Devulapalli Amar
-
జగన్ పని అయిపోలేదు.. కథ ఇప్పుడే మొదలైంది
-
ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా ?
-
ఎన్నికల ఫలితాల సర్వేల పై దేవులపల్లి అమర్ సెన్సేషనల్ కామెంట్స్
-
రాహుల్ గాంధీ కడప పర్యటన దేవులపల్లి స్ట్రాంగ్ రియాక్షన్
-
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
-
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
-
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
ప్రజలకు దారి చూపినవాడు నాయకుడవుతాడు. ప్రజలు నడిచే దారిలో తానూ నడిచినవాడే నాయకుడవుతాడు. ప్రజలు నాయకుడి వైపు ఎందుకు చూస్తారు? మా దారిలో కష్టం ఉంది తొలగించు... మా గింజలకు వెలితి ఉంది పూరించు... మాకు జబ్బు చేస్తే వైద్యానికి దోవ లేదు చూపించు... మా పిల్లలకు చదువు చెప్పించు... మా నెత్తిన ఒక నీడ పరువు... మా పిల్లలకు ఒక ఉపాధి చూపించు... ఇలా చెప్పుకోవడానికే కదా.అవి విన్నవాడే నాయకుడవుతాడు. నేను ఉన్నానని అనేవాడే పాలకుడవుతాడు.ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వర్తమాన పరిణామాలకు మూలాలు ఏమిటో తెలియడం తెలుగు ప్రజలకు అవసరం. ఎందుకంటే ప్రజల నొసట రాత పాలకులే రాస్తారు. నాటి మద్రాసు రాష్ట్రంతో మొదలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రకటన, తెలంగాణ ఉద్యమాల దరిమిలా తెలుగు రాష్ట్రాల విభజన... వీటన్నింటిలో పాలకుల ఎత్తుగడలకు, ప్రజల ఆకాంక్షలకు జరిగిన ఘర్షణ ఒక క్రమానుగతంగా చదివితే ఎక్కడెక్కడ నాయకుడనేవాడవసరమో అక్కడక్కడ తెలుగు జాతి ఒక నాయకుణ్ణి తయారు చేసుకోగలిగింది అనిపిస్తుంది. అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఈ నాయకుల్లో ప్రజల కోసం నిలిచే నాయకులూ ఉన్నారు. ప్రజలను వంచించే నాయకులూ ఉన్నారు.సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయంలో ప్రదర్శించిన అహం, ప్రోత్సహించిన ముఠా రాజకీయాల సంస్కృతి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక అనిశ్చితిలోనే ఉంచాయి. స్థిరంగా నిలిచి, బలంగా కొనసాగే నాయకుడు ఉన్నప్పుడే జాతి ముందుకు వెళ్లగలదు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్కు సమర్థమైన నాయకత్వం వహించినా కుర్చీ కింద పెట్టే మంటలు వారిని కుర్చీ వదులుకునేలా చేశాయి. అసలు తెలుగువారికి ఒక ఆత్మాభిమానం ఉందా అనే సందేహం కలిగించాయి.ఈ సందర్భమే ఎన్.టి.రామారావు పుట్టుకకు కారణమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన నాయకుడిగా, చరిష్మా కలిగిన పాలకుడిగా, పేదవాడి గురించి ఆలోచన చేసిన అభిమాన నేతగా ఎన్.టి.రామారావు ప్రజల మెప్పును పొందారు. కాని ఆయన అహం, తొందరపాటు చర్యలు కుట్రలకు తెరలేపాయి. చంద్రబాబు నాయుడు తెలుగుజాతి అవమానపడే రీతిలో ఎన్.టి.ఆర్ను వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ ఫండ్ ఉన్న అకౌంట్ను కూడా హస్తగతం చేసుకున్న వార్త అందిన రోజున ఎన్.టి.ఆర్. తీవ్ర మనస్తాపం చెందారు. అదే ఆయన మృతికి కారణమైందన్న భావన ఉంది.‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్’ అన్నాడు గురజాడ. ఒక రాష్ట్రాన్ని ప్రజల వారసత్వంగా చూడాల్సిందిపోయి దానినో కార్పొరెట్ ఆఫీసుగా మార్చి, దానికి తాను సి.ఇ.ఓగా భావించి పాలించడం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగు ప్రజలు చులకనను ఎదుర్కొన్నారు. గుండు దెబ్బలు తిన్నారు. నీతి, రీతులే వ్యక్తిత్వమని భావించే మన సంస్కృతిలో వంచనతో వచ్చిన నాయకుడిని నమ్మి మోసపోతున్నామని తెలుగు ప్రజలకు పదేపదే అనిపించిన ఉదంతాలు ఉన్నాయి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చి పెద్ద గీత గీసే వరకూ చంద్రబాబు ఎంత చిన్న గీతో ప్రజలకు అర్థమైందని విశ్లేషకులు అంటారు.ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత... పాలన చేస్తే ఎలా ఉంటుందో వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చూపారు. విశాలమైన హృదయం, దయ, ఆర్ద్రత ఉన్న నాయకుడు తన పాలనలో ప్రతి వ్యక్తి ఉన్నతి కోసం తపన పడతాడని, పడాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియింబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంట్, జలయజ్ఞం... రాష్ట్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నదని ప్రజలు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉన్న కాలమది.కాని రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తెలుగుజాతిని స్థాణువును చేసింది. రాజశేఖర రెడ్డిని చూసిన కళ్లు అలాంటి నాయకుడి కోసమే వెతుకులాడాయి. ఆ నాయకుణ్ణి వై.ఎస్.జగన్లో చూసుకున్నాయి. అయితే రాజకీయ కుయుక్తులు పన్నడంలో తలపండిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జగన్కు మధ్య సైంధవుడిలా నిలిచారు. టక్కుటమార విద్యలు ప్రదర్శించి, అబద్ధాల మేడలు కట్టి మరోసారి జనాన్ని నమ్మించి సి.ఎం. అయ్యారు. కాని చంద్రబాబు పరిపాలనా కాలంలో రాష్ట్రం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. చిన్నా చితక పథకాల ప్రయోజనాల కోసం కూడా ప్రజలు అల్లల్లాడారు. ఒక వర్గం ప్రజలు రాజధాని నిర్మాణం వల్ల లబ్ధి పొందుతున్నారని సామన్యులకు అవగతమైంది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుని కోసం వారు తిరగబడ్డారు. వై.ఎస్.జగన్ని తమ ముఖ్యమంత్రిని చేసుకున్నారు.రాష్ట్ర విభజన వల్ల అనేక వెసులుబాట్లు కోల్పోయి, నిధుల లోటులో రాష్ట్రం ఉన్నప్పటికీ జగన్ తన విశిష్ట సమర్థతతో ప్రజాహిత పాలన కోసం నవరత్నాలతో ముందుకు వచ్చారు. రెండేళ్ల కరోనా కాలం ప్రపంచాన్ని స్తంభింపచేసినా తెలుగు రాష్ట్రం ముందంజలో ఉండేలా చూసుకున్నారు. విద్య నుంచి వికాసం, వైద్య ఖర్చు నుంచి విముక్తి ప్రధాన అజెండాగా చేసుకున్న జగన్ విస్తృత తెలుగు సమూహాలను గట్టున పడేశారు. తెలుగు ప్రజలు ఎన్నడూ చూడని విధంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణి జరిగింది. రాజధానిలో పేదలకూ చోటుండాలని భావించిన జగన్ వంటి ముఖ్యమంత్రి ఉన్నారా?దారులు స్పష్టం. ప్రజలు ఏ దారిని ఎంచుకోవాలో తమకు తాముగా నిర్ణయించుకోవాలని అంటారు దేవులపల్లి అమర్. ఆయన రాసిన ‘మూడు దారులు’ గ్రంథం ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి మొదలయ్యి ప్రభావవంతమైన ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎన్.టి.రామారావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధోరణులను తెలియచేస్తూ ఇప్పుడు వై.ఎస్. జగన్తో తల పడుతున్న చంద్రబాబు ‘యూ టర్న్’లను, వెన్నుపోట్లను, నమ్మించి వచించిన సంఘటలను విపులంగా తెలియచేసి పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.అనుభవజ్ఞుడైన జర్నలిస్టుగా మాత్రమే కాదు, చేయి తిరిగిన జర్నలిస్టుగా కూడా దేవులపల్లి అమర్ ఎంతో సులభంగా, సరళంగా చరిత్రని, వర్తమానాన్ని, తెలుగు నేలకు సంబంధించిన రాజకీయ ఘటనలను ఒక వరుసలో ఉంచి పాఠకులకు గొప్ప అవగాహన కలిగిస్తారు. కొన్ని ఘటనలు జరక్కపోయి ఉంటే తెలుగు జాతి మరింత ముందంజలో ఉండేది కదా అనిపించే విషయాలన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది నేటి రాజకీయ కార్యకర్తలకు, నిపుణులకే కాదు భావి విద్యార్థులకు కూడా కీలకమైన రిఫరెన్స్ గ్రంథం.‘చరిత్రదేముంది... చింపేస్తే చిరిగి పోతుంది’ అనేది సినిమాలో డైలాగ్. కాని చరిత్ర చిరిగిపోదు. అలాగే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఉజ్జీవనం చెందుతూనే ఉంటుంది. చరిత్ర నిర్మింపబడే కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విభజన అయ్యాక కాళ్లూ చేతులు ఊనుకుని ఒక గొప్ప పురోగమనానికి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో ఎటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలో, తద్వారా ఎటువంటి ఘన చరిత్రకు తెలుగు జాతి ఆలవాలంగా ఉండాలో ఈ ఎన్నికల కాలంలో నిర్ణయించుకోవాలి. దారి స్పష్టం కావాలంటే ఈ గ్రంథం చదవండి.మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు; రచన– దేవులపల్లి అమర్; ప్రచురణ– రూప బుక్స్; పేజీలు: 210; వెల–395; ప్రతులకు–రూప పబ్లికేషన్స్, హైదరాబాద్.– వి.ఎన్.ప్రసాద్ (చదవండి: మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు) -
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
-
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
-
చంద్రబాబు పై అమర్ షాకింగ్ కామెంట్స్
-
సీఎం జగన్ పై రఘురామ రాజు ప్రకటన దేవులపల్లి అమర్ కౌంటర్
-
JPకి దేవులపల్లి అమర్ కౌంటర్
-
గందరగోళంలో పవన్ కళ్యాణ్.. దేవులపల్లి అమర్ విశ్లేషణ
-
చంద్రబాబు, పవన్ వేస్ట్ ..మోదీ కి సీన్ అర్థమైంది
-
నేను చంద్రబాబుకి వ్యతిరేకం కాదు .. ఈ పుస్తకం రాయడానికి అసలు కారణం
-
కక్ష సాధింపు కోసమే అన్ని పార్టీలు దాడి చేస్తున్నాయి
-
చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ఎల్లో మీడియా అసత్యాలు
-
విశాఖలో మూడు దారులు పుస్తక పరియ కార్యక్రమం
-
Amar : మూడు దారులు : రాజకీయ రణరంగంలో భిన్న ధృవాలు
-
Amar : మూడు దారులు : రాజకీయ రణరంగంలో భిన్న ధృవాలు
సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన "మూడు దారులు" రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు.. పుస్తకం సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందనీ, పరిశోధకులకు చక్కటి గైడ్గా, రిఫరెన్స్ మెటీరియల్గా పనికొస్తుందని పుస్తక పరిచయ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయం సభా మందిరంలో బుధవారం నిర్వహించిన "మూడు దారులు" పుస్తక పరిచయం కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు రచయిత అమర్ కృషిని అభినందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ పూర్వ ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబీ వర్ధన్ సభకు అధ్యక్షత వహించగా, లీడర్ దిన పత్రిక సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి పుస్తకంలోని అంశాలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ తొలి అధ్యాయంలో రచయిత తెలుగు రాష్ట్రాల పూర్వ చరిత్రను, ఆనాటి రాజకీయాలను వివరించిన తీరు, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి సమగ్రంగా పొందుపరిచారని ప్రశంసించారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్న ప్రొఫెసర్ బాల మోహన్ దాస్ వైఎస్ ఆర్ విద్యా విషయాల పట్ల ఎంతో శ్రద్ధ పెట్టేవారనీ, పాలనా వ్యవహారాలలో తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేవారని పేర్కొన్నారు. రాజకీయాలలో నైతిక విలువలకు వైఎస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని అన్నారు. మూడు దారులు పుస్తకంలో రచయిత ప్రత్యేకంగా ప్రస్తావించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్మోహన రెడ్డి గురించి పుస్తకం చదివిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారో తానే స్వయంగా రాండమ్ శాంపిల్ సర్వే చేశానని ఆయన వివరిస్తూ.. వైఎస్ఆర్ కు 87 శాతం, చంద్రబాబు కు 49.5 శాతం, జగన్ కు 78.5 శాతం జనం మద్దతుగా మాట్లాడారని పేర్కొన్నారు. మూడు దారులు పుస్తకం భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పుస్తకాన్ని సమగ్రంగా సమీక్ష చేసిన లీడర్ దిన పత్రిక ఎడిటర్ రమణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించేందుకు జరిపిన వైస్రాయ్ ఉదంతాన్ని రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో ఆ కుట్రను పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని, ఈ పుస్తకం ద్వారా అమర్ నెరవేర్చారన్నారు. పుస్తకంలో ముగ్గురు ముఖ్యమంత్రులను కథా వస్తువుగా అమర్ తీసుకున్నారని, అయితే నాలుగో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా దర్శనమిస్తారని తెలిపారు. అధికారం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ని వెన్నుపోటుకు సైతం వెనుకాడని సంఘటన పుస్తకంలో సాక్షాత్కరిస్తుందన్నారు. ముఖ్యంగా చంద్రబాబు చేసిన ‘వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మ ఎలా క్షోభించింది, అడ్డదారిలో చంద్రబాబు పాలన ఎలా కైవసం చేసుకున్నారో తెలుసుకోవచ్చన్నారు. ఈ ఆధారాలతో అమర్ రాయడం విశేషమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు. చరిత్రలో వాస్తవిక దృష్టితో రాయడంలో రచయిత సఫలీకృతులయ్యారన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఏయూ జర్నలిజం శాఖ విశ్రాంత ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబివర్ధన్ మాట్లాడుతూ.. పాత్రికేయులు అమర్ రాసిన మూడు రహదారుల పుస్తకంపై పి.హెచ్.డి చేయవచ్చన్నారు. సాధారణంగా చరిత్రలను, జీవిత కథలను రాస్తూ ఉంటారని, అందుకు భిన్నంగా ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనా చరిత్రను తొలిసారిగా రాసి అమర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరిశోధనాత్మక జర్నలిజం ప్రాంతీయ భాషలోనే చేయవచ్చని, అందుకు ఉదాహరణ ఈ పుస్తకమే అన్నారు. పాత్రికేయ ప్రముఖులు మంగు రాజగోపాల్ ఆత్మీయ ప్రసంగం చేస్తూ జర్నలిస్టులలో రాసే జర్నలిస్టు అక్షర బాహుబలి అమర్ అన్నారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు సమాజంలోని రాజకీయ పరిణామాలకు అప్డేట్ అవ్వాలని, వారిలో అమర్ ముందుంటారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి అమర్ ఈ పుస్తకం రాశారని తెలిపారు. పుస్తక రచయిత అమర్ మాట్లాడుతూ.. దక్షిణాది వారిని ఉత్తరాది వారు పట్టించుకోరని, మద్రాసీయూలుగా పిలిచే తెలుగువారిని ఆంధ్రులుగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారని, 1983 వరకు ఓకే పార్టీలో కలిసి ప్రయాణించారని తెలిపారు. 83లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాలను ప్రభావితం చేశారన్నారు. ఈ పుస్తకం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చానని, ఎవరిని కించపరిచే ఉద్దేశంతో రాయలేదన్నారు. అనంతరం, రచయిత అమర్ ను అతిథులు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. పాత్రికేయులు బిఎస్ రామకృష్ణ వందన సమర్పణతో సభ ముగిసింది. -
'మూడుదారులు': రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు!
నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. కాకపొతే, ఈ మువ్వురిలో చంద్రబాబు నాయుడిది రాజకీయంగా భిన్నమైన మార్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలభయ్ ఏళ్ళ చరిత్ర ఈ ముగ్గురితో ముడిపడి వుంది. ఈ చారిత్రక పరిణామాలను ఒక సీనియర్ జర్నలిస్టుగా దగ్గరనుంచి పరిశీలించగలిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని దేవులపల్లి అమర్, తన అనుభవ సారాన్ని తాను రాసిన మూడు దారులు అనే ఈ రెండువందల పేజీల గ్రంథంలో సవిస్తరంగా ప్రస్తావించారు. చంద్రబాబు అనగానే గుర్తు వచ్చే మరో ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ. రామారావు. ఆ పేరు వినగానే తలపుకు వచ్చే మరో పదం వైస్రాయ్ ఎపిసోడ్. ఇప్పుడు మూడు, నాలుగు పదుల వయసులో వున్నవారికి గుర్తు వుండే అవకాశం లేదు కానీ, కొంత పాత తరం వారికి తెలుసు. విచిత్రం ఏమిటంటే వారికీ పూర్తిగా తెలియదు. ఆ కాలంలో చురుగ్గా పనిచేసిన కొందరు జర్నలిస్టులు అప్పటి రాజకీయ పరిణామాలను నిశితంగా చూసిన వారే అయినా, ఇంకా ఏదో కొంత సమాచారం మరుగున ఉందేమో అనే సందేహం, వారు ఈ అంశంపై రాసిన రచనలు, వార్తలు, పుస్తకాలు చదివినప్పుడు పాఠకులకు కలగడంలో ఆశ్చర్యం లేదు. కారణాన్ని కూడా అమర్ తన గ్రంథంలో ప్రస్తావించారు. ఆయన అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్రప్రభలో రిపోర్టింగ్ బ్యూరో ఇంచార్జ్ గా వున్నారు. ‘మరి, అప్పట్లో ఇటువంటి (ఈ గ్రంథంలో పేర్కొన్న) విషయాలను మీరెందుకు రిపోర్ట్ చేయలేదని కొందరు మితృలు నన్ను ప్రశ్నించారు. వాళ్ళు అలా అడగడం సబబే. ఇలా అడిగిన వారిలో మీడియా మితృలు కూడా వున్నారు. పత్రికా స్వేచ్ఛ నేతి బీరకాయ చందం అని వారికి తెలియనిది కాదు. పత్రిక పాలసీని సంపాదకులు కాకుండా యజమానులే నిర్ణయించే కాలానికి వచ్చాక జరిగిన ఉదంతం ఇది. అప్పుడు నేను పనిచేస్తున్న పత్రిక యజమాని, చంద్రబాబు నాయుడు పక్షం ఎంచుకున్నారు. ఇక మా ఎడిటర్ ఆయన్ని మించి బాబు భక్తి ప్రదర్శించేవారు.’ అంటూ రాసుకొస్తూ అమర్ ఆ రోజుల్లో జరిగిన డిస్టిలరీ అనుమతి ఉదంతాన్ని పేర్కొన్నారు. ‘బాబుకు అనుకూలంగా రాసిన ఆ వార్తను ఈనాడు పత్రిక మాత్రమే ప్రముఖంగా ప్రచురించడం, ఆ వార్త మా పత్రికలో మిస్ అవడం తట్టుకోలేని మా ఎడిటర్, మా బ్యూరోను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. జరిగిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మర్నాడు మొదటి పేజీలో, సుదీర్ఘంనైన సంపాదకీయం రాసి, చంద్రబాబు పట్ల తన విధేయతను చాటుకున్నారు. అయితే సంపాదకుడి వైఖరికి నిరసనగా ఉద్యోగాన్ని వదిలి వేయవచ్చు కదా అంటే, నిజమే చేయవచ్చు. కానీ అప్పట్లో వెంటనే మరో చోట ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆ సాహసం చేయలేదు. చాలామంది జర్నలిస్టుల పరిస్థితి అదే. బయటకు చెప్పుకోలేక పోవచ్చు. ఇప్పుడయినా ఆ వివరాలన్నీ రాసే అవకాశం వచ్చింది. వైస్రాయ్ సంఘటనలో నిజానిజాలు గురించి నేటి యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సవివరంగా రాయడం జరిగింది’ అని అమర్ ఇచ్చిన వివరణ. మూడు దారుల్లో ఇదొకటి. మిగిలినవి రెండూ వై.ఎస్. ఆర్., వై ఎస్. జగన్ ఎంచుకున్న దారులు. ఈ దారులపై మీడియా కావాలని వికృత ధోరణితో వార్తలు వండి వార్చింది అనే ఆరోపణలకు సంబంధించి కొన్ని దృష్టాంతాలను అమర్ ఈ గ్రంథంలో పేర్కొన్నారు. నాటి సంఘటనలకు సాక్షీభూతులైన అనేకమందిని కలుసుకుని, చంద్రబాబు అనుకూల, ప్రతికూల జర్నలిస్టులు, రచయితలు రాసిన పుస్తకాలలోని అంశాలను కూడా ఆయన ఉదహరించి, తన రచనకు సాధికారతను ఒనగూర్చే ప్రయత్నం చేశారు. తాను స్వయంగా గమనించిన విషయాలతో పాటు, తనకు తెలియ వచ్చిన మరి కొన్ని అంశాలను ధ్రువపరచుకునేందుకు అమర్ చాలా కసరత్తు చేసినట్టు ఈ పుస్తకం చదివిన వారికి తెలుస్తుంది. కన్నవీ, విన్నవీ విశేషాలతో కూడిన గ్రంధరచన కాబట్టి కొంత వివాదాస్పదం అయ్యే అవకాశాలు వున్నాయి. నాటి సంఘటనలకు నేనూ ఒక ప్రత్యక్ష సాక్షిని కనుక పుస్తకం చదువుతున్నప్పుడు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంగతులు మూగ మనసులు సినిమాలోలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాఠకులను ఇది ఆకర్షిస్తుంది. ఈ పుస్తకాన్ని ముందు అమర్ ఆంగ్లంలో DECCAN POWER PLAY అనే పేరుతొ ప్రచురించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. తెలుగు అనువాద రచన మూడు దారులు పుస్తకావిష్కరణ కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్లో మరోమారు జరగనుంది. తోకటపా: విజయవాడ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగ ఉవాచ: ‘దేవులపల్లి అమర్ కు వై.ఎస్. రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ. జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి ఏమి రాసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు’. భండారు శ్రీనివాస్ రావు, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు) -
ఈ నెల 27న విజయవాడలో 'మూడు దారులు' పుస్తక ఆవిష్కరణ
-
శ్వేత టీడీపీకి రాజీనామా చేయడానికి అసలు కారణం పై క్లారిటీ ఇచ్చిన దేవులపల్లి అమర్
-
లోకేష్ ను మంత్రిని చేసినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు ..!
-
అట్టర్ప్లాప్ అయినా ఫర్వాలేదనుకుంటున్న పవన్!
టాస్క్ అనే ఇంగ్షీషు పదానికి గూగుల్ తెలుగులో ఇచ్చే నిర్వచనం ఒక పనికి ఒప్పుకోవడం. ‘‘టాస్క్’’ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎవరికి వారే ఒక పని సాధించాలని అనుకోవడం. ఆ కోవకు చెందిన వాళ్ళకు స్పష్టత ఉంటుంది. అది తాము వెళ్ళే మార్గం పట్లా.. చేరుకోవాల్సిన గమ్యం పట్లా!. ఇక రెండో కోవకు చెందిన వాళ్ళు ఎవరో ఇస్తే చేసే పని. ఇటువంటి వారికి మార్గం , గమ్యం దేని పట్లా స్పష్టత ఉండదు. పని ఇచ్చిన వాడు ఏం చెప్తే అది చేయాలి.. ప్రతిఫలం తీసుకోవాలి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒక టాస్క్కు ఒప్పుకున్నాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ ప్రారంభించాడు. ఆయన పార్టీ పెట్టి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన నిర్వాకాన్ని విశ్లేషించి నట్టయితే ఆయన మనం ముందు చెప్పుకున్న రెండో కోవకు చెందిన వ్యక్తి అని ఎవరికయినా అర్ధం అవుతుంది . తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఆయనకో టాస్క్ ఇచ్చాడు . 2014 లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశాన్ని అధికారం లోకి తీసుకురావడం 2019 లో తెలుగు దేశం తిరిగి గెలిచేట్టు చూడటం 2024లో బీజేపీని దగ్గర చేర్చి మళ్ళీ తెలుగు దేశం అధికారం లోకి రావడానికి ప్రయత్నించడం ఈ మూడు పనుల్లో ఆయన విఫలం కావడమే కాక రెంటికీ చెడ్డ రెవడి సామెత అయ్యింది ఆయన పని. 2014 లో ఆంధ్ర ప్రదేశ్లో తెలుగు దేశం గెలవడానికి పవన్ కల్యాణ్ చేసిందేమీ లేదు , మోదీ హవా బలంగా వీస్తున్న సమయం అది . చంద్రబాబు నాయుడు ఇచ్చిన పని చేసే ధ్యాసలో పడి పోయి పవన్ తన పార్టీ గురించి మర్చిపోయాడు . ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకునే ఎవరయినా ముందు తన పార్టీ నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారు . ఆ పార్టీ బలోపేతం అయితేనే కదా ఇంకెవరికాయినా సహాయం చేయగలిగేది. పవన్ కల్యాణ్కు చంద్రబాబు ఆ మాట చెప్పడు. ఎందుకంటే పవన్ పార్టీ బలం పుంజుకుంటే మళ్ళీ తనకే నష్టం అని ఆయనకు బాగా తెలుసు . అందుకే పవన్ పార్టీ నిద్రావస్థలోనే ఉండాలి అతను మాత్రం తన కోసం పని చేయాలి.. ఇదీ బాబు ఆలోచన . తాను ఎన్డీయే భాగస్వామిననీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , హోం మంత్రి అమిత్ షా తాను పిలిస్తే పలుకుతారనీ పవన్ తరచూ చెప్తూ ఉంటాడు . పట్టుమని పది పంచాయితీలను గెలుచుకోలేని పార్టీని, దాని నాయకుడిని రాజకీయాల్లో రాటు తేలిన బీజేపీ ఎందుకు పక్కన పెట్టుకుంటున్నదో అర్ధం చేసుకోలేని స్థితి పవన్ది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 14 రోజులు అన్నపానీయాలు మాని ఏడుస్తూ పడుకున్నానని ఆంధ్ర ప్రదేశ్కు వెళ్ళి బహిరంగ సభల్లో చెప్పుకున్న పవన్.. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తానని ముందు ప్రకటించాడు. బీజేపీతో పొత్తులో చివరికి ఎనిమిది స్థానాలకే సంతృప్తి పడ్డాడు. ఆ ఎనిమిది స్థానాల్లో కూడా అభ్యర్ధులు కరువై బీజేపీ వాళ్ళకే పవన్ పార్టీ కండువాలు కప్పారంటే ముందే చెప్పినట్టుగా పార్టీ నిర్మాణం మీద ఆయన శ్రద్ద చూపించారో అర్ధం అవుతుంది. తెలంగాణా ఎన్నికల వాలకం చూస్తే ఆయన పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్ లు వస్తాయనే నమ్మకం కూడా లేదు . పోటీ చేసిన అన్నీ చోట్లా డిపాజిట్లు పోగొట్టుకోవడం ఆయన పార్టీకి కొత్త ఏం కాదు . తెలంగాణ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకే ఆంధ్ర ప్రదేశ్లో శాసన సభకూ, లోక్సభకూ ఎన్నికలు జరుగుతాయి . తెలంగాణలో బీజేపీ తో దోస్తీ , ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్ళి తెలంగాణ లో బోర్డ్ తిప్పేసిన తెలుగు దేశంతో దోస్తీ పవన్ రాజకీయ గందరగోళానికి అద్దం పడుతుంది. నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పెట్టుకుని, ఆ ఎన్నికల్లో తాను ప్రధాన పాత్ర పోషించబోతున్నానని చెప్పుకునే ఏ రాజకీయ నాయకూడూ పవన్ చేసిన తప్పు చేయడు కదా!. తనకు పని ఇచ్చిన చంద్ర బాబు ఎట్లాగూ ఇటువంటివి చెప్పడు. ఆయనను చూసైనా పవన్ జాగ్రత్త పడాలి కదా. అలా కాకుండా తెలంగాణాలో నవ్వులపాలయి ఆంధ్ర ప్రదేశ్ కు వెళితే చంద్రబాబు పార్టీ 16 స్థానాలిచ్చి అక్కడికంటే రెట్టింపే ఇచ్చాం సరిపెట్టుకో అనడం ఖాయం. సినిమా పోతే పోయింది , హీరో రెమ్యునరేషన్ వొస్తే చాలు కదా!. నిర్మాతలు, ప్రేక్షకులూ (నమ్ముకున్న పార్టీ నాయకులు , కార్యకర్తలు ) ఏమైపోతే ఏం . :::దేవులపల్లి అమర్, రాజకీయ విశ్లేషకులు -
అమిత్ షాతో లోకేష్ భేటీ వెనుక కర్త, కర్మ, క్రియ..
-
అలా మాట్లాడినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాలేదా
-
చంద్రబాబు మాస్టర్ ప్లాన్ : దేవులపల్లి అమర్
-
రాజకీయాల గురించి దేవులపల్లి అమర్ వ్యాఖ్యలు చేశారు
-
ఈనాడు పిచ్చిరాతలపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన అసలు నిజాలు
-
నువ్వు నీ పిచ్చి యాత్రలు : దేవులపల్లి అమర్
-
పార్లమెంట్లో మణిపూర్ ప్రకంపనలు పై దేవులపల్లి అమర్ క్లియర్ కట్ విశ్లేషణ
-
మంత్రాలకు చింతకాయలు రాలవు...పవన్ ఇక జైలుకేనా...
-
‘పవన్ కళ్యాణ్ది అవగాహన లేమి’
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే చాలా కష్టపడాలని, దాంతో పాటు పూర్తి అవగాహన ఉండాలని, చాలా విషయ పరిజ్ఞానం ఉండాలన్నారు. ప్రజల్ని నమ్మించగలను అనే ఆత్మవిశ్వాసం ఉండాలని, అదే సమయంలో అతి విశ్వాసం అనేది ఉండకూడదన్నారు. అయితే పవన్ కళ్యాణ్లో ఆత్మ విశ్వాసం లేదు, అతి విశ్వాసం కూడా లేదన్నారు. కానీ ఆత్మనున్యతా భావంతో ఉన్నట్లే పవన్ కళ్యాణ్ ప్రసంగాల్ని బట్టి అర్ధమవుతుందన్నారు. -
మేనిఫెస్టో అంటే జగన్.. ఉన్నది ఉన్నట్టుగా..: దేవులపల్లి అమర్
సాక్షి, సత్తెనపల్లి: మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన "మేనిఫెస్టో అంటే జగన్" చర్చా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. "జగన్ 650 హామీలు ఇచ్చారని, అందులో 20 శాతం కూడా అమలు చేయలేదంటూ టీడీపీ ఒక బుక్ రిలీజ్ చేస్తోందట. కాంగ్రెస్ నినాదం గరీబీ హఠావో అమలు కాలేదు. సమాజమే దేవాలయం అన్న టీడీపీ 20 ఏళ్లు పాలించింది. అయినా రాష్ట్రంలో పేదరికం ఇంకా ఎందుకు ఉంది? జగన్ పేదవాడి కష్టాలు తీర్చేలా మేనిఫెస్టో పెట్టారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతటి గెలుపు జగన్కే సాధ్యమైంది. నేను చేసిన సంక్షేమం మీకు అందితేనే నాకు ఓటు వేయండి అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. జగన్ ఒక భిన్నమైన తత్వవేత్త, ఫిలాసఫర్. ప్రతీ గడపకు నాయకులు అధికారులు వెళ్లి సమస్య తెలుసుకుని పరిష్కరించే వ్యవస్థను జగన్ క్రియేట్ చేసారు. ఈ వ్యవస్థలో ఏం జరిగినా క్షణాల్లో జగన్ తెలుసుకుంటారు" రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి తరఫున గడప గడపకు తిరిగి నిరంతరం శ్రమించేలా ఒక వ్యవస్థ ను రూపొందించిన వ్యక్తి జగన్ అని, దేశంలో ఎక్కడా ఇటువంటి వ్యవస్థ లేదని అమర్ అన్నారు. ఒకప్పుడు సమాజంలో పత్రికలు విశ్వసనీయత కలిగి ఉన్నాయి అని, నేడు సోషల్ మీడియా ద్వారా సత్యం కనుమరుగు అవుతున్నది, వాస్తవాలు ప్రజలకు చేరడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! ప్రజా సంక్షేమ పార్టీ కాబట్టే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని, ప్రతి గడపకు లబ్దిచేకూరాలనే ధ్యేయంతో సీఎం పని చేస్తున్నారని అమర్ అన్నారు. అభివృద్ది అంటే భవనాలు కట్టించడం మాత్రమే కాదు అని, పేదరిక నిర్మూలన, ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే అభివృద్ది అవుతుంది అని, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది కేవలం అపోహ మాత్రమే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, డొక్కా మాణిక్య వరప్రసాద్, సీనియర్ పాత్రికేయులు వివిఆర్ కృష్ణంరాజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఒక పనికిమాలిన న్యూస్ ఛానల్ అవినాష్ రెడ్డి కేసుపై రాసిన రాతలు
-
ఇలాంటి పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెట్టకండి రైలు ఘటనకి దానికి సంబంధం ఏంటీ..
-
‘కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వెనక కూడా చంద్రబాబే!’
