సినిమాలు చేయాలనుకుంటాను. అందుకే సినిమా సినిమాకి గ్యాప్ వస్తుంటుంది. ఎన్టీఆర్, మహేశ్బాబు వంటి స్టార్లతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? అన్నీ కలిసిరావాలి. నా తర్వాతి సినిమాకి కథ రెడీ. కోవిడ్ ఉధృతి తగ్గాక ప్రారంభిస్తా’ అన్నారు. -
ఇప్పుడు నాకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు!
నాయకుడు.. ప్రతినాయకుడు... హాస్యనటుడు.. సహాయనటుడు... ఇలా నటుడిగా చంద్రమోహన్ గుర్తుండిపోయే పాత్రల్లో జీవించారు. ఐదున్నర దశాబ్దాల కెరీర్లో నాలుగు భాషల్లో, నాలుగు తరాల నటులతో సినిమాలు చేసిన ఘనత చంద్రమోహన్ది. హీరోగా 175 సినిమాలు చేశారు. కెరీర్ మొత్తంలో 932 సినిమాలు చేశారు. ఈ విలక్షణ నటుడి పుట్టినరోజు నేడు (మే 23). 80 ఏళ్లు పూర్తి చేసుకుని, 81లోకి అడుగుపెడుతున్న చంద్రమోహన్ చెప్పిన విశేషాలు. ► కెరీర్లో స్థిరపడటం, ఆర్థిక స్థిరత్వం.. కెరీర్ తొలినాళ్లల్లో వీటిపైనే నా దృష్టి. ఈ రెండూ నెరవేరాక నేను కావాలని కోరుకున్న దర్శకుల కోసం సినిమాలు చేశాను. ►వినోదం పండించడం చాలా కష్టం. కమెడియన్కి గుర్తింపు రావాలంటే డైలాగుల్లో పంచ్ ఉండాలి. ప్రేక్షకుల నాడి తెలుసుకుని నటించాలి. అలాగే మరో సవాల్ ఏంటంటే.. వ్యక్తిగతంగా ఎలాంటి మూడ్లో ఉన్నా అది కెమెరా ముందు కనిపించనివ్వకూడదు. మరో కష్టం ఏంటంటే.. చేసినట్లే చేస్తే స్టేల్ అయ్యే ప్రమాదం ఉంది. కొత్తగా ప్రయత్నించాల్సి ఉంటుంది. కష్టమైన హాస్య పాత్రలను కూడా నేను పండించడానికి కారణం నా ఫ్యామిలీ. మా నాన్న, అక్కయ్యలు, తమ్ముడు, నేను.. మాకు మేం నవ్వకుండా ఇతరులను నవ్వించే అలవాటు ఉంది. ►నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుని, ‘గంగ మంగ’, ‘లక్ష్మణ రేఖ’, ఇంకో సినిమాలో నెగటివ్ పాత్రలు చేశాను. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్ రౌండర్ అనిపించుకోవాలని గ్రహించాక అన్ని రకాల పాత్రలు చేయడం మొదలుపెట్టాను. హీరోగానే అనుకుని ఉంటే సినిమాల్లో 50 ఏళ్లకు పైగా ఉండగలిగేవాడిని కాదు. ►ఓ 50 ఏళ్లు నిర్విరామంగా సినిమాలు చేసిన నేను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. ఎవరైనా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో అంటే, ‘ఇనుముకు చెదలు పడుతుందా?’ అనేవాణ్ణి. ఆ నిర్లక్ష్యమే నా ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసింది. ‘రాఖీ’లో ఎమోషనల్ సీన్ చేసి, బైపాస్ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరాను. ‘దువ్వాడ జగన్నాథమ్’ అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోవడంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాను. అయితే టీవీలోనో, యూ ట్యూబ్లోనో నా సినిమాలు వస్తున్నాయి.æగతంలో కన్నా ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ కావడం ఆశ్చర్యంగా అనిపించినా ఆనందంగా ఉంది. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. అయితే సినీజీవితం చాలా నేర్పించింది. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని నేర్పింది. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని నేర్పింది. చెప్పుకోలేని చేదు నిజాల్ని ఎలా గుండెల్లో దాచుకోవాలో చెప్పింది. వృత్తి జీవితంలో ఎలాంటి లోటు లేదు. వ్యక్తిగత జీవితం కూడా అంతే. నా భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే. నాకు కోపం ఎక్కువ, ఆమెకు సహనం ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది నా కోపాన్ని తగ్గించడానికేనేమో అనిపిస్తుంటుంది. మా ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మాసిస్ట్. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలో ఉంటున్నారు. చంద్రమోహన్ సినిమాల్లో ఆయనకు నచ్చిన 30 పాటలు. 1. ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ 2. మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి 3. మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు 4. కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం 5. మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ 6. లేత చలిగాలులు– మూడు ముళ్లు 7. దాసోహం దాసోహం – పెళ్లి చూపులు 8. సామజవరాగమనా – శంకరాభరణం 9. ఈ తరుణము – ఇంటింటి రామాయణం 10. ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి 11. పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు 12. నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి 13. పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి 14. కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం 15. ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే 16. బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం 17. నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు 18. చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు 19. నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం 20. వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం 21. అటు గంటల మోతల – బాంధవ్యాలు 22. ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు 23. ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య 24. ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం 25. ఏమని పిలవాలి – భువనేశ్వరి 26. మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు 27. పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి 28. ఐ లవ్ యు సుజాత– గోపాల్ రావ్ గారి అమ్మాయి 29. నీ తీయని పెదవులు– కాంచనగంగ 30. నీ చూపులు గారడీ– అమాయకురాలు. -
పాజిటివ్గా ఉండండి.. పాజిటివ్ తెచ్చుకోకండి
కరోనా కష్టకాలంలో తన స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహంతో పాతికవేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. మే 20న (గురువారం) హీరో మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. ఆ విషయం గురించి మనోజ్ మాట్లాడుతూ – ‘‘కోవిడ్ బాధితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలు పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్లైన్ వర్కర్స్తో పాటు కోవిడ్ కట్టడిలో భాగస్వాములైనవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజూ శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం.. ఇలా కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతుంది. ఈ లాక్డౌన్లో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందిపడుతున్న పాతికవేల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్లోనూ ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాం. అందరూ కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించండి. పాజిటివ్గా ఉండంyì... కానీ కోవిడ్ పాజిటివ్ తెచ్చుకోకండి’’ అన్నారు. -
Gully Rowdy: దుమ్మురేపుతున్న రామ్ మిర్యాల పాట
‘పుట్టినే ప్రేమ పడగొట్టెనే ప్రేమ.. ఏం చేశావో ఏమో కదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలాకుతలం అవుతున్నానమ్మా..’ అంటూ ప్రేయసిని చూసి పాడేస్తున్నాడు గల్లీరౌడీ. ఈ రౌడీ ప్రేమ కహానీ తెలుసుకోవాలంటే మా ‘గల్లీరౌడీ’ సినిమా చూడాల్సిందే అంటున్నారు ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలోని ‘పుట్టినే ప్రేమ..’ పాటను సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మా సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్. -
Sundeep Kishan: ప్రయోగాత్మక సినిమాలో...
హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘టైగర్’ సినిమా విడుదలై ఆరేళ్లు అయింది. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమాని ప్రకటించారు. ఇది సందీప్కి 28వ సినిమా. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శుక్రవారం సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథ, కథనాల ప్రకారం ఇది సందీప్ కెరీర్లో ఓ ప్రయోగాత్మక చిత్రంలా నిలుస్తుంది. సందీప్ నుంచి ప్రేక్షకులు ఆశించే కొత్తదనం, వైవిధ్యమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుట్ట. -
అందాల తార జయప్రద గురించి ఈ విషయాలు తెలుసా..?
ఆమె ఆరేసుకుంటే ప్రేక్షకుడు మనసు పారేసుకున్నాడు. ఈమెతోనే రజనీకాంత్ ‘ఇంక ఊరేల.. సొంత ఇల్లేల ఓ చెల్లెలా’ అన్నది. కమలహాసన్ కళ మద్యపు మురుక్కాలవలో పారుతుంటే ఈమె కదూ దానిని ‘సాగర సంగమం’ చేయించింది. ‘భారతీయ వెండితెర మీద అంత అందమైన ముఖం మరొకటి లేదు’ అని సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రదది. ఆమె రాజకీయ ప్రస్థానం ఒకదారి. ఆమె నటనదే ప్రేక్షకుల గుండెదారి. జయప్రద... జయసుధ.. శ్రీదేవి తెలుగు సినీ జగత్తును ఏలిన ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాల తేడాతో స్టార్లు అయ్యారు. తెలుగు మాట, తెలుగు ఆట, తెలుగు సౌందర్యం తెర మీద చూపారు. శ్రీదేవి గ్లామర్లో బెస్ట్. జయసుధ యాక్టింగ్లో బెస్ట్. జయప్రద ఇటు గ్లామర్, అటు యాక్టింగ్ రెంటిలోనూ బెస్ట్ అనిపించుకున్నారు. రాజమండ్రికి చెందిన లలిత రాణి ‘భూమి కోసం’ (1974)లో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించారు. ఒక పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు జయప్రద. మొట్టమొదటి వేషం అలాంటిది ఎవరూ వేయరు. కాని జయప్రద చేశారు. ఆ సినిమాలోనే పేరు మార్చుకుని అప్పట్లో ‘జయ’ ట్రెండ్ నడుస్తున్నందున జయప్రదగా మారారు. ఆమె పెదవి మీద పుట్టుమచ్చ ఉంటుంది. వెండితెర మీద ఒక అందమైన పుట్టుమచ్చగా ఆమె ప్రేక్షకులకు నచ్చింది. తరం మారుతున్నప్పుడు కొత్త తరం వస్తుంది. వాణిశ్రీ, లక్ష్మి, మంజుల, లత... వీరు సీనియర్లు అవుతున్న కొద్దీ కొత్తవాళ్లు కావాల్సి వచ్చారు. జయప్రద ఆ సమయంలోనే మద్రాసులో అడుగుపెట్టారు. ఏకంగా కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆమె తమిళంలో తీసిన ‘అవల్ ఒరు తోడర్ కథై’లో సుజాత చేసిన పాత్రను జయప్రదకు ఆఫర్ చేశారాయన. సుజాతకు అప్పటికి తెలుగు రాదు. అచ్చతెలుగు అమ్మాయి ఉంటేనే బాగుంటుందని బాలచందర్ ఆలోచన. అందుకు జయప్రద సరైనది అని ఆయన భావించారు. ఒక మధ్యతరగతి గంపెడు సంసారాన్ని తన భుజాల మీద మోసే, తన కలలను చిదిమేసుకుని కుటుంబం కోసం బతికే ఒక సగటు ఆడపిల్ల కథ అది. దాని బరువు ఎక్కువ. జయప్రదది ఆ సమయానికి చిన్న వయసు. కాని ఆమె ఆ పాత్రను అర్థం చేసుకొని పోషించడంతో... ఒక్క కేరెక్టర్లోనే ప్రేమ, కోపం, ఆర్తి, అసహనం చూపడంతో జయప్రద స్టార్ అయ్యారు. ఆ సినిమాయే తెలుగులో రజనీకాంత్కు కూడా తొలి సినిమా. ఆ సినిమాలో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట’... ఏసుదాస్కు, జయప్రదకు, రజనీకాంత్కు నేటికీ మిగిలిపోయింది. కె.బాలచందర్ దర్శకత్వంలో ఆమె ‘47 రోజులు’, ‘అందమైన అనుభవం’ చేశారు. కేన్సర్ పేషెంట్గా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? జయప్రద తప్ప. ‘అడవి రాముడు’తో కె.రాఘవేంద్రరావు జయప్రదను కమర్షియల్ హీరోయిన్ను చేశారు. అప్పటికే జయప్రద కుటుంబం ఎన్.టి.ఆర్కు పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం సెలవుల్లో వచ్చి ఆయన దగ్గర కూచుని కబుర్లు చెప్పిన స్కూల్ గర్ల్ ఇప్పుడు ఆయన పక్కనే హీరోయిన్ అయ్యింది. వేటూరి రాయగా కె.వి.మహదేవన్ స్వరపర్చగా బాలూ, సుశీల పాడిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట జయప్రదను సకల ప్రేక్షకులకు పరిచయం చేసేసింది. జయప్రద అంటే ఒక సుందరమైన సౌందర్యవంతమైన రూపం. ప్రేక్షకులు అలానే కోరుకున్నారు. ఆమె నేటికీ అలానే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా లో నటిస్తున్నారు. మరోసారి జయప్రద జయప్రదంగా మన ముందుకు రావాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
