City plus
-
షాహీ నాష్టా.. నోరూరించే నిజాంల నాటి వంటకాలు
షాహీ నాష్టా.. అంటే నిజాం కాలంలో ఉదయం పూట అల్పాహారం. పాయారోటీ, గుర్దాభాజీ, ఖీమారోటీ, ఖిచిడీ ఖీమాలాంటి పదార్థాలను నిజాములు అల్పాహారంగా సేవించేవారు. నిజాముల కాలం నాటి వంటకాలు కొన్ని నేటికీ ప్రజాదరణలో ఉన్నాయి. క్రమేణా ఈ వంటకాలన్నీ పాతబస్తీ హోటళ్లు, సికింద్రాబాద్లోని ఒకటి రెండు హోటళ్లలో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో నగరంలో నాన్వెజ్ బ్రేక్ఫాస్ట్ అందించే రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతోంది. జంటనగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో నాన్వెజ్ అల్పాహార వంటకాల కోసం ఉదయం పూట వందలాది మంది వేచి చూస్తారంటే అతిశయోక్తి కాదు. – సికింద్రాబాద్వయసుతో పని లేకుండా... ప్రతిరోజు 6 గంటల నుంచే వేడివేడిగా మాంసాహారపు వంటకాల అల్పాహారాలను రెస్టారెంట్ల నిర్వాహకులు సిద్ధంగా ఉంచుతున్నారు. భాజీగుర్దా, ఖీమా కర్రీ, పాయ వంటి పురాతన వంటకాలతోపాటు చిల్లిగారె, పూరి, ఇడ్లీ, వడ, దోశ, రాగిముద్ద వంటి బ్రేక్ఫాస్ట్ను చికెన్, మటన్తో కూడిన వివిధ వంటకాలతో రడీగా ఉంచుతున్నారు. మరికొన్ని హోటళ్లు అయితే ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకూ నాన్వెజ్ వంటకాలను అందుబాటులో ఉంచుతున్నారు. రాత్రి 12 గంటల లోపే నాణ్యమైన మాంసం, అవసరమైన ఆకుకూరలు, మసాలాలను సిద్ధం చేసుకుని తెల్లవారుజామున ఒంటిగంట, రెండు గంటల ప్రాంతంలో వంటలు ప్రారంభిస్తున్నారు. ఉదయం 5 గంటలకు రెస్టారెంట్లను తెరిచి పూరి, రోటీ ఇతర టిఫిన్లతో కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు.వయసుతో పని లేకుండా... ఉదయం వేళల్లో చోటా ఆరగించేవాళ్లలో అన్ని వయస్కుల వాళ్లూ కనిపిస్తున్నారు. 18 ఏళ్ల నవయువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకూ ఈ టిఫిన్లు ఆరగిస్తున్నారు. కేవలం నాన్వెజ్ కర్రీతో ప్రత్యేకంగా లభించే టిఫిన్లు ఆరగించడం కోసం వచ్చే వాళ్లు మిత్రులుగా మారిన వారూ ఉంటున్నారు. నాన్వెజ్ టిఫిన్లు సేవించేవారు మైదానాల్లోనే మిత్రులుగా మారుతున్నారు. కొందరు ఐతే ఏకంగా నాన్వెజ్ టిఫిన్స్ కోసం చాట్ గ్రూప్స్ మెయింటెన్ చేస్తున్నారు. వారాంతాల్లో జాతరే!రోజు రోటీ, ఇతర టిఫిన్లు తినేందుకు నాన్వెజ్ టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్ల వద్ద కస్టమర్లు బారులు తీరుతున్నారు. శని, ఆదివారం వచి్చందంటే చాలు మాంసాహార టిఫిన్సెంటర్ల ముందు జాతర కనిపిస్తుంది. భాజీగుర్దా.. ఖీమాతో రోటీపాటు, ఇడ్లీ, వడ, దోశ వంటి అల్పాహారాలు కూడా మాంసం కూరలతో తినేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కస్టమర్లతో రెస్టారెంట్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. మార్నింగ్ వాకర్లు, స్మిమ్మర్లు, జిమ్కు వెళ్లేవాళ్లు, క్రికెటర్లు వారాంతపు రోజులు, సెలవు దినాల్లో వ్యాయామం ముగించుకున్నాక నేరుగా మాంసాహార టిఫిన్ సెంటర్ల వద్దకు చేరుకుంటారు. వీళ్లే కాకుండా పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా సెలవు దినాల్లో నాన్వెజ్ టిఫిన్స్ ఆరగించేందుకు ఉవి్వళ్లూరు తున్నారు. -
అమెరి‘ఖానా’...
అమెరికా కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ గ్రూప్ ‘చిలీస్’ నగరంలో తన రెండవ శాఖను ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్, రోడ్నెం..1లోని జలగం వెంగళరావు పార్క్ ఎదురుగా నెలకొల్పిన ఈ రెస్టారెంట్ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటి షామిలి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ అశీష్ సక్సేనా మాట్లాడుతూ హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ తర్వాత బంజారాహిల్స్లో రెండవ శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దీనితో భారత్లో తమ బ్రాండ్ 8 శాఖలు నెలకొల్పినట్టయిందన్నారు. అమెరికాలో అమితాదరణ కలిగిన టెర్లింగ్వా చిలి, బోంబే బర్గర్, ఒరిజినల్ బార్బెక్యూ రిబ్స్, చీజ్ క్యూసొదిల్లాస్, చెర్రీ కోలా.. వంటి రుచులు హైదరాబాదీలను సైతం అమితంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. - సాక్షి, లైఫ్స్టైల్ ప్రతినిధి -
హాయ్..నేను జ్యోతిలక్ష్మిని..
తాను ఎక్కడికి వెళ్లినా జ్యోతిలక్ష్మి వచ్చిందంటున్నారని, ఇది తనకెంతో ఆనందంగా ఉందని కథానాయిక చార్మి పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హల్లో వంశీ ఇంటర్నేషనల్-వంశీ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ‘ జ్యోతిలక్ష్మీ’ చిత్ర యూనిట్కు అభినందన సభ నిర్వహించారు. ఇందులో హీరోయిన్ చార్మి మాట్లాడుతూ.. మహిళలను తోటి మహిళ గౌరవించే సంస్కృతి వస్తే మిగతా వారు గౌరవిస్తారన్నారు. పురుషుడి అండ ఉంటే మరింత ప్రగతి సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా చార్మి, హీరో సత్య, చిత్ర బృందంపై పూలవాన కురిపించారు. నిర్మాత సి.కల్యాణ్, సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు, టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి, రచయిత్రి కేబీ లక్ష్మి, జీవీఎల్ఎన్ రాజు, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, వంశీ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, ప్రధాన కార్యదర్శి సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు. - సాక్షి,సిటీబ్యూరో -
సమాజ సేవలో.. నేనున్నానని..
హీరో అంటే.. వందమందిని ఇరగదీయాలి. డ్యూయెట్లు పాడాలి. తనవారి కోసం విలన్ను ఎదిరించి నిలవాలి.. ఇది ‘రీల్ హీరో’ సంగతి. మరి నిజ జీవితంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవారు.. తనకన్నా సమాజం కోసం పాటుపడేవారు.. ‘రియల్ హీరో’ అవుతారు. ఈ కోవకు చెందిన వ్యక్తే వేణు శ్రావణ్. వెండి తెరపై హీరో కావాలన్న కలతో సిటీకి వచ్చిన అతడు పేదల సాయంలో నిమగ్నమయ్యాడు. ఓ పక్క రేడియో జాకీగా, మరోపక్క బుల్లితెర నటుడిగా కొనసాగుతున్నాడు. తాను సేకరించిన పాత, కొత్త దుస్తులను ఆదివారం ధర్నా చౌక్లో పేదలకు పంచాడు. వారికి భోజనం సైతం పెట్టాడు. ఈ సందర్భంగా అతడిని ‘సాక్షి’ పలకరిస్తే ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన మాటల్లోనే.. - సాక్షి,సిటీబ్యూరో అలా ‘చలో హైదరాబాద్’ ‘మాది ఖమ్మం జిల్లాలోని బ్రాహ్మణపల్లి. డిగ్రీ వరకు ఖమ్మంలోనే చదువుకున్నాను. పాఠశాల, కళాశాల రోజుల్లో నాటకాలు వేశాను. అలా సినిమా హీరో కావాలనుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఇండస్ట్రీని ఇరగదీయాలని చలో హైదరాబాద్ అన్నా. భాగ్యనగరంలో కొన్నాళ్లు టీచరుగా పనిచేశాను. తర్వాత రెయిన్బో ఎఫ్ఎంలో ఆర్జేగా మారాను. మరో పక్క ‘విధి, రాధా-మధు, చక్రవాకం, ఆమె, శుభలగ్నం’ వంటి సీరియల్స్లో నటించాను. ఇదే సమయంలో యాంకర్ గానూ చేస్తున్నా. తర్వాత సమాజంలో ఒక్కో ఘటనతో ఒక్కో అనుభవం. దీంతో ఆశయం ముందు హీరో కావలన్న ఆశ చిన్నదైపోయింది. అలా పుట్టుకొచ్చింది ‘కలర్స్’ ‘కొన్నాళ్ల క్రితం వృద్ధుల దినోత్సవం రోజు నిజాంపేట్లోని ఓ వృద్ధాశ్రమంలో ఈవెంట్ కోసం యాంకర్గా వెళ్లాను. ఆరోజు ఉదయం నుంచి తమ బిడ్డల కోసం వృద్ధులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంత సేపటికీ వారు రాలేదు. నా వాక్ చాతుర్యంతో వారిని ఆడించి మెప్పించాను. వారు నన్ను నిజమైన బిడ్డవంటూ ముద్దాడారు. ఒకసారి చిన్న బాబుకి లివర్ ఆపరేషన్ చేయాలి. ఖమ్మంకు చెందిన దంపతులిద్దరూ నా రూములో 15 రోజులు ఉన్నారు. ‘సాక్షి చానెల్’ వారిని సంప్రదిస్తే బాబు సమస్యను టీవీలో టెలికాస్ట్ చేశారు. దీంతో రూ.14 లక్షలు పోగయ్యాయి. ఆ డబ్బుతో ఆ బాబు బతికాడు. సమయానికి సరైన సాయం అందక చాలామంది పేదలు కష్టాలు పాలవుతున్నారు. చర్లపల్లి జైల్లో కార్యక్రమాలు చేశా. క్షణికావేశంతో చేసిన తప్పులకు నేరస్తులు జైల్లో ఉంటే వారి కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో తెలుసుకున్నా. ఇలాంటి వారికి సాయం చేయాలనుకున్నా. ఇందుకోసం డబ్బు కావాలి. ఇందుకు 2013లో ‘కలర్స్ సర్వీస్ అండ్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో సంస్థను స్థాపించా. దీనిద్వారా లైవ్ షోలు చేసి విరాళాలు సేకరిస్తున్నా. ఫేస్బుక్ స్నేహితులతో మాట్లాడి ఆదివారాల్లో ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేస్తున్నా. ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే నాకు ముఖ్యం’.. అని ముగించాడు. -
దత్తతకు పిల్లలు కావలెను..!
లైఫ్ ఛేంజ్ ఎఫెక్ట్ సిటీలో పెరుగుతున్న సంతానలేమి జంటలు దత్తత కోసం శిశువిహార్కు దరఖాస్తుల వెల్లువ ఎదురు చూపుల్లో వెయ్యికి పైగా జంటలు ఆలస్యపు పెళ్లిళ్లు.. మారిన జీవనశైలి.. రోజంతా పని ఒత్తిడి.. ఆపై అధిక బరువు.. వెరసి నవ దంపతుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా సంతానం కలగక పోవడంతో తోడు కోసం అనాథ పిల్లలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దత్తతకు పిల్లలు కావాలని కోరుతూ ఇప్పటికే అనేక మంది శిశువిహార్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, వారికి పిల్లలు మాత్రం దొరకడం లేదు. ఏడాది లోపు బిడ్డ కావాలంటే సుమారు ఆరేళ్లు ఆగాల్సి వస్తోంది. దీంతో చాలామంది దంపతులు ఆందోళన చెందుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో కప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాదిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. అధిక పని ఒత్తిడితో పాటు ఉష్ణోగ్రతలకు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. ఆకలి తీర్చుకునేందుకు పిజ్జాలు, బర్గర్లతో కడుపు నింపుకోవడంతో స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు భార్య ఒక షిఫ్ట్.. భర్త మరో షిఫ్ట్లో ఆఫీసుకు వెళ్తుండడం వల్ల వారు కనీస దాంపత్యానికి నోచుకోలేకపోతున్నారు. వీకెండ్లో పార్టీల పేరుతో మద్యం తీసుకోవడం వల్ల శృంగార సమస్యలు తలెత్తుతున్నాయి. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (ఐవీఎఫ్), ఇంట్రాసైటో ప్లాస్మి క్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) చికిత్సలు సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే అంశంపై 2013లో నగరానికి చెందిన ఇద్దరు దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్తో పాటు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను ఆశ్రయించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటిరిగా జీవించలేక, పిల్లలపై మమకారం చంపుకోలేక అనాథలను దత్తత తీసుకునేందుకు దంపతులు ముందుకు వస్తున్నా, పిల్లలు దొరకని పరిస్థితి తలెత్తింది. దత్తతకు ఆరేళ్లు ఆగాల్సిందే.. గతంతో పోలిస్తే దంపతుల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి. ఆడపిల్లలు భారమని భావించే రోజులు పోయాయి. శిశు విహార్లో పిల్లలను దత్తత తీసుకుంటున్న దంపతుల జాబితాను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. ప్రస్తుతం పిల్లల కోసం 1100 మందికిపైగా ఎదురు చూస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆడశిశువు కావాలంటే కనీసం మూడేళ్లు సమయం పడుతుండగా, మగ శిశువుకు ఐదు నుంచి ఆరే ళ్లు పడుతోంది. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నా.. అది కూడా గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే గత పదమూడేళ్లలో శిశువిహార్ ద్వారా మొత్తం 2047 మందిని దత్తత ఇవ్వడం గమనార్హం. ఐటీ అనుబంధ ఉద్యోగుల్లో అధికం నగరంలో 30కి పైగా ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా, మా ఆస్పత్రికి ప్రతి రోజూ సగటున 30 కేసులు వస్తున్నాయి. వీరిలో అధిక శాతం ఐటీ, కాల్ సెంటర్స్, మీడియా అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న దంపతులే. ముందు వీరికి పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తాం. తొలుత మందులతో ప్రయత్నిస్తాం. అయినా ఫలితం లేకపోతే ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి కృత్రిమ పద్ధతుల్లో టెస్ట్ట్యూబ్ బేబీకి సిఫారసు చేస్తాం. చిన్న వయసులోనే మోనోపాజ్ వస్తుండటం వల్ల నగరంలో చాలా మంది రెండో సారి గర్భధారణకు నోచుకోవడంలేదు. - డాక్టర్ చందన, నోవా ఇన్ఫెర్టిలిటీ సెంటర్ -
ఆలోచింపజేసే రేపేంటి?
పర్యావరణాన్ని కాలుష్యం చేస్తే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? పాలిథిన్ కవర్ల బదులు పేవర్ కవర్లు వాడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టితో చేసిన వినాయకులే ఎంతో మేలని.. ఇంకుడు గుంతలు ఉపయోగకరమని.. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆత్మహత్యలు ఉండవని అంటున్నారు సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) సంస్థ ప్రతినిధులు. ప్రతి ఒక్కరూ నేల తల్లి పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్రాం. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన రేపేంటి? ఎంతో ఆలోచింపజేసింది. ప్రకృతి సేద్యం కోసంఅరకిలో వరి విత్తనాలు ఉచితంగా ఇవ్వనున్నామని, పేపరు బ్యాగులు, మట్టి వినాయకులు, సీడ్బాల్, ఇంటి పంటపై ఇందిరా పార్కు వద్ద శని, ఆదివారాల్లో కూడా ప్రదర్శన నిర్వహించడంతో పాటు ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తామని విజయ్రాం చెప్పారు. -దోమలగూడ -
శారీలో శ్రావ్యం..
తరాలు మారినా చీరకట్టుకు ఆదరణ తగ్గదని, చీరకట్టుతో వచ్చే అందం మరే వస్త్ర సౌందర్యంలో రాదని ‘కాయ్ రాజా కాయ్’ కథానాయిక శ్రావ్య అన్నారు. శుక్రవారం ఆమె బషీర్బాగ్లో అవంతి స్కిల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షోరూంలోని వస్త్ర అందాలను తిలకించారు. భారతీయ సంస్కృతిలో చీర కట్టుకు విడదీయరాని బంధమని, తాను ఎక్కువగా చీరలనే ఇష్టపడతానని పేర్కొన్నారు. అనంతరం అవంతి స్కిల్స్ నిర్వహకులు మహేష్ అవస్తి, మాట్లాడుతూ హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తి, హోల్ సెల్ రంగంలో 20 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఈ షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన కళాంకారి, హ్యాండ్ పెయింటింగ్, బాతిక్, బనారస్, మహేశ్వరి వంటి రకాలు అందుబాటులో ఉంటాయన్నారు. -హిమాయత్నగర్ -
రంగుల డాన్...
మురిపించెన్.. ఓ ఊసరవెల్లి చెట్టుపై నుంచి కిందకు దిగి ఠీవీగా లాన్లో నడుచుకుంటూ వెళ్తోంది.. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు, స్థానికులు దాన్ని చూశారు. చూడముచ్చటగా ఉండటంతో దాంతో కాసేపు ఆడుకున్నారు. ఫొటోలు తీసుకున్నారు. అనంతరం దాన్ని ఓ డబ్బాలో బంధించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్లోని కృష్ణకుంజ్ గార్డెన్లో చోటుచేసుకున్న ఈ దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి. ఫొటోలు: దశరధ్జ్రువా -
కాన్వాసుపై చారిత్రక పండగ
♦ తెలంగాణ సంస్కృతిని చాటుతున్న చిత్రకారులు ♦ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్ ఇద్దరు చిత్రకారులు.. పేర్లు దేవేందర్గౌడ్, రామ్మోహన్. ఒకరిది మహబూబ్నగర్ జిల్లా బోయినపల్లి. మరొకరిది వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి. ఇద్దరిలోనూ కామన్గా ఉన్నది.. కళలపై మమకారం. ఇదే వీరిద్దరినీ కలిపింది. కలిసి కాన్వాసుపై తెలంగాణ చరిత్రను పరిచి.. సంస్కృతిని ఇనుమడింపజేస్తున్నారు. తెలంగాణ కల్చర్ను ప్రమోట్ చేసేందుకు దేశ పర్యటన చేపట్టారు. ఆయా రాష్ట్రాల్లో వారు తెలంగాణ ‘చిత్రాన్ని’ ఆవిష్కరిస్తున్నారు. తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని వీరు బంజారాహిల్స్లోని గ్యాలరీ స్పేస్ ఆర్ట్ గ్యాలరీలో ‘కాకతీయన్ హెరిటేజ్’ పేరుతో గ్రూప్ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్రకారులను ‘సాక్షి’ పలకరించినప్పుడు చిత్రాల చరిత్రను వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో ‘ఈ సిటీని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ నగరమే నా కళకు ప్రాణం పోసింది’ అని సంతోషంగా చెప్పారు దేవేందర్గౌడ్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తాలూకా బోయినపల్లి గ్రామానికి చెందిన ఈ చిత్రకారుడు.. మూడేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నారు. తెలంగాణ సంస్కృతిని, కాకతీయుల పాలనలో వెలసిన చారిత్రక కట్టడాల గొప్పతనాన్ని చాటేందుకు ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా అవతారమెత్తారు. పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన మరో ఆర్టిస్టు రామ్మోహన్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచీ వరంగల్లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను వెళుతుండేవాడిని. కుంభమేళా తర్వాత అంత పెద్దగా జనాలు వచ్చే ఈ జాతర ప్రత్యేకతను నలుగురికీ చెప్పాలనుకున్నా. అందుకు కుంచె పట్టా’ అని చెప్పారు. కళే కలిపింది ఇద్దరిని.. ‘మా ఇంట్లో నేను చిన్నోడిని. మా నాన్న ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. చిన్నప్పటి నుంచి నాకు కళలపై ఉన్న ఆసక్తి కుంచె పట్టేలా చేసింది. అలా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి బీఎఫ్ఏ చేశా. ఇదే సమయంలో నాకు దేవేందర్ గౌడ్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు ఒక్కటే. ఓసారి సమ్మక్క-సారలమ్మ జాతరను చూశాం. అప్పటి నుంచే మన తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ఫిక్స్ అయిపోయాం’ అని చెప్పుకొచ్చారు రామ్మోహన్. ఢిల్లీలో కూడా చేశాం.. ‘తెలంగాణ కల్చర్ను ప్రమోట్ చేసేందుకు ఢిల్లీలోని ఆలిండియా ఫైన్ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీలో ఇప్పటికే ఎగ్జిబిషన్ చేశాం. తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని మరికొన్ని కొత్త పెయింటింగ్స్తో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. మన తెలంగాణలోనైనా మన చారిత్రక కట్టడాలకు తగిన గుర్తింపు లభిస్తుందని కోరుకుంటున్నా’మన్నారు ఈ కళా ద్వయం. ఓ కుంచెది ‘శిల ్ప’ చరిత్ర.. ‘800 ఏళ్ల క్రితం నాటి రామప్ప గుడి నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఇంత అద్భుత శిల్ప సంపద ఉన్నా అనుకున్నంత గుర్తింపు రాకపోవడం ఆలోచింపచేసింది. రామప్ప ఓ శిల్పి. కళాకారులకు కాకతీయులు గుర్తింపు ఇచ్చినా ఇప్పటివారు నిర్లక్ష్యం చేయడం బాధించింది. ఈ శిల్పాలు శివుని అనాటమీ (స్ట్రక్చర్).. విష్ణువు ఆకృతిని పోలి ఉంటాయి. రామప్ప గుడి శిల్ప సంపదను కళ్లకు కట్టినట్టు చూపేందుకు కుంచెను ఆయుధంగా వాడుకున్నా’ అని గర్వంగా చెప్పారు దేవేందర్గౌడ్. మరో కుంచెది ‘మహా జాతర’.. ‘భారతదేశంలో భారీగా భక్తులు హాజరయ్యేది కుంభమేళాకే. తర్వాత అంత భక్తజనం తరలి వచ్చేది ‘సమ్మక్క- సారక్క’ జాతరకే. తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు ఈ గిరిజన అక్కాచెల్లెళ్లు చూపిన తెగువను ప్రపంచమే చెప్పుకుంటుంది. మిగతా జాతర్లకు ఈ తిరునాళ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. మిగతా చోట్ల బంగారంతో మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ బెల్లాన్ని సమర్పిస్తుంటారు. ఇదే సీన్ను పెయింటింగ్ ద్వారా చూపించా. సమ్మక్క గద్దె, సారక్క గద్దెను చూస్తే అలానే నిలబడి చూడాలనిపిస్తునే ఉంటుంది. అందుకే ఆ చిత్రాలను గీశా’ అంటూ చెప్పారు రామ్మోహన్. -
దేహానికి సమ్మర్ గార్డ్స్
మండే ఎండల్ని ఇచ్చే ప్రకృతే వాటి నుంచి కాపు ‘కాచే’ కాయల్నీ మనకు ఇచ్చింది. అందుకేనేమో... వాటికి తమ పేరుకు (ఆంగ్లంలో) ‘గార్డ్స్’ను జత చేసుకున్నాయి. నగరంలో మండుతున్న వేసవి నుంచి సిటీజనుల్ని రక్షించేందుకు అందుబాటులోనే ఉన్న కొన్ని కూరగాయలు తీసుకుంటే చాలంటున్నారు వైద్యులు. కూల్ డ్రింక్స్నో, మరో కృత్రిమ పానియాలనో ఆశ్రయిస్తూ ఎండ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. వాటికి బదులు కొన్ని రకాల కూరగాయల్ని ఆహారంలో భాగం చేయడం ద్వారా మండే ఎండల్నీ చల్లగా సాగనంపవచ్చని నగరానికి చెందిన పలువురు పోషకాహార నిపుణులు చెబుతున్నారు. - సాక్షి, లైఫ్స్టైల్ ప్రతినిధి బిట్టర్ గార్డ్ ఇది సమ్మర్ నుంచి రక్షించే ‘బెటర్ గార్డ్’. కాకర కాయగా మనకు అత్యంత చిరపరిచితమైన ఈ కూరగాయ వేసవికి తోడు పని ఒత్తిడి కారణంగా తలెత్తే హైపర్ టెన్షన్ను నివారిస్తుంది. సీజనల్గా ఏర్పడే పుండ్లు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్ వార్మ్ వంటి వాటిని అదుపు చేయడంలో సహకరిస్తుంది. డయాబెటిస్ నియంత్రణకు ఇది చక్కని ఆహారం. స్నేక్ గార్డ్ పేరులో పామున్నా.. స్నేక్ గార్డ్.. తెలుగులో పొట్లకాయగా మనకు చిరపరిచితమే. ఇది దేహానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. వేడిమి కారణంగా పేరుకుంటున్న పొడి తత్వాన్ని దూరం చేసి శరీరంలో ఫ్లూయిడ్స్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీర విధి నిర్వహణ సాధారణంగా జరిగేలా దోహదపడుతుంది. యాష్ గార్డ్ పేరులో బూడిద ఉన్నా తీరులో బంగారం అనిపిస్తుంది యాష్గార్డ్.. అదే బూడిద గుమ్మడికాయ. దేహాన్ని చల్లగా ఉంచి వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది దాదాపు 96 శాతం నీటిని కలిగి ఉంటుంది. విటమిన్- బి,ఎ (థయామిన్), బి3 (నియాసిన్)ను పుష్కలంగా అందిస్తుంది. దీనిలోని హై పొటాషియం రక్తపోటు సరైన క్రమంలో ఉండేలా చూస్తుంది. కిడ్నీలో రాళ్లు వంటి సమస్యల నివారణకు మంచి మందు. రిడ్జెడ్ గార్డ్ బీరకాయనే ఆంగ్లంలో రిడ్జెడ్ గార్డ్ అంటారు. ఇది రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. వేసవి కారణంగా తలెత్తే జీర్ణకోశ వ్యాధులకు చక్కని పరిష్కారం చూపుతుంది. బాటిల్ గార్డ్ అత్యధికంగా నీటి శాతాన్ని కలిగి ఉన్న బాటిల్ గార్డ్.. సొరకాయగా తెలుసు. ఇది మినరల్ వాటర్ బాటిల్స్ను మించిన పోషకాలను అందిస్తూ దేహానికి రక్షణగా నిలుస్తుంది. ఎండ కారణంగా కడుపులో తలెత్తే ఎసిడిటీ సమస్యకు సొరకాయ మేలైన పరిష్కారం చూపుతుంది. విపరీతమైన చెమట కారణంగా కోల్పోయే సోడియంను శరవేగంగా భర్తీ చేస్తుంది. అతి దాహాన్ని, అలసటను దూరం చేస్తుంది. -
నా భార్య నాకన్నా ఎత్తుంటే తప్పేముంది?
ఈడు జోడు మారింది చూడు కాంబినేషన్లో కొత్త మార్పులు ‘అమ్మాయి ఆకాశంలో ఉంటే వీడేమో భూమ్మీద. పెళ్లంటే ఈడూ జోడూ కుదరకపోతే ఎలా?’ ఇలాంటి ప్రశ్నలకు కాలం చెల్లింది. ఈతరహాపాత తరపు అభిప్రాయాలను పట్టించుకోని నవతరం.. ఈడు విషయంలో అబ్బాయి కన్నా అమ్మాయి చిన్నగా ఉండాలంటూ పెట్టిన ఆంక్షలను ఇప్పటికే స్పష్టంగా తిప్పికొట్టేసింది. అదే వేగంతో ఇప్పుడు జోడు విషయంలోనూ మార్పులకు సై అంటోంది. తనకన్నా ఎత్తున్న అమ్మాయిలను తలెత్తుకుని చూడడానికి మాత్రమే కాదు ఆమెతో కలిసి ఏడడుగులు నడవడానికి కూడా అబ్బాయిలు ముందుంటున్నారు. పెళ్లి అనే వ్యవస్థలో పురుషుడికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టిన సంప్రదాయం.. వయసులోనూ, ఆకారంలోనూ.. కూడా పురుషాధిక్యతకే పెద్ద పీట వేసింది. అమ్మాయికన్నా అబ్బాయి వయసు, ఎత్తు ఎక్కువుండాలని నిర్ధేశించింది. ప్రస్తుత తరం ఈ కాంబినేషన్ రూల్ని తోసిరాజంటోంది. హైటెక్కినా.. ఓకే ‘నా భార్య నాకన్నా ఎత్తుంటే తప్పేముంది? అందులో నాకు చిన్నతనం అనిపించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు పంజ గుట్టలో నివసించే మల్లీశ్వరరావు. తనకన్నా ఎత్తున్న శ్రీదేవిని ఆయన భార్యగా చేసుకున్నారు. ఈ విషయంలో ఆయన బంధువుల్లో కొందరు గుసగుసలాడకపోలేదు. అయితే దీన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ‘మాది చింతపల్లి అనే పల్లెటూరు. అక్కడ భార్యకన్నా భర్త ఎత్తు తక్కువ ఉండడం అనేది నవ్వుకునే విషయమే. అయితే ఇదంతా తొలినాళ్లలోనే. ఇప్పుడు వాళ్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మనసులు కలిసిన జంటలకు ఇవన్నీ చాలా చిన్న విషయాలు’అని చెప్పారాయన. అత్యాధునిక పోకడలను మోసుకొచ్చే ఫ్యాషన్ ర్యాంప్ మీద తరచూ మెరిసే సిటీ జంట ఆయేషా లఖోటియా, అజహర్ లఖోటియాలు సైతం ఈ విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోరు. ‘నా భార్య నాకన్నా హైట్ అనే విషయం నాకు గర్వంగానే అనిపిస్తుంది. నిజానికి షి ఈజ్ వెరీ గుడ్ లుకింగ్’ అంటారు అజహర్. ‘నేను హైట్ తక్కువున్నాను. నా కంటే తక్కువ హైట్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఇద్దరికీ పుట్టే పిల్లలు మరీ పొట్టిగా పుట్టే అవకాశముంది. అందుకే నాకన్నా రెండు అంగుళాలు ఎక్కువున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా’నన్నాడు శశాంక్. సినిమాలూ స్ఫూర్తి.. ‘నా హైట్ చూసి హీరోలు నా పక్కన నటించడానికి ఇబ్బంది పడుతున్నారు. అదే నాకు మైనస్ అయింది’ అంటూ వాపోయింది కొంత కాలం క్రితం మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దీపికా పదుకునే వంటి పొడుగుకాళ్ల బ్యూటీతో షారూఖ్, రణవీర్సింగ్ తదితర హీరోలు, సోనాక్షి సిన్హాతో షాహిద్ కపూర్ హాయిగా జట్టు కట్టేస్తున్నారు. ఆమీర్ఖాన్ (5.6 ఫీట్స్) కత్రినాకైఫ్ (5.9 ఫీట్స్)తో జంటగా నటనను పండిస్తున్నారు. రియల్ లైఫ్లోనూ ఒకరికొకరు అంటుకు తిరిగే సల్మాన్ (5.7), కత్రినాకైఫ్లు ఈ తరహా కాంబినేషన్కు నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే బాట పట్టింది. కృతి సనన్ (5.9 ఫీట్స్) వంటి టాల్గాళ్తో నాగచైతన్య (5.7 ఫీట్స్) లాంటి కుర్ర హీరోలు హైట్ను పక్కన పెట్టి మరీ జోడి కట్టారు. ప్రముఖుల పెళ్లిళ్లూ... తనకన్నా వయసు, హైట్ కూడా ఎక్కువున్న అమ్మాయిని పెళ్లాడిన సచిన్ టెండూల్కర్ జంట కూడా ఈ విషయంలో యూత్కి ఇన్స్పిరేషనే. ‘నా భార్య నాకన్నా ఎత్తు ఎక్కువుండడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది’ అని చెప్పే రాజ్పాల్ యాదవ్ లాంటి బాలీవుడ్ నటులు ఈ తరహా ట్రెండ్కు ప్రమోటర్లుగా మారారు. ఇక సినీనటి దేవయాని, డెరైక్టర్ రాజకుమరన్ల జంట కూడా మరో ఎగ్జాంపుల్. రానున్న కాలంలో ఈడు జోడు అనేది రివర్స్ అయి అబ్బాయికన్నా అమ్మాయే ఎక్కువ వయసుండాలని, ఎత్తుండాలని కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పొడవుతో గుడ్ లుక్.. చిన్న తనం నుంచే పొడుగున్న అమ్మాయిలంటే ఇష్టం. వాళ్లలో కనబడే కాన్ఫిడెన్స్, గుడ్లుక్స్ బాగా ఇష్టం. అందుకేనేమో నాకన్నా ఎత్తుగా ఉందని అందరూ అంటున్నా వెనుకాడకుండా ఆయేషాని పెళ్లి చేసుకున్నాను. మీ వల్ల హైహీల్స్ వేసుకోవాలనే నా కోరిక తీరడం లేదు.. అంటూ ఆయేషా అనే సరదా మాటలు తప్ప మా మధ్య మరే సమస్య లేదు. - అజహర్ లఖోటియా ఆదివారం ఆర్గానిక్ సందడి ఆర్గానిక్ ఫ్రూట్స్, కూరగాయలు, ఇంట్లో చేసిన బ్రెడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్మేడ్ జ్యువెలరీ.. ఇలా ఎన్నో ఆదివారం అంగట్లో లభిస్తాయి. అలాగే టై గార్డెనింగ్, క్రియేటివ్ డిజైన్ స్పేస్ గురించి తెలుసుకోవచ్చు. బంజారాహిల్స్లోని లామకాన్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఇది కొనసాగుతుంది. వీర్దాస్ షో... ప్రసిద్ధ భారతీయ స్టాండప్ కమెడియన్ వీర్దాస్ నగరంలో తన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘అన్బిలీవబులిష్-ట్రూ వర్డ్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ఎ లయర్’ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శన ఆదివారం రాత్రి 8 గంటలకు శిల్పకళావేదిక లో ఉంటుంది. బాటిల్ ఆఫ్ బ్యాండ్స్.. నగరానికి చెందిన పలు రాక్ బ్యాండ్స్ పోటాపోటీగా తమదైన శైలి సంగీతంతో హోరెత్తిస్తూ సాగే బాటిల్ ఆఫ్ బ్యాండ్స్... కార్యక్రమం పంజాగుట్టలోని సెంట్రల్మాల్లో జరుగనుంది. ఈ బ్యాండ్స్ వార్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది. ఎంబ్రాయిడరీ వర్క్షాప్ బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు: మే 30, 31 ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్ ఉర్దూ గజల్స్కి ప్రాముఖ్యత ఎందుకు..! ఈ అంశం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం జూన్ 2న సాయంత్రం 7 గంటలకు లామకాన్లో జరగనుంది. హైదరాబాద్, లక్నోకి చెందిన ప్రముఖ ఉర్దూ ప్రొఫెసర్లు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. -
ఆర్ట్స్ ఆన్లైన్ - ఆర్ట్స్ ఆఫ్లైన్
మీరు చేసిన ఆర్ట్ వర్క్ ఆన్లైన్, ఆఫ్లైన్లో అమ్మటం ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ మీటప్ మీ కోసమే అంటున్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు. వివరాలు: ది గ్యాలరీ కఫే, బంజారాహిల్స్ రోడ్ నెం.10లో, ఉదయం 8.30కు -
లంబాడీ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్షాప్
బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు: మే 30, 31 ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్ -
బాటిల్ ఆఫ్ బ్యాండ్స్..
నగరానికి చెందిన పలు రాక్ బ్యాండ్స్ పోటాపోటీగా తమదైన శైలి సంగీతంతో హోరెత్తిస్తూ సాగే బాటిల్ ఆఫ్ బ్యాండ్స్... కార్యక్రమం పంజాగుట్టలోని సెంట్రల్మాల్లో జరుగనుంది. ఈ బ్యాండ్స్ వార్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది. -
వీర్దాస్ షో...
ప్రసిద్ధ భారతీయ స్టాండప్ కమెడియన్ వీర్దాస్ నగరంలో తన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘అన్బిలీవబులిష్-ట్రూ వర్డ్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ఎ లయర్’ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శన ఆదివారం రాత్రి 8 గంటలకు శిల్పకళావేదిక లో ఉంటుంది. -
క్లాసికల్ డ్యాన్స్తోనే భవిష్యత్తు..
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్ సాక్షి, లైఫ్స్టైల్ ప్రతినిధి : ‘ఏ డ్యాన్స్లో రాణించాలనుకున్నా ముందస్తుగా సంప్రదాయ నృత్యం సాధన చేయాల్సిందే. క్లాసికల్ డ్యాన్స్లో ప్రావీణ్యం సాధిస్తే ఏ డ్యాన్సయినా సులువుగా చేయవచ్చు. నృత్యంలో రాణించాలనుకున్నవారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని సూచించారు ప్రసిద్ధ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్. నగరానికి చెందిన ప్రసిద్ధ ఒడిస్సీ నృత్యకారిణి సోనాలి ఆచార్జీ మాదాపూర్లోని సోనాలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోడ్రన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సరోజ్ఖాన్ మాట్లాడుతూ తాను ప్రాథమికంగా క్లాసికల్ డ్యాన్సర్ని కాబట్టే విభిన్న రకాల పాటలకు నృత్యాలను అందించగలిగానన్నారు. అయితే ఇప్పుడు సినిమాల్లో వచ్చే డ్యాన్స్లు చూస్తుంటే అవేమిటో తనకే అర్థం కావడం లేదన్నారు. కొన్ని సినిమాల్లో కొరియోగ్రాఫర్తో సంబంధం లేకుండానే డ్యాన్స్లు చేసేస్తున్నారని, ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో పాటకు హీరోనే డ్యాన్స్ డెరైక్షన్ చేసేశాడని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో, పొట్టి పొట్టి దుస్తుల హీరోయిన్లతో పనిచేయలేకే బాలీవుడ్లో కొరియోగ్రఫీ చేయడం లేదన్నారు. హైదరాబాద్లో సోనాలితో కలిసి ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం సంతోషంగా ఉందంటూ ప్రతి 2 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి స్టూడెంట్స్ ప్రతిభను పరిశీలిస్తానని, అలాగే రానున్న దీపావళికి 11 రోజుల పాటు ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించి పెద్ద ప్రదర్శన నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాతపస్వి తెలుగు సినీ దర్శకులు కె.విశ్వనాథ్ మాట్లాడుతూ సంప్రదాయ నృత్యం, సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయన్నారు. సంగీతం, పాటలు తప్ప ఏముంటాయి ఆయన సినిమాలో అంటూ కొందరు విమర్శించినా... సిరిసిరిమువ్వ దగ్గర్నుంచి తన ప్రతి సినిమాలో వాటికే పెద్ద పీట వేశానని గుర్తు చేశారు. మన సంప్రదాయ మూలాల్ని మరిచిపోతే మనకంటూ ఉన్న గుర్తింపు కోల్పోతామని పిల్లలకు ఈ విషయంలో అవగాహన పెంచాల్సిన బాధ్యత పెద్దలదేనన్నారు. ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు సోనాలి మాట్లాడుతూ సంప్రదాయ ఒడిస్సీతో పాటు బాలీవుడ్ నృత్యాల్లో కూడా తాము శిక్షణ అందిస్తామన్నారు. -
సమర మే చేద్దామిలా..
సూర్య@42.9 నిన్నా మొన్నటి దాకా కాస్త చూసీ చూడనట్టు ఉన్న సూరీడు.. ‘మే’ నెల, రోహిణీ కార్తె రోజుల్లో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. కేవలం 4 రోజుల్లో అమాంతం పెరిగిన ఎండలు.. నగరవాసిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండలను ఎదుర్కోవడంలో మనకి తోడ్పడేందుకు వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్లు విలువైన సూచనలు అందిస్తున్నారు. - సాక్షి, లైఫ్స్టైల్ ప్రతినిధి గ్రీష్మ భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రెండు రోజులుగా నగరంపై విరుచుకు పడుతున్నాడు. ఉదయం నుంచే తన విశ్వరూపం చూపుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాడు. ఎండలు ఒక్కసారిగా పెరగడంతో సిటీజనులు అల్లాడుతున్నారు. నీడ లేకుండా క్షణం నిలవలేకపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వెళ్లినా గొంతు తడుపుకొనే మార్గం కోసం వెదుకుతున్నారు. బుధవారం ఎండకు తట్టుకోలేక ప్రజలు పడే పాట్లు ఇలా ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. దాహమేస్తే ఇలా.. మూలు రోజులకన్నా ఈ సీజన్లో కనీసం 3 రెట్లు నీళ్లు అధికంగా తీసుకోవాలి. పళ్ల రసాలు, మజ్జిగ, రాగి మాల్ట్, నిమ్మరసం వంటివన్నీ ఉపయుక్తమైన ద్రవాహారాన్ని అందించేవే. ఫ్రిజ్ నీటిని తాగకుండా కుండలు, కూజాలే ఉత్తమం. విపరీతమైన దాహం వేసే వరకూ ఆగకుండా ఈ సీజన్లో తరచుగా నీరు, బార్లీ వంటి ద్రవాహారం తీసుకుంటుండాలి. సహజాహారమే సరైంది.. వేసవికాలం రుచికరమైన, ఆరోగ్యకరమైన సీజనల్ ఫ్రూట్స్కి విడిది. యాంటీ ఆక్సిడెంట్స్ నిండిన తాజా పండ్లు, కూరగాయలు దేహాన్ని చల్లబరచడంలో, విటమిన్లు, మినరల్స్ను అందించడంలో ఉపకరిస్తాయి. వీటిలో.. బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ బెర్రీస్, బొప్పాయి, పచ్చి మామిడి, చెర్రీస్, యాపిల్, పుచ్చకాయ, ఉసిరి.. వంటివి విరివిగా ఉపయోగించడం మంచిది. కూరగాయల్లో కాకరకాయ, క్యాబేజి, కాలిఫ్లవర్, బ్రాక్కొలి, దోస, గ్రీన్బీన్స్, ఆస్పారెగస్, అల్ఫా అల్ఫా, పెద్ద వంకాయ, ఐస్బర్గ్, పుదీనా... వంటివి నీటి పరిమాణాన్ని దేహంలో సమపాళ్లలో ఉంచేందుకు ఉపకరిస్తాయి. మాంసాహారం పరిమితం చేయాలి. చెమట కారణంగా కోల్పోయే శక్తిని సులభంగా పొందేందుకు ప్రోటీన్ షేక్స్ తీసుకోవచ్చు. ఓట్మీల్, బ్రౌన్ రైస్, తియ్యటి బంగాళ దుంపలు ఆహారంలో భాగం చేస్తే బెటర్. ఆహారంతో ఓ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్సీడ్ ఆయిల్ను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కలిపి తీసుకుంటే దేహానికి అవసరమైన ఫాటీ యాసిడ్స్ అందుతాయి. స్నానమే పరిష్కారం.. చమట పూర్తిగా ఆరాక మాత్రమే స్నానం చేయాలి. కనీసం రోజుకు 2 లేదా వీలైతే 3 సార్లు స్నానం, దీనికి వినియోగించే నీళ్లలో రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ లాంటి మెడికేటెడ్ ఉత్పత్తులు కలపడం మేలు. ఉదయపు స్నానం వంట్లో బడలికను పోగొట్టి హుషారుగా చేసేందుకు సహకరిస్తే, రాత్రి వేళ స్నానం మలినాలను తొలగించి చక్కని నిద్ర కు తోడ్పడుతుంది. మంచి నిద్ర మజిల్ పునరుత్తేజానికి అవసరం. ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే చన్నీళ్ల స్నానం బెటర్ అంటున్నారు కేర్ క్లినిక్స్కు చెందిన ‘ఫిజియో’ శశిశేఖర్. మేలైన మార్గం యోగా వేసవిలో యోగా చాలా మంచిదని కపిలమహర్షి యోగా రీసోర్స్ సెంటర్కు చెందిన యోగా నిపుణులు సి.ఎస్.రావు చెబుతున్నారు. సూర్య నమస్కారం 12 భంగిమలు లెక్కిస్తూ చేయాలి. భంగిమకి 5 సెకన్లు చొప్పున కేటాయిస్తూ ఓ నిమిషం సమయంలో పూర్తి చేయాలి. వేసవి కాలానికి తగ్గట్టుగా నిదానంగా చేసే ఈ సూర్య నమస్కారాలను రోజులో 6 సార్లు ఆచరిస్తే వేసవి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఉష్ట్రాసనం, భద్రాసనం, ఏకన్ముక్తాసనం, శశాంకాసనం, అర్ధకోణాసనం, ప్రశాంతాసనం, యోగనిద్ర, షణ్ముఖి ముద్ర ఆసనాలు కూడా మంచివే. నేలపై కూర్చుని, పడుకుని చేస్తూ ఒక ఆసనం లోంచి మరో ఆసనంలోకి మారేటప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ రెండు శ్వాసల వ్యవధి ఉండేలా చూడాలి. శీతలి, ఉజ్జయి, చంద్రఖేధిని, నాడిశోధన చేయడం ద్వారా ఎండ వేడిమి వల్ల కలిగే శారీర క ఇబ్బందులన్నింటినీ అధిగమించవచ్చు. -
పెయింటింగ్ వర్క్షాప్
ఆలోచనలకు రంగులద్ది, చక్కటి పెయింటింగ్స్ వేయాలని అనుకునే వారికోసం సికింద్రాబాద్లోని అవర్ సాక్రెడ్ స్పేస్లో వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో జరిగే వర్క్షాప్ చిత్రలేఖనంలో బేసిక్స్ తెలుసుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం. వాటర్ కలర్స్ను వాడుతూ అందమైన ఊహలకు రూపమివ్వడానికి ఉపకరించేలా ఇది కొనసాగుతుంది. -
‘పర్సనల్ సేఫ్టీ’పై అవగాహన
పిల్లలు, పెద్దలకు వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన కలిగించేందుకు ఈనెల 16న సాయంత్రం 4.30 గంటలకు బంజారాహిల్స్ లామకాన్లో చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలోచనా విధానాలు, యంత్రాంగాలు ఇలా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని కోణాలపై చర్చించనున్నారు. పిల్లల భద్రత గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సిద్ధంగా ఉన్న టీనేజర్, యంగ్స్టర్, పేరెంట్స్ అందరూ ఈ చర్చలో పాల్గొనవచ్చని కార్యక్రమ నిర్వాహకులు మిహిరా అపరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 15 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం. తబలా క్లాసెస్ సుహాస్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి 11 వరకు బంజారాహిల్స్ లామకాన్లో తబలా శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. -
ఫ్లాట్ డిస్కౌంట్
సిటీలోని బ్రాండ్ ఫ్యాక్టరీ ఫ్లాట్ 40 శాతం రాయితీని ప్రకటించింది. పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన అన్ని వస్త్రాలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. స్పోర్ట్స్ షూస్, లగేజి, ఉమెన్ హ్యాండ్ బాగ్స్కు కూడా వర్తించే ఈ డిస్కౌంట్ ఈనెల 15 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుంది. యునెటైడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్, కలర్ ప్లస్, జాన్ ప్లేయర్, పార్క్స్, పార్క్ అవెన్యూ, రేమండ్స్, మినరల్, లీ, రాంగ్లర్, నైకీ, పూమా, జీని అండ్ జానీ తదితర బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయని బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రతినిథి రాక్ డిసౌజా తెలిపారు. -
హోటల్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణ
హయత్నగర్: నిథం-ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాసై, 18-30 సంవత్సరాల వయసుగల వారు దరఖాస్తులు చేసుకోవాలని వారు తెలిపారు. వివరాలకు 9959173183, 9989313278 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
ఆన్లైన్ మార్కెటింగ్ కోర్సు
ఆన్లైన్ మార్కెటింగ్ మెళకువలను నేర్పేందుకు ఈనెల 18 నుంచి కొత్త బ్యాచ్ను ప్రారంభిస్తోంది మాదాపూర్లోని డిజిటల్ మార్కెటింగ్ సంస్థ. ఇప్పటికే బిజినెస్ రంగంలో ఉన్నవారితో పాటు గృహిణులు, స్టార్టప్ యజమానులు, ఎంటర్ప్రెన్యూర్స్, మేనేజ్మెంట్ స్టడీస్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్కు ఈ ఆన్లైన్ మార్కెటింగ్ లాభదాయకమని సంస్థ తెలిపింది. డిజిటల్ మార్కెటింగ్లో వస్తున్న నయా ట్రెండ్ విషయాలను చెప్పేందుకు ఫ్రీ డెమో క్లాస్లను నిర్వహిస్తోంది. ఆసక్తి గలవారు 088015 66566 నంబర్లో సంప్రదించవచ్చు. -
నా ప్రతి అడుగులో అమ్మ ఉంది..
‘శాంత బయోటెక్’ ఫౌండర్గా పరిచయం అవసరంలేని ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త వరప్రసాద్ రెడ్డి. ఎన్ని పదవులు వరించినా.. ఎంత పెద్ద హోదాలో ఉన్నా అమ్మకు నచ్చిన తనయుడిగా ఉంటే చాలనుకునే వరాల పుత్రుడు ఆయన. తాను ఎదిగిన ప్రతి మలుపులో అమ్మ తోడ్పాటు ఉందని.. అమ్మ పుట్టిన రోజును (మే 9) ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నారాయన. ‘నాఎదుగుదలకు కారణం అమ్మ’ అని ఆయనంటే.. ‘నేనేం చేసానయ్యా నీకు జన్మతహా వచ్చింది.. సాధించావు’.. అంటుందా తల్లి. మాతృదినోత్సవం సందర్భంగా ఆ తల్లి, తనయుల మాటలు.. ‘ఇంట్లో స్త్రీ చదువు, సంస్కారవంతమైనది అయితే ఆ ఇంట్లో అందరూ సంస్కారవంతులవుతారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమె ఆలోచనలు, తినే ఆహారం, చదివే పుస్తకం, వినే శబ్దాలు, సంగీతం అన్నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. అవి సహజంగానే బిడ్డకు అబ్బుతాయి. ప్రణాళికాబద్ధ మైన జీవితం, ఆధ్యాత్మిక చింతన, ఏ విషయానికి ఉద్రేక పడకుండా ఉండే స్వభావం ఆమె నుంచే వచ్చాయి. గురువు చదువు నేర్పిస్తే.. సంస్కారం అమ్మ నేర్పుతుంది. సంస్కారం లేకపోతే సంపూర్ణమైన వ్యక్తిత్వం రాదు’.. కృతజ్ఞతగా చెప్పారు కొడుకు వరప్రసాద్ రెడ్డి. ‘అమ్మ నాలుగున్నర కల్లా లేస్తారు. ఆ సమయానికి లేచి ఆమెతో పాటు కాసేపు కూర్చుని మిగతా పనులు మొదలుపెడతాను. నేనున్న వృత్తిలో ప్రయాణాలు ఎక్కువ. దానివల్ల అమ్మను రోజూ చూసే అవకాశం ఉండదు. చాలా బాధగా ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఆఫీస్కి వెళ్లడం లేదు. అమ్మతో ఎక్కువ టైం గడుపుతున్నాను. నేనొక్కడినే ఆమెకు సంతానం. ఈ వయసులో ఆమెకు ఇవ్వగలిగిన బహుమతులు ఏం ఉంటాయి..! మధ్య వయస్కులకు, చిన్న పిల్లలకు బహుమతులు ఇస్తాం. ఈ వయసులో ఆమె నగలు, చీరలు వేసుకోలేదు. అందుకే ఏడేళ్ల క్రితం ఆమెకు ఉత్తరం రాశాను. ఆమె దాన్ని చదువుకుని, మనసంతా తడైపోయింది. ‘మడిచి జేబులో పెట్టుకునే ఉత్తరం కాదు, నీ బిడ్డలు దీన్ని చూడాలి. వాళ్ల తల్లిని వారు అలాగే చూసుకోవాలి. పటం కట్టించు’ అంది. అమ్మకు నేనిచ్చిన బహుమతి నచ్చింది’. కొడుకు సంతోషం. ‘ఏదో రామాయణం, భారతంలో కథలు చెప్తే ఊ.. కొట్టేవాడు. నిద్దరొస్తే పడుకునేవాడు. ఇంట్లో పది మంది పిల్లలున్నా వారితో చేరి అల్లరి చేసేవాడు కాదు. అతిశయంగా చెప్పటం లేదు. చెప్పింది వినేవాడు. ఒక్కమాట ఎవరినీ అనేవాడు కాదు. దేవుడి నైవేద్యం కూడా పెట్టేవరకూ తాకేవాడు కాదు. పుట్టుకతో వచ్చిన లక్షణాలే అవి’.. అంటుంది శాంతమ్మ. ‘పది మందికి ఉపయోగపడేలా ఉండమని, నిస్వార్థంగా చేసేది మనకు కలిసొస్తుంది నాయనా.. అని చెప్పానే తప్పా ఫలానా పని చెయ్యి.. వద్దు అంటూ చెప్పలేదు. తినేది నలుగురికి పెట్టేవాడు. ఇప్పటికీ అదే తీరు. ఇంట్లో ఏది చేసినా తీసుకెళ్లి నలుగురు పిల్లకాయలకు పెట్టి తింటాడు. అలా పెరిగిన క్రమంలో వంటపట్టినని ఏమన్నా ఉన్నాయేమో గాని, నేను ప్రత్యేకంగా ఏమీ నేర్పలేదు. తల్లికి పిల్లలు వృద్ధిలోకి రావాలనే ఉంటదిగా. పెద్దోడై, మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో, పది మందికి ఉపయోగపడే మనస్తత్వం కలవాడు కావాలని అనుకుంటాం. మాది వ్యవసాయ కుటుంబం. అయిదో తరగతి చదువున్న దాన్ని. గొప్పగా ఏం చెప్పగలను’ అంటుంది భూషణం లాంటి కొడుకుని కన్న ఈ బంగారు తల్లి. ‘ఆ రోజుల్లో 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ సాహిత్యం, పురాణ, ఇతిహాసాల మీద పట్టు ఉంది. వాటి సారం వివరించేది. మంచి, చెడుల మధ్య విచక్షణ తెలుసుకుంది. చదువు భుక్తి కోసం అయితే సంస్కారం జీవన్ముక్తికి అవసరం. అమ్మ నుంచి మనకొచ్చే ఈ సంస్కారం మనం గుర్తించం. తల్లి దగ్గర అది నేర్చుకున్నాం అని కూడా చెప్పం. అలా ఆమె ఇచ్చిన సౌభాగ్యాన్ని మదర్స్డే రోజు బోకే ఇచ్చి తీర్చుకోలేం. ప్రతి రోజు ఆమె కోసం ఆలోచించాలి’. ఇది ఆ కొడుకు కృతజ్ఞత. ‘పద్యం దాని తాత్పర్యం చెప్పేదాన్ని.. బుద్ధిగా వినేవాడు. సుభాషితాలు, వేమన, సుమతి శతకాలు అన్నీ నీతి వాక్యాలే కాబట్టి అవి ఆకట్టుకుని ఉండవచ్చు. అంతేగాని నేను ప్రత్యేకంగా కొట్టి, తిట్టి చెప్పింది, నేర్పించింది ఏమీ లేదు. తోటి పిల్లలతో ఆడుకోవటం కన్నా నా దగ్గరే ఎక్కవ సేపు గడిపేవాడు’. ఆ అమ్మ నిరాడంబరత. ‘స్త్రీ బాగుంటే సమాజం, పరిజనం అంతా బాగుంటాయి. ఆ ఉద్దేశంతోనే తల్లిని బాగా చూసుకోవాలి. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మగా పుట్టాలి. అప్పుడే ఆమె చేసినంత సేవ ఆమెకు చేయగలం’ అమ్మా నీవే నేను నేనే నీవు నేను నీలో అంతర్భాగానిని నీవు నాలో అంతర్వాహినివి..! -
‘అమ్మ’దనానికి ప్రతీక యశోదమ్మ
‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న రామచందర్ రావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐ. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళుతుండేవారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లాలోని గుమ్మడివెల్లి గ్రామం నుంచి హన్మకొండకు మకాం మార్చాం. నాన్న మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు. అమ్మ యశోదా దేవి మా చదువుల కోసం హన్మకొండలోని శివారు గ్రామాల్లో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారు. కాజీపేటలోని సెయింట్ గాబ్రియల్ స్కూల్లో పదో తరగతి వరకు చదివించారు. ఇంటర్ తర్వాత బ్రదర్స్ సురేందర్ రావు, నరేందర్ రావు మెడిసిన్లో చేరారు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశా. మరో బ్రదర్ సీఏ చేశాడు. మమ్మల్ని సరైన మార్గంలో నడపడంలో మా అమ్మ పాత్ర మరవలేనిది. వృధా ఖర్చులకు ఎప్పుడూ దూరంగా ఉంచేది. తెల్లవారుజామునే లేపి చదివించడంతో పాటు చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని పదేపదే చెప్పేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం మాకు చిన్నప్పటి నుంచే అమ్మ అలవర్చారు. అమ్మ మీద ప్రేమ, గౌరవంతో యశోద హాస్పిటల్స్ ప్రారంభించాం. 1989లో ఒక చిన్న క్లినిక్గా ప్రారంభమైన యశోద హాస్పిటల్ పాతికేళ్ల కాలంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా ఎదగడంలో అమ్మ దీవెనలు ఉన్నాయి. తల్లిగా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా.. సంకల్పంతోనూ.. శ్రమించే తత్వంతోనూ.. అంకితభావంతోనూ, క్రమశిక్షణతోనూ ఎందరికో ఆదర్శమూర్తి అయిన అమ్మ జీవితం ఈతరం వారికి స్ఫూర్తి అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు అమ్మ మా మధ్యలో లేకున్నా... ఆమె చూపిన మార్గంలోనే ముందుకెళుతున్నాం’. - గోరుకంటి రవీందర్రావు, చైర్మన్, యశోద హాస్పిటల్స్ -
'అర్ధగంట చేజింగ్ తర్వాత దొరికాడు'
ఎంతటివారైనా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే అమ్మతో గడిపిన క్షణాలే జ్ఞాపకాల దొంతర్లుగా కళ్ల ముందు కదలాడతాయి. ప్రతిచోటా అమ్మ చూపిన ప్రేమానురాగాలే గుర్తుకు వస్తాయి. ఏమిచ్చినా అమ్మ రుణం తీరదు. లోకంలో ఏదీ అమ్మ ప్రేమకు సాటిరాదు. అమ్మతో ఉన్న అనుబంధాన్ని కొందరు ప్రముఖులు ఇలా గుర్తు చేసుకున్నారు. వారి మాటల్లోనే... ‘1950 మార్చి మూడో తేదీ...నెల్లూరు జిల్లా మొలాపేట.. ఒక కుర్రాడి కోసం సందుల్లో నలుగురు పరుగెత్తుతున్నారు. గోడలు దూకేస్తున్నారు. అరగంట చేజింగ్ తర్వాత దొరికాడు. పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఒక ఆవిడ కాళ్ల మీద కుర్రాడిని బలవంతంగా పడుకోబెట్టారు. ఉగ్గుగిన్నెలోని వంటాముదం కుర్రాడి నోట్లో పోశారు. ఆ కుర్రాడు ఇప్పటి నటుడు జయప్రకాశ్ రెడ్డి. కాళ్ల మీద కుర్రాడిని పెట్టుకుంది జేపీ అమ్మ సాంబ్రాజ్యమ్మ. ‘రెండు, మూడు నెలలకోసారి నేను పరుగెత్తే సీన్ రీపిట్ అవుతుండేద’ని అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జేపీ. విసుక్కునేది కాదు.. నాన్న సాంబిరెడ్డి పోలీసు ఆఫీసర్. రోజూ పదుల సంఖ్యలో జనాలు ఇంటికి వచ్చేవారు. వారందరికీ టీతో సరిపెట్టకుండా మా అమ్మ టిఫిన్లు కూడా చేసేది. అస్సలు విసుక్కునేది కాదు. పెద్దయ్యాక నాటకాలు వేస్తూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరేవాణ్ని. నాతోపాటు ఐదారుగురు ఆర్టిస్టులు వచ్చేవారు. ఆ టైమ్లోనూ అమ్మ ఎంతో ఓపికగా అందరికీ భోజనం పెట్టేది. పూర్తి శాకాహారి.. మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్. మా కోసమే నాన్వెజ్ వండడం నేర్చుకుంది. ఆమె మాత్రం శాకాహారమే తినేది. అమెరికాలో బ్రదర్స్తో కలిసి 18 ఏళ్లు ఉంది. అక్కడ బ్రదర్ ఫ్రెండ్స్ అమెరికా వాళ్లు అమ్మ వంట రుచికి ఫిదా అయిపోయారు. పక్షవాతం వచ్చిన నాన్నను కంటికి రెప్పలా చూసుకోవడం ఇప్పటికీ నా మదిలో కదలాడుతునే ఉన్నాయి. ఇప్పుడు 84 ఏళ్లు.. నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మకు టీబీ సోకింది. చెన్నైలో వైద్యం చేయిస్తే తగ్గిపోయింది. ఇప్పడు అమ్మకు 84 ఏళ్లు. ఓపెన్ హార్ట్ సర్జరీ కావడంతో అమ్మను మూడున్నరేళ్ల క్రితం గుంటూరుకు తీసుకొచ్చా. చంటి పిల్లలా వ్యవహరిస్తున్న అమ్మను చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తన తల్లికంటే ఎక్కువగా మా అమ్మను జాగ్రత్తగా చూసుకునే భార్య దొరకడం నా అదృష్టం’’. -
ప్రాణం నీవే పయనం నీవే
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం అమృతం కంటే కమ్మనైనది.. అనంతమైన ప్రేమ.. హద్దులు లేని వాత్సల్యం.. భూదేవికున్న ఓపిక ఎవరికుంటాయి..! ఒక్క అమ్మకు తప్ప. అందుకే దేవుడే ఆ ప్రేమ కోసం పరితపించాడు. బిడ్డ కడుపున పడ్డాక.. నెలలు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్న బరువును ఓపికగా మోస్తుంది. చీకటి గర్భంలోని కదలికలను చేతితో తడుముకుంటూ రంగుల కలను కంటుంది. నేలపై పడ్డ బుజ్జి పాపాయికి లోకాన్ని పరిచయం చేస్తుంది. అందుకే అమ్మ దేవుడికన్నా మిన్న. -
చేనేత షో యగం
పోచంపల్లి వస్త్ర సోయగం.. సిటీవాసులను పలకరించింది. కుషాయిగూడలోని ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు ఎస్ఎస్ఐసీ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళాను టాలీవుడ్ నటి హాసికా దత్ ప్రారంభించింది. ష్యాషన్ లుక్.. ట్రెడిషనల్ మార్క్.. ఈ రెండూ చేనేత వస్త్రాల్లోనే కనిపిస్తాయన్నారామె. తాను కూడా చేనేత వస్త్రాలను ఇష్టంగా ధరిస్తానని చెప్పారు. ఈ నెల 17 వరకు కొనసాగే ప్రదర్శనలో.. డిజైనర్ శారీస్, సిల్క్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కుర్తాలు, టేబుల్ లెనిన్ వంటి రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. - కుషాయిగూడ -
సల్లూభాయ్.. వుయ్ లవ్ యు..