వర్తమాన రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఏ విలువలు అయితే పాటించకూడదో, ఎలాంటి వ్యక్తిత్వానికయితే దూరంగా ఉండాలో ఆ ఇద్దరు వ్యక్తులు సజీవ సాక్ష్యంగా కనిపిస్తారు. మొదటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ లో ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి అన్ని హంగులు, అర్భాటాలు అనుభవించి.. చివరికి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి.. ఇప్పుడు ఏకంగా పార్టీకే పంగనామాలు పెట్టారు కిరణ్ కుమార్. ఇక రెండో వ్యక్తి చంద్రబాబు. ఆయన మాస్టర్ ప్లాన్ మామూలుగా ఉండదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఎప్పటికప్పుడు అతి తెలివి ప్రదర్శిస్తునే ఉంటారు. తన అనుయాయులందరిని బీజేపీలోకి పంపించి తన పబ్బం గడుపుకుంటున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వెనక కూడా చంద్రబాబే ఉన్నారా? కావొచ్చంటున్నారు సీనియర్ జర్నలిస్టు దేవుల పల్లి అమర్. కిరణ్ కుమార్, చంద్రబాబు.. ఇద్దరి వ్యవహారాలు కచ్చితంగా భిన్నంగా చూడాల్సిందేనంటున్నారు. -
మీకు శిక్షణ ఎవరిస్తున్నారు లోకేష్?
ఎలుక తోక తెచ్చి ఏడాది పాటు ఉతికినా, నలుపు నలుపే గాని, తెలుపు కాదు అని తెలుగులో ఓ సామెత ఉంది. అప్పుడప్పుడు ఇది అనుకోకుండా.. నేనున్నానంటూ మరీ గుర్తుకొస్తుంది. ఆ అవసరాన్ని తెలుగు ప్రజలకు తరచుగా గుర్తు చేస్తున్నారు టీడీపీ నేత నారా లోకేష్. పాదయాత్రలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంలో బోలెడు తప్పులు (కావాలనో?.. లేక జనాన్ని పక్కదారి పట్టించాలానో?) చేస్తున్నారు. కొన్ని సార్లు మాత్రం పద ప్రయోగంలోనో, లేక పలకడంలోనే తేడా కొట్టి కొన్ని సుభాషితాలు వల్లిస్తున్నారు. ఇక ఈ మాటల విషయంలో టీడీపీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇది మానడం లేకపోగా.. మరింత పెరుగుతున్నాయంటున్నారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్. ఇటీవల అనంతపురంలో లోకేష్ చేసిన ప్రసంగాన్ని విశ్లేషించారు అమర్ దేవులపల్లి. ఇక నైనా ఇలాంటివి సవరించుకోకుంటే నవ్వుల పాలవుతారని హితవు పలికారు. -
లోకేష్ ముందు చరిత్ర తెలుసుకో.. నువ్వు మీ బాబులా తయారయ్యావ్
-
‘ఎన్టీఆర్ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు భారీగా విజయవంతం కావడం తెలుగుదేశం పార్టీకి గానీ, ఎల్లో మీడియాకు గానీ ఏ మాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. ఏకంగా దేశంలో ఉన్న టాప్ క్లాస్ బిజినెస్ మాగ్నెట్లు అంతా రావడం, ఆంధ్రప్రదేశ్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని కొనియాడటం, వేల కోట్ల పెట్టుబడులు పెడతామని నేరుగా ప్రకటించడం.. ఎల్లో బ్యాచ్కు మింగుడు పడలేదు. సాధారణంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారుల సదస్సు జరిగితే అందులో రకరకాల వేషాలు, డ్రామాలు పుట్టుకొస్తాయి. అలాంటి ఓ విచిత్రమైన ఘటనను షేర్ చేసుకున్నారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మంత్రిగా ఉండేవారు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన, ఆయన చెప్పిన అనుభవం ఇది. "తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఫేక్ షోలు చేయడం అలవాటు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం.. ఆయనకు పెద్దగా తెలియదు. ఎప్పుడూ చుట్టూ ఉండే చంద్రబాబు, ఆయన మనుష్యులు ఓ రోజు ఒకాయనను తీసుకొచ్చారు. నేరుగా ఎన్టీఆర్ దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశారు. అయ్యా.. ఈయన భూటాన్ రాయబారి అని పరిచయం చేశారు. ఎన్టీఆర్ దానికి ఎంతో సంతోషించారు.. స్వయంగా వెంట తీసుకెళ్లి బుద్ధుడి విగ్రహాం చూపించారు. ఆ వ్యక్తితో ఫోటోలు దిగి పేపర్లో వేయించారు. టుప్కా అని భూటాన్ నుంచి రాయబారి వచ్చారని, ముఖ్యమంత్రిని కలిశారని పేపర్లలో ప్రచారం చేయించారు. అప్పట్లో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో పని చేస్తుండే వాడిని. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత .. నాతో పని చేస్తోన్న ఓ కొలీగ్ ఓ ఫోటో చూపించారు. అందులో నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న వ్యక్తి ఫోటో ఉంది. ఇతనే కదా మొన్న ఎన్టీఆర్ను కలిసిన భూటాన్ రాయబారి అని చెప్పారు. తెలుగుదేశం వాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారు. స్వెట్టర్లు అమ్ముకునే వ్యక్తిని భూటాన్ రాయబారి అని చెప్పించిన ఘనత చంద్రబాబుది.." అని దేవులపల్లి అమర్ అన్నారు. చదవండి: జాకీ యూనిట్పై రాప్తాడులో టీడీపీ కాకిగోల.. వాస్తవాలతో సాక్ష్యం ఇదిగో -
ఈనాడు తప్పుడు కథనాలపై మండిపడ్డ దేవులపల్లి అమర్
-
కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు
సాక్షి, అమరావతి: కరోనాతో చనిపోయిన జర్న లిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ చెప్పారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు చాలా మంది కరోనాతో చనిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెండోదశ వైరస్ విజృంభణలో ఎక్కువమంది జర్న లిస్టులు మృతిచెందారని తెలిపారు. వీరి కుటుం బాలకు శాశ్వత మేలు కల్పించడానికి ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే ఈ సాయం ఆ కుటుంబాలకు పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వలేదని భావించి శాశ్వత మేలు చేయాలని ఆలోచిస్తోందని చెప్పారు. జర్నలిస్టుల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలినుంచి సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు సంతకం చేసిన కొద్ది ఫైళ్లలో జర్నలిస్టుల హెల్త్స్కీమ్ ఫైలు ఒకటని గుర్తుచేశారు. ఐజేయూ అధ్యక్షుడు ఇటీవల మాట్లాడుతూ ఏపీలో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని, దీనిపై ప్రశ్నించాలంటూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించడం సమంజ సం కాదన్నారు. ఈ నెల 17న ఏపీయూడబ్ల్యూజే ఆ విర్భావ దినోత్సవాన్ని సా వధాన దినోత్సవంగా జరు పుకోవడానికి పిలుపునివ్వడాన్ని తప్పుబట్టారు. యాజమాన్యాలను ఎందుకు ప్రశ్నించరు? రూ.కోట్లు ఆర్జిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీస వేతనాలివ్వని యాజమాన్యాల ను యూనియన్ నాయకులు ఎందుకు ప్రశ్నించరని అమర్ దుయ్యబట్టారు. ఏపీడబ్ల్యూ జర్నలిస్టుల సంక్షేమానికి అనేక రాయితీలు ఇస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం యూనియన్ నాయకులకు తగదన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ జర్నలిస్టులపై దాడులు జరిగాయో ఆధారాలతో ని రూపించాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం జర్నలిస్టులను అన్ని విధా లుగా ఆదుకుందని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానీని కలిసి జర్నలిస్టు యూనియన్ నాయకులు కృతజ్ఞత లు తెలిపారని, ప్రస్తుతం వారే ప్రభుత్వంపై బురద జల్లే చర్యలకు దిగుతుండటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు పరిశీలనలో ఉంది రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం అక్రిడిటేషన్ మంజూరు చేస్తుందని చెప్పారు. అక్రిడిటేషన్లు ఇవ్వడంలో ఆలస్యమైందని విమర్శించే వారు దాని వెనుక వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. అక్రిడిటేషన్ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని కృషి చేస్తున్నారని తెలిపారు. చిన్న పత్రికలకు జీఎస్టీ మినహాయింపు, అక్రిడిటేషన్ కమిటీల్లో యూనియన్లకు ప్రాతినిథ్యం అంశాలు సమాచారశాఖ దృష్టిలో ఉన్నాయన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. సగర్వదినంగా జరుపుకోవాలి: యూనియన్ల నేతలు రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో తెలియజేస్తూ ఏపీ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్ను శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల యూనియన్ నాయకులు శుక్రవారం ఓ ప్రకట నలో తెలిపారు. ఈ 17న ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని జర్నలిస్టులు సావధాన దినంగా కాకుండా సగర్వ దినంగా జరుపుకోవా లని పిలుపునిచ్చారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు కలి గించేదిశగా ప్రభుత్వం ఆలోచించడం హర్షణీయ మని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ ఉన్నతమైన ఆలోచన విధానంతో ఉన్నారని, జర్నలిస్టులకు త్వరలోనే తీపి కబురు అందిస్తామని అమర్ హామీ ఇచ్చారని తెలిపారు. -
సీఎం జగన్ హామీ : 5 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా దేశంలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. వీరిలో మరీ ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్ట్లు ఎక్కువగా ఉన్నారు. వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు వీరంతా తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ నేపథ్యంలో కరోనా క్లిష్ట సమయంలోనూ ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. వైరస్పై పోరులో మరణించిన ప్రతి జర్నలిస్ట్కు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని మంగళవారం మీడియా ముందు వెల్లడించారు. (ఉచిత విద్యుత్కు కొత్త ఎనర్జీ) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా వల్ల అనేక మంది చనిపోతున్నారు. దీనిలో జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు.వార్తా సేకరణ క్రమంలో అందరూ ముందుండి నడిచారు. ప్రధాని కూడా జర్నలిస్ట్ లు కరోనా వారియర్స్ అని చెప్పారు. జర్నలిస్టులను ప్రభుత్వాలు కూడా సహకారం ఇవ్వాలి. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీలో 38 మంది జర్నలిస్టులు మృతి చెందారు. వారిని ఆదుకోవాలని ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. 38 మంది చనిపోయారని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 5 లక్షలు ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. చికిత్స తీసుకునే వారికి కూడా ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేశారు. సీఎంకు, దీనికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని కే శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ..‘ కోవిడ్ వల్ల చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్ ముందుకు రావడం మంచి పరిణామం. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. యూనియన్లు కేంద్రం ప్రకటించిన 50 లక్షల బీమాను డిమాండ్ చేస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల వెనుక ఉండి ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నిరూపితమైంది. భవిష్యత్తులో కూడా సీఎం జగన్ జర్నలిస్టుల వెనుక ఉంటారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. -
రామకృష్ణపై దేవులపల్లి అమర్ ఫైర్
సాక్షి, అమరావతి : సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిపై అంతరాష్ట్ర, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేస్తున్న విమర్శలు ఖండించారు. ప్రభుత్వ సలహాదారులు ఏ విధంగా సలహాలు, సూచలనలు ఇవ్వాలో తమకు తెలుసని, రామకృష్ణ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం తమకు లేదని హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం అమర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ సలహాదారుల మీద చేసిన వ్యాఖ్యలు చదివాను. సలహాదారులు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు పత్రికా ప్రకటన ద్వారానో, వీధి ప్రదర్శనల ద్వారానో ప్రకటించే విధంగా ఉండవు. అధికారంలో భాగస్వామ్యం కోసమో, చట్ట సభల్లో సొంత శక్తితో వెళ్లలేక అధికార పక్షాల మొప్పు కోసమో, లేదా ఇతర ప్రయోజనాల కోసం చేసే ప్రదర్శనలు కావు. ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ప్రజా బాహుళ్యానికి మంచి చేసేందుకు ప్రభుత్వానికి అవసరమైన రీతిలో, తగిన సమయంలో ఇచ్చే విధంగా ఉంటాయి. ఇవ్వనీ రామకృష్ణ లాంటి వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదు. సీపీఐని కొంతైనా మెరుగుపరిచేందుకు ఎవరైనా మంచి సలహాదారుడిని వెతుక్కోవాలని నా సూచన’ అని లేఖలో పేర్కొన్నారు. -
దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులపై సీఎం జగన్కు అపార గౌరవం ఉందని.. ఆయనలోనూ ఓ జర్నలిస్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు ప్రమాదకరంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనాథ్రెడ్డి... జర్నలిస్టులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవలసిన అవసరం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంత విలేకరుల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆయనను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ... పాత్రికేయ రంగంలో శ్రీనాథ్రెడ్డి సేవలను గుర్తించి సీఎం జగన్.. ఆయనను ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించారని పేర్కొన్నారు. శ్రీనాథ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ మరింతగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కూడా శ్రీనాథ్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ‘గతంలో ఏ ప్రభుత్వాలు జర్నలిస్టులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే సీఎం జగన్ మాత్రం ఆరుగురు సీనియర్ జర్నలిస్టులకు తన ప్రభుత్వంలో పలు పదవులు ఇచ్చారు’ అని హర్షం వ్యక్తం చేశారు. ‘1996 లో ప్రెస్ అకాడమీ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ శిక్షణ ఇచ్చేది. గత కొంత కాలంగా ప్రెస్ అకాడమీలు నామమాత్రంగా మారాయి. ప్రెస్ అకాడమీకి స్థలం, నిధులు ఇచ్చి జర్నలిస్టులను ప్రోత్సహించాలి’ అని విఙ్ఞప్తి చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్, సీనియర్ పాత్రికేయులు ఆర్. దిలీప్రెడ్డి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కాగా శ్రీనాథ్రెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామం. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. -
దేవులపల్లి అమర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ మీడియాలో గతంలో దక్షిణాదికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై కవరేజి తక్కువగా ఉండేదని చెప్పారు. ఇటీవల కాలంలో జాతీయ మీడియా కూడా దక్షిణాది వైపు దృష్టి పెట్టిందని.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పాలనాపరమైన అంశాలను జాతీయ మీడియాకు చేరువయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఏపీ ప్రభుత్వ జీవోలో కొత్తగా ఏమీ లేదు
-
‘కమలం’ ఆశలు ఫలిస్తాయా?
కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో అఖండవిజయం సాధించిన బీజేపీ తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ కలిగించింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభంజనం ధాటికి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు బి. వినోద్కుమార్ మాత్రమే కాకుండా కేసీఆర్ తనయ కవిత సైతం ఓడిపోవడం దిగ్భ్రాంతికరం. పైగా తెలంగాణలో 2023లో తామే అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ముఖ్యనేత రాం మాధవ్ చెప్పడం కేసీఆర్కి మింగుడుపడని విషయమే. ఇక ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గల అపూర్వ ప్రజాదరణ, ఆయన అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రజా ప్రయోజనంకోసం చేస్తున్న పనుల వేగం చూస్తే రాం మాధవ్ చెప్పినట్టు అక్కడ అధికారంలోకి వచ్చే మాట అట్లా ఉంచి ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి రావడానికి కూడా బీజేపీ ఓ పదేళ్ళు ఆగాల్సిందే. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి ఇప్పటిదాకా ఒక్క కర్ణాటక రాష్ట్రం మీదనే ఆశలు ఉండేవి. గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన కారణంగా రాష్ట్రంలో అధికారం కోల్పోయిందే తప్ప బీజేపీకి మంచి స్థానాలే వచ్చాయి. నిజానికి అక్కడ అప్పటి దాకా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పడి పోయి సంకీర్ణానికి ఆ పార్టీ మద్దతు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంతేకాదు మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి సంపూర్ణ ఆధిక్యత లభించింది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉంటే గత పార్లమెంట్లో బీజేపీ 17 స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తే మొన్నటి ఎన్నికల్లో సొంతంగా 25 స్థానాలు గెలిచి తాము బలపరిచిన మరో స్థానంలో సినీనటి సుమలతను గెలిపించుకున్నది. అంటే ఇప్పుడు కర్ణాటకలో 28కి 26 స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయన్న మాట. ఇదే ఊపులో రేపో మాపో అక్కడి సంకీర్ణ సర్కారును పడగొట్టి తామే తిరిగి అధికారాన్ని చేపట్టే ప్రయత్నాల్లో అప్పుడే పడిపోయారు కమలనాధులు. మరో ముఖ్య దక్షిణ రాష్ట్రం తమిళనాడులో బీజేపీ చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇవ్వలేదు, తాను నిలబెట్టదల్చుకున్న ఏఐడీఎంకే చతికిల పడటంతో ఇప్పుడప్పుడే తమిళనాట సమయం వృథా చెయ్యడానికి సిద్ధంగా లేదని చెప్పాలి. మొన్నటి లోక్సభ ఫలితాలు చూసిన తరువాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో అక్కడ స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. మరో రాష్ట్రం కేరళ బీజేపీకి నెరవేరని కోరికగానే నిలిచిపోయింది. ఇక బీజేపీ ముఖ్య నాయకుడు రాం మాధవ్ రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ తెలంగాణలో 2023లో తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం 2029 దాకా ఆగాల్సి ఉంటుం దని చెప్పారు. బీజేపీలో రాం మాధవ్ ఒక ముఖ్య నాయకుడు. అల్లా టప్పా మనిషి కాదు. ఆంధ్రప్రదేశ్ విషయం కాసేపు అట్లా పెడదాం. తెలంగాణాలో 2023లో అధికారంలోకి వస్తామని అంత గట్టిగా ఎట్లా చెప్పగలుగుతున్నారు ఆయన అన్నది మాట్లాడుకుందాం. ఇటీవల జరి గిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా నాలుగు స్థానాలలో గెలిచింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో బలంగా ఉన్న తెలుగుదేశంతో పొత్తుల కారణంగా ఒకసారి, ఒంటరిగా ఒకసారి రెండు స్థానాలు గెలిచినా సొంతంగా నాలుగు లోక్సభ స్థానాలు గెలవడం బీజేపీకి ఇదే ప్రథమం. చిత్రంగా గత డిసెంబర్ నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయిదు నుండి ఒక స్థానానికి పడిపోయి 119 స్థానాలకుగాను నూటికి పైగా స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయిన బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు చోట్ల అందునా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మూడుచోట్ల కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లలో గెలవడంతో అందరి దృష్టి బీజేపీ వైపు మళ్ళింది. ఇందులో నిజామా బాద్ స్థానంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఓడిపోవడం ఒకటయితే, గతంలో కేసీఆర్ తాను ముమ్మారు ప్రాతి నిధ్యం వహించి అద్భుత ఆధిక్యతలతో గెలిచిన తరువాత తనకు అత్యంత సన్నిహితుడయిన బోయినపల్లి వినోద్ కుమార్కు అప్పగిస్తే ఆయనా ఓటమి పాలు కావడం మరొకటి. ఆదిలాబాద్లో సోయం బాపురావు గెలుపు కేసీఆర్ గిరిజనుల మధ్య చిచ్చు పెట్టబోయి చేతులు కాల్చుకోవడానికి నిదర్శనంగా చూడాలి. సికింద్రాబాద్లో గెలిచి కేంద్ర మంత్రి కూడా అయిన కిషన్ రెడ్డి అదృష్టవంతుడు అని చెప్పాలి. శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన అయిదు మాసాల్లోనే లోక్సభకు ఎన్నిక కావడం కేంద్రంలో పదవి దక్కడం అదృష్టమే కదా. 1980 దశకంలో మావోయిస్ట్ ఉద్యమం ఉధృతంగా ఉండి వామపక్ష ఉద్యమాలకూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికీ గుండెకాయగా నిలిచిన ఉత్తర తెలంగాణలో మూడు లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం ఆషామాషీగా చూడాల్సిన విషయం కాదు. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకోడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్రావు అనుసరిస్తున్న రాజ కీయ ఎత్తుగడలే కారణం. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కేసీఆర్ ఉద్యమ కాలంలో ఫిరాయింపుల మీద విరుచుకుపడే వారు. అప్పట్లో ఆయన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటల్లోనే ‘‘ఇతర పార్టీల నుండి గెలిచినోణ్ని పార్టీ ఫిరాయింప చేస్తే ప్రజలు చీరి చింతకు కడతారు, ఇంత కిర్కిరి, ఇంత హరాకిరి ఉంటదా, ఇంత వ్యభిచార బుద్ధా రాజకీయాల్లో, నీతి ఉండొద్దా రాజకీయాల్లో’’ ఇట్లా సాగింది ఆయన ప్రవచనం. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కేసీఆర్ చేస్తున్న పనే ఎడాపెడా ఫిరాయింపులు చేయించడం. 2014లో 119కి గాను 62 స్థానాలే లభించాయి అసెంబ్లీలో, ఏ ముగ్గురిని చంద్రబాబునాయుడు టీడీపీలోకి లాగేసినా తన ప్రభుత్వం పడిపోవడం ఖాయం (చంద్రబాబు అటువంటి పిచ్చి ప్రయత్నం ఒకటి మొదలుపెట్టి రెడ్ హండెడ్గా దొరికిపోయి రాత్రికి రాత్రి విజయవాడకు మకాం మార్చిన విషయం తెలిసిందే) కాబట్టి అప్పట్లో తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని ఖాళీచేసి ఇద్దరు ముగ్గురు మినహా ఎమ్మెల్యేలందరినీ కొనేశారు కేసీఆర్, అప్పట్లో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ చివరికి సీపీఐ సభ్యులను వదలకుండా తన పార్టీలో కలుపుకున్నప్పుడు ఉద్యమ సమయంలో తానే∙తిట్టిన తిట్లు ఇప్పుడు తనకే వర్తిస్తాయని మరిచిపోయారు. ఆయనకు ఇంకో ఆలోచన కూడా ఉండింది, ఏనాటికయినా తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే కాబట్టి తెలుగుదేశం లాగానే దాన్ని కూడా తుడిచిపెట్టేస్తే ఇక తిరుగు ఉండదు అన్నది ఆ ఆలోచన. అందుకు అనుగుణంగానే ఆయన పావులు కదిపారు. 2018లో గడువుకంటే ముందే శాసనసభ ఎన్నికలకు వెళ్లి 88 స్థానాలు గెల్చుకుని మంచి మెజారిటీ సాధించినా ఆగకుండా కాంగ్రెస్ శాసన సభ్యులను టీఆర్ఎస్లో చేర్చుకునే పని కొనసాగించారు. ఇక కాంగ్రెస్ పని అయిపోయింది తెలంగాణలో తన పార్టీకి తిరుగులేదు అన్నది ఆయన ధీమా. కానీ పరిస్థితులు అట్లా లేవు. శాసనసభకూ లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలొస్తే గెలుపు సులభం అవుతుందన్నది ఆయన ఆలో చన కాగా అసదుద్దీన్ ఒవైసీ స్థానం మినహాయిస్తే మిగిలిన 16 స్థానాలూ తన పార్టీవే అని ఎంత గొంతు చించుకుని చెప్పినా ప్రజలు తొమ్మిది స్థానాల దగ్గరే టీఆర్ఎస్ను ఆపేశారు. కాంగ్రెస్ను, తెలుగుదేశాన్ని తెలంగాణలో లేకుండా చెయ్యడం కోసం కేసీఆర్ చేసిన కార్యకమాలన్నిటికీ బీజేపీ మౌన సమర్థన ఉంది. ఎందుకంటే ఆ తరువాత తెలంగాణాలో ఏర్పడే శూన్యంలోకి తాము ప్రవేశించి అధికారం చేజిక్కించు కోవాలన్నది కమలనాధుల ఆలోచన. మోదీ మద్దతు తనకు ఉందని మురిసిపోయిన కేసీఆర్కు బీజేపీ అసలు ఆలోచన అర్ధం కాలేదు. ముస్లిం మైనారిటీల పట్ల సానుకూలంగా ఉండ టానికీ మజ్లిస్ పార్టీతో అతిగా పూసుకోడానికీ మధ్య తేడాను కేసీఆర్ మరిచిపోయిన కారణంగా కూడా తెలంగాణలో బీజేపీ బలపడటానికి తానే కారణం అయ్యారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సమాధి అయి నట్టేననీ టీఆర్ఎస్కు తిరుగులేదనీ సంబరపడినంతసేపు పట్టలేదు లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మూడు చోట్ల కాంగ్రెస్ను గెలిపించడానికి. అందు లోనూ ఎవరి రాజకీయ జీవితాన్ని సమాప్తం చెయ్యాలని కేసీఆర్ అను కున్నారో ఆ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుండి లోక్సభకు వెళ్లడం ఇంకో షాక్. కేసీఆర్ కోరిక నెరవేరి తెలంగాణలో కాంగ్రెస్ పతనం అవుతుందో లేదో తెలియదు కానీ మరో బలమయిన ప్రత్యర్ధి బీజేపీ తెలంగాణలో ప్రవేశించింది అనడంలో సందేహం లేదు. పైగా ఏ ఫలితంలేని ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ముందుకు తెచ్చి ఆయన కమలనాధుల కటాక్షాన్ని కూడా కోల్పోయారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం అక్కడి నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గల అపూర్వ ప్రజాదరణ, ఆయన అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రజా ప్రయోజనంకోసం చేస్తున్న పనుల వేగం చూస్తే రాం మాధవ్ చెప్పినట్టు అధికారంలోకి వచ్చే మాట అట్లా ఉంచి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి రావడానికి కూడా బీజేపీ ఓ పదేళ్ళు ఆగాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ది కనీసం తెలం గాణ పరిస్థితి కూడా కాదు. మొన్నటిదాకా అధికారంలో ఉన్న తెలుగు దేశం భవిష్యత్తు ఆ పార్టీ నాయకత్వమే గందరగోళంలో పడేసుకుంది కాబట్టి బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలో సంపూర్ణ అధికారంలో ఉన్న బీజేపీ పెద్దఎత్తున చేయూత ఇస్తేనే ప్రజలు హర్షిస్తారు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
చంద్రబాబు విమర్శ వింతల్లోకెల్లా వింత
రాజకీయ జీవిత చరమాంకంలో చంద్రబాబు ఈ దేశానికీ పెద్ద నష్టం చెయ్యడానికి సిద్ధపడ్డారు. ఎన్నికల నిర్వహణ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించడమే ఆ నష్టం. ఈ దుష్ప్రచారాన్ని ఈ దేశ ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కానీ ఇటువంటి నాయకులే వచ్చిపోతుంటారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలను పూర్తిగా తుంగలో తొక్కిన కారణంగానే ప్రజాదరణ కోల్పోయి ఒక యువనేత చేతిలో ఓడిపోతున్నానన్న వాస్తవాన్ని అంగీకరించలేక చంద్రబాబు తన ఓటమికి ఈసీ అసమర్థత, ఎన్నికల్లో జరిగిన అవకతవకలూ కారణం అని చెప్పేందుకు తయారు చేసుకుంటున్న వేదికే ఈ నాటకం అంతా. బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ ఎన్నికలప్పుడూ చూడని వింతలు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం. ఎన్నికల్లో గెలుపు పట్ల కొన్ని రాజకీయ పక్షాలు ధీమాగా ఉంటాయి. కొన్ని పార్టీలకు గెలుస్తామో లేదో అర్థం కాకపోవచ్చు. వాళ్ళు కొంచెం సందిగ్ధంలో ఉంటారు. ఓటమి ఖాయం అని కొన్ని పార్టీలకు ముందే తెలిసి పోతుంది. ఈ అన్ని కోవలకు చెందిన పార్టీలు ఎన్నికలు అయ్యాక ఫలితాలు వెలువడే వరకూ తమకు తోచిన లెక్కలు వేసుకుని జయాపజయాలను గురించిన ఒక అంచనాకు రావడం సహజంగా జరిగే పని. గెలుపు పట్ల ధీమా ఉన్నవాళ్ళు లేదా గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు, మనం చెయ్యాల్సిన ప్రయత్నం మనం చేశాం అనుకునే వాళ్ళు ఫలితాలు వెలువడే వరకూ ప్రశాంతంగా గడిపేస్తారు. ఎన్నికల సమయంలో పడ్డ శ్రమను మరిచిపోడానికి విశ్రాంతి తీసుకుంటారు. ఎన్నికలప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ, అక్రమాలకూ పాల్పడిందనీ ఫిర్యాదు చేస్తారు. అధికార పక్షం చాలా ధీమాగా ఉంటుంది. ఫలితాలు వెలువడిన తరువాత ఓడిపోయినా పార్టీలు కారణాలను విశ్లేషించుకోవడం సహజం. వీలయితే తప్పులు సరిదిద్దుకుని మళ్ళీ అయిదేళ్లకు వచ్చే ఎన్నికల్లో ప్రజాభిమానం చూరగొనడానికి ఏం చెయ్యాలో ఆలోచించి ఆ ప్రకారం నడుచుకోవడం కూడా సహజం. ఈసీపై బాబు విమర్శ వింతల్లోకెల్లా వింత ఓటమికి కారణాలను వెతుక్కోవడం, విశ్లేషించుకోవడం అంటే తమ వల్ల జరిగిన తప్పులను గుర్తించడం, మళ్ళీ ఆ తప్పులు జరక్కుండా చూసుకోవడం. మొదట్లోనే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అట్లా కాకుండా ఒక వింత పరిస్థితి నెలకొని ఉన్నది. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తాను అధికారంలో ఉన్నానో, ప్రతిపక్షంలో ఉన్నానో అర్థం కాని పరిస్థితుల్లో ప్రవర్తిస్తున్న తీరు ఈ వింత పరిస్థితికి దారి తీసింది. 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. అంతకు ఒక రోజు ముందు నుండే ఆయన ఈ ఎన్నికలు జరిగిన తీరు మీద అభ్యంతరాలు వ్యక్తం చెయ్యడం, అక్రమాలు జరగబోతున్నాయని వాపోవడం, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించడం మొదలు పెట్టారు. తన పోలీసులనే తనను అరెస్ట్ చెయ్యమని ప్రేరేపించడం పరాకాష్ట. ఇన్నీ చేసి పోలింగ్ రోజున మళ్ళీ పొద్దున్నే బుద్ధిమంతుడిలా బూత్కు వెళ్లి ఓటు వేసి బయటికొచ్చి భార్యా బిడ్డలతో కలిసి వేలి మీద సిరా గుర్తు చూపించి ఇంటికి వెళ్ళారు. అట్లా వెళ్ళిన గంట తరువాత గోల మొదలు పెట్టారు ఈవీఎంలు మొరాయించాయనీ, తప్పులు చేస్తున్నాయనీ ప్రతిపక్షానికి అనుకూలంగా ఓట్లు మారుతున్నాయనీ. అసలు ఈ ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణే తప్పు.. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలనీ ఉపన్యాసం మొదలుపెట్టారు. ఆయన ఇట్లా ఉపన్యసిస్తున్న సమయంలోనే ఆయన ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్గా పనిచేసిన పెద్దమనిషి కోడెల శివప్రసాద్ ఒక బూత్లో దూరి తలుపులు వేసుకుని రిగ్గింగ్ మొదలుపెట్టి జనం చేత బయటికి ఈడ్పించేసుకున్నాడు. 1994లో తాను భాగస్వామిగా ఉన్న టీడీపీ.. 1999, 2014లో తను అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ ఎన్నికలలో గెలిచినప్పుడు ఇవే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగిన విషయం ఆయన మరిచిపోతున్నారు. పోనీ అప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయి ఇప్పుడు చెయ్యడం లేదు, అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిజాయితీగా పనిచేసింది ఇప్పుడు చెయ్యడం లేదు అనుకుంటే గత అయిదేళ్లుగా ఎందుకు ఒక్క మాటా మాట్లాడలేదు? మొన్నటికి మొన్న నంద్యాల శాసన సభ ఉపఎన్నికల సందర్భంలో ఎందుకు మాకు ఈవీఎంలు వద్దు, ఈ ఎన్నికల సంఘం వద్దు అనలేదు. ఇప్పుడు తన కొత్త మిత్రులు కాంగ్రెస్ వారు పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో గెలిచినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? గెలుపుపై ధీమా.. తోడుగా చిత్తచాంచల్యం ఇప్పుడెందుకు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ కప్పెక్కి ఈవీఎంలనూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు? ఈ ఎన్నికలలో ప్రజల తీర్పు ఆయనకు ముందే తెలిసి పోయింది. అధికారం కోల్పోబోతున్నామని అర్థం అయింది. అందుకే పొంతన లేని మాటలు మొదలు పెట్టారు. కాసేపు నా ఓటు నా పార్టీకి పడిందో లేదో అని అనుమానం వ్యక్తం చేస్తారు, మళ్ళీ వెంటనే తన పార్టీకి 150 స్థానాలు లభిస్తాయని మాట్లాడతారు. గెలుపు మీద ధీమా ఉన్న వాళ్ళెవ్వరూ ఇట్లా చిత్త చాంచల్యం ప్రదర్శించరు. ‘‘స్టేట్స్మన్‘‘ అయితే ఓటమిని కూడా ధైర్యంగా స్వీకరిస్తారు. ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబునాయుడు ఎంత సేపూ ఆత్మస్తుతి పరనిందతోనే గడిపేస్తారు. ఆయన రాజకీయ జీవితం అంతా అట్లానే గడిచింది. ఈ చివరి అంకంలో ఆయన మారతారని ఎట్లా అనుకుంటాం. ఎన్నికలు అయిపోయాయి. ఈవీఎంలు స్ట్రాంగ్రూమ్లలో భద్రంగా ఉన్నాయి. మే 23వరకూ ఆగితే ఫలితం తెలిసి పోతుంది. ఇప్పుడు ఎన్ని విన్యాసాలు ప్రదర్శించినా పరిస్థితి మారదు, మళ్ళీ ఎన్నికలు జరగవు. మరెందుకు చంద్రబాబు ఇంత గోల చేస్తున్నట్టు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని పదేళ్ళయినా పూర్తి కాని ఒక యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒంటరి పోరాటంలో తాను మట్టికరవబోతున్నానన్న ఆలోచనే ఆయనకు మింగుడు పడటం లేదు. సీనియర్ రాజకీయవేత్తగా విలువల విషయంలో మార్గదర్శిగా ఉండాల్సిన తాను యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. నిజాయితీ నా సొంతం, నేను నిప్పును అని చెప్పుకునే ఆయన ప్రజాప్రతినిధులను కొంటుంటే, జగన్ తన పార్టీలో చేరే వాళ్ళు పదవులకు రాజీనామా చెయ్యాలని నిబంధన విధించి కొన్ని విలువలను ప్రతిష్టించాడు. ఈ అయిదేళ్ళలో జగన్మోహన్ రెడ్డికి పెరిగిన ప్రజాదరణ, ముఖ్యంగా 14 మాసాలపాటు ఆయన చేసిన పాదయాత్రను జనం ఆదరించిన తీరు చంద్రబాబునాయుడును గంగవెర్రులు ఎత్తిస్తున్నది. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పాటించకపోగా వాటిని పూర్తిగా తుంగలో తొక్కిన కారణంగానే ప్రజాదరణ కోల్పోయి ఒక యువనేత చేతిలో ఓడిపోతున్నానన్న వాస్తవాన్ని అంగీకరించలేక చంద్రబాబు నాయుడు తన ఓటమికి ఎన్నికల సంఘం అసమర్థత, ఎన్నికల్లో జరిగిన అవకతవకలూ కారణం అని చెప్పేందుకు తయారు చేసుకుంటున్న వేదికే ఈ నాటకం అంతా. ఓటమి ముంగిట్లోనూ డబ్బు చేసుకోవడమే! అంతే కాదు, ఫలితాలు వెలువడే దాకా ఈ నలభై రోజులు బీజేపీ వ్యతిరేక శిబిరంలో తానే చక్రం తిప్పుతున్నాననే భ్రమలో ఉండి, ఇతరులను కూడా ఉంచి మకాం ఢిల్లీకి మార్చాలనే ఆలోచన కూడా ఇందుకు కారణం కావచ్చు. కానీ వాతావరణం చూస్తే అట్లా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లోక్సభ స్థానాల్లో కచ్చితంగా ఆయన పార్టీ గెలవగల స్థానం ఒక్కటి కూడా గట్టిగా చెప్పలేని స్థితిలో ఉన్నారు. లోక్సభ స్థానాలు లేకుండా ఢిల్లీలో ఆయనను పిలిచి పీట వేసే వాళ్ళు ఎవరూ ఉండరన్న విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. చంద్రబాబు ఆయన పార్టీ నేతలూ ఇంకా 150 స్థానాలు మావే అని చెప్పుకుని తిరగడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మళ్ళీ ఆయనే వస్తాడేమో అనే భయంతో డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వసూలు చేసుకోవడం (ఇది జరుగుతున్నది అనడానికి నిదర్శనం నిన్న మొన్న ముఖ్యమంత్రి అధికార నివాసం ఫోన్ నుంచి వ్యాపారులను డబ్బు ఇవ్వాలని పీడిస్తూ వెళ్ళిన ఫోన్ కాల్స్, ఆ వ్యాపారులు చేసిన పోలీసు కంప్లైంట్స్). రెండో కారణం ఓడిపోతున్నామని తెలిస్తే ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి కూడా ఎవరూ పిలవరేమో అన్న దుగ్ధ కావొచ్చు. ఏది ఏమయినా రాజకీయ జీవిత చరమాంకంలో చంద్రబాబు నాయుడు ఈ దేశానికీ పెద్ద నష్టం అయితే చెయ్యడానికి సిద్ధపడ్డారు. ప్రజాస్వామ్య పండుగగా అందరం కీర్తించే ఎన్నికల నిర్వహణ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం పట్ల ప్రజల్లో విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించడమే ఆ నష్టం. అభినవ గోబెల్ చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ దుష్ప్రచారాన్ని ఈ దేశ ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఇటువంటి నాయకులే వచ్చిపోతుంటారు. ఏది ఏమయినా వచ్చే నలభై రోజులు అమరావతిలోని ఉండవల్లి వేదిక బీట్ చూస్తున్న విలేకరులకు మాత్రం రోజూ కొన్ని గంటలు చంద్రబాబు పత్రికాగోష్టి పేరిట ఇచ్చే ఉపన్యాసాల ఘోష భరించక తప్పదు. -దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
డేటాచౌర్యంలో చంద్రబాబే దోషి!