నితిన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
సినిమా అవకాశాల కోసం తిరగకుండానే తేజ లాంటి పెద్ద దర్శకుడి రూపంలో ఆ యువకుడికి హీరోగా అవకాశం వచ్చింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రయత్నాలు చేయకుండా వినాయక్, రాజమౌళి, రాఘవేంద్రరావు, కృష్ణవంశి లాంటి బడా డైరెక్టర్లు తనని హీరోగా సెలక్ట్ చేసుకున్నారు. ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. అతి చిన్న వయసులోనే స్టార్ అయిపోయాడు. కాలం అడ్డం తిరిగింది. వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. స్టార్ హోదా పోయింది. దగ్గరి వాళ్లు దూరమయ్యారు. అయినా ‘ధైర్యం’గా నిలబడ్డాడు. తప్పిదాలు తెలుసుకున్నాడు. ఆచి తూచి కథలు ఎంచుకున్నాడు. ‘ఇష్క్’తో పనిచేశాడు. పుష్కరకాలం తర్వాత మళ్లీ వి‘జయం’ వరించింది. తనదైన నటనతో ప్రేక్షకుల ‘దిల్’లో స్థానం సంపాదించుకొని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అతనే యంగ్ హీరో నితిన్. ఈ ‘అల్లరి బుల్లోడి’ 38వ పుట్టిన రోజు నేడు (మార్చి 30). ఈ సందర్భంగా నితిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. ► నితిన్ పూర్తి పేరు నితిన్ కుమార్ రెడ్డి.1983 మార్చి 30న సుధాకర్రెడ్డి, విద్యారెడ్డి దంపతులకు నిజామాబాద్లో జన్మించాడు. ► నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పాపులర్ డిస్ట్రిబ్యూటర్. ► నువ్వు-నేను సినిమా సమయంలో డైరెక్టర్ తేజ.. నితిన్ ని చూసి నా తర్వాత సినిమా హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. ► 2002లో 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడ నితన్ ► తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును గూడ అందుకున్నాడు ► దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘సై’ సినిమా నితిన్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది ► ఒకానొక దశలో ఏకంగా దశాబ్దానికి పైగా వరసగా 14 సినిమాలు ప్లాపులు వచ్చాయి నితిన్కి. ► 2012లో వచ్చిన 'ఇష్క్' సినిమాతో మళ్లీ సక్సెస్ బాటపట్టాడు ► 2020లో వెంకి కుడుముల రూపొందించిన ‘భీష్మ’తో మరో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు ► ఈ ఏడాది చెక్తో ఎంట్రీ ఇచ్చి.. తాజాగా రంగ్దే మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు ► హీరోగానే కాకుండా.. నిర్మాతగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యే గుర్తింపు తెచ్చుకున్నాడు ► పవన్ కల్యాణ్ నటించిన తొలి ప్రేమను 28సార్లు చూసి పవర్ స్టార్కు వీరాభిమానిగా మారాడు. ► జూలై 16, 2020న షాలిని కందుకూరితో నితిన్ వివాహం జరిగింది. ఈ వేడుకకి పవన్ కల్యాణ్ హాజరయ్యాడు ► నితిన్ ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. -
స్నేహం.. యాక్షన్.. థ్రిల్
‘‘అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధా రంగా ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని రూపొందించాం. ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. మా నాన్న (మంచు మోహన్బాబు) పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. ఇందులో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు పది నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను శుక్రవారం వైజాగ్ మెలోడి థియేటర్లో ప్రేక్షకులకు చూపించారు. అనంతరం విలేకరులతో మంచు విష్ణు మాట్లాడుతూ – ‘‘విశాఖలో అభిమానులతో ఈ ప్రీమియర్ షో చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా ఉంటుంది. ఈ చిత్రంలో స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అన్నీ ఉంటాయి’’ అన్నారు. నవదీప్ కూడా పాల్గొన్నారు. -
శర్వానంద్కి సర్ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో..
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. శనివారం 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్న బర్త్ డే బాయ్ శర్వాకి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, స్నేహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బర్త్డే సందర్భంగా శర్వానంద్కి ఊహించని సర్ప్రైజ్ ఎదురయ్యింది. తన బెస్ట్ ఫ్రెండ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్కు మర్చిపోలేని పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అర్థరాత్రి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసి శర్వానంద్ చేత కేక్ కట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిలో శర్వానంద్.. రామ్ చరణ్, మరో స్నేహితుడితో కలిసి బర్త్ డే కేక్ కట్ చేయడం చూడవచ్చు. ఆచార్య సినిమాకు సంబంధించి తన షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్, రెండు రోజుల క్రితం భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్నేహితుడు శర్వానంద్ కోసం సర్ప్రైజ్ బర్త్ డే పార్టీ అరెంజ్ చేశారు. రామ్ చరణ్, శర్వానంద్తో పాటు మరో స్నేహితుడు విక్కి కూడా ఈ బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. Thank you @AlwaysRamCharan for hosting a great party ❤️❤️❤️ pic.twitter.com/jJf03cRMp0 — Sharwanand (@ImSharwanand) March 6, 2021 శ్రీకారం మూవీని పూర్తి చేసిన శర్వానంద్ ప్రస్తుతం తరువాత సముద్రం సినిమాతో బిజీగా ఉన్నాడు.అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దార్థ్, అను ఇమ్యానుయేల్, అదితి రావ్ హైదరీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో చిత్రం బృందం శర్వానంద్ బర్త్ డే సందర్భంగా మహా సముద్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసింది. పోస్టర్ని బట్టి ఈ సినిమా సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో శర్వానంద్ చేతిలో ఆయుధంతో.. చాలా కోపంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకారం సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని తెలియజేస్తూ సాగే ఈ చిత్రంలో శర్వానంద్కు జోడిగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటించారు. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. -
కేసీఆర్కు సీఎం జగన్ బర్త్ డే విషెష్
సాక్షి, అమరావతి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో చిరకాలం కొనసాగేలా దీవించాలని ప్రార్ధిస్తున్నాను’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాజికవేత్తలు, హరిత ప్రేమికులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ తమిళిసై, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్దేవ్ కుమార్ తదితరులు ట్విట్టర్ ద్వారా సీఎం కేసీఆర్కు బర్త్డే విషెస్ చెప్పారు. సినీ ప్రముఖులు చిరంజీవి, మహేశ్ బాబుతో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నేడు కోటి వృక్షార్చన -
బర్త్ డే: కేసీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు
అరవై ఏళ్ల కల.. కోట్ల మంది ఆశయం.. ఎంతో ప్రాణత్యాగాల ఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. సుదీర్ఘ కాలం పాటు సాగుతున్న ఉద్యమానికి ఊపిరి పోసి ఎట్టకేలకు మలిదశలో స్వరాష్ట్ర కల సాధ్యమైంది. దానికి మార్గం వేసినది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. రాష్ట్రం కోసం పోరాడి దాన్ని సాధించి అదే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం కేసీఆర్కే చెల్లింది. ఫిబ్రవరి 17వ తేదీ ఆయన జన్మదినం. ఈ సందర్భంగా కేసీఆర్ జీవితంలోని కొన్ని ప్రధాన ఘట్టాలు తెలుసుకోండి. జననం 17 ఫిబ్రవరి, 1954. స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకగా పేర్కొంటారు. కానీ వారి పూర్వీకులది చింతమడక కాదు. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో వారి భూమి కోల్పోవడంతో చింతమడకకు వలస వచ్చారు. అందుకే జలాశయాల కోసం భూ సేకరణ జరిగినప్పుడుల్లా తాము భూ నిర్వాసితులమేనని కేసీఆర్ చాలాసార్లు గుర్తు చేశారు. కేసీఆర్కు ఒక అన్న, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ డిగ్రీ పట్టా పొందారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రవేశం. మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్లో కీలక నేతగా మారారు. పదిహేన్నేళ్ల వయసులో.. 1969, ఏప్రిల్ 23న శోభతో వివాహం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు సాహిత్యం పూర్తి చేశారు. అయితే అదే విశ్వవిద్యాలయ శత వసంతాల వేడుకలను పూర్వ విద్యార్థి అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించడం విశేషం. కేసీఆర్కు దైవభక్తి ఎక్కువ. తరచూ యాగాలు చేస్తుంటారు. అందుకే దేవాలయాల అభివృద్ధికి నడుం బిగించారు. యాదాద్రిని అద్భుత రీతిలో తీర్చిదిద్దుతున్నారు. దాదాపు రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ ఆలయ పునఃనిర్మాణం చేస్తున్నారు. తిరుమల వేంకటేశ్వరుడికి బంగారు ఆభరణాలు, విజయవాడ కనకదుర్గకు ముక్కు పుడక, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు బహూకరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించినట్లు కేసీఆర్ తెలిపారు. కేసీఆర్కు ఎన్టీఆర్, అమితాబ్ సినిమాలంటే చాలా ఇష్టం. పౌరాణిక చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తారు. ఘంటసాల పాటలంటే ప్రాణం, ఆ పాటలు విని మంచిమూడ్లో వాటిని ఎదుటివారికి వినిపించడమంటే ఆయనకు ఇష్టం. పుస్తక ప్రియుడు. సాహిత్య పుస్తకాలు విపరీతంగా చదువుతారు. పుస్తక ప్రియులతో గంటల తరబడి చర్చల్లో గడుపుతారు. ఓల్గా నుంచి గంగ వరకు ఎన్నెన్నో పుస్తకాలను చదివినట్టు ఆయన పలు సందర్భాల్లో తెలిపారు. దూర ప్రయాణాల్లో కారు డ్రైవింగ్ చేయడం ఆయనకో సరదా. నిత్యం అన్ని పత్రికలు చదివాకే పనిలోకి వెళ్తారు. గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాలు ఆసక్తిగా తెలుసుకుంటారు. రాజకీయ తొలి గురువు మదన్ మోహన్. గురువుపైనే పోటీ చేసి కేసీఆర్ గెలిచారు. కూతురు కవిత అంటే కేసీఆర్కు ఎంతో ఇష్టం. కవిత పుట్టాకే రాజకీయాల్లో కలిసొచ్చిందని గట్టి నమ్మకం. అందుకే విదేశాల్లో ఉన్న కవితను పిలిపించారు. ఆమెను నిజామాబాద్ ఎంపీగా పోటీలో నిలిపి గెలిపించేలా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీని చేశారు. 