deposit
-
బ్యాంకుల్లోకి రూ.45 వేల కోట్ల డిపాజిట్లు
బడ్జెట్లో ఆదాయపన్ను తగ్గింపు, ఇతర పన్ను ప్రతిపాదనలతో బ్యాంకుల్లోకి వచ్చే డిపాజిట్లు పెరగనున్నాయి. సుమారు రూ.40,000 నుంచి 45,000 కోట్ల వరకు బ్యాంకుల్లోకి డిపాజిట్లు(Bank Deposit)గా రావొచ్చని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై ఆదాయం రూ.40,000 మించినప్పుడు (60 ఏళ్లలోపు వారికి) బ్యాంక్లు 10 శాతం మేర టీడీఎస్ వసూలు చేస్తుండగా, ఈ పరిమితిని రూ.50,000కు పెంచడం గమనార్హం. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000గా ఉన్న పరిమితిని రూ.లక్షకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే.‘పన్ను రాయితీని పెంచడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.20,000 కోట్లు డిపాజిట్ల రూపంలో రావొచ్చు. సేవింగ్స్ డిపాజిట్లపై వృద్ధులు ఆర్జించే వడ్డీపై టీడీఎస్ పరిమితిని పెంచడం వల్ల మరో రూ.15,000 కోట్లు రావొచ్చు’ అని నాగరాజు వివరించారు. సీనియర్లు కాని ఇతర వ్యక్తులకు పన్ను ఆదా రూపంలోనూ మరో రూ.7,000 కోట్ల మేర డిపాజిట్లుగా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఇదీ చదవండి: త్వరలో భారత్ సొంత జీపీయూ క్యాన్సర్ సంస్థలతో యాక్సిస్ బ్యాంక్ జట్టుక్యాన్సర్పై పరిశోధనలు, పేషంట్ల సంరక్షణ కార్యక్రమాలకు తోడ్పాటు అందించే దిశగా దేశీయంగా మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో చేతులు కలిపినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. టాటా మెమోరియల్ సెంటర్కి చెందిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్కేర్ సెంటర్స్ వీటిలో ఉన్నట్లు వివరించింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల కింద ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ విజయ్ మూల్బగల్ తెలిపారు. ప్రధానంగా పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, క్యాన్సర్ నివారణ .. చికిత్సపై అవగాహన కల్పించే సంస్థలు, అలాగే పేషంట్ల సంరక్షణ మొదలైన వాటికి సహాయసహకారాలు అందించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొన్నారు. సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్కేర్ సెంటర్స్ సంస్థ హైదరాబాద్లో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయం అందించినట్లు వివరించారు. -
ఎస్బీఐ రెండు కొత్త డిపాజిట్ పథకాలు
న్యూఢిల్లీ: డిపాజిట్దారుల కోసం ఎస్బీఐ రెండు వినూత్నమైన పథకాలను ప్రకటించింది. ఇందులో ఒకటి ‘హర్ ఘర్ లఖ్పతి’ కాగా, మరొకటి ‘ఎస్బీఐ పాట్రాన్స్’. ఇందులో హర్ ఘర్ లఖ్పతి పథకం కింద రూ.లక్ష లేదా అంతకుమించి రూ.లక్ష చొప్పున ఎంత వరకు అయిన సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన రికరింగ్ డిపాజిట్ పథకం. ఆర్థిక లక్ష్యాల సాధనను ఈ పథకం సులభతరం చేస్తుందని, కస్టమర్లు ప్రణాళిక మేరకు పొదుపు చేసుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ‘ఎస్బీఐ పాట్రాన్స్’ అన్నది 80 ఏళ్లు, అంతకుమించి వయసున్న వృద్ధుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన టర్మ్ డిపాజిట్ పథకం. సాధారణంగా సీనియర్ సిటిజన్లకు ఆఫర్ చేసే రేటుపై అదనంగా 0.10% వడ్డీ రేటును ఈ పథకం కింద ప్రస్తుత డిపాజిటర్లతోపాటు, కొత్త టర్మ్ డిపాజిటర్లకు ఇవ్వనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. ఇవి కస్టమర్ల ఆకాంక్షలను తీర్చడంతోపాటు అదనపు రాబడులను అందిస్తాయని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రకటించారు. -
డిపాజిట్లా.. స్టాక్మార్కెట్టా.. మన కష్టార్జితం ఎటువైపు..?
చినుకు చినుకు కలిస్తే జడివాన అవుతుందన్నది ఎంత వాస్తవమో... రూపాయి రూపాయి కూడబెడితేనే రేప్పొద్దున్న అవి వేలు, లక్షలుగా మారతాయి అన్నది కూడా అంతే వాస్తవం. ఇలా కూడబెట్టడానికి, సంపద పెంచుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టార్జితంతో చెలగాటం ఆడలేం కాబట్టి... ముందు చూపుతో తెలివిగా వ్యవహరించడం అత్యంత ప్రధానం. ఇదివరకటి రోజుల్లో మన ఖర్చులు పోగా మిగిలే డబ్బుల్ని బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో డిపాజిట్ చేసుకునేవారు. లేదంటే ఏ బంగారమో కొనుక్కునే వారు. ఇప్పుడు రోజులు మారాయి. సంప్రదాయ మార్గాలు కొత్త రూటు వెతుక్కున్నాయి. అలా ఈమధ్య కాలంలో నలుగురూ కొత్తగా దృష్టి పెడుతున్నదే షేర్లలో పెట్టుబడులు. మన డబ్బులు స్వల్ప వ్యవధిలోనే ఇంతలింతలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే క్రమశిక్షణ పాటించాలి సుమా.... మన దగ్గరున్న డబ్బులు ఏయే మార్గాల్లో దాచుకుంటే/పెట్టుబడి పెడితే ఎంత అవ్వడానికి అవకాశం ఉంటుందో ఉదాహరణ పూర్వకంగా పరిశీలిద్దాం. ఉదాహరణకు... మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుందాం. వాటిని ఏయే మార్గాలకు మళ్లిస్తే ఎంత గిట్టుబాటు అవుతుందో పరిశీలిద్దాం.1. పోస్ట్ఆఫీస్వడ్డీరేట్లు 7-7.5 స్థాయిలోఉన్నాయి. అయిదేళ్లకాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్డీ ఏడాదికి రూ. 7,000-7,500. ఐదేళ్లకురూ.35,000 -37,500.* ఎలాంటి రిస్క్ ఉండదు.* ఒకసారి పెట్టుబడి పెట్టి అయిదేళ్లపాటు వదిలేయడమే. * చాలా తక్కువ రాబడి. * పెట్టుబడి సురక్షితం. * అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. * అయితే పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. * డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించలేకపోయినా, మధ్యలో అవసరానికి వెనక్కి తీసుకున్నా చార్జీలు వసూలు చేస్తారు. * డిపాజిట్ చేసిన ఆరు నెలలలోపు విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. * ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఎఫ్డీ వడ్డీ రేటు కాకుండా సేవింగ్స్ వడ్డీరేటు చెల్లిస్తారు. * ఏడాది పైబడితే.. వాస్తవానికి నిర్ధారించిన ఎఫ్డీ రేటు కంటే 2% తక్కువగా అప్పటికి ఎన్నినెలలు పూర్తయితే ఆనెలలకు లెక్కగడతారు. మిగతా కాలానికి సేవింగ్స్ రేటుని పరిగణనలోకి తీసుకుంటారు.2. బ్యాంకు డిపాజిట్వడ్డీ రేట్లు గరిష్టంగా 7 శాతం దాకా ఉన్నాయి. అయిదేళ్ల కాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్ డీఏడాదికి రూ. 7,000. అయిదేళ్లకు రూ.35,000.* ఇంచుమించు పోస్ట్ఆఫీస్ మాదిరిగానే ప్రతిఫలాలు ఉంటాయి. * ఎలాంటి రిస్క్ ఉండదు.* ఒకసారి పెట్టుబడి పెట్టి మెచ్యూర్ అయ్యే వరకు ఆగొచ్చు. * తక్కువ రాబడి కానీ పెట్టుబడి సురక్షితం. * అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. * పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. * డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించకపోతే అరశాతం నుంచి 1% దాకా (బ్యాంకునుబట్టి) చార్జీలు వసూలు చేస్తారు.* నిర్ణీత వ్యవధిలోపు డిపాజిట్ను ఉపసంహరించుకుంటే అప్పటిదాకా జమకూడిన వడ్డీ నుంచి గాని, అసలు మొత్తం నుంచి గాని ఈ చార్జీలను మినహాయించుకుంటారు. * మధ్యలోనే వెనక్ కితీసుకుంటే డిపాజిట్ మెచ్యూర్ అయినప్పుడు వచ్చే పూర్తి వడ్డీ మొత్తం కోల్పోతారు.3. స్టాక్ మార్కెట్కరోనా తర్వాతి కాలంలో చాలా మందిని ఆకర్షించిన పెట్టుబడి మార్గం ఏదైనా ఉందంటే అది స్టాక్ మార్కెట్టేనని చెప్పుకోవచ్చు. కుప్పలు తెప్పలుగా డీమ్యాట్ అకౌంట్లు పుట్టుకొచ్చేశాయి. అయితే ఇలా ఖాతాలు తెరిచినవారిలో ఎక్కువ మంది పెట్టుబడుల కంటే ట్రేడింగ్ పైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అలా కాకుండా దీన్నో పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటే కచ్చితంగా అధిక ప్రతిఫలాన్ నిపొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిట్లో ఉన్నట్లే ఇందులోనూ ప్రయోజనాలు లోటుపాట్లు ఉండటం సహజం. అవేమిటంటే...* నిర్ణీత పెట్టుబడితోనూ అధిక రాబడి పొందొచ్చు. * డిపాజిట్లతో పోలిస్తే వచ్చే ప్రయోజనం ఎక్కువ. అదేసమయంలో రిస్క్ కూడా ఎక్కువే. * పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరిస్తే గ్యారంటీ ప్రతిఫలాన్ని పొందవచ్చు. * పై ఉదాహరణనే పరిశీలిస్తే లక్ష రూపాయల పెట్టుబడిని ఏడాది కాలవ్యవధితో పెట్టుబడి పెట్టారనుకుందాం. ఉదా: ఈ రూ. లక్షతో రూ. 2000 విలువ చేసే షేర్లు కొంటే 50 వస్తాయి. ఇంత విలువ ఉన్న షేర్లు ఏడాది వ్యవధిలో కనీసం రూ.200 పెరిగే అవకాశం ఉంటుంది (మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మార్కెట్ బాగోకపోతే షేర్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మార్కెట్లోకి అడుగు పెట్టేటప్పుడే మనం ఎంత వరకు రిస్క్ భరించగలమో చూసుకుని దిగాలి. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు ఎప్పుడూ మంచి ప్రతిఫలాలనే ఇస్తాయని చరిత్ర చెబుతున్న వాస్తవం). * మన 50 షేర్ల మీద రూ. 10,000 రిటర్న్ వచ్చినట్లన్నామాట. దీన్ని అయిదేళ్లకు లెక్కగడితే రూ. 50,000 ప్రతిఫలం ముట్టినట్లు. * బ్యాంకు డిపాజిట్లు, పోస్ట్ఆఫీస్ డిపాజిట్లతో పోలిస్తే అధిక రాబడి సాధించినట్లే అవుతుంది. ఇక్కడ నేను చెప్పింది కనీస స్థాయిలో లెక్కగట్టి మాత్రమే అన్న విషయాన్ని గ్రహించాలి. ఇంతకంటే ఎక్కువ కూడా... అంటే లక్షకు లక్ష, రెండు లక్షలు... అంతకుమించి కూడా సంపాదించిపెట్టే అవకాశం స్టాక్ మార్కెట్కు మాత్రమే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. * చెప్పానుగా..రిస్క్ కూడా ఎక్కువే... ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు షేర్ ధరను పడగొడితే సంపాదించడం మాట అటుంచి పోగొట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే మనం కొనే షేర్/షేర్ల నుబట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఏ చెత్తపడితే ఆచెత్త షేర్ ను కొనేయకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోకూడదు. దీనికి సంబంధించి మళ్ళీ మరోసారి విడమర్చి చెబుతా..డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో మనం ఏది ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో అర్ధం అయిందనుకుంటా... బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీచేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాసరావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
అకౌంట్లో ఇంతకు మించి క్యాష్ జమైతే అంతే..
మనలో చాలా మంది బ్యాంకు ఖాతాల ఆధారంగా లావాదేవీలు చేస్తూంటారు. ఎఫ్డీలో డబ్బు దాచుకుంటారు. సేల్ డీడ్ ద్వారా చెల్లింపులు చేస్తూంటారు. బిజినెస్ చేస్తున్నవారు కరెంట్ అకౌంట్ ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. అయితే ఏ ఖాతాకైనా లావాదేవీల పరంగా నిబంధనల ప్రకారం కొన్ని అవధులుంటాయి. వాటిని పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఆదాయపన్ను అధికారుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే ఖాతాలకు నిబంధనల ప్రకారం ఎంతమొత్తంలో లిమిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.సేవింగ్స్, కరెంట్ ఖాతాలో లావాదేవీలుభారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి ప్రాథమికంగా రూ.50 లక్షలు ఉంటుంది. కొన్నిసార్లు కరెంట్ అకౌంట్కు సంబంధించి లేవాదేవీలు ఆయా బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.నగదు ఉపసంహరణనగదు ఉపసంహరణల విషయానికి వస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ.1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయని వ్యక్తులకు విత్డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ.1 కోటికి మించితే 5% టీడీఎస్ అమలవుతుంది.నగదు బహుమతినగదు బహుమతులపై ఆదాయపు పన్నుశాఖ నిబంధనలు విధించింది. పన్ను విధించదగిన ఆదాయాన్ని దాచిపెట్టి పన్నులను ఎగవేసేందుకు ప్రయత్నిస్తుంటారు. నగదు బహుమతులకు సంబంధించి దీన్ని నిరోధించడానికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. సంబంధీకులు కానివారి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంలో నగదు బహుమతులు స్వీకరించినట్లయితే ఎటువంటి గిఫ్ట్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు, అత్తమామలతో సహా ఇతర బంధువుల నుంచి బహుమతులను స్వీకరిస్తే పన్ను మినహాయింపు ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్ పరిమితిఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే కనీసం రూ.100 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఆపై చేసిన ఎఫ్డీపై ట్యాక్స్ ఉంటుంది. అయితే ఎఫ్డీల్లో రూ.రెండు కోట్లు కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉంటే బల్క్ డిపాజిట్ల రూపంలోకి మారుతాయి. ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఏటా రూ.10 వేలు దాటితో టీడీఎస్ 10 శాతం కట్ అవుతుంది.‘రియల్’ లావాదేవీలుపూర్తి నగదును ఉపయోగించి స్థలం లేదా, ఇల్లు కొనుగోలు చేసేందుకు నిబంధనలు అనుమతించవు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నగదు లావాదేవీల పరిమితికి లోబడి ఉంటాయి. నగదు రూపంలో రూ.2,00,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేయకూడదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం నగదు రూపంలో రూ.రెండు లక్షల కంటే ఎక్కువ చెల్లింపులు స్వీకరిస్తే విక్రేత 100% పెనాల్టీ రుసుమును చెల్లించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ కార్డ్తో గేమ్స్ వద్దుసేల్ డీడ్లో నగదు చెల్లింపులను రికార్డ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రిజిస్టర్డ్ టైటిల్ డీడ్లో రుజువులు రికార్డు చేసే క్రమంలో రూ.రెండు లక్షలు గరిష్ట పరిమితి మాత్రమే ఉండాలి. అది కూడా బ్యాంకు డ్రాఫ్ట్, చెక్, ఈసీఎస్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండడం మేలు. -
డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలు
డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినూత్న ప్రొడక్టులను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. రికరింగ్ డిపాజిట్– క్రమానుగత పెట్టుబడి విధానం (ఎస్ఐపీ) కాంబో ప్రొడక్ట్సహా వినూత్నమైన ఉత్పత్తులను తీసుకురావాలని యోచిస్తున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నందున కస్టమర్లు ఆర్థికంగా మరింత అవగాహనతో వ్యవహరిస్తున్నారని, వ్యవస్థలో డిమాండ్ ఉందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో వారు వినూత్న పెట్టుబడి సాధనాల కోసం వెతకడం ప్రారంభించారని కూడా తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఆర్థిక అక్షరాస్యత మెరుగుపడటంతో కస్టమర్లు తమ పెట్టుబడులపై అధిక రాబడుల గురించి ఆలోచిస్తున్నారు. ఆ మేరకు పోర్ట్ఫోలియో రూపకల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.సహజంగానే ఎవరూ ప్రతి రూపాయినీ ప్రమాదకర లేదా ఊహాజనిత ఇన్వెస్ట్మెంట్లో ఉంచాలని కోరుకోరు. బ్యాంకింగ్ ప్రొడక్టులు ఎల్లప్పుడూ పోర్ట్ఫోలియోలో భాగమే. కాబట్టి మేము వారికి నచ్చే ఉత్పత్తులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.రికరింగ్ డిపాజిట్ వంటి కొన్ని సంప్రదాయ ప్రొడక్టుల్లో కొత్త విధానాలు తీసుకురావాలని యోచిస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్/ రికరింగ్ డిపాజిట్–ఎస్ఐపీను డిజిటల్గా యాక్సెస్ చేయగల కాంబో ప్రోడక్ట్గా రూపొందించాలనే ప్రతిపాదనలున్నాయి.తాజా ప్రొడక్టులు జన్ జెడ్లో (12 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు) ప్రాచుర్యం పొందడానికి అనుగుణమైన ఆవిష్కరణలపై బ్యాంక్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది.అంతేకాకుండా, డిపాజిట్ సమీకరణ కోసం బ్యాంక్ భారీ ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.ఇదీ చదవండి: బీమా పాలసీ వెనక్కిస్తే మెరుగైన ప్రయోజనాలు!కొత్త ఖాతాలను తెరవడంపై బ్యాంక్ దృష్టి సారిస్తోంది. రోజుకు దాదాపు 50,000 నుంచి 60,000 సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను తెరవడం లక్ష్యంగా పెట్టుకున్నాం.ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లలో దాదాపు 50 శాతం డిజిటల్ ఛానెల్ల ద్వారానే తెరుస్తున్నాం.వచ్చే 3–5 ఏళ్లలో రూ.లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటాలని దేశీయంగా బలమైన ఆర్థిక సంస్థగా అవతరించాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని బ్యాంక్ నమోదుచేసింది. -
రుణాలు పీక్... డిపాజిట్లు వీక్
న్యూఢిల్లీ: రుణాల పెరుగుదల డిపాజిట్ వృద్ధిని మించిపోతోందని, ఇది బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతా) సవాళ్లకు దారితీయవచ్చని ఫిక్కీ–ఐబీఏ నివేదిక ఒకటి పేర్కొంది. రుణ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను పెంచడం అలాగే రుణ రేటును తక్కువగా ఉంచడం బ్యాంకుల ఎజెండాలో అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) విభాగం వాటా తగ్గినట్లు సర్వేలో పాల్గొన్న బ్యాంకుల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ తెలియజేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు సహా మొత్తం 22 బ్యాంకులు (మొత్తం అసెట్ పరిమాణంలో వీటి వాటా 67 శాతం) ఈ సర్వేలో పాల్గొన్నాయి. 2024 జనవరి నుంచి జూన్ మధ్య జరిగిన ఈ 19వ దఫా ఫిక్కీ–ఐబీఏ సర్వే నివేదికలో వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్ని..2024 ప్రథమార్థంలో 80 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు కాసా డిపాజిట్ల వాటా తగ్గుదలను నమోదుచేసుకోగా, సగానికి పైగా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇదే విషయాన్ని తెలిపాయి. అయితే అధిక, ఆకర్షణీయమైన రేట్ల కారణంగా టర్మ్ డిపాజిట్లు వేగం పుంజుకున్నాయి. సర్వేలో 71% బ్యాంకులు గత ఆరు నెలల్లో మొండిబకాయిల స్థాయిలు తగ్గిన్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల రేటు 90 శాతంగా ఉంటే, ప్రైవేటు రంగ బ్యాంకుల రేటు 67 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాలు, లోహాలు, ఇనుము, ఉక్కు వంటి రంగాల్లో వృద్ధికి తగినట్లుగా దీర్ఘకాలిక రుణ డిమాండ్ కనబడుతోంది. ప్రత్యేకించి మౌలిక విభాగం పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ రంగానికి రుణ డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు సర్వేలో 77% బ్యాంకులు వెల్లడించాయి. బ్యాంకులు– ఫిన్టెక్ కంపెనీల మధ్య భాగస్వామ్యం– నూతన ఆవిష్కరణలు, సేవల విస్తృతి, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవడం వంటి సానుకూల చర్యలకు దోహదపడుతుంది. ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్ఏటీఎం చానెల్ నిర్వహణ విషయంలో వ్యయాలు తగ్గాలి. వ్యూహాత్మక స్థానాలను ఎంచుకోవడం, ఏటీఎం లావాదేవీల కోసం ఇంటర్ఛేంజ్ ఫీజులను పెంచడం, వ్యయాలు– ప్రయోజనాలను విశ్లేషించడం, సాంకేతికతను పెంచడం వంటి పలు కీలక సూచనలను బ్యాంకర్లు చేశారు. -
తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) రుణ వృద్ధి 25–27 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 28 శాతంగా నమోదైంది. ఎస్ఎఫ్బీలు విభాగాలవారీగా, భౌగోళికంగా కార్యకలాపాలు విస్తరిస్తే రుణ వృద్ధి మెరుగుపడుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదిక పేర్కొంది.క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఎస్ఎఫ్బీల మూలధన నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్పటికీ తక్కువ వ్యయాలతో డిపాజిట్లను సేకరించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో రుణ వృద్ధికి అవసరమయ్యే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ, డిపాజిట్యేతర వనరులను అన్వేషిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా ఉన్న సూక్ష్మరుణాలతో పాటు తనఖాలు, అన్సెక్యూర్డ్ రుణాలు మొదలైన కొత్త మార్గాల్లో రుణ వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు చిన్న బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని నివేదిక తెలిపింది. కొత్త అసెట్స్ విభాగాల్లో రుణ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 40 శాతం వరకు ఉండొచ్చని, సంప్రదాయ విభాగాల్లో ఇది 20 శాతంగా ఉండొచ్చని సంస్థ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు.ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు యాపిల్ కంటెంట్మరిన్ని విశేషాలు..నెట్వర్క్పరంగా ఎస్ఎఫ్బీల బ్రాంచీల సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి రెట్టింపై 7,400కి చేరింది. తూర్పు రాష్ట్రాల్లో శాఖల సంఖ్య అత్యధికంగా ఉంది. 2019 మార్చి నాటికి మొత్తం శాఖల్లో తూర్పు రాష్ట్రాల్లో 11 శాతం ఉండగా ప్రస్తుతం ఇది 15 శాతానికి పెరిగింది. సగానికి పైగా శాఖలు, గణనీయంగా వృద్ధి అవకాశాలున్న గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి.గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బ్యాంకింగ్ రంగానికి పూర్తి భిన్నంగా, ఎస్ఎఫ్బీల్లో రుణ వృద్ధికన్నా బల్క్ డిపాజిట్ల వృద్ధి 30 శాతం అధికంగా నమోదైంది. 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ డిపాజిట్లు 22 శాతమే. చౌకగా ఉండే కరెంట్–సేవింగ్స్ డిపాజిట్ల వాటా 35 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది.ఎస్ఎఫ్బీలు టర్మ్ డిపాజిట్లపై ఆధారపడటం ఇకపైనా కొనసాగనుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీ లోన్ల విభాగంలో రూ.6,300 కోట్ల లావాదేవీలు జరగ్గా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,000 కోట్లకు చేరాయి. -
డిపాజిట్ల పెంపుపైనే దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) డిపాజిట్ వృద్ధిని మెరుగుపరచాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్థికమంత్రి ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో బ్యాంకింగ్ పనితీరు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గత కొన్ని నెలల్లో రుణ వృద్ధి కంటే డిపాజిట్ల పరుగు 300–400 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వెనుకబడి ఉంది. ఇలాంటి పరిస్థితి బ్యాంకులకు అసెట్–లయబిలిటీ (రుణాలు–డిపాజిట్లు) అసమతుల్యతను సృష్టిస్తోంది. ప్రత్యామ్నాయ పెట్టుబడులపై ఆసక్తి వల్లే...ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు గృహ పొదుపులు మారడంవల్లే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి రేటు పడిపోతోందన్న ఆందోళనలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇటీవలే స్వయంగా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ విస్తారమైన బ్రాంచ్ నెట్వర్క్ను ఉపయోగించుకోవడం, అలాగే వినూత్న ఉత్పత్తులు, సేవల ద్వారా డిపాజిట్లను సమీకరించాలని ఆయన కోరారు. ‘పెరుగుతున్న క్రెడిట్ డిమాండ్ను తీర్చడానికి బ్యాంకులు స్వల్పకాలిక నాన్–రిటైల్ డిపాజిట్లు, ఇతర సాధనాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. డిపాజిట్లు పెరక్కపోవడం బ్యాంకింగ్ వ్యవస్థను నిర్మాణాత్మక లిక్విడిటీ సమస్యలకు గురిచేసే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు. రిటైల్ కస్టమర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయని పేర్కొన్న ఆయన, ఫలితంగా బ్యాంకులు రుణ వృద్ధికి వెనుకంజలో ఉన్న డిపాజిట్లతో నిధుల విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ బ్యాంకుల చీఫ్లతో ఆరి్థకమంత్రి డిపాజిట్లపైనే ప్రత్యేకించి దిశా నిర్దేశం చేయడం గమనార్హం. ఈ సమావేశంలో చర్చనీయాంశలను ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సమీక్షా సమావేశ ముఖ్యాంశాలు.. 2024–25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన మొదటి సమీక్ష సమావేశం ఇది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం సూర్య ఘర్, పీఎం విశ్వకర్మ యోజనతోసహా ప్రభుత్వం వివిధ ప్రధాన పథకాల అమలులో బ్యాంకుల ఆరి్థక పనితీరు, పురోగతిని ఆర్థిక మంత్రి సమీక్షించారు.కోర్ బ్యాంకింగ్ వ్యాపారంపై దృష్టి సారించాలని, వినూత్న ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా డిపాజిట్ వృద్ధి వేగాన్ని పెంచాలని బ్యాంకుల చీఫ్ను ఆర్థిక మంత్రి కోరారు.సమర్థవంతమైన కస్టమర్ సేవల డెలివరీ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లతో మెరుగైన సంబంధాలను కలిగి ఉండాలని సీతారామన్ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో ఉద్యోగులు తమ కస్టమర్లతో కనెక్ట్ అయ్యేలా చూడాలని ఆమె బ్యాంకులను కోరారు.వడ్డీ రేటు విషయంలో ఆర్బీఐ బ్యాంకింగ్కు స్వేచ్ఛనిచ్చిందని, ఆ స్వేచ్ఛను ఉపయోగించి బ్యాంకులు డిపాజిట్లను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలని ఆమె సూచించారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఆందోళనలు, ఆర్థిక రంగానికి ఎదురయ్యే నష్టాలపై కూడా ఈ సమీక్షా సమావేశం చర్చించింది. మోసం, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన సమస్యలు అలాగే మొండిబకాయిల సమస్యల పరిష్కారానికి సంబంధించి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) పురోగతికి వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.ప్రభుత్వ బ్యాంకుల పనితీరుపై హర్షం2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం రూ. 1.4 లక్షల కోట్లను దాటింది. దాదాపు రూ.1 లక్ష కోట్ల అధిక బేస్పై గత ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కలిసి 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.1,04,649 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. ఎక్స్ఛేంజీల్లో ప్రచురితమైన సంఖ్యల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ.141,203 కోట్ల మొత్తం లాభంలో మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వాటానే 40 శాతానికి పైగా ఉంది. ఎస్బీఐ ఆర్జిత లాభం రూ.61,077 కోట్లయితే, వార్షిక వృద్ధి 22 శాతం. 2022–23లో ఈ వృద్ధి రూ.50,232 కోట్లు. 2023–24 ఆరి్థక సంవత్సరం అన్ని వ్యాపార అంశాల్లో బ్యాంకింగ్ మెరుగైన పనితీరును ప్రదర్శించడంపట్ల తాజా సమీక్షా సమావేశంలో హర్షం వ్యక్తం అయ్యింది. నికర మొండిబకాయిలు 0.76 శాతానికి తగ్గడం, మూలధన నిష్పత్తి తగిన స్థాయిలో 15.15 శాతంగా నమోదుకావడం, నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం) 3.22 శాతంగా నమోదుకావడం, షేర్ హోల్డర్లకు రూ.27,830 కోట్ల డివిడెండ్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ సానుకూల అంశాలు మార్కెట్ల నుండి మూలధనాన్ని సేకరించే విషయంలో ప్రభుత్వ బ్యాంకుల సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచాయని సమీక్షా సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో డీఎఫ్ఎస్ సెక్రటరీ వివేక్ జోషి, సెక్రటరీ డిజిగ్నేటెడ్ ఎం నాగరాజు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (డీఎఫ్ఎస్) సీనియర్ అధికారులు పాల్గొన్నారు.అధిక వడ్డీ మార్గాలపై యువత దృష్టి: ఎస్బీఐదేశంలోని యువ జనాభా బ్యాంకింగ్ డిపాజిట్లపై కాకుండా అధిక వడ్డీరేటు లభించే ఇతర మార్గాలను అన్వేషిస్తోందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికవేత్తల నివేదిక తాజాగా పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని దాదాపు సగం టర్మ్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్లవేనని పేర్కొన్న నివేదిక, రుణ వృద్ధి రేటుతో పోటీగా డిపాజిట్ల వృద్ధి రేటుకు దోహదపడ్డానికి డిపాజిట్లపై పన్ను విధానంలో మార్పులు అవసరమని స్పష్టం చేసింది. కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే, డిపాజిట్ల వృద్ధి రూ.61 లక్షల కోట్లయితే, రుణ వృద్ధి 59 లక్షల కోట్లుగా ఉందని పేర్కొనడం గమనార్హం. గడచిన 26 నెలల్లో డిపాజిట్ల స్పీడ్ మందగమనం ఉందని ఆర్బీఐ 2024 జూన్లో విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ, గడచిన కాలం చూస్తే మూడు నుంచి నాలుగేళ్లు డిపాజిట్ల వృద్ది రేటుకన్నా, రుణ వృద్ధి స్పీడ్గా ఉన్న చరిత్ర ఉందని నివేదిక పేర్కొంది. ఈ లెక్కన తాజా పరిస్థితి (డిపాజిట్ల మందగమనం) 2025 జూన్–అక్టోబర్ మధ్య ముగిసే అవకాశం ఉందని అంచనావేసింది. తాజా డిపాజిట్–రుణ పరిస్థితి ఇదీ..ఈ ఏడాది జూలై 12 నాటికి వార్షికంగా చూస్తే, బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 11 శాతానికి పరిమితమైంది. అయితే, రుణ వృద్ధి మాత్రం 14 పైగా శాతంగా నమోదైంది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ, డిపాజిట్ వృద్ధిలో ఇంత తేడా రావడం గడిచిన 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుత తక్కువ వడ్డీ రేట్లతో రిటైల్ డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు కష్టతరంగా మారిందన్నది ప్రధాన విశ్లేషణ. ఆర్ఆర్బీల సేవలు పెరగాలిసూక్ష్మ, లఘు, మధ్య, చిన్న తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రొడక్టులను రూపొందించాలని ప్రాంతీయ గ్రామీ ణ బ్యాంకులు (ఆర్ఆర్బీ), వాటి స్పాన్సర్డ్ బ్యాంకుల సీఈఓలకు ఆర్థిక మంత్రి ఈ సమీక్షా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. వాటికి రుణ లభ్యత సకాలంలో లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రుణ ఫోర్ట్ఫోలియోను పెంచడానికి అపారమైన అవకాశాలు ఉన్న వస్త్ర, చెక్క ఫర్నీచర్, తోలు, ఆహార ప్రాసెసింగ్ వంటి చిన్న సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. అలాగే సాంకేతిక రంగంలో పురోగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలనీ ఆమె విజ్ఞప్తి చేశారు. -
ముందస్తు విత్డ్రాకు ఆర్బీఐ నిబంధనలు
ముంబై: ఎన్బీఎఫ్సీల్లో డిపాజిట్ చేసిన మూణ్నెల్ల వ్యవధిలోనే డిపాజిటర్లు అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం డబ్బును వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్స్పై వడ్డీ లభించదని పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను సమీక్షించిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వైద్యం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే విపత్తులను అత్యవసర పరిస్థితులుగా పరిగణిస్తారు. మరోవైపు, డిపాజిట్లు స్వీకరించే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) పాటించాల్సిన లిక్విడ్ అసెట్స్ పరిమాణాన్ని అవి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి ఆర్బీఐ పెంచింది. అలాగే, పబ్లిక్ డిపాజిట్లకు అన్ని వేళలా పూర్తి కవరేజీ ఉండేలా చూసుకోవాలని, ఏడాదికి ఒకసారైనా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి ’ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ రేటింగ్ పొందాలని హెచ్ఎఫ్సీలకు సూచించింది. పబ్లిక్ డిపాజిట్లను 12 నెలల నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ.. వడ్డీ ఎంతంటే?