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ఖాన్కు హిట్ అండ్ రన్ కేసులో శిక్ష ఖరారవడం నగరవాసుల్లో విషాదాన్ని నింపింది. బాలీవుడ్ హీరోల్లో బహుశా ఎవరికీ లేనంత అనుబంధం సల్మాన్ఖాన్కి సిటీతో ఉంది. సల్లూభాయ్ నగరానికి వస్తే చాలు అతడిని చూడడానికి ఎగబడతారు. తన సినిమాలను సూపర్హిట్ చేయడంలో రికార్డులు సృష్టించిన జోధ్పూర్ వంటి నగరాలను దాటి సల్మాన్ మన హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడి అభిమానులు సల్మాన్ మానియాకు కేరాఫ్గా నిలిచారనేది అధికారికంగా రూఢీ అయిన విషయం. అందుకే.. ‘సల్లూభాయ్ వుయ్ లవ్ యు’ అంటూ సిటీ సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, లైఫ్స్టైల్ ప్రతినిధి క్రేజ్కి కేరాఫ్ సల్లూభాయ్ సల్మాన్కి సిటీ అంటే మహా ఇష్టం. హైదరాబాద్లో సినిమా షూటింగ్స్ అంటే ఇష్టపడేవాడని బాలీవుడ్ నిర్మాతలు అంటుంటారు. తెలుగు నటి భూమికాచావ్లాతో నటించిన ‘తేరేనామ్’ ఇక్కడి సిటీ కాలేజ్లోనే ఎక్కువ భాగం షూట్ చేశారు. ఇంకా ‘వాంటెడ్’ తదితర సినిమాలూ షూటింగ్ జరుపుకున్నాయిక్కడ. మన బిర్యానీ అన్నా, హలీమ్ అన్నా సల్మాన్కి చాలా ఇష్టం. తన సోదరి అర్పిత పెళ్లి నగరంలోని ఫలక్నుమా ప్యాలెస్లో చేయడం సిటీ మీద సల్మాన్కి ఉన్న అభిమానానికి నిదర్శనం. సల్మాన్ హోస్ట్ చేసిన టీవీ షో ‘బిగ్బాస్’లో తొలి కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన ఖాసిఫ్ ఖురేషి నగరవాసే. సిటీలోని సబేరీ కళ్లజోడు షోరూమ్కి సల్మాన్ బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి నడుడికి శిక్ష పడడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అందరికీ మంచి చేసే వ్యక్తి.. పలు ఈవెంట్స్తో పాటు అర్పిత మ్యారేజ్కు సల్మాన్ సెక్యూరిటీ ఇన్చార్జ్గా పనిచేశా. సీసీఎల్ ఆఫ్టర్ పార్టీలో సంతోష్నగర్కు చెందిన బౌన్సర్ రఫీఖ్.. సల్మాన్ని ఆర్మ్ రెజ్లింగ్లో ఓడించాడు. దీనికి ఏ మాత్రం ఫీలవ్వకపోగా, అతనికి క్యాష్ గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రశంసించాడు. తన దగ్గర పనిచేసేవారిని సల్లూభాయ్ బాగా చూస్తాడు. అందరికీ మంచి చేసే వ్యక్తికి శిక్ష పడడం వేదనకు గురిచేసింది. - మహ్మద్ అబ్రార్, సల్మాన్కు సిటీలో సెక్యూరిటీ చాలా మారిపోయాడు.. చాలా బాధగా ఉంది. సిటీకి సల్మాన్ ఎప్పుడు వచ్చినా తప్పకుండా చూసేవాడిని. తనని చూసే రెగ్యులర్గా బ్రాస్లెట్ వాడుతున్నా. హీరోగా ఎంత మంచి నటుడో.. వ్యక్తిగా అంత సహృదయుడు. ఆయన ‘బీయింగ్ హ్యూమన్’ వంటి చారిటీ కార్యక్రమాలు చేశాడు. ఆయనకు ఐదేళ్ల ఖైదు వల్ల సినిమాలకు మాత్రమే కాదు.. ఆయన్ను నమ్ముకున్న ఎన్నో చారిటీ కార్యక్రమాలకు కూడా విఘాతం కలుగుతుంది. ఆ సంఘటన జరిగిన 13 సంవత్సరాల తర్వాత తను చాలా మారాడు. వందల మంది ప్రాణాలు కాపాడాడు. ఒక అభిమానిగానే కాకుండా ఆయన కారణంగా సాయం పొందుతున్న వారి తరపున ఆలోచించి బాధపడుతున్నా. - అహ్మద్ఖాన్, ఈవెంట్ కో ఆర్డినేటర్ రియల్ ‘హ్యూమన్’ సల్మాన్ చిన్నప్పటి నుంచీ సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు కలవాలనుకున్నా కుదర్లేదు. అతను చేసే చారిటీ కార్యక్రమాలు నాలో మరింత అభిమానాన్ని పెంచాయి. అలాంటిది.. అతనికి ఇలా శిక్ష పడడం చాలా బాధగా అనిపిస్తోంది. తన వల్ల చాలా మంది చిన్నారులు సేవ్ అయ్యారు. దేవుడు అతనికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. - ప్రత్యూష, సిటీ మోడల్ -
రీమిక్స్ రీచార్జ్
‘వయ్యారి భామ’కు సిటీ డీజే స్వరాల జోడింపు తె లుగు డీజే పృధ్వి మిక్స్ ఆల్బమ్స్కు ఊపు ‘యూట్యూబ్’లో తొలి తెలుగు డబ్స్టెప్ మిక్స్ హల్చల్ పబ్స్.. క్లబ్స్ ఈవెంట్స్లో మ్యూజిక్ని కదం తొక్కించే డిస్క్ జాకీ (డీజే)లు సిటీకి కొత్తకాదు. అయితే, అంత మాత్రాన డీజేల క్రేజ్ ఎల్లలు దాటదు. సొంతంగా ఆడియో, వీడియో ఆల్బమ్స్ రూపొందించి విడుదల చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. సిటీ డీజేలు ఈ విషయంలో కొంత వెనుకంజలో ఉన్నా.. డీజే పృథ్వి ‘మిక్స్ ట్రాక్’ను కదం తొక్కించాడు. అదీ ఇటీవలే ఊపందుకున్న ‘డబ్ స్టెప్’ శైలిలో కావడం విశేషం. - సాక్షి, లైఫ్స్టైల్ ప్రతినిధి బాలీవుడ్లో భళా.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రీమిక్స్ ఆల్బమ్స్ బాగా పాపులర్. హిందీ పాటల మిక్సింగ్తో మొదలైన ట్రెండ్.. తెలుగుకూ విస్తరించింది. అప్పట్లో ఘంటసాల పాటలను రీమిక్స్ చేసి విడుదల చేసిన ఆడియో ఆల్బమ్స్ కొన్ని సూపర్హిట్ అయ్యాయి కూడా. అయితే, తర్వాత ఈ ధోరణిలో మార్పు వచ్చింది. పాప్ గాయని స్మిత ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల...’తో పాత పాటలకు కొత్త స్వరాలు సమకూర్చే ట్రెండ్ మళ్లీ పుంజుకుని వరుసగా కొన్ని ఆల్బమ్స్ వచ్చాయి. మళ్లీ కొంత గ్యాప్. తర్వాత హీరో చిరంజీవి హిట్ సాంగ్స్ని ‘మెగామిక్స్’ పేరుతో నగరానికే చెందిన డీజే ప్రభు రూపొందించారు. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆయనే ఇళయరాజా పాటల మిక్స్ ఆడియోను ‘చలాకీ చిన్నది’ పేరుతో విడుదల చేశారు. రానురానాను పూర్తి పాటను నవీకరించే రీమిక్స్లూ తగ్గిపోయాయి. పాత పాటకు తమవైన సంగీత ప్రత్యేకతను జత చేసే డీజే మిక్స్లూ అరుదైపోయాయి. అదే సమయంలో హిందీ పాటల మిక్సింగ్ ఎప్పటికప్పడు వైవిధ్య రీతులను సంతరించుకుంటూ ఊపందుకుంటోంది. సినీతారలు కూడా మ్యూజిక్ ఆల్బమ్స్పై మోజు పెంచుకునేంతగా బాలీవుడ్లో మిక్సింగ్ విజృంభిస్తోంది. అక్కడి ఆల్బమ్స్ విజృంభణకు ముంబై డీజేల క్రియేటివిటీయే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఎప్పటికప్పుడు హిట్ సాంగ్స్కు సొంత ట్రాక్లు, మరోవైపు పాత పాటలకు కొత్త సంగీతాన్ని జత చేస్తూ నార్త్లో దూసుకుపోతున్నారు డీజేలు. అయితే మన సిటీ డీజేలు కూడా హిందీ, ఇంగ్లిష్ ట్రాక్స్నే మిక్సింగ్కు ఎంచుకుంటుండటంతో నేటి యువ శ్రోతలకు నిన్నటి పాటలను కొత్త శైలిలో వినే అవకాశం దక్కడం లేదు. మరోపక్క తెలుగు పాటల మిక్స్ ఆల్బమ్స్కు సినిమాల్లో రీమిక్స్ పాటల వెల్లువ అడ్డుకట్ట వేసింది. సినీ సంగీత దర్శకులే రీమిక్స్ పాటలకు సై అంటుండడంతో ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించేవారు సెలైంటైపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు పాటల మిక్సింగ్ ట్రెండ్కు కాసింత ఊపు నిచ్చేలా సిటీ డీజే పృథ్వీ తాజాగా ఒక పాత పాటకు డీజే మిక్స్ చేశారు. కిక్ ఇచ్చిన ‘డబ్ స్టెప్’.. ఈ డబ్ స్టెప్ మూలాలు ఇంగ్లాండ్లోని సౌత్ లండన్లో ఉన్నాయని చెబుతారు. డ్రమ్స్, పెర్క్యుషన్, బాస్ ఫ్రీక్వెన్సీస్ మేళ వింపుతో సాగే ఈ శైలి.. బాగా ప్రయోగాత్మకంగా సాగే రీమిక్స్లకు పేరొందింది. మూలాలు మూడు దశాబ్దాల క్రితమే ఉన్నాయని గుర్తించినా, 2010 నుంచి లండన్ నైట్ క్లబ్స్లో డబ్ స్టెప్ స్టైల్ను డీజేలు బాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. పెద్ద పెద్ద మ్యూజిక్ కన్సర్ట్స్ ద్వారా అమెరికాలో దీని పాపులారిటీ పెరగడంతో ఇప్పుడిప్పుడే ఆసియా దేశాలకు సైతం విస్తరించింది. డిస్క్ జాకీల రీమిక్స్ల ఆధారంగా విజృంభిస్తున్న డబ్స్టెప్ను సిటీ డీజే పృథ్వీ తన తాజా మిక్సింగ్కు వినియోగించడం ఇప్పుడు నగరంలో మరికొందరు డీజేలను ఇన్స్పైర్ చేస్తోంది. ‘వయ్యారి భామ’కు వన్నె చిన్నెలు.. పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘తమ్ముడు’లోని ‘వయ్యారి భామా నీ హంస నడక..’ పాట అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. వైవిధ్యమైన సంగీతానికి పెట్టింది పేరైన రమణ గోగుల కూర్చిన ఈ పాట ఇప్పుడు విన్నా ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి పాటనే ఎంచుకున్నాడు సిటీ యంగెస్ట్ అండ్ బెస్ట్ డీజేగా పేరొందిన పృథ్వి. ‘నేను పవన్ కల్యాణ్ అభిమానిని. వయ్యారి భామ పాట అంటే నాకు చాలా ఇష్టం. అలాగే తమ్ముడు సినిమాలో పవన్ చేసిన కొన్ని హాస్య సన్నివేశాలు, ఆడవారి గొంతును అనుకరిస్తూ మాట్లాడిన మాటలు.. వంటివి ఇప్పటికీ యూత్ సరదా చాట్స్లో చోటు చేసుకుంటూనే ఉంటాయి. అందుకే ఆ పాటను, కొన్ని మాటలను, నా మ్యూజిక్ని మిక్స్ చేసి కొత్తగా విడుదల చేశా’నన్నాడు పృథ్వి. రెండు రోజుల క్రితమే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఈ పాట.. వేల సంఖ్యలో హిట్స్తో వీక్షకుల ఆదరణ పొందిందంటున్నాడీ యంగ్ డీజే స్టార్. త్వరలోనే మరికొన్ని తెలుగు మ్యూజిక్ ఆల్బమ్స్ చేయాలని అనుకుంటున్నట్లు పృథ్వీ చెప్పాడు. -
మనసు బాగోలేదా...?
ఇటీవల జర్మనీ విమానం కూలిపోయిన సంఘటన గుర్తుందా? దానికి కారణం ఏమిటో జ్ఞాపకం ఉందా? డిప్రెషన్లో ఉన్న కో-పైలట్ ఇందుకు పాల్పడ్డాడని తెలిశాక ప్రపంచం నివ్వెరపోయింది.. ఇంకా ఎందరో తనువు చాలించుకుంటున్నారు. మరికొందరు ఇతరుల ఉసురు తీస్తున్నారు. కారణాలేమైతేనేమి? డిప్రెషన్ (వ్యాకులత)తో ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకోవడంపై ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలు, వైద్యులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కౌన్సెలింగ్, థెరపీ వంటి చికిత్సా విధానాలతో డిప్రెషన్ నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. ప్రశాంత జీవితాన్ని కోరుకోని వారుండరు. కానీ ఆ ప్రశాంతతే చాలామందికి కరువవుతోంది. ఒంటరితనం, విషాదం, అపార్థం, నిరాశ, ఆందోళన, అసంతృప్తి వంటివి డిప్రెషన్కు దారితీస్తాయి. ఇవి వయసుతో పనిలేకుండా అన్ని వయసుల వారికీ వర్తిస్తాయి. విద్యార్థులకైతే ఇష్టం లేని కోర్సులు, కాలేజీల్లో చేర్చడంతో అక్కడ ఇమడలేక, సర్దుబాటు చేసుకోలేక, సబ్జెక్ట్ అర్థం కాక సతమతమవుతుంటారు. ఇంకా దూరంగా ఉన్న కాలేజీలకు రోజూ వెళ్లిరావడం, పేరెంట్స్కు దూ రంగా ఉండడం, లవ్ ఫెయిల్యూర్స్ కూడా డిప్రెషన్కు దోహదపడుతున్నాయి. ఇక విద్య పూర్తయ్యాక కూడా వ్యాకులతకు లోనయ్యే వారెందరో ఉంటున్నారు. చదువయ్యాక సరైన ఉద్యోగావకాశాలు, విద్యార్హతకు తగిన ఉద్యోగాలు రాక, జీతాలు చాలక కొందరు, అధిక పని, నిద్రలేమి వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. పెళ్లయ్యాక భార్యాభర్తల నేపథ్యం సమస్యలు, ఫైనాన్షియల్ షేరింగ్ లేకపోవడం, జాబ్ రిలేటెడ్ ప్రోబ్లమ్స్, వివాహేతర సంబంధాలు, టీవీ సీరియళ్ల ప్రభావం డిప్రెషన్కు కారణమవుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇక వృద్ధాప్యంలోనూ డిప్రెషన్కు లోనవుతున్న వారూ ఉన్నారు. వయసు మీరాక వివిధ కారణాల వల్ల పిల్లలు దూరం కావడం, జీవిత భాగస్వామి మరణించడంతో ఒంటరితనాన్ని భరించలేకపోవడం, అనారోగ్యం వంటి వాటితో వ్యాకులతకు గురవుతున్నారు. పలువురు తమ మనోవేదనను ఇతరులతో పంచుకోకుండా లోలోపలే భరించడంకూడా ఇందుకు ప్రేరేపిస్తున్నాయి. ఇవన్నీ వెరసి అం తిమంగా డిప్రెషన్కు దారి తీసి ఆత్మహత్యలకు ఆస్కారమిస్తున్నాయి. ఇలా పేద, మధ్య తరగతి వారే కాదు.. మేధావులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, రచయితలు తనువులు చాలించిన వారిలో ఉండడం విశేషం! మన విశాఖ నగరంలోనూ డిప్రెషన్కు గురవుతు న్న వారి సంఖ్య అధికంగా ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో 15శాతం యువతలోనే ఉంటోందని అంచనాకొచ్చారు. విధి నిర్వహణలో జాగ్రత్త.. డిప్రెషన్లో ఉంటూ విధి నిర్వహణ చేసే వారితో ఎంతో అప్రమత్తంగా ఉండాలని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. విమాన పెలైట్లు, వాహనాల డ్రైవర్లు, మెదడు, గుండె సంబంధిత వైద్యులు, సైంటిస్టులు, కీలక పరిశ్రమలు, మైనింగ్లో పనిచేసేవారిలో అవసరమైన వారు తరచూ డిప్రెషన్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో వారితో పాటు ఇతరులకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న జర్మన్ విమానం కో-పైల ట్ ఆండ్రియాస్ లుబిట్జ్ ప్రియురాలు కాదనడంతో డిప్రెషన్కు లోనై విమానాన్ని కూల్చివేసి 150 మంది అమాయక ప్రయాణికుల చావుకు కారణమయ్యాడన్న చేదు నిజాన్ని వీరు ఉదహరిస్తున్నారు. అందుకే ఇలాంటి వారి మానసిక స్థితి తెలిసేలా ముందుగా అవసరమైన చెకప్ చేయాలని వీరు పేర్కొంటున్నారు. థెరపీతో నయం.. డిప్రెషన్కు గురయిన వారికి థెరపీతో నయం చేయొచ్చు. డిప్రెషన్లో మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటాయి. డిప్రెషన్ స్కేల్తో దాని తీవ్రతను గుర్తిస్తారు. ఇందులో మైల్డ్, మోడరేట్లకు కౌన్సెలింగ్, కాగ్నెటివ్ బిహేవియర్ థెర పీతో పూర్తిగా సరి చేస్తాం. ఇందుకు 2-6 నెలల పాటు చికిత్స అవసరం. అవసరమైన వారికి అవగాహన, సోషల్ స్కిల్స్, కెరీర్ ప్లానింగ్, హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాం. సివియర్ కేటగిరీలో ఉన్న వారిని సైక్రి యాట్రిస్ట్ను సంప్రదించాలి. విశాఖ నగరంలో డిప్రెషన్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఇంకా పెరగాలి. మైండ్ అండ్ బాడీతో పనిచేసే వారు తరచూ డిప్రెషన్పై చెకప్ చేయించుకోవాలి. అవసరమైన వారు సంప్రదిస్తే కౌన్సెలింగ్, చికిత్స అందిస్తాం. - డాక్టర్ ఎం.వి.ఆర్.రాజు, సైకాలజీ విభాగాధిపతి, ఏయూ (సెల్ః 9393101813) -
భయపెట్టే ప్రయత్నం
హారర్ మూవీస్.. చూస్తున్నంత సేపు భయపడుతుంటాం.. కానీ ఆ సినిమాలు చూడడంలో వచ్చే థ్రిల్లే వేరు. ఫీచర్ ఫిల్మ్స్కే పరిమితమైన హారర్ మూవీస్ షార్ట్ఫిల్మ్స్లోనూ అప్పుడప్పుడూ పలకరిస్తున్నాయి. అలా వచ్చిందే ఫ్లాట్ నంబర్.4. నగరానికి చెందిన నరేష్ తన ఈ హారర్ మూవీతో నెటిజన్లను కాస్త భయపెట్టారు. ఇంతకీ ఫ్లాట్ నంబర్.4లో ఏముంది? ఇదీ కథ రైల్వే స్టేషన్లో ఆటో ఎక్కి తన ఫ్రెండ్ ఇంటికి వస్తుంది ఒక అమ్మాయి. ఫ్రెండ్ డాలీకి ఫోన్ చేస్తే వాచ్మన్ దగ్గర ‘ఫ్లాట్ న ం.4’ తాళాలు ఉంటాయి.. తీసుకో అని చెప్తుంది. ఫ్లాట్కు వెళ్లి సేదతీరాక ఆపిల్ తింటూ టీవీ చూస్తుంటుందీ అమ్మాయి. అప్పుడు టైం రాత్రి 7 అవుతుంది. ఆ సమయంలో డాలీ ఫోన్ చేసి తను ఇంటికి వచ్చేసరికి రాత్రి 12.30 అవుతుంది అని చెబుతుంది. ఇంతలో తన వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించి వెనక్కి చూస్తుంది. కానీ ఎవరు ఉండరు. ఈ సారి వెనక్కి చూసినప్పుడు ఒక ఆకారం కనిపిస్తుంది. ఎటు చూస్తే అటే కనిపించి భయపెడుతుంది. తన ఫ్రెండ్ చనిపోయినట్లు, ఫొటోకు దండ, చనిపోయిన తేదీ ఉండడం, దెయ్యం తనను చంపేస్తున్నట్లుగా భయపడుతుంది. ఆ సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో నిద్ర నుంచి లేస్తుంది. ఇంతకీ ఇదంతా ఆమెకు వచ్చిన కలన్న మాట. రివ్యూ హారర్ మూవీస్కు టేకింగ్, మ్యూజిక్ ప్రధానం. ఎక్కువ భయపెట్టేవి ఆ రెండే. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు డెరైక్టర్. కెమెరా టేకింగ్, సీన్కు సరిపడే మ్యూజిక్ హారర్ ఫీల్ తెచ్చింది. యాక్టింగ్కు అంతగా స్కోప్ లేదు. కానీ ఉన్నంతలో బాగుంది. సినిమా ప్రారంభంలో చిత్రం రాం గోపాల్ వర్మకు అంకితం అని ఒక స్లైడ్ వేశారు. దానికి తగినట్లుగానే టేకింగ్లో కొంత ఆర్జీవీ మార్క్ క నిపించింది. ఓవరాల్గా ఫిల్మ్ బాగుంది. కానీ చూపించినదంతా కేవలం ‘ఊహ’ అని తేల్చేయడ మే కాస్త మైనస్ అనిపిస్తుంది.‘ఫ్లాట్ నం.4’ లోకి వెళ్లాలనుకునేవారికి ఇదిగోండి తాళం.. https://youtube/nRuVFmZbxGU ఇదంతా అమ్మ చలవే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఎంబీఏ చేశాను. డిగ్రీలో ఉండగానే నటుడిని కావాలని ఉండేది. అవకాశం లేక వెళ్లలేకపోయాను. ఇప్పుడు ఇంటర్నెట్ నాకు అవకాశాన్ని కల్పించింది. ఫేస్బుక్, యూ ట్యూబ్, చాలా ఈ-బుక్స్ చదివి డెరైక్షన్ నేర్చుకున్నాను. మా అమ్మగారు చాలా సపోర్ట్ చేస్తారు. షార్ట్ఫిల్మ్కు అయ్యే ఖర్చు అమ్మే ఇస్తారు. 2014లో ఫస్ట్ షార్ట్ఫిల్మ్ చేశాను. ఇప్పటికి 4 చేశాను. నా దగ్గర ఇంకో 30 స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తాను. - నరేష్ బాబు, డెరైక్టర్ -
ఎన్నెన్నో వర్ణాలు..!
అందమైన ప్రకృతిలో అసంఖ్యాకమైన సిత్రాలు. లక్షలాది వర్ణాలు. అందమైన పూలు.. కనువిందైన పక్షులు.. నీలాకాశంలో రకరకాల రంగుల్లో మేఘాలు.. అనంత సాగరంలో అలలపై దోబూచులాడే వింత వర్ణాలు.. పుడమిపై లెక్కలేనన్ని రంగులు.. జీవితమంతా రంగులమయం కాదూ. ఈ వర్ణాలను, వాటి అందాలను కాన్వాస్ అద్దంపై ప్రతిబింబించేవాడు చిత్రకారుడు. చిత్రం తీర్చిదిద్దే సమయంలో అతని ఆలోచనలు ఎలా ఉంటాయో, అవి కాన్వాస్పై ఎలా ప్రాణం పోసుకుంటాయో ఊహించడం కష్టం. కానీ చిత్రం పూర్తయ్యాక అది చెప్పే కథలు అనంతం. చూసేవారి కళ్లకు మనసుంటే ఆ కథ మధురాతిమధురం. ఇక తమ చిత్రాల గురించి ఆర్టిస్టులే మాట్లాడితే? అది మరింత అర్ధవంతంగా ఉంటుంది. ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి చెందిన బీఎఫ్ఏ విద్యార్థి రాజశేఖర్ ఇలా తన పెయింటింగ్ ప్రత్యేకతను ఇలా వివరించారు. ‘ఓ చిత్రం గీసేటప్పుడు ఆర్టిస్ట్ను ఏదో తెలియని శక్తి ఆవహిస్తుంది. అంతులేని ఉత్తేజానికి అది కారణమవుతుంది. నేను కూడా అటువంటి భావాలకు లోనయ్యాను. నేను ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు గీశాను. వాటిలో ఏది అత్యుత్తమైనదంటే ఆలోచించాలి కానీ.. మనసుకు బాగా నచ్చినది మాత్రం నేను గీసిన ‘ఫైవ్ ఎలిమెంట్స్’ చిత్రం. నైరూప్య కళ (ఏబ్స్ట్రాక్ట్ పెయింటింగ్) కోవలోకి వచ్చే ఈ చిత్రం నాకు ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. ఈ పెయింటింగ్ వేస్తూ గంటల తరబడి ఏవో ఊహల్లోకి వెళ్లిపోయేవాడిని. నాకు కావాల్సిన, నేను కోరుకున్న భావం వచ్చే వరకూ చిత్రం గీస్తూనే ఉండేవాడిని. పంచభూతాలను చిత్రంలో అంశాలుగా తీసుకుని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాను. ఇలా వేసిన ప్రతి పెయింటింగ్లో నేను కోరిన భావం వచ్చిందన్న సంతృప్తి ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం కలుగుతుంది. ఆలోచన ఇలా.. సృష్టి సర్వం పంచభూతాల కలయిక కారణంగా రూపు దిద్దుకున్న సంగతి తెలిసిందే. వీటి నుంచే మానవ జన్మ ప్రారంభమవుతుంది. వీటిలో విలీనం కావడం ద్వారా అది ముగుస్తుంది. పంచభూతాలైన ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అవి ఒకదానితో ఒకటి అనుబంధమై ఉంటాయి. వాటికి నిర్దిష్టమైన రూపాన్ని ఊహించడం కష్టం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పెయింటింగ్ తీర్చిదిద్దడానికి ప్రయత్నించాను. ఒక్కో అంశానికి ఒక్కో రంగును నిర్దేశించుకుని వాటిని రకరకాలుగా కలుపుతూ పాంచభౌతికమన్న భావాన్ని చూపించడానికి కృషి చేశాను. ఆకాశానికి గాఢమైన నీలి రంగు, నీటికి లేత నీలి రంగు, గాలికి తెలుపు, అగ్నికి ఎరుపు, భూమికి జేగురు రంగు ఎంచుకున్నాను. ఈ పెయింటింగ్కు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం తీసుకున్నాను. ఒక్కో పెయింటింగ్ వేయడానికి నాకు రెండు నుంచి నాలుగు రోజుల వరకు సమయం పట్టింది. ఇదే కాన్సెప్ట్తో ఇప్పటివరకు 20 పెయింటింగ్స్ వరకు వేశాను. పాంచభౌతికమైన ప్రకృతి నన్నెంతగా ప్రభావితం చేసిందీ వీటిని చూస్తే అర్ధమవుతుంది. -
చూడు తమ్ముడూ!
విషయాన్ని సుత్తి లేకుండా.. సూటిగా చెప్పడం చేతకాని వారెందరో.. వాట్సప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్ దగ్గర అడ్డంగా బుక్కై పోతుంటారు. విషయ పరిజ్ఞానం ఉన్నా.. సింపుల్గా చెప్పడం తెలియని మేధావుల మెసేజ్లకు వాట్.. వాట్.. అనే రిప్లైలు వస్తుంటాయి. ఇంకొందరుంటారు.. అల్రెడీ ఫోన్లో ఇన్బిల్ట్గా ఉన్న స్మైలీ బొమ్మలను రిప్లైగా పంపుతూ.. అదే క్రియేటివిటీ అని ఫీలైపోతుంటారు. భాషలో రాయలేని విషయాలెన్నో.. ఒక్క బొమ్మ చెప్పేస్తుంది. అలాంటి బొమ్మల కొలువుతో వచ్చేసింది.. దేఖ్ భాయ్ ఆండ్రాయిడ్ యాప్. ఇది ఆన్లైన్ ప్రపంచంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్తో రాజ్యమేలుతోంది. ఈ మధ్య.. వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్.. ఇత్యాది మెసేజ్ ఓరియెంటెడ్ ఆన్లైన్లో కొత్తగా కొన్ని చిత్రాలు విచిత్ర సంభాషణలతో కిక్కెక్కిస్తున్నాయి. మాటలకందని ఎన్నో భావాలు ఒక్క హావభావంతో ఎదుటివారికి చేరిపోతాయి. ఇదే సూత్రాన్ని పాటిస్తూ రూపొందించిన దేఖ్భాయ్ యాప్ ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. కళ్లుమూసుకుని, ఓ చెయ్యెత్తి ఏదో సీరియస్గా చూస్తున్న ఓ గుండు బొమ్మపై.. దేఖ్ భాయ్ అని రాసుంటుంది. సందర్భోచితంగా మీరేదైనా మెసేజ్ రాసుకోవచ్చు. తర్వాత దాన్ని షేర్ చేస్తే చాలు. ఇందులోని ఇన్బిల్ట్ మెసేజ్లు కూడా సరదాగా, ఫన్నీగా ఉంటాయి. హస్తీ హస్తీ.. దోస్తీ దోస్తీ.. ‘దేఖ్ భాయ్.. పైసే మాంగేతో ఫ్రెండ్షిప్ ఖతమ్’ (డబ్బులడిగావో.. దోస్తీ కట్) ఇదో రకం చిలిపి హెచ్చరిక సందేశం. దీన్ని పంపి చూడండి.. అట్నుంచి నవ్వులే రిప్లైగా వస్తాయి. బాయ్ బొమ్మ మాత్రమే కాదు.. ఓ పెద్దావిడ సీరియస్గా హితవు పలుకుతున్నట్టు ఉండే బొమ్మ.. కోపం, సంతోషం, హాస్యం.. ఇలా రకరకాల భావాలకు తగ్గట్టుగా ఉన్న బొమ్మలు ఇందులో ఉన్నాయి. పెద్దావిడ విషయానికి వస్తే.. ‘దేఖ్ బేటా..’ అని మొదలవుతుంది మెసేజ్. ‘దేఖ్ బేటా.. సోజా వర్నా ఫోన్ కో ఆగ్ లగాదూంగీ’ (పండుకో.. లేకపోతే ఫోన్కు నిప్పెట్టేస్తా..!) ఇలాంటి సరదా వార్నింగులెన్నో ఈ పెద్దావిడ బొమ్మను అడ్డం పెట్టుకుని పంపించేయొచ్చు. సెలబ్రిటీ హంగులు.. దేఖ్ భాయ్ ప్రస్థానానికి మూలం గుజరాతీ ‘జో బకా’ (చూడు మిత్రమా). ‘జో బకా’ మెసేజ్లు ఆన్లైన్లో ఎప్పట్నుంచో చక్కర్లు కొడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన దేఖ్ భాయ్ సిరీస్కు ఈతరం యువత రెడ్కార్పెట్ స్వాగతం పలుకుతోంది. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ బొమ్మలేకాదు.. సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, బాబా రాందేవ్, రాహుల్ గాంధీ, రజనీకాంత్.. ఇలా ఫేమస్ పర్సనాలిటీల చిత్ర విచిత్రమైన క్యారికేచర్లు కూడా ఈ సరదా సందేశాల్లో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బొమ్మలకు బ్యాక్ గ్రౌండ్లో కనిపించే ఎల్లో కలర్ను కూడా కస్టమైజ్డ్ గా మీ కిష్టమైన రంగుల్లోకి మార్చుకోవచ్చు. ఇన్బిల్ట్ బొమ్మలే కాదు.. కస్టమైజ్డ్గా ఫొటోలు కూడా ఎంపిక చేసుకునే చాన్స్ ఉంది. ఏ ఎక్స్ప్రెషన్స్నైనా పలికించే బొమ్మలు ఉన్నాయి కదా అని దేఖ్ భాయ్ని ఎడాపెడా వాడేస్తే లాభం లేదంటారు హ్యూమరిస్టులు. ఆ భావానికి తగ్గ భాషను పలికించగలిగితేనే కిక్కు డోసు పెరుగుతుందని చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం ‘దేఖ్ భాయ్.. సోచ్ మత్.. డౌన్లోడ్ కర్..!!’. -
జస్ట్.. లైట్ తీస్కో!...
ఉరుకుల పరుగుల జీవితాలు. ప్రశాంతంగా కప్పు కాఫీ తాగడానికి కూడా టైం లేని రోజులు. మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. దాని వల్ల నిద్రపోవడానికి కూడా లేట్ అయ్యింది. ఉదయాన్నే ఆఫీస్లో మీటింగ్ ఉంది. గబగబ లేచి రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్లాలి. ఆ తొందరలో పొరపాటున ప్యాంట్ వేసుకోవడం కూడా మరచిపోయే వాళ్లు ఉంటారు. అలా ఎవరుంటారు అంటారా? ఒక్కసారి చింతకాయల రవి సినిమా చూడండి. ఇంటర్వ్యూకు పిలిచారు కదా అని ప్యాంట్ వేసుకోవడం మరచిపోయి మేనేజర్ దగ్గరకు వెళ్లిపోతాడు వెంక టేష్. అలాంటి టైంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా!!! కానీ ఏడాదికోరోజు సరదాగా ఫ్యాంట్ విప్పేసి తిరిగితే ఎలా ఉంటుంది...హౌ ఫన్నీ! అంటూ విదేశాల్లో విద్యార్థులకు ఓ ఫన్నీ ఆలోచన తట్టింది. ఇకనేం...స్టూడెంట్స్కు ఓ ఆలోచన వస్తే ఇక ఆగేదేం ఉంది...వెంటనే మొదలెట్టేశారు. అకాడమిక్ సంవత్సరం సెమిస్టర్కు ఆఖరి రోజున ఏదైనా ఫన్నీగా చేస్తే బాగుంటుంది కదా అని కొంత మంది ఆలోచించి ఆ రోజున స్టూడెంట్స్ అంతా ప్యాంట్స్ విప్పేసి తిరిగారు. చిట్టిపొట్టి షార్ట్స్తో క్యాంపస్ కలియతిరిగి పండగ చేసుకున్నారు. ఇదేదో బాగుందే...అని చాలా దేశాల్లో స్టూడెంట్స్ కూడా అట్రాక్ట్ అయిపోయారు. 2000వ సంవత్సరంలో ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లో ఇది స్టార్ట్ అయ్యింది. తరువాత కెనడా,స్వీడన్,ఆస్ట్రేలియా,ఫిన్లాండ్,యూకే లాంటి దేశాలలో ఈ క్రేజ్ వ్యాపించింది. ఇపుడీ ప్యాంటోపాఖ్యానం ఏమిటనుకుంటున్నారా...? టుడే నో ఫ్యాంట్స్ డే. ప్రతి సంవత్సరం మేలో వచ్చే మొదటి శుక్రవారాన్ని ‘నో ఫ్యాంట్స్ డే’ గా జరుపుకుంటారు. కెనడా మాజీ ప్రెసిడెంట్ కూడా ఆ రోజున విద్యార్థులతో కలిసి ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ ఫొటోలోని ఫోజు అదే. శంకర్ తీసిన ‘స్నేహితుడు’ సినిమా చూస్తే ఇండియాలో కూడా ఆ కల్చర్ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎనీ వే... హ్యాపీ నో ప్యాంట్స్ డే.... -
ఇటు టూ గ్రో
ఇంటిపంట సాగుదారులంతా ఫేస్బుక్లో ఫ్రెండ్స్. ఏయే పంటలు పండిస్తున్నారు? ఏం తింటున్నారు? ఏం వండుతున్నారు?.. ఇవన్నీ పోస్ట్స్, షేర్స్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా బంజారాహిల్స్లోని లామకాన్లో మీట్ అయ్యారు. ముచ్చటపడి ఇంట్లో పండించే ఆకు, కాయగూరలను ఆహారంగా ఎలా తీసుకోవాలనే విషయమై వర్క్షాపు నిర్వహించుకున్నారు. దీనికి హాజరైన ఎన్వరాన్మెంటలిస్ట్ సీతా ఆనంద్ వారందరికీ చెప్పిన విషయాలు మనకీ ఉపయోగపడేవే.. ..:: ఓ మధు మనం ఇంట్లో పండించుకునే ఆకుకూరలు వారం.. పదిహేను రోజులకు చేతికొచ్చేవై ఉంటే మంచిది. ఇక మనం మోజుపడి పెరటిలోనే పండించుకునే వాటిని ఎలా తింటున్నామన్నది ముఖ్యం. ఉదాహరణకు చిక్కుడు, వంకాయ వంటివి వండేటప్పుడు బాగా నూనె వేసి డీప్ ఫ్రై చేసేస్తుంటాం. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ కూరగాయలైనా, పప్పులైనా ఎంత పచ్చివి తినగలిగితే ఆరోగ్యానికి అంత మంచిది. శ్రీరామ నవమికి తినే వడపప్పు చక్కటి రా ఫుడ్ రెసిపీ. అలాంటివి రెగ్యులర్గా అన్ని పప్పులతో కలిపి కాంబినేషన్గా చేసుకోవచ్చు. పచ్చివి తింటేనే.. సలాడ్ చేసుకునేందుకు వీలైన కూరగాయలను కూడా ఇంట్లో పెంచవచ్చు. చాలా కూరగాయలను సలాడ్స్ చేసుకోవటం కుదరదని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. బీరకాయ, సొరకాయ, బూడిద గుమ్మడి కాయలు వంటివి పచ్చివి తినటమే ఉత్తమం. నీటి పరిమాణం ఎక్కువగా ఉండే కూరగాయల్ని వేడి చేయకూడదు. అంటే వండకూడదు. ఆ నీటిలో చాలా పోషకాలుంటాయి. వండటం వలన నీరు పోయి పోషకాలు నశిస్తాయి. ఆ కూరగాయల్లో ఉండే రసాయనాలు మారిపోతాయి. అలా కాంపోజిషన్స్ మారిపోతే ఆరోగ్యానికే హాని. తీగకూరగాయలన్నిటినీ సలాడ్స్గా చేసుకుని తింటేనే మంచిది. టమోటా, బాదం లాంటివి ఆ సలాడ్స్లోకి చేరిస్తే మంచి రుచి వస్తుంది. గంగవాయిలీ, పాలకూరలు కూడా సలాడ్లో వేసుకోవచ్చు. తోటకూర తినటం కొంచెం కష్టం. దీంట్లో కీరదోస, టమోటా, పచ్చిమిర్చి, నువ్వులు, పచ్చి నూనె.. ఇలా కాంబినేషన్స్తో ట్రై చేస్తే టేస్టీగా మారుతుంది. గానుగ నూనె వాడాలి. ఆహార క్రమం.. మనం తీసుకునే ఆహారంలో మొదటి స్థానంలో ఫ్రూట్స్ ఉండాలి. ఆ తరువాత స్థానం ఆకు, కూరగాయలకు ఇవ్వాలి. పప్పులకు కూడా ప్రాధాన్యమివ్వాలి. సమ్మర్లో ఎక్కువగా సలాడ్స్, ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీజనల్ ఫుడ్నుసమపాళ్లతో తీసుకోవాలి. సమ్మర్ స్పెషల్ స్మూదీ.. నచ్చిన ఆకుకూర ఒక కప్పు, అరటిపండు, బాదం లేదా కొబ్బరిపాలు మిక్సీలో వేసుకోవాలి. అరటిపండు... లేకపోతే ఖర్జూరాన్ని వేసుకోండి. జ్యూస్లా చేసుకోవాలి. దానిలో సబ్జా గింజలు వేస్తే.. సమ్మర్ స్పెషల్ స్మూదీ రెడీ. ఇందులో కావాలంటే కొంచెం కొబ్బరి కూడా కలపొచ్చు. -
యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్
యువ, చిన్నారి ప్రేక్షకులకు నగరంలో మహా పండుగ. ప్రఖ్యాత ‘స్టట్గార్ట్ ఇంటర్నేషనల్ యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్’ సిటీకి వస్తోంది. బంజారాహిల్స్లోని గోథెజంత్రమ్ ఈ కలర్ఫుల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. జర్మనీ, డెన్మార్క్, ఇరాన్, ఫ్రాన్స్లకు చెందిన షార్ట్ కార్టూన్స్ కూడా ఇందులో ప్రదర్శిస్తారు. జెబ్రా, హోమ్ స్వీట్ హోమ్, పాస్తా యా, మై లిటిల్ క్రోకో, లబాజ్ ఎ సాహబ్ వంటి చిత్రాలు వీటిల్లో ఉన్నాయి. వేదిక : గోథెజంత్రమ్, బంజారాహిల్స్ సమయం : ఈ నెల 30 సాయంత్రం 6.30 గంటలకు ప్రవేశం : ఉచితం -
బచ్చా బాలీవుడ్
అసలే సమ్మర్.. ఇక పిల్లలకు ఎక్కడ లేని హుషార్.. రొటీన్ ఆటపాటలు.. సమ్మర్ టూర్స్.. వీటి నుంచి కాస్త డిఫరెంట్గా గడపాలనుకునే చిన్నారులకు భలే చాన్స్.. బచ్చా బాలీవుడ్ ప్రోగ్రామ్. వేసవి కానుకగా ఇనార్బిట్ మాల్ జీక్యూ చానల్తో కలిసి 17 రోజుల పాటు నటనలో శిక్షణనిచ్చేందుకు వర్క్షాప్లు నిర్వహిస్తోంది. ఇందులో నటన, దర్శకత్వం, స్క్రిప్ట్రైటింగ్, డైలాగ్ రైటింగ్, మేకప్, సంగీతం, నృత్యం తదితర అంశాల్లో శిక్షణనిస్తారు. మే 2 నుంచి 18 వరకు ఈ వర్క్షాప్ జరుగుతుంది. 7 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలు అర్హులు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఇక్కడ టాలెంట్ చూపిన చిన్నారులతో ఒక షార్ట్మూవీని చిత్రీకరిస్తారు.దానిని జీక్యూ చానల్తో పాటు టీవీ, సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తారు. సో.. చిన్నారులూ.. గెట్ రెడీ. లైట్స్.. కెమెరా.. యాక్షన్. -
బాంబే రాగశ్రీ
బాంబే జయశ్రీ... భారతీయ సంగీతంలో పరిచయం అక్కర్లేని పేరు. ‘శశివదనే శశివదనే... స్వరనీలాంబరి నీవా...’ పాటను ఇష్టపడని సంగీత ప్రియులుండరు. ‘మనోహరా నా హృదయంలో...’ అంటూ కూనిరాగాయలు తీయని చెలి ఉండదు. ఇలాంటి పాటలతో తెలుగువారి చెవుల్లో తేనెలు కురిపించిన జయశ్రీ ఇటీవల హైదరాబాద్కు వచ్చారు. రవీంద్రభారతిలో సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన కచేరీలో తన గాన మాధుర్యంతో శ్రోతలకు వీనులవిందు చేశారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ఆమెను పలకరించింది. ఆ సంగీత ఝరి పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: కట్ట కవిత హైదరాబాదీలెప్పుడూ కొత్త ఆలోచనలను స్వాగతిస్తారు. ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో అంతే ఎనర్జిటిక్ కూడా. 1990 తొలినాళ్లలో నేను ఇక్కడ మొదటి ప్రదర్శన ఇచ్చాను. అప్పటినుంచే నాకు సిటీ అంటే అమితమైన ప్రేమ. బీఆర్సీ అయ్యంగార్ నిర్వహించే కన్సర్ట్స్లో పాల్గొనడానికి తరచూ వచ్చేదాన్ని. ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. నా పుస్తకం వాయిసెస్ వితిన్ మొదట ప్రింట య్యింది కూడా ఇక్కడే. కర్ణాటక సంగీతం తెలుగులో చాలా కంపోజ్ అయింది. అయితే ఈ విషయంలో తమిళనాడుతో పోల్చు కుంటే మాత్రం తక్కువే. ఈ 20 ఏళ్లలో నగరంలో కర్ణాటక సంగీత ప్రేమికులు తగ్గిపోయారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారికి మాత్రం దీనిపై ప్రేమ తగ్గలేదు. నేర్చుకుంటున్నారు, పాడుతున్నారు, వింటున్నారు. కర్ణాటక సంగీతం ఓ మంచి స్నేహితుడి సాంగత్యం వంటిది. శ్రోతల్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆస్వాదిస్తారు. ఈ సంగీతాన్ని వింటూ కొందరు ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తే... మరికొందరు అందులోని సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇవ్వాల్సిన సమయం... కోల్కత్తాలో పుట్టి, ముంబైలో పెరిగి, ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నా... నా పేరు పక్కన బాంబే ఉండడాన్నే ఇష్టపడతాను. ముంబై అంటే అంతిష్టం. సంగీతమే సర్వం అయిపోయింది కానీ.. తొలినాళ్లలో అమ్మ నా మెంటార్. తరువాత నా గురువులు టి.ఆర్.బాలమణి, లాల్గుడి జయరామన్ల ఆశీస్సులతో ఇంత ఎదిగాను. అలాగే హిందుస్థానీ సంగీతాన్ని నాకందించిన మహవీర్ జయపూర్వాలే, అజయ్ పొహంకర్లను మరువలేను. ఇప్పటిదాకా ఎంతో నేర్చుకున్నాను, ఎంతో పొందాను. కానీ ఇది నేను సమాజానికి ఎంతోకొంత ఇవ్వాల్సిన సమయం. అందుకే ‘హితం’ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా విద్యార్థులతో కలిసి గ్రామీణ విద్యార్థులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కు సంగీతాన్ని నేర్పిస్తున్నాను. సంగీతంతో సంతోషాన్ని నలుగురికి పంచడంలో ఆనందం ఉంది. -
లేడీసే లీడర్స్
యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్.. యువ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, వారి సాధికారతకు కృషి చేస్తున్న సంస్థ. దశాబ్దానికి పైగా నగరంలో సేవలందిస్తున్న ఎఫ్ఎల్ఓ (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్)కు అనుబంధంగా నడుస్తోందీ వైఎఫ్ఎల్ఓ. పర్సనాలిటీ డెవలప్మెంట్, అవేర్నెస్, ట్రైనింగ్, బిజినెస్ కన్సల్టెన్సీ, నెట్వర్కింగ్ తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు యంగ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ను అప్డేట్ చేస్తూ... వారి అభివృద్ధికి చేయూతనందిస్తోంది. దీనికి నూతన చైర్పర్సన్గా సామియా అలమ్ఖాన్ నియమితులయ్యారు. సిటీకి చెందిన ఈ యువ పారిశ్రామికవేత్త మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. బ్యాంకింగ్ ప్రొఫెషనల్గా కెరీర్ ప్రారంభించి, ఐటీఈఎస్, కేపీఓ సెక్టార్స్లో ప్రభావవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం లీడింగ్ లైఫ్స్టైల్ ఎగ్జిబిషన్ ‘ఆరాయిష్’ పార్ట్నర్గా, ‘ది హైదరాబాద్ దక్కన్ సిగరెట్ ఫాక్యక్టరీ’ డెరైక్టర్గా సమర్థవంతమైన పాత్రలు పోషిస్తున్న సామియా... శకుంతల దివి నుంచి ‘వైఎఫ్ఎల్ఓ’ పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా... జీవితంలోని ప్రతి అంకంలో మహిళ నాయకురాలే అంటారామె. ‘మహిళ సాధికారత సాధించాలంటే విద్యాభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించడం కీలకం. అన్ని స్థాయిల్లో విద్య, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా దీన్ని సాకారం చేసుకోగలం. కాన్ఫిడెన్స్, ఎంపవర్మెంట్... కజిన్స్. దానికి మూలం, ప్రోత్సాహం ఆత్మవిశ్వా సమే. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఓ శక్తిగా ఎదుగుతోంది. మహిళలు నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఆలోచనలు విస్తృతం చేసి, ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకు పోయేలా ఎదగాలి. అది విద్య, మౌళిక వసతులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, వ్యాపారాలు.. ఏవైనా కావచ్చు’ అంటూ ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు సామియా. వయసులో చిన్నే అయినా ఆమె ఆలోచనలు ఆకాశమంత. సీఈఓ నుంచి హౌస్వైఫ్ వరకు.. మహిళలు వంటింట్లో ఉన్నా.. వ్యాపార రంగంలో ఎదుగుతున్నా.. ఎక్కడున్నా నాయకురాళ్లే అనేది సామియా అలమ్ఖాన్ చెప్పే భాష్యం. అంతే కాదు... ‘ఏ గొప్ప కార్యం జరిగినా దానికి ఆరంభం మహిళలతోనే. విశ్వాసం, నాయకత్వ లక్షణాలున్న ఎంతో మంది స్త్రీల సామర్థ్యంతో ఈ భారతావని నిర్మితమైంది’ అంటూ స్ఫూర్తిదాయకంగా చెప్పుకొచ్చారు ఈ యువ పారిశ్రామికవేత్త. మహిళలు స్వతంత్రంగా ఎదిగి తోటి మహిళలకూ చేయూతనందించడం తప్పనిసరంటున్న సామియా ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారు. ‘లెర్న్, ఇంప్లిమెంట్ అండ్ ఇన్స్పైర్’ అనే థీమ్తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తానంటున్నారామె. సో... బెస్ట్ ఆఫ్ లక్ టు సామియా! -
రోప్ తేరా మస్తానా!
అంతకంతకూ ఆధునికులకు చేరువైపోతూ.. నిత్య జీవితంలో భాగంగా మారిపోతున్న యోగా.. సమకాలీన పోకడలకు తగ్గట్టు పలు రూపాలను సంతరించుకుంటోంది. అదే బాటలో నగరానికి తాజాగా పరిచయమైంది రోప్ యోగా. యోగ సాధకులకు కొత్త ఉత్సాహాన్నందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ..:: ఎస్.సత్యబాబు పై నుంచి కిందకు, పక్కలకు వేలాడుతూ చూడ్డానికి విచిత్రంగా అనిపించే ఈ ఆసనాల సాధన పేరు.. రోప్ వాల్ యోగా. అయ్యంగార్ల యోగాశైలి నుంచి ఈ నవీన యోగ జీవం పోసుకుందంటారు. యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ డిజైన్ చేశారని చెబుతున్న ఈ పద్ధతిలో తాడు, గోడలను ఆధారం చేసుకుని ఆసనాలు వేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చని చెబుతారు. అయ్యంగార్లు దీనిని యోగా కరుంట లేదా యోగా పప్పెట్రీ అని పిలిచేవారట. ఇప్పటిదాకా బాగా అనుభవజ్ఞులైన యోగా గురువులకు, యోగా చరిత్ర ఔపోసన పట్టిన వారికి మాత్రమే తెలిసిన ఈ విశేష ఆసన శైలి.. కొందరు యోగా గురువుల ద్వారా ఇటీవలే సిటీలో అరంగేట్రం చేసింది. ఆరోగ్యాభిలాషులకు చేరువవుతోంది. తాడు, గోడే ఆధారంగా.. రోప్ యోగా చేసేందుకు పూర్తిస్థాయి రోప్వాల్ను సెటప్ చేస్తారు. ఆ వాల్కు రోప్స్ను హుక్స్తో బిగిస్తారు. ట్రెక్కింగ్ వంటి వాటికి ఉపయోగించే బలమైన తాడును ఉపయోగిస్తారు. ఈ తాడు ఆధారంగా ఎంత బరువు, వయసు ఉన్న వారైనా ఆసనాలు వేయొచ్చు. గోడ, తాడులను ఆధారం చేసుకోవడం వల్ల మామూలు విధానంలో వేయడం కష్టమైన కొన్ని రకాల ఆసనాలను సులువుగా వేయవచ్చు. ప్రస్తుతం సిటీలోని కొన్ని యోగా స్టూడియోలలో బిగినర్స్ కోసం ఒకరకమైన తాళ్లను, యోగాసనాల్లో నైపుణ్యం కలిగిన వారి కోసం మరో రకమైన రోప్స్ను అమరుస్తున్నారు. మిగిలిన యోగాసనాలను సాధన చేస్తూ ఈ రోప్ యోగాను వారంలో రెండ్రోజులు వేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. నో పెయిన్స్.. ఓన్లీ గెయిన్స్.. రోప్యోగాతో రిజల్ట్స్ ఫుల్ అంటున్నారు రినా హిందోచా. నగరంలోని తిరుమలగిరిలో రోప్వాల్ యోగా స్టూడియోను ఆమె నెలకొల్పారు. ‘ఐదేళ్ల సాధనతో గాని సాధ్యం కాని విలోమాసనం వంటివి రోప్స్ ద్వారా స్వల్పకాలంలోనే వేయవచ్చు. ఈ శైలిలో వేసే ఆసనాల వల్ల వెన్నెముక పటిష్టమవుతుంది. టైట్ మజిల్స్ను రిలాక్స్ చేస్తుంది. బ్యాక్పెయిన్కి మంత్రదండంలా పనిచేస్తుందని చెప్పవచ్చు’ అంటున్న రినా హిందోచా తమ దగ్గర ఒకేసారి పది మంది రోప్ యోగా చేయడానికి వీలుగా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. పదకొండేళ్లుగా శిక్షకురాలిగా ఉన్న ఉత్తర శర్మ సైతం సిటీలో రోప్యోగా స్టూడియో నిర్వహిస్తున్నారు. కొన్ని రకాల బాడీ టైప్స్కి ఇది పనికిరాదనే అపోహలను యోగా నిపుణులు తోసిపుచ్చుతున్నారు. బాడీ టైప్ని బట్టి విభిన్న ఆసనాలు, సాధన శైలిని మార్చుకోవచ్చునంటున్నారు. గతేడాదే రోప్వాల్ యోగా స్టార్ట్ చేశానంటున్న రమ్య, తనకు దీని ద్వారా మైగ్రెయిన్ బాధ తప్పిందన్నారు. ‘తొలుత చూసినప్పుడు భయమేసింది. కానీ.. ఇప్పుడు మరింత ఫ్లెక్సిబుల్గా మారాన’ని ఆనందం వ్యక్తం చేశారామె. ఫ్లెక్సిబులిటీని అలా ఉంచితే తల భాగానికి రక్త సరఫరా మెరుగై మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు యోగా గురువులు. ‘ఇది మైండ్కి, దేహానికి చాలా మేలు చేస్తుంది. చర్మం కాంతివంతమై, ముడతల్ని నివారిస్తుంది. తలకు రక్త సరఫరా అనేది హార్మోనల్ బ్యాలెన్సింగ్కు ఉపకరిస్తుంది. పిట్యూటరీ గ్రంథితో పాటు బ్రెయిన్లో ఉండే స్పిరిట్యువల్ సెంటర్గా పేర్కొనే పినియల్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది’ అంటూ నిపుణులు దీని లాభాలను వివరిస్తున్నారు. జాగ్రత్తలూ ఉన్నాయ్.. ఇప్పటికే యోగసాధనలో ఉన్నవారు మాత్రమే ఈ యోగా శైలిని ఎంచుకోవాలి. అసలు యోగాసనాలే పరిచయం లేనివారు ప్రారంభ దశలో ఇవి వేయడం క్షేమం కాదు. కనీసం వారం రోజులైనా సరే ముందస్తుగా యోగ సాధన చేయకుండా తిన్నగా రోప్ అందుకోవడానికి కుదరదు. -
ఖల్నాయక్..