1975లో రాజకీయాల్లో బిజీ అయి కుమారుడు కేటీఆర్ తొట్టెల వేడకకు కేసీఆర్ ఇంటికి కూడా వెళ్లలేదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టినా చిన్నపిల్లలకు ఇచ్చే కిట్కు మాత్రమే కేసీఆర్ తన పేరు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలకు ‘కేసీఆర్ కిట్’ ఇస్తున్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా నవంబర్ 29న నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు పది రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. ‘ఆ పది రోజులు మానేసిన అన్నం బువ్వ ప్రజలకు బోనంకుండలో బెల్లం బువ్వ అయ్యింది’ అని కవులు పాటలు పాడారు. కేసీఆర్కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లంలో మంచి పట్టు ఉంది. అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడి ప్రజలను ఆకట్టుకోవడం కేసీఆర్ స్టైల్. కేసీఆర్ ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్న సమయంలో పాడిన పద్యాలు.. కవితలు.. పాటలు, డైలాగ్స్ ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆసరాతో ఆప్తుడయ్యాడు.. రైతుబంధుతో బంధువయ్యాడు.. రైతుబీమాతో భోజుడయ్యాడు.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో మేనమామయ్యాడు.. కేసీఆర్ కిట్ తో తాతయ్యాడు.. మిషన్ భగీరథ, కాకతీయతో జలాధీశుడయ్యాడు నిరంతర విద్యుత్తుతో వెలుగులు వెదజల్లుతున్నాడు.. కాళేశ్వరంతో జలసిరులు కురిపించాడు.. స్వరాష్ట్రం తెచ్చాడు.. స్వర్ణకాంతులు వెలిగిస్తున్నాడు.. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ యోధుడా అందుకో ఈ శుభాకాంక్షలు (సోషల్ మీడియాలో వచ్చిన కవిత) రాజకీయం జీవితంలో ప్రధాన ఘట్టాలు సిద్ధిపేటలోని రాఘవపూర్ ప్రధాన వ్యవసాయ కో-ఆపరేటిప్ సొసైటీకి చైర్మన్గా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించారు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించడంతో కాంగ్రెస్ను వదిలి వచ్చేశారు. 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1989, 1994, 1999, 2001లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక. తొలిసారిగా 1987-88లో మంత్రి అయ్యారు. 1989-1993 వరకు తెలుగుదేశం పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1999లో ఆంధ్రప్రదేశ్ ఉప శాసన సభాపతిగా ఉన్నారు. 1999లో చంద్రబాబు నాయుడు కేసీఆర్కు మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. ఈ అసంతృప్తి టీఆర్ఎస్ పార్టీ స్థాపనకు దారి తీసింది. చంద్రబాబు తీరుకు నిరసనగా 2001 ఏప్రిల్ 21న డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఏప్రిల్ 27న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2003లో న్యూ స్టేట్స్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. 2004 ఎన్నికల్లో తొలిసారి లోక్సభకు పోటీ చేశారు. కరీంనగర్ నుంచి ఎంపీగా విజయం. యూపీఏ-1 హయాంలో 2004-06 కాలంలో తొలిసారి కేంద్ర మంత్రి. తెలంగాణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ 2006లో యూపీఏ నుంచి బయటకు వచ్చారు. కేంద్ర మంత్రిగా, కరీంనగర్ ఎంపీగా రాజీనామా చేశారు. అనంతరం జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ రెండు లక్షల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. 2009లో మహబూబ్నగర్ నుంచి కేసీఆర్ పోటీ చేసి ఎంపీగా గెలిచారు. పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ బిల్లుపై పార్లమెంట్లో కొట్లాడారు. 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష చేసి పది రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నారు. డిసెంబర్ 9న కేంద్రం ప్రకటనతో దీక్ష విరమించారు. జూన్ 2, 2014న ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ (గజ్వేల్ ఎమ్మెల్యే) బాధ్యతలు చేపట్టారు. 2018 సెప్టెంబర్ 6వ తేదీన అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రెండోసారి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. రెండో దఫా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. -
కెజీఎఫ్ హీరో యశ్ బర్త్డే లుక్స్
-
తల్లి సైకిల్ యాత్ర: ఉపాసన భావోద్వేగం
బంజారాహిల్స్ : అపోలో ఆస్పత్రుల వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని తన 60వ పుట్టినరోజు వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు. ఈ నెల 25న ఉదయం తన భర్త అనిల్ కామినేనితో కలసి చాలెంజ్ టు సైకిల్ టు చెన్నై ఫ్రం హైదరాబాద్ అనే నినాదాన్ని ఎంచుకొని బయల్దేరారు. రోజుకు వంద కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఆరు రోజుల్లో 600 కిలోమీటర్లు వెళ్ళి చెన్నైలో తన తండ్రి ప్రతాప్.సి.రెడ్డిని బుధవారం కలుసుకొని సంతోషం పంచుకున్నారు. సైక్లింగ్తో తన భర్త, కూతురుతో కలసి ఔటింగ్కు వెళ్లిన ఆనందం కలిగించిందని ఆమె తెలియజేశారు. సైకిల్ రైడింగ్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఒక మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదనే నమ్మకానికి పునాది వేసిందని పేర్కొన్నారు. తన తల్లి శోభనా కామినేని తన 60వ పుట్టినరోజున హైదరాబాద్ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్లు సైకిల్ రైడింగ్ చేస్తూ వెళ్లడం తనకెంతో గర్వంగా ఉందని ఆమె కూతురు, సినీహీరో రామ్చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల బుధవారం ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. -
దిల్రాజు 50వ జన్మదిన వేడుక గ్రాండ్ పార్టీ
-
అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్..!
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్షన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అడవి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ రోజు తన బర్త్డే సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధైర్య సాహసాలు ప్రతిబింబించేలా `మేజర్` ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించింది చిత్ర యూనిట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లుక్లో అడివి శేష్ను ప్రదర్శిస్తూ ఈ రోజు ఉదయం 10 గంటలకు `మేజర్` ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదలచేసింది చిత్ర యూనిట్. Happy to present the first look of #Major!! Wishing you a very happy birthday @AdiviSesh. I'm sure Major will go down as one of your best performances. Good luck and happiness always! 😊 pic.twitter.com/q5BLRj8ewn — Mahesh Babu (@urstrulyMahesh) December 17, 2020 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జర్నీని ప్రేక్షకులకుకి అందించడమే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం అని తెలిపారు దర్శకుడు. అతడు వీర మరణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది చిత్ర యూనిట్. 27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వర్ధంతి సందర్భంగా హీరో అడివి శేష్ లుక్ టెస్ట్ పోస్టర్తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి వెల్లడించే వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.(ఆయన కళ్లల్లో ప్యాషన్ కనిపించింది– అడివి శేష్) మేజర్ టీమ్ ఆగష్టులో కోవిడ్ సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటి వరకు 70శాతం షూట్ పూర్తి చేసింది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేయనున్నారు. -
‘అందాల రాక్షసి’ బర్త్డే.. చీర కట్టులో..
సాక్షి, హైదరాబాద్: ‘అందాల రాక్షసి’.. బ్యూటీ లావణ్య త్రిపాఠి నేడు 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. డిసెంబర్ 15 ఆమె బర్త్డే సందర్భంగా హీరో అల్లు శీరిష్తో పాటు ప్రముఖ నటీనటులు ఆమెకు బర్త్డే విషెష్ తెలుపుతున్నారు. అంతేగాక అభిమానుల నుంచి కూడా లావణ్యకు సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ వెల్లువెత్తున్నాయి. కాగా అందాల రాక్షసితో టాలీవుడ్ వెండితెరపై మెరిసిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత స్టార్హీరోయిన్గా ఎదిగారు. Happy birthday Lavanya! Keep making faces and dont become normal. Have a great year ahead. All the best for A1 Express & CKC! @Itslavanya pic.twitter.com/YT1cjGsOdq — Allu Sirish (@AlluSirish) December 15, 2020 హీరో నాని, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘భలే భలే మాగాడివోయ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మన్మధుడు’ నాగార్జున అక్కినేని సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’లో నటించి టాలీవుడ్లో అగ్రనటిగా రాణిస్తున్నారు. ఇక ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా లావణ్య చీర కట్టులో మెరిసిపోతున్న కొన్ని హాట్ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) -
ఒక్కరు కాదు.. వందమంది రజనీలు
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్కు 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. శనివారం పదుల సంఖ్యలో అభిమానులు రజనీ వేషధారణలో పోయస్ గార్డెన్లోని ఆయన ఇంటిముందుకు చేరి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రోబో, భాషా, నరసింహ ఇలా హిట్ సినిమాలలోని రజనీ వేషాలను వారు ధరించారు. కొందరు పోస్టర్లు పట్టుకుని తమదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. సూపర్ స్టార్ రాజకీయరంగ ప్రవేశం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా జరుకుంటున్నారు. కాగా, డిసెంబర్ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నట్లు తలైవర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
హ్యాపీ బర్త్డే బంగారం
తంగమే... నయనతారను విఘ్నేష్ శివన్ అలానే పిలుస్తారు. అంటే బంగారమే అని అర్థం. ‘హ్యాపీ బర్త్డే తంగమే’ అని బుధవారం తన గర్ల్ ఫ్రెండ్కి శుభాకాంక్షలు చెప్పారు విఘ్నేష్. ‘‘నువ్వెప్పుడూ ఇలానే స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఇంతే అంకితభావంతో, క్రమశిక్షణతో, ఇలానే నిజాయతీగా కొనసాగాలి. ఎప్పటికీ ఇలానే ఎదుగుతూ ఉండాలి. ఆ దేవుడు నీకెప్పుడూ ఆనందాన్ని, విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతో పాజిటివిటీతో మరో సంవత్సరం ఆరంభం అయింది’’ అని కూడా విఘ్నేష్ పేర్కొన్నారు. కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్, నయన ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక పుట్టినరోజు సందర్భంగా నయనతార రెండు లుక్స్తో అభిమానులను ఖుషీ చేశారు. ఒకటి తమిళ చిత్రం ‘నెట్రిక్కన్’, ఇంకోటి మలయాళ చిత్రం ‘నిళల్’. ‘నెట్రిక్కన్’ అంటే శివుడి మూడో కన్ను అని అర్థం. ఇందులో నయన అంధురాలిగా నటిస్తున్నారు. నగరంలో వరుస హత్యలకు గురయ్యే యువతుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఓ సీరియల్ కిల్లర్ నయనను అంతం చేయడానికి ప్రయత్నించడం చిత్రం ప్రధానాంశం. ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. ‘నిళల్’ మలయాళ సినిమా. నీడ అని అర్థం. ఇందులో హీరోకి దీటుగా ఉండే పాత్రను నయనతార చేస్తున్నారు. -
ఆమె స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి : రోజా
