Bomb threat
-
తిరుపతిలో కలకలం.. కలెక్టరేట్కు బాంబు బెదిరింపు మెయిల్
సాక్షి, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. దీంతో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇవాళ(శుక్రవారం) సాయంత్రం పోలీసులకు మెయిల్ రాగా, తిరుపతి కలెక్టరేట్ను బాంబ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్లో అన్ని విభాగాల సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు.. తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో బాంబు లేదని తేల్చడంతో కార్యాలయంమ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.కాగా, తిరుపతికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా కార్పొరేట్ హోటళ్లతో పాటు పలు ఆలయాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. గత నెల(ఫిబ్రవరి)లో ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాలలో హ్యూమన్ ఐఈడీ బాంబు పెట్టామంటూ ఆగంతుకుల నుంచి కళాశాల అధికారులకు ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు, అధ్యాపకులు ఉలిక్కిపడ్డారు.వెంటనే కళాశాల అధికారులు తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. గతంలో పలు మార్లు కళాశాలకు బాంబు బెదురింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై ఫేక్ సమాచారంగా తేల్చారు. -
PM Modi : మోదీ విమానానికి బాంబు బెదిరింపు
-
ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు
సాక్షి, తిరుపతి: ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హ్యూమన్ ఐఈడీ బాంబ్ పేరుతో పేల్చేస్తామంటూ గురువారం ఉదయం కళాశాలకు ఆగంతకుడు మెయిల్ చేశాడు. కళాశాల అధికారులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అగ్రికల్చర్ కళాశాలకు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. కేరళ రాష్ట్రం నుంచి మెయిల్ వచ్చినట్టు కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.గత రెండు నెలల క్రితం కూడా తమిళనాడు రాష్ట్రం నుంచి మెయిల్ వచ్చింది. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గతంలో కూడా పలు హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
-
పిల్లలూ.. స్కూల్లో బాంబులు పెట్టారంట పారిపోండి
ఢిల్లీ : ముంబైలో (mumbai) బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ముంబైకి చెందిన పలు స్కూళ్లలో బాంబులు (bomb threat) పెట్టామంటూ అగంతకులు బెదిరింపులు ఈ-మెయిల్స్ పంపారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్వ్కాడ్స్ స్కూల్స్లో తనిఖీలు నిర్వహించాయి. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని బాంబు స్వ్కాడ్ నిర్ధారించాయి.గురువారం ముంబైలోని జోగేశ్వరి-ఓషివారా ప్రాంతానికి చెందిన ది ర్యాన్ గ్లోబల్ స్కూల్లో 2001లో భారత పార్లమెంట్పై ఉగ్రదాడికి పాల్పడ్డ అప్జల్ గురు అనుచరులు బాంబు పెట్టినట్లు అగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్లో పేర్కొన్నారు.మరోవైపు, బుధవారంతమిళనాడులో ఏరోడ్ జిల్లాలో సుమారు ఏడు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న రెండు స్కూల్స్కు బాంబు బెదిరింపులొచ్చాయి. ఏరోడ్ జిల్లాకు చెందిన భారతి విద్యాభవన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్స్లో బాంబులు పెట్టామంటూ దుండగులు ఈ-మెయిల్స్ పంపారు.దీంతో అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థుల్ని అలెర్ట్ చేసింది. వెంటనే స్కూల్ వదిలి పారిపోవాలంటూ సూచించారు. అనంతరం, స్కూల్ తనిఖీలు నిర్వహించింది. పోలీసులకు సమాచారం అందించింది.యాజమాన్యం ఫిర్యాదుతో స్కూల్స్కు పోలీసులు,బాంబు స్వ్కాడ్, స్నైపర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. స్కూల్స్లో అణువణువూ తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో బాంబులు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఢిల్లీలో 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు.. పోలీసులకు చిక్కిన విద్యార్థి
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులకు సంబంధించి క్లాస్ 12 విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో పరీక్ష జరగకూడదనే కారణంగానే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. బాంబు బెదిరింపులకు సంబంధించి సదరు విద్యార్థే ఆరు సార్లు మెయిల్స్ పంపినట్టు గుర్తించారు.ఇటీవలి కాలంలో ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో బెదిరింపు మెయిల్స్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థినే పలుమార్లు బెదిరింపులకు కారణమని గుర్తించారు. దీంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పాఠశాలలో పరీక్ష జరగకూడదనే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. ఈ విద్యార్థే ఆరుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. సదరు బాలుడు ఎంతో ప్లాన్ ప్రకారం ఇలా చేసినట్టు తెలుస్తోంది. ప్రతిసారీ అతడు.. తన సొంత పాఠశాలలను కాకుండా వేరే పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ పంపించాడు. అనుమానం రాకుండా ఉండటానికి ఇలా చేసినట్టు అధికారులు వెల్లడించారు. అతను ఒకసారి 23 పాఠశాలలకు మెయిల్ పంపాడని అధికారులు తెలిపారు.మరోవైపు.. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం సైతం వేడెక్కింది. శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి అతిషి.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను విమర్శించడంతో బాంబు బెదిరింపులు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ క్రమంలో ఆప్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. -
బాంబు బెదిరింపుల శాఖ ఒక్కటి ఏర్పాటు చేయాలి సార్!
-
ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
-
స్కూల్స్కు బాంబు బెదిరింపులు.. రంగంలోకి పోలీసులు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు వార్త తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలో పలు స్కూల్స్కు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు, బాంబ్ తనిఖీ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఆర్కేపురంలో రెండు పాఠశాలలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. డీపీఎస్ ఆర్కేపురం, జీడీ గోయింకా పబ్లిక్ స్కూల్స్కు సోమవారం ఉదయం ఏడు గంటలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు, బాంబ్ తనిఖీ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. సదరు పాఠశాల వద్ద తనిఖీలు జరుగుతున్నాయి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో పాఠశాలకు వస్తున్న విద్యార్థులను వెనక్కి పంపించారు స్కూల్స్ యాజమాన్యం, సిబ్బంది. దీంతో, విద్యార్థులు, పేరెంట్స్లో భయాందోళన నెలకొంది. #WATCH | A team of Delhi police arrives at RK Puram's DPS - one of the two schools that received bomb threats, via e-mail, this morning pic.twitter.com/c23ciJTLGi— ANI (@ANI) December 9, 2024#BREAKING- Two Delhi schools receive bomb threats via email.- DPS RK Puram and GD Goenka Public School, Paschim Vihar, received threat emails.- Both schools shut down following the bomb threats.@priyanktripathi shares the latest updates. pic.twitter.com/U9XFK8pe09— TIMES NOW (@TimesNow) December 9, 2024 -
ట్రంప్ కేబినెట్ నామినీలకు బాంబు బెదిరింపులు
వాషింగ్టన్: కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గ సభ్యులుగా నామినేట్ చేస్తున్న పలువురు నేతలు, ప్రముఖులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రక్షణ, గృహనిర్మాణం, వ్యవసాయం, కారి్మక శాఖల మంత్రులతోపాటు పలువురు విభాగాలకు అధిపతులుగా ట్రంప్ ఎంపిక చేసిన తొమ్మిది మందికీ ఈ బెదిరింపులు వచ్చాయి. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఎంపికైన రిపబ్లికన్ నాయకురాలు ఎలీస్ స్టెఫానిక్ సైతం బెదిరింపులను ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. బాంబుతో పేల్చేస్తామని తమ ఇంటికి బెదిరింపు ఫోన్కాల్ వచ్చిందని ఎలీస్ చెప్పారు. థ్యాంక్స్ గివింగ్ కోసం వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్కు భర్త, కుమారుడితో కలిసి కారులో వెళ్తుండగా ఆమెకు ఈ బెదిరింపు సందేశం అందింది. రక్షణ మంత్రిగా నామినేట్ అయిన పీట్ హెగ్సెత్కు సైతం బెదిరింపు సందేశం వచ్చింది. పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ అడ్మిని్రస్టేటర్గా ట్రంప్ నామినేట్ చేసిన లీ జెల్డిన్, వ్యవసాయ మంత్రిగా నామినేట్ అయిన బ్రూక్ రోలిన్స్కూ బుధవారం ఉదయం బెదిరింపు కాల్స్ వచ్చాయి. గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఎంపికైన స్కాట్ టర్నర్, కారి్మక మంత్రిగా ఎంపికైన లోరీ చావెజ్ డెర్మర్కు బెదిరింపులు వచ్చాయి. ఇటీవల అమెరికా అటార్నీ జనరల్ పదవి నామినేషన్ నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న ఫ్లోరిడా రిపబ్లికన్ నాయకుడు మాట్ గేట్జ్ను, వాణిజ్య మంత్రి నామినేట్ అయిన హోవార్డ్ లుట్నిక్ను ఆగంతకులు లక్ష్యంగా చేసుకున్నారు. గేట్జ్ స్థానంలో ఎంపికైన పామ్ బోండీతో పాటు శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూజీ వైల్స్, సీఐఏ డైరెక్టర్గా నామినేట్ అయిన జాన్ రాట్క్లిఫ్కు బెదిరింపులు వచ్చాయి. అధికార రిపబ్లికన్ పార్టీ నేతలతోపాటు విపక్ష డెమొక్రాట్లకూ బాంబు బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం.ఈ ఘటనలను అధ్యక్షుడు బైడెన్కు వివరించినట్లు వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ బృందంతో ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ సంప్రదింపులు జరుపుతోందని, అమెరికా పార్లమెంట్ భద్రతాబలగాలతో కలిసి పరిస్థితిపై సమీక్ష జరుపుతున్నామని శ్వేతసౌధం వెల్లడించింది. ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి -
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
-
శంషాబాద్ ఎయిర్పోర్టులో ‘బాంబు’ అలజడి
హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ హల్ చల్ చేశాడు. దీంతో.. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో.. విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తేల్చారు.మరోవైపు.. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో పైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నాగ్పూర్ విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమై.. అది ఉత్తదేనని తేల్చారు. ఈ క్రమంలో ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు.. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై విమాన ప్రయాణ నిషేధం విధించే దిశగా పౌర విమానయానశాఖ ఆలోచన చేస్తోంది. అయితే అందుకు తగ్గట్లు నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు.ఇదీ చదవండి: మా జీతాల్లో కోతలు వద్దు సార్! -
విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ రూరల్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఆదివారం పలు విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గోవా నుండి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు.ఇందులో 180 మంది ప్రయాణికులు ఉన్నా రు. మరో గంటకు బెంగళూరు–హైదరాబాద్ ఇండిగో విమానానికి, మళ్లీ గంట తర్వాత హైదరాబాద్–పుణే ఇండిగో విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో పాటు ఎయిర్ఇండియా విమానానికి ఇదే తరహా కాల్ వచి్చనట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
బాంబు బెదిరింపుల వేళ.. విమానంలో పేలుడు పదార్థాలు
ఢిల్లీ: దేశంలో వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఓ విమానంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. దుబాయ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో క్యాట్రిడ్జ్(పేలుడు పదార్థం) దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది.వివరాల ప్రకారం.. అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది. ప్రయాణీకులందరూ విమానం దిగిన తర్వాత విమానంలోని ఓ సీటులో క్యాట్రిడ్జ్ను సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా సంస్థలకు చెందిన అధికారులు మాట్లాడుతూ.. ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI916 సీటు జేబులో క్యాట్రిడ్జ్(పేలుడు పదార్థం) దొరికింది. అయితే, అప్పటికే ప్రయాణికులంతా సురక్షితంగా దిగారు. భద్రతా ప్రొటోకాల్ను పాటిస్తూ ఈ విషయంపై ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలుసులు కూడా వెల్లడించారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో విమానాలు, స్కూల్స్, హోటల్స్కు బాంబు బెదిరింపు కాల్స్ పెరిగిన విషయం తెలిసిందే. పలువురు ఆకతాయిలు.. ఫేర్ బెదిరింపు కాల్స్ చేయడంతో ఈ ఘటనపై అధికారులు, పోలీసులు కూడా దృష్టిసారించారు. ఇక, గడిచిన 20 రోజుల్లో మొత్తం 600కుపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రాగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. ఈ బెదిరింపులన్నీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇలాంటి బెదిరింపులపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది."One ammunition cartridge was found in the pocket of a seat of our flight AI916 after it had landed from Dubai at Delhi on 27 October 2024 and all passengers had safely disembarked. A complaint was immediately lodged with the Airport Police by Air India strictly adhering to the… pic.twitter.com/INwG7Kf9K5— ANI (@ANI) November 2, 2024 -
Vizag: రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు
భారత్కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు అటు విమానయాన అధికారుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లో దాదాపు 200కుపైగా విమానాలకు బెదిరింపులు అందాయి. వీటిపై విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదు.సాక్షి, విశాఖపట్నం: తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న విమానంతోపాటు చెన్నై నుంచి విశాఖపట్నం వస్తున్న విమానానికి మంగళవారం బెదిరింపులు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో వెంటనే భద్రత సిబ్బంది రెండు విమానాల్లోనూ బాంబు స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు.కాగా సోమవారం కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా ముంబయికి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విమానాశ్రయానికి ఆగంతకుడు ఫోన్ చేసి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందని బెదిరించడంతో.. అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఆకాశంలో ఉన్న విమానాన్ని పైలెట్లు వెంటనే వెనక్కి మళ్లించి విశాఖలో ల్యాండ్ చేశారు. 120 మంది ప్రయాణికులను కిందకు దించేయడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. బాంబు స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్టు అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, బాంబు లేదని గుర్తించారు. అనంతరం నాలుగు గంటలు ఆలస్యంగా విమానం ముంబయికి బయలుదేరింది. -
బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియాపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీయ విమానాలతోపాటు అంతర్జాతీయ విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లోనే 250కి పైగా భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్లకు వరుసగా బెదిరింపులు రావడంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది.ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ శనివారం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను ధిక్కరించినట్లయితే థర్డ్ పార్టీ కంటెంట్ను ఆయా ప్లాట్ఫామ్లు తీసుకునే వెసులుబాటును నిలిపివేస్తామని స్పష్టం చేసింది.నకిలీ బెదిరింపుల వల్ల విమాన సర్వీసులు ఆలస్యం అవ్వడం నిలిచిపోవడం జరుగుతున్నాయని తెలిపింది. ఆకతాయిలు పెట్టే ఫేక్ బెదిరింపు మెసేజ్లను ఎప్పటికప్పుడు గుర్తించి, తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఫేక్ బెదిరింపు మెసేజ్లను ఎప్పటికప్పుడు తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా కంపెనీలను బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. -
తిరుపతిలో హోటల్సు కు బాంబు బెదిరింపు..