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ను ప్రకటించింది. 666 రోజుల ఎఫ్డీని ప్రారంభించింది. ఇది రూ .2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ మొత్తాలపై సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం వరకు వడ్డీని అందిస్తుంది.666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తాయి. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులను సూపర్ సీనియర్ సిటిజన్లుగా వ్యవహరిస్తారు.ఈ 666 రోజుల ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సాధారణ కస్టమర్లకు 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ రూపాయి టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. ఇవి జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్పై రుణం పొందే సౌలభ్యం, ప్రీమెచ్యూర్ విత్డ్రా సదుపాయం అందుబాటులో ఉంది.కస్టమర్లు, సాధారణ ప్రజలందరూ ఈ పెట్టుబడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏ బ్రాంచిలోనైనా ఈ ఎఫ్డీని తెరవచ్చు. అలాగే బీఓఐ ఓమ్ని నియో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఎఫ్డీని తెరిచే అవకాశం ఉంది. -
ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు అలెర్ట్. మే నెలలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును సవరించాయి. వాటిల్లో ఎస్బీఐ, డీసీబీ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎస్, క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి .డీసీబీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు డీసీబీ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు) సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం కొత్త రేట్లు మే 22, 2024 నుండి అమలులోకి వస్తాయి.19 నెలల నుండి 20 నెలల కాలవ్యవధిలో సాధారణ కస్టమర్లకు 8శాతం, సీనియర్ సిటిజన్లకు 8.55శాతం అత్యధిక ఎఫ్డీ వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. అత్యధిక పొదుపు ఖాతా వడ్డీ రేటు 8శాతం వరకు అందించబడుతుంది. పొదుపు ఖాతాపై 8 శాతం వరకు, ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.55 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.ఐడీఎఫ్సీఐడీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయిబ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం నుండి 7.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం వడ్డీ రేటు 3.50 శాతం నుండి 8.40 శాతం వరకు ఉంటుంది. 500 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 8శాతం, 8.40శాతం వరకు అందిస్తుంది. ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైల్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల వరకు), బల్క్ డిపాజిట్లపై (రూ. 2 కోట్ల కంటే ఎక్కువ) నిర్దిష్ట కాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయి.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లుఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. బ్యాంక్ సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 8.50 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, బ్యాంక్ 4.60 శాతం నుంచి 9.10 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కాలవ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.10 శాతం వరకు పొందవచ్చు.ఆర్బీఎల్లో వడ్డీ రేట్లు ఆర్బీఎల్ బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.ఆర్బీఎల్ బ్యాంక్ 18 నుంచి 24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై అత్యధికంగా 8శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అదే ఎఫ్డీ వ్యవధిలో, సీనియర్ సిటిజన్ 0.50 శాతం అదనంగా పొందవచ్చు. సూపర్ సీనియర్ సిటిజన్లు (80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ) 8.75శాతం అదనపు వడ్డీ రేటుకు అర్హులు. -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్న్యూస్..
ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. టైల్ స్థిర డిపాజిట్లకు (రూ.2 కోట్ల వరకూ ఎఫ్డీలు) సంబంధించి కొన్ని కాల పరిమితులపై వడ్డీరేట్లను పెంచింది. 2023 డిసెంబర్ తర్వాత బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీరేటు పెంచడం ఇదే తొలిసారి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, ఈ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వస్తాయి. 46 రోజుల నుంచి 179 రోజులు, 180 నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితుల డిపాజిట్ రేట్లు 25 నుంచి 75 బేసిస్ పాయింట్ల శ్రేణిలో (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి. కాగా, సీనియర్ సిటిజన్లకు ఆయా కాలపరిమితులపై (టేబుల్లో పేర్కొన్న రేట్ల కన్నా అదనంగా) పేర్కొన్న డిపాజిట్ రేట్లకు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు లభిస్తుంది. దీర్ఘకాలిక (ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య) డిపాజిట్పై ఏకంగా 1% వరకూ అదనపు వడ్డీరేటు లభిస్తుంది. తాజా రేట్లు ఇలా... కాల పరిమితి వడ్డీ(%) 7–45 రోజులు 3.546–179 రోజులు 5.5 180–210 రోజులు 6.0 211 రోజులు– ఏడాది 6.25 ఏడాది–రెండేళ్లు 6.80 రెండేళ్లు–మూడేళ్లు 7.00 మూడేళ్లు– ఐదేళ్లు 6.75ఐదేళ్లు– పదేళ్లు 6.50 -
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్డేట్ కార్యక్రమంలో ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి. ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది. -
ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి డిపాజిట్ ఎలా కట్టాడో తెలుసా?
ప్రతి ఎన్నికలలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థులు చర్చనీయాంశం అవుతూ ఉంటారు. ఏదో ఒక అంశంలో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జబల్పూర్ వ్యక్తి కూడా ఇలాగే వార్తల్లో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా జబల్పూర్లో ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్న వినయ్ చక్రవర్తి ఎన్నికల డిపాజిట్ను చిల్లర నాణేల రూపంలో చెల్లించారు. నామినేషన్ ఫారమ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించడానికి రూ. 25,000 నాణేలతో బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లారు. రూ. 10, రూ. 5, రూ. 2 నాణేల రూపంలో రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నానని, కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్, ఆన్లైన్ విధానంలో డిపాజిట్ చెల్లించే సౌకర్యం లేదని అందుకే తన వద్ద ఉన్న నాణేల రూపంలో డిపాజిట్ చెల్లించానని చక్రవర్తి తెలిపారు. దీనిపై జబల్పూర్ జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా విలేకరులతో మాట్లాడుతూ, అభ్యర్థి నాణేలలో రూపంలో చెల్లించిన డిపాజిట్ను స్వీకరించి దానికి సంబంధించిన రశీదును అతనికి అందించినట్లు చెప్పారు. లోక్సభ తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్లోని అరడజను స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఈ బ్యాంకుల్లో 2 సంవత్సరాల డిపాజిట్లపై 7.25% వడ్డీ
-
బహుజనవాదం .. బహుదూరం
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్కుమార్కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్చెరులో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రవీణ్కుమార్కు నిరాశ బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. -
రాజస్థాన్: ఎపుడూ డిపాజిట్ దక్కలే.. అయినా తగ్గేదేలే!
Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల సందర్బంగా 78 ఏళ్ల తీతర్ సింగ్ వార్తల్లో నిలిచారు. వరుసగా 32వ సారి కూడా ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రడీ అయ్యారు. 1970 నుంచి గ్రామపంచాయతీ నుంచి లోక్సభ వరకు 31 ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్ ప్రతిసారీ ఓటమిని చవిచూశారు. అయితే తగ్గేదెలే అంటూన్న తితార్ సింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజస్థాన్లోని గంగానగర్కు చెందిన 78 ఏళ్ల తీతర్ సింగ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) దినసరి కూలీ. తాజా ఎన్నికల్లో వరుసగా స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీకి సై అన్న తీతర్ సింగ్ ఈ పోటీ వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా వెల్లడించారు. రాష్ట్రంలోని 25ఎఫ్ గులాబేవాలా గ్రామంలో నివాసం ఉంటున్న సౌదాగర్ సింగ్ కుమారుడు తీతర్ సింగ్. చదవింది ఐదవ తరగతి. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1985లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాననీ అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ఆశ మాత్రం అలాగే ఉంది అంటారు తీతర్ సింగ్. ఎందుకంటే నాలుగు తరాలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అటు పేదలకుగానీ ఇటు గ్రామాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.ఇప్పటికైనా పేద ప్రజలకు ప్రభుత్వభూమి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తానుఎమ్మెల్యేగా ఎన్నికైతే గ్రామంలోని రోడ్ల అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు భూమిలేని పేద కూలీలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయడానికి తన మేకలను, ఇంటిని అమ్ముకున్నారట. స్థానికుల నుంచి సేకరించిన కొద్దిపాటి విరాళాలతోనే పోటీకి దిగారు. స్నేహితులతో కలిసి డోర్ టు డోర్ కాన్వాసింగ్ చేయడం మరో ప్రత్యేకత. గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాలనేది సింగ్ కల అట. వృద్ధాప్యం కారణంగా చదవడం, రాయడం మర్చిపోయినా సంతకం మాత్రం చేయగలరు. అయినా ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మాత్రం వీడలేదు. అంతేకాదు ప్రతీ ఎన్నికలోనూ అతనికి డిపాజిట్ కూడా దక్కలేదు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు వచ్చాయట. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సురేంద్ర పాల్ సింగ్, కాంగ్రెస్ నుంచి గుర్మీత్ సింగ్ కూనర్తో సింగ్ తలపడనున్నారు. తీతర్ సింగ్కు భార్య గులాబ్ కౌర్, ఇక్బాల్ సింగ్ ,రిచ్పాల్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈసారి ఎన్నికల్లో భార్యా పిల్లలు తనకు మద్దతుగా నిలిచారని సింగ్ చెప్పారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సదర్పుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక్కడ నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. Titar singh srikaranpur nirdlay akele dum lde 💪🏻 pic.twitter.com/nuWGnNmI9k — Rajan Gupta (@rajangupta066) November 2, 2023 -
ఆర్బీఐ కార్యాలయాల ముందు క్యూ
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాలయాల ముందు జనం బారులు దీరారు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలను దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాలు కొనసాగిస్తున్నాయి. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్పిడి, డిపాజిట్కు సెపె్టంబర్ 30 వరకు అనుమతించారు. ఆ తర్వాత ఆఖరు తేదీని అక్టోబర్ 7 వరకు పొడిగించారు. ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. వ్యవస్థ నుంచి రూ.3.43 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత శుక్రవారం వెల్లడించారు. రూ.12,000 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ చలామణిలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది. -
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?
తమిళనాడులోని పళనికి చెందిన రాజ్కుమార్ అనే డ్రైవర్కి ఉన్నట్టుండి తన ఖాతాలో భారీ మొత్తంలో నగదు డిపాజిట్ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 వేల కోట్ల జమ కావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తరువాత విషయం తెలుసి సంబరాలు చేసుకునేలోపే జరిగిన పరిణామానికి ఉసూరు మన్నాడు. సెప్టెంబరు 9న చెన్నైలోని క్యాబ్ డ్రైవర్ రాజ్కుమార్ ఎదురైనా అనుభవం ఇది. ఇంతకీ ఏమైంది అంటే.. రాజ్కుమార్ చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి తన ఖాతాలో రూ.9,000 కోట్లు డిపాజిట్ కావడంతో ముందు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా అతని ఖాతాలో రూ.105 మాత్రమే ఉంది. ఆ తరువాత ఇదేదో స్కాం అనుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. ఒకసారి టెస్ట్ చేస్తే పోలా అనుకున్నాడు. వెంటనే తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేశాడు. లావాదేవీపూర్తియిందా లేదా ఆసక్తిగా ఎదురు చూశాడు. ఆశ్చర్యంగా.. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో ఇది నిజమేనని నిర్ధారించుకున్నాక ఎగిరి గంతేశాడు. కానీ అరగంటలోనే ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. మరుసటి రోజు ఉదయం తూత్తుకుడి బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు. పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని ఫ్రెండ్కి ట్రాన్సఫర్ చేసిన సొమ్ము మొత్తం అప్పగించాల్సిందేని డిమాండ్ చేశారు. దీంతో కంగు తిన్న రాజ్కుమార్ లాయర్లతో బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేశాడు. చివరికి రూ. 21 వేలను వాహనరుణంగా సర్దుబాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
బ్యాంకుల్లో రూ.5 లక్షల బీమాపై అవగాహన అవసరం
ముంబై: డిపాజిట్ బీమా పథకం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆగస్టు 31లోగా తమ వెబ్సైట్లు అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్లలో తన లోగో, క్యూఆర్ కోడ్ను ప్రముఖంగా ప్రదర్శించాలని ఆర్బీఐ అనుబంధ విభాగం– డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అన్ని బ్యాంకులను కోరింది. బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు డీఐసీజీసీ ద్వారా బీమా కవరేజ్ ఉంటుంది. ఈ బీమా పథకం వాణిజ్య బ్యాంకులుసహా లోకల్ ఏరియా బ్యాంకులు (ఎల్ఏబీ), చెల్లింపుల బ్యాంకులు (పీబీ), చిన్న ఆర్థిక బ్యాంకులు (ఎస్ఎఫ్బీ), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) సహకార బ్యాంకులలో డిపాజిట్లకు వర్తిస్తుంది. ఆర్బీఐ సంప్రదింపులతో తాజా సూచనలు చేస్తున్నట్లు డీఐసీజీసీ సర్కులర్ వివరించింది. ఎందుకంటే... ► చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసాన్ని పటిష్టం చేయడంలో, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో డిపాజిట్ బీమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఒక సర్క్యులర్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించింది. ► లోగో, క్యూర్ కోడ్ ప్రదర్శన వల్ల డీఐసీజీసీ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలోకి వచ్చే బ్యాంకులను కస్టమర్ సులభంగా గుర్తించడానికి వీలవుతుందని, అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్కు సంబంధించిన సమాచారం సకాలంలో వారు పొందగలుగుతారని తెలిపింది. బీమా కవరేజ్ బ్యాంకులు 2,027 డీఐసీజీసీ నమోదిత బీమా బ్యాంకుల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 2,027. ఇందులో 140 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. 43 ఆర్ఆర్బీలు, రెండు ఎల్ఏబీలు, ఆరు పీబీలు, 12 ఎస్ఎఫ్బీలు, 1,887 సహకార బ్యాంకులు కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ బీమా ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షలు. ఇందుకు సంబంధించి కవరవుతున్న ఖాతాల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 294.5 కోట్లు. బీమా కవరవుతున్న డిపాజిట్ల విలువ రూ.83,89,470 కోట్లు. -
ఇంకా రూ. లక్ష కోట్లు రావాలి! రూ.2 వేల నోట్లపై కీలక సమాచారం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మే నెలలో రూ.2 వేల నోట్లను ఉపసంహరించింది. 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లేదా ఏదైనా బ్యాంకు శాఖలో ఇతర డినామినేషన్ నోట్లతో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఇప్పటివరకు రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించిన రూ. 2,000 కరెన్సీ నోట్లను సెప్టెంబర్ చివరి నాటికి మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని కోరిన ఆర్బీఐ ఇందు కోసం అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది. కాగా ఇప్పటివరకు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కివచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. మొత్తంగా రూ.3.6 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉండగా మూడింట రెండు వంతులకు పైగా నోట్లు తిరిగి వచ్చాయి. అంటే ఇంకా దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా రూ.2,000 నోట్లను వెంటనే డిపాజిట్ చేయాలని ఆర్బీఐ అధికారులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే! -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఈ స్కీమ్ గడువు పెంపు!
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. 400 రోజుల స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలశ్ డిపాజిట్ పథకాన్నిఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ వాస్తవానికి 2023 జూన్ 30తో గడువు ముగియాల్సి ఉంది. అయితే ఖాతాదారుల్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ స్కీమ్ను జూన్ 30 వరకు అందుబాటులో ఉంచినట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎస్బీఐ కస్టమర్లు ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్పై లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. -
వ్యాల్యూ స్టాక్ గుర్తించడం ఎలా?
అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్ను గుర్తించడం ఎలా? – కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్ను గుర్తించం కూడా ఒక కళేనని చెప్పుకోవచ్చు. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. కంపెనీ నిధులను నిజాయితీగా నిర్వహిస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి. నేను మూడు, నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నందున, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నందున లాంగ్టర్మ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? దీనికంటే మరేదైనా మెరుగైన ఆప్షన్ ఉందా? – అంకిత్ ముద్రా వడ్డీ రేట్లు, వీటికి సంబంధించిన సైకిల్ (కాల వ్యవధి) అనేవి ఊహించనివి. పరిస్థితులు, సూక్ష్మ ఆర్థిక అంశాల ఆధారంగా ఇవి మార్పులకు లోనవుతుంటాయి. కరోనా మహమ్మారి రాకతో ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు 2020 మార్చి–మేలో వడ్డీ రేట్ల కోతను గుర్తుకు తెచ్చుకోండి. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఇటీవల వరుసగా చేపట్టిన రేట్ల పెంపులు కూడా ఒక నిదర్శనమే. కచ్చితంగా వడ్డీ రేట్ల సైకిల్ను అంచనా వేయడం ఎవరి వల్లా కాదు. ఆ విధమైన అంచనాలతో పోర్ట్ఫోలియో ఏర్పాటు చేసుకోవడం రిస్క్ తీసుకోవడమే అవుతుంది. కనుక స్థూల ఆర్థిక అంశాల కంటే మీ పెట్టుబడుల కాలవ్యవధికి అనుగుణమైన సాధనాలపై దృష్టి సారించడమే మంచిది. మూడు నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అప్పుడు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో పెట్టుబడికి రక్షణ ఉండాలి. అటువంటప్పుడు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలం. ఈ పథకం కాల వ్యవధి, మీ పెట్టుబడుల కాల వ్యవధికి ఒకే రకంగా ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో (డెట్ సాధనాలు) పెట్టుబడులు పెట్టడం వెనుక ఉద్దేశ్యం స్థిరమైన రాబడులు ఆశించడమే. ఈక్విటీల్లో మాదిరి అస్థిరతలు లేకుండా, పెట్టుబడికి రక్షణ కల్పించుకోవడం. లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ చూడ్డానికి ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ అవి ఎంతో అస్థిరతలతో ఉంటాయి. దీర్ఘకాలంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో మాదిరే రాబడులను ఇస్తాయి. డెట్ ఫండ్స్ ఎంపిక చేసుకునేప్పుడు అనుసరించాల్సిన సూత్రం మీ పెట్టుబడుల కాల వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనం పెట్టుబడుల కాలవ్యవధి ఒకే విధంగా ఉండాలి. ఇక మీ పెట్టుబడుల కాలవ్యవధి మూడు నాలుగేళ్లు కనుక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ను కూడా చూడొచ్చు. ఈక్విటీలతో వచ్చే రిస్క్ కొంత ఇందులో ఉంటుంది. ఇవి ఈక్విటీలు, డెట్, ఆర్బిట్రేజ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చే స్తాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ కంటే ఎక్కువ రాబడులు ఇస్తాయి. అచ్చమైన ఈక్విటీలతో పోలిస్తే తక్కువ అస్థిరతలతో మెరుగైన రాబడులు ఇస్తాయి. ధీరేంద్ర కుమార్ - సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
Amrit Kalash : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలశ్ డిపాజిట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. 400 రోజుల గడువు కలిగిన ఈ ప్లాన్ వాస్తవానికి 2023 మార్చి 31తో ఈ స్కీమ్ గడువు ముగియాల్సి ఉంది. అయితే ఖాతాదారుల్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ స్కీమ్ను జూన్ 30 వరకు అందుబాటులో ఉంచినట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎస్బీఐ కస్టమర్లు ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్పై లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. -
బ్యాంకుల్లో రూ.35 వేల కోట్ల డిపాజిట్లు.. వారసులకు అందేదెలా?
కోటీ, రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.35 వేల కోట్లు. బ్యాంకుల్లో పదేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తమిది. డిపాజిట్దారులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యుల(వారసులు)కు కూడా తెలియని డిపాజిట్లు కొన్నయితే, వారసులు ఎవరో తేలక బ్యాంకులోనే ఉండిపోయినవి కొన్ని. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఎవరూ క్లెయిమ్ చేయని ఈ డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లుగా కేంద్ర ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. 10,24,00,599 ఖాతాలకు చెందిన ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిబంధనల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు పేర్కొంది. ఈ సొమ్ము మృతుల వారసులకు చెందాల్సి ఉందని తెలిపింది. ఈ క్లెయిమ్లను పరిష్కరించడంలో కుటుంబ సభ్యులకు సహకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. మృతుల ఖాతాలకు సంబంధించి చట్టపరమైన ప్రాతినిధ్యం లేకుండా క్లెయిమ్లు పరిష్కరించరు. ఇందుకోసం నిర్దిష్టమైన దరఖాస్తు, నిబంధనలు ఉంటాయి. వీటిని మృతుల కుటుంబ సభ్యులు సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించినట్లు ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ దరఖాస్తులు సరైన వివరాలు లేకుండా, అసంపూర్తిగా ఉంటే వాటిని బ్యాంకులు తిరస్కరిస్తాయని, అయితే వాటిని తిరస్కరించడానికి కారణాలను క్లెయిమ్దారులకు బ్యాంకులు తెలియజేయాలని, సక్రమంగా నమోదు చేయడానికి సహకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థి క శాఖ పేర్కొంది. ఈ ఖాతాల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పింది. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, చట్టబద్ధమైన వారసులను కనుగొనేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఒక సంవత్సరానికంటే ఎక్కువ కాలం కార్యకలాపాలు లేని ఖాతాలను ప్రతి ఏడాదీ సమీక్షించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిందని తెలిపింది. ఆ ఖాతాదారులను సంప్రదించి కారణాలను తెలుసుకోవడంతో పాటు ఎటువంటి లావాదేవీలు జరగలేదని లిఖితపూర్వకంగా నిర్ధారించుకోవాలని సూచించినట్లు చెప్పింది. -
రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
రక్షణ ‘ఫిక్స్డ్’.. రాబడి కాదు!
ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతో సురక్షితం. ఎక్కువ మంది ఇలానే భావిస్తుంటారు. రాబడి తక్కువే అయినా, భద్రత పాళ్లు ఎక్కువ కదా అన్న భరోసా వారిది. అందుకే ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గతంలో మాదిరి ఇప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా తప్పింది. ఉన్నచోట నుంచే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లోనూ డిపాజిట్ చేసుకోవడం, ఆన్లైన్లోనే రద్దు చేసుకోవడం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎఫ్డీ మరింత సౌకర్యవంతంగా మారిందని చెప్పుకోవాలి. ఒకవేళ బ్యాంకు సంక్షోభం పాలైనా.. రూ.5 లక్షల వరకు తిరిగి చెల్లించే ఆర్బీఐ ‘డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’ ఉంది. కానీ, ఇవన్నీ నాణేనికి అనుకూల ముఖమే. రెండో వైపు తిప్పి చూస్తే.. అసలు ఫిక్స్డ్ డిపాజిట్లో రాబడి వస్తుందా..? ద్రవ్యోల్బణం, పన్ను పోను మిగిలేది ఎంత? అసలు ఇది మెరుగైన పెట్టుబడి సాధనమేనా..? ఈ అంశాలన్నీ చర్చించే కథనమే ఇది. ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) నుంచి తమ పెట్టుబడులను ఇతర సాధనాల వైపు మళ్లిస్తుండడాన్ని పరిశీలించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ వైపు వారు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలను గమనించాలి. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్లకు దూరంగా వెళ్లడానికి కారణాలను చూస్తే.. ఒకటి వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, రెండోది ఇన్వెస్టర్లలో వివిధ సాధనాలు, వాటిల్లోని రిస్క్, రాబడుల పట్ల పెరుగుతున్న అవగాహనే. ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్నో తరాల నుంచి నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఉంటూ వస్తోంది. కానీ, టెక్నాలజీ అందుబాటు, పెట్టుబడులకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచుతున్నాయి. దీంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్ రాబడులతో పోల్చి చూసుకునే వారు పెరుగుతున్నారు. అందుకే ఇతర సాధనాలతో పోలిస్తే నేడు ఎఫ్డీలు అంత ఆకర్షణీయమైనవిగా ఇన్వెస్టర్లకు అనిపించడం లేదు. నికర రాబడి సున్నా.. ఏ రాబడికి అయినా ముందు చూడాల్సింది ద్రవ్యోల్బణమే. ఇది పోను మిగులు రాబడి ఎంత అన్నదే ఇన్వెస్టర్కు ప్రామాణికం అవుతుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వివిధ కాల వ్యవధుల ఆధారంగా 2.50 శాతం నుంచి గరిష్టంగా 7 శాతం వరకు ఉన్నాయి. కానీ, సెప్టెంబర్ నెలకు సంబంధించి వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్) 7.3 శాతంగా ఉంది. అంటే ఇంతకుమించి వడ్డీ రేటు ఉంటేనే అసలు రాబడి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. అంతెందుకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇలా చూసినా 7 శాతం వడ్డీనిచ్చే ఎఫ్డీపై నికర రాబడి 0.3 శాతమే అవుతుంది. మరింత వివరంగా చూస్తే.. ఏడాది ఎఫ్డీపై ఎస్బీఐ ఆఫర్ చేస్తున్న రేటు 5.65 శాతమే. అంటే ద్రవ్యోల్బణం కంటే ఒక శాతం తక్కువ. కెనరా బ్యాంకు, పీఎన్బీ బ్యాంకులు సైతం 5.5 శాతం రేటును ఇస్తున్నాయి. ప్రైవేటు రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులోనూ ఏడాది కాల ఎఫ్డీపై రేటు 5.75 శాతానికి మించి లేదు. రెండేళ్ల కాల వ్యవధికి చూసినా.. కెనరా బ్యాంకు 5.60 శాతం, యూనియన్ బ్యాంకు 5.45 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 6.50 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. మూడేళ్ల ఎఫ్డీలపై ఎస్బీఐ ఇస్తున్న రేటు 5.60 శాతం. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 6.50 శాతం, యాక్సిస్ బ్యాంకు 5.70 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఐదేళ్ల కాల ఎఫ్డీలపై ఎస్బీఐలో రేటు 5.65 శాతం ఉంటే, యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకులో 5.75 శాతం చొప్పున ఉంది. అంటే ఐదేళ్ల వరకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు, ఆర్బీఐ అంచనా వేస్తున్న ద్రవ్యోల్బణ రేటు 6.7 శాతం కంటే తక్కువే ఉన్నాయి. అంటే ఈ మేరకు ఎఫ్డీపై నష్టపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇక పన్ను పరిధిలో ఉన్న వారికి ఎఫ్డీలతో మరింత నష్టమే అని చెప్పుకోవాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే 7 శాతం ఎఫ్డీ రేటు రాబడి నుంచి పన్ను చెల్లించగా మిగిలే నికర రాబడి 4.9 శాతమే. ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉండడంతో నికరంగా 2 శాతం నష్టాన్ని ఎఫ్డీ రూపంలో తెచ్చుకున్నట్టు అవుతుంది. రక్షణ ఒక్కటే కాదు.. నిజానికి పెట్టుబడి ఏదైనా రక్షణ పాళ్లు ఎంతన్నది చూడాలి. కానీ, అదే సమయంలో రాబడి కూడా చూడాలి. అసలు రాబడి లేకుండా, రక్షణ ఉన్న సాధనం వల్ల ఒరిగేదేమి ఉంటుంది? ఎఫ్డీలు లిక్విడ్ సాధనం. అవసరమైనప్పుడు వేగంగా రద్దు చేసుకుని నగదుగా మార్చుకోవచ్చు. స్వల్పకాల అవసరం ఏర్పడితే అదే ఎఫ్డీపై రుణం (లోన్ ఎగైనెస్ట్ డిపాజిట్/ఓవర్డ్రాఫ్ట్) తీసుకోవచ్చు. అదే సమయంలో ఎఫ్డీలు ఒక్కటే లిక్విడ్ సాధనం అనుకోవడానికి లేదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా లిక్విడ్ సాధనాలే. మూడు రోజుల వ్యవధిలో నగదుగా మార్చుకోవచ్చు. డెట్ సాధనా ల్లో ద్రవ్యోల్బణం మించి రాబడి అందుకోవచ్చు. మూడేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణ ప్రభావం పోను మిగిలిన రాబడిపైనే పన్ను పడుతుంది. ఫండ్స్లో వైవిధ్యానికి చోటు కల్పించుకోవచ్చు. లక్ష్యానికి అనుగుణంగానే.. కాల వ్యవధికి అనుకూలమైన సాధనం ఎంపిక చేసుకోవడం పెట్టుబడికి కీలకం అవుతుంది. వ్యవధి మూడేళ్లకు మించి లేనప్పుడు ఈక్విటీలను ఎంపిక చేసుకోకపోవడమే సరైనది. 