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ ఆర్కే రోజా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆమె జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక సినీ పరిశ్రమలోనూ సుధీర్ఘ కాలం కొనసాగిన రోజుకు పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు అందాయి. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా 1972 నవంబర్ 17న జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లోనూ విజయం సాధించి వరుసగా రెండోసారి చట్టసభకు ఎన్నికయ్యారు. అగ్ర కథానాయకుల సరసన రాజకీయాల్లోకి రాకముందు రోజా తెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు. తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కే.సెల్వమణిని వివాహం చేసుకున్నారు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా జబర్దస్త్, బతుకు జట్కబండి, రంగస్థలం వంటి షోలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. ఈ సందర్భంగా మంగళవారం సాక్షి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రోజా మాట్లాడారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వైఎస్సార్సీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగాను. తొలినాళ్లలో హీరోయిన్గా రాణించడం చాలా కష్టమని ఎంతో మంది ఎగతాలి చేశారు. అయినప్పటికీ.. ఎంతో కష్టపడి నటన, డాన్స్ నేర్చుకున్నాను. పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించాను. కొత్తలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. విమర్శలను పాజిటివ్గా తీసుకున్నాను. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేయడం ఆనందంగా ఉంది.’ అని సంతోషం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహేశ్ అన్నట్లు ఇవ్వకపోతే లావైపోతాం
ఏదైనా కొత్త ప్రయత్నం మొదలుపెట్టాలంటే ఓ మంచిరోజు చూడాలి. ‘పుట్టినరోజుకి మించిన మంచి రోజు లేదు’ అంటున్నారు మంజుల. దానికి కారణం కూడా చెప్పారు. ఆ విషయంతో పాటు మరెన్నో విశేషాలు పంచుకున్నారు. నేడు తన బర్త్డే సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు మంజుల. ► పుట్టినరోజు విశేషాలు చెబుతారా? ఎవరికైనా పుట్టినరోజు అనేది చాలా చాలా మంచిరోజు. ఆ రోజు స్టార్స్ అన్నీ అందరికీ అలైన్మెంట్ (అమరిక)లో ఉన్నట్లుగా ఉంటాయి. అందుకే ఆ రోజు ఏం చేసినా అది సజావుగా జరుగుతుందని నమ్ముతాను. పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా నేను రెండు నిర్ణయాలు తీసుకున్నాను. ఒకటేంటే.. నా యూ ట్యూబ్ చానల్లో ‘వెయిట్ లాస్’కి సంబంధించిన సిరీస్ చేయాలనుకుంటున్నాను. ఇంకోటి హెల్త్ ప్రొడెక్ట్స్. మనకొచ్చే ఆరోగ్య సమస్యలన్నీ చాలావరకు మనం వాడే నూనెలతోనే వస్తాయి. అందుకే ఆర్గానిక్ ఉత్పత్తులతో కొబ్బరినూనె, శనగనూనె, ఆవనూనె, నెయ్యి.. వంటివన్నీ తయారు చేస్తున్నాం. మా ఉత్పత్తులు 100శాతం యుఎస్డిఏ సర్టిఫికెట్తో మార్కెట్లోకి వస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయాలు మనకు తెలిసినప్పుడు అందరితోనూ పంచుకోవాలి. అవన్నీ మన దగ్గరే పెట్టుకుంటే లావైపోతాం. ‘శ్రీమంతుడు’లో మహేశ్ చెప్పాడుగా. నేను ఒకప్పుడు చాలా బరువు పెరిగాను. మళ్లీ మామూలుగా ఎలా అయ్యానో కూడా యూ ట్యూబ్లో షేర్ చేసుకున్నాను. ► పుట్టినరోజున స్టార్స్ అన్నీ అనుకూలంగా ఉంటాయనే విషయం ఎలా తెలిసింది? భారతీయ జాతక చక్రం లాగానే ‘కబాలా’ అని ఒకటుంది. చైనీస్, ఫిలిప్పీన్స్ వాళ్లు కబాలాను నమ్ముతారంటారు. ‘సన్ పీరియడ్’ అని ఒకటుంటుందని వాళ్లు చెబుతారు. మనం పుట్టినరోజు నుంచి 52 రోజులపాటు ఆ శక్తి ఉంటుందట. ఆ 52 రోజుల సమయంలో మనం ఏం పట్టుకున్నా బంగారం అవుతుందంటారు. అలాగని మనం కష్టపడకుండా కూర్చుంటే కుదరదు. మన కృషికి స్టార్ పవర్ తోడవుతుంది. ► మీ గత పుట్టినరోజులకు ఇది పాటించి, చేసినవి మీకు కలిసొచ్చాయా? నిజానికి ఈ విషయం నాకు ఏడాది క్రితమే తెలిసింది. నా గత బర్త్డేకి వెబ్సైట్, యూట్యూబ్ చానల్, ఆర్గానిక్ ఫుడ్స్.. ఇవన్నీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అవన్నీ ఆచరణలో పెట్టగలిగాను. ► మీ నాన్నగారికోసం ప్రత్యేకమైన డైట్ ఏమైనా చెప్పారా? నాన్నగారే నాకు చాలా విషయాలు చెప్పారు. ఆయన ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటారు. మొన్నీ మధ్య నాకు కొంచెం ఎలర్జీ అయితే ఆయనతో చెప్పాను. ‘అమ్మూ.. పసుపునీళ్లతో ఆవిరి పట్టు’ అన్నారు. రోజూ పదకొండు గంటలకు ఫోన్ చేసి, ‘ఈరోజు ఆవిరి పట్టావా, లేదా’ అని అడిగేవారు. నాన్న చెప్పిన చిట్కా వర్కవుట్ అయింది. ► ఇప్పుడు కృష్ణగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మధ్య కొంచెం డల్గా కనబడ్డారు.. ఆయన చాలా బాగున్నారు. ఒక్కోసారి ఎవరికైనా డల్గా ఉంటుంది. అది సహజం. అయితే ఇదివరకటిలా నాన్న స్పీడ్గా నడవటం లేదు. అది అనారోగ్యం వల్ల కాదు. జాగ్రత్తగా ఉంటున్నారు.. అంతే. మిగతాదంతా మామూలే. రోజూ వాక్ చేస్తారు, యోగా చేస్తారు. నాన్న ఫుల్ ఎనర్జీగా ఉన్నారు. ► విజయనిర్మలగారు చనిపోయాక ఆయన జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఆ బాధ నుంచి బయటపడగలిగారా? నాన్న కచ్చితంగా ఆవిడ్ని మిస్సవుతున్నారు. వాళ్లిద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్. కానీ ఆవిడ పక్కన లేకపోయినా నాన్నగారు ఆ బాధ నుంచి బయటకు రాగలిగారు. బేసిక్గా నాన్న కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ► నిజానికి విజయనిర్మలగారు దూరం అయ్యాక కృష్ణగారు మీలో ఎవరి దగ్గరికన్నా వస్తారేమో అనుకున్నాం? ఎప్పటినుంచో ఉంటున్న ఇంట్లో ఆయనకంటూ ఒక సెటప్ తయారు చేసుకున్నారు. ఆ ఇంట్లో అందరూ ఉన్నారు. మా ఇంటికి, నాన్నగారింటికి దూరం రెండు నిమిషాలే. ఓ రకంగా చెప్పాలంటే మేం కలిసి ఉంటున్నట్లే. అలాగే రోజూ మనవళ్లు, మనవరాళ్లను కలుస్తారు. -
ఆమె అన్ని పాత్రలకి సూ‘టబు’ల్..
సౌత్ నుంచి బాలీవుడ్కు వెళ్లి స్టార్స్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైలో జెండా పాతినవారిలో శ్రీదేవి, జయప్రద మొదటి వరుసలో వస్తారు. కాని అంతే స్టార్డమ్ను, రెస్పెక్ట్ను సృష్టించుకున్న ఇంకో హీరోయిన్ను మన సౌత్ ఖాతాలో ఎవరూ వేయరు. ఆమె టబూ.. అసలు సిసలు తెలుగు అమ్మాయి. అందులోనూ హైదరాబాదీ అమ్మాయి. టబు బాలీవుడ్లో తన టాలెంట్ను చూపారు. ఇటు సౌత్లో అటు నార్త్లో ఒక వర్సటైల్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ తన బర్త్డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు.. అసలు పేరు తబస్సుమ్... టబు అని అందరూ పిలుస్తారు గాని ఆమె అసలు పేరు తబస్సుమ్. పిలిస్తే తబు అని పిలవాలి. కాని టబు అని అలవాటైంది. ఆమె మదర్, ప్రసిద్ధ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ మదర్ దగ్గరి బంధువులు. షబానా ఆజ్మీకి టబూ మేనకోడలి వరుస. టెన్త్ వరకూ హైదరాబాద్లో చదువుకున్న టబు ఇంటర్ నుంచి చదువు కోసం ముంబై వెళ్లింది. షబానా ఆజ్మీ వల్ల సినిమా వాతావరణం ఉండటంతో ముందు టబు అక్క పర్హా ఖాన్ హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత టబు కూడా సినిమా రంగ ప్రవేశం చేసింది. షబానా ఇంట్లో టబును చూసిన ప్రసిద్ధ నటుడు దేవ్ ఆనంద్ ఆమెకు హమ్ నౌజవాన్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కాని కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉండే మన నిర్మాత రామానాయుడు టబును కూలీ నంబర్ ఒన్ సినిమాతో తెలుగులోకి తీసుకు వచ్చారు. ఆ సినిమా సూపర్హిట్. టబు కూడా సూపర్ హిట్. బాలీవుడ్లో కూడా విజయపథమే.. కూలీ నంబర్ ఒన్ తర్వాత టబు రేంజ్ పెరిగిపోయింది. అందరు హీరోలకు అందుబాటులో లేనంత స్థాయికి వెళ్లింది. ఆ టైమ్లోనే హిందీలో అజయ్ దేవ్గణ్తో చేసిన విజయ్పథ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అజయ్ దేవగణ్ ముంబైకు వచ్చినప్పటి నుంచి టబుకు క్లోజ్ ఫ్రెండ్. వాళ్లు ముంబైలో ఇరుగు పొరుగు ఉండేవారు. ఆ పరిచయం వల్లే విజయపథ్లో కలిసి నటించారు. హిట్ కొట్టారు. (చదవండి: మళ్లీ జంటగా...) టబు-నాగ్ల స్నేహానికి నాంది.. ఈ లోపు తెలుగులో మాస్టర్ అఖిల్ హీరోగా సిసింద్రీ మొదలయ్యింది. నాగార్జున సొంత సినిమా కావడం వల్ల ఇందులో స్పెషల్ సాంగ్లో నటించింది టబు. నాగార్జున టబుల సుదీర్ఘ స్నేహానికి ఈ సినిమా మొదటి మెట్టుగా నిలిచింది. పండు అలియాస్ మహాలక్ష్మి.. కాని అసలు సిసలు మాయాజాలం, టబూజాలం తెలియజేసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. హిందీలో కొత్త ఫ్యామిలీ స్టోరీ ట్రెండ్ను తీసుకొచ్చిన హమ్ ఆప్ కే హై కౌన్ స్ఫూర్తితో రాసుకున్న ఈ కథలో మహాలక్ష్మి అలియాస్ పండుగా టబు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నాగార్జునను గ్రీకువీరుడిగా మోహించే అందాలరాశిగా ఆకర్షించారు. (చదవండి: ముచ్చటగా మూడోసారి) ప్రేమదేశంతో సౌత్లో టాప్ కాని అదే సమయంలో దర్శకుడు కదిర్ తమిళంలో తీసిన కాదల్ దేశం టబును మొత్తం సౌత్కు పరిచయం చేసింది. ఆ సినిమా తెలుగులో ప్రేమదేశం పేరుతో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. టబులోని గ్రేస్ ఈ సినిమాలో కుర్రకారు వెర్రెత్తి చూశారు. మేచిస్, అస్తిత్వతో మరో మెట్టు పైకి.. కాని టబు అంటే ఇలాంటి కేరెక్టర్లేనా? ఆమెలో నటిగా టాలెంట్ లేదా? ఉంది అని కనిపెట్టినవాడు దర్శకుడు గుల్జార్. అతడు తీసిన హిందీ సినిమా మేచిస్ టబులోని కొత్త నటిని లోకానికి వెల్లడి చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని మంచి కథలు రాయవచ్చని ఆ సినిమా రుజువు చేసింది. ఉగ్రవాదం నేపథ్యంలో నలిగే ఒక అమ్మాయి పాత్రలో టబు అద్భుత నటన ప్రదర్శించి ఎన్నో అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు సంజయ్ మంజ్రేకర్ తీసిన అస్తిత్వ సినిమా టబును నటనను మరో స్థాయికి తీసుకెళ్లారు. భర్త ఉండగా మరో పురుషుడితో సంబంధంలోకి వెళ్లే గృహిణి పాత్రలో టబు ఈ సినిమాలో నటించారు. స్త్రీల మానసిక ప్రపంచం గురించి భావోద్వేగాల గురించి ఈ సినిమాలో టబు చేసిన స్టేట్మెంట్ ఆ సమయంలో గొప్ప ఫెమినిస్టిక్ స్టేట్మెంట్గా విమర్శకులు వ్యాఖ్యానించారు. ఉత్తమ నటిగా నిలబెట్టిన చాందిని బార్ ఆ తర్వాత ఫైనల్ టచ్గా మధుర్ భండార్కర్ తీసిన చాందిని బార్ టబును జాతీయ ఉత్తమ నటిగా నిలబెట్టింది. ముంబైలో పని చేసే బార్ డాన్సర్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షకుల ఇటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత టబు గొప్ప కథలకు ఒక ముఖ్యమైన ఎంపికగా నిలిచింది. హిందీలో సీరియస్ సినిమాలు చేస్తూనే తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పక్కన సినిమాలలో నటించింది టబు. చిరంజీవితో అందరివాడులో ఆమె చేసిన పాట ఎవరు మర్చిపోతారు. (చదవండి: హార్ట్ బీట్ని ఆపగలరు!) అంధాదున్కి క్రిటిక్స్ కితాబు.. టబు ఇటీవల బాలీవుడ్లో అంధాధున్ సినిమాలో కీలకమైన పాత్ర చేసి బాలీవుడ్ను మరోసారి సర్ప్రైజ్ చేశారు. ఆమె చేయడం వల్లే ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని క్రిటిక్స్ కితాబు. మొన్నటి అల వైకుంఠపురములో టబు తాజా తెలుగు సినిమా. ఇక టబు పర్సనల్ లైఫ్లోకి వస్తే తను సింగిల్ ఉమన్గా ఉన్నారు. ఇంకా వివాహ బంధంలోకి వెళ్లలేదు. ఖాళీ దొరికితే సోలో ట్రావెలర్గా దేశాలు తిరగడం ఆమెకు ఇష్టం. గొప్ప నటిగా గొప్ప సినిమాలు మరెన్ని చేస్తూ తను హ్యాపీగా ఉంటూ మనల్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టుయూ వన్స్ అగైన్ టబు. -
రుద్రన్గా వస్తోన్న లారెన్స్..