చార్మినార్ కేంద్రంగా నూతన నగరం ఏర్పడిన తర్వాత నగరం గురించి చెప్పిన వారిలో అమీర్అలీ మూడో తరానికి చెందినవాడు. ఈ థగ్గు ప్రత్యేకత ఏమిటి? ముందు తరాలు చెప్పిన ‘ఉద్యానవన నగరి’ వైనాలు నిజమేనని ధ్రువీకరించుకున్నాం.‘రోమాంచిత సాహసాలు’ ఇతడికే ప్రత్యేకం! అమీర్ అలీ అనే థగ్గు మాత్రమే బంజారాహిల్స్ను తొలిసారి వర్ణించాడు. ‘కుడివైపున కఠిన శిలల గుట్టలు. ఎడమవైపు మైదానప్రాంతం. ఆకాశంలో కలుస్తోందా అన్నట్టు ఆ మైదానం చాలా విశాలంగా ఉంది. మధ్యలో చిన్నిలోయ. అక్కడో నది (మూసి). తీరం వెంబడి అడవిని తలపించే వృక్షాలు. మధ్యలో సూర్యకాంతిలో తెల్లటి నివాసాలు. ధగధగా మెరుస్తున్నాయి. వీటన్నిటి మధ్య వీటన్నికంటే ఎత్తులో చార్మినార్.. పక్కనే మక్కామసీదు.. తలెత్తుకుని నిల్చున్నాయి. నూరు చిన్నచిన్న మసీదులు శ్వేతవర్ణంలో కాంతులీనుతున్నాయి. దూరం నుంచి ఈ నగరం చొరబడలేని అడవి. దగ్గరకు చేరేకొద్దీ తోటలు. తీర్చిదిద్దినట్టు.. వీధులు,నివాసాలు. దూరం నుంచి చూస్తే.. ఇక్కడ నరమానవులు ఉన్నారా..? అని అనిపించేది. నగరంలోకి ప్రవేశిస్తే తెలిసింది.. ఇది చిక్కని జనసముద్రం! చార్-మినార్ల మొనలు మేఘాలను చీల్చుకుని ఆకాశాన్ని అందుకున్నాయి. ఈ ఒక్క దర్శనం చాలు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫలితం దక్కింది’ అని హైదరాబాద్ గురించి రాసుకున్నాడు అమీర్ అలీ. బందీని విడిపించాడు! కుతుబ్షాహీ సమాధులను తొలిసారి వర్ణించిన క్రెడిట్ కూడా అమీర్అలీదే! ఇక్కడకు రావడంలో ‘అందం’ ఉంది.‘ప్రతాపం’ ఉంది. అమీర్ అలీ గుర్రంపై అటుగా వెళ్తున్నాడు. అజీమా అనే అందమైన యువతి బాల్కనీలో విశ్రాంతిగా కన్పించింది. ఓ ముసలి, వ్యసనపరుడు ఆమెను ఇంటి బందీని చేశాడు! అమీర్అలీని అజీమా చూపులు కలిశాయి. సహాయకురాలిని అమీర్అలీ దగ్గరకు పంపింది, విముక్తం చేయాలని కోరుతూ! కథను క్లుప్తం చేస్తే, వాళ్లు లేచిపోదామనుకుంటారు. మరుసటి రోజు ఉదయం కుతుబ్షాహీ సమాధుల దగ్గరలోని షావలీ దర్గా దగ్గర కలుసుకోవాలని అనుకుంటారు. అనుకున్న వేళకు అమీర్ అలీ వచ్చేస్తాడు. అజీమాకు ఆలస్యం అవుతుంది. దిక్కులు చూస్తోన్న అమీర్అలీకి దర్గా కుడివైపు కుతుబ్షాహీ సమాధులు కనిపిస్తాయి. కొంచెం దూరం నుంచి చూసి చెప్పినా ‘కుతుబ్షాహీలు శాశ్వతనిద్రపోతున్న అచ్చోట అడవి పావురాళ్లూ, గబ్బిలాలు చేసే సవ్వడిని పెద్దపెద్ద గుమ్మటాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడి శబ్దమూ, నిశ్శబ్దమూ, వెలుతురూ, చీకటి చిత్రమైన భావాలను కలిగించాయి’ అని అన్నాడు. బంధం తెంచుకుంది! కొంచెం ఆలస్యంగానైనా అజీమా అనుకున్న చోటికి వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పిల్లవాడిని కన్నారు. చాలా సుఖంగా జీవించారు. పదేళ్లు రివ్వున గడిచాయి. అమీర్ అలీ పట్టుబడ్డాడు! జైలు పాలయ్యాడు! అజీమా ఎటువంటి మానసికస్థితికి లోనైఉంటుంది..? రోజుకు పలుమార్లు ‘దిగ్భ్రాంతి’ చెందినట్లుగా ప్రకటనలు ఇచ్చే ‘పెద్దవాళ్ల’లా కాదు, ఆమె నిజంగానే దిగ్భ్రాంతి చెందింది! తనను రక్షించిన కథానాయకుడు థగ్గు అని.. చుక్కనెత్తురు చిందకుండా వందల మందిని హత్యచేశాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆత్మహత్య చేసుకుంది! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఫోన్ నంబర్: 7680950863 -
కమాన్ రాక్స్టార్స్
దక్కన్ పీఠభూమిలో ఠీవీగా నిల్చున్న భాగ్యనగరంలో హిల్స్కు కొదవేం లేదు. కాంక్రీట్ వనంలా మారిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వదిలిపెడితే.. నగర శివార్లకు వెళ్తే.. ఇప్పటికీ.. ఎన్నో బండరాళ్లు సహజమైన అందాలతో దర్జాగా నిల్చుని ఉన్నాయి. ఉలి అలికిడి లేకుండానే వెలిసిన ఈ రాళ్ల సోయగాన్ని కాపాడే ల క్ష్యంతో కొన్ని సంస్థలు రాకథాన్, రాక్వాక్, రాక్ క్లయింబింగ్ వంటి ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు శంషాబాద్ దగ్గర్లోని వైట్ క్వార్ట్జ్ క్లిఫ్ దగ్గర రాక్వాక్ నిర్వహిస్తోంది ద సొసైటీ టు సేవ్ రాక్స్. మాసబ్ట్యాంక్లోని ఎన్ఎమ్డీసీ ప్రధాన ద్వారం దగ్గర రాక్స్టార్లంతా జట్టుకట్టి ఉదయం 7.30 గంటలకు అక్కడ్నుంచి మెయిన్స్పాట్కు బయల్దేరుతారు. ఇందులో పాల్గొనేవారు సొంత వాహనాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫోన్: 9866019402, 9848418085 -
కిక్.. క్లిక్..
రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఫొటో ఎక్స్పో-2015 శనివారం ప్రారంభమైంది. సినీనటి మంచు లక్ష్మి ఈ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న అధునాతన బైక్ దగ్గర నిల్చుని ఫొటోకు ఫోజులిచ్చారు. - రాయదుర్గం -
నేను.. మీ దియా!
సెలబ్డబ్ సెలబ్రిటీస్ హార్ట్ బీట్ దియామీర్జా మోడల్గా మెరిశారు. సినీనటిగా వెలిగారు. నిర్మాతగా మారారు. వీటన్నింటికంటే మించి చిన్న వయసులోనే సందేశాత్మక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తోటి నటీనటులకు భిన్నంగా నిలిచారు. దియామీర్జా మన హైదరాబాదీ అని సగర్వంగా చెప్పుకొనేలా తన జీవనయానాన్ని మలచుకున్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా తన మనసులో మాటల్ని ఇలా పంచుకున్నారు. ..:: ఎస్.సత్యబాబు నేనెప్పుడూ మోడల్ని కావాలనుకోలేదు. అయ్యాను. నటిని అనే ఆలోచనే చేయలేదు. కాని సినిమాల్లో నటించాను. అదే క్రమంలో నిర్మాత అయ్యాను. డబ్బు కోసం సినిమాలు తీయడం లేదు. నా ఆలోచనలు, ఆశయాలను వీలైనంతగా ప్రతిఫలించే సినిమాలనే చేస్తున్నాను. ఇటీవల నేను తీసిన బాబీజసూస్ సినిమా అలాంటిదే. నేను.. మోడల్.. నటి.. ‘నువ్వు అందంగా ఉంటావన్న భావన తలకెక్కనీయవద్దు’ అని అమ్మ ఎప్పుడు హెచ్చరించేది. నేనెంచుకున్న కెరీర్ అందంతో ముడిపడి ఉన్నా.. కేవలం దాన్నే ఆధారంగా నేనెన్నడూ భావించలేదు. అందాలపోటీలను కనీసం చూడని నేను.. అనుకోకుండా ఓ రోజు బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొన్నాను. మా అమ్మ ఆకాంక్షలకు వ్యతిరేకంగా అందులో పార్టిసిపేట్ చేశాను. కిరీటం గెలుచుకున్నా.. ఒంటరి అయిపోయాను. సంతోషం అనేది ఇతరులతో పంచుకున్నప్పుడే కలుగుతుందని నాకు ఆనాడే తెలిసింది. ఇక సినిమాలు కూడా నేను ప్లాన్ చేసుకున్న రంగం కాదు. స్కూల్డేస్లో థియేటర్ అనుభవం ఉంది. బ్యూటీ కాంటెస్ట్లో విజయం నన్ను అమాంతంగా నటిని చేసేసింది. నేను...నా చిన్నతనం... మానసికంగా నా పరిణతికి నా స్కూల్డేసే కారణం. మా ఇంట్లోగానీ, స్కూల్లో గానీ.. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా చూపేవారు కాదు. మా పేరెంట్స్ది ప్రేమ వివాహం. ఇద్దరి మతాలు వేరు. దీంతో చిన్నప్పుడు మన మతమేదని అమ్మను ప్రశ్నించేదాన్ని. ‘మానవత్వమే మన మతమ’ని అమ్మ చెప్పేది. అయితే ఆ సమాధానంతో అందరినీ కన్విన్స్ చేయలేకపోయేదాన్ని. దీంతో ఇండియన్ అని చెప్పమన్న అమ్మ సూచనను అమల్లోపెట్టాను. నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు నాన్న పోయారు. తర్వాత నాకు స్టెప్ ఫాదర్గా అహ్మద్ అలీ మీర్జా వచ్చారు. ఆయనంటే నాకు చాలా గౌరవం. నా సర్నేమ్ ఆయన అందించిందే. నేను.. సేవ.. మొదటి నుంచి సామాజిక స్పృహ ఎక్కువే. అందుకే మంచి ఉద్దేశాలతో వచ్చే ఎన్జీవోలతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాను. మహిళలపై దాడుల నుంచి గ్రామీణ విద్య వరకు మన జీవితాలపై ప్రభావం చూపే ఏ అంశమైనా నా అవసరం ఉందంటే తప్పకుండా ముందుంటాను. ఎన్డీటీవీ గ్రీన్థాన్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి అందులో భాగంగా ఉన్నాను. కేన్సర్, ఎయిడ్స్పై అవగాహన కల్పించే సొసైటీలు, స్పాస్టిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, పెటా, క్రై.. ఇలా పలు సంస్థలతో కలసి కదులుతున్నాను. ప్రజాప్రయోజన కార్యక్రమాల ప్రచారం కోసం ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు నన్ను సంప్రదిస్తే వెంటనే ఓకే చెబుతున్నాను. నేను.. ఆయన.. పెళ్లి నా జీవితానికి మరింత ఆనందాన్ని జత చేసింది. సాహిల్.. ఓ అద్భుతమైన భాగస్వామి. ఆయన మనస్తత్వం, ఆలోచనలు బాగుంటాయి. ఇంకో మాట.. నాపై భాగ్యనగరం ప్రభావం ఎంతో ఉంది. చిన్నప్పుడు నేను చదువుకున్న విద్యారణ్య స్కూల్లో అవలంబించిన జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ నుంచి.. ఇక్కడ ఉండగా నా జీవితంలో ఎదురైన ప్రతి పరిణామం నా వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించాయి. -
నాట్యలాస్యం
ఆదివాసీలకు ఆలవాలంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో అడుగడుగునా జానపదలాస్యం కనిపిస్తుంది. మణిపూర్లో వికసించి, జానపద వైభవానికి ప్రతీకలుగా నిలిచిన ‘వసంత్ రాస్, పుంగ్ చోలమ్’.. నాట్యాలకు హైదరాబాద్ వేదిక కానుంది. శిల్పారామంలోని అంఫీ థియేటర్లో ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ జంట నృత్యాలు కనువిందు చేయనున్నాయి. ఇంఫాల్లోని జవహర్లాల్ నెహ్రూ మణిపురి డ్యాన్స్ అకాడమీకి చెందిన 20 మంది కళాకారులు వీటిని ప్రదర్శించనున్నారు. రాసలీల రేయిలోని.. బృందావన శ్రీకృష్ణుడి రాసలీలను కీర్తిస్తూ సాగే నాట్యం వసంత్రాస్. మణిపూర్లో వసంత రుతువు ఆగమనం తర్వాత చైత్ర మాసంలో జానపదులు జరిపే ఉత్సవాల్లో వసంత రాస్ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాధాకృష్ణుల ఆనందకేళి, కృష్ణునితో గోపికల వినోదవల్లరి.. ఇలా భాషలోన రాయలేని.. రాసలీల రేయిని.. ఈ రూపకంలో కళ్లముందుంచుతారు కళాకారులు. ఢమరుకం మోగ.. హోలీ వేళలో.. మణిపూర్ పల్లెల్లో పుంగ్ చోలమ్ కన్నులవిందుగా సాగుతుంది. మృదంగాలు చేతబూనిన కళాకారుల లాస్య విన్యాసం చూసి తరించాల్సిందే. పాదరసంలా పాదాలను కదుపుతూ.. గాలిలో ఎగురుతూ.. చేసే నృత్యం అద్భుతంగా సాగుతుంది. ఫోన్: 9849298275, 9391047632 -
వెండితెర బంగారం
చిట్చాట్ నిత్య నూతన చిరునవ్వుతో.. టాలీవుడ్ జనాలకు దగ్గరైన నిత్యామీనన్.. చీరకట్టులో సింప్లీ సూపర్బ్ అనిపించింది. బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో శనివారం జరిగిన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశంకర్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో... ఆయన కుంచె నుంచి జాలువారిన పెయింటింగ్స్ను చూసి అచ్చెరువొందింది. ఈ సందర్భంగా నిత్యామీనన్తో సిటీప్లస్ చిట్చాట్.. నేను పుట్టి పెరిగింది బెంగళూరులో. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి జర్నలిజం కోర్సు చేశా. హీరోయిన్ అవుతానని ఏనాడూ అనుకోలేదు. జర్నలిస్టుగా రాణించాలనుకున్నా. పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఆ తర్వాత నా ఆలోచనలను సినిమా ద్వారా చెప్పేందుకు నిర్మాత కావడం కోసం పూణెలోని ఎఫ్టీఐలో సినిమాటోగ్రఫీలో ఎన్రోల్ చేసుకున్నా. ఈ ఎంట్రెన్స్ సమయంలోనే నందినిరెడ్డితో పరిచయం ఏర్పడింది. హీరోయిన్గా నటించాలని బ్రెయిన్ వాష్ చేసింది. అలా మొదలైంది నా సినిమా కెరీర్. చిన్నప్పటి నుంచీ చలాకీ... స్కూల్ డేస్ నుంచే చలాకీగా ఉండేదాన్ని. ఇంట్లో కూడా బాగా అల్లరి చేసేదాన్ని. నా ముసిముసినవ్వులు, వినసొంపైన మాటలతో పేరెంట్స్ను కూల్ చేసేదాన్ని. కోపమొచ్చినా మరుక్షణంలో మరిచేలా నటించేదాన్ని. అలా నాకు తెలియకుండానే నటన వచ్చేసింది. పదో తరగతిలో ఉండగానే ‘ద మంకీ హూ న్యూ టూమచ్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. అలా మొదలైంది... నా కెరీర్కు దోహదపడిన ఈ భాగ్యనగరం అంటే నాకు ప్రత్యేక అభిమానం. అలా మొదలైంది సినిమా చాలా వరకు సిటీ లొకేషన్స్లోనే తీశారు. ఈ షూటింగ్ ిపీరియడ్లోనే సిటీలోని చారిత్రక కట్టడాలు చూసేశాను. నాకు డ్రెస్ వేసుకోవడం కంటే.. చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా ఉంటాను. హైదరాబాదీ డిజైనర్స్ చేతిలో అట్రాక్షన్గా రూపుదిద్దుకున్న చీరలు భలేగా ఉంటాయి. అ మజానే వేరు.. సిటీఫుడ్ అంటే చాలా ఇష్టం. టైం దొరికినప్పుడల్లా బంజారాహిల్స్లోని తాజ్బంజారాకు వెళ్తుంటా. అక్కడ లేక్ పక్కన ఉన్న కుర్చీల్లో కూర్చొని బిర్యానీ తింటే ఆ మజానే వేరు. స్పైసీ ఫుడ్ కూడా నోరూరిస్తుంటుంది. సరికొత్తగా కనిపించిన ఏ వంటకాలనైనా టేస్ట్ చూడనిదే వదిలిపెట్టను. సినిమా పరంగా అయితే ఇష్క్, ఒక్కడినే, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. మంచి పేరునే తెచ్చిపెట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తిలో చేసింది చిన్న రోల్ అయినా నటన సంతృప్తినిచ్చింది. ఓకే బంగారంలోని నా పాత్ర రియల్ లైఫ్కి అతికినట్టు సరిపోతుంది. సొంతూరు వెళ్తున్నా.... ఇన్నాళ్లు సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నా. రెండు నెలల పాటు బ్రేక్ను ఇవ్వాలనుకుంటున్నా. బెంగళూరుకు వెళ్లి కుటుంబసభ్యులతో గడుపుదామనుకుంటున్నా. ఆ తర్వాత బెంగళూరు డేస్ రీమేక్ తెలుగు మూవీలో నటించబోతున్నా. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతుంటా. రాస్తుంటా. కూర్చొని ఆలోచిస్తుంటా. అయితే ఆర్ట్ వేయడమనేది ఓ విద్య. అంత కష్టమైన పనిని నేను చేయలేను. -
దారితోచని పాదచారి
అదిగో అది రోడ్డు..! ఎవరికి..? వాహనాలకు. ఇదిగో ఇది ఫుట్పాత్..! ఎవరికి ? పాదచారులకు. మరి నడిచే వారేరి..? నడిచే వారికి దారేది..? ఈ నగరంలో ఫుట్పాత్లుండాలి ఎవరికైనా కనిపించాయా..? రోడ్లు విస్తరిస్తున్నాయి. వాటి నిండా వాహనాలు నిండిపోతున్నాయి. రహదారులు వెడల్పయ్యే కొద్దీ ఫుట్పాత్లు చిక్కిపోతున్నాయి. వాహనాలు పెరిగే కొద్దీ పాదచారులూ బక్కచిక్కిపోతున్నారు. దూరం తక్కువే అయినా నడిచే తీరిక లేదు నగరవాసికి. నడిచే తీరిక ఉన్నా రహదారిపై పద్మవ్యూహాన్ని ఛేదించే ఓపిక అంతకన్నా లేదు. తప్పక నడుద్దామనుకుంటే.. ఫుట్పాత్ ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిందే. విక్రమార్కుడిలా అన్వేషణ సాగిస్తే అక్కడక్కడా ఒక్కో సైజులో ఉండీ లేనట్టు ఊరిస్తూ దర్శనమిస్తాయివి. దారి కాచిన చిక్కులు.. నైలు నది ఉన్నట్టుండి ఎడారిలో మాయమైనట్టు మన సిటీలో ఫుట్పాత్లు సడన్గా మాయమై ఏ దుకాణానికి సంబంధించిన సామగ్రో కాళ్లముందు ప్రత్యక్షమవుతుంది. కాలు తడవకుండా సముద్రాన్నయినా దాటొచ్చేమో కాని.. కాలు రోడ్డు మీద పెట్టకుండా ఫుట్పాత్ మీద నడవలేమన్నది ‘నగర సత్యం’. అడుగడుగునా ఆక్రమణలు, కబ్జాలు సారీ అలా అంటే వారికి కోపమొస్తుందేమో ! ఏదో జస్ట్ ఖాళీగాఉందని వాడుకుంటున్నారు. కేవలం దుకాణాదారులేనా.. గృహస్తులు, అపార్ట్మెంట్వాసులూ తక్కువేం కాదు. మొక్కల పెంపకం పేరుతో ఫుట్పాత్లను అందంగా వాడేసుకుంటున్నారు. అడగటానికి మీరొస్తారా..! నేనొస్తానా..!! అందుకే అవి అందంగా చెలామణీ అయిపోతున్నాయి. ఇదీ రహదారే.. ఇక అక్కడక్కడ కనిపించే ఫుట్పాత్లని ముఖ్యంగా మెయిన్ రోడ్పై ఫుట్పాత్లను యమ దర్జాగా వాడుకునే బైక్వీరుల గురించి చెప్పాలి. సిగ్నల్ పడినా ట్రాఫిక్లో కొన్ని బైకుల వేగం ఆగదు. ఫుట్పాత్ కనిపిస్తే చాలు వాటిపైకి ఎక్కేస్తాయి. వారి కోసమే ఫుట్పాత్ ఉందన్నట్టు రేసింగ్లో దూసుకెళ్లినట్టు ముందుకెళ్తారు. ఫుట్పాత్లు ఇలా కూడా వాడొచ్చన్నమాట అని విస్తుపోవడం మన వంతు. ఆపడానికి మీరొచ్చారా..! నేనొచ్చానా..!! అందుకే వాళ్లు ఫుట్పాత్లను సైతం ‘మా దారి రహదారి’ అని డిక్లేర్ చేస్తున్నారు. మార్గదర్శులెవరు..? ‘కంచే చేను మేస్తే’ అన్న చందంగా ప్రభుత్వం వల్ల కలిగే నష్టాల గురించి ఎవరి దగ్గర మొర పెట్టుకోవాలో చెప్పండి. రోడ్డుతో పాటు ఫుట్పాత్లకూ ఇంత బడ్జెట్ ఉంటుంది. కానీ రోడ్డొకరిది.. ఫుట్పాత్ ఒకరిది. నారు పోసిన వాడు నీరు పోయక మానడు. కాని, రోడ్డు పోసిన వాడు ఫుట్పాత్ మాత్రం వేయడు. అది వేరే డిపార్ట్మెంట్ పని కనుక. పోనీ ఎట్టకేలకు ఫుట్పాత్ తయారైనా.. మరో డిపార్ట్మెంట్ అర్జెంట్గా తవ్వి తీరుతుంది. అలా తవ్వింది పూడ్చడానికి మరో బడ్జెట్కాలం పడుతుంది. ‘మా తాతలు గోతులు తవ్వారు.. మేం నీతులు చెబుతున్నాం’ అంటూ చూసే వారే కానీ నిజంగా ఫుట్పాత్ల గురించి ఆలోచించే డిపార్ట్మెంట్లేవి. ఓ బాటటౌటటడ నడకదారి మనందరి హక్కు. అందమైన రోడ్లతో పాటు సరైన ఫుట్పాత్లు మన నగరానికి నిజమైన అవసరం. మనం వాడనిదే, అడగనిదే ఆ అవసరాన్ని తీర్చేందుకు ప్రభుత్వాలు ముందుకు రావు. ఓ పక్క కొన్ని చోట్ల నిజంగానే ఫుట్పాత్లు అందంగా ఉన్నా, వాటిని ఉపయోగించే పాదచారులు ఏరి..? ఫుట్పాత్లు ఉన్నా కూడా రోడ్డు మీద వాహనాల మధ్యలో నడిచే వారు మనలో చాలామందే ఉన్నారు. అలవాటులో పొరపాటుగా ఫుట్పాత్ మరచిపోయి మరీ వాహనాలతో పోటీపడుతున్నారు. ఈ సారి ఫుట్పాత్ కనిపిస్తే పండుగ చేసుకోండి. దానిపై దర్జాగా నడవండి. ఏదైనా అడ్డొస్తే ధైర్యంగా అడగండి. నడవడం మన హక్కు. ఫుట్పాత్ మన అధికారం. -
యాప్స్ ఫర్ క్లైమేట్ చేంజ్
‘మొబైల్ యాప్స్ ఫర్ క్లైమేట్ చేంజ్’... విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్తో కలిసి వరల్డ్వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రూపొందించిన ప్రాజెక్ట్! ఈ పర్యావరణ అధ్యయనాన్ని ‘అర్బన్ ఐనేచర్వాచ్ చాలెంజ్’ పేరుతో విద్యార్థుల ప్రాజెక్టు వర్క్లో భాగం చేశారు. డిసెంబర్లో లాంచ్ చేసిన ఈ యాప్స్ ఉపయోగిస్తున్న తీరును తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టింది డబ్ల్యూడబ్ల్యూఎఫ్. ఇందులో మెరిడియన్, హైదరాబాద్ పబ్లిక్స్కూల్, భారతీయవిద్యాభవన్, చిరాక్ ఇంటర్నేషనల్, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, ఇక్బాలియా ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులు పాల్గొని.. యాప్ వినియోగాన్ని వివరిస్తారు. సమయం: ఉదయం 9:30 గంటలకు వేదిక : ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, బంజారాహిల్స్ -
సాక్షి ఎక్స్లెన్స్
గత ఏడాది విభిన్న రంగాల్లో ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శించిన విజయవంతమైన వ్యక్తులను గుర్తించి సత్కరించేందుకు సాక్షి మీడియా గ్రూప్.. ‘సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ 2014’ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహించింది. నగరంలోని తాజ్ బంజారా హోటల్ ఇందుకు వేదికైంది. అవార్డులకు సంబంధించిన నామినేషన్ల వడపోత ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు పాపులర్ కేటగిరీలుగా స్పోర్ట్స్, టీవీ సీరియల్స్, సినిమా రంగాలకు సంబంధించి తమకు అందిన నామినేషన్లను జ్యూరీ సభ్యులు పరిశీలించారు. వీటిలో ఒక్కో కేటగిరీ నుంచి ఫైనలిస్ట్లుగా కొందరిని ఎంపిక చేశారు. వీరిలో నుంచి విజేతలను ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. యంగ్ అఛీవర్ ఇన్ సోషల్ సర్వీస్ కేటగిరీ నుంచి ఐదుగురిని టాప్ ఫైనలిస్ట్లుగా ఎంపిక చేశారు. ఈ విభాగంలో తుది విజేతను జ్యూరీయే స్వయంగా ఎంపిక చేస్తుంది. మొదటి రోజు ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఎంపిక కమిటీకి జ్యూరీ సభ్యులుగా సినీ, క్రీడా రంగ ప్రముఖులు రావి కొండలరావు, గీతాంజలి, అల్లాణి శ్రీధర్, పూర్ణిమారావు, ఎన్.ముఖేష్కుమార్, విక్టర్ అమల్రాజ్, నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, నృత్యకారిణి స్వాతి సోమనాథ్ వ్యవహరించారు. రెండో రోజు.. రెండో రోజు గురువారం బెస్ట్ మూవీ, బెస్ట్ మేల్-ఫిమేల్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫిమేల్-మేల్ సింగర్ల కేటగిరీలకు ఫైనలిస్ట్లను సెలక్ట్ చేశారు. ఈ ప్రక్రియకు జ్యూరీ సభ్యులుగా సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ్, చంద్రబోస్, కవిత, రాశి, సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్, సామాజిక ప్రముఖులు గోరటి వెంకన్న, దేవి వ్యవహరించారు. ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి పర్యవేక్షించారు. సంతోషంగా ఉంది: దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన వారిని సత్కరించేందుకు సాక్షి మీడియా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఈ తరహా సెలక్షన్స్ సినీఫీల్డ్లో సాధారణమే. అయితే ఓ మీడియా సంస్థ ఇంత జెన్యూన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉంది. మరెందరికో స్ఫూర్తి: నటి కవిత ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సాక్షి మీడియాకు ధన్యవాదాలు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా ఇందులో పాలుపంచుకుంటున్నా. ఈ కార్యక్రమం మరెందరికో స్ఫూర్తి నివ్వాలని కోరుకుంటున్నా. కొత్తగా అనిపించింది: సంగీత దర్శకుడు రాధాకృష్ణన్ ఇలాంటి అవార్డ్ ప్రోగ్రామ్స్ బాలీవుడ్లో ఎక్కువ. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సాక్షి నుంచి నాకు కాల్ రాగానే కొత్తగా అనిపించింది. ఇటువంటికార్యక్రమాలు కొత్త స్ఫూర్తి నింపుతాయి. గొప్ప ఆలోచన: సినీ గేయ రచయిత చంద్రబోస్ కేవలం సినిమా నటీనటులు, గాయనీగాయకులు అని కాకుండా.. స్పోర్ట్స్ పర్సన్స్, సీరియల్స్, సామాజిక సేవకులు.. ఇలా పలు రంగాలకు చెందిన వారిని ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు సాక్షికి కృతజ్ఞతలు. ప్రేక్షకులే నిర్ణేతలు: సినీ నటి రాశి ఎవరు ది బెస్ట్ అని నిర్ణయించడం అంత సులభమైన విషయం కాదు. సరైన న్యాయనిర్ణేతలు మాత్రం టీవీల ముందు కూర్చున్న ప్రేక్షక దేవుళ్లే. సాక్షి చేపట్టిన ఎక్స్లెన్స్ ఈవెంట్లో నా ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో..: సామాజిక కార్యకర్త దేవి సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నం బాగుంది. షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీస్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుండేది. మంచి కథ, కథనం ఉండి పెద్దగా పేరు రాని మంచి మూవీస్ అనేకం ఉంటాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టి ఉంటే.. న్యూ టాలెంట్స్ను ప్రోత్సహించినట్టుండేది. ఫ్యూచర్లో ఆ కోణంలో ఆలోచిస్తే బాగుంటుంది. -
మై ఎడ్యూ ఫెయిర్-2015
సమయం: ఈ రోజు ఉదయం 11 గంటలకు వేదిక: గ్రీన్పార్క్, బేగంపేట్ ఫోన్: 9176938884 -
వీక్లీ ఆర్గానిక్ బజార్
సమయం: ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు వేదిక: లామకాన్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్ ఫోన్: 9642731329, 9177882261 -
సలామ్ సల్సా
ఆడుతూ పాడుతూ.. అలుపు సొలుపు తెచ్చుకోవాలనుకుంటున్నారా. తనువుకు వ్యాయామం.. మనసుకు ఆహ్లాదం కలిగించే సరదా స్టెప్పుల ఆటే సల్సా. చూడటానికి జల్సాగా కనిపించినా.. సల్సాతో ఫిట్నెస్ మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు ట్రైనీలు. అందుకే సల్సా డ్యాన్స్ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు డ్యాన్స్ క్లాస్ జరుగుతుంది. వేదిక: అవర్ సేక్రెడ్ స్పేస్, ఎస్పీ రోడ్, సికింద్రాబాద్ -
సెలెక్ట్ యువర్స్..
నిగనిగలాడే నగలంటే మగువలకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందుకే బంగారం ధర భగభగ మండినా.. కొంగొత్త ధగధగలతో మేనంతా మెరిసిపోవాలనుకుంటారు. ష్యాషన్కు రెడ్కార్పెట్ పరచి స్వాగతించే అతివల కోసం.. యునెటైడ్ ఎగ్జిబిషన్ మెగా జ్యువెలరీ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. ప్రముఖ డిజైనర్ల లేటెస్ట్ కలెక్షన్స్ ఇందులో కొలువుదీరనున్నాయి. బంజారాహిల్స్లోని తాజ్కృష్ణలో ఈ రోజు నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఫోన్: 040-66466778 -
రాగరంజని
ద్రవిడ సీమలో విరిసిన గాత్రం సిటీవాసులను రాగ రంజనిలో ఓలలాడించనుంది. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ రంజనీ శివకుమార్ గళవిన్యాసానికి బంజారాహిల్స్ రోడ్నంబర్ 8లోని సప్తపర్ణి వేదిక కానుంది. రంజని కర్ణాటక గాత్ర కచేరి ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రవేశం ఉచితం. ఫోన్: 040- 23705440 -
ఫన్ ఫ్లవర్
పొద్దుతిరుగుడు పూలలా ముద్దుగుమ్మలు సిగ్గులొలికిస్తూ వయ్యారాలు పోయారు. పసుపు పచ్చందంలో మెరిసిపోయారు. ఫన్కార్ ఇన్నోవేటివ్ మైండ్స్ లేడీస్క్లబ్ సభ్యులు మారియట్ హోటల్లో శుక్రవారం సన్ఫ్లవర్ పార్టీ వేడుకగా చేసుకున్నారు. సమ్మర్ సీజన్కు ఫన్నీగా వెల్కం చెబుతూ.. ఎల్లో కాస్ట్యూమ్స్లో స్టన్నింగ్ పోజులిచ్చారు. -
ఖూబ్సూరత్
దుబాయ్ శీను సినిమా చూశారుగా..! అందులో షాయాజీ షిండే తరచూ ముఖం వంకర్లు తిప్పే సీన్ గుర్తుందా..? ముఖారవిందం అందంగా కనిపించడానికి ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తున్నానని షిండే చెప్పే సీన్లు మనం కామెడీగా తీసుకున్నాం కానీ.. అది నిజమేనండీ బాబు..! ప్రస్తుతం సిటీలో కొందరు అతివలకు ఫేసర్సైజ్ ఫీవర్ పట్టుకుంది. వీకెండ్ వస్తే చాలు.. ఫేస్ చరిష్మాను మార్చే ఫేసర్సైజ్ వర్క్షాప్లకు పరుగులు తీస్తున్నారు. ..:: వాంకె శ్రీనివాస్ ‘ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది’.. తెలుగు అలంకారాలు నేర్చుకునే రోజుల్లో ఈ వాక్యం పదే పదే చదువుకున్నాం. చంద్రబింబాన్ని కృష్ణపక్షం ఎలా మింగేస్తుందో.. ముఖ వర్చస్సును వయసు అలా హరిస్తుంది. నిండు యవ ్వనంలో నిగనిగలాడిన బూరెల్లాంటి బుగ్గలు.. నడివయసుకు వచ్చే సరికి పీలగా మారిపోతాయి. ఫిట్నెస్ సూత్రాలను తు.చ తప్పకుండా ఫాలో అయ్యే మగువల్లోనూ తనువెల్లా అందం తొణికిసలాడినా.. ముఖం వరకు వచ్చే సరికి మాత్రం వయసు పైబడిన ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి సిటీస్త్రీలు ఫేసర్సైజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీకెండ్స్లో జరిగే వర్క్షాప్లకు హాజరవుతున్నారు. అక్కడ నేర్చుకున్న వ్యాయామాలను ప్రతి రోజూ ఓ 15 నిమిషాలు చేస్తూ గ్లామర్ను పెంచుకునే పనిలోపడ్డారు. ముఖార‘వింత’ం ఫేసర్సైజ్లో భాగంగా ముఖంపై చేతులు పెట్టుకోవడం.. మెడ చుట్టూ చేతులను బిగించడం.. ఇలా వింత విన్యాసాలతో అందాన్ని సొంతం చేసుకుంటున్నారు. ‘1980లో కారొలే మాగియో ఫేసర్సైజ్ ఫేసియల్ ఎక్సర్సైజ్ను సృష్టించారు. ఇందులోని ఎక్సర్సైజ్లు ముఖ కండరాలను మెరుగుపరిచి అందంగా కనబడేలా చేస్తాయి. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఫేసర్సైజ్.. ఢిల్లీ, ముంబైల మీదుగా ఇప్పుడు హైదరాబాద్కు చేరుకుంది. ఇన్నాళ్లు ముఖం అందాన్ని మార్చుకునేందుకు కాస్మొటిక్ సర్జరీల వైపు మొగ్గు చూపిన వాళ్లు.. ప్రస్తుతం ఫేసర్సైజ్ ఆప్షన్ను ఎంచుకుంటున్నారు. ఇందులో ఫోర్హ్యాండెడ్నెస్, డబుల్ చీక్, ఫర్ స్మైలింగ్ లైన్, నెక్ టోనర్.. ఇలా 72 డిఫరెంట్ ఎక్సర్సైజులను నేర్పిస్తున్నామ’ని తెలిపారు జూబ్లీహిల్స్లోని మేఘవి స్పా యజమానురాలు మేఘవి. చహరేమే జాదూ.. ఒక్కో రకం ఎక్సర్సైజ్తో ముఖంలోని ఒక్కో భాగం అందంగా కనిపిస్తుందని చెబుతున్నారు ఫేసర్సైజ్ ట్రైనీలు. ‘నుదురు అందంగా కనిపించడం కోసం.. కనుబొమ్మల పైభాగంలో రెండు వైపుల నుంచి చేతులు కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సులువుగా జరిగి.. కండరాలు సంకోచించడం వల్ల.. లలాటంలో కళ పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాల వల్ల మీ వయసు ఐదేళ్లు తక్కువగా కనిపిస్తుంది’ అని అంటారు మేఘవి. ఈ ఫేసర్సైజ్ కేవలం అతివల కోసమే కాదు. మగాళ్లు కూడా చేసుకోవచ్చని చెబుతున్నారామె. ముఖంలో అందం పెరగటం వల్ల మనిషిలో కాన్ఫిడెంట్ లెవల్స్ కూడా పెరుగుతాయని అంటున్నారు. -
వెన్నునొప్పి ముదిరితే మిగిలేది వైకల్యమే
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయక పోవచ్చు కానీ, శరీరాన్ని నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్రెస్ట్,ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సలతో వెన్ను నొప్పిఉన్న మూల కారణాలను శాశ్వతంగా నిర్మూలించవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. వెన్నెముక వర్సెస్ పవర్హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడి నట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్ట మొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. కేరళ పంచకర్మతో... అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరో ధాన్ని నివారించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరా లను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవ స్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరో సారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు ఇన్పేషంట్ సౌకర్యం కలదు. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail:krishnaprasad.gmail.com -
డాగ్స్ spot
ఆదివారం వస్తోందంటే వాటికి పండుగే. ఎంచక్కా టామీతో కులాసాగా షికార్లు కొట్టొచ్చని పప్పీ... జూలీతో జాలీగా ఎంజాయ్ చేయొచ్చని జాకీ.. తెగ ఆరాటపడుతుంటాయి. మనం ఆదివారం కోసం ఎదురు చూడటంలో అర్థం ఉంది. మరి స్కూలు, ఆఫీసు ఎరుగని శునకాలు కూడా ఆ రోజు కోసం ఎందుకంత ఆరాటంగా ఎదురుచూస్తున్నాయంటే మాత్రం.. దానికో కారణం ఉంది. ఎవ్రీ సండే వాటి యజమానులతో కలసి.. అందంగా ముస్తాబై నెక్లెస్రోడ్లోని జలవిహార్కు ఎదురుగా ఉన్న చిన్నపార్క్కు వచ్చేస్తాయి. ఇవే కాదు నగరం నలుమూలల నుంచి ఎన్నో శునకాలు ఈ ‘డాగ్స్ స్పాట్’కు చేరుకుంటాయి. ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు తోటి కుక్కలతో ఆటలాడుకుంటాయి... సరదాగా పోట్లాడుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మస్తీ మజా చేసేస్తాయి. ..:: వాంకె శ్రీనివాస్ గాంధీనగర్కు చెందిన సన్నీ ఓ రోజు తన డ్యూక్ (కుక్క)ను పట్టుకుని నెక్లెస్రోడ్ మీదుగా వెళ్తున్నాడు. అదే టైంలో ఓ పెద్దాయన రాందాస్తో సన్నీకి పరిచయమైంది. వీరిద్దరూ ఇక్కడ ముచ్చట ్లలో ఉండగానే.. రాందాస్ చేతిలో ఉన్న మరో కుక్క (బాండ్), డ్యూక్తో సరదాగా ఆటలాడుకుంది. ఈ సీన్ ఇద్దరిలో కొత్త ఆలోచనకు నాంది పలికింది.ప్రతి ఆదివారం నెక్లెస్రోడ్కు కుక్కలను జాగింగ్కు తీసుకురావాలని అందులో కోరారు. మీ పెట్స్కు ఇంతకన్నా మంచి వీకెండ్ గిఫ్ట్ మరొకటి మీరివ్వలేరని ప్రచారం చేశారు. ప్రతివారం కుక్కలు కలుస్తుండటం వల్ల వాటి ప్రవర్తనలో మార్పు కూడా వస్తుందని అప్పీల్ చేశారు. పోటీగా ఆటలు.. సన్నీ అండ్ రాందాస్ ఆలోచన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మొదట రెండు కుక్కలతో మొదలైన సండే సందడి.. ఇప్పుడు 70 శునకాలకు చేరుకుంది. సిటీ శివారు ప్రాంతాల నుంచి కూడా పెట్ లవర్స్ తమ శునకాలను తీసుకుని నెక్లెస్ రోడ్కు చేరుకుంటున్నారు. దీంతో ప్రతి ఆదివారం లాబ్రీడర్, జర్మన్ షెఫర్డ్, బిగిల్, పగ్, రాడ్విల్లర్.. ఇలా వివిధ జాతుల కుక్కలు నెక్లెస్ రోడ్లో ఆడిపాడేసుకుంటున్నాయి. తోటి శునకాలతో కలసి పోటీ పడిమరీ పరిగెత్తుతున్నాయి. మూడు గంటల పాటు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి. ఫ్యామిలీ అనుబంధం... ఇక్కడికి వచ్చిన శునకాలే కాదు.. వాటిని తమ వెంట తీసుకుని వచ్చిన యజమానులకూ కొత్త పరిచయాలు సరికొత్త ఆనందాన్ని పంచుతున్నాయి. మొదటి వారం ముఖ పరిచయంతో వెనుదిరుగుతున్న పెట్ లవర్స్.. రెండు, మూడు వారాలు అయిపోయే సరికి మంచి మిత్రులుగా మారుతున్నారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి పలకరించుకునే స్థాయికి చేరుకుంటోంది వీరి స్నేహం. అంతేకాదు, అలా వాళ్ల ఇంటికి వెళ్లేటప్పుడు తమ కుక్కను కూడా వెంటబెట్టుకుని మరీ వెళ్తున్నారు. ఇక ఎవ్రీ సండే కుక్కలు చేసే విన్యాసాలతో రిలీఫ్ అవుతున్నారు వాటి ఓనర్లు. ‘కుక్కలు లేనివారు కూడా ఎందరో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అవి చేస్తున్న ఫీట్లు చూసి.. వారూ కుక్కలను పెంచుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొందరు మేలుజాతి కుక్కల సమాచారం తెలుసుకుంటున్నార’ని చెబుతున్నారు సన్నీ. మొత్తానికి సిటీలో కొత్తగా మొదలైన డాగ్ స్పాట్ శునకాలకే కాదు, వాటి యజమానులకు కూడా సరికొత్త జాలీ స్పాట్గా మారిపోయింది. -
అదరగొట్టారు
స్కూలు ఫంక్షన్స్లో పిల్లలు ప్రదర్శనలు ఇవ్వటం మాములే. అలా ఓ స్కూల్లో వేసిన నాటకంలో వాళ్ల ఇన్వాల్వ్మెంట్, టాలెంట్ చూసి ముచ్చట పడిన యాజమాన్యం.. మరోసారి పెద్దల కోసమంటూ లామకాన్లో వీళ్లతో ఓ నాటక ప్రదర్శన ఏర్పాటు చేసింది. 20 మందికి పైగా పిల్లలు ఎలాంటి తడబాటు లేకుండా డైలాగులు, చక్కటి హావభావాలతో మురిపించారు. కామెడీ, సెటైర్, చక్కటి భాష కలిసిన ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకం ఆహూతులను ఆకట్టుకుంది. షేక్స్పియర్ రాసిన నాటకాలు అర్థం చేసుకోవటమే కష్టం. అలాంటిది ఆ నాటకాన్ని అలవోకగా ప్రదర్శించడం మహామహా నటులకే సాధ్యమయ్యే పని. అంతటి క్లిష్టమైన నాటకాన్ని సులభంగా అర్థం చేసుకోవడమే కాదు... అనుభవమున్న నటుల్లా ఆయా పాత్రల్లో జీవించారు చిన్నారులు. నగరంలోని శ్లోక పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు షేక్స్పియర్ ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకాన్ని నవరస రంజితంగా ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ఒరిజినల్లో వున్న క్యారెక్టర్లు, కథనం అలాగే ఉన్నాయి. సంభాషణలు మోడరన్ డేస్కి అనువుగా మార్చి, కాంటెపరరీగా మలిచిన ఈ నాటకం అబ్బురపరిచింది. ఊహించని మలుపులు.. షేక్స్పియర్ నాటకం విషయానికి వస్తే.. ‘ఫ్రెడరిక్ తన అన్న డ్యూక్ ఆస్తిని ఆక్రమించుకుని అతన్ని తరిమేస్తాడు. కానీ అతని కూతురు రోజాలిండ్ని మాత్రం తన కూతురు సిలియా కోసం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చూసీ చూడగానే రోజాలిండ్ ప్రేమలో పడతాడు పరదేశ యువరాజు ఆర్నాల్డో. అతని అన్న ఆలివర్. రోజాలిండ్ ప్రేమ విషయం తెలిసి ఫ్రెడరిక్ కోపగించుకొని దండించబోతాడు. తట్టుకోలేక రోజాలిండ్ అబ్బాయిగా, సిలియా ఎలీనాగా వేషం వేసుకుని ఇంటి నుంచి పారిపోతారు. మారువేషాల్లో వున్న ఎలీనాతో అలివర్ ప్రేమలో పడతాడు. మగవేషంలో ఉన్న రోజాలిండ్ ఆర్నాల్డోని కలుస్తుంది. ప్రేమకోసం తపిస్తూ అతను రాస్తున్న కవితలు చదివి, ఆ ప్రేమను మరిచిపొమ్మని చెబుతుంది. మరోవైపు రోజాలిండ్ని అబ్బాయి అనుకుని ఫేబ్ అనే అమ్మాయి ఆమెను ప్రేమిస్తుంది. ఇలా ఒక ప్రేమ జంటతో మొదలైన కథలోకి నాలుగు జంటలు వస్తాయి. చివరికి సుఖాంతమవుతుంది. అయితే మధ్యలో వచ్చే అనేక పాత్రలు, ఊహించని మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రపంచం నేటికి చెప్పుకునే ‘జీవితం ఒక రంగస్థలం లాంటిది, అందులో మనమందరం పాత్రధారులం’ డైలాగ్స్ ఈ నాటకంలోనివే. -
సమజ్దార్ లోగ్
ఎడతెరిపి లేని పని భారంతో అలసిన మనసులను నవ్వుల జల్లులతో కాసింత ఉల్లాస పరిచే కామెడీ ప్లే ఇది. దర్పణ్ థియేటర్ గ్రూప్ ఈ నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ముగ్గురు మతి స్థిమితం లేని వారి చుట్టూ కథ తిరుగుతుంది. ముగ్గురూ కలసి తమ లైఫ్ను ఆశ్రమంలో ఆస్వాదిస్తుంటారు. ఓ రోజు ఉన్నట్టుండి వీరి మధ్యలోకి ఓ వ్యక్తి వస్తాడు. తాను పిచ్చివాడిని కాదని, బాగా చదువుకున్నానని చెప్పుకుంటాడు. అసలు ఇంతకీ అతను ఎందుకు అక్కడికి వచ్చాడని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు ఆ ముగ్గురూ. వారి మధ్య సాగే సంభాషణ గిలిగింతలు పెడుతుంది. బంజారాహిల్స్ లామకాన్లో ఈ నెల 10, 11 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు ప్లే షురూ అవుతుంది. వివరాలకు: 9703169709 -
ది ఎకనామిక్స్ ఆఫ్ హ్యాపీనెస్
ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రదర్శిస్తున్న ఈ చిత్రం... ప్రపంచంలోని ఆరు భిన్న ప్రాంతాల్లో సంభవించిన ఆర్థిక వ్యవస్థ మార్పులపై చర్చిస్తుంది. వేదిక: లామకాన్, బంజారాహిల్స్ సమయం: ఈ నెల 22 రాత్రి 7 గంటలకు -
ఫెస్ట్... జబర్దస్త్!
ఫ్యాషన్వాక్, సోలో డ్యాన్స్, మేనేజ్మెంట్ స్కిట్స్.... డిఫరె ంట్ కాన్సెప్ట్స్ తో ఆంగ్లోఫైల్ బిజినెస్ స్కూల్ యాన్యువల్ ఫెస్ట్-2015 జోష్ ఫుల్గా సాగింది. మూడు థీమ్స్తో సాగిన మూడు రౌండ్ల ఫ్యాషన్ షో విద్యార్థుల సృజనాత్మకతను కళ్లకు కట్టింది. విద్యార్థులు రౌండ్లో జంటగా, రెండో రౌండ్లో వెస్ట్రన్ అండ్ ఫ్లోరల్ వేర్లో, మూడో రౌండ్లో ఎథ్నిక్ అండ్ డిజైనర్ వేర్లో ర్యాంప్పై ప్రొఫెషనల్ మోడల్స్కు దీటుగా హొయలు పోయారు. గెస్ ది బ్రాండ్, అడ్వర్టైజింగ్స్ అండ్ నాస్టాల్జియా వంటి మేనేజ్మెంట్ గేమ్స్ స్టూడెంట్స్ మెదడుకు పదును పెట్టాయి. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వినితా సురానా ప్రసంగం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. -
గ్రహపాటు!
సామాజిక సైట్లో తన గారాల కుక్కగారి వీడియో ఒకటి పోస్ట్ చేయబోయి... పెద్ద చిక్కే కొని తెచ్చుకుంది సెక్సీ సింగర్ కాటి పెర్రీ. క్రిస్ జెన్నర్ పిక్సీ హెయిర్ స్టైల్లా తన అందమైన లూజ్ హెయిర్ను కట్ చేసుకుని షాకిచ్చిన క్యూటీ... మరోసారి ఫ్యాన్స్ను షేక్ చేసింది. సోషల్ సైట్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ల్లో పెట్ డాగ్ బటర్స్ చిలిపి చేష్టల వీడియోను మురిపెంగా అప్లోడ్ చేసిన అమ్మడికి కాసేపట్లోనే షాక్ మీద షాక్లు తగిలాయి. సదరు కుక్కగారి మెళ్లో వేలాడ దీసిన ట్యాగ్పై పెర్రీ ఫోన్ నంబర్ కూడా ఉందట!!! దీన్ని పసిగట్టిన ఫ్యాన్స్... కాల్స్ మీద కాల్స్ చేసేశారట. దెబ్బకు కంగుతిన్న స్వీటీ... కాసేపటికి తేరుకుని, జరిగింది అర్థం చేసుకుందట. పొరపాటు గ్రహపాటుగా మారిన ఈ ఎపిసోడ్లో మిలియన్ల కాల్స్ చిన్నదాని ఫోన్కు చేరాయట. ఈ బాధ తట్టుకోలేక వెంటనే ఆ వీడియో తొలగించేసి... ఫోన్ నంబర్ను బ్లాక్ చేస్తే గానీ విశ్రాంతి దొరకలేదనేది ఓ యూఎస్ మ్యాగజైన్ కథనం!!! -
లెక్క తక్కువైనా...!
సూపర్ డెరైక్టర్ మహేష్భట్ గారాల కూతురుగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా... ఆ తరువాత స్పెషల్ ఇమేజ్తో కుర్రకారుకు దగ్గరైపోయింది బొద్దుగుమ్మ అలియాభట్. గత ఏడాది వరుస సినిమాలతో అభిమానుల మనసు కొల్లగొట్టిన ఈ సొగసిరి లెక్క తక్కువైనా పర్లేదు గానీ... ఎక్కువ కాకుండా ఉంటే చాలంటోంది. ఆఫర్లు వస్తున్నాయి కదా అని చేసుకుంటూ పోతే... చివరకు ఫ్యాన్స్ విసుగెత్తిపోతారంది. ఏదైనా ఓ లిమిట్లో ఉంటే బాగుంటుందంటోంది. తన సినిమాల రిలీజ్లో కాస్త గ్యాప్ ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ఇక తన తండ్రి మహేష్భట్ ప్రొడక్షన్స్లో పనిచేసే ప్లాన్స్ ప్రస్తుతానికైతే ఏమీ లేవంది అలియా. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్లో ‘బెస్ట్ ఫిమేల్ యాక్టర్’ (క్రిటిక్స్) గెలుచుకున్న ఈ చబ్బీ చీక్స్ సుందరి మెస్మరైజింగ్ లుక్సే కాదు... ఎనర్జటిక్ యాక్టింగ్తో క్రేజీ తారగా మారిపోయింది. -
వుడ్ కట్ ఆర్ట్ ఎగ్జిబిషన్
అమీర్పేటలోని ‘ధీ ఆర్ట్ స్పేస్ గ్యాలరీ’లో గురువారం ప్రారంభమైన వుడ్ కట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కళాభిమానుల మనసు దోచుకుంటోంది. 13 మంది ప్రముఖ ఆర్టిస్టులు రూపొందించిన అద్భుత చిత్రాలు ఇక్కడ కొలువుదీరాయి. తెలంగాణ వనితను కాన్వాస్పై కళాత్మకంగా ఆవిష్కరించారు ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం. వ్యవసాయం వదిలిపెట్టి రైతులు పరిశ్రమల్లో పనిచేసేందుకు ఎలా వస్తున్నారనే థీమ్తో యంగ్ ఆర్టిస్టు పీసీ శేఖర్ చిత్రాలు భారత గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టాయి. నెమలిని గాంధీజీ అప్యాయతతో దగ్గరకు తీసుకుంటున్నట్టుగా చెక్కపై జగదీశ్ తమ్మినేని చెక్కిన చిత్రం... గాంధీకి పక్షులంటే ఎంత ప్రేమో చెప్పకనే చెబుతోంది. చెరువులు, వాగులు, కుంటల్లో కనిపించే చేపల చిత్రాలను వుడ్కట్ ఆర్ట్లో అద్భుతంగా మలిచారు మరో ఆర్టిస్టు శ్రీకాంత్ గురు. బరోడాలో సెటిల్ అయిన సిటీ అమ్మాయి గాయత్రి మాట్లాడుతూ... డైలీ లైఫ్లో ఎదురయ్యే డిఫరెంట్ సమస్యలకు చిత్రరూపమిచ్చే ప్రయత్నం చేశానన్నారు. ‘ఐ యామ్ లిజనింగ్... చెట్టు ముందు కూర్చొని నేను వింటున్నాను అనే థీమ్తో ప్రతాప్ మోడీ వుడ్కట్స్ ప్రత్యేకతను చాటుకుంది. హైదరాబాద్కు చెందిన ఆర్టిస్టు పద్మారెడ్డి మాట్లాడుతూ... భారత సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రధానమైన వివాహ వేడుకలనే సబ్జెక్ట్గా ఎంచుకొని ‘ది వెడ్డింగ్ గౌన్’కు చిత్ర రూపమిచ్చానని చెప్పారు. డెకరేటివ్ మోటార్స్ యూజ్ చేసుకుంటూ బ్యూటిఫుల్గా పిక్చర్ చేశానంటున్నారు. వచ్చే నెల 16 వరకు ఈ అపురూప చిత్ర ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. సాక్షి, సిటీ ప్లస్ -
మాస్టర్ చెఫ్
భక్తి అరోరా.. ఈ సీజన్ మాస్టర్ చెఫ్ ఇండియాకు ఎంపికైన ఏకైక హైదరాబాదీ. ఆ కార్యక్రమంలో ఏడుగురు పార్టిసిపెంట్స్లో ఈమె ఒకరు. అందరూ ‘ఝాన్సీ కి రాణి’, ‘భక్తి కి శక్తి’ అని పిల్చుకునే ఈ అమ్మాయి ఫ్లేవర్-ఇ-ఆజమ్ రుచులతో ఇప్పటికే జడ్జెస్ మనసు గెలుచుకుంది. హైదరాబాద్ ఆడిషన్స్లో మిస్సయినా... బై నుంచి ప్రయత్నించి, ఎంపికై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ..:: కట్ట కవిత షోలో పాల్గొన్నవాళ్లందరూ పాకశాస్త్రంలో ప్రవీణులే. అయితే కాంపిటీషన్ వేరు కదా! ఇచ్చిన టైమ్లోనే వంటల్ని ది బెస్ట్గా చేసి చూపాలి. ఆ టైమ్ను ఎలా మేనేజ్ చేస్తున్నామన్నదే ప్రధానం. ఇంట్లో తాపీగా వండటం తప్ప... ఇలా షోస్కి వెళ్లింది లేదు కాబట్టి మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే చుట్టూ కెమెరాలు, మనం చేస్తున్న దాన్ని ఎంతో మంది చూస్తున్నారన్న స్పృహ వెరసి కొంత కంగారు. కానీ తరువాత సెట్ అయ్యాను. కలినరీ స్టూడియో... కుకింగ్ మీద ప్యాషన్తో ఉద్యోగాన్ని సైతం వదిలేసి ముంబైలో ‘బెల్ పెప్పర్’ రెస్టారెంట్ ప్రారంభించాను. కేవలం పార్టీ ఆర్డర్స్ మాత్రమే తీసుకునేవాళ్లం. భవిష్యత్లో హైదరాబాద్లో ఓ కేఫ్, కలినరీ స్టూడియో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నా. అమ్మ పోరు పడలేక.. ఎనిమిదేళ్లప్పటి నుంచే వంట నేర్చుకున్నాను. మా అమ్మ వంట నేర్చుకోమని ఎప్పుడూ నా వెంటపడేది. ‘భవిష్యత్లో ఎవరి మీదా ఆధారపడకూడదంటే నువు కచ్చితంగా వంట నేర్చుకోవాలి’ అనేది. అయితే నేను అమ్మాయిని కాబట్టి అలా అనేది అనుకోకండి. ఎందుకంటే మా బ్రదర్ను కూడా వంట నేర్చుకోమని పట్టుబట్టేది. అప్పుడు అలా అమ్మ పోరాడి నేర్పిన వంటి ఇప్పుడు ఇలాపనికొస్తోంది. ఆయన ప్రోత్సాహం... మాది ముంబై. పెళ్లి తరువాత హైదరాబాద్కు షిఫ్టయ్యాం. నా హజ్బెండ్ సురేందర్ మానేకర్ ఆడిషన్స్కు వెళ్లాలని నన్ను ప్రోత్సహించారు. నేను కచ్చితంగా ఎంపికవుతానని తన నమ్మకం. తను డయాబెటిక్. దాంతో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న రైస్, పొటాటోస్ ఎక్కువగా తీసుకోకూడదు కదా! అయితే... వాటిని రిప్లేస్ చేస్తూ కొత్త ప్రయోగాలతో వంటలు చేయడం ప్రారంభించాను. నేను వంటల్లో ఆరితేరడానికి అదీ ఒక కారణం. -
సిటీ రాకెట్
అందరిలా కాదు శివాని. ఏడేళ్ల వయసులోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాకెట్ పట్టి... కోర్టులోకి దిగి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తోంది. అమ్మానాన్నల ప్రోత్సాహం... కోచ్ సహకారం... వెరసి అద్వితీయ ప్రదర్శనతో అంతర్జాతీయ వేదికలపై నగర కీర్తిని ఘనంగా చాటుతోంది. ఆమె ఆటకు ముచ్చటపడ్డ ఎంపవర్ స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ అందిస్తోంది. బ్యాంకాక్లో జరిగిన ఆసియా ఓషియానియా టోర్నీలో మంచి ప్రతిభ కనబరిచి సిటీకి తిరిగి వచ్చిన ఈ ‘జూనియర్ రాకెట్’ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది. మేం సిటీకి వచ్చి సెటిలయ్యే నాటికి నా వయసు ఆరేళ్లు. నాన్న శ్రీనివాస్ పోలీస్ ఉద్యోగి కావడంతో మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చాం. అమ్మ సత్యవతి గృహిణి. సిటీకి వచ్చిన తరువాత నా ధ్యాసంతా టెన్నిస్పైకి మళ్లింది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఏడేళ్లప్పుడు బేగంపేట్ ఏస్ టెన్నిస్ అకాడమీలో తొలిసారి రాకెట్ పట్టా. కోచ్ ప్రవీణ్ భార్గవ్ శిక్షణలో ప్రావీణ్యం సంపాదించా. ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలు ఆడటం మొదలుపెట్టా. నా ప్రతిభను గుర్తించిన ఎంపవర్ స్పోర్ట్స్ చేయూతనిచ్చింది. విదేశాల్లో ఆడే టోర్నీలకు దొడ్లా డెయిరీ ప్రయాణపు ఖర్చులు, ట్రైనింగ్కు నిధులు సమకూరుస్తోంది. సక్సెస్ మంత్ర... క్రీడల్లో రాణించాలంటే ఫిట్నెస్ ప్రధానం. ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. అందుకు తగ్గట్టే శారీరక వ్యాయామంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవల్సి ఉంటుంది. డ్రైఫ్రూట్స్, ఎనర్జిటిక్ డ్రింక్స్కు ప్రాధాన్యమిస్తా. రోజూ ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు ప్రాక్టీసు చేస్తాను. ఉదయం వేళలో ఒక గంట ఫిట్నెస్, రెండు గంటలు టెన్నిస్ ప్రాక్టీసు, మళ్లీ సాయంత్రం వేళలో గంట ఫిట్నెస్, రెండు గంటలు టెన్నిస్ ప్రాక్టీస్. టోర్నీ సమయాల్లో ప్రత్యర్థుల బలబలాలు, ఆటతీరు ఆధారంగా నా శైలిని మార్చుకుంటాను. సిటీలో విక్టరీ... తొలినాళ్లలో సిటీలో జరిగిన వివిధ టోర్నీల్లో పాల్గొన్నా. ఎన్నో సవాళ్లు. అన్నింటినీ అధిగమించి విజయాలు సాధించా. ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలో పాల్గొనే అర్హత సాధించా. 2014 ఏప్రిల్ 21న హైదరాబాద్లో జరిగిన అండర్ 14 సూపర్ సిరీస్ సింగిల్స్, డబుల్స్ విజేతనయ్యా. సిటీతో పాటు వివిధ నగరాల్లో జరిగిన టోర్నీల్లో సత్తాచాటా. అహ్మదాబాద్లో అండర్-14 నేషనల్స్ టోర్నీ రన్నర్గా నిలవడం లైఫ్లో మర్చిపోలేనిది. గతేడాది అండర్ -18 టాటా సిరీస్ నెగ్గా. ఇదేకాదు వివిధ నగరాల్లో జరిగిన టోర్నీల్లోనూ మంచి ప్రతిభ కనబరిచా. దీంతో అండర్ -14 ఇండియా టీమ్లో ఆడే అవకాశం దక్కింది. నాతో పాటు చండీఘర్ నుంచి ప్రింకుల్ సింగ్, మహారాష్ట్ర నుంచి మెహత్ జైన్కు అవకాశమొచ్చింది. బ్యాంకాక్లో జరిగిన ఆసియా ఓషియానియా టోర్నమెంట్లో భారత్ తరఫునా ఆడాం. సింగిల్స్లో సెమీఫైనల్ వరకు వెళ్లా. తద్వారా ఆసియా జూనియర్ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానానికి చేరా. గతంలో దిల్లీలో జరిగిన రోడ్ టూ వింబుల్డన్లో ఎంపికైన 16 మందిలో నేను ఒకదాన్ని. త్వరలోనే మళ్లీ దిల్లీలో జరిగే ఇదే టోర్నీలో సత్తా చాటితే వింబుల్డన్ గ్రాండ్శ్లామ్ జూనియర్ విభాగంలో ఆడే అవకాశం వస్తుంది. దీన్ని అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా. ఐ లైక్ చార్మినార్... టైమ్ దొరికితే పుస్తకాలు చదువుతా. టీవీలో స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తుంటా. ఫెదరర్, కిమ్ క్లియ్స్టర్స్ నాకు ఇష్టమైన క్రీడాకారులు. బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నా. చార్మినార్ నచ్చిన స్పాట్. వీఎస్ -
ఆర్టిస్టిక్
బంజారాహిల్స్ గ్యాలరీ స్పేస్లో పలువురు చిత్రకారులు రూపొందించిన చిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. శనివారం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రసిద్ధ ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్ బి.భాస్కరరావు, ఇరాన్ ఆర్టిస్ట్లు బహార్ హంజెహ్పౌర్, అమీర్ హంజెహ్పౌర్, ముంబైకి చెందిన చిత్రకారిణులు ర ష్మీ త్యాగి, అంబరీన్ ధరమ్సేలతో పాటు బ్రహ్మా ప్రొద్దొకు, దీక్షారాయ్, కె.వి.ఎస్.ప్రసాద్, రుక్సానా హుడా, కె.రవి, సంజయ్ శంకర్ అకోలికర్ల ఆర్ట్వర్క్స్ కొలువుదీరాయి. ఏప్రిల్ 15 వరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా ప్రదర్శన అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సాక్షి, సిటీప్లస్ -
కల్యాణం.. కమనీయం
జానకిరాముల విశేషాలు, పెళ్లి మంత్రాలకు అర్థాలు పిల్లలకు వివరించారు ఉమ. శ్రీరామ నవమి ప్రత్యేకతను చిన్నారులు ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈతరం పిల్లలకు రాముడు, ఆయన గాథ తెలియదని, అవన్నీ ఇలా వారి చేతే చేయించి చూపడం వల్ల ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారని అన్నారు పేరెంట్ కె.రాంబాబు. ‘రాముడికి బట్టలు పెట్టాం. బాసికం కట్టాం. తెర పట్టుకుని మంత్రాలు చదివాం. తలంబ్రాలు పోశాం. పూల బంతులు ఆడాం. దేవుడి పెళ్లి మేమే చేశాం. పెళ్లయ్యాక ఉంగరాల ఆట కూడా ఆడాం. ఈ కల్యాణం మాకెంతో నచ్చింది’ అంటూ మురిసిపోతూ చెప్పారు చిన్నారులు ఆశ్రీత మణికంఠ, వంశిక, అంశృత. అలాగే... బుడతలు అయోధ్యాధిపతికి కట్నకానుకలు చెల్లించే ఘట్టాన్నీ... తమ ముద్దు ముద్దు మాటలతో మహా రక్తి కట్టించారు. ‘విగ్రహాల ఆవాహన నుంచి వివాహ మహోత్సవంలోని ప్రతి ఘట్టాన్నీ సంప్రదాయబద్దంగా పిల్లలతో చేయించాం. కంకణ ధారణ, రాముడికి స్నాతకోత్సవం, యజ్ఞోపవీత ధారణం... ఇలా ప్రతి ఘట్టాన్నీ నిర్వహిస్తూ, వాటి కారణాలను వివరించాం. పిల్లలే పేరంటాళ్లను పిలిచి ఈ తంతు చేశారు. రామాయణ శ్లోకాలు వినిపించి, వారి చేత ఉచ్ఛరిస్తూ, వాటి అర్థాలను చెప్పడం వల్ల చిన్నారులు ఇంత పెద్ద కార్యాన్ని ఎంతో ఆసక్తిగా, ఓపిగ్గా పూర్తిచేశారు’ అన్నారు ఉమా చల్లా. ఓ మధు -
సైకిల్ సవారీ
హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ శనివారం నిర్వహించిన ‘ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్’ ఉత్సాహంగా సాగింది. ఎర్త్ అవర్ డే సందర్భంగా గచ్చిబౌలి బైసైక్లింగ్ క్లబ్ వద్ద ప్రారంభమైన ఈ రైడ్ గూగుల్, కొత్తగూడ, గచ్చిబౌలి జంక్షన్ల మీదుగా సాగింది. కాలుష్య నివారణ, శారీరక దారుఢ్యం కోసం సైక్లింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ సైకిళ్లను వాడాల్సిన అవసరం ఉందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. నగరంలో మరిన్ని సైక్లింగ్ క్లబ్లు రావాలని ఆకాంక్షించింది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఐటీ ఉద్యోగులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని సైకిల్పై స్వారీ చేశారు. గచ్చిబౌలి -
లిప్ లాక్!