-
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి చండీగఢ్కు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం అంగతకులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. అగంతకుల ఫోన్ కాల్తో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. 130 ప్రయాణికులతో చండీగఢ్కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని దించి సోదాలు నిర్వహించారు.గతకొన్ని రోజులగా విమానాలకు బాంబుల బెదిరింపుల బెదడ ఎక్కువైంది. ఈ బాంబు బెదిరింపులపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందించారు. 9 రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. వాటిపై కేంద్రం దృష్టి సారించింది. విమానంలో బాంబ్ పెట్టామంటూ ఫేక్ కాల్ చేసిన బాలుడిని ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికీ వస్తున్న బాంబు బెదిరింపులపైఫేక్ కాల్స్ లేదంటే ఉగ్రకోణం ఉందా? అనే దిశగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. -
విస్తారా విమానానికి మరో బాంబు బెదిరింపు
సాక్షి, ఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కలకలం రేపుతున్నాయి. తాజాగా విస్తారా విమానానికి మరో బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విమానానికి బెదిరింపు మెయిల్ రావడంతో జైపూర్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.కాగా, గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి.దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది.ఇండిగోకు చెందిన హైదరాబాద్– గోవా, కోల్కతా–హైదరాబాద్, కోల్కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్–బగ్దోరా, కోచి– హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది. -
Tirupati: అమ్మో.. బాంబ్
తిరుపతి అర్బన్: నగరంలోని స్టార్ హోటళ్లకు గుర్తుతెలియని వ్యక్తు లు గురువారం రాత్రి బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధానంగా లీలామహల్ సర్కిల్, కపిలతీర్థం, అలిపిరి సమీపంలోని నాలుగు గుర్తింపు పొందిన హోటళ్లకు మెయిల్స్ ద్వారా బెదిరింపులకు దిగారు. నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చర్చసాగుతోంది. లేదంటే చంపుతామని, మీ హోటళ్లలో పలుచోట్ల బాంబులు పె ట్టామని హెచ్చరించినట్లు సమాచారం. వెంటనే హోటళ్ల యాజ మాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు హోటల్స్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బూచీ సమాచారంతో తిరుపతి నగర వాసులు ఉలిక్కి పడ్డారు. గురువారం రాత్రి ఆ హోటల్స్తోపాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కానీ ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు.విమానాశ్రయానికి..ఏర్పేడు: బాంబు బెదిరింపు ఈ మెయిల్పై తిరుపతి విమానాశ్రయ స్టార్ ఎయిర్లైన్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ షబీర్ గురువారం ఫిర్యాదు చేసినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. బెంగళూరులోని స్టార్ ఎయిర్ హెడ్ ఆఫీస్తో అనుబంధించిన తిరుపతి ఎయిర్ ఫోర్ట్ అధికారిక స్టార్ ఎయిర్ ట్విట్టర్ ఖాతాకు గుర్తుతెలియని వ్యక్తి గురువారం బాంబు బెదిరింపు సందేశాన్ని పంపినట్లు చెప్పారు. విమానాలను ఎస్5–154(టీఐఆర్–ఐఎక్స్జీ) ప్రధాన అ««ధి కారుల అనుమతి పొందిన అనంతరం మధ్యాహ్నం 1.21 గంటలకు బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. -
బాంబు బెదిరింపులు: సోషల్మీడియా సంస్థలపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులు అందరినిషాక్ గురిచేస్తున్నాయి. దాదాపు 10 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు హెచ్చరికలు వచ్చాయి. వీటిపై విమానయానశాఖ విచారణ చేపడుతున్ప్పటికీ, ఎయిర్లైన్స్ యాజమాన్యం తనిఖీలు చేస్తున్నా బెదిరింపులు మాత్రం ఆగం లేదు.అయితే బెదిరింపులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుండటంతో తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ.. సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ఎక్స్’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిత్వశాఖ సంయుక్త కార్యద్శి సంకేత్ ఎస్ భోంద్వే.. విమానయానసంస్థ అధికారులు, ఎక్స్, మెటా వంటిఇ సోషల్ మీడియా ప్రతినిధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్ వంటి మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నియంత్రించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.కాగా గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 120కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న కూడా ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియాకు చెందిన 30 విమానాలకు ఇలాంటి బెదిరింపులు అందాయి. అయితే అధికారులు అప్రమత్తమై భద్రతా ప్రోటోకాల్లను అనుసరించారు. ఈ పరిస్థితిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రయాణీకుల భద్రతపై రాజీ పడకుండా ప్రభుత్వం దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి బూటకపు బెదిరింపులను ప్రసారం చేసే వారిపై నో ఫ్లై లిస్ట్తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత విమానయాన భద్రతా నిబంధనల సవరణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.ఇవి బూటకపు బెదిరింపులే అయినప్పటికీ వాటిని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. బెదిరింపుల దాడి వెనుక కుట్ర దాగి ఉంటుందా అని ప్రశ్నించగా.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి చెప్పారు.ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని, దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని కోరారు. -
నగరంలో సీఆర్పీఎఫ్ స్కూల్కు బాంబు బెదిరింపు
జవహర్నగర్: ఢిల్లీలోని ఓ సీఆర్పీఎఫ్ పాఠశాల ప్రహరీ వద్ద మూడు రోజుల కిందట బాంబు పేలుడు సంభవించిన ఘటనను మరువక ముందే హైదరాబాద్ శివారులోని జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలకు వచ్చిన బాంబు బెదిరింపు సందేశం మంగళవారం కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి సీఆర్పీఎఫ్ పాఠశాలకు ఈ–మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశం పంపారు. జవహర్నగర్ సీఆర్పీఎఫ్ పాఠశాలతోపాటు ఢిల్లీలోని రోహిణి, ద్వారకాలోగల సీఆర్పీఎఫ్ పాఠశాలలో బాంబులు అమర్చినట్లు అందులో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పాఠశాల ప్రారంభమయ్యాక యాజమాన్యం ఈ–మెయిల్ను చూసి అప్రమత్తమైంది. వెంటనే విద్యార్థులను బస్సుల్లో ఇళ్లకు తరలించడంతోపాటు పోలీసులకు సమాచారం అందించింది.దీంతో సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ పోలీసులతోపాటు రాచకొండ సీపీ సుధీర్బాబు, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, కుషాయిగూడ ఏసీపీ మహేశ్, జవహర్నగర్ సీఐ సైదయ్య పాఠశాలకు చేరుకొని పరిసర ప్రాంతాలను, పాఠశాల భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జాగిలాలతో, బాంబు స్క్వాడ్తో అనువనవూ గాలించి బాంబు లేదని నిర్ధారించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం సతీమణి పేరున కొందరు దుండగులు ఫేక్ ఐడీ సృష్టించి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. -
మరో 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు
భారత్కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు అటు విమానయాన అధికారుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 100కుపైగా విమానాలకు బెదిరింపులు అందాయి. వీటిపై విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదు.తాజాగా మంగళవారం మరో 10 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్గాల్లో ఈ బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ బెదిరింపులు జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు వెళ్లే విమానాలను లక్ష్యంగా చేసుకుని వచ్చినట్లు తెలిపారు. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రతా ప్రోటోకాల్లను అనుసరించింది, ప్రయాణీకులందరినీ సురక్షితంగా దింపి,తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే విమానం, అహ్మదాబాద్ నుంచి జెద్దాకు వెళ్లే విమానం, లక్నో నుంచి పుణె, హైదరాబాద్ నుంచి జెడ్డా, ఇస్తాంబుల్ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి డమ్మాం, బెంగళూరు నుంచి జెడ్డా, ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ, కోజికోడ్ నుంచి జెడ్డా, ఢిల్లీ నుంచి జెడ్డా వెళ్లే విమానాలకు ఈ బెదిరింపులు అందినట్లు అధికారులు తెలిపారు. తమ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ... వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యతకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా వచ్చినట్లు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడపై పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత.. ఒకేసారి దేశవ్యాప్తంగా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోమవారం రాత్రి పాఠశాల అడ్మినిస్ట్రేషన్కు ఈ-మెయిల్స్ను దుండగులు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నారు. ఢిల్లీ తోపాటు హైదరాబాద్లోని అన్ని సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఇమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపుల సందేశాలు రావటంతో అన్ని స్కూళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్స్గా భద్రత అధికారులు భావిస్తున్నారు.ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఎక్కువగా అంతర్జాతీయ మార్గాల్లో నడిచే 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్లైన్ ధృవీకరించింది. దేశీయ సర్వీసులే కాకుండా జెడ్డా, ఇస్తాంబుల్, రియాధ్ లాంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నామని విమానయాన సంస్థ తెలిపింది. గత వారం నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్న పలు భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. టార్గెట్ చేసిన ఎయిర్లైన్స్లో ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా మరియు అకాసా ఎయిర్ ఉన్నాయి.చదవండి: ‘లారెన్స్ బిష్ణోయ్ను ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’ -
వట్టి బెదిరింపులేనా?
ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్లైన్స్కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ. ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్వర్క్ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి. నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్ప్రెస్లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది. ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం. మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు. సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్లైన్లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి. -
వారంలో 100కుపైగా బెదిరింపులు.. ‘నో-ఫ్లై లిస్ట్లో చేరుస్తాం’
విమానాల్లో బాంబు ఉందంటు తప్పుడు సమాచారం అందించి పట్టుబడిన వారిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్)గా పరిగణిస్తుందన్నారు. గత వారం రోజులుగా పలు విమానాల్లో దాదాపు 100కుపైగా బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది.ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ..‘బాంబు బెదిరింపు చర్యల వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్క్రాఫ్ట్ రాకపోకలు తాత్కాలికంగా కొన్నిచోట్ల నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చాలా ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయ భద్రతా సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ పరిణామాలకు కారణమవుతున్న వారిపట్ల ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. వీరిని ‘నో ఫ్లైలిస్ట్’(ఎలాంటి కమర్షియల్ విమానాల్లో ప్రయాణించకుండా నిరోధించడం)లో చేరుస్తాం. ఈ నేరాన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్-క్రిమినల్ కేసు)గా పరిగణిస్తాం’ అని చెప్పారు.సమాచారం అందిన వెంటనే ఏం చేస్తారంటే..బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలోని బాంబు బెదిరింపు అంచనా కమిటీ (బీటీఏసీ) అత్యవసర సమావేశం అవుతుంది. బీటీఏసీలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), సంబంధిత విమానయాన సంస్థ, విమానాశ్రయ నిర్వాహకులు సభ్యులుగా ఉంటారు. విమానంలో బాంబు ఉందని అందిన సమాచారం మేరకు ఈ కమిటీ ముప్పును ‘నిర్దిష్ట’, ‘నాన్-స్పెసిఫిక్(అస్పష్టమైన)’ అనే రెండు విధాలుగా వర్గీకరిస్తుంది. నిర్దిష్ట ముప్పులో ఫ్లైట్ నంబర్, తేదీ, బయలుదేరే సమయం, ఎయిర్పోర్ట్కు రావాల్సిన సమయం..వంటి నిర్దిష్ట సమాచారంతో బెదిరింపులు వస్తాయి. దాంతో కమిటీ వెంటనే సదరు పైలట్లను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించమని కోరతారు. తదుపరి చర్యల కోసం గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటారు. ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!నాన్-స్పెసిఫిక్ థ్రెట్ విషయంలో ఎయిర్లైన్, ఫ్లైట్ నంబర్, తేదీ, షెడ్యూల్ సమయం స్పష్టంగా తెలియజేయరు. టేకాఫ్ అయిన కాసేపటికే బెదిరింపు వస్తే తిరిగి విమానం బయలుదేరిన ఎయిర్పోర్ట్కు రమ్మని పైలట్కు చెబుతారు. లేదా అప్పటికే చాలా దూరం ప్రయాణం చేస్తే దగ్గర్లోని ఎయిర్పోర్ట్లో జనావాసం ఎక్కువగా లేని బే(విమానాలు నిలిసే ప్రదేశం)కు రప్పిస్తారు. వెంటనే ప్యాసింజర్లను వేరేచోటుకు మారుస్తారు. బ్యాగేజీ, కార్గో, క్యాటరింగ్ మెటీరియల్ స్కాన్ చేస్తూ షిఫ్ట్ చేస్తారు. బాంబు స్వ్కాడ్, స్కానర్ల సాయంతో విమానాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకుంటే విమానాన్ని తిరిగి ఆపరేట్ చేస్తారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులుంటే మాత్రం భద్రతా సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతారు. -
24 గంటల్లో.. 11 విమానాలకు బాంబు బెదిరింపులు
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసపెట్టి బెదిరింపులు రావడం ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని రేకెత్తిస్తోంది. విమానాల టేకాఫ్కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఢిల్లీ నుంచి లండన్కు వెళ్లే విస్తారా విమానానికి బాంబు బెదిరింపుతో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కు మళ్లించారు. జైపూర్-దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే అది నకిలీ అని తేలింది. వీటితోపాటు మరో ఐదు ఆకాశా ఎయిర్ విమానాలు, ఐదు ఇండిగో విమానాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి.దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసేందుకు ఆలస్యం అయింది. ఈరోజు ఉదయం 6:10 గంటలకు టేకాఫ్ షెడ్యూల్ చేయగా.. 7:45కి దుబాయ్కి బయలుదేరింది. మరోవైపు ఫ్రాంక్ఫర్ట్కు మళ్లించిన విస్తారా విమానం ఆ తర్వాత లండన్కు బయలుదేరింది.కాగా గత సోమవారం నుంచి దాదాపు 50 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. నకిలీ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేదుకు సిద్ధమైంది. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బూటకపు కాలర్లను ఐదేళ్లపాటు నో-ఫ్లై లిస్ట్లో ఉంచడం వంటి అనేక చర్యలు తీసుకుంటామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజేసీఏ) తెలిపింది. అయితే నకిలీ బాంబు బెదిరింపుల వల్ల తమకు జరిగిన నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. -
విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు
ఢిల్లీ: విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. లండన్-ఢిల్లీ విస్తారా విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రత్తమైన అధికారలు ఆ విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్ఫర్టకు పైలట్లు దారి మళ్లించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని విస్తారా ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. STORY | Vistara's Delhi-London flight diverted to Frankfurt after bomb threatREAD : https://t.co/d6PLa4w0GV pic.twitter.com/R1BzJcO2rW— Press Trust of India (@PTI_News) October 19, 2024విమానం మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశాక.. ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తేలిపారు. అనంతరం విమానం లండన్కు బయలుదేరింది. ఇటీవల కాలంలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. కేవలం ఒక వారంలో 15 విమానాలకు ఇలాంటి బెదిరింపులు గమనార్హం. విమానాల టేకాఫ్కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లించారు. -
మరో అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు
-
మరో 2 విమానాలకు బాంబు బెదిరింపులు.. 3 రోజుల్లో 12 ఘటనలు
దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. గత మూడు రోజుల్లో అనేక విమానాలకు బాంబు బెదరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినన విషయం తెలిసిందే. మొత్తం గత 72 గంటల్లో 12 విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.తాజాగా బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.ఆకాశా ఎయిర్లైన్ సంస్థకు చెందిన QP 1335 విమానం 184 మంది ప్రయాణికులు, సిబ్బందితో బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.అదే విధంగా ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 6E 651 విమానం దాదాపు 200 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై నుంచి బయల్దేరగా.. సోషల్ మీడియా ద్వారా బెదిరింపు అలర్ట్ వచ్చింది. దీంతో పైలట్ విమానాన్ని అహ్మదాబాద్కు మళ్లించారు. అక్కడ విమానం సేఫ్గా ల్యాండ్ అయినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టగా బెదిరింపు కాల్స్ బూటకమని తేలింది.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది. -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్గా యుద్ధ విమానాలు
భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది.దేశవ్యాప్తంగా మంగళవారం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యింది. తాజాగా తాజాగా మధురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.విమానం సింగపూర్కు బయలుదేరిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు ఈ-మెయిల్ వచ్చింది.ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 684కి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్ భద్రతా దళాలకు చెందిన రెండు ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి. ఎయిరిండియా విమానానికి ఎస్కార్ట్గా వ్యవహరించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లాయి.కాగా, ఈ బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పౌర విమానయాన భద్రతా సంస్థ భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల సాయం కోరింది. బాధ్యులను కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎయిరిండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్జీ ఎంగ్ హెన్ స్పందించారు. ఎయిరిండియా విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి రెండు ఆర్ఎస్ఏఎఫ్ ఎఫ్-15ఎస్జీలు రంగంలోకి దిగాయని తెలిపారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లాయని, చివరకు విమానం చాంగీ విమానాశ్రయంలో రాత్రి (మంగళవారం) 10:04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.కాగా దేశవ్యాప్తంగా మంగళవారం 7 విమానాలకు బాంబు బెదిరింపు ఎదురయ్యింది. ఢిల్లీ నుంచి షికాగో వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కెనడాలోని ఓ విమానాశ్రయానికి మళ్లించి తనిఖీ చేశారు. అలాగే జైపూర్ నుంచి అయోధ్య మీదుగా బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం, దర్భంగా నుంచి ముంబయి వెళ్లే స్పైస్జెట్ విమానం, బాగ్డోగ్రా నుంచి బెంగళూరు వెళ్లే ఆకాశ ఎయిర్ విమానం, దమ్మం(సౌదీ అరేబియా) నుంచి లక్నవూ వెళ్లే ఇండిగో విమానం, అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ అలయన్స్ ఎయిర్ విమానం, మదురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. -
ఎయిర్ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏఐ-127 విమానానికి ముప్పు ఉందని మంగళవారం(అక్టోబర్ 15) బెదిరింపు మెయిల్ అందింది.దీంతో అప్రమత్తమైన ఎయిర్ ఇండియా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని కెనడాలోని ఇకాల్యూట్ ఎయిర్పోర్టుకు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. ఇకాల్యూట్ ఎయిర్పోర్టులో ప్రోాటోకాల్ ప్రకారం విమానంలోని ప్రయాణికులను,సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాత విమానం తిరిగి బయలుదేరేందుకు అనుమతిస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో తమ విమానాలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
-
ఎయిరిండియా విమానంలో బాంబు?
ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని బెదిరింపు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్కు వెళ్లే ఎయిరిండియా ఇండియా విమానాన్ని వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్కు మళ్లించారు. అప్పటికే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ పోలీసులు అవసరమైన భద్రతా చర్యలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు సమాచారం అందింది. అప్పటికే విమానం టేకాఫ్ అవ్వడంతో పైలట్కు సమాచారం అందించి వెంటనే విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఐజీఐ)కు మళ్లించాం. అప్పటికే ఎయిర్పోర్ట్లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేశాం. విమానం ఎయిర్పోర్ట్ చేరిన వెంటనే ప్యాసింజర్లను సురక్షితంగా వేరేచోటుకు చేరవేశాం. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విమానం న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ బాంబు బెదిరింపు సమాచారం ఎవరు పంపారు..ఎక్కడి నుంచి తమకు సమాచారం వచ్చిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఇటీవల తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో టేకాఫ్ అయిన విమానం వీల్స్ లోపలికి ముడుచుకోలేదు. హైడ్రాలిక్స్ సమస్య కారణంగా ఇలా జరిగినట్లు తెలిసింది. వెంటనే పైలట్ గ్రౌండ్ సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు రెండు గంటలు గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా తిరుచ్చి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసి చర్యలు చేపట్టారు. -
సికింద్రాబాద్-నాగ్పూర్ వందేభారత్కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్పూర్ వందేభారత్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. వందేభారత్లో బాంబు ఉందని ఓ ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు. అయితే రైలులో బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని సమాచారంచ్చినక్తిని లింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్గా గుర్తించారు, దీంతో అతడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.కాగా సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ప్రారంభించగా.. సెప్టెంబర్ 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ కొత్త రైలు ఏర్పాటు చేశారు.అయితే ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి 80 శాతం ఖాళీతో నడుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. దాదాపు 1200 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ ట్రైన్ బోగీల సంఖ్యను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 బోగీలతో నడుస్తుండగా.. 10 బోగీలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. -
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అగంతకుడు.. సీఐఎస్ఎఫ్ అధికార వెబ్సైట్కు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు లేఖ పంపించాడు. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా, ఎయిర్పోర్టు అథారిటీ గోప్యంగా ఉంచింది.ఎయిర్పోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఏర్పేడు పోలీసులు బృందాలుగా దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: పోలీసులే షాకయ్యేలా.. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు -
బెంగళూరులో మూడు కాలేజీలకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.బెంగళూరులోని మూడు ప్రముఖ కాలేజీలకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావటంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. బీఎంఎస్ కాలేజీ, ఎంఎస్ రామయ్య కాలేజీ, బీఐటీ కాలేజీలకు బాంబు బెదిరింపులు రావటంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.Bengaluru Bomb Threat: Major Colleges, Including BIT, BMSCE and MSRIT Receive Bomb Threats; Probe Launchedhttps://t.co/BjoVZwox4e#Bengaluru #BIT #BombThreat— LatestLY (@latestly) October 4, 2024క్రెడిట్స్: LatestLYసమాచారం అందిన వెంటనే ఆయా కాలేజీల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ , ఇతర సంబంధిత బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. అవి నిజమైన బెదిరింపులా లేదా ఉత్తుత్తి బెదిరింపులా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు సంబంధించి.. హనుమంతనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
-
ఢిల్లీలోని మూడు మాల్స్, ఓ ఆసుపత్రికి బాంబు బెదిరింపు
దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. పాఠశాలలు, షాపింగ్ మాల్స్, ప్రార్థన స్థలాలు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, ప్రముఖుల ఇళ్లే టార్గెట్గా వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా దక్షిణ ఢిల్లీలోని మూడు మాల్స్కు, ఓ ఆసుపత్రికి సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.చాణక్యపురిలోని చాణక్య మాల్, సాకేత్ ప్రాంతంలోని సెలెక్ట్ సిటీవాక్, వసంత్ కుంజ్లోని ఆంబియెన్స్ మాల్ సహా చాణక్యపురిలోని ప్రైమస్ ఆసుపత్రికి ఈ మెయిల్ ద్వారా బాబు బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని గంటల్లో బాంబు పేలుతుందంటూ దుండగులు మెయిల్లో పేర్కొన్నట్లు చెప్పారు.సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఆయా మాల్స్, ఆసుపత్రి వద్దకు చేరుకొని సోదాలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. చివరకు ఆ బెదిరింపు బూటకమని తేలిందికాగా ఈ నెల 17న గురుగ్రామ్లోని ఆంబియెన్స్ మాల్కు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు మాల్ మేనేజ్మెంట్కు మెయిల్ ద్వారా బెదిరించారు. ‘ప్రతి ఒక్కరినీ చంపేందుకు మాల్లో బాంబులు అమర్చాం. మీలో ఎవ్వరూ తప్పించుకోలేరు, అందరూ చస్తారు’ అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన మాల్ అధికారులు వెంటనే పోలీసులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని మాల్ను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. అప్పుడు కూడా ఎలాంటి బాంబూ దొరకలేదని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ఇక -
గురుగ్రామ్లోని మాల్కు బాంబు బెదిరింపు..