ఒక డ్యాన్సర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ కొరియోగ్రాఫర్గా ఎంతో గుర్తింపు తెచ్చుకుని.. దర్శకుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు రాఘవ లారెన్స్. సినిమాలతోనే కాక సమాజ సేవతో కూడా అభిమానులకు సంపాదించుకున్నారు. గురువారం లారెన్స్ పుట్టిన రోజు. సందర్భంగా రుద్రన్ అనే తన కొత్త సినిమా పోస్టర్ని విడుదల చేశారు. ఇది చూస్తుంటే ఈ సారి మరో మ్యాజిక్ ఏదో క్రియేట్ చేయబోతున్నాడని అర్ధమవుతోంది. మూనీ సీక్వెల్స్తో ఇన్నాళ్లు ఊహించని విధంగా బయపెట్టిస్తూనే నవ్వించిన లారెన్స్ నెక్స్ట్ మరో డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్తో రానున్నట్లు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. కేవలం బయపెట్టడమే కాకుండా మంచి సందేశాలను ఇచ్చేలా సినిమాలను తేరకెక్కించే లారెన్స్ ఇప్పుడు కూడా అదే తరహాలో కొత్త కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అంధించనున్నారు. తెలుగులోనే కాకుండా ఈ సినిమాను మిగతా భాషల్లో కూడా భారీగా రిలీజ్ చేయాలని కుదిరితే పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. (చదవండి: హాట్ టాపిక్గా మారిన లారెన్స్ ట్వీట్) Hi friends and fans, Here is my next film title look. Happy to release it on my birthday. I need all your blessings 🙏🏼🙏🏼 @gvprakash @5starcreationss pic.twitter.com/2EmwYmNiUO — Raghava Lawrence (@offl_Lawrence) October 29, 2020 కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా దర్శకుడిగా సక్సెస్ అవుతూనే హీరోగా కూడా కనిపించారు లారెన్స్. ఇక ఇప్పుడు హిందీలో కూడా లక్ష్మీ బాంబ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఆ సినిమా కాంచన సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని కరోనా వైరస్ సహాయక చర్యల కోసం వినియోగించిన సంగతి తెలిసిందే. -
‘రాధేశ్యామ్’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?
డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తోన్న 'బీట్ ఆఫ్ రాధేశ్యామ్'ని మోషన్ పోస్టర్ని రిలీజ్ చేశారు. విజువల్ వండర్గా వచ్చిన ఈ పోస్టర్ అభిమానులను ఎంతో అలరిస్తుంది. 1.16 నిమిషాల నిడివి ఉన్న ఈ పోస్టర్లో ముందుగా అర చేయి కనిపిస్తుంది. దాంట్లో అడవి.. అందులో రైలు. ఒపెన్ చేస్తే ఫస్ట్ రోమియో-జులియేట్, తర్వాత సలీం-అనార్కలీ, తర్వాత దేవదాసు-పార్వతీల బొమ్మలు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజా హెగ్డే రైలు బోగి డోర్ వద్ద నిల్చుని బయటకు చూస్తుంది. తర్వాత డార్లింగ్ ఆమెను చూస్తూ నిల్చుంటాడు. ఇదంతా చూస్తుంటే ఓ ట్రైన్లో వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథగా రాధేశ్యామ్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. అలానే ముందు వచ్చిన అమర ప్రేమికుల బొమ్మలను చూస్తే.. ఈ చిత్రం కూడా గొప్ప అమర ప్రేమ కావ్యంగా ఉంటుందా లేక ఆ కథల్లనే రాధేశ్యామ్ కూడా విషాదంగా ముగుస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ ఈ మోషన్ పోస్టర్ మాత్రం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. (చదవండి: ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్.. ప్రభాస్ లుక్ అదుర్స్) ఇక ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా.. పూజా ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. -
ప్రేమ కోసం షారుఖ్ ఎన్ని కష్టాలు పడ్డాడో!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ గురువారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. గౌరీ, షారుఖ్లది ప్రేమ వివాహం అని అందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న వీరు వారి ప్రేమను దక్కించుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. సినిమా హీరో అయిన షారుఖ్ కూడా నిజ జీవితంలో చాలానే కష్టాలు పడ్డారు. అయితే వారి ప్రేమ కథ ఏమిటో గౌరీ పుట్టిన రోజు సందర్భంగా ఒకసారి తెలుసుకుందాం. జర్నలిస్ట్ అనుపమ చోప్రా రాసిన కింగ్ ఆఫ్ బాలీవుడ్: షారుఖ్ ఖాన్ అండ్ సెడక్టివ్ వరల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే పుస్తకంలో వీరి ప్రేమ పెండ్లి పీటలు ఎక్కడానికి పడిన కష్టాలను వివరించారు. గౌరీని పెళ్లి చేసుకునే సమయానికే కింగ్ ఖాన్ టీవీ సీరియల్లో నటిస్తూ ఉన్నాడు. అయితే ఆయనను గౌరీ వాళ్ల ఇంట్లో ఎవరు అంగీకరించలేదు. గౌరీ తండ్రి, రమేష్ చిబ్బా, తన మతం కంటే షారుఖ్ నటనా వృత్తి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్, భారత మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ వద్ద పనిచేస్తున్నప్పుడు సినీ తారల జీవితాలను దగ్గరుండి చూడటంతో ఆయన ఆ వృత్తిని ద్వేషించారు. ఇక గౌరీ తల్లి సవితా, షారుఖ్ను తెరపై చూడటానికి ఇష్టపడిన గౌరీ తల్లి అల్లుడిగా మాత్రం అంగీకరించలేదు. ఇక గౌరీ వాళ్ల సోదరుడికి రౌడీ అన్న పేరు కూడా ఉండేది. అతను ఏకంగా షారుఖ్ తలపై గన్పెట్టి మరీ బెదిరించాడు. అయినా షారుఖ్ బయటపడకుండా తన ప్రేమను దక్కించుకున్నాడు. షారుఖ్, గౌరీ అక్టోబర్ 25, 1991 న వివాహం చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వారి బంధం బలంగా కొనసాగుతుంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారి పేర్లు ఆర్యన్, సుహానా, అబ్రామ్. చదవండి: 'కెప్టెన్గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు' -
చిరంజీవిగారి నుంచి అవార్డు అందుకోవాలి
‘‘చిరంజీవిగారంటే చిన్నప్పటి నుంచి భక్తి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలోకి వచ్చా. ఇంజనీరింగ్ తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం చేశా. ఆ తర్వాత నాన్నగారికి తెలియకుండానే సత్యానంద్గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆడిష¯Œ ్సలో ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చిత్రంలో హీరోగా ఎంపికయ్యా’’ అని హాస్యటుడు గౌతంరాజు కుమారుడు, హీరో కృష్ణంరాజు అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘తొలి ప్రయత్నం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. నాకు మాస్ అంటే చాలా ఇష్టం. చిరంజీవిగారి నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందేది ఫైట్స్, డ్యా¯Œ ్స. నా తొలి సినిమా ఇంకా ఆయన వద్దకి చేరలేదని బాధపడుతున్నా. ఏదో ఒక రోజు ఆయన చేతుల మీదగా ఒక చిన్న అవార్డు అయినా తీసుకోవాలన్నది నా పెద్ద కల. అందుకోసం ఎంతైనా కష్టపడతా. దర్శకుల్లో సుకుమార్గారు అంటే చాలా ఇష్టం. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, రాజమౌళి, హరీష్ శంకర్గార్ల కూడాæ ఇష్టం. నటుడిగా నిరూపించుకునే పాత్రలు చేయాలనుకుంటున్నాను ’’ అన్నారు. -
పెద్ద బడ్జెట్ సినిమా తీయను
‘‘జీవితంలో ఎప్పుడూ పెద్ద బడ్జెట్ సినిమా తీసే ఆలోచన లేదు. నా తుది శ్వాస వరకు చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తూనే ఉంటాను’’ అని నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అన్నారు. నేడు ఆయన 63వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘2004లో నేను మొదటి సినిమా తీశాను. ఇప్పటికి 98 సినిమాలు పూర్తి చేశాను. 99వ చిత్రం రామ్గోపాల్ వర్మతో ఉంటుంది. నూరవ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఒక శతాధిక దర్శకుడు మాట ఇచ్చారు. 101వ సినిమాగా ‘అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి’ అనే సినిమా స్టార్ట్ చేస్తాను. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుగారి శిష్యుడు ఉదయభాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి జేకే భారవి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ కరోనా ప్రభావం తగ్గాక 102వ చిత్రం ఉంటుంది. దీనికి సాయి ప్రకాష్గారు దర్శకుడు. చిన్న సినిమాలకు ఓటీటీ/ఏటీటీలే మార్గం. పెద్ద సినిమాలు థియేటర్లో చూస్తే ఆ థ్రిల్, ఆ అనుభూతి బాగుంటుంది’’ అన్నారు. -
'వకీల్ సాబ్' మోషన్ పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నడు(బుధవారం) 49వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి' సినిమాతో టాలీవుడ్లో హీరోగా రంగప్రవేశం చేసిన ఆయన ఎందరో అభిమానులకు దేవుడిగా మారే స్థాయికి ఎదిగిపోయారు. అయితే అనూహ్యంగా అన్న చిరంజీవి బాటలోనే ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు విరామం ఇవ్వడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత "వకీల్ సాబ్"తో తిరిగి సందడి చేయనున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా 'వకీల్ సాబ్' చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ పోస్టర్ విడుదలైంది. (ఆ రోజు పవన్ అభిమానులకు డబుల్ ధమాకా) ఇందులో మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తులను మొదట చూపించారు. ఆ తర్వాత పవన్ సూటు వేసుకుని లాయర్ గెటప్లో దర్శనమిచ్చారు. ఒక చేత క్రిమినల్ లా పుస్తకం పట్టుకుని, మరో చేత కర్ర పట్టుకుని ఏ దారిలోనైనా నేరస్థులను వదిలేదే లేదని చెప్పకనే చెప్తున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్లో "సత్యమేవ జయతే" అంటూ వస్తుండటం మోషన్ పోస్టర్కు అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా శ్రీరామ్ వేను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ క్రియేషన్స్పై దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. ఇది బాలీవుడ్ బ్లాక్బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే (నిహారిక నిశ్చితార్థం: పవన్ అందుకే వెళ్లలేదు) -
ఎప్పటికీ ఆనందంగా...