3–5 ఏళ్ల కాలానికి హైబ్రిడ్ పథకాలు, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ పథకాలు అనుకూలం. 5–10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి లార్జ్క్యాప్, మిడ్క్యాప్ పథకాలు, ఈటీఎఫ్లు, ఈఎల్ఎస్ఎస్లు, 10 ఏళ్లకు మించిన దీర్ఘకాలం కోసం స్మాల్క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మూడేళ్లలోపు అయితే రాబడి పెద్దగా లేకపోయినా డెట్ సాధనాలకే పరిమితం కావాలి. ఇక అత్యవసర నిధి అయితే ఎఫ్డీలు, లిక్విడ్ ఫండ్స్, లో డ్యురేషన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయాలు ఎఫ్డీలకు ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. దీనికంటే ముందు ఎఫ్డీల్లో పెడుతున్న మొత్తం దేనికి ఉద్దేశించినది? అని ప్రశ్నించుకోవాలి. అత్యవసర నిధి అయితే ఎఫ్డీలలో పెట్టుకోవడం సరైనదే అవుతుంది. అత్యవసరం చెప్పి రాదు. ఏ సమయంలో అయినా వెంటనే వెనక్కి తీసుకోవడానికి వెసులుబాటుతో ఉండాలి. ఇక్కడ రాబడి ప్రామాణికం కాదు. కనుక ఎమర్జెన్సీ ఫండ్ను ఎఫ్డీలలో పెట్టుకోవచ్చు. అలాగే, ఏడాది కాలం కోసం కూడా ఎఫ్డీలను పరిశీలించొచ్చు. ఏడాదికి మించిన కాలవ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు.. భిన్న కాలాలతో కూడిన వైవిధ్యమైన డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఈక్విటీ కలగలిసిన హైబ్రిడ్ ఫండ్స్, ఈటీఎఫ్లు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఇవి ఏడాది నుంచి మూడేళ్ల కాల మనీ మార్కెట్, డెట్ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో సగటు వార్షిక రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుందని ఆశించొచ్చు. ఇంతకంటే మెరుగైన రాబడులు, తక్కువ రాబడులకు అవకాశం లేకపోలేదు. ఎంపిక చేసుకునే పథకాల పనితీరు ఆధారంగా రాబడి ఉంటుందని మర్చిపోవద్దు. రెండు నుంచి మూడేళ్ల కాలానికి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. మీడియం టు లాంగ్ డ్యురేషన్ నాలుగు నుంచి ఏడేళ్ల కాల వ్యవధి కలిగి సాధనాల్లో పెట్టుబడులు పెడతాయి. వీటిల్లోనూ రాబడులు ఇంచుమించుగా మీడియం డ్యురేషన్ ఫండ్స్ స్థాయిలోనే ఉంటాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ ఏడేళ్లకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. చారిత్రక రాబడులు 6 శాతం నుంచి 18 శాతం మధ్య ఉన్నాయి. ఇవి గుర్తు పెట్టుకోవాలి.. డెట్ ఫండ్స్లో పెట్టుబడి, రాబడికి గ్యారంటీ ఉండదు. దీన్నే క్రెడిట్ రిస్క్ అంటారు. అంటే ఫండ్స్ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయగా, ఆయా పత్రాలకు సంబంధించి తిరిగి చెల్లింపులు జరగకపోవడం. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, అస్థితరల్లో వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లిక్విడిటీ రిస్క్ కూడా ఎదురుకావచ్చు. నాణ్యమైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో లిక్విడిటీ రిస్క్ దాదాపుగా ఉండదనే చెప్పుకోవచ్చు. కానీ, రాబడి కోసం రిస్క్ తీసుకుని డెట్లో పెట్టుబడులు పెట్టడం కంటే.. ఈక్విటీలను ఆశ్రయించడం మెరుగైన మార్గం అవుతుంది. ఎందుకంటే ఎలానూ రిస్క్కు సిద్ధ పడ్డాం కనుక, ఈక్విటీల్లో మెరుగైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. ఆయా విషయాల్లో నిపుణుల సలహాలను తీసుకొని నడచుకోవడం వల్ల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కార్పొరేట్/ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు కార్పొరేట్, ఎన్బీఎఫ్సీ సంస్థల డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. వీటిపై 7.5–8.5% మధ్య రాబడులు ఆశించొచ్చు. ఏఏఏ రేటెడ్ కలిగిన బాండ్లనే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రాబడి మాటేమో కానీ, పెట్టుబడి కూడా సంక్షోభంలో పడిపోతుంది. మీడియం డ్యురేషన్ ఫండ్స్ ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాల వ్యవధితో ఉండే డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఎంపిక చేసుకునే పథకాల ఆధారంగా ఈ విభాగంలో మూడేళ్ల కాలానికి వార్షిక సగటు కనిష్ట రాబడి 3 శాతంగాను, గరిష్ట రాబడి 17 శాతం వరకు ఉంది. కనుక ఎంపిక చేసుకునే పథకం ఇక్కడ ప్రామాణికం అవుతుంది. ఏడు శాతానికి పైనే రాబడి ఆశించొచ్చు. పీపీఎఫ్ అసంఘటిత రంగంలోని వారు, 15–20 ఏళ్ల కాల లక్ష్యాలకు పీపీఎఫ్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో చేసే పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చే రాబడులపైనా పన్ను ఉండదు. అన్ని విధాలుగా పన్ను ప్రయో జనం కలిగిన సాధనం. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1%గా ఉంది. వీపీఎఫ్ ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్వో కింద భవిష్యనిధి స్కీమ్ ఉంటుంది. దీనికి అదనంగా స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) పేరుతో అదనపు పెట్టుబడి చేసుకోవచ్చు. పీఎఫ్కు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్ పెట్టబడులకూ వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి పీపీఎఫ్ బ్యాలన్స్పై 8.10 శాతం వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. కాకపోతే వీపీఎఫ్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాతే ఉపసంహరించుకోగలరు. ఒకవేళ ఉద్యోగానికి రాజీనామా చేసినా, రిటైర్ అయినా అటువంటి సందర్భాల్లో ఈపీఎఫ్తోపాటు వీపీఎఫ్ కూడా తీసేసుకోవచ్చు. డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్తో ఒక సానుకూలత ఉంది. మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు డెట్ నుంచి ఈక్విటీకి, ఈక్విటీ నుంచి డెట్కు పెట్టుబడులను బదలాయిస్తుంటాయి. తద్వారా రిస్క్ తగ్గించి, అధిక రాబడులను ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. 9–18 శాతం మధ్య దీర్ఘకాలంలో వార్షిక రాబడులను వీటి నుంచి ఆశించొచ్చు. హైబ్రిడ్ ఫండ్స్ ఐదేళ్లు అంతకుమించిన కాలానికి హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ మెరుగైనవి. ద్రవ్యోల్బణం, పన్ను బాధ్యతలు తీసేసి చూసినా.. ఈక్విటీ ఫండ్స్లో రాబడి మెరుగ్గానే ఉంటుందని అందుబాటులోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కన్జర్వేటివ్ హబ్రిడ్ ఫండ్స్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అని రెండు రకాలు ఉన్నాయి. ఈక్విటీల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకు ఇన్వెస్ట్ చేసేవి అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాలు. నూరు శాతం ఈక్విటీ రిస్క్ వద్దనుకునే వారు, ఈక్విటీ డెట్ కలయిక కోరుకునే వారికి ఇవి అనుకూలం. వీటిల్లో వార్షిక రాబడి దీర్ఘకాలంలో 12–18 శాతం మధ్య ఆశించొచ్చు. వీటికి ఈక్విటీ పథకాలకు మాదిరే పన్ను విధానం వర్తిస్తుంది. లాభాలు స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీలకు 10–25% మధ్య కేటాయింపులు చేస్తాయి. వీటిల్లో రాబడులకు డెట్ ఫండ్స్ పన్ను విధానం వర్తిస్తుంది. రిస్క్ తక్కువ తీసుకునే వారికి ఇవి అనుకూలం. కొంత భాగం ఈక్విటీలకు కేటాయించడం వల్ల దీర్ఘకాలంలో వార్షిక రాబడి 9–12% మధ్య ఉంటుంది. ఇక బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీలు, డెట్కు సమానంగా కేటాయింపులు చేస్తుంటాయి. లార్జ్క్యాప్/మిడ్క్యాప్/స్మాల్క్యాప్ లార్జ్క్యాప్ కంపెనీలు ఎలాంటి మార్కెట్ పరిస్థితులను అయినా, ఆర్థిక సంక్షోభాలను అయినా తట్టుకోగలవు. ఎందుకంటే ఆయా రంగాల్లో అవి పెద్ద స్థాయికి చేరినవి కనుక. రిస్క్ తక్కువగా ఉండాలని భావించే వారు ఐదేళ్లు అంతకుమించిన కాలానికి లార్జ్క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. సగటు వార్షిక రాబడులు 12–18 శాతం మధ్య ఉంటాయి. మోస్తరు రిస్క్ తీసుకునే వారు మిడ్క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో రాబడులు 12–22 శాతం మధ్య ఉంటాయి. స్మాల్క్యాప్ పథకాలను పదేళ్లు అంతకుమించిన కాలానికి, అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదు అధిక రాబడులు కోరుకునే వారు పరిశీలించొచ్చు. వీటిల్లో రాబడులను 18 శాతానికి పైన ఆశించొచ్చు. -
సేవింగ్ అకౌంట్తో డబ్బులు సంపాదించండిలా
మీరు డబ్బులు ఎక్కడ దాస్తుంటారు. సేవింగ్స్ అకౌంట్లోనా? అయితే మీ సేవింగ్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో వడ్డీని పొందవచ్చు. ఆ విషయం మీకు తెలుసా? మీ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంకు అధికారుల్ని సంప్రదించండి. నా సేవింగ్ అకౌంట్కు స్వీప్ - ఇన్ ఎఫ్డీ ఆప్షన్ను ఎనేబుల్ చేయమని అడగండి. అలా అడిగితే ఆ ఆప్షన్ను ఎనేబుల్ చేస్తారు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వినియోగదారులకు అందించే వడ్డీ.. మీ సేవింగ్ అకౌంట్లో ఉన్న మనీకి అందిస్తారు. కానీ ఈ మొత్తం ఆయా బ్యాంకులు విధించిన నిబంధనలకు లోబడి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ అకౌంట్ను నుంచి డబ్బులు తీయాలని అనుకుంటున్న ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీరు ఆ ఆకౌంట్ వినియోగిస్తున్నప్పుడు సేవింగ్ అకౌంట్గాను, వినియోగించకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్గా పనిచేస్తుంది. షార్ట్ టర్మ్లో డబ్బులపై వడ్డీ పొందాలంటే ఇదే మంచి ఆప్షన్ అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ స్వీప్-ఇన్ స్వీప్ ఇన్ లేదా ఆటో స్వీప్ సదుపాయం అనేది సేవింగ్ అకౌంట్లో బ్యాంకు అధికారులు నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉండాలి. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వన్ ఇయర్ టెన్యూర్ కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజిట్గా బదిలీ చేసుకోవచ్చు. ఆ మొత్తానికే మీరు ఇంట్రస్ట్ను పొందవచ్చు. స్వీప్ ఆప్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే? సేవింగ్ అకౌంట్పై ఉన్న మొత్తానికి ఇంటస్ట్ర్ పొందడంతో పాటు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. స్వీప్ ఇన్ ఫెసిలిటీ ఎలా పని చేస్తుంది? కొన్ని బ్యాంకులు సేవింగ్ అకౌంట్ను .. ఫిక్స్డ్ డిపాజిట్కి లింక్ చేసే సదుపాయాన్ని అందిస్తాయి. మరికొన్ని బ్యాంకులు మీరు నిర్వహించే లావాదేవీల ఆధారంగా ఆ సదుపాయాన్ని అందిస్తాయి. మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా వడ్డీని అందిస్తాయి. కానీ అది చాలా తక్కువ మొత్తంలో ఉండనున్నాయి. ఈ స్వీప్- ఇన్ ఆప్షన్ పొందాలి అంటే బ్యాంకు అధికారుల వద్ద పూర్తి సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది. స్వీప్-ఇన్ అకౌంట్ అర్హతలు అవును, మీరు కనీసం రూ.25వేలతో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ను ఓపెన్ చేయాలి. దీనిలో నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన కనీస బ్యాలెన్స్ రూ. 25, 000 - రూ.1, 00, 000. డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
ఖాతాదారులకు హెచ్డీఎఫ్సీ శుభవార్త
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. కోవిడ్ విజృంభణ సమయంలో అత్యధికంగా వడ్డీ చెల్లించేలా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ స్కీమ్ గడువును పెంచుతున్నట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్ల కోసం హెచ్డీఎఫ్సీ మే 18, 2020లో ‘సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ’ అనే స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఆ ఎఫ్డీ పథంలో చేరిన ఖాతాదారులకు .. సాధారణ డిపాజిట్ల కంటే ఎక్కువగా వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఆ పథకంలో చేరే గడువు సెప్టెంబర్ 30,2022తో ముగియగా..తాజాగా ఆ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. 0.25శాతం అదనపు వడ్డీతో మే 18, 2020 నుండి మార్చి 31, 2023 మధ్య కాలంలో సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీలో చేరిన ఖాతాదారులకు ఐదేళ్ల టెన్యూర్, లేదంటే ఒక రోజు నుంచి 10 ఏళ్ల టెన్యూర్ కాలానికి రూ.5కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.25శాతం అదనంగా వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. తేడా ఎంతంటే ఐదు సంవత్సరాలు, ఒక రోజు నుండి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు సాధారణ వడ్డీ రేటు 5.75 శాతం అందిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద అదనంగా 6.50 శాతం వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లు పొందుతారు. టెన్యూర్ లోపు డ్రా చేస్తే అయితే, పైన పేర్కొన్నట్లుగా ఐదేళ్లలోపు డిపాజిట్లను ప్రీ క్లోజ్ చేసుకుంటే బ్యాంకు లబ్ధి దారులకు చెల్లించే వడ్డీరేటులో ఒకశాతం తగ్గుతుందని, లేదా డిపాజిట్ ఉన్న కాలానికి వర్తించే బేస్ రేటు ఉంటుందని బ్యాంక్ తెలిపింది. చదవండి👉 బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కంపెనీలు.. మాఫీ అయిన లక్షల కోట్ల జాబితా ఇదే! -
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో... డిపాజిట్ భద్రమేనా?
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్.. ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికి విశ్వసనీయమైన సాధనం. సమీపంలోని బ్యాంకు శాఖలో డిపాజిట్ చేసుకోవడం, అవసరం ఏర్పడినప్పుడు వెళ్లి తీసుకోవడం సౌకర్యాన్నిచ్చే అంశం. బ్యాంకులో డిపాజిట్ అయితే ఎక్కడికీ పోదు? అన్న నమ్మకం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఎఫ్డీలపై అధిక వడ్డీ రేటును కొన్ని బ్యాంకులు ఆఫర్ చేయడం గమనించే ఉంటారు. ఈ విషయంలో వాణిజ్య బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) కొంచెం అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. మరి అధిక రాబడి కోసం ఈ సాధనాలను ఎంపిక చేసుకోవడం ఎంత వరకు సురక్షితం అన్న ప్రశ్న రావచ్చు. అలాగని, అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయంటే ఏదో సందేహించాల్సిందే? అని భావించడం కూడా సరికాదు. ఎందుకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయన్నది ఇక్కడ గమనించాలి. ఆర్బీఐ నియంత్రణల పరిధిలో పనిచేసే బ్యాంకులు ఏవైనా, వాటిల్లో డిపాజిట్ చేసే విషయంలో సందేహించక్కర్లేదు. డిపాజిట్పై ఇన్సూరెన్స్ అమల్లో ఉందా? అన్నది విచారించుకోవాలి. అంతేకాదు, డిపాజిట్కు ముందు ముఖ్యమైన అంశాలు కొన్నింటిని విశ్లేషించుకోవాలి. అప్పుడే రాబడితోపాటు, భరోసా ఉండేలా చూసుకోవచ్చు. రిస్క్–రాబడి.. చాలా వరకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు) ఏడాది కాల ఎఫ్డీలపై 7–7.25% రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. పెద్ద బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు కంటే కనీసం ఒక శాతం ఎక్కువ. వడ్డీ రేటు వ్యత్యాసం అన్నది ఎస్ఎఫ్బీలు, ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య 1.5–2% వరకు ఉంది. అందుకే కొందరు ఇన్వెస్టర్లకు ఎస్ఎఫ్బీలు ఆఫర్ చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ రేటు ఆకర్షణీయంగా అనిపించొచ్చు. రేటు ఆకర్షణీయంగానే ఉన్నా, భద్రత విషయంలో సందేహంతో వెనుకాడాల్సిన అవసరం లేదు. అన్ని ఇతర షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మాదిరే, ఎస్ఎఫ్బీలు సైతం ఆర్బీఐ నియంత్రణల పరిధిలోనే పనిచేస్తాయి. కనుక ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి కూడా.. రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కవరేజీ ఉంటుంది. పెద్ద వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఎస్ఎఫ్బీల వ్యాపార నమూనా అధిక రిస్క్ తో ఉంటుంది. అందుకనే అవి డిపాజిట్లపై కాస్తంత అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఎస్ఎఫ్బీలు తమ మొత్తం రుణాల్లో 75 శాతాన్ని ప్రాధాన్య రంగాలకు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయం, ఎస్ఎంఎంఈలు ప్రాధాన్య రంగాల కిందకు వస్తాయి. అలాగే, ఎస్ఎఫ్బీల రుణ పుస్తకంలో 50 శాతం రుణాలు.. ఒక్కోటీ రూ.25 లక్షలు, అంతకులోపే ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. దీని కారణంగా ఎస్ఎఫ్బీల రుణాల్లో అన్సెక్యూర్డ్ రుణాలు 50–75 శాతం వరకు ఉంటాయి. కానీ, పెద్ద వాణిజ్య బ్యాంకుల్లో అన్సెక్యూర్డ్ రుణాలు మొత్తం రుణాల్లో 30 శాతం కంటే తక్కువే ఉంటాయి. ఎటువంటి హామీ/తనఖా లేని రుణాలు అన్సెక్యూర్డ్ కిందకు వస్తాయి. అందుకనే ఎస్ఎఫ్బీల వ్యాపారంలో రిస్క్ ఎక్కువ. కనుక ఎస్ఎఫ్బీలు రుణాల రిస్క్ను బ్యాలన్స్ చేసుకునేందుకు.. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే 1.5–2.5% అధిక రేటుపై రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణ రేటు 6.9 % నుంచి మొదలవుతోంది. అదే ఎస్ఎఫ్బీల్లో ఈ రేటు 8.5% నుంచి ఉంటోంది. ఇలా రుణాలపై అధిక రేటును ఎస్ఎఫ్బీలు వసూలు చేస్తుంటాయి. డిపాజిట్లపై మెరుగైన రేటును ఆఫర్ చేయడానికి ఇది కూడా ఒక కారణమే. ఇక ఎస్ఎఫ్బీలు మొదలై 5–6 ఏళ్లే అవుతోంది. కనుక డిపాజిట్ల సమీకరణ దశలోనే అవి ఇంకా ఉన్నాయి. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం, అధిక డిపాజిట్ బేస్ వచ్చే వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ రేటును ఆఫర్ చేయడం సహజంగానే చూడాలి. ఎంత వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు..? మీకు సమీపంలోని ఎస్ఎఫ్బీ శాఖకు వెళ్లి డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ సంస్థలు ఇంకా పూర్తి స్థాయి టెక్నాలజీ వనరులను సమకూర్చుకోలేదు. కనుక నేరుగా వెళ్లి ఎఫ్డీ చేసుకోవడం మంచిదే. అత్యవసరాల్లో తిరిగి డిపాజిట్ను వెనక్కి తీసుకోవడం ఆలస్యం కాకుండా ఉంటుంది. ఇక ఎంత మొత్తం వరకు డిపాజిట్ చేసుకోవచ్చు? అన్న సందేహం రావచ్చు. ఒక వ్యక్తి తన పొదుపు నిధులు మొత్తాన్ని ఒకే బ్యాంకు శాఖలో డిపాజిట్ చేసుకోవడం సూచనీయం కాదు. పైగా ఎస్ఎఫ్బీలో డిపాజిట్ చేసుకోవడానికి ముందు బ్యాంకు కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయో? ఒక అంచనాకు రావాలి. నమ్మకం ఏర్పడిన తర్వాతే డిపాజిట్కు వెళ్లాలి. అధిక రాబడుల కోసం మిగులు నిధుల వరకే డిపాజిట్కు పరిమితం కావాలి. డిపాజిట్ మొత్తానికి భద్రత కోరుకునేట్టు అయితే.. అప్పుడు ఒక బ్యాంకు పరిధిలోలో రూ.5 లక్షలకు మించి డిపాజిట్ చేయవద్దు. ఎందుకంటే డీఐసీజీసీ కింద బ్యాంకు సంక్షోభం పాలైతే ఒక బ్యాంకు పరిధిలో ఒక డిపాజిట్ దారుకు గరిష్టంగా వచ్చేది రూ.5 లక్షలకే పరిమితం. అందుకుని రూ.5 లక్షల చొప్పున వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్చేసుకోవాలి. దీర్ఘకాలానికి కాకుండా 1–3 ఏళ్ల వరకు డిపాజిట్ చేసుకుని, కాల వ్యవధి ముగిసిన తర్వాత రెన్యువల్ చేసుకోవడం మంచిది. ఆయా అంశాలపై ఒక నిర్ణయానికి ముందు వీటిపై సమగ్ర సమచారం పొందాలి. నిపుణులను సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకు ఎంపిక ఎలా? స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే వాటి అధికారిక వెబ్ సైట్ల నుంచి గణాంకాలు పొందొచ్చు. బ్యాంకు సామర్థ్యం ఏపాటిదో అవగాహన తెచ్చుకునేందుకు వాటి స్థూల మొండిబాకీలు (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్–ఎన్పీఏలు) ఏ స్థాయిలో ఉన్నాయి? బ్యాంకు రుణ పుస్తకం, డిపాజిట్ల బేస్ గత మూడేళ్ల కాలంతో పోలిస్తే, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉందన్నది చూడాలి. నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు మెరుగుపడ్డాయా లేక క్షీణించాయా? గమనించాలి. ఎస్ఎఫ్బీలు చిన్న గా (పరిమాణం పరంగా) ఉన్నందున వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే అవి అధిక వృద్ధిని నమోదు చేయగలవు. రుణాలు, డిపాజిట్లలో 25–35% వరకు, నికర వడ్డీ ఆదాయంలో 20–25% వృద్ధి ఉందంటే సానుకూలంగా చూడొచ్చు. ఎస్ఎఫ్బీలలో ఏయూ ఎస్ఎఫ్బీ మినహా మిగిలినవి సూక్ష్మ రుణ కార్యకలాపాలనే ఎక్కు వగా నిర్వహిస్తున్నాయి. దీంతో కరోనా సమయంలో వీటికి ఎక్కువ షాక్లు తగిలాయి. వాటి ఎన్పీఏలు ఐదేళ్ల సగటును మించి పోయాయి. వ్యాపార కార్యకలాపాలు తిరిగి గాడిన పడిన తర్వాత ఇవి తగ్గుముఖం పట్టడం సహజం. ఎస్ఎఫ్బీలు అన్నీ కూడా తగినన్ని నిధులతో ఉన్నందున ఆందోళన అనవసరం. -
ఎస్బీఐ డిపాజిట్, రుణ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంపుబాట నేపథ్యంలో... భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన డిపాజిట్, రుణ రేట్లను పెంచింది. మే తొలి వారం తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రెండు దఫాలుగా (0.40 శాతం, 0.50 శాతం చొప్పున) 4.9 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో ఆర్బీఐ 0.50 శాతం రెపో పెంపు నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ వెబ్సైట్ తెలిపిన సమాచారం ప్రకారం... ►ఎంపిక చేసిన కాలపరిమితులకు సంబంధించి రూ. 2 కోట్ల కంటే తక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.20 శాతం వరకూ పెరిగాయి. ఈ మార్పు తక్షణం అమల్లోకి వచ్చింది. ►211 రోజుల నుంచి ఏడాది మధ్య డిపాజిట్ రేటు ప్రస్తుతం 4.40% ఉంటే ఇది 4.60%కి పెరిగింది. సీనియర్ సిటిజన్లు ప్రస్తుతం 4.90% వడ్డీరేటు తీసుకుంటుండగా, ఇది 5.10%కి పెరగనుంది. ►ఇక ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్ రేటు 0.20 శాతం పెరిగి 5.30%కి చేరింది. ఈ విభాగంలో సీనియర్ సిటిజన్లు 5.80% వడ్డీ అందుకుంటారు. ►రెండు నుంచి మూడేళ్ల మధ్య వడ్డీరేటు 5.20 శాతం నుంచి 5.35 శాతానికి ఎగసింది. సీనియర్ సిటిజన్లు పొందే రేటు 5.70 శాతం నుంచి 5.85 శాతానికి పెరుగుతుంది. రూ. రెండు కోట్లపైన డిపాజిట్లు దాటితే... రూ.2 కోట్లు ఆపైబడిన డిపాజిట్లకు సంబంధించి వివిధ కాలపరిమితులపై వడ్డీరేటు 0.75%వరకూ పెరిగింది. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య రేటు 4% నుంచి 4.75%కి పెరిగింది. సీనియర్ సిటిజన్లకు ఈ రేటు 4.50% నుంచి 5.25 శాతానికి పెరుగుతుంది. రుణ రేట్ల పెరుగుదల ఇలా.. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణరేటు (ఎంసీఎల్ఆర్)ను కూడా ఎస్బీఐ 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. జూన్ 15 నుంచి తాజా పెంపు అమల్లోకి వస్తుంది. గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలకు దాదాపు ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.20% నుంచి 7.40% కి పెరగనుంది. వెబ్సైట్ ప్రకారం, రెపో ఆధారిత లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్)ను కూడా జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చేట్లు పెంచింది. ఐడీబీఐ బ్యాంక్ కూడా... మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ రూ.2 కోట్ల దిగువన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్–రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ), నాన్–రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) టర్మ్ డిపాజిట్లపై 15వ తేదీ నుంచి తాజా పెంపు నిర్ణయం అమలవుతుంది. తాజా నిర్ణయం ప్రకారం, 91 రోజుల నుంచి 6 నెలల మధ్య డిపాజిట్లపై రేటు 3.75% నుంచి 4%కి పెరుగుతుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.60%కి చేరింది. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్య రేటు 5.60% నుంచి 5.75%కి ఎగసింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
SBI Hikes Interest Rates On Fixed Deposits: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త. ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానుండగా...రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీరేట్లు వర్తించనున్నాయని అధికారులు తెలిపారు. 7 నుంచి 45 రోజుల వ్యవధి మినహాయించి మిగిలిన టెన్యూర్ వడ్డీరేట్లను పెంచింది. దీంతో 46 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్లో 3శాతం ఉన్న వడ్డీ రేటు 3.50శాతం, 180 నుంచి 210 టెన్యూర్లో 3.10 నుంచి 3.50శాతం వరకు పెరిగాయి. సంవత్సరం కంటే తక్కువ అంటే 211 రోజుల టెన్యూర్లో 3.30 శాతం నుంచి 3.75శాతం వరకు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల టెన్యూర్లో 3.60 నుంచి 4శాతం, 2 సంవత్సరాల నుంచి 3సంవత్సరాల లోపు టెన్యూర్లో 3.6శాతం నుంచి 4.25శాతం, మూడు నుంచి 5 సంవత్సరాల లోపు టెన్యూర్లో 4.50 శాతం వరకు, 5ఏళ్ల నుంచి 10 టెన్యూర్ వరకు 4.50శాతం వరకు పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ల పిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. 7 నుంచి 45 రోజుల టెన్యూర్ను మినహాయించింది. 46 నుంచి 179 రోజుల టెన్యూర్లో 3.5శాతం నుంచి 4శాతానికి, 180 రోజుల నుంచి 210 రోజుల టెన్యూర్లో 3.6శాతం నుంచి 4శాతానికి పెంచింది. ఒక సంవత్సరం కంటే తక్కువ అంటే 211 రోజుల టెన్యూర్లో 3.80శాతం నుంచి 4.25 శాతానికి, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు టెన్యూర్లో 4.1 శాతం నుంచి 4.5శాతం వరకు, 2 సంత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు టెన్యూర్లో 4.1 నుంచి 4.75శాతం వరకు, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు టెన్యూర్లో 4.1 నుంచి 5శాతం , 5 సంవత్సరాల నుంచి 10ఏళ్ల టెన్యూర్లో 4.1 శాతం నుంచి 5శాతానికి వడ్డీ రేట్లు పెంచుతూ తాజాగా ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చదవండి👉వందల కోట్లే..ఎస్బీఐ కార్డ్స్కు పెరిగిన లాభం! -
మంత్రిగారు మా గోడు వినండి! ట్యాక్స్–ఫ్రీ డిపాజిట్ల కాలాన్ని తగ్గించండి
న్యూఢిల్లీ: పన్ను రహిత స్థిర డిపాజిట్ల (ట్యాక్స్–ఫ్రీ ఎఫ్డీలు) కాలపరిమితిని ప్రస్తుత ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 2022–23 వార్షిక బడ్జెట్లో ప్రతిపాదనను ప్రవేశపెట్టాలని కోరింది. వచ్చే నెల ఒకటవ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఐబీఐ చేసిన బడ్జెట్ ముందస్తు సిఫారసుల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఈక్విటీ అనుసంధాన పొదుపు పథకాల (ఈఎల్ఎస్ఎస్) వంటి మ్యూచువల్ ఫండ్ ప్రొడక్స్కు అందిస్తున్న పన్ను ప్రయోజనాలను స్థిర డిపాజిట్లకు అందించాలి. ఇందుకు సంబంధించి పన్ను రహిత స్థిర డిపాజిట్ల కాలపరిమితిని మూడేళ్లకు తగ్గించాలి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద ఐదేళ్ల స్థిర డిపాజిట్ పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ. 1.50 లక్షల పనున మినహాయింపు ఉంది. ► మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ (ఈక్విటీ అనుసంధాన పొదుపు పథకాల వంటివి) పోలిస్తే, పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) తక్కువ ఆకర్షణీయంగా ఉంది. అయితే లాక్–ఇన్ వ్యవధిని తగ్గించినట్లయితే, పన్నుల పరంగా స్థిర డిపాజిట్లు కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. తద్వారా బ్యాంకులకు సైతం నిధుల లభ్యత పెరగుతుంది. ► బలహీన రంగాలను ప్రోత్సహించడం, వివిధ పథకాలను అమలుచేయడంసహా అందరికీ ఆర్థిక ఫలాలు అందించడం, బ్యాంకింగ్ సేవల విస్తృతి, డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడం, ఐటీ వ్యయాలవంటి అంశాలకు బ్యాంకులు వివిధ ఖర్చులను బ్యాంకింగ్ భరిస్తోంది. వీటి భర్తీకి కొంతమేర ప్రత్యేక రిబేట్లు, అదనపు ప్రోత్సహకాలను కూడా బ్యాంకింగ్ కోరుతోంది. ► పన్నులకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగం బ్యాంకింగ్కు అవసరం. ► బ్యాంకుల అప్పీళ్ల వ్యవహారాల్లో గణనీయమైన మొత్తాలు కూడా ఉంటాయి. అయితే విచారణ సందర్భల్లో భారీ మొత్తాలకు సంబంధించిన అంశాలనుకూడా చిన్న మొత్తాలతో కూడిన అప్పీళ్లతో సమానంగా పరిగణిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ► బ్యాంకులు–ప్రభుత్వ వాఖ మధ్య అప్పీళ్ల వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు ఉండాలి. ► పన్ను శాఖ– బ్యాంకుల మధ్య వ్యాజ్యాలను తగ్గించడానికి, అప్పీల్ ప్రక్రియ విచారణను వేగవంతంగా పూర్తి చేయడానికి ఖచ్చితమైన సమయపాలనతో ఏర్పాటు చేయబడిన వివాదాల కమిటీ మాదిరిగానే ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగం అవసరం. చదవండి: కేంద్ర బడ్జెట్లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..! -
బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా..! అయితే మీకో గుడ్న్యూస్!
బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇంట్రస్ట్ రేట్లు పెంచుతూ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతా దారులు వడ్డీరేట్ల పెంపుపై సంతోషం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన ఆ ఇంటస్ట్ర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం? దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు తర్వాత వడ్డీ రేటు 5.6 శాతంగా ఉంటుంది. పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా..,రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి.ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. అలాగే, ఫిక్స్డ్ డిపాజిట్పై వడ్డీ పొందేందుకు కనీస వ్యవధి 7 రోజులు. వడ్డీ ఒక సంవత్సరంలోని రోజుల సంఖ్య ఆధారంగా లెక్కించబడుతుంది. లీపు సంవత్సరంలో వడ్డీ 366 రోజులకు లెక్కించబడుతుంది, సాధారణ సంవత్సరంలో వడ్డీ 365 రోజులకు లెక్కించబడుతుంది. కాగా, పెరిగిన వడ్డీ రేట్లపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీ దగ్గర్లోని బ్యాంక్ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే -
టైమ్ బ్యాంక్లొస్తున్నాయ్.. ఓ 4 ‘గంటలు’వెనకేసుకుందాం!