నాలుగేళ్లు కలిసుండి... ఆ తరువాత ఒకరినొకిరు తిట్టుకుని... విడిపోయిన సూపర్ సింగర్ జెనిఫర్ లోపెజ్, నటుడు కాస్పర్ స్మార్ట్ మళ్లీ ఒక్కటయ్యారా! వీళ్ల వాలకం చూస్తుంటే కాదనలేకపోతున్నారు హాలీవుడ్ జనం. రీసెంట్గా ‘అమెరికన్ ఐడల్’ పధ్నాలుగో సీజన్ షూటింగ్ గ్యాప్లో ఈ ఇద్దరూ లిప్ లాక్ వేసుకుని మైమరిచిపోయారట! రోజంతా ఒకరినొదిలి ఒకరు ఉండలేనంతగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారట. ఎంతో కాలం రొమాన్స్ చేసిన ఈ తారలు గత ఏడాది జులైలో విడిపోయారు. భర్త మార్క్ ఆంథోనీతో ఏడేళ్ల కాపురం చేసి విడిపోయిన జెనిఫర్కు కాస్పర్ మరింత దగ్గరయ్యాడు. ఎంతో అన్యోన్యంగా తిరిగారు. అయితే కాస్పర్ ఇద్దరు మోడల్స్తో క్లోజ్గా ఉన్న పిక్చర్స్ ఓ వెబ్సైట్ రిలీజ్ చేసింది. దీంతో వీరు విడిపోయారు. -
గోంగూర పచ్చడి కంపల్సరీ
సిటీప్లస్ ‘హైదరాబాద్లోనే పుట్టాను. ఇక్కడి విద్యారణ్య, స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో చదువుకున్నాను. ఈ నగరం నాకు చాలా నేర్పింది. చిన్నతనంలోనే పెద్ద ఆలోచనలు చేసేలా నన్ను మార్చింది’ అంటూ సిటీతో తన జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు మాజీ బ్యూటీక్వీన్, బాలీవుడ్ నటి దియామీర్జా. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాబాలన్ హీరోయిన్గా తాను ప్రొడ్యూస్ చేసిన బాబీజాసూస్ సినిమా కోసం చాలా రోజులు ఇక్కడ గడిపానని, మళ్లీ ఇప్పుడే అఫిషియల్గా రావడమని చెప్పారు. ‘ఇక్కడకు వ చ్చి.. తిరిగి వెళ్లేటప్పుడు గోంగూర పచ్చడి కంపల్సరీగా ఉండాల్సిందే. అన్నీ కుదిరితే త్వరలోనే తెలుగు సినిమా నిర్మిస్తా’ అని చెప్పారు దియా. మహిళల స్వయం సాధికారత అంటే తనకు చాలా గౌరవమంటున్న దియా.. ఆడ- మగ ఇద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకోవాలన్నారు. తల్లి, చెల్లి, భార్య, స్నేహితురాలు.. ఇలా ఏ పాత్రలోనైనా మహిళ ఎంతో మనస్ఫూర్తిగా ఇమిడిపోతుందన్నారు. వరల్డ్కప్లో విరాట్కొహ్లీ ఫెయిల్యూర్కి, తద్వారా ఇండియా సెమీస్లో పరాజయం పాలవడానికి అతని గాళ్ఫ్రెండ్ అనుష్క కారణమంటూ అందరూ తప్పుపడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదెంత మాత్రం సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా ఫిక్కీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. దాదాపు 200 మంది మహిళలు హాజరైన ఈ కార్యక్రమాన్ని ఫిక్కీ చైర్పర్సన్ మోనికా అగర్వాల్ పర్యవేక్షించారు. -
మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్ట్
సురాంజలి ఫౌండేషన్ పండిట్ భీమ్సేన్ జోషి పేరిట జాతీయ స్థాయి సంగీత, నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు గోల్కొండ కోట దగ్గర్లోని తారామతి బారాదరిలో ఈ సంగీత నృత్యోత్సవం జరుగనుంది. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో వెంపటి శ్రీమయి నృత్య ప్రదర్శనతో పాటు, పండిట్ ఆనింద చటర్జీ, పండిట్ కుమార్ బోస్- తబలా, షౌనక్, ఆనంద్ భాటే- వోకల్, పండిట్ రాజన్, సాజన్ మిశ్రా శాస్త్రీయ గాత్ర కచేరీ, మహాపాత్రో ఒడిస్సీ నృత్యం, అభిజిత్ బెనర్జీ గ్రూప్ ప్రదర్శనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి చెందిన బ్రోచర్ను సోమవారం విడుదల చేశారు. ఈ ఈవెంట్ నిర్వహణ ద్వారా వచ్చిన నిధులను ఆటిజం బాధిత చిన్నారులకు అందజేయనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 09989821333 ఫోన్ నంబర్ను సంప్రదించవచ్చు. -
అన్నుల మన్నుల
మెరిసేదంతా బంగారం కాదు.. అందరికీ తెలిసిన సామెత. ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం మగువలను మురిపింపజేసేదంతా బంగారమే. పసిడితో ప్రాణం పోసుకుని నిగనిగలాడే నగలకు దీటుగా ధగధగలాడే ఆభరణాలు ఫ్యాషన్ సెక్టర్లో ఎన్నో ఉన్నాయి. వీనులను మెరిపించే దుద్దులైనా.. మెడను హత్తుకునే నెక్లెస్ అయినా.. మట్టితో తయారై మాణిక్యాల్లా మెరుస్తూ.. పుత్తడి ఆభరణాలను మరిపిస్తున్నాయి. అందుకే మనసుకు నచ్చి.. తనువుకు నప్పే నగలైతే చాలు.. దాన్ని దేంతో చేశారన్నది అప్రస్తుతం అంటున్న నారీమణులకు టైట జ్యువెలరీ వరంగా మారింది. మగువలకు జ్యువెలరీ కంటే ఇష్టమైంది మరొకటి ఉండదు. అందుకే స్వర్ణాభరణాలు ఎన్ని ఉన్నా.. మార్కెట్లోకి వచ్చే నయా ట్రెండ్ జ్యువెలరీని పక్కాగా ఫాలో అవుతుంటారు. నల్లపూసల హారం, చంద్రహారం, నెక్లెస్, వంకీలు, జుంకాలు.. బంగారంతో ఒక సెట్ చేయించుకోగలరు. కాస్త సిరిమంతుల ఇంతులైతే.. రెండు డిఫరెంట్ సెట్ల జ్యువెలరీ చేయించుకోగలరు. ఇన్ని ఉన్నా.. ట్రెండ్ మారిన ప్రతిసారీ దానికి తగ్గట్టుగా జ్యువెలరీ చేయించుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు కదా..! అందుకే 1 గ్రామ్ గోల్డ్ వైపో.. రోల్డ్గోల్డ్ వైపో మొగ్గుచూపుతారు. ఈ కేటగిరీ మహిళలను టార్గెట్ చేసిన జ్యువెలరీ డిజైనర్లు టైట టెంపుల్ జ్యువెలరీకి అదనపు సొబగులు అద్ది మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మట్టితో మాణిక్యాలు.. ప్రజెంట్ ట్రెండ్ను ప్రతిబింబిస్తూ.. ట్రెడిషనల్ లుక్ మిస్ కాకుండా మన ముందుకు వచ్చిన మోడల్ టైట టెంపుల్ జ్యువెలరీ. టైట బొమ్మల మాదిరి ఈ ఆభరణాలు కూడా మట్టితో తయారైనవే. మన్నుతో మన్నికైన ఆభరణాలు చేయడం అంటే మామూలా..! అందుకే బంగారు ఆభరణాలు చేసినంత జాగ్రత్తగా వీటిని తయారు చేస్తారు. లక్ష్మీ, సరస్వతీ దేవి వంటి దేవతా రూపాలు, విభిన్న డిజైన్లను లాకెట్లుగా మలిచి.. వాటికి రుద్రాక్షలు, ముత్యాలు, పగడాలు, రకరకాల రత్నాలు పొందికగా అటాచ్ చేసి జ్యువెలరీ లుక్ తీసుకొస్తారు. మట్టితోనే జుంకాలు సైతం తయారు చేస్తున్నారు. ఇన్నోవేటివ్ లుక్ సొంతం చేసుకున్న ఈ మట్టి ఆభరణాలను యువతుల నుంచి అమ్మమ్మల వరకు అందరూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. హ్యాండిల్ విత్ కేర్.. అన్ని రకాల సంప్రదాయ వస్త్రశైలులకూ ఈ జ్యువెలరీ అతికినట్టు సరిపోతుంది. అంతేకాదు ఫ్యాషన్ వేరింగ్కు నప్పుతుండటంతో యువతులు కూడా వీటిపై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. చీరకట్టులో, చుడీదార్లో, లంగాఓణి, గాగ్రాచోలీ ఇలా ఏ రకమైన డ్రెస్సింగ్ చేసుకున్నా వాటిపైకి ఇవి ఇట్టే సెట్ అయిపోతున్నాయి. పైగా ధర తక్కువగా ఉండటంతో.. పండుగలకు, పబ్బాలకు తమ డ్రెస్సింగ్కు మ్యాచ్ అయ్యే మోడల్స్ను కొనుగోలు చేస్తున్నారు కొందరు. అంతేకాదు ఎప్పుడూ బంగారంలో మెరిసి బోర్ కొట్టిన వారు కాస్త డిఫరెంట్గా కనిపించడానికి కూడా వీటికి తమ జ్యువెలరీ సెట్లలో చోటిస్తున్నారు. అయితే వీటిని హ్యాండిల్ చేయడంలో మాత్రం జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు డిజైనర్లు. మట్టితో చేసినవి కావడంతో ఏ మాత్రం చేజారినా.. పగిలే అవకాశం ఉంది. సో హ్యాండిల్ విత్ కేర్.. హ్యాపీ విత్ వేర్. శిరీష చల్లపల్లి -
మన్బోలే తంబోలా
వినసొంపైన పాటలు.. అంతకుమించిన మాటలతో సిటీ శ్రోతలను అలరిస్తున్న రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం ‘రేడియో సిటీ తంబోలా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాక్షి దినపత్రిక భాగస్వామ్యంతో ఈ మెగా మ్యూజిక్ ఈవెంట్ని కండక్ట్ చేస్తోంది. ప్రతి బుధ, శుక్రవారాల్లో సాక్షి పత్రికలో కొన్ని పాటలతో లిస్ట్ ప్రచురితమవుతుంది. ఆ లిస్ట్లో ఇచ్చిన పాటలు ఆయా రోజుల్లో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య రేడియో సిటీలో ప్రసారమవుతాయి. పాట విన్న శ్రోతలు పాటల లిస్ట్లో ఏవైనా 5 పాటలను సీక్వెన్స్ మిస్ కాకుండా కరెక్ట్ ఆర్డర్లో టైప్ చేసి 56060 నంబర్కు మెసేజ్ చేస్తే చాలు. కరెక్ట్గా ఎస్సెమ్మెస్ పంపిన వారు రూ.2,000 విలువ చేసే ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంది. సో.. ఆ లక్కీ విన్నర్ మీరే ఎందుకు కాకూడదు. -
కెసెండ్రా మాట ఎవరు వింటారు?
నీరు జీవితం! చెట్టు చేమకు సమస్త ప్రాణికోటికి నదులు, ఇతర నీటి వనరులే జీవనాధారం! కాబట్టే నగరాలు నదీతీరాల వెంట వెలిశాయి. టైగ్రిస్, నైలు, సింధు నదీతీరాల్లో నాగరికతలు నవనవలాడాయి. నదుల నడక మారిన కారణంగా, నదుల్లో జలరాశులు హరించుకుపోయిన కారణంగా చారిత్రక నగరాలు అంతరించిపోయిన దాఖలాలున్నాయి. మొన్న ఆదివారం వరల్డ్ వాటర్ డే చేసుకున్నాం! నీరు చరిత్రలోకి ప్రవహించక ముందే ఓసారి నీటిని స్మరించుకుందాం! భూగోళం బాస్కెట్బాల్ సైజులో ఉంటే మంచినీటి గోళం పింగ్పాంగ్ బంతి సైజులో ఉంటుంది. భూగోళాన్ని ఆక్రమించిన 70 శాతం నీటిలో మంచి నీరు ‘గరిటెడే’! భూమి ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకూ మనిషికి అవసరమైన మంచి నీటి పరిణామంలో మార్పు లేదు! నీటి నిలువల్లోనే మార్పులు. సాంప్రదాయక పద్ధతుల్లోని నీటి నిలువలను మనుషులమైన మనం మార్పునకు గురిచేస్తున్నాం! నదుల సహజ ప్రవాహాన్ని అరికట్టి కృత్రిమ జలాశయాలను ఏర్పరుస్తున్నాం. సహజనీటి వనరుల చుట్టూ పరిశ్రమలు, నివాసాలు ఏర్పరచుకుంటున్నాం. ఒక కారు తయారీకి పెద్ద స్విమ్మింగ్ పూల్ పరిమాణంలో మంచినీరు వాడతాం. మంచినీటి విలువలు లేని ఒక కూల్డ్రింక్ కోసం రెండువందల రెట్లు అధికంగా మంచినీరు వాడతాం. మన చేష్టల ఫలితంగా మంచినీటికి నిలువ జాగా లేకపోతోంది! నీటిని నిలువ చేయడంలో ప్రకృతికి తనదైన పద్ధతులున్నాయి. మన పూర్వీకులు వాటిని గౌరవించారు. అధికారిక జలాశయాలు ఏర్పడ్డాక వాటి సరఫరా, నియంత్రణ కేంద్రీకృతం అయ్యింది. నీటి సరఫరా బ్యూరోక్రసీ విధుల్లో భాగం అయ్యింది. జలాశయాలు, కాలువల్లో మేటలు (సిల్ట్) ఏర్పడతాయి. వీటిని క్రమానుగతంగా తొలగించాలి. పాలకులు, అధికార గణం వాటిని పట్టించుకోరు. ఫలితంగా నీటి నిలువ సామర్ధ్యం కుంచించుకుపోతోంది! కొత్త కాలనీలు నిర్మించేపుడు, ఇళ్లు నిర్మించే సందర్భాల్లో అప్పటికే ఉన్న మురుగుకాల్వలకు నష్టం కలుగకుండా చేయడం, కొత్తవాటిని ఏర్పరచుకోవడం అనే అంశంలో దారుణమైన అంధత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితం? చినుకు చిటుక్కుమంటే నగరం ముంపునకు గురికావడం అనుభవంలోకి వస్తూనే ఉంది కదా! సేద్యానికి జూదానికి తేడా ఏమిటి? వీటికి తోడు భూతాపపు పెరుగుదల వాతావరణంపై విపరీత ప్రతికూలతను చూపుతోంది. వానలు వెర్రెత్తుతున్నాయి. రుతువులకూ వానలకూ సంబంధం లేకుండా పోతోంది. ఈ నెలలో ఈ కార్తెలో వానలు వస్తాయి అనే శతాబ్దాల లెక్కలు తల్లకిందులు కావడంతో నీటి నిలువలపైనా ఆ ప్రభావం పడుతోంది. ‘వానాకాలం పంట’ అనే నానుడికీ కాలం చెల్లుతోంది. భారతీయ వ్యవసాయం జూదప్రాయంగా మారుతోంది. జూదశాల (క్యాసినో)కు వ్యవసాయానికీ తేడా ఏమిటి? క్యాసినో ఎప్పుడు తెరుస్తారో తెలుస్తుంది. మనమెంత నష్టపోతామో తెలుస్తుంది. వ్యవసాయ జూదం ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ముగింపు ఎప్పడూ సుఖాంతం కాదు కదా! ప్రాణాంతకంగా కూడా మారుతోంది. నీటి కంటె చమురు చౌక గతంలో ఎప్పుడూ వినని ‘నీటి కరువు’ అనే పరిస్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. కెసెండ్రా గుర్తుంది కదా? ట్రాయ్ రాజు ప్రియం కూతురు కెసెండ్రా. ఆమె అందానికి అబ్బురపడ్డ అపోలో దేవుడు ఆమెకు జరగబోయే సంఘటనలను సవివరంగా చెప్పగల వరాన్ని ఇస్తాడు. కానుకకు కొనసాగింపుగా ఆమెతో సంగమాన్ని కోరతాడు. కెసెండ్రా అంగీకరించదు. అపోలో కోపితుడవుతాడు. ఆమె చెప్పే భవిష్యవాణిని ఎవ్వరూ నమ్మకుందురు గాక అని శపిస్తాడు. ఆధునిక కెసెండ్రాలు నీటి విషయంలో భవిష్యవాణిని చెబుతూనే ఉంటారు. ఎవరు నమ్ముతారు? వచ్చే ఐదేళ్లలో మంచినీటికి విపరీత కరువు వస్తుందని 2050 నాటికి శాశ్వత కరువు ఏర్పడుతుందని కెసెండ్రాలు సెలవిస్తున్నారు. భవిష్యత్ యుద్ధాలు చమురు కోసం కాదు నీటికోసమే జరుగుతాయి అనే జోస్యాన్ని నమ్మాల్సి వస్తోంది. కడవ నీటికోసం పల్లెతల్లులు పదిమైళ్లు నడవడం కంటిముందు కనిపిస్తున్న వాస్తవమే కదా! నదీప్రవాహాలను పంచుకుంటున్న కర్ణాటక-తమిళనాడు మధ్య అంతర్యుద్ధం ఏర్పడ్డ పరిస్థితులను చూశాం కదా! తెలుగు రాష్ట్రాల్లోనూ సెగలు-పొగలు కన్పిస్తున్నాయి. పోలీసులు పోలీసులపై లాఠీచార్జ్ చేసిన వైనానికి కారణం ఇరురాష్ట్రాల నీటి అవసరాలే కదా! ఆ దండ కట్టలేం! ‘చెంగ’ అనే పంజాబీ పదానికి అర్థం మంచి, చక్కని, అందమైన.. ఇలాంటి పేర్లున్నాయి. భారతదేశానికి నదులతో ఒక చెంగల్వ దండ వేద్దామనుకున్నారు దివంగత ఇంజనీర్ కె.ఎల్.రావు. ఆయన నెహ్రూ కేబినెట్లో ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు నీటి చుక్కకు తపిస్తోంటే కొన్ని ప్రాంతాలు వరదల్లో మునిగిపోవడం గురించి రావుగారి ఇంజనీరింగ్ హృదయం కలత చెందింది! ఈ దుస్థితి తొలగాలంటే ఏంచెయ్యాలి..? నదులను కాల్వల ద్వారా అనుసంధానం చేస్తూ ‘గార్లెండ్ ప్రాజెక్ట్’ను సూచించారు. దశాబ్దాల క్రితపు ఖరీదైన ఆ కల ఇప్పటికీ ఆచరణలోకి అడుగువేయలేదు. ఒక వేళ అమలు చేయాలనుకుంటే గార్లెండ్ ప్రాజెక్ట్కు ఎంత ఖర్చవుతుంది? పదేళ్ల క్రితం అంచనా ప్రకారం 5,60,000 కోట్ల రూపాయలు! ఆర్థిక కారణాలొక్కటే ఈ ప్రాజెక్ట్ అమలుకు అడ్డంకి కాదు. రాష్ట్రాల భిన్న ధోరణులు కూడా! ‘ నా జీవిత కాలంలో ఈ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టదు’ అని ప్లానింగ్ కమిషన్ సభ్యులొకరు ఇటీవల నిర్వేదం చెందారు. అతడిని నిరాశావాదని అందామా..!! ప్రజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
నెగిటివ్ రోల్స్ ఇష్టం
ఆయన సినిమా చూస్తుంటే మన పక్కింటి బాషా భాయ్... ఎదురింటి శంకరన్న మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా హైదరాబాదీ గల్లీలు మన కళ్లకు కడతాయి. బాలీవుడ్ బాద్షాలా... హైదరాబాదీలకు ఓ ఖాన్ ఉన్నాడు. హాఫ్ ప్రై, జబర్దస్త్, గుళ్లుదాదాల్లో నెగిటివ్ రోల్స్లో మెప్పించి, ఏక్తా సర్దార్తో కథానాయకుడిగా హైదరాబాదీల మనసు దోచుకున్న ఆ ఖాన్.. తౌఫిక్ ఖాన్. నటుడిగానే పరిమితమవ్వకుండా మినార్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఏర్పాటు చేసి... సిటీ కల్చర్ను, సిటీకే సొంతమైన భాషను దృశ్యమానం చేస్తున్నాడు. త్వరలో మరో సినిమా ముహూర్తానికి రెడీ అవుతున్న ఖాన్ను సాక్షి సిటీప్లస్ పలకరించింది. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే... ..:: దార్ల వెంకటేశ్వరరావు తెరపై నన్ను నేను చూసుకోవాలని మెహిదీపట్నంలోని రిషి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగానే కళాశాల నాటకాల్లో నటించేవాణ్ణి. డ్రామాల్లో నన్ను చూసిన ఫ్రెండ్స్ మెచ్చుకునే వాళ్లు. అప్పుడే సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా కలిగింది. స్నేహితుల సహకారంతో మొదట నాలుగు సినిమాల్లో నటించాను. నెగిటివ్ రోల్స్ ఇష్టం. అందుకే మొదట అవి చేశాను. తరువాత సొంత బ్యానర్ ‘మినార్ ఫిల్మ్ ప్రొడక్షన్’ ఏర్పాటు చేశాను. ఈ క్రమంలో నా దోస్తులు సయ్యద్ హమీదుద్దీన్, జాఫర్ హుస్సేన్ మిరాజ్, జయంత్ల ప్రోత్సాహం మరువలేనిది. రియల్ స్టోరీ... నాలుగు చిత్రాల తర్వాత ఏక్తాసర్దార్ సొంత బ్యానర్పైనే నిర్మించాను. ఇందులో లీడ్రోల్ చేశాను. హైదరాబాద్లో ఆటో నడుపుతూ జీవనం గడిపే ఓ ఆటోడ్రైవర్ పోలీసుల వేధింపులతో సర్దార్గా ఎలా మారాడనేది ఆ చిత్ర సారాంశం. హైదరాబాదీ భాష, వ్యవహారంతో పాటు అచ్చ హైదరాబాదీ చిత్రంలా ఉండేందుకు నా ఫ్రెండ్స్ అక్బర్బిన్ తబర్, అద్నాన్ సాజిద్, గుళ్లుదాదా, ఆర్కే మామ, అజీజ్ నాసిర్, అల్తాఫ్ హైదర్ గ్యాంగును తీసుకున్నా. ఈ చిత్రంలో బాగా నటించేందుకు ముంబై నుంచి శిక్షకులను పిలిపించుకుని, వారి దగ్గర మూడు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకున్నా. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కోసం టాలీవుడ్లో పెద్ద నటుడైన ముఖేష్ రిషీని ఒప్పించాం. ఆయన అంగీకరించడం సంతోషాన్నిస్తే... ఆ చిత్రం హైదరాబాద్లో 100 రోజులు ఆడటం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. దీనికి సీక్వెల్గా కొత్త సినిమా ప్రారంభిస్తున్నా. సొంతానికి వాడుకోను... సినిమాలో నటించినపుడు వచ్చిన డబ్బు, చిత్ర నిర్మాణం తర్వాత వచ్చిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోను. వచ్చిన డబ్బంతా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తా. ఆ అల్లా దయతో నాకు ఈ జీవితానికి కావాల్సినంత డబ్బు బిజినెస్ ద్వారా వస్తుంది. సినిమాలో వచ్చినా రాకపోయినా 365 రోజులు సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటా. బియ్యం, రంజాన్ సమయంలో దుస్తులు, పండుగ సరుకులు అందిస్తుంటా. సేవలో ఉండే ఆనందం చాలా గొప్పది. తల్లిదండ్రుల పేరుతో యాకుత్పుర అమన్నగర్లో అమీనా యూసుఫ్ మసీదు నిర్మించా. సినిమాల్లో నటించడం డబ్బు కోసం కాదు కాబట్టే ఇంత కాలం ఇతర సినిమాల్లో ఆఫర్లు వచ్చినా వదులుకున్నా. అయితే ఈ సారి వస్తే నటించి, ఆ డబ్బు ట్రస్టులకు ఇవ్వాలని అనుకుంటున్నా. పేరు తెచ్చుకోవాలని... ఏక్తాసర్దార్ ఒక్క హైదరాబాద్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా బాగా ఆడింది. దీంతో మంచి గుర్తింపు వచ్చింది. మక్కాకు వెళితే అక్కడ చాలా మంది గుర్తు పట్టి ‘సర్దార్’ అంటూ పిలిచారు. దుబాయ్లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇలా అభిమానులు వచ్చి పిలుస్తూ ఫొటోలు దిగుతుంటే చాలా మజా అనిపిస్తుంది. ‘యే షహర్ మేతో సిర్ఫ్ ఏకీ రహ్సక్తా... ఓ హై సర్దార్’ డైలాగ్ లాగే హైదరాబాద్ సర్దార్గా ఇంకా పేరు తెచ్చుకోవాలని ఉంది. సన్నీ డియోల్, నానా పటేకర్ అంటే ఇష్టం. తెలుగులో ప్రకాష్రాజ్ నటన అంటే అమితమైన ప్రేమ. ప్రోత్సాహమివ్వాలి... చిన్న నిర్మాతలు ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు. మన భాష, సంస్కృతి పరిరక్షణకు ఇవి దోహదపడుతున్నాయి. వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. హైదరాబాద్లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఉంది. అది మారాలి! -
హాస్టల్ దునియా
చదువుకోసమో... ఉద్యోగవేటలోనో నగరంలో అడుగుపెడితే మొదటఎదురయ్యే సమస్య వసతి. బంధువులుంటే సరి... లేకపోతే హాస్టలే గతి. ఆ హాస్టల్ను వెదకడానికి నానా కష్టాలు. ఎన్నో తిప్పలు పడి వెతికినాక దొరికినా... అందులో సౌకర్యాలు అరకొర. ఈ సమస్యలన్నింటికీ సింగిల్ క్లిక్తో చెక్ పెట్టేలా చేశాడు యువ ఇంజనీర్ రాజు. ‘హాస్టల్దునియాడాట్కామ్’ వెబ్సైట్ని సృష్టించి... అవసరం ఆవిష్కరణలకు నాంది అని మరోసారి నిరూపించాడు. ఆ నాంది ప్రస్తావన... ..:: భువనేశ్వరి ‘కరీంనగర్ మా స్వస్థలం. నాన్న రైతు. ఇంజనీరింగ్ చదువుకోవడానికి హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ జేఎన్టీయూలో చదువు పూర్తయ్యాక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాలేజ్ టైమ్లోనే సరైన హాస్టల్ సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడ్డాను. జస్ట్ డయిల్ ద్వారా వెదికితే... అడ్రస్ ఉంటుంది. హాస్టల్లో సదుపాయాల గురించి తెలియదు. చాలా ఇబ్బంది పడ్డాను. అయితే నాలా ఎంతో మంది ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అనిపించింది. ఒక యూజర్ఫ్రెండ్లీ వెబ్సైట్లో నగరంలోని హాస్టళ్ల వివరాలు పెడితే ఎలా ఉంటుందని ఆలోచించాను. ముందుగా వెబ్సైట్ని డిజైన్ చేసుకున్నాను. ఉద్యోగం చేసుకుంటూనే ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాను’అంటూ హాస్టల్ దునియా డాట్కామ్ రూపకల్పన వెనుక సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు రాజు. ఏడాది కిందట స్టార్ట్ అయిన ఈ వెబ్సైట్ను ఇప్పటివరకు 8 లక్షలమంది చూశారు. అన్ని వివరాలు... ఈ వెబ్సైట్లో హాస్టల్ అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టి ఊరుకోలేదు. హాస్టల్లో ఉన్న సదుపాయాలు, సింగిల్ రూమ్కి ఫీజు ఎంత?, డబుల్ షేరింగ్కి ఎంత, త్రిబుల్ షేరింగ్కి ఎంత, ఏసీ ఉంటే, లేకపోతే... ఇలా అన్ని రకాల వివరాలు చేర్చాడు. ఆ హాస్టల్కి ఎంత దూరంలో ఏమేమున్నాయో కూడా మెన్షన్ చేశాడు. ‘ఇన్ని వివరాలు సైట్లో పెట్టాలంటే నేరుగా హాస్టల్ యజమానులతో మాట్లాడాలి, హాస్టల్ని చూడాలి. కొత్తలో పెన్ను, పేపరు పట్టుకుని హాస్టల్కి వెళ్లి వివరాలు చెప్పమని అడిగితే చాలామంది తిరస్కరించారు. ఏ ఐటి అధికారులో పంపించి ఉంటారని భయపడ్డారు. చాలా ఓపికతో విషయం చెప్పి, వారిని ఒప్పించి వివరాలు సేకరించడానికి చాలా సమయం పట్టింది. రోజూ ఆఫీసునుంచి బయటికివచ్చాక ఫ్రెండ్స్ని తీసుకుని హాస్టళ్ల చుట్టూ తిరిగేవాణ్ణి. అలా కొన్ని నెలలపాటు తిరిగి రెండు వందల హాస్టళ్ల వివరాలు సేకరించగలిగాను. వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేశాను’ అని తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నాడు రాజు. కొద్దిరోజుల్లోనే... సైట్ని మొదలుపెట్టిన కొద్దిరోజులకే విజిటర్స్ సంఖ్య పెరిగిపోయింది. దీంతో ‘మా హాస్టల్ వివరాలు కూడా చేర్చండ’ంటూ హాస్టళ్ల యజమానులు రాజుని సంప్రదించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్లో నగరంలోని 1500 హాస్టళ్ల వివరాలున్నాయి. వెబ్సైట్కి వెళ్లి మనకు కావాల్సిన సదుపాయాలను ఆప్షన్స్లో టైప్ చేస్తే... మన రిక్వైర్మెంట్స్కి తగిన హాస్టల్ను అడ్రస్, ఫోన్నెంబర్తో సహా మన ముందుంచుతుంది. ‘తొలిసారి ఇలాంటి వినూత్న ప్రయత్నం చేసి విజయం సాధించినందుకు ఈ మధ్యనే స్టార్టప్ హీరో అవార్డు వచ్చింది. నగరంలో అమీర్పేట్, కూకట్పల్లి, మాదాపూర్, మణికొండ... ఇలా ఏరియావైజ్ హాస్టళ్ల వివరాలను క్షణాల్లో తెలుసుకోగలిగే అవకాశాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంతోపాటు గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే హాస్టల్లో రూమ్ దొరకడం ఎంత సులువో.. అంతే కష్టం కూడా. ముఖ్యంగా అమ్మాయిలకు. ఈ సమస్య మన ఒక్క నగరానిది మాత్రమే కాదు. బెంగళూరు, చెన్నైలో ఉన్న తెలుగువాళ్ల సూచనమేరకు అక్కడా హాస్టల్ దునియా ప్రారంభించాను’ అని వివరించాడు రాజు. ఈ స్టార్టప్ హీరో భవిష్యత్లో పుణే, కోయంబత్తూర్కి కూడా ఈ సేవలను విస్తరించాలనుకుంటున్నాడు. ఇతర నగరాల్లో... ఈ మధ్యనే మొదలైన బెంగళూరు వెబ్సైట్లో ప్రస్తుతం 50 హాస్టళ్ల వివరాలు ఉన్నాయి. మరిన్ని చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చెన్నైలోనూ హాస్టల్దునియా ప్రారంభమైంది. ‘దేశంలోని ఏ నగరానికైనా కొత్తగా వచ్చిన వ్యక్తి వసతి ఇబ్బందులెదుర్కోకుండా ఉండాలన్నదే నా ఆలోచన’ అని చెబుతున్న ఈ యువ ఇంజనీరు కల నెరవేరాలని కోరుకుందాం! -
స్ట్రీట్ ప్లేస్
యోగా, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్తో నగరవాసులకు కావాల్సినంత ఫన్ని అందిస్తున్న రాహ్గిరి.. మరో కొత్త థీమ్తో రోడ్డెక్కింది. ఆటపాటలతోనే సరిపెట్టక... మార్చి 8న మహిళల పట్ల బాధ్యతను తెలియజెప్పిన రాహ్గిరి.. ఇప్పుడు నుక్కడ్ నాటక్ (వీధి నాటకం)కి వేదికైంది. ఎంటర్టైన్మెంట్తో పాటు సోషల్ మెసేజ్నీ పాస్ చేస్తోంది!. నాటకం ఏదైనా వేయండి... ప్రజలను ఆలోచింపజేయాలి. ఆసక్తికరంగానూ ఉండాలి. ప్రదర్శించడం మీకు ఇష్టమైతే... రాహ్గిరి వేదిక సిద్ధంగా ఉంది. ..:: కట్ట కవిత వీధి నాటకాలు... లైవ్ మీడియా. ఎవర్గ్రీన్ కూడా. టీవీ, సినిమాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ఇంటర్నెట్ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది... ఇంకా వీధి నాటకాలనెవరు చూస్తారు? ఇది చాలా మంది సందేహం. ఇలాంటి సందేహాల్ని పటాపంచలు చేస్తూ.. వాటికి తాను వేదికవుతానంటోంది ‘రాహ్గిరి’. ఇటీవలే మంథన్ సొసైటీ.. పిల్లలతో పులులను కాపాడాలంటూ సందేశమిచ్చింది. ఈ వారం కొత్తగా... కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘బేటీ బచావో, బేటీ పడావో’ స్ఫూర్తితో ‘బేటీ హై తో కల్ హై’ వీధి నాటకాన్ని ప్రదర్శించాయి మంథన్ అండ్ లివ్ లైఫ్ ఫౌండేషన్స్. ‘మంథన్’ నుక్కడ్ నాటక్ సొసైటీ... సామాజిక సమస్యలపై మరిన్ని నాటకాస్త్రాలను సంధించడానికి సిద్ధమవుతోంది. అసలు సత్యం... వీధి నాటకాలు వేయడానికి థియేటర్స్ అక్కర్లేదు. వీధులు, షాపింగ్ మాల్స్, పార్కులు ప్లేస్ ఏదైనా కావచ్చు. చాలా సింపుల్ కాస్ట్యూమ్స్తో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో అందరినీ ఆక ట్టుకోవడమే కాదు... ఆలోచింపజేసేలా ప్రదర్శన ఇవ్వడం కష్టంతో కూడుకున్న పని. దాన్ని సవాల్గా తీసుకుని ఆర్టిస్టులకు, ప్రేక్షకులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తున్నాయివి. లింగ వివక్షని ఎత్తి చూపుతూనే పొగ తాగకూడదని చెబుతున్నాయి. వరకట్నం పెనుభూతమని, భ్రూణహత్యలు పాపమని, లంచగొండితనం నేరమనే చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రవృత్తిగా అయితే ఈ నాటకాలని ప్రొఫెషనల్ ఆర్టిస్టులే వేయడం లేదు. విద్యార్థులు, ఉద్యోగులు.. వివిధ రంగాల్లో ఉన్నవారు ప్రవృత్తిగా వీటిని ఎంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ ఐటీ ప్రొఫెషనల్ అనిరుధ్. ‘చుట్టూ ఉన్నవాళ్లు మావైపు చూసేందుకు గట్టిగా అరుస్తాం. నాటకాల్లో ఇది మొదటిఅంశం. దీనికోసం ఎనర్జీతోపాటు ఏకాగ్రత కూడా అవసరం. సినిమాల్లో లాగా రీ టేకులు ఉండవు. ఒకే షాట్లో ఓకే అయిపోవాలి. దీనికోసం ఎంతో రిహార్సల్స్ చేస్తాం. మైక్, స్టేజ్ లాంటి లగ్జరీస్ ఏమీ ఉండవు. ప్రేక్షకుల కళ్లముందే ప్రదర్శించాలి. వాళ్లను మెప్పించాలంటే ఎంతో హాస్యం వచ్చి ఉండాలి. చున్ని, టవల్స్ వంటి చిన్నచిన్న ప్రాపర్టీస్తో ప్రేక్షకులను నవ్వించాలి. ఈ వీధి నాటకాలకు సంగీతం, డ్యాన్స్ వంటివి కూడా జోడించవచ్చు’ అని చెబుతున్నాడాయన. అంశమేదైనా... వేదిక మాది... భారతీయ సంస్కృతి సంప్రదాయాలను సుసంపన్నం చేసిన వాటిలో వీధి నాటకం కూడా ఒకటి. అంతటి ప్రాముఖ్యత ఉన్న వీధినాటకాలను పునర్జీవింపచేయడానికి, వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడానికి రాహ్గిరి కచ్చితంగా సహకరిస్తుంది అంటున్నారు ‘రాహ్గిరి’ ప్రతినిధి విశాలరెడ్డి. సామాజిక, రాజకీయ సమస్యేదైనా... వ్యంగ్యంగా, నవ్వులు కురిపిస్తూ ఉత్సాహంగా సాగే ఈ వీధి నాటకాలు కచ్చితంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయని చెబుతున్నారు ఎంబార్క్ ఎన్జీవో ప్రాజెక్ట్ మేనేజర్ ప్రశాంత్ బచ్. సమ్థింగ్ స్పెషల్ రంగులు, లైటింగ్, మేకప్, ఒక స్టేజీ, కళాకారులు, రిహార్సల్స్.. ఒక నాటకాన్ని ప్రదర్శించాలంటే ఇంత సరంజామా కావాలి. పైగా ఏదైనా నాటకాన్ని చూడాలనుకుంటే.. అది ప్రదర్శించే చోటకు వెళ్లాలి. అందరూ అలా వెళ్లలేరు. కాబట్టి వాటి ద్వారా చెప్పదల్చుకున్నది జనంలోకి వెళ్లదు. కానీ, రాహ్గిరి వేదిక అందుకు భిన్నం. విద్యార్థులు, ఉద్యోగులు అప్పటికప్పుడు కళాకారులుగా మారిపోతారు. ఇతివృత్తాన్ని అర్థం చేసుకుని తమదైన ‘పాత్ర’ పోషిస్తారు. తాము చెప్పదల్చుకున్నది అందరి మధ్య, ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునేలా చెబుతారు. తద్వారా అందరికీ సులభంగా సందేశం చేరుతుంది. ఇకపై ప్రతి వారం సామాజిక సమస్యలు ప్రధానాంశంగా స్ట్రీట్ ప్లేస్ ప్రదర్శిస్తామని రాహ్గిరి ప్రతినిధులు చెబుతున్నారు. -
ఆ క్రెడిట్ టాలీవుడ్దే..
సంజన.. బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లిగా వయ్యారాలు పోయిన ఈ భామ.. కన్నడలో బిజీ నటిగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులను అడపాదడపా అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యే ఓ ఇంటిదయ్యింది. అలాగని ఇల్లాలయిపోయిందని ఫిక్సయిపోకండి. ఓ అందమైన ఫ్లాట్కు ఓనర్ అయిందట. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సంజన తన మూవీ ముచ్చట్లు, కొత్తింటి అచ్చట్లు సీటీప్లస్తో పంచుకుంది. ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. - శిరీష చల్లపల్లి మాది బెంగళూరు. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్గా కనిపించాలనుకునేదాన్ని. అలా ఫ్యాషన్ ఫీల్డ్లోకి ఎంటరయ్యాను. సినిమాల్లోకి రాకముందు జాన్ అబ్రహంతో ఫాస్ట్ట్రాక్ గ్లాసెస్ యాడ్లో నటించాను. ఆ యాడ్ చూసి పూరి జగన్నాథ్ నన్ను పిలిపించారు. తను తీయబోయే ‘బుజ్జిగాడు’లో మంచి రోల్ ఉందని చెప్పారు. అందులో ‘త్రిష చెల్లిగా నువ్వయితేనే కరెక్ట’ని ఆఫర్ చేశారు. వెంటనే ఓకే చెప్పేశాను. అప్పుడు నా ఏజ్ జస్ట్ సెవెంటీన్. ఆ సినిమా కోసమే నేను మొదటిసారి హైదరాబాద్కు వచ్చాను. అప్పటికీ నాకు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. పూరి గారు నాకు కొత్త లోకాన్ని పరిచయం చేశారు. ఇంకా చెప్పాలంటే నాకో కొత్త లైఫ్ అందించారు. అంతకుముందు తమిళం, కన్నడంలో కొన్ని సినిమాలు చేసినా.. బుజ్జిగాడు మంచి బ్రేక్ ఇచ్చింది. టాలీవుడ్లో సక్సెస్ తర్వాత శాండిల్వుడ్లో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రజెంట్ కన్నడలో ప్రధాన నటి కావడానికి కారణం టాలీవుడే. మై డ్రీమ్ హోమ్.. ఈవెంట్స్, ఇనాగరేషన్స్, మూవీస్.. ప్రస్తుతం బిజీగానే ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్నీ ఫాలో అవుతున్నాను. అందుకే బెంగళూరూలో ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాను. ఈ మధ్యే అందులోకి వెళ్లాం. చిన్నప్పటి నుంచి నాకో డ్రీమ్ హోమ్ ఉండేది. న్యూ ఫ్లాట్లో కూడా ఫర్నిచర్, ఆర్కిటెక్చర్.. ఇలా ప్రతిదీ నా ఊహాసౌధాన్ని మరపించేలా ప్లాన్ చేసుకున్నాను. నేను రోజూ వెళ్లే యోగా సెంటర్, జిమ్ సెంటర్ కూడా మా ఇంటికి చాలా దగ్గర. ప్రజెంట్ నా డ్రీమ్ హోమ్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాను. షాపింగ్స్.. హ్యాంగౌట్స్. పేరుకు బెంగళూరువాసినైనా.. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. తర చూ ఈ సిటీ విజిట్ చేస్తుంటాను. వచ్చిన ప్రతిసారీ కనీసం రెండుమూడ్రోజులు స్టే చేస్తాను. ఫ్రెండ్స్తో కలసి సరదాగా షాపింగ్, హ్యాంగౌట్స్కి వెళ్తుంటాను. ప్రస్తుతం కన్నడలో 5 సినిమాలు చేస్తున్నాను. తెలుగులో అవును-2 సినిమాలో నటిస్తున్నాను. -
న్యూయార్క్కు మన ఫ్యాషన్
నగరానికి చెందిన డిజైనర్ శిల్పారెడ్డి న్యూయార్క్లోని హడ్సన్ రివర్ వేదికగా తన అత్యాధునిక ఫ్యాషన్లకు మనదైన సంప్రదాయ పోచంపల్లి చేనేత వైభవాన్ని మేళవించి ప్రదర్శించనున్నారు. ఈ నెల 19న ఈ షో జరుగనుంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎన్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గీతారెడ్డి, నటి రెజీనా కసాండ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ... ‘దేశంలో ఉన్నన్ని చేనేతలు మరెక్కడా లేవు. ముఖ్యంగా తెలంగాణలోని గద్వాల శారీస్, సిద్ధిపేటలో గొల్లభామ శారీస్... ఇలా ఎన్నో ఉన్నాయి. మన చేనేతలకు మరింత చేయూత, మరింత ప్రచారం అవసరం. ఆధునిక యువతకు పోచంపల్లి, ఇకత్ వంటి సంప్రదాయ చేనేతలను చేరువ చేసేందుకు శిల్పారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం’ అన్నారు. ‘పోచంపల్లి గొప్పతనం ఏమిటో ఈ డ్రెస్ (తాను ధరించిన డ్రెస్ చూపిస్తూ) ధరించాకే తెలిసింది. నాలా దీని గురించి తెలియని యూత్ ఇంకా ఉండే ఉంటారు. ఇది నిజంగా విచారించాల్సిన విషయం. ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్స్ని ఉపయోగించి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ను తలపించే అట్రాక్టివ్ డ్రెస్లు రూపొందించవచ్చునని ఇప్పుడే తెలిసింది. ఇకపై రెగ్యులర్గా నా వార్డ్రోబ్లో ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్స్కు చోటు ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది రెజీనా. ఆర్గానిక్... నేచురల్... అత్యంత సహజమైన పద్ధతిలో రూపొందించిన ఫ్యాబ్రిక్ పోచంపల్లి. ఇవి పూర్తిగా ఆర్గానిక్. ఇలాంటి చేనేతలను వినియోగించడం ఒక డిజైనర్ కనీస బాధ్యత అని నేను భావిస్తున్నాను. పారిస్లో నా డిజైన్లను ప్రదర్శించినప్పుడు మల్కా ఫ్యాబ్రిక్ వినియోగించా. ఆ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ ఫ్యాబ్రిక్స్కి ఇంటర్నేషనల్ వేదికల్లో ప్రాచుర్యం కల్పించేందుకు న్యూయార్క్లో నేను ఇచ్చే ప్రదర్శన హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నా... అన్నారు శిల్పారెడ్డి. - సాక్షి, సిటీ ప్లస్ -
బ్రైడల్ స్పెషల్
పెళ్లిళ్ల సీజన్లో విస్తృత శ్రేణి సంప్రదాయ ఆభారణాలను నగరవాసుల ముందుకు తెస్తోంది ‘హైదరాబాద్ బ్రైడల్ జ్యువెలరీ వీక్ 2015’. నగరంలో తొలిసారిగా మే 23, 24 తేదీల్లో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ బ్రోచర్ను సోమవారం ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కర్టెన్రైజర్లో మోడల్ అనుకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరికొంత మంది మోడల్స్ విభిన్న ఆభరణాలు ధరించి సంప్రదాయ సిరులు ఒలికించారు. ఈ బ్రైడల్ జ్యువెలరీ వీక్ ఇదే వేదికపై జరుగుతుంది. -
జస్ట్ లవ్!
మోడల్, నటి కారా డెలావీన్... చూస్తుంటే ప్రేమలో పడినట్టుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా సింగర్ విన్సెంట్తో కలిసి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన యూనివర్సల్ మ్యూజిక్ ఆఫ్టర్ పార్టీలో గాళ్ఫ్రెండ్కు ఓ రొమాంటిక్ ముద్దిచ్చి పిచ్చెక్కించింది. తమ మధ్యనున్న అనుబంధాన్ని కారా, విన్సెంట్లిద్దరూ ఇలా చెప్పకనే చెప్పారనేది ‘సన్’ డైలీ కథనం. గత ఏడాది డిసెంబర్లో విన్సెంట్ను కలిసింది కారా. ఏం మాయ చేసిందో ఏమో... ఇక అప్పటి నుంచీ విన్సెంట్ను వదలకుండా ఫాలో అవుతుంది 22 ఏళ్ల కారా. అంతటితో అయిపోలేదు... విన్సెంట్ అసలు పేరు అన్నే క్లార్క్ను ‘ఏసీ’గా టూటూ వేయించుకుందట డెలావీన్! ఇది చూసిన హాలీవుడ్ జనం... ఈ ‘కొత్త తరహా’ ప్రేమ జంటపై ఛలోక్తులు విసురుతున్నారట. అయితే ప్రేమకు హద్దులేవీ లేవని.. ఎవరి లైఫ్ వారిదని ఈ భామలిద్దరూ చెప్పుకొంటున్నారు. -
నిక్ నేమ్!
మెగాస్టార్గా ఎదిగినా ఆ దర్పం ఎక్కడా కనపడనివ్వడు అమితాబ్బచ్చన్. సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా సెట్స్లో ఎవరితోనైనా భేషజం లేకుండా ఇట్టే కలసిపోతాడు. సరదాగా కబుర్లు చెబుతాడు. తాజాగా స్టార్ హీరోయిన్ దీపికాపడుకొనేతో అమితాబ్ చేస్తున్న చిత్రం ‘పికూ’ షూటింగ్ ఉత్సాహంగా సాగుతోందట. తన కుమార్తెగా నటిస్తున్న దీపికకు అమితాబ్ ఓ ముద్దు పేరు పెట్టాడట... ‘దీపికు’ అని! అటు అమ్మడి పేరు... ఇటు సినిమా టైటిల్ మిక్స్ చేసేసిన బిగ్ బీ... సెట్స్లో కూడా ‘దీపికు’ అనే పిలుస్తున్నాడట! అలా కొత్తగా పిలుస్తున్నా దీపిక కూడా నో చెప్పలేదనేది హిందుస్థాన్ టైమ్స్ కథనం. ఇప్పటి వరకూ తనను ఎవరూ ఇలా పిలవకపోయినా... అమితాబ్ కాబట్టి పలుకుతోంది ఈ పొడుగు కాళ్ల సుందరి! సరదాగా ఎంజాయ్ చేస్తోంది కూడానట! నైస్ ‘దీపికు’! -
మూవీ బజ్
ఈ ప్రిన్సెస్ ఫ్రాక్కి గేరా 6 నుంచి 8 మీటర్లు ఉంటుంది. దీంతో కుచ్చులు బాగా వచ్చి ప్రిన్సెస్ లుక్ వస్తుంది. ఈ తరహా ఫ్రాక్స్పైన ఓపెన్ ఫ్రీహె యిర్ లేదా ట్రెండోనాట్, చెవులకు మెరిసే యాక్సెసరీస్ పర్ఫెక్ట్ మ్యాచ్. అప్పటికే రిచ్ లుక్ ఉంటుంది కాబట్టి జువెలరీ అవసరం లేదు. కాళ్లకు మాత్రం కంఫర్ట్గా ఉండే వెడ్జెస్ లేదా హీల్స్ వేసుకుంటే ఆరోజు పార్టీకీ మీరే యువరాణి! - స్వప్న పైడి, డిజైనర్ -
ప్రిన్సెస్ ఫ్రాక్స్
ఫ్రాక్స్.. అమ్మాయిల బాల్యానికే పరిమితమైన కాస్ట్యూమ్. పెద్దయ్యాక అంటే... సెలబ్రిటీస్ వంటి వారికి మాత్రమే సొంతమైంది. ధరించాలనే కోరిక ఉన్నా... పెద్దవాళ్లని కాదనలేక ఆ ఇష్టాన్ని కష్టంగా వదిలేస్తున్నారు. అయితే చిన్నప్పటి ఆ కుచ్చుల గౌన్ను లేటెస్ట్ ట్రెండ్గా మార్చారు నగరంలోని డిజై నర్లు. చూడగానే అందరికీ నచ్చి మెచ్చేలా ‘ప్రిన్సెస్ ఫ్రాక్’గా మార్కెట్లోకి తెస్తున్నారు! సిరి చిన్నప్పుడు కుచ్చులు కుచ్చుల గౌన్ వేసుకుని క్యూట్గా మెరిసిపోతుంటే ముద్దాడనివారుండరు. ఆ తరువాత వయసుతోపాటు ఫ్రాక్స్తో దూరం కూడా పెరిగిపోతుంది. ‘ఆ ఫ్రాక్ ఎంత బాగుందో కదా! ప్చ్... మనం వేసుకోలేమే?’ అని బాధపడే అమ్మాయిలెంతో మంది. అమ్మాయిలకు ఆ ఆనందాన్ని పంచేందుకు ప్రయత్నిస్తున్నారు డిజైనర్లు. పైనుంచి కిందివరకు సింగిల్ కాస్ట్యూమ్ విత్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉండే ‘ప్రిన్సెస్ ఫ్రాక్స్’ నగరంలో లేటస్ట్ ట్రెండ్. విదేశాల్లో ఫ్రాక్స్కి యమ క్రేజ్. జస్ట్ బోర్న్ బేబీ నుంచి సిక్స్టీ ప్లస్ బామ్మ వరకూ ఇది చాలా కామన్ కాస్ట్యూమ్. ఈ ట్రెండ్ను మన నగరవాసులు అందిపుచ్చుకున్నారు. అందుకే బర్త్డేస్లో ఏంజిల్లా కనిపించేందుకు సిండ్రిల్లా ఫ్రాక్స్ ధరించేందుకు ఇష్టపడుతున్నారు. ఎంగేజ్మెంట్, రిసెప్షన్, గెట్ టు గెదర్స్తోపాటు నైట్ పార్టీస్లో సైతం వీటికే టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ ప్రిన్సెస్ ఫ్రాక్కి గేరా 6 నుంచి 8 మీటర్లు ఉంటుంది. దీంతో కుచ్చులు బాగా వచ్చి ప్రిన్సెస్ లుక్ వస్తుంది. ఈ తరహా ఫ్రాక్స్పైన ఓపెన్ ఫ్రీహెయిర్ లేదా ట్రెండోనాట్, చెవులకు మెరిసే యాక్సెసరీస్ పర్ఫెక్ట్ మ్యాచ్. అప్పటికే రిచ్ లుక్ ఉంటుంది కాబట్టి జువెలరీ అవసరం లేదు. కాళ్లకు మాత్రం కంఫర్ట్గా ఉండే వెడ్జెస్ లేదా హీల్స్ వేసుకుంటే ఆరోజు పార్టీకీ మీరే యువరాణి! - స్వప్న పైడి, డిజైనర్ -
మీది ఏ పార్టీ?
రాజకీయ పార్టీలు ఎందుకు ఏర్పడతాయి? మనుషులు వేగిరపాటును కలిగి ఉంటారు. పూర్వాపరాలు తెలియకుండానే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఒకే అభిప్రాయాన్ని కలిగిన వ్యక్తులు ఒకరినొకరు కలుసుకుంటారు. ఒక పార్టీని స్థాపిస్తారు. ఒక్కసారి అందులో చేరారో... ఆ వర్ణపటకంలోంచే చూస్తారు. నిష్పాక్షికత, నిజాయితీ, సమభావన అన్నీ పార్టీ వర్ణపటకపు కార్యాకారణ సంబంధాలలోంచే ద ర్శిస్తారు. రాజకీయ పార్టీలు ఎందుకు పాపులర్ అవుతాయి? ప్రజలు తమ గురించి తాము ఆలోచించాల్సిన శ్రమను రాజకీయ పార్టీలు తప్పిస్తాయి. ఆలోచించడం అనే కఠినతరమైన పనిని ప్రజలు ఇతరులకు అప్పజెప్పేస్తారు. ఏదో ఒక రాజకీయ పార్టీ నీకేం కావాలో ఆలోచిస్తుంది. ఒక అభిప్రాయాన్ని సిద్ధం చేస్తుంది. అది నీ అభిప్రాయమే, నీ గుండె లోతులలోంచి వచ్చినదే అని నమ్మిస్తుంది. నీ కలను మేం నిజం చేస్తాం అంటే ఎంత సంతోషం!! ఎదుటి వారిలో మంచా! తాత్వికులకు ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. రాజకీయ పార్టీలకు ప్రతి పరిష్కారానికి ఒక సమస్య ఉంటుంది! వెళ్లాల్సిన చోటుకు సాదాసీదా మార్గం కళ్లకు స్పష్టంగా కనపడుతున్నా, పార్టీలు తెలియని ప్రత్యామ్నాయ మార్గాల కోసం పోరాడతాయి. విశ్వాసులలో విశ్వాసాలకు అనుగుణంగా భగవంతుడుంటాడు. సగుణుడు, నిర్గుణుడు, చరాచరుడు, ఒకే ఒక్కడు, అనేకులు, ఇలా... పార్టీలవారు ఏ విశ్వాసులైనప్పటికీ వారి భగవంతునికి ఒకే రూపం. అది వారి అధినాయకత్వం. సత్యం ఏమిటి? అధినాయకత్వపు ఉవాచే అయినప్పుడు అంతా సరళంగా జరిగిపోవాలి కదా! పార్టీలకు సమస్యలు రాకూడదు కదా? వస్తాయి.. ఒకోసారి! పార్టీల సమస్య ఏమిటంటే అంతరాత్మ ఉన్నవారు, కర్తవ్య నిష్ట కలిగినవారు, ఒకోసారి ఆయా పార్టీల్లో చేరడమే. ఈ తరహా జీవులు ఎదుటి పార్టీకి సంబంధించిన వారు చెప్పేదాంట్లో కూడా సత్యం ఉండవచ్చు అని ‘సంశయిస్తారు’. లేదా పార్టీ చెబుతున్న దాంట్లో ఔచిత్యం ఎంతని ఆలోచిస్తారు. పార్టీ పటకం దాటి ఆలోచించే ఇలాంటి సంశయ జీవులకు రాజకీయ పార్టీల్లో స్థానం ఉండదు. పార్టీ ‘సంశయ జీవులను’ అనుమానిస్తుంది. అటువంటి వారిని పార్టీ భరించలేదు. తాము ఎప్పుడూ కరెక్టే అనే నిశ్చితాభిప్రాయం పార్టీ వ్యక్తుల్లో ఉండాలి. ఇప్పుడు పార్టీ ఏమంటుందో దానికి సరిగ్గా వ్యతిరేకంగా భవిష్యత్తులో పార్టీ అవసరాల మేరకు చెప్పగలిగే సామర్ధ్యాన్ని పార్టీ జీవులు కలిగి ఉండాలి. దాన్నే ‘నిబద్ధత’ అంటారు. పార్టీలు మారినప్పుడు ఆయా పటకాలకు అనుగుణంగా మారడం రాజకీయ జీవులకు తప్పనిసరి! లింకనూ ఒపీనియన్స్ మార్చాడు... ఒపీనియన్స్ చేంజ్ చేసుకోకపోతే పొలిటీషియన్ ఎలా అవుతారు? లింకన్ కూడా ఇందుకు అతీతుడు కాడు! అమెరికా అధ్యక్షుడు కాక మునుపు, పొలిటీషియన్ కాక మునుపు, అబ్రహాం లింకన్ న్యాయవాది. యువ న్యాయవాది లింకన్ ఒక రోజు ఉదయం ఒక కేసును వాదించాడు. తన వాదనతో జడ్జిని మెప్పించి కేసును గెలిచాడు. మధ్యాహ్నం పూట అదే కోర్టులో మరో కేసు అదే జడ్జి సమక్షంలో వాదించాడు. ఉదయం పూట వినిపించిన వాదనకు పూర్తి వ్యతిరేకంగా కొత్త కేసును వాదించాడు. న్యాయమూర్తి నవ్వుతూ ‘మిస్టర్ లింకన్... ఉదయం నీ వాదనలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పూర్తి వ్యతిరేకంగా ఇప్పుడు వాదించావు. ఇంతకీ ఏది కరెక్ట్’ అని ప్రశ్నించారు.‘యువరానర్, ఉదయం నేను తప్పుగా వాదించి ఉండవచ్చు. ఇది మధ్యాహ్నం. ఇప్పుడు నేను వాదిస్తోంది కచ్చితంగా ఒప్పే’ అన్నాడు లింకన్! ఈ కేసూ లింకనే గెలిచాడు! రాజకీయాలు, వ్యాపారాల్లో లాగా న్యాయవాదృ వృత్తిలోనూ ‘పార్టీలు’ ఉంటాయి. ఒక రకంగా పార్టీల్లో ఈ మూడూ కలగలసి ఉంటాయి. ఇది రాజకీయపార్టీల ‘ఘన’ స్వభావం! రెండో రకం పార్టీలది ‘ద్రవ’ స్వభావం! కాక్టైల్స్గా విశ్వవిఖ్యాతం! సాంఘిక జంతువు అయిన మనిషి చేసుకునే ఈ పార్టీలకు ఇతర జంతుజాలానికీ సంబంధం లేదు! ఇందులో మానవ జీవులే ఉంటాయి. మగా-ఆడా! (లేడీస్ ఫస్ట్ అనడం ఈ సందర్భంలో నాకు ఇష్టం లేదు). ఈ పార్టీలు లోకంలో లోకుల మధ్య అనాదిగా జరుగుతున్నాయి. కాక్టైల్స్లో నేను విన్నవీ, కన్నవీ వచ్చేవారం సిప్ చేద్దాం! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
ఓపెన్ ఫర్ ఆల్..