ప్రభుత్వం దగ్గర సురక్షితంగా ఉండాల్సిన పౌరుల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే వెంటనే కదిలి విచారణకు ఆదేశించి బాధ్యులైనవారిపై చర్యలు చేపట్టాల్సింది పోయి నా డేటా నాకు పంపాలి కానీ మీరు కేసులు ఎట్లా పెడతారు అని తెలంగాణ పోలీసుల మీద, ప్రభుత్వం మీద చంద్రబాబు రంకెలేస్తున్నారు. పౌరుల వ్యక్తిగత వివరాలు ఏపీ ప్రభుత్వంలోని ఎవరో ఒకరు ఇవ్వకపోతే ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎట్లా అందాయి? ఎన్నికలలో గెలవడం కోసం ఇన్నాళ్ళూ అవలంబిస్తున్న పద్ధతులు ఈసారి ఫలితం ఇచ్చేట్టు లేవని అర్థం అయిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు వెయ్యిరెట్లు ప్రమాదకరమైన వంచనాత్మక క్రీడలో అదే పద్ధతిలో దొరికిపోయేట్టున్నారు. ‘‘నా సత్తా ఏంటో తెలియాలంటే ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా చూడమనండి మోదీని, కేసీఆర్ని’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అన్నారు. 1984 ఆగష్టు సంక్షోభంలో నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటు నుంచి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాపాడటంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అని ఈ సినిమాలో చూపించారు. కాబట్టే చంద్రబాబు తన పార్టీ సమావేశాల్లో, మంత్రివర్గ సమావేశాల్లో బహిరంగ సభల్లో ఈ సినిమా ప్రమోషన్ మొదలు పెట్టారు. 84 తరువాత పుట్టిన వాళ్ళు చాలామందికి ఆనాటి ఆగష్టు సంక్షోభంలో ఏం జరిగిందో తెలిసే అవకాశం తక్కువ, వాళ్ళంతా ఇప్పుడు ఓటర్లు అయ్యారు కాబట్టి ఈ సినిమాలో చూపించినదంతా నిజమని నమ్మి తనకు ఓట్లు వేస్తారని ఆయన అభిప్రాయం. నిజంగా అలా జరుగుతుందనే ఆయన అనుకుంటారు, నమ్ముతారు కూడా, ఎందుకంటే ఆయన చరిత్ర చదవరు , చరిత్ర దండగ అనే అభిప్రాయం ఆయనది కాబట్టి తనలాగే ఈ వర్గం ఓటర్లు చరిత్ర చదవకుండా, తెలుసుకోకుండా గుడ్డిగా తనకు ఓట్లు వేస్తారని ఆయన భావిస్తూ ఉండొచ్చు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 84లో నాదెండ్ల భాస్కర్రావును ముందు పెట్టి ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అస్థిర పరి చేందుకు చేసిన కుట్రను భగ్నం చెయ్యడంలో చంద్రబాబు పాత్రే ప్రధానమని చూపించారు ఈ సినిమాలో. ఇది పూర్తిగా అబద్ధం అని ఆనాటి తరం వాళ్ళందరికీ, ముఖ్యంగా ఎన్టీఆర్ను ఆయన ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న రాజకీయ పక్షాలకూ, మేధావులకు, పత్రికా సంపాదకులకూ బాగా తెలుసు. ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న వెంకయ్యనాయుడుకు, జైపాల్రెడ్డికి తెలుసు. అరుణ్ శౌరి, కులదీప్ నయ్యర్ వంటి ప్రముఖ సంపాదకులకు తెలుసు ఆనాడు చంద్రబాబుది కేవలం ఒక మేనేజర్ పాత్ర అని. చంద్రబాబు అప్పుడప్పుడే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాడు. ఆయన బంధుత్వాన్ని ప్రయోగించి మామ పంచన చేరాడే తప్ప సినిమాలో చూపించినట్టు ఎన్టీఆర్ ఏమీ ఆయనను ఆహ్వానించలేదు. రామకృష్ణ స్టూడియోస్లో తెలుగుదేశం, దాని మిత్రపక్షాల శాసన సభ్యుల శిబిరంలో అయినా, వాళ్ళందరినీ ట్రైన్లో ఢిల్లీకి తరలించే క్రమంలో అయినా, ఢిల్లీ నుంచి వాళ్ళందరినీ బెంగళూరు సమీపంలోని నందిహిల్స్ శిబిరానికి తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు శాసనసభలో బలపరీక్ష కోసం తరలించిన అన్ని సంఘటనల్లో చంద్రబాబుది మేనేజర్ పాత్రే. శాసన సభ్యుల అవసరాలు తీర్చడం, సౌకర్యాలు ఏర్పాటు చెయ్యడం మినహా ఆయన చేసిందేమీ లేదు, రామకృష్ణ స్టూడియోలో, ఎంఎల్ఏల ఢిల్లీ ట్రైన్ ప్రయాణంలో, నందిహిల్స్ శిబిరంలో వారి వెన్నంటి ఉండి ప్రత్యక్ష సాక్షులయిన పలువురు పాత్రికేయులలో నేనూ ఒకడిని. అయితే ఈ సినిమాలో మాత్రం చంద్రబాబు ఫైటింగ్లు కూడా చేసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నిలబెట్టినట్టు చూపిస్తారు. ముఖ్యంగా ఎంఎల్ఏలను ట్రైన్లో ఢిల్లీ తరలించినప్పుడు రివాల్వర్తో దాడి చేసిన వాళ్ళతో ఆయన స్వయంగా తలపడినట్టు, దుండగులను తరిమికొట్టినట్టు చూపిస్తారు. ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడ్డ వాళ్ళంతా ఎన్టీఆర్కు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ఆయన ప్రభుత్వానికి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా నిలబడ్డారు తప్ప చంద్రబాబు సినీ ఫక్కీ ఫైట్లతో విజయం చేకూరలేదు. నెల రోజుల సీఎం నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర పోలీసు ఐజీని మార్చి మహేందర్ రెడ్డి అనే అధికారిని నియమించారు. రామకృష్ణ స్టుడియోలో ఉన్న శాసన సభ్యులను బలవంతంగా అక్కడి నుండి తరలించి బయటకు తెచ్చి వదిలెయ్యాలన్న భాస్కర్రావు ఆదేశాలను అరవిందరావు పాటించి ఉంటే కథ వేరేగా ఉండేది. ఆయన ఆ పని చెయ్యనని కచ్చితంగా తిరస్కరించారు. అట్లాగే రాష్ట్ర ప్రజల మనోగతాన్ని ఇందిరా గాంధీకి వివరించి మళ్ళీ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునరుద్దరింపచేసిన ఘనత శంకర్ దయాళ్ శర్మది. ఇప్పుడింత వక్రీకరణలతో కూడిన సినిమా ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ఆయనది. 84లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ దగ్గరి నుంచి 95లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకూ చంద్రబాబుది మేనేజర్ పాత్రే. ప్రజాస్వామ్యంలో రాజ కీయాలను, ఎన్నికలను ఈవెంట్లుగా మాత్రమే చూడటం వాటికి తానూ మేనేజర్గా వ్యవహరించడమే ఆయన 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర, అనుభవం. రాజకీయాల్లో మానవీయ కోణం ఉంటుందని కానీ, నైతిక విలువలు ఉంటాయని కానీ ఆయన ఒప్పుకోరు. బాబు నమ్మే సిద్ధాంతం రాజకీయమే దేవాలయం అధికారమే దైవం. రాజకీయాలంటే అధికారం, దానికోసం ఏమైనా చేయొచ్చు అదీ ఆయన సిద్ధాంతం. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. 1992లో రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక కోట్ల విజయభాస్కర్ రెడ్డి పాణ్యం నుండి శాసనసభ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఆయన మీద టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఉపఎన్నికలో ప్రజల సానుభూతి పొందడానికి చంద్రబాబు ఎటువంటి స్కెచ్ ప్రతిపాదించారో దాన్ని ఎన్టీఆర్, ఇతర నాయకులు ఎట్లా వ్యతిరేకించారో రేణుకా చౌదరిని, దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఆ నాటి టీడీపీ నాయకులను అడిగితే చెపుతారు. ఎన్టీఆర్ను దించేసి సీఎం అయిన కొద్ది రోజుల్లోనే 1996లో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో చంద్రబాబు గాంధీగారిని (కరెన్సీ) ఓటర్లకు బాగా పరిచయం చేసారని ఆ పార్టీ సీనియర్ నాయకులే చమత్కారంగా చెప్పుకునేవారు. ఎన్నికల్లో ధన ప్రభావం మొదలయింది ఆ ఎన్నికల నుంచే, దానికి ఆద్యుడు చంద్రబాబే. 1996లో అత్తిలి నుండి 2017 నంద్యాల ఉపఎన్నికలదాకా చంద్రబాబు డబ్బు ప్రభావాన్ని ఎంత పెంచేసారో, ప్రజాస్వామ్యాన్ని ఎంత అవినీతిమయం చేసేసారో అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలోనే ఓటుకు కోట్లు కేసు ప్రయోగం విఫలం అయి హైదరాబాద్ శాశ్వతంగా వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు అదే హైదరాబాద్లో అంతకు వెయ్యిరెట్లు ప్రమాదకరమయిన ఒక క్రీడలో అదే పద్ధతిలో దొరికిపోయేట్టున్నారు. ఎన్నికలలో గెలవడం కోసం ఇన్నాళ్ళూ అవలంబిస్తున్న పద్ధ్దతులు ఈసారి ఫలితం ఇచ్చేట్టు లేవని అర్థమయి ఈ కొత్త క్రీడకు శ్రీకారం చుట్టారు. మూడున్నర కోట్ల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల వ్యక్తిగత వివరాలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర ఉన్న విషయాన్ని సామాజిక కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ పౌరుడు లోకేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. హైదరాబాద్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా ఆ కంపెనీలో జరిపిన సోదాల్లో అందరూ నిర్ఘాంత పోయే వివరాలు బయటపడ్డాయి. ప్రభుత్వం దగ్గర సురక్షితంగా ఉండాల్సిన పౌరుల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే ఏపీ ప్రభుత్వం వెంటనే కదిలి ఇదెలా జరిగిందో విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలకు పూనుకోవాల్సిందిపోయి నా డేటా నాకు పంపాలి కానీ మీరు కేసులు ఎట్లా పెడతారు అని తెలంగాణ పోలీసుల మీద, ప్రభుత్వం మీద బాబు రంకెలేస్తున్నారు. పౌరుల వ్యక్తిగత వివరాలు ప్రభుత్వం లోని ఎవరో ఒకరు ఇవ్వకపోతే ఐటీ గ్రిడ్కు ఎట్లా అందాయి? ఎట్లా అందాయో తెలియాలంటే ఐటీ గ్రిడ్ యజమానిని ప్రశ్నించాలి. ఆయన పారిపోయి ఏపీలో ప్రభుత్వ ఆశ్రయంలో ఉన్నాడు. ఆయనకు పూర్తి రక్షణ అక్కడి ప్రభుత్వమే కల్పిస్తున్నది అంటే అర్థం ఏమిటి? నిందితుడిని విచారించి నిజాలు బయటపెట్టాల్సిన ప్రభుత్వం అతడికి రక్షణ ఇచ్చి, నేరాన్ని బయటపెట్టిన బాధ్యతగల పౌరుడు లోకేశ్వర్ రెడ్డిని దారినబోయే దానయ్య అని చులకనగా మాట్లాడి ఆయనను హైదరాబాద్ నుంచి ఎత్తుకుపోయే ప్రయత్నం చెయ్యడంలో అర్థం ఏమిటి? ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, ప్రభుత్వమే రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను ఒక ఐటీ కంపెనీకి ఇచ్చి తన పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే యాప్ ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలోని తన పార్టీ కార్యకర్తలకు అందచేసే ఏర్పాటు చేసింది. సీఎంగా తన దృష్టికి వచ్చే విషయాలను అవసరమయిన మేరకు తప్ప ఎక్కడా వెల్లడించనని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన బాబు ప్రభుత్వం నుంచి టీడీపీ ప్రయోజనాల కోసం ఈ వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోవడమంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టే. ఈ వివరాల సహాయంతో ఎన్నెన్ని అక్రమాలకూ పాల్పడతారో ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో బాటు ఐటీ రంగ నిపుణులూ, మేధావులూ వివరంగా చెపుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక్క మాట చెప్పాలి. టీడీపీ ప్రభుత్వ ఘాతుక చర్య కారణంగా మీ ఎవ్వరి వ్యక్తిగత జీవితాలూ భద్రంగా మాత్రం లేవు అని. ఈ వ్యవహా రాన్ని పోలీసులు, న్యాయస్థానాలు తేలుస్తాయి అని రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇది ఓట్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏపీలోని చివరి ఓటు వరకూ భద్రం అని తేలేదాకా, మొత్తం ఓటర్ల జాబితా నూటికి నూరు శాతం సరిగ్గా ఉందని నిర్ధారణ జరిగాకనే అక్కడ ఎన్నికలు జరపాలి. అవీ స్వతంత్రంగా జరపాలి. తీగ అయితే లాగారు డొంక కదులుతుందా లేదా చూడాలి. వ్యాసకర్త: దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
నిజాలను దాచేసే సినిమాలెందుకు?
ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఏ నాటికయినా ఇబ్బంది రాకుండా ఉండటానికే బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలలో ఎన్టీఆర్ ఇమేజ్ అవసరం కాబట్టి బావమరిది చేత రెండు సినిమాలు తీయించ బూనుకున్నారు. బాలకృష్ణ తన తండ్రి ప్రజాజీవిత వ్యక్తిత్వాన్ని నిజాయితీగా చిత్రీకరిస్తే చంద్రబాబును విలన్గా చూపిం చాలి. ఎన్టీఆర్ చివరి శ్వాస వరకూ జరిగిన ఘటనలను మహానాయకుడు చిత్రీకరిస్తే మాత్రం చంద్రబాబు పాత్రలో వక్రీకరణలు తప్పవు. ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో వక్రీకరణలకు ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాం గోపాల్ వర్మ నిర్మించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏమన్నా సమాధానం చెబుతుందేమో చూడాలి. వి డోంట్ నీడ్ ఎన్టీఆర్ (మాకు ఎన్టీఆర్ అవసరం లేదు) అని ఎన్టీరామారావు నుంచి అధికారం లాక్కున్న కొద్ది రోజులకే ఒక స్థానిక ఆంగ్ల దిన పత్రికకు చంద్రబాబు నాయుడు ఇంటర్వూ్య ఇచ్చిన సమయానికి నందమూరి బాలకృష్ణ ఆయనతోనే ఉన్నాడు. బాలకృష్ణ, హరికృష్ణ మొదలయిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఆ సమయంలో చంద్రబాబు వెంటనే ఉన్నారు. ఎన్టీ రామారావును దుర్మార్గంగా పదవీచ్యుతుడిని చేసిన తరువాత సచివాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో గోడలకు ఉన్న ఫొటోలను తీసి మరుగు దొడ్ల పక్కన పడేస్తే మీడియా వాళ్ళు ఫొటోలు తీసి ప్రచురించిన విషయం ప్రపంచానికి తెలుసు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన రసీదు పుస్తకాల మీద పార్టీ ఆవిర్భావం నుంచీ ప్రచురిస్తూ వచ్చిన ఎన్టీఆర్ బొమ్మను తొలగించేసిన చంద్రబాబు తరువాత హరికృష్ణ అలగడంతో తిరిగి ఆ రసీదు పుస్తకాలను మార్చి ఎన్టీఆర్ బొమ్మ ముద్రించిన విషయమూ తెలుసు. ఇప్పుడు ఎన్టీరామారావు స్థాపించిన పార్టీ అని, ఆయన విగ్రహాలకు దండలు వేసినంత మాత్రాన ఆయన మీద చెప్పులు వేయించిన విషయం ఎవరూ మరిచిపోరు. ఎన్నికలలో గెలుపు కోసం ఎన్టీఆర్ భజన తప్ప ఈ బృందం ఆయనను నిజాయితీగా గౌరవించింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి కాబట్టి ఎన్టీఆర్ స్తోత్ర పారాయణంలో స్వరం పెంచారు చంద్రబాబు. ప్రపంచంలో ప్రతి విషయాన్ని పదవి కోణంలో నుండి చూడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ అయిదేళ్ళ కాలంలో చంద్రబాబు పరిపాలనను చూసిన జనం మార్పు కోరుతున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి ఎన్టీఆర్ను ఎన్నికలలో లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం సినిమాల రూపంలో మొదలుపెట్టారు చంద్రబాబు. బాలకృష్ణ తన తండ్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కిస్తుంటే చంద్ర బాబును ఎందుకు మధ్యలోకి తేవడం అని ఎవరయినా అనుకోవొచ్చు. చంద్రబాబు అన్నీ అట్లాగే చేస్తారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఏ నాటికయినా ఇబ్బంది రాకుండా ఉండటానికే బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలలో ఎన్టీఆర్ ఇమేజ్ అవసరం కాబట్టి బావమరిది చేత రెండు సినిమాలు తీయించ బూనుకున్నారు. మొదటిది ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదల అయింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ నట జీవితం చివరన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించే వరకే చూపించారు. ఎన్టీఆర్ రాజకీయాలు, ఎన్నికలు, అధికారంలోకి రావడం ఇట్లాంటివన్నీ ఉండే రెండో భాగం ఎన్టీఆర్ మహా నాయకుడు ఎల్లుండి విడుదల కాబోతున్నది. మొదటి భాగం కథానాయకుడును జనం పెద్దగా ఆదరించలేదు. ఈ రెండో భాగం ఎట్లా ఉండబోతున్నది అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది. దాని గురించి పెద్దగా ఆలోచించడానికి ఏముంది? ఎన్టీరామారావు రాజకీయాల్లో నిలబడటానికి, కొనసాగడానికీ విజయాలు సాధించడానికీ బాబు నిర్వహించిన గొప్ప పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఎన్టీరామారావు కథానాయకుడిగా తీసిన మొదటి భాగం పెద్ద ఇబ్బందికరమైందేమీ కాదు. రెండవ భాగం అట్లా కాదు రెండు ఆగస్టు సంక్షోభాలను ఇందులో తెరకెక్కించాలి. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్రావు చేసింది ఎన్టీఆర్కు వెన్నుపోటు అయితే, 1995 ఆగస్టులో బాబు చేసింది కూడా ఎన్టీఆర్కు వెన్నుపోటే కావాలి, బాబు చేసింది ప్రభుత్వాన్ని, పార్టీని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభీష్టం మేరకు జరిగినదిగా భావిస్తే 84లో నాదెండ్ల చేసిందీ అదే అనుకోవాలి, అయితే నాదెండ్ల విఫలం అయ్యారు, బాబు సఫలం అయ్యారు. ఇవన్నీ ఎట్లా చూపిస్తారు ఈ సినిమాలో, అసలు చూపిస్తారా లేదా? ఆ రెండు ఎపిసోడ్లు లేకుండా ఎన్టీఅర్ రాజ కీయ జీవితాన్ని తెరకు ఎక్కించడం ఎట్లా సాధ్యం? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులనూ, రాజ కీయ పరిశీలకులనూ వేధిస్తూ ఉండవచ్చు. ఈ మధ్యలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవి తంలోని ఒక స్వల్ప ఘట్టం, ఎంతో ముఖ్యమయిన ఘట్టం కూడా, పాదయాత్రను ఆధారం చేసుకుని తీసిన యాత్ర సినిమా అద్భుత ప్రజాదరణ పొందింది. ఈ సినిమా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి కొంత లాభం చేస్తే చెయ్యొచ్చు కానీ అందుకోసమే తీసిన సినిమా కాదు, ఎందుకంటే ఇందులో ఎన్నికలలో లబ్ధి కోసం ఉద్దేశించిన వక్రీకరణలు లేవు. అటువంటి వక్రీకరణలకు ఈ సినిమాలో అవకాశం కూడా లేదు. యాత్ర తీసిన వాళ్ళు చాలా స్పష్టంగా వైఎస్ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొం టున్న కొన్ని తీవ్ర సమస్యలకు అధికారంలోకి రాగానే కనుగొన్న పరిష్కారాలకు సంబంధించినంత వరకే పరిమితం అయ్యారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ అందులో ప్రధానమైనవి. ఈ పథకాల కారణంగా రాజశేఖరరెడ్డి పరిపాలనలో లాభపడ్డ కోట్లాది మందికి కొత్తగా చెప్పాల్సింది, మెప్పించాల్సింది ఏమీ లేదు. ఇంకెవరికో రాజకీయ లబ్ధి చేకూరేందుకు కాకుండా ప్రజా జీవి తంలో వైఎస్ ఆర్ వ్యక్తిత్వాన్ని చిత్రీకరించడం వరకే పరిమితం అయ్యారు కాబట్టి యాత్ర సినిమా అందరినీ ఆకట్టుకున్నది. మరి ఎన్టీఆర్ రాజకీయ జీవి తాన్ని తెరకు ఎక్కించాలనుకుంటున్న బాలకృష్ణ కేవలం ఆయన ప్రజాజీవిత వ్యక్తిత్వాన్ని నిజాయితీగా చిత్రీకరిస్తారా లేక చంద్రబాబు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా తీస్తారా అన్నది చూడాలి. నిజాయితీగా తీస్తే చంద్రబాబును విలన్గా చూపించాలి. ఎందుకంటే ఎన్టీఆర్ చెప్పిన చివరి మాటలు అవే కదా. జామాతా దశమగ్రహం అన్నాడు ఎన్టీఆర్ చంద్రబాబును ఉద్దేశించి. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అతడిని నమ్మడమే అని కూడా చివరి మాటల్లో బాధపడ్డాడు ఎన్టీఆర్. పోనీ చంద్రబాబు పాత్ర లేకుండా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని సినిమాగా తీస్తారా, అదెట్లా సాధ్యం? మా నాయకురాలు కోరితే మామ మీద అయినా పోటీ చేస్తాను అన్న దగ్గరి నుంచి వైస్రాయ్ కుట్ర దాకా చంద్రబాబు పాత్ర లేకుండా ఎన్టీఆర్ రాజకీయ సినిమా ఎట్లా తీస్తారు? చంద్రబాబు ఒక్కడే కాదు లక్ష్మీ పార్వతి లేకుండా కూడా ఈ సినిమా సంపూర్ణం కాదు. అయితే తనను గొప్ప రాజకీయ దురంధరుడిగా, లక్ష్మీపార్వతి ఒక చవకబారు స్త్రీగా చిత్రించే విధంగా గతంలో పుస్తకాలు రాయించిన చరిత్ర చంద్రబాబుది. బాలకృష్ణ తీసే సినిమాలో కూడా బావగారి రాజకీయ చతురత, పరిపాలనా సామర్థ్యం ముందు పీఠిన ఉండి మొత్తానికి ఎన్టీఆర్ వ్యక్తిత్వం మరుగున పడే ప్రమాదం ఉంది. ఎన్టీఆర్ చివరి శ్వాస వరకూ ఈ సిన్మా ఉంటే మాత్రం చంద్రబాబు పాత్రలో విపరీతమైన వక్రీకరణలు తప్పవు. ప్రజా జీవితంలో ఎన్టీఆర్ మహనీయతకు మహానాయకుడు సినిమాలో చంద్రగ్రహణం తప్పదు. నా తండ్రి వంగవీటి రంగాను హత్య చేయించింది తెలుగుదేశంవారు కాదు అని ఆయన కుమారుడు రాధా చేత చెప్పించి రాజకీయ నడివీధిలో అతడిని వదిలేయగలిగిన తెలివితేటలూ చంద్రబాబువి. అటువంటి చంద్రబాబు బాలకృష్ణ చేత ఈ సినిమాలో మా బావ బంగారం అనిపించకుండా ఉంటాడని ఎట్లా అనుకుందాం. ఎన్టీఆర్ మరణించిన 23 ఏళ్ళ తరువాత ఇప్పుడెందుకు ఆయన జీవితాన్ని తెరకెక్కించాలని అని పించింది అంటే రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి కోసమే అనడంలో సందేహం లేదు. మరి రాజశేఖరరెడ్డి మీద సినిమా ఆయన మరణించిన పదేళ్లకు ఎందుకు తీయాల్సి వొచ్చింది అన్న ప్రశ్న కూడా చంద్రబాబు అభిమానులు అడగొచ్చు. రాజశేఖర్ రెడ్డి సినిమా తీసింది ఆయన కొడుకు కాదు, రాజకీయాల్లో కూడా లేడు. ఎన్టీఆర్ సినిమా తీస్తున్నది ఆయన కుమారుడు, రాజకీయంగా తన బావకు, తద్వారా తన అల్లుడికి లాభం చెయ్యాలని అనుకుంటున్న వ్యక్తి. బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో వక్రీకరణలకు ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాం గోపాల్ వర్మ నిర్మించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏమన్నా సమాధానం చెబుతుందేమో చూడాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనగానే ఇది లక్ష్మీ పార్వతికి అనుకూలంగా ఉంటుందనే భావన వెంటనే కలుగుతుంది, 1989లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం ఘోర పరాజయం నుండి ఆయన తుది శ్వాస దాకా ఉండే ఈ సినిమాలో అయినా లక్ష్మీపార్వతి పాత్రకు న్యాయం జరుగుతుందేమో చూడాలి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
రక్షకుల ముసుగులో భక్షకులు
ఏకంగా మూడు రాష్ట్రాల్లో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలను ఘోరంగా మోసం చేసిన శారదా స్కాంలో దర్యాప్తును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్షకు దిగడం విడ్డూరం. కోల్కతా పోలీసు కమిషనర్ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వచ్చారు. అయినా వారికి అడ్డుపడి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ఆదాయపన్ను అధికారులకు రక్షణ కల్పించవలసిన పోలీసుల సహాయాన్ని ఉపసంహరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు ఎగవేసే బడా వ్యాపారులకు కొమ్ము కాసింది. మమత, చంద్రబాబులు తమనూ, తమ వారినీ రక్షించుకునేందుకు వ్యవస్థల రక్షకులం అనే ముసుగులు ధరిస్తారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అజోయ్ ముఖర్జీ తన రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోవడం పట్ల నిరసనగా ఒక రోజు సత్యాగ్రహం చేశాడట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆయన రెండుసార్లు ముఖ్య మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ వీడి బాంగ్ల కాంగ్రెస్ స్థాపించాక ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో బాంగ్ల కాంగ్రెస్తో బాటు మార్క్సిస్ట్ పార్టీ కూడా భాగ స్వామి. ఆ ప్రభుత్వంలో సీపీఎం నాయకుడు జ్యోతిబసు హోంమంత్రి. తన ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపడానికి ఆనాడు అజోయ్ ముఖర్జీ సత్యా గ్రహం చేస్తే, ఇన్నేళ్ళకు తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసం ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరయినా పడ గొట్టే ప్రయత్నం చేస్తుంటే , దాన్ని అడ్డుకునే పరిస్థితి లేక నిస్సహాయతకు గురయితే నిరసనకు దిగాలి. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం ఏదీ జరుగుతున్న దాఖలాలు లేవు. ఏకంగా మూడు రాష్ట్రాల్లో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలను ఘోరంగా మోసం చేసిన ఒక సంస్థ వ్యవహారంలో దర్యాప్తు ముందుకు సాగ కుండా అడ్డుకునేందుకు మమతా బెనర్జీ ఈ దీక్ష చేశారు. శారదా స్కాంలో పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్కు చెందిన నాయకుల హస్తం ఉన్నదన్న ఆరోపణల మీద అరెస్ట్లు కూడా జరిగాయి గతంలో. ఈ కుంభకోణాలపైన దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు కోల్కతా నగర పోలీసు కమిషనర్ను విచా రించడానికి వెళితే, స్థానిక పోలీసులు ఎదురు తిరిగి వారిని అడ్డుకోవడమే కాదు ఏకంగా ముఖ్యమంత్రి బయలుదేరి ఆ పోలీసు కమిషనర్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి సీబీఐ చర్యకు నిరసనగా తాను ధర్నాకు పూనుకున్నారు. ఇంతకంటే విడ్డూరం బహుశా ఇంకోటి ఉండదేమో. ఒక అధికారి మీద ఆరోపణలు వస్తే దాని మీద విచారణకు అంతకంటే పైస్థాయి సంస్థ దర్యాప్తు చేస్తుంటే చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వవలసిన ముఖ్యమంత్రే అడ్డుపడటం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగడం అజోయ్ ముఖర్జీ కాలానికీ, మమతా బెనర్జీ కాలానికీ మారిపోయిన రాజకీయ విలువలకు–మారిపోయిన అనడం కంటే దిగజారిపోయిన అంటే బాగుంటుంది–అద్దం పడుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లో కేసులు దర్యాప్తు చెయ్యాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిందే, అందులో ఎటువంటి వివాదమూ లేదు. అయితే కోర్టులు ఆదేశించినప్పుడు ఆ నిబంధన వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక అనుమతి అప్పుడు అవసరం ఉండదు. ఇక్కడ మొన్న కోల్కతా పోలీసు కమిషనర్ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు సుప్రీం కోర్టు ఆదేశాలమేరకే వచ్చారు. అయినా మమతా బెనర్జీ ప్రభుత్వం వారికి అడ్డుపడి కోర్టు ధిక్కారానికి పాల్పడటమేకాక దీక్షలకు దిగడం విచిత్రం. మళ్ళీ సుప్రీంకోర్టే కోల్కతా పోలీసు కమిషనర్ సీబీఐ అధికారుల ముందు హాజరై కేసు దర్యాప్తునకు సహకరించవలసిందేనని చెప్పాల్సి వచ్చింది. ఒక కేసు దర్యాప్తులో ఒక అధికారిని రక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రే నడుం బిగించడం, అదీ కొన్ని లక్షల కుటుంబాలను నాశనం చేసిన ఒక దుర్మార్గమైన కేసులో కావడం వెనక ఉన్న ప్రయోజనం ఏమిటో సామాన్యులకు కూడా అర్థం అవు తుంది. కోల్కతా పోలీసు కమిషనర్ను విచారించడానికి సీబీఐ ఎంచుకున్న సమయం కేంద్ర ప్రభుత్వం మీద లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ మీద అనుమానాలకు తావు ఇస్తున్నది. రెండు మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం, ఎన్డీఏకు ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రతిపక్ష ఫ్రంట్ ఒకటి ఏర్పడటం, ఆ ఫ్రంట్ గత వారమే కోల్కతాలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించడం కూడా ఈ అనుమానాలకు ఊతం ఇస్తున్నది. ఒకప్పుడు మమతా బెనర్జీ బీజేపీకి మిత్రురాలే. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కూడా. ఆమెలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న మొన్నటి దాకా ఎన్డీఏలో భాగస్వామే. బీజేపీకి మంచి మిత్రుడే. రాజకీయంగా తెగతెంపులు చేసుకున్నాక ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సీబీఐ ప్రవేశానికి అనుమతిని రద్దు చేసింది, చంద్రబాబు అడుగుజాడల్లో నడిచి మమతా బెనర్జీ బెంగాల్లో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా సీబీఐ ప్రవేశించనే లేదు, ఆదాయ పన్ను అధికారులు కొన్ని వ్యాపార సంస్థల మీదా సంపన్నుల మీద దాడులు చేస్తేనే సహించలేని చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించిందో చూశాం. ఆదాయ పన్ను అధికారులకు రక్షణ కల్పించ వలసిన పోలీసుల సహాయాన్ని ఉపసంహరించుకుని ఏపీ ప్రభుత్వం పన్నులు ఎగవేసే బడా వ్యాపారులకు కొమ్ము కాసింది. శారదా స్కాంలో నిందితులను రక్షించడానికి కంకణ బద్ధురాలైన మమతా బెనర్జీకి మద్దతు తెలపడానికి బాబు, కుమారుడు లోకేష్ హుటాహుటిన కలకత్తా వెళ్ళారు. పోలీసు కమిషనర్ను ప్రశ్నించడానికి వీలులేదని మమతా బెనర్జీ సీబీఐని అడ్డుకుంటే, సుప్రీంకోర్టు అలా కుదరదని విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్తే–అందులో మమత విజయం చంద్రబాబుకు ఏం కనిపించిందో? అధికారంలో ఉన్నవారు చట్టబద్ధ వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం మామూలైపోయిన మాట నిజం. ఇవ్వాళ బాబు, మమత ఏ కూటమిలో అయితే చేరారో అదే యూపీఏ అధికారంలో ఉండగా సుప్రీంకోర్టే సీబీఐ పంజరంలోని రామ చిలకగా మారిందని వ్యాఖ్యానించింది. ఎవరు అధికారంలో ఉన్నా చట్టబద్ధ వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను తమకు అనుకూలంగా, తమ వ్యతిరేకులను రాజకీయంగా వేధించడానికి ఉపయోగించుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు రావలసిందే తప్ప రాజకీయ పార్టీలు చేస్తామంటున్న, చేస్తున్న పోరాటాల్లో చిత్తశుద్ధి కనిపించదు. జాతిని రక్షిస్తాం, వ్యవస్థలను రక్షిస్తాం, అందుకే కాంగ్రెస్తో చేతులు కలుపుతున్నానని చెపుతున్న చంద్రబాబు గతంలో ఇవే వ్యవస్థలను రాజకీయ వేధింపుల కోసం కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏను అడ్డగోలుగా వాడుకున్నప్పుడు తానూ భాగస్వామి అయిన విషయం ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్న శారదా స్కాం వంటిదే ఆంధ్రప్రదేశ్లో అగ్రి గోల్డ్ కుంభకోణం. ఇంకా అనేక ఆర్థిక అవకతవకలకు సంబంధించి తెలుగు దేశం ప్రభుత్వం, దాని అధినేత, ఆయన కుమారుడూ, మంత్రులూ, నాయకులూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బహుశా కేంద్ర సంస్థల కన్ను ఈ అక్రమాల మీద పడుతుందన్న అనుమానం కలిగిందేమో కొంత కాలంగా–ముఖ్యంగా బీజేపీతో తెగతెంపులు అయిన దగ్గరి నుండీ– బాబు ప్రజలను తనకు రక్షణగా ఉండాలని పదేపదే కోరుతున్నారు. నిన్నగాక మొన్న శాసన సభలో కూడా నన్ను జైలులో పెడతారా అని గొంతు చించుకుని మాట్లాడారు. ఏ తప్పూ జరగకపోతే జైలులో పెడతారేమో అన్న అనుమానం ఎందుకు కలుగుతున్నది ఏపీ ముఖ్యమంత్రికి? నిజానికి దీక్షలు చెయ్యడంలో మమతకి బాబే ఆదర్శం. నాలుగేళ్ళు ప్రత్యేక ప్యాకేజీ పాటపాడి, తప్పనిసరి పరిస్థితుల్లో మాట మార్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నాక ఆయన రోజుకో దీక్ష చేస్తున్నారు. చిత్రం ఏమిటంటే ఆ దీక్షలన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే. అన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీని కాపీ కొట్టినట్టుగానే మొన్న అసెంబ్లీలో కూడా నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపే కార్యక్రమం చేశారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శాసన సభలో నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపితే, శాసన సభను అపవిత్రం చేస్తారా అన్న చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అదే ప్రతిపక్షం నిరసనను కాపీ కొట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసుకోనిచ్చే పరిస్థితులు ఇవాళ కనపడటం లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని మమత, చంద్రబాబులు తమనూ, తమ వారినీ రక్షించుకునేం దుకు వ్యవస్థల రక్షకులం అనే ముసుగులు ధరిస్తారు. ఈ ముసుగులను తొలగించి వారివారి నిజ స్వరూపాలు బయటపెట్టే పని ప్రజలే చెయ్యాలి. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘రామ్రహీమ్ను దోషిగా తేల్చడాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రాంచందర్ చత్తర్పతి హత్య కేసులో డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మిత్ రామ్రహీమ్ను దోషిగా తేల్చడాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ప్రధాన కార్యదర్శి సబీనా ఇందర్జిత్ స్వాగతించారు. బాధిత జర్నలిస్టు కుటుంబంతో పాటు, యావత్ జర్నలిస్ట్ సమాజానికి న్యాయం దక్కిందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2002 మేలో డేరా సచ్చాసౌదాలో సాధ్వీలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఓ సాధ్వి ఇచ్చిన ఫిర్యాదును తాను నిర్వహించే ‘పూచ్ సచ్’అనే పత్రికలో చత్తర్పతి ప్రచురించారని తెలిపారు. 2002 అక్టోబర్ 24న చత్తర్పతి ఆయన నివాసంలోనే హత్యకు గురైన కేసును 2003లో రిజిష్టర్ చేయగా 2006లో సీబీఐకు అప్పగించారన్నారు. పన్నెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సీబీఐ కోర్టు రామ్రహీమ్తో పాటు, మరో ముగ్గురిని దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో రామ్రహీమ్కు కఠినశిక్ష విధించాలన్న చత్తర్పతి కుమారుడు అన్షూ్షల్ డిమాండ్కు ఐజేయూ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. -
చంద్రులిద్దరూ దొందూ దొందే
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలు చంద్రశేఖర్రావు , చంద్రబాబునాయుడు ఇద్దరికీ ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం విశ్వాసం కానీ, గౌరవం కానీ లేవు. చంద్రశేఖర్రావు అయినా చంద్రబాబునాయుడు అయినా వోట్లేసి గెలిపించిన ప్రజలకు తాము జవాబుదారీ కాదు అనుకుంటారు కదా. కాంగ్రెస్ వ్యతిరేక ప్రయోజనాలు కేసీఆర్వి అయితే, బీజేపీ వ్యతిరేక ప్రయోజనాలు చంద్రబాబువి. ఈయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్నా,ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని బలోపేతం చేస్తానన్నా ఇద్దరూ ఆశిస్తున్న ఫలితం ఒక్కటే. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆ రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం సం బంధంలేని ఒక రాజకీయ యుద్ధం జోరుగా సాగుతున్నది. ఇటీవలే ముగిసిన తెలంగాణ శాసన సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ యుద్ధం మరింత తీవ్రం అయింది. ఈ రెండు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధాన్ని రెండు జాతీయ రాజకీయ పార్టీలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. కొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల మీద ఈ రెండు ప్రాంతీయ పార్టీల అధినేతల రాజకీయ యుద్ధం ప్రభావం ఆ రెండు జాతీయ పార్టీల జయాపజయాల మీద కొద్దో గొప్పో ఉండకపోదు కాబట్టే వాటికి ఈ ఆసక్తి. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలు చంద్రశేఖర్రావు , చంద్రబాబు నాయుడు ఇద్దరికీ ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం విశ్వాసం కానీ, గౌరవం కానీ లేవు. తెలంగాణ సాధన కోసం పద్నాలుగేళ్ళు సాగిన మలి విడత ఉద్యమ కాలంలో కానీ, తత్ఫలితంగా సాకారం అయిన తెలంగాణా రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా నాలుగున్నర ఏళ్ళు పరిపాలన సాగించిన కాలంలో కానీ చంద్రశేఖర్ రావు ఆ విషయాన్ని అనేక మార్లు రుజువు చేసుకున్నారు. మళ్ళీ మంచి ఆధిక్యతతో ప్రజలు అధికారం కట్టబెట్టి రెండవసారి ముఖ్యమంత్రిని చేశాక అయినా ఆయన కొంచెం మారుతారేమో, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారేమో అనుకున్న వారికి ఆశాభంగమే అయింది. ఈ పదవీ కాలంలో ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండబోతున్నదో ఈ మూడు వారాల కాలంలో తెలంగాణ ప్రజలకు రుచి చూపించారు. డిసెంబర్ 11 న ఎన్నికల ఫలితాలు వెలువడితే ఇవాళ జనవరి రెండవ తేదీ వరకు అంటే 21 రోజులయినా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చెయ్యలేదు. ఆయన దృష్టిలో మంత్రివర్గం ఉన్నా లేకున్నా ఒకటే. అవును మంత్రివర్గం ఉన్ననాడు కూడా నిర్ణయాలన్నీ ఆయనే చేసినప్పుడు ఇంకా మంత్రివర్గంతో పని ఏముంటుంది? తన పార్టీ తరఫున గెలిచిన 88 మంది శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉన్నా ఇద్దరు స్వతంత్ర ఎంఎల్ఏలను రెండో రోజే కండువా కప్పి పార్టీలో కలిపేసుకున్నారు. తన కుమారుడికి పార్టీ కార్యాధ్యక్ష పదవి కట్టబెట్టి రానున్న రోజుల్లో ఆయనే ముఖ్య మంత్రి, అన్ని అధికారాలూ ఆయనవే అన్న సంకేతాలు బలంగా పంపించారు. అధికార కేంద్రం ఇప్పుడు తెలంగాణ భవన్లో కేటీ రామారావు చాంబర్కు బదిలీ అయిపోయింది. మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళంతా ఆయన ఆఫీస్ ముందు క్యూ కడుతున్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఇటువంటివి సహజమే కాబట్టి అవి పార్టీ లో ప్రజాస్వామ్యయుతంగా అత్యధికుల ఆమోదంతో జరిగాయా లేదా అన్నది ఎవరూ పట్టించుకోరు. దేశమంతటా ప్రాంతీయ పార్టీలలో ఏక వ్యక్తి అధికారం చెలాయించిన చోటల్లా ఇదే పరిస్థితి ఉంటుంది. దాన్నే కేసీఆర్ కూడా ఆదర్శంగా తీసుకుంటారు. అంతేకానీ అందుకు భిన్నంగా ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలని ఎందుకు అనుకుంటారు. రాష్ట్రంలో మంత్రివర్గం ఉండదు. శాసన సభ్యులతో∙ఒక పూట అసెంబ్లీని సమావేశ పరిచి ప్రమాణం అయినా చేయిద్దామనే ఆలోచన ఉండదు. స్వతంత్ర ఎంఎల్ఏలతోబాటు, శాసన మండ లిలో కాంగ్రెస్ పక్షాన్ని నిర్వీర్యం చేస్తూ ఆ పార్టీ సభ్యులను కలుపుకుని వారికి చట్టబద్ధత కల్పిస్తారు. కానీ తమను విభేదించి బయటికివెళ్ళిన మండలి సభ్యుల మీద మాత్రం 24 గంటల్లో వేటు వేయిస్తారు. అదే శాసన మండలిలో కాంగ్రెస్ నుండి తన పార్టీలోకి కొంతకాలం క్రితం ఫిరాయించిన వారి మీద వేటు ఉండదు. ఇంకాపదిమంది దాకా కాంగ్రెస్ సభ్యులకు కండువాలు కప్పబోతున్నామని ఆయన నోటనే విన్నాం. వాళ్ళు వొస్తానంటే నేనువొద్దని ఎలా అనాలి అని ఆయనే స్వయంగా విలేకరులకు చెప్పారు. వంద స్థానాలు గెలుస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటను ఈ విధంగా నిజం చెయ్యాలన్నది తండ్రీకొడుకుల పట్టుదల అని అర్థం అవుతూనే ఉంది. ఒక పార్టీ పేరు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళుతున్న వాళ్ళు సిగ్గుపడనప్పుడు చేర్చుకునే వాళ్ళెందుకు సిగ్గు పడాలి? అని కదా ఇవాళ దేశమంతటా రాజకీయ పార్టీలు చెపుతున్నది. అదే కేసీఆర్ కూడా పాటిస్తున్నారు. ప్రతిపక్షం నుండి 23 మంది శాసన సభ్యులను కొనుగోలు చేసి కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్ర బాబు మొన్నటికి మొన్న తెలంగాణా ప్రచారంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో టీఆర్ఎస్ మీద విరుచుకుపడిన విడ్డూ రంచూసాం కదా. నాలుగైదు మాసాల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల దాకా తెలంగాణాలో ఇదే పరి స్థితి కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు. ముఖ్య మంత్రే చెప్పారు. తన పరిపాలనా పద్ధ తికి ప్రజలు ఆమోదం తెలిపారనడానికి నిదర్శనమే మొన్నటి ఫలితాలు అని. సచివాలయానికి వెళ్ళవలసిన పని లేదని ప్రజలే అంగీకరించారు కదా అని చెప్పేశారు ఆయన. ఆయనను ఎదిరించే సాహసం ఆ పార్టీలో ఎవరూ చెయ్యలేరు. మంత్రివర్గం లేకుండా ప్రగతి భవన్ దర్బార్లో ఆయన నిర్వహిస్తున్న సమీక్షల తీరు చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులకే నోరు లేనప్పుడు అధికారులు మాత్రం ఏం మాట్లాడుతారు? ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటి పారుదల ప్రాజెక్ట్ల పురో గతి సమీక్షలో నాలుగున్నర సంవత్సరాలు నిద్రాహారాలు మాని ప్రాజెక్ట్ సైట్ల దగ్గర గడిపిన అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఉండడు,వాటితో ఏ సంబంధం లేని ఇతర ప్రజాప్రతినిధులు ఉంటారు. ఎన్నికల ప్రచార సభల్లో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ చేసిన కృషిని ఆకాశానికి ఎత్తిన కేసీఆర్కు మళ్ళీ గెలిచాక సమీక్షల్లో ఆయన కూడా ఉండాలని అనిపించదు, పైగా పనిలో జాప్యం జరుగుతున్నదని అధికారులను మందలించడం దేనికి సంకేతం?హరీశ్ రావును వేనోళ్ళ పొగిడిన నోటనే ఆయన అధ్వర్యంలో పనిసరిగా జరగలేదని చెప్పడమా! ప్రాజెక్ట్ల సందర్శనకు కూడా బయలుదేరారు ఆయన. తన కుమారుడి ప్రాముఖ్యత పెంచే క్రమంలో హరీష్ సమర్ధతను తగ్గించి చూపే ప్రయ త్నం కావొచ్చు, అది వారి రాజకీయ విజ్ఞతకే వొదిలేద్దాం. కానీ ఈ వ్యవహారం అంతా అప్రజాస్వామికంగా ఉంది అని చెప్పేదెవరు ఆయనకు. మాట్లాడితే మీడియా మీద విరుచుకు పడుతున్నారాయే. మొన్నటి పత్రికా గోష్టిలో ఆయన ఇంకోమాట కూడా చెప్పారు. దాన్నిబట్టి రేపటి నుండి పత్రికల్లో,టీవీ లలో ఎటువంటి వార్తలు రాయాలో,చూపాలో కూడా ఆయనే నిర్ణయిస్తారు. ప్రముఖ విద్యావేత్త, మేథావి చుక్కా రామయ్య చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి అయిన మౌన సంస్కృతి రాజ్యం ఏలుతున్న కారణంగానే పాలకులు ఇట్లా వ్యవహరించగలుగుతున్నారు. కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా వోట్లేసి గెలిపించిన ప్రజలకు తాము జవాబుదారీ కాదు అనుకుంటారు కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కూడా గడ్డు కాలం నడుస్తున్నది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు వెయ్యి కోట్లకు పైగా పేరుకు పోయాయి. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం ఎందుకు చెయ్యడం లేదు ఆరోగ్యశ్రీ ప«థకం కింద? సామాన్యుడి అవసరాలు తీరనప్పుడు పాలకులు చెప్పే వృద్ధిరేటుల ఊసెవరికి కావాలి? రాష్ట్రం మీద నుండి దృష్టి మళ్ళించడానికే ఆయన ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలు అని అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఆయనకు ఏనాడయినా కాంగ్రెస్తోనే సమస్య. అందుకే ఆయన కాంగ్రెస్ ఉండే ఫ్రంట్ను వ్యతిరేకిస్తారు. బీజేపీని కూడా విమర్శిస్తున్నాం, ఆ పార్టీ ఉండే ఫ్రంట్లో కూడా చేరబోము అన్న మాటలు ఇప్పటి వరకే. లోక్సభ ఎన్నికల తరువాత అది బహిరంగ రహస్యమే అవుతుంది. అప్పటి రాజకీయ అవసరాలు అని సమర్థించుకోవొచ్చు. 2009లో ఎన్నికల ఫలి తాలు వెలువడక ముందే లుధియానా వెళ్లి అడ్వాణీ ప్రచార సభ వేదిక ఎక్కి కూర్చున్నది కేసీఆరే కదా. ఇక తెలంగాణ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుకు గత నాలుగున్నర సంవత్సరాల్లో ఆ రాష్ట్రాన్ని భయంకరమయిన అప్పుల్లో ముంచేసి అస్తవ్యస్తం చేసిన పరిస్థితి నుండి జనం దృష్టి మళ్ళించడానికి, రోజురోజుకూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి,ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయ కుడు జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మందిలో పెరిగిపోతున్న అభిమానం నుండి దృష్టి మళ్ళించడానికి మార్గం కావాలి. కేంద్ర ప్రభుత్వ అధినేత మోదీ, కేసీఆర్ను జగన్కు జత కట్టేసి లబ్ధి పొందాలన్న దుగ్ధ ఆయనది. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేస్తానని బయలుదేరిన చంద్రబాబు రెండు ప్రయోజనాలు ఆశించారు. ఒకటి ముందే చెప్పుకున్నట్టు రాష్ట్ర సమస్యల నుండి, తన అస్తవ్యస్త, అవినీతిమయ పాలన నుండి ప్రజల దృష్టి మళ్ళించడం, రెండవది బీజేపీ నుండి తన మీదకు దూసుకు వొచ్చి పడుతుందని ఊహిస్తున్న ప్రమాదాల నుండి రక్షణ పొందడం. అయితే ఆ ప్రయత్నం పెద్దగా ఫలించకపోవడంతో ఇప్పుడు మోదీ, కేసీఆర్, జగన్ కలయిక అనే కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. ఒకే అసత్యాన్ని పదేపదే చెపితే జనం నమ్మేస్తారు అన్న గోబెల్ పక్కా వారసుడు ఆయన. ఆ అసత్యాన్ని అంతే స్థాయిలో అన్నిసార్లూ ప్రచారం చెయ్యడానికి ఆయన చేతిలో మీడియా ఉండనే ఉంది. కాంగ్రెస్ వ్యతిరేక ప్రయోజనాలు కేసీఆర్వి అయితే, బీజేపీ వ్యతిరేక ప్రయోజనాలు చంద్ర బాబువి. ఈయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్నా,ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని బలో పేతం చేస్తానన్నా ఇద్దరూ ఆశిస్తున్న ఫలితం ఒక్కటే. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే కేసీఆర్కు, బీజేపీ కూటమి అధికారంలోకి వొస్తే చంద్రబాబుకు రాజకీయంగానే కాదు. ఇతరత్రా కూడా ఇబ్బందులు తప్పవు. అదీ జాతీయ రాజకీయాలపై వారు చూపు తున్న మక్కువకు అసలు కారణం.ఆ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా ఈ ఇద్దరు ప్రాంతీయ నాయకులను అందుకే అంత ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయిదు మాసాలాగితే లోక్సభ ఫలితాలు వెలువడిన 24గంటల్లో దూద్ కా దూద్ పానీ కా పానీ, అసలు రంగులన్నీ బయట పడతాయి. వ్యాసకర్త: దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
కాంగ్రెస్ భుజం మీద తుపాకీ పెట్టి..
కాంగ్రెస్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణలో టీఆర్ఎస్ను, జాతీయ స్థాయిలో బీజేపీని కాల్చేందుకు సిద్ధం అయ్యాడు చంద్రబాబు. రేపు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, నెత్తి మీద కత్తిలా వేలాడుతున్న ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందని ఆయన భయం. ప్రచారాస్త్రం కోసం వెతుక్కుంటున్న కేసీఆర్కు... బాబు కాంగ్రెస్తో కలిసి ఎన్నికల రంగంలోకి రావడం మంచి ఆయుధం దొరికినట్టు అయింది. బాబుతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ కూడా కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీడియా స్వేచ్ఛపట్ల స్పృహ అంటే ఆ మీడియా అధిపతికి బాబు, కేసీఆర్లలో ఎవరితో ఉండాలో తేల్చుకోవాల్సిన సమయం. కూట్లో రాయి ఏరలేనమ్మ ఏట్లో ఏరబోయిం దన్న సామెత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుకు సరిగ్గా సరిపోతుంది . 2014 లో అపారమైన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి తనకే అధికారం ఇవ్వాలని ఆయన కోరితే, కాబోలు అనుకుని ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆ రాష్ట్రాన్ని ఆగం ఆగం చేసిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణాను ఉద్ధరిస్తాననీ, దానితోబాటు దేశాన్నే ఉద్ధరిస్తాననీ బయలుదేరాడు. చంద్రబాబు ఎందుకు తెలంగాణలో తలదూర్చాలని అనుకుంటున్నాడు? సోనియాగాంధీ ఇటలీ దయ్యం, దేశాన్ని నాశనం చేసిందని మాట్లాడిన నోటితోనే కాంగ్రెస్ గానం ఎందుకు చేస్తున్నాడు అన్న విషయం మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఆయన చెపుతున్న ప్రజాస్వామ్య అనివార్యత దేశ ప్రయోజనాల కోసం కాదు, సొంత ప్రయోజనాల కోసం అనీ మళ్ళీ మాట్లాడితే తానూ తన పార్టీ వారు, అనుయాయులూ అవినీతి కేసుల నుండి రక్షణ పొందడానికి అని అందరికీ అర్థం అయిపోయింది. ఇప్పుడు ఆయన తెలంగాణాలో ఎందుకు తలదూర్చాడో మాట్లాడుకుందాం. కాంగ్రెస్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణలో టీఆర్ఎస్ను, జాతీయ స్థాయిలో బీజేపీని కాల్చేందుకు సిద్ధం అయ్యాడు చంద్రబాబు. తెలంగాణలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు కొనసాగడం అంటే చంద్రబాబు చిక్కుల్లో పడ్డట్టే . టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించుకుని రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇద్దరు నాయకులను అధ్యక్షులుగా నియమించుకుని తనను తాను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న చంద్రబాబు తెలంగాణ ఏర్పడిన కొత్తలో వేసిన ఒక తప్పటడుగు కారణంగా హైదరాబాద్లో పదేళ్ళు ఉండే అవకాశాన్ని వదులుకుని అమరావతికి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. ఒక్క శాసన మండలి స్థానం కోసం కక్కుర్తి పడి శాసన సభ్యులను కొనుగోలు చేసే కార్యక్రమం ఆయన చెయ్యక పోయి ఉంటె కేసీఆర్ టీడీపీని తెలంగాణలో ఖాళీ చేయించే పనికి నడుంకట్టి ఉండేవాడు కాదేమో. అది చంద్రబాబు స్వయంకృతం. రేపు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే, నెత్తి మీద కత్తిలా వేలాడుతున్న ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందని ఆయన భయం. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ కేసును నీరు కార్చేయ్యవచ్చునన్నది చంద్రబాబు ఆలోచన. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్పట్ల, ఆ పార్టీ పాలన తీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఏ పొత్తూ లేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్రావు నియంతృత్వ ధోరణి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణం అయింది. చెప్పేవి శనగలు, అమ్మేవి ఆముదాలు, కొనేటివి గోధుమలు అన్న రీతిన సాగిన ఆయన ప్రకటనలు, ప్రగతి భవన్ పేరిట నిర్మించిన గడీకి పరిమితమై ఆయన సాగించిన ‘ఎంపిక చేసిన పాలన’ (ట్ఛl్ఛఛ్టిజీఠ్ఛి జౌఠ్ఛిటn్చnఛ్ఛి) అంటే ప్రజా బాహుళ్యానికి లాభం చేసే పనులు కాకుండా తమకు లాభం చేకూర్చే పనులు మాత్రమే చెయ్యడమని ప్రజలకు అర్థమయ్యింది. ప్రజలకే కాదు, సొంత పార్టీ నాయకులకు చివరికి మంత్రులకు కూడా అందుబాటులో లేకుండా పోయిన వైనం, ఎక్కువమంది శాసన సభ్యులు మూటగట్టుకున్న అవినీతి అన్నీ కలిసి ఈసారి టీఆర్ఎస్ ఓటమి ఖాయం అన్న వాతావరణాన్ని సృష్టించాయి తెలంగాణలో. ఆయన కుటుంబ సభ్యుల వ్యవహార శైలి, ముఖ్యంగా కొడుకు కేటీ రామారావు, కూతురు కవిత వ్యవహార శైలి టీఆర్ఎస్కు తీవ్ర నష్టం చేసే విధంగా తయారయింది. పరిస్థితిని చక్కదిద్దడానికి సలహాలు ఇచ్చేందుకు నోరు విప్పి మాట్లాడే స్థితిలో పార్టీ నాయకులు లేరు. మంత్రులే ఆ సాహసం చెయ్యలేని దుస్థితి. పేరుకు ఇద్దరు ఉప ముఖ్య మంత్రులు, ఒకాయన దళితుడు, మరొకాయన మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు. ఇరువురూ శాసన మండలి సభ్యులే. వీరిలో ఒకాయన సీఎం దృష్టికి కొన్ని విషయాలు తీసుకురాదలచుకుని ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి ఎంతకూ కుదరక చివరికి ఏమైతే అది అయిందని ప్రగతి భవన్కు వెళ్ళాడట. ముందుగా అపాయింట్మెంట్ లేకుండా ఇంకొకసారి మీరు ప్రగతి భవన్కు రావద్దని పేషీలోని పీఏ స్థాయి ఉద్యోగి చెప్పి పంపేశారట. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఇది. ముఖ్యమంత్రి బహిరంగంగానే మజ్లిస్ తన మిత్ర పక్షం అని ప్రకటించినా ఆయన మత విశ్వాసాలు వ్యక్తిగతం కాకుండా అధికారికం కావడం విమర్శలకు దారి తీసింది. ప్రగతి భవన్ ప్రారంభోత్సవం నాడు చిన్న జియ్యర్ స్వామిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడం దగ్గరి నుండి మొన్న రెండు రోజులు రాజ శ్యామల యాగం చెయ్యడం దాకా ఆయన కార్యక్రమాలు వివాదాస్పదం అవుతూనే వచ్చాయి. వీటన్నిటికి కొనసాగింపుగా ఆయన గడువు కన్నా చాలా ముందు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పుకోలేని స్థితి. ఇవన్నీ టీఆర్ఎస్కు ప్రతికూల అంశాలుగా జనం నోళ్ళలో నానుతున్న సమయంలో ప్రచారాస్త్రం కోసం వెతుక్కుంటున్న కేసీఆర్కు చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి ఎన్నికల రంగంలోకి రావడం మంచి ఆయుధం దొరికినట్టు అయింది. బాబుతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ కూడా కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను ప్రజాకూటమి ఎట్లా అధిగమిస్తుందో చూడాలి. చంద్రబాబు ఆలోచన మాత్రం ఒక్కటే. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్ళీ పెత్తనం చెయ్యడానికి అవకాశం వస్తుంది. పైగా జాతీయస్థాయిలో పలుకుబడి పెరుగుతుంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దుష్పరిపాలన నుండి రాష్ట్రం, దేశం దృష్టి మళ్ళించవచ్చు. తెలంగాణలోనే కాక శాసన సభ ఎన్నికలు జరుగుతున్న మిగతా నాలుగు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్కు ఆయన పెద్ద ఎత్తున ఎన్నికల నిధులు సమకూర్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు నిధులు సమకూర్చినట్టు మోదీ అమిత్ షా దగ్గర రుజువులు ఉన్నాయట. కర్ణాటక ఎన్నికలలో కూడా ఇదే మాట విన్నాం. తెలంగాణాలో మళ్ళీ చంద్రబాబు ప్రవేశాన్ని కోరుతున్న ఆయన అనుకూల మీడియాకు హఠాత్తుగా ఒత్తిడి పెరిగిందనే విషయం గుర్తుకొచ్చింది . తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో చంద్రబాబు అండ చూసుకుని తెలంగాణ ప్రభుత్వం మీద కయ్యానికి కాలు దువ్వి, ఛానల్ ప్రసారాలు నిలిచిపోయే దాకా తెచ్చుకుని; చంద్రబాబు అమరావతికి పలాయనం చిత్తగించాక తెలంగాణ ప్రభుత్వ అధినేతతో సంధి చేసుకుని అధికార పక్షం నడుపుతున్న పత్రిక, చానల్ను కూడా మించిపోయి కేసీఆర్ మౌత్ పీస్గా మారిన ఆ మీడియా యజమానికి తెలంగాణ ఎన్నికలలోకి మళ్ళీ చంద్రబాబు ప్రవేశించే సరికి మీడియా మీద ప్రభుత్వ ఒత్తిడి హఠాత్తుగా గుర్తొచ్చింది. నాలుగున్నర సంవత్సరాలపాటు అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్కు, తెలంగాణలో కేసీఆర్ సర్కార్కు డబ్బా కొట్టిన ఈ మీడియా అధిపతికి ఇప్పుడు కేసీఆర్ కొంగర కలాన్ బహిరంగ సభ విఫలం అయిన విషయం గుర్తొచ్చింది. మిగిలిన అన్ని మీడియా సంస్థల్లాగే ఆనాడు కొంగర కలాన్ సభ అద్భుతం అని రాసిన, చూపించిన ఆయన ఇవాళ ఒత్తిడి గుర్తు చేసుకుంటున్నాడు. ఎంత విచిత్రం. ఎందుకీ హఠాత్ ఆత్మపరిశీలన, పశ్చాత్తాపం? మీడియా స్వేచ్ఛపట్ల స్పృహ అంటే ఇప్పుడిక ఆ మీడియా అధిపతికి చంద్రబాబు, చంద్రశేఖర్రావుల మధ్య ఎవరితో ఉండాలో తేల్చుకోవాల్సిన సమయం. చంద్రబాబును రక్షించుకోవాలి, ఆయనను రక్షించుకుంటేనే తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. (ఈ మధ్యనే ఒక విశ్రాంత చీఫ్ సెక్రెటరీ చెప్పారు. ఒక మీడియా సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం 700 కోట్ల రూపాయల లాభం చేసిందని), అది కొనసాగాలంటే.. చంద్రబాబును రక్షించాలంటే తెలంగాణలోప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకోవాలి. కాబట్టే ఇప్పుడు హఠాత్తుగా మీడియా మీద ఒత్తిడి గుర్తొచ్చింది. ఆ మీడియా అధిపతి మాటల్లోనే చెప్పాలంటే మీడియా తన మనుగడ, విశ్వసనీయత కోసం స్వతంత్రంగా పని చెయ్యవలసిన అవసరం ఏర్పడిందట. కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలోకి ప్రవేశించక ముందు టీఆర్ఎస్కు 80 సీట్లు తప్పకుండా వస్తాయని రాసిన అదే మీడియా అధిపతి ఇవాళ స్వరం మార్చేశాడు. మీడియా సంస్థలు రాజ కీయ పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. ఆ పని ఇష్టంతో చెయ్యడం వేరు, భయంతో చెయ్యడం వేరు అని హిత బోధ చేస్తున్న ఆ పత్రికాధిపతి నిన్నటి దాకా కేసీఆర్కు బాకా ఊది, ఇప్పుడు మీడియా స్వతంత్రత, విశ్వసనీయత గురించి లెక్చర్లు ఇస్తున్నాడు. రేపొక వేళ కేసీఆర్ కొత్త అస్త్రం చంద్రబాబు వ్యతిరేకత పనిచేసి టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఈయన మళ్ళీ ప్లేటు ఫిరాయిస్తాడా? తెలంగాణలో చంద్రబాబు, ఆయన వందిమాగధ మీడియా వ్యవహారాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ గమనించి జాగ్రత్త పడితే మంచిది. అధికార పక్షం టీఆర్ఎస్కు అటువంటి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. మీడియాను ఎన్ని కిలోమీటర్ల లోతున పాతి పెట్టాలో బాగా తెలి సిన నాయకుడు ఉన్నాడు ఆపార్టీకి. ఆయనే చూసుకుంటాడు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