సాక్షి, సెంట్రల్డెస్క్: ప్రస్తుతం ప్రపంచమంతా డబ్బు కోసం పరుగులు పెడుతోంది. ఎవరిని కదిలించినా.. ‘ఎంతో కొంత వెనకేసుకోవాలి కదరా’ అనే మాటే వినబడుతోంది. కానీ అసలు ప్రపంచంలో డబ్బే అవసరం లేకుండా పనులు జరిగిపోతే. మనకు వచ్చే పనులను వేరే వాళ్లకు చేసిపెట్టి.. మనకు అవసరమున్న పనులను అవి వచ్చే వాళ్లతో చేయించుకుంటే. ఈ పనులన్నింటినీ వాటికయ్యే సమయం ప్రకారం లెక్కిస్తే. ఇదేదో బాగుంది కదా! దీన్నే టైమ్ బ్యాంకు విధానం అంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అసలు ఏంటీ విధానం, ఎలా నడుస్తుంది, ఎన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది, మన దేశంలో పరిస్థితేంటి.. తెలుసుకుందాం. మీరో కంప్యూటర్ హార్ట్వేర్ ఇంజనీర్. మీ ఇంట్లో గార్డెనింగ్ పని చేయాల్సి ఉంది. ఆ పని చేసే వ్యక్తిని పిలిచారు. అతను వచ్చి ఆ పని చేసేశాడు. సుమారు 2 గంటల సమయం పట్టింది. ఆ సమయం ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్నిరోజులకు వేరే ఎవరి ఇంట్లోనో షార్ట్ సర్క్యూట్ వల్ల కంప్యూటర్ పాడైతే మీరు వెళ్లి బాగు చేశారు. రిపేర్కు దాదాపు 4 గంటలు పట్టింది. ఈ సమయం మీ బ్యాంకు ఖాతాలో చేరిపోతుంది. ఇంతకుముందు మీరు చేయించుకున్న రెండు గంటల పని పోనూ ఇంకో రెండు గంటలు మిగులుతుంది. ఈ సమయాన్ని మీరు వేరే పనులకు వాడుకోవచ్చు. ఇలా మీకు వచ్చిన పనులు చేస్తూ, వాటికి పట్టే సమయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తుండటం.. మీకు కావాల్సిన పనులకు ఆ సమయాన్ని వాడుకోవడం.. డబ్బు అవసరమే లేకుండా పనులన్నీ జరిగిపోవడం.. ఇదే టైమ్ బ్యాంకు విధానం. ఇప్పుడు చాలా దేశాల్లో వాడుకలోకి వస్తున్న సరికొత్త విధానం. ఎక్కడ పుట్టింది ఈ ఐడియా? ప్రజలు తాము చేసే పనులను డబ్బుకు బదులు సమయంతో కొలిచే ఈ కొత్త విధానానికి అమెరికాకు చెందిన ఎడ్గర్ ఎస్. కాన్ అనే వ్యక్తి సృష్టికర్త. ప్రస్తుతం ఇతను అమెరికాలో టైమ్ బ్యాంకులకు సీఈవో. ఈ పద్ధతిలో ఎవరైనా ఒక గంటపాటు తమకు వచ్చిన పనిని అవసరమైన వారికి చేశారనుకోండి.. అతనికి ఓ గంట టైమ్ క్రెడిట్ ఇస్తారు. అలా పని చేసిన మొదటి వ్యక్తికి ఇంకేదైనా పని అవసరమైనప్పుడు ఆ పని చేయగలిని వాళ్లు వచ్చి ఆ గంట చేసి వెళ్తారు. ఇలా టైమ్ను క్రెడిట్ చేసుకోవడం, డెబిట్ చేయడం, అవసరమైన పనులకు వ్యక్తులను పంపడం లాంటివి చూసుకునేందుకే టైమ్ బ్యాంకులు ఉంటాయి. ఎన్ని దేశాల్లో నడుస్తోంది? ప్రస్తుతం ఓ ప్రణాళికాబద్ధంగా టైమ్ బ్యాంకులు 30కి పైగా దేశాల్లో నడుస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలూ ఈ టైమ్ బ్యాంకులను నడిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ టైమ్ బ్యాంకుల ద్వారా 40 లక్షల గంటల పని జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రాంతాలు, దేశాల వరకే పరిమితమైన ఈ టైమ్ బ్యాంకుల సరిహద్దులను చెరిపేసేందుకు టైమ్ రిపబ్లిక్ 2013లో తొలి గ్లోబల్ టైమ్ బ్యాంకును కూడా ప్రారంభించింది. స్విట్జర్లాండ్లో వృద్ధుల కోసం.. స్విట్జర్లాండ్లో ఈ టైమ్ బ్యాంక్ను వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం లాగా ప్రారంభించారు. ఇందులో చేరిన ప్రతి వ్యక్తికీ సామాజిక భద్రత అకౌంట్ ఒకటి, టైమ్ బ్యాంకు కార్డు ఒకటి ఇస్తారు. ఎవరైనా ఎప్పుడైన సాయం అవసరమైతే తమ టైమ్ను వాడుకోవచ్చు. ఆ వ్యక్తి కోరే పని చేసే వలంటీర్ను ఎంపిక చేసి బ్యాంకు వాళ్లు పంపుతారు. సామాజికంగా కలిసిమెలిసి ఉండే వాళ్లకు, కొత్త పరిచయాలు కోరుకునే వాళ్లకు ఈ టైమ్ బ్యాంకింగ్ ఉత్సాహాన్నిస్తుంది. ఎందుకంటే స్విట్జర్లాండ్లో టైమ్ బ్యాంక్ క్లబ్లో చేరిన సభ్యులతో బ్యాంకులు ఎప్పటికప్పుడు సమావేశాలు, పార్టీలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశంలో ఏంటి పరిస్థితి? స్విట్జర్లాండ్లో అమలు చేస్తున్న పథకాన్ని దేశంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచించింది. దేశంలో దాదాపు కోటిన్నర మంది వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. వీళ్లలో ఏదోరకంగా సేవలు పొందుతున్న వాళ్లు కేవలం 20 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్లు ఏపనినైనా తమకుతాముగా చేసుకోవాల్సిందే. మరో 30 ఏళ్లలో దేశంలో 60 ఏళ్ల పైబడిన వాళ్లు మొత్తం జనాభాలో 20 శాతం అవుతారు. ప్రస్తుత సమాజంలో చిన్న కుటుంబాలు పెరగడం, సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండటంతో వృద్ధులు ఒంటరిగా గడపాల్సిన సందర్భాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టైమ్ బ్యాంకుల ద్వారా యువకులు ముందుకొచ్చి వృద్ధుల అవసరాలు తీర్చడం, వాళ్ల ఒంటరితనాన్ని పోగొట్టడం, అందుకు యువకులు వెచ్చించిన సమయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం, ఆ తర్వాత తమ వృద్ధాప్యంలో ఆ సమయాన్ని వాడుకునే వెసులుబాటు పొందడం వంటివి సమస్యలకు పరిష్కారం చూపిస్తాయని కొందరు నిపుణులు అంటున్నారు. లోపాలేమైనా ఉన్నాయా? టైమ్ బ్యాంకులు ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. కాబట్టి సర్వీసులు పొందే, అందించే వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఈ సర్వీసుల్లో సాంకేతికతను చాలా తక్కువగా వాడుతున్నారు. అంటే టైమ్ బ్యాంక్ యాప్ లాంటివి ఇంకా అందుబాటులోకి రాలేదు. పైగా కొన్ని పనులకు విలువ ఎక్కువగా ఉంటుంది. కొన్నింటికి తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక సమస్యే. అయితే ఒకవేళ ఎవరి పనికైనా మిగతా వాళ్ల పనులతో పోలిస్తే ఎక్కువ విలువ ఉంటుందని, ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటే అలాంటి వాళ్లు సమయానికి బదులు డబ్బును కోరే వెసులుబాటును ఈ బ్యాంకుల్లో ఇస్తూ సమస్యను పరిష్కరిస్తున్నారు. పేద దేశాల్లో సాధ్యమా? ఇలాంటి టైమ్ బ్యాంకు విధానం ధనిక దేశాల్లోనే కుదురుతాయని కొందరు నిపుణులు అంటున్నారు. అలాంటి దేశాల్లో ప్రజలకు తిండి, చదువు కోసం పెద్దగా ఆందోళన ఉండదని, కాబట్టి వాళ్లు ఇలాంటి పనులకు ముందుకొచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. పైగా ధనిక దేశాల్లో ఇలాంటి పనులు చేసేవాళ్లకు అక్కడి ప్రభుత్వాలు కావాల్సిన సదుపాయాలు, డబ్బులు కూడా అందించే అవకాశం ఉంటుందన్నారు. కానీ పేద, మధ్య తరగతి దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదని, ఆ దేశాల్లో తిండి కోసమే ప్రజలు ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుందని, పిల్లల చదువులకు డబ్బులు అవసరమవుతాయని చెబుతున్నారు. కాబట్టి ఆ దేశాల ప్రజలు ఈ కొత్త విధానానికి ఇష్టపడరని అంటున్నారు. -
ఫిక్స్డ్ డిపాజిట్లు, ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా..?
మీరు బ్యాంక్లో పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటున్నారా?అయితే ఇది మీ కోసమే. ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడిని వచ్చేలా పలు బ్యాంకులు ఆశాజనకంగానే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆ వడ్డీ రేట్ల ఆధారంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే మంచిదని ఆర్ధిక వేత్తలు సలహా ఇస్తున్నారు. మనలో చాలా మందికి ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి తక్కువగా ఉంటుందని అనుకుంటారు. అందులో కొంత వాస్తవం ఉన్నా.. మీ డబ్బులు సేఫ్గా ఉంటాయని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం బ్యాంకులు దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై 5% నుండి 6.5% వరకు ఆఫర్ చేస్తున్నాయి. అయితే, మీరు ఎఫ్డీలో పెట్టాలని నిర్ణయించుకునే ముందు బ్యాంకులు, పోస్టాఫీసులు అందించే వడ్డీ రేట్లను పోల్చడం మంచిది. లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది వేర్వేరు లక్ష్యాలకు వేరే రకమైన పెట్టుబడి ప్రణాళిక అవసరం. ఉదాహరణకు ఎఫ్డీలో పెట్టుబడులు నిజమైన రాబడిని ఇవ్వవు. అనగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని అందించవు. కాబట్టి మీ పిల్లల విద్య కోసం 15 సంవత్సరాల ఎఫ్డీలో నిధులు ఉంచడం వల్ల లాభం ఉండదు. అయితే మీరు ఒకటి లేదా రెండు సంవత్సరాలకే పరిమితం చేసుకోవాలంటే ఎఫ్డీలపై బ్యాంకులు అందించే ఇంట్రస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి. -
హుజురాబాద్ :1978 నుంచి కాంగ్రెస్కు నో చాన్స్..
కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గం కలిసి రావట్లేదు. వరుసగా పరాజయాలను మూటకట్టుకుని చిక్కిశల్యమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఈ ఉప ఎన్నికల్లో ఏకంగా డిపాజిటే కోల్పోయింది. అనివార్యంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత బలమైన అభ్యర్థినే బరిలోకి దింపుతారన్న ప్రచారం జరిగింది. ఈస్థానం నుంచి పోటీ చేసేందుకు కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్యల పేర్లు వినిపించాయి. అధిష్టానం చివరి నిమిషంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు కాగా, ఇక.. పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. 1978 నుంచి కాంగ్రెస్కు నో చాన్స్.. 1952 ఏర్పడిన హుజూరాబాద్ ద్వి శాసనసభ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ తరఫున పున్నమనేని నారాయణరావు, సోషలిస్టు పార్టీ నుంచి జి.వెంకటేశం గెలుపొందారు. తిరిగి 1957లో జరిగిన ద్వి శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నర్సింగరావు, రాములు విజయం సాధించారు. 1962లో ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాములు మరోసారి గెలుపొందారు. 1967లో పోల్సాని నర్సింగరావు, 1972లో వొడితెల రాజేశ్వర్రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా జయకేతనం ఎగుర వేశారు. అనంతరం 1978, 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2008, 2009, 2010, 2014, 2018లో జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులెవరు గెలుపొందిన దాఖలాలు లేవు. ఆ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన ఓట్లు పొంది డిపాజిట్ దక్కించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రస్తుత ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ ఘన విజయం సాధించగా మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. 1978 నుంచి నేటి వరకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందకపోగా మొదటిసారి బీజేపీ ఇక్కడి నుంచి గెలిచి చరిత్ర సృష్టించారు. చదవండి: Telangana: అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ -
కేసీఆర్ డిపాజిట్ పోవడం ఖాయం: ఈటల
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ గడ్డ మీద న్యాయం గా, ధర్మంగా ఎన్నికలు జరిగితే కేసీఆర్ డిపాజిట్ పోవడం ఖాయమ’ని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం జ మ్మికుంటలో నిర్వహించిన ఆరె క్షత్రీయుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల మాట్లాడారు. ‘నేను ధర్మం తప్పను. న్యాయం వదలను. కన్నీళ్లు, కష్టం ఉన్నవాళ్ల దగ్గర ఉంటా’అని తెలిపారు. తాను మంచివాడిని కాకపోతే 18 ఏళ్లు ఎలా భరించారో కేసీఆర్ సమాధానం చెప్పాలి’అని అన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, మహిళా సంఘాల పావలా వడ్డీ రుణాలు, గొర్రెలు, దళితబంధు.. ఇలా అన్నింటిని ఈటలను ఓడించేందుకు అమలు చేస్తున్నారని, ప్రగతి భవన్ లో కుట్రలకు ప్రణాళిక చేస్తే, హరీశ్రావు వాటిని అమలు చేస్తున్నారని, హరీశ్రావుపై ప్రజలకు గౌర వం పోయిందని అన్నారు. ‘ఒకడు పొట్టిగా ఉన్నానని.. ఇంకొకడు రెండు వేల ఎకరాలు ఉన్నాయని.. ఇంకోడు రెండు వందల ఎకరాలు ఉ న్నాయని.. మరొకరు నాకు నేనుగా నామీద దాడి చేసుకొని.. కాళ్ల కు, చేతులకు కట్లు కట్టుకొని ఓట్లు అడుక్కుంటానని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం’అని ప్రశ్నించారు. ‘మీకు కూడా భార్య, తల్లి ఉంటుంది. 13, 14 తారీఖుల్లో దాడి చేయించుకుంటానని అంటున్నారు,, ఇప్పుడు టీఆర్ఎస్ నేతలపైనే తనకు అనుమానం వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.4,700 కోట్ల మేరకు జీవోలు కేవలం హుజూరాబాద్ ఎన్నిక కోసమే జారీ చేశారని తెలిపారు. అనంతరం జమ్మికుంటలో నిర్వహించిన కిసాన్మోర్చా సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘ఒకడికి రూ.50 లక్షలు ఇచ్చి కరపత్రాలు కొట్టించి నాకు వ్యతిరేకంగా దళితవాడల్లో పంచిస్తున్నాడు. డబ్బులు తీసుకుని ప్రెస్మీట్లు పెట్టేవాళ్లు, కరపత్రాలు పంచేవాళ్లు హుజూరాబాద్కు కోకొల్లలుగా వచ్చారు’ అని ఆరోపించారు. -
హుజురాబాద్: తుపాకులు అప్పగించాలె.. లేదంటే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో లైసెన్స్ తుపాకులపై పోలీసులు దృష్టిపెట్టారు. లైసెన్సు కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో పోలీసుశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆయుధాలచట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం.. కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ, లైసెన్సు తుపాకులు కలిగి ఉన్నవారంతా సమీపంలోని పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేయాలి. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా, ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేస్తారు. చదవండి: పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట అలా చేయని వారిపై కేసులు పెట్టేందుకు వెనకాడమని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీపీ స్పష్టంచేశారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి నవంబరు 6వ తేదీన తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయబ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతాసిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని వివరించారు. కమిషరేట్ పరిధిలో 101 లైసెన్స్డ్ తుపాకులు ఉండగా అందులో 73 తుపాకులు వ్యక్తిగతమైనవి కాగా.. మిగిలిన 28 గన్స్ భద్రతాసిబ్బంది వద్ద ఉన్నాయి. చదవండి: హుజురాబాద్.. ప్రతి గడప తొక్కుదాం.. ఒక్క ఓటు వదలొద్దు -
Karimnagar: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): గ్రామంలో ఎవరికైనా కూతురు పుడితే పాప పేరిట రూ.5,116 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేశ్ ప్రకటించారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై వివక్ష చూపవద్దన్నారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టినట్లుగా భావించాలని చెప్పారు. తల్లి, చెల్లి, భార్య ఆడవాళ్లే అయినప్పుడు పుట్టే బిడ్డ మాత్రం ఆడబిడ్డ కావొద్దని కోరుకోవడం మూర్ఖత్వమేనని పేర్కొన్నారు. పంచాయతీ రికార్డుల్లో జనన నమోదు చేసిన వెంటనే రమేశ్ అన్న కానుక పేరిట రూ.5,116 బ్యాంకులో డిపాజిట్ చేసి, సంబంధిత పత్రాలను తల్లిదండ్రులకు అందిస్తామని తెలిపారు. దసరా పండుగ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. సర్పంచ్ నిర్ణయాన్ని గ్రామస్తులు అభినందించారు. తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ ఇందు, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ తాజొద్దీన్ ఉన్నారు. చదవండి: వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసు: జువైనల్ హోంకు బాలుడి తరలింపు -
‘రేవంత్ దమ్ముంటే హుజూరాబాద్లో డిపాజిట్ తెచ్చుకో’
కమలాపూర్: ‘నువ్వు పీసీసీ అధ్యక్షుడివి అయ్యాక జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది. నీకు దమ్ముంటే హుజూరాబాద్లో కాంగ్రెస్కు డిపాజిట్ తెచ్చుకో’అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘బిడ్డా రేవంత్రెడ్డి.. తెలంగాణ లో అక్కడక్కడ సభలు పెడుతున్నావు. కానీ, హుజూరాబాద్ గురించి ఎందుకు మాట్లాడుతలేవు? ఈటలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నవా?’అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదని, అది విహారయాత్ర అని ఎద్దేవా చేశారు. -
రోజు రూ.100 ఇన్వెస్ట్మెంట్తో రూ.15 లక్షలు మీ సొంతం..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు సరికొత్త స్కీమ్ను అందుబాటులోకి తెచ్చింది. సుకన్య సమృద్ది యోజన కింద పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ పథకం కింద పంజాబ్ బ్యాంకులోని ఏ శాఖలోనైనా ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చును. ఒక పేరెంట్గా, మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి ఖాతాలో రూ .250 కనీస డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ .1,50,000 డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంది. తల్లిదండ్రులు ఖాతా ఓపెన్ చేసిన 15 సంవత్సరాల వరకు లబ్దిదారుల ఖాతాలో ప్రీమియం అమౌంట్ను డిపాజిట్ చేయవచ్చును. ఖాతా తెరిచిన తేదీ నాటికి లబ్ధిదారులకు 10 సంవత్సరాలు నిండి ఉండకూడదు .సుకన్య సమృద్ధి ఖాతాలపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది. ఈ ఖాతాలపై బ్యాంకు 7.6 శాతం వడ్డీ రేటును ఇవ్వనుంది. ఈ ఖాతాలను పోస్టాఫీసులకు బదిలే చేసుకునే సౌకర్యాన్ని పీఎన్బీ బ్యాంకు కల్పిస్తుంది. అకౌంట్ హోల్డర్ ఉన్నత విద్య కోసం, ఖాతాలోని అమౌంట్ నుంచి గరిష్టంగా 50 శాతం వరకు విత్డ్రా చేయవచ్చును. సుకన్య సమృద్ధి ఖాతా ఓపెన్ అయినప్పటి నుంచి మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలుగా ఉండనుంది. మీరు సుకన్య సమృద్ధి ఖాతాలో రోజుకు రూ.100 చొప్పున అంటే నెలకు రూ .3000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలం మిగిసే సమయానికి లబ్థిదారులు రూ .15 లక్షలకు పైగా పొందవచ్చును. ఏటా రూ .36,000 డిపాజిట్ చేయడం ద్వారా, మీరు 14 సంవత్సరాల తర్వాత 7.6 శాతం వడ్డీరేటుతో రూ .9,11,574 వరకు పొందుతారు. 21 సంవత్సరాల తర్వాత, అమౌంట్ రూ .15,22,221 వరకు వస్తోంది. -
ఇన్కంట్యాక్స్ నుంచి మినహాయింపు కావాలా? ఇవిగో మార్గాలు
వ్యాపారం ఎంతో రిస్క్తో కూడిన పని. అనేక కష్టనష్టాలకు ఓర్చితేనే ఏదైనా కంపెనీ లాభాల బాట పడుతుంది. అయితే ఈ లాభాల నుంచి ఆదాయపన్ను కట్టాల్సి వస్తుంది. బడా కంపెనీలకు ఇది పెద్ద సమస్య కాకపోయినా ఎదుగుతున్న కంపెనీలు పన్ను మినహాయింపు ఆశిస్తాయి. ప్రతీనెల జీతం తీసుకునే ఉద్యోగులు ఆదాయం పన్ను మినహాయింపును కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం చట్ట పరంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చే వాటిలో కొన్ని.. టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మనకు, మన కుటుంబానికి ఇన్సురెన్స్ భద్రత అందిస్తుంది. ఆదాయపన్ను కడుతున్నవారు ఇన్వెస్ట్ చేయాల్సిన వాటిలో ఇన్సురెన్స్ ప్రధానమైంది. ఇన్సురెన్స్ పాలసీ ప్రీమియంగా చెల్లించిన మొత్తానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం కడితే ఆ ఏడాదికి సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చట్టపరంగా ఇన్కంట్యాక్స్ను తగ్గించుకునేందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం చక్కనగా ఉపకరిస్తుంది. ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ప్రారంభించి, అందులో జమ చేసిన సొమ్ముకు పన్ను నుంచి మినహయింపు ఉంటుంది. అయితే ఇందులో జమ చేసే మొత్తాన్ని 15 ఏళ్ల వరకు విత్డ్రా చేయడానికి వీలులేదు. ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు ఎక్కువ మంది ఎంచుకునే మార్గాల్లో ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఒకటి. ఈక్విటీ మార్కెట్లతో పోల్చితే రిస్క్ తక్కువ, గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అయితే డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ పథకం ద్వారా పన్ను రాయితీ పొందవచ్చు. తక్కువ ఆదాయం పొందే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. రిటర్న్స్ కూడా ఎక్కువగా అందిస్తుంది. ఈ పథకం ద్వారా రూ. 1.50 లక్షల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం అరవై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు పన్ను రాయితీ కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఐదేళ్లు మెచ్యూరిటీ పీరియడ్గా ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. -
ఈడీఎల్ఐ పరిమితి రూ. 7 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం(ఈడీఎల్ఐ) కింద పొందే గరిష్ట ప్రయోజన పరిమితిని ఈపీఎఫ్ఓ రూ. 7 లక్షలకు పెంచింది. దీంతో ఈపీఎఫ్ సభ్యులు అనారోగ్యం, యాక్సిడెంట్ లేదా సహజ కారణాలతో మరణించినట్లయితే వారి నామినీకి రూ.7 లక్షల వరకు చెల్లిస్తారు. ఈపీఎఫ్ఓ సభ్యులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. గతంలో డెత్ ఇన్సూరెన్స్ పరిమితి 2–6 లక్షల రూపాయలుండగా, తాజాగా ఈ పరిమితిని రూ.2.5–7 లక్షల రూపాయలకు పెంచినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. మరణానికి 12 నెలల ముందు ఉద్యోగి పొందిన సరాసరి జీతం ఆధారంగా కవరేజ్ వర్తిస్తుంది. చదవండి:పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
సాగర్ ఫలితం: ప్చ్.. డిపాజిట్ దక్కలే!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం కమలనాథులకు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపినా డిపాజిట్ కూడా దక్కకపోవడం బీజేపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న తరుణంలో సాగర్ ఉప ఎన్నిక ఫలితం కమలనాథులకు మింగుడు పడటం లేదు. సాగర్ ఎన్నికలో గెలిచి గ్రామీణ తెలంగాణలోనూ పుంజుకుంటున్నామని చెప్పుకోవాలని భావించినా.. అలా జరగకపోవడంతో ఏం చేయాలో పాలుపోనిస్థితిలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి రవినాయక్కు 7,676 ఓట్లే రావడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పనిచేయని మంత్రం... బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్రెడ్డిని కాదని.. లంబాడా సామాజిక వర్గానికి చెందిన రవినాయక్ను బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా బరిలోకి దింపింది. అయితే, ఈ ఎన్నికలో గెలుస్తామని లేదా రెండో స్థానంలో నిలుస్తామనే ఆశలు బీజేపీ నాయకత్వంలో మొదటి నుంచీ కనిపించలేదు. కానీ, ఎస్టీ అభ్యర్థిని రంగంలోకి దింపిన నేపథ్యంలో పరువు నిలుపుకునే ఓట్లు వస్తాయని, కనీసం 20వేలకు పైగా సాధిస్తే తాము గెలిచినట్లేనని ఆ పార్టీ నేతలు భావించారు. అయితే బీజేపీ ప్రయోగించిన మంత్రం పనిచేయకపోవడంతో రవినాయక్ డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చింది. దుబ్బాక అసెంబ్లీ ఫలితం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న పార్టీకి ఈ ఫలితం షాక్ ఇచ్చిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సాగర్ ఎన్నిక ఒక్కటే పార్టీ భవిష్యత్ను తేల్చదని పార్టీ నేతలు కొందరు పేర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలను బట్టి పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, ఆ ఫలితాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ అడ్రస్ గల్లంతు టీడీపీ తరపున పోటీ చేసిన మువ్వా అరుణ్ కుమార్ పరిస్థితి మరీ దారుణం. ఆయన కేవలం 1708 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. అరుణ్ కుమార్ కంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తలారి రాంబాబు(2970) ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. ‘నోటా’కు 498 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో జానారెడ్డి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 70,504 ఓట్లు దక్కాయి. 26 రౌండ్ల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో కేవలం రెండు రౌండ్లలో (10,14) మాత్రమే జానారెడ్డి ఆధిక్యత కనబరిచారు. విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు 88,982 ఓట్లు వచ్చాయి. -
డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ శుభవార్త
సాక్షి, ముంబై: భారతదేశంలో ప్రముఖ గృహ రుణ సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ వివిధ కాలపరిమితుల స్థిర డిపాజిట్ పథకాలపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ వడ్డీరేటు పెంచింది. మార్చి 30వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. పలు బ్యాంకులు తమ స్థిర డిపాజిట్లపై వడ్డీని తగ్గిస్తున్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ వెబ్సైట్ తెలుపుతున్న సమాచారం ప్రకారం, ప్రత్యేక స్థిర డిపాజిట్ విషయానికి వస్తే, రూ. 2 కోట్ల వరకూ 33 నెలల పాటు డిపాజిట్ చేస్తే 6.20 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. 66 నెలల మెచ్యూరిటీ విషయంలో 6.60% వడ్డీ అమలవుతుంది. 99 నెలల స్థిర డిపాజిట్లపై 6.65 శాతం వడ్డీ అందుతుంది. -
సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం
-
బాధితుల్ని మోసం చేసిన చంద్రబాబు
-
ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యంత ధనవంతుడైన రమేశ్కుమార్ శర్మ డిపాజిట్ గల్లంతైంది. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిని రూ.1,107 కోట్లుగా పేర్కొన్న రమేశ్కుమార్, బిహార్లోని పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆయనకు కేవలం 1,558 ఓట్లు మాత్రమే రావడంతో డి´జిట్ను కోల్పోయారు. మొత్తం పోలైన ఓట్లలో ఆయనకు వచ్చినవి 0.14 శాతం ఓట్లు మాత్రమే. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామ్క్రిపాల్ యాదవ్ గెలుపొందారు. రామ్క్రిపాల్కు 5 లక్షల ఓట్లు(47.28 శాతం) రాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి 4.7 లక్షల ఓట్లతో (43.63 శాతం) రెండో స్థానంలో నిలిచారు. లోక్సభలో పోటీపడిన టాప్ 5 ధనవంతుల్లో రమేశ్కుమార్ మినహా మిగతా నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. వారిలో కొండా విశ్వేశ్వర్రెడ్డి రూ.895 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ రూ.660 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో, వసంతకుమార్ రూ.417 కోట్ల ఆస్తితో నాలుగో స్థానంలో, జ్యోతిరాదిత్య సింధియా రూ.374 కోట్ల ఆస్తితో ఐదో స్థానంలో ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్రెడ్డి చేతిలో 14,317 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్ లోని చిన్ద్వారా నియోజకవర్గంలో పోటీచేసి న నకుల్ నాథ్ 35 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తమిళనాడులోని కన్యాకుమా రి నియోజకవర్గంలో వసంతకుమార్ 3 లక్షల ఓట్ల మెజారిటీలో విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని గుణ నియోజకవర్గంలో పోటీచేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అభ్యర్థి క్రిష్ణపాల్ సింగ్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
పెట్టుబడులకు.. సిస్టమ్యాటిక్ రికరింగ్ డిపాజిట్
ఈక్విటీలు దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చే సాధనం. కానీ, పెట్టుబడికి, రాబడులకు ఎప్పుడూ రిస్క్ ఎంతో కొంత ఉంటుంది. కనుక పెట్టుబడులన్నీ తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకుండా, భిన్న సాధనాల మధ్య వైవిధ్యం ఉండేలా చూసుకోవాలంటూ సూచనలిస్తుంటారు ఆర్థిక సలహాదారులు. పోర్ట్ఫోలియో రిస్క్ను తగ్గించి స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలు ఎన్నో ఉన్నాయి. వీటిని పరిశీలించినప్పుడు పెట్టుబడుల మధ్య వైవిధ్యం, సమతుల్యత కోసం రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) మంచి ఆప్షన్. బ్యాంకులు అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ సాధనాలను ఇన్వెస్టర్లు తమ మధ్య కాలం నుంచి దీర్ఘకాలిక అవసరాల కోసం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రయోజనాలు... ఫిక్స్డ్ డిపాజిట్ లాభాలు ఆర్డీలోనూ ఉంటాయి. కాకపోతే దీనికి అదనంగా పెట్టుబడులకు క్రమశిక్షణ అన్నది ఆర్డీతో సాధ్యం. నిర్ణీత కాలానికి, ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది కనుక... అనవసర దుబారా కంటే పెట్టుబడికి ప్రాధాన్యం గుర్తుకొస్తు్తంది. కనీసం రూ.100 నుంచి కూడా ఆర్డీ చేసుకునేందుకు బ్యాంకులు అవకాశం ఇస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బంధన్బ్యాంకులు వంటివి తక్కువ మొత్తానికే వీలు కల్పిస్తుంటే, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి పెద్ద బ్యాంకులు రూ.1,000 నుంచి ఆర్డీ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒకేసారి ఒకే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదే ఆర్డీ అయితే ప్రతీ నెలా ఇంత చొప్పున నిర్ణీత కాలం వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వడ్డీ రేట్లు... రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఆర్డీ టర్మ్ (కాల వ్యవధి)ను బట్టి వేర్వేరుగా ఉంటాయి. అది కూడా బ్యాంకులను బట్టి మారిపోతుంటాయి. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లకు దగ్గరగానే ఈ రేట్లు ఉండడాన్ని గమనించొచ్చు. ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే అధిక రేటు ఆఫర్ చేస్తోంది. 27–36 నెలల కోసం ఆర్డీ చేసేట్టు అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆఫర్ చేస్తున్న రేటు 7.4%. 60 ఏళ్లు దాటిన వారికి అరశాతం వడ్డీ రేటు అదనంగా ఇస్తోంది. బంధన్ బ్యాంకు అయితే 7.65% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.75% ఎక్కువ ఇస్తోంది. ఇక బ్యాంకులతోపాటు డిపాజిట్లు సేకరించే ఎన్బీఎఫ్సీలు కూడా ఆర్డీ పథకాలను అందిస్తున్నాయి. వీటిల్లో వడ్డీ రేట్లు బ్యాంకుల్లో కంటే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఎన్బీఎఫ్సీల్లో ఆర్డీ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంకుల్లో చేసే రూ.లక్ష వరకు డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బీమా ఉంటుంది. అదే ఎన్బీఎఫ్సీల్లో చేసే డిపాజిట్లకు బీమా వర్తించదు. తమ అవసరాలకు అనుగుణంగా ఆర్డీ టర్మ్ను ఎంచుకోవచ్చు. చాలా బ్యాంకులు ఆరు నెలల నుంచి పదేళ్ల కాల వ్యవధి వరకు టర్మ్లతో కూడిన ఆర్డీలను అనుమతిస్తున్నాయి. కాకపోతే ఒక్కసారి టర్మ్ ఎంచుకున్న తర్వాత అందులో మార్పులకు అవకాశం ఉండదు. అత్యవసరాల్లో అక్కరకు ఆర్డీలో మరో వెసులుబాటు ఉంది. అత్యవసర నిధి సమకూర్చుకోని వారు, అత్యవసర సందర్భాల్లో నిధులకు ఆర్డీ అక్కరకు వస్తుంది. ఆర్డీలో ఉన్న బ్యాలెన్స్పై రాయితీ రేటుతో రుణం తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు నిర్ణీత వాయిదాల తర్వాత ఓవర్డ్రాఫ్ట్ కల్పిస్తున్నాయి. బంధన్ బ్యాంకు 6 నెలల తర్వాత ఓవర్డ్రాఫ్ట్ను ఆఫర్ చేస్తోంది. నిర్ణీత వ్యవధికి ముందే ఆర్డీని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చాలా బ్యాంకులు ఇందుకు అనుమతిస్తున్నాయి. కాకపోతే అప్పటి వరకు గడించిన వడ్డీ నుంచి కొంత ఉపసంహరించుకుంటాయి. ఇది సాధారణంగా 1–2% ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు దీనికి బదులు ఆర్డీ చేసినప్పుడు ఉన్న రేట్ల ప్రకారం... ఎంత కాలానికి ఆర్డీ ఉంచారో చూసి ఆ మేరకు రేటును అమలు చేస్తున్నాయి. ఈ వడ్డీని గడువు తీరాకే చెల్లిస్తున్నాయి. ఇక మూలం వద్ద పన్ను కోత(టీడీఎస్)ను ఆర్డీలకు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. 2018–19 ఏడాది వరకు ఒక ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే టీడీఎస్ అమలవుతుంది. తర్వాత నుంచి ఈ పరిమితి రూ.40,000కు పెరగనుంది. మొత్తం ఆదాయం ఆదాయపన్ను శ్లాబ్ కంటే తక్కువే ఉంటే ఫామ్ 15జీ (సీనియర్ సిటిజన్లు ఫామ్ 15హెచ్) సమర్పించడం ద్వారా టీడీఎస్ లేకుండా చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ విధానం మీరు ఇప్పటికే బ్యాంకు కస్టమర్ అయితే, నెట్బ్యాంకింగ్ ద్వారా ఆర్డీని ఆన్లైన్లో ప్రారంభించుకోవచ్చు. అలాగే, బ్యాంకు శాఖకు వెళ్లి కూడా ఆర్డీని మొదలుపెట్టొచ్చు. దరఖాస్తుతోపాటు అవసరమైన డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నిజానికి ఆర్డీ అన్నది క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాల్లో మంచి ఉపకరణం. కాకపోతే రెగ్యులర్గా వడ్డీ చెల్లించే ఆప్షన్ ఇందు లో ఉండదు. అలాగే, క్యుములేటివ్ ఇంటరెస్ట్, అసలు కలిపి గడువు తీరిన తర్వాతే చెల్లించడం జరుగుతుంది. రెగ్యులర్ఆర్డీకి అదనంగా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటే ఫ్లెక్సీ ఆర్డీ లేదా మరో ఆర్డీ ఖాతా ప్రారంభించకుంటే సరిపోతుంది. -
కార్డు ఉంటేనే డిపాజిట్!