సిటీవాసులు కొందరు కాలక్షేపానికి రవీంద్రభారతికి, కాస్త తలపండిన వారు త్యాగరాయగాన సభకు వె ళ్తుంటారు. లలిత కళలకు వేదికగా నిలిచిన ఆ ప్రదేశాలు అందరికీ చిరపరిచితమే. వీటి సరసన ఐదేళ్ల కిందట ఓ కొత్త వేదిక వచ్చి చేరింది. మాల్స్, ప్రీమియర్ థియేటర్స్, హెవీ ట్రాఫిక్తో సిటీ రిచ్నెస్ని కళ్లకుకట్టే బంజారాహిల్స్ రోడ్ నంబర్ వన్ దాటుకుని అలాగే ముందుకు వస్తే ఒక చిన్న సందు, ఆ వీధి చివర ఒక చిన్న ఇల్లు.. వారంలో ఆరు రోజులూ ఆ ఆవాసం ఆర్టిస్టులకు, ఆర్ట్ లవర్స్కు నివాసంగా ఉంటుంది. తమ కళలను ప్రదర్శించడానికి సరైన నెలవు లేని కళాకారులకు నిలయం లామకాన్. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ కళల సౌధం ముచ్చట్లు.. ..:: ఓ మధు చిన్న చిన్న వేడుకలకు కూడా కన్వెన్షన్ సెంటర్లు వేదికవుతున్న వేళ.. పై కప్పు కూడా లేకుండా వచ్చింది లామకాన్. ఈ ఓపెన్ సెంటర్ తలుపులు లలిత కళలకు ఆల్వేస్ ఓపెన్గా ఉంటాయి. ఆర్ట్ లవర్స్కి అడ్డంకులు ఉండవిక్కడ. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు, ఛాయ్ పానీతో పాటు.. మనిషి, మనిషికి సంబంధించిన అన్ని సంగతులు మాట్లాడుకునేందుకు అవకాశం ఇస్తుందీ నిలయం. కేవలం మాటలే కాదు, చేతల్లో, కళల్లో, చర్చల్లో తమకు చేతనైన పద్దతుల్లో తమ వాదన, నిపుణతను చాటుకోవడానికి ఉన్న ఓపెన్ కల్చరల్ సెంటర్ ఇది. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అరుదుగా ఉండే ఓపెన్ సెంటర్లలో లామకాన్ ఒకటి. ఆ నలుగురు.. ఫరాన్, హుమేరా, బీజ్యు మాథ్యూ, ఇలాలే.. అనే నలుగురు 2010లో లామకాన్ ప్రారంభించారు. ఫరాన్ ప్రముఖ కళాకారిని పద్మశ్రీ జిలాని భాను కుమారుడు. ప్రముఖ కళాకారుడు, ఫొటోగ్రాఫర్, ఫిలింమేకర్ సైంటిస్ట్ అయిన మోయిద్ హసన్ ఫరాన్కు మేనమామ. హసన్ మరణానంతరం.. ఆయన నివాసాన్ని కల్చరల్ సెంటర్గా మలిచారు ఫరాన్. హైదరాబాదీ స్టైల్.. లామకాన్లోకి ఎంటరవ్వగానే.. అడుగులు వడివడిగా ఇరానీ ఛాయ్, గరమ్ సమోసాలకేసి వెళ్లిపోతాయి. గతంలో ఒక్క ఇరానీ ఛాయ్ కొడితే కేఫ్లో మూడు గంటలు కూర్చునే ఛాన్స్ ఉండేది. అలాంటి థీమ్తోనే ఈ చోటుని తీర్చిదిద్దారు. మెనూ మొదలుకుని మార్బుల్స్, ఫర్నిచర్.. మొత్తం ఇరానీ కేఫ్ స్టయిల్లోనే ఉంటాయి. ఇరానీ ఛాయ్, సమోసాకు దోస్తీగా కిచిడీ, మిర్చి, ఆమ్లెట్, దహీవడ ఘుమఘుమలు అదనం. వీటన్నింటినీ లాగిస్తూ.. రాజకీయాలు, సినిమాలు, మత ధర్మాలు, ఆర్టిస్టులు, పుస్తకాలు.. ఇలా అనేక విషయాలు మాట్లాడుతూ గడిపేస్తుంటారు. లండన్లో కూడా ఇలాంటి సెంటర్ ఒకటుంది. దానికి కూడా బీజు మాథ్యూ పార్టనర్గా ఉన్నారు. కూల్ డ్రింక్స్, బర్గర్స్ లాంటివి ఇక్కడ ఉండవు. దాహానికి కుండలోని చల్లని నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఎ కంప్లీట్ స్పేస్.. లిబరల్, సెక్యులర్, అణగారిన వారి హక్కుల గురించి మాట్లాడుకోవడానికి.. అలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ స్పేస్ వినియోగించుకోవచ్చు. ‘ఒక అంశాన్ని కేవలం చర్చ ద్వారా మాత్రమే చైతన్య పరచలేం. దానికి కాన్వాస్పై కొలువుదీరిన చిత్రాలు కావాలి.. నాటకాలు, నృత్య రూపకాలు ఇలా పలు రకాల మాధ్యమాలు తోడవ్వాలి. అప్పుడే దాన్ని ప్రభావవంతంగా చూపించగలం. అలాంటి ఆస్కారమున్న అంశాలను ఇక్కడ ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాం’ అని తెలిపారు లామకాన్ మేనేజర్ సుబ్బారెడ్డి. ‘సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి రిటైరయ్యాక లామకాన్ పనులు ప్రారంభించాం. అందరికీ ఫ్రీగా, ఫ్రీడంతో ఉండే చోటు ఏర్పాటు చెయ్యాలి అనే ఉద్దేశంతో దీన్ని రూపొందించాం. ప్రభుత్వం, కార్పొరేట్ సహకారం లేకుండా దీనిని ఇండిపెండెంట్గా నిర్వహిస్తున్నాం. స్వేచ్ఛగా చేయాలనుకున్నది చేసే అవకాశం ఉందిక్కడ. లామకాన్పై సిటీవాసులు చూపిస్తున్న ఆదరణ ఆనందంగా ఉంది. ఐదేళ్లు గడిచాయి. ఇంకా ఎన్నో చేయాల్సి ఉంద’ని అంటారు లామకాన్ ఫౌండర్లలలో ఒకరైన ఫరాన్. పర్మినెంట్ వెన్యూ.. కుర్చీలు, ల్యాప్టాప్, ప్రొజెక్టర్, మైక్స్ ఇలా అన్నీ ఇక్కడ ఉచితంగా అందిస్తారు. ఆడియన్స్, ఆర్టిస్టులకు రుసుం లేకుండా దొరికే వేదికిది. నిషుంభిత, సమాహార, ఉడాన్ ఇలా అనేక నాటక సంస్థలకు లామకాన్ పర్మినెంట్ వెన్యూ. విబ్జియార్, అక్టోపస్ స్టూడియోస్, హైదరాబాద్ డాక్యుమెంటరీ సర్కిల్ ఏర్పాటు చేసే షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలు ఇలా చాలా కార్యక్రమాలు ఇక్కడికి వచ్చే వారిని కదలనివ్వవు. - ప్రత్యూష, నటి యూత్ అడ్డా.. కాఫీడేస్.. ఐమాక్స్.. మాల్స్ యూత్కి అడ్డా అనుకుంటాం. కానీ, కెరీర్ డిస్కషన్స్కి, థియేటర్ ప్రాక్టీస్కి, పెయింటింగ్స్కి, డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చూడటానికి ఎంతోమంది యువతీయువకులు లామకాన్కు వస్తున్నారు. షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, షేరింగ్ ఆఫ్ జాయ్, ఎగ్జిబిషన్ ఆఫ్ ఆర్ట్స్.. అప్రిసియేషన్ ఆఫ్ ఆర్ట్ లవర్స్.. ఇదీ లామకాన్ చేస్తున్న సేవ. - మాధవి లత, పప్పెటర్ -
లవ్ ట్రీట్స్
ఈ మాట ఈ ఇద్దరి కోసమేనేమో! ఆ ఇద్దరూ ప్రసాద్, ప్రత్యూష. ప్రసాద్ ఫ్రమ్ నెల్లూరు.. ప్రత్యూష ఫ్రమ్ పశ్చిమ గోదావరి అయినా పెరిగింది మాత్రం చెన్నైలో. హాస్టల్ నుంచి చెన్నై డెంటల్ కాలేజ్కి బస్లో వెళ్తుంటే వీరిద్దరికి పరిచయం. కొన్నాళ్లకే అది స్నేహంగా మారింది. ఎంతలా అంటే.. ఆ టైమ్లోనే ప్రత్యూష వాళ్ల నాన్నగారు చనిపోవడంతో ఆమెకు ఓదార్పు, సాంత్వన, అండ అన్నీ ప్రసాదే అయ్యారు. దాంతో ఆ స్నేహం ఎంత గాఢమైందంటే.. చివరకు ప్రత్యూషకు ప్రసాదే లోకం, ప్రసాద్కూ ప్రత్యూషే ప్రయారిటీ అనేంతగా! అందుకే ప్రసాద్ అంటుంటారు సరదాగా ‘అసలు బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్చేసినట్టుగానే లేదు.. ఫ్రెండ్స్, సరదాలు అన్నీ మిస్ అయినట్టుగా అనిపిస్తాయి’ అని. ‘నిజమే మరి.. ఎందుకంటే బీడీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎమ్డీఎస్.. టిల్ టు డే కలిసే ఉన్నాం!’ అంటారు ప్రత్యూష. ఎమ్డీఎస్ సెకండియర్లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతోనే. ‘మా పెళ్లికి టూ డేసే లీవ్ ఇచ్చారు మా ప్రిన్స్పల్. ఇలా పెళ్లి చేసుకొని అలా కాలేజ్కి వెళ్లిపోయాం’ ఆ రోజుని గుర్తుచేసుకున్నారు ప్రత్యూష. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్.. ‘నిజానికి నాకు ఈ ప్రొఫెషన్ కన్నా బిజినెస్ అంటేనే ఇష్టం. ఆ ప్రయత్నమూ చేసి మళ్లీ ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను. అంటే ఈ వృత్తి అంటే ఆసక్తి లేదని కాదు.. చాలా ఇంట్రెస్ట్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటుంటాను.. అయితే పెషంట్మీద పెర్ఫార్మ్ చేయడం ఇష్టం ఉండదు. అంటే ఈ వృత్తికి డెడికేషన్ చాలా ఉండాలి’ అని ప్రసాద్ అంటుంటే ‘పేషంట్స్ కూడా ఆయన్ని ట్రీట్చేసే తీరుని చాలా ఇష్టపడ్తార’ని ఆ టాపిక్ని పూర్తిచేస్తూ ‘నాకు టీచింగ్ అంటే ఇష్టం. కాలేజెస్లో క్లాసెస్ తీసుకుంటాను. నేను చెప్పబోయే సబ్జెక్ట్కి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేసిపెడ్తాడు. టెక్నికల్గా నేను వీక్. ఆ విషయంలో నాకు చాలా హెల్ప్ చేస్తాడు’ అని ఆమె వివరిస్తే ‘పీఆర్లో నేను వీక్. దానికి సంబంధించిన వ్యవహారమంతా ప్రత్యూష చూసుకుంటుంది’ అని ఆమె అందిస్తున్న సహకారాన్ని ఆయన చెప్పారు. ప్లస్.. మైనస్ ‘పంక్చువాలిటీ విషయంలో తను చాలా లేజీ’అంటారు ప్రసాద్. ‘నేను అరగంట ముందుంటే తను గంట లేట్. పేషంట్స్ మనకోసం ఎదురుచూడొద్దు’ అని వివరణ ఇచ్చారు. ‘రావడం లేట్ అయినా డ్యూటీ ముగించుకోవడానికి తొందరపడను’ ప్రత్యూష సమాధానం. ‘ఆ టైంలో గొడవేం ఉండదు కానీ కోపమొస్తుంది’ అని ప్రసాద్ అంటుంటే ‘క్లాస్ తీసుకుంటాడు’ అని పక్కనుంచి ప్రత్యూష. ‘అందుకే మా అబ్బాయికి ఇప్పటి నుంచే పంక్చువల్గా ఉండడం నేర్పుతున్నా’ అని చెప్తారు ప్రసాద్. ‘ఎవరికి కోపమొచ్చినా మాట్లాడకుండా పక్కకి వెళ్లిపోతాం. అదీ అయిదుపది నిమిషాలే. మళ్లీ మామూలైపోతాం’ ప్రత్యూష. మరి ప్లస్ గురించి? ‘షి వోంట్ బాదర్ ఎబౌట్ ఫైనాన్స్ అండ్ షి వోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్’అని ప్రసాద్ అంటుంటే ‘నాకేం కావాలో అన్నీ తనే చూసుకుంటుంటారు.. ఆ బర్డెన్ మోసే చాన్సే ఇవ్వరు. దేని గురించీ ప్రెషర్గా ఫీలయ్యేలా చేయడు. ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్గా లేని రోజుల్లో కూడా దుబాయ్లాంటి చోట 875 రూపాయలు పెట్టి తనకు నాకు కాఫీ కొనిచ్చిన రోజులూ ఉన్నాయి. ఉదయం లేవగానే నాకు కాఫీ లేకపోతే కుదరదు. తనకసలు కాఫీ, టీలు అలవాటే లేదు. అలా నాకు ఇష్టమైనవాటి కోసం ఎంత కష్టమైనా కాంప్రమైజ్కాడు’ అంటూ భర్తకు కాంప్లిమెంట్ ఇస్తారు ప్రత్యూష. ‘తను ఈ గాడ్జెట్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు. నాకేమో చాలా ఇష్టం. నేను ఏ ఫోన్ గురించయినా వాకబు చేసినట్టుగా, ఓ అయిదు నిమిషాలు దాన్ని చూసినా తెల్లారే సరికల్లా ఆ ఫోన్ నా టేబుల్ మీద పెడుతుంది’ ప్రత్యూష మనసుకు తన మాటలు అద్దారు ప్రసాద్. ‘నేను ఈ రోజు వరకే ఆలోచిస్తే.. తన ప్లాన్ పదేళ్ల వరకు ఉంటుంది’ అని భర్త ముందుచూపు మెచ్చుకుంటారు ప్రత్యూష. ఒకరికి ఒకరు.. ‘మోర్ దన్ మై పేరెంట్స్. ఎందుకంటే మా అమ్మానాన్నతో నేనున్నది ఎయిటీన్ ఇయర్సే. 20 ఏళ్లుగా.. ట్వంటీ ఫోర్ అవర్స్ కలిసే ఉంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే షీ ఈజ్ ఎవ్రీ థింగ్ టు మీ’అంటూ తన జీవితంలో ప్రత్యూష పాత్రను చెప్తారు ప్రస్తాద్. ‘ఫ్రెండ్.. గైడ్.. ఫిలాసఫర్.. ప్రొటెక్టర్.. ఎవ్రీథింగ్’ ప్రత్యూషదీ అదే ఆప్యాయత ప్రసాద్పట్ల! ‘మామధ్య అభిప్రాయబేధాలు ఉండవని కాదు.. కానీ అవేవీ మాధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ని తీసుకురాలేదు. ఇంకా చెప్పాలంటే అవగాహనను పెంచాయి’ అంటారు ప్రత్యూష. ‘భార్యాభర్తల్లా కాకుండా ఫ్రెండ్స్లా ఉంటాం. వి నో ఈచ్ అదర్ వెరీవెల్’ అంటూ హ్యాపీమ్యారీడ్లైఫ్ సీక్రెట్ చెప్పారు ప్రసాద్. ..:: సరస్వతి రమ -
వాక్ ఫర్ అవేర్నెస్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ ‘గ్లకోమా అవగాహన నడక’ నిర్వహించింది. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆసుపత్రి వద్ద నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు సాగిన ఈ నడకలో టాలీవుడ్ తారలు ఇషా, అవసరాల శ్రీనివాస్, నాగినీడు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్లకోమా సాధారణంగా 40 ఏళ్లు పైబడ్డవారిని ప్రభావితం చేస్తుందని, మధుమేహం ఉన్నవారితో పాటు వంశపారంపర్యంగా కూడా గ్లకోమా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆసుపత్రి గ్లకోమా కేర్ అధిపతి శిరీషా సెంథిల్ చెప్పారు. బంజారాహిల్స్ -
రాణిగిరి
ఉదయం ఏడు గంటలు. సన్ డే మార్నింగ్... హాలిడే మూడ్లో అక్కడక్కడా వెహికిల్స్ కనిపించే రహదారి ఆటపాటలతో ఒకటే సందడిగా మారింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా... అంతా కలసి రోడ్డును మైదానంలా ఫీలైపోయి ఆడేసుకుంటున్నారు. ఎవరికి తోచిన యాక్టివిటీ వారు చేసేసుకుపోతున్నారు. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి మాదాపూర్ మైండ్స్పేస్ రోడ్డు వరకు దాదాపు నాలుగు గంటల పాటు నాన్స్టాప్గా ఇదే హంగామా! మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిర్వహించిన ప్రత్యేక ‘రాహ్గిరి’ ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. సీనియర్ సిటిజన్స్, యువతులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గల్లీఫుట్బాల్, క్రికెట్, సైక్లింగ్, రన్నింగ్, స్కేటింగ్.. ఒకటేమిటి అన్నీ ఇక్కడే! మదర్హుడ్ ఇండియా హాస్పిటల్ ‘మహిళల భద్రత’పై పెయింటింగ్ పోటీ, టీఏఎఫ్ ఆధ్వర్యంలో ‘స్ట్రాంగ్ విమెన్.. స్ట్రాంగ్ నేషన్’ సైకిల్ రైడ్ పోటాపోటీగా జరిగాయి. జుంబా డ్యాన్స్లో మల్కాజ్గిరి డీసీపీ రమారాజేశ్వరి ఉత్సాహంగా అడుగులు కదిపారు. రాయదుర్గం -
ట్రూ ఫ్రెండ్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో థిక్ ఫ్రెండ్షిప్లంటే కామన్గా కనిపించేవి డేటింగ్లే! అదీ ముద్దు గుమ్మలైతే ఒకరికొకరికి బొత్తిగా పొసగనే పొసగదు. కారణాలేమైనా... హీరోలతో ఉన్నంత కలివిడినెస్ను వారిలో వారు మెయిన్టెయిన్ చేయరు! కానీ... చిలిపి కళ్ల చిన్నది అనుష్కాశర్మ తన చిత్రం ‘ఎన్హెచ్10’ ప్రమోషన్లో క్యూటీ గాళ్ కత్రినా కైఫ్ను పొగిడేసింది. కత్రినాతో తనకు మాంచి దోస్తానీ ఉందని... తను ఓ ట్రూ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. ‘షీ ఈజ్ రియల్ పర్సన్. నాటకీయత ఉండదు. హృదయపూర్వకంగా మాట్లాడుతుంది. మేమిద్దరం హెల్దీ టైమ్ స్పెండ్ చేశాం. కత్రినకు కూడా నేనంటే ఎంతో ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్కా. అంతే కాదు... కత్రినా ప్రెట్టీయస్ట్... సెక్సీయస్ట్ యాక్టర్ కూడానని అద్భుతమైన కాంప్లిమెంటూ ఇచ్చేసింది. మొత్తానికి విరాట్తో డేటింగ్షిప్ను ఎంత ఎంజాయ్ చేస్తుందో... కత్రినతో ఫ్రెండ్షిప్నూ అంతే ఆస్వాదిస్తోంది అనుష్కా! -
సల్మాన్... ప్రైస్లెస్!
ఇప్పటి వరకు మనకు షర్ట్లెస్ సల్మాన్ఖాన్ తెలుసు. కానీ అతడిలో మరో యాంగిల్ బయటకు తీసింది శ్రీలంక చిన్నది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తన కెరీర్ను మలుపు తిప్పిన సల్లూభాయ్ ప్రైస్లెస్ అంటూ ఆకాశానికెత్తేసింది. అవకాశాల కోసం ఆశగా ఎదురు చూసి చూసి నిరాశలో కూరుకుపోయిన సమయంలో సల్మాన్ తనకు ‘కిక్’ సినిమా ఇచ్చాడని, ఆ ఉపకారానికి వెల కట్టలేమని ఎంతో ఉద్వేగంగా చెబుతోంది. ‘ఏ సినిమా అయినా సరే చాన్స్ వస్తే చాలని పరితపిస్తున్న రోజులవి. ఒక టైమ్లో అసలు హోప్స్ వదిలేసుకున్నా. ఫీల్డ్కు గుడ్బై చెబుదామా అన్న ఆలోచనా వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సల్మాన్, సాజిద్ నదియావాలా ఆఫర్ ఇచ్చి ఆదుకున్నారు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనిది’ అంటూ అంతరాంగాన్ని ఆవిష్కరించింది జాక్వెలిన్. ఏదిఏమైనా... ‘కిక్’ అమ్మడికి డబుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. కెరీర్కు ఓ సూపర్ హిట్ టర్నింగ్ పాయింట్తో పాటు, సల్మాన్తో డేటింగ్షిప్! లక్కంటే అదే మరి! -
సండే బ్రంచ్
అకేషన్ ఏదైనా... ఫుడీస్కు వెరైటీ టేస్ట్లను రుచి చూపించడంలో ముందుంటాయి నగరంలోని హోటల్స్. విమెన్స్ డే సందర్భంగా ఆదివారం నోవాటెల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ హోటల్ భిన్నమైన రుచులకు వేదికైంది. ఇక్కడి ‘ద స్క్వేర్’లో ఏర్పాటు చేసిన స్పెషల్ సండే బ్రంచ్ చవులూరించింది. ప్రముఖ చెఫ్స్... నార్తిండియన్, సౌతిండియన్ ప్రత్యేక వంటకాలతో ‘ఆహా’ అనిపించారు. నోరూరే రుచులను అతిథులు వేడివేడిగా ఓ పట్టు పట్టారు. ఫుడ్ ప్రియులకు మరిన్ని వెరైటీ వంటకాలను అందించేందుకు వచ్చిన నయా చెఫ్ను అతిథులకు పరిచయం చేశారు. మహిళలు... పాకశాస్త్రంలో మెళకువలు అడిగి తెలుసుకున్నారు. సాక్షి, సిటీ ప్లస్ -
సబల
మగువంటే పువ్వులా సున్నితమే కాదు... అవసరమైతే రాళ్లను పిండి చేసేంత సబలగానూ అవతారమెత్తగలదు ! నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆదివారం నిర్వహించిన మహిళా దినోత్సవంలో బాలిక కరాటే విన్యాసం ఇది. ‘నా రక్షణ.. నా బాధ్యత’పై విమెన్ ఆఫీసర్స్ గ్రూప్1 తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10కె సైక్లింగ్, 5కె, 3కె రన్ నిర్వహించారు. అడిషనల్ సీపీ (క్రైమ్) స్వాతి లక్రా, జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్ అరుణాబహుగుణతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యాలయాలు, ఇళ్లు, రోడ్లపై మహిళలకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెబుతూ పోలీస్ అకాడమీ ట్రైనీ ఐపీఎస్లు ప్రదర్శించిన స్ట్రీట్ ప్లే ఆకట్టుకుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన రన్... జలవిహార్ మీదుగా తిరిగి పీపుల్స్ ప్లాజాకు చేరుకుంది. ఖైరతాబాద్ -
‘క్యాట్వాక్’
క్యాట్వాక్... మోడల్స్ పిల్లి నడక! కానీ ఈ పిల్లుల ‘క్యాట్వాక్’ చూస్తే టాప్ మోడల్స్ కూడా వెనక్కు పోవాల్సిందే. క్యాట్ ఫుడ్ బ్రాండ్ విస్కాస్... నగరంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్యాట్ షో నిర్వహించింది. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన ఈ షోలో అందంగా అలంకరించుకున్న జాతి పిల్లులు హుందాగా నడిచాయి. ఎదురొస్తేనే అపశకునంగా భావించే పిల్లులు.. ఎప్పుడో పెంపుడు జంతువుల జాబితాలో చేరాయి. ఇప్పుడు ఈ పెట్స్కే టాప్ ప్రేయారిటీ ఇస్తున్నారు నగరవాసులు. కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్నారు. ఒక్క నగరంలోనే కాదు ప్రస్తుతం ఇతర దేశాల్లో సైతం డాగ్స్ కంటే క్యాట్స్ను పెంచుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వీటిని పెంచేవారికి... పెట్స్ గురించి సమాచారం తెలియజేయడానికి ఈ ఇంటర్నేషనల్ క్యాట్ షో నిర్వహించింది విస్కాస్. ఇందులో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 130 మేలు జాతి పిల్లులు పాల్గొన్నాయి. ట్రెడిషనల్ లాంగ్ హెయిర్, బ్రిటిష్ లాంగ్ హెయిర్ బ్రీడ్, నార్వేజియన్ బ్రీడ్, అరేబియన్ మావ్ ఇలా 16 రకాల బ్రీడ్స్ ఇందులో పోటీపడ్డాయి. విస్కాస్కు ఇది నాలుగో అంతర్జాతీయ షో. వరల్డ్ క్యాట్ షో మ్యాప్లో ఇండియాకు స్థానం కల్పించడమే ఈ షో లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో బ్లూ క్రాస్ చైర్పర్సన్ అమల... హైదరాబాదీ బిల్లీలను ఫ్రీ అడాప్షన్ కోసం ఉంచారు. కలిసొచ్చింది... ‘నా పిల్లి పేరు డస్టీ. నేను పుట్టినప్పటికే మా ఇంట్లో పిల్లి ఉండేది. దానికి రెండు పిల్లలు పుట్టాయి. అందులో ఒకటే ఈ డస్టీ. దీనికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నా ఫీలింగ్స్ను, ఎమోషన్స్ను ఇట్టే పట్టేస్తుంది. నేను డల్గా కనిపిస్తే సంతోషపెట్టడానికి ‘పిల్లి’మొగ్గలు వేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో నా సిస్టర్లా పెరుగుతోంది. దీని పోషణకు నెలకు ఆరువేల రూపాయల దాకా ఖర్చవుతుంది’ అని చెబుతోంది మాసబ్ ట్యాంక్లో ఉండే అదీబా. ‘మా సిస్టర్స్కు పిల్లులు అంటే చాలా ఇష్టం. అమెరికా నుంచి నాలుగు పర్షియన్ క్యాట్స్ను ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకటి 45 వేల రూపాయలు. వీటికి సపరేట్ ఏసీ రూమ్ ఉంది. క్యాట్ ఫుడ్తోపాటు స్టీమ్డ్ చికెన్, ఫిష్ బాగా తింటాయి. కేజింగ్ నచ్చదు. ఫ్రీగా ఉండటానికే ఇష్టపడతాయి. అందరూ అపశకునంగా భావిస్తారు కానీ పిల్లులతో మాకు కలిసొచ్చింది’ అంటున్నాడు యూసఫ్గూడవాసి మోసిన్ఖాన్. శుభ పరిణామం... ‘పిల్లి ఇండిపెండెంట్ నేచర్ ఉన్న ఫ్రెండ్లీ పెట్. ఇవి ఎదురొస్తే అపశకునంలా భావించడం చూస్తుంటాం. కానీ ఈ క్యాట్ వాక్లో 45 జాతుల పిల్లులు నగరం నుంచే పాల్గొన్నాయి. దీనిద్వారా మూఢనమ్మకాలు లేనివారు సిటీలోనూ ఉన్నారన్న విషయం అర్థమవుతోంది. ఇది మంచి పరిణామం’ అన్నారు అమల. శిరీష చల్లపల్లి -
కిడ్స్ కిష్కింద
ఓన్లీ యాక్షన్.. నో కట్.. 140 సన్నివేశాలు.. 25 పాటలు..12 గంటల నిర్విరామ ప్రదర్శన.. 250 మంది ఆర్టిస్టులు సింగిల్ టేక్లో అదరగొట్టారు. అలాగని వీళ్లంతా రంగస్థలంపై రాటుదేలిన నటశేఖరులేమీ కాదు, ఇంకా స్కూలేజ్ కూడా దాటని బాలబాలికలే.. రంగస్థలంపై తొలిసారి అడుగుపెట్టినవారే. అయితేనేం, ఇటీవల రవీంద్రభారతిని కిష్కిందపురం అగ్రహారంగా మార్చేశారు. తమ అద్వితీయ నటనతో ఈ రుద్రాంశ జన్మ వృత్తాంతం మొదలుకొని.. ఆంజనేయ యానాన్ని తు.చ తప్పకుండా కళ్ల ముందుంచారు. త్రిగుళ్ల నాగరాజు ఆంజనేయుడు వానరశ్రేష్టుడే కాదు, పిల్లలకు ఇష్టదైవం కూడా. ఈ వాయునందనుడి లీలలు పిల్లలకు భలే పసందుగా ఉంటాయి. ఆ కపిరాజు కుప్పిగంతులు, తోకతో చేసే విన్యాసాలు, కండలు తిరిగిన శరీరం, ధైర్యసాహసాలు.. ఇవన్నీ చిన్నారుల్లో అంజనీపుత్రుడి పై ప్రత్యేకమైన భక్తికి కారణాలు. అందుకే తన శ్రీ ఆంజనేయం ప్రాజెక్ట్కు నటీనటులుగా బాలబాలికలను ఎంచుకున్నానంటారు ఈ నాటక రూపకర్త దీనబాంధవ. శ్రీ ఆంజనేయం.. దీనబాంధవ స్వగ్రామం యాదగిరిగుట్ట. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి ఎం.ఏ సంస్కృతం, ఎంపీఏ (మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్) పట్టా పొందారు. ప్రస్తుతం 101.9 ఎఫ్ఎంలో రేడియో జాకీగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లు పలు పాఠశాలల్లో థియేటర్ ఆర్ట్స్ టీచర్గా కూడా పనిచేశారు. తెలుగు నాటక వైభవాన్ని మరోసారి దశదిశలా చాటాలనే సంకల్పంతో 12 గంటల నిర్విరామ నాటకాన్ని ప్రదర్శించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తను ఎంతగానో ఆరాధించే ఆంజనేయుడి చరిత్రనే కథావస్తువుగా ఎంచుకున్నారు. 45 రోజుల శిక్షణ.. ఆంజనేయుడి చరిత్రనంతా క్రోడీకరించి.. కొన్ని నెలలు కష్టపడి 12 గంటలకు సరిపడా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. తానే స్వయంగా 25 పాటలూ రాశారు. స్నేహితుడు ఫణి నారాయణ వీటికి స్వర రచన చేశారు. 250 మంది చిన్నారులను పాత్రధారులుగా ఎంచుకున్నారు. వారికి 45 రోజుల పాటు స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత రెండు గంటల శిక్షణ నిచ్చేవారు. ఈ ప్రక్రియలో దీనబాంధవకు అతడి స్నేహితులు తిరుమలేశ్, సురేష్, ముస్తఫా, రాజ్కుమార్లు సహాయం చేశారు. నాటకంలోని పాటలకు దీనబాంధవ భార్య వల్లివసంతం, ఆమె స్నేహితురాలు హారతి డ్యాన్స్ కంపోజ్ చేశారు. సీన్ బై సీన్.. తనను కైలాసం దగ్గర అడ్డుకున్న నందిని రావణుడు అవమానించడం.. ప్రతిగా నంది ‘వానరుల వల్లే లంక నాశనమవుతుంద’ని శపించడంతో నాటకం మొదలవుతుంది. తర్వాత శివపార్వతుల కేళీ ఫలాన్ని వాయుదేవుడు అంజనీదేవికి ప్రసాదంగా అందివ్వడం.. ఆంజనేయుడి జననం.. విద్యాభ్యాసం.. వాలి సుగ్రీవుల కథ.. రామసుగ్రీవుల మైత్రి.. వాలి వధ, వానరసేన సీతాన్వేషణ, ఆంజనేయుడి సముద్ర లంఘనం, లంకిణి గర్వహరణం.. సీతమ్మ దర్శనం.. లంకాదహనం.. అహిరావణ, మహిరావణుల కథ.. ఆంజనేయుడి మానస పుత్రులు మకరధ్వజుడు, మత్స్యవల్లభుల వృత్తాంతం.. రావణ సంహారం.. రామ పట్టాభిషేకం.. ఇలా రామయణ ంలోని ఎన్నో ఘట్టాలు కళ్ల ముందుంచారు బాలనటులు. అంతేనా, ద్వాపరయుగంలో భీమాంజనేయ సంవాదం, కృష్ణాంజనేయ యుద్ధం, నారద, తుంబురల గర్వభంగం.. కలియుగానికి వచ్చేసరికి యాదగిరిగుట్ట క్షేత్రానికి స్వామి క్షేత్రపాలకుడైన విధం, త్యాగరాయస్వామిని హనుమ అనుగ్రహించిన కథ.. ఇలా ఎన్నో గాథలను ప్రదర్శించారీ చిన్నారి నటులు. ఆఫ్టర్ సమ్మర్.. పన్నెండు గంటల నిర్విరామ నాటక యజ్ఞంలో నగరంలోని సువిద్య పాఠశాలకు చెందిన చిన్నారులు మొదటి ఆరు గంటలు పాలుపంచుకున్నారు. తర్వాతి మూడు గంటల పోర్షన్ను శ్రీ మేధ స్కూల్ విద్యార్థులు, చివరి మూడు గంటల భాగాన్ని సూపర్ ట్విన్ సిటీస్ పాఠశాల విద్యార్థులు అభినయించారు. ఈ మెగా నాటకం తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ కిడ్స్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈసారి గిన్నిస్ రికార్డ్ సృష్టించడమే లక్ష్యంగా జూన్లో 260 మంది చిన్నారులతో 13 గంటల నాటకానికి సమాయత్తమవుతున్నారు దీనబాంధవ. అందుకోసం ఈ వేసవిలో ప్రత్యేక శిబిరాన్ని కూడా నిర్వహిస్తానని చెబుతున్నారు. -
లవ్ యూ.. మామ్
ఆడవారికి అమ్మదనం కన్నా కమ్మదనం ఏముంటుంది..! బుజ్జాయిలకు అమ్మ కన్నా ఆత్మీయ నేస్తం ఎవరుంటారు !! ఈ రెండు అనుభూతులూ.. ఒకే ఫ్రేములో ఇదిగో ఇలా అందంగా ఒదిగిపోయాయి. విమెన్స్ డే సందర్భంగా పింక్థాన్ ఆధ్వర్యంలో ఆదివారం కేబీఆర్ పార్క్లో బేబీ వేర్ వాకింగ్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో చంటి పిల్లలను ఎత్తుకుని తల్లులు నడక సాగించారు. ఈ సందర్భంగా ఓ బుడతడు తన తల్లికి రోజా ఇస్తూ విమెన్స్ డే విషెస్ తెలియజేశాడు. - బంజారాహిల్స్ -
ముంబైలో పుట్టినా.. హైదరాబాదీనే..!
పదమూడేళ్ల వయసులోనే ‘తెరకెక్కిన’ మిల్కీబ్యూటీ చార్మి. అప్పటి నుంచి అచ్చంగా తెలుగు నటిగా మారిపోయింది. సిల్వర్స్క్రీన్పై పుష్కరకాలం దాటిన ఈ నటి టాలీవుడ్ కెరీర్లో దాదాపు అగ్రహీరోలందరి సరసనా నటించింది. తాను హైదరాబాద్ అమ్మాయినే అంటోన్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ తన అభిమాన సిటీ గురించి చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: ఎస్బీ నేను పంజాబీని అయినా, ముంబైలో పుట్టి పెరిగినా, హైదరాబాద్ అమ్మాయిగానే భావిస్తా. ఎందుకంటే నాకు నటిగా జన్మనిచ్చిన తెలుగు సినీ పరిశ్రమకు కేంద్రం ఈ నగరమే. హైదరాబాద్ ఇప్పుడు ఇంత హైటెక్సిటీగా మారిపోయింది కాబట్టి ఈ మాట చెప్పట్లేదు. ఇక్కడికి వచ్చిన కొత్తలోనే ఈ సిటీ తెగ నచ్చేసింది. ఇక్కడి జనాల జీవనశైలిలో కనిపించే వైవిధ్యం.. నాకు ఆశ్చర్యంతో పాటు ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. నేను వచ్చిన కొత్తలో సిటీలో ఇంత గ్రోత్ లేదు. జూబ్లీహిల్స్లో వెళ్తుంటే ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడైతేనా.. బాబోయ్ చెక్పోస్ట్ దాటాలంటే చాలు గగనమే. ఇక్కడే స్థిరనివాసం.. నార్త్ నుంచి వచ్చిన మిగిలిన హీరోయిన్లు వచ్చి వెళ్తుంటారేమో కాని, నేనైతే హైదరాబాద్పై మక్కువ పెంచుకుని.. ఇక్కడో ఇల్లు తప్పనిసరిగా కొని తీరాలని నిర్ణయించుకున్నా. బహుశా మాస్ సినిమా చేసే టైమ్లో అనుకుంటా.. నా సంపాదనతో మణికొండలో ఫ్లాట్ కొనుక్కున్నా. ఈ సిటీలో నా ఫేవరెట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. జూబ్లీహిల్స్లోని హెలియోస్ జిమ్లో వర్కవుట్స్, మాదాపూర్ ఇనార్బిట్మాల్లోని ఫ్యూజన్9 రెస్టారెంట్లో కూర్చుని ఫుడ్ని ఆస్వాదించడం ఇలా ఈ సిటీలో నాకున్న హాబీస్ లిస్ట్ పెద్దదే. ఇనార్బిట్ మాల్లో రెస్టారెంట్ నుంచి సిటీ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. ఆ ప్లేస్కు వీక్లీ ఒకసారైనా వెళ్లి ఎంజాయ్ చేయడం నాకు అలవాటు. పండుగ కళ ఇష్టం... వినాయకచవితి, రంజాన్.. వంటి పండుగల టైమ్లో సిటీలో సందడి చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. రోడ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఇంత ట్రెడిషనల్గా ఉంటూనే అల్ట్రా మోడ్రన్గా వెలిగిపోయే నైట్లైఫ్ జోష్ కూడా అంతే స్థాయిలో ఉండడం ఈ సిటీకి మాత్రమే సాధ్యం. నా క్లోజ్ ఫ్రెండ్స్లో చాలా మంది ఇక్కడే ఉన్నారు. అందుకే ముంబై వెళ్లినా ఎక్కువ రోజులు ఉండలేను. హోమ్సిక్ ఫీలై కొన్ని రోజులకే తిరిగొచ్చేస్తా. -
కో అంటే కోహ్లి..
వరల్డ్కప్లో వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బంతిని బౌండరీలు దాటిస్తున్న విరాట్ కోహ్లి.. వెస్ట్రన్ హెయిర్స్టైల్కూ హద్దులు చెరిపేస్తున్నాడు. ప్రపంచకప్లో ఆటగాడిగా సాధించిన ఘనతతో సమానమైన కీర్తిని తన సరికొత్త లుక్తోనూ సంపాదించుకుంటున్నాడు. గూగుల్లో అత్యధిక సెర్చ్లు సాధించిన కోహ్లీ హెయిర్స్టైల్.. ఫేస్బుక్లో అతని ఫాలోవర్స్ సంఖ్యను కూడా రికార్డ్ స్థాయికి పెంచింది. అదే కోవలో కొత్త ఫ్యాషన్లంటే ముందుండే సిటీయూత్నూ ఆకట్టుకుంది. ఈ ‘హాట్’హెయిర్స్టైల్కి సిటీలో సమ్మర్ సీజన్ ఆజ్యం పోసింది. కూల్ కూల్ కోహ్లి స్టైల్ అని సిటీ కోడై కూస్తోంది. ఎస్.సత్యబాబు ధనాధన్ ధోని క్రికెట్లోకి ఎంటరవుతూనే జులపాల జుత్తును సిటీలో రీ ఎంట్రీ చేయించాడు. క్రికెటర్గా ఉన్నప్పుడు సచిన్ సడన్గా తన హెయిర్స్టైల్ మార్చి స్ట్రయిట్ కట్తో కనిపించి సిటీవాసులకు దాన్ని క్రేజీగా మార్చాడు. ఇక ఇప్పుడు కోహ్లి వంతు వచ్చింది. ‘కోహ్లి హెయిర్స్టైల్ గురించి నెట్లో సెర్చ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకొచ్చి మరీ తమకు అదే రకమైన స్టైల్ కావాలని అడుగుతున్నారు’ అని చెప్పారు దిల్సుఖ్నగర్లోని ఎన్ఆర్బీ సెలూన్ యజమాని నందు. బ్యాట్తోనే కాదు లవర్ బాయ్గానూ నిత్యం వార్తల్లో ఉండే కోహ్లిని అభిమానించే యువతకు నగరంలో కొదవలేదు. అలాగే కొత్త హెయిర్స్టైల్స్తో ప్రయోగాలు చేసే వారికీ కొరత లేదు. ఈ నేపథ్యంలో పార్లర్స్ కోహ్లి హెయిర్కట్ను ప్రత్యేకంగా ఆఫర్ చేస్తున్నాయి. సమ్మర్ స్పెషల్... ‘ఎలాగూ సమ్మర్ వచ్చింది. లాంగ్ హెయిర్తో ఈ సీజన్ కష్టం కదా. అందుకే స్టైల్ మార్చాలనుకుంటుంటే.. కోహ్లి ఓ దారి చూపించాడు’ అని చెప్పాడు విరాట్ ‘కట్’ని తలకి సెట్ చేయించుకున్న సిటీ కుర్రాడు శైలేంద్ర. సిటీలో ఈ స్టైల్ సెట్ చేయడానికి పార్లర్స్లో రూ.450 నుంచి డిమాండ్ చేస్తున్నారు. రెండు చెంపల వైపు దాదాపు అడుగున చర్మం కనిపించే స్థాయిలో హెయిర్ తీసేసి మధ్యలో మాత్రం తగినంత ఉంచుతారు. పాపిట తరహాలో కుడి వైపు గైడ్లైన్ గీయడం కోసం బ్లేడ్ వినియోగిస్తారు. లేయర్స్గా ఉండే జుట్టు నుదుటి మీద పడకుండా పైకి ఉండేలా సెట్ చేస్తారు. ‘దీన్ని క్రూక్డ్ కట్, నారో కట్, షార్ట్ మెహక్ అని కూడా అంటారు’ అని చెప్పారు హెయిర్స్టైలిస్ట్లు రాజు, బబ్లూ. జుట్టు సరళిని బట్టి కోహ్లి స్టైల్ సెట్ చేయడం కోసం కనీసం 30 నిమిషాలు ఆ పైన సమయం తీసుకుంటుందని చెప్పారు. సిటీలో యూత్ దీనిపై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొందరు ఈ స్టైల్ని మక్కీకి మక్కీ కావాలని కోరుతుంటే.. మరికొందరు చిన్న చిన్న మార్పులతో అనుసరిస్తున్నారు. కుడివైపు గైడ్లైన్ గీస్తే ఇంట్లోవాళ్లు తిడతారనే భయంతో కొందరు వద్దంటున్నారు. అలాగే రెండు చెంపల వైపు మరీ నున్నగా ఉండకుండా చిన్న చిన్నగా వెంట్రుకలు ఉంచడం లాంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటున్నారు. వెస్ట్రన్ వెరైటీ.. కోహ్లి ఇంట్రడ్యూస్ చేసిన హెయిర్స్టైల్ పేరు మెహక్. ఇండియాకి కొత్తే అయినా.. పాశ్చాత్య దేశాలకు పాతదే. ఫుట్బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హామ్ 2012లో జరిగిన ఫిఫా వరల్డ్కప్లో దీన్ని బాగా పాపులర్ చేశాడు. తర్వాత పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా దాన్ని ఫాలో అయ్యాడు. ఇదే స్టైల్తో బెస్ట్ లుకింగ్ మ్యాన్ అవార్డ్ను రొనాల్డో దక్కించుకున్నాడు. ఇది మొహికన్ హెయిర్స్టైల్ నుంచి పుట్టిందని చెబుతున్నారు. రొనాల్డోకి తాను పెద్ద ఫ్యాన్ అని ఓ సందర్భంలో చెప్పిన విరాట్ తనకు ఈ ఫుట్బాల్ ప్లేయర్ స్ఫూర్తి అని కూడా అన్నాడు. దీనికి ప్రతిగా రొనాల్డో సోషల్ మీడియా ద్వారా విరాట్కు థ్యాంక్స్ చెప్పాడు కూడా. ఫాలోవండర్స్... తన లుక్తో ప్రయోగాలు చేస్తానని గతంలోనే చెప్పిన కోహ్లి మాట మీద నిలబడి.. తనకు నచ్చిన, నప్పిన లుక్తో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం వరల్డ్కప్లో టాక్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిన తన లుక్ ద్వారా విరాట్.. ఫేస్బుక్ మీద అత్యధిక సంఖ్యలో నెటిజన్లు ఫాలో అయిన సెకండ్ ఇండియన్ స్పోర్ట్స్ స్టార్గా స్థానం దక్కించుకున్నాడు (ఫిబ్రవరి 20, 2015 నాటికి 20,017,258 అభిమానులు. 24,789,418 లైక్స్తో సచిన్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు) ఈ హెయిర్స్టైల్ కోసం విరాట్ మెల్బోర్న్లోని టోనీ గై సెలూన్కు నడుచుకుంటూ వెళ్లాడట. ఏమైతేనేం.. క్రిస్టియానో రొనాల్డోను తలపిస్తూ బయటకు వచ్చాడు. అతని స్టైల్ను అనుసరిస్తూ యువత సిటీలో నయా ట్రెండ్కు గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది. -
బంపర్ డీల్!
రీసెంట్ పాస్ట్లో చెప్పుకోతగ్గ హిట్స్ లేకపోయినా గిరాకీ మాత్రం తగ్గలేదు బాలీవుడ్ బేబ్ ప్రియాంక చోప్రాకు. ఈ మల్టీ టాలెంటెడ్ సుందరి ఇటీవలే ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఓ హ్యాండ్ బ్యాగ్ బ్రాండ్తో అక్షరాలా పదిహేను కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుందట! భారత్లోనే కాదు... అమెరికాలో కూడా ప్రియాంకానే ఈ బ్రాండ్కు ప్రమోటర్. త్వరలోనే అమ్మడు సదరు యాడ్ షూటింగ్లో పాల్గొనబోతుందనేది ఓ వెబ్సైట్ కథనం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఈ యాడ్స్ ప్రసారమవుతాయట. విశేషమేమంటే...ఈ షూటింగ్ రెండు నెలలపాటు కొనసాగుతుందట! సూపర్డూపర్ సినిమాలు లేకపోయినా... ఈ సోగ కళ్ల సుందరి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మొత్తానికి రాబోయే యాడ్లో ప్రియ సరికొత్త లుక్స్తో అలరించనుందనేది సినీజనం టాక్! లెట్స్ వెయిట్ అండ్ సీ! -
దేవుడే దిగివచ్చినా!
బాలీవుడ్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే స్టార్లు ఖాన్ త్రయం... షారూఖ్, సల్మాన్, ఆమిర్. ఈ ముగ్గురు హీరోలూ... చాలా కాలం తరువాత ఈమధ్యే జరిగిన సల్మాన్ సిస్టర్ మ్యారేజ్లో ఒక్కటయ్యారు. అంతాబానే ఉంది గానీ... స్టార్ దర్శకురాలు ఫరాఖాన్ వీరిని తన కుకరీ షోకు రప్పిస్తుందనేది ఇప్పుడో సంచలన వార్తగా మారింది. కానీ అలాంటిదేమీ లేదని కూల్గా చెప్పింది ఫరా. ‘మీరు ప్రయత్నించలేదా’ అంటే... అవన్నీ రూమర్లేనని కొట్టిపారేసింది. కాకపోతే... తన ‘ఓంశాంతి ఓం’ సినిమా కోసం ముగ్గుర్నీ ఒకే స్క్రీన్పైకి తీసుకు రావాలనుకున్నా వర్కవుట్ కాలేదని చెప్పింది! అసలు తానే కాదు... ఈ ఖాన్ త్రయాన్ని కలిపి ఒకే సినిమాలో చూపించడం ఆ దేవుడి వల్ల కూడా కాదనేసింది! మొత్తానికీ డైలాగ్... ప్రయత్నించి విసిగిపోయిన ఫ్రస్టేషన్లో వచ్చిందా... తనవల్ల కానిది ఇంకెవరివల్లా కాదన్న కాన్ఫిడెన్స్తో వచ్చిందా... లేక మళ్లీ ముగ్గురి మధ్య గ్యాప్ పెరిగిందన్న సంకేతం ఇస్తోందో... అన్నది అర్థం కావట్లేదు బీటౌన్ పీపుల్కు! -
సీన్ మారిందా!
ఫిల్మీ దునియాలో హాట్ కపుల్ ఎవరంటే ఠక్కున చెప్పే పేర్లు రణబీర్కపూర్, కత్రినాకైఫ్. ఎక్కడా ఆ విషయాన్ని బయట పెట్టలేదు గానీ... చాలాకాలంగా ఇద్దరూ డేటింగ్లో మునిగి తేలుతున్నారు. ఇక వీరి లవ్ రేస్లో మిగిలింది పెళ్లి బాజానే అనుకుంటున్న సమయంలో హోలీ సాక్షిగా అందరికీ షాకిచ్చింది రణబీర్ తల్లి నీతూకపూర్. మాజీ ప్రియురాలు దీపికాపడుకొనేతో హోలీ ఆడుతున్న రణబీర్ పిక్చర్ను సామాజిక సైట్లో పోస్ట్ చేసి జనాల మదిలోకి ఓ సరికొత్త ఆలోచనల్ని పరిగెత్తించింది. ప్రస్తుతం ఓ సినిమాలో చేస్తున్న దీపిక, రణబీర్లు వాలంటైన్స్ డేను కలసి ఎంజాయ్ చేశారని సమాచారం. దీంతో కత్రినా, రణబీర్ల మధ్య ఏదో జరిగిపోతోందని గుసగుసలు మొదలయ్యాయి. నీతూ లేటెస్ట్ పోస్ట్తో ఆ గుసగుసలకు మరింత బలం వచ్చినట్టయిందనేది ఇండస్ట్రీ టాక్! -
స్ప్రింగ్ కార్నివాల్
నగరంలోని షాపింగ్ ప్రియులకు ఓ సరికొత్త అనుభూతినిచ్చింది బంజారాహిల్స్ లామకాన్లో శనివారం నిర్వహించిన ‘స్ప్రింగ్ కార్నివాల్’. ఫుడ్, మ్యూజిక్, వస్త్రాలు, యాక్సెసరీస్, జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్గానిక్ వెరైటీలెన్నో కొలువుదీరిన ఈ ఫ్లీ మార్కెట్ విశేషంగా ఆకట్టుకుంది. నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నచ్చిన ఐటెమ్స్ను ముచ్చటగా కొనుక్కున్నారు. -
అల్ట్రా బూస్ట్
స్పోర్ట్స్ షూస్లో బెస్ట్ బ్రాండ్ అడిడాస్... కొత్త మోడల్తో ముందుకొచ్చింది. విప్లవాత్మక మార్పులతో రూపొందించిన ఈ సరికొత్త రన్నింగ్ షూస్ ‘అల్ట్రా బూస్ట్’ను టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా లాంచ్ చేసింది. జూబ్లీహిల్స్ అడిడాస్ స్టోర్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సానియాతోపాటు ఐదుగురు రన్నర్స్ కూడా పాల్గొన్నారు. షూస్ ధరించి పరుగెత్తడంలో సరికొత్త అనుభూతిని ఆస్వాదించారు. షూస్తోపాటు... శరీర దృఢత్వం, పనితీరు ఇతర శారీరక అంశాలను సూచించే ‘మై కోచ్ స్మార్ట్ రన్’ పరికరాన్ని కూడా ప్రవేశపెట్టింది అడిడాస్. జీపీఎస్ సిస్టమ్తో పనిచేసే ఈ పరికరం స్పోర్ట్స్ పర్సన్స్కు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు నిర్వాహకులు. -
ఫ్యాషన్ ఐకాన్
ఫ్యాషన్ రంగంలో వస్తున్న అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా దేశంలో న్యూ బ్రాండ్స్కు ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ మ్యాక్స్. హైదరాబాద్లో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఈ సంస్థ మొట్టమొదటిసారిగా ఫ్యాషన్ షోలపై దృష్టి సారించింది. నగరంలోని సుజ నామాల్లో ‘మాక్స్ ఫ్యాషన్ ఐకాన్ ఇండియా-2015’ పోటీలు నిర్వహించింది. ఔత్సాహిక మోడల్స్ ర్యాంప్వాక్ చేశారు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన నటి, మోడల్ మనస్వి మంగాయ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ. ఈ నెల 21న దిల్లీలో ‘మాక్స్ ఫ్యాషన్ ఐకాన్ ఇండియా-2015’ ఫైనల్స్ జరగనున్నాయి. -
జో.. పశ్చిమానంద
‘చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టె కలిపావు’ అన్న చరణానికి ఉదాహరణ జో కోస్టర్ జీవితం! వాణిజ్య వ్యవహారాల కన్సల్టెంట్ అయిన స్విట్జర్లాండ్కు చెందిన ‘జో’ తెలుగువారి స్వచ్ఛంద సేవకుడిగా మారాడు! ఇప్పుడాయన ఎందరో విద్యార్థుల తలలో నాలుక! ‘హైదరాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్’వ్యవస్థాపక డెరైక్టర్ అయిన జో కోస్టర్తోసంభాషణ అతని మాటల్లోనే... పున్నా కృష్ణమూర్తి స్విట్జర్లాండ్ నా దేశం. బెర్లింగన్ మా ఊరు. కాన్స్టన్స్ అనే సరస్సు మా ఊరుకు ఆభరణం. హైద్రాబాద్, సికింద్రాబాద్ను హుసేన్ సాగర్ కలిపినట్టు, కాన్స్టన్స్ జర్మనీ-ఆస్ట్రియా-స్విట్జర్లాండ్లను కలుపుతుంది. వీచేగాలిని బట్టి సరస్సు అలలు ఒకో తీరాన్ని తాకినట్టు నా ప్రయాణం సాగింది. మ్యూనిచ్లో ఒక వాణిజ్య సంస్థకు బిజినెస్ కన్సల్టెంట్ డెరైక్టర్గా పనిచే సేవాడిని. ఒక స్వచ్ఛంద సంస్థ ప్రాజక్ట్ పనితీరును పరిశీలించేందుకు 1992లో మొదటిసారి ఇండియా వచ్చా. ప్రతి ఏటా వచ్చి రెండు-మూడు వారాలు ఉండేవాడిని. గోదావరి జిల్లాలు, ఖమ్మం, నగరంలోని కొన్ని స్లమ్స్లో పనిచేశాను. నా దృష్టిలో హైదరాబాద్లాంటి నగరాలు వేరు. గిరిజన, దళిత సమూహాలు నివసించే ప్రాంతాలు వేరు. ఇక్కడి ప్రజలతో ఏర్పడిన అనుబంధం నన్ను హైదరాబాదీని చేసింది. 2003 నుంచి పన్నెండేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. నా భార్య ఇనెస్ స్విట్జర్లాండ్లో నర్స్గా పనిచేస్తోంది. కొన్ని నెలలు తను ఇక్కడకు వస్తుంది. మరికొన్ని నెలలు నేను అక్కడకు వెళ్లి వస్తాను. ధర్మవ్యాధుని ‘జో’ల పాట బిజినెస్ కన్సల్టెన్సీ-ఎన్జీఓల వ్యాపకాలకు సంగీతం ఎలా జతకూడింది? అనుకుంటున్నారు కదా! సహజమే! మున్సిపల్ పట్టణం అయిన బెర్లింగెన్లో మాకో రెస్టారెంట్ ఉంది. మా నాన్న జోసెఫ్ బుచర్. ‘కసాయి’ అంటే కటువుగా భావిస్తారేమో కానీ.. వృత్తిలో కళాత్మకత ఉంటుంది. భారతీయ పురాణాల్లో ధర్మవ్యాధుడు గుర్తొస్తాడు మా నాన్నను తలచుకుంటే! రెస్టారెంట్లో కస్టమర్లు విందు ఆరగిస్తున్నప్పుడు మా నాన్న అకార్డియన్ వాయించేవాడు. అకార్డియన్ వినేందుకు కొందరు కస్టమర్లు మా రెస్టారెంట్కు వచ్చేవారు. నాన్న ద్వారా విన్న ట్యూన్స్, వారాంతాల్లో వెళ్లిన మ్యూజిక్ క్లాస్లు బాల్యంలో సంగీతం పట్ల శ్రద్ధను పెంచాయి. మా రెస్టారెంట్లో, లోకల్ బ్రాస్-బ్యాండ్, స్విస్ ఆర్మీబ్యాండ్లలో ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడిని. శాక్సాఫోన్, ట్రంపెట్, క్లార్నెట్, అకార్డియన్ ఎంత గొప్ప ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పటి జనరేషన్లో కొందరు వాటిపట్ల చిన్నచూపు చూస్తున్నారు. పియానో, గిటార్, వయొలెన్, సితారలను మాత్రమే ‘క్లాసిక్స్’ అనుకొంటున్నారు. ఫ్రెంచ్ టచ్! బుధ, శనివారాలు ఫ్రాన్స్ వాసులకు మ్యూజిక్ డేస్! ఆ రెండు రోజులు రెగ్యులర్ సిలబస్ను పక్కనపెట్టి క్లాసికల్-కాంటెపరరీ మ్యూజిక్ను నేర్చుకుంటారు. హైదరాబాద్లోని ఫ్రెంచ్ కల్చరల్ సెంటర్ ‘అలయన్స్ ఫ్రాంఛైజ్’ డెరైక్టర్గా పనిచేసిన ఫ్రెడరిక్, మ్యూజిక్ లవర్. హవాయియన్ గిటార్ను రూపకల్పన చేసిన హిందుస్తానీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ జయవంత్ నాయుడును, నన్నూ వారాంతపు కార్యక్రమాల్లో ప్రోత్సహించేవారు. ఆ నేపథ్యంలో హైదరాబాద్లో వెస్ట్రన్ మ్యూజిక్ను నేర్పే సంస్థ అవసరం ఉందని వివిధ సాృస్కృతిక సంస్థలు, పాఠశాలల నిర్వాహకులు భావించారు. అలా ‘హైదరాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్’ (http://www.hydmusic.com) అంకురించింది. దక్కన్ వాయిస్... వెస్ట్రన్ మ్యూజిక్ అంటే శంకరాభరణం సినిమాలో కథానాయకుడు శంకర శాస్త్రి చెప్పినట్లు సంగీతం స్థలకాలాదులకు అతీతమైనది. అన్నమయ్య కీర్తన ‘జో అచ్యుతానంద’ ఎంత హాయైన పాట! వెస్ట్రన్ మ్యూజిక్లో కూడా మంచి నిద్రను ప్రసాదించే క్లాసిక్ ట్యూన్స్ ఉంటాయి. ఈ అవగాహనతో హైదరాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్ నిపుణులు 11వ శతాబ్దినుంచి ఇప్పటి వరకు మ్యూజిక్ థియరీని విద్యార్ధులకు చెబుతారు. వెస్ట్రన్ క్లాసిక్ మ్యూజిక్ మాస్టర్స్ నుంచి సమకాలీనుల వరకూ విద్యార్ధులకు పరిచయం చేస్తాం. ప్రాక్టీస్ చేయిస్తాం. ఎంపిక చేసిన వారితో కచేరీలు పెట్టిస్తాం. వివిధ దేశాలనుంచి సమకాలీన ప్రముఖులను పిలిపించి వారి కన్సర్ట్స్ ద్వారా సంగీతాభిమానులను ఆకర్షిస్తాం. సంస్థద్వారా తర్ఫీదైన యువకుల ప్రావీణ్యాన్నీ పరిచయం చేస్తాం. ఉదాహరణకు నవంబర్ 1వ తేదీన అలయన్స్ఫ్రాంచైజ్ కార్యాలయంలో నిర్వహించనున్న ‘హైదరాబాద్ యూత్ ఎసెంబుల్ మూడో సీజన్’ కోసం శిక్షణాకార్యక్రమాలను ఇటీవలే ప్రారంభించాం. ఫేస్బుక్: <http://www.facebook.com/TheHyderabadWesternMusicFoundation>www.facebook.com/TheHyderabadWesternMusicFoundation ద్వారా గానీ, info@hydmusic.com ఈమెయిల్ ద్వారా గానీ వివరాలు తెలుసుకోవచ్చు. -
సమానం అంటే సగమని కాదు
షబానా అజ్మీ.. బాలీవుడ్ నటి మాత్రమే కాదు.. సామాజిక రుగ్మతలపై తనదైన గొంతును వినిపించే సోషల్ యాక్టివిస్ట్. మహిళా సమస్యలపై, ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలపై నిరసన గళం వినిపించే రెబల్స్టార్. నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఏకంగా ఐదు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఈమె ఒకరు. ఇటీవల ఓ చర్చావేదికలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన షబానా ‘సిటీప్లస్’తో తన మనోభావాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే. శ్రావణ్ జయ ప్రస్తుతం మన దేశంలో స్త్రీలపై అత్యాచారం జరగని రాష్ట్రాన్ని చూపించగలరా? ఎప్పుడో ఒకప్పుడు కాదు. ప్రతిరోజూ.. ఇంకా చెప్పాలంటే ప్రతి గంటకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ, మానవ హక్కుల కోసం గతంలో పోరాడాను. నేటి మహిళ స్థితి ఇంకా దీనావస్థలో ఉంది. గతంలో స్త్రీలపై అత్యాచారం జరిగితే పోలీసుల రికార్డుల్లో మాత్రమే నమోదయ్యేది. నేరం చేసినవారికి శిక్ష పడిన దాఖలాలు కూడా చాలా తక్కువ. అయితే నిర్భయ చట్టం వచ్చాక పెద్ద సంఖ్యలో యువత వీధుల్లోకి రావడం, స్త్రీల ర క్షణ గురించి కొంతమేరకైనా మాట్లాడటం హ ర్షించదగ్గ విషయం. కాని ‘నిర్భయ’, ‘బేటీ బచావో’ లాంటి చట్టాలు వచ్చాక కూడా అకృత్యాలు జరగడం విచారకరం. చట్టాలు చేసినంత మాత్రాన నేరాలు అదుపులోకి రావు. స్త్రీని గౌరవంగా చూడాలన్న నైతిక ప్రేరణ కలిగించడం ముఖ్యం. అది ప్రతి ఒక్కరూ అనివార్యంగా తెలుసుకోవాలి. నేటికీ బాల్య వివాహాలు.. స్త్రీ, పురుష విభేదాలు అతి ఎక్కువగా ఉన్న మనదేశంలో సమానత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమైన అంశం. నా తల్లిదండ్రులిద్దరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. నాన్న (కైఫీ అజ్మీ), అమ్మ (షౌకత్ అజ్మీ).. వారిద్దరి భావోద్వేగాలు నాలోనూ ఉన్నాయి. అందుకే నటిగా బిజీగా ఉన్నా కూడా సామాజిక రుగ్మతలపై పోరాటం చేశా. నేటికీ 12 ఏళ్ల బాలికలకు పెళ్లి చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా ఆడపిలల్ని కనడంలో అయిష్టత చూపిస్తున్నారు. ఒకవైపు పురిటిలోనే చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఆడశిశువు అని తెలియగానే గర్భంలోనే బిడ్డను చంపేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. సమానత్వం అంటే జనాభాలో సగం మహిళలు ఉండటం కాదు.. హక్కుల్లో, అన్నింటా మహిళలకు సగ భాగం ఉండాలి కదా! ప్రాధాన్యమివ్వని సినిమా... సినిమాల్లో ఆడవాళ్లను ఆటబొమ్మలుగా చూపించే దౌర్భాగ్యం నుంచి దర్శకనిర్మాతలు బయటికి రావాలి. మన చిత్రాల్లో రానురాను మహిళలకు ఇంపార్టెన్స్ తగ్గుతోంది. ఏదో ఒకటి, రెండు తప్ప అన్ని సినిమాల స్క్రిప్టులు హీరోలను దృష్టిలో పెట్టుకుని రాసేవే. నే ను దాదాపు 120 సినిమాల్లో నటించాను. ప్రతి సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటా. ప్రస్తుతం ‘జబా’్జ అనే సినిమాలో నటిస్తున్నాను. మన సినిమాలు ప్రాక్టికల్గా, రియాలిటీ కి దగ్గరగా ఉండాలి. ఇండియన్ సినిమాలో సెన్సారింగ్ అంటే మాటల్ని, దృశ్యాల్ని కట్ చేయడమే. ఎందుకంటే మన ఇండస్ట్రీ ఇప్పటికీ బ్రిటిష్ సెన్సారింగ్ విధానాన్ని అనుసరిస్తోంది. కాని సెన్సార్ చేయడం అంటే ‘కట్’ చేయడం మాత్రమే కాదు. ఏదైనా దృశ్యం అభ్యంతరకరంగా కాని, నిబంధనలను ఉల్లఘించే విధంగా కాని ఉంటే కట్ చేయాలి. అలాకాక ప్రేక్షకుల వయసు, విచక్షణ జ్ఞానానికి సంబంధించిన దృశ్యాలు ఉంటే వాటిని కట్ చేయడం కంటే ఆ చిత్రానికి రేటింగ్ మార్చి ఇవ్వాలి. అమెరికాలో చిత్రాలకు ఇదే తరహాలో సెన్సార్ విధానాన్ని పాటిస్తున్నారు. -
చిట్టితల్లికి ఎన్ని శాపాలో..