జాతీయ పత్రికా దినోత్సవం- జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం
-
ఐజేయూ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దేవులపల్లి అమర్
సాక్షి, అమృత్సర్ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్ బాధ్యతలు చేపట్టారు. శని, ఆదివారాలు పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన ఐజేయూ 9వ మహాసభలో ఎస్. ఎన్ సిన్హా నుంచి అమర్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీకి చెందిన సబినా ఇంద్రజిత్ సెక్రెటరీ జనరల్గా బాధ్యతలు చేపట్టారు. జాతీయ కార్యవర్గానికి ఈరోజు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి వై. నరేందర్ రెడ్డి కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నగునూరి శేఖర్, కె.సత్యన్నారాయణ ఎన్నికయ్యారు. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా స్థానిక సంస్థలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియా స్వతంత్ర్యంగా, నిర్భయంతో పనిచేయాలన్నారు. -
‘దిగజారుడు’లో పరాకాష్ట
ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ విషయంలో మొదటి నుంచీ దిగజారుడు రాజకీయాలే నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఛీకొట్టి బయటకు వచ్చాడనే కారణంతో జగన్ మీద అక్రమ కేసులు బనాయించి పదహారు మాసాలు జైలుపాలు చేసిన నాటి నుంచి ఏపీలో ఇవే రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ ఏపీలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి కానీ, ప్రజల మనోభావాలు కానీ రెండు జాతీయ పార్టీలకు ఇంకా అర్థం కాలేదు. టీడీపీ తోక పట్టుకుని ఎలాగోలా ఎన్నికల సముద్రం ఈదాలని జాతీయ పార్టీలు భావించవచ్చు కానీ ప్రజా సంకల్పయాత్రకు పోటెత్తుతున్న ప్రజాభిప్రాయం సాక్షిగా, రహస్య స్నేహ పాచికలు ఇక పారవన్న సత్యం ఆ మూడు పార్టీలు అర్థం చేసుకుంటే మంచిది. సమకాలీన రాజకీయ పోకడలు చూస్తుంటే పదే పదే గురజాడ వారి ‘కన్యాశుల్కం’ తొలి అంకంలో మధురవాణి అన్న మాటలు గుర్తొ స్తాయి. గిరీశంతో పూర్తిగా తెగతెంపులు కాక ముందే తనను తాకచూసిన రామప్ప పంతులుతో మధురవాణి ‘‘వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారు? సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా? అయ్యా, ఇటు పయిని మీ తోవ మీది. నా తోవ నాది’’ అని అంటుంది. కొన్ని పార్టీ లను చూస్తే మధురవాణి ఎంత నీతిమంతురాలో కదా అనిపిస్తుంది. మొన్న ఒక సందర్భంలో బీజేపీకి చెందిన నాయకుడొకరు వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద నడుస్తున్న అక్రమ ఆస్తుల కేసులో ఏడేళ్ళ తరువాత ఆయన సతీమణి భారతి పేరు చేర్చే ప్రయత్నం గురించి ప్రస్తావించి ‘‘మా వాళ్లు కూడా దిగజారుడు రాజకీయాలాడటం విచారకరం’’ అని తన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీ ద్వయాన్ని ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ విషయంలో, ఆయన పార్టీ విషయంలో మొదటి నుంచీ దిగజారుడు రాజకీయాలే నడుస్తున్నాయి. కాంగ్రెస్ రాజకీయాలు నచ్చక ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి తానూ, ఎంఎల్ఏ పదవికి ఆయన తల్లీ రాజీనామా పారేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచీ చూస్తున్నాం ఈ తరహా రాజకీయా లను. కాంగ్రెస్ విధానాలతో విభేదించాడు, తన దారి తాను చూసు కున్నాడు అని ఊరుకోకుండా జగన్ మీద అక్రమ కేసులు బనాయించి పదహారు మాసాలు జైలుపాలు చేసిన నాటి నుంచి ఏపీలో ఇవే రాజకీ యాలు నడుస్తున్నాయి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ (ఆ అధి కారం కాంగ్రెస్కు జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పెట్టిన భిక్ష), ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కలిసి ఈ దిగజారుడు రాజకీయాలకు తెర లేపాయి. నాటినుంచి నేటి వరకూ టీడీపీతో కలిసి కాంగ్రెస్, ఈ నాలు గేళ్ళుగా అదే టీడీపీతో కలిసి బీజేపీ జగన్ను రాజకీయంగా పరిమార్చ డానికి ఈ రాజకీయాలు ఆడుతూనే ఉన్నాయి. వాటిని ప్రజల్లోకి తీసుకు పోయి జగన్ను, ఆయన స్థాపించిన పార్టీని అప్రతిష్టపాలు చెయ్యడానికి బాబు కనుసన్నల్లో మెలిగే మీడియా మోహరించి ఉండనే ఉన్నది. వైఎస్సార్సీపీ పెట్టినప్పటి నుంచే కుట్రలు వైఎస్ జగన్ని, ఆయన పార్టీని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నది రాజకీయ పక్షాలే అయితే అర్థం చేసుకోవచ్చు, ఏపీలోని మీడియా యాజ మాన్యం అంతా కూడా దాదాపు ఒక్కటై జగన్ను రాజకీయాల్లో లేకుండా చెయ్యాలనే కుట్ర 2011లో ఆయన కాంగ్రెస్ను వీడి వైఎస్సార్సీపీ స్థాపించినప్పుడే మొదలయింది. దేశానికి స్వతంత్రం వచ్చాక ఎన్నో పార్టీలు ఆవిర్భవించాయి, కొన్ని నిలబడ్డాయి, ఎన్నో కూలబడ్డాయి, సోదిలో లేకుండా పోయిన పార్టీలు, శక్తిచాలక వెళ్లి వేరే జాతీయ పార్టీ లతో చేతులు కలిపి పదవుల కోసం ప్రయాసపడిన పార్టీలు అనేకం చూశాం. నిజానికి అలా మఖలో పుట్టి పుబ్బలో మాయమైన పార్టీల న్నిటి నాయకులూ జగన్ కంటే వయసులోనూ, అనుభవంలోనూ చాలా పెద్దవారు. అలాకాకుండానే రాజకీయాల్లో నిలదొక్కుకుని ప్రజాదరణ పొందుతున్నాడు కాబట్టే అందరూ ఏకమై ఆయనను ఒంటరిని చేయ డానికే ఈ ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించగానే తన పదవికి రాజీనామా చేసి కడప నుంచి లోక్çసభకు మళ్లీ పోటీకి దిగిన నాడే బాబు జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాడని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసి బోర్లా పడ్డారు. 5.45,672 ఓట్ల మెజారిటీతో గెలిపించారు ప్రజలు జగన్ను ఆనాడు. ఇంత చేస్తే బీజేపీతో తన పాత స్నేహాన్ని తిరిగి పునరుద్ధరించుకున్నది బాబే. రాజకీయాల్లో రహస్య స్నేహాలు చెయ్యడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్న రోజుల్లో తనపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల విషయంలో అర్ధరాత్రి ఆనాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం శరణుజొచ్చిన విషయం అందరికీ తెలుసు. ఆ మాట చిదంబరమే స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత జగన్పై కేసులు పెట్టించడం, కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని అవిశ్వాసం నుంచి గట్టెక్కించడానికి ఉమ్మడి అసెంబ్లీలో బల పరీక్ష సందర్భంగా టీడీపీని గైర్హాజరు పరచడం నుంచి మొదలై నిన్న కాక మొన్న రాజ్యసభలో పీఏసీ సభ్యుడిగా తన సభ్యుడు íసీఎం రమేష్ గెలుపు కోసం కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం, అదే సభలో డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వెయ్యడం దాకా కాంగ్రెస్తో చంద్రబాబు దోస్తీ కొనసా గుతూనే ఉంది. ఇప్పటికైతే చెప్పలేదుగాని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాయంతో గట్టెక్కాలన్నదే బాబు ఆలోచన. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఏనాడూ ఒంటరిగా పోటీ చేసి గెలిచిన సందర్భాలు లేవు. 1983, 85, 94 ఎన్నికల్లో ఎన్టీఆర్ కారణంగా గెలిచిన టీడీపీ బాబు చేతుల్లోకి వచ్చాక 1999లో ఏబీ వాజ్పేయి, 2014లో మోదీ ప్రభంజనాల్లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లి గెలిచింది. 2019 ఎన్నికల్లో కూడా ఒంటరి పోరుతో గెలవలేమన్న విషయం బాబుకు బాగా తెలుసు. ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్లే పరిస్థితి లేదు. కాంగ్రెస్తో చేతులు కలపడానికి బాబు సిద్ధం కాబట్టి కాంగ్రెస్తో చేతులు కలిపైనా సరే ఎన్నికల్లో గెలవాలన్నది ఆయన అశ. మంగళవారం ఉదయం హైదరాబాద్లో మీడియాతో ఇష్టా గోష్టి జరిపిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీతో పొత్తు అవకాశాలను ఖండించ లేదు సరికదా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల నిర్ణయానికి వదిలేస్తామన్నారు. ఏపీలో ఈ మధ్యనే బాబు మిత్రుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి కాంగ్రెస్ తెచ్చుకున్నది బాబు సూచన మేరకే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పోకడలు చిత్రంగా ఉంటాయి. పార్టీకి విధేయుడై ఉండి రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన రాజ శేఖరరెడ్డి మరణిస్తే ఆ విషాదాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదా ర్చబోయిన జగన్ బయటికి పోయేదాకా పొగ పెడతారు, లాస్ట్ బాల్ ఇంకా ఉంది అని చివరి దాకా చెప్పి పార్టీని సోదిలోకి లేకుండా చేసి పోయిన కిరణ్ను మళ్లీ తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. కాంగ్రెస్కు ఇప్పుడు ఏపీలో స్వశక్తి మీద నాలుగు సీట్లయినా తెచ్చుకునే స్థితి లేదు. ఆ మాట రాహుల్ మీడియా ఇష్టాగోష్టిలో ఒప్పుకున్నారు. మరి ఇటలీ మాఫియా, సోనియా దయ్యం అని దూషించిన బాబుతో దోస్తీ ఎందుకు అంటే జగ న్ను రాజకీయంగా తుదముట్టించడానికే. ఏపీలో ఇవ్వాళ కాంగ్రెస్కు మరొక ఎజెండా లేదు. అయితే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలపై నేడు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబుపై చావని బీజేపీ ఆశలు? నలభై ఏళ్ల అనుభవం అని ఊదరగొట్టి నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ను నాలుగు వందల సంవత్సరాల వెనక్కు తీసుకుపోయిన చంద్రబాబు నిర్వాకమూ తెలుసు. కాంగ్రెస్ సరే. మరి బీజేపీ ఎందుకు తమ సహాయం తీసుకుని ఎన్నికల్లో గెలిచి, నాలుగేళ్లు కలిసి నడిచి గెలుపు రాజకీయాల ఎత్తుగడలో భాగంగా తెగతెంపులు చేసుకున్న తెలుగుదేశా నికే సాయం చేయాలనుకుంటోంది? జగన్మోహన్రెడ్డికి సంబంధించిన కేసుల్లో భారతిని కూడా నిందితురాలిగా చేర్చడం ద్వారా చంద్రబాబుకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నది బీజేపీ అన్నది నిర్వివాదాంశం. ‘బాబూ, ఇంకా మా తలుపులు తెరిచే ఉన్నాయి నీకోసం, జగన్ కేసుల విచారణను వేగిరపరిచి ఆయనను మళ్లీ జైలుకు పంపాలని, ఆయన బయట ఉంటే తట్టుకోలేనని నువ్వు ఎన్నోసార్లు అడిగావు, ఇదిగో ఆయన సతీమణిని కూడా ఈ కేసులో ఇరికించాం,’ అని ఈ చర్య ద్వారా బీజేపీ చెప్పకనే చెప్పింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మళ్లీ బాబు అవసరం వస్తుందేమోనన్న భయంతోనే మోదీ, అమిత్ షాలు తమ తలుపులు చంద్రబాబు కోసం తెరిచి ఉంచారు. బాబు, మోదీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతూనే ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? లేకపోతే బీజేపీ నాయకులే స్వయంగా చెబుతున్న లెక్కల ప్రకారం వేలాది కోట్ల అవినీతి చంద్రబాబు ప్రభుత్వంలో జరిగితే జీవీఎల్ నరసింహారావు అనే ఎంపీతో టీవీ చర్చల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఆయన అవినీతిని దుయ్యబట్టించారే తప్ప ఏ చర్యలూ ఎందుకు ఉండవు? భారతి పేరు నిందితుల జాబితాలో చేర్చే ఆసక్తీ, ఉత్సాహం చంద్రబాబు అవినీతి విషయంలో ఏమైనట్టు? ఆంధ్రప్రదే శ్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితి కానీ, ప్రజల మనోభావాలు కానీ రెండు జాతీయ పార్టీలకు ఇంకా అర్థం కాలేదు. అవినీతిలో నిండా మునిగిన తెలుగుదేశం తోక పట్టుకుని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నికల సముద్రం ఈదాలనుకుంటున్న రెండు జాతీయ పార్టీలను ప్రజలు గమ నిస్తూనే ఉన్నారు. గత నవంబర్ ఆరో తేదీన జగన్మోహన్రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర ప్రారం భించిన నాటి నుంచి పది జిల్లాలు దాటి నిన్న విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించే దాకా ఈ తొమ్మిది మాసాల్లో ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా, పిల్ల కాలువగా మొదలయి మహానదిగా ఈ యాత్ర మారింది. జనంతో సాగుతున్న ఈ యాత్ర ప్రజాభిప్రాయానికి అద్దం పడుతోంది. రహస్య స్నేహ పాచికలు ఇక పారవన్న సత్యం ఆ మూడు పార్టీలు అర్థం చేసుకుంటే మంచిది. దేవులపల్లి అమర్(datelinehyderabad@gmail.com) -
ఐజేయూ కొత్త అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్
-
ఓ సర్వజ్ఞుడి అంతరంగం
డేట్లైన్ హైదరాబాద్ స్టేట్స్మన్ చంద్రబాబు ఈ మధ్య దిక్కు తోచని స్థితిలో పడ్డట్టున్నారు. సొంతంగా ఆలోచించి ప్రజా ప్రయోజనాల గురించి కానీ, రాజకీయంగా కానీ నిర్ణయాలు తీసుకోలేని స్థితి అది. ప్రతిపక్ష నాయకుడు ఎజెండా నిర్ణయిస్తుంటే ఆయన అనుసరిస్తున్నారు. ప్రతిపక్షాన్ని వెంట తీసుకుపోవలసిన ముఖ్యమంత్రి అదే ప్రతిపక్షాన్ని అనుసరించాల్సిన పరిస్థితికి వచ్చారంటే దానికి ఆయనే బాధ్యుడనడంలో సందేహం లేదు. ఈ స్థితిలో అఖిలపక్షమో, అఖిల సంఘమో అర్థం కాని, ఏ మాత్రం ప్రయోజనం లేని కుప్పిగంతులు ఆపడం మంచిది. నలుగురి అభిప్రాయాలు తెలుసుకోవడం, సలహాలు సూచనలు తీసు కోవడం, సంప్రదింపులు జరపడం, మంచిచెడులను బేరీజు వేసుకో వడం, ఫలితాలను అంచనా వేయడం వీటన్నిటి నుంచి అంతిమంగా తమకు వచ్చిన ఆలోచనను అమలు చేయడం విజ్ఞుల లక్షణం. ఇందుకు చాలా సమయం పట్టవచ్చు, అనేక అవరోధాలు ఎదురు కావచ్చు, ప్రతి ఘటన కూడా పెద్ద ఎత్తున ఉండవచ్చు. కానీ ఒక సమస్యకు సరైన పరిష్కారం సాధించాలనుకునే వారు విజ్ఞులయితే ఈ కష్టాన్ని భరిస్తారు, ఇదే మార్గంలో వెళతారు. రాజకీయాల్లో ఉన్న వారికీ, అందునా అధికా రంలో ఉన్నవారికీ ఇది చాలా అవసరం. ప్రజల జీవితాలతో, వారి మంచి చెడ్డలతో వ్యవహారం కాబట్టి, వారికి మంచే చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వస్తారు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి వారినే రాజకీయాల్లో రాజనీతిజ్ఞులు (స్టేట్స్మన్) అంటారు. ‘నేను మామూలు రాజకీయ నాయకుడిని కాను. చట్టసభలతో 40 ఏళ్ల అనుభవం నా ఒక్కడికే సొంతం. దేశంలో చాలామంది కంటే ముందే, అదీ చిన్న వయసులో ముఖ్యమంత్రిని అయ్యాను. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణశకం నాతోనే మొదలయింది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ కాన్ఫరెన్స్ హాల్గా మారిన ఆ రాష్ట్ర శాసనసభలో గంటల తరబడి ఇదే విషయం చెబుతున్నారు. ఒక అసత్యాన్ని వందసార్లు చెబితే సత్యం అయి పోతుం దన్న సిద్ధాంతం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే బాగా ఒంట బట్టించుకున్నారు. రాజనీతిజ్ఞుడనగా....! ఆయన కన్నా చిన్న వయసులో ప్రజాక్షేత్రంలో పోరాడి గెలిచి ముఖ్య మంత్రులు అయిన పిన్న వయస్కులు చాలా మంది ఉన్నారు. ఆయన కంటే రాజకీయాల్లో తలపండిన భీష్ములు ఇంకా మిగిలే ఉన్నారు. కానీ ఆయన మాత్రం వాళ్లెవరినీ పరిగణనలోకి తీసుకోరు. తానే ‘సీనియర్’ని అంటారు. అందరూ నమ్మాలని కూడా చెబుతారు. సభలో తెలుగు తమ్ముళ్లకు మరో దారి లేదు కాబట్టి బల్లలు చరిచి హర్షామోదాలు ప్రకటిస్తుంటారు. నారా చంద్ర బాబునాయుడు స్వయం ప్రకటిత స్టేట్స్మన్. విజ్ఞులు, రాజనీతిజ్ఞులు (స్టేట్స్ మన్) ఎట్లా ఆలోచిస్తారో, ఎట్లా వ్యవహరిస్తారో ముందే మాట్లాడుకున్నాం. మరి మన స్వయంప్రకటిత స్టేట్స్మన్ చంద్రబాబునాయుడు వ్యవహారం మొదటి నుంచి ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దాం! 1995లో ఎన్టీ రామారావు కష్టఫలాన్ని కుట్రపన్ని చేజిక్కించుకున్న తరు వాత చంద్రబాబు బీజేపీ హవాలో, వాజ్పేయి ప్రజాకర్షణ తోడై 1999లో అధికారం సొంతం చేసుకున్నారు. అప్పుడే ఏదో సందర్భంలో అఖిలపక్ష సమావేశం ఒకటి నిర్వహించారు. సమావేశం ముగిశాక అఖిలపక్షం అన్నారు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆహ్వానించలేదు ఎందుకు అని విలేఖరులు అడిగితే శాసనసభలో వారికి ప్రాతినిధ్యం లేదు కదా అని తడుముకోకుండా జవాబిచ్చారు. ఆ ఎన్నికల్లో సీపీఐ శాసనసభలో ఒక్క స్థానం కూడా గెలవని మాట వాస్తవమే. కానీ సీపీఐ జాతీయ పార్టీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉంది. ఎన్నికల సంఘం గుర్తింపు ఉంది కదా అని మళ్లీ ప్రశ్నిస్తే స్టేట్స్మన్ దగ్గర జవాబు లేదు. సభలో ప్రాతినిధ్యం లేని పార్టీలను పిలవద్దనుకున్న ప్పుడు ఇది అఖిలపక్షం ఎట్లా అవుతుంది, ఫ్లోర్ లీడర్ల సమావేశం అనాలి కదా అని మరో విలేకరి రెట్టిస్తే స్టేట్స్మన్కు కోపం వచ్చింది. మీ మైండ్సెట్ మారాలి అని వెళ్లిపోయారు. ఈ పందొమ్మిదేళ్ల కాలంలో ఆ విలేకరి మైండ్సెట్ ఎంత మారిందో తెలియదు కానీ తన మైండ్ సెట్ ఏ మాత్రం మార్చుకోకుండా మీడియా మైండ్ సెట్ మాత్రం విజయవంతంగా మార్చే శారాయన. అఖిలపక్షం ఎత్తుగడ దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఆయనకు హఠాత్తుగా అఖిలపక్షం అవసరమైంది. సరే, ఇందులో ఒక దశాబ్దం పాటు అధికారానికి దూరంగానే ఉన్నారు కాబట్టి మళ్లీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లే లెక్కలోకి తీసు కుందాం. తన మీదా, తన పరిపాలన మీదా తనకే నమ్మకం లేక మాటి మాటికీ సర్వేలు చేయించుకునే స్టేట్స్మన్ చంద్రబాబునాయుడు ఆ సర్వేల్లో 95 శాతం జనం తన వెంటే ఉన్నారు కాబట్టి ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలు అవసరం లేదు అని దబాయించి, శాసనసభలో ఉన్న ఒకే ఒక్క బలమయిన ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా చేసి, చివరికి ఆ ప్రతిపక్షం శాసనసభను నిరంతరంగా బహిష్కరించే పరిస్థితికి తీసుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రాజధాని లేని, రూ. 16 వేల కోట్లకు మించిన లోటుతో రాష్ట్రం మిగిలిపోతే ఏ ఒక్క రోజూ ఏం చేద్దాం ఈ పరిస్థితిని అధిగమించడానికి అని ఏ ఒక్క ప్రతిపక్షాన్ని సలహా అడిగిన పాపాన పోనీ స్టేట్స్మన్ చంద్రబాబు. రాజధాని కోసం అనువైన స్థలాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే ఆ కమిటీ నివేదికను ప్రజల ముందు ఉంచడం మాట దేవుడెరుగు. కనీసం శాస నసభకు సమర్పించని చంద్రబాబుకు, రాజధాని స్థల నిర్ణయం విషయంలో గానీ, అక్కడ వేలాది ఎకరాలు పంట భూములను రైతుల వద్ద నుంచి తీసు కున్నప్పుడు కానీ, అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తానని గొప్పలకు పోయి వందల వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథాగా ఖర్చు చేసినప్పుడు కానీ ప్రతిపక్షాలు గుర్తుకు రాలేదు. ఎన్నికల హామీగా అయిదు నుంచి పదిహేను సంవత్సరాలకు పెంచిన ప్రత్యేక హోదాను ముగిసిపోయిన అధ్యాయంగా ప్రకటించి, కేంద్రం ఇస్తానన్న ప్యాకేజీ మహా ప్రసాదంగా స్వీకరించిన నాడు ఒక్క నిముషం ఆగి ప్రతిపక్షాలను కూడా సంప్రదించి నిర్ణయం తీసుకుందాం అన్న ఆలోచనే రాలేదు ఆయనకు. శాసనసభ సమా వేశాలు నడుస్తున్నాయి. కనీసం పొద్దుటి దాకా ఆగి సభకు సమాచారం అందించి బహిరంగ ప్రకటన చేద్దాం అన్న సోయి కూడా లేకుండా అర్ధరాత్రి దాటాక మీడియా ముందుకు వచ్చి కేంద్ర నిర్ణయాన్ని ఒక్కడే సమర్థించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అఖిలపక్ష/సంఘ సమావేశం అంటూ బయలు దేరారు. ఆనాడు కనీసం తన పార్టీలోని ముఖ్యులతో కూడా మాట్లాడని చంద్రబాబునాయుడు నాలుగేళ్లు గడిచాక ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఈ నాలుగేళ్లూ అలుపెరుగని పోరాటం చేసి ప్రజలను మరింత జాగరూకులను చేశాక ఇప్పుడు తూతూ మంత్రంగా అఖిలపక్షం అంటూ బయలుదేరారు. ఒక పక్క ప్రతిపక్షం వైఎస్సార్íసీపీ లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి దాని మీద చర్చకు పట్టుపట్టి ఇతర పక్షాలను కూడ గట్టుతున్న స్థితిలో తప్పనిసరి అయి ఆ పార్టీని అనుసరించిన చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని పిలవడంలో అర్థం లేదు. పరిష్కారం ఏమిటో తెలియని స్థితిలో, అది సాధించడానికి అనుసరించాల్సిన మార్గాన్ని నిర్ణయించుకునే క్రమంలో ప్రతిపక్షాన్ని సంప్ర దించాలి కానీ సమస్యకు తానే కారకుడై, దాని పరిష్కారానికి ఇతరులు ఇప్పటికే పోరాటంలో చాలా దూరం వెళ్లిపోయాక వాళ్లను అందుకోలేక ఉన్నచోటనే చతికిలబడి సహాయం కోసం అర్ధించినట్టుగా ఉంది ముఖ్య మంత్రి వ్యవహారం. కామ్రేడ్స్ దారెటు? చట్టసభలో ప్రాతినిధ్యం లేని పార్టీని అఖిలపక్షానికి పిలవబోనని 1999లో చెప్పిన చంద్రబాబు ప్రస్తుత ఆహ్వానాన్ని అదే చట్టసభలో ప్రాతినిధ్యం కలి గిన పార్టీలు వైఎస్సార్సీపీ, బీజేపీ తిరస్కరిస్తే ప్రాతినిధ్యం లేని వామపక్షాలే ఆయనకు దిక్కయ్యాయి. పోనీ ఆనాడు పనికిరాని వాళ్లం ఇప్పుడెట్లా పని కొచ్చాం అని అడగడానికి సంకోచించారో, సరేలే ఇప్పటికయినా గుర్తించారు కదా అని సర్డుకుపోవాలని వెళ్లారో తెలియదు. ఆయన ఎవరినీ గుర్తించరు, అవసరం వచ్చినప్పుడు వాడుకుని వదిలేస్తారు, అంతే. 1995 ఆగస్టు 31 అర్ధరాత్రి (ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రాత్రి) కమ్యూనిస్ట్ పార్టీల శాసనసభాపక్షాల నాయకుల ఇళ్లకు వెళ్లి మద్దతు కోసం అర్థించిన చంద్రబాబు, ఆ తరువాత దేశానికి కావలసింది కమ్యూనిజం కాదు, టూరిజం అనడానికి ఎక్కువ సమయం పట్టలేదని వామపక్షాలు జ్ఞాపకం చేసుకుంటే మంచిది. స్టేట్స్మన్ చంద్రబాబునాయుడు ఈ మధ్య దిక్కు తోచని స్థితిలో పడ్డట్టున్నారు. సొంతంగా ఆలోచించి ప్రజా ప్రయోజనాల గురించి కానీ, రాజకీయంగా కానీ నిర్ణయాలు తీసుకోలేని స్థితి అది. ప్రతిపక్ష నాయకుడు ఎజెండా నిర్ణయిస్తుంటే ఆయన అనుసరిస్తున్నారు. ప్రతిపక్షాన్ని వెంట తీసు కుపోవలసిన ముఖ్యమంత్రి అదే ప్రతిపక్షాన్ని అనుసరించాల్సిన పరిస్థితికి ఆయనే బాధ్యుడనడంలో సందేహం లేదు. ఇటువంటి స్థితిలో అఖిలపక్షమో, అఖిల సంఘమో అర్థం కాని, ఏ మాత్రం ప్రయోజనం లేని కుప్పిగంతులు ఆపడం మంచిది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కచ్చితంగా తెచ్చి తీరే విధంగా, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరే విధంగా ప్రధాన ప్రతిపక్షమూ, ప్రజలూ చేస్తున్న పోరాటాలకు ఊతం ఇచ్చే విధంగా స్టేట్స్మన్ చంద్రబాబు నిర్ణయాలు ఉంటేనే ప్రజలు హర్షిస్తారు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘చంద్రుల’ నోట చైనా పాట
డేట్లైన్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల పాలకులు ఇద్దరూ తమకు అడ్డంకిగా మారిన ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ కాలరాస్తున్నారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. నిరసనలకు తావే లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్పింగ్లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు సీఎంలకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్లుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ మధ్య వేర్వేరు సందర్భాలలో చైనాలో పరిపాలనను, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఉదహరించారు. ఇటు తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తాను జాతీయ రాజకీయాలకు వెళ్లనున్నట్టు ప్రకటించిన సభలో చైనాను ప్రస్తావిస్తే, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అక్కడి శాసనసభలో మాట్లాడుతూ చైనాను కొనియాడారు. ఇద్దరి మాటల్లోనూ మనకు అర్థం అయింది ఏమిటంటే అభివృద్ధి సాధించాలంటే చైనాను ఆదర్శంగా తీసుకోవాలి అని. అభివృద్ధి అంటే ఏమిటి? అది ఎవరి అభివృద్ధి? దేన్నయినా పణంగా పెట్టి ఆ అభివృద్ధి సాధించుకోవలసిందేనా? చైనా సాధిస్తున్న అభివృద్ధిని గురించి ఇంకోసారి చర్చించుకుందాం. ఇటీవలే చైనా దేశ రాజ్యాంగాన్ని సవరించి ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ జీవితకాలం పదవిలో కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది ఆ దేశ పార్లమెంట్. రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష పదవిలో ఎవరూ కొనసాగకూడదన్న నియమాన్ని సవరించి జిన్పింగ్కు నిరాఘాటంగా అధికారంలో కొనసాగే అవకాశం కల్పించడం చైనా దేశాన్ని ఏకవ్యక్తి నియంతృత్వం వైపు నెట్టడమే అన్న విమర్శను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చి ఈ చర్యకు ప్రజల ఆమోదం ఉందని తేల్చేసింది. చైనా మోడల్ దేనికి నిదర్శనం? అభివృద్ధి పేరిట చైనా దేన్ని పణంగా పెడుతుందో ఈ తాజా చర్యల వల్ల మనకు అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో, అభివృద్ధి కోసం దేశాన్ని నియంతృత్వ పాలకుల చేతుల్లో ఎలా పెట్టెయ్యవచ్చునో, దానికోసం స్వేచ్ఛాస్వాతంత్య్రాల అవసరం అసలే అక్కరలేదనో ఎవరయినా ఆర్థిక శాస్త్ర పండితులు చెప్తారేమో. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛను, జీవించే హక్కును కోరుకునే వారెవ్వరూ ఇప్పటి చైనా పోకడలను హర్షించరు, ఆమోదించరు. విచిత్రంగా చైనాలో ఈ రాజ్యాంగ సవరణ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరి నోటా చైనా అభివృద్ధి పాట వినిపించింది. నిజంగా ఈ ఇద్దరు నాయకులను చైనాలో జరుగుతున్న అభివృద్ధి ఆకర్షించిందా లేకపోతే జిన్పింగ్ లాగా తమకు శాశ్వత అధికారం కట్టబెడితేనే చైనా మోడల్ అభివృద్ధి సాధిస్తామని ప్రజలకు చెప్పదల్చుకున్నారా తెలియదు. ఈ సందేహం రావడానికి కారణం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి నిరసనలకు తావు లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపొయింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తానూ చెయ్యబోయే అభివృద్ధిని 2050 సంవత్సరం వరకూ విస్తరిస్తుంటారు. అంటే ఆయన, ఆయన కొడుకు లోకేష్, ఆ తరువాత మనుమడు దేవాన్‡్ష కూడా ముఖ్యమంత్రులు అయిపోవొచ్చు ఈ 52 ఏళ్ళ కాలంలో. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 20 ఏళ్ళ దాకా మాదే అధికారం అంటారు. ప్రతిపక్షాలు లేనే లేవు, ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాష్ట్ర శాసనసభలోని 119 స్థానాల్లో 106 మావేననీ, వచ్చే 20 ఏళ్ళు అధికారం మాదే అని కూడా అంటుంటారు. ఇద్దరూ ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ, విలువలనూ కాలరాస్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్పింగ్లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు ముఖ్యమంత్రులకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్టు ఉన్నది. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి కుప్పిగంతులే! రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలిచ్చి, విడిపోతున్న సమయంలో 15 ఏళ్ళు ప్రత్యేక తరగతి హోదా కావాలని డిమాండ్ చేసి ఆ తరువాత అధికారంలోకి వచ్చాక అదే హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాన్ని, ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కదలనివ్వదు, జైళ్ళలో పెడుతుంది. కేసులు పెడుతుంది. హోదా సంజీవని కాదు, ప్యాకేజీతోనే ప్రయోజనం అని చెప్పి చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసి, చివరికి ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పని స్థితిలో మళ్ళీ ప్రత్యేక హోదా పాట అందుకున్నది. ఎన్నికల ఎత్తుగడగా బీజేపీని వదిలించుకోవాలని ఆలోచిస్తున్నప్పటికీ చంద్రబాబుకు పూర్తి ధైర్యం చాలడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో నుండి మాత్రం తన మంత్రులతో రాజీనామా చేయించి ఎన్డీఏ కూటమిలో మాత్రం కొనసాగుతున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కేంద్రంతో తగాదా పడలేము, మంచిగా ఉండి సాధించుకోవాలి అనే పాట పాడుతూ వొచ్చిన చంద్రబాబుకు, ఆయన పార్టీ నాయకులకూ ఇప్పుడు బీజేపీతో సంబంధాలు చెడేసరికి సహకార ఫెడరలిజం గుర్తొచ్చింది. 2016 సెప్టెంబర్ 8న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న ప్యాకేజీ గురించి ప్రకటించినప్పుడు ఉబ్బితబ్బిబ్బయిపోయి ఆయనకు సన్మానాలు చేసిన చంద్రబాబు, అదే ప్రకటనను అక్షరం పొల్లుపోకుండా 2018 మార్చిలో చేస్తే మాత్రం అన్యాయం జరిగిందని ప్రకటనలు చేస్తున్నారు. అధికారాన్ని మళ్ళీ ఎట్లాగయినా దక్కించుకోవాలన్న ఆరాటం స్పష్టంగా కని పిస్తూనే ఉంది ఆయన నిర్ణయాల్లో. తాము ఇంకా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూనే, ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకయినా మద్దతు ఇస్తామన్న ప్రతిపక్షాన్ని మాత్రం బీజేపీలో చేరబోతున్నది అని నిందించేందుకు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు శతవిధాలా చేస్తున్న ప్రయత్నాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటే పొరపాటు. ఇక దేశానికే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తాను ఇస్తాననీ మూడవ ఫ్రంట్కు తాను నాయకత్వం వహిస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రైతు సమస్యల మీద కేంద్రాన్ని నిలదీయడానికి ఉద్యమం చేస్తానని, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉండదు. హైదరాబాద్లో ధర్నా చౌక్ ఎత్తేసి నిరసనకారులను ఇళ్ళల్లో నిర్బంధించి అవసరం అయితే పోలీస్ స్టేషన్లకు తరలించి ముఖ్యమంత్రి మాత్రం జంతర్ మంతర్కు నిరసన కార్యక్రమం నిర్వహించడానికి వెళతారు. రిజర్వేషన్ల పెంపు డిమాండ్ మీద ఆయన పార్టీ ఎంపీలు లోక్సభను స్తంభింప చెయ్యొచ్చు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపవచ్చు కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం విపక్షాల నిరసనకు అనుమతి లేదు. ప్లకార్డులు ధరించి సభకు రావడం అరాచకం. దాడుల రాజకీయంలోనూ పక్షపాతమే! శాసనసభలో గవర్నర్ మీద దాడి హేయమయిన చర్య. ఎవరూ సమర్థించకూడని చర్య. అయితే గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలపడం ఇవాళ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. నిలబడి నిరసన తెలపడం, నినాదాలు చెయ్యడం, ప్రసంగాల ప్రతులను చించివెయ్యడం చాలా కాలంగా శాసనసభల్లో మామూలు అయిపోయింది. అయితే భౌతికంగా గవర్నర్ మీద దాడికి దిగడం ఎవరితో ప్రారంభం అయింది? ఉమ్మడి రాష్ట్రంలో ఇదే గవర్నర్ గారి మీద ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు కాదా దాడి చేసింది. శాసన సభ ఆవరణలో ఒక ఎంఎల్ఏను కొట్టండిరా తన్నండిరా అని రెచ్చగొట్టిన పెద్ద మనిషి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్నాడు. రేపో మాపో ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సంఘటనను ఆదర్శంగా చేసుకుని గవర్నర్ మీద మళ్లీ దాడి చెయ్యడాన్ని ఎవరూ సమర్థించరు. చెప్పేదేమంటే మేం చేస్తే మంచిది, ఇతరులు చేస్తే చెడ్డది అన్న ప్రభుత్వాల, రాజ కీయ పక్షాల వైఖరి సరయినది కాదు అనే. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమం అనేక మార్గాల్లో, అనేక పద్ధతుల్లో సాగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో చెప్పడానికి మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటి పలు కార్యక్రమాలు జరి గాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఆ ఉద్యమ కార్యక్రమాలు అన్నింట్లో భాగస్వామి. వాటిల్లో ఒకటయిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ జరుపుకోవడాన్ని ఎందుకు ప్రభుత్వం అడ్డుకున్నట్టు? ఉద్యమ కాలంలో తెలంగాణ సాధన కోసం ఆ నాటి ప్రభుత్వంతో తలపడిన దానికి, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి తేడా లేదా? మిలియన్ మార్చ్ నిర్వహణను నిషేధించడానికి ఆ నాడు ప్రభుత్వం ఏ కారణాలు చెప్పిందో, స్ఫూర్తి సభను నిషేధించడానికి నేటి ప్రభుత్వమూ అవే కారణాలు చూపడం విడ్డూరం. ఆ నాటి దృశ్యమే ఈనాడూ ట్యాంక్ బండ్ చుట్టూ కనిపించింది. ఆనాడు వేల మంది పోలీసులు ఉద్యమకారుల మీద విరుచుకుపడి అరెస్టులు సాగిస్తే ఈనాడు పోలీసులు అంతకంటే ఎక్కువ దాష్టీకం చేశారు, దౌర్జన్యం చేశారు. పాలకులు ఎవరయినా ప్రజా ఉద్యమాల పట్ల, వారి ఆకాంక్షల పట్ల ప్రదర్శించే అసహనంలో మాత్రం మార్పు ఉండదేమో! మన పాలకులూ చైనా దారి పట్టినట్టు ఉన్నారు..!! దేవులపల్లి అమర్ ఈమెయిల్ : datelinehyderabad@gmail.com -
‘నివాళి’ చెబుతున్న నిజాలు
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కు అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ, టీడీపీ రెండూ కూడా రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ అన్న విషయం గుర్తించాలి. కేంద్రం నుంచి ఏ సహాయమూ రాలేదంటున్న చంద్రబాబు కేంద్ర సహాయం అద్భుతం, అమోఘం అని ఈ నాలుగేళ్లు ఎందుకు భజన చేశారో చెప్పాలి. తాము ఇచ్చిన నిధులకు ఇప్పుడు లెక్కలు చెపుతూ అందులో బోలెడు అవినీతి జరిగిందంటున్న బీజేపీ నాయకులు అధికారం తమ చేతిలో ఉండి కూడా ఇంతకాలం లెక్కలు ఎందుకు అడగలేదో, ఎందుకు అవినీతికి అడ్డుకట్ట వేయలేదో కూడా చెప్పాలి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర చదువుకున్నవారికి వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి తెలియకుండా ఉండదు. బీజేపీ, ఆరెస్సెస్ సహా హిందూత్వవాదులంతా ఆయనను స్వాతంత్య్ర వీర్ సావర్కర్ అని పిలుచుకుంటారు. దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న మితవాదశక్తులు నిద్రలో కూడా కలవరించే ‘అఖండæభారత్’ఆలోచన వీర్ సావర్కర్ బలపరిచినదే. స్వాతంత్య్రోద్యమంలో సావర్కర్ పాత్ర గురించి రెండు వాదనలు ఉన్నాయి. దేశæస్వాతంత్య్రం కోసం పోరాడినందుకు సావర్కర్కు బ్రిటిష్ పాలకులు 50 ఏళ్ల జైలు శిక్ష విధించి అండమాన్ సెల్యూలర్ జైలుకు పంపారని బీజేపీ, ఆరెస్సెస్ తదితర హిందూత్వ అనుకూలవాదులు చెబుతారు. బ్రిటిష్ పాలనకు అనుగుణంగా నడుచుకుంటాననీ, క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటూ లేఖ రాసినకారణంగా ఆయనను విడుదల చేశారనీ, మహాత్మాగాంధీ పిలుపు మేరకు జరిగిన క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొనవద్దనీ, బ్రిటిష్ వారిచ్చిన పదవులకు రాజీనామా చెయ్యొద్దనీ తన వారికి పిలుపు ఇచ్చిన సావర్కర్ స్వాతంత్య్రవీరుడు ఎట్లా అవుతాడని కాంగ్రెస్ వాదులూ కమ్యూనిస్ట్లూ వాదిస్తుంటారు. బీజేపీ, ఆరెస్సెస్లకు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ సావర్కర్ ఆరాధ్యదైవమే. నివాళిలోనూ రాజకీయమే సరే, సావర్కర్ను ఎవరి కోణం నుంచి వారు విశ్లేషించవచ్చు. స్వాతంత్య్ర పోరాటకాలంలో వ్యవహార శైలిని బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరయినా అంచనా వెయ్యవచ్చు. ఎవరికయినా, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లు ఇటువంటి విషయాల్లో స్పష్టమయిన అభిప్రాయం కలిగి ఉండాలి, ఉంటారు కూడా. అయితే ఇప్పుడు సావర్కర్ ప్రస్తావన ఎందుకు అనే సందేహం కలగవచ్చు. మొన్న అంటే ఈ నెల 26వ తేదీ సావర్కర్ వర్ధంతి. 1966 ఫిబ్రవరి 26 వ తేదీన, అంటే 52 ఏళ్ల క్రితం ఆయన చనిపోయారు. ఆ సందర్భంగా దేశంలో చాలామంది సావర్కర్ అభిమానులు ముఖ్యంగా హిందూత్వవాదులు తమకు తోచిన పద్ధతుల్లో నివాళులు అర్పించారు. సావర్కర్ పాత్రను వ్యతిరేకించే వారు ఎవ్వరూ ఎక్కడా ఆయనకు నివాళులు అర్పించలేదు. అంతమాత్రాన ఆయన అభిమానులకు పోయేదేమీలేదు. అయితే సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించి అంతలోనే నాలుక కరుచుకుని ఆ నివాళిని వెనక్కి తీసుకునే వాళ్లను ఏమనాలి? అదికూడా మామూలు వ్యక్తులు అయితే వేరు. రాజకీయ దిగ్గజం, అపర చాణక్యుడు అని పేరు తెచ్చుకున్న, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడు ఆ పని చేస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి? పాపం, సావర్కర్ గురించి ఆయనకు ఏమీ తెలియదు, ఎవరో చెపితే పొరపాటున నివాళులు అర్పించారు. ఆ వెంటనే మరెవరో, అయ్యో సావర్కర్ బ్రిటిష్ పాలనను సమర్ధించినవాడు, క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించాడు అని గుర్తు చేస్తే వెనక్కి తీసుకున్నారని అర్థం చేసుకోవాలా? ఆ పని చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబు చాలా సీనియర్ నాయకుడు. ఆయనే తరచూ ఆమాట చెబుతూ ఉంటారు, దేశంలో ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వాళ్లందరిలో తానే సీనియర్నని. అంతేకాదు, తాను స్టేట్స్మన్ని అని కూడా ఆయనే పదే పదే గుర్తు చేస్తుంటారు. వీర్ సావర్కర్ ఎవరో, ఆయనకు నివాళులు అర్పించాలా, కూడదా అన్న విషయాలు చంద్రబాబునాయుడు వంటి ‘స్టేట్స్మన్’కు తెలియకుండా ఉంటాయని ఎట్లా అనుకుంటాం? మొన్న 26వ తేదీన పొద్దున్నే చంద్రబాబునాయుడు ట్వీటర్లో వీర్ సావర్కర్కు నివాళులు అర్పించారు. అయితే కొద్దిసేపట్లోనే ఆ నివాళిని ట్వీటర్ నుంచి తొలగించేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఇది ఎవరూ పెద్దగా పట్టించుకునే విషయం కాదు. రాజకీయ అవసరాల కోసం ఎవరినయినా ఏ జంకూ లేకుండా వదిలించుకోగలిగిన చంద్రబాబు బీజేపీని మరొక్కసారి వదిలించుకోబోతున్నారనే వార్తలు బాగా ప్రచారంలో ఉన్న సమయంలో ఇది జరిగింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన వీర్ సావర్కర్ను కీర్తించాల్సిన అవసరం లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో బీజేపీ సిద్ధాంతాలను నూటికి నూరు శాతం సమర్ధించే వారే ఉండాలని లేదు. రాజకీయ అవసరాల కోసం, మళ్లీ మాట్లాడితే అధికారం కోసం ఎవరు ఎవరితో అయినా జత కడుతుంటారు, ఎవరినయినా వదిలేస్తారు. అందులో సిద్ధహస్తుడయిన చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2004 ఎన్నికల ముందటి అవతారం మళ్లీ ఎత్తదల్చుకున్నారు కాబట్టి చంద్రబాబునాయుడు ఇప్పుడు బీజేపీని వదిలించుకుని సెక్యులర్ బురఖా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టే ట్వీటర్లో నుంచి వీర్ సావర్కర్ నివాళి మాయమైంది. ఇద్దరూ సమాధానాలు చెప్పాలి చంద్రబాబునాయుడు తమను వదిలేస్తాడన్న విషయం బీజేపీకి కూడా తెలుసు. అందుకే కొన్నిరోజులుగా స్వరం పెంచింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఆంధ్రప్రదేశ్కి ఈ మూడున్నర ఏళ్లలో ఇచ్చిన నిధుల లెక్కలు చెబుతున్నారు. మరో బీజేపీ నాయకుడు, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు ఆ నిధుల్లో జరిగిన అవినీతి గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. 1995లో ఎన్టీ రామారావు నుంచి అక్రమంగా అధికారం లాక్కున్నాక, 1999లో బీజేపీ సహాయంతో, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రజాకర్షణ శక్తి, కార్గిల్ వంటి అంశాలు కలిసొచ్చి అత్తెసరు మార్కులతో బయటపడ్డారు చంద్రబాబు. మళ్లీ 2014లో అదే బీజేపీ సహాయం, మోదీ సమ్మోహన శక్తి, పవన్కల్యాణ్ సహకారంతో మరోసారి అత్తెసరు మార్కులతోనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు మరోసారి బీజేపీని వదిలేయడం పెద్ద విశేషం ఏమీకాదు. ఆయనకు ఎన్నడూ స్వయం ప్రకాశకత్వం లేదు. అందుకే బహుశా 2019లో కొత్త మిత్రుల వెతుకులాటలో పడ్డారేమో! అయితే 2004లో ఆయన హైదరాబాద్లోనే అడ్వాణీ ర«థం దిగేసి తెగతెంపులు చేసుకున్నప్పటి బేలతనం ప్రస్తుత బీజేపీ నాయకత్వంలో లేదు. బీజేపీ ఇప్పుడు అమాయక చక్రవర్తి అటల్ బిహారీ వాజ్పేయి చేతుల్లో లేదు. ‘కట్ త్రోట్’రాజకీయాలు నడుపుతున్న అమిత్ షా, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్కు అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ, టీడీపీ రెండూ కూడా రాష్ట్ర ప్రజలకు అనేక విషయాల్లో జవాబుదారీ అన్న విషయం గుర్తించాలి. కేంద్రం నుంచి ఏ సహాయమూ రాలేదంటున్న చంద్రబాబునాయుడు కేంద్ర సహాయం అద్భుతం, అమోఘం అని ఈ నాలుగేళ్లు ఎందుకు భజన చేశారో ప్రజలకు చెప్పాలి. తాము ఇచ్చిన నిధులకు ఇప్పుడు లెక్కలు చెపుతూ అందులో బోలెడు అవినీతి జరిగిందంటున్న బీజేపీ నాయకులు అధికారం తమ చేతిలో ఉండి కూడా ఇంతకాలం లెక్కలు ఎందుకు అడగలేదో, ఎందుకు అవినీతికి అడ్డుకట్ట వేయలేదో కూడా ప్రజలకు చెప్పాలి. సరయిన జవాబులు రాకపోతే ఏం చెయ్యాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. విజన్ 2033లో చంద్రబాబు చివరగా, చంద్రబాబునాయుడు చట్టసభల్లోకి ప్రవేశించి నిన్నటితో 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మానసపుత్రిక అయిన ఒక మీడియా సంస్థ యజమానితో పెట్టిన సుదీర్ఘ ముచ్చట్లలో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు– క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదటిరోజే మంత్రి పదవిని ఆశించిన విషయం. అట్లాగే రాజకీయ పుట్టుకే అసమ్మతితో అని కూడా చెప్పుకున్నారు. మొదటిసారి 1978లో 26 ఏళ్ల వయసులోనే మంత్రి పదవి ఇవ్వనందుకు డాక్టర్ చెన్నారెడ్డి ప్రభుత్వం మీద అసమ్మతి కార్యక్రమం మొదలు పెట్టానని గర్వంగా చెప్పుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందునా ఆంధ్రప్రదేశ్ వంటి సంక్షోభ స్థితిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పదవీకాలంలో ప్రజలకు ఏం చేసిందీ చెప్పే ప్రయత్నం లేకపోగా ‘మందు కొట్టేవారా, తోటి విద్యార్థుల చేత మందు కొట్టించి తగాదాలకు వెంట తీసుకువెళ్లేవారా, చిల్లర ఖర్చుల కోసం పేకాట ఆడేవారా’ వంటి చిల్లర ముచ్చట్లకు పరిమితం కావడంతో వీక్షకులు ముక్కున వేలేసుకున్నారు. ఈ ముచ్చట్లలోనే ముఖ్యమంత్రి ఒక్క విషయం మాత్రం స్పష్టం చేశారు. అమరావతిలో రాజధాని నిర్మించడానికీ, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికీ తనకు ఇంకో పదిహేను సంవత్సరాలు అధికారం కావాలని చెప్పారు. బహుశా ఆయన విజన్ 2033 కావచ్చు. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
‘హోదా’ గోదాలో కొత్త కదలిక
విభజనానంతర ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం ఇవాళే ఉద్యమం ప్రారంభం కాలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి తొలిరోజు నుండి ఈనాటి వరకూ ప్రత్యేక హోదా కోసం అన్ని వేదికల మీదా మాట్లాడుతున్నారు. దాని వల్ల రాష్ట్రానికి జరిగే లాభాలను గురించి ప్రజలకు చెబుతూనే ఉన్నారు. ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి ఆయన ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగితే దాన్ని భగ్నం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అదే ప్రత్యేక హోదా పాట పాడటం హాస్యాస్పదం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపున, అంటే ఏప్రిల్ 6 నాటికి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రకటించడంతో హోదా అంశం మళ్లీ ఊపందుకుంది. దీనితో అధికార తెలుగుదేశం పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారయింది. హోదా రాకపోతే చరిత్ర క్షమించదన్న వాస్తవం అర్థంకాని తెలుగుదేశానికి ఇది ఆషామాషీ వ్యవహారం కాదని జగన్ మళ్లీ తేల్చి చెప్పినట్టయింది. హోదా కోసం ఎవరు నిజాయితీగా పోరాడుతున్నారో ప్రజలకు మరొకసారి అర్థమయింది. ‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు, అందుకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం’ అని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడో తేల్చేసింది. అట్లా కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన మరుక్షణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని స్వాగతించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్కు అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే, మరుక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందరి నిద్రలూ చెడగొట్టి ఆ ప్రకట నను స్వాగతిస్తూ కొన్ని గంటలు ప్రసంగించారు. ఏపీని బీజేపీ మోసం చేసిందా? ఎలా! ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ ఉండదు, అది సంజీవని కాదు, ప్రత్యేక హోదా వల్ల జరిగే లాభం కంటే ఎంతో ఎక్కువ లాభం జరిగే విధంగా కేంద్రం నిధుల వరదలెత్తించబోతున్నది, దాన్ని అడ్డుకునేందుకు, అభివృద్ధి జరగకుండా చూసేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తున్నది అని చంద్రబాబునాయుడు ఆనాడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దగ్గర పట్టుబట్టి ఒప్పించుకున్న అంశం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ప్రతిపత్తి అయిదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని నాడు రాజ్యసభలో ఉన్న ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, మరో అడుగు ముందుకు వేసి, పదిహేనేళ్లు కావాలన్నారు. 2014 ఎన్నికల ప్రచార సందర్భంగా ఎన్డీఏ నాయకులు ఇరువురూ(మోదీ, బాబు) అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తప్పని సరిగా ఇస్తాం అని ప్రజలకు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇద్దరూ మాట మార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం మనం అడిగిన దానికంటే చాలా ఎక్కువే ఇచ్చింది అని చెప్పారు. మరి ఇప్పుడేమయింది? కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తే వాటికి రాష్ట్రం లెక్కలు చెప్పడంలేదనీ,పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనీ కేంద్రంలో ఎన్డీఏ ప్రధాన భాగస్వామి బీజేపీ ప్రతినిధులు చెబుతూ ఉంటే, ప్యాకేజీ పేరు చెప్పి మోసం చేశారు, నిధులు ఇవ్వడం లేదు అని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఎక్కడ బెడిసినట్టు? ఇద్దరికీ ఎక్కడ చెడింది? గత వారంరోజులుగా ఒకరినొకరు బహిరంగంగానే ఎందుకు విమర్శించుకుంటున్నారు? ఈ ఆరోపణలూ ప్రత్యారోపణలకు ఏ మాత్రం అయినా విలువ ఉండాలంటే అవతల నరేంద్ర మోదీ కానీ, అమిత్ షా కానీ నోరు విప్పాలి. ఇవతల చంద్రబాబునాయుడు నోరు తెరవాలి. ఆ పని ఎందుకు జరగడం లేదు? మిత్రధర్మం లేదా సంకీర్ణధర్మం అనుకుంటే అటు కానీ, ఇటు కానీ ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదు కదా! అంతర్గతంగా మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుని బయటికి వచ్చి ఒకే స్వరంతో మాట్లాడితే కదా సంకీర్ణ ధర్మాన్ని పాటించినట్టు! కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇచ్చింది తీసుకోవాలి, ఆ తరువాత మరింత కావాలని అడుక్కోవాలి అన్న ధోరణిని చంద్రబాబునాయుడు ఎందుకు అవలంబిస్తున్నారు? ఎందుకు ఎక్కడికక్కడ సర్దుబాటు ధోరణిని అవలంబిస్తున్నది? నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి. సంకీర్ణ భాగస్వాములు కూడా అవసరం అయినప్పుడు కనీస స్నేహపూర్వక విమర్శ అయినా చేస్తారు, ఆ సాహసం కూడా ఎందుకు చంద్రబాబు చెయ్యలేకపోతున్నారు? అంత బలహీన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, దాని అధినేత ఎందుకు ఉన్నారు? అందుకు గల బలమయిన కారణాలు ఏమిటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అప్పాయింట్మెంట్ కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఫెడరల్ రాజ్యంలో ఎందుకు ఉన్నది? రాష్ట్రంలో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయినా బిక్క మొహం వేసుకుని ప్రధాని పిలుపు కోసం ఎదురుచూస్తూ ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్కపూట లోక్సభలో నోరు విప్పి మాట్లాడినందుకు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్కు ఊరేగింపులు, సన్మానాలు ఎందుకు చేస్తున్నారు? పదే పదే అదే పాట అరుణ్ జైట్లీ నోట పాడించినందుకా తెలుగుదేశం విజయోత్సవాలు? మేము బోలెడు నిధులు ఇచ్చాం, వాటికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదు అని చెబుతున్న బీజేపీ ఎంఎల్సీ సోము వీర్రాజుకు జవాబు చెప్పే స్థితిలో తెలుగుదేశం నాయకులు ఎందుకు లేకుండా పోయారు? ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి మాట్లాడరేం? ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు సరే, రెండురోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, వీర్రాజు విడుదల చేసిన లెక్కల్లో తప్పులుంటే రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధికారికంగా ఆ తప్పులను సరి చేయవచ్చు కదా! ఆయన అయినా ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్రం నుండి ఎన్ని నిధులు వచ్చాయి, వాటిని ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఖర్చు చేశామన్న విషయం తెలుసుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది కదా! వాళ్లు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చామన్న విషయం మరిచిపోయి మేము ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అన్న ధోరణిలో ఉంటే ప్రజలెట్లా సహిస్తారు? తాజా పరిస్థితే తీసుకుందాం. హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలన్న విషయం గుర్తొచ్చిన తెలుగుదేశం పార్టీ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేవని బయటికొచ్చి మాట్లాడుతున్నా ఆ పార్టీ అధినేత మాత్రం నోరు విప్పి ఒక్క మాటా మాట్లాడటం లేదు. చీటికి మాటికి మీడియా ముందుకొచ్చి గంటల తరబడి మాట్లాడిందే మాట్లాడే అలవాటు మొదటి నుండీ ఉన్న చంద్రబాబునాయుడు పెదవి విప్పక పోవడం వెనక రహస్యం ఏమిటి? ఎన్ని లీకులు ఇచ్చినా, వందిమాగధ మీడియాలో ఎంత రాయిం చినా అధినేత నోరు విప్పి మాట్లాడితేనే కదా శ్రేణులు పరిస్థితిని అర్ధం చేసుకునేది. ఆయన ఆ పనికి సిద్ధంగా లేరన్నవిషయం స్పష్టం అవుతున్నది. అదే సమయంలో క్రమక్రమంగా బీజేపీ నుండి దూరం జరగాలి, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తాను ఇచ్చిన 600 హామీలు ఎందుకు అమలు కాలేదని ఎవరూ ప్రశ్నించకుండా కేంద్రం నుండి సహకారం లేని కారణంగా అభివృద్ధి చెయ్యలేకపోయామని చెప్పుకుని జనాన్ని మళ్లీ ఓట్లు అడగాలన్నది చంద్రబాబు ఆలోచన. ప్రజలు ఎప్పుడయినా ఒక్కసారి మోసపోతారుకానీ అన్నిసార్లు మోసపోరు కదా! ఆది నుంచి వైకాపా నినాదం అదే విభజనానంతర ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం ఇవాళే ఉద్యమం ప్రారంభం కాలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి తొలిరోజు నుండి ఈనాటి వరకూ ప్రత్యేక హోదా కోసం అన్ని వేదికల మీదా మాట్లాడుతున్నారు. దాని వల్ల రాష్ట్రానికి జరిగే లాభాలను గురించి ప్రజలకు చెబుతూనే ఉన్నారు. ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి ఆయన ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగితే దాన్ని భగ్నం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అదే ప్రత్యేక హోదా పాట పాడటం హాస్యాస్పదం. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాల్లో భాగస్తులు కావద్దని ప్రజ లకు పిలుపునిచ్చిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి ప్రతిపత్తితో వచ్చే ప్రయోజనం ఏదీ ఉండదని దబాయించిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రిదే. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయించి, అక్రమ కేసులు పెట్టిన చరిత్ర ఆయన ప్రభుత్వానిది. పదహారు మాసాల తరువాత తనను కలుసుకున్న చంద్రబాబునాయుడి నియోజకవర్గాల పెంపు కోరికను ప్రధాని మోదీ అంగీకరించి ఉంటే ఏ గొడవా ఉండేదికాదు. ఎవరి కోసం ఖర్చు చేశారో తేల్చాలి ఇక్కడ బీజేపీ ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులకురాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదు అని వారు ఫిర్యాదు చేస్తే సరిపోదు. కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత అన్న లెక్కలతో బాటు, ఆ నిధులు ఎక్కడ ఎందుకు ఎవరికోసం ఖర్చు చేశారో తేల్చేందుకు కూడా ప్రయత్నించాలి. లేకుంటే జరిగేది ఒక్కటే. ఎన్డీఏ రథం దిగిపోయి చంద్రబాబు బీజేపీని నిందించడం ప్రారంభిస్తారు. ఇది చంద్రబాబుకు కొత్త కూడా కాదు, ఆ సంగతి బీజేపీకి కూడా అనుభవంలో లేనిది కాదు. పవన్కల్యాణ్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణకు బయలుదేరిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, ఉండవల్లి అరుణ్కుమార్ తదితర మేధావుల బృందం, దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోనూ అత్యంత సంపన్నుడయిన చంద్రబాబునాయుడు పాలనలో అత్యధిక ప్రజలు పేదరికంలో ఎందుకు ఉన్నారు, వారి సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు అన్న నిజాన్ని నిగ్గు తేలిస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రులు అందరిలో అత్యంత సంపన్నుడు చంద్రబాబునాయుడే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదికలో పేర్కొన్నట్టు ఈరోజే పత్రికల్లో వచ్చింది మరి! - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఉత్తమ రాజకీయాలకు దారేది?