కుత్బుల్లాపూర్: ఐచ్చికంగా ఉండాల్సిన విధి విధానాలను బలవంతంగా వినియోగదారులపై రుద్దుతున్నారు బ్యాంక్ అధికారులు. తమ టార్గెట్లు చేరుకునేందుకు ఖాతాదారులను పావులుగా వాడుకుంటున్నారు. తమ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా సరే గ్రీన్ కార్డు లేదా ఏటీఎం కార్డు ఉండాల్సిందేనంటూ ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్ర రోడ్డులో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ (కుత్బుల్లాపూర్ శాఖ)లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. కార్డు ఉటేనే డిపాజిట్ల స్వీకరణ సాధారణంగా బ్యాంకుల్లో ‘గ్రీన్ చానల్’ పేరిట పేపర్ వినియోగం తగ్గించేందుకు డిపాజిట్ కౌంటర్ల వద్ద స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేసి తద్వారా డిపాజిట్లు స్వీకరిస్తున్నారు. ఒక వేళ కార్డు లేకపోతే సంబంధిత ఫామ్ మీద వివరాలు రాసి డిపాజిట్కు అనుమతిస్తారు. అయితే ఈ ఎస్బీఐ బ్రాంచ్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. ఫారం నింపి డబ్బులు ఇస్తే తీసుకోమంటూ బ్యాంక్ అధికారులు తిరస్కరిస్తున్నారు. ఏటీఎం కార్డు లేకపోతే బ్యాంక్ వారు జారీ చేస్తున్న గ్రీన్ కార్డుతో మాత్రమే డిపాజిట్లు స్వీకరిస్తామని తేల్చిచెబుతున్నారు. దీంతో నిరక్షరాశులు, నిరుపేదలైన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.20కు గ్రీన్ కార్డు.. ఖాతాదారు తన ఏటీఎం కార్డును మరిచిపోయి బ్యాంక్కు వస్తే బయట ఉన్న సీడీఎం(క్యాష్ డిపాజిట్ మెషిన్)లో వేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే రూ.20 చెల్లించి ఎస్బీఐ ‘గ్రీన్ రెమిట్ కార్డు’ తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇక వినియోగదారులు తిరిగి వెళ్లి ఏటీఎం కార్డు తీసుకురాలేక రూ.20 చెల్లించి గ్రీన్ కార్డును తీసుకుని డిపాజిట్లు చేసుకుంటున్నారు. ఈ రెండు పద్ధతుల్లో తప్ప ఇతర పద్ధతుల్లో ఇక్కడి అధికారులు ఏ మాత్రం క్యాష్ డిపాజిట్లను స్వీకరించడం లేదు. గ్రీన్ కార్డు ఆవశ్యకతను, దాని ఉపయోగాలను సానుకూలంగా ఖాతాదారులకు వివరించాల్సిన సిబ్బంది ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బలవంతంగా గ్రీన్కార్డులను అంటగడుతున్నారని పలువురు ఖాతాదారులు వాపోతున్నారు. పైగా బ్యాంక్ ఆవరణలో గ్రీన్ కార్డు లేదా ఏటీఎం కార్డు ద్వారానే డిపాజిట్ స్వీకరిస్తామని ఎక్కడా నోటీసు కూడా పెట్టకపోవడంతో చాలా మంది ఖాతాదారులు కార్డు లేకుండానే బ్యాంక్కు రావడం, సంబంధిత అధికారులతో వాదులాడడం, లేదా బతిమిలాడడం సర్వసాధారణమైంది. ఇక్కడ అందరూ చదువుకున్న వారే.. కార్డు తెచ్చుకోవాల్సిందే.. ఈ విషయమై సంబంధిత బ్యాంక్ ఉన్నతాధికారిని ఖాతాదారులు సంప్రదించగా జనవరి 1వ తేదీ నుంచి పేపర్ లెస్ డిపాజిట్లను తీసుకుంటున్నామని, ఇది తమ బ్యాంక్లో తప్పనిసరని చెప్పుకొచ్చారు. మరి కార్డులు తీసుకురాని వారి పరిస్థితి ఏమిటని అడగ్గా ‘ఇది పట్టణ ప్రాంతం.. అందరూ చదుకున్న వాళ్లే ఉంటారు. కార్డు తెచ్చుకోకపోతే మేమేమీ చేయలేమంటూ’ స్పష్టం చేశారు. మరో అధికారి స్పందిస్తూ అత్యవసర సమయంలో మాత్రమే డిపాజిట్ స్లిప్లను అనుమతిస్తామని కొంచెం వెసలుబాటు మాటలు చెప్పారు. -
ఆర్భాటం లేకుండా నిర్భాగ్యుల కోసం
పెళ్లి ఖర్చులను లక్షల్లో తగ్గించుకుని, ఆ డబ్బును అనాథ బాలికల పేర డిపాజిట్ చేసిన అనంతపురంలోని ఓ తండ్రి.. సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. శుభకార్యమంటేనే విందులు, వినోదాలు..హంగులు, ఆర్భాటాలు.. అన్నిటినీ మించి మంచినీళ్ల ప్రాయంగా సాగే దుబారా ఖర్చులు. యుద్ధంలో గెలిచినా, ఓడినా ఇరుపక్షాలూ నష్టపోయిన చందంగా కూతురు పెళ్లయినా, కొడుకు పెళ్లయినా తల్లిదండ్రులకు తడిసి మోపెడంత ఖర్చులు తప్పనిసరి. తిప్పలు పడి అప్పులు చేసైనా బిడ్డల పెళ్లి ఆనందంగా కానిచ్చేద్దాం అన్న తొందరలో ఏ మూల చూసినా ఖర్చు విపరీతంగా ప్రవహిస్తుందన్నది సంతోషాల పొరల మధ్య కనపడని కఠిన వాస్తవం. పెళ్లయిన కొద్ది రోజులకు పెద్దలకు కనపడేవి ఆల్బమ్లలోని మధుర క్షణాల అందమైన చిత్రాలే కాదు.. అందిన చోటల్లా చేసిన అప్పుల పట్టిక కూడా. అప్పులు, తిప్పలు ఎలా ఉన్నా పెళ్లన్నాక ‘ఈ మాత్రమైనా’ చేయడం సంప్రదాయమని, ఆనవాయితీ అని అనుకునే తల్లిదండ్రులకు భిన్నంగా.. కొందరు ఆదర్శవాదులు ఆలోచిస్తున్నారు. అనవసర ఆర్భాటాలను, పెళ్లి ఖర్చుల్ని తగ్గించుకోవడమే కాదు.. ఆ మొత్తంలో కొంతైనా అన్నార్తులకు, అనాథలకు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడాలకుంటున్నారు. అలాంటి ఆదర్శవంతుల కోవకు చెందిన వారే అనంతపురానికి చెందిన న్యాయవాది ప్రభాకరరెడ్డి. ఇటీవలే ఆయన తన కూతురు వివాహం చేశారు. పెళ్లికి అయ్యే ఖర్చులో దాదాపు రూ.5 లక్షల వరకు తగ్గించి, అభాగ్యులకు ఇవ్వడానికి సంకల్పించడమే కాకుండా ఆచరించి చూపించారు. పెళ్లి కార్డులోనూ విభిన్నత పెళ్లి కార్డులకే ఇప్పుడు వేల రూపాయల ఖర్చవుతోంది. ఒకప్పుడు సాదా సీదాగా కేవలం సమాచారం మాత్రమే ఉండే శుభలేఖలు, మారుతున్న కాలానుగుణంగా ఫ్యాషన్ ప్రపంచం వెంట పరుగులు పెడుతూ వివిధ రకాలైన డిజైన్లతో దర్శనమిస్తాయి. అయితే ప్రభాకరరెడ్డి పెళ్లి కార్డులను నిరాడంబరంగా కొట్టించడమే కాకుండా.. వాటిల్లో ఒక చక్కటి సందేశముండే విధంగా కొత్తదనాన్ని తీసుకువచ్చారు. ఆహార పదార్థాలను ఏ మాత్రం వృథా చేయొద్దని ప్రత్యేక విన్నపం కింద పెళ్లికార్డులో ప్రచురించి, చెప్పి మరీ పంచారు. అన్నం లేక వేలాది మంది ఆకలితో నకనకలాడుతుంటే కాస్తంత రుచి చూసి వదిలేయడం తగదంటూ సుతిమెత్తగానే విజ్ఞప్తి రూపంలో స్పష్టం చేశారు. సర్వ్ కాకుండా మిగిలిన ఆహారాన్ని అనాథాశ్రమాలకు తరలించాలని సూచించడంతో వారింటి పెళ్లి కార్డు కూడా ఓ ప్రత్యేకతగా నిలిచిపోయింది. బాలికల పేరు మీద 5 లక్షలు! కూతురి పెళ్లి అనుకున్నది మొదలు ఎంత వీలైతే అంత పెళ్లి ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నారు ప్రభాకరరెడ్డి. షామియానా, ఫ్లవర్ డెకరేషన్, క్యాటరింగ్ ఇలా ప్రతి చోట రేషన్ నిర్ణయించుకుని తగినంత మాత్రమే ఖర్చు చేయాలని నిశ్చయించుకున్న తర్వాత.. అలా తగ్గించిన అంచనా వ్యయానికి సమానమైన డబ్బును అనాథలకు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతపురంలోని పలు అనాథాశ్రమాలలో ఉంటున్న బాలికల పేరు మీద సుమారు రూ. 5 లక్షలను డిపాజిట్ చేశారు! అంతేనా బంధువులకు మల్లే అనాథలందరికి కొత్త దుస్తులు కుట్టించి పెళ్లిలో వారికి వీఐపీల మాదిరి ప్రత్యేక స్థానాలు (ఆ చిన్నారుల పేర్లు రాసి) ఏర్పాటు చేశారు. ఇలా అందరూ ఆడంబరాలను తగ్గించుకుని నిర్భాగ్యులకు సహాయం చేయాలని ప్రభాకరరెడ్డి వినమ్రంగా కోరుకుంటున్నారు. వృథా మహా పాపం మా అమ్మాయి సాయి శ్రీవల్లి, కొడుకు శ్రవణ్కుమార్, భార్య విజయలక్ష్మి, మా వియ్యంకులు మా ఆలోచనను హర్షించడం వల్లే ఆదర్శమైన వివాహం చేయగలిగాం. ఇటీవల పెళ్లిళ్లలో ఇరవై ముప్పై నుండి వంద దాకా ఐటమ్స్ వడ్డిస్తున్నారు. ఆర్భాటం పెరిగే కొద్దీ ఆహారాన్ని ఎవరూ పూర్తిగా తీసుకోలేరన్నది వాస్తవం. దీనిని దృష్టిలో ఉంచుకుని రూ.లక్షల రూపాయలు మిగిలే విధంగా పెళ్లిని చేయొచ్చని నిరూపించాం. ‘ఆకలి ఉన్న వారికి అన్నం చేరాలి.. అజీర్తి ఉన్న చోట కాదన్నది’ మా నమ్మకం. ముఖ్యంగా అనాథల కళ్లలో ఆనందాలను చూడగల్గితే అంతకంటే మంచి సమాజం మరెక్కడా ఉండదని అనుకుంటాను. – పుట్టపర్తి ప్రభాకరరెడ్డి, న్యాయవాది, అనంతపురం. – గుంటి మురళీకృష్ణ, సాక్షి, అనంతపురం -
అపరాధి
‘‘ఇప్పటికీ మాధవరావు చనిపోయాడంటే నమ్మలేక పోతున్నా మాస్టారు.’’ గట్టిగా నిట్టురిస్తూ చెప్పాడు శ్రీరాములు. ‘‘నిజమే.... నిన్న సాయంత్రం ఇద్దరం అర్ధగంట మాటాడుకున్నాం..... చక్కగా మాట్లాడాడు. అటువంటి ఆయన ఈరోజు లేడంటే ఎవరు నమ్మగలరు చెప్పండి’’ బాధపడుతున్నాడు శంకరం. ఫ్రీజర్ బాక్స్లో పడుకోబెట్టి ఉంది మాధవరావు భౌతికకాయం. మాధవరావు హెడ్ మాస్టారుగా పని చేసి రిటైరయ్యారు. వచ్చిన జీతంలో ఇంటికి కావలసినవన్నీ కొంటూ, కొంత కొంత దాచుకుని కాకినాడ రామారావుపేటలో ఐదుసెంట్ల భూమి కొన్నారు. రిటైరై ఆరునెలలవుతోంది. రిటైర్మెంట్ బెనిఫిట్ గా వచ్చిన మొత్తం కొంత పోస్టాఫీసులో కొంత జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేశారు. సర్వీసులో ఉండగానే కొడుకు పెళ్లి చేశారు. మాధవరావు కొడుకు రవి బీఈడీ చేశాడు. గవర్నమెంటు కొలువు రాక ఒక కాన్వెంట్లో టీచర్గా చేరాడు. అంతా కలసి వుంటున్న చిన్న ఉమ్మడి కుటుంబం వాళ్ళది. ‘‘ఇంతకీ హార్ట్ ఎటాక్తోనే పోయేడంటారా!’’ మళ్ళీ అనుమానంగా అన్నాడు సుబ్బరామయ్య. ‘‘వాళ్ళ ఇంట్లో వాళ్ళే హార్ట్ ఎటాక్ అంటుంటే మనకెందుకయ్యా’’ అన్నాడు శంకరం.‘‘నాకెందుకో అది సహజ మరణంగా అనిపించడం లేదు’’ తన సందేహాన్ని వెలిబుచ్చాడు శ్రీరాములు. ఓ యువకుడు వీరి దగ్గరకు వచ్చాడు.‘‘నమస్తే మాస్టారు! నన్ను గుర్తు పట్టరా?’’ అన్నాడు శంకరం కేసి చూస్తూ. ‘‘మనిషి గుర్తున్నావు కాని, పేరు గుర్తుకు రావడం లేదు’’ పేరును తడుముకుంటున్నాడు శంకరం మాస్టారు. ‘‘నాపేరు హరి అండీ... 2005 టెన్త్ క్లాస్ బాచ్. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్లో అక్కౌంటెంట్గా కాకినాడ ట్రాన్స్ఫర్ అయి వచ్చాను రెండు రోజులుగా బ్యాంకులో బిజీగా వుండి ఇటు రాలేక పోయాను. ఈ రోజు మాధవయ్య మాస్టారు గారిని కలుద్దామని వస్తే ఇలా జరిగింది...’’ ‘‘ఆ గుర్తుకు వచ్చావయ్యా హరి!. సెకండ్ బెంచ్ సెకండ్ వన్... ఆ రోజుల్లో నువ్వు క్లాస్లో చాలా బాగా చదివే వాడివి’’ అన్నాడు శంకరం. ‘‘మాస్టారు... మాధవయ్యగారిది సహజ మరణం కాక పొతే మర్డరా... లేక ఆత్మహత్యా?’’ ‘‘చ... చ... ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఎవరైనా హత్య చేసి వుండాలి.’’ ఆన్నాడు సుబ్బరామయ్య! అసలు ఉదయం మాధవరావు శవాన్ని చూసినప్పటి నుంచి అదే అనుమానంతో వున్నాడు సుబ్బరామయ్య. ‘‘హత్య! ఆ అవసరం ఎవరికుంది? ‘‘ అంటున్న శ్రీరాములుతో ‘‘ఏమో!ఎవరికుందో పరిశోధిస్తే కదా తెలిసేది?’’ అన్నాడు సుబ్బరామయ్య. ‘‘నేను కంప్లైంట్ ఇస్తా. సహజ మరణం అయితే ఎవరినీ నిందించక్కర్లేదు . అలా కాకుంటే .... కారణమైనా వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందే.’’ అనుకుంటూ పొలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు హరి. కంప్లైంట్ పట్టుకొని ఇనస్పెక్టర్ రూమ్లోకి వెళ్ళాడు హరి. ‘‘నమస్తే మీకేం కావాలి’’ సౌమ్యంగా అడిగాడు ఇనస్పెక్టర్. ‘‘నా పేరు హరికిషన్. ఎస్.ఎమ్.హెచ్. స్కూల్ ఒకప్పటి స్టూడెంట్ని’’...... అంటున్న హరి మాటకు ‘‘నేనూ ఎస్.ఎమ్.హెచ్.స్కూల్ స్టూడెంట్ నే.. టెన్త్ ఏ బాచ్ మీరు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్ శ్యామ్ ‘‘2002 బాచ్’’ అన్న హరి మాటకు ‘‘మీరు మా అన్నయ్య క్లాస్మేట్. నేను మీ కంటే నాలుగు సంవత్సరాలు జూనియర్’’ అన్నాడు శ్యామ్. ‘‘మీ అన్నయ్య పేరు?’’ ‘‘మా అన్నయ్య పేరు మారిస్. ‘‘ఓ మారిస్ బ్రదరా మీరు. మారిస్ నా క్లాస్ మేటే కాదు, నా బెంచ్మేట్ కూడా ‘‘. ‘‘ఇంతకూ మీరు వచ్చిన పని?’’ అడిగాడు శ్యామ్. ‘‘మీరే నాకు హెల్ప్ చేయాలి. ఆ అపరాధి ని పట్టుకోవాలి. మాస్టారి ఆత్మకు శాంతి చేకుర్చాలి’’ ఆవేదనగా అన్నాడు హరి. ‘‘కూల్... కూల్... ఆవేదన వద్దు... అసలు జరిగిన విషయం చెప్పండి’’ అన్నాడు శ్యామ్. ఉదయం జరిగినదంతా చెప్పాడు హరి. ‘‘నేనూ ఆ స్కూల్లోనే చదివాను కనుక హెడ్ మాస్టారుగా నాకు ఆయన తెలుసు. చాలా డిసిప్లిన్ వున్నవారు... సరే మీరు ముందుగా మాధవరావుగారి ఇంటికి వెళ్ళండి నేను కాసేపటిలో వస్తాను’’ అన్నాడు శ్యామ్.సమయం నాలుగు గంటలు కావొస్తోంది. మాధవరావుగారి భౌతికకాయం చూడడానికి చాలామంది వచ్చి వెళుతున్నారు. మాధవరావు తమ్ముడు బెంగుళూరులో వుంటున్నారు. ఆయన వస్తే గాని శవాన్ని కదపరట. ఈరోజు రాగలడో లేదో... ఎవరో అంటున్న మాటలు శ్యామ్ చెవిన పడ్డాయి. ఖాకీ డ్రెస్ వదిలి మఫ్టీలో వచ్చాడు. వీధి మొదట్లో వున్న బడ్డీ కొట్టు పక్కగా బుల్లెట్ స్టాండ్ వేసి కొట్టు దగ్గరకి వెళ్ళాడు. శ్యామ్. ‘‘మహానుభావుడు...ఎవరినీ ఏమనే వాడుకాదు. తన పనేదో తాను చూసుకునేవాడు....’’ చెప్పుకుపోతున్నాడు బడ్డీ కొట్టు ఓనర్. ‘‘మరి అలాంటి మాస్టారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుందంటావ్?‘‘ అన్న శ్యామ్ మాటలకు ఠక్కున నోరు మూసేశాడు బడ్డీ్డకొట్టు ఓనర్.‘‘హత్యా! అని ఎవరన్నారండి!’’ ‘‘చాలామంది అనుకుంటున్నారు. నీదాకా రాలేదా?’’ ప్రశ్నించాడు శ్యామ్.‘‘లేదయ్యా. ఆయనది హత్యని ఎవరనుకుంటారు. మంచివాడు అలాంటి బాబుని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది’’ అన్నాడతను. అతనితో కాసేపు మాట్లాడి, మాధవరావు ఇంటివైపు కదిలాడు శ్యామ్.‘‘రవీ! ఓసారి ఇలావస్తారా...’’ కొత్త వ్యక్తి తనను పేరు పెట్టి పిలవడంతో ఆశ్చర్యపోయాడు మాధవరావు కొడుకు రవి. షర్టు బటన్స్ పెట్టుకుని ఇవతలగా వచ్చి ‘‘ఎవరండీ మీరు?’’ అన్నాడు. ‘‘నాపేరు శ్యామ్ టు టౌన్ ఇన్సె్పక్టర్ని.’’‘‘మాతో పోలీసువాళ్లకి ఏం పని?’’ అడిగాడు రవి. ‘‘మిస్టర్ రవి! మీరు శ్రద్ధగా వినండి. మీ నాన్నగారిది సహజ మరణం కాదని. ఎవరో ఆయనను హత్య చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. మీరు సహకరిస్తే మా పని సులువవుతుంది’’ అన్నాడు శ్యామ్. ‘‘హత్యా! ఎవరన్నారు? ఆయన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? అయినా కంప్లైంట్ ఎవరు ఇచ్చారు?’’ గబాగబా మాటాడుతున్నాడు రవి. ‘‘ఇలా రండి..’’ అంటూ రవిని బయటకు తీసుకెళ్లి మాట్లాడాడు శ్యామ్. అప్పటికే ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కింది. హత్య అనేసరికి ..... చూడడానికి వచ్చిన వారంతా గబ గబా చూసి వెళ్లి పోతున్నారు. కాసేపటికే అక్కడంతా ఖాళీ అయిపోయింది. శ్యామ్ మాధవరావుగారి భార్యతో మాట్లాడాడు. తరువాత మాధవరావుగారి భౌతిక కాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. మాధవరావుగారి చొక్కా జబ్బకి అంటుకున్న రక్తపుమరక, నోటి దగ్గర కనిపించిన తెల్లని పొర స్పష్టంగా కనిపించాయి. మాధవరావుగారు మొదట చనిపోయిన గదిని పరిశీలించాడు ఇన్సె్పక్టర్ శ్యామ్. చిన్న గది. ఒకవైపు మంచం, మరోవైపు పాతకాలపు చెక్కబీరువా, ఆయన కూర్చునే పడక కుర్చీ. మంచం మీద తెల్లని తలగడ, దుప్పటి చెదిరిపోయి ఉన్నాయి. తలగడకు అంటిన మరక కుడా శ్యామ్ నిశిత దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. కానిస్టేబుల్ని రప్పించి ఆ గదికి తాళం వేయించాడు. రవి అనుమతి తీసుకుని బాడీని పోస్టుమార్టమ్కు పంపడానికి ఏర్పాట్లు చేశాడు. కోడలు భానుమతి, పనిమనిషి రాములమ్మ జరుగుతున్న సంఘటనలకి నిశ్చేష్టులయి చూస్తున్నారు. మాధవరావు వియ్యంకుడు, భానుమతి తండ్రి విశ్వనాథరావు ఈ విషయం జీర్ణించుకోలేక పోతున్నాడు. శ్యామ్ అందరితోనూ విడివిడిగా మాట్లాడాడు. చుట్టుపక్కల వాళ్లంతా తలుపులు బిగించుకోవడంతో వాళ్ళని తర్వాత కలవాలని నిర్ణయించుకున్నాడు. మరోసారి బడ్డీకొట్టువాడితో మాట్లాడిన తరువాత శ్యామ్ బుల్లెట్ టూ టౌన్ పొలీస్ స్టేషన్ వైపు దూసుకు పోయింది. మాధవరావు చనిపోయి ఐదు రోజులు దాటింది. శ్యామ్ చొరవతో పోస్టుమార్టం రిపోర్ట్ కొద్ది వేగంగానే తయారయింది. మాధవరావుగారిది హత్యేనని, ఆయనకు ఎవరో ఎక్కువ మోతాదులో పెథిడ్రిన్ ఇంజక్ట్ చేసి, ఆపై ఊపిరాడకుండా చేసి చంపారని తేలింది. కాని అంత చిన్న ఇంట్లో అలా చేసే దైర్యం ఎవరిదీ? ఇంట్లో అందరికీ ఆయనంటే అభిమానమే. ఎవరినీ అనుమానించే పరిస్థితి లేదు. అలాగని బయట వారెవరికీ ఈ హత్య చేసే అవకాశం కనిపించడం లేదు. శ్యామ్కి ఈ కేసు పరీక్షగా నిలిచింది. స్టేషన్లో కూర్చుని మాధవరావు హత్య కేసుని విశ్లేషిస్తున్నాడు ఇన్సె్పక్టర్ శ్యామ్. అతని పక్కగా శివం, భద్రం అనే కానిస్టేబుల్స్ శ్రద్ధగా వింటున్నారు. ‘‘మాధవరావుగారు అజాత శత్రువు అనేది నిజం. కానీ, ఆయన్ని హత్య చేయడం వలన ఎవరికో లాభం ఉండి ఉంటుంది. అది తెలుసుకోవాలి. ముందుగా వారింట్లో వుండే అందరి గురించి తెలుసుకోండి. రవి, కోడలు భానుమతి , మాధవరావు భార్య సత్యవతి, వియ్యంకుడు విశ్వనాథరావు, పనిమనిషి రాములమ్మ, పాలు తీసుకువచ్చే రాములు. ఇలా ఎవరినీ వదలద్దు నాకు సాయంత్రానికల్లా రిపోర్టు కావాలి. అలాగే మాధవరావు హత్య జరిగిన రోజు ఎవరు ఎక్కడ వున్నారు లాంటి వివరాలు సేకరించండి. నేను కొన్ని విషయాలు తెలుసుకుని వస్తాను’’ అంటూ బయలుదేరాడు శ్యామ్. సాయంత్రం కానిస్టేబుల్ శివం, భద్రంతో సమావేశమయ్యాడు శ్యామ్. ‘‘శివం నువ్వు చెప్పు’’ అనగానే...‘‘యస్ సార్... నేను మాధవరావు వియ్యంకుడు విశ్వనాథరావు గురించి వాకబు చేశాను.ఆయన చాలా మంచివాడు. మాధవరావుకి స్నేహితుడు. తన కన్నా పేద కుటుంబం అయినా .. మాధవరావుతో సంబంధం కలుపుకున్నాడు. కూతురంటే చాలా గారం .. ఆమె బీ ఫార్మసీ. చదువుకుంది. ఆమె పేరుతో పెట్టినదే భాను మెడికల్ షాప్..’’ ముగించాడు శివం. ‘‘ఇక భద్రం నువ్వు తెలుసుకున్న విషయాలు చెప్పు ‘‘... ‘‘సార్.. నేను రవి గురించి, పనిమనిషి రాములమ్మ గురించి ఎంక్వయిరీ చేశాను.మాధవరావు కొడుకు రవి చాలా మంచివాడు. బీఈడీ చేసినా గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం రాలేదని అతని దిగులు. ఇక్కడే ఒక ప్రైవేటు స్కూల్లో చేరాడు. అతని భార్య భానుమతి చాలా ఖర్చు మనిషి. అతని జీతం చాలడం లేదని రోజూ గొడవ పడుతుంది. భార్యతో గొడవల వల్ల కొద్దిగా మందుకి అలవాటు పడ్డాడు. అలాగని తాగుబోతు కాదు. రాత్రి వెళ్ళే ముందు బడ్డీ కొట్టు దగ్గర ఓ రౌండ్ వేసి వెళతాడని తెలిసింది. ఇక పని మనిషి రాములమ్మ గురించి తెలిసిన విషయాలు కొంత ఆశ్చర్యం, అనుమానం కలిగిస్తున్నాయి. మాధవరావుగారు హెడ్ మాస్టర్గా పనిచేసినంత కాలం రాములమ్మ పిల్లాడి స్కూల్ ఫీజు, పుస్తకాల ఖర్చులు వంటి భాద్యత చుసుకునేవాడు. ఆయన రిటైరయ్యాక స్కూల్ వాళ్లు ఆమెకు ఫీజు గురించి నోటీసులు ఇచ్చారు. ఒకేసారి ఆరు వేల రూపాయలు కట్టాలని. దాంతో ఆమెకు దిక్కు తోచలేదు.మాధవరావు కూడా ఆమెకు భరోసా ఇవ్వలేదు. ఎలా కట్టిందో ఏమో! మాధవరావు చనిపోయిన ముందురోజు ఆమె ఫీజు కట్టేసింది. అలాగే పుస్తకాలు కూడా కొనేసింది. ఆ డబ్బు ఎక్కడిదో తెలుసు కోవాలి’’ అన్నాడు భద్రం. ‘‘సర్! మీరు మాధవరావు కోడలు గురించి తెలుసుకోవాలని వెళ్ళారు. ఎనీ క్లూ?’’ అంటున్న భద్రం మాటలకి...‘‘లెట్స్ గో... మాధవరావుగారింటికి పదండి.. దొంగ దొరికినట్టే’’ అంటూ బయటకు నడిచాడు ఇన్సె్పక్టర్ శ్యామ్.‘‘మిసెస్ భానుమతి..! మాధవరావు గారిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. మీకు సహకరించిన రాములమ్మని కూడా’’ అన్న ఇన్సె్పక్టర్ శ్యామ్ మాటలకు రవి, సత్యవతితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ‘‘మిస్టర్ ఇన్సె్పక్టర్ మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? నా కూతురుని అపరాధి అనడానికి ఎంత ధైర్యం?. మామగారిని కంటికి రెప్పలా చూసుకునే భానుమతి మీద అభాండం వేస్తారా?’’ గట్టిగా కేకలు పెడుతూ వణుకుతున్నాడు విశ్వనాథరావు.‘‘ఒకరిని అపరాధి అనే ముందు మేం చాలా ఎంక్వయిరీ చేస్తాం. ఆ తరువాత వారిని దోషిగా బయట పెడతాం.మీ కుమార్తె భానుమతి చాలా గారాబంగా పెరిగిన అమ్మాయి. అతిగారాబంతో ఆమెకు అడిగి నంత డబ్బు ఇస్తూ వచ్చారు. దానితో ఆమె భారీ షాపింగులోకి, చిరు వ్యసనాలకి బానిసగా మారింది. పెళ్లయిన తర్వాత ఆమె జోరుకి బ్రేక్ పడింది. దాంతో ఆమెలో అసహనం పెరిగింది. అప్పుడప్పుడు మీరులేని సమయంలో మీ మెడికల్ షాపుకి వెళ్లి క్యాష్ బాక్స్లో డబ్బు దొంగచాటున తెచ్చుకుని ఖర్చు పెట్టేది. తన భర్త చిన్న ఉద్యోగి. అతని జీతంలో కొంత ఇచ్చినా ఆమెకు సరిపోయేది కాదు. దాంతో అతనితో గొడవ పడేది. ఆమెకు తెలిసింది మాధవరావు గారి డిపాజిట్లకు నామినీగా రవిని పెట్టారని... పూర్ ఫెలో! ఆయన్ని అడ్డు తొలగిస్తే ఆ డబ్బు రవి చేతికి వస్తుంది. రవిని గుప్పెట్లో పెట్టుకుని హాయిగా ఎంజాయ్ చేయొచ్చని తలచింది’’ చెప్పాడు ఇన్స్పెక్టర్ శ్యామ్... కాస్త ఆగి...‘‘విశ్వనా«థరావుగారూ! మీరు అక్టోబర్ 25న విజయవాడ వెళ్ళారు కదూ’’ ప్రశ్నించాడు. ‘‘అవును! ఆరోజు విజయవాడ వెళ్లాను’’ అన్నాడు విశ్వనాధరావు.‘‘ఆ రోజు మధ్యాహ్నం షాపు ఖాళీగా వుంది. షాపులో పనిచేసే అమ్మాయి భోజనం చేస్తోంది. ఆ సమయంలో భానుమతి తెలివిగా ఓ సిరంజ్, పెథిడ్రిన్ ఇంజక్షన్ దొంగిలించి ఏమీ ఎరగనట్లు ఇంటికి చేరుకుంది. ఇకపోతే మీ పని మనిషి రాములమ్మ.. మాధవరావుగారు హెడ్ మాస్టారుగా వున్నపుడు రాములమ్మ కొడుక్కి ఫీజు కట్టి చదివించారు.అప్పుడు బాగానే వుంది. ఆయన రిటైర్ అయ్యాక పిల్లాడి ఫీజు చెల్లించాలని స్కూలు వాళ్ళు పంపిన నోటీసులు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాదాపు ఐదువేల రూపాయలు ఎక్కడి నుండి తేవాలి. ఆమె అవసరాన్ని గుర్తించి తెలివిగా ఆమెను వాడుకుంది భానుమతి. భానుమతి అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బును ఆమె వీధి చివర లెక్క బెట్టుకొని దాచుకోవడం బడ్డీ కొట్టు ఓనర్ చూసాడు.మాధవరావు నోరుమూసి ఇంజక్షన్ గట్టిగా చెయ్యడంతో చిమ్మిన రక్తపుమరక ఆయన గ్లాస్కో షర్ట్ కు అంటుకుంది. ఆయన నోటి నుంచి వచ్చిన నురగ తలగడ గలేబుకి అంటుకుంది. మా పరిశీలనలో పనస చెట్టు పక్కన తుప్పలలో దొరికిన ఈ ఇంజెక్షన్ బాటిల్, వాడి పారేసి సిరంజ్ మీ షాపు నుంచి బయటకు వచ్చినవే. మరో విషయం మీ షాపులో కంప్యూటర్ బిల్లింగ్ జరుపుతున్నారు.కనుక మా పరిశోధనలో అరడజను వుండవలసిన పెథిడ్రిన్ ఇంజక్షన్లలో ఐదే వున్నట్లు, ఒక ఇంజక్షన్ బాటిల్ బిల్లు చెయ్యకుండానే బయటకు వెళ్ళినట్లు తెలిసింది. అన్నీ ఎంక్వయిరీ చేసిన తరువాతే భానుమతి అపరాధి అని తెలిసింది’’ అని చెబతూ ‘‘ శివం, సత్యం ఆమెను అరెస్టు చెయ్యండి’’ ఆదేశించాడు ఇన్స్పెక్టర్. ఆప్పుడే అక్కడికి వచ్చిన హరికి జరిగిన సంఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయి. రవి, సత్యవతి ఏమీ తోచని స్థితిలో శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయారు. కూచిమంచి నాగేంద్ర -
ఎఫ్డీ సొమ్ము బ్యాలన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
గతంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సొమ్ములు ఇప్పుడు చేతికి వస్తున్నాయి. వీటిని హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? ఈ ఫండ్లో ఒకేసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయమంటారా? లేక సిప్ విధానాన్ని అనుసరించమంటారా ? – కుముదిని, విశాఖపట్టణం మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారి అయితే, నిరభ్యంతరంగా బ్యాలన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాలన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, మీ ఇన్వెస్ట్మెంట్స్పై స్వల్పకాలంలో ఎలాంటి రాబడులు ఆశించకూడదు. అలాగే ఒక క్రమబద్ధమైన ఆదాయం రావాలని కూడా కోరుకోకూడదు. బ్యాలన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే, ఒకటి లేదా రెండేళ్లలో మీ పెట్టుబడిలో ఒకింత నష్టం వచ్చినా కంగారుపడకండి. దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయడానికి బ్యాలన్స్డ్ ఫండ్స్ కాకుండా మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఈక్విటీ ఇన్కమ్ ఫండ్, మంత్లీ ఇన్కమ్ ప్లాన్(ఎమ్ఐపీ)లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. మీ దగ్గరున్న ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ మొత్తాన్ని కనీసం ఆరు లేదా పన్నెండు భాగాలుగా చేసి, ఒక్కో భాగాన్ని నెల వారీగా ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 32 సంవత్సరాలు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడులు, పన్ను ప్రయోజనాలు పొందవచ్చని మిత్రులు చెబుతున్నారు. అయితే ఈక్విటీ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉంటుంది. కాబట్టి ఈక్విటీలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు లభించే హైబ్రిడ్ ఫండ్స్ కానీ, బ్యాలన్స్డ్ ఫండ్స్ కానీ ఉన్నాయా ? ఈ తరహాలో వుండే పెన్షన్ ఫండ్స్ వుంటే...వాటి వివరాలు వెల్లడించండి. – వినోద్, హైదరాబాద్ మీరు పేర్కొన్న వివరాల ప్రకారం రెండు పెన్షన్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఫ్రాంక్లిన్ ఇండియా ఆఫర్ చేస్తోంది. మరొకటి యూటీఐ అందిస్తోంది. ఈ రెండు పెన్షన్ప్లాన్లు..ఈక్విటీలో 40 శాతం వరకూ ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పూర్తిగా ఈక్విటీతో ముడిపడని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కావాలంటే, మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)ను కూడా పరిశీలించవచ్చు. ఈక్విటీలో ఎన్పీఎస్ గరిష్టంగా 50 శాతం వరకూ ఇన్వెస్ట్ చేస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. అయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు రిటైరయ్యేదాకా లాక్–ఇన్ అయిపోతాయి. ఎన్పీఎస్ ఇన్వెస్ట్మెంట్స్లో కనీసం 40 శాతం కార్పస్ను యాన్యూటీ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు యువకులు. స్టాక్ మార్కెట్ అంటే భయపడాల్సిన, దూరంగా ఉండాల్సిన వయస్సు కాదు మీది. స్వల్పకాలంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగానే ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. ఇక ఈఎల్ఎస్ఎస్ల విషయానికొస్తే, ఈఎల్ఎస్ఎస్ల్లో మీ ఇన్వెస్ట్మెంట్స్కు లాక్–ఇన్ పీరియడ్ మూడేళ్లు మాత్రమే. ప్రణాళికబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తే, మూడేళ్ల కాలంలో మీరు నష్టపోయే పరిస్థితి కానీ, నిరాశపడే రాబడులు కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రిస్క్(నష్టభయం) తగ్గించుకోవాలంటే సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఒడిదుడుకులు, నష్టభయం రెండూ వేర్వేరు. స్వల్పకాలం ఇన్వెస్ట్మెంట్స్ను పరిగణనలోకి తీసుకుంటే, ఒడిదుడుకులు నష్టభయంగా మారతాయి. మీలాంటి యువకులు కొంత రిస్క్ను భరించైనా సరే, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. నేను రెండేళ్ల క్రితం ఎల్ఐసీ జీవన్ తరంగ్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.35,000 చొప్పున ప్రీమియమ్ చెల్లిస్తున్నాను. ఇది చాలా ఎక్కువగా ఉందని నా భావన. ఈ పాలసీని సరెండర్ చేయమంటారా ? కొనసాగించమంటారా? – అనిల్, విజయవాడ జీవన్ తరంగ్ అనేది హోల్ లైఫ్ ప్లాన్. బీమా మొత్తానికి 5.5 శాతం రేటు చొప్పున వార్షిక సర్వైవల్ బెనిఫిట్ను ఈ పాలసీ అందిస్తుంది. బీమా పాలసీ ముగిసిన తర్వాత బోనస్లను ఇతరత్రా మొత్తాలను చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఈ మొత్తాలను పాలసీ ముగియక ముందే అందజేస్తారు. పాలసీకి సంబంధించిన వ్యయాలను చార్జీలను ఈ పాలసీ వెల్లడించడం లేదు. ప్రీమియమ్ అధికంగా ఉండటం, వ్యయాలు, చార్జీల విషయాల్లో పారదర్శకత లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ పాలసీని సరెండర్ చేయడమే మంచిది. మీరు పాలసీ తీసుకొని మూడేళ్లు కాలేదు కాబట్టి, ఈ పాలసీని సరెండర్ చేస్తే మీకు తిరిగి ఏమీ రాదు. ఆర్థిక విషయాల్లో ఎప్పుడూ సరళంగా ఉండాలి. జీవిత బీమా కోసం పూర్తి టర్మ్ పాలసీలు తీసుకోవాలి. వీటిల్లో ప్రీమియమ్ తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మీకు మంచి రాబడులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రూ.200 కోట్లు కట్టండి!