బేటీ బచావోలో ఈ రోజు కనిపించే అమ్మాయిలాంటి వాళ్లెందరికో నగరాల్లోని పాష్ లొకాలిటీస్లు ఆవాసాలు. ఇది ఓ పదేళ్లమ్మాయి జీవితం! ఉనికి సహజం అయినప్పుడు పేరు అనవసరం! కాబట్టి నేరుగా ఆమె కథలోకి వెళ్దాం. ఈ అమ్మాయి వాళ్లది ఆంధ్రలోని మారుమూల పల్లెటూరు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ముల్లో ఆఖరుది. పెద్దక్క పెళ్లయింది. రెండో అక్క అమ్మానాన్నలతోపాటు వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. ఇద్దరన్నలు హైదరాబాద్లోనే ఉంటున్నారు చదువు కోసం. ఈ ఇద్దరు మగపిల్లల్ని చదివించడం కోసం తల్లి, తండ్రి, అక్కతో కలసి పదేళ్ల ఈ పిల్లా శ్రమదానం చేస్తోంది. ఎలా.. తన అమ్మానాన్నలు పనిచేసే పొలం యజమానికి ఒక్కడే కొడుకు. హైదరాబాద్లో ఉంటున్నాడు వ్యాపార నిమిత్తం. అతని భార్య ప్రభుత్వోద్యోగి. ఇద్దరు పిల్లలు. చిన్న పిల్లాడికి నెలల వయసుంటుంది. ఆ పిల్లాడి ఆలనాపాలనకు ఈ పిల్లను తెచ్చుకున్నారు. అంటే బాలకార్మికురాలిగా అన్నమాట. అదీ జీతమిచ్చి కాదు. వెట్టికి. కారణం.. ఈ పిల్ల అక్క పెళ్లికి వాళ్ల నాన్న ఈ వ్యాపారి తండ్రి దగ్గర పాతికవేలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు కింద పదేళ్ల బిడ్డను ఇక్కడికి పంపించాడు. పిల్లాడి బాధ్యత.. తన తిండి తనకే సరిగ్గా తినడం రాని ఆ చిట్టితల్లి చిట్టిచిట్టి చేతులతో ఇంకో చంటోడికి ముద్దలు తినిపించాలి. వాడు సరిగ్గా తినకపోతే ఈ అమ్మాయికి వీపు మీద వాతలే! సన్నగా పీలగా ఉన్న ఈ పిల్ల బొద్దుగా ఆరోగ్యంగా ఉన్న ఆ బాలుడిని పొద్దస్తమానం చంకనెత్తుకొని మోయాలి. కింద దించితే వాడు రాగం తీస్తాడు. అమ్మగారు పొద్దున లేవగానే ఆఫీస్కెళ్లే హడావిడిలో ఉంటారు కాబట్టి పిల్లాడు ఏడ్వకుండా వాడి బాధ్యతలన్నీ ఈ పిల్లే చూసుకోవాలి.. ఆవిడ ఆఫీస్కు వెళ్లిపోతే ఎవరూ ఉండరు కాబట్టి మళ్లీ ఈ అమ్మాయికే ఆ భారం. అమ్మగారు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి వస్తారు.. ఆవిడకు కాస్త విశ్రాంతి కావాలి.. ఆ పిల్లాడిని సాయంకాలం ఈ పిల్లే లాలించాలి. పదేళ్లకే ఓ తల్లి మోయాల్సిన భారం ఈ చిన్నతల్లి మోస్తోంది. ఆమెకన్నా రెండేళ్లే చిన్నోడైన అమ్మగారి పెద్దకొడుకు ఎంచక్కా స్కూల్కి వెళ్తాడు. స్నేహితులతో ఆడుకుంటాడు.. పాడుకుంటాడు.. కావల్సింది తింటాడు.. హాయిగా నిద్దరోతాడు! దీనికి పూర్తిగా విరుద్ధం ఈ అమ్మాయి జీవితం! ఇలాంటి వెట్టి జీవితాలు హైదరాబాద్లోని పెద్దిళ్లల్లో చాలా కనిపిస్తాయి. ఓవైపేమో ప్రభుత్వాలు బాలకార్మిక వ్యవస్థను రద్దుచేయడానికి కఠిన చర్యలు అంటాయి.. ఇంకో వైపు బేటీలను బచాయించడానికి కంకణాలు కట్టుకుంటాయి. అయినా ఈ పిల్లల తలరాతలు మానవు. ముగింపు ఇలాంటి వెతలకు ముగింపు కావాలి. ఎప్పుడు ? ఏమో! బేటీ బచావో ప్రచారానికి ‘సిటీప్లస్’ పెన్ను పట్టి నెలవుతోంది. నేటితో విరామమిస్తోంది. ఈ నెలరోజుల్లో ఇక్కడ ప్రచురితమైన గాథలే కాక రాయడానికి వీల్లేని ఘోర గాయాలనూ చూసింది. దాదాపు అరవై శాతం వ్యథలకు కారణం ఇంటి సభ్యులే! మనసు చలించింది.. కలత చెందింది! అక్షరాలుగా పేరిస్తే ఒక్కరైనా స్పందించి ఆడబిడ్డ పట్ల సున్నితంగా ఆలోచిస్తారేమో అనిపించింది. అందుకే ఈ ప్రయత్నంతో ముందుకు వచ్చాం. ఆ ఒక్కరు ఇంకొకరిని.. ఆ ఇంకొకరు మరొకరిని ఇలా కనీసం కొంతమందైనా ప్రభావితమైతే.. ప్రయత్నం సఫలమైనట్టే! ఆడపిల్ల రక్షణకు అడుగు పడ్డట్లే! అలా బేటీ బచావో అనే ఈ కాలమ్కి మంచి ముగింపును ఆశిస్తున్నాం! సరస్వతి రమ -
సీన్ షితారే..
‘నేను ఈల వేస్తే గోలుకొండ అదిరి పడతది’ అంటూ సిటీలో ఏ బ స్స్టాప్లోనో.. వీధి మలుపు దగ్గరో.. అమ్మాయిలను ఆటపట్టించారా.. తస్మాత్ జాగ్రత్త! ఆడపిల్లలను ఫాలో అవ్వడం.. దారి కాచి బీటు వేయడం ఇక కుదరని పని. కాలేజీ గేట్ ముందు.. బస్స్టాప్లలో.. రద్దీ ప్రాంతాల్లో.. మఫ్టీల్లో మహిళా పోలీసులు ఉంటారు.‘ఫిగర్ కత్తిలా ఉంది’ అని కామెంట్ చేశారా.. సీన్ షితారే. ఈ ఆకతాయి పనులను చూసి ఎవరైనా ‘షీ టీమ్’కు రింగిస్తే చాలు.. మీ తాట తీస్తుంది! భువనేశ్వరి షీ టీమ్.. ప్రస్తుతం నగరంలో యువతులకు రక్ష క కవచం. గతేడాది అక్టోబర్ 24న ఈ మహిళాదళం పరిచయమైంది. అమ్మాయిలపై పెరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ టీమ్ ఆపరేషన్లు ఆకతాయి యువకుల్లో దడ పుట్టిస్తున్నాయి. అబ్బాయిల నడవడిలో మార్పు తెచ్చేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. ఇది సింగిల్ టీమ్ కాదు. వంద బృందాలున్నాయి. ఒక్కో టీమ్లో ఐదుగురు పోలీసులు. అందులో ఒక మహిళా పోలీస్ తప్పనిసరిగా ఉంటారు. దాదాపు 500 మంది పోలీసులు మఫ్టీలో మనల్ని ఒక కంట కనిపెడుతుంటారన్నమాట. పరుగో పరుగు... గత నాలుగు నెలల్లో ‘షీ టీమ్’లు 135 మంది ఈవ్టీజర్లను అరెస్ట్ చేశాయి. వీరిలో కాలేజీ కుర్రాళ్లు.. ఉద్యోగస్తులు.. మేజర్లు.. మైనర్లు.. అందరూ ఉన్నారు. ఈవ్టీజింగ్ జరుగుతున్న స్పాట్ వీళ్లకు ఎలా తెలుస్తుందంటారా..? కాలేజీ గోడలపైన, బస్స్టాప్ పరిసరాలల్లో ‘ఒక్క ఫోన్ కాల్ చాలు ఆకతాయి నోటికి తాళం వేయడానికి, చేతికి సంకెళ్లు వేయడానికి’ అంటూ కనిపించే ‘షీ టీమ్’ ప్రకటనే దీనికి కారణం. ఇదే అమ్మాయిలకు భరోసా కల్పించింది. ఈ పనిలో యమ బిజీగా ఉన్న మన అడిషనల్ సీపీ క్రైమ్ స్వాతి లక్రాని పలకరిస్తే.. ‘‘షీ టీమ్’ పేరు చెబితే ఈవ్టీజర్లు పారిపోతున్నారు. ఈ విషయంలో అవగాహన తేవడంలో మా టీమ్ విజయం సాధించిందని గర్వంగా చెప్పగలను. అయితే మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే సోషల్ నెట్వర్క్ సాయం కూడా తీసుకుంటున్నాం’ అని చెప్పారామె. ఫేస్‘బుక్’ సాయంతో... ఈవ్టీజింగ్ కేసుల్లో అరెస్టయిన వారిలో చాలావరకూ మైనర్లే ఉంటున్నారు. వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి ‘షీ టీమ్’ వినూత్నమైన పనిష్మెంట్లు ఇస్తోంది. ‘అమ్మాయిలను ఏడిపిస్తూ పట్టుబడిన మైనర్లను కొట్టలేం. అందుకే వారిని వెరైటీగా పనిష్ చేస్తున్నాం. వారి వారి ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో రోజుకు కొన్ని వందలసార్లు.. యాంటీ ఈవ్టీజింగ్ కొటేషన్లు అప్లోడ్ చేయిస్తున్నాం. వాళ్లు పోస్ట్ చేస్తున్నారా లేదా అని మా వాళ్లు ఫాలోఅప్ చేస్తారు. మైనర్ నేరస్తులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు వారానికి, పదిరోజులకి ఇన్నిసార్లని వారి దగ్గర అటెండెన్స్ కూడా తీసుకుంటున్నాం’ అని చెప్పారు స్వాతి లక్రా. ‘షీ టీమ్’ దృష్టిలో పడనంత వరకే ఈవ్టీజర్ల ఆటలు. ఆ తర్వాత సీనంతా చాలా సీరియస్గా ఉంటుంది. వారు మారడంతో పాటు వారిలాంటివారిని మార్చే పనిచేయకపోతే ‘షీ టీమ్’ బెత్తం రుచి చూపిస్తుంది. వంద డయల్ చేస్తే... ‘అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే మీ దృష్టికి వచ్చిన సంఘటనల గురించి ‘100’ నెంబర్కి ఫోన్ చేసి చెబితే చాలు. సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన అవసరం ఉంటే వీలైనంత త్వరగా మా టీమ్ అక్కడికి చేరుకుంటుంది. నగరంలో ముఖ్యమైన సెంటర్లలో మా టీమ్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకున్నాం’ అని తెలిపారు స్వాతి లక్రా. మహిళా రక్షణ కోసం విడుదల చేసిన hawk eye మొబైల్ అప్లికేషన్, sheteamhyderabad అనే ఫేస్బుక్ అకౌంట్, hydsheteam@gmail.com ద్వారా వచ్చే ఫిర్యాదుల ఆధారంగా కూడా ‘షీ టీమ్’ ఈవ్టీజర్లను వేటాడుతోంది. మైనర్లను మార్చడం, మేజర్లను శిక్షించడంతో సరిపెట్టుకోవడం లేదు. అమ్మాయిలకు కూడా కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో ధైర్యం నింపుతోంది. మేమున్నాం... రెండు నెలలుగా కొందరు అబ్బాయిలు షీ టీమ్ని కలిసి వారి ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళుతున్నారు. విషయం ఏంటంటే.. వారుంటున్న ప్రదేశాల్లో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా షీటీమ్ తర ఫున తాము ముందుకొచ్చి సాయపడతామని చెబుతున్నారు. ‘మహిళల రక్షణ కేవలం పోలీసులది మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరిది. అందరి బాధ్యత అని తెలిసిన రోజున మాతో పని ఉండదు’ అని అంటున్నారు స్వాతి లక్రా. అలాగే అమ్మాయిని ఏడిపిస్తే మజా వస్తుందనుకునేవారికి మన ‘షీ టీమ్’ చేతిలో సీన్ సితారే అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. -
ఒకరికి ఒకరు!
హిందీ జంట దీపికా పడుకొనే, రణవీర్సింగ్ల మధ్య రోజురోజుకూ వ్యవహారం ముదురుతున్నట్టుంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా కలసి తెగ తిరిగేస్తున్నారు. ఎక్కడ చూసినా వారే. రీసెంట్గా ఢిల్లీలో రణవీర్ స్నేహితుడు కరణ్ కపాడియా మ్యారేజ్ నిత్యా మెహ్రాతో జరిగింది. దీనికి ప్రేయసి దీపికతో సహా అటెండయ్యాడట. ‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ పెళ్లివారంతా ఇద్దరినీ చుట్టుముట్టేశారట! ఇక రణవీర్ చెల్లి రితిక అయితే దీపికను అతుక్కుపోయింది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో క్రీజీగా మారాయి. రణవీర్ మాత్రం చెయ్యికి, మెడకు కలిపి కట్టు కట్టుకుని కాస్త డిఫరెంట్గా దర్శనమిచ్చాడు. ఏంటని ఆరా తీస్తే... జైపూర్లో షూటింగ్ సందర్భంగా హార్స్ రైడింగ్ చేస్తూ పట్టు తప్పి కింద పడ్డాడట మనోడు. భుజం విరిగి ఇప్పుడిలా అవస్థలు పడుతున్నాడు. పెళ్లి తరువాత కూడా ఈ ప్రేమ పావురాలు ఒక్కటిగా ఎగిరిపోయాయట! -
అమ్మ దారి!
‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’తో జాతీయ అవార్డు తెచ్చుకున్న బెంగాలీ గుమ్మ కొంకణాసేన్ శర్మా... తన తల్లి అపర్ణాసేన్ బాటలో పయనిస్తోంది. ఇప్పటి వరకు నటనకే పరిమితమైన కొంకణ... ఇక మెగాఫోన్ పట్టి డెరైక్టర్ అవతారం ఎత్తనుందనేది సమాచారం. ఈ బహుభాషా చిత్రానికి కథ, రచన కూడా ఆమే సమకూర్చుకుందట. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఎంతో గోప్యంగా జరుగుతుందనేది కోల్కతా టైమ్స్ కథనం. విశేషమేమంటే... ఇందులో అమ్మడు నటించడం లేదట! తొలి ప్రాజెక్ట్ కాబట్టి... పూర్తి ఫోకస్ డెరైక్షన్ డిపార్ట్మెంట్పై పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుందట. ఇందులో అనుభవం లేదు కాబట్టి... బిగ్స్క్రీన్కు వెళ్లే ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని అనుకుందట కొంకణా. ఎందుకో గానీ... మళ్లీ మనసు మార్చుకుని ‘బిగ్’ ప్రాజెక్ట్లోకి దూకేసింది. ప్రస్తుతానికైతే అపర్ణాసేన్ ఇన్వాల్వ్మెంటేమీ లేదు గానీ, అవసరమైతే అమ్మ తనను గైడ్ చేస్తుందంటూ సన్నిహితులతో చెప్పిందట కొంకణ! -
హయాత్ను పంచి, ఆయుష్షు పెంచే అమ్మల నగరమిది!
ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు ఎప్పుడైనా మీ మనసులోకి వస్తోందా? అంతటి వ్యాకులతకు మీరు గురవుతున్నారా? హైదరాబాద్ గడ్డ మీద అలాంటి ఆలోచన వస్తే... మీరు సైకాలజిస్టునో, సైకియాట్రిస్టునో, ఇలాంటి విషయాలకు కౌన్సెలింగ్ చేసే ఇతర నిపుణులనో కలవనక్కరలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ మన నగరంలోనే జరుగుతుంటుంది కదా! వికలాంగులకు ఎంసెట్టో, మరింకో జట్టుకో ఎంపిక జరుగుతుంటుంది కదా! ఫిజికల్లీ చాలెంజ్డ్ విద్యార్థులకు కౌన్సెలింగ్ జరిగే చోటుకు వెళ్లండి. ఈ హైదరాబాద్ గడ్డ మీద జరిగే ఆ మహాక్రతువును దర్శించిన వాడెవ్వడూ మళ్లీ ఆత్మహత్యకు పాల్పడడు. ఆత్మహత్య అంశానికీ హైదరాబాద్ నగరానికి సంబంధమేమిటని ఆశ్చర్యపడుతున్నారా?! ఇక చదవండి. హైదరాబాద్ నగర స్థాపకుడు సుల్తాన్ కులీ కుమార్తె హయాత్బక్షీ. ఆమె తండ్రి విలాసవంతుడు. కానీ హయాత్బక్షీ భర్త సుల్తాన్ మీర్జా అలాకాదు. విషయంలోలత్వాల పట్ల విముఖుడు. అంతులేనంతగా అంతర్ముఖుడు. భర్తకు అనుగుణంగా నడుచుకునే ఇల్లాలుగా వ్యహరించేదామె. కొడుకు అబ్దుల్లా కుతుబ్షాహ్కు పన్నెండేళ్ల వయసు వచ్చీరాకముందే భర్త చనిపోయాడు. దాంతో పేరుకు అబ్దుల్లా పాలకుడే అయినా అన్ని పాలనా వ్యవహారాలనూ చక్కబెట్టేది ఆ తల్లి. అబ్దుల్లా తన తాత కులీ లాగే విలాసప్రియుడు. వినోదప్రియుడైన తండ్రి, ఏకాంతప్రియుడైన భర్త, విలాసప్రియుడైన కొడుకు... ఈ మూడు భిన్నమనస్తత్వాల తత్వాలెరిగి ప్రవర్తించిందామె. అందుకే అబ్దుల్లా కుతుబ్షాహ్ హయాంలో అరివీరభయంకరుడు, కరుడుగట్టిన వీరుడుగా పేరు పడ్డ ఔరంగజేబు గోల్కొండను ముట్టడించాడు. అబ్దుల్లా మీద ఔరంగజేబు ఆగ్రహించిన సమయమది. ఓటమి తప్పని పరిస్థితులవి. ముప్పయి తొమ్మిదేళ్ల ఔరంగజేబు ముందు దాదాపు రెట్టింపు వయసులో తెల్లని దుస్తులు ధరించి నిలబడిందా తల్లి. తన తెల్లటి కొంగుమాటున కొడుకును కప్పేసింది. తన తెల్లటి కొంగును తెల్లజెండా అనుకొమ్మని ఔరంగజేబుకు విన్నవించింది. రాజ్యాన్ని కబళించకుండా ఉండేలా రాయబారి భూమికను పోషిస్తూ... దౌత్య వ్యవహారాలను నిర్వహించిందా మాత. అమ్మదనపు కమ్మదనాలనూ, మాతృదేవత గొప్పదనాలను కీర్తిస్తూ, శ్లాఘిస్తూ ఇప్పటికే అనేకానేక పాటలూ, పద్యాలూ, వాక్యాలూ, వ్యాసాలూ విరచితమై ఉన్నాయి. అమ్మప్రేమ గురించి కొత్తగా చెప్పేందుకేమీ లేదు. కానీ... ఒక్కమాట. అమ్మగా హయాత్బక్షీ అంశ అంతర్లీనంగా ఈ నగరం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందేమో! వికలాంగులైనాసరే విద్యలో విద్వత్తున్న తల్లులు... తమ పద్దెనిమిదీ, ఇరవైయ్యేళ్ల చిన్నారులను పిల్లలను పసిపాపాయిల్లా ఎత్తుకుని ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంస్థల మెట్లు అవలీలగా, అలవోకగా ఎక్కేస్తుంటారు. తమ బిడ్డలనూ కష్టాల మెట్లెక్కించి, డిగ్రీల గట్టెకించడానికి యత్నిస్తుంటారు. తొమ్మిదో నెల తర్వాత బొడ్డు పేగు తెగుతుందనే మాట తప్పని నిరూపితమవుతుందిక్కడ. కంటికి కనపడని పేగుబంధం ఇరవయ్యేళ్ల కొడుకునీ భుజాన మోస్తూ ఉండేలా, చేతుల్లో ఎత్తుకునే ఉండేలా, భారం తెలియకుండా చేసేలా కట్టిపడేసి ఉందని ఇట్టే అర్థమైపోతుంటుంది మనకు. ఉర్దూలో హయాత్ అంటే ఆయుష్షు. బఖష్నా... అంటే ఉదారంగా పంచడం. తన ఆయుష్షునూ ఔదార్యంతో పంచేసే, ఇదుగో అంటూ ఇచ్చేసే అమ్మ హయాత్బక్షీ లాంటి అమ్మలెందరో నడయాడే ఈ నగరంలో ఆ కౌన్సెలింగ్ ప్రక్రియను చూశాక... అన్ని అవయవాలూ సవ్యంగా, దివ్యంగా ఉన్న ఎవ్వడూ ఆత్మహత్యకు తలపెట్టడు. తప్పక బతుకుతాడు. ఎలాగైనా బతికేస్తాడు. -
గానమే ప్రాణం
కొంమండూరి రామాచారి... వర్ధమాన సంగీతంలో తరచుగా వినిపించే పేరు. ఈ పేరు వినగానే కొందరికి ప్రభావశీలి అయిన పాటల మాంత్రికుడుగా గుర్తుకొస్తే... మరికొందరికి క్రమశిక్షణతో సంగీతం నేర్పే గురువుగా స్ఫురిస్తారు. తనకి పాటలు నేర్పిన గురువులకు నిఖార్సయిన శిష్యుడిగా... తన దగ్గర సంగీత సాధన చేస్తున్న వారికి ఆదర్శప్రాయుడైన గురువుగా... గానమే ప్రాణంగా జీవిస్తున్న పాటల మాంత్రికుడి పరిచయం. కోన సుధాకర్రె డ్డి మెదక్ జిల్లా ‘పెదగొట్టిముక్కల’లో కొమండూరి కృష్ణమాచార్యులు, యశోదమ్మ దంపతులకు జన్మించారు రామాచారి. బాల్యం అంతా జన్మస్థలం సమీపంలోని శివంపేట్లోనే. పదో తరగతి వరకు అక్కడే చదివి ఇంటర్ కోసం 1980లో సికింద్రాబాద్లో ప్రభుత్వ సంగీత కళాశాలకు వచ్చిన ఆయన ఏనాడూ వెనుదిరిగి చూడలేదు. తొలి మలుపు... అప్పుడప్పుడే పాటలు పాడటం ప్రారంభించిన తనకు బాలవినోదం కార్యక్రమం కలిసి వచ్చింది. పీవీ సాయిబాబా దగ్గర లలితసంగీతం నేర్చుకొన్నారు. రేడియోతోపాటు.. హిం దీ, తెలుగు, లలిత గీతాలు పాడటం ప్రారంభిం చారు. గొంతు బాగుందని ప్రోత్సహించడంతో స్నేహితులతో కలిసి మ్యూజిక్ గ్రూప్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్రదర్శనలు, ఆకాశవాణి, దూరదర్శన్లో పాటలు పాడటంతో మంచి గుర్తింపు వచ్చింది. 1998లో... 1998లో లిటిల్ మ్యుజీషియన్ అకాడమీ ఏర్పాటు చేసి ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారాయన. వీకెండ్స్లో రాష్ట్ర నలుమూలలు, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు తమ పిల్లలను శిక్షణ కోసం తీసుకొస్తారు. ఒకసారి పిల్లల కంఠం వింటే పాటల్లో వారి భవిష్యత్ ఏంటో ఇట్టే చెప్పేయగల దిట్ట. ఇప్పుడు సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్న కుర్రకారు సాకేత్, ప్రణవి, గీతామాధురి, కారుణ్య, హేమచంద్ర. నాగసాహితీ, దీపు, ఇర్ఫాన్, రేవంత్లు రామాచారి శిష్యులే. టీవీ ఛానల్స్ రియాల్టీషోస్లో పాల్గొనే వారిలో అధిక శాతం వీరి శిష్యులే. సంగీతం నేర్పడంతో పాటు క్రమశిక్షణకు పెద్ద పీఠ వేస్తారు. సంగీతంతో సమానంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పుతారు. వేసవిలో అంతర్జాతీయ శిక్షణ.. విదేశాల్లో సైతం రామాచారికి వేలాది మంది శిష్యులు ఉన్నారు. ఒక్క అమెరికానే కాదు లండన్, అస్ట్రేలియాతో పాటు చాలా దేశాల్లో పాఠశాలల వేసవి సెలవుల సమయంలో అక్కడికి వెళ్లి శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయంగా వేల ప్రదర్శనలు ఇచ్చిన ఆయన, వందలాది అవార్డులు సొంతం చేసుకొన్నాడు. పూల వాసన దారానికి కూడా అబ్బుతుందన్న ట్లు.. ఇంటిల్లిపాది సంగీతాన్ని వంటబట్టిం చుకొన్నారు. రామాచారి వారసుడు సాకేత్ ఇప్పటికే ప్లే బ్యాక్ సింగర్గా దూసుకుపోతున్నాడు. కుమార్తె సాహితీ కూడా పాటలు పాడుతుంది. సెల్యూట్ చేయాల్సిందే... సంగీతం వ్యాప్తికి ఇక్కడి మీడియా చేస్తున్న కృషికి సెల్యూట్ చేయకతప్పదు. మీడియానే చొరవ తీసుకోకుండా ఉండి ఉంటే సంగీతం వెనకబడేది. బయటికి వెళ్తే హితులు, సన్నిహతులు, విదేశాల్లోని వారు కూడా మీ ఆధ్వర్యంలో ఒక సంగీత కళాశాల ప్రారంభించమని కోరుతున్నారు. అంతర్జాతీయ సంగీత రెసిడెన్సియల్ కళాశాల ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. కొంత నిధులు సమకూర్చుకొన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థల సహయం చేస్తే సంగీత కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తా. -
సిస్టర్స్ 4 బ్యూటీ
గల్లీకో బ్యూటీ పార్లర్.. సెంటర్కో బ్యూటీ హబ్.. సిటీలో ఇప్పుడు సర్వసాధారణం. మూడు దశాబ్దాల కిందట.. బ్యూటీ పార్లర్ కెరీర్ అంటే ఓ అసాధారణ విషయం. కానీ దాన్నే కెరీర్గా ఎంచుకుని.. సిటీలో నయా ట్రెండ్ సెట్ చేసింది మాత్రం ఆ నలుగురే. ఆధునికతను అందిపుచ్చుకుని అతివలకు దగ్గరి బంధువులయ్యారు. అనూస్సిస్టర్స్గా పేరొందిన ఆ అక్కాచెల్లెళ్ల పేర్లు అనురాధ, అన్నపూర్ణ, అనుపమ, అనిరుధ. కోట కృష్ణారావు థర్టీత్రీ ఇయర్స్ బ్యాక్.. 1982 నగరంలోని తిలక్నగర్. మున్సిపల్ కమిషనర్ ఇల్లు. ఆ ఇంటి ముందు బ్యూటీ సెలూన్ పేరిట బోర్డు వెలసింది. అంతటి హోదాలో ఉన్న వ్యక్తి ఇంటి ముందు ఈ బోర్డేంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆరా తీస్తే కమిషనర్ గారాలపట్టి అనురాధకు బ్యూటీ రంగంపై ఆసక్తి ఎక్కువ. తన ఇంటికి సమీపంలో ఎవరో బ్యూటీ చిట్కాలతో అందానికి వన్నెలద్దుతున్నారని తెలిసి ఆమె కూడా వెళ్లింది. అక్కడినుంచి వచ్చిన తర్వాత అద్దం ముందు నిల్చుని పదే పదే చూసుకుంది. తనూ బ్యూటీ సెలూన్ ప్రారంభించాలని డిసైడ్ అయింది. ఒకవైపు డిగ్రీ చదువుతూనే.. అప్పట్లో అందుబాటులో ఉన్న వనరులతో బ్యూటీ సెలూన్కు సంబంధించిన శిక్షణ తీసుకుంది. ఇంట్లోవారిపైనే ప్రయోగాలు చేసింది. సక్సెస్ సాధించి తల్లిదండ్రులు తిరుపతిరావు, లలితాదేవిని మెప్పించి.. ఒప్పించి.. సింగిల్ కుర్చీతో బ్యూటీ సెలూన్ ఓపెన్ చేసింది. మగవారు చేసే పని చేస్తుందని ఎందరు ఎన్ని రకాల మాటలన్నా.. పట్టించుకోకుండా ముందుకెళ్లింది. నిత్యాన్వేషకులుగా.. అనురాధ స్టార్ట్ చేసిన బ్యూటీ సెలూన్కు కొద్ది రోజుల్లోనే యువతులు క్యూ కట్టారు. సెలూన్కు ఆదరణ పెరగటంతో.. ఎదురుగా ఉన్న పెద్ద ఇంట్లోకి మారారు. రెండేళ్లకు విద్యానగర్లో అన్ని సౌకర్యాలతో బ్యూటీ పార్లర్ను నెలకొల్పారు. అందులోనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో అనురాధ చెల్లెలు అన్నపూర్ణ కూడా అక్కకు తోడైంది. రకరకాల బ్యూటీ సమస్యలతో తమ వద్దకు వస్తున్న కస్టమర్ల కోసం వీరు నిత్యాన్వేషకులుగా మారారు. చెన్నై, ముంబై, ఢిల్లీతో పాటు అమెరికా వంటి దేశాలు చుట్టి వచ్చి బ్యూటీ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను అధ్యయనం చేశారు. మిగతా ఇద్దరు సిస్టర్స్ అనుపమ, అనిరుధలు కూడా అక్కలు నడిచిన బాటే పట్టారు. 1991-92 మధ్య కాలంలో సెలూన్ సేవలతో పాటు అనూస్ పూర్తిస్థాయి క్లినికల్ సర్వీసెస్గా తీర్చిదిద్దారు. నలుగురు కలిసి 1992లో సికింద్రాబాద్ మినర్వా కాంప్లెక్స్లో మొట్టమొదటిసారిగా జర్మన్ టెక్నాలజీని పరిచయం చేస్తూ బ్యూటీ సేవల్లో ఆధునికతకు ఆహ్వానం పలికారు. బ్యూటీ స్కూల్ కూడా నిర్వహిస్తూ వచ్చారు. మహిళలతో పాటు మగవారికీ బ్యూటీ సేవలు అందిస్తున్నారు. యజమానులూ జీతానికే.. ఏ రోజూ బ్యూటీ సెలూన్ నుంచి లాభాలు ఆశించలేదు ఆ సిస్టర్స్. సంస్థలో మిగతా వారి లాగానే ప్రతి నెలా జీతాలు తీసుకుంటూ వచ్చారు. సంస్థ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ అదే సంస్థలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని బ్యూటీ రంగానికి పరిచయం చేస్తూ అనూస్ను ఒక బ్రాండెడ్ సంస్థగా తీర్చిదిద్దారు. అలా పదేళ్లలోనే దేశవ్యాప్తంగా 17 నగరాల్లో 27 బ్రాంచ్లతో అనూస్ బ్యూటీ సామ్రాజ్యాన్నే నెలకొల్పారు. అందం వెంటే ఆత్మవిశ్వాసం.. అందం వెంటే ఆత్మవిశ్వాసం ఉంటుందంటారు అనూస్ సిస్టర్స్. ‘మోములో ఏ చిన్న మచ్చ ఉన్నా ఏదో తెలియని బాధ. ఆ బాధ కెరీర్ కు అడ్డంకిగా మారుతుందనే వారు ఎందరో ఉంటారు. అలాంటి వారికి అందాన్ని తీర్చిదిద్ది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పురిగొల్పే ప్రయత్నం చేయడమే అనూస్ లక్ష్యం’ అని చెబుతారు అనురాధ. ‘అనిరుధ అమెరికాలోని బ్రాంచ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. మిగతా ముగ్గురం దేశంలోని పలు నగరాల్లో అనూస్ బాధ్యతలను చూసుకుంటున్నాం. మా జీవిత భాగస్వాములు కూడా మా అభిరుచిని గుర్తించి.. పూర్తి సహకారం అందించడం వల్లే బ్యూటీ రంగంలో మాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నాం’ అని ఆమె అంటున్నారు. -
అల్లరి పిల్లని..
చలాకీతనానికి మారు పేరు అశ్విని శర్మ. టీవీ యాంకర్గా పరిచయమై.. సినిమాల్లోనూ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ అమ్మాయి క్లాసికల్ సింగర్ కూడా. ఎంత రెబల్గా కనిపిస్తుందో అంతే సెన్సిటివ్ గాళ్ అయిన అశ్విని... క్రిటిక్సే తనవెల్ విషర్స్ అంటోంది. నేను అండమాన్లో పుట్టాను. డాడీ ఆర్మీ ఆఫీసర్. అమ్మ హౌస్వైఫ్. అక్కకు పెళ్లైపోయింది. ఒక పాప కూడా. నేను ఫిఫ్త్ క్లాసులో ఉన్నప్పుడే మా ఫ్యామిలీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యింది. నాకు ఊహ తెలిసిందిక్కడే. అప్పటి నుంచి మేం ఉంటున్నది సికింద్రాబాద్ బోయిన్పల్లిలోనే. ప్లస్టూ వరకు కేంద్రీయ విద్యాలయలో చదివాను. నిఫ్ట్, హామ్స్టెక్లో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను. చిన్నప్పటి నుంచి నేను బాగా అల్లరి. అనర్గళంగా మాట్లాడేదాన్ని. అదే నన్ను యాంకరింగ్ వైపు వచ్చేలా చేసింది. లిట్రల్లీ నేను టామ్బాయ్ని. ఆడుకునేటప్పుడు అబ్బాయిలను చితక్కొట్టేదాన్ని. స్కూల్కు డుమ్మా కొట్టి, ఫ్రెండ్స్తో కూడా మాన్పించి ఇంటి డాబాపైకి చేరి... టిఫిన్బాక్సులు తింటూ ఎంజాయ్ చేసేవాళ్లం. ఆ తరువాత అమ్మతో దెబ్బలు తప్పేవి కాదనుకోండి! బై గాడ్స్ గ్రేస్... నేను స్టడీస్లోనూ ముందుండేదాన్ని. హైపర్ యాక్టివ్ కావడంతో.. అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. రెండుసార్లు గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు సంపాదించా. రీసెంట్గా 108 నిమిషాల్లో నవగ్రహ కీర్తనలు పూర్తి చేశాను. టైం దొరికినప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. మా తాతవాళ్లు... శ్రీపాద ఫ్యామిలీ. అలా బ్లడ్లోనే మ్యూజిక్ ఉంది. అందుకే సింగింగ్ నాకు అబ్బింది. ప్రస్తుతం వీణలో డిగ్రీ చేస్తున్నా. ఇంట్లో ఉన్నప్పుడు వీణ వాయిస్తూ టైంపాస్ చేస్తాను. ఫ్రెండ్స్తో ఉంటే మాత్రం షాపింగ్కి ఫ్రీకవుట్ అవుతాను. ఎప్పుడూ డల్గా ఉండను. నాకు ఆరోగ్యం బాగాలేదని నేను చెబితే తప్ప... ఎవరూ గుర్తు పట్టలేరు. అంత యాక్టివ్ అన్నమాట. థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ... ఎక్కడ ఫంక్షన్కు వెళ్లినా బడబడా ఏదో ఒకటి వాగుతూ ఉంటాను. అలా ఓసారి ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్కు వెళ్లినప్పుడు చలాకీగా ఉన్న నన్ను చూసి జెమిని కిరణ్గారు, రాఘవేందర్రావుగారు ‘ఈ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉందే’ అని బుల్లితెరవైపు తీసుకొచ్చారు. మొదటిసారిగా జెమినిలో ‘నీ కోసం’ ప్రోగ్రాంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. అది మొదలు.. అన్ని ఛానల్స్లో రకరకాల ప్రోగ్రామ్స్ చేశాను. ‘అభిమాని’, ‘ైధె ర్యం’, ‘ఛత్రపతి’, ‘పల్లకిలో పెళ్లికూతురు’,‘కొడుకు’.. ఇలా చాలా సినిమాల్లో చేస్తూ వచ్చాను. పదమూడేళ్లనుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ ప్రయాణంలో మా అమ్మ సపోర్ట్ చాలా ఉంది. సినిమాల్లోకి రాకుండా ఉంటే... ఏ ఎయిర్ హోస్టెసో, ఫ్యాషన్ డిజైనరో అయి ఉండేదాన్ని. నేను ఖురాన్ చదువుతాను. చర్చికి, గుడికీ వెళ్తాను. అన్ని మతాలనూ గౌరవిస్తాను. అది మా నాన్న నుంచి నేర్చుకున్నది. నాకు ఎక్కువగా జనాలతో ఉండటం ఇష్టం. వర్క్హాలిక్ని. విమర్శలను స్పోర్టివ్గా తీసుకుంటాను. నా క్రిటిక్సే నా వెల్ విషర్స్ అనుకుంటాను. ఐయామ్ వెరీ థాంక్ఫుల్ టు దెమ్. ‘షా గౌస్’ చాయ్... చిన్నప్పుడు నేను, మా అక్క, మా కజిన్స్ తెల్లవారుజామునే లేచి సికింద్రాబాద్ ‘బ్లూ సీ’ హోటల్లో చాయ్ తాగేవాళ్లం. ఇప్పుడు ప్యారడైజ్కి వెళ్లి మరీ వెజ్ తినేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది నేనే అనుకోవచ్చు. ఇంకా టోలిచౌకిలో ‘షా గౌస్’ కేఫ్లో ఇరానీ చాయ్ అంటే ఇష్టం. ఇప్పటికీ వీలుచేసుకుని మరీ.. అప్పుడప్పుడు వెళ్లి తాగుతుంటాను. ఇమ్లిబన్ దగ్గర ఉన్న గోశాలలో మూడు గోవులను అడాప్ట్ చేసుకున్నా. వాటి ఫీడింగ్, మెయింటెనెన్స్ చూసుకుంటాను. పూజలు చేయడానికీ టైమ్ స్పెండ్ చేస్తాను. శిరీష చల్లపల్లి -
కలర్ఫుల్ మార్కెట్
‘ఆ రెస్టారెంట్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ టైంపాస్ చేద్దామని వెళ్లాను. అదేంటో అక్కడికెళ్లాక భలే ఆకలేసేసింది. తినకుండా ఉండలేకపోయా’ అంటూ చెప్పే మాటలు వింటుంటాం. సిటీలో వెళ్తుంటే ఒక షోరూంచూశారు. అప్రయత్నంగానే లోపలకి వెళ్లారు. మీకు తెలుసా? ముందస్తు ఆలోచన లేకుండా మిమ్మల్ని అటువైపు మళ్లేలా చేసింది షోరూమ్ ఎంట్రన్స్లో ఉన్న ఎట్రాక్టివ్ కలర్ అని. కన్సూమర్స్ని అట్రాక్ట్ చేయడానికి మార్కెటింగ్ నిపుణుల ప్రధాన అస్త్రాలవి. మనం వాడే ప్రతి ఉత్పత్తి, పొందుతున్న ప్రతి లగ్జరీ మనల్ని ఆకట్టుకునే రంగుల్ని... కట్టుకునే మనల్ని కట్టిపడేస్తున్నాయి. ఎస్.సత్యబాబు నవ వసంతాన్ని పక్షం ముందుగానే రంగులతో స్వాగతించే పండుగ హోలీ. మానవ జీవితం రంగులతో పెనవేసుకుపోయింది. మనిషి మాత్రమే రంగులను ఆస్వాదించగలడు. రంగుల మీద ఆ ఇష్టమే మార్కెటింగ్ నిపుణులకు వరంగా మారుతోంది. ఉత్పత్తిదారులు వర్ణాస్త్రాలకు పదును పెట్టేందుకు దోహదం చేస్తోంది. రంగులలో కలదు.. జోయ్ హల్లోక్ కలర్ అసైన్మెంట్స్ స్టడీ ప్రకారం బ్లూ కలర్ స్త్రీ, పురుషులు ఇద్దరూ ఇష్టపడే రంగుగా వెలుగుతోంది. పురుషులు అత్యధికంగా ఇష్టపడే రంగుల్లో బ్లూ 57 శాతం, గ్రీన్ 14 శాతం, బ్లాక్ 9 శాతంగా ఉంటే, మహిళల్లో బ్లూని 35 శాతం, పర్పుల్ 23 శాతం, గ్రీన్ 14 శాతం ఇష్టపడతారు. ఇక పురుషులు అత్యధికంగా ద్వేషించే రంగుల్లో బ్రౌన్ 27 శాతం, ఆరెంజ్ 22 శాతం, పర్పుల్ 22 శాతంగా ఉన్నాయి. ఇక మహిళలు ఆరెంజ్ని 33 శాతం, బ్రౌన్ని 20 శాతం, గ్రీన్ 17 శాతం మంది ద్వేషిస్తారు. చాలా వరకూ మార్కెటింగ్ సూత్రాలు ఈ తరహా సర్వేల ఆధారంగానే రూపొందుతున్నాయి. మహిళలను, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునే ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం పింక్ రంగులో ఉంటాయనేది వేరే చెప్పనక్కర్లేదు. దాదాపు 90 శాతం వస్తువుల ఎంపిక కలర్స్ని బట్టే జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సిగ్నల్స్ టు రెస్టారెంట్స్... ఇంట్లోంచి అడుగు బయట పెట్టిన దగ్గర్నుంచి మనల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసేవి రంగులే. ట్రాఫిక్ సిగ్నల్స్లో వెలిగే రెడ్, గ్రీన్ల గురించి సిటీవాసులకు చెప్పక్కర్లేదు. ఇక మనలో తిండిపై ఇష్టాన్ని ప్రేరేపించే శక్తి ఎల్లోకు ఉందని చెబుతారు. అందుకే చిప్స్, ఫ్రెంచ్ఫ్రైస్, ఇంకా పలు రకాల ఆహారోత్పత్తులకు అంత డిమాండ్. దీనిని దృష్టిలో ఉంచుకునే సిటీలోని పలు రెస్టారెంట్స్లో ఎల్లోని ఏదో ఒక రూపంలో భాగం చేస్తున్నారు. ఉదాహరణకు మెక్డొనాల్డ్ ఆర్చ్లు, పిజ్జాహట్ బోర్డ్స్. అంతేకాకుండా ఎల్లో ఆప్టిమిస్టిక్ కలర్. విండో షాపర్స్ను అట్రాక్ట్ చేసే విషయంలోనూ దీన్ని బాగా వినియోగిస్తున్నారు. రెడ్కలర్ ఎనర్జిటిక్. హార్ట్రేట్ని పెంచుతుంది. యూత్ని లక్ష్యంగా చేసుకున్న పిజ్జా సెంటర్లు, కాఫీడేలు, కెఎఫ్సీ.. వంటివి ఎర్రని రంగులున్న బోర్డ్స్తో ఆహ్వానిస్తుంటాయి. ఫాస్ట్ఫుడ్ సెంటర్స్కు ఆరెంజ్, ఎల్లో, రెడ్ కలర్స్ వినియోగిస్తే.. అవి ఆహారప్రియత్వాన్ని మాత్రమే కాకుండా వేగంగా తినే తత్వాన్ని కూడా ప్రేరేపిస్తాయన్న నిపుణుల సలహాలను బ్రాండెడ్ ఔట్లెట్స్ అక్షరాలా పాటిస్తున్నాయి. అదే హైక్లాస్ రెస్టారెంట్స్ విషయానికి వస్తే అటు ఆకలిని, ఇటు రిలాక్సయిన భావనను ఒకేసారి కలిగించాలి కాబట్టి.. పీచ్, యాప్రికాట్, క్రీమ్, ఆరెంజ్లో వేరియేషన్స్ లీడ్ చేస్తున్నాయి. డిఫరెంట్ షేడ్స్.. బ్లూ కలర్ విశ్వసనీయతకు గుర్తుగా భావిస్తారు. అందుకే మెజారిటీ సెక్యూరిటీ గార్డ్స్ టీమ్ బ్లూగా కనిపిస్తున్నారు. పర్పుల్ అనేది కామ్నెస్, ప్రశాంతత కోరుకునేవారిని ఆకర్షించే రంగు. సిటీలోని బ్యూటీపార్లర్స్, ఏజింగ్ ప్రొడక్ట్స్కు ఈ కలర్ వాడడానికి ఇదో కారణం. శక్తివంతమైన ఫీలింగ్ని బ్లాక్ అందిస్తుందని, పవర్ఫుల్గా ఫీల్ అవ్వాలనుకునేవారిని ఎట్రాక్ట్ చేయడం కోసం దీనిని ఎక్కువ వాడతారు. బైక్స్, మద్యం బాటిల్స్ కలర్స్ని చూస్తే ఈ కలర్ టెక్నిక్ని వాళ్లు ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు. గ్రీన్ ఫీల్డ్ మార్కెటింగ్ లేదా గ్రీన్ మార్కెటింగ్ ఇప్పుడు సిటీలో లేటెస్ట్ బజ్. కలర్తో ‘స్పా’ట్... కలర్ థెరపీకి సిటీ ‘స్పా’లు తెగ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ‘మరీ బ్రైట్గా కాకుండా మరీ డార్క్గా కాని మధ్యస్థపు కాంతితో కనిపిస్తేనే వినియోగదారులు స్పా ఫీల్ను ఎంజాయ్ చేయగలరు. అందుకే ప్రత్యేకమైన లైట్ కలర్స్ వినియోగించాం’ అని జూబ్లీహిల్స్లోని స్పా యజమాని చెప్పారు. అలాగే జిమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ చేసే చోట కామింగ్ కెమికల్స్ను ప్రేరేపించేందుకు బ్లూ షేడ్స్ వాడతున్నారు. ‘బ్లూ షేడ్ వల్ల వెయిట్స్ని మరికాస్త సులభంగా లిఫ్ట్ చేయవచ్చునని రీసెర్చ్ ఫలితాలు వెల్లడించాయి’ అని సిటీ ట్రైనర్ ఒకరు చెప్పారు. నిద్రమత్తుని నిరోధించే గుణం కూడా బ్లూకి ఉంది. ఫన్ కావాలంటే ఫిట్నెస్ రూమ్కి ఆరెంజ్ యాడ్ చేస్తారు. యోగా కేంద్రాల విషయానికి వచ్చేసరికి కామింగ్ కలర్ అవసరం. ఓషన్ బ్లూస్, గ్రాస్ కలర్డ్ గ్రీన్ని వినియోగిస్తున్నారు. ఇవి పీస్ఫుల్ ఫీల్ని అందిస్తాయని యోగా సెంటర్స్ భావిస్తున్నాయి. కలర్ఫుల్ టెక్నిక్.. కలర్కి మన మనసుల్ని నియంత్రించే శక్తి ఉందని ప్రూవ్ అయిన సంగతే. మార్కెటింగ్లో దీనిని ప్రధాన అస్త్రంగా చేసుకోవడానికి కారణమిదే. కోలా లాంటి సాఫ్ట్ డ్రింక్స్ దగ్గర్నుంచి లాటమాటినా లాంటి ఈవెంట్ వరకూ సూపర్హిట్ అవడానికి ప్రధాన కారణం కలర్. సిటీలోనే కాదు ఎక్కడైనా కలర్ అనేది మార్కెటింగ్కు అత్యంత అవసరమైన అంశం. - అనిల్ రమేష్, మార్కెటింగ్ ప్రొఫెసర్ -
ముఝె అస్లీ రంగ్ దే..
ఒక చెంపకు బంతి.. మరోవైపు చామంతి. ఇదిగో మోదుగ.. అదిగో ఇండిగో ! పూవులో పూవునై.. రంగులో రంగునై ఈ హోలీ ఆడుకోనా..! ఆడుకున్నా. హోలీ ఆయారే !! ఎటు చూసినా రంగుల మయం. అసలు ప్రక ృతే హోలీలో ఆడినట్టు ఎటు చూసినా రంగు రంగుల్లో విరబూసిన పువ్వులే. ఏ పండుగైనా ప్రకృతే ప్రేరణ. అందుకే కాబోలు వసంత ఆగమనానికి స్వాగతం పలికేందుకు ప్రకృతిలోని రంగులతో మమేకమై రంగులనే పండుగగా మార్చేశాం. పురాణాలు ఎన్ని కథలు చెప్పినా, వాటన్నిటికీ అతీతంగా హోలీని చేసుకుంటున్నాం. నిజానికి ఈ రంగుల పండుగలో రంగులు తప్ప మరో అంశానికి ప్రాధాన్యమే ఇవ్వం. హోలీ ఎందుకు చేసుకుంటున్నారు అనే ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు. అయినా కూడా రంగులాటలో ఉత్సాహంగా పాల్గొంటారు. హోలిక వధ, కాముని దహనం కథ, కృష్ణ రాసలీల గాథ.. కారణం ఏదైనా కానీ మనం మాత్రం ఇప్పుడు రంగుల కోసమే హోలీ ఆడుకుంటున్నాం. రంగు పడుద్ది.. బృందావనంలో పసుపు నీళ్లాటలు, మోదుగ పూల రంగుతో వసంతాలు.. వినడానికి ఎంత బావున్నాయో. ఇవన్నీ తాతల జమానాలోనే అంతరించాయి. నెల రోజులు రుద్దినా పోని గులాల్, నాలుగు రోజులు మెరిసే సునేర్.. ఇవీ ఇప్పటి హోలీ ట్రెండ్స్. వీటితో పాటు మరెన్నో కొత్త రంగులు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ రంగులు వేటితో తయారు చేస్తున్నారు..?, అందులో పదార్థాలేమిటి..? అని మనం అడగం, వారు ప్రకటించరు. గుడ్డి నమ్మకంతో కొనేస్తాం, ఆడేస్తాం. పైగా ఎంత ఎక్కువ రోజులు నిలిచే రంగైతే అంత మంచిదని కొనుక్కునే వారూ ఉన్నారు. ఆ రంగులను మరింత చిక్కగా మార్చడానికి ఏవేవో ప్రయోగాలు చేసేస్తారు. ప్రజారోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన విభాగాలు వీటిపై ఓ కన్ను వేయాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్లు, అలర్జీల వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న రీసెర్చిల హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. మరీ చేజారకముందే ప్రభుత్వ పరమైన పర్యవేక్షణ పెరగాలి. ప్రజల్లో కూడా అవగాహన, విచక్షణ కలగాలి. రంగుల గురించి అవగాహన మాట అటుంచితే, హోలీ విచక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రంగులాటలో ఆనందహేల ఎంతుంటుందో.. అపశ్రుతుల కేళి కూడా జరుగుతుంటుంది. గుడ్డు పగులుద్ది.. రంగుల్లో ముంచెత్తే పర్మిషన్ ఇవ్వకనే ఇచ్చే పండుగ హోలీ. ఆ ముసుగులో మర్యాదల గీత దాటే సంప్రదాయమూ కనిపిస్తుంది. వద్దన్న వారికీ రంగులు పూయటం ఓ సరదా కానీ తెలియని వారిపై కూడా రంగుల దాడి చేయడం ఎంత వరకు సమంజసం. కానీ హోలీలో అవేమీ చెల్లవనే ధీమాతో మర్యాదాతిక్రమణ జరిగిపోతూ ఉంటుంది. ఇక రంగులు కాకుండా కోడి గుడ్లు, టమాటాలు, గ్రీజు వంటివి కూడా హోలీలో చోటు సంపాదించాయంటే ఈ రంగులాటకి అవమానం కాదూ. ఇక డబ్బున్న వర్గాల్లో హోలీ పార్టీల పేరుతో రెయిన్ డ్యాన్స్లు సాధారణంగా కనిపిస్తాయి. డబ్బున్నవారు నీళ్లు కొనుక్కోగలరు, ఆ నీళ్లు వేస్ట్ చేయగలరు. ఆ రెయిన్ హోలీ వెనుక వేస్జేజ్ వారికి పట్టదు. ఇక హోలీలో భంగు సంప్రదాయం ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ రూపంలోకి తర్జుమా కావడం సంపన్న వర్గాలని కలవరపరచాల్సిన అంశం. పండుగ పండుద్ది.. కొత్తదనం పేరుతో హోలీ రూపాంతరం చెందుతోంది. అసలు ఆనందం మాయమవక ముందే మేల్కొందాం. క్రోమియం, లెడ్, సిలికా వంటి కెమికల్స్ని రంగుల తయారీలో ఉపయోగిస్తున్నారన్న అవగాహన ఎప్పట్నుంచో మీడియా కల్పిస్తూనే ఉంది. మరి సహజమైన హోలీ వైపు మన అడుగులు ఎందుకు పడట్లేదు. కొన్నేళ్ల కిందటి వరకూ సహజ రంగులు మార్కెట్లో అందుబాటులో ఉండేవి కావు. కానీ, మూడునాలుగేళ్లుగా ఆర్గానిక్ రంగులపై రీసెర్చి బాగా జరిగింది. ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగింది. ఇక వాడకం పెంచాల్సిన బాధ్యత మనదే. మోదుగ నీరు, పసుపు నీరు వంటి ఇంటి చిట్కాలే కాదు, మార్కెట్లో వివిధ మొక్కల నుంచి తయారు చేసిన రంగులూ అందుబాటులో ఉన్నాయి. బంతి పువ్వులు, ఇండిగో దానిమ్మ వంటివి మనకు హాని చేయని పదార్థాలు. వాటితో తయారు చేసిన రంగులను ఉపయోగిద్దాం. హెచ్వైడీ గో గ్రీన్, డీడీఎస్ వంటి సంస్థలు సహజ రంగులను మార్కెట్లో అందుబాటులో ఉంచారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సహజ రంగుల వైపు మీరూ ఒక అడుగు వేసి చూడండి. హోలీ మరింత హ్యాపీ హోలీ అవుతుంది. -
ఆమెకు ఆత్మీయ ఆహ్వానం
మల్టీటాస్క్.. మహిళలను చూసే పురుడుపోసుకొని ఉంటది! బహుముఖ ప్రజ్ఞ.. వనితల ప్రతిభకు పట్టంగా వచ్చి ఉంటది! ట్వంటీఫోర్ ఇంటూ సెవెన్.. సేవలందించే వాళ్లుంటారేమో.. కానీ ట్వంటీఫోర్ ఇంటూ త్రీసిక్స్టీఫైవ్ డేస్ సేవలందించే వ్యక్తి ఈ భూమ్మీద స్త్రీ ఒక్కతే! భక్తుల మొర వినడానికి ఆ భగవంతుడు సైతం పరిమిత సమయాన్నే కేటాయిస్తాడు. కానీ ఇంట్లో వాళ్ల అవసరాలకు ఇంతులు అన్నివేళలా ఆసరాగా ఉంటారు. అలాంటి ఆడవాళ్లు తమకోసం ఏడాదికి ఒక్కరోజు కేటాయించుకునే భాగ్యం కలిగింది.. ‘మహిళా దినోత్సవం’గా! దాని వెనక కారణం ఏదైనప్పటికీ! ఈ ఉత్సవాన్ని అద్భుతమైన వేదికగా మలచుకొని అంతే అదుర్స్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది సాక్షి.. విమెన్స్ వరల్డ్ సౌజన్యంతో! తేదీ.. మార్చి ఏడు.. వెన్యూ.. జేఆర్సీ కన్వెన్షన్.. సమయం.. ఉదయం పదకొండు నుంచి మూడు గంటల వరకు! సేవ, త్యాగం, కష్టించి పనిచేసే తత్వం, ఓర్పు, క్షమించే ఔన్నత్యం.. ఇన్ని గుణాల ఇంతి ఇంట్లో ఉన్నా ఒక్కరోజూ కుటుంబ ప్రశంసలకు నోచుకోదు. కానీ వీటిని సాక్షి గుర్తించి.. ఫ్యామిలీలో చోటివ్వాలనుకుంది. అనుకున్నదే తడవుగా పాఠకుల ముందుకు వెళ్లింది. తమ అమ్మలోని కమ్మదనాన్ని తెలియజెప్పమని బిడ్డల్ని అడిగింది. మనసుపెట్టిన సంతానం తమ తల్లి ఔన్నత్యాన్ని చెప్తూ సాక్షికి ఉత్తరాలు రాశారు. అలా అమ్మకు సత్కారం చేయబోతోంది సాక్షి. అలాగే జీవనసహచరి అండను, అందిస్తున్న సేవను, ఒడిదుడుకులు వచ్చినా కుటుంబనావ ఒరగకుండా చూసుకుంటున్న వైనాన్ని వివరించమని భర్తలకు చెప్పింది. ‘బాగుంది’ అంటూ భార్య కాచిన కాఫీకి కూడా కితాబివ్వని భర్తలు సాక్షి వినతికి భారీగానే స్పందించారు మరి. సహచరి సహకారాన్ని లేఖల రూపంలో ఫ్యామిలీకి పంపారు. అలా అర్ధాంగికి అవార్డునివ్వబోతోంది. ఆలిగా, అమ్మగా బాధ్యతలు నిర్వరిస్తూనే.. ఉత్పత్తిలోనూ స్వేదాన్ని చిందిస్తున్న ధీరకూ వందనం చేయాలనుకుంది. వ్యవసాయంలో సాయమవుతూ ధాన్యరాశులను పండిస్తున్న ‘సిరి’సిత్రాన్ని అందివ్వమ్మనీ కోరింది సాక్షి. ఆశ్చర్యంగా ఆ మహాలక్ష్ముల శ్రమను చెప్పే అక్షర కూర్పులూ వచ్చాయి! అలా మహిళారైతునీ సత్కరించబోతోంది. ఈ మూడు కేటగిరీలకు చెందిన ఎంట్రీలను పరిశీలించే బాధ్యతలను ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి, ప్రొఫెసర్, రచయిత మృణాళిని, స్త్రీవాద రచయిత్రి కొండవీటి సత్యవతి నిర్వహించారు! సన్మాన సత్కారాలు అందుకోబోయే మహిమాన్వితలను ఎంపిక చేశారు! ఇదంతా.. పత్రికాముఖంగా చేసే ప్రయత్నం! ఏడో తారీఖున.. జేఆర్సీ కన్వెన్షన్లో మహిళల కోసం ఇంకొన్ని కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. తోటివారికి స్ఫూర్తిని పంచేలా ‘ప్రైడ్ వాక్’, కళ, ఛాయాగ్రహణం, హస్తకళల్లో తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే వీలుగా ఆయా రంగాల్లో ఆసక్తి ఉన్న మహిళల కోసం వారు రూపొందించిన కళాకృతులతో ఓ ప్రదర్శననూ నిర్వహిస్తోంది. అంతేకాదు మహిళామణులు తయారు చేసిన వివిధ వస్తువులతో స్టాళ్లూ కొలువుదీరనున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే స్త్రీలలో ఆరోగ్యస్పృహ కలిగించేందుకు అనూస్ ఆధ్వర్యంలో బాడీమాస్ ఇండెక్స్ ఫ్రీ క్యాంప్ కూడా ఉంటుంది. ఇవికాక ఇంకా అనేక కార్యక్రమాలు, ఆహూతులకు రకరకాల పోటీలు ఉంటాయి. ఇలా మహిళల ఆంతరంగిక సౌందర్యాన్ని చాటే కార్యక్రమాలెన్నో అలరించనున్నాయి. వీటన్నిటితోపాటు సాక్షి ఫ్యామిలీ నిర్వహించిన అమ్మ, అర్థాంగి, మహిళారైతు పోటీల్లో ఎన్నికైన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. అతిథులుగా.. ‘గులాబీ’గా ప్రేక్షక హృదయాల్లో గుబాళించిన నటి మహేశ్వరి, బాలల హక్కుల కోసం పోరాడుతున్న మమతారఘువీర్, ఐపీఎస్ రమారాజేశ్వరి, డిజైనర్, మహిళాపారిశ్రామికవేత్త సర్వమంగళ, ఫీనిక్స్ జ్యోతిరెడ్డి వంటి వనితలే కాక సినీతారలు, చిత్రకారిణులు, పలు రంగాల్లో ఖ్యాతి గడించిన మహిళలు ఈ ఉత్సవానికి అతిథులుగా విచ్చేస్తున్నారు. కొసమెరుపు ఈ ఉత్సవానికి ప్రాయోజితకర్తగా వ్యవహరించనున్న ‘విమెన్స్ వరల్డ్’ విమెన్స్ డే సెలబ్రేషన్స్లో స్పెషల్థింగ్గా.. చీరకట్టడంలోని మెళకువలను నేర్పించనుంది! గేమ్స్ అండ్ ప్రైజెస్ ఈవెంట్లో భాగంగా.. హోమ్ బడ్జెట్ నిర్వహణ, స్టోరీ టెల్లింగ్కి సంబంధించి పోటీలు ఉంటాయి. గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారు. ఇందులో పాల్గొనదలచిన వారు కార్యక్రమం జరుగుతున్న ఆవరణలోనే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. -
రాచకొండ రంగేళీ..