డేట్లైన్ హైదరాబాద్ పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగడాన్ని కూడా ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. ఎవరికయినా స్వేచ్ఛ ఉంది. కానీ పవన్ మాట్లాడుతున్నదేమిటి? కేసీఆర్ తాట తీస్తానన్న నోటితోనే, ‘ఆయన అంటే నాకు మొదటి నుంచి చాలా అభిమానం’ అంటున్నారు. విభజన బాధతో పదకొండు రోజులు పస్తు ఉన్నానన్న నోటితోనే జై తెలంగాణ నినాదం వందేమాతరం అంత పవిత్రమయిందని కూడా అంటున్నారు. ఆయన మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మాలా? అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండాల్సిన అవసరంలేదు, మారవచ్చు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి ఈ మధ్య ఒక సభలో మాట్లాడినప్పుడు ‘రాగ్ దర్బారీ’ అనే ఒక రాగం గురించి ప్రస్తావించారు. వెనకటికి మహారాజును పొగడటానికి ప్రత్యేకంగా కొంత మందిని నియమించేవాళ్లట. వారికి రకరకాల పేర్లు. వందిమాగధులనీ, విదూషకులనీ ఉండేవారు. ఆస్థానకవుల పనీ దాదాపు అదే. కానీ రాజరిక వ్యవస్థ అంతరించింది. ప్రజాస్వామ్యం వచ్చింది. అయినా ఈ ప్రభువులను పొగిడే జాతి మాత్రం వేర్వేరు రూపాల్లో కొనసాగుతూనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నడుస్తున్నది కూడా రాగ్ దర్బారీయే అంటే అతిశయోక్తి కాదు. ఆధునిక యుగపు ప్రభువులను కీర్తించడానికి కొత్తగా ఒక విదూషకుడు రాగ్ దర్బారీ ఆలపిస్తూబయలుదేరాడు. పైగా రాజాస్థానానికే పరిమితం కాకుండా రాజ్యం అంతటా తిరిగి ప్రభువు కీర్తి ప్రతిష్టలను ప్రజల ముందు వేనోళ్ల నోరారా పొగిడే పని భుజాన వేసుకున్నాడు ఈ కొత్త విదూషకుడు. అంతేకాదు రాజును విమర్శించే వాళ్లను దండించడానికి ఆ కాలంలో కొరడాలు వాడితే, ఇప్పుడు చట్టాలకు కొత్త పదును పెట్టి పరుష పదజాలాలు వాడితే కారాగార వాసం తప్పదని హుకుంనామాలు జారీ చేసేశారు. ఎంతసేపు ఈ డొంక తిరుగుడు? నేరుగా విషయానికి రావచ్చు కదా అని విసుక్కునే వాళ్లకోసం ఇక విషయానికి వచ్చేద్దాం! పరిహాసమవుతున్న ప్రజాస్వామ్యం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ‘తెలంగాణ గాంధీ’ అని కీర్తిస్తున్న వాళ్లు ఉన్నారు. ఆయన ఫొటోలకు పాలాభిషేకాలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఆయనను స్తుతిస్తున్న వాళ్లూ అనేక మంది ఉన్నారు తెలంగాణ సమాజంలో. పదమూడు సంవత్సరాల సుదీర్ఘ మలిదశ శాంతియుత పోరాటం తరువాత ప్రత్యేక రాష్ట్రం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనేతగా చంద్రశేఖరరావు సర్వదా, సదా అభినందనీయుడే. అయితే ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడానికి వీల్లేదు అంటేనే చిక్కంతా. తనను ఎవరూ విమర్శించడానికి వీల్లేదని మహాత్ముడు ఎన్నడూ అనలేదు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో భాగం అయినవాళ్లూ, కాని వాళ్లూ ఎవరయినా సరే ప్రభుత్వ పనితీరు పట్ల ఒక అభిప్రాయం కలిగి ఉండే, ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ, విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం పౌరులందరికీ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ ఒకరికి ఒక రకంగా, ఇంకొకరికి మరో రకంగా ఉండదు. అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఎవరినయినా ‘సన్నాసులు’, ‘పనికిమాలి నోళ్లు’ అంటాను. కానీ నన్ను ఎవరూ ఏమీ అనకూడదు అంటే కుదరదు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకూ, మలిదశ ఉద్యమానికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినది 1998 వరంగల్ డిక్లరేషన్. ఆ ఘట్టానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తలపెట్టిన ఊరేగింపు మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరోజు వరంగల్ పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద గుమిగూడిన తెలంగాణ వాదుల మీద ఆడా మగా అని చూడకుండా పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేసి నిర్బంధించారు. తెలంగాణ ఉద్యమకాలంలో తమ పోరాటానికి విశ్వసనీయతను జత చేసిన సంస్థ జేఏసీ. కొలువుల కోసం కొట్లాడుతానని జేఏసీ కోర్టు అనుమతి తెచ్చుకున్న కూడా ఎక్కడివాళ్లను అక్కడ అరెస్ట్ చేసి సభను భగ్నం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ మధ్య వరంగల్ పట్టణంలో ఒక మహిళా సంఘం వాళ్లు హాల్ మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా అక్కడి పోలీస్ కమిషనర్ అనుమతి ఇవ్వకుండా చేయడంలో హైదరాబాద్ నుంచి ఆదేశాలు ఉన్నాయన్న విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇట్లా అనేకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆటా పాటా మాట మీద విరుచుకుపడుతున్న నిర్బంధానికి పరాకాష్ట– ధర్నా చౌక్ ఎత్తివేత. 1985–89 మధ్యకాలంలో ఎన్టీ రామారావు పరిపాలన నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు ఈనాటి పాలకులు. అప్పుడు కూడా తెలంగాణలో ఆటా మాటా పాటా బంద్ అయ్యాయి. ఇదేం ధోరణి? తన 25వ సినిమా విజయం సాధించలేకపోవడంతో ఇక పూర్తి స్థాయిలో రాజకీయాలనే వృత్తిగా చేసుకునే ఆలోచనకు వచ్చారు నటుడు పవన్ కల్యాణ్. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభించారాయన. ఆ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయడాన్ని ఎవరయినా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్న ఎందుకు వేయవలసి వచ్చిందం టే– సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆనాటి ఎంపీ జగన్మోహన్రెడ్డి పార్లమెంట్లో ప్లకార్డ్ పట్టుకున్నారు. దానిని కారణంగా చూపించి, ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన మానుకోటకు బయలుదేరితే రచ్చ రచ్చ చేసి తీవ్ర ఉద్రిక్తతలకు కారకులయ్యారు కొందరు. వారే ఈరోజు అధికారంలో ఉండి పవన్కల్యాణ్కు ఎర్రతివాచీ పరచడం వెనుక మతలబు ఏమిటి? పవన్కల్యాణ్∙కేసీఆర్ తాట తీస్తానన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకు భరించలేని దుఃఖంతో పదకొండురోజులు అన్నపానాలు మానేసి బాధపడ్డానన్నారు. జగన్మోహన్రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ ఒక్క పరుష పదప్రయోగం అయినా చేశారా? మరెం దుకు ఈ తేడా? అప్పుడు పరిస్థితి వేరు అంటారేమో! అప్పుడయినా ఇప్పుడయినా భావ ప్రకటనా స్వేచ్ఛకు అర్థం మాత్రం ఒకటే. ఇప్పుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగడాన్ని కూడా ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. ఎవరికయినా స్వేచ్ఛ ఉంది. కానీ పవన్ మాట్లాడుతున్నదేమిటి? కేసీఆర్ తాట తీస్తానన్న నోటితోనే, ‘ఆయన అంటే నాకు మొదటి నుండి చాలా అభిమానం’ అంటున్నారు. విభజన బాధతో పదకొండు రోజులు పస్తు ఉన్నానన్న నోటితోనే జై తెలంగాణ నినాదం వందేమాతరం అంత పవిత్రమయిందని కూడా అంటున్నారు. ఆయన మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మాలా? అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండాల్సిన అవసరంలేదు, మారవచ్చు. అది ముందు చెప్పాలి. అప్పుడు నేను మాట్లాడిన మాటలు పొరపాటు, చెంపలు వేసుకుంటున్నాను, నా అభిప్రాయం తప్పు అని ప్రజల ముందుకు రావాలి. ఆయన ఆ పని చెయ్యలేదే! రాజకీయ పార్టీ పెట్టానంటున్న పెద్దమనిషి ప్రభుత్వాలను విమర్శించను అంటున్నాడంటే ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయ అవినీతికీ, దివాలాకోరుతనానికీ నిదర్శనంగా నిలిచిన ఓటుకు కోట్లు కేసు గురించి మాట్లాడను అని చెబుతున్న ఈ నాయకుడు ఈ దేశానికే నీతిపాఠాలు చెబుతానంటూ బయలుదేరాడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకే ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. నిజం చెప్పాలంటే పవన్ కల్యాణ్ది అక్కడా ఇక్కడా కూడా రాగ్ దర్బారీయే. ఉద్యమ విజయశక్తిని నరనరాన నింపుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులూ, శ్రేణులూ తమ అధినేత తాట తీస్తానన్న మాటకు క్షమాపణ చెప్పి, నిరాహారంగా పడుకుని బాధ పడ్డానంటూ తెలంగాణను అవమానించినందుకు ఆ తప్పును కూడా ఒప్పుకుని తెలంగాణ వీధుల్లో కదులు అని పవన్ కల్యాణ్ను ఎందుకు నిలదీయలేక పోయారు? పైగా సమర్థనలకు పూనుకోవడం వెనుక ఉన్న ఎజెండా ఏమిటి? జగన్ యాత్రను హైజాక్ చేయడానికే! వెయ్యి మందికి పైగా విద్యార్ధులు, యువకులు ఆత్మాహుతి చేసుకున్న తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడు రక్తం ధారపోస్తాను అని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆపై ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాడు. అక్కడ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువ రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సాగుతున్నది. జనం నుంచి ఆయనకు అద్భుతమయిన ఆదరణ లభిస్తున్నది. ఆయన పాదయాత్ర దారిలోనే పవన్ కల్యాణ్ను ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆయన ప«థక రచనలో భాగంగానే ఈ పర్యటన సాగుతున్నది. జగన్మోహన్రెడ్డి శాసనసభలో ప్రతిపక్షనేత, ఆ కారణం వల్ల ఆయనది కేబినెట్ హోదా. శాసనసభలో ప్రతిపక్షాన్ని ‘గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్’ అంటారు. 2014 ఎన్నికల్లో అధికార పక్షానికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్కూ వచ్చిన ఓట్ల తేడా రెండు శాతం కంటే తక్కువ. అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ఆయన ఆ మధ్య అధికార పక్షానికి చెందిన ఒక ఎంపీ నడిపే బస్ ప్రమాదానికి గురైనప్పుడు, ఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పోస్ట్ మార్టం చెయ్యకుండా ఎందుకు తరలించారని జిల్లా కలెక్టర్ను నిలదీసినందుకు ఆయన మీద కేసు పెట్టారు. ఏ హోదా లేని సినిమా నటుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తుంటే మాత్రం అనంతపురం జిల్లాలో మంత్రి, ప్రజా ప్రతినిధులూ, అధికారులూ ఆయన ఆదేశిస్తే ఫైళ్లు చంకన పెట్టుకుని వెళ్లి సమీక్షలు జరిపారు. పవన్ కల్యాణ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఒక్క వార్డ్ మెంబర్ కూడా లేడు. జగన్మోహన్రెడ్డికి లభి స్తున్న ప్రజాదరణను దారి మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఈ ఎత్తు వేస్తున్నట్టు కనిపిస్తుంది. పార్ట్టైం రాజకీయాలను ప్రజలు ఎప్పుడూ ఆదరించిన దాఖలాలు చరిత్రలో లేవు. అటు తెలంగాణలో అయినా, ఇటు ఆంధ్రప్రదేశ్లో అయినా పవన్ కల్యాణ్ విషయంలో జరుగుతున్నది ఒకే విధంగా కనిపిస్తున్నది. 2019 లోనో, ఇంకొంచెం ముందుగానో వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం రెండు రాష్ట్రాల అధిపతులను పట్టి పీడిస్తున్న కారణంగానే పవన్ కల్యాణ్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నట్టు అర్థం అవుతున్నది. మరి పవన్కల్యాణ్ ఎందుకు అక్కడా ఇక్కడా ‘రాగ్ దర్బారీ’ అందుకున్నారు? ఏది ఏమయినా అభిమానుల పేరిట ఉన్మాద మూకలను వెంటేసుకుని తిరిగే సినిమా నటుడు రాజకీయాల్లో తమకు ఉపయోగపడతాడని రెండు రాష్ట్రాల అధికారపక్షాలు భావిస్తూ ఉంటే పొరపాటు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే ఈ వికృత క్రీడకు తెర తీయడం ఆందోళన కలిగించే విషయమే. దీని గురించి రెండు రాష్ట్రాల ప్రజలూ ఆలోచించుకోవాల్సిందే. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఉచిత విద్యుత్.. ఒకింత ఊరట
డేట్లైన్ హైదరాబాద్ నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల లబ్ధి జరుగుతుంది. కానీ పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! కరెంట్ బిల్లులు కట్టనందుకు బావి దగ్గర నుంచి ఫ్యూజులు పీక్కొచ్చి ఎంఆర్ఓ కార్యాలయంలోనో, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లోనో పెట్టేసుకోవడం చూశాం. నీరందక కళ్ల ముందే ఎండిపోతున్న చేనును చూసి దిక్కుతోచకుండా మిగిలిన రైతు పరిస్థితి చూశాం. అలాంటి రైతు ‘ఊరన్నా ఇడిచిపెట్టి పోవాలె, ఉసురన్నా తీసుకోవాలె.’ బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసిన తెలంగాణ రైతుల దైన్యం ఎలా ఉండేదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, చంద్రబాబునాయుడి ప్రభుత్వ హయాంలో చూశాం. అప్పుడే, ‘నేను అధికారంలోకి వచ్చాక ఉచిత కరెంట్ ఇస్తాను, కరెంట్ బిల్లుల బకాయిలు రద్దు చేస్తాను’ అని అప్పటి ప్రతిపక్షనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. దీనికి చంద్రబాబు స్పందన ఏమిటో కూడా మన విన్నాం.‘ఆ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే!’ అని ఎద్దేవా చేసిన చంద్రబాబునాయుడు తరువాత డాక్టర్ వైఎస్ తను ఇచ్చిన హామీని నెరవేర్చడం స్వయంగా చూశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సర్కార్ కార్యాలయాల్లో బందీలుగా ఉన్న ఫ్యూజులను పైసా అపరాధ రుసుం కట్టించుకోకుండానే రైతులకు ఎట్లా తిరిగి ఇచ్చిందీ కూడా చంద్రబాబు వీక్షించారు. హామీ మేరకు ఉచిత కరెంట్ ఎట్లా ఇచ్చిందీ, కరెంట్ బిల్లుల బకాయిలు ఎట్లా మాఫీ చేసిందీ కూడా ఆయన గమనించారు. అప్పటికి దేశంలో ఇంకా విద్యుత్ సంస్కరణలు ఊపందుకోలేదు. ఈ చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్ధికభారం మోయవలసి వచ్చింది. అయినా రాజశేఖరరెడ్డి వెనక్కు తగ్గలేదు. ఫతేమైదాన్లో ప్రమాణ స్వీకారం చేశాక ఆయన మొదటి సంతకం ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్ మీదనే చేశారు. ఆయన జీవించినంత కాలం అదే విధానం అమలు పరిచారు. రాజశేఖరరెడ్డి నిర్ణయం తెలుగు ప్రాంత రైతులకు గొప్ప ఊరట. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలంగాణ రైతులకు మరీ పెద్ద ఊరట. తెలంగాణలో అత్యధికంగా, ఇరవై అయిదు లక్షల బోరు బావులు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. కరెంట్ అవసరం ఆనాడు తెలంగాణ రైతులకే ఎక్కువ. ఇప్పటికీ తెలంగాణలో బోరు బావుల మీద ఆధారపడి చేస్తున్న వ్యవసాయం శాతం అధికమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట తలపెట్టిన ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే పరిస్థితి మారుతుంది. బోరు బావుల అవసరం పూర్తిగా తగ్గిపోతుంది. కాలువలు పారుతున్నప్పుడు బోర్ల అవసరం ఉండదు. పైగా భూగర్భ జలాల పరిస్థితి కూడా చాలా మెరుగు పడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఏర్పడిన నూతన ప్రభుత్వం నిరంతరాయంగా వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే ఉంది. రైతులకు మంచిరోజలు 2017 డిసెంబర్ 31 రాత్రి 12 గంటల ఒక్క నిమిషం, అంటే నూతన సంవత్సరం లోకిఅడుగుపెట్టిన క్షణం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 24 గంటల విద్యుత్ సరఫరా మీద అనుకూలంగా, ప్రతికూలంగా జరుగుతున్న చర్చలూ, విమర్శలూ, విశ్లేషణల గురించి తరువాత మాట్లాడుదాం. ఇందులో 40 శాతం విద్యుత్ సరఫరా, వ్యవసాయం కోసం ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది. దానికి ప్రభుత్వం భరించాల్సిన మొత్తం సంవత్సరానికి రూ. 600 కోట్లు. ప్రాజెక్టులు పూర్తయి కాలవల్లోకి నీళ్లొస్తే ఈ వ్యయం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల కోసం వాడే విద్యుత్ భారం ప్రభుత్వానికి తప్పదు. ఏది ఏమైనా తెలంగాణ రైతు వ్యవసాయం మీద ఆశలు పెంచుకునే మంచిరోజులు వచ్చాయని చెప్పాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఉచితంగా విద్యుత్ వస్తున్నది, అందునా 24 గంటల సరఫరా జరుగుతున్నది కాబట్టి వృథా అయ్యే అవకాశాలను కూడా ప్రభుత్వం గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆటోమేటిక్ స్టార్టర్ల విషయంలో ప్రభుత్వం ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. వాటిని తొలగింప చెయ్యడానికి పై స్థాయి నుంచి కింది దాకా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పని చేయవలసి ఉంటుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మీద వస్తున్న విమర్శల గురించి ఆలోచిస్తే– 2003 ప్రాంతాల్లో ప్రారంభమైన విద్యుత్ సంస్కరణలు తరువాత కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ఒకటి, రెండు ప్రభుత్వాల హయాంలలో (పదేళ్లలో) ఊపందుకుని విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు పూర్తయి అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ లభ్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని జేఏసీ అంచనా. ఇందుకు ఆధారంగా జేఏసీ నాయకులు 2017 –2018 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వార్షిక నివేదికలో రూపొందించిన వివరాలను చూపుతున్నారు. అయితే దేశమంతటా ఇబ్బడి ముబ్బడిగా కరెంట్ ఉత్పత్తి అయి మిగులు పరిస్థితిలోకి వెళితే ఆ వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చెయ్యడానికి వాడుకుంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. జేఏసీ చెబుతున్నది కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించడం కూడా సరికాదు. 24 గంటల విద్యుత్ సరఫరా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వల్ల పడనున్న భారం ఏటా రూ.600 కోట్లని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా అందుకోసం విద్యుత్ సంస్థల మీద పది వేల కోట్ల రూపాయల మేర భారం పడనుందనీ, అందులో రూ. 5,500 కోట్ల భారాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తానని అంటున్నదని జేఏసీ చెబుతున్నది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దానికీ, జేఏసీ చూపుతున్న లెక్కలకూ చాలా వ్యత్యాసం ఉంది. ఎంతైనా ప్రజల డబ్బే కాబట్టి ప్రభుత్వం దీనికి సరైన వివరణ ఇస్తే బాగుంటుంది. అంతిమంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోకుండా చూడాల్సిన బాధ్యతా ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 24 గంటల విద్యుత్ సరఫరా ఫలితాలు రెండు రోజుల్లోనే తెలియవు. కొంతకాలం పరిశీలించాల్సిందే. ఎకరాకు ఎనిమిదివేలు రైతులకు లాభం చేకూర్చే మరో కార్యక్రమం– ఎకరాకు ఏటా ఎనిమిది వేల రూపాయలు.రెండు విడతలుగా రైతులకు చెల్లించే ఈ మొత్తం ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా మొత్తం అవసరాలు తీర్చలేకపోయినా కూడా రైతుకు ఊరటే. కానీ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు– కౌలు రైతులకు ఈ పథకం వర్తింపచేసే ప్రసక్తే లేదని. తెలంగాణలో ఎంతమంది రైతులు సొంతంగా వ్యవసాయం చేస్తున్నారు, ఎంత భూమి కౌలుదారుల చేతుల్లో ఉంది అనే లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఆ లెక్కలు తేల్చి ఈ పథకం అమలు చేస్తే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది. పైగా పేద, ధనిక భేదం లేకుండా అందరికీ ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తామనడం సరయినది కాదు. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల తప్పక కొంత లబ్ధి జరుగుతుంది. కానీ ఇంకా తక్కువ సంఖ్యలోనే అయినా పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి ఏటా 8 వేల రూపాయల ఆర్థికసాయం మంచి ఆలోచనే అయినా రైతులను వేధిస్తున్న ఇతర సమస్యల మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతో ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రకటించిన రైతు సమాఖ్యల మీద పెద్ద పెట్టున విమర్శలు రావడంతో మళ్లీ వాటి ఊసే ఎత్తడంలేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న జన్మభూమి కమిటీల లాగా కాకుండా రైతు సంక్షేమానికి పాటు పడే, న్యాయం జరిగేటట్టు చూసే ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఉంది. పంటకు గిట్టుబాటు ధర రాక, నాణ్యమైన విత్తనాలు లభిం చక, పంటల బీమా లేక ఊపిరి సలపక రైతుల ఉసురు తీస్తున్న ఉదంతాలు అనేకం. పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగలేదన్న సంగతి వాస్తవం. ముప్పిరిగొంటున్న ఈ సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపకుండా కేవలం 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి, ఏడాదికి ఎనిమిది వేలు ఇచ్చినంత మాత్రాన రైతు పరిస్థితి బాగుపడదు. మిగిలిన రైతు సమస్యల పరిష్కారమూ ముఖ్యమేనని చెప్పడం అందుకే. గడువు కంటే ముందుగానే వస్తాయంటున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్ర శేఖరరావు ఈ సమస్యలతో పాటు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తేనే సాధ్యం. అంతేతప్ప చంద్రబాబునాయుడి మార్గంలో రాజకీయ పేకాటలో జోకర్ వంటి పవన్కల్యాణ్ లాంటి వాళ్లు సాయపడతారనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్లను మూయించి ఎన్నో కుటుంబాలను కాపాడిన ముఖ్యమంత్రికి బహుశా ఆ ఆట రాదేమో. పేకాటలో జోకర్లు ఎన్ని ఉన్నా ఒరిజినల్ సీక్వెన్స్ ఒకటి తప్పనిసరి. లేకపోతే ఆటలో ఓటమే. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బీజేపీ గెలుపుతో.. రూటు మార్చిన చంద్రబాబు
డేట్లైన్ హైదరాబాద్ గుజరాత్లో బీజేపీ ఓడిపోతుందని గామోసు ఏపీ ముఖ్యమంత్రి కొంచెం స్వరం పెంచి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్, రాజధానికి సాయం విషయాల్లో కేంద్రాన్ని విమర్శిం చడం మొదలుపెట్టారు. పోలవరాన్ని కేంద్రానికి దండం పెట్టి అప్పజెప్తానన్నారు. మిత్రుడు బలహీనపడితే వదిలేసి, కొత్త మిత్రులను వెతుక్కోవడం ఆయనకు అలవాటే. డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు బీజేపీ గెలవడంతో ఆయన రూటు మార్చి, బీజేపీని విమర్శించే టీడీపీ తమ్ముళ్లకు నోరు మూసుకోండి అని ఆదేశాలు పంపారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి ఖాయం అన్న అభిప్రాయం మొన్న ఫలితాలు వెలువడే వరకూ చాలా మందిలో ఉండేది. ఏకంగా 22 ఏళ్ళ పాలన అధికార పార్టీ బీజేపీపట్ల ఎంతో వ్యతిరేక తను తెచ్చిపెట్టి ఉంటుంది. దానికి తోడు రాష్ట్ర స్థాయిలో సమర్ధ నాయకత్వం లేదు. జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాల ప్రతికూల ప్రభావం, పెరిగి పోయిన మతపరమయిన అసహనం వెరసి బీజేపీకి ఓటమి తప్పదనే భావ నను కలిగించి ఉండొచ్చు. వీటన్నిటికి తోడు∙కాంగ్రెస్ పార్టీ ప్రచార సరళి మెరుగుకావడమూ, ముఖ్యంగా తాజాగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన రాహుల్ గాంధీలో కొంత రాజకీయ పరిణతి కనిపించడం, అది ఆయన ప్రచార ప్రసంగాలలో ప్రతిబింబించడమూ మొద లైన అంశాలన్నీ కలసి కాంగ్రెస్ను గుజరాత్లో గెలిపిస్తాయని అనుకున్నారు. మోదీ, అమిత్ షా జోడీ కూడా ఒక దశలో ఓడిపోతున్నామనే అనుకున్నారు. అందుకే మోదీ చివరి వారం ప్రచారంలో తన శక్తియుక్తులన్నిటినీ ప్రయో గించాల్సి వచ్చింది. ప్రధాన మంత్రి స్థాయి నుంచి చాలా కిందికి దిగజారి మాట్లాడాల్సి వచ్చింది. చివరి రోజుల్లో ఆయన చేసిన ప్రచారం.. సొంత పార్టీ వారే ముక్కున వేలేసుకునేట్టు చేసింది. చావు తప్పి కన్ను లొట్టబోయి... కాంగ్రెస్కు పాకిస్తాన్తో సంబంధాలు అంటగట్టారు. తనను చంపడానికి కాంగ్రెస్ సుపారి ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ వారు ఔరంగజేబు వార సులన్నారు, గుజరాత్ అస్మిత (ఆత్మగౌరవం) గురించి పదే పదే మాట్లాడి ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొట్టారు. తనను నీచ జాతి వాడు అని మణి శంకర్ అయ్యర్ దూషించాడని, అది గుజరాతీలు అందరినీ తిట్టినట్టేననీ రెచ్చగొట్టారు. మణిశంకర్ అయ్యర్కు హిందీ సరిగా రాదు, అయినా ఆయన మోదీ మీద చేసిన వ్యాఖ్య ఒక కులాన్ని కానీ, జాతిని కానీ ఉద్దేశించి చేసింది కాదు. వ్యక్తిగతంగా మోదీని ఉద్దేశించి చేసింది. అయినా మోదీ దాన్ని వాడు కుంటారని, నష్టం జరుగుతుందనీ తెలుసు కనుక రాహుల్ ఆ వ్యాఖ్య చేసి నందుకు మణిశంకర్ అయ్యర్ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించారు. 2014 ఎన్నికల సందర్భంగా కూడా మణిశంకర్ అయ్యర్ మోదీని ‘చాయ్ వాలా’ అని సంబోధించి బీజేపీ నెత్తిన పాలు పోసిన విషయం అందరికీ తెలి సిందే. ఇలా దొరికిన ప్రతిదాన్నీ వాడుకున్నా గుజరాత్లో బీజేపీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచింది. 2014 ఎన్నికల నినాదం ‘కాంగ్రెస్ ముక్త భారత్’ ఇక అసాధ్యమని గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఫలితాల తదుపరి మోదీ పార్లమెంట్లోకి వెళుతూ విజయ సంకేతం ఇచ్చి నప్పుడు సైతం ఆయన ముఖంలో కనిపించినది మేకపోతు గాంభీర్యమే తప్ప, సహజ విజయహాసం కాదు. మోదీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల వ్యతిరేకత వల్ల కావచ్చు, హార్ధిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మెవాని త్రయం తిరుగుబాటు వల్ల వచ్చిన మార్పు కావొచ్చు గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం పెరిగింది. సరిగ్గా ఎన్నికలకు కొద్దిగా ముందు శంకర్సింగ్ వఘేలా పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టకపోతే కాంగ్రెస్కు ఇంకో పది సీట్లు పెరిగి ఉండేవి. గుడ్డిలో మెల్ల అన్నట్టు బీజేపీ హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ను ఓడించి అధికారం కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ ముక్త భారత్ను సంపూర్ణం చెయ్యడానికి తామిక ఐదు రాష్ట్రాల దూరంలోనే ఉన్నామని బీజేపీ చెప్తున్నది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే, ఏం చేసైనా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కైవసం చేసుకోవడమేనని ఇప్పుడు అందరికీ అర్థం అవుతున్నది. అయినా ఒక రాజకీయ పార్టీని లేకుండా చెయ్య డం ప్రజాస్వామ్యంలో సాధ్యపడదని కమలనా«థులకు గుజరాత్ ఫలితాల తరువాత అర్థమై ఉంటుంది. కాంగ్రెస్ ముక్త భారత్ అసాధ్యం 2018 ప్రారంభంలో మరో నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జర గనున్నాయి . వాటిల్లో మూడు చాలా చిన్న రాష్ట్రాలు. కర్ణాటక మాత్రమే పెద్ద రాష్ట్రం, పైగా అది కాంగ్రెస్ పాలనలో ఉంది. పంజాబ్ తరహా ఎన్నికల వ్యూహాన్నే కనుక కాంగ్రెస్ కర్ణాటకలో కూడా అనుసరిస్తే అక్కడ అది మళ్లీ గెలవడం ఖాయం. ఏ ఎన్నికనైనా మోదీకి, రాహుల్కు మధ్య పోటీగా చూస్తే కాంగ్రెస్ తట్టుకుని నిలబడటం కష్టం. మోదీకి దీటుగా రాహుల్ నిలవడానికి ఇంకా కొంత సమయం కావాలి. పంజాబ్లో ఓటర్లు అది కెప్టెన్ అమరేందర్ సింగ్కు, బాదల్కు మధ్య పోటీగా చూసినందువల్లనే కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటకలో మోదీ గుజరాత్లో లాగా అస్మిత అంటూ ప్రజల్ని రెచ్చగొట్టలేరు. ప్రస్తుతానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు దీటయిన నాయకుడు కర్ణాటక బీజేపీలో కానరాడు. కర్ణాటక విజయాన్ని కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్కు బహుమతిగా ఇస్తామని సిద్దరామయ్య ఇప్పటికే ప్రక టించారు. 2018 చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్ రాష్ట్రల్లో బీజేపీనే అధికారంలో ఉంది. గుజరాత్ అంత సుదీర్ఘ కాలంగా కాకపోయినా మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉంది. అంతో ఇంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని పిస్తున్నది ఆ రాష్ట్రాల్లోనే. రాజస్థాన్లో ఏ పార్టీకీ రెండోసారి అధికారం ఇవ్వడం సాధారణంగా జరగదు. అసలు ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలతోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్వహించాలన్న ఆలోచనలో మోదీ ఉన్నట్టు వార్తలు వస్తు న్నాయి. అత్యధిక రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకున్నామన్న సంతోషంలో తలమునకలు అవుతున్న బీజేపీ ఆయా రాష్ట్రాల్లో సహజంగానే ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల వ్యతిరేకత తోడై జమిలిగా దెబ్బ కొడతాయేమో చూసుకోవాలి. ఈ స్థితిలో కాంగ్రెస్ ముక్త భారత్ కలగానే మిగిలిపోతుందేమో అని గుజరాత్ ఎన్నికల ఫలితాల విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో దక్షిణాదిని కైవసం చేసుకోవాలన్న బీజేపీ కల నెరవేరే అవకాశం కనిపించడం లేదు. కేరళ మీద ఆశలు ఎలాగూ లేవు. జయలలిత మరణం తరువాత తమిళనాడును తమ అదుపులోకి తెచ్చుకోవాలన్న కమల నాథుల ప్రయత్నాలు నెరవేరేట్టు లేవని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తు న్నాయి. ఇక మిగిలినవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు. నమ్మదగని మిత్రుడు చంద్రబాబు నాయుడుతో కలసి అధికారం పంచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఒక పక్క, దాగుడు మూతలాగే చంద్రశేఖర్రావు అధికారంలో ఉన్న తెలంగాణ మరో పక్క. ప్రతిసారీ మేం మిత్ర పక్షం చేతుల్లో మోసపోతూనే ఉన్నాం అని నిన్న బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అన్న మాటలే చంద్రబాబు నమ్మదగ్గ మిత్రుడు కాదనడానికి రుజువు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసి నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని 18 శాతం ఓట్లు సంపాదించుకున్న చరిత్ర కలిగిన బీజేపీ ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం నీడన గడపాల్సి రావడానికీ, తెలంగాణలో టీఆర్ఎస్ పుట్టుక కంటే చాలా ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా సుష్మాస్వరాజ్ వంటి నాయ కులను ముందుంచి నడిచినా, తెలంగాణ ఏర్పాటుకు పూర్తి సహకారం అందించినా గానీ తమ పార్టీ.. నిజాంను కీర్తిస్తూ, మజ్లిస్కు పెద్ద పీట వేస్తున్న కేసీఆర్ ధాటికి తట్టుకోలేని దుస్థితిలో ఉండటానికీ కారణం ఏమిటో అందరికీ తెలుసు. 1998లో 18 శాతం ఓట్లు తెచ్చుకున్న నాటి నుంచే స్వతంత్రంగా కొనసాగి ఉంటే బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కచ్చితంగా బలమయిన రాజకీయ శక్తిగా ఎదిగి ఉండేది. మిత్రుడి చేతుల్లో ప్రతిసారీ మోసపోతూనే ఉన్నామని వీర్రాజు ఇప్పుడు బాధ పడటం చేతులు కాలాక ఆకులు పట్టు కున్నట్టుంది. 2019 ఎన్నికల్లో సొంతంగా గెలవలేమని భావిస్తే కేసీఆర్ బీజేపీతో పొత్తుకు సిద్ధపడతారని తెలిసిందే. బీజేపీ స్థానిక నాయకత్వం కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నట్టుంది. గుజరాత్ ఫలితాలు చూసి తెలంగాణలో కూడా మేం గెలుస్తాం అని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రక టించారు సరే, అందుకు అనువైన పరిస్థితులైతే కనిపించడం లేదు. బెడిసికొట్టిన టీడీపీ అంచనాలు గుజరాత్లో బీజేపీ ఓడిపోతుందన్న అభిప్రాయం ఏపీ ముఖ్యమంత్రికి కూడా కలిగినట్టుంది. అందుకే కొంచెం స్వరం పెంచి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్, రాజధానికి సాయం విషయాల్లో కేంద్రాన్ని విమర్శించడం మొద లుపెట్టారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన పోలవరాన్ని కేంద్రానికి దండం పెట్టి అప్పజెప్తానన్నారు. మిత్రుడు బలహీనపడితే వదిలేసి, కొత్త మిత్రులను వెతుక్కోవడం చంద్రబాబుకు అలవాటే. గెలవడానికి ఆయనకు ఎవరో ఒకరి సాయం కావాలి. ఆయన స్వయం ప్రకాశితుడు కాదని అన్ని ఎన్నికలూ రుజువు చేశాయి. 1999, 2014 రెండుసార్లూ ఆయన అధికారంలోకి వచ్చింది బీజేపీ కారణంగానే. అవసరం తీరాక బీజేపీ రథం ఎలా దిగిపోయారో కూడా చూసాం. గుజరాత్లో బీజేపీ ఓడిపోతే మోదీ బలహీన పడతారు. అప్పుడు తెగదెంపులు చేసుకుని బీజేపీ కారణంగానే రాష్ట్రానికి తాను ఏమీ చెయ్యలేక పోయానని 2019లో ప్రజల ముందుకు వెళ్లాలనేది ఆయన ఆలోచనగా కని పిస్తుంది. పవన్కల్యాణ్లో ఆయన ఎట్లాగూ కొత్త మిత్రుడిని చూస్తున్నారు. డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు గుజరాత్లో బీజేపీ మళ్లీ గెలిచి కూర్చుంది. అయితే ఈ విషయాలు టీడీపీ నాయకుడు రాజేంద్రప్రసాద్కు ఏం తెలుసు? విశ్రాంతి కోసం అధినేత మాల్దీవులకు వెళ్లే ముందటి వైఖరినే వ్యక్తం చేశారు. కానీ పథకం మారింది. బీజేపీని విమర్శించే వైఖరి మారింది. నోరు మూసుకోండి అని తెలుగుదేశం తమ్ముళ్లకు మాల్దీవుల నుంచి ఆదేశాలు అందాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోము వీర్రాజు టీడీపీని, ప్రభుత్వాన్ని కడిగి పారేశాడు. మా దయవల్లే బీజేపీకి ఏపీలో నాలుగు సీట్లు వచ్చాయని రాజేంద్రప్రసాద్ అంటే, 2014లో మేం లేకుంటే టీడీపీ గెలిచేదా? అన్నాడు వీర్రాజు. అంతే కాదు నోట్లు రద్దు చేసి మేం గెలు స్తుంటే, నోట్లు పంచి టీడీపీ గెలుస్తున్నది అని ఆయన నంద్యాల ఉప ఎన్ని కను గుర్తు చేశారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కావడంతో ఆ పార్టీ నాయకులకు స్వేచ్ఛ లభించినట్టుంది. అందుకే ఏపీలో బీజేపీ బలపడకూడదంటే సహించబోం అని హెచ్చరించారు వీర్రాజు. ఆయన టీడీపీ మీద, చంద్రబాబు మీదా ఇంకా చాలా విమర్శలే చేసారు. గుజరాత్ ఫలితాల తరువాత బీజేపీతో తెగదెంపుల ఆలోచన పక్కన పెట్టేసిన చంద్రబాబు మాల్దీవుల నుంచి వచ్చాక నష్ట నియం త్రణ కోసం ఏం చేస్తారో చూడాలి. వ్యాసకర్త, ప్రముఖ పాత్రికేయులు దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
పేదలుంటే పెట్టుబడులు రావా?