సాక్షి, ముంబై: ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమ పద్దతులు పాటించిన జై ప్రకాశ్ అసోసియేట్స్కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. రూ. 200 కోట్లను కోర్టుకు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మే10 నాటికి చెల్లింపు చేయాలని ఆదేశించింది. అలాగే రిఫండ్ అడుగుతున్న గృహకొనుగోలు దారుల జాబితా సమర్పించాలని సంస్థను కోరింది. మే 10 నాటికి రెండు వాయిదాలలో రూ. 200 కోట్లను డిపాజిట్ చేయాలని చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జెఎల్ఎ)ను ఆదేశించింది. ఏప్రిల్ 6 నాటికి రూ. 100 కోట్లు, మిగిలిన సొమ్ము మే10వ తేదీలోపు డిపాజిట్ చేయాలని కోరింది. దీంతోపాటు చెల్లింపులు చేయాలంటూ గృహ-కొనుగోలుదారులకు ఎటువంటి నోటీసులను పంపించకూడదని స్పష్టం చేసింది. అలాగే గృహ-కొనుగోలుదారుల ప్రాజెక్ట్ వారీగా చార్ట్ను సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
మన దేశంలో సామాన్యుల దగ్గరి నుంచి ధనవంతుల వరకు బాగా పరిచయమైన పెట్టుబడి సాధనం ప్రభుత్వ భవిష్య నిధి (పీపీఎఫ్). ఇందులో చేసే పెట్టుబడులు, దానిపై వచ్చే రాబడులకు పూర్తిగా పన్ను మినహాయింపులు ఉండటమే దీనికి కారణం. అయితే, పీపీఎఫ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందామా మరి!! కాలవ్యవధి 15 ఏళ్ల పైనే.. పీపీఎఫ్ 15 ఏళ్ల లాకిన్ పీరియడ్తో ఉంటుంది. దీని ప్రకారం మెచ్యూరిటీ 15 ఏళ్లకు పూర్తి కావాలి. అయితే, కాల వ్యవధిని లెక్కించేది ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి కాదు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల వ్యవధిని పరిగణిస్తారు. ఏ తేదీ, ఏ నెలలో మొదలుపెట్టారన్నది ముఖ్యంకాదు. ఉదాహరణకు 2017 జూలై 1న ఖాతా ప్రారంభించారనుకోండి. దాన్ని 2018 మార్చి 31గా లెక్కిస్తారు. అప్పటి నుంచి 15 ఏళ్ల వ్యవధికి పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో కాల వ్యవధి 2032 ఏప్రిల్ 1తో ముగుస్తుంది. పొడిగించుకోవచ్చు... పీపీఎఫ్ ఖాతా కాలవ్యవధి 15 ఏళ్లే అయినప్పటికీ, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు పొడిగించుకోవచ్చు. ఖాతాలో పెట్టుబడులపై అప్పటి వడ్డీ రేటు అమలవుతుంది. పొడిగించుకోవాలని అనుకుంటే 15 ఏళ్లు ముగిసిన తర్వాత ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పొడిగించిన కాలానికి జమలు చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు అవసరమైతే ఏడాదికోసారి బ్యాలెన్స్లో 60 శాతం మించకుండా వెనక్కి తీసుకోవచ్చు. బదిలీ చేసుకోవచ్చు కూడా... పీపీఎఫ్ ఖాతాను ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు. ఒక తపాలా కార్యాలయం నుంచి మరో తపాలా కార్యాలయానికి లేదా తపాలా కార్యాలయం నుంచి బ్యాంకుకు మార్చుకునేందుకు అవకాశం ఉంది. అలాగే, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు కూడా బదిలీ చేసుకోవచ్చు. నామినేషన్ ఖాతాకు నామినేషన్ సదుపాయం ఉంది. ఓ వ్యక్తి తన ఖాతాకు అవసరమైతే మైనర్ను కూడా నామినీగా అపాయింట్ చేసుకోవచ్చు. అయితే, మైనర్ తరఫున తెరిచిన ఖాతాకు నామినేషన్ సౌకర్యం లేదు. ఖాతా తెరవటానికి అర్హులెవరు? దేశంలో నివసిస్తున్న వారే పీపీఎఫ్ ఖాతాను తెరిచేందుకు అవకాశం ఉంది. జాయింట్ పీపీఎఫ్ ఖాతాకు అవకాశం లేదు. అయితే, సంరక్షకుడితో కలసి మైనర్లు ఖాతాను ప్రారంభించొచ్చు. సంరక్షకులనే వారు తల్లి లేదా తండ్రి లేదా కోర్టు నియమించిన వేరొకరైనా కావచ్చు. తల్లిదండ్రులు మరణించిన సందర్భాల్లో తప్పిస్తే తాత, బామ్మలు మనవడు లేదా మనవరాలి పేరిట పీపీఎఫ్ ఖాతా తెరవడానికి అవకాశం లేదు. ఒకరు తన పేరిట ఒక ఖాతాను మించి ప్రారంభించేందుకు నిబంధనలు అనుమతించవు. అయితే మైనర్ పేరిట తెరిచిన ఖాతాను వేరేగా పరిగణిస్తారు. ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), హిందూ ఉమ్మడి కుటుంబాలు (హెచ్యూఎఫ్) లేదా వ్యక్తులకు సంబంధించిన సంస్థ (బీఓఐ)లు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం లేదు. ఇటీవలే కేంద్రం పీపీఎఫ్కు సంబంధించి ఎన్ఆర్ఐల విషయంలో ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తులు ఎవరైనా పీపీఎఫ్ ఖాతా తెరిచి, ఆ తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడితే (ఎన్ఆర్ఐగా మారితే) వారి పీపీఎఫ్ ఖాతా మూసివేతకు గురవుతుంది. ఖాతాలో ఉన్న బ్యాలెన్స్పై కేవలం సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు మాత్రమే చెల్లిస్తారు. అంటే 7.8 శాతం వడ్డీ రేటు వర్తించదు. నగదు అవసరమైతే... పెట్టుబడి ప్రారంభించిన తర్వాత 15 ఏళ్ల వ్యవధి తీరకుండానే డబ్బుతో పని పడిందనుకోండి. పెట్టుబడుల్లో కొంత వెనక్కి తీసుకోవచ్చు. లేదా రుణం కూడా తీసుకోవచ్చు. రుణంపై పీపీఎఫ్ వడ్డీ రేటు కంటే 2% అదనంగా వసూలు చేస్తారు. పీపీఎఫ్ ఖాతా జమలపై రుణం తీసుకుంటే దాన్ని తీర్చిన తర్వాతే మరోసారి రుణం పొందేం దుకు వీలుంటుంది. మూడో ఏట చివరి నుంచి ఏడవ సంవత్సరంలోపే రుణానికి అవకాశం. ఆ తర్వాత నుంచి పెట్టుబడిలో కొంత వెనక్కి తీసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఏడాదికి ఒక్కసారే ఈ అవకాశం. ఒకవేళ చందాలు జమలేక ఖాతా ఇనాక్టివ్గా మారిపోతే రుణాలు పొందడానికి, ఖాతా లో ఉన్న బ్యాలన్స్ను వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. కనీస చందాలతోపాటు జరిమానాలు చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకున్న తర్వాతే ఆ అవకాశం లభిస్తుంది. వడ్డీ లెక్కించేది ఇలా... పీపీఎఫ్లో పెట్టుబడులపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి 7.8 శాతం వడ్డీరేటు అమలవుతోంది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసేవారు 5వ తేదీలోపు ఇన్వెస్ట్ చేస్తేనే ఆ చందాకు ఆ నెలకు సంబంధించిన వడ్డీ లభిస్తుంది. చెక్కు ఇచ్చినా గానీ 5వ తేదీలోపు డ్రా అయి వెళ్లేలా చూసుకోవాలి. పీపీఎఫ్ ఖాతాలోని నగదు బ్యాలెన్స్ ప్రతి నెలా 5వ తేదీన ఎంతయితే ఉంటుందో... దాన్నే వడ్డీకి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వార్షికంగా ఒక్కసారే ఇన్వెస్ట్ చేస్తుంటే ఏప్రిల్ 5వ తేదీలోపు డిపాజిట్ చేయడం ప్రయోజనం. ఏటా మార్చి 31నే వడ్డీ ఖాతాలో జమ చేసినప్పటికీ ప్రతీ నెలా 5వ తేదీ నాటికి ఉన్న బ్యాలెన్స్ను పరిగణనలోకి తీసుకుని లెక్కించడం జరుగుతుంది. వార్షికంగా గరిష్ట పరిమితి దాటి ఎంత మొత్తం జమ చేసినా దానిపై వడ్డీ రాదు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల జమలపైనే వడ్డీ లభిస్తుంది. వార్షికంగా కనీసం రూ.500 జమ చేయకపోతే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు పీపీఎఫ్ ఖాతా ఇనాక్టివ్గా మారిపోతుంది. తిరిగి ఆ ఖాతాను యాక్టివ్గా మార్చుకోవాలంటే అప్పటి వరకు బకాయి పడిన ప్రతి సంవత్సరానికి కనీస చందా రూ.500తోపాటు పెనాల్టీ రూ.50 (ఏటా) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కనీసం రూ.500;గరిష్ఠం రూ.1.5 లక్షలు పీపీఎఫ్లో ఎంత పడితే అంత డిపాజిట్ చేయటానికి వీల్లేదు. దీనికంటూ నిబంధనలున్నాయి. పీపీఎఫ్లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేయొచ్చు. తన పేరిట గానీ, తన పిల్లల పేరిట గానీ పీపీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకు మించడానికి వీల్లేదు. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో 12 సార్లే డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఏక మొత్తంలోనూ డిపాజిట్ చేసుకోవచ్చు. కాకపోతే 12 సార్లకు మించి చేయడానికి మాత్రం వీలుండదు. లాకిన్ పీరియడ్ డిపాజిట్ ప్రారంభించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి ప్రారంభమవుతుంది కనుక వార్షిక చందాలైతే 16 సార్లు చేయాల్సి ఉంటుంది. నెలవారీ చందాలైతే గరిష్ఠంగా 192 సార్లు డిపాజిట్ చేయవచ్చు. ముందస్తుగాచఖాతా ముగిస్తే..! కొన్ని ప్రత్యేక కేసుల్లో పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా క్లోజ్ చేసేందుకు అనుమతి ఉంటుంది. దీనికి సైతం కనీసం ఐదేళ్ల కాల వ్యవధి ముగిసి ఉండాలి. నిజానికి పీపీఎఫ్ ఖాతాలో చేసే పెట్టుబడులు, దానిపై రాబడులకు పన్ను మినహాయింపు ఉందని చెప్పుకున్నాం కదా. అయితే, 15 ఏళ్ల కాల వ్యవధి తీరకుండానే వెనక్కి తీసుకుంటే ఆ మొత్తంపై పన్ను పడుతుంది. వార్షిక ఆదాయ రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ నిధిపై సంపద పన్ను వర్తించదు. ఏ కోర్టూయ జప్తు చేయలేదు పీపీఎఫ్ ఖాతాదారుడు ఎవరికైనా, ఏ సంస్థకైనా బకాయి పడితే అతడి ఖాతాను జప్తు చేసేందుకు చట్టం అనుమతించదు. దీంతో పీపీఎఫ్ ఖాతాలో ప్రతి రూపాయి ఆ వ్యక్తికే చెందుతుంది. లేదంటే అతడి కుటుంబ సభ్యులకు దానిపై హక్కు లభిస్తుంది. -
‘డొల్ల’తనం బట్టబయలు!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తరువాత సుమారు 35 వేల కంపెనీలు రూ.17 వేల కోట్లకు పైగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, ఆ తరువాత విత్డ్రా చేసుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. అక్రమ నగదు ప్రవాహాలపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించిన తరువాత కార్యకలాపాలకు దూరంగా ఉన్న సుమారు 2.24 లక్షల కంపెనీల పేర్లను అధికారిక రికార్డుల నుంచి తొలగించి, 3.09 లక్షల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు వేసినట్లు పేర్కొంది. నకిలీ డైరెక్టర్లు కార్పొరేట్ కంపెనీల్లో చేరకుండా నిరోధించేందుకు కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపింది. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు గత నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత బట్టబయలైన డొల్ల కంపెనీలు, వాటి డైరెక్టర్ల వివరాలు, నగదు జమ, ఉపసంహరణలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్రం ఆదివారం విడుదల చేసింది. ఆర్థిక నేరాలు, అకౌంటింగ్ అవకతవకల కట్టడికి పలు చర్యలను ప్రకటించింది. ముఖ్యాంశాలు.... ► 56 బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం నోట్ల రద్దు తరువాత 35 వేల కంపెనీలు, 58 వేల ఖాతాల ద్వారా రూ.17 వేల కోట్లను డిపాజిట్ చేసి విత్డ్రా చేశాయి. ► వాటిలో నవంబర్ 8న నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్న ఓ కంపెనీ ఆ తరువాత రూ. 2,484 కోట్లు డిపాజిట్ చేసి ఉపసంహరించుకుంది. ► ఒక కంపెనీకి ఏకంగా సుమారు 2,134 ఖాతాలున్నాయి. ► ఇలాంటి కంపెనీలకు సంబంధించిన సమాచారం దర్యాప్తు సంస్థలకు అందజేత ► రిజిస్ట్రేషన్ రద్దయిన కంపెనీల ఆస్తులను తిరిగి రిజిస్ట్రేషన్ చేయొద్దని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ ► కనీసం రెండేళ్లు అంతకన్నా ఎక్కువ కాలం క్రియాశీలకంగా లేని సుమారు 2.24 లక్షల కంపెనీల రద్దు. వాటి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల అమ్మకాలపై ఆంక్షల విధింపు ► వేటు పడిన వారిలో 3 వేలకు మందికి పైగా డైరెక్టర్లు ఒక్కొక్కరు నిబంధనలకు విరుద్ధంగా 20కి పైగా కంపెనీల్లో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ► నకిలీ డైరెక్టర్లను నియంత్రించడానికి డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్(డిన్)ని వారి ఆధార్, పాన్తో అనుసంధానించేందుకు యత్నాలు ప్రారంభం ► 2013–14 నుంచి 2015–16 మధ్య కాలంలో వార్షిక రిటర్నులు దాఖలు చేయని కంపెనీల డైరెక్టర్లపై అనర్హత వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం ► చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్ల నియంత్రణ వ్యవస్థలో మార్పులు సూచించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు ► ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు పరిశీలిస్తూ అకౌంటింగ్ ప్రమాణాలు నిర్ధారించేందుకు, తప్పులకు పాల్పడే నిపుణులపై చర్యలు తీసుకునేందుకు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ(ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటుకు చర్యలు ముమ్మరం ► తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం(ఎస్ఎఫ్ఐఓ) ఆధ్వర్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. -
ఎస్బీఐ ఘోర తప్పిదం
రాంచీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఘోర తప్పిదం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు తప్పుడు, అనధికారిక లావేదేవీలు, వేల రూపాయల గల్లంతుతో ఖాతాదారులు లబోదిబోమంటుండగా స్వయంగా బ్యాంకే డిపాజిట్ విషయంలో తప్పులో కాలేసింది. సంక్షేమ పథకం కోసం కేటాయించిన కోట్ల రూపాయలను ఒక నిర్మాణ కంపెనీ ఖాతాలోకి జమ చేయడం కలకలం రేపింది. తాజా నివేదికల ప్రకారం.. ఈ నిధులను జమ చేయాల్సిందిగా విద్యాశాఖను ఎస్బీఐ కోరినపుడు ఈ తప్పిదాన్ని బ్యాంకు గుర్తించింది. జార్ఖండ్ రాష్రం మధ్యాహ్న భోజన పథకం కోసం కేటాయించిన రూ.100కోట్ల నిధులను పొరపాటున ఓ నిర్మాణ కంపెనీ ఖాతాలోకి డిపాజిట్ చేసింది. ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ (రాంచీ జోన్) డీకే పాండా ప్రకారం, ఈ ఘటపై బ్యాంకు అంతర్గత విచారణ చేపట్టింది. అలాగే దీనికి బాధ్యతగా ఓ అధికారిని సస్పెండ్ చేసింది. కంపెని చెందిన సుమారు ఏడు ఎనిమిది ఖాతాల్లో ఈ మొత్తం జమ అయినట్టు తెలిపారు. దీంతోపాటు సీబీఐలోకూడా అధికారిక ఫిర్యాదును సమర్పించామని పాండా చెప్పారు. అయితే ఈ మొత్తం సొమ్ములో 70శాతం రికవరీ చేయగా, ఇంకా రూ.30కోట్లను స్వాధీనం చేసుకునేందుకు ఎస్బీఐ ప్రయత్నిస్తోంది. -
రూ.353 కోట్లు బీమా పరిహారం జమ
అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమా పరిహారం రూ.353 కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు లీడ్ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఖరీఫ్–2016కు సంబంధించి 5.07 లక్షల మందికి మంజూరైన రూ.419 కోట్ల పరిహారంలో బజాజ్ కంపెనీ నుంచి తొలి విడతగా నాలుగు రోజుల కిందట రూ.153 కోట్లు, రెండో విడతగా శనివారం మరో రూ.200 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో మిగతా రూ.66 కోట్లు జమ చేసే అవకాశం ఉందన్నారు. ప్రీమియం కట్టిన రైతుల జాబితాలు పరిశీలించిన తర్వాత త్వరలోనే ఖాతాల్లోకి పరిహారం జమ చేయవచ్చని తెలిపారు. -
చివరి అవకాశం..రేపటినుంచి ఇక అంతే..
-
చివరి అవకాశం..రేపటినుంచి ఇక అంతే..
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లు జమ నేటితో రద్దు. రద్దైన పెద్దనోట్ల ఆర్బీఐ ప్రత్యేక కౌంటర్లలో డిపాజిట్లకు తుది గడువు నేటి (మార్చి31) తో ముగియనుంది. గత ఏడాది నవంబర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసి సంచలనం సృష్టించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం భారత పౌరులు పాతనోట్లను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. నేరంగా పరిగణిస్తారు. ఈ ఉల్లంఘన రూ. 10,000 జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు ఐదు రెట్లు వీటిలో ఏది ఎక్కువ దాని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ప్రవాస భారతీయుల (ఎన్నారైలు) పాతనోట్ల మార్పిడికి జూన్ 30కి గడువును ఇచ్చింది కేంద్ర బ్యాంకు. ఈ సౌకర్యం ముంబై, ఢిల్లీ, కోలకతా, చెన్నై, నాగ్పూర్ లో ఆర్బిఐ కార్యాలయాలలో మాత్రమే అందుబాటులో ఉంది. విదేశాలనుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులనుంచి రెడ్ ఛానల్ సర్టిపికెట్ తెచ్చుకోవాల్సి ఉంది. ఫెమా నిబంధనల ప్రకారం ఈ పరిమితి ఒక వ్యక్తికి రూ. 25,000. ఒకవేళ ఈ డిపాజిట్కు కేంద్ర బ్యాంకు నిరాకరించిన విషయంలో, 14 రోజుల లోపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ కు ఫిర్యాదు చేయవచ్చు. నేపాల్, భూటాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లో ఉండే వారు ఈ సౌకర్యం ఉపయోగించుకోలేరు. కాగా నవంబర్ 8న డిమానిటైజేషన ప్రకటించిన కేంద్రప్రభుత్వం రద్దయిన పెద్దనోట్లను బ్యాంకులు స్వీకరించే గడువును జనవరి 30, 2017తో ముగించింది. అయితే రద్దయిన నోట్లను డిసెంబరు 30వ తేదీలోపు తమ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోలేని వారు తగిన కారణాలను చూపి.. రిజర్వ్బ్యాంకు ప్రత్యేకించిన కౌంటర్లలో మార్చి 31వ తేదీ వరకు మార్పిడి చేసుకునే అవకాశం ఇచ్చింది. నగదు ఉపసంహరణపై అనేక ఆంక్షలు, పరిమితుల నేపథ్యంలో తీవ్ర నిరసన వ్యక్తంకావడంతో ఖాతాదారుల సౌలభ్యంకోసం విడతలవారీగా కొన్ని వెసులు బాటును ప్రకటించింది. మరోవైపు డిమానిటైజేషన్ 50 రోజుల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 86శాతం చలామణిలో ఉన్న పెద్దనోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడింది. రద్దయిన నోట్లను నవంబరు 10వ తేదీ నుంచి బ్యాంకులు స్వీకరించడం ప్రారంభించాయి. దీంతో అటు డిపాజిట్లకు, ఇటు నగదుకోసం ఏటీఎంల సెంటర్లదగ్గర, బ్యాంకుల వద్ద ప్రజలుబారులు తీరారు. పనిచేయని ఏటీఎంలు, నో క్యాష్ కోర్డులు వెక్కిరించడంతో కొన్ని అవాంఛనీయ ఘటనలు, మరణాలు సంభవించిన సంగతి విదితమే. -
ఆయుధాలు డిపాజిట్ చేయండి
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హోంశాఖ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈనెల 9వ తేదీన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా లైసెన్స్డ్ తుపాకులను డిపాజిట్ చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేదీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లైసెన్స్ ఉన్న ఆయుధాలు కలెక్టర్, ఎస్పీ కార్యాలయం . లేదంటే సంబంధిత పోలీస్స్టేషన్, ఆయుధ డీలర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించారు. బ్యాంకుల్లో సెక్యూరిటీ గార్డులు సైతం తుపాకులు సరెండర్ చేయాలని ఉత్తర్వుల్లో రాజీవ్త్రివేదీ స్పష్టంచేశారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలు వెంట ఉండకూడదని పేర్కొన్నారు. -
ఎన్నిసార్లయినా డిపాజిట్ చేయొచ్చు
• దానికి రెట్టింపు మొత్తం పన్నుగా చెల్లిస్తే చాలు • దాన్ని గరీబ్ కల్యాణ్ డిపాజిట్గా పరిగణిస్తాం • నల్లధనం వెల్లడికి చివరి అవకాశమిదే: ఆర్థికశాఖ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ స్కీమ్ (పీఎంజీకేడీఎస్)– 2016 కింద ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా దఫాలుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నల్లడబ్బును వెలికితీయడంలో భాగంగా– పెద్ద నోట్ల రద్దు తరవాత బ్యాంకుల్లో నోట్లు డిపాజిట్ చేయటానికిచ్చిన గడువు మధ్యలో... అంటే డిసెంబర్ 16న ప్రభుత్వం తాజా క్షమాభిక్ష పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఎవరైనా... లెక్కచూపని ఆదాయంగా ప్రకటించినదానిలో కనీసం 25% మొత్తాన్ని 2016 డిసెంబర్ 17 – 2017 మార్చి 31 మధ్య బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని నాలుగేళ్ల వరకూ వడ్డీలేని డిపాజిట్గా అలాగే ఉంచుతారు. ఇప్పటిదాకా ఈ 25% మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాలన్న నిబంధన ఉండగా... దీన్ని ప్రభుత్వం సవరించింది. దఫదఫాలుగా చేసిన డిపాజిట్లనూ ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేసింది. ఇదీ పథకం... ⇔ ఎవరైనా లెక్క చూపని ఆదాయంగా ప్రకటించాలనుకున్న మొత్తంలో 50% మొదట పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ రసీదు చూపించిన తర్వాతే వారు ఈ పథకం పరిధిలోకి వస్తారు. ⇔ 50 శాతాన్ని పన్నుగా చెల్లించాక... మొత్తం సొమ్ములో మరో 25 శాతాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నాలుగేళ్ల పాటు అలా డిపాజిట్ రూపంలోనే ఉంటుంది. దీనిపై ఎలాంటి వడ్డీ ఉండదు. ⇔ తన దగ్గరుండే మిగిలిన 25 శాతాన్ని పన్ను చెల్లించిన ఆదాయంగా పరిగణిస్తారు. దానికి ఎలాంటి లెక్కలూ అడగరు. ⇔ ఈ పథకం కింద పన్ను చెల్లించిన, డిపాజిట్ చేసిన వారి పేర్లను ఎక్కడా బయటపెట్టబోమని కేంద్రం చెబుతోంది. తాజా సవరణ ప్రకారం... ⇔ ఈ పథకం కింద డిపాజిట్ చేయటానికి గడువింకా ఉంది. కాకపోతే కొందరు ఇప్పటికే డిపాజిట్ చేసి ఉండొచ్చు. ⇔ అలాంటి వారు మరిన్ని దఫాలుగా కూడా డిపాజిట్ చేసుకోవచ్చని... అలా డిపాజిట్లు చేశాక... దానికి రెట్టింపు మొత్తాన్ని (50 శాతం) తమకు పన్నుగా చెల్లించాల్సి ఉంటుందనేది కేంద్రం తాజాగా చేసిన ప్రకటన సారాంశం. ⇔ అలా పన్నుగా చెల్లించాక... అందులో సగం మొత్తాన్ని (25 శాతం) వారు తమ దగ్గర పన్ను చెల్లించేసిన ఆదాయంగా ఉంచుకోవచ్చు. ⇔ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం... నాలుగేళ్ల తరవాత వడ్డీ లేకుండా చేతికొస్తుంది. 23 లక్షల మందికి సీబీడీటీ ప్రశంసలు.. సకాలంలో పన్ను చెల్లింపులు, రిటర్న్స్ దాఖలు చేసిన 3.74 లక్షల మందికి తాజాగా ఐటీ శాఖ ప్రశంసలు లభించాయి. వీరికి ప్రశంసా పత్రాలను పంపినట్లు సీబీడీటీ పేర్కొంది. దీనితో ఈ తరహా ప్రశంసంలు అందుకున్న వారి సంఖ్య 2016–17 అసెస్మెంట్ ఇయర్లో 23 లక్షలకు చేరినట్లు తెలి పింది. పన్ను చెల్లింపుల ప్రాతిపదికన ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీల్లో ఈ–మెయిల్ ప్రసంశా పత్రాలను పంపినట్లు తెలిపారు. -
రూ.2.5 లక్షల డిపాజిట్లపై ప్రశ్నలుండవు..
స్పష్టతనిచ్చిన ఆదాయ పన్ను శాఖ న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ అనంతరం బ్యాంకుల్లోకి వెల్లువెత్తిన నగదుపై పన్నులపరమైన చర్యలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ స్పష్టతనిచ్చింది. రూ. 2.5 లక్షల దాకా డిపాజిట్ మొత్తాలపై ఎటువంటి ప్రశ్నలు ఉండబోవని.. పన్ను రిటర్నులతో పొంతన లేని ఖాతాలపైనే ప్రత్యేకంగా దృష్టి ఉంటుం దని వివరించింది. అత్యాధునిక డేటా విశ్లేషణ సాధనాలతో రూ. 2 లక్షల నుంచి రూ. 80 లక్షలు, అంతకు పైబడిన డిపాజిట్ల మొత్తాలను వేర్వేరుగా గుర్తించామని పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న విధంగా రూ. 2.5 లక్షల దాకా డిపాజిట్ల డేటాను ప్రస్తుతానికైతే పక్కన పెట్టామని ఆయన వివరించారు. పన్నుపరమైన ప్రభావాలను ప్రస్తావిస్తూ .. ఉదాహరణకు పన్ను పరిధిలోకి వచ్చేవిధంగా రూ. 10 లక్షల పైచిలుకు ఆదాయం గలవారు రూ. 3 లక్షల మేర డిపాజిట్ చేయడం సమర్ధనీయమైనదేనని, అటువంటి వారి జోలికి తాము వెళ్లబోమని చంద్ర పేర్కొన్నారు. అయితే, గత మూడేళ్లలో ఐటీ రిటర్నులు దాఖలు చేయకుండా ఎకాయెకిన రూ. 5 లక్షలు డిపాజిట్ చేసిన వారి కేసులు పరిశీలించే అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. మరోవైపు స్క్రూటినీ చేపట్టిన సందేహాత్మక కేసుల్లో మాత్రం పన్ను రీఫండ్లను ఆపి ఉంచడం జరుగుతుందని చంద్ర చెప్పారు. -
రద్దయిన నోట్లు మిగిలిపోయాయా? అయితే..