భర్త ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా తమ కుమార్తె ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్నేహ. 2012లో తమిళ నటుడు ప్రసన్న, హీరోయిన్ స్నేహ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో స్నేహ ఓ బాబుకి జన్మనిచ్చారు. బాబు పేరు విహాన్. ఈ ఏడాది జనవరిలో పాపకు జన్మనిచ్చారు స్నేహ. శుక్రవారం ప్రసన్న పుట్టినరోజుని పురస్కరించుకుని పాప ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు స్నేహ. అలాగే ‘‘నా సోల్మేట్ (ప్రసన్నని ఉద్దేశించి)కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా లవర్ బాయ్, నా గార్డియన్ ఏంజిల్ తను. మేం ఆనందంగా ఉండాలని దీవిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా జీవితం ఎప్పటికీ ఇలా ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు స్నేహ. -
మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
చిరు బర్త్డే : మోహన్బాబు ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 22). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’ అని డైలాగ్ కింగ్ మోహన్బాబు ట్వీట్ చేశారు. చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్. @KChiruTweets pic.twitter.com/TQ4CqAkGgc — Mohan Babu M (@themohanbabu) August 22, 2020 మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్కి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పట్ల నాకు ఎల్లప్పుడూ గౌరవం, కృతజ్ఞత ఉంటాయి. ఆయనే నా నిజమైన ఆచార్యుడు' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. Many many happy returns to the biggest INSPIRATION of mine and many, @KChiruTweets garu🤗 #HBDMegastarChiranjeevi pic.twitter.com/6Ex0MzlMjS — Ravi Teja (@RaviTeja_offl) August 22, 2020 Wishing you a very Happy Birthday @KChiruTweets garu! You've been an inspiration to an entire generation and will continue to be! Great health and happiness to you always sir😊🙏 pic.twitter.com/S7XpdFRWoM — Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2020 Many many Happy returns of the day to our one & only MEGA STAR . My heart is always filled with respect , love & gratitude . My true Acharya is many ways . #HBDMegastarChiranjeevi pic.twitter.com/2TD9juEAJg — Allu Arjun (@alluarjun) August 22, 2020 తన 'ఆచార్య' చిరంజీవేనంటూ వరుణ్ తేజ్ కూడా ట్వీట్ చేశాడు. 'హ్యాపీబర్త్ డే చిరంజీవి గారు' అంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే చిరంజీవిగారు. నేటి తరానికి మీరు ఆదర్శం. మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. చిరు నా బెస్ట్ ఫ్రెండ్.. ఆయన ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటాను. హ్యాపీ బర్త్ డే చిరంజీవి' అని సీనియర్ నటి రాధిక పేర్కొన్నారు. ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సినీనటుడు సునీల్ ట్వీట్ చేశాడు. Happy birthday Megastar!🤗🤗🤗 I feel so lucky and blessed to have you by my side.. Thank you so much for inspiring me and a lot more.🙏🏽 Love you to the moon and back!❤️ My Acharya!!!🙌🏽🙌🏽🙌🏽@KChiruTweets #HBDMegastarChiranjeevi pic.twitter.com/zYcH4S2b3m — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) August 22, 2020 'మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అద్భుతమైన నటనా కౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడానికి మీకు ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ కెరీర్లో మరిన్ని గొప్ప మైలురాళ్లు అందుకోవాలని ఆశిస్తున్నాను' అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. బాబాయ్... @KChiruTweets... పుట్టిన రోజు శుభాకాంక్షలు... ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ‘చిరంజీవి’ లా ప్రకాశించాలని, ఆ శ్రీవారి ఆశీస్సులతో ఇంకెన్నో శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. #HBDMegastarChiranjeevi pic.twitter.com/l4V8sDvZjE — Raghavendra Rao K (@Ragavendraraoba) August 21, 2020 Your birthday is been celebrated like a festival and as a fan since many years this day is an event full of joy n happiness .. To our one and only mega star @KChiruTweets Happy birthday to u Cheers #HBDMegastarChiranjeevi pic.twitter.com/MgHKdPht69 — PURIJAGAN (@purijagan) August 22, 2020 -
రాక్షసుడుని హిందీలో రీమేక్ చేయబోతున్నా
‘‘గత ఏడాది నా పుట్టినరోజుకి ‘రాక్షసుడు’ సినిమా హిట్తో ఉన్నా.. ఈ ఏడాది ఏం లేదు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే కచ్చితంగా మరో హిట్తో ఉండేవాణ్ణి’’ అని దర్శకుడు రమేశ్ వర్మ పెన్మెత్స అన్నారు. ‘ఒక ఊరిలో, రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి, రాక్షసుడు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రమేశ్ వర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు. ►ఈ లాక్డౌన్లో ఇంట్లో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాను. అయితే పని అనేది తప్పని సరి కావడంతో 10 రోజులుగా ఆఫీసుకు వెళుతున్నా. మళ్లీ షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్లాన్ చేయాలి కదా. ‘రాక్షసుడు’ సినిమా విడుదల తర్వాత నాకు నాలుగైదు అవకాశాలు వచ్చాయి. కానీ రవితేజగారితో చేయాలనుకోవడంతో ఆగాను. నిర్మాత కోనేరు సత్యనారాయణగారు కూడా తొందరేం లేదు కంఫర్టబుల్గా చేద్దామన్నారు. తమిళ్లో హిట్ అయిన ఓ సినిమా రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ ఆ కథ కంటే ఇప్పుడు చేయబోయే సినిమా కథ రవితేజగారికి చాలా బాగుందని దీంతో ముందుకు వెళుతున్నాం. సెట్స్పైకి వెళ్లేందుకు బౌండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసిపెట్టుకున్నాం. ఇంతలో కరోనా వచ్చేసింది. ప్రస్తుతం చిన్న సినిమాల షూటింగ్లు మొదలయ్యాయి. కానీ పెద్ద చిత్రాలేవీ షూటింగ్స్ ప్రారంభించలేదు. అందరూ మొదలు పెడితే మేం కూడా సిద్ధమే. ►‘రాక్షసుడు’ హిందీ రీమేక్ హక్కులను కోనేరు సత్యనారాయణగారే తీసుకున్నారు. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహించాలన్నారాయన. రీమేక్లో నటించేందుకు చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. కానీ మేం ఎవర్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. రవితేజగారి సినిమా పూర్తయ్యాక బాలీవుడ్లో ‘రాక్షసుడు’ రీమేక్ చేస్తా. ►నిర్మాతగా ‘7’ నా తొలి సినిమా. చిన్న చిత్రంగా తీద్దామనుకున్నాం. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరడంతో పెద్ద సినిమా అయింది.. బడ్జెట్ కూడా పెరిగింది. దీంతో నా స్నేహితులు కూడా ప్రొడక్షన్లో భాగమయ్యారు. ఈ చిత్రం వల్ల నష్టంలేదు.. సేఫ్ ప్రాజెక్ట్.. నెట్ ఫ్లిక్స్లో ఇప్పటికీ ఆదరణ బాగుంది. ఆ సినిమా హిందీలో చేస్తే బాగుంటుందని నెట్ఫ్లిక్స్ వాళ్లు ఓ ప్రతిపాదన కూడా పెట్టారు. భవిష్యత్లో సినిమాలు నిర్మించాలా? వద్దా అన్నది నిర్ణయించుకోలేదు.. అవకాశాల్ని బట్టి వెళతా. -
మంచి రోజులు ముందున్నాయి
స్టార్ హీరోల పుట్టినరోజంటే హంగామా, సందడి అంతా వేరు. సామాజిక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ వేడుకలు సర్వసాధారణం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సామూహికంగా పాల్గొనే కార్యక్రమాలు నిర్వహించడం కరెక్ట్ కాదని వాయిదా వేస్తున్నారు. అయితే అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా చూపిస్తున్నారు. సంబరాలన్నీ ఇంటర్నెట్ సాక్షిగా జరుపుకుంటున్నారు. ఓ స్టార్ హీరో బర్త్డే అంటే ప్రత్యేకంగా డిజైన్ చేసిన సీడీపీ (కామన్ డిస్ప్లే పిక్చర్), మరియు హ్యాష్ట్యాగ్ విడుదల చేసి, ఆ సీడీపీనే తమ అకౌంట్స్ పిక్చర్స్గా మార్చుకుని ఆ ట్యాగ్ను ఉపయోగించి తమ ప్రేమను సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తుంటారు. ఈ ఏడాది చిరంజీవి బర్త్డే కామన్ డీపీను సుమారు వందమంది సెలబ్రీటీలతో విడుదల చేయిస్తున్నారు. వంద మందికి పైగా సెలబ్రీటీలు కామన్ డీపీను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ సీడీపీ విడుదల చేసే వారిలో చిరుతో నటించినవారి దగ్గర నుంచి యంగ్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. ఇది తాత్కాలిక కష్టమే ‘‘సినిమా షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు.. ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. పని లేక, చేతిలో డబ్బు లేక సినీ కార్మికుల పరిస్థితి కష్టంగా ఉంది. అందుకే ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సీసీసీ) తరపున మూడోసారి కూడా కార్మికులకు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని నిర్ణయించుకుని, ఇప్పటికే పంపిణీ మొదలుపెట్టాం’’ అని హీరో చిరంజీవి అన్నారు. సీసీసీ మూడో విడత నిత్యావసర సరుకుల పంపిణీ సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి చిరంజీవి ఓ వీడియో షేర్ చేశారు. ‘‘హైదరాబాద్లోని అన్ని అసోసియేషన్లు , యూనియన్లు, సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో ఉన్న సినీ వర్కర్స్కి ఎప్పటిలాగా ఇస్తాం. అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లోని రెప్రజంటేటివ్లకు, పోస్టర్ అతికించే కార్మికులకు కూడా అందివ్వాలని నిర్ణయించాం. ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదు.. తాత్కాలిక కష్టమే. మంచి రోజులు ముందున్నాయి. పని చేసుకొంటూ సంతోషంగా గడిపే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కి, మామూలు పరిస్థితులు నెలకొనాలని ఆ వినాయకుడికి మొక్కుదాం’’ అన్నారు. ఈ సమావేశంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, దర్శకుడు మెహర్ రమేశ్, నటుడు బెనర్జీ తదితరులు మాట్లాడారు. -
బర్త్డే లుక్
నటుడు కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై పద్మావతి గల్లా ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా సోమవారం నిధీ అగర్వాల్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఈ సినిమా కోసం చేసిన కృష్ణగారి ‘యమలీల’ చిత్రంలోని ‘జుంబారే..’ సాంగ్ రీమిక్స్ వీడియోకు మంచి స్పందన వచ్చింది.. ఇప్పటి వరకూ 60 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపూటి. -
నా విజయం వాయిదా పడిందనుకున్నా!
‘‘నా చిన్నప్పుడు దూరదర్శన్ రోజుల్లో మా ఊర్లో మాకు టీవీ ఉండేది. ఆ టీవీ ముందు మా ఊరు మొత్తం ఉండేది. వీసీఆర్లో సినిమాలు వేసుకొని చూసే వాళ్లం. వీసీఆర్ని నేనే ఆపరేట్ చేసేవాడ్ని. దాంతో అక్కడ నన్ను అందరూ స్పెషల్గా చూసేవారు. అలా సినిమా మీద ఆసక్తి, ఇష్టం, పిచ్చి మొదలైంది’’ అన్నారు దర్శకుడు సుబ్బు. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నేడు సుబ్బు పుట్టినరోజు. ఈ సందర్భంగా సుబ్బు చెప్పిన విశేషాలు.. ► ‘‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఫిలాసఫీని నమ్మే ఓ కుర్రాడి కథే ఈ సినిమా. దానివల్ల అతను ఎదుర్కొన్న సంఘటనలు, సమస్యలు ఈ సినిమాలో ఉంటాయి. సాయి ధరమ్ తేజ్ పాత్ర, స్టోరీ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. స్నేహితులకు, తెలిసినవాళ్లకు ఇలాంటి సందర్భం ఎదురయినట్టు ఉండే సీన్స్ చాలా ఉంటాయి. పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యాము. ఈలోగా లాక్ డౌన్ వచ్చింది. దాంతో మా సినిమా విడుదల వాయిదా పడింది. నా సక్సెస్ కాస్త పోస్ట్ పోన్ అయిందనుకున్నాను. ఈ సినిమాను మరింత మెరుగుపరచుకునే అవకాశం వచ్చిందని భావించి సినిమా మీద ఇంకా వర్క్ చేశా. ► ఈ లాక్డౌన్లో కథలు వర్కవుట్ చేశాను. ఆల్రెడీ 3 కథలకు ఆలోచనలు ఉన్నాయి. ఒకదాన్ని పూర్తి చేశా. ‘బొమ్మరిల్లు’ భాస్కర్, విరించి వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ‘ఊసరవెల్లి, ఒంగోలు గిత్త’ సినిమాలు చేశాను. ఇదే బ్యానర్ లో దర్శకుడిగా నా మొదటి సినిమా చేయడం సంతోషంగా ఉంది. నా రెండో సినిమా ఈ బ్యానర్ లోనే ఉంటుంది. మొదటి సినిమా పట్టాలెక్కాలంటే చాలా కష్టం అంటారు. కానీ అదష్టవశాత్తు నా ప్రయాణం చాలా సాఫీగా జరిగినట్లే. మంచి నిర్మాత, అర్థం చేసుకునే హీరో దొరికారు. ► మాది తుని. పూరి జగన్నాథ్ గారు, గుణశేఖర్ గారు మా పక్కన ఊరే. వాళ్లు సినిమాల్లో సక్సెస్ అయ్యారు మనం కూడా అవొచ్చనే బూస్ట్ వచ్చింది. మనం చెప్పే కథలతో కేవలం వినోదం పంచాం అన్నట్టు కాకుండా మన కథలకు కనెక్ట్ అయి ప్రేక్షకులు ఆలోచించేలా, వాళ్లకు ఓ నమ్మకం కలిగించేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. చిరంజీవిగారితో ఓ సినిమా చేయాలని నా డ్రీమ్. -
ఆ మాట ఆస్కార్తో సమానం
‘‘ప్రతి రచయితకూ ఓ విజన్ ఉంటుంది. ఆ విజన్ని తెరపైకి ఎక్కించడంలో ఓ కిక్ ఉంటుంది. రచయితలు రాసిన కొన్ని కథలు ఒక్కోసారి దర్శకులకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు నిర్మాతలను ఒప్పించి మేమే దర్శకత్వం చేయాలి. మా విజన్ని అప్పుడే తెరపై చూపించగలం.. అందుకే నేను రచయిత నుంచి డైరెక్టర్గా మారాను’’ అన్నారు శ్రీధర్ సీపాన. ‘నమో వెంకటేశ, అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం, డిక్టేటర్’ వంటి పలు చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సీపాన ‘బృందావనమది అందరిది’ చిత్రంతో దర్శకునిగా మారారు. బుధవారం ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ‘బృందావనమది అందరిది’ నా తొలి సినిమా. ఆ చిత్రానికి నా స్నేహితులు శ్రీనివాస్ వంగాల, ప్రభాకర్ నిర్మాతలు. వారికి ఇండస్ట్రీ కొత్త కావడంతో ప్రొడక్షన్ పనులూ నేనే చూసుకున్నాను. దర్శకుడిగా నా రెండో సినిమా చిరంజీవిగారి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఉంటుంది. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్పైకి వెళుతుంది. జీఏ 2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తారు. కల్యాణ్ దేవ్ సినిమా విడుదల తర్వాతే ‘బృందావనమది అందరిది’ చిత్రం విడుదలవుతుంది. కరోనాకి ముందు ‘ఆచార్య’ కోసం కొరటాల శివగారితో కలిసి చిరంజీవిగారితో స్క్రిప్ట్ వర్క్లో పాల్గొన్నాను. అప్పుడు కల్యాణ్ దేవ్తో తీసే కథని చిరంజీవిగారు, కొరటాలగారు విని బాగా ఎంజాయ్ చేశారు. ‘కథ విన్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను’ అని చిరంజీవిగారు చెప్పారు. ఆ మాటతో ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందం దక్కింది. డైరెక్టర్గానే కాదు.. రచయితగానూ కొనసాగుతాను. ప్రస్తుతం డైరెక్టర్ కె.రాఘవేంద్రరావుగారి సినిమాకి, అనిల్ సుంకరగారి ప్రొడక్షన్లో ఓ సినిమాకి డైలాగులు రాస్తున్నాను. మరో రెండు మూడు సినిమాలకు చర్చలు జరిగాయి. ఓ వెబ్ సిరీస్ రెండు మూడు రోజుల్లో ఫైనల్ అవుతుంది’’ అన్నారు. -
బిచ్చగాడు 2
‘బిచ్చగాడు’ సినిమాతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. జాతీయ అవార్డుగ్రహీత ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్గా, మరోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటోని పుట్టినరోజు జూలై 24 (శుక్రవారం). ఈ సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ‘బిచ్చగాడు 2’ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదల చే శారు. -
హ్యాపీ బర్త్డే డియర్ తారక్ : చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యడు జోగినపల్లి సంతోష్ ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్డే అన్నయ్య. మరెన్నో ఏండ్లు ప్రజాసేవలో కొనసాగాలి. మరిన్ని పెద్ద పదవులను చేపట్టాలి. మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలి. మీరొక ఐకాన్. సమకాలీన రాజకీయాల్లో రెండో స్థానానికి నా సోదరుడు తప్ప మరెవరూ సాటిరారని చెప్పడానికి గర్వంగా ఉంది. చిన్నప్పుడు నీతో గడిపిన రోజులు మధురమైన జ్ఞాపకాలు’ అని సంతోష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్తో దిగిన చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాతో పంచుకున్నారు. అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం ‘జన్మదిన శుభాకాంక్షలు డియర్ తారక్. ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తితో ముందుకు సాగాలి’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా కేటీఆర్ ఈరోజుతో 44వ ఏట అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అభిమానుల ట్వీట్లతో సామాజిక మాధ్యమాలు మారుమోగుతున్నాయి. -
మంచి సంగీతం ఇవ్వడమే నా లక్ష్యం
‘‘ఆర్ఎక్స్ 100’ సినిమా పాటలు విన్న నాగార్జునగారు ఫోన్ చేసి నన్ను మెచ్చుకోవడమే కాదు, ఏకంగా తాను నటిస్తున్న ఓ సినిమాకు నన్ను సంగీత దర్శకునిగా తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను’’ అని సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అన్నారు. తక్కువ కాలంలోనే పలు హిట్ సినిమాలకి, స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందించే స్థాయికి చేరుకున్న చైతన్య పుట్టినరోజు బుధవారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సంగీతంపై ఇష్టంతో సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. శ్రేయాస్ మీడియా వారు తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా నా మ్యూజికల్ టాలెంట్ ఇండస్ట్రీకి తెలిసింది. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన డైరెక్టర్ రమేశ్ వర్మ ‘7’ అనే సినిమాకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా వర్క్స్లో ఉండగానే ‘ఆర్ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి నుంచి పిలుపు వచ్చింది. అయితే ‘7’ సినిమా కంటే ‘ఆర్ఎక్స్ 100’ చిత్రమే ముందుగా విడుదలయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నాకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు అందరూ ఛాలెజింగ్ వర్క్స్ ఇచ్చారు. ఎవ్వరూ కూడా ఆ సినిమాలాంటి పాటలు కావాలని అడగలేదు.. దీంతో కొత్త ట్యూ¯Œ ్స చేసే వీలు కుదిరింది. నాకు అవకాశాలు ఇస్తున్న దర్శకులు, నిర్మాతలకు, నా పాటల్ని ఆదిరిస్తున్న శ్రోతలకి ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ శ్రోతలకి మంచి సంగీతం ఇవ్వడమే నా లక్ష్యం’’ అన్నారు. -
బ్యూటీ బ్యాటర్కు బర్త్డే విషెస్
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధనా జన్మదినం (శనివారం) సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. తన అందమైన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న మంధాన నేడు 24వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ పలువురు క్రికెటర్లు ఆమెకు ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మంధనా స్మృతి. ఆటలో ఇలాగే రాణించడం కొనసాగించాలి. భారత జట్టులో ఎడమచేతి వాటం గల బ్యాట్స్మెన్ చాలా ఖ్యాతిని కలిగి ఉంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి’ అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ‘ఎంతో ప్రతిభావంతులైన మంధనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఎక్కువ పరుగులు, ఎక్కువ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. మీకు ఈ ఏడాది చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేసర్ భువనేశ్వర్ కుమార్ ట్విటర్ ద్వారా విషెస్ తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా బ్యాట్ వింత్ టాలెంట్ ప్లేయర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా ఇప్పటివరకు 51 వన్డే మ్యాచ్లు ఆడిన మంధాన 43.1 సగటుతో 4 సెంచరీలు చేసి 2025 పరుగులు సాధించారు. వన్డేల్లో వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పారు. 75 టీ20 మ్యాచ్లు ఆడి 25.2 సగటుతో 1716 పరుగులు రాబట్టారు. అంతేకాకుండా 2018లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్గా పేర్కొంది. 2018లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రధానం చేసింది. ఇదే సమయంలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా కూడా ఎంపికయ్యారు. -
ముఖ్యమంత్రి పాత్రలో...
ప్రముఖ క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు జూలై 10న. ఆయన నటిస్తోన్న నూతన చిత్రం ‘రొరి’లోని లుక్ను ఈ సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. సీటీఎస్ స్టూడియోస్, ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా చరణ్ రొరి నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో కోట అనేకసార్లు ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్ పాత్రల్లో నటించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన నటించలేదు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్. రామన్నచౌదరి పాత్ర చేస్తున్నారు. -
ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవద్దు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ అభిమానులకు ఆనందాన్నిచ్చే వ్యాఖ్యలు చేశాడు. భారత్లో ఐపీఎల్ నిర్వహించడమే తనకు మొట్టమొదటి ప్రాధాన్యతాంశమని అన్నాడు. ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవడం ఏమాత్రం ఇష్టం లేదన్న ‘దాదా’... ఏమాత్రం అవకాశం దొరికినా సరైన భద్రతా చర్యలు తీసుకుంటూ లీగ్ను నిర్వహిస్తామని హామీ ఇచ్చాడు. ఐపీఎల్కు సంబంధించి తాము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు ఐసీసీ టి20 వరల్డ్కప్ భవితవ్యంపై ప్రకటన చేయాల్సి ఉంటుందని అన్నాడు. బుధవారం తన 48వ పుట్టినరోజు జరుపుకున్న ‘దాదా’ ఇంకా ఏమన్నాడంటే... ► మా తొలి ప్రాధాన్యత భారత్లో ఐపీఎల్ నిర్వహించడమే. 35–40 రోజులు దొరికినా చాలు టోర్నీ జరుపుతాం. కానీ వేదిక గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. ► మొదట ఐపీఎల్ విండో దొరుకుతుందో లేదో చూడాలి. ఆ తర్వాత భారత్లో పరిస్థితులు అనకూలించకపోతే ఏ దేశానికి లీగ్ను తరలించాలో ఆలోచించాలి. విదేశాల్లో అయితే ఫ్రాంచైజీలకు, బోర్డులకు వ్యయభారం ఎక్కువవుతుంది. ► పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో తటస్థ వేదిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సెప్టెంబర్లో జరగాల్సిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్ రద్దయింది. ► టి20 ప్రపంచకప్పై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. కానీ ఐసీసీ అధికారికంగా చెప్పేవరకు అసలేం జరుగనుందనే దానిపై ఒక నిర్ణయానికి రాలేం. నా వ్యక్తిగత అంచనా ప్రకారమైతే ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరిగేది అనుమానమే. ► ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నైలలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో అక్కడ లీగ్ జరుగుతుందని చెప్పలేను. అహ్మదాబాద్పై ప్రస్తుతం మా దృష్టి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడే నిర్వహిస్తామని కచ్చితంగా అయితే చెప్పలేను. ► కరోనా విరామం తర్వాత భారత్ ఆడబోయే తొలి అంతర్జాతీయ సిరీస్ ఏదో చెప్పలేను. భారత క్రికెటర్ల ఆరోగ్యమే మా తొలి ప్రాధాన్యత. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది లేదు. -
ప్యాన్ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నా
‘‘గతంలోలా సినిమాలను నిర్మిస్తే ప్రేక్షకులు వాటిని ఆదరించే పరిస్థితిలో లేరు. కథ కొత్తగా ఉంటేనే ఆదరిస్తారు. అందుకే నేను ఇక నుంచి తీసే సినిమాల కంటెంట్ను దృష్టిలో పెట్టుకొని చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించాలనుకుంటున్నాను’’ అని నిర్మాత అడ్డాల చంటి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని విలేకరులతో మాట్లాడుతూ– ‘‘1982లో ప్రముఖ కళా దర్శకుడు భాస్కరరాజుగారి దగ్గర, ఆయన కుమారుడు ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజుగారి దగ్గర అసిస్టెంట్గా జీవితాన్ని ప్రారంభించాను. తక్కువ కాలంలోనే ఆర్ట్ అసిస్టెంట్ నుండి ఆర్ట్ డైరెక్టర్గా మారాను. కళా దర్శకునిగా నాకు జీవితం ఇచ్చింది నిర్మాత రామానాయుడుగారు. ఆర్ట్ డైరెక్టర్గా నా మొదటి చిత్రం ‘ప్రేమ’. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున.. ఇలా దాదాపు అందరి హీరోల సినిమాలకు పనిచేసి, ‘చంటి మనవాడే’ అనే పేరు త్వరగా తెచ్చుకున్నాను. కెమెరామేన్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఫ్రెండ్లీ మూవీస్ అనే సంస్థను ప్రారంభించి బాలకృష్ణతో ‘పవిత్ర ప్రేమ’, ‘కృష్ణబాబు’ నిర్మించాము. ఆ తర్వాత నేను సోలో నిర్మాతగా మారి ఎన్టీఆర్తో ‘అల్లరి రాముడు’’, ప్రభాస్తో ‘అడవి రాముడు’ తరుణ్తో ‘ఒక ఊరిలో’ చిత్రాలను నిర్మించాను. ఈ ఏడాది ప్యాన్ ఇండియా ఫిల్మ్ నిర్మించబోతున్నాను. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనే ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఓటీటీలో చిన్న బడ్జెట్ సినిమాలను, వెబ్సిరీస్లను నిర్మించేందుకు కథలు సిద్ధం చేస్తున్నాను’’ అన్నారు. -
బర్త్డే లుక్
‘ఈ మాయ పేరేమిటో’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో హీరోగా నటించిన రాహుల్ విజయ్ తాజాగా మరో సినిమా అంగీకరించారు. ఎస్కెఎల్ఎస్ గేలాక్సీ మాల్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై బృందా రవీందర్ దర్శకత్వంలో ఇ.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం (జూన్ 7) రాహుల్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని అతని ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: అనంత్ శ్రీరామ్, కెమెరా: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, స్టంట్స్: విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివ ప్రసాద్. -
సుందరమ్మ.. కామ్రేడ్ భారతక్క
ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు కమిట్ కాని ప్రియమణి ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు ఒప్పుకున్నారు. ఒకటి ‘నారప్ప’, మరోటి ‘విరాట పర్వం’. గురువారం ఈ బ్యూటీ బర్త్డే సందర్భంగా రెండు చిత్రాల్లోని ప్రియమణి ఫస్ట్ లుక్స్ను విడుదల చేశారు. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నారప్ప’. తమిళ హిట్ ‘అసురన్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో హీరోయిన్గా సుందరమ్మ అనే పాత్రలో నటిస్తున్నారు ప్రియమణి. డి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీదేవి సతీష్ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘విరాటపర్వం’ విషయానికి వస్తే...రానా, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ ప్రధాన తారాగణంగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. డి. సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కామ్రేడ్ భారతక్క పాత్రలో నటిస్తున్నారు ప్రియమణి. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్కుమార్ చాగంటి. -
సినిమాకి సినిమా కష్టాలు వచ్చాయి
‘‘సాధారణంగా ఎవరికైనా ఊహించని కష్టమొస్తే ‘సినిమా కష్టాలొచ్చాయి’ అంటారు. ప్రసుత్తం కరోనా వల్ల సినిమాకి, సినిమావాళ్లకి నిజంగానే సినిమా కష్టాలు వచ్చాయి’’ అన్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ– ‘‘సినిమాకు కష్టాలు రావడం కొత్తేం కాదు. కేబుల్ టీవీ, సీడీ, డీవీడీ ప్లేయర్స్, సీరియల్స్, గేమ్ షోస్, క్రికెట్, ఐపీఎల్, యూట్యూబ్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్. వీటన్నింటినీ తట్టుకొని సినిమా థియేటర్లో నిలబడుతూనే ఉంది. నిశ్చింతగా, నిశ్చలంగా ఉండటం సినిమాకి చేతకాదు. సముద్రపు అలలాగా పడినా పైకి లేవడం సినిమాకి తెలుసు. కోవిడ్ కాదు దానికంటే ప్రమాదకరమైనది వచ్చినా థియేటర్లో సినిమా చూడాలనే ప్రేక్షకుడి కాంక్షను ఆపలేదు. థియేటర్లో సినిమా చూసే అనుభూతికి మరేదీ సాటిరాదు. కోవిడ్ వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తున్న థియేటర్లు త్వరలోనే జన సమూహాలతో ప్రకాశవంతం చెందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
నాలుగు పాత్రల కథ
బుల్లితెర యాంకర్, ‘బిగ్ బాస్ 3’ ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’. ఈ చిత్రంతో గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితీప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయి¯Œ ్స మోషన్ పిక్చర్స్, కాక్టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు. ఆదివారం (మే 10) శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ ఇ.వి.ఎస్ మాట్లాడుతూ– ‘‘ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ క్యారెక్టర్ సర్ప్రైజ్ ఇస్తుంది. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దిలీప్ కుమార్ ఎంఎస్, సంగీతం: శేఖర్ మోపూరి, సహ నిర్మాత: సిహెచ్ వేణు మాధవ్. -
Taapsee Pannu Birthday : తాప్సీ పన్ను బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
మూడో సినిమా
సందీప్ కిషన్ హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘బీరువా’ వంటి చిత్రాలు అందించిన నిర్మాత పి. కిరణ్ సందీప్తోనే మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. గురువారం సందీప్ కిషన్ పుట్టినరోజుని పురస్కరించుకుని తమ కాంబినేషన్లో రూపొందనున్న మూడో సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించనున్నారు. ఆనంది ఆర్ట్స్ క్రియేష¯Œ ్స పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 15గా రూపొందనున్న ఈ చిత్రానికి భాను బోగవరపు కథ అందిస్తున్నారు. అందమైన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ‘ఏ1 ఎక్స్ప్రెస్’ సినిమా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సినిమా షూటింగ్ ఆరంభమవుతుంది. -
‘నీలో ఏమాత్రం మార్పు లేదు’
హీరోయిన్ త్రిష తనదైన నటనతో దక్షిణాదిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశారు త్రిష. ఇక పలు అగ్రహీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి త్రిష నేడు (మే4) 37 వసతంలోకి ఆడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ట్వీటర్ వేదికగా త్రిషకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. (టిక్టాక్లో త్రిష.. ‘సేవేజ్’ పాటకు స్టెప్పులు) ‘హ్యాపి బర్త్డే డియర్. ఎల్లప్పుడు నువ్వు బలంగా, సానుకూలంగా ఉండాలి’ అని సీనియర్ నటి రాధిక శరత్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్రిష, కీర్తి సురేష్లతో దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. మరో నటి కుష్బూ కూడా త్రిషకు.. బర్త్ డే విషెస్ చెప్పారు. ‘ఇప్పటికీ నీలో ఏ మాత్రం మార్పు లేదు. అదే సంతోషం, మంచి మనసు కలిగి ఉన్నావు. నీకు సంతోషం, ప్రేమ, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది రజినీకాంత్ పేట చిత్రంలో కనిపించారు. అంతకు ముందు తమిళ చిత్రం ‘96’లో జానకి దేవి పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. Happy birthday dear @trishtrashers be strong and positive as always . Love to you hope to catch up with you soon ❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/IAnaNwPGce — Radikaa Sarathkumar (@realradikaa) May 4, 2020 Hey Pretty woman. The best part about you is you haven’t changed a bit.. you are still the same old chirpy, happy, a beautiful soul. May you be showered with love, happiness, health n wealth in abundance.. Happy birthday dear @trishtrashers ❤️❤️❤️🎂🎂🎂🎂💖💖💖💖🤗 pic.twitter.com/RResLCP0Vt — KhushbuSundar ❤️ (@khushsundar) May 3, 2020 -
కటారి క్రాక్
‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘క్రాక్’. ఇందులో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరస్వతీ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహనిర్మాత. లాక్డౌన్ తర్వాత జరిపే చివరి షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. ఆదివారం (ఏప్రిల్ 26) సముద్రఖని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఇందులో కటారి పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో సముద్రఖని ఓ కీలక పాత్ర చేస్తున్నారు. -
బిగ్ స్క్రీన్ అనుభూతే వేరు
‘‘ప్రస్తుతం అందరూ ఓటీటీ వేదికల్లో సినిమాలు చూస్తున్నారు. కానీ ఈ ప్రభావం థియేటర్స్ మీద ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్కి ప్రత్యామ్నాయం థియేటరే. బిగ్ స్క్రీన్ అనుభూతే వేరు’’ అన్నారు నిర్మాత బెక్కం వేణు గోపాల్. ‘టాటా బిర్లా మధ్యలో లైలా, ప్రేమ ఇష్క్ కాదల్, హుషారు’ వంటి సినిమాలు నిర్మించారాయన. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోవాలని కోరుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. కరోనా ప్రభావం అన్ని ఇండస్ట్రీలపై ఉంది. దీన్ని అందరూ బాధ్యతగా భావించి పోరాడాలి. ఓటీటీ ప్రభావం థియేటర్స్ మీద ఉండదు. ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో సినిమాలకు రారు అన్నారు. కానీ అలా ఏం జరగలేదు. ప్రస్తుతం విశ్వక్ సేన్తో ‘పాగల్’ అనే సినిమా చేస్తున్నాను. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెడతాం. ఆ తర్వాత శ్రీ విష్ణుతో కూడా ఓ సినిమా ప్లాన్ చేశాం. ‘రోటీ– కపడా– రొమాన్స్’ అనే మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ‘దిల్’ రాజుగారితో కొన్ని సినిమాలు కలసి చేయబోతున్నాను’’ అని తెలిపారు. -
చంద్రబాబుకు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి : ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 70వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. Best wishes to @ncbn garu on his birthday. May he be blessed with happiness and good health. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2020 -
డ్రైవర్ పుష్పరాజ్
పుష్పరాజ్గా మారిపోయారు అల్లు అర్జున్. ఎందుకంటే తన కొత్త చిత్రం కోసం. ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ముత్తం శెట్టి మీడియా సహ–నిర్మాత. బుధవారం (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘పుష్ప’ టైటిల్ను, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పూర్తిగా చిత్తూరు యాస మాట్లాడే పుష్పరాజ్ పాత్రలో కనిపిస్తారు అల్లు అర్జున్. పుష్పరాజ్ లారీ డ్రైవర్ అట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కేవీవీ, సీఈఓ: చెర్రీ. -
కేజ్రీవాల్కు డబుల్ ధమాకా
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు డబుల్ ధమాకాలా ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పుట్టినరోజు కూడా మంగళవారం రావడం కలిసివచ్చింది. భార్య బర్త్డే వేడుకలతో పాటు ఢిల్లీ ప్రజలు తన సర్కార్కు మరోసారి పట్టం కట్టడంతో కేజ్రీ ఉత్సాహం రెట్టింపైంది. తన భర్త కోసం విస్తృతంగా ప్రచారం చేసిన సునీతా కేజ్రీవాల్ (54)కు ట్విటర్లో నెటిజన్ల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వకముందు ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన విషయం తెలిసిందే. హ్యాపీబర్త్డే సునీతా మేడమ్..మా హీరోకు మీరే బలం..మిమ్మల్ని చూసి గర్విస్తున్నామని ఓ ట్విటర్ యూజర్ పేర్కొనగా, ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వచ్చిన రోజే పుట్టినరోజు జరుపుకోవడం సంతోషకరమని, కేజ్రీవాల్ వెనుకున్న శక్తి మీరేనంటూ మరో ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఓటింగ్ రోజున పోలింగ్ బూత్ వెలుపల కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన సునీత తమ కుమారుడు తొలిసారిగా ఎన్నికల్లో ఓటు వేస్తున్నాడని పేర్కొన్నారు. తన భర్త కేజ్రీవాల్పై బీజేపీ విమర్శలను దీటుగా తిప్పికొడుతూ ఆప్ శ్రేణులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. చదవండి : ఆప్ సంబరాలు.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం -
అమాయకత్వం ఏమాత్రం తగ్గలేదు: బిగ్బీ
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ నేడు 44వ వడిలోకి అడుగుపెట్టాడు. తల్లిదండ్రులు బిగ్బీ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, భార్య ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్యల సమక్షంలో అభిషేక్ తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ఇక అభిషేక్కు ఇష్టమైన వాటి నమూనాతో ప్రత్యేక కేక్ను తయారు చేయించింది అందాల సుందరి ఐశ్వర్య. ‘హ్యాపీ బర్త్డే బేబీ.. ప్రేమతో’ అంటూ నవ్వులు చిందిస్తున్న ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అతని సోదరి శ్వేతా బచ్చన్ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ వాళ్లిద్దరూ కలిసి చిన్నప్పుడు సైకిల్తో ఆడుకున్న ఫొటోలను పంచుకుంటూ బర్త్డే గ్రీటింగ్స్ తెలిపింది. ఇది అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. (అమితాబ్కు బిగ్ ఫ్యాన్ని) ఇక అమితాబ్ బచ్చన్ పుట్టినరోజును పురస్కరించుకుని భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘ఆరోజు ఫిబ్రవరి 5. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆ రోజంతా వాడి రాకకోసం ఎంతో ఆదుర్దాగా ఎదురు చూశాను. ఎట్టకేలకు వాడు జన్మించాడు. అభిషేక్ ఈ లోకంలోకి అడుగుపెట్టడంతో అందరం ఆనందంలో తేలియాడుతూ సంబరాలు జరుపుకున్నాం’ అని ఎమోషనల్ అయ్యాడు. పిల్లలు ఎంత ఎదిగినా కన్నవాళ్ల కంటికి ఇంకా చిన్నపిల్లల్లాగే కనబడుతారనేది అమితాబ్ విషయంలో మరోసారి నిరూపితమైంది. ‘నేటితో అతనికి 44 సంవత్సరాలు. కానీ నా కంటికి ఇంకా చిన్నపిల్లోడే. చిన్ననాటి అమాయకత్వం అభిషేక్కు ఇప్పటికీ పోలేదు. బహుశా పోదేమో కూడా’ అని రాసుకొచ్చాడు. చదవండి: ముద్దు మురిపాలు