హర్యానాలోని గురుగ్రామ్ నగరంలో ప్రముఖ షాపింగ్ మాల్కు బాంబ్ బెదిరింపు అందింది. గురుగ్రామ్లోని ఆంబియెన్స్ మాల్కు శనివారం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన మాల్ అధికారులు.. బిల్డింగ్ నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ మాల్ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు.అయితే మాల్ మేనేజ్మెంట్కు వచ్చిన మెయిల్లో.. బిల్డింగ్లో బాంబులు అమర్చినట్లు, మాల్లోని ఏ ఒక్కరూ తప్పించుకోలేరని గుర్తు తెలియని వ్యక్తి పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు గుర్తించలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయి.మరోవైపు నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం మాల్ను ఖాళీ చేసి తనిఖీ చేశారు. మాల్ భద్రతను తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించినట్లు నోయిడా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ తెలిపారు. ఈ డ్రిల్లో ఫైర్ సర్వీసెస్, డాగ్ స్క్వాడ్ మరియు పోలీసు బృందాలు పాల్గొన్నాయని చెప్పారు. -
ఢిల్లీలోని పాఠశాలకు మరోసారి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా సౌత్ ఢిల్లీలోని ఓ పాఠశాలకు బెదిరింపులు అందడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ కైలాష్లోని ప్రైవేటు పాఠశాలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబు అమర్చినట్లు గురువారం అర్థరాత్రి ఈ మెయిల్ రాగా.. పాఠశాల అధికారులు 10 నిమిషాల్లోనే విద్యార్థులను ఖాళీ చేయించారు.బాంబు డిటెక్షన్ టీమ్, డాగ్ స్క్వాడ్కు సమాచారం ఇచ్చారు. వారు పాఠశాల మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేయగా.. ఎలాంటి అనుమానాస్పదంగా ఏమీ కనుగొనలేదని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అయితే ఈ బెదిరింపు బూటకమని అధికారులు ధృవీకరించారు. కాగా ఇటీవలే రాజధాని నగరంలోని పలు పాఠశాలలకు (వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. -
లండన్ వెళ్లే ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..
తిరువనంతపురం: లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానానికి మంగళవారం బాంబు బెదిరింపులు అందాయి. కేరళలోని కొచ్చిన్ విమానశ్రాయం నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన AI 149 విమానం లండన్ గాట్విక్ వెళ్లేందుకు రన్వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఈ విమానంలో బాంబు పెట్టినట్లు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని వెంటనే కొచ్చి అంతర్జాతీయ విమనాశ్రయంలోని ఎఎయిరిండియా సిబ్బందికి చేరవేశారు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఎయిర్లైన్ సెక్యూరిటీ అధికారులు విమానంలో విస్త్రృతంగా తనిఖీలు చేపట్టారు. ఇన్లైన్ బ్యాగేజీ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా భద్రతా తనిఖీలు జరిపారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.అన్ని తనిఖీలు అనంతరం విమానం లండన్ వెళ్లేందుకు అనుమతించినట్లు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. అదే విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమైన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 29 ఏళ్ల సుహైబ్గా తేల్చారు.కొచ్చిన్ ఎయిర్పోర్ట్లోని చెక్-ఇన్ సమయంలో సుహైబ్, అతని భార్య, కుమార్తెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతన్ని పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. బేగంపేట ఎయిర్పోర్టుకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సదరు మెయిల్లో విమానాశ్రయంలో బాంబు ఉందని హెచ్చరించారు. దీంతో, అలర్ట్ అయిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎయిర్పోర్ట్ సహా పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బాంబు లేదని గుర్తించారు. అనంతరం, సదరు మెయిల్ ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయలకు కూడా ఇలాగే బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం తెలిసిన విషయమే. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో బాంబు లేదని తెలిసి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఇలాంటి కాల్స్, మెయిల్స్ పెడితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
ప్యారిస్–ముంబై విమానానికి బాంబు బెదిరింపు
ముంబై: పారిస్ నుంచి 306 మందితో ముంబై బయల్దేరిన విస్తారా విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. ‘బాంబు పెట్టాం’ అని రాసిన నోట్ ఎయిర్ సిక్నెస్ బ్యాగ్లో కనిపించింది. దాంతో ముంబైలో లాండవగానే అందరినీ హుటాహుటిన దించేసి తనిఖీలు చేపట్టారు. బాంబు సహా అనుమానాస్పద వస్తువులేవీ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
ముంబై: దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నగరాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, జైళ్లు, ప్రముఖులు నివాసాలు,. విమానాశ్రయాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా విమానంలో కూడా బాంబు బెదిరింపులు అందాయి.ఇండిగో విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నై నుంచి 172 మంది ప్రయాణికులతో ముంబై వెళుతున్న 6E 5314 ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు రావడంతో.. అప్రమత్తమైన అధికారులు ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బే కు తరలించి విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. ‘ప్రయాణికులందరిని సురక్షితంగా విమానం నుంచి ఖాళీ చేయించాం. ప్రస్తుతం విమానం తనిఖీలో ఉంది. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్ ప్రాంతంలో తిరిగి ఉంచుతాం’ అని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.కాగా వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇదే రెండోసారి. మే 28న ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో బాత్రూమ్లో ఓ టిష్యూ పేపర్పై ‘బాంబు’ అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేసి.. ఎయిర్పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్ సిబ్బంది.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. నకిలీ బెదిరింపులని గుర్తించారు. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
-
ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు
ఢిల్లీ, సాక్షి: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో విమాన సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దించేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మంగళవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం టాయిలెట్ మీద బాంబ్ అని రాసి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో.. విమానం గాల్లోకి ఎగరకముందే అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. విమానాన్ని ప్రత్యేక ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా దించేశారు. ఆపై సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. వేకువ జామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ ఘటనపై కాసేపట్లో అధికారులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. The IndiGo crew before taking off found a note with the word "bomb" written on it in the aircraft's lavatory, says aviation security official who was on the spot.— ANI (@ANI) May 28, 2024 Passengers of #IndiGo flight from #Delhi to #Varanasi were evacuated via emergency exit following a #bombthreat, earlier today.The aircraft has been moved to isolation bay and further investigations are being carried out. More details are awaited.#imxplorer #travel #indigo pic.twitter.com/QYRVgGKpIR— IMxplorer-Travel The World (@IMTravelService) May 28, 2024 -
బెంగుళూరులోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపు
ముంబై: ప్రముఖ నగరాల్లో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్లు, ఎయిర్పోర్టులు, హాస్పిటల్స్, ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల ఢిల్లీలోని, హస్పిటల్స్, తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ అందిన విషయం తెలిసిందే.తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని మూడు ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. హోటల్ ఒట్టేరాతో సహా మరో రెండింటికి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు బెంగళూరు ఆగ్నేయ డీసీపీ పేర్కొన్నారు. నేడు ఆ హోటళ్లు పేల్చివేస్తామని దీనిలో హెచ్చరించినట్లు చెప్పారు.బెదిరింపు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలను మోహరించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని, తనిఖీలు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా బుధవారమే దేశ రాజధాని ఢిల్లీలోని నార్త్ బ్లాక్కు బెదిరింపు మెయిల్ వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఇందులోనే ఉంది. అయితే అక్కడ ఎటువంటి అనుమానిత వస్తువులు గుర్తించలేకపోవడంతో బెదిరింపు బూటకమని తేలింది. ఇక గతంలోనూ బెంగళూరులోని 40కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం విదితమే. -
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్లు, ఎయిర్పోర్టులు, హాస్పిటల్స్ ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఢిల్లీలోని తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ అందింది.దీంతో జైలు అధికారులు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. జైలులోని ప్రముఖ రాజకీయ నాయకులతోపాటు కొందరు ఉన్నతస్థాయి ఖైదీలు ఉన్న సెల్లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ టీమ్, పోలీసులు సోదాలు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించలేదు. కాగా ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలు, ఆసుపత్రులు, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐఏ) విమానాశ్రయానికి కూడా ఇలాంటి హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే -
అహ్మదాబాద్లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో సోమవారం పలు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు కలకాలం రేపాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు యాత్రాంగం, బాంబ్ స్క్వాడ్స్ బెదిరింపులు వచ్చిన అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాయి. అయితే ఎటువంటి బాంబులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. సియా గురుకుల పాఠశాల, థాల్తేజ్లోని ఆనంద్ నికేతన్, డీసీఎస్ బోపాల్, మెమ్నగర్లోని హెచ్బీకే పాఠశాల, థాల్తేజ్లోని జెబార్ పాఠశాల, ఎస్జీ రోడ్డులోని కాస్మోస్ క్యాజిల్ ఇంటర్నేషనల్ స్కూల్, చంద్ఖేడా, షాహిబాగ్ కంటోన్మెంట్లోని రెండు కేంద్రీయ విద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యం విద్యార్థులను ఖాళీ చేయించాయి.ఈ ఘటనపై అహ్మదాబాద్ పోలీసు కమినిషనర్ జీఎస్ మాలిక్ మాట్లాడుతూ.. రష్యన్ సర్వర్ నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అరబిక్లో భాషా పదాలలో బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపు మెయిల్స్పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గుజరాత్లో ఎన్నికల పోలింగ్కు ఒకరోజు ముందు బాంబు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పరిధిలోని దాదాపు 200 స్కూళ్లకు బాంబు బెదిరింపు మియిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
సీఎం సిద్ధరామయ్య, మంత్రులకు బాంబు బెదిరింపులు
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రముఖులను టార్గెట్ చేసుకొని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాంబు బెదిరింపులు నిజమో, అబద్దమో తేల్చేందుకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు తలలు పట్టుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోసహా పలువురు మంత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం Shahidkhan10786@protonmail.com. అనే ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్ అందుకున్న వారిలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వరతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు 2.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 20 కోట్లు) ఇవ్వకపోతే కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున్న పేలుళ్లు జరుపుతామని హెచ్చరించారు. దీనిపై బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లతో పాటు పోలీసు సిబ్బంది తనిఖీ చేపట్టారు. ‘సినిమా ట్రైలర్పై మీ అభిప్రాయం ఏమిటి? మీరు మాకు 2.5 మిలియన్ డాలర్లు అందించకపోతే, కర్ణాటక అంతటా బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పేలుళ్లు జరుపుతాము. "మేము మీకు మరో ట్రైలర్ చూపించాలనుకుంటున్నాము. అంబారీ ఉత్సవ్ బస్సులో బాంబును పేల్చబోతున్నాం. అంబారీ ఉత్సవ్ బస్సు పేలుడు తర్వాత, మా డిమాండ్లను సోషల్ మీడియాలో లేవనెత్తుతాము. మీకు పంపిన మెయిల్ స్క్రీన్షాట్లను అప్లోడ్ చేస్తాం. మా నెక్ట్స్ పేలుడు గురించి త్వరలోనే ట్వీట్ చేస్తాం.’ అని మెయిల్లో పేర్కొన్నారు. -
జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
జైపూర్: రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ధృవీకరించారు. ఎయిర్పోర్టు అధికారిక మెయిల్కు బెదిరింపు రావడంతో అప్రమత్తమైనట్లు చెప్పారు. బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే ఎయిర్పోర్టు మొత్తం సీఐఎస్ఎఫ్ బలగాలు బాంబు, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టాయని, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై సైబర్సెల్ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఇదీ చదవండి.. కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు షాక్ -
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు వచ్చిన బాంబుల బెదింపులు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ మెయిల్ ద్వారా పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైకోర్టుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టులో భారీ బాంబు పేలుడు సంభిస్తుందని బుధవారం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ మెయిల్ వచ్చింది. ‘ఫిబ్రవరి 15న హైకోర్టులో బాంబు పేల్చుతా. ఈ పేలుడు ఢిల్లీలోనే అతిపెద్దది కానుంది. ఎంతమంది భద్రతా బలగాలైనా పెట్టుకోండి.. అందరినీ పేల్చివేస్తాం’ అని గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదే రోజు మరోవైపు బిహార్ డీజీపీకి వాట్సప్ ఆడియో క్లిప్ ద్వారా బాంబు బెదిరింపు రావటం గమనార్హం. అయితే ఈ ఘటనలో నిందితుడిని కర్ణాటకలో పటుకున్నామని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి అతన్ని విచారణ కోసం పట్నా తరలించారు. నిందితుడిని అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపు..
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం విదితమే. నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తమైన ముంబై పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈలోపే దేశ రాజధానిలోనూ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బెదిరింపులు అందాయి. ఉదయం 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి ఢిల్లీ స్కూల్లో బాంబ్ పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్తో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని క్యాంపస్ నుంచి ఖాళీ చేయించారు. రెండు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘నాతో సెల్ఫీ మాములుగా ఉండదు’.. టూరిస్టులను వెంబడించిన గజరాజు -
Shamshabad: బాంబు బెదిరింపు కలకలం.. ఎయిర్పోర్టులో హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. దీంతో, అధికారులు ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. అనంతరం, బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేపట్టింది. వివరాల ప్రకారం.. శంషాబాద్లోని రాజీవ్గాంధీ విమానాశ్రయానికి బాంబ్ మెసేజ్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. జీఎంఆర్ కస్టమర్ కేర్కు ఈ మెసేజ్ పెట్టాడు. దీంతో, అధికారులు ఎయిర్పోర్టును తమ ఆధీనంలోకి తీసుకుని హై అలర్ట్ ప్రకటించారు. బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేపట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, సదరు మెసేజ్ విదేశాల నుంచి వచ్చినట్టు పోలీసులు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు
కోల్కతా: కోల్కతాలోని ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మ్యూజియంలో బాంబును అమర్చినట్లు ఈమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సందర్శకులందర్ని మ్యూజియం నుంచి ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలను మ్యూజియానికి పంపించారు. బాంబు బెదిరింపు ఈమెయిల్లు బూటకమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి అలాంటి మెయిల్స్ కొన్ని వచ్చాయని వెల్లడించారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల దేశంలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఎక్కువైంది. దేశరాజధానిలో ఇటీవల ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద బాంబు బెదిరింపుల ఘటన జరిగింది. అటు.. ముంబయిలోనూ ఆర్బీఐ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే అయోధ్య రామాలయం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీ సర్కార్కు షాక్.. మొహల్లా క్లినిక్లపై సీబీఐ దర్యాప్తు -
యోగి ఆదిత్యనాథ్కు బాంబు బెదిరింపులు .. ఇద్దరి అరెస్టు
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అయోధ్య రామాలయంలపై బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాంబులు వేసి యోగి ఆదిత్యనాథ్, అయోధ్యలోని రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో నిందితులు పోస్ట్ చేశారని అధికారులు తెలిపారు. నిందితులను తాహర్ సింగ్, ఓంప్రకాష్ మిశ్రాలుగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) బృందం గుర్తించింది. నిందితులు లక్నోలో విభూతి ఖండ్ ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు. ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్, అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చేస్తామని బెదిరించారని పోలీసులు గుర్తించారు. బెదిరింపు పోస్టుల్లో నిందితులకు సంబంధించిన ఈమెయిల్ ఐడీలు ఉన్నట్లు తేలింది. ఈమెయిల్ ఐడీల సాంకేతిక విశ్లేషణ తర్వాత తాహర్ సింగ్ ఈమెయిల్ ఖాతాలను సృష్టించారని, ఓంప్రకాశ్ మిశ్రా బెదిరింపు సందేశాలు పంపారని తేలింది. నిందితులు ఇద్దరూ గోండా నివాసితులు. పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసును ఎస్టీఎఫ్ మరింత లోతుగా విచారిస్తోంది. నిందితులే ఈ చర్యకు పాల్పడ్డారా? లేక దీని వెనక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్ నేతలు అలర్ట్! -
ఢిల్లీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబై: పుణె నుంచి ఢిల్లీ వెళ్తున్న అకాశ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాలు.. ఆకాశ ఎయిర్ సంస్థకు విమానం(QP 1148) 185 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో శుక్రవారం అర్థరాత్రి 12 గంటలకు తెల్లవారుజామున పుణె నుంచి బయల్దేరింది. టేకాఫ్ అయిన 40 నిమిషాలల తర్వాత ఓ ప్రయాణికుడు తన వద్దనున్న బ్యాగ్లో బాంబ్ ఉందని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం, పోలీసులు విమానం అంతా తనిఖీలు చేపట్టారు. అయితే తమ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు చేసిన ప్రయాణికుడు ఛాతీలో నొప్పి వస్తుందని కూడా చెప్పడంతో విమానం ల్యాండైన వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి వైద్యం అందించి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో శనివారం ఉదయం 6 గంటలకు విమానం మళ్లీ ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా అయిదుగురు మృత్యువాత -
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో హైఅలర్ట్ నెలకొంది. బాంబు బెదిరింపు మెయిల్తో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ టీం తనిఖీలు చేపట్టాయి. అయితే కాసేపటికే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ను ఇవాళ రాత్రి ఏడుగంటలకు పేల్చేస్తామంటూ ఎయిర్పోర్ట్ కస్టమర్ కేర్ సెంటర్కు ఓ మెయిల్ వచ్చింది. దీంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయితే కాసేపటికే అదే మెయిల్ ఐడీ నుంచి మరో మెయిల్ వచ్చింది. తమ కుమారుడి మానసిక స్థితి బాగోలేదని.. అందుకే అలా సందేశం పంపాడని.. క్షమించాలని ఆ మెయిల్లో ఉంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో తనిఖీలు మాత్రం కొనసాగించి.. ఆ బెదిరింపును ఫేక్గా నిర్ధారించుకున్నాయి. మరోవైపు ఆ మెయిల్స్ బెంగాల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మెయిల్స్ పంపిన చిరునామాను ట్రేస్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. -
Eiffel Tower: బాంబు బెదిరింపుతో ఈఫిల్ టవర్ ఖాళీ
ప్యారిస్: సుందర కట్టడంగా పేరొందిన ఈఫిల్ టవర్ వద్ద ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెంట్రల్ప్యారిస్లో ఉన్న ఈ టవర్కు శనివారం బాంబు బెదిరింపు వచ్చింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం సమయంలో దుండగులు ఫోన్ చేసి ఈఫిల్ టవర్ను కూల్చేందుకు బాంబు అమర్చామంటూ బెదిరించారు. దీంతో హుటాహుటినా టవర్లలోని ఫ్లోర్లన్నింటిని ఖాళీ చేయించారు అధికారులు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ప్యారిస్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి.. ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ టవర్ను 1887 జనవరిలో మొదలుపెట్టి.. 1889 మార్చి 31వ తేదీనాటికి నిర్మాణం పూర్తి చేశారు. ప్రారంభ ఏడాదిలో 20 లక్షల మంది సందర్శకులు ఈఫిల్ టవర్ను సందర్శించగా.. కిందటి ఏడాది 62 లక్షల మంది ఈఫిల్ టవర్ను సందర్శించారు. FRANCE 🇫🇷 The Eiffel Tower has been evacuated due to a bomb threat. This is developing. They don’t seem to be in much of a hurry evacuating. Hmmmm pic.twitter.com/Iabb9SqdXY — Forever Trumper (@FanaTeresafana) August 12, 2023 -
హైదరాబాద్ ఇన్కమ్ టాక్స్ టవర్స్కు బాంబు కాల్
నాంపల్లి: ఏసీ గార్డ్స్లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం (ఐటీ టవర్స్)కు సోమవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఐటీ టవర్స్ను కాసేపట్లో పేల్చేస్తామంటూ ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సోమవారం మధ్యాహ్నం 12.50 గంటలకు డయల్ 100కు ఫోన్ కాల్ వచ్చింది. మెయిన్ కంట్రోల్ విభాగం సిబ్బంది వెంటనే నాంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు ఉద్యోగులందరినీ బయటకు పంపించారు. అనంతరం ఐటీ టవర్స్ను పూర్తిగా బాంబు స్క్వాడ్తో తనిఖీ చేశారు. టవర్స్లోని అన్ని అంతస్తులను క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఎక్కడా బాంబు లేదని, ఫోన్ కాల్ ఫేక్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
మాదాపూర్ కొత్తగూడెం TCS ఆఫీసుకు బాంబు బెదిరింపు
-
సెంట్రల్ రైల్వేస్టేషన్కు బాంబు బెదిరింపు
కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్కు బాంబు బెదిరింపు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. వివరాలు.. చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పోలీసు కంట్రోల్ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టినట్లు సమాచారం అందించాడు. కాసేపట్లో బాంబు పేలుతుందని చెప్పి కట్ చేశాడు. దీంతో సెంట్రల్ రైల్వే స్టేషన్కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఫ్లవర్బజార్ అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ విశ్వనాథన్ భాగ్యరాజ్ నేతృత్వంలో పోలీసులు విచారించారు. ఫోన్ కాల్ నంబర్ కీల్పాక్కం మెంటల్ హెల్త్ షెల్టర్ నుంచి వచ్చినట్లు తెలిసింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యాసార్పాడికి చెందిన రామలింగం కుమారుడు మణికంఠన్ (21)గా గుర్తించారు. అతను ఏడేళ్లుగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. అలాగే తన వద్ద బాంబు ఉందని రెండుసార్లు ఎగ్మూర్ రైల్వే స్టేషన్ను బెదిరించాడు. స్టేషన్లో బాంబు లేదని నిర్ధారించిన పోలీసులు మరోసారి ఇలాంటివి పునావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బాంబు బెదిరింపు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పబ్లిక్ స్కూల్.. బాంబు బెదిరింపు మెయిల్తో ఉలిక్కిపడింది. పాఠశాల ఆవరణలో బాంబులు ఉన్నాయని పేర్కొంటూ ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఆ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఐతే అలాంటి దేమి కనుగొనలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఢిల్లీలోని మధుర రోడ్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 8.10 గంటల ప్రాంతంలో పాఠశాల అధికారుల నుంచి ఈ విషయమై తమకు ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తాము హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకుని పాఠశాలను వెంటనే కాళీ చేయించామని చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు కనుగొనలేదన్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని సాదిక్నగర్లో ది ఇండియన్ స్కూల్కి ఈమెయిల్ ద్వారా వచ్చిన బాంబు బెదిరింపు మరువకు మునుపే అలాంటి ఘటనే మరోకటి చోసుకోవడం గమనార్హం. ఐతే ఆ ఘటనలో బాంబు స్క్వాడ్, ఇతర ఏజెన్సీలు తనిఖీలు చేపట్టడా అలాంటివేమీ కనిపించలేదు. దీంతో పోలీసులు ఆ మెయిల్ బూటకమని ప్రకటించారు కూడా. (చదవండి: వందే భారత్ రైలుపై కాంగ్రెస్ ఎంపీ పోస్టర్లు కలకలం) -
ఢిల్లీ స్కూల్, పాట్నా ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
ఈ మధ్యకాలంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు బెదిరింపు ఫోన్ల ఘటనలు ఎక్కువయ్యాయి. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, శివసేన నేత సంజయ్ రౌత్ను చంపేస్తామని బెదిరింపులు అందాయి. దీంతోపాటు వివిధ చోట్ల బాంబు పెట్టి పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ పాఠశాలతోపాటు విమనాశ్రాయానికి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాదిక్ నగర్లోని ది ఇండియన్ స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10: 49 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. తరువాత బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్కు సమాచారం ఇచ్చారు. పాఠశాల లోపల, పరిసర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. The Indian School in Sadiq Nagar received an bomb threat via email. As a precautionary measure, the school has been vacated. Bomb Detection and Disposal Squad informed: Delhi police More details awaited. pic.twitter.com/p6DKKeSXsl — ANI (@ANI) April 12, 2023 మరోవైపు బీహార్లోని పాట్నా ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి నుంచి జయప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయానికి బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన ఎయిర్పోర్టు అధికారులు, పోలీసులు బాంబ్ స్వ్కాడ్కు సమాచారం అందించారు. ఈ మేరకు ఎయిర్పోర్టు లోపల, బయట సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం 1.47 గంటలకు ఈ బెదిరింపు అధికారులకు అందింది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తుండటంతో విమానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఇంటి గొడవ గూగుల్కు అంటించాడు!.. అసలు విషయం తెలియడంతో షాక్!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి గొడవలు గూగుల్కు ‘అంటుకున్నాయి’. ఆ సంస్థలో పని చేస్తున్న అన్నకు తమ్ముడు ఇచ్చిన వార్నింగ్ బాంబు బెదిరింపుగా మారింది. పుణేలోని గూగుల్ కార్యాలయానికి బాంబు బెదిరింపు అంటూ కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు సోమవారం చందానగర్లో శివానంద్ అనే యువకుడిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే ఈ వ్యవహారం మొత్తం అన్నదమ్ముల ఆస్తి పంచాయితీగా తేలింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురికాలనీకి చెందిన దయానంద్, శివానంద్ అన్నదమ్ములు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న వీరి మధ్య కొన్నాళ్లుగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. నగరంలో ఉన్న ఓ ఇంటిని విక్రయించే విషయంలో ఇవి మరింత ముదిరాయి. ప్రస్తుతం దయానంద్ పుణేలోని గూగుల్ క్యాంపస్లో పని చేస్తున్నాడు. ఆదివారం తన అన్నకు ఫోన్ చేసిన శివానంద్ ఇంటిని అమ్మే విషయంపై వాగ్వాదానికి దిగాడు. ఇది తారాస్థాయికి చేరడంతో తన మాట వినకపోతే బాంబుతో పేల్చేస్తానని అన్నాడు. అప్పటికే సోదరుడిపై కక్షతో ఉండి, దీంతో సహనం కోల్పోయిన దయానంద్ ఈ వార్నింగ్కుఓ ట్విస్ట్ ఇచ్చాడు. తమ్ముడిని ఇబ్బంది పెట్టాలని పథకం వేసి ముంబైలో ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని గూగుల్ క్యాంపస్ మేనేజర్కు ఫోన్ చేశాడు. రాత్రి 7.54 గంటల సమయంలో తనకు ఫోన్ చేసిన ఆగంతకుడు పుణే క్యాంపస్లో బాంబు పెట్టినట్లు, దాన్ని పేల్చేయనున్నట్లు బెదిరించాడని చెప్పాడు. ఆగంతకుడికి చెందినదిగా చెప్తూ తన సోదరుడి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఈ పరిణామంతో ఆందోళనకు గురైన మేనేజర్ ఈ విషయాన్ని ముంబై జోన్–5 డీసీపీ విక్రమ్ దేశ్ముఖ్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ప్రాథమిక, సాంకేతిక ఆధారాలను బట్టి ఆగంతకుడు సైబరాబాద్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం సోమవారం ఉదయం ఇక్కడకు చేరుకుంది. ఆ సమయంలో శివానంద్ చందానగర్లోని తన బంధువుల ఇంట్లో ఉన్నాడు. స్థానిక పోలీసుల సహకారంతో అక్కడికి వెళ్లిన ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేసి ముంబై తరలించారు. శివానంద్ను విచారించిన నేపథ్యంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దయానంద్పై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గూగుల్ ముంబై క్యాంపస్ నుంచి సమాచారం కోరారు. -
ఎయిర్పోర్టులో బాంబు కలకలం.. హుటాహుటిన ఖాళీ చేయించిన అధికారులు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే ఇంటర్నేషనల్ టర్మినల్ను ఖాళీ చేయించారు అధికారులు. అనుమానాస్పద ప్యాకేజీని గుర్తించినట్లు వెల్లడించారు. పోలీసులు, సిబ్బంది విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. తాము చెప్పే వరకు ఇంటర్నేషనల్ టర్మినల్ వైపు ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. అక్కడ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు వెల్లడించారు. 2020లో శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయాన్ని 30 లక్షల మందికిపైగా ప్రయాణికులు వినియోగించారు. పికప్, డ్రాప్ ఆఫ్ సేవలు తమ దేశీయ టర్మినల్స్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: ట్రంప్ మొదటి భార్య మృతిపై అనుమానాలు! వైద్యులు ఏం చెప్పారంటే? -
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు..
లండన్: 3 టీ20లు, 5 వన్డేల సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. లీసెస్టర్ వేదికగా న్యూజిలాండ్ మహిళలు, ఇంగ్లండ్ మహిళల మధ్య ఇవాళ(సెప్టెంబర్ 21) జరగాల్సిన మూడో వన్డేకు కొద్ది గంటల ముందు ఓ గుర్తు తెలియని అగంతకుడు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపుకు పాల్పడినట్లు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు దృవీకరించాయి. కివీస్ బృందం బస చేస్తున్న హోటల్ను బాంబు పెట్టి పేల్చేస్తామని సదరు అగంతకుడు కివీస్ మేనేజ్మెంట్లోని ఓ వ్యక్తికి మెయిల్ చేశాడు. అయితే ఈ బెదిరింపు నమ్మదగదిగా లేదని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కొట్టిపారేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఇటీవల కివీస్ పురుషుల జట్టు భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా బెదిరింపులు వచ్చి ఉండవచ్చని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బాంబు బెదిరింపు తర్వాత కివీస్ మేల్ క్రికెటర్లు భయాందోళనలకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టేడియం బయట తమ ఆటగాళ్లపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు కివీస్ ప్రధాని జెసిండా.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా, పాక్ పర్యటన నుంచి న్యూజిలాండ్ జట్టు వైదొలిగిన తర్వాత ఇంగ్లండ్ జట్టు సైతం పాక్ టూర్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: అఫ్గాన్లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట..! -
రిజల్ట్స్ విడుదల చేస్తారా.. లేదంటే బాంబు వేయమంటారా?
ముంబై: మహారాష్ట్రలోని ముంబై విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఫలితాలు విడుదల చేయకపోతే విశ్వవిద్యాలయాన్ని బాంబులు వేసి పేల్చేస్తామని ఈమెయిల్స్లో హెచ్చరికలు వచ్చాయి. డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయకపోతే తాము చెప్పిన పని చేస్తామని స్పష్టం చేశారు. ఆ పని విద్యార్థులే చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. బ్యాచిల్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్) సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ, మూల్యంకన విభాగం డైరెక్టర్ మెయిల్కు బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అధికారులు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముంబై విశ్వవిద్యాలయం ఇటీవల చివరి సంవత్సర విద్యార్థుల సెమిస్టర్ ఫలితాలు ఆలస్యంగా విడుదల చేసింది. మిగిలిన వారి ఫలితాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే పలువురు విద్యార్థులు విశ్వవిద్యాలయానికి బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. -
చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపు
సాక్షి, చెన్నై: చెన్నై సెంట్రల్, మదురై రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు చేసిన రామనాథపురం వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరు రైల్వేస్టేషన్ కంట్రోల్ రూం వాట్సాప్ నెంబరుకు ఒక సమాచారం వచ్చింది. అందులో చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్లలో బాంబులు పెట్టామని, మరికొద్ది సేపట్లో పేలనున్నట్లు ఉంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అధికారులు చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్ల కంట్రోల్ రూంలకు సమాచారం అందించారు. ఈ రెండు రైల్వేస్టేషన్లలో భద్రతా అధికారులు, బాంబు స్క్వాడ్ నిపుణులు పోలీసు జాగిలాలతో రెండు గంటలపాటు తనిఖీలు జరిపారు. బాంబులేవీ లభించలేదు. విచారణలో బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి రామనాథపురానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక దళం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: మద్యం మత్తులో వదినను లైంగికంగా వేధించిన మరిది.. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంబానీ ఇల్లు ఎంటిలియా ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు చేపట్టి.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అంధేరీలోని ప్రదీప్ శర్మ ఇంట్లో గురువారం ఉదయం ఎన్ఐఎతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది తనీఖీలు చేపట్టారు. ఉదయం ఐదుగంటల నుంచి సుమారు ఆరుగంటలపాటు ఈ సోదాలు కొనసాగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రదీప్పై పశ్నల వర్షం కురిపించింది ఎన్ఐఏ. ఇక ఈ కేసులో షీలర్ అనే అనుమానితుడితో శర్మ గతంలో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభించారు. షీలర్ గతంలో పోలీసు ఇన్ఫార్మర్గా పని చేశాడని, అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో శర్మను ఏప్రిల్లోనే ఓసారి ప్రశ్నించారు కూడా. వాజే గురువు ఇక మన్సుక్ హిరేన్ మృతి కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతోనే శర్మ ఇంట్లో సోదాలు చేపట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ఇక ఈ కేసులో ఎన్ఐఎ కస్టడీలో ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు, శర్మ గురువులాంటోడు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహనంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్ను ప్రదీప్ శర్మ ద్వారనే తెప్పించినట్లు వాజే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ కేసుతో పాటు వ్యాపారవేత్త మన్సుక్ హిరేన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడిగా ఉన్నారు. కాగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరున్న ప్రదీప్ శర్మపై 2006లో లఖన్ భయ్యా ఎన్కౌంటర్, అందులో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లోకి వచ్చిన ఆయన.. 2019లో ప్రదీప్ శర్మ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. శివసేనలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తన పేరుమీద ఓ ఎన్జీవో నడుపుతున్నారు 59 ఏళ్ల ప్రదీప్. చదవండి: రియల్ అబ్ తక్ చప్పన్: పాతికేళ్ల సర్వీస్. 100 ఎన్కౌంటర్లు -
తాజ్మహల్కు బాంబు బెదిరింపు
-
తాజ్మహల్కు బాంబు బెదిరింపు
ఆగ్రా : ప్రపంచంలోనే అందమైన కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. పర్యాటకులను అక్కడినుంచి ఖాళీ చేయించి తాజామహల్ను మూసివేశారు. తాజామహల్లో బాంబు పెట్టినట్లు గురువారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్, స్థానిక బలగాలను మోహరించారు. బాంబు బెదింపు రావడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి ఫోన్ కాల్ చేసిన దుండగులు..తాజ్ మహల్లో పేలుడు పదార్దాలు పెట్టామని, ఏ క్షణమైనా అవి పేలొచ్చని తెలిపాడు. దీంతో వెంటనే దీంతో అలర్ట్ అయిన పోలీసులు సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది తాజ్ మహల్ కట్టడం పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే తాజ్మహల్ లోపల ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని ఆగ్రా ఐజీ సతీష్ గణేష్ ధృవీకరించారు. ఇది ఫేక్ కాల్ అని పేర్కొన్నారు. చదవండి : (రాజకీయాలకు చిన్నమ్మ గుడ్బై..రాజీకి షా ప్రయత్నాలు) (గడ్డు పరిస్థితుల్లో యడ్డి సర్కార్: అసెంబ్లీలో అగ్నిపరీక్ష ) Bomb Disposal Squad & other teams carried out extensive search at Taj Mahal premises. No such object has been found yet. Man who called up to give info (of bomb) will soon be traced. I'd like to assure you that there's 99% chances of it being hoax call: A Satish Ganesh, IG Agra pic.twitter.com/MfkmwBrBoA — ANI UP (@ANINewsUP) March 4, 2021 -
అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు
వాషింగ్టన్: అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సుప్రీంకోర్టును ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ను రప్పించి సుప్రీంకోర్టులో తనిఖీలు చేపట్టారు. కాగా జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇది జరగడం ఆసక్తికరంగా మారింది. కాగా భారత కాలామానం ప్రకారం రాత్రి 10.30గంటలకు క్యాపిటల్ హిల్ భవనంలో జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. కాగా జో బైడెన్తో చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించనున్నారు. -
హీరో విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపులు
చెన్నై: తమిళ హీరోల ఇళ్లల్లో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్స్ రావడం ఇటీవలి కాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఇలాంటి ఆగంతకులకు పోలీసులు ఎంత బుద్ధి చెప్పినా వారు తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం నాడు ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి చెన్నైలోని హీరో విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదిరించారు. దీంతో పోలీసులు, బాంబ్స్క్వాడ్తో సహా హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అంగుళం అంగుళం జల్లెడ పట్టినా బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఎవరో ఆగంతకుడు బెదిరింపు కాల్స్ సినట్లు ధృవీకరించారు. అతడు విల్లాపురం నుంచి కాల్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని పట్టుకునే పనిలో పడ్డారు. (చదవండి: కోబ్రాతో సంబంధం ఏంటి?) గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసానికి కూడా ఓ మానసిక రోగి బాంబు పెట్టానంటూ బెదిరించిన విషయం తెలిసిందే. ఇక విక్రమ్ సినిమాల విషయానికొస్తే.. ఆయన రాజేశ్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన 'కదరం కొండాన్' సినిమాలో చివరి సారిగా కనిపించారు. ప్రస్తుతం 'కోబ్రా'లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ను రష్యాలో చిత్రీకరించాల్సి ఉంది. అయితే అక్కడ కోవిడ్ కారణంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో షూటింగ్ వాయిదా వేశారు. అజయ్ జ్ఞానముత్తి దర్శకత్వం వహిస్తున్న కోబ్రా చిత్రంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్తో పాటు నటీనటులు శ్రీనిధి శెట్టి, కెఎస్ రవికుమార్, బాబు ఆంథోనీ, రోషన్ మాథ్యూ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (చదవండి: ధనుష్, విజయ్ కాంత్ ఇళ్లలో బాంబు) -
సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపు ఇచ్చిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ బెదిరింపుతో భద్రతను పెంచారు. చెన్నై గ్రీవెన్స్ రోడ్డులో సీఎం పళనిస్వామి నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్ సాలైలో సచివాలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిసరాలు భద్రతా వలయంలోనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో తరచూ సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది. మంగళవారం వచ్చిన బెదిరింపు కాల్స్తో పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయం పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్స్వ్కాడ్లు రంగంలోకి దిగాయి. సచివాలయంలోని అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సీఎం ఇంటి పరిసరాల్లోనూ భద్రతను పెంచారు. ప్రవేశ మార్గంలో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఈ బెదిరింపు ఇచ్చిన యువకుడి కోసం సైబర్ క్రైం గాలింపు చేపట్టింది. చదవండి: ఈ చేపలు కుట్టినా, వీటిని తిన్నా ప్రాణాలు పోతాయ్ -
యోగి ఆదిత్యానాథ్కు బాంబు దాడి హెచ్చరిక
లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ను చంపుతామని బెదిరిస్తూ వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపంది. యూపీ పోలీస్ ప్రధాన కార్యాలయం వాట్సాప్ నెంబర్కు అభ్యంతరకర పదజాలంతో ఈ మెసేజ్ వచ్చింది. ఓ వర్గానికి యూపీ సీఎం ముప్పుగా పరిణమించారని అంటూ బాంబు దాడితో యోగి ఆదిత్యానాథ్ను మట్టుబెడతామని గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం అర్ధరాత్రి ఈ మెసేజ్ రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారుదీనిపై లక్నోలోని గోమతినగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మెసేజ్ పంపిన మొబైల్ నెంబర్ కాల్ డిటైల్స్ను పోలీసులు ఆరా తీస్తున్నారు. చదవండి : వివాదాస్పద ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన సర్కార్ -
ఇంటర్సిటీ ట్రైన్కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. ఉదయం 5:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అమరావతికి వెళ్లాల్సిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఆందోళన రేగింది. డయల్ 100కు ఫోన్ చేసి ట్రైన్లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో రైల్వే స్టేషన్లోనే ఆ రైలును ఆర్పీఎఫ్ పోలీసులు నిలిపివేశారు. రైలును అణువణువు తనిఖీ చేశారు. ఆర్పీఎఫ్ సీనియర్ డివిజన్ కమిషనర్ గాంధీ ఆధ్వర్యంలో తనిఖీలు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని తెలిపారు. అదేవిధంగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్ను ఫేక్ కాల్గా గుర్తించారు. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
శరీరంలో బాంబు ఉందంటూ ఓ యువతి..
కోల్కతా : ఓ యువతి చేసిన నిర్వాకానికి కోల్ కతా ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఏషియన్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సివచ్చింది. తన శరీరంలో బాంబు ఉందని, దానిని ఏ క్షణంలోనైనా పేల్చేస్తానని బెదిరించడంతో కంగుతిన్న ఫైలెట్.. విమానాన్ని కోల్కతాఎయిర్ పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మోహిని మొండల్ (25) శనివారం రాత్రి 9.57 గంటలకు ఎయిర్ ఏషియన్ విమానంలో కోల్కతా నుంచి ముంబై బయలు దేరింది. మార్గమద్యలో తన కేబిన్ సిబ్బందికి ఒక లెటర్ ఇచ్చి అది ఫ్లైట్ కెప్టెన్కు అందివాల్సిందిగా కోరింది. తన శరీరం చుట్టూ బాంబులు ఉన్నాయని, వాటిని ఏ క్షణమైనా పేల్చేస్తానని లేఖలో హెచ్చరించింది. దీంతో కంగుతిన్న పైలట్..అధికారులకు సమాచారం అందించి కోల్కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం మోహిని మెండల్ను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శనివారం రాత్రి 11.46 గంటలకు తిరిగి పంపించారు. కాగా, మోహిని శరీరంలో బాంబు లేదని, ఆమె ఎందుకు అలా బెదిరించిందో విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు. -
'ఆ బాంబు బెదిరింపు నకిలీయే'
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. సాయిరాం కాలేరు అనే పేరుతో ఒక అగంతకుడు మెయిల్ రూపంలో అధికారులకు పంపిన విషయం విదితమే . కాగా, ఈ బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్గా గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్రెడ్డి బుధవారం ప్రెస్మీట్లో పేర్కొన్నారు. డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సాయిరాం, శశికాంత్ ఇద్దరు మంచి స్నేహితులు. కాగా, సాయిరాం గత కొన్ని రోజులుగా కెనడా వెళ్లే పనిలో వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాయిరాం వీసా అప్లికేషన్ దరఖాస్తు చేయడం కోసం శశికాంత్ ఇంటికి వెళ్లాడు. అప్లికేషన్కు సంబంధించిన వివరాలను సాయిరాం కంప్యూటర్లో అప్లోడ్ చేస్తుండగా శశికాంత్ ఆ వివరాలను రహస్యంగా సేకరించినట్లు తెలిపారు. సాయిరాం పేరుతో అసభ్య పదజాలంతో కూడిన సమాచారాన్ని శశికాంత్ కెనడా వీసా సైట్లో అప్లోడ్ చేయడాన్ని తెలుసుకున్న సాయిరాం రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై ఫిర్యాదు ఇచ్చాడన్న కోపంతో ఎలాగైనా సాయిరాంను కెనెడా వెళ్లకుండా అడ్డుకోవాలని శశికాంత్ విశ్వప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే 4వ తేదిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సాయిరాం కెనడాకు వెళ్తున్నట్లు తెలుసుకున్న శశికాంత్ సాయిరాం మెయిల్ ఐడీతో ఎయిర్పోర్ట్ను బ్లాస్ట్ చేయనున్నట్లు మెయిల్ రూపంలో అధికారులకు పంపినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ ఘటనకు సూత్రధారుడైన శశికాంత్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. (చదవండి : శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు) -
ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
శంషాబాద్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుస్తానంటూ ఓ వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. సాయిరాం కాలేరు అనే పేరు మీద వచ్చిన ఈ మెయిల్ మంగళవారం మధ్యాహ్నం 2.31 గంటలకు ఎయిర్పోర్టులోని ఆర్జీఐఏ కస్టమ్స్ సపోర్ట్ మెయిల్ ఐడీకి చేరింది. సంబంధిత అధికారులు వెంటనే భద్రతా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మెయిల్లో ‘ఐ వాంట్ టు బ్లాస్ట్ బాంబ్ ఇన్ ఎయిర్పోర్టు టుమారో’అని ఉంది. దీంతో ఎయిర్పోర్టు భద్రతా అధికారులు సీఐఎస్ఎఫ్, సైబరాబాద్ పోలీసులతో పాటు కేంద్ర పౌర విమానయాన భద్రత అధికారులకు సమాచారం అందించారు. ఆర్జీఐఏ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసి కేసు దర్యాప్తును ప్రారంభించారు. rairamka eru@ ive.com ఐడీతో వచ్చిన మెయిల్ను సైబరాబాద్ సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్తగా దేశీయ, అంతర్జాతీయ అరైవల్, డిపార్చుర్ టెర్మినళ్లతో పాటు పార్కింగ్ ఏరియాలను డాగ్స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. -
ఇండిగోకు బాంబు బెదిరింపు
ముంబై : ముంబై నుంచి ఢిల్లీ మీదుగా లఖ్నవూ వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానంలో బాంబు పెట్టారనే సమాచారం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణాన్ని వాయిదా వేసి విమానాన్ని పూర్తిగా తనిఖీలు చేశారు. అనంతరం విమానంలో ఎటువంటి బాంబ్ లేదని నిర్ధారించిన తరువాత ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో విమానం శనివారం ఉదయం 6.05 గంటలకు ముంబయి ఎయిర్పోర్టు నుంచి లఖ్నవూ బయల్దేరాల్సి ఉంది. అయితే టేకాఫ్ అవడానికి ముందు ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ మహిళ విమానాశ్రయం టర్మినల్ 1 వద్ద ఉన్న ఇండిగో చెకిన్ కౌంటర్ దగ్గరకు వెళ్లి.. ఇండిగో 6ఈ 3612(ముంబయి-లఖ్నవూ మార్గం) విమానంలో బాంబు ఉన్నట్లు చెప్పారు. అనుమానితులుగా భావిస్తున్న కొందరి ఫొటోలను సాక్ష్యాలుగా చూపించారు. సదరు వ్యక్తులు బాంబు పెట్టి ఉంటారని మహిళ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక బాంబు బెదిరింపుల అసెస్మెంట్ కమిటీ(బీటీఏసీ) కూడా ప్రమాదం జరగొచ్చని అనుమానాలు వ్యక్తం చేయడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. వెంటనే ప్రయాణికులను దింపేసి విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. అయితే విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. రెండు గంటల ఆలస్యం తరువాత ఉదయం 8. 40 గంటలకు ప్రారంభయ్యింది. అనంతరం సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విచారణ నిమిత్తం సదరు మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకేళ్లారు. అయితే ఈ ఘటనపై ఇండిగో ఇంతవరకూ స్పందించలేదు. అంతేకాక ఘటన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని గురించి కూడా సమాచారం లేదు. -
బెదిరింపు ఫోన్కాల్
ఆఫీస్లో బాంబ్ ఉన్నట్లు అర్ధరాత్రి ఓ ఫోన్కాల్ వచ్చింది. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆఫీసులో ఏ ప్లేసూ వదలకుండా తనిఖీ చేశారు. కానీ అక్కడ ఏం లేకపోవడంతో ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీస్ సిబ్బంది మమ్ముర ప్రయత్నాలు మొదలుపెట్టారు. చదువుతుంటే... ఇది ఓ యాక్షన్ సినిమాలోని సీన్లా ఉంది కదా. కానీ నిజంగా జరిగింది. చెన్నైలోని ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీస్లో ఇదంతా జరగిందని కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఒక కమ్యూనిటీని కించపరిచేలా ఉన్నాయట. అందుకే ఎవరో ఇలా బెదిరింపు కాల్ చేసారట. ఈ సినిమా తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. -
మణిరత్నం ఆఫీస్కు బాంబు బెదిరింపు
లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం నవాబ్. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర డైలాగ్లను తొలగించాలంటూ ఓ అగంతకుడు మణిరత్నం కార్యలయానికి ఫోన్ చేసిన బెదిరించాడు. చెన్నైలోని అభిరామపురంలోని మణి ఆఫీస్ను బాంబులతో పేల్చేస్తామంటూ బెదించినట్టుగా మణి ఆఫీసు సిబ్బంది వెల్లడించారు. అయితే ఏ డైలాగ్లను తొలగించాలని అగంతగకుడు డిమాండ్ చేశాడో మాత్రం వెల్లడించలేదు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మణిరత్నం ఆఫీస్కు భద్రత కల్పించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ నాట 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. -
కోణార్క్ ఎక్స్ప్రెస్.. బాంబు కలకలం
సాక్షి, ఖమ్మం: కోణార్క్ ఎక్స్ప్రెస్లో బాంబు ఉందనే సమాచారం కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మధిర రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ట్రైన్లోని S 11 కోచ్ సీట్ నెంబర్ 57 కింద అనుమానాస్పదంగా ఉన్న రెండు చిన్న బాక్స్లు, ఒక చేతి సంచీని పోలీసులు గుర్తించి వాటిని స్టేషన్కి దూరంగా తరలించారు. అనంతరం బాంబు స్వ్కాడ్కు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్లో మరోసారి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ను ఖమ్మంలో కాసేపు నిలిపివేశారు. -
అమీర్పేట్ మెట్రో స్టేషన్కు బాంబు బెదిరింపు
-
అమీర్పేట్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఆదివారం ఉదయం కలకలం రేగింది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు వార్తతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుర్తు తెలియని కాల్ ఆధారంగా అధికారులు అప్రమత్తం స్టేషనలో తనిఖీల పేరుతో హడావుడి చేశారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఓ బ్యాగును, చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన బాంబ్ స్క్వాడ్ చివరకు బాంబు లేదని నిర్ధారించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
హైకోర్టుకు బాంబు బెదిరింపు
ముంబై: ముంబై హైకోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో హైకోర్టులో కొద్దిసేపు కార్యకలాపాలు నిలిచిపోయాయి. తనిఖీల అనంతరం బాంబు బెదిరింపు ఆకతాయిల పని అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంజుల చెల్లూర్ సహాయకుల గది నంబర్-51 లో బాంబు అమర్చినట్లు బుధవారం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు బాంబ్ స్క్వాడ్ను రప్పించి తనిఖీలు చేపట్టారు. అధికారులను, సిబ్బందిని బయటకు పంపించి కోర్టు లోపల, ఆవరణలో అణువణువూ తనిఖీ చేపట్టగా ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో బెదిరింపు ఒట్టిదేనని తేల్చారు. పోలీసులు సూచనల మేరకు కోర్టు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బాంబు ఉందని.. విమానంలోంచి దూకేశారు!
వాళ్లంతా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఆల్బరీ నగరానికి వెళ్లడానికి విమానం ఎక్కారు. వాళ్ల విమానం ఇంకా టేకాఫ్ తీసుకోకముందే ఉన్నట్టుండి ఒక ప్రకటన వినిపించింది. విమానంలో బాంబు ఉన్నట్లు తెలిసిందని, అందువల్ల లగేజి ఎక్కడిదక్కడే వదిలేసి వెంటనే బయటకు పరుగెత్తాలని ఆ ఎనౌన్స్మెంట్లో తెలిపారు. విమానంలో బాంబు ఉందంటూ బాత్రూంలో ఒక నోట్ కనిపించింది. దాంతో ఎందుకైనా మంచిదని ఆ విషయాన్ని బయటకు తెలిపారు. అంతే, మొత్తం విమానంలో ఉన్న 42 మంది ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు దూకేశారు. ఆ తర్వాత పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీసుల వాళ్లు, బాంబు నిర్వీర్యదళం అంతా వచ్చి విమానం మొత్తం గాలించారు గానీ అక్కడ వాళ్లకు ఏమీ కనిపించలేదని ద ట్రిబ్యూన్ ఎక్స్ప్రెస్ పత్రిక తన కథనంలో తెలిపింది. బాత్రూంలో నోట్ అంటించినట్లుగా భావిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
మాంచెస్టర్ కాలేజీలో బాంబు భయం!
నిన్న కాక మొన్నే ఒక సంగీత కార్యక్రమంలో బాంబు పేలుడుతో ఉలిక్కిపడ్డ మాంచెస్టర్ నగరం మరోసారి భయంతో చిగురుటాకులా వణికిపోయింది. ఇంగ్లండ్లోని మాంచెస్టర్ నగర శివార్లలో గల ట్రాఫర్డ్ నగరంలో ఒక కాలేజీలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. వెంటనే బాంబు నిర్వీర్య దళం అక్కడకు చేరుకుని అనుమానాస్పదంగా కనిపించిన ప్యాకెట్ను గుర్తించి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే అందరూ అనుమానించినట్లుగా అందులో బాంబు ఏమీ లేదని బ్రిటిష్ ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ నిపుణులు చెప్పారు. మాంచెస్టర్ ఎరెనాలో జరిగిన బాంబు పేలుడులో 22 మంది మరణించడం, మరో 64 మంది గాయపడటంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కలకలం రేగింది. దాంతో అనుమానాస్పద స్థితిలో ఏ వస్తువు కనిపించినా భయపడుతున్నారు. తాజాగా కాలేజి ఘటనలోనూ ఇలాగే జరిగింది. ఎవరికీ సంబంధం లేకుండా ఒక ప్యాకెట్ కనిపించడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులకు తెలిపారు. అయితే అందులో బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
గురువాయూర్ ఆలయానికి బాంబు బెదిరింపు
గురువాయూర్: ప్రఖ్యాత గురవాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో కేరళ యంత్రాంగం అప్రమత్తమైంది. గుర్తు తెలియని వ్యక్తి శనివారం ఉదయం ఆలయ అధికారులకు ఫోన్ చేసి.. బాంబు పెట్టినట్లు బెదిరించాడు. ఈ హెచ్చరికతో భీతిల్లిన ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాంబ్ స్క్వాడ్ సహా హుటాహుటిన చేరుకున్న పోలీసు బలగాలు ఆలయం అణువణువూ శోధిచాయి. చివరికి బాంబులేదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఆలయ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, అందుకే ఆలయాన్ని పేల్చేసేందుకు బాంబు అమర్చినట్లు అగంతకుడు పేర్కొనడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆగంతకుడు ఎక్కడి నుంచి ఫోన్ చేశాడనేదానిపై దర్యాప్తు చేపట్టారు. -
అంతా లోపలే.. అంతలో బాంబు బెదిరింపు
న్యూయార్క్: అమెరికాలో ఫ్రాన్స్ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. బాంబు బెదిరింపు రావడంతో ఉన్నపలంగా అప్పటికప్పుడు ఎంబీసీని పూర్తిగా ఖాళీ చేయించారు. అయితే, ఇది తాత్కాలికమేనని, క్లియరెన్స్ రాగానే తిరిగి ప్రారంభించామని కార్యాలయ అధికారులు తెలిపారు. త్వరలో ఫ్రాన్స్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం అమెరికాలోని ఫ్రాన్స్ వాసులు ఓటు నమోదుచేసుకుంటున్నారు. ఈ సమయంలోనే న్యూయార్క్లోని కాన్సులేట్కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఒక అనుమానిత వాహనం కాన్సులేట్పైకి దాడి చేసేందుకు దూసుకొస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందడంతోనే ఖాళీ చేయించారని సమాచారం. ‘పదుల సంఖ్యలో రాయబార కార్యాలయంలో ఉన్నారు. వారందరినీ తనిఖీ చేయడంతోపాటు ఓ వాహనాన్ని చెక్ చేస్తుండగా అనుమానిం వచ్చింది. దీంతో అందరినీ అలర్ట్ చేశాం. దీంతో అప్పటికప్పుడు ఖాళీ చేసి తిరిగి గంట తర్వాత ప్రారంభించాం’ అని కాన్సుల్ జనరల్ అన్నే క్లైరీ లెజెండ్రీ చెప్పారు. న్యూయార్క్లో దాదాపు 28వేల మంది ఫ్రెంచ్ పౌరులు ఉంటున్నారు. -
విమానాశ్రయంలో బాంబు కలకలం
అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో బుధవారం బాంబు ఉందన్న సమాచారం కలకలం రేపింది. శ్రీ గురు రామ్దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన సూట్కేసును గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ డిస్పోజల్ సిబ్బంది ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ప్రధాని ర్యాలీకి బాంబు బెదిరింపు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దుతో కోపం వచ్చిన ఓ విద్యార్థి.. ఆయన ఉత్తరప్రదేశ్లో పాల్గొంటున్న ఎన్నికల ర్యాలీలో బాంబులు పేలుతాయంటూ ఉత్తుత్తిగా బెదిరించాడు. అలా ఫోన్ చేసినందుకు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న ఆ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ అనే ఆ విద్యార్థి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. దాంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై మావు వద్ద భద్రత పెంచారు. అది ఉత్తుత్త బెదిరింపు అని అనుమానం వచ్చినా, ప్రధానమంత్రి పాల్గొంటున్న ర్యాలీ కావడంతో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఏటీఎస్ కూడా రంగంలోకి దిగాయి. ఏసీపీ హుక్మారామ్ దీనిపై దర్యాప్తు చేసి దీపక్(21)ను అరెస్టు చేశారు. ఆ కాల్ నైరుతి ఢిల్లీలోని లాల్బాగ్ ప్రాంతం నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీపక్ వద్ద ఒక డైరీ స్వాధీనం చేసుకుని చూడగా, అందులో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల ప్రసంగాలు రాసుకున్నట్లు కనిపించింది. అతడు లాల్బాగ్ ప్రాంతంలో నివసిస్తాడు. ఉత్తరప్రదేశ్లోని ఆజాంగఢ్ అతడి స్వస్థలం. ఢిల్లీ యూనివర్సిటీలో కరస్పాండెన్స్ కోర్సు చేస్తూ తమ బంధువుల వద్ద ఉంటున్నాడు. ర్యాలీని భగ్నం చేసేందుకే తాను ఆ ఫోన్ కాల్ చేశానన్నాడు. -
నిశ్చితార్థం పెట్టుకొని ఏం పని చేశారంటే..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఓ వైపు నిశ్చితార్థం పెట్టుకొని మరో వైపు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడింది ఓ యువ జంట. వివరాలు..బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు ఫోన్కాల్ కలకలం రేపింది. వెంటనే అధికారులు విమానాన్ని ఆపేసి హుటాహుటిన అణువణువూ తనిఖీ చేశారు, చివరకు ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.45గంటలకు బెంగళూరు నుంచి కేరళలోని కొచ్చి ఎయిర్పోర్టుకు బయలుదేరాల్సిన విమానంలో బాంబు ఉందని ఎయిర్పోర్టుకు కాల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్టు సిబ్బంది, పోలీసులు ప్రయాణికులను దించివేసి బాంబ్ స్క్వాడ్తో క్షుణ్నంగా తనిఖీ చేయించారు. ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. 160 మంది ప్రయాణికులతో ఈ ఎయిర్ ఏషియా విమానం చివరకు గురువారం తెల్లవారుజామున 3.10గంటలకు టేకాఫ్ అయ్యింది. బెదిరింపు కాల్కు సంబంధించి కేరళలోని అలెప్పీ పట్టణానికి చెందిన అర్జున్, నేహా గోపీనాథ్ అనే యువ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలెప్పీలో ఒక పబ్లిక్ బూత్ నుంచి కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ జంటకు గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే ఎందుకు ఫోన్ కాల్ చేశారనేది దర్యాప్తు చేస్తున్నారు. -
బాంబు బెదిరింపు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అత్యవసరంగా ఓ విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మరో ముఖ్య విషమేమంటే.. ప్యాసింజర్ ఈ చర్యకు పాల్పడ్డాడని చెక్ రిపబ్లిక్ అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బోయింగ్ 707 విమానం లాస్ పల్మాస్(స్పెయిన్) నుంచి వార్సాకు వెళ్తుంది. అయితే ప్రేగ్ సమీపానికి రాగానే విమానంలో బాంబు ఉందని శుక్రవారం రాత్రి విమాన సిబ్బందికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బోయింగ్ విమానాన్ని ప్రేగ్ లోని వక్లవ్ హవెల్ ఎయిర్ పోర్టు సమీపంలోని వాడకంలో లేని మరో ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అందులో ఉన్న 160 మంది ప్రయాణికులను దించివేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పోలాండ్కు చెందిన ఓ ప్యాసింజర్ ఈ ఫోన్ కాల్ చేసినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విమాన ప్రయాణికులు రాత్రి ఆ ఎయిర్ పోర్టులో గడిపారు. తిరిగి శనివారం ఉదయం ప్రయాణికులను అదే విమానంలో వార్సాకు వెళ్లే ఏర్పాట్లుచేశారు. మరోవైపు పోలాండ్ ప్రయాణికుడు ఎందుకు బెదిరింపు కాల్ చేశాడు అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రయాణికుడి వివరాలను విమాన సిబ్బంది వెల్లడించలేదు. -
చెన్నై అపోలో ఆస్పత్రికి బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. కొందరు దుండగులు ఆస్పత్రిలో బాంబు పెట్టామని బెదిరించడంతో హుటాహుటిన బ్యాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆస్పత్రి మొత్తాన్ని క్షుణ్ణంగా తనీఖీ చేస్తున్నది. తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత 74 రోజులపాటు అపోలో ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. 74 రోజులు చికిత్స అందించిన జయలలిత మృత్యువుతో పోరాటంలో విజయం సాధించలేదు. ఒకదశలో ఆమె కోలుకున్నారని, ఇక త్వరలోనే ఇంటికి పంపిస్తారని కథనాలు వచ్చాయి. ఇంతలోనే కార్డియక్ అరెస్టుకు గురికావడంతో సోమవారం రాత్రి జయలలిత తుదిశ్వాస విడిచారని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. అయితే, జయలలిత మృతి ప్రకటన, చికిత్స విషయంలో వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో అపోలో ఆస్పత్రికి బాంబు బెదిరింపు రావడం గమనార్హం. -
సంపత్ వినాయక టెంపుల్కు బాంబు బెదిరింపు
విశాఖపట్నం : విశాఖలో ప్రసిద్ధి చెందిన సంపత్ వినాయక టెంపుల్కు శుక్రవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ పరిణామంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు విచారణను చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
సికింద్రాబాద్ స్టేషన్లో బాంబు కలకలం
నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్లోని 2, 7 ప్లాట్ఫారాలలో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు 100కు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్, బాంబుస్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ బాంబులు ఏవీ లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే విస్తృత తనిఖీలు చేసిన తర్వాత అక్కడ బాంబులు ఏవీ లేవని తెలియడంతో కాస్త నెమ్మదించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్కు పాల్పడిన తర్వాత పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలు ఎక్కడైనా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ చిన్న వదంతి వచ్చినా కూడా ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడుతున్నారు. -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నుంచి గువాహటి వెళ్లే ఎయిరిండియా విమానంలో బాంబు ఉందంటూ ఓ ఫోన్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా విమానాశ్రయం మొత్తం అప్రమత్తమైంది. విమానాన్ని టేకాఫ్ తీసుకోకుండా ఆపేసి క్షుణ్ణంగా తనిఖీ చేయడం మొదలుపెట్టారు. గువాహటి వెళ్లే విమానంలో బాంబు ఉన్నట్లు ఓ మహిళ ఎయిరిండియా చెకిన్ కౌంటర్ వద్దకు ఫోన్ చేసి తెలిపింది. దాంతో విమానాన్ని అప్పటికప్పుడు ఆపేసి.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అధికారులు తక్షణం అక్కడకు చేరుకుని దాన్ని తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఆ మహిళ ఎయిరిండియా చెకిన్ కౌంటర్కు ఫోన్ చేసింది. 9.30 గంటలకు గువాహటి బయల్దేరాల్సిన విమానంలో బాంబు ఉందని ఆమె తెలిపింది. దాంతో ఆ విమానం ఎక్కాల్సిన మొత్తం 114 మంది ప్రయాణికులను వెంటనే ఆపేశారు. ఎయిర్పోర్టులో హై ఎలర్ట్ ప్రకటించారు. -
క్వీన్స్ టౌన్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
క్వీన్స్ టౌన్: న్యూజిలాండ్ లోని క్వీన్స్ టౌన్ ఎయిర్ పోర్టుకు ఆదివారం బాంబు బెదిరింపు రావడంతో అక్కడి భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్ పోర్టులోని కీలక విభాగాలను ఖాళీ చేయించిన అధికారులు ప్రయాణీకులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ పోర్టులోని రన్ వేపై ల్యాండయిన విమానంలో గుర్తు తెలియని వ్యక్తి ఉత్తరాన్ని వదిలి వెళ్లినట్లు చెప్పారు. ఇది గమనించిన క్లీనర్ ఉత్తరంలో విమానంలో బాంబు ఉంచినట్లు పేర్కొనడాన్ని గమనించి అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించిన ఎయిర్ పోర్టు అధికారులు భధ్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో విమానాన్ని జల్లెడ పట్టిన అధికారులు ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టులోని మిగతా ప్రాంతాలను బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. -
సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత ఇంటికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. జయలలిత చాలా రోజులుగా చెన్నైలోని పోయెస్గార్డెన్లోనే నివసిస్తున్నారు. ముఖ్యమంత్రి కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఎవ్వరినీ ఆ ప్రాంతం వైపు అనుమతించరు. తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుంది. అలా అనుమతి పొందినా అనేక దశల్లో సెక్యూరిటీ చెకింగ్ను దాటాల్సి ఉంటుంది. సీఎం బంగ్లా చుట్టూ 24 గంటలూ సాయుధ పోలీసులు కాపలా ఉంటారు. ఇంతటి భధ్రతా ఏర్పాట్ల నడుమ ఉన్న సీఎం బంగ్లాలో బాంబు పెట్టామని, అది మరికొద్ది సేపట్లో పేలుతుందని చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్కు ఆదివారం రాత్రి అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో గగుర్పాటుకు గురైన కంట్రోల్ రూము అధికారులు వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్ వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు విచారణకు దిగారు. విళుపురం జిల్లా మరక్కానం కూనీమేడు గ్రామం నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసుల తొలి దశ విచారణలో తేలింది. ప్రత్యేక దళానికి చెందిన పోలీసులు రాత్రికి రాత్రే అక్కడికి చేరుకుని భువనేశ్వరన్(21) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. అయితే భువనేశ్వరన్ మతిస్థిమితం లేనివ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
విమానానికి బాంబు బెదిరింపు.. రక్షణగా ‘ఫైటర్లు’
టెల్ అవీవ్ : న్యూయార్క్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు వెళుతున్న ఈఎల్ ఏఎల్ ప్యాసింజర్ విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే ఆ విమానానికి రక్షణగా స్విట్జర్లాండ్ ఎయిర్ఫోర్స్ యుద్ధ విమానాలను మోహరించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, బాంబు బెదిరింపు తప్పుడు సమాచారమని అధికారులు తెలిపారు. -
'పీఎం, సీఎం నివాసాలను పేల్చివేస్తాం'
న్యూఢిల్లీ: ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన బెదిరింపు కాల్ ఢిల్లీలో కలకలం సృష్టించింది. భద్రత బలగాలను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసాలలో బాంబులు పెట్టామని, పేల్చివేస్తామంటూ శనివారం మధ్యాహ్నం జాతీయ దర్యాప్తు సంస్థ కంట్రోల్ రూమ్కు ఫోన్ వచ్చింది. ఎన్ఐఏ అధికారులు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని మోదీ అధికార నివాసం 7 బంగ్లాకు, సివిల్ లైన్స్లో ఫ్లాగ్స్టాఫ్ రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి భద్రత బలగాలు, బాంబు డిస్పోజల్ బృందాలు చేరుకుని అణువణువూ గాలించాయి. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ సర్వీస్ ద్వారా బెదిరింపు ఫోన్ కాల్ చేసినట్టు గుర్తించారు. నిందితుడిని గుర్తించేందుకు అధికారులు విచారణ చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఓ వ్యక్తి ఇలాగే ఫోన్ చేసి రాష్ట్రపతి భవన్, ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరించాడు. -
కృష్ణా ఎక్స్ప్రెస్లో బాంబు కలకలం
బాపట్ల స్టేషన్లో దిగిపోయిన ప్రయాణికులు బాపట్ల: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్లో బాంబు ఉందనే వదంతి గురువారం కలకలం సృష్టించింది. రైలు చీరాల స్టేషన్ దాటాక డి-5 బోగీలో నుంచి పొగలు రావడాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు రైలులో బాంబు ఉందని భయపడ్డారు. ఆ విషయం కాస్తా రైలంతా వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు బాపట్ల స్టేషన్కు చేరుకోగానే రైలులోని సుమారు 2 వేల మంది ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్ఫామ్పైకి దూకడం మొదలెట్టారు. దీన్ని గమనించిన రైల్వే అధికారులు వారిని ప్రశ్నించగా.. రైలులో బాంబు ఉందని జవాబిచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు డి-5 బోగీని పరిశీలించారు. బ్రేక్ స్లిప్ అయ్యి పొగలు వస్తున్నాయని, ప్రమాదమేమీ లేదని ప్రయాణికులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నించారు. అయినా ప్రయాణికులందరూ రైలు ఎక్కేందుకు నిరాకరించడంతో గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్యాసింజర్లో కొంతమందిని, అండమాన్ ఎక్స్ప్రెస్లో మరికొంతమందిని ఎక్కించి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు కాల్
ఖట్మాండ్: ఢిల్లీ-ఖట్మాండ్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఖట్మాండ్ విమానశ్రయం నుంచి ఆదివారం ఢిల్లీ రావాల్సిన ఎయిర్వేస్ జెట్ విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన నేపాల్ విమానాశ్రయ అధికారులు విమానంలోని ప్రయాణికులందరినీ వెంటనే దింపేశారు. విమానంలో నుంచి ప్రయాణికులను దింపేసిన అనంతరం బాంబు స్క్వాడ్ అక్కడకు చేరుకుని విమానంలో క్షుణంగా తనిఖీలు నిర్వహించింది. అయితే ఆ విమానంలో బాంబు వంటి పేలుడు పదార్థాలు ఏమి దొరకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికుల లగేజీలను కూడా సోదా చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని జాతీయ, అంతర్జాతీయ విమానాలన్నీ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వరకు రద్దు చేయబడినట్టు విమానశ్రయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: ఢిల్లీ నుంచి మంగళవారం వివిధ నగరాలకు బయల్దేరిన ఐదు జెట్ ఎయిర్ వేస్ విమానాలను బాంబులతో పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమై భద్రతను సమీక్షించారు. బెదిరింపులు వచ్చిన ఐదు విమానాలను సురక్షితంగా వాటి గమ్య స్థానాల్లో ల్యాండ్ చేసినట్టు అధికారులు చెప్పారు. విమానాల నుంచి ప్రయాణికులను దించివేసి తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సివుంది. -
ఢిల్లీ ఎయిర్పోర్టులో బాంబు కలకలం
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. రెండు విమానాల్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఢిల్లీ నుంచి నేపాల్, భువనేశ్వర్ వెళుతున్న రెండు ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేశారు. ప్రయాణికులను కిందకు దించివేసి భద్రతా సిబ్బంది, బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. కాగా ఈ విమానాల్లో నలుగురు ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించి తనీఖీలు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోల్కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో ఆదివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. 24 గంటల్లోగా విమానాశ్రయాన్ని పేల్చివేస్తామంటూ ఈ రోజు ఉదయం ఎయిర్పోర్ట్ మేనేజర్కు ఈమెయిల్ వచ్చింది. ఈ మెయిల్ జర్మనీ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో విమనాశ్రయాధికారులు ఫిర్యాదు చేశారు. విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో నిఘాను పెంచి తనిఖీలను ముమ్మరం చేశారు. -
ఢిల్లీలో ‘బాంబు’లాట
వసంత్ విహార్ స్కూలుకు బెదిరింపు కాల్ అర్ధ గంట తనిఖీల తర్వాత ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణ ఊపిరిపీల్చుకున్న యాజమాన్యం బాంబు కాల్తో ఢిల్లీలో దిగిన విమానం ఇదీ బెదిరింపు కాలేనని వెల్లడి ఆకతాయిల కోసం పోలీసుల వేట న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని గురువారం రెండు ‘బాంబు కాల్స్’ భయపెట్టాయి. దక్షిణ ఢిల్లీ వసంత్ విహార్లోని మోడ్రన్ స్కూళ్లో, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో ఆయా యంత్రాంగాలు పరుగులు పెట్టాయి. చివరికి ఇవి బూటకపు కాల్స్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు కాల్స్ చేసిన ఆకతాయిలను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. స్కూల్లో కలకలం దక్షిణ ఢిల్లీ వసంత్ విహార్లోని మోడ్రన్ స్కూళ్లో బాంబు ఉందంటూ గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి యాజమాన్యానికి వ్యక్తి చేశాడు. ఓ బ్యాగ్లో బాంబు ఉందని, అది సరిగ్గా ఒంటి గంటకు పేలుతుందని చెప్పాడు. దీంతో స్కూలు యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాంబు నిర్వీర్యం చేసే బలగాన్ని రప్పించింది. వారు బ్యాగులను తనిఖీ చేసి అంతా బూటకమని తేల్చారు. ఈ మేరకు దక్షిణ జిల్లా డీసీపీ ప్రేమ్ నాథ్ వివరాలు వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కు చెందినవాడినని చెప్పుకున్నాడని డీసీపీ వివరించారు. పరీక్షలకు లేని అంతరాయం స్కూళ్లో 12వ త రగతి బోర్డు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ కాల్ వచ్చింది. అయితే ఫోన్ కాల్ వచ్చే సమయానికే విద్యార్థులు పరీక్ష రాసి బయటకు వచ్చారని, మిగతా తరగతుల విద్యార్థులకు సెలవు కావడంతో వారు స్కూలుకు రాలేదని డీసీపీ ప్రేమ్నాథ్ తెలిపారు. ఫోన్ కాల్ వచ్చినప్పుడు పాఠశాల భవనంలో టీచర్లు, ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. వారిని భవనం నుంచి బయటకు పంపించి, బాంబు, డాగ్ స్క్వాడ్లతోనూ సోదాలు జరిపించాం. అర్ధ గంట సోదాల తర్వాత ఏమీ కనిపించకపోవడంతో అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తేల్చాం’ అని డీసీపీ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని వెల్లడించారు. ఈ బెదిరింపు కాల్ ఓ ల్యాండ్లైన్ నుంచి వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కాల్ జాడ కనిపెట్టేందుకు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశాయి. ఎయిర్పోర్టులో గోరక్పూర్ విమానం గోరక్పూర్కు వెళ్లాల్సిన జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో బాంబు ఉన్నట్లు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసి క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం బెదిరింపు కాల్ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ‘జైపూర్-గోరక్పూర్ జెట్ విమానం (9 డబ్ల్యూ 2647 నంబర్) మధ్యాహ్నం 3.30 గంటలకు గోరక్పూర్కు చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు ఉన్నట్లు మధ్యాహ్నం 12.08 గంటలకు గోరక్పూర్ ఎయిర్ డెరైక్టర్ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో మధ్యాహ్నం 12.57 గంటలకు విమానాన్ని ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేసి క్షుణ్నంగా పరిశీలించాం’ అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ (ఐజీఐ) దినేష్ కుమార్ గుప్తా వెల్లడించారు. అలాగే విమానంలోని 61 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బందిని చెక్ చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం అది కేవలం బెదిరింపు కాల్ అని వెల్లడికావడంతో మధ్యాహ్నం 3.18 గంటలకు విమానం గోరక్పూర్కు బయలుదేరింది. -
సీనియర్ నటుడి బంగ్లాకు బాంబు బెదిరింపు
చెన్నై: సీనియర్ నటుడు, దర్శకనిర్మాత, నటుడు శింబు తండ్రి టీ రాజేందర్కు చెందిన బంగ్లాలో బాంబు పెట్టినట్టు బెదిరింపు రావడంతో మరోసారి పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ఇప్పటికే శింబు బీప్ సాంగ్ వివాదంలో తలనొప్పికి గురవుతున్న పోలీసులు తాజాగా ఈ బాంబు బెదిరింపు కాల్తో అలర్ట్ అయ్యారు. టీ రాజేందర్కు స్థానిక పోరూర్లోని శెట్టియార్ అగరం ప్రాంతంలో పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో బాంబు ఉన్నట్టు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 108 అంబులెన్స్, కంట్రోల్ రూమ్కు ఒక ఫోన్కాల్ వచ్చింది. దీంతో అంబులెన్స్ నిర్వాహకులు మధువాయిల్ పోలీసులకు సమాచారం అందించారు. మధురవాయిల్ పోలీసులు వెంటనే పోరూర్లోని టీ.రాజేందర్ బంగ్లాకు వెళ్లి క్షుణంగా తనిఖీలు జరిపారు. అయితే అక్కడ బాంబులు దొరకలేదు. దీంతో పోలీసులు ఆ ఫోన్ నంబర్కు తిరిగి ఫోన్ చేశారు. ఒక మహిళ ఫోన్ను తీయడంతో ఆమె మగ గొంతుతో బాంబు బెదిరింపు కాల్ చేసినట్టు నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఆమె కోసం గాలిస్తున్నారు. ఇటీవల శింబు బీప్ సాంగ్ మహిళా సంఘాల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసిన నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు కాల్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
'ఎయిర్ పోర్ట్ ఖాళీ చేయించారు'
ఆమ్స్టర్డామ్: ఓ వ్యక్తి 'నా దగ్గర బాంబు ఉంది' అని అరవడంతో అధికారులు విమానాశ్రయాన్ని ఖాళీ చేయించిన ఘటన నెదర్లాండ్స్ లో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆమ్స్టర్డామ్ లోని స్చిపోల్ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఆ సమయంలో బ్రిటన్కు చెందిన 29 ఏళ్ల ఓ వ్యక్తి హఠాత్తుగా.. నా దగ్గర బాంబు ఉంది అని అరిచాడు. దీంతో భద్రతా అధికారులు అప్రమత్తమై ప్రయాణికులను ఖాళీ చేయించారు. అధికారులు స్నిఫర్ డాగ్లను రంగంలోకి దింపి సదరు వ్యక్తి లగేజ్ను చెక్ చేయించారు. అయితే అతడి వద్ద ఎలాంటి విస్పోటక పదార్థాలు లభించలేదు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని.. అలా ఎందుకు ప్రవర్తించాడు అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. సుమారు 20 నిమిషాల అనంతరం ఎలాంటి బాంబు లేదని నిర్థారించుకున్న తరువాత ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతిచ్చారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చనే హెచ్చరికలతో పలు యూరప్ దేశాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. -
'మా విమానానికి బాంబు బెదిరింపు నిజమే'
సింగపూర్: తమ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని సింగపూర్ ఎయిర్లైన్స్(ఎస్ఐఏ) స్పష్టం చేసింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సింగపూర్కు బయలుదేరిన విమానం ఎస్ క్యూ 001కు ఉగ్రవాదులు బాంబు హెచ్చరికలు చేశారని, దాంతో విమానాన్ని చాంఘీ విమానాశ్రయంవద్ద సురక్షితంగా దించివేశామని చెప్పారు. దీనివల్ల ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బంది కలిగిందని, వారి సామాను తీసుకునేందుకు దాదాపు రెండున్నర గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందని , అందుకు చింతిస్తున్నామని అన్నారు. తొలుత బాంబు బెదిరింపు విషయాన్ని అధికారులకు చెప్పామని, అయితే, భద్రతా కారణాల దృష్ట్యా వివరాలు చెప్పకుండా చాలా జాగ్రత్తగా విమానాన్ని దించివేసేలా చేశామన్నారు. చివరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు. -
బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లింపు
-
బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లింపు
ఇస్తాంబుల్: ఉగ్రవాద చర్యలు ప్రపంచానికి సవాల్గా మారగా, బాంబు బెదిరింపులతో విమానయాన సంస్థలు కలవరపడుతున్నాయి. బాంబు బెదిరింపు రావడంతో టర్కీ ఎయిర్లైన్స్ విమానాన్ని మార్గమధ్యంలో దారిమళ్లించారు. నూయార్క్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న విమానాన్ని కెనడాలోని హాలిఫాక్స్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. కెనడా అత్యవసర సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తయ్యారు. విమానంలోని ప్రయాణికులందరినీ దించివేసి, క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా నుంచి ప్రాన్స్కు వెళ్తున్న రెండు విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని వెంటనే దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనిఖీల అనంతరం ఫ్రాన్స్కు చేరుకున్నాయి. -
ఫుట్బాల్ స్టేడియంలో బాంబు కలకలం
-
ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు
-
ఫ్రాన్స్ విమానాలకు బాంబు బెదిరింపు
పారిస్ ఉగ్రవాద దాడులతో విషాదంలో మునిగిపోయిన ఫ్రాన్స్ను ఉగ్రవాద నీడలు వెంటాడుతున్నాయి. బాంబుదాడి చేయనున్నట్టు బెదిరింపులు రావడంతో ఫ్రాన్స్కు చెందిన రెండు విమానాలను దారిమళ్లించారు. అమెరికా నుంచి పారిస్ వెళ్తున్న ఈ రెండు విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం. మంగళవారం లాస్ ఏంజిలెస్ నుంచి ఎయిర్ ఫ్రాన్స్ 65 విమానం పారిస్కు బయల్దేరింది. కాసేపటి తర్వాత విమానాన్ని పేలుస్తారని బెదిరింపులు రావడంతో వెంటనే దారి మళ్లించి సాల్ట్ లేక్ సిటీలో ల్యాండ్ చేశారు. మరో విమానం వాషింగ్టన్ నుంచి పారిస్కు బయల్దేరగా, ఇదే కారణంతో దారి మళ్లించి నోవా స్కోటియాలో ల్యాండ్ చేశారు. గత శుక్రవారం రాత్రి పారిస్ ఉగ్రవాద దాడుల్లో 129 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
ఫుట్బాల్ స్టేడియంలో బాంబు కలకలం
హనోవర్: స్టేడియంలో బాంబు పెట్టారన్న వదంతులతో జర్మనీ, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ రద్దయ్యింది. స్టేడియంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తనిఖీల్లో తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం హనోవర్ సిటీలో జర్మనీ, నెదర్లాండ్స్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. పారిస్ ఉగ్రవాద దాడులను ఖండిస్తూ స్వేచ్ఛకు ప్రతీకగా ఈ మ్యాచ్ను నిర్వహించాలని తలపెట్టారు. 49 వేల మంది సీటింగ్ సామర్థ్యం ఉన్న ఆతిథ్య స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది, జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావాల్సివుంది. మ్యాచ్ కాసేపట్లో ఆరంభం కావాల్సివుండగా స్టేడియంలో బాంబుదాడి జరగనున్నట్టు కలకలం రేగింది. పోలీసులు వెంటనే రంగంలో దిగి స్టేడియంలోని ప్రేక్షకులను బయటకు తరలించి, స్టేడియంలో క్షుణ్నంగా గాలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, ఎవరినీ అరెస్ట్ చేయలేదని తనిఖీల అనంతరం పోలీసులు ప్రకటించారు. ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్.. మ్యాచ్ రద్దుకావడంతో బెర్లిన్కు వెళ్లిపోయారు. గత శుక్రవారం రాత్రి పారిస్లో జర్మనీ, ఫ్రాన్స్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం బయట ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసిన సంగతి తెలిసిందే. పారిస్లో పలు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 129 మంది ప్రాణాలు కోల్పోయారు. -
తిరుపతి రైల్వేస్టేషన్కు బాంబు బెదిరింపు
తిరుపతి: ఇప్పటికే ఉగ్రవాదుల టార్గెట్గా ఉన్న దక్షిణ భారత ఆథ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలోని రైల్వే స్టేషన్లో బాంబు కలకలం చెలరేగింది. నిత్యం లక్షల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుపతి రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి.. పోలీస్ హెల్ప్ లైన్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. రైల్వే స్టేషన్లోని వివిధ ప్రదేశాల్లో మొత్తం 8 బాంబులు అమర్చినట్లు ఆగంతకుడు పోలీసులకు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బుధవారం ఉదయం మూడు గంటల వరకు రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. 8 డాగ్ స్క్వాడ్, 4 బాంబ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. అయితే చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల హడావుడి చూసి అక్కడున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగళవారం రాత్రి 11:30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి పోలీస్ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. -
సోమనాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు
గుజరాత్: గుజరాత్లోని పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని పేల్చివేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. దీంతో ఆలయానికి భద్రతను పెంచటంతో పాటు హై అలర్ట్ ప్రకటించారు. కాగా ఆలయాన్ని పేల్చివేస్తామంటూ ఆలయ ట్రస్టు కమిటీకి ఓ లేఖ వచ్చింది. ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో గుజరాతీ భాషలో రాసిన ఓ లేఖ వడోదరా నుంచి వచ్చినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఇక బాంబు స్క్వాడ్ బృందం ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే భక్తుల రాకపోకలపై దృష్టి సారించారు. అయితే ఇప్పటివరకూ ఆలయంలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ లేఖ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై సెక్యూరిటీ ఏజెన్సీ విచారణ చేపట్టింది. కాగా సోమనాథ్ ఆలయం సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తమైంది. -
ముంబై విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై మరోసారి ఉగ్రవాదులు దాడి తలపెట్టారా? పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ ఇదే మాట చెబుతోంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని తాజ్ హోటల్తో పాటు స్వదేశీ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో బాంబు పేలుళ్ల గురించి చర్చించుకుంటుండగా తాను విన్నానంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ముంబై మహానగరం మొత్తం అప్రమత్తమైంది. తాజ్ హోటల్తో పాటు విమానాశ్రయాలలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను మోహరించి, హై సెక్యూరిటీ ఎలర్ట్ ప్రకటించారు. మూడు ప్రాంతాల్లోనూ భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనే విషయం ఇంతవరకు తెలియలేదు. అతడు మంగళవారం ఉదయం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫోన్ చేశాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా మూడు ప్రదేశాలలోను బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను దించారు. -
అజ్మీర్ దర్గాకు బాంబు బెదిరింపు
దేశంలోనే కాక విదేశాల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందిన అజ్మీర్ దర్గాకు బాంబు బెదిరింపు వచ్చింది. 12వ శతాబ్దం నాటి ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో బాంబు పెట్టినట్లు సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో వెంటనే దర్గాను ఖాళీ చేయించారు. ఆ సమయానికి దర్గాలో దాదాపు లక్ష మంది వరకు భక్తులు ఉన్నారు. దర్గాలోకి బాంబు డిటెక్టర్లతో పోలీసు కమాండోలు ప్రవేశించడంతో వాళ్లంతా ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. మొత్తం అన్ని గేట్ల నుంచి భక్తులను బయటకు పంపి, మొత్తం ప్రాంగణం అంతటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాదాపు అరగంట పాటు తనిఖీ చేసిన తర్వాత అక్కడ ఎలాంటి బాంబు లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రాంతంలో హై ఎలర్ట్ ప్రకటించి, క్విక్ రెస్పాన్స్ బృందాలు ఆ మార్గాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. తెల్లవారుజామున 6.40 గంటల సమయంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. దర్గాను పేల్చేస్తామని బెదిరింపు రావడంతో ఉదయం 7.45 నుంచి 9.15 వరకు దర్గాను మూసేసినట్లు పోలీసులు తెలిపారు. -
బెంగాల్ సచివాలయానికి బాంబు బెదిరింపు
పశ్చిమబెంగాల్ సచివాలయం అయిన రైటర్స్ బిల్డింగ్కు బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో మొత్తం సచివాలయంలో ఉద్యోగులందరినీ బయటకు పంపించేశారు. బాంబు ఏదైనా ఉందేమోనన్న అనుమానంతో బాంబు నిర్వీర్య దళాన్ని పిలిపించి తనిఖీలు చేయిస్తున్నారు. అయితే బాంబు ఉందో లేదో కూడా ఇంతవరకు నిర్ధారణ కాలేదు. భవనంలో బాంబు ఉన్నట్లు ఒక ఈమెయిల్ అందడంతో వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. సీనియర్ పోలీసు అధికారులు బాంబు నిర్వీర్య దళంతోను, పోలీసు కుక్కలతోను వెంటనే అక్కడకు చేరుకుని సిబ్బందిని ఖాళీ చేయించారు. మెయిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై కూడా తాము దర్యాప్తు చేస్తున్నట్లు కోల్కతా పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భవనంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
అంబాలా: ఇటు మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న భారీ రైలు ప్రమాదం ఘటనపై అప్రమత్తమత్తమవుతున్నవేళ.. హర్యానాలోని అంబాలా రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం రేగింది. రైల్వే స్టేషన్లో బాంబు అమర్చినట్లు మరి కొద్ది సేపట్లో అది పేలబోతోందన్నట్లు బుధవారం ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్టేషన్ కు చేరుకుని అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ముందు జాత్రత్త చర్యల్లో భాగంగా ప్రయాణికులందరినీ బయటికి పంపించివేశాయి. గుర్ దాస్ పూర్ జిల్లాలో ఉగ్రవాదుల దాడి సందర్భంలో సమీపంలోని రైల్వే ట్రాక్ పై పేలడానికి సిద్ధంగా ఉన్న ఐదు బాంబులను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబాల్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ ను తేలికగా తీసుకోకూడదని భావించిన అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దాడిమరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయం పేల్చేస్తాం
గురువాయూరు: కేరళ గురువాయూరులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకృష్ణ దేవాలయం. ఈ దేవాలయాన్ని 24 గంటలలో పేల్చివేస్తామని ఆగంతకులు మంగళవారం ఫోన్ చేసి దేవాలయ సిబ్బందిని బెదిరించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దేవాలయంతోపాటు పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఫోన్ కాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. బెదిరింపు ఫోన్ కాల్ ఖతార్ నుంచి వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వాసికెక్కిన గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారన్న విషయం విదితమే. -
భారత విమానానికి బాంబు బెదిరింపు.. దించివేత
మస్కట్: విమానాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. మొన్న టర్కీష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో బాంబు ఉందని హెచ్చరికలు రావడంతో ఢిల్లీలో ల్యాండింగ్ చేసి తనిఖీలు చేయగా.. తాజాగా భారత్కు చెందిన విమానానికి కూడా అలాంటి బెదిరింపే వచ్చింది. దీంతో ముంబయి నుంచి దుబాయ్ వెళుతున్న భారత జెట్ ఎయిర్ వేస్ 9డబ్ల్యూ 536 విమానాన్ని అనూహ్యంగా మస్కట్లో దించివేశారు. విమానంలో బాంబు ఉన్నట్లు హెచ్చరికలు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇందులో 54మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా క్షేమంగా బయటపడ్డారు. -
టర్కీ విమానానికి బాంబు బూచి
ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ న్యూఢిల్లీ: బాంబు బెదిరింపు వార్తతో టర్కీ విమానాన్ని మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. టర్కీకి చెందిన 330 ఎయిర్ క్రాఫ్ట్ విమానం 134 మంది ప్రయాణికులతో ఇస్తాంబుల్ నుంచి బ్యాంకాక్ వెళుతోంది. విమానం టాయిలెట్ రూంలోని అద్దాలపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టినట్లు లిప్స్టిక్తో రాశారు. ఇది గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై నాగ్పూర్ ఏటీసీకి సమాచారం అందించారు. వారి సూచన మేరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దింపారు. సీఐఎస్ఎఫ్ బలగాలు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పేలుడు పదార్థాలు లేవని తేల్చినట్లు పౌరవిమానయాన కార్యదర్శి ఆర్.ఎన్. చౌబే మీడియాకు తెలిపారు. పూర్తిగా తనిఖీలు చేసిన అనంతరం రాత్రి 9.30 గంటలప్రాంతంలో విమానాన్ని పంపేందుకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. కాగా, విమానంలో బాంబు తనిఖీకి దాదాపు మూడు గంటల సమయం పట్టినట్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మహేశ్ శర్మ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ సురేందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించారు. -
బాంబు లేదు... అదంతా ఉత్తి బెదిరింపే!
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయిన టర్కీ విమానంలో బాంబు లేదని, విమానం బాత్రూంలో రాసినది ఉత్తుత్తి బెదిరింపేనని తేలిపోయింది. బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న విమానంలో ఉన్న మొత్తం 148 మంది ప్రయాణికులను దించేసి, విమానాన్ని ఆరు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు ఆ విమానంలో బాంబు గానీ, మరెలాంటి పేలుడు పదార్థాలు గానీ లేవని తేల్చారు. దాంతో ప్రయాణికులు, సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు.. విమానం బాత్రూంలోని అద్దం మీద లిప్స్టిక్తో ఎవరో.. 'కార్గో విభాగంలో బాంబు ఉంది జాగ్రత్త' అని రాశారు. దాన్ని చూసినవాళ్లు పైలట్కు విషయం చెప్పడంతో అత్యవసరంగా విమానాన్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించేశారు. -
లిప్స్టిక్తో బెదిరించారు!
''ఈ విమానం కార్గో విభాగంలో బాంబు ఉంది జాగ్రత్త''.. అని టర్కిష్ ఎయిర్లైన్స్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే, ఈ బెదిరింపు ఎలా వచ్చిందో తెలుసా.. విమానంలో ఉన్న బాత్రూం అద్దం మీద ఒక లిప్స్టిక్తో ఈ మాట రాశారు. టికె-65 విమానం మొత్తం 148 మంది ప్రయాణికులతో బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తుండగా మధ్యలో ఎవరో ఈ బెదిరింపును చూసి.. పైలట్కు విషయం చెప్పారు. దాంతో వెంటనే విమానం పైలట్ నాగ్పూర్ ఏటీసీని సంప్రదించాడు. అయితే విమానాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఏటీసీని సంప్రదించి దించాలని వాళ్లు సూచించారు. (తొలి కథనం.. విమానం కేబిన్ లో బాంబు) దాంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్లైన్స్ విమానాన్ని అత్యవసరంగా దించారు. మొత్తం ప్రయాణికులను, సిబ్బందిని కూడా భద్రతా సంస్థల అధికారులు విచారించారు. అందరి సామాన్లు, ముఖ్యంగా హ్యాండ్బ్యాగులను తనిఖీ చేశారు. ఆ లిప్స్టిక్ ఎవరి బ్యాగ్లోనైనా ఉందేమోనని చూశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా బృందాలు ఈ విచారణను కొనసాగిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం శాఖ కార్యదర్శి ఎన్సీ గోయల్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. హైజాక్ చేసే ప్రయత్నమా? విమానాన్ని హైజాక్ చేయాలన్న ఉద్దేశంతోనే బాంబు ఉందని బెదిరించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముందుగా విమానంలో గందరగోళం సృష్టించి, ఆ తర్వాత దీన్ని హైజాక్ చేయాలన్నది వాళ్ల ఉద్దేశమని భావిస్తున్నారు. విమానాన్ని ఐసోలేటెడ్ బే ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ దాన్ని తనిఖీ చేస్తున్నారు. ఎయిర్పోర్టు వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులతో సహా అన్ని నిఘా సంస్థల అధికారులు మోహరించారు. -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు బాంబు బెదిరింపు
మూడు గంటలపాటు తనిఖీ, ఉత్తిదేనని నిర్ధారణ హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టామని ఆదివారం ఉదయం ఓ ఆకతాయి చేసిన ఫోన్కాల్ పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. మూడు గంటలపాటు రైల్వే పోలీసులు తనిఖీ నిర్వహించి ఉత్తిదేనని నిర్ధారించారు. వివరాలు... రైల్వేస్టేషన్లో బాంబు పెట్టామని, అది ఉదయం 11 గంటలకు మూడో నెంబర్ ప్లాట్ఫామ్పై పేలుతుందని ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూమ్కు ఒక వ్యక్తి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కంట్రోల్రూమ్ అధికారులు అప్రమత్తం చేయడంతో వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వ్కాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. అన్ని ప్లాట్ఫారాలు, ప్రయాణికుల లగేజీ, విశ్రాంతి గదులు, పార్కింగ్ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. తీరా తనిఖీలు ముగిశాక అది ఆకతాయి ఫోన్కాల్గా పోలీసులు నిర్ధారించుకున్నారు. శంకర్పల్లికి చెందిన బాలయ్య అనే వ్యక్తికి చెందిన సిమ్కార్డు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు గుర్తించారు. పోలీసులను ఆటపట్టించిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
వరంగల్ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
వరంగల్ (కరీమాబాద్) : వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం సాయంత్రం బాంబు కలకలం రేగింది. ఓ ఆగంతకుడు రైల్వే ఎస్పీకి ఫోన్ చేసి స్టేషన్ ఆవరణలో బాంబు పెట్టినట్లు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే, జిల్లా పోలీసులు డీఎస్పీ సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్ స్కాడ్లు స్టేషన్లో అణువణువూ గాలించారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి బాంబు లభ్యం కాలేదు. -
వరంగల్ రైల్వే స్టేషన్ ఎదుట బాంబు కలకలం
వరంగల్ :వరంగల్ రైల్వేస్టేషన్ లో సోమవారం బాంబు కలకలం రేగింది. వివరాల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రైల్వే స్టేషన్ సమీపంలోని కాకతీయ శిలాతోరణం దగ్గర ఓ బ్యాగును వదిలి వెళ్లాడు. ఈ విషయమై సమాచారమందుకున్న రైల్వే, సివిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బాంబు స్క్వాడ్ కోసంపోలీసులు ఎదురు చూస్తున్నారు. -
రైల్లోనుంచి కిందకు దూకిన ప్రయాణికులు!
కుప్పం: గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రైల్వే శాఖకు ఫోన్ చేసి చెన్నై-లాల్బాగ్ ఎక్స్ప్రెస్ రైలులో బాంబు ఉందని బెదిరించారు. దాంతో రైలును కుప్పం రైల్వేస్టేషన్లో నిలిపివేసి రెండు గంటలపాటు తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపుతో ప్రయాణికులు భయపడిపోయి తోచుకుంటూ రైలులో నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. తనిఖీలు అనంతరం రైలులో బాంబు ఏమీ లేదని తేలింది. ఎవరో తప్పుడు కాల్ చేశారని పోలీసులు చెప్పారు. -
హసీనాకు త్రుటిలో తప్పిన బాంబు ప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం బాంబు పేలుళ్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఢాకాలోని రద్దీ వాణిజ్య ప్రాంతం కార్వాన్ బజార్ గుండా ప్రధాని కాన్వాయ్ వెళ్లిన 10 నిమిషాల తర్వాతే, అక్కడ బాంబు పేలుళ్లు సంభవించాయి. బంగ్లా జాతిపిత, ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ 1971లో చేసిన చారిత్రక ప్రసంగాన్ని పురస్కరించుకొని అవామీ లీగ్ ఏర్పాటు చేసిన ర్యాలీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక పోలీసు అధికారి స్వల్పంగా గాయపడ్డారు. విపక్షాలు దేశవ్యాప్తంగా రవాణా దిగ్బంధానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఈ పేలుళ్లు సంభవించాయి. -
సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు
-
దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు
దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆలయంలో బాంబు పెట్టామని, అది పేలుతుందని గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. దాంతో భక్తులను అక్కడినుంచి ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్ను పిలిపించి తనిఖీలు చేశారు. ఆకతాయి వ్యక్తి 7863656157 నెంబర్ నుంచి 100కు ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు తెలిపాడు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎటువంటి బాంబు దొరకపోవడంతో ఊపరి పీల్చుకున్నారు. తరచూ ఆకతాయిలు, పోలీసుల్ని ఆటపట్టించడానికి ఇటువంటి కాల్స్ చేస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. అయితే ఇంతకుముందు పలుమార్లు ఈ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరగడం లేదా ఇక్కడ బాంబులను గుర్తించడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2002 సంవత్సరంలో తొలిసారిగా ఆలయం సమీపంలో బాంబు పేలుడు జరిగింది. 2007 సంవత్సరంలో బాంబు అమర్చారు గానీ, అది పేలకముందే ఓ పోలీసు కానిస్టేబుల్ దాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. తాజాగా 2013 సంవత్సరంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోనే ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న ఎ-1 మిర్చి సెంటర్, వెంకటాద్రి థియేటర్ ఎదురుగా గల బస్ స్టాపు వద్ద కొద్దిపాటి తీవ్రతతో బాంబులు పేలాయి. మరోసారి ఇప్పుడు ఆలయానికి బాంబు బెదిరింపు రావడం గమనార్హం. -
దాడి చేస్తాం
సాక్షి, చెన్నై: సీఎం పన్నీరు సెల్వం, మంత్రులపై బాంబు దాడులు చేస్తామని ఓ అజ్ఞాత వ్యక్తి బెదిరింపు లేఖ రాశాడు. అరియలూరు రైల్వే స్టేషన్కు ఈ లేఖ రావడంతో దీనిని పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ వేగవంతం చేశారు. అరియలూరు రైల్వే స్టేషన్కు వచ్చిన ఓ లేఖను అక్కడి సిబ్బంది చదివారు. అందులో అరియలూరులోని ప్రధాన వంతెనను పేల్చేస్తామని, మలై కోట్టై ఎక్స్ప్రెస్ను పట్టాలు తప్పించి, బోల్తా కొట్టిస్తామని పేర్కొనడంతో అక్కడి సిబ్బంది ఆందోళనలో పడ్డారు. అదే లేఖలో మరో వైపుగా మంత్రుల్ని వదలి పెట్టమని, సీఎం పన్నీరు సెల్వం సచివాలయూనికి వెళ్లే సమయంలో రాకెట్ లాంఛర్తో దాడి చేయబోతున్నామని హెచ్చరించడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ లేఖను అందుకున్న రైల్వే పోలీసులు అరియలూరు, తిరుచ్చి ఎస్పీలకు సమాచారం అందించారు. ఈ నెల 13, 14 తేదీల్లో తాము అనుకున్నట్టుగా, ముందుగా వేసిన పథకం మేరకు దాడులు జరిగి తీరుతాయని మోహన్ మురళి శంకర్ పేరును లేఖలో రాసి ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ లేఖ తిరుచ్చిలోని రామలింగ పురం నుంచి రావడంతో అక్కడ విచారణను వేగవంతం చేశారు. గత నెల ఇదే చిరునామాతో తిరుచ్చి శ్రీరంగం స్టేషన్కు రావడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ లేఖలను పంపిస్తున్న వ్యక్తి ఒకరేగా భావించి అతడి భరతం పట్టేందుకు ప్రత్యేక బృందాలు పరుగులు తీస్తున్నాయి. ఆ లేఖలో పేర్కొన్నట్టుగా వంతెన వద్ద, మలై కోట్టై రైలు అరియలూరు మీదుగా వెళ్లే ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చెందిన మంత్రులకు భద్రతను పెంచారు. -
తిరుమలలో బాంబుల కలకలం
తిరుమల, తిరుపతిలలో బాంబుల కలకలం చెలరేగింది. దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుమలలో పలుచోట్ల బాంబులు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, శ్రీవారి ఆలయం, యాత్రికుల సముదాయాల్లో పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేశారు. అలిపిరి, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాలలో బాంబు స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేశారు. నాలుగు బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేస్తున్నట్లు అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ కర్ణాటక నుంచి వచ్చిందని, ఆ ఫోన్ కాల్ ఆధారంగా తనిఖీలు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
ఢిల్లీ-జమ్మూ రైలుకు బాంబు బెదిరింపు
చండీగఢ్: జమ్మూ నుంచి ఢిల్లీ వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్టు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆదివారం రాత్రి పంజాబ్లోని పఠాన్కోట్ వద్ద రైలును ఆపివేశారు. సైన్యం, పోలీసులు రంగంలోకి దిగి నాలుగు గంటలకు పైగా రైలును తనిఖీ చేశారు. రైలులో ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలులో పేలుడు పదార్థాలున్నట్టు జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం వచ్చింది. వారు వెంటనే పంజాబ్ పోలీసులకు ఈ విషయాన్ని చేరవేశారు. దీంతో భదత్ర సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రైలు బయల్దేరింది. పఠాన్కోట్ పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉండటం, ఇటీవల జమ్మూలో ఉగ్రవాద దాడులు పెరిగిన నేపథ్యంలో నిఘా పెంచారు. -
మధురైలో బాంబుల కలకలం
తమిళనాడులోని మధురైలో బాంబులు కలకలం రేపాయి. ఓ చెత్త కుండీలో ఉన్న 11 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు పేలుళ్లతో మధురైలో విధ్వంసాలు సృష్టిస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అనుమానం వచ్చినచోటల్లా విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. దాంతో ఓ చెత్తకుండీలో దాచి ఉంచిన మొత్తం 11 బాంబులు బయటపడ్డాయి. వీటిని ఏ సామగ్రితో తయారుచేశారన్న విషయాన్ని బాంబు స్క్వాడ్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
కోచి: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 25న ముంబై నుంచి వచ్చే ఒక విమానాన్ని పేల్చేయడం లేదా వీలైతే ఆత్మాహుతి దాడి చేస్తారని కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు విమానాశ్రయం డైరెక్టర్ ఏకేసీ నాయర్ చెప్పారు. శనివారం ముంబై నుంచి కోచి వచ్చే విమానం లేదా శుక్రవారం రాత్రి అహ్మదాబాద్-ముంబై సెక్టార్ విమానంపై దాడి చేయనున్నట్టు హెచ్చరికలు వచ్చాయి. గురువారం రాత్రి ఓ ఆగంతకుడు కోల్కతా విమానాశ్రయ అధికారికి ఫోన్ చేసి ఈ మేరకు బెదిరించాడు. ఆయన వెంటనే కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సీఐఎస్ఎఫ్ డీఐజీ ఆనంద్ మోహన్ చెన్నై నుంచి కోచి చేరుకుని అత్యున్నత స్థాయి భద్రత సమావేశం నిర్వహించారు. కోచి విమానాశ్రయంలో భద్రత బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. -
సీపీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
కేరళలోని తిరువనంతపురంలో గల సీపీఎం ప్రధాన కార్యాలయం ఏకేజీ సెంటర్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఎవరో వ్యక్తి ఫోన్ చేసి, ఆ కార్యాలయంలో బాంబులు పెట్టినట్లు బెదిరించాడు. అలా ఒకటి కాదు రెండు మూడు సార్లు కాల్ చేసి మరీ చెప్పాడు తెల్లవారుజామున 4.08 గంటల నుంచి 4.27 గంటల మధ్య ఇంటర్నెట్ ద్వారా ఈ ఫోన్లు చేశాడు. తొలుత ఇది ఉత్తుత్త బెదిరింపే అనుకున్నా, ఒకటికి రెండు మూడు సార్లు బెదిరింపులు రావడంతో వెంటనే సీపీఎం వర్గాలు పోలీసులకు విషయం తెలిపాయి. దాంతో బాంబుస్క్వాడ్ను , కుట్రల వ్యతిరేక బృందాన్ని అక్కడకు పంపి తనిఖీలు చేయించారు. అయితే అక్కడ ఎలాంటి బాంబులు లభ్యం కాలేదు. -
రేణిగుంటలో బాంబు కలకలం
రేణిగుంట: ఓ కళాశాలలో బాంబు ఉందని ఓ అంగతకుడు చేసిన ఫోన్ కాల్ స్థానికంగా కలకలం రేపింది. రేణిగుంటకు సమీపంలోని కరకబాడీ లోని శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో బాంబు ఉన్నట్టు పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించారు. దాంతో రేణిగుంట పోలీసులు ఘటనస్థలానికి పరుగులు పెట్టారు. కళాశాలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. చివరికి బెదిరింపు కాల్ అని పోలీసులు నిర్ఱారణ చేసుకున్నారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు
ఆట ఆరంభం సినిమాలో హీరో అజిత్ బాంబు నిర్వీర్య దళం నిపుణుడు. అలాంటి అజిత్ ఇంటికే శనివారం నాడు ఓ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. 'తాళ 55' షూటింగులో అజిత్ బిజీగా ఉండగా.. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేసి, ఆ ఇంట్లో బాంబు ఉందని బెదిరించాడు. దాంతో బాంబుస్క్వాడ్ ఆయన ఇంటికి హుటాహుటిన చేరుకుని వెంటనే అక్కడ అణువణువూ గాలించింది. అయితే, ఎలాంటి బాంబు లేకపోవడంతో అది ఉత్తుత్త కాల్ మాత్రమేనని తేలింది. అయితే, ఈ బెదిరింపు రావడానికి కారణమేంటో ఇంతవరకు తెలియలేదు. పోలీసులు ఆ ఫోన్ చేసిందెవరో తేల్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని భరత్ అనే పాత్రికేయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ''ఈసీఆర్లోని అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. తెల్లవారుజామున 4 గంటలకు బాంబుస్క్వాడ్ మొత్తం పరిసరాలను గాలించింది. అది ఉత్తుత్త కాల్ అని తేలింది'' అని భరత్ ట్వీట్ చేశారు. -
‘సెంట్రల్’లో టెన్షన్
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. బెంగళూరు-గువాహటి ఎక్స్ప్రెస్ రైలు సుమారు ఆరునెలల క్రితం చెన్నై మీదుగా వె ళుతున్న తరుణంలో సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆగింది. సరిగ్గా అదే సమయంలో ఆ రైలులోని రెండు బోగీల్లో బాంబులు పేలగా ఒక ఇంజనీరింగ్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన జరిగి నెలలు దాటుతున్నా నిందితులెవరూ దొరకలేదు. నాటి నుంచి నగరంలోని పోలీస్ స్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం పరిపాటి అయింది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1గంట సమ యంలో పోలీసులకు మరో ఫోన్కాల్ వచ్చిం ది. సాయంత్రం 4-6 గంటల మధ్య సెంట్ర ల్ రైల్వే స్టేషన్లో బాంబు పేలనుందని అందులోని సారాంశం. ఈ ఫోన్కాల్తో ఉలిక్కిపడిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సెంట్రల్లో తనిఖీలు ప్రారంభించారు. ఏ మూలను వదలకుండా గాలించారు. ఫ్లాట్ఫారంలపై బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న అన్ని రైళ్లను తనీఖీలు చేశారు. రైల్వే స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులను, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసిగానీ వదల్లేదు. సుమారు నాలుగు గంటల పాటు విరామం లేకుండా వెదికినా అనుమానాస్పద వస్తువులు ఏమీ దొరకలేదు. దీంతో ఇదంతా ఆకతాయి పనిగా నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసులను, ప్రయాణికులను, అధికారులను ఇంతగా భయాందోళనకు గురిచేసిన ఫోన్కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
చెన్నై రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రధాన రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఓ రైలును బాంబులతో పేల్చేస్తామని ఆగంతకులు ఫోన్ చేయడంతో కలకలం రేగింది. పోలీసులు రంగంలోకి విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందం రైల్వే స్టేషన్ లో అణువణువు తనిఖీ చేస్తున్నారు. బాంబు బెదిరింపుతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. బాంబు ఎక్కడ పెట్టారోనని వారంతా భయపడుతున్నారు. -
మదురై మీనాక్షి ఆలయానికి బాంబు బెదిరింపు
ప్యారిస్: మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన బాంబు బెదిరింపుతో కలకలం రేగింది. తేని జిల్లా పెరియకుళంకు చెందిన యువకుడి సెల్ఫోన్కు శనివారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి తన సెల్ఫోన్ నుంచి స్కైప్ ద్వారా మాట్లాడారు. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో కొంత సేపటిలో బాంబు పేలుతుందని తెలిపి ఫోన్ కట్చేశాడు. ఆందోళన చెందిన ఆ యువకుడు తేని ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించాడు. తేని పోలీసులు మదురైలో ఉన్న ఆలయ నిర్వాహకం, సీబీసీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబు స్క్వాడ్ నిపుణులు, జాగిలాలతో ఆలయానికి చేరుకున్నారు. అక్కడ మీనాక్షి అమ్మవారి ఆలయం లోపల, ఆలయం బయట రెండు గంటల సేపు తనిఖీల్లో నిర్వహించారు. బాంబు ఉన్నట్లు ఆచూకీ కనిపించకపోవడంతో అది బాంబు బూచి అని తెలిసింది. శనివారం ఆడి అమావాస్య రోజు కావడంతో ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చారు. తనిఖీల సమయంలో భక్తులను లోపలికి అనుమతించ లేదు. తనిఖీలు పూర్తయిన తర్వాతనే భక్తులను అమ్మవారి దర్శనార్థం ఆలయంలోకి అనుమతించారు. బాంబు బెదిరింపు ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు ఆలయ భద్రతను మరింత పటిష్ఠం చేశారు. -
ప్రశాంతి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు
విశాఖపట్నం: విశాఖపట్నం-బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులు వచ్చాయి. దీంతో శనివారం మధ్యాహ్నం దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు ఆపివేశారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి రైల్లో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.