ముంబై: రద్దయిన పాత నోట్లు ఇంకా మిగిలిపోయాయా? రూ. 500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేయడం మర్చిపోయారా..అయితే అలాంటి వారికి నిజంగా లడ్డూ లాంటి వార్తే. రద్దయిన ఈ పెద్దనోట్లను మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందట. రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడికి, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందని జాతీయ మీడియా గురువారం రిపోర్ట్ చేసింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ, బ్యాంకు అధికారుల వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. తమ దగ్గర మిగిలిపోయిన పెద్దనోట్ల డిపాజిట్ కు అనుమతించాల్సిందిగా కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాసినట్టు పేర్కొంది. అయితే ఈ అవకాశాన్ని చాలా తక్కువ విలువ డిపాజిట్లకు పరిమితం చేయవచ్చని తెలిపింది. ఈ పరిమితి సుమారు రూ.2వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది. కాగా నవంబరు 8న దేశవ్యాప్తంగా రూ.500,1000 పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పడి చేసేందుకు కొన్ని పరిమితులను, ఆంక్షలను విధించింది. మరోవైపు పాత నోట్ల డిపాజిట్లకు గడువు 2016 డిసెంబర్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. -
నోట్లు డిపాజిట్ చేశారా!!
ఐటీ విషయంలో నిజాయితీగా ఉండండి పెద్ద నోట్లు రద్దయ్యాయి. బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వీలుకాని వారు రిజర్వు బ్యాంకు కార్యాలయాల్లో డిక్లరేషన్ యిచ్చి జమ చేసే అవకాశం ఇంకా ఉంది. ఈ డిక్లరేషన్ లో చాలా వివరాలివ్వాలి. ఇది మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 2017–18 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. బడ్జెట్లో ఏ మార్పులూ లేకపోతే... 31 జూలై 2017లోగా రిటర్న్లు దాఖలు చెయ్యాలి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ... ⇔ నిజంగా బ్యాంకు ద్వారా నవంబర్ 8కి ముందు విత్ డ్రా చేసి... ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన నోట్లను డిపాజిట్ చేసి ఉంటే రిస్కేమీ లేదు. ⇔ మధ్య తరగతి, సామాన్యులు లెక్కలు రాయక్కర్లేదు. కానీ నగదు పుస్తకం లాంటిది రాసిన వారు నవంబర్ 8 నాటి నగదు విలువ తేల్చండి. ⇔ వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు కూడా ఇలా చేయొచ్చు. మీరు జమ చేసిన ప్రతి రూపాయికి (ప్రతి 5 వందల నోటుకి) వివరణ ఉండాలి. దొంగ వివరణ ఇవ్వొద్దు. నిల్వ తేల్చాక అందులోంచి 100, 50, 20, 10 తీసేయండి. మిగిలిన 1000 మరియు 500లతో... డిపాజిట్ చేసిన మొత్తం మీదే దృష్టి పెట్టండి. ⇔ స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మీరు తీసుకున్న బ్లాక్ మనీ బ్యాంకు లాకర్ల లోంచి బయటకు తీసి నిజాయితీగా డిపాజిట్ చేసి ఉంటారు. మీ వృత్తి నిపుణుల సలహా మేరకు పన్ను లెక్కించి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. ⇔ మీ డిపాజిట్లు రూ.2,50,000 వరకు ఎటువంటి వివరణ అడగం అంటున్నారు. అంటే ఒక పాన్ నంబర్తో రూ.2,50,000 డిపాజిట్ దాటకూడదు. గత్యంతరం లేకపోతే యింట్లో అందరి చేత బ్యాంకు ఖాతా తెరిపించి మొత్తాన్ని 2,50,000 దాటకుండా డిపాజిట్ చేసి వివరణ ఇవ్వండి. ⇔ మరొక జాగ్రత్త తీసుకోండి.. ఒక పాన్ నెంబర్ కింద ఏడాది కాలంలో రూ.10,00,000 దాటి జమ చేస్తే మీ ఖాతా వివరాలు డిపార్టుమెంటుకి వెళ్తాయి. ఈ పరిధి లోపలే వ్యవహారాలుండాలి. పది లక్షలు దాటినా... వివరణ యివ్వగలిగితే కాగితాలుంటే పర్వాలేదు. అబద్ధం చెప్పొద్దు. ప్రతి వ్యవహారం ‘కాగితాల‘తో చేయండి.. రుజువులు ఏర్పరచుకోండి. ⇔ అవసరమైతే (వ్యాపారస్తులు) యింట్లో కుటుంబీకుల పేరిట టర్నోవర్ చూపించండి. వారి చేత పన్ను కట్టించండి. పాన్ తీసుకోండి.. 30% కట్టవలసిన చోట 20%.. 20% కట్టవలసిన చోట 10% కట్టినా పరవాలేదు.. లాభం సమంజసంగా ఉండాలి.. పూర్తిగా ఎగవేత ప్రయత్నం చేయొద్దు. ⇔ ఐటీ డిపార్టుమెంటు ఆరా తీసినప్పుడు సరైన వివరణ ఇవ్వండి.. మిమ్మల్ని అసెస్మెంట్ చేసే అధికారులు ఎంతో సహకారం అందిస్తారు.. అందరి మీద కక్ష సాధింపు చర్యలుండవ్. సామాన్యులెవరూ భయపడనక్కర్లేదు. ప్రస్తుతం మీకు నోటీసు రాకపోయినా.. వస్తుందన్న భయంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. నోటీసు వచ్చిన వెంటనే భయపడొద్దు. అన్ని కాగితాలు, రుజువులు, బ్యాంకు అకౌంట్ కాపీలు, పేయింగ్ స్లిప్పులు, వ్యవహార సంబంధిత పత్రాలు, ఇతరుల దగ్గర్నుంచి కన్ఫర్మేషన్ లెటర్స్.... ఇలా ఎన్నో ఆలోచించుకుని తయారు చేసుకోండి. వ్యవహారాన్ని బట్టి తారీఖుల ప్రకారం ఫైల్ చేసుకోండి. వివరణ రాసుకోండి. అప్పుడు నోటీసు వచ్చిన వెంటనే అధికారులని కలవవచ్చు. అవసరమైనప్పుడు వృత్తి నిపుణుల సహాయం తీసుకోండి. మీ వివరణ సరిగ్గా ఉన్నప్పుడు మీరు భయపడక్కర్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకారం ఆదాయాన్ని డిక్లేర్ చేయండి. తద్వారా మీ క్షేమం, సంక్షేమము, శాంతి ఏర్పడుతాయి. -
డిపాజిట్లలో 40% మావద్దే!
• డిజిటల్ చొరవ కొనసాగితేనే ఆశించిన ప్రయోజనం • ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య దావోస్: నోట్ల రద్దు అనంతరం తమ బ్యాంకులో జమ అయిన డిపాజిట్లలో 15 నుంచి 40 శాతం వరకు ఉండిపోతాయన్న అంచనాను ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల సందర్భంగా అరుంధతి భట్టాచార్య ఓ ప్రముఖ టెలివిజన్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘డిపాజిట్లలో అధిక మొత్తం వ్యాపారస్తుల నుంచి వచ్చి ఉంటే, వారు తిరిగి తమ వ్యాపార అవసరాల కోసం వెనక్కి తీసుకుంటారు. కానీ, ఒకవేళ బ్యాంకుల్లోకి వచ్చిన నగదు జమల్లో అధిక శాతం ప్రజల పొదుపు (ఇళ్లలో దాచుకున్న నగదు) అయితే అవి అలానే కొనసాగుతాయి’’ అన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. నగదుకు బదులుగా డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకానికి చేపట్టిన చర్యలను కొనసాగించాల్సి ఉందన్నారు. ఒకవేళ తిరిగి డీమోనిటైజేషన్ ముందునాటి పరిస్థితులకు వెళ్లితే ఆశించిన ప్రయోజనాలను పొందలేమని చెప్పారు. గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్ల రద్దు చేసిన తర్వాత బ్యాంకుల్లోకి సుమారు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు వచ్చి చేరిన విషయం తెలిసిందే. ఈ భారీ నిల్వలతో బ్యాంకులు లబ్ధి పొందుతాయన్న విశ్లేషణల నేపథ్యంలో అరుంధతి భట్టాచార్య మాటలకు ప్రాధాన్యం నెలకొంది. రుణాలుగా మళ్లించడం ద్వారానే ప్రయోజనం ‘‘బ్యాంకుల్లో గరిష్ట స్థాయిలో డిపాజిట్లు కొనసాగడం అంటే వాటికి తక్కువ వ్యయానికే నిధులు అందుబాటులో ఉన్నట్టు. వీటిని రుణ వితరణ చేయడం ద్వారా బ్యాంకులు లాభపడతాయి’’ అని సెంట్రమ్ వెల్త్ మేనేజ్మెంట్ అనలిస్ట్ పాయల్ పాండ్యా తెలిపారు. బ్యాంకులు తమ దగ్గరున్న డిపాజిట్లను సాధ్యమైనంత త్వరగా రుణాలుగా మళ్లించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎస్బీఐలో డిపాజిట్లు రూ.1.4 లక్షల కోట్లు పెరగ్గా... అదే సమయంలో కంపెనీ లోన్ బుక్ సైతం తగ్గింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి రుణాల జారీ 9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు భట్టాచార్య ఈ నెలారంభంలో రుణాల రేట్ల తగ్గింపు సందర్భంగా వెల్లడించారు. డిసెంబర్ నాటికి ఇది 6.7 శాతంగా ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి మరో 1,894 కోట్లు! న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు మూలధనంగా మరో రూ.1,894 కోట్లు విడుదల కానున్నాయి. ప్రభుత్వం గత ఏడాది జూలై 19న ఒక ప్రకటన చేస్తూ... ఎస్బీఐకి రూ.7,575 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నట్లు తెలిపింది. ఇందులో 75 శాతాన్ని విడుదల చేసింది. ఎస్బీఐ, పీఎన్బీ, ఐఓబీలుసహా 13 ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటి రుణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తూ... ఇప్పటివరకూ రూ.22,915 కోట్లను కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అందించింది. -
త్వరలో తిరిగి వచ్చిన నోట్ల లెక్కలు: ఆర్బీఐ
ముంబై: బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డిపాజిట్ అయిన పాత నోట్ల సంఖ్యను తిరిగి సరిచూసుకుని సంబంధిత మొత్తం గణాంకాలను త్వరలో ప్రకటిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం తెలిపింది. నోట్ల డిపాజిట్పై వివిధ ఊహాగానాలు, వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా వివరణ ఇచ్చింది. డిసెంబర్ 30 నాటికే రద్దయిన నోట్లలో 95 శాతం మేర వెనక్కు వచ్చేశాయని ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ‘‘రద్దయిన నోట్ల డిపాజిట్లపై పలు అంచనాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇందుకు సంబంధించి వివిధ కరెన్సీ చెస్ట్లలో ఉన్న నోట్ల లెక్కను తిరిగి సరిచూసుకుని తగిన గణాంకాలను త్వరలో విడుదల చేస్తాం’’ అని ఆర్బీఐ వివరణ ఇచ్చింది. ఈ ప్రక్రియను ఇప్పటికే ఆర్బీఐ ప్రారంభించిందనీ ప్రకటన పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిస్తామనీ తెలిపింది. -
డిపాజిట్ల వివరాలు పంపండి: ఆర్బీఐ
న్యూఢిల్లీ: డిసెంబర్ 30తో గడువు ముగియడం రద్దయిన కరెన్సీ నోట్ల డిపాజిట్ల వివరాలు తెలపాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. శుక్రవారం బ్యాంకు పనివేళలు ముగిశాక వివరాలు పంపే పని ప్రారంభించాలంది. ‘రద్దయిన నోట్ల మార్పిడి, డిపాజిట్లకు గడువు ముగియడంతో డిసెంబర్ 30, 2016 నాటికి ఎంత పాత కరెన్సీ చేరిందో ఈ మెయిల్ ద్వారా తెలపాలి’ అని కోరింది. డీసీసీబీలు తప్పించి అన్ని బ్యాంకు శాఖలు... గడువు ముగిసే నాటికి తమ వద్ద ఉన్న పాత నోట్లను ఆర్బీఐ కేంద్రాల్లో, కరెన్సీ చెస్ట్ల్లో శనివారం కల్లా డిపాజిట్ చేయాలంది. -
ఆ డబ్బెవరిది?
నాలుగు రోజులు.. రూ.43 కోట్లు.. డీసీసీబీ డిపాజిట్లపై నాబార్డు ఆరా.. విచారణ చేపట్టిన ఉన్నతాధికారుల బృందం నిజామాబాద్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సహకార బ్యాంకుల్లోని డిపాజిట్లపై నాబార్డు ఉన్నతాధికార బృందం విచారణ చేపట్టింది. డిపాజిట్ల మాటున బ్లాక్ మనీని.. వైట్గా మార్చుకున్నారా? అనే దానిపై ఆరా తీసింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం జిల్లాలోని కో–ఆపరేటివ్ బ్యాంకులను సందర్శించి డిపాజిట్లపై విచారణ చేపట్టింది. సుమారు మూడు రోజుల పాటు విచారణ జరిగింది. రూ.రెండు లక్షలు, అంతకు మించి డిపాజిట్ చేసిన ఖాతాలపై ఆరా తీసింది. అలాగే పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన ఖాతాలకు కేవైసీ ఉందా? లేదా? అనే కోణంలో విచారణజరిపింది. రూ.50 వేలకు మించి చేసిన డిపాజిట్లకు పాన్కార్డు జత చేశారా? వంటి అంశాలను పరిశీలించింది. డిపాజిట్ల సేకరణలో ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించారా? లేదా? అనే అంశాలపై విచారణ జరిగింది. రాజకీయ నేతల పాలనలో నడుస్తున్న ఈ కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో బ్లాక్మనీని, వైట్గా మార్చారనే ఆరోపణలు పలు రాష్ట్రాల్లో వ్యక్తమయ్యాయి. దీంతో అప్రమత్తమవైన ఆర్బీఐ విచారణ చేపట్టాలని నాబార్డును ఆదేశించింది. ఈ మేరకు నాబార్డు ఉన్నతాధికార బృందం జిల్లాలో విచారణ జరిపింది. రాష్ట్రంలో ఎక్కువ డిపాజిట్లు.. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 41 కో–ఆపరేటివ్ బ్యాంకులున్నాయి. వీటిలో సుమారు 1.30 లక్షల మంది ఖాతాదారులున్నారు. డిమానిటైజేషన్ నేపథ్యంలో ఇతర బ్యాంకుల మాదిరిగా కో–ఆపరేటివ్ బ్యాంకులకు పాతనోట్ల ఎక్చే ్సంజీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం మొదటి నుంచి అనుమతి ఇవ్వలేదు. కేవలం డిపాజిట్లు మాత్రమే తీసుకునేందుకు వీలు కల్పించింది. గత నెల 9, 10, 11, 12 తేదీల్లో నాలుగు రోజులు మాత్రమే డిపాజిట్లు తీసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ 13వ తేదీ నుంచి ఈ డిపాజిట్ల స్వీకరణకు కూడా బ్రేకు వేసింది. ఈ నాలుగు రోజుల్లోనే జిల్లాలో సుమారు రూ.43 కోట్ల మేరకు డిపాజిట్లు వచ్చాయి. దీంతో ఇలా ఇతర జిల్లాల్లోని కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు రావడంతో ఆర్బీఐ నాబార్డును విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా నాబార్డు బృందం ఈ డిపాజిట్లపై ఆరా తీసింది. ఇందులో ఏమైనా నల్లధనాన్ని తెల్లదనంగా మార్చారా? అనేక కోణంలో ఆరా తీయడం సహకార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సహకార బ్యాంకుల్లో నామమాత్ర డిపాజిట్లపై విచారణల పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం పలు ప్రైవేటు బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో జరిగిన వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్లధనం మార్చుకునేందుకు కొన్ని ప్రైవేటు బ్యాంకులు యథేచ్ఛగా నల్ల కుబేరులకు సహకరించారనే అభిప్రాయం ఉంది. పాత నోట్ల మార్పిడితో పాటు, డిపాజిట్ల సేకరణలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. -
నోటోపోటు
కథ ‘‘ఏంటిది?’’– గిన్నెలోని పసుపు పచ్చటి పదార్థం వైపు అనుమానంగా చూస్తూ అడిగాను.‘‘లెమన్ రైస్, అన్నా’’ అన్నాడు క్యాంటిన్ఓనర్. గిన్నెలో పదార్థం తీరు చూస్తుంటే లెమన్రైస్ నిర్వచనంలో ఏదో తేడా ఉందనిపించింది.‘‘పిచ్చోడా, మనోడు అన్నంలో పసుపు వేస్తే అదే లెమన్రైస్, అదే కాస్త జీలకర్ర వేసాడనుకో అది జీరారైస్, లేదంటే కాసిని కూరగాయలు తరిగి వేసాడనుకో, అదే వెజ్ బిర్యానీ... పేర్లేదైనా మూల పదార్థం ఒకటే నాయనా’’ అని పక్కనే ఉన్న మా సీనియర్ కొలీగ్ నాకు హితబోధ చేసాడు.‘సరే ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా’ అని ఆ లెమన్రైస్ అనే బ్రహ్మపదార్థాన్ని ఆర్డరు చేశా. వెంటనే ఒక ప్లేటు నిండా పొర్లిపోయేలా పెట్టి ఇచ్చాడు క్యాంటీన్వాలా. ‘‘ఇదేంటి ఇంత పెట్టావు’’ అన్నాను భయంగా. ‘‘రేపు ఆదివారం, సరుకు మిగలకూడదు, రెండు ప్లేట్లకు తక్కువ, ఒక్కప్లేటుకు ఎక్కువగా ఉంది కాబట్టి నీపై అకాల ప్రేమ కలిగింది మనోడికి’’ అని అందులోని ఆర్థిక సూత్రాన్ని పక్కన ఉన్న నా ఉపనిషత్ గురువు వెంటనే వివరించాడు. విరక్తితో ఆ ప్లేటు తీసుకొని తినడానికి తయారయ్యాను. కానీ లెమన్రైస్, నా జీర్ణవ్యవస్థ అయస్కాంతంలోని సజాతి ధ్రువాల్లా వికర్షించుకోవడం ప్రారంభించాయి. ఈ పోరాటాన్ని కొనసాగిస్తే ప్రాణాపాయం కలుగుతుందన్న భయంతో విరమించి నా సీట్లోకి వచ్చి కూలబడ్డాను.‘‘నీదగ్గర పెద్ద నోట్లున్నాయా?’’ అని అడిగాడు మా ఇన్చార్జి. ‘‘ఉన్నాయండీ, రెండు వెయ్యి రూపాయల నోట్లున్నాయి’’ అని చెప్పాను.‘‘జాగ్రత్త, 500, 1000 నోట్లను ఇప్పుడే ప్రభుత్వం రద్దు చేసింది’’ అని నింపాదిగా చెప్పారాయన.ఒక్క క్షణం అర్థం కాలేదు. నోట్ల రద్దంటే ఇప్పుడు నా దగ్గరున్న 10 వేలూ పనికి రాకుండా పోతాయా? వామ్మో ఈ నెలంతా ఎలా? లాంటి తింగరి ఊహలు వచ్చాయి. రేపట్నించి బ్యాంకుల్లో మార్చుకోవచ్చని మా బాస్ భరోసా ఇచ్చారు. హమ్మయ్య అనుకొని నెట్ ఓపెన్ చేసి చూస్తే అన్ని సైట్లలో ఇదే రచ్చ. మరోవైపు ఎందుకు రద్దు చేశారు? పాతనోట్లు ఎలా మార్చుకోవాలి? ఎప్పటివరకు గడువు? దీంతో ఏం జరుగుతుంది? విత్డ్రా, డిపాజిట్ల పరిమితి ఎంత? ఇలా ప్రశ్నలు, సమాధానాలు చానెళ్లలో హోరెత్తుతున్నాయి. చాలామంది ప్రభుత్వ నిర్ణయాన్ని భేష్ అంటున్నారు. కొంతమంది మాత్రం ఈ చర్యతో ప్రజలకు నానా ఇబ్బందులు తప్పవంటున్నారు. పక్కింటోడికి కూడా తెలీని ముఖాలు చర్చాకార్యక్రమాల్లో ఎగిరెగిరిపడుతూ చర్చిస్తున్నాయి. ‘ఏంటీ గోల, రద్దయితే ఏమైంది, ఆకాశం కూలిపోయిందా? రేపట్నించి బ్యాంకులో తీసుకోవచ్చన్నారుగా, ఎందుకీ హడావుడి’ అనిపించింది. ఆ రోజంతా పేపర్లో ఇదే మ్యాటర్, ప్రముఖుల అభిప్రాయాలు, విశ్లేషణలు... ఇలా వర్క్ పూర్తయ్యి ఇంటికి చేరేటప్పటికి అర్ధరాత్రి దాటింది.పడుకునేముందు ‘రేపు వెళ్లి నా రెండు నోట్లు మార్చుకోవాలా? ఒకటి మార్చుకొని రెండోది గుర్తుగా ఉంచుకోవాలా?’ అన్న శాస్త్ర సంబంధ తర్క మీమాంస మనసులో బిగినయింది. టీవి చర్చల్లాగా దానికి ముగింపు రాకముందే నిద్రలోకి జారుకున్నాను. తెల్లారి లేవగానే నోట్ల విషయం గుర్తొచ్చింది. నెమ్మదిగా రెడీ అయి దగ్గర్లోని బ్యాంకుకు బయలు దేరాను. మధ్యలో టెస్టింగ్ కోసం కిరాణా కొట్టువాణ్ణి కదిలించా, ‘ఏమయ్యా పెద్దనోటుకు చిల్లరుందా?’ అని.‘‘ఉంది, కాకపోతే ఏమైనా కొంటేనే చిల్లరిసా’’్త అన్నాడు.ఇంకే పర్లేదు, అనుకొని బ్యాంకుకు వెళ్లాను. దారంతా తిరునాళ్ల సందడి. కలయో, వైష్ణవ మాయో అంటే అర్థం ఆ రోజే తెలిసింది.జీవితంలో ఏనాడూ తెల్లారి లేవడం అలవాటు లేని పలు జీవాలు బ్యాంకు ముందు మత్తుకళ్లతో నిల్చున్నాయి. నైట్డ్రస్సులు, పాచి కంపులు... నా జీవితంలో బ్యాంకు ముందు అంతమంది జనాలు అంత పొద్దున్నే గుమిగూడడం ఫస్ట్టైమ్ చూసాను. వీళ్లకు టీ అమ్మి క్యాష్ చేసుకుందామని ఫ్లాస్కులతో అటూ ఇటూ తిరుగుతున్న బాల కార్మిక వీరులు. టీ తాగాలని ఉన్నా, చిల్లర లేని జేబును చూసి గుడ్లనీరు కుక్కుకుంటున్నవాళ్లు.. ఇలా ఎందరో... వీళ్లందరూ నోట్లు మార్చుకొని నా వంతు వచ్చేదెప్పుడు? అని ప్రశ్నించుకొని రేపు అనేది ఒకటి ఉంది అని గుర్తుచేసుకొని గిరుక్కున వెనక్కి తిరిగి కిరాణా కొట్టు దగ్గరకు పోయాను. ‘‘ఒక వక్కపొడి పొట్లం ఇవ్వవోయ్,’’ అని 500 నోటు ఇచ్చాను. ‘‘వేళాకోళం ఆడకండి సార్’’ అన్నాడు వాడు.‘‘సరే ఒక యాభైరూపాయలకు ఏవైనా సరుకులు కొంటా కానీ, చిల్లర ఇవ్వు’’ అన్నాను. ‘‘కనీసం 450 రూపాయలకు ఏమైనా కొంటే చిల్లర ఇస్తా’’ అని నా నోటు వెనక్కు ఇచ్చాడు.‘‘ఒంటికాయ శొంఠికొమ్ము గాడ్ని, 450 రూపాయలకు ఏం కొనాలి నా బొంద’’ అనుకొని నీరసంగా ఇంటికి వచ్చా. గుమ్మంలోనే మా ఓనరు ముసలమ్మ బోసినోటితో నవ్వుతూ పలకరించింది. ‘‘ఏంటి’’ అని కళ్లెగరేసా, ‘‘ఒకటో తారీకు ఇచ్చిన అద్దె పాతనోట్లతో ఇచ్చావు, కాస్త వాటిని మార్చి కొత్తవి తెచ్చివయ్యా,’’ అని బాంబేసింది.నో.. కుదరదు, నా రెండు నోట్లే మారక చస్తుంటే నీగోలేంటి అని తిట్టుకుంటూ, ‘‘మీరు మార్చుకోవచ్చుగా’’ అన్నాను. ‘‘పెద్దదాన్ని నేను పోలేను, నువ్వే తెచ్చివ్వు’’ అని అద్దె మొత్తం తెచ్చి నా చేతిలో పోసింది. పొద్దున్నే పనిపిల్ల మీద విరుచుకపడేటప్పుడు, ఎప్పుడైనా కొంచెం లేటుగా లైట్లు ఆర్పితే గొంతేసుకొని మీద పడిపోయేటప్పుడు ముసల్దానికి పెద్దరికం గుర్తురాదు, ఇప్పుడు మాత్రం పెద్దరికం గుర్తొచ్చింది దొంగముఖానికి.. అయినా తప్పదు, కాదని చెప్తే ఈ సౌమ్యరూపం పోయి పిశాచ రూపంలో ఎగబడ్తుంది. ఏంచేస్తాం, అదేదో సినిమాలో డబ్బులు ఖర్చు చెయ్యాలని పందెం ఉంటే, హీరో దగ్గరకు మరింత డబ్బులు వచ్చిపడుతుంటాయి, అలాగే ఉంది నా పరిస్థితి. బ్యాంకులో మార్చడం తర్వాత, ముందు ఏటీఎంలో అయినా డ్రా చేసుకోకుంటే రోజు గడిచేలాలేదని దగ్గర్లోని ఏటీఎంకి వెళ్లాను. ‘నోక్యాష్’ అని బోర్డు కనిపించింది. పక్కన ఉన్న అతన్ని ‘‘ఇక్కడ ఇంకో ఏటీఎం ఎక్కడుందండీ’’ అనడిగా.‘‘కిలోమీటర్ దూరంలో ఉంది’’ అని బదులిచ్చాడు.సరే అని బండి స్టార్ట్ చేయబోతుంటే, నన్ను పిలిచి ‘డబ్బులు డ్రా చేయడానికైతే నా వెనక నిలబడు, నేనూ ఆ ఏటీఎం క్యూలోనే ఉన్నాను’ అని కేకేసాడాయన. అంటే క్యూ కిలోమీటర్ పొడవుందన్నమాట, దెబ్బకు మైండ్ తిరిగిపోయింది.రాత్రికి ఇంతమంది ఉండరు అప్పుడు డ్రాచేసుకుందాం అనుకొని ఆఫీసుకు పోయి, రాత్రి వచ్చేటప్పుడు చూస్తే ఎవరూ లేరు. హమ్మయ్య అని ఏటీఎం దగ్గరకు పోతే నో క్యాష్ బోర్డుంది. దీనమ్మ జీవితం అని తిట్టుకుంటుండగా, ఏదో వాట్సప్ మెసేజ్ వచ్చింది. దగ్గర్లో ఏ ఏటీఎంలో డబ్బులున్నాయో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అని ఉంది. సరే అని నేనున్న ఏరియా పిన్కోడ్ కొట్టాను. దగ్గర్లో మరో ఏటీఎం ఉందని చూపింది. అది చూపే అడ్రస్ నాకు తెలీదు. సరే అని అడ్రస్ను గూగుల్ మ్యాప్లో వెతుక్కుంటూ బయలుదేరా. సందులు, గొందులు తిరిగిన నా ప్రయాణం ఒక డెడ్ ఎండ్ దగ్గర ఆగింది. అది ఏటీఎం ఉందని చెప్పిన ప్రాంతంలో పెద్ద మురికికాలువ ఉంది. జీపీఎస్ను బండబూతులు తిట్టుకుంటూ ఇంటికివచ్చా. ఇలాంటప్పుడే మనం కాస్త గిరీశంలాగా థింక్ చేయాలి అనుకొని గదిలో అటూఇటూ తిరుగుతూ ఆలోచించాను. ఆఫీసులో ఒకపెద్దాయనకు ఇవ్వాల్సిన 10వేల రూపాయల బాకీ గుర్తొచ్చింది. మర్నాడు వెళ్లడంతోనే ఆయన దగ్గరకు వెళ్లి ‘‘సార్ ఇవిగో మీకివ్వాల్సిన 10వేలు’’ అని చేతులో పెట్టాను. గొంగళిపురుగు మీదపడ్డట్లు ఒక్కసారిగా ఆయన దులపరించుకొన్నాడు. ‘‘అబ్బాయ్ నీ వేషాలు నాదగ్గర కాదు. నాకు కొత్త నోట్లు ఇవ్వు’’ అన్నాడు.‘‘అదేంటండీ మీరిచ్చినప్పుడు ఇవే ఇచ్చారు కదా’’ అన్నా లాజిక్గా‘‘నీకు అప్పిచ్చినప్పుడు ఇవి చెల్లుబాటులో ఉన్నాయ్, ఇప్పుడు లేవు’’ అన్నాడాయన మరింత లాజిక్గా‘‘గురువుగారు, డిసెంబర్ 30 వరకు ఇవి చెల్లుతాయండీ, తీసుకోండి పర్లేదు’’ అన్నాను కన్నింగ్గా‘‘బాబూ, డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్పిడికి మాత్రమే చెల్లుతాయి, వ్యక్తుల మధ్య లావాదేవీలకు చెల్లవు, సో నువ్వు మార్చి తెచ్చివ్వు’’ అన్నాడు మరింత కన్నింగ్గా.ఛీ, ఐడియా పనిచేయలేదు అనుకొని నా సీటు దగ్గరకు వచ్చాను. ఇంతలో మా సారు పిలిచి నోట్ల రద్దుపై ఎవరికి వాళ్లు సొంత స్టోరీ తయారుచేయాలని హుకుం జారీ చేశారు. సరే అని నెట్ ఓపెన్ చేద్దును కదా ఒకటే గోల. ఎర్ర వీరులు, కాషాయ యోధులు ఆన్లైన్ వేదికగా హోరా హోరీగా మహా సంగ్రామం చేస్తున్నారు. దేశానికి మంచిదని కొందరు, కాదని కొందరు. ప్రతి ఒక్కడూ ఆర్థికవేత్తే, ప్రతి ఒక్కడూ విశ్లేషకుడే, ప్రతి ఒక్కడూ విమర్శకుడే, ప్రతి ఒక్కడూ సలహాదారే.ఇందులో మళ్లీ బహిరంగ విమర్శక అంతర్గత సమర్థకులు, అంతర్గత విమర్శక బహిర్గత సమర్థకులు.. ఇలా ఎన్నో పక్షాలు, ఎన్నో వైరుధ్యాలు. ఇక జోకులు, కవితలు, పుకార్లు.. సరేసరి. అబ్బబ్బ దేశ ప్రజలకు కాలక్షేపానికి కొదవలేకుండా పోయింది ప్రభుత్వ నిర్ణయంతో అనిపించింది. వీళ్లతో మనకెందుకులే అని వ్యాపారాలంటూ తిరిగే కొంత మందికి ఫోన్ చేశా. తనకు నష్టం జరిగినా పక్కోడికి మరింత నష్టం జరిగిందని సంతోషించేవాళ్లు, తాను తినకపోతే ఎవరికీ దక్కకూడదని నోట్లను నాశనం చేసేవాళ్లు, ఇప్పుడు పోయి పన్ను కడతామంటే ఐటివాళ్లు ఏమంటారో అని భయపడేవాళ్లు, ఉద్యోగులు వద్దన్నా వడ్డీ లేకుండా అప్పులిస్తున్నవాళ్లు, పనోళ్లపేరు మీద అకౌంట్లు తీసి డిపాజిట్లు చేస్తున్నవాళ్ళు, హడావుడిగా చుట్టపక్కాలను పిలిచి వాళ్లొద్దన్నా చేబదుళ్లు ఇస్తున్నవాళ్లు .. ఇలా నోట్ల రద్దు విచిత్ర పర్యవసానాలను వివరించారు వాళ్లు. సందట్లో సడేమియాలాగా కమీషన్పై నోట్ల వ్యాపారం జోరందుకుందంట అని ఒక మిత్రుడు చెప్పి వాడికి తెలిసిన ఒకతని నెంబరు ఇచ్చాడు. సరే చూద్దాం అని ఆ నెంబరుకు ఫోన్ చేసి ‘‘నా దగ్గర పాతవి పది ఉన్నాయి, మారుస్తారా’’ అని అడిగా నెమ్మదిగా. వాడు మాత్రం బర్రె గొంతేసుకొని ‘‘35 శాతం కట్ అయిద్ది, ఓకేనా’’ అన్నాడు. ఏమి కట్ అయిద్ది అనుకొని ‘‘మరోమాట లేదా’’ అన్నా మరింత నెమ్మదిగా. ‘‘ఏందయ్యా నువ్వు అంత భయపడతా మాట్లాడతావ్, మార్చేవాడ్ని నాకు లేని బాధ నీకేంది, సరే 32 శాతం మీద ఓకేనా’’ అన్నాడు. రౌండ్ ఫిగర్ 30 శాతం మీద చెయ్యమన్నాను. ‘‘సరే ఫలానా చోటికి డబ్బు తీసుకొని రా, అంతపెద్ద మొత్తం జాగ్రత్తగా రాగలవా’’ అని అడిగాడు. పదివేలకు జాగ్రత్తేంటి అనుకొని మళ్లీ వెంటనే ‘‘నిజమేలే ఇప్పుడు పదివేలే పదికోట్లు’’ అన్నాను. వాడొక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ‘‘ఇంతకూ నువ్వు చెప్పిన పది అంటే పదివేలా’’ అన్నాడు నెమ్మదిగా.‘‘అదేంటోయ్ అంత చిన్నగా మాట్లాడతావ్, మరేం పర్లేదన్నావ్గా, అవును పదివేలే, నువ్వేంటి పది లక్షలనుకున్నావా, కోట్లనుకున్నావా?’’ అన్నాను నోట్లు మారుతున్నాయన్న ఆనందంతో నవ్వుతూ. అవతలపక్క దబ్ అని శబ్దం వచ్చింది.ఏంటి వీడు కొంపదీసి పదికోట్లనుకున్నాడా, ఏం? పదివేలు మాత్రం డబ్బులు కావా అని తిట్టుకొని ఫోన్ పెట్టేశా.మొత్తం మీద 30 శాతానికి నోట్లు మారుస్తున్నారన్నమాట. మరిన్ని వివరాలు కనుక్కుందాం అని ఇందాకటి మిత్రుడికి ఫోన్ చేసి ‘ఎవరైనా ఇలా మార్చిన వాళ్లు కానీ, మార్చబోతున్నవాళ్లు కానీ ఉన్నారా?’ అని అడిగా. వాడు రహస్యంగా ‘ఎవరో ఎందుకు, నేనే రాత్రికి కోటి రూపాయలు మార్చుకుంటున్నా, నువ్వు వస్తావా’ అని అడిగాడు. ఎగిరి గంతేసి ఒప్పుకున్నా. సాయంత్రం వాడి దగ్గరకు పోయేసరికి పాత 500, 1000 నోట్ల కట్టలు బ్యాగుల్లో పెట్టున్నాయి. ఇద్దరం కార్లో మార్పిడి ప్రాంతానికి పోయాం.‘‘అరేయ్ వాళ్లు ఇచ్చేవి మంచివో కాదో ఎలా తెలుస్తుంది, యూవీ లైట్ లాంటివి ఏమైనా ఉన్నాయా’’ అనడిగాను.‘‘అక్కర్లేదు నమ్మకమే జీవితం’’ అన్నాడు వాడు గంభీరంగా. అక్కడ వాళ్లు మాకోసం వంద నోట్ల కట్టలతో ఎదురు చూస్తున్నారు. నాకైతే మాఫియా మూవీ చూస్తున్నంత ఉత్కంఠ. వీళ్లు మార్చుకొని బ్యాగులు తెరిచి చూడబోతుండగా పోలీసు విజిల్స్ వినిపించాయి. వెంటనే హడావుడిగా అందరం ఎవరి కార్లలో వాళ్లం అక్కడి నుంచి జంప్ అయ్యాం. ఇంటికి వచ్చి మావాడు వాళ్ల బ్యాగు తీసి ఒక్కో కట్ట పరిశీలిస్తుంటే వాడి ముఖంలో రంగులు మారుతున్నాయి.‘‘ఏమైందిరా’’ అని అడిగా. ‘‘మోసం, దగా ఇందులో 99 శాతం దొంగనోట్లే’’ అని అరిచాడు.నాకు షాక్ తగిలింది. వీడికి తగిలిన దెబ్బ మామూలిది కాదు, కోటి రూపాయలంటే మాటలా, ఎలా ఓదార్చాలో కూడా మాటలు రాలేదు నాకు. గొంతుపెగుల్చుకొని ‘‘ఊర్కోరా, పోలీసులకు జరిగింది చెప్పి వాళ్ల నెంబరు ఇచ్చి ట్రేస్ చేయమందాం, మనవి మనకు దక్కితే టాక్స్ కట్టి మార్చుకుందువు’’ అని సముదాయించాను. పోలీసులనగానే మావాడి ఏడుపుకు బ్రేక్ పడింది. ‘‘వద్దులేరా’’ అన్నాడు. ‘‘ఏంట్రా నువ్వు భయపడకు, ఏంకాదు, ప్రెస్వాణ్ణి కదా, నేను మాట్లాడతా పోలీసులతో’’ అని అభయమిచ్చాను.వాడు కంగారుగా లేచి, ‘‘పోతే పోనీలేరా, మనం 100 శాతం దొంగనోట్లిచ్చాం, వాళ్లతో పోలిస్తే మనకు లక్ష లాభమే’’ అన్నాడు.ఒక్కక్షణం అర్థం కాలేదు. అంటే ఆ పోలీసు విజిల్స్ అన్నీ... అవికూడా నా సెటప్పేరా అన్నాడు వాడు.ఇసుక తక్కెడ, పేడ తక్కెడ సామెత గుర్తొచ్చింది.వీళ్ల పాడుగాను, మనిషి ప్రతి సంక్షోభంలో స్వార్థమే చూసుకుంటాడు అనుకొని ఆ షాక్లోనే ఇంటికి పోయాను.మర్నాడు బ్యాంక్లో అష్టకష్టాలు పడి నా నోట్లు మార్చుకున్నాను. కొత్త 2 వేల రూపాయల నోట్లు పట్టుకోగానే ఏదో నిధిని గెల్చుకున్న సంబరం కలిగింది. సన్నగా విజిలేసుకుంటూ ఇంటికొచ్చి ఓనర్కు అద్దె ఇచ్చి నా రెండువేల రూపాయల నోటును జాగ్రత్తగా జేబులో పెట్టుకొన్నాను. ఇంక పాతనోట్ల బాధ తప్పింది అని సంతోషిస్తూ కిరాణా కొట్టుకు పోయా. కానీ కొత్త కష్టాలు అప్పుడే బిగినయ్యాయని అర్థమయింది. ఎవరి దగ్గర చూసినా రెండువేల నోటే. 500 నోటు జాడే లేదు. వందలు ఎక్కడో బందీలయ్యాయి. 500 నోటుకు 450 కొంటే చిల్లరిస్తానన్న కొట్టువాడు 2000 నోటుకైతే 1950 రూపాయలకు సరుకులు కొనాలని తేల్చి చెప్పాడు. నోట్లు మార్చుకొని నేను సాధించేదేంటో నాకర్థం కాలేదు. పెద్దోళ్లు ఎలా మార్చుకుంటున్నారో తెలీదు, బక్కప్రాణులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలీదు. చిల్లర శ్రీమహాలక్ష్మి అన్న నానుడికి అర్థం తెలుస్తోంది. ఇన్నాళ్లూ పొదుపంటే ఏంటో తెలీని జనాలంతా ఖర్చు విషయంలో మహా పీనాసులయ్యారు. చిన్నా, పెద్ద తేడాలేకుండా డబ్బు విలువ తెలిసివస్తోంది. మరోవైపు చిన్న చితకా వ్యాపారాలు, మధ్య తరగతి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. నిర్ణయాన్ని కొత్తల్లో సమర్థించిన వారిలో చాలామంది తిట్టుకోవడం బిగినయింది. నోట్ల మార్పిడి విషయంలో ఆర్బీఐ అంచనాలు ఎంతగా విఫలం అయ్యాయో కనిపిస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు చిన్న నోట్లను మరిన్ని చలామణీలోకి వదలకుండా మరింత పెద్ద నోటు వదలడం వెనక మతలబేంటో నాకేమీ అర్థం కాలేదు. ఒక రకంగా ఈ నిర్ణయం ఎకానమీకి మంచిదే అయినా, ముందస్తుగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఏది ఏమైనా, ఈ దెబ్బకు సమాజం బాగుపడడమో, నాకి పోవడమో ఖాయం.రాత్రి ఇంటికి వచ్చి చొక్కాను హ్యాంగర్కు తగిలిస్తుంటే రంగంటినట్లు కనిపించింది. ఈ రంగెక్కడిది అనుకొని జేబులోంచి కొత్త నోటు తీసుకొని చూద్దును కదా, చెమటకు తడిసి రంగు వెలిసిపోయి కనిపించింది. ఖర్మరా బాబూ, మాములుగానే ఇవి మారడంలేదు, ఇప్పుడీ రంగువెలిసిన నోటును ఎవరు తీసుకుంటారన్న కొత్త భయం బిగినయింది. ఇంతలో వాట్సప్ మెసేజ్. కొత్తనోటులో చిప్ ఉందట, చిప్ సంగతి దేవుడెరుగు, నాణ్యత ఎంత చీప్గా ఉందో మెసేజ్ పంపిన దరిద్రుడికి తెలుసా అని పట్టరాని కోపమొచ్చింది. దాన్ని ఎక్కడో పెట్టి చూస్తే ఏదో కనపడుతుంది అని ఇంకో మెసేజ్. మీ బొంద కనిపిస్తుంది, నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. నా చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరవు కనీసం దేశానికి పట్టిన నల్లచీడైనా వదిల్తే బాగుండు, భారతమాతాకీ జై అనుకొని పడుకున్నాను. బ్యాంకులో మార్చడం తర్వాత, ముందు ఏటీఎంలో అయినా డ్రా చేసుకోకుంటేరోజు గడిచేలాలేదని దగ్గర్లోని ఏటీఎంకి వెళ్లాను. ‘నోక్యాష్’ అని బోర్డు కనిపించింది.పక్కన ఉన్న అతన్ని ‘‘ఇక్కడ ఇంకో ఏటీఎం ఎక్కడుందండీ’’ అనడిగా. పదివేలకు జాగ్రత్తేంటి అనుకొని మళ్లీ వెంటనే ‘‘నిజమేలే ఇప్పుడు పదివేలే పదికోట్లు’’ అన్నాను. వాడొక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ‘‘ఇంతకూ నువ్వు చెప్పిన పది అంటే పదివేలా’’ అన్నాడు నెమ్మదిగా. ∙డి. శాయి ప్రమోద్ -
‘నోట్ల రద్దు’పై రిజర్వు బ్యాంకు పిల్లిమొగ్గలు
-
43 రోజులు.. 60 పల్టీలు!
• ‘నోట్ల రద్దు’పై రిజర్వు బ్యాంకు పిల్లిమొగ్గలు • మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయలేక ఆపసోపాలు... • గత 43 రోజుల్లో.. ఏకంగా 60 సార్లు వెనుకడుగు నోట్ల రద్దు’నిర్ణయాన్ని అమలు చేయడంలో రిజర్వు బ్యాంకు ఆపసోపాలు పడుతోంది. ఉద్ధండులైన ఆర్థికవేత్తలున్నా.. అడ్డగోలు నిర్ణయాలతో అసంబద్ధ నిబంధనలను ప్రకటిస్తూ నవ్వుల పాలవుతోంది. తర్వాత నాలుక కరుచుకుని.. వాటిని వెనక్కి తీసుకుంటోంది. ఇలా నోట్ల రద్దును ప్రకటిం చిన నవంబర్ 8 నుంచి ఇప్పటివరకు.. 43 రోజుల వ్యవధిలో ఏకంగా 60 సార్లు జరిగింది. అందులో కొన్ని ప్రధాన అంశాలు.. నవంబర్ 8న మోదీ నోట్ల రద్దును ప్రకటించారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు పోస్టాఫీసులు,బ్యాంకుల్లో పాత నోట్లు ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చని ఆర్బీఐ చెప్పింది. తర్వాత 4 రోజులకే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పాతనోట్ల డిపాజిట్కు తొందరపడవద్దని, ఇంకా 46 రోజుల టైముందనీ సెలవిచ్చారు. పరిమితులపై మల్లగుల్లాలు: నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లోంచి పాత నోట్లకు బదులుగా విత్డ్రా చేసుకోగలిగిన మొత్తం రోజుకు రూ.4వేలు. ఈ పరిస్థితి 15 రోజులు ఉంటుందని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. కానీ 9 రోజులకే మాట మార్చి.. రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువ విత్డ్రా కుదరదంది. తర్వాత.. నవంబర్ 15న నోట్ల మార్పిడి చేసుకున్న వారి వేలిపై ముద్రవేస్తామని ప్రకటన చేసింది. ఎన్నికల సంఘం అక్షింతలతో వెనక్కి తగ్గి, బేషరతుగా ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకోవచ్చంది. తర్వాత రూ.2.5 లక్షల కంటే ఎక్కువ వేస్తే విచారణ, చర్యలు ఉంటాయని బాంబు పేల్చింది. సడలింపులు.. బిగింపులు: విత్డ్రా నిబంధనలపై జనం మండిపడ్డంతో.. ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఖాతా నుంచి రూ.2.5 లక్షల వరకూ విత్డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. కానీ పలు నిబంధనలు పెట్టింది. ఖాతాదారు వివరాలన్నీ (కేవైసీ) తెలిపిన ఖాతాల్లోంచే విత్డ్రాకు అనుమతించడం, డిసెంబర్ 30 లోపు పెళ్లి ఉంటేనే నగదు ఇవ్వడం వంటి నిబంధనలపై ఆగ్రహం వ్యక్తమైంది. తరువాత వారానికి రూ.24 వేల వరకూ విత్డ్రా చేసుకోవచ్చని.. రైతులు, కంపెనీలు రూ.50 వేల వరకు తీసుకోవచ్చని మినహాయింపులు ఇచ్చింది. మరో పిల్లిమొగ్గ! తాజాగా రూ.5వేల కంటే ఎక్కువ మొత్తంలో పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ఒకే ఒక్క అవకాశం కల్పిస్తామని.. అది కూడా అప్పటివరకూ ఎందుకు డిపాజిట్ చేయలేకపోయా రో బ్యాంకు అధికారులకు వివరణ ఇచ్చాకేనని ఆర్బీఐ హుకుం జారీ చేసింది. ‘మా ప్రధాని, ఆర్థిక మంత్రి డిసెంబర్ 30 దాకా డిపాజిట్ చేసుకోవచ్చన్నారు కాబట్టి నేను ఇప్పటివరకూ చేయలేదు’ అన్న కామెంట్లు బ్యాంకులకు చేరడంతో మళ్లీ వెనక్కితగ్గింది. ‘మీ డబ్బు.. ఎంతైనా జమచేసుకోండి!’ అంటూ నాలుక కరిచేసుకుంది! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
5వేల డిపాజిట్పై యూటర్న్
• 5 వేల డిపాజిట్పై వెనక్కి తగ్గిన రిజర్వ్ బ్యాంక్ • డిసెంబర్ 30 వరకు ఎంతైనా వేసుకోవచ్చని ప్రకటన • కేవైసీ ఉంటే అధికారులు ప్రశ్నించరని భరోసా • బుధవారం మధ్యాహ్నం నుంచి బ్యాంకుల ముందు పెరిగిన క్యూలు ముంబై: బ్యాంకు ఖాతాల్లో ఒకసారి రూ.5వేలకు మించి పాతనోట్లు డిపాజిట్ చేయరాదన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవటంతో ఆర్బీఐ వెనక్కు తగ్గింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) సర్టిఫికెట్లు సమర్పించిన వినియోగదారులు డిసెంబర్ 30 వరకు ఎన్నిసార్లైనా ఎంత మొత్తంలోనైనా పాతనోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్నిరోజులు ఎందుకు పాతనోట్లు డిపాజిట్ చేయలేదనే ప్రశ్న కూడా బ్యాంకు అధికారులు అడగబోరని స్పష్టం చేసింది. మంగళ, బుధవారాల్లో అరుణ్జైట్లీ ప్రకటన (ఎంతమొత్తం డిపాజిట్ చేసినా బ్యాంకు అధికారులు ప్రశ్నించరు), ఆర్బీఐ ప్రకటనల్లో (అధికారులు ప్రశ్నిస్తారు) వైరుధ్యం నేపథ్యంలో.. డిపాజిట్ నిబంధనలను పూర్తిగా సమీక్షించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. బుధవారం ఉదయం వరకు రెండ్రోజులుగా నడుస్తున్న పద్ధతిలోనే ప్రశ్నావళితో ముందుకెళ్లిన బ్యాంకు అధికారులు.. మధ్యాహ్నం నుంచి ఆర్బీఐ తాజా ఆదేశాలను అమలుచేసి ప్రశ్నించటం ఆపేశారు. అయితే కేవైసీ నిబంధనను మాత్రం బ్యాంకులు కఠినంగా అమలుచేస్తున్నాయి. కాగా, నోట్లరద్దు పథకం అమల్లోకి వచ్చాక రూ. 5.92 లక్షల కోట్ల మొత్తాన్ని మార్కెట్లోకి బ్యాంకింగ్ రంగం ద్వారా పంపించామని ఆర్బీఐ వెల్లడించింది. ‘ఎలక్ట్రానిక్’ రుసుముపై నిషేధం: నోట్లరద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేదిశగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా చెల్లింపులపై రుసుంను నిషేధించాలని ఆర్థిక శాఖ కోరింది. వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ నెఫ్ట్ ట్రాన్స్ఫర్కు రుసుములను తొలగించాలని ఓ ప్రకటనలో సూచించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.10వేల వరకు నెఫ్ట్కు బ్యాంకులు రూ.2.5, పదివేల నుంచి లక్ష వరకు రూ.5, రూ.1–2లక్షల వరకు రూ. 15, రెండు లక్షలకన్నా ఎక్కువగా ఉంటే రూ. 25 వసూలు చేస్తున్నాయి. సర్వీస్ టాక్స్ దీనికి అదనం. ఆర్థిక శాఖ సూచన ప్రకారం ఐఎంపీఎస్, యూపీఐ చెల్లింపుల రుసుములపై మార్చి 31, 2017 వరకు నిషేధం అమల్లో ఉంటుంది. యూఎస్ఎస్డీ లావాదేవీలపై వెయ్యి, అంతకుమించిన చెల్లింపులపై యాభై పైసలు తగ్గనుంది. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ‘లక్కీ గ్రాహక్ యోజన, డిజి ధన్ వ్యాపార్ యోజన’లను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, వినియోగదారుల అకౌంట్లలో రూ.5వేల కన్నా ఎక్కువ జమచేస్తుంటే బ్యాంకు అధికారులే విచారణ చేయాలంటూ ఆర్బీఐ రెండ్రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాలపై అఖిల భారతీయ బ్యాంకు అధికారుల సంఘం నిరసన చేపట్టింది. ఐడీఎస్ నల్లధనం రూ. 55 వేల కోట్లే! న్యూఢిల్లీ: ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద ప్రకటించినట్లు పేర్కొన్న రూ. 67,382 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రూ. 55 వేల కోట్లకు తగ్గించి చూపే అవకాశముంది. తమ వద్ద లెక్కల్లో చూపని రూ. 10 వేల కోట్లకుపైగా నల్లధనం ఉందని చెప్పిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ రావు, ఆయన సన్నిహితులు ఆ డబ్బుపై పన్ను తొలి వాయిదాను నవంబర్ 30లోగా చెల్లించకపోవడంతో ఈమేరకు సవరణ చేయనున్నారు. నల్లధన ప్రకటనకు తెచ్చిన ఐడీఎస్ పథకం గడువు సెప్టెంబర్ 30తో ముగియడం తెలిసిందే. -
‘ఖాతాదారులకు పట్టపగలే చుక్కలు’
న్యూఢిల్లీ: పాత నోట్ల డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధన ఖాతాదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. అయిదు వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలన్న నిబంధనపై ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మొత్తాన్ని కూడా డిపాజిట్ చేసుకునేందుకు నిరాకరించడమేగాక..ఖాతాదారులను బ్యాంకర్లు ఇంటరాగేషన్ తరహాలో ప్రశ్నలతో వేధిస్తున్నారు. మొదటి డిసెంబర్ 30లోపు పాత నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చన్న కేంద్రం..ఇప్పుడు ఎందుకు మాట మార్చిందంటూ ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నగదు కోసం జనాలు బ్యాంకులతో పాటు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతూనే ఉన్నారు. -
40 రోజులైనా మారని నోట్ల కష్టాలు
-
నోట్ల రద్దు వారికి ముందే తెలుసా ?
-
జన్ధన్ ఎంత?
నవంబర్ 8న ప్రధాని నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాక... పేదలకు చెందిన జన్ధన్ బ్యాంకు ఖాతాలకు బినామీలను ఉపయోగించుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. దానికి బలం చేకూర్చేటట్లుగా తొలి వారంలోనే (నవంబరు 8-15) ఈ అకౌంట్లలో ఏకంగా రూ. 20,206 కోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చారుు. దీంతో ప్రభుత్వం వీటిపై దృష్టిపెట్టింది. జన్ధన్ ఖాతాలను దుర్వినియోగపర్చే వారికి శిక్ష తప్పదని ఓ సభలో ప్రధాని మోదీ స్వయంగా హెచ్చరించారు. ఈ ఖాతాల నుంచి నెలకు రూ. 10 వేలు మించి ఉపసంహరణకు అనుమతించబోమని పరిమితి కూడా విధించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న జన్ధన్ ఖాతాలు, వాటిల్లోని డిపాజిట్ల వివరాలు చూద్దాం.. - సాక్షి నాలెడ్జ సెంటర్ -
చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవ్
వచ్చే ఎన్నికల్లో జనసునామీలో కొట్టుకుపోవడం ఖాయం : వైఎస్ జగన్ ► కాంట్రాక్టర్ల కోసం పోలవరం వ్యయం పెంచుతున్నారు ► సబ్ కాంట్రాక్టర్లకు పనులిచ్చి లంచాలు పంచుకుంటున్నారు ► పరిహారం కోసం ప్రశ్నించిన రైతులను మాత్రం జైల్లో పెడుతున్నారు ► ఒకే ప్రాజెక్టు కింద రకరకాల పరిహారాలివ్వడం ఎక్కడైనా ఉందా? ► పట్టిసీమలో ఇచ్చినట్లే ప్రతి రైతుకూ రూ.19 లక్షలు ఇవ్వాలి ► ఇప్పుడు 18 ఏళ్లు నిండిన వారికి కూడా ప్యాకేజీ వర్తింపచేయాలి ► గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు ► ఒక్క ఆస్పత్రిలోనూ మందులు లేవు.. వైద్యులూలేరు ► 4 నెలల్లోనే 14 మంది పెద్దలు, 15 మంది పిల్లల కన్నుమూత ► జీడీపీలో నాలుగో స్థానంలో ఉన్నామని చంద్రబాబు గొప్పలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘పేదల ఉసురుపోసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జన సునామీలో కొట్టుకుపోవడం ఖాయం. పైనుంచి దేవుడు కూడా మొట్టికాయలు వేస్తున్నాడు. భగవంతుడు కరుణిస్తే మరో ఏడాదిలోనే ఎన్నికలు రావచ్చు. ఇవాళ కాకపోయినా మరో రెండేళ్లకు ఎన్నికలు రావడం అనివార్యం. అప్పుడు చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవ్’’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, సిమ్మెంట్, ఇనుము, ఇసుక రేట్లు తగ్గుతున్నా... కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యయాన్ని ఏటేటా పెంచుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు ప్రాజెక్టుకోసం భూములిచ్చిన గిరిజనులు పరిహారం అడిగితే జైల్లో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరెక్కడా ఉండబోడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో రెండవ రోజు పర్యటనలో భాగంగా గురువారం వీఆర్ పురం మండలం రేఖపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. కాంట్రాక్టర్ మేలుకే ‘పోలవరం’ వ్యయం పెంపు 2013లో రూ.16 వేల కోట్లు ఉన్న వ్యయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచడం కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసమే. చంద్రబాబు తనకు నచ్చిన సబ్కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ’నాకింత నీకింత’ అని లంచాలు పంచుకుంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్ యాదవ్కు పోలవరం సబ్కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. మరోవైపు పరిహారం కోసం ప్రశ్నించిన రైతులను జైల్లో పెట్టిస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరెక్కడా ఉండడేమో. ముంపు ప్రాంతంలో మూడేళ్లుగా ప్రజలు పడుతున్న అగచాట్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ముంపు మండలాల్లో వీఆర్వో దగ్గరనుంచి ఎమ్మార్వో వరకూ అందరూ టెంపరరీ, ఇన్చార్జ్ ఉద్యోగులే. ఆఖరుకు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా ఓ ఏవోను పెట్టారు. దీన్ని చూస్తుంటేనే ఈ ప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వానికి ప్రేమ ఏమిటో అర్థమవుతోంది. ఒక్కో చోట ఒక్కో ప్యాకేజా? పోలవరం రావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ప్రాజెక్టుకోసం భూములిచ్చి త్యాగం చేసిన గిరిపుత్రులకు న్యాయం చేయాలని అడగడం ధర్మమే కదా! గిరిజనుల అవస్థల గురించి చెప్తే అభివృద్ధి నిరోధకులని అభాండాలు వేసేస్తున్నారు. పోలవరంలో భాగమైన పట్టిసీమకు భూములిచ్చిన రైతులకు రూ.19 లక్షలిచ్చారు. పశ్చిమ గోదావరిలో రూ. 10.50 లక్షలు ఇచ్చిన ప్రభుత్వమే తూర్పు గోదావరిలో రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తోంది. ఒకే ప్రాజెక్టు కింద ఒక్కో చోట ఒక్కో రకమైన పరిహారం ఇవ్వడం ఎక్కడైనా ఉందా? పట్టిసీమలో ఇచ్చినట్లే ప్రతి రైతుకూ అదే రూ.19 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే ప్రాజెక్టు రావాలన్న తపనతో 2007-2009 సమయంలో మొదట భూములిచ్చిన రైతులకు అప్పట్లో కేవలం రూ.1.5 లక్షలిచ్చారు. ఆ మొత్తంతో ఇప్పుడు పదిసెంట్ల భూమి కూడా రాదు, అందుకే వారి త్యాగాన్ని గుర్తించి ఎకరాకు కనీసం మరో రూ.ఐదారు లక్షలైనా ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా. అలాగే నోటిఫికేషన్ ఇచ్చేనాటికి 18 సంవత్సరాలు నిండిన వారికే ప్యాకేజీ ఇస్తామనడం సరికాదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పటికీ ఇవ్వనందున... ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా పరిహారమివ్వాల్సిందే. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొండపోడు భూములను సాగు చేసుకునేందుకు పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూములను కూడా లాగేసుకుని పరిహారం ఇవ్వబోమనడం అన్యాయం. రైతులకు ఏ పరిహారమైతే ఇస్తున్నారో డి-ఫామ్ పట్టాలున్న రైతులకు కూడా అదే పరిహారం ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా. స్వచ్ఛభారత్కు అంబాసిడర్లా బాబు ప్రగల్భాలు రాష్ట్రంలో ఎక్కడా బహిరంగ మల, మూత్ర విసర్జన లేనేలేదని, అంత గొప్పగా మరుగుదొడ్లు కట్టించానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ నిన్న రంపచోడవరంలో గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాల పిలిస్తే అక్కడకు వెళ్లా. దాదాపు 750 మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. వాళ్లు చెబుతున్న కష్టాలు వింటుంటే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అర్హుడా? అనిపించింది. పిల్లలకు మరుగుదొడ్లు లేక చెంబు పట్టుకొని కొండెక్కాల్సి వస్తుంది. పడుకోవడానికి మంచాలు లేవు. వర్షం పడితే నీరు కారుతోంది. శ్లాబులు పడుతున్నారుు. ఇదే మం డలంలోని చింతూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఇదే దుస్థితి. కానీ చంద్రబాబేమో స్వచ్ఛ భారత్కు తానే అంబాసి డార్లా చెప్పుకుంటున్నారు. రెండేళ్లుగా జీతాలు రావడంలేదని లెక్చరర్లు మొత్తుకుంటున్నా పట్టించుకునేవారు లేరు. వైద్యులు లేరు.. మందులు లేవు.. మన్యం ప్రాంతంలో ఒక్క ఆస్పత్రిలోనూ మందులు లేవు.. ఇక వైద్యమెలా చేస్తారు? మారేడుమల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడ్రోజులుగా ఒక్క వైద్యుడూ లేరు. నేను వెళ్లేటప్పటికి ఒక డాక్టర్ పరుగెత్తుకుంటూ వచ్చారు. ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఇద్దరమే ఉన్నామని చెప్పారు. గైనిక్, పీజీ డాక్టర్ లేరని తెలిపారు. విలీన మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో నాలుగు నెలల్లోనే దాదాపుగా 14 మంది చనిపోయారు. కానీ ఇవాల్టికీ వారెందుకు చనిపోయారో కారణం తెలీదు. రాజవొమ్మంగి మండలంలో రెండు నెలల్లో 15 మంది నెల, రెండు నెలల పిల్లలు చనిపోయారు. అంగన్వాడీ కేంద్రాల్లో తగినంత పౌష్టికాహారం పెట్టకపోవడంతో... పౌష్టికాహారం, రక్తహీనతతో మరణించారని చెబుతున్నారు. వైఎస్ హయాంలో కేవలం 20 నిమిషాల్లో వచ్చే 108 వాహనాలు ఇప్పుడు కదలడంలేదు. ఐటీడీఏ పరిధిలో పది వాహనాలుండగా పనిచేస్తున్నది కేవలం మూడు. ఇదీ చంద్రబాబు పాలన. కానీ ఆయన ఇవ్వాళ పొద్దున్నే టీవీలో కనిపించి దేశంలోనే జీడీపీలో నాలుగో స్థానంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. తానేం అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మేస్తారని ఆయన నమ్మకం. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే ఈయనా ముఖ్యమంత్రేనా? జబ్బేంటో తెలియకుండానే చచ్చిపోయారు చింతూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాళ్ల వాపులు వచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్లాం. వైద్యం చేసిన డాక్టర్లు ఇంటికి తీసుకుపొమ్మన్నారు. తీరా ఇంటికొచ్చిన కొద్ది రోజులకే చచ్చిపోయారు. మా వాళ్లు చచ్చిపోరుు రోజులు గడిచినా జబ్బేంటో తెలీదు. ప్రభుత్వం కనీసం మా కుటుంబాలను పరామర్శించి, ఆదుకోలేదు..’’ అంటూ తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతంలో కాళ్ల వాపుతో మృతి చెందిన వారి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బోరుమన్నారుు. గత రెండు నెలల కాలంలో తూర్పు మన్యంలో అంతుచిక్కని వ్యాధి సోకి కాళ్ల వాపుతో 14 మంది చనిపోయారు. బుధవారం జిల్లాకు వచ్చిన జగన్ గురువారం కూడా మన్యప్రాంతంలో పర్యటించారు. చింతూరులో ఐదుగురు, వీఆర్పురంలో ఎనిమిది మంది, కూనవరంలో ఒకరు కాళ్ల వాపు వ్యాధితో మృతి చెందడంపై ఆరా తీశారు. చింతూరు మండలం మావిళ్లగూడెంలో మృతి చెందిన ముచ్చిక లక్ష్మయ్య, ముచ్చిక సీతారామయ్యల కుటుంబాలను నర్శింహాపురంలో పరామర్శించారు. ‘ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా? ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నారు? మంత్రులు గానీ అధికారులు గానీ వచ్చి అడిగారా?’ అని అడిగి తెలుసుకున్నారు. అసలు తమ భర్తలు ఎలా చచ్చిపోయారో తమకు తెలియదని లక్ష్మయ్య భార్య దూలమ్మ, సీతారామయ్య భార్య కమలమ్మ విలపించారు. మమ్మల్నెవరూ పట్టించుకోలేదు, ఏ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జబ్బుతో చనిపోయారో కూడా తెలియని దారుణమైన పాలనలో మనం ఉన్నామని, జనం చచ్చిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జగన్ మండిపడ్డారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. -
నెలరోజుల్లో ఎంత డబ్బు డిపాజిట్ చేశారంటే..?