పచ్చికను చుట్టుకున్న గుట్టలు.. మధ్యలో హొయలుపోతూ సెలయేరు.. వాటిని కంటి చూపుతో నియంత్రిస్తున్న భావన కలిగించేలా రాజభవనాలు.. ఎప్పుడూ పాలనతో గంభీరంగా ఉండే అక్కడి వాతావరణం తొమ్మిది రోజులుగా ఎంతో కోలాహలంగా మారింది. సాధారణ వ్యక్తి నుంచి రాజు వరకు అందరిలోనూ ఉత్సాహం... సామంత రాజులూ వేడుకలో పాలుపంచుకుంటున్నారు. అంతటి ఉత్సాహంలోనూ ప్రజా సంక్షేమ కాంక్షే అక్కడ రాజ్యమేలింది. వర్గాల వారీగా రాజు మంతనాలు జరిపి రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయంలో అభిప్రాయ సేకరణ జరిపారు. నచ్చినవారు తోచిన సలహాలిచ్చారు. రాజు సరేనన్నారు. మైమరిపించే ఉత్సాహం రెట్టింపయింది అక్కాడవారికి. ఊహల్లో కల్పనగా పుట్టుకొచ్చే కథలా ఉంది కదూ ఈ వర్ణన. కానీ మనకు రాజధానిగా వర్ధిల్లిన కోట గోడల సాక్షిగా ఇది యథార్థ గాథ. మన చరిత్ర అక్కడి నుంచే మొదలైందనే భావనకు రూపంగా కనిపించే హైదరాబాద్ కాదిది. అంతకు ముందు విలసిల్లిన రాచకొండ వైభవంలో ఓ భాగం. నగరానికి కూతవేటు దూరంలో నాటి రాచరిక దర్పానికి సాక్ష్యంగా నిలిచిన మొండి గోడలే దానికి తార్కాణం. హైదరాబాద్ పుట్టక పూర్వం ఆ దుర్గంలో వసంతోత్సవ వేళ సాక్షాత్కరించిన దృశ్యమే ఈ వర్ణన! హోలీ... రంగుల కేళీ. మనకింతవరకే తెలుసు. కానీ ఈ వసంతోత్సవం వెనక పరమార్థమూ దాగి ఉంది. దాన్ని ఆచరించి చూపిందే ‘రాచకొండ’. హైదరాబాద్ సంస్థానం ఏర్పాటుకు పూర్వం ఈ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయక వంశం (1361-1475) పాలించింది. ఈ వంశంలో రెండో పాలకుడు రెండో సింగమనాయక హయాం (1384-1399) నుంచి వసంతోత్సవాన్ని నిర్వహించిన ప్రస్తావన చారిత్రక గ్రంథాల్లో ఉంది. రాచకొండ సామంతరాజ్యాల్లో ఒకటైన భీమ్గల్ ఆస్థానంలో కవిగా వెలుగొందిన కొరవి గోపరాజు విరచిత ‘సింహాసన ద్వాత్రింశిక’లో ఈ వసంతోత్సవ ప్రస్తావన ఉంది. మూడు వర్గాల ప్రజలతో మమేకం... రాచకొండలో ఇది తొమ్మిది రోజుల వేడుక. చివరిరోజు వసంతోత్సవం. ఆరోజు రాజు-బంటు తేడా లేకుండా అంతా కలిసి ఆనందాన్ని పంచుకోవటం ఆనవాయితీ. రాజప్రసాదం వెలుపల ఇందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేవారు. దాన్ని వ జ్రవైఢూర్యాలు, రంగురంగుల పూలతో అద్భుతంగా అలంకరించేవారు. ఆ ప్రాంతానికి రాగానే కస్తూరి సువాసన గుబాళించేది. మేళతాళాలు, యువత నృత్యవిన్యాసాల సందడుల మధ్య రాజు పరివారంతో అక్కడికి చేరుకునేవారు. అందుకు గుర్తుగా భేరీలు మోగగానే ఈలలు, చప్పట్లతో ప్రజలు ఆయనను స్వాగతించేవారు. ఆ ప్రాంతం చుట్టూ విస్తరించిన తోటలు, అందులోని పూలు, పండ్ల చెట్లు కొత్త శోభను సంతరించున్న వేళ... రాజ పరివారం అందులో విహరించేది. ఆ తర్వాత సంగీత నృత్యకార్యక్రమాలు జరుగుతుండగా ప్రధాన వేదిక వద్దకు రాజ కుటుంబం చేరుకునేది. ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసిన వసంత, మదన-రతి, లక్ష్మీఉపేంద్ర, గౌరీశంకర దేవాతామూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించే వారు. మనలోని కోరికలను జయించేలా కామదహనం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు హోలీ వేళ నిర్వహించే ఆనవాయితీ ఉన్నందున ఆ తరహా దేవతారూపాల పూజలు జరిగేవి. తర్వాత అక్కడికి చేరుకున్న మేధావులు, కవులు, కళాకారులతో రాజు భేటీ అయ్యేవారు. వారితో పాటు ప్రజల నుంచి పాలనపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకునేవారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు, గంధం, కుంకుమలాంటి వాటిని పరస్పరం చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపేవారు. అక్కడే ఉన్న సెలయేరు (ఇప్పుడు మామూలు చెరువుగా ఉంది)లో జలకాలాటలు సాగేవి. తోటల్లోని పూలతో యువతులు మాలలు గుచ్చి రాజుకు సమర్పించేవారు. మామిడి పిందెలను తెచ్చి ఆయనకు కానుకగా ఇచ్చేవారు (ఇప్పటికీ ఆ పాంతంలో పండ్ల చెట్లున్నాయి). ‘రంగుల కేళీ ఎంత ఘనంగా జరగాలో, ఏ రూపంలో నిర్వహించాలో చాటిచెప్పే అద్భుత సంప్రదాయం రాచకొండలో అప్పట్లో విలసిల్లింది. రాజు ప్రజారంజక పాలన అందిస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఆయన ప్రజలతో మమేకమై వారికేం కావాలో తెలుసుకోవాలి. అది ఇక్కడ కనిపించింది. ఆ తీరు నేటి తరానికి ఆదర్శం కావాలి’ అని ఔత్సాహిక పురావస్తు పరిశోధకులు సత్యనారాయణ చెబుతున్నారు. కొరవి గోపరాజు రాసిన గ్రంథంలో రాచకొండ వసంతోత్సవ వైభవం కళ్లకు కట్టిందన్నారు. గౌరీభట్ల నరసింహమూర్తి ఇండియా అన్ప్లగ్డ్ సంప్రదాయేతర ఇంధన వనరుల్ని ఎక్కువగా వినియోగించుకొని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని కోరుతూ డబ్ల్యూడబ్ల్యూస్ ఎర్త్ అవర్కి పిలుపునిచ్చింది. ఈ నెల 28 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ‘ఇండియా అన్ప్లగ్డ్’కు నగరవాసులంతా చేయూతనివ్వాలని కోరింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్కృష్ణాలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో టెన్నిస్ తార సానియా మిర్జా పాల్గొంది. ఎర్త్ అవర్ను అన్ని సంస్థలు, కార్యాలయాలు పాటించి, పర్యావరణ పరిరక్షణలో అంతా భాగస్వాములు కావాలని కోరింది. -
హావ్ ఏ సేఫ్ ఫెస్ట్
రంగుల కేళీ హోలీ రానే వచ్చింది. పండుగ పూట రంగురంగుల హరివిల్లులవ్వడం అందరికీ ఇష్టమే. కానీ ఆ ఇష్టం కష్టంగా మారకూడదంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అందుకు ఫేస్ యోగా ఎక్స్పర్ట్ మాన్సీ గులాటీ కొన్ని టిప్స్ చెబుతున్నారు. వాటిని పాటించి జోష్ఫుల్ హోలీని సక్సెస్ఫుల్ చేసుకోండి... హోలీ ఆడడానికి గంట ముందు ముఖం, చేతులకు కొబ్బరి నూనెను రాసుకోవాలి. నేచురల్, ఆర్గానిక్ కలర్స్ను మాత్రమే సెలక్ట్ చేసుకోవాలి. వీటివల్ల చర్మానికి ఎలాంటి హాని ఉండదు. పిల్లలకు పసుపు, కుంకుమ, గంధం, విభూది లాంటివి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ల చర్మం చాలా సున్నితమైంది. మార్కెట్లో దొరికే కలర్స్ వాడితే ప్రమాదం. పసుపులో యాంటీయాక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీసెప్టిక్ కూడా. ఆడాక ముఖం, ఒంటిపై రంగులు పోకపోతే సహజంగా ముఖంపై గోర్లతో గీరడం, కిరోసిన్తో కడగ డం వంటి ప్రయోగాలు చేస్తుంటారు. అది ప్రమాదకరం. బొప్పాయి గుజ్జు తీసుకుని మర్దన చేస్తే... ఎంతటి ముదురు రంగైనా సునాయాసంగా వదిలిపోతుంది. ముఖంపై రంగులు తొలగించడానికి చల్లని నీటిని మాత్రమే ఉపయోగించాలి. వేడి నీటితో కడిగితే రంగులు చర్మానికి ఇంకా అతుక్కుపోతాయి. ఆట తరువాత మాయిశ్చరైజర్ లేదంటే బేబీ ఆయిల్ని లైట్గా ముఖానికి అప్లై చేస్తే చర్మం పొడిబారకుండా, దద్దుర్లు రాకుండా ఉంటుంది. ఆడేటప్పుడు తలపై రంగులు, గుడ్డు కొట్టినప్పుడు జుట్టు మొదళ్లలోకి చేరి స్కాల్ప్ పొడిబారే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే తలకు బేబీ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ రాయాలి. చేతిగోళ్లలో రంగులు పోకుండా వారాల తరబడి ఉంటాయి. వాటిని వదిలించేందుకు పెడిక్యూర్, మానిక్యూర్లాంటివి పదేపదే చేయించకూడదు. ముందుగానే పెట్రోలియం జెల్లీని చేతివేళ్లకు అప్లై చేస్తే గోళ్లలోకి రంగులు పోవు. సిరి -
‘హిజ్ అండ్ హర్’
ఏరియల్ ‘హిజ్ అండ్ హర్’ ప్యాక్ని టాలీవుడ్ నటి మంచు లక్ష్మి, ఆమె భర్త ఆనంద్ శ్రీనివాసన్ ఆవిష్కరించారు. బంజారాహిల్స్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు... ‘షేర్ ది లోడ్’ మూవ్మెంట్లో ‘బకెట్ చాలెంజ్’ను మొదలు పెట్టి, అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిటీప్లస్ వారిని పలుకరించింది... మంచు లక్ష్మి : మేం అమెరికాలో ఉన్నప్పుడు నేను, ఆండీ (ఆనంద్ శ్రీనివాసన్) వర్క్ని షేర్ చేసుకునేవాళ్లం. ఇద్దరికీ కుకింగ్ అంటే ఇష్టం. తెగ వండేవాళ్లం. ఆనంద్ శ్రీనివాసన్ : నిజానికి వర్క్ తను జస్ట్ ప్రారంభించేది. మాటల్లో పెట్టి ఏదో మ్యాజిక్ చేసేది. చివరికి చూస్తే నాతో కంప్లీట్ అయ్యేది. మంచు లక్ష్మి : ఇప్పుడు మనం చాలా లక్కీ కాబట్టి వాషింగ్ మెషీన్లు వచ్చాయి. పని ఈజీ అయిపోతోంది. కానీ మా అమ్మమ్మ టైమ్లో ధోబీ ఇంటికొచ్చి బట్టలను కౌంట్ చేసి తీసుకెళ్లి తెచ్చిచ్చేవాడు. హైదరాబాద్కు వచ్చాక వాళ్లే ఇంటికి వచ్చి వాష్ చేయడం మొదలైంది. ఆనంద్ శ్రీనివాసన్ : పాపకు సంబంధించిన విషయాల్లో లక్ష్మినే కేర్ తీసుకుంటోంది. మంచు లక్ష్మి : యా... పాప బట్టలు స్వయంగా నేనే వాషింగ్ మెషీన్లో వేసి వాష్ చేస్తాను. అవి ఆరాక ఫోల్డింగ్ చేయడం ఆండీ పని. ఆర్గానిక్ డయపర్స్నే వాడుతున్నాం. అవి ఇండియాలో దొరకవు. అందుకే ఆండీ అమెరికానుంచి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాడు. ఆనంద్ శ్రీనివాసన్: తీసుకురావడమంటే ఒకటో రెండో ప్యాకెట్స్ కాదండి... మూడునాలుగు సూట్కేసులు నిండా మోసుకొచ్చాను. మంచు లక్ష్మి : అరియానా, విరియానా ఉండటం వల్ల మా బేబీకి బట్టలు కొనేపని తప్పింది. వాళ్లిద్దరి బట్టలూ ఇదే వేసుకుంటుంది. ఆనంద్ శ్రీనివాసన్: అలా అని తనకు బట్టలు తక్కువనుకుంటున్నారేమో... మా ఇద్దరివి కలిసినా అన్ని ఉండవు. అన్ని బట్టలున్నాయ్ తనకు. పాప వచ్చాక... మా లైఫ్ అంతకుముందుకన్నా చాలా కలర్ఫుల్గా ఉంది. శిరీష చల్లపల్లి -
లెట్స్ సెలబ్రేట్
అమ్మాయిలంటేనే రంగులు. ఇక రంగుల పండుగ హోలీ, సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు ఒకచోట చేరితే... ఆ వేడుక చూడటానికి వేయి కళ్లు చాలవు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. సీనియర్, జూనియర్ సరిహద్దులను చెరిపి చెలిమికి బాటలు వేసేదీ రంగోలీ. ఈ సంబురంలో భాగంగా ఇంటాబయట రెండు రోజులు సప్తవర్ణశోభితమవుతున్న యువతుల మనోభావాలు... ఈరోజు క్యాంపస్ కబుర్లు! భువనేశ్వరి ఫొటోలు: ఎన్.రాజేష్రెడ్డి మౌనిక: హోలీ... చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ కలిసి ఆడుకునే ఆట. మామూలుగా కాలేజీలో సీనియర్స్, జూనియర్స్ అనే గీత ఉంటుంది కదా! దాన్ని పూర్తిగా చెరిపేసే రోజిది. పల్లవి: రియల్లీ... ఈరోజు పొద్దున నా ఫ్రెండ్ సీనియర్పై రంగు వేసింది. దాంతో తనకు కొంచెం కోపం వచ్చి వద్దని చెప్పింది. కాసేపటికే ఆ సీనియర్ గుప్పెడు రంగు తీసుకొచ్చి మా ఫ్రెండ్పై చల్లింది. అంతే... అంతా కూల్. మేమంతా తలో చెయ్యా వేశాం. భాగ్య: అంతేగా... నిజమైన ఫ్రెండ్స్ ఎవరో తెలిసేది ఈరోజే. హోలీ ముందు రోజు కాలేజీలో, ఈరోజు ఇంట్లో. మొత్తానికి రెండు రోజులు ఫుల్ ఎంజాయ్మెంట్. పూస: ఇంట్లో అన్నయ్యలపై తప్ప అందరిపై రంగులు వేస్తాం మేం. ప్రణీత: ఇంటి దగ్గర అమ్మానాన్నలు ఎక్కువసేపు ఆడనివ్వరు. అందుకే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లిపోతాం. మాధురి: పండుగ సంబరాలను చెడగొట్టే రసాయనిక రంగుల జోలికి వెళ్లకుండా వీలైనంత వరకూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కల్పన: సునేర్ని వాడితే స్కిన్ పాడైపోతుంది. దాన్ని నీళ్లలో కలిపి మీద పోయడం కూడా మంచిది కాదు. మాధురి: అందుకే చాలావరకు గులాల్ వాడుతున్నాం. నీళ్లలో కలపకుండా డ్రై కలర్స్నే చల్లుకుంటున్నాం. నీళ్లతో కడిగితే వెంటనే పోతాయి. భావన: నాలుగైదేళ్ల నుంచి నేచురల్ కలర్స్ తయారీపై అవగాహన రావడం వల్ల మేమూ ఇంటి దగ్గర ఆడే హోలీకోసం కొన్ని రకాల రంగులు తయారు చేసుకుం టున్నాం. భాగ్య: ఇంటి దగ్గర కంటే కాలేజీలోనే బాగా ఎంజాయ్ చేస్తాం. ఎటు చూసినా ఫ్రెండ్సే కదా! కొందిరిపై ఇష్టంతో... ఇంకొందరిపై కోపంతో(నవ్వుతూ) పరుగులు పెట్టించి మరీ పూసేస్తాం. ప్రణీత: చిన్నప్పుడు పండుగ పేరుతో రంగులు పోసుకునేవాళ్లం. ఇప్పుడు మనసులో భావాలను తెలుపుతూ, ఎదుటి వారిపై ఉన్న ఇష్టాన్ని తెలుపుతూ ఎంజాయ్ చేసే వయసు కదా! ఈ రోజు శత్రువులు కూడా స్నేహితులయిపోతారు. శైలజ: పండుగకు రెండు రోజుల ముందు నుంచే కాలేజీలో రంగుల వర్షం కురుస్తుంది. అందుకే ఓ మోస్తరుగా ఉండే డ్రెస్సులు వేసుకొస్తాం. వాటిపై కూడా సెటైర్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తాం. భాగ్య: మొత్తానికి ఇంటికెళ్లేలోపు మా రూపులు మారిపోతాయి. అమ్మ చూసి... ‘అప్పుడే మొదలుపెట్టారా’ అంటూ నిట్టూరుస్తుంది. తెల్లారిందో లేదో ఇంటి చుట్టుపక్కలవారితో పండుగ మొదలైపోతుంది. స్వరూప: వదిన, అత్త వరసున్నవాళ్లతో బాగా ఆడతాం. వాళ్లు కూడా మాపై రంగు పోయడానికి బాగా ప్రిపేర్ అవుతారనుకోండి. ఎవరి ప్రతాపాలు వారు చూపించుకుంటారు. మొత్తానికి పండగరోజు సాయంత్రానికి ఎవరి ముఖాలు వాళ్లు గుర్తుపట్టుకునే పరిస్థితి ఉండదు. విజయలక్ష్మి: నాకు మాత్రం కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే ఫైనలియర్ స్టూండెంట్స్మి కదా! ఇప్పటివరకూ హోలీ అంటే ఇంట్లో, కాలేజీలో.. రెండు చోట్ల వేడుక. వచ్చే ఏడాది నుంచి ఇలా రెండు చోట్ల ఎంజాయ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. హనీష: అందుకే ఈసారి బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. పొద్దున బ్యాగులో బుక్స్కి బదులు రంగు పొట్లాలతో దిగాం. మౌనిక: కోఎడ్ కాలేజీల్లో కంటే మా దగ్గరే అమ్మాయిలు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. అక్కడయితే అబ్బాయిల మధ్య కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. అంతా మా రాజ్యం. శైలజ: ఈరోజు స్పెషాలిటి ఏంటంటే మీరు వేరు, మేం వేరు అనేది ఉండదు. కాలేజీ కాంపౌండ్లో ఎవరు కనిపించినా రంగులమయం అయిపోవాల్సిందే. ప్రియాంక: లెక్చరర్స్ కూడానా...(నవ్వుతూ) భాగ్య: అమ్మో మేడమ్స్పై రంగులా! పల్లవి: ఓన్లీ స్టూడెంట్స్మే సెలబ్రేట్ చేసుకుంటాం. -
ప్యూర్ లెదర్
ఇవి అచ్చంగా తోలుబొమ్మలేనండోయ్..! అలాగని.. నాలుగు దిక్కుల నడిమి సంతలో.. నాట్యం చేసే బొమ్మలు కావు. ప్యూర్ లెదర్తో రూపొందించిన అందమైన బొమ్మలు. చల్ చల్మనే చలాకి గుర్రాలు.. తెల్లని కొమ్ముల నల్లని ఏనుగులు.. చెంగు చెంగున దూకే హరిణాలు.. ఇలా ఎన్నో బొమ్మలు కుత్బుల్లాపూర్ సుచిత్ర రహదారిలో క నువిందు చేస్తున్నాయి. జీవకళ ఉట్టిపడుతున్న ఈ బొమ్మలను చూడగానే ఆ దారిన వెళ్తున్న బాటసారులు కన్నార్పకుండా చూడటమే కాదు.. కాసులు చెల్లించి సొంతం చేసుకుంటున్నారు. ఇక చిన్నపిల్లలైతే.. తల్లిదండ్రులను సతాయించి మరీ వాటిని సాధిస్తున్నారు. రూ.150 నుంచి రూ.350 వరకూ పలుకుతున్న ఈ బొమ్మలు కింద పడ్డా పగలకపోవడం వీటి అదనపు ఆకర్షణ. -
తెలంగాణ హోలీ కేళి
సిటీ కలర్ఫుల్ హోలీ వేడుకలకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. చాక్లెట్ బాయ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని వెర్టిగో లాంజ్లో ‘తెలంగాణ ఫస్ట్ హోలీ మేళా పోస్టర్’ను టాలీవుడ్ సెలబ్రిటీలు అనుకృతి, ఫరాఖాన్, హీరో రాహుల్ మంగళవారం విడుదల చేశారు. ఈ హోలీ వేడుకకు ‘సూర్య వర్సెస్ సూర్య’ హీరో నిఖిల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ హైవేలో ఉన్న హనీ బర్గ్ రిసార్ట్లో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి డీజే హోరు మొదలవుతుందని చాక్లెట్బాయ్ ఎండీ కలహర్రెడ్డి తెలిపారు. సాక్షి, సిటీప్లస్ -
మరీ విడ్డూరం పాటలు..
ఈ రోజుల్లో వస్తున్న పాటలు అర్థం పర్థం లేకుండా ఉంటున్నాయని, కొన్ని మరీ విడ్డూరంగా ఉంటున్నాయని బాలీవుడ్ ‘డిస్కో’బ్రాండ్ సంగీత దర్శకుడు బప్పీ లహిరి వ్యాఖ్యానిస్తున్నాడు. ‘చార్ బాటిల్ వోడ్కా..’ వంటి పాటలు బొత్తిగా విడ్డూరంగా ఉంటున్నాయని, వాటిలో ఏమాత్రం అర్థం పర్థం ఉండటం లేదని అంటున్నాడు. బాలీవుడ్ స్వర్ణయుగంలో అర్థవంతమైన పాటలు వచ్చాయని, ఇప్పుడలాంటి పాటలు మచ్చుకైనా ఉండటం లేదని వాపోతున్నాడు. -
ప్రకృతికాంతకు హొయలు...
పట్నంలో విరిసిన ఆ కుంచె పల్లె చుట్టొచ్చిన తర్వాత కాన్వాస్పై పరవశించింది. ప్రతి చిత్రంలోనూ నిలువెత్తు పచ్చదనాన్ని నిండుగా పరిచింది. కెరటాల కడలని కదలకుండా కళ్ల ముందుంచుతుంది. పారే సెలయేరును అందంగా ఒడిసిపడుతుంది.. రుతురాగాలకు ఒయ్యారాలు పోయే ప్రకృతి కాంతను తైల వర్ణాల్లో ఆవిష్కరిస్తుంది. ఇంతకీ ఆ కుంచె పట్టింది నగరానికి చెందిన నరేంద్రనాథ్. దేశ, విదేశాల్లో చిత్రకళ ప్రదర్శనలిచ్చిన నరేంద్రనాథ్ను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాట ల్లోనే.. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. మా నాన్న డాక్టర్ పీఆర్ రాజు చిత్రకారుడైనా నన్ను ఏనాడూ పెయింటింగ్స్ నేర్చుకొమ్మని ఒత్తిడి చేయలేదు. స్కూల్ డేస్లో పెయింటింగ్ పోటీల్లో పాల్గొనేవాణ్ని. బహుమతులు కూడా గెలుచుకున్నాను. నా చిన్నతనంలో ఆయన భారత కళాపరిషత్ పేరుతో చిత్రకళ సంస్థను నిర్వహిస్తూ.. ఎందరో ఔత్సాహికులకు చిత్రలేఖనం నేర్పేవారు. మా తమ్ముడు పలాలా అక్కడే కుంచె పట్టడం నేర్చుకున్నాడు. అద్భుతమైన కళాకారుడిగా ఎదిగాడు కూడా. అనుకోకుండా ఓ రోజు వాడు హఠాన్మరణం పొందడం మా కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. అలా మారాను.. తమ్ముడు పోయిన కొన్నాళ్లకు స్నేహితులతో కలసి కర్ణాటకలోని బెల్గామ్ ప్రాంతంలో ఉన్న ఓ పల్లెటూరుకు వెళ్లాను. అక్కడి ప్రకృతి సంపద నన్ను కట్టిపడేసింది. తర్వాత ఐదుగురు చిత్రకారులతో కలసి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తిరిగాను. కొన్ని రోజులు అక్కడే బస చేశాను. అదే నన్ను ప్రకృతి చిత్రకారునిగా మార్చింది. అప్పటి నుంచి ఆర్మూర్, ఖమ్మం, మెట్పల్లి, వరంగల్.. ఇవేకాక ఇలాంటి మరెన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలకు వెళ్లాను. పచ్చని పంటపొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ నా కాన్వాస్పై తొంగిచూశాయి. చిత్రకళపై పట్టు సాధిస్తూనే.. కర్ణాటకలోని బీఎంఎస్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి బీఎఫ్ఏ పూర్తి చేశాను. కాన్వాస్పై తైలవర్ణాలు వాడుతూ చెట్లు, కొండలు.. గుట్టలు, వాగులు.. వంకలను పరచడం నాకెంతో ఇష్టం. ఇలా వేసిన పెయింటింగ్స్తో హైదరాబాద్లో ఇప్పటి వరకు 20కి పైగా ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. అమెరికా, బ్రెజిల్, యూకేతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ప్రదర్శనలు నిర్వహించాను. అన్ని రకాల మాధ్యమాల్లో పయింటింగ్స్ వేయగలిగినా.. ఆయిల్ పెయింటింగ్స్ వేయడానికే ప్రాధాన్యం ఇస్తాను. మరిన్ని థీమ్స్తో.. నగరీకరణ వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగి ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. పల్లెలు కూడా పచ్చదనానికి క్రమంగా దూరమవుతున్నాయి. అందుకే ప్రకృతిపై అవేర్నెస్ తీసుకురావడానికి నా కళను ఒక వారధిగా మలుచుకున్నాను. ప్రకృతిని పరిరక్షిస్తే మనకే మేలని నా చిత్రాల ద్వారా సందేశాన్ని అందిస్తున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని థీమ్స్పై చిత్రాలు గీసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తా. మా నాన్న ప్రారంభించిన బేగంపేటలోని డాక్టర్ పీఆర్ రాజు ఆర్ట్ స్టడీ సర్కిల్లో అనేక మంది ఆర్టిస్టులను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాను. వీఎస్ -
లాక్మే బ్యూటీ విన్నర్
మార్చి 8న వరల్డ్ విమెన్స్ డే సందర్భంగా ప్రతి ఏడాదిలాగే.. లాక్మే సెలూన్ 8 మంది వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వీరికి రాబోయే ఎనిమిదేళ్లు బ్యూటీ సర్వీసెస్ ఫ్రీగా అందించనుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 8 మంది మహిళల్లో హైదరాబాద్కు చెందిన సంజనా బిస్వాస్ కూడా ఉన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని లాక్మే షోరూమ్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తెలుగు, కన్నడ నటి అస్మిత సూద్ పాల్గొని.. సంజనా బిశ్వాస్కు ‘లాక్మే ఫర్ లైఫ్’ కార్డ్ను అందజేశారు. హిమాయత్నగ ర్లోని లాక్మే బ్యూటీ స్పాట్కు తాను రెగ్యులర్గా వెళ్తుంటానని చెప్పారు అస్మిత సూద్. ‘అక్కడ ఎన్నెన్నో కొత్త హెయిర్ స్టయిల్స్, స్కిన్ ట్రెండ్స్ సర్వీసెస్ చే యించుకుంటాను. ఒక మహిళగా ఈ బ్యూటీ ఫీల్డ్లో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంద’ని అన్నారు. థ్రిల్గా ఫీలవుతున్నా.. లాక్మే లైఫ్ కార్డ్ను అందుకోవడం హ్యాపీగా ఉందన్నారు లాక్మే లక్కీ విన్నర్ సంజనా బిశ్వాస్. ‘మేము హైటెక్ సిటీలో ఉంటాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో టెక్నికల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఏడేళ్లుగా లాక్మే సెలూన్కే వెళ్తున్నాను. నా వెడ్డింగ్ ఫిక్స్ అయినప్పటి నుంచి ప్రీ వెడ్డింగ్ , పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు లాక్మేలోనే ముస్తాబయ్యాను. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 8 మంది మగువల్లో నేనుండటం అదృష్టంగా భావిస్తున్నాను. రానున్న 8 ఏళ్లు బ్యూటీ సర్వీసెస్ కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేనందుకు చాలా థ్రిల్గా ఫీలవుతున్నాను’ అని సంతోషంగా తెలిపారు సంజ నా బిశ్వాస్. సిరి -
ఈ ప్రశ్నలకు బదులేది..?
మతసామరస్యాన్ని చాటుతూ బంజారాహిల్స్లోని లామకాన్లో ‘కమ్యూనల్ హార్మోనీ పేరుతో శని, ఆదివారాల్లో పలు డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. గోద్రా దుస్సంఘటన జరిగి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ బాధితుల స్మృత్యర్థం విజ్జీయార్, విమోచన్, లామకాన్లు /ా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రదర్శనలో తొలిరోజు ఆనంద్ పట్వర్ధన్, శుభ్రదీప్ చక్రవర్తి, రాకేశ్ శర్మ రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. రెండో రోజైన ఆదివారం ఫైనల్ సొల్యూషన్, ఫాదర్.. సన్ హోలీ వార్ చిత్రం 2 భాగాలు, ఎన్కౌంటర్డ్ ఆన్ సాఫ్రాన్ చిత్రాలను స్క్రీనింగ్ చేశారు. ఫాదర్-సన్ హోలీవార్.. 2 భాగాలు ఆనంద్ పట్వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాల్లో.. దేశంలో బలహీనుల మీద దాడులకు కారణమవుతున్న అనేక భావజాలాలకు మూలమైన అంశాలను అర్థవంతంగా చూపించారు. నాటి సతి సహగమనం నుంచి తలాక్ వరకు అన్ని చోట్ల బాధితులు మహిళలే. పురుషాధిక్యతకు బలం చేకూరుస్తున్న మత విధానాలు, సంప్రదాయాలు, చారిత్రక కథలు.. నేటి టీవీ కార్యక్రమాలను చిత్ర దర్శకుడు వేలెత్తి చూపించారు. ఈ డాక్యుమెంటరీ 90వ దశకంలో తీసిందైనా.. చిత్రాల్లో ప్రస్తావించిన అంశాలు నేటికీ ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అహింసను నపుంసకత్వానికి చిహ్నంగా భావించడం భవిష్యత్తును మరింత అంధకారంలోకి తోసే విధానమనే ఆలోచనను రేకెత్తిస్తూ ఫాదర్-సన్ హోలీవార్ ముగుస్తుంది. ఎన్కౌంటర్డ్ ఆన్ సాఫ్రాన్ ఎజెండా గుజరాత్లో జరిగిన ఎన్కౌంటర్ల గురించి తీసిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ ఇది. ట్యూషన్లు చెప్పుకునే అమ్మాయి, బంధువులను చూడటానికి వెళ్లిన భార్యభర్తలు, మోటరు బైక్ మీద అహ్మదాబాద్కు బయలుదేరిన యువకుడు హఠాత్తుగా ఎన్కౌంటర్ అయినట్లు వార్తా కథనాలు. పోలీసుల వివరణలు ప్రసారమవుతాయి. పేపర్లో వార్తలు వస్తాయి. కొన్ని ఫిర్యాదులు, కొంత విచారణ తర్వాత జనం వాటిని మరచిపోతారు. ఎన్కౌంటర్లో చనిపోయింది టైస్టులా, సామాన్యులా, పోలీసు కథనాలలో ఉన్న నిజానిజాలు నిగ్గుతేల్చిన డాక్యుమెంటరీ ఇది. నిపుణులు, అధికారుల కన్నా సామాన్యులు, కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నలు సమస్య మూలాలను కదిలించేవిగా ఉన్నాయి! ఈ డాక్యుమెంటరీ రూపొందించింది శుభ్రదీప్ చక్రవర్తి. ఫైనల్ సొల్యూషన్ ‘మా తాతను, నాన్నను వాళ్లు పొడిచి చంపేశారు. మా ఊరి నుంచి పంపించేశారు. అప్పటి నుంచి ఈ ఊళ్లో ఉంటున్నాం. మా పిన్ని ఇంకా మిగతా ఆడవాళ్ల బట్టలు ఊడదీసి, చంపేశారు. వాళ్లని నేను చూశాను’ అని నాలుగేళ్ల పిల్లవాడి మాటలతో మొదలయ్యే ఈ డాక్యుమెంటరీ గుజరాత్ అల్లర్ల మీద లోతైన విషయాలను మన ముందుకు తెస్తుంది. అల్లర్లలో నష్టపోయిన ఇరు వర్గాల వాళ్ల ఇళ్లు, వాడలను కళ్లముందుంచారు డెరైక్టర్. దాడులలో బతికి బయటపడ్డ వారు, ముఖ్యంగా స్త్రీలు పడిన వేదనను గుండె కదిలించేలా చూపించారు. రాకేశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చాలా చోట్ల స్క్రీనింగ్ చేయడానికి అనుమతులు నిరాకరించారు. ఓ మధు -
సీనియర్స్ డియర్స్
ఇంతలా సంతాపసభ జరుగుతోంది? చనిపోయిన వ్యక్తి రాజకీయనాయకుడా? లేదా సెలబ్రిటీనా? ఇంత అభిమానంతో అంజలి ఘటిస్తున్న ఈ వృద్దులంతా ఎవరై ఉంటారు? ఫొటో చూసిన అందరికీ వచ్చే సందేహం ఇది. కానీ కాలంచేసిన పెద్దాయనకు వాళ్లు బంధువులు కాదు, చనిపోయిన వ్యక్తి ఏ నాయకుడో కాదు. మరి వీరికి ఆ స్వర్గీయుడికి ఉన్న బంధం ఏంటంటే...‘వి ఆర్ ఆల్ సినీయర్ సిటిజన్స్... మేం మాకోసం, సమాజం కోసం’ అని సమాధానమిస్తారు. ఆటలు, పాటలు, ఆరోగ్యం, అనుబంధంతోపాటు ఒక పండుటాకు రాలినపుడు వారు స్పందించేతీరుకి ఈ సంతాపసభ స్వచ్ఛమైన నిదర్శనం. కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీ ‘సీనియర్ సిటిజన్స్’ చెప్పిన కబుర్లే ఈవారం సిక్ట్సీప్లస్. -భువనేశ్వరి అప్పటివరకూ వారిమధ్యలో తిరిగిన మనిషి మంచానపడ్డా, మరణించినా మేమున్నాం మిత్రమా అంటూ ముందుకెళ్లే ఈ జ్యేష్ఠ పౌరులు జరిపే ప్రతి కార్యక్రమం వారికోసం మాత్రమే కాదు.. సమాజం కోసం కూడా. ‘మంచినీటి కేంద్రాల నుంచి మున్సిపాలిటి పాలన వరకూ అన్ని సమస్యలపై పోరాడుతున్నాం. రిటైర్డ్ పర్సన్స్ కదా... నలుగురు ఒకదగ్గర కూడితే ఏదో ఊసుపోని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారనుకుంటే పొరపాటు. మాలో అన్ని రంగాలకు చెందిన అధికారులూ ఉన్నారు. వారి అనుభవాల్ని నలుగురికీ చెప్పడంతో పాటు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సలహాలు కూడా అందిస్తున్నాం’ అని చెప్పారు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉప్పలగోపాలరావు. వీధిలో కరెంటు స్తంభం లైటు వెలగకపోతే ఎవరు ఫిర్యాదు చేయాలి? మామూలుగా మన వేలు యువతవైపు వెళుతుంది. కానీ ఇక్కడ ఆ పని చేస్తుంది వృద్ధులు. ఇక్కడ కాలనీకో అసోసియేషన్ ఉండడం వల్ల ఆ కాలనీ బాగోగులన్నీ వారే చూసుకుంటున్నారు. పద్నాలుగు కాలనీలు... కూకట్పల్లి చాప్టర్ కిందున్న పద్నాలుగు కాలనీలలో పద్నాలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. వారంతా వివేకానందానగర్కాలనీలోని సినీయర్ సిటిజన్స్ సంఘాల సమాఖ్యలో జీవితకాల సభ్యత్వం తీసుకున్నవారు. ‘మా అసోసియేషన్లో 140 మంది వృద్ధులు సభ్యులుగా ఉన్నారు. తలో వెయ్యి రూపాయలు వేసుకుని లైఫ్టైం మెంబర్షిప్ తీసుకున్నాం. ఆ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీ డబ్బులతో మా కార్యక్రమాలు సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో పుట్టినరోజులు, సంతాపసభలు, డాక్టర్స్డే, టీచర్స్డే... అన్నీ జరుపుకొంటాం. అసోసియేషన్ ఫౌండర్ అయిన డాక్టర్ సబ్బిన సత్యనారాయణ గారు ఈ మధ్యనే మరణించారు. సంతాపసభ నిర్వహించుకుని ఈ సందర్భంగా ఆయన స్మృతులను నెమరువేసుకుంటున్నాం’ అని చెప్పారు వైస్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి. విహారయాత్రలకు... గత ఏడాది భాగ్యనగరికాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లోని ఓ ఇరవైమంది విహారయాత్రకు వెళ్లొచ్చారు. ‘శ్రీశైలం, కాళహస్తి... ఓ నాలుగైదు ప్రదేశాలు తిరిగొచ్చాం. దారిపొడవునా చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ, మారిన కాలాన్ని వర్ణించుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాం. మా కాలనీవారికి విహారయాత్రలంటే కాస్త మక్కువెక్కువ’ అని చెప్పారు హెచ్సిఎల్లో రిటైర్డ్ అయిన ఎ.ఆర్.కె చౌదరి. ఆయనతో మాటకలుపుతూ ‘నెక్ట్స్ మేమంతా పంచారామాలు వెళదామనుకుంటున్నాం’ అని అన్నారు ట్రెజరర్ రోషిరెడ్డి. ఇదే సరైన సమయం... ‘చిన్నప్పుడు చదువులు, తర్వాత ఉద్యోగాలు... ఆ తర్వాత కుటుంబం, బాధ్యతలు. ఇంకెప్పుడు సమాజం కోసం నాలుగు నిమిషాలు ఆలోచించేది అని ప్రశ్నించుకుంటే కరెక్టు వయసు 60 సంవత్సరాల తర్వాతే. ఈ మాటకు రుజువు మేం చేసుకుంటున్న, చేస్తున్న పనులే నిదర్శనం. ఇప్పటివరకూ ప్రపంచంతో సంబంధం లేకుండా హడావుడి జీవితం గడిపాం. ఇప్పుడు అడుగులో అడుగువేసుకుంటూ వీధిలో కాసేపు నడిచే సమయం దొరికింది. కావాల్సినవారిని పలకిరిస్తూ, ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేస్తూ, సమాజంలో వస్తున్న మార్పుల్ని గమనిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నాం’ అని చెబుతున్నారు ఉప్పల గోపాల్రెడ్డి. ‘అంతేకాదు... మా ఆలోచనలను సమాజంతో పంచుకునే అవకాశం కూడా ఇప్పుడే బాగా ఉంటుంది. అందుకే నేను పసిపిల్లల నుంచి వృద్ధులవరకూ అందరికీ ఉపయోగపడే ‘చేతన’ అనే మాసపత్రిక ప్రచురిస్తున్నాను’ అని చెప్పారాయన. ప్రతి నెలా హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించుకుంటున్నారు. ఇక మానసిక చైతన్యం కోసం ఈ సీనియర్ సిటిజన్స్ సీరియస్ స్లోగన్...‘ఎల్డర్స్ ఫర్ ఎల్డర్స్, ఎల్డర్స్ ఫర్ సొసైటీ, సొసైటీ ఫర్ ఎల్డర్స్’. విశ్రాంతి తీసుకునే సమయంలో మరింత ఉత్సాహంతో ఈ సీనియర్ సిటిజన్స్ వేస్తున్న అడుగులు నేటి అందరికీ అడుగుజాడలు. మీరూ పంపండి.. యాభై దాటితే సగం జీవితం అయిపోయినట్టేనా?.. ‘కాదు.. జస్ట్ బిగిన్’ అంటున్నారు సీనియర్ సిటిజన్స్. ఆటపాటలు.. ఇష్టమైన వ్యాపకాలతో స్నేహిస్తూ.. కాసింత చారిటీకి టైమిస్తూ జీవితాన్ని ‘కొత్త బంగారు లోకం’ చేసుకుంటున్న సీనియర్ సిటి‘జెమ్స్’ ఎందరో!. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అని చాటుతున్న అటువంటి వారికి విజ్ఞప్తి.. మీ అసోసియేషన్ లేదా వృద్ధాశ్రమాల యాక్టివిటీస్ గురించి మాకు రాసి పంపండి. మీ ఎక్స్పీరియన్స్ మరెందరికో ఇన్స్పిరేషన్. మెయిల్: sakshicityplus@gmail.com -
ఆమె అడవిని జయించింది..
నగర మహిళలు మోడరనే కాదు... ఫియర్లెస్ కూడా. ఎత్తై గుట్టల్ని అవలీలగా ఎక్కేస్తూ.. ఎంతటి కష్టమైనా సరే ఈజీగా విజయాన్ని చేజిక్కించుకోగలమని చాటుతున్నారు. నదీ జలాల్ని సునాయాసంగా దాటేస్తూ... జీవితాన్నే ఎదురీదుతున్న తమకు ఇదో లెక్కకాదని నిరూపిస్తున్నారు. ట్రెక్కింగ్, రాఫ్టింగ్, రాక్ క్లైంబింగ్... సాహసంగానో, ప్రత్యేక గుర్తింపు కోసమో కాదు కేవలం అభిరుచిగా మాత్రమే చేస్తున్నారు. ఆటవిడుపు కోసం అడవులను ఎంచుకుని, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తున్న కొందరు మహిళల గురించి... వాంకె శ్రీనివాస్ ఒకప్పుడు మహిళ ఆసక్తులంటే... సంగీతం, నృత్యం, పుస్తక పఠనం, కుట్లు, అల్లికలు, రకరకాల వంటల తయారీ. అతి కొద్ది మంది మాత్రమే వీటికి భిన్నంగా నడిచేవారు. జనరేషన్ మారింది. ఇప్పుడలా కాదు. చిన్నతనం నుంచే ప్రత్యేకంగా ఉండే హాబీలను ఎంచుకునే వారు కొందరైతే... ఉద్యోగం, కుటుంబ బాధ్యతల నుంచి విశ్రాంతి పొందేందుకు వినూత్న ప్రయోగాలు చేయాలనుకునేవారు మరికొందరు. ఈ ఆలోచనలే ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రాఫ్టింగ్ వంటి సాహసాలవైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయంటున్నారు ఈ తరం మహిళలు. సెల్ప్ కాన్ఫిడెన్స్... కొత్త ప్రదేశాలు చుట్టిరావడమంటే కొత్త విషయాలు నేర్చుకోవడమే. ఆసక్తి ఉండాలే కానీ సాహస యాత్రలను మించిన అభిరుచి లేదంటారు ఐకామ్ టెలీ లిమిటెడ్లో మేనేజర్గా పనిచేస్తున్న రజనీ పోతినేని. ‘మా స్వస్థలం విజయవాడ. పదిహేనేళ్ల కిందట హైదరాబాద్కు మారాం. విజయవాడలో చదువుతున్నప్పుడు మా కళాశాలలో స్పోర్ట్స్ ఈవెంట్లలో చలాకీగా ఉండేదాన్ని. సిటీలోనూ జరిగే వివిధ రన్స్లో పాల్గొంటుండేదాన్ని. అలా నాకు నాలుగేళ్ల కిందట గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ (జీహెచ్ఏసీ) గురించి తెలిసింది. వెంటనే అందులో సభ్యత్వం తీసుకున్నా. అప్పటి నుంచి ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ల్లో చురుగ్గా పాల్గొంటున్నా’ అని సంతోషంగా చెబుతున్నారామె. ‘ఈ సాహసయాత్రల కోసం ఎక్కువ దూరాలు వెళ్లాల్సిన పనిలేదు. నగరానికి చుట్టూనే ఎన్నో మంచి ప్రాంతాలున్నాయి. భువనగిరి ఫోర్ట్, శేషాచలం కొండలే అందుకు ఉదహరణ. వాటిపైకి ఎక్కడం, అందరితో కలిసి చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని వంటచేసుకొని తినడం. అదో అద్భుతమైన అనుభూతి. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని కొత్త ప్రదేశాలు... అడవుల్లో పర్యటించినప్పుడు కలిగే ఆనందం, సొంతమయ్యే ఆత్మస్థైర్యం అంతా ఇంతా కాదు’ అంటూ రజనీ అనుభూతులను నెమరువేసుకున్నారు. జాగ్రత్తలు అవసరం... మహిళలు ఒంటరిగా సాహసయాత్రలు చేయగలరా? ఇంటి గడప దాటని వారు... నదులు దాటగలరా? ఇలాంటి ఎన్నో అభిప్రాయాలు, అనుమానాలు. కానీ అలాంటి సందేహాలకు తమ సాహసాలతో సమాధానం చెబుతున్నారీ మహిళలు. ‘ఏటవాలుగా ఉన్న కొండలు ఎక్కుతుంటే జారిపోతున్నట్లుంటుంది. కాస్త కష్టమే అయినా అదో ఆనందం. తాడు సాయంతో నది దాటడం, రాత్రిళ్లు ఆడవుల్లో తిరగడం లాంటివాటికి చాలా మంది భయపడతారు. కానీ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. సాహసయాత్రలు చేయాలనుకున్నవారు ఒకేసారి సుదూరాలు వెళ్లాలనుకోకూడదు. మొదట స్థానికంగా ఉన్న వాటిపై దృష్టి పెట్టాలి. అప్పుడే అవగాహన వస్తుంది. ఆసక్తి ఉండాలి. మానసికంగా మనల్ని మనం సిద్ధం చేసుకోగలగాలి. సాహసాలకు అవసరమైన నైపుణ్యాలను ఒంటబట్టించుకోవాలి. జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. స్థానిక ప్రాంతాలే కాదు... మహారాష్ట్ర, కర్ణాటకల్లోని ఆడవుల్లోనూ మేం ప్రయాణించాం’ అని చెప్పుకొచ్చింది ఇన్నోమైండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న సిరి అప్పినేని. లైఫ్కి అన్వయించుకోవచ్చు... మంచి అభిరుచి ఎంచుకోవడమే కాదు. దాన్ని జీవితానికి అన్వయించుకోవడం తెలిసుండాలి. అదే అసలైన ఆనందం అంటున్న హైదరాబాదీ యువతి ఫరీదా సుల్తాన్. ఈమె ఫ్రిలాన్స్ కన్సల్టెంట్. ముస్లిం కుటుంబం నుంచి వచ్చినా ట్రెక్కింగ్, ఆడవుల్లో పర్యటించడం, పర్వతాలు ఎక్కడం.. అంటే ఎంతో ఆసక్తి. ఆమె ఆసక్తికి కుటుంబ ప్రోత్సాహం తోడయ్యింది. ఇంకేముంది... వారాంతం వస్తే చాలు... సాహసాలకే సమయం కేటాయిస్తుంది. హైదరాబాద్లోని మౌలాలి, శామీర్పేట్, ఖాజాగూడ, అమ్మగూడలోని గుట్టలే కాదు... మహారాష్ట్రలోని పుణేను చుట్టి వచ్చిందీమే. ‘పుణేలోని ఎత్తై ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ కొండల్లో రాత్రంగా ఉండడం, నిశీధిని జాగ్రత్తగా గమనించడం, వంట చేసుకోవడం, అదో మధురానుభూతి. ఈ యాత్రల వల్ల నేను చాలా నేర్చుకున్నా. ట్రక్కింగ్కి వెళ్లేటప్పుడు అవసరమైన సామగ్రిని మాత్రమే తీసుకెళతామంటోంది ఫరీదా. మానసిక దృఢత్వం, దేన్నయినా సాధించగలమనే ఆత్మవిశ్వాసం... ఎందుకు చేయలేమనే పట్టుదల... వంటివన్నీ సాహసయాత్రలతోనే అలవాడతాయి. పని ఒత్తిడి నుంచి కాస్త విశ్రాంతి పొందడానికి ఇలాంటి సాహసాలకు మించిన రిఫ్రెష్మెంట్ లేదంటోంది ఫరీదా. -
నగరం... బిందాస్
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. స్టడీస్ కూడా ఇక్కడే. అమ్మ డిఫెన్స్లో గెజిటెడ్ ఎంప్లాయ్. నాన్న ఇండస్ట్రియలిస్ట్. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఉండేవాళ్లం... నాకు ఊహ వచ్చేనాటికి ఈసీఐఎల్ షిఫ్టయ్యాం. అప్పుడు ఈసీఐఎల్ పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడున్నంత జనాభా లేదు. సెవెంత్ వరకు సఫిల్గూడలోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. తరువాత దుర్గాబాయి దేశ్ముఖ్కాలనీకి మారాము. ఇట్లా హైదరాబాద్లోని చాలా ప్లేసెస్తో అనుబంధం ఏర్పడింది. డీడీ కాలనీకి దగ్గరగా ఉంటుంది కదా అని... నన్ను దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జాయిన్ చేశారు. ఎయిత్ నుంచి టెన్త్ వరకు అక్కడే. ఆ ఏరియాలో మొత్తం కాలేజీలే కదా. లైఫ్లో అసలు ఫన్ స్టార్ట్ అయ్యింది అక్కడినుంచే. అందుకే ఇప్పటికీ ఆ ఏరియా అంటే చాలా ఇష్టం. నా సెవెంత్ క్లాస్లో... అప్పుడప్పుడే ఓషన్ పార్క్ స్టార్ట్ చేశారు. నేను, మా వాచ్మెన్ వాళ్లబ్బాయి (నేపాలీ) కలిసి... స్కూల్ డుమ్మా కొట్టి, ఇంట్లో చెప్పకుండా ఓషన్ పార్క్కు వెళ్లొచ్చాం. అప్పుడది మాకొక థ్రిల్లింగ్ అడ్వెంచర్. అడ్వెంచర్స్ మీద అప్పుడు మొదలైన ఇంట్రెస్ట్... ఇప్పటికీ వదలలేదు. టీనేజ్ కొచ్చాక... ఆర్టీసీ క్రాస్రోడ్స్లో సినిమాలు చూడటం, బైక్మీద చక్కర్లు కొట్టడం, ఫ్రెండ్స్, అల్లరి... చాలా సరదాగా గడిచిపోయాయా రోజులు. ఆర్టీసీ క్రాస్రోడ్లో రిలీజైన ప్రతి సినిమా కనీసం ఐదు సార్లు చూసేవాడిని. అందుకే ఆ ఏరియా అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. సినిమాల్లోకి రాకుంటే... సినిమాల్లోకి రాకుండా ఉంటే... నైన్ టు ఫైవ్ జాబ్ అయితే అస్సలు చేసేవాడిని కాదు. రొటీన్గా ఉండటం అంటే బోర్. వైల్డ్లైఫ్ ట్రావెలింగ్, అడ్వెంచర్ ట్రావెలింగ్ రిలేటెడ్గా ఉండేవాడిని. ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్కోర్స్ ఫిల్మ్స్... సెకండ్ అంటే నేను చేస్తున్న బిజినెస్ ప్రాజెక్ట్ ‘ది విలేజ్’ గేటెడ్ కమ్యూనిటీ ఫాం హౌసెస్. శంకర్పల్లి దగ్గర అన్ని సౌకర్యాలతో అపార్ట్మెంట్ ధరలకంటే తక్కువకే అందిస్తున్నా. ప్లేస్ తీసుకుని ఫాం హౌస్ కట్టించుకుంటే... మెయింటెనెన్స్ ఇబ్బంది కూడా ఉంటుంది. అలాంటివేవీ లేని బెస్ట్ ఆపర్చ్యునిటీ ఇది. బెస్ట్ప్లేస్... వేరే రాష్ట్రాలనుంచి వచ్చి బతకాలనుకునేవాళ్లకి బెస్ట్ ప్లేస్ హైదరాబాద్. ఎందుకంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. పైగా ఊపిరి సలపనివ్వకుండా జనం. హైదరాబాద్ పేరుకు సిటీనే అయినా... ప్రేమాభిమానాలు, పలకరింపులు, మంచి చెడు చెప్పే మనుషులు ఇక్కడ అడుగడుగునా ఉంటారు. ఏమీ తెలియని ఓ మనిషి కూడా హైదరాబాద్లో బిందాస్గా బతికేయొచ్చని గట్టిగా నమ్ముతా. హైదరాబాద్ను మించిన ఫ్రెండ్లీ ప్లేస్, బిజినెస్ ప్లేస్ మరొకటి లేదు. ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ టు బీ ఏ హైదరాబాదీ. పేరెంట్స్ నాకు బర్త్ ఇస్తే... సిటీ నా కెరీర్కి బర్త్ ఇచ్చింది. -
అమోల్ ‘సెలైన్స్’..
విలక్షణ నట దర్శకుడు అమోల్ పాలేకర్ ‘సెలైన్స్’ పేరిట ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శన ఢిల్లీ కళాభిమానులకు కనువిందు చేస్తోంది. సినీరంగానికి రాక ముందు అమోల్ చిత్రకారుడిగానే కెరీర్ ప్రారంభించాడు. సినిమాల్లోకి వచ్చాక కుంచెకు దూరమయ్యాడు. చాలాకాలం తర్వాత ఇన్నాళ్లకు తన ‘రంగుల’కలను కేన్వాస్పైకి ఎక్కించాడు. గడచిన ఏడాది వ్యవధిలో గీసిన నలభై నైరూప్య చిత్రాలను ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో ప్రదర్శనకు పెట్టాడు. -
దర్శన్ ‘వయొలెన్స్’..
‘మేరీ కోమ్’ చిత్రంలో ప్రియాంకా చోప్రా సరసన ఆదర్శభర్త పాత్రలో మెప్పించిన దర్శన్కుమార్, తన తాజా చిత్రం ఎన్హెచ్-10లో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో హీరోయిన్ అనుష్క శర్మను దారుణంగా హింసించే శాడిస్టు పాత్రలో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు. నవదీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్హెచ్-10లో తన పాత్ర ప్రతి మహిళకు ఓ పీడకల మాదిరిగా ఉంటుందని దర్శన్ చెబుతున్నాడు. -
కార్టింగ్ ట్రాక్...
సిటీ ఎంటర్టైన్మెంట్లో మరో రేస్ చేరింది. నగరంలోని లియోనియాలో ‘చికేన్ సర్క్యూట్’ పేరుతో 1.2 కిలోమీటర్ల కార్టింగ్ ట్రాక్ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటైన ఈ ట్రాక్పై డెమో రన్స్తో రేసర్ అర్మాన్ ఇబ్రహిం ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇతర ప్రొఫెషనల్ రైడర్స్ తమ స్టంట్స్తో.. చికేన్ ఓ ట్రాక్ మాత్రమే కాదు, మోటార్స్పోర్ట్స్ అన్నింటికి సరైన వేదిక అని నిరూపించారు. ఫీనిక్స్ లైవ్ నిర్వహించిన ఈ ప్రారంభ వేడుకల్లో ఫీనిక్స్ మనేజింగ్ పార్ట్నర్ భరత్వర్మ, ఎఫ్ఎమ్ఎస్సీఐ కార్టింగ్ కమిషన్ ఛైర్మన్ సజీవ్ రాజన్, మెకో రేసింగ్ వ్యవస్థాపకులు అక్బర్ ఇబ్రహిం, లియోనియా జనరల్ మేనేజర్ ప్రవేశ్ కుమార్ దాస్ పాల్గొన్నారు. -
వస్త్రాభరణాలు..
నుదురును ముద్దాడే పాపిట బిళ్ల.. ముక్కును మెరిపించే ముక్కెర.. వీనులకు పొందికైన దుద్దులు.. కంఠంలో మిరుమిట్లు గొలిపే ఆభరణాలు.. పాదాల అడుగులకు మడుగులొత్తుతూ ఘల్లుమనే గజ్జెలు.. ఇవన్నీ ఇంతులకు ఎంతో ఇష్టమైనవే. బోషాణంలో ఏడు వారాల నగలున్నా.. బీరువాలో పట్టు చీరల షోరూమ్ ఉన్నా.. కొత్తగా ఏది కనిపించినా.. ఇట్టే వలవేసి ఒడిసిపట్టడంలో మగువల ను మించిన వారుండరు. అందుకే ఫ్యాషన్ డిజైనర్లు రకరకాల ఫార్ములాలతో మార్కెట్లోకి వచ్చి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. కొత్తగా మేనిని హత్తుకునే వస్త్రాలను మరింత ముస్తాబు చేసేందుకు స్పెషల్ జ్యువెలరీని రూపొందిస్తున్నారు. దీంతో ఒంటిపై నగనిగలకు దీటుగా.. కట్టుకునే వస్త్రాలూ ధగధగలాడేలా ముస్తాబవుతున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఒకప్పుడు చీరలకు అదనపు సొబగులు అంటే.. మ్యాచింగ్ బ్లౌజ్.. గోల్డ్ ఆర్ రోల్గోల్డ్లో మ్యాచింగ్ జ్యువెలరీ ఉంటే చాలనుకునేవారు. కొంత కాలానికి శారీస్కు లైస్ జతపరచో.. మగ్గం వర్క్స్తోనో అందాన్ని అద్దేవారు. ప్రస్తుతం చీరలకు కూడా నగలొచ్చేశాయి. శారీ బ్రూచెస్గా మార్కెట్లోకి వచ్చిన ఈ క్లాత్ జ్యువెలరీని ఈ తరం నారీలోకం తెగ ప్రేమించేస్తోంది. కొంగు బంగారంగా బాసిల్లుతున్న గంటలను తలదన్నే రేంజ్లో శారీ బ్రూచెస్ కనిపించే సరికి నయా ఫ్యాషన్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు మహిళలు. ముత్యాల సరాలు.. కొంగును మోస్తున్న భుజం నుంచి కుచ్చిళ్లను పట్టుకున్న నడుం వరకూ వేలాడే నాలుగు వరుసల ముత్యాల హారంపై క్రేజ్ ఎక్కువగా చూపిస్తున్నారు సిటీ స్త్రీలు. రెండు చివరల పెద్ద పెద్ద లాకెట్లు ఉండటం ఈ హారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేనా, పూల ఆకారంలో మురిపించే లాకెట్లు ఒకవైపు.. మయూరాన్ని మరిపించేవి మరోవైపు.. మగువల మనసును దోచేస్తున్నాయి. కొంగు పిన్నులుగా, కుచ్చిళ్లకు పట్టుకొమ్మలుగా ఇమిడిపోతూనే.. స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. గోల్డెన్ చాయిస్.. ఈ బ్రోచెస్ కేవలం శారీస్ మీదికే కాదు.. ఫ్యాషన్ వేరింగ్కు కూడా సూటవుతున్నాయి. చీరలకు, డ్రెస్లకు.. బోర్డర్లు, చమ్కీలు, కుందన్లు ఇవ్వలేని అందాన్ని ఈ బుల్లి లాకెట్లు ఇచ్చేస్తున్నాయి. వెస్ట్రన్ వేర్కు కూడా ఈ బ్రూచెస్ ఎలిగెంట్ లుక్ ఇస్తున్నాయి. అంతేకాదు వీటిని మల్టీ పర్పస్గా కూడా ఉపయోగించుకోవచ్చు. జడ బిళ్లలుగా, మెడలో హారంగా, చేతికి బ్రేస్లెట్గా, వంకీగా.. రకరకాలుగా ఇమిడిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ బ్రూచెస్కు డిమాండ్ పెరుగుతుండటంతో.. జ్యువెలరీ స్టోర్స్ సైతం ప్యూర్గోల్డ్తో వీటిని రూపొందిస్తున్నారు. వజ్రాలు, రత్నాలతో ఫినిషింగ్ ఇస్తున్నారు. సిరిమంతుల స్త్రీలు ఒకడుగు ముందుకేసి.. ఈ కాస్ట్యూమ్స్ జ్యువెలరీని ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటున్నారు. సిరి -
స్టాలిన్ ఉద్బోధ !
రెండో ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదం కృశిస్తోందని, అమెరికా సామ్రాజ్యవాదం విస్తరించనుందని అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ నేత, యునెటైడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అధినేత స్టాలిన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు వివరించారు. మారిన పరిస్థితుల్లో అమెరికాను ప్రపంచ కమ్యూనిస్టులు ప్రథమ శత్రువుగా భావించాలన్నారు. అమెరికాను వ్యతిరేకిస్తూ.. బలహీనపడుతోన్న బ్రిటిష్ సామ్రాజ్యంతో స్నేహపూర్వకంగా ఉండే భారత్ వంటి దేశాలు, జాతీయ భూస్వామ్యవర్గాలు.. కమ్యూనిస్టుల పోరాటంలో తదుపరి ప్రాధాన్యతలలోకి వస్తాయని సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింపును వివేచించాలన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో స్టాలిన్ ఏమన్నారు..?! భారత్లో హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత.. సైన్యం కమ్యూనిస్ట్లను నిర్దాక్షిణ్యంగా అణచివేయడం ప్రారంభించింది. బ్రిగ్స్ ప్లాన్ను అమలు చేస్తూ! మలేసియాలో కమ్యూనిస్ట్లను అణచివేసేందుకు బ్రిటీష్ సైన్యాధికారి ‘బ్రిగ్స్’ అనుసరించిన వ్యూహంతో! ఏమిటా వ్యూహం? కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న గ్రామాలపై విచక్షణారహితంగా బలప్రయోగం చేయడం! పంటలను దగ్ధం చేయడం. గిరిజనులు, గ్రామస్తులను భీతావహులను చేయడం. దోచుకోవడం. అనుమానితులందరినీ ఒకచోట చేర్చి కంచెవేయడం. వంట వండుకోవడానికి వంటచెరకు కోసం ఎవరైనా వెళ్లాలంటే ఇంట్లో మగమనిషిని తమ క్యాంపుల్లో జామీన్దారుగా ఉంచుకోవడం! మహిళలు తిరిగివచ్చాకే ఇంటిమనిషిని వదలడం.. ఇత్యాదులు! గెరిల్లా పోరాటంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు గ్రామీణుల ద్వారా సమాచారం అందకుండా చేయడం, లేదా తప్పుడు సమాచారం ఇప్పించడం, దళాలను ఏకాకులను చేయడం. ఆనుపానులను తెలుసుకొని చుట్టుముట్టడం, మట్టుపెట్టడం.. దటీజ్ బ్రిగ్స్ ప్లాన్! తెలంగాణలో, కమ్యూనిస్ట్ల ప్రభావం ఉన్న ఆంధ్ర ప్రాంతంలో బ్రిగ్స్ ప్లాన్ మలేసియాను మరిపించేలా అమలైంది! కమ్యూనిస్ట్లకు నిజాం ప్రభుత్వంపై పోరాటం చేయడం నల్లేరుపై నడకలా సాగింది. భారత ప్రభుత్వంపై పోరాటం కత్తుల వంతెనపై విన్యాసమే అవుతోంది! నిషేధం విధించిన మూడు రోజుల్లోనే కమ్యూనిస్ట్లు మెరికల్లాంటి తమ యోధులు రెండు వందల మందిని కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో రణదివే నాయకత్వంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ వారిని పోరుబాట పట్టాల్సిందే అని ఆదేశించింది. క్రియాశీలురు మైదానప్రాంతం నుంచి అజ్ఞాతవాసం వెళ్లాలంది. తదనుగుణంగా కరీంనగర్ జిల్లాలోని గోదావ రి అటవీ ప్రాంతానికి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? మహానాయకుడు చండ్ర రాజేశ్వరరావుకే భద్రతలేని పరిస్థితుల్లో!! పార్టీ శ్రేణులు విచలితమయ్యాయి! ఇంగ్లండ్ కాంటాక్ట్తో క్రెమ్లిన్కు కబురు! సాయుధపోరాటాన్ని కొనసాగించడమా? విరమించడమా? పార్టీపై ఒత్తిడి పెరిగింది. నాయకత్వం తర్జనభర్జనలు పడింది. ఎటూ పాలు పోలేదు. అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీకి యునెటైడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అధినేత జె.వి. స్టాలిన్ నాయకుడు. అన్ని దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు క్రెమ్లిన్లోని ప్రధాన కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను సూచనలను పాటిస్తాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ తమ సమస్యను చర్చించేందుకు స్టాలిన్తో భేటీని కోరింది. ఒక ప్రతినిధి బృందం మాస్కోకు వచ్చి స్టాలిన్ను సంప్రదించాల్సిందిగా సూచన అందింది! 1951లో నలుగురు సభ్యుల బృందం మాస్కో బయలు దేరింది! శ్రీపాద అమృత్ డాంగే, అజయ్ ఘోష్, చండ్ర రాజేశ్వరరావు-బసవపున్నయ్య ఈ బృందంలో సభ్యులు. మొదటి ఇరువురూ సాయుధ పోరాటవిరమణకు అనుకూలురు. మిగిలిన ఇరువురూ విరమణకు అనుకూలురు కాదు, అలాగని కొనసాగించాలని కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఆరు నెలుగా అనేక సమావేశాలు.. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంలోని నలుగురూ మాస్కో చేరారు. తెలంగాణ సాయుధపోరాటం కొనసాగింపునకు అనుకూల వ్యతిరేక వర్గాల వారి వాదనల ఇంగ్లిష్ డాక్యుమెంట్లు రష్యన్ భాషలోకి అనువాదమయ్యాయి. వాటి ప్రాతిపదికగా అక్కడి నాయకులతో శ్రేణుల వారీగా చాలా చాలా సమావేశాల్లో పాల్గొన్నారు. ఆరు నెలలు గడిచాయి. చివరకు క్రెమ్లిన్లో స్టాలిన్ను కలిశారు. ఆ రోజు 1951 ఫిబ్రవరి 9. మొలతోవ్-మలెకోవ్-సుజ్లోవ్లూ ఆ సమావేశంలో పాల్గొన్నారు. స్టాలిన్ రష్యన్లో మాట్లాడుతున్నారు. ప్రతినిధి బృందం ఇంగ్లిష్లో మాట్లాడుతోంది. ప్రతి ప్రదమూ ఆచి తూచి ! నిపుణులు దుబాసీలుగా వ్యవహరిస్తున్నారు. మూడు ప్రశ్నలు! తెలంగాణలో సాయుధ పోరాటం జరుగుతున్న ప్రాంతపు మ్యాప్ను స్టాలిన్ సహాయకులను అడిగారు. భారతదేశపు చిత్రపటం, దక్షిణ భారతదేశపు సవివర చిత్రపటాలు ఆయన విశాలమైన మేజా బల్లైపై క్షణాల్లో పరిచారు. స్టాలిన్ తన పైపును పొగాకుతో నింపి.. వెలిగించాడు. ఇలా అడిగాడు ... ‘మీరు సాయుధపోరాటం చేస్తోన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆనుకుని లేదా దగ్గరగా ఏదైనా విదేశం ఉన్నదా?’ ‘లేదు’ ‘మీరు తప్పించుకునేందుకు ఏదైనా ఒక నౌకాశ్రయం ఉన్నదా?’ ‘లేదు’ ‘మీరు ఆశ్రయం పొందేందుకు ఏదైనా రక్షిత స్థలం ఉందా?’ ‘లేదు’ స్టాలిన్ పైపును ఛాతీ అట్టడుగు పొరల్లోకి పీల్చాడు. టేబుల్పై మ్యాప్లను పక్కకు నెట్టేశాడు. పొగను వదుల్తూ అన్నాడు... ‘ ఈ పరిస్థితుల్లో మీరు ప్రతిబంధకాలను ఎదుర్కోవడం, పోరాటం చేయడం కష్టమే ’ అన్నారు! అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నేత స్టాలిన్ అభిప్రాయం మేరకు భారతదేశంలో పార్టీ తన విధానాన్ని సవరించుకుంది. ఈ నిర్ణయం వచ్చేసరికి భారత ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీని భౌతికంగా ఉండచుట్టింది! ఆ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసింది! అలా తెలంగాణ సాయుధపోరాటం ముగిసింది! ప్రజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
న్యూ ఎరైవల్స్
వయ్యారి భామలు హంస నడకలతో అందంలో పోటీపడ్డారు. అచ్చతెలుగు సంప్రదాయంలో సిరులొలికించారు. పట్టు చీరలు సింగారించుకుని... మెరిసి మురిపించారు. సిల్వర్ జూబ్లీ సందర్భంలో సోమాజిగూడ కళానికేతన్లో శనివారం లేటెస్ట్ కలెక్షన్ను ఆవిష్కరించారు. మహిళలకే కాదు... మగవారికీ నప్పేలా విభిన్న డ్రెస్సింగ్స్ను ఈ సందర్భంగా పరిచయం చేశారు. నగరంలోని టాప్ మోడల్స్ ఈ కలెక్షన్స్లో జిగేల్మన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లు కూడా ఆవిష్కరించారు. వీటిల్లో కూడా ఈ నయా వెరైటీలను అందుబాటులో ఉంచుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. - సాక్షి, సిటీ ప్లస్ -
అద్వితీయం
‘గ్రీన్ గ్రోత్’... ఈ థీమ్తో కేరళ త్రిసూర్లో జరిగిన విబ్జియార్ అంతర్జాతీయ డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆబాలగోపాలాన్నీ అలరించింది. ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించిన ఈ పండగలో ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలింస్కు గాడ్ఫాదర్ ఆనంద్ పట్వర్దన్తో పాటు అనేకమంది దేశవిదేశ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన అస్మితా ఫౌండేషన్ ప్రదర్శించిన ‘అహల్య’ నృత్యరూపకం ఫెస్టివల్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అహల్య అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ రూపకం నలభై నిమిషాల పాటు ఆహూతులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది. అహల్య చుట్టూ ఉన్న నాటి పరిస్థితులను నేటితరం స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో పోల్చుతూ వినిపించిన వాయిస్ ఓవర్ ఆలోచనాత్మకంగా ఉంది. వసంత కన్నభిరన్ రాసిన ఈ బ్యాలేకు రాజేశ్వరీ సాయినాథ్, ఆమె కుమార్తె వైష్ణవి బృందం చేసిన నాట్యానికి ముగ్ధులైన ఆహూతులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. లాభాపేక్ష లేకుండా, సామాజిక బాధ్యతగా చేపట్టిన ఇలాంటి ఫెస్టివల్స్ ప్రతి రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉందని, ఇది ఓ మంచి పరిణామమని నగరం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన షార్ట్ ఫిలిం మేకర్ నవీన్రెడ్డి చింతల, రెయిన్బో ఆర్జే మహ్మద్ అబ్దుల్ నయీం అభిప్రాయపడ్డారు. - ఓ మధు -
మాక్ టెయిల్స్
ఎండాకాలం వచ్చేసింది. సాలిడ్ స్పైసెస్కి గుడ్బై చెప్పి.. ఠండా డ్రింక్స్కు వెల్కమ్ చెప్పాల్సిన టైమ్. ఇక డాక్టర్స్ రిఫరెన్స్ కూడా ఎక్కువ నీళ్లతో పాటు, కోకోనట్ వాటర్కే. మరి రోజంతా వర్క్ చేసి కేవలం కొబ్బరి నీళ్లకే పరిమితం అయితే ఎలా..! అందుకే ఎనర్జీ డ్రింక్స్ను ఆఫర్ చేస్తున్నాయి రెస్టారెట్స్, జ్యూస్స్టాల్స్. ఆరోగ్యంగా ఉంచే సమ్మర్ మాక్టైల్స్ను అందిస్తున్నాయి. రెస్టారెంట్కు వెళ్లలేనివాళ్లు ఇంట్లో కూడా తయారు చేసుకోగలిగే సింపుల్ డ్రింక్స్ని మనకు పరిచయం చేస్తున్నారు అమీర్పేట్ ఆదిత్య పార్క్’ ఫుడ్ అండ్ బెవరేజెస్ మేనేజర్ అమితేష్ కుమార్. అవేమిటో ఓ లుక్కేయండి! - సిరి డ్రూలింగ్ గోవా సీజనల్ ఫ్రూట్ అయిన జామపండుకు, ఎనర్జీని పెంచే నిమ్మరసాన్ని జోడించి, అల్లం, కొత్తిమీర, చాట్మసాలా, బ్లాక్సాల్ట్ బ్లెండ్ చేసిన ఈ డ్రింక్కు కాస్త ఐస్ యాడ్ చేసుకుని లాగించేయొచ్చు. ఇంటినుంచి బయటికి వెళ్లేముందో, బయటినుంచి ఇంటికొచ్చాకో ఒక్క గ్లాస్ తాగితే అలసట, నీరసం ఇట్టే మాయమవుతాయి. సిల్లీ సర్ప్రైజ్ ఈకాలంలో ఫ్రెష్గా దొరికే స్ట్రాబెరీకి నిమ్మరసం, నారింజగుజ్జును కలిపి బెండ్ చేసి... కొన్ని ఐస్ముక్కలు కలుపుకుని టేస్ట్ చేయండి. ఎంత నీరసంగా ఉన్నా సరే రెండు నిమిషాల్లో రిఫ్రెష్ అయిపోతారు. అంతేకాదు... ఇంటికి వచ్చే గెస్ట్లకు చల్లచల్లగా ఈ సిల్లీ సర్ప్రైజ్ని అందిస్తే... నిజ ంగానే సర్ప్రైజ్ అయిపోతారు. స్క్వేర్ కట్ ఆల్టైమ్ ఫేవరేట్ ఆపిల్ పండ్లకు పుచ్చపండు ముక్కలు, షుగర్ సిరప్, నిమ్మరసం, పుదీనా ఆకులు, కాస్త సోడాని మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. టేస్టీగా ఉండే ఈ డ్రింక్ హెల్దీ కూడా. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇస్తే... ఇష్టంగా లాగించేస్తారు. సో లెట్స్ ట్రై! -
అమ్మ చేసిన ద్రోహం
ఈ బేటీకి సంబంధించిన ఈ సంఘటన ఇటీవల మేడ్చల్లో జరిగింది. సంతోషికి పద్నాలుగేళ్లు! చక్కని చుక్క. తనకు ఊహ తెలిసినప్పటినుంచే తండ్రిని చూడలేదు. వానాకాలం చదువు. కొన్నాళ్ల కిందట హఠాత్తుగా ఆమెకు ఓ వ్యక్తిని తండ్రిగా పరిచయం చేసింది సంతోషి తల్లి. అందుకు తగ్గట్టే ఇంటి బాధ్యతను తీసుకోవడం, సంతోషి స్కూల్ ఫీజు కట్టడం, తల్లిని, తనను అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లడం.. ఇవన్నీ ఆ పిల్లను చాలా సంతోషపెట్టాయి. అన్నిటికన్నా తండ్రి అనే భావన సంతోషిని బాగా ఆనందపెట్టింది. రోజులన్నీ అలా గడిచిపోతే.. ఈ రోజు బేటీ బచావోలో సంతోషి చర్చకు వచ్చి ఉండేది కాదు! ఏం జరిగింది.. ‘అమ్మ గుర్తొస్తుంది.. అమ్మను చూడాలి’ అని ఏడుస్తున్న పద్నాలుగేళ్ల అమాయకత్వం ఓ బిడ్డకు తల్లి అయింది. విస్మయం! పుట్టిన బిడ్డకు తండ్రి సంతోషికి తండ్రిగా వాళ్లింట్లోకి వచ్చిన వ్యక్తే! మనసు వికలమై, ఒళ్లు గగుర్పొడిచే విషయం ఏంటంటే.. సంతోషి అలా తల్లి అయ్యే పరిస్థితికి నెట్టిన మనిషి వేరే ఎవరో కాదు సొంత తల్లే! తేరుకొని నిజంలోకి వస్తే.. సంతోషి రెండు నెలల కిందట ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది. మగబిడ్డ పుట్టాడు. అనారోగ్యంగా. ప్రస్తుతం నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. డెలివరీ అయ్యాక, సంతోషి ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక ఆ అమ్మాయిని కస్తూర్బాగాంధీ ఆశ్రమంలో చేర్పించారు. తన ఈ దుస్థితికి తల్లే కారణమన్న విషయం ఇప్పటికీ పాపం.. ఆ పాపకు తెలియదు. అందుకే అమ్మ దగ్గరికి వెళ్లాలి అని ఏడుస్తోంది. ఈ అమ్మాయి మానసికంగా కాస్త కోలుకున్నాక.. కౌన్సిలింగ్ చేసి స్కూల్లో చేర్పించాలనేది ఆశ్రమం వాళ్ల ఆలోచన. పుట్టిన బిడ్డ బతకడం కష్టమని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవేళ బతికితే శిశువిహార్లో చేర్పిస్తారు. తల్లి, ఆమె పరిచయం చేసిన తండ్రి జైల్లో ఉన్నారు. ఆ ఇద్దరు జైల్లో అనుభవించే శిక్షకన్నా సంతోషి అనుభవిస్తున్న వేదనే ఎక్కువ. ఆ అమ్మాయి ఏం పాపం చేసిందని ఈ శిక్ష? సొంత తల్లిని కూడా నమ్మకుండా ఏ బిడ్డ అయినా ఎలా ఉంటుంది? భద్రత కల్పించాల్సిన ఆమె ఒడి, రక్షణ కవచంలా మారాల్సిన ఆమె పరిష్వంగమే బిడ్డనుభక్షిస్తే ఎలా? ఇప్పుడు ఇలాంటి బిడ్డలకు అండగా నిలబడాల్సింది మనమే! బయట భద్రత ఉంది అనే భరోసా కల్పిద్దాం! మన మగపిల్లలకు అమ్మాయిలను గౌరవించే సంస్కారాన్ని ఉగ్గుపాలతో పడదాం! (పేరు మార్చాం) -
నిజాం స్పెషల్... పొగబండి
1874 అక్టోబరు 9... అక్కడో జాతర జరుగుతున్నంత హడావుడి ఉంది. నగరంలోనే ప్రముఖులుగా చెప్పుకొనేవారంతా అక్కడే ఉన్నారు. దూరంగా సాధారణ జనం గుమిగూడారు. దేనికోసమో ఎదురు చూస్తున్నారు.. వారిలో ఒకటే ఉత్సాహం. ఇంతలో దూరంగా గుప్పుమంటూ పొగ కనిపించింది. అంతే చప్పట్లు, ఈలల తో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. అతిథి రంగ ప్రవేశం. ఎంతో ఆశ్చర్యంగా అంతా అటువైపు ఎగాదిగా చూస్తూ సంభ్రమాశ్చర్యాలలో మునిపోయారు. ఆ వచ్చిన అతిథి రైలు! భాగ్యనగరం తొలిసారిగా రైలును చూసి మురిసిపోయిన రోజది. సికింద్రాబాద్ - వాడీ మధ్య నడిచే ఆ రైలే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమైన తొలి రైలు. అదే రోజు సికింద్రాబాద్ స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా బ్రిటిష్ ఇండియా రైల్వే సంస్థ రైల్వే వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటే దానికి భిన్నంగా సొంతంగా రైల్వేను ఏర్పాటు చేసిన ఘనత హైదరాబాద్కే దక్కింది. హైదరాబాద్ స్టేట్ను భారత్లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించాలన్న ఉద్దేశంతో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ హయాంలో 1870లో ప్రస్తుత తెలంగాణలో రైలుమార్గం నిర్మించాలనే ఆలోచన మొగ్గ తొడిగింది. వాడీ నుంచి తొలి లైన్ను సికింద్రాబాద్ వరకు నిర్మించి 1874న స్టేషన్ భవనాన్ని సిద్ధం చేశారు. హైదరాబాద్ స్టేట్ భారత్లో అంతర్భాగం కాదనే భావనను నరనరానా జీర్ణించుకున్న నిజాం... బ్రిటిష్ ఇండియా రైల్వే వ్యవస్థను దరి చేరనీయలేదు. 1870ల్లో నిజామ్స్ స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. 1879లో ‘ది నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే’గా మారింది. ఇది 1950 వరకు కొనసాగింది. చివరకు 1951లో జాతీయమై భారత రైల్వేలో విలీనమైంది. దీనికి అనుబంధ కంపెనీగా 1898లో హైదరాబాద్-గోదావరి వ్యాలీ రైల్వేను కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి 235 కిలోమీటర్ల మేర లైన్ను నిర్మించి 1881లో సింగరేణి కాలరీస్ కంపెనీతో అనుసంధానించారు. 1889లో ఆ లైన్ను విజయవాడ వరకు పొడిగించారు. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టు (లైన్ నిర్మాణం) నిర్మాణానికి దశాబ్దాల సమయం పడుతుంటే... నిజాం మాత్రం 230 కి.మీ. మేర ట్రాక్, సికింద్రాబాద్ స్టేషన్ భవనాన్ని కేవలం నాలుగేళ్ల కాలంలో నిర్మించి రైలును ప్రారంభింపచేశారు. సరుకు రవాణా కోసం నిజాం ప్రత్యేకంగా 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్ను నిర్మించారు. ఇక్కడికి అప్పట్లో కేవలం గూడ్సు రైళ్లు మాత్రమే వచ్చేవి. 1921లో తొలి ప్యాసింజర్ రైలు ఆ స్టేషన్కు వచ్చి సాధారణ ప్రయాణికుల చేరవేత మొదలుపెట్టింది. దీనికి అదనంగా కాచిగూడ రైల్వేస్టేషన్ను 1916లో నిర్మించారు. 1904 నాటికి ఈ రైల్వే మూలధన వ్యయం రూ.4.3 కోట్లు. ఆ సంవత్సరంలో 28 లక్షల నికర ఆదాయాన్ని పొందటం విశేషం. హైదరాబాద్-గోదావరి వ్యాలీ రైల్వే రూ.7.8 లక్షల ఆదాయాన్ని పొందింది. స్వరూపం ఇలా... అత్రఫ్-ఇ-బల్దా జిల్లా (హైదరాబాద్) పరిధిలో 98 మైళ్ల లైన్ ఉండేది. దీని పరిధిలో ఏడు స్టేషన్లు నిర్మించారు. మెదక్ జిల్లా పరిధిలో 22 మైళ్లు, నిజామాబాద్ పరిధిలో 80 మైళ్లు, 10 స్టేషన్లు, నాందెడ్ జిల్లాలో 40 మైళ్లు, 6 స్టేషన్లు, పర్బణి పరిధిలో 63 మైళ్లు, 9 స్టేషన్లు, ఔరంగాబాద్ పరిధిలో 96 మైళ్లు, 11 స్టేషన్లు నిర్మించారు. నిజాం రైల్వే... భారత రైల్వేలో విలీనం అయ్యాక సికింద్రాబాద్ కేంద్రాన్ని బొంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న నాటి సెంట్రల్ రైల్వేలో భాగం చేశారు. 1966లో దాన్ని విభజించి సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటు చేశారు. హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ (ఏపీ ఎక్స్ప్రెస్) దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీన్ని 1976లో ప్రారంభించారు. 1677 కి.మీ. దూరాన్ని ప్రస్తుతం ఇది 26.30 గంటల వ్యవధిలో చేరుకుంటోంది. సగటు వేగం 64 కి.మీ. సికింద్రాబాద్ జంక్షన్ మీదుగా నిత్యం 210 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. గౌరీభట్ల నరసింహమూర్తి -
సిటీలో పట్టాభిరాముడు
నిజాం పాలకుల మతసామరస్యానికి ప్రతీక సీతారాంబాగ్ దేవాలయం. మల్లేపల్లి నుంచి ఆసిఫ్నగర్కు వెళ్లే దారిలో ఉన్న సీతారాంబాగ్ దేవాలయం జంటనగరాల్లోని హిందూ దేవాలయాల్లోనే అతి పురాతమైనది. పండుగ వచ్చిందంటే భక్తులకు కిక్కిరిసే ప్రస్తుత ఆలయాల్లా కాకుండా... ఆ కాలంలోనే సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ పురాతన దేవాలయం నేటికీ భక్తులను ఆకట్టుకుంటోంది... సీతారాంబాగ్ దేవాలయాన్ని నిర్మించిన కచ్చితమైన సంవత్సరం చరిత్రలో ఎక్కడా లేదు. మూడో, నాల్గో నిజామ్ల పరిపాలనా కాలం(1803-1857)లో ఈ సీతారాముల దేవాలయం నిర్మించి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. నిజాంకాలంలో ప్రముఖ మార్వాడీ వ్యాపారి పురానమాల్ గెనేరివాలా ఈ దేవాలయాన్ని నిర్మించారని, తర్వాత ఆయన కుమారులు దేవాలయ అభివృద్ధి, పరిరక్షణ బాధ్యతలు చేపట్టారని చెబుతారు. ఆలయ జాగీర్... దేవాలయం చుట్టూతా ఎత్తై ప్రాకారం... కోట గోడలను తలపింపజేస్తుంది. జైపూర్ పాలరాతితో తయారు చేయించిన సీతారాముల విగ్రహాలు ఈ దేవాలయంలో ప్రతిష్టించారు. అలాగే వరదరాజస్వామి దేవాలయం కూడా ఇక్కడ కొలువై ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తగిన సత్రపు గదులు, అర్చక స్వాముల కోసం ప్రత్యేక గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దేవాలయ ప్రాంగణపు గోడలు ఎత్తై ప్రధాన ద్వారాలతో, యూరోపియన్ వాస్తు శైలిలో నిర్మించారు. ఆనాటి నిజాం ప్రభువులు కొందరు హిందూ దేవాలయాల అభివృద్ధికి కూడా తగిన సహాయం అందించారని చెబుతారు. నాల్గో నిజాం ప్రభువు నవాబ్ నాసిర్-ఉద్-దౌలా సీతారాంబాగ్ దేవాలయ అభివృద్ధికి ఇతోదికంగా సహకరించారని, ఆలయ పరిరక్షణకు కొన్ని భూములు జాగీర్గా కూడా ప్రకటించారని చరిత్ర చెబుతోంది. పూదోటల నడుమ... 1908లో మూసీనది పరవళ్లు తొక్కినప్పుడు అంతేకాదు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరింత సెక్యులర్ భావాలతో నుదుట తిలకం దిద్దుకుని, హిందూ వస్త్రధారణతో ఆ నదీమ తల్లికి పట్టుచీర, హారతి సమర్పించారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అసఫ్జాహీ ప్రభువుల పరిపాలనా కాలంలో సుమారు 20 ఎకరాల్లో సీతారాంబాగ్ దేవాలయం చక్కని పూదోటల నడుమ నిర్మించారు. ఆనాడు తెలంగాణా ప్రాంతంలో విద్యా సంస్థలు అసలే లేవు. అలాంటి రోజుల్లోనే సీతారాంబాగ్ ఆలయ ప్రాంగణంలో సంస్కృత విద్యాశాలనొకొదాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఎందరికో ఉచిత విద్యాదానం చేశారు. ఇక్కడ ఖండవల్లి నర్సింహశాస్త్రి వ్యాకరణ పండితులుగా పనిచేశారు. దాశరధి, దివాకర్ల వెంకటావధాని వంటి పండితులు ఇక్కడి తరగతులకు హాజరయ్యారు. ఈ సంస్కృత పాఠశాలలో ఆ రోజుల్లోనే ‘అమరభారతి’ అనే లిఖిత మాస పత్రికను కూడా నిర్వహించారు. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు రవ్వా శ్రీహరి, కె.కె. రంగానాథాచార్యులు, ఎస్.వి.విశ్వనాథశర్మ, తదితరులు ఈ పాఠశాల విద్యార్థులే. పండితులకు పుట్టినిల్లుగా, ఎందరికో ఎన్నో విధాల సేవలందించిన పురాతన దేవాలయం నేటికీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. చక్కని గాథలు తెలిపే ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే! -
కాలక్షేపానికి... come to me
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ... అంతకుమించి యూత్ పెద్దగా కోరుకునేదేముంది? అయితే సిటీలో హ్యాంగవుట్ స్పాట్స్ రూపకర్తలు అంతకుమించే ఆఫర్ చేస్తున్నారు. వీటి వెల్లువ పుణ్యమా అని.. యువ గుసగుసల వేదికలు అంతకంతకూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. సిటీ యూత్ హృదయాలను దోచుకుంటున్న హ్యాంగవుట్ ట్రెండ్స్ ముచ్చట్లు... ..:: ఎస్.సత్యబాబు ఇరానీ క్యాంటీన్ల నుంచి ఇంటర్నేషనల్ కెఫెల దాకా సిటీ యూత్ సరదాలకు, ముచ్చట్లకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. కావేవీ ఎంజాయ్మెంట్కు అనర్హం అన్నట్టుగా.. ఎందెందు వెతికినా అందందు కాలక్షేపం దొరుకుతోంది. రోజురోజుకూ యువత ఆకాంక్షలు మారుతూండడంతో ముచ్చట్ల వేదికలు కూడా విభిన్న రకాలుగా ముస్తాబవుతున్నాయి. కాలేజ్ కుర్రకారు దగ్గర్నుంచి కార్పొరేట్ ఉద్యోగుల దాకా పలు రంగాల్లోని యువతను ‘కాలక్షేపానికి కమ్ టు మి’ అంటున్నాయి. హైఫై టు వైఫై.. పేలే జోకులు.. ఫెల్లున నవ్వులు.. ఛెల్లున హైఫైలు.. అంతలోనే వైఫైలోకి పయనాలు.. క్షణానికో రకంగా మారిపోయే యూత్ మూడ్స్కి అనుగుణమైన వాతావరణమే హ్యాంగవుట్ ప్లేస్కు ప్రధాన వనరు. ఆకర్షణీయమైన యాంబియన్స్కు ప్రథమ స్థానం ఇస్తున్న యువతీయువకులు ఫుడ్కి సెకండ్ప్లేస్, మ్యూజిక్కి థర్డ్ప్లేస్ ఇస్తున్నారు. ఈ మూడు అంశాల్లో సంతృప్తి చెందాక... అదనంగా అందేవాటిని పరిశీలిస్తున్నారు. యూత్ అభిరుచులను దృష్టిలో ఉంచుకుని యాంబియన్స్, ఫుడ్, మ్యూజిక్లను అద్భుతంగా మలుస్తున్న హ్యాంగవుట్స్ రూపకర్తలు అంతకుమించి అందిస్తున్న ఆకర్షణల్లో ఉచిత వైఫై ఫెసిలిటీ ప్రధానమైంది. నలుగురూ కలసి ముఖాముఖి ముచ్చటించుకోవడానికి మాత్రమే కాదు.. చాటింగ్లూ, వాట్సప్లూ, షేరింగ్లతో ఒంటరిగా గడపడానికి కూడా వైఫై అత్యవసరంగా మారింది. ఉచితంగా ఈ-సేవను అందిస్తున్న హ్యాంగవుట్ ప్లేసెస్కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి డిస్కౌంట్స్ కనీసం 15 శాతం నుంచి ఆపైన అందిస్తున్నారు. గ్రూప్స్ సంఖ్యను బట్టి కూడా ఈ ఆఫర్స్ను మరింత ఆకర్షణీయంగా మలుస్తున్నారు. తరచుగా యాంబియన్స్లో మార్పు చేర్పులు చేయడమే కాదు, వీటి విశేషాలను ఆన్లైన్ ద్వారా యూత్కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. వెల్కమ్ డ్రింక్స్ను ఫ్రీగా ఇచ్చే ప్లేస్లూ ఉన్నాయి. యూత్ చాయిస్లు... యూత్ని ఎట్రాక్ట్ చేయడంలో కాఫీడేలు, బరిస్తా, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ.. ఆల్టైమ్ పాపులర్. బంజారాహిల్స్లోని జీవీకే మాల్లో ఉన్న హార్డ్ రాక్ కెఫె... ఇప్పుడు సిటీ కుర్రాళ్లకు హార్ట్బీట్. అలాగే జూబ్లీహిల్స్లోని రోడ్ నంబర్ 45లో హార్ట్ కప్ కెఫె.. మ్యూజిక్, ఫుడ్తో ఎప్పుడూ యువ సందోహంతో నిండి ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో క్రీమ్ స్టోన్ ఐస్క్రీమ్ పార్లర్.. సమయం సందర్భం లేకుండా పార్టీలు, విందు వినోదాలతో సందడిగా కనిపిస్తుంటుంది. ‘క్రీమ్ స్టోన్లో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతుండడం ఈ ప్లేస్కి ఉన్న క్రేజ్కు నిదర్శనం’ అంటారు ఫుడీ సంకల్ప్. మాదాపూర్లో లేటెస్ట్గా ప్రారంభమైన సిగుస్తా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92లో జస్ట్ లాంచ్ అయిన స్టార్ బక్స్ లకూ యూత్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే మరో ఐదు రెస్టారెంట్స్ ఓపెన్ కానున్నాయి. హ్యాపీ హ్యాంగవుట్స్ ప్రస్తుతం యువాదరణ పొందుతున్న ఖరీదైన ముచ్చట్ల వేదికల గురించి చెప్పాలంటే.. కేబీఆర్ పార్క్ రోడ్లో ఉన్న క్రేవ్ ఒకటి. సుందర ఉద్యానవనం సమీపంలో ఉండే ఈ హ్యాంగవుట్ ప్లేస్కు వైట్ ఇంటీరియర్స్ స్పెషల్ ఎట్రాక్షన్. అలాగే లేట్నైట్ చిల్ అవుట్కి పేరొందిన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని వ్యూ లాంజ్లో వెరైటీ మాక్టైల్స్ యువత చవులూరిస్తాయి. హైటెక్ సిటీలోని చార్కోల్ యూత్ మెచ్చే బార్బెక్యూ ఫుడ్కి కేరాఫ్. కార్పొరేట్ ఉద్యోగులు పని అనంతరం సేదతీరేందుకు ఎంచుకునే ప్లేస్ ఇది. వింటర్ సీజన్లో చలిమంట (బోన్ ఫైర్) సెటప్తో సహా యువతను ఉర్రూతలూగించే ఆకర్షణలతో.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ది బ్యాక్ యార్డ్ ఆకట్టుకుంటుంది. చుట్టూ పచ్చదనం, లాంతర్ల అమరికతో... వెరైటీ లుక్ దీని స్పెషాలిటీ. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ది లాస్ట్ సొసైటీ సౌకర్యవంతమైన సిట్టింగ్కు, లైటింగ్కు చిరునామా. ఎత్తయిన భవనాల మధ్య ఠీవిగా నిలిచి ఆహ్వానిస్తుంది. వరండా దీనిలో ప్రత్యేక ఆకర్షణ. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37లో విలాసవంతంగా, ఖరీదుగా కనిపించే ఎయిర్లాంజ్ మరో బెస్ట్ ప్లేస్. లెక్కలేనన్ని పాస్తాలకు ఒక్కచోటే అంటూ లొట్టలేస్తారు యూత్. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోనే ఉన్న ‘ది పాస్టా బార్ వెనెటొ’ కూడా ఫేవరేట్ స్పాట్గా మారింది. ఇలా రకరకాల హ్యాంగవుట్ హబ్లు నగర యువతను సేదతీరుస్తున్నాయి. -
మణులొద్దు.. మాన్యాలొద్దు..
యావత్ భారతదేశంలోనే వయోలిన్కు పర్యాయపదంగా నిలిచిన మహామహోపాధ్యాయుడు ద్వారం వెంకటస్వామి నాయుడు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, వయోలిన్పై స్వర విన్యాసాలను సాధన చేసిన మంగతాయారు ఎనిమిది పదుల వయసులోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. వంశీ సంగీత అకాడమీ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా మంగళవారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో తన వయోలిన్ కచేరీతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ఆ వాద్య శిఖామణిని ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ..:: త్రిగుళ్ల నాగరాజు వయోలిన్ వాద్య విన్యాసంలో మేరునగధీరుడు మా నాన్నగారు. బ్రహ్మ సృష్టికారుడైతే.. నాదాన్ని సృష్టించింది సరస్వతీదేవి. ఆ అమ్మవారు సృజించిన నాద విలాసాన్ని భువిపై నలుచెరగులా వ్యాప్తి చేసిన కారణజన్ములలో మా నాన్నగారు ఒకరని నేను విశ్వసిస్తాను. విదేశీ వాద్య పరికరమైన వయోలిన్ను వాగ్దేవి ఒడిలో అలంకరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పుంభావ సరస్వతి. ఎందరో శిష్యులను ఆదరించి, విద్వాంసులుగా తీర్చిదిద్ది, వయోలిన్ను భారత వాద్య సంపదలో ఓ భాగంగా మార్చేశారాయన. అలాంటి మహానుభావుడి వారసురాలుగా పుట్టడంనా పూర్వ జన్మ సుకృతం. మహామహుల సరసన.. నా బాల్యమంతా విజయనగరంలోనే సాగింది. నాన్నగారి శిష్యురాలిగా చిన్నతనంలోనే వయోలిన్ నేర్చుకోగలిగాను. విజయనగరంలోని సంగీత కళాశాలలో డిప్లొమా చేశాను. అంతేకాదు కొన్నాళ్లు నేను సంగీతం నేర్చుకున్న కళాశాలలోనే అధ్యాపకురాలిగా కూడా పనిచేశాను. మా కుటుంబం మద్రాస్కు వెళ్లిన తర్వాత ప్రభుత్వ స్కాలర్షిప్తో సంగీతంలో డిగ్రీ చేశాను. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్-ఏ కళాకారిణిగా సెలెక్టయ్యాను. 16 ఏళ్ల పాటు ఆకాశవాణిలో నా వాద్య స్రవంతి కొనసాగింది. అదే సమయంలో ఎన్నో కచేరీల్లో పాల్గొన్నాను. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, వేదవల్లి, ఎమ్మెల్ వసంతకుమారి వంటి గానశారదల కచేరీల్లో వాద్య సహకారం అందించడం మరచిపోలేని అనుభూతి. నా జీవితాన్ని కళకే అంకితం చేశాను. వయోలిన్లో లీనమై వివాహం సంగతే మరచిపోయాను. ఒక గురువుగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దాను. నేడు ఇండియాతో పాటు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోనూ నా శిష్యులు పాఠశాలలు స్థాపించి మరీ కళాసేవ చేస్తున్నారు. ఒక గురువుగా అంతకంటే ఏం కావాలి. ప్రభుత్వం బాధ్యత.. పూర్వం రోజుల్లో కళాకారులను ఆదుకోవడానికి మహారాజులు ఉండేవారు. నేడు రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు.. ప్రభుత్వాలు, ప్రజాపాలకులు వచ్చారు. కళాకారులకు మాత్రం సరైన పోషణ కరువైందనే చెప్పాలి. అప్పుడు ఇచ్చినట్టు మణులు, మాన్యాలు అవసరం లేదు.. కళనే సర్వసంగా భావించి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులకు పోషించడం ప్రభుత్వం కనీస బాధ్యత. నాదసాధకులకు ప్రోత్సాహం మాట అటుంచండి, పోషణ అందిస్తే అదే పదివేలు. కళాకారులు తృప్తిగా ఉంటేనే దేశం, కాలం సుభిక్షంగా ఉంటాయి. ఆయా కళాకారుల ప్రదర్శనలను సీడీలుగా రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసి, వాటిపై వచ్చిన మొత్తాన్ని వారికి అందజేస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారు. గురువులదే బాధ్యత.. జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహానుభావులకు ఆలవాలంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో నాకీ సత్కారం చేయడం మరింత ఆనందాన్నిచ్చింది. నేటి తరంలో సంగీతం, నాట్యం నేర్చుకోవాలనే జిజ్ఞాస కనిపిస్తోంది. దాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప వేదం, నాట్యం, సంగీతం, చిత్రలేఖనం.. వంటి కళల్లో ప్రవేశం పొందలేరు. మీకు లభించిన వరం నిష్ఫలం కాకూడదంటే కళను ఆరాధించాలి. భక్తి, శ్రద్ధలతో సాధన చేయాలి. ఈ రెండూ లేనివాళ్లు.. సంగీతంలోనే కాదు ఏ రంగంలో ఉన్నా రాణించలేరు. గురువుల కృపను పొందడం అంటే .. వారికి సుశ్రూష చేసి విజ్ఞానాన్ని సముపార్జించడం ఒకటే కాదు, వారు చూపిన బాటలోనడవగలగాలి. వారు నేర్పిన విద్యల్లోని అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించగలగాలి. అప్పుడే గురువును మించిన శిష్యులని అనిపించుకోగలరు. -
రికెట్ ప్రపంచ కప్
భారత్లో క్రికెట్ ప్రపంచ కప్ కంటే పెద్ద పండగ ఉండదేమో! నాలుగేళ్లకోసారి వచ్చే ఈ నలభై ఐదు రోజుల సంబరాలు ఈసారి తారస్థాయికి చేరాయి. అందుకు కారణాలూ లేకపోలేదు... చాంపియన్లుగా టీమ్ ఇండియా బరిలోకి దిగడం... ఆరంభంలోనే హై ఓల్టేజ్ మ్యాచ్లో పాక్పై ఘన విజయం సాధించడం. మరి ఇంత టెంపో ఉంటే మార్కెట్ జనులు ఊరుకుంటారా? దీన్ని క్యాష్ చేసుకొనేందుకు అన్ని రకాల అస్త్రాలూ అభిమానుల పైకి సంధిస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్, మెగామాల్స్, స్మాల్ షాప్స్... అది ఇదని తేడా లేకుండా అంగడి ఏదైనా వరల్డ్ కప్ థీమ్తో ఆఫర్లు అదరగొడుతున్నారు. కాఫీ కప్పుల నుంచి క్యాప్ల వరకు అన్నీ క్రికెట్ మయం చేసి అమ్మేస్తున్నారు. ఇక ప్రపంచ కప్ నిర్వహిస్తున్న ఐసీసీ కూడా తన వెబ్సైట్ ద్వారా ఇదే కాన్సెప్ట్తో వెరైటీస్ను విక్రయిస్తోంది. ఈ ట్రెండీ ఐటెమ్స్పై ఓ లుక్కేద్దాం... ..:: హనుమా -
కిలో బియ్యం.. రూ. 2,200!
రూపాయికే కిలో బియ్యం సంగతి తెలుసు. కాని కిలో రూ.2,200కు దొరికే బియ్యం గురించి విన్నారా? పాతిక రూపాయలకు దొరికే కోలాల గురించి తెలుసు.. రూ.8 వేలు పలికే సాఫ్ట్ డ్రింక్ గురించి తెలుసా? పదో ఇరవయ్యో పెడితే పొట్ట నింపేసే రొట్టెముక్కలు చూసే ఉంటారు. కానీ రూ.300 ఖర్చు చేయించే బ్రెడ్ గురించి విన్నారా? పర్స్ వీకైనా.. స్ట్రాంగ్ బాడీ కావాలనుకునే నగరవాసులు.. డైట్ సప్లిమెంట్స్కు ‘రైట్ రైట్’ అంటున్నారు. దీంతో ఒకప్పుడు బాడీబిల్డర్లను మాత్రమే దృష్టిలో పెట్టుకున్న ఈ ఉత్పత్తులు ఇప్పుడు సిటీలో ఫిట్నెస్ ఫీవర్ని, ‘ప్యాక్’ ఇష్టులనూ టార్గెట్ చేస్తున్నాయి. - ఎస్.సత్యబాబు వ్యక్తి బాడీ వెయిట్లో ప్రతి కిలోకూ అవసరమైన 1.2 కి.గ్రాల ప్రొటీన్ రెగ్యులర్ ఫుడ్ ద్వారా అందకపోతే, దేహానికి అత్యంత అవసరమైన ఒమెగా 2, ఒమెగా 6 ఫ్యాట్స్ ఆహారం ద్వారా లభించకపోతే.. ఉదయపు ఎండ అందించే డి విటమిన్ సరిపడా దక్కకపోతే... సప్లిమెంట్ తప్పదు. విటమిన్లు, పోషక లోపాలను వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్స్తో భర్తీ చేసుకోవడం సహజమైన విషయమే. అయితే షేప్ కోసం సప్లిమెంట్స్ అనేది లేటెస్ట్ ట్రెండ్. సప్లిమెంట్.. గిఫ్ట్ ‘ప్యాక్’ సిక్స్ప్యాక్ కోరుకున్నవాళ్లు తినే అన్నం, తాగే నీళ్లు సైతం నియంత్రించుకుంటున్నారు. దీంతో పోషక లోపాల భర్తీకి సప్లిమెంట్స్ తప్పడం లేదు. సాధారణ రీతిలో అయితే దాదాపు 6 నెలలు పట్టే శారీరక సామర్థ్యాన్ని వారంలోనే సంతరించుకోవడానికి వీటిపై ఆధారపడుతున్నారు. వ్యక్తికి 50 గ్రాముల ప్రొటీన్ సమకూరాలంటే కనీసం 200-300 కి.గ్రా. బాయిల్డ్ చికెన్ తినాలి. దీని కన్నా సప్లిమెంట్స్ వాడకమే తేలికని ‘ప్యాక్’ ప్రియులు భావిస్తున్నారు. ఇవి చాక్లెట్, స్ట్రాబెర్రీ, వె నీలా తదితర ఫ్లేవర్స్తో రుచికరంగా దొరుకుతున్నాయి కూడా. సాధనానంతరం ప్యాక్-పోషణలో కూడా సప్లిమెంట్స్ అవసరమే. మితిమీరితే...అనర్థాలే... ఈ ఆహార ప్రత్యామ్నాయాలు శరవేగంగా శక్తిని అందించినా, అలవాటైతే వదలడం అంత తేలికకాదని వైద్యులు అంటున్నారు. పరిమితికి మించిన వినియోగం హార్మోన్ల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. కొవ్వును కరిగించే ఫ్యాట్ బర్నర్స్ను అధిక మోతాదులో వాడడం ప్రమాదకరం. వైద్య, నిపుణుల పర్యవేక్షణలో, ఉత్పత్తుల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పరిమిత స్థాయిలో వినియోగించాలని సూచిస్తున్నారు. కాస్ట్లీ ‘ప్యాక్స్’... ఆస్ట్రేలియాకు చెందిన ఎక్స్క్లూజివ్ ప్రొటీన్ రైస్ క్వినోరైస్ కిలో రూ.1800. అదే ఆర్గానిక్ అయితే రూ.2200. రోజుకి 100 గ్రాములు సరిపోతుందట. ఓట్స్లా ఉండే పుష్కుష్ కిలో రూ.600 పలుకుతోంది. 20 రోజులు సరిపోయే ప్యూర్ ప్రొటీన్ టిన్ ఒక్కోటి రూ.8000 దాకా, హోల్ గ్రెయిన్స్ బ్రౌన్ బ్రెడ్ రూ.300 ధరల్లో లభిస్తున్నాయి. కూల్డ్రింక్లా అనిపించే ప్రీ-వర్కవుట్ డ్రింక్ నైట్రిక్ ఆక్సైడ్ టిన్ రూ.4,000. పౌడర్ రూపంలోని క్రియేటిన్ ఎనర్జీ లెవల్స్ని శరవేగంగా పెంచుతుంది. ఇవేకాక మాస్ గెయినర్స్, వెయిట్ గెయినర్స్ కూడా లభిస్తున్నాయి. కొన్ని మాల్స్, బేకరీల్లో వెల్నెస్ స్టోర్స్లలోనే ఈ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. జిమ్లు, ఫిట్నెస్ స్టూడియోస్, స్పాలకు సప్లయర్లే సరఫరా చేస్తుంటే, బంజారాహిల్స్, పంజగుట్ట, అబిడ్స్ ప్రాంతాల్లో ప్రత్యేక స్టోర్స్ వెలిశాయి. వీ షేప్, సిక్స్ప్యాక్ వంటి ప్రత్యేక లక్ష్యాలతో హెవీ వర్కవుట్స్ చేసేవారికి ఇవి అవసరమవుతాయంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్. వీటి వాడకానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరని చెబుతున్నారు. ప్రొటీన్ రొటీన్ ఇదీ... హెవీ ఎక్సర్సైజ్లకు ఆహారం ద్వారా లభించే న్యూట్రిషన్స్ సరిపోవు కాబట్టి సప్లిమెంట్స్ భాగం చేశా. మార్నింగ్ ప్రీ వర్కవుట్ డ్రింక్, వర్కవుట్ తర్వాత 2 స్కూప్స్ ప్రొటీన్ 200 మి.లీ నీటితో తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్గా ఎగ్వైట్స్, 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, లంచ్గా 100 గ్రా.చికెన్, క్వినో రైస్, రెండుగంటలు ఆగి ఒక ప్రొటీన్ స్కూప్, లైమ్జ్యూస్తో తీసుకుంటాను. గ్రిల్డ్ ఫిష్తో డిన్నర్ పూర్తి చేసి, 1 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్, నిద్రపోయే ముందు తిరిగి 1స్కూప్ ప్రొటీన్. ఇది నా రెగ్యులర్ డైట్ విత్ సప్లిమెంట్స్. - రఘు -
ఆటే మంత్రం
నేడు ప్లే టెన్నిస్ డే పదేళ్లు కూడా నిండని చిన్నారులు రాకెట్ పట్టుకుని బంతులను బలంగా బాదుతుంటారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు మంచు తెరలు వీడక ముందే మైదానాల్లో ఎడతెరిపి లేకుండా సాధన చేస్తుంటారు. ఫోర్ హ్యాండ్... బ్యాక్ హ్యాండ్... వాలీ... ఆఫ్ వాలీ... ఓవర్హెడ్... డ్రాప్ షాట్... అక్కడ వినిపించే మాటలివే. కోచ్ల శిక్షణలో మెరికల్లా మారే ప్రయత్నం... సిటీలో కనిపించే దృశ్యం. వీళ్లందరికీ స్ఫూర్తి... భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా. ఈ హైదరాబాదీని ఆదర్శంగా తీసుకుని ఎందరో టెన్నిస్ను తమ టార్గెట్ చేసుకున్నారు. పోటీల్లో అదరగొట్టి నగరానికే వన్నె తెస్తున్నారు. నేడు ‘ప్లే టెన్నిస్ డే’. ఈ సందర్భంగా సిటీలోని టెన్నిస్ అకాడమీలు, స్టేడియాల్లో ఏం జరుగుతుందో ఓసారి చూసొద్దాం... పొద్దున్నే గంట ఆరు కొట్టక ముందే ఎల్బీ స్టేడియంలో అటెండెన్స్. ఓ అరగంట వార్మప్... ఆపై తోటి ఆటగాళ్లతో ప్రాక్టీస్. అలా మూడు గంటల పరిశ్రమ. తరువాత నాన్నతో కలసి ఇంటికి వెళ్లడం. సాయంత్రం... ఆరు గంటలు. జూబ్లీహిల్స్ జీవీకే టెన్నిస్ అకాడమీలో ప్రత్యక్షం. కోచ్ల డెరైక్షన్లో... మరో మూడు గంటల కఠోర సాధన... సబ్జూనియర్, జూనియర్, ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీల్లో ఆడుతున్న యడ్లవల్లి ప్రాంజల రోజువారీ షెడ్యూల్ ఇది. మాటలు రావు. కానీ... టెన్నిస్ అంటే పిచ్చి. ‘నువ్వేం ఆడతావే’ అన్న బంధువుల ఎత్తిపొడుపు మాటలకు రాకెట్తోనే సమాధానం. ఎల్బీ స్టేడియంలో ఉదయం... సాయంత్రం... రోజుకు ఏడు గంటల పాటు అలుపెరుగని కృషి... ఆటపై అమితమైన మక్కువ, కసితో అండర్-12, 14, 16, ఏఐటీఏ టైటిల్స్ సాధించి పెట్టాయి షేక్ జాఫ్రిన్కు. రెండేళ్ల కిందట బధిర జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం దక్కించుకుని మరెందరిలోనో స్ఫూర్తి నింపుతోందీ బాలిక. వీరిద్దరే కాదు... ఇలా ఎందరో తమకు తాము లక్ష్యాలను నిర్దేశించుకుని టెన్నిస్ను శ్వాసిస్తూ ముందుకు సాగుతున్నారు. వివిధ పోటీల్లో సత్తా చాటుతున్నారు. సిటీని టెన్నిస్కు కేరాఫ్గా మారుస్తున్నారు. పెద్దల్లోనూ క్రేజ్... క్రికెట్ ఇతర క్రీడల్ని డామినేట్ చేస్తున్న సమయంలో, ముఖ్యంగా హైదరాబాద్లో టెన్నిస్కు క్రేజ్ తెచ్చింది సానియామిర్జా. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సానియాను చూసిన చాలామంది తల్లిదండ్రుల చూపు ఈ క్రీడపై పడింది. ఫలితంగా తమ పిల్లలను దగ్గరుండి మరీ టెన్నిస్ అకాడమీలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నారు. వారు ప్రాక్టీస్ చేసినంత సేపూ స్టేడియంలోనే ఉండి ప్రోత్సహిస్తున్నారు. బాలబాలికలూ అంతే శ్రద్ధగా ఆటపై పట్టు బిగిస్తున్నారు. ఫలితంగా జాతీయ స్థాయి క్రీడాకారులు నగరం నుంచి పుట్టుకొస్తున్నారు. ఆట వల్ల ఆరోగ్యం, శరీర దారుఢ్యం, ఆలోచనా ధోరణిలో మార్పు, ఉద్యోగ అవకాశాలు... ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయని పిల్లలతో పాటు తల్లిదండ్రులు గ్రహించడం వల్లే నగరంలో టెన్నిస్కు క్రేజ్ పెరుగుతుందన్నది నిపుణుల మాట. ప్రోత్సహించాలనే... టెన్నిస్ అంటే హైదరాబాద్ గుర్తు రావాలన్న ఆలోచనతోనే చాంపియన్ టెన్నిస్ లీగ్లో ‘హైదరాబాద్ ఏసెస్’ జట్టును కొన్నాం. సిటీలోనూ మ్యాచ్లు జరిగేలా చూశాం. సానియా మిర్జాలా మరెంతో మంది టెన్నిస్ తారలను వెలుగులోకి తీసుకు రావాలనుకుంటున్నాం. మన సిటీలో టెన్నిస్కు మంచి ఆదరణ కనబడుతోంది. అదే స్థాయిలో ప్రతిభ కలిగినవారూ ఉన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలన్నదే మా ఉద్దేశం. భవిష్యత్లో సిటీ క్రీడాకారులకు మంచి అవకాశాలు వస్తాయి... అంటున్నారు హైదరాబాద్ ఏసెస్ జట్టు యజమానులు రాజేశ్ దండు, రామరాజు. తాము పారిశ్రామికవేత్తలమైనా... టెన్నిస్పై ఉన్న అభిమానమే సీటీఎల్ వైపు నడిపించిందన్నారు. -
ట్రైయాంగిల్
అమ్మాయి ఓ చూపు చాలు... లక్ష భావాలు వెతుక్కోవచ్చంటారు. నిజమే ఆడ వారి మాట లకు అర్థాలే వేరు మరి. వారి మాటలకే కాదు చేతలకి పలు అర్థాలు ఉంటాయని ‘ట్రైయాంగిల్’ షార్ట్ ఫిల్మ్ చూస్తే అర్థమవుతుంది. సినిమాని పూర్తిగా మూకీలోనే తీసినా... కథాంశం ఎక్కడా చెడకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు సాయిరాజ్ అండ్ టీమ్. ఒక అమ్మాయి ఇద్దరి అబ్బాయిల మధ్య సాగే ఈ కథలో ీహ రోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. డైలాగులు లేని సినిమా కావడంతో ఎక్స్ప్రెషన్స్తోనే అన్ని భావాలను వ్యక్తపర చాలి. ఇందులో హీరోయిన్గా చేసిన సుదీప్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. టెక్నికల్గా కాకుండా కాన్సెప్ట్ పరంగా ఈ చిన్ని చిత్రం చాలా బాగుంది. ఎస్.శ్రావణ్జయ -
షో టైమ్
ఇండివిడ్యువల్ టాలెంట్ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్లంటే ఇప్పుడు యుూత్లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెరుుల్ టు sakshicityplus@gmail.com