మెట్రో పనులైనా, పోలవరం ప్రాజెక్ట్ పనులైనా డాక్టర్ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదలయ్యాయన్న వాస్తవం ఎట్లా మరచిపోతారు? రాజకీయ పార్టీలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక కల సాకారమైన సమయంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది మా గొప్పే అనుకుంటే ఎట్లా? మరింత ఆలస్యం జరగకుండా ఆ మిగిలిన పనులు సత్వరం పూర్తి అయ్యేటట్టు చూసి మెట్రోను పరుగులు పెట్టిస్తే కార్పొరేషన్లో గెలిపించినందుకు వారి రుణం తీర్చుకున్నట్టయినా ఉంటుంది. ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సభలు (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్–జీఈఎస్) ముగిశాయి. హైదరాబాద్ సౌందర్యానికీ, తెలంగాణ ప్రభుత్వ ఆతిథ్యానికీ విదేశీ ప్రతినిధులంతా మురిసిపోయారు. ఆ జ్ఞాపకాలను మూటగట్టుకుని తిరిగివెళ్లారు. ఏ మహా నగరానికైనా కొంచెం మరమ్మతు కావాలనుకుంటే అప్పుడప్పుడు ఇటువంటి ప్రపంచ స్థాయి సంబ రాలు అవసరమే. ఇప్పుడు జరిగింది పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన సదస్సు కాదు. దీని కారణంగా నూతన తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు వచ్చిపడవు కూడా. ఆయా దేశాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుని, తాము లాభం పొందేందుకు అవకాశం కలిగించే వేదికగా ఈ సదస్సును నిర్దేశించారు. ఏదయితే ఏమి, ఎనిమిదవ జీఈఎస్కు దక్షిణ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణ వాసులందరికీ సంతోషం కలిగించే విషయమే. ఇది అమెరికన్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో కలసి ఏర్పాటు చేసిన సదస్సు. ఈ మూడురోజుల సదస్సు ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించవలసి రావడం అనివార్యం. అందునా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ముఖ్య అతిథిగా హాజరైన సభలకు మనం హైదరాబాద్ను వీలయినంత అందంగా తయారు చెయ్యడం అవసరమే. ఇవాంక పర్యటించే అవకాశం ఉన్న ప్రాంతాలను మరింత అందంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసింది. బిచ్చగాళ్లందరినీ ఆ మూడురోజులూ ఎవరికంటా, ముఖ్యంగా ఇవాంక తదితర విదేశీ అతిథుల కంట పడకుండా దాచెయ్యగలిగాం. నగరాన్ని సుందరంగా అలంకరించాం. ఈ సభలు ఆశించిన ఫలితాలు సాధిం చాయా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుందేమో కానీ తక్షణ ఫలితం, అందునా తెలంగాణ రాష్ట్రానికి ఒనగూడింది మాత్రం మన రాష్ట్ర యువ మంత్రి కేటీ రామారావుకు అమెరికా సందర్శన కోసం స్వయంగా ఇవాంక నుంచి ఆహ్వానం అందడం. సదస్సులో ఒక గోష్టికి ఆయన సంధానకర్తగా వ్యవహరించి అందరి చేతా శభాష్ అనిపించుకోవడం. ఐటీ అంటేనే ఇవాంకా ట్రంప్ అని మన యువ ఐటీ మంత్రిగారు కొత్త నిర్వచనం చెప్పిన తరువాత అమెరికా సందర్శనకు ఆయనకు ఆ మాత్రం ఆహ్వానం రాకుండా ఎట్లా ఉంటుంది? ఈ సదస్సు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇంతకు మించి ఏమైనా లాభం జరిగి ఉంటే ప్రభుత్వం వారో, ఈ రంగంలో నైపుణ్యం కలవారో చెప్తే అర్థం చేసుకుని రాష్ట్ర ప్రజలు కూడా ఆనందిస్తారు. చాలాకాలం బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉన్నందుకేనేమో మనలో ఇంకా బానిస మనస్తత్వం అంతరించలేదు. అతిథి మర్యాదలకు లోటు చెయ్యని సంస్కారం, సంప్రదాయం మన సొంతమైనా ఆ అతి«థి మర్యాదలు అతిగా మారి మన బానిసత్వ లక్షణాలను బయట పెడుతుంటాయి. మొన్న ముగి సిన ఈ అంతర్జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడి కూతురికి మనం చేసిన మర్యాదలు ఆ కోవలోకే వస్తాయి. పేదరికాన్ని దాచగలిగామా! సరే, సభలు ముగిశాయి. మన పేదరికాన్ని దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా మాయమైన బిచ్చగాళ్లు ఎక్కడున్నారో వెతుక్కోవాలి ఇప్పుడు. బహుశా ఇప్పటికే మళ్లీ రోడ్ల మీదకు వచ్చేసి ఉంటారు. విదేశీ అతి థుల ముందు మన పేదరికాన్ని తాత్కాలికంగా దాచిపెట్టుకునే ప్రయత్నానికి బదులు దాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తే ఎవరైనా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. అది జరగదు. మన ప్రయత్నాలు బిచ్చగాళ్లను నిర్మూలిం చడం కాకుండా, భిక్షాటనను నిర్మూలించే దిశగా సాగాలి. చివరి మనిషి కూడా పేదరికం నుంచి బయటపడ్డ నాడు బంగారు తెలంగాణ సాధించామని చెబితే ఆ ప్రభుత్వాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. హైదరాబాద్ నగరంలో భిక్షాటన ఒక వ్యాపారంగా మారిందని, దిక్కూ మొక్కూ లేనివాళ్లను, ఎందరో పసివాళ్లను తెచ్చి రోజంతా రోడ్ల మీద అడుక్కునేటట్టు చేసి, వాళ్లు సంపాదించినదంతా దోచుకుపోతున్న ఒక మాఫియా పని చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదంటే ఆశ్చర్యమే. అద్భుతంగా పని చేసిందని అమెరికా పోలీసుల ప్రశంసలు అందుకున్న హైదరాబాద్ పోలీసుల దృష్టి ఇటువంటి నేర సామ్రాజ్యాల మీద పడకపోవడాన్ని ఎట్లా చూడాలి? పోలీసులు అత్యుత్సాహం కొలువుల కొట్లాట కోసం కలిసి మాట్లాడుకుంటామని కోర్టుల అనుమతి కూడా పొందిన వారిని సభలకు పోకుండా అడ్డుకోవడానికి అరెస్టులు చెయ్యడం, తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆవేదన చెందుతున్న యువకులను ఉస్మానియా హాస్టల్ గదుల తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్లి చావగొట్టి అరెస్టులు చెయ్యడం, కవరేజీకి పోయిన విలేకరులను అరెస్ట్ చేసి ఠాణాలో గంటల తరబడి కూర్చోబెట్టడం వంటి పనుల్లో తీరిక లేకుండా ఉన్న మన పోలీసులకు రోడ్ల మీద అడుక్కునే వాళ్ల వెనుక ఉన్న మాఫియాను పసిగట్టే సమయం ఎక్కడుంది? ఇవాంక పర్యటన తరువాత అయినా మన ప్రభుత్వం, పోలీసు పెద్దలూ ఈ మాఫియాను ఛేదించి, ఆ పేదలకు విముక్తి కలి గించి పునరావాసం కల్పించే ఆలోచన చేస్తే బాగుంటుంది. పేదరికాన్ని పారదోలుతాం, రాష్ట్రాన్ని బంగారం చేస్తామని పదే పదే ప్రకటించుకునే పాలకులు ఈ వైపు ఆలోచించాలి. అదెట్లా కుదురుతుంది? భిక్షాటన నిర్మూలిం చడం అయ్యే పనేనా అని ఎవరయినా అంటే మన ప్రభుత్వంలోనే ప్రస్తుతం కార్యదర్శి స్థాయిలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం సలహా తీసుకోవచ్చు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన రోజుల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతల సహాయం తీసుకుని ఎక్కడికక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసి రోడ్ల మీద బిచ్చగాళ్లు కనిపించకుండా చేశారు. అన్ని జిల్లాల్లో ఇటువంటి ప్రయత్నం జరగాలి. జిల్లాల అధికారులకు వదిలేయకుండా ప్రభుత్వమే తన పాలనలో భాగంగా గట్టి నిర్ణయాలు చేస్తే తప్ప ఇటువంటివి సాధ్యం కావు. ఒక్క మనిషి ఆకలితో అలమటిస్తున్నా, ఒక్క మనిషికి శరీరం నిండా కప్పుకోడానికి బట్టలు లేకపోయినా అది సంక్షేమ రాజ్యం అనిపించుకోదు. ఈ నెలలోనే భాషను ఉద్ధరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా చాలామంది విదేశీ ప్రతినిధులు వస్తున్నట్టున్నారు. మన ప్రతిష్ట నిలుపుకోడానికి మళ్లీ మన వీధుల్లో బిచ్చగాళ్లు మాయమవుతారేమో!అంతర్జాతీయ స్థాయిలో మనకు ప్రతిష్ట తెచ్చే సభలు, మన భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సమావేశాలు ప్రభుత్వాలు పూనుకుని నిర్వహించడం తప్పుకాదు. మానవీయ కోణం లోపించిన ఇటువంటి కార్యక్రమాలన్నీ సువాసన లేని ప్లాస్టిక్ పువ్వుల వంటివే. ఇంతకీ మెట్రో ఘనత ఎవరిది? జీఈఎస్ సభల పుణ్యమా అని హైదరాబాద్ మెట్రో రైల్ 30 కిలోమీటర్ల పరుగుకూడా ప్రారంభం అయింది. అంతర్జాతీయ సభలకు హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను ఉపయోగించుకుని తెలంగాణ ప్రభుత్వం మియాపూర్ నుంచి నాగోల్ దాకా మొదటి దశ మెట్రో రైల్ సౌకర్యాన్ని ఆయన చేత ప్రారంభింప చేసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడంలో తీవ్రమైన జాప్యానికీ, వేల కోట్ల అదనపు వ్యయానికీ కారణమైన తెలంగాణ రాష్ట్ర సమితి, దాని నాయకుడు చంద్రశేఖరరావు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కారణంగా ఆ ఘనత తమదేనని చెప్పుకోవడం హాస్యాస్పదం. మెట్రో రైల్ మార్గం శాసనసభ ముందు నుంచి పోతే ఆ భవన సముదాయం అందం పోతుందన్న ఉద్యమకారుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మెట్రో రైల్ కల సాకారం చేసిన ఘనత తనకే దక్కాలంటున్నారు. సుల్తాన్బజార్ మీదుగా మెట్రో వెళితే రక్తాలు పారుతాయన్న ఉద్యమకారుడు కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చినందునే అది సాధ్యపడిందని అంటున్నారు. ఇక్కడ మెట్రో పనులైనా, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ పనులైనా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదలయ్యాయన్న వాస్తవం ఎవరైనా ఎట్లా మరచిపోతారు? రాజకీయ పార్టీలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక కల సాకారమైన సమయంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది మా గొప్పే అనుకుంటే ఎట్లా? మరింత ఆలస్యం జరగకుండా ఆ మిగిలిన మార్గాల్లో కూడా పనులు సత్వరం పూర్తి అయ్యేటట్టు చూసి మెట్రోను పరుగులు పెట్టిస్తే హైదరాబాద్ నగరవాసులు కార్పొరేషన్లో 99 సీట్లలో గెలిపించినందుకు వారి రుణం తీర్చుకున్నట్టయినా ఉంటుంది. కొంచెం రాజకీయ సందడి ఈ సందడిలో కొంచెం రాజకీయం కూడా నడిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో భారతీయ జనతా పార్టీశ్రేణులను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. అక్కడ ఆయన హైదరాబాద్ను విముక్తం చేసినందుకు సర్దార్ పటేల్ను, తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను జ్ఞాపకం చేసుకున్నారు. ఉద్యమ కాలం నుంచి, మొన్నటికి మొన్న శాసనసభ వేదిక మీద మాట్లాడే వరకూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిజాం రాజును కీర్తిస్తున్న తీరుకు జవాబుగా మోదీ అన్న మాటలు చాలా మందికి అర్థమయ్యాయి. ప్రొటోకాల్తో సంబంధం లేకుండా బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్రెడ్డిలను ప్రధానమంత్రి తన వెంట తీసుకుపోయిన తీరు కూడా చర్చనీయాంశమైంది. కార్యకర్తల సమావేశంలో మోదీ మాటలు తెలుగు రాష్ట్రాల్లో సమీప భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వచ్చే ఆశలను వదులుకున్నట్టు స్పష్టం చేశాయి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
వాస్తవాలు చెబితే అదే పదివేలు!
తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజాం రాజును వేనోళ్ల పొగడినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీ రామారావుకు బ్రహ్మరథం పట్టినా, ఆయన జీవితం మీద సినిమాలు నిర్మించేటట్టు చూస్తున్నా ఎన్నికల రాజకీయాల కోసమేనని అందరికీ తెలుసు. ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించబోతున్న కేసీఆర్కు నిజాం పాలనలో తెలుగు భాషాసంస్కృతులు ఎంత నిర్వీర్యం అయ్యాయో ఆయన చుట్టూ చేరిన మేధావులు చెప్పరెందుకు? జాతీయ స్థాయిలో పద్మావతి సినిమా గొడవ, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో నంది పురస్కారాల రగడ పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నవారు ఇద్దరు– ఏడవ నిజాం, ఎన్టీ రామారావు. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజాం రాజును వేనోళ్ల పొగడినా, ఆయనను మహానీయుడిగా చిత్రించడానికి చరిత్ర తిరగరాస్తానని చెప్పినా; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీ రామారావుకు బ్రహ్మరథం పట్టినా, ఆయన జీవితం మీద సినిమాలు నిర్మించేటట్టు చూస్తున్నా ఎన్నికల రాజకీయాల కోసమేనని అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు జీవితం మీద ఎవరో సినిమాలు తీస్తే చంద్రబాబునాయుడుకు ఏం సంబంధం అని ప్రశ్నించేవాళ్లూ ఉండొచ్చు. ప్రత్యక్షంగా చంద్రబాబునాయుడుకు ఆ సినిమాలతో ఏమీ సంబంధం లేకపోయినా ఆ సిని మాలు తీస్తున్న వాళ్లు ఎవరు, దాని వెనక వాళ్ల ప్రయోజనాలు ఏమిటి, అంతి మంగా అవి ఎవరికి ప్రయోజనకరంగా మారతాయి? అన్న విషయాలు కొంచెం ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఎన్టీ రామారావు జీవితం మీద మూడు సినిమాలు రాబోతున్నట్టు వార్తలొచ్చాయి. అందులో ఒకటి స్వయానా ఎన్టీ రామారావు కుమారుడు, చంద్రబాబునాయుడి బావమరిది, వియ్యంకుడు, ఆయన పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నిర్మించబోతుంటే, మరొకటి ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్వర్మ తీయబోతున్నారు. మూడో సినిమా నిర్మిస్తున్నవారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఈ మూడు సినిమాలూ కూడా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, ముఖ్యంగా లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం, ఆయన మరణించే వరకు జరి గిన ఘట్టాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టబోతున్నాయన్నది నిజం. ఎన్టీఆర్ అంటే భక్తితోనేనా! నటుడు బాలకృష్ణ తాను నిర్మించబోయే సినిమాకు సంబంధించి ఇంకా వివరాలు బయటపెట్టకపోయినా అది కచ్చితంగా లక్ష్మీపార్వతి పట్ల ప్రేక్షకులలో అంటే ప్రజలలో వ్యతిరేక భావాన్ని పెంచేదిగానే ఉంటుంది. అంతే తప్ప అధికారంలో లేనప్పుడు అందరూ ఎన్టీఆర్పై కనీసం జాలి లేకుండా గాలికి వది లేస్తే ఆమె చేరువయింది, సపర్యలు చేసింది, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నది అన్న కోణంలో నుంచి మాత్రం తీయబోరనేది స్పష్టం. రాజకీయంగా చంద్రబాబునాయుడుకు తద్వారా తన సొంత అల్లుడికి నష్టం జరిగే విధంగా బాలకృష్ణ ఈ సినిమాలో వాస్తవాలు చిత్రీకరిస్తారని ఎవరయినా ఎందుకనుకుం టారు? ఇక రాంగోపాల్వర్మ సినిమా! ఆయన తీసే సినిమాలు ఎట్లా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా రాయలసీమ ముఠా తగాదాల నేప«థ్యంలో పరిటాల రవి, మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి మధ్య కక్షలకు సంబంధించి రక్తచరిత్ర పేరిట ఆయన తీసిన రెండు సినిమాలలో వాస్తవాల వక్రీకరణ తెలిసిందే. అది వాస్తవాలకు కల్పన జోడించి తీసిన సినిమా అంటారాయన. ఇప్పుడు తీయబోయే సినిమా మాత్రం వాస్తవ జీవితచిత్రణేనని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు నిర్మాత అంటూ వార్తలు వచ్చాయి కాబట్టి చంద్రబాబునాయుడి ప్రయోజనాలతో సంబంధం లేకుండా జరిగింది జరిగినట్టు చిత్రీకరిస్తారన్న భావన కొందరిలో ఉండొచ్చు. కానీ వర్మ సినిమా టైటిల్, దానికి సంబంధించి బయటికొచ్చిన ఒక పోస్టర్ చూస్తే ఈ సినిమాది కూడా బాలకృష్ణ సినిమా దారేనని అర్థం అవుతుంది. ఈ సినిమా పేరు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాజకీయ రంగంలోని వ్యక్తుల జీవితాల ఆధారంగా వర్మ తీసిన సినిమాలన్నీ వివాదాస్పదమే అయ్యాయి. ఇదేమవుతుందో చూడాలి! ఇక తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినిమా నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తీయబోయే మూడో సినిమా పేరు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ (వెంకట సుబ్బారావు పేరు గుర్తుకొచ్చే విధంగా పెట్టిన పేరు). టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది లక్ష్మీపార్వతి పాత్రను అవమానకరంగా చిత్రించబోతున్నారని! సినిమా కథ ఏమిటో తెలియకుండా ఆ మాట ఎట్లా అంటారని అడగొచ్చు ఎవరయినా! ఎన్టీఆర్తో వివాహానికి ముందు లక్ష్మీపార్వతి వీరగంధం వెంకటసుబ్బారావు అనే ఆయన భార్య. కారణాలు ఏమయినా... అవి మనకు అనవసరం కూడా, ఆయన నుంచి విడాకులు తీసుకుని ఆమె ఎన్టీఆర్ను పెళ్లి చేసుకున్నారు. సినిమా పేరు వీరగంధం అని పెట్టడంలోనే చిత్రకథ ఏ వైపు వెళుతున్నదో అర్థమవుతుంది. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆమె మీద బురద చల్లడానికీ, తద్వారా ఎన్టీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికీ అప్పటి కొందరు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానూ, తెలుగుదేశం పార్టీ లోనే చంద్రబాబు నాయుడు వంటి నాయకులు రహస్యంగానూ వీరగంధం సుబ్బారావును పావుగా వాడుకోజూసిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిల పెళ్లి క్షమించరాని నేరంగా చిత్రీకరించే ప్రయత్నం ఆ రోజుల్లో జరిగింది. అనారోగ్యం పాలయి సేవలు చేసే దిక్కులేని పరిస్థితులలో తోడు అవసరం కాబట్టి పెళ్లి చేసుకుంటే మిన్ను విరిగి మీద పడ్డట్టు ఎన్టీ రామారావు మీద విరుచుకుపడ్డ వాళ్లే ఎక్కువ. అందులో తెలుగుదేశం నాయకులు తక్కువ తినలేదు. చంద్రబాబునాయుడు అందుకు మినహాయింపు కాదు. స్త్రీల పట్ల ఏమాత్రం గౌరవం లేని ఎంతో మంది చీకటి జీవితాల కంటే ఎన్టీఆర్ చాలా గొప్పవాడు. ఆయనను పెళ్లి చేసుకున్నాక తెలుగుదేశం రాజకీయాల్లో ఆమె జోక్యం కానీ, పరిపాలన విషయంలో ఎన్టీఆర్ ఆమె ప్రభావానికి లోనై నిర్ణయాలు తీసుకోబోయారన్న విషయంలో కచ్చితమైన సమాచారం ఉంటే ఎవరయినా విమర్శనాత్మకంగా చర్చించవచ్చు. కానీ దాదాపు 22 ఏళ్ల క్రితం మరణించిన ఎన్టీఆర్ జీవితం తెరకెక్కించే ప్రయత్నం చేసేవారు ఎవరయినా సంపూర్ణ సమాచారం సేకరించుకుని చేస్తే బాగుంటుంది. ఆత్మకథలు రాసే వారికి నిజాయితీ, జీవిత చరిత్రలు రాసే వారికి పరిశోధన చాలా ముఖ్యం అన్న విషయం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఎన్టీఆర్ పేరు ప్రతిష్టలను, ప్రజాభిమానాన్ని ఎన్నికల రాజకీయాల కోసం మాత్రమే వాడుకునే చంద్రబాబునాయుడి తెలుగుదేశం ఈ మూడు సినిమాల నుంచి లబ్ధి పొందే హడావుడిలో ఎన్టీఆర్ను నవ్వుల పాలు చేసే అవకాశాలే ఎక్కువ. నిజాం బూజును దులపాలి ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను పొగుడుతున్న తీరు జుగుప్సాకరంగా తయారయింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆంధ్రా వలస పాలకుల కంటే నిజాం రాజు పాలనే మెరుగ్గా ఉండేది అనేమాట ఉద్యమకారుల నుంచి తరచూ వినబడేది. మూర్ఖుడూ, ప్రజా కంటకుడూ అయిన నిజాం కంటే ఎక్కువ దుర్మార్గులు వలస పాలకులు అన్న అర్థం స్ఫురించే విధంగా ఉండేది ఆ పోలిక. నిజానికి అందులో వాస్తవం లేకపోయినా ఉద్యమ కాలంలో ఇటువంటివి సహజం అని సరిపెట్టుకునేవాళ్లం. నిజాం రాజు, ఆయన కిరాయి సైనికులు(రజాకార్లు) తెలంగాణ ప్రాంత ప్రజల మీద సాగించిన దమనకాండను మరచిపోయి, ఆయనో మహనీయుడు అని తాను కీర్తించడమే కాక భావితరాల వారికి తప్పుడు సమాచారాన్ని పంపే ప్రయత్నంలో భాగంగా చరిత్రను తిరగ రాస్తానని అంటున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ ఉద్యమంలో చంద్రశేఖరరావు, ఆయన నాయకత్వం వహించిన టీఆర్ఎస్ల పాత్ర విస్మరించడానికి వీలు లేనిదే అయినా, అందుకు ప్రతిఫలంగా రాష్ట్రాన్ని ఏలే అధికారం ప్రజలు ఆయన పార్టీకి కట్టబెట్టినా చరిత్రను వక్రీకరించి తిరగరాస్తానంటే కుదరదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు పన్నెండు శాతం ముస్లింలను ఆకర్షించడానికీ, మజ్లిస్ పార్టీ సహకారంతో వచ్చే ఎన్నికలలో గట్టెక్కడానికీ మైనారిటీ సంక్షేమం పేరిట ఎన్ని పథకాలయినా తీసుకురావచ్చు, ఎన్ని వందల, వేల కోట్ల రూపాయల నిధులయినా కేటాయించవచ్చు. ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. ముస్లింలు ఈ దేశ పౌరులు. తెలంగాణ సమాజంలో వాళ్లు భాగంగా ఉన్నారు. తెలంగాణలో ముస్లింలకు నిజాం ప్రతినిధి కాదు, మజ్లిస్ నాయకులు అంతకన్నా కాదు. తెలంగాణ ప్రజల ఆస్తులు కొల్లగొట్టి, స్త్రీల మాన ప్రాణాలను హరించి, వందలాది మందిని ఊచకోత కోసి సంపాదించిన నెత్తుటి బంగారాన్ని నిజాం రాజు ఆస్పత్రి కట్టించడానికి దానం చేశాడని పొంగిపోయి శాసనసభ సాక్షిగా ఆ క్రూరుడిని, అతడి పాలనను వేనోళ్ల కీర్తించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రజాస్వామ్యాన్ని, ఆ అద్భుత పునాదుల మీద నిర్మించుకున్న విలువలను ధ్వంసం చేసేందుకు పూనుకున్నారు. మేధావులు వాస్తవాలు చెప్పాలి తెలుగుభాషను గొప్పగా కీర్తిస్తూ, ఆ కీర్తిని నేల నాలుగు చెరగులా వ్యాపింపచేసే ప్రయత్నంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబోతున్న ముఖ్యమంత్రికి నిజాం పాలనలో తెలుగు భాషాసంస్కృతులు ఎంత నిర్వీర్యం అయ్యాయో, ఉర్దూ రాజభాషగా వెలుగొందుతూ ఉంటే అజ్ఞాతంలో ఉండిపోయిన తెలుగు భాషకు మద్దతుగా ఉద్యమాలు సాగాయనీ, అందులో భాగంగానే గ్రంథాలయోద్యమం వేళ్లూనుకున్నదనీ ఆయన చుట్టూ చేరిన మేధావులు చెప్పరెందుకు? రావణాసురుడిని కొలిచే వాళ్లు ఉంటారు. అది వాళ్ల ఇష్టం. నిజాం రాజును కొలిచే వాళ్లూ ఉంటారు, అది కూడా వాళ్ల ఇష్టం. కానీ ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ రాజ కీయ ప్రయోజనాల కోసం ఆ పని చెయ్యడం తగదు. రామాయణ కాలంలో ఏం జరిగిందో మనకు తెలియదు. రావణుడు మంచివాడా, ప్రజాకంటకుడా అన్నదీ మనకు తెలియదు. కానీ నిజాం కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసు, ఆయన దుష్పరిపాలనా మనకు తెలుసు. ఆయన రాజ్యంలో ప్రజల మీద జరిగిన దమనకాండ గురించి మనకు తెలుసు. తెలిసీ మౌనంగా ఉండటం నేరం. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బయట పేచీ, లోపల లాలూచీ
డేట్లైన్ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు వైపులా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రదర్శించని సఖ్యత, వ్యాపారాలు పెంచుకోవడంలో ప్రదర్శిస్తేనే అభ్యంతరం. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యాలను విస్తరింప చేసుకోవడానికి అజ్ఞాత స్నేహాలు చేస్తేనే అభ్యంతరం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. తన రాజకీయ అవసరాల కోసం రేవంత్రెడ్డి కొన్ని వ్యవహారాలు మాత్రం బయట పెట్టి ఉండవచ్చు. బయటికి రానివి ఇంకెన్నో! యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి. తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా, రామకృష్ణుడినే నంబర్ టూగా పరిగణించాలి. నిజానికి యనమల రామకృష్ణుడు లేకపోతే రాజకీయాల్లో చంద్రబాబునాయుడు లేరు. 1995లో ఎన్టీ రామారావును అన్యాయంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు శాసనసభ స్పీకర్గా ఉన్న యనమల కొంచెం భిన్నంగా వ్యవహరించి ఉంటే చంద్రబాబునాయుడి రాజకీయ చరిత్ర అక్కడితో ముగిసి ఉండేది. శాసనసభలో అంతకు ముందురోజు వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న రామారావును తామందరికీ రాజకీయ భిక్ష పెట్టారన్న విషయాన్ని కూడా మరచి కనీసం మాట్లాడేందుకు కూడా అనుమతించకుండా యనమల ఆరోజు చంద్రబాబు అనుకూల వైఖరి తీసుకుని ఉండకపోతే ఏం జరిగి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరిటాల సునీత, అదే తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవి భార్య. ప్రస్తుత మంత్రివర్గ సభ్యురాలు. పయ్యావుల కేశవ్ మాజీ శాసనసభ్యుడు. ప్రస్తుత శాసన మండలి సభ్యుడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో ‘బ్యాక్ రూమ్ మేనేజ్మెంట్’ అద్భుతంగా చేసినందుకు చంద్రబాబు చేత ప్రత్యేక సత్కారం అందుకున్న ముఖ్యుడు. రేవంత్రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని, సమీప భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందనే ఆశ కూడా లేని తెలంగాణ రాష్ట్ర విభాగం కార్యాధ్యక్షుడు, శాసనసభ్యుడు. పార్టీ అధినేత, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నిన ఒక తప్పుడు వ్యూహంలో పావుగా మారి, జైలుకు వెళ్లి, తీరని నిందను మోస్తున్నవాడు. ఈ నలుగురి ప్రస్తావనే ఇప్పుడెందుకంటే, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆనాడేమైందీ ప్రశ్నించే గుణం? రేవంత్రెడ్డి పార్టీ మారబోతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలోని పలువురు ముఖ్య నేతలను, కార్యకర్తలను తీసుకుని కాంగ్రెస్లో చేరబోతున్నారని వార్త. అందుకోసం ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. కాంగ్రెస్లో చేరితే తన వర్గం వారికి పది పదకొండు లోక్సభ స్థానాలు, ఓ 25 శాసనసభ స్థానాలు ఇవ్వాలన్న డిమాండ్ పెట్టారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దీనితో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను పిలిచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వివరణ కోరారు. తెలుగుదేశంలో ఉంటూ నువ్వు రాహుల్ గాంధీని ఎట్లా కలుస్తావు? అందుకు చంద్రబాబునాయుడి అనుమతి తీసుకున్నావా? అని ప్రశ్నిస్తే, మీకెవ్వరికీ నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి వచ్చాక ఆయనకే చెప్తాను అన్నీ అన్నారు రేవంత్రెడ్డి. కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అది నెగ్గకుండా చూడటానికి తెలుగుదేశం పక్షం సభ నుంచి గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్తో ఎందుకు కుమ్మక్కు అవుతున్నారని చంద్రబాబును ఈ నాయకులు ప్రశ్నించలేదు. ఇంతెందుకు, 1996లో యునైటెడ్ ఫ్రంట్ను కట్టి కాంగ్రెస్ సహాయంతో కేంద్రంలో పార్టీని చేర్చినప్పుడు మనది కాంగ్రెస్ వ్యతిరేక పునాది మీద పుట్టిన పార్టీ అని మోత్కుపల్లి నర్సింహులు ఎందుకు గుర్తు చెయ్యలేదో మరి! మొన్నటికి మొన్న, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో, నిన్న సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్తో కలిసి పనిచేశామని తెలంగాణ టీడీపీ నాయకులు తమను తాము ప్రశ్నించుకుంటే బాగుండేది. అప్పుడు మాట్లాడని నాయకులు రేవంత్ నుంచి వచ్చిన సమాధానంతో సమావేశం నుంచి వాకౌట్ చేస్తే, రేవంత్ మాత్రం దర్జాగా ట్రస్ట్ భవన్లోనే కూర్చున్నారు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ గాని, ఇంకెవరైనా గాని ఇక్కడ పార్టీ వ్యవహారాల మీద ఏమాత్రం పట్టు లేనివాళ్లని తేలిపోయింది. క్రమశిక్షణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి ఇది. ఆయన కుమారుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్బాబు మూడు రోజులు హైదరాబాద్లో మకాం వేసి కూడా ఎవరినీ కట్టడి చెయ్యలేని స్థితిలో తిరిగి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. వీరిది పోరాటం, వారిది వ్యాపారం తాను సభ్యుడిగా ఉన్న రాష్ట్ర పార్టీలో నాయకత్వానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని తలెగరేసిన రేవంత్ పక్క రాష్ట్రంలోని మంత్రుల మీద, నాయకుల మీద కూడా విరుచుకు పడ్డారు. పార్టీ కోసం నేను జైలుకు వెళితే, తెలంగాణ లో ప్రభుత్వంతో కొట్లాడుతుంటే ఆంధ్ర మంత్రులు, నాయకులు తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యంగా వ్యవహరించి వ్యాపారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పయ్యావుల కేశవ్ ఒక్కడే బయటపడి వివరణ ఇచ్చారు తప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత నోరు మెదపలేదు. బహుశా అధినేత ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు. అయినా అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రితో మాట్లాడటం ఈ రోజుల్లో ఏమంతపని! మాట్లాడే ఉంటారు. ఆయన ఏం చెప్పారో అందరూ అర్థం చేసుకోవచ్చు కూడా. అటు ఆంధ్ర మంత్రులూ నాయకులకయినా, ఇటు తెలంగాణ పార్టీ నేతలకయినా ఈ పరిస్థితిలో చంద్రబాబునాయుడు ఏం చెబుతారు? ఇంకొకరు ఎవరయినా అయితే పార్టీ నుంచి తక్షణం బహిష్కరించి ఉండే వాళ్లం కానీ, ఈయన రేవంత్రెడ్డి అయిపోయారు. కాస్త ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, ఎవరూ తొందర పడకండి అనే చెప్పి ఉంటారు. నిజమే కదా! ఓటుకు కోట్లు కేసులో వ్యూహం రచించింది తానూ, అమలు చేస్తూ దొరికిపోయి జైలుకు వెళ్లింది రేవంత్ రెడ్డి కాబట్టి, ఆ కేసు ఇంకా నెత్తి మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. ఎంత స్నేహహస్తం చాచుతున్నట్టు కనిపిస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అవసరమైతే దాన్ని మళ్లీ తన మీద ప్రయోగించడానికి వెనుకాడరన్న విషయం చంద్రబాబునాయుడుకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చేదాకా ఇటూ అటూ తెలుగుదేశం వారంతా ‘వ్యూహాత్మక మౌనం’పాటించాల్సిందే, తప్పదు. ఇక యనమల రామకృష్ణుడి సంబంధీకులకు తెలంగాణలో వేల కోట్ల రూపాయలకాంట్రాక్టులు, పరిటాల సునీత కుమారుడికీ,పయ్యావుల కేశవ్ అల్లుడికీ వ్యాపార లైసెన్సుల గురించి రేవంత్ మాట్లాడితే; రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత కలసి వ్యాపారం చెయ్యడం కోసం కంపెనీ రిజిస్టర్ చేయడం గురించి కేశవ్ ప్రస్తావించారు. ఈ విషయానికి వస్తే ఇందులో ఎవరు పులుకడిగిన ముత్యాలు అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులూ; అక్కడివారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి కాంట్రాక్ట్లు, లైసెన్స్లు తెచ్చుకుంటూనే ఉన్నారు. వ్యాపారం చేయవద్దని ఎవరూ చెప్పరు. ఫలానా వర్గం వారే వ్యాపారాలు చెయ్యాలనీ ఎవరూ చెప్పరు. రాజకీయాల్లో ఉన్నవాళ్లు వ్యాపారాలకు అర్హులు కాదు అనే చట్టం ఏమీలేదు. తమకు ఇష్టమైన వ్యాపారం చేసుకునే హక్కు జీవించే హక్కు వంటి ఇతర హక్కుల వంటిదే. రాజ్యాంగం ప్రసాదించిన హక్కే. అయితే చిక్కంతా ఎవరు ఎటువంటి వ్యాపారాలు ఏ రకంగా చేస్తున్నారు అన్న విషయం దగ్గరనే. పయ్యావుల కేశవ్ చెప్పినట్టు తెలంగాణలో మద్యం వ్యాపారం చేసుకోవడానికి నిబంధనలను అనుసరించి ఆయన మేనల్లుడో, ఇంకొకరో ఆంధ్ర ప్రాంతానికో, రాయలసీమ ప్రాంతానికో చెందినవారు లైసెన్సులు తెచ్చుకుంటే ఆక్షేపించనక్కర లేదు. తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసుకునే హక్కును ఎవరూ కాదనలేరు. నిజానికి దేశంలో ఈ చివర నుంచి, ఆ చివర దాకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్లు నిర్మించే కాంట్రాక్టర్లు కొంతమంది తెలుగువాళ్లేనన్న విషయం మరిచిపోవద్దు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ఒక సందర్భంలో స్వయంగా తానే చెప్పారు, ఆంధ్రప్రాంతం వారితో తనకున్న వ్యాపార లావాదేవీలను గురించి. రాజకీయాలు, వ్యాపారం కలగాపులగం అయిపోయినందునే సమస్యంతా. ఉదాహరణకు రాజకీయ అవసరాలకారణంగానే అమాయకులయిన విద్యార్థులు చదువుల ఒత్తిడి తట్టుకోలేక అన్యాయంగా ప్రాణాలు తీసుకుంటుంటే ఏ చర్యా లేకుండా పోయింది, ఇక్కడయినా, అక్కడయినా. ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు వైపులా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రదర్శించని సఖ్యత, వ్యాపారాలు పెంచుకోవడంలో ప్రదర్శిస్తేనే అభ్యంతరం. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యాలను విస్తరింప చేసుకోవడానికి అజ్ఞాత స్నేహాలు చేస్తేనే అభ్యంతరం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. తన రాజకీయ అవసరాల కోసం రేవంత్రెడ్డి కొన్ని వ్యవహారాలు మాత్రం బయట పెట్టి ఉండవచ్చు. బయటికి రానివి ఇంకెన్నో! ఏది ఏమైనా రేవంత్రెడ్డి వ్యవహారం మాత్రం తెలుగుదేశం పార్టీని అక్కడా ఇక్కడా మరింత అయోమయంలో పడేసిన మాట వాస్తవం. పార్టీ నుంచి బహిష్కరిస్తే ఓటుకు కోట్లు వ్యవహారం ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో, బుజ్జగించి పార్టీలోనే ఉంచుకుందామంటే టీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి కచ్చితంగా అవలంబించాల్సిందే అన్న రేవంత్ షరతు మింగుడు పడదాయే. ముందునుయ్యి, వెనుక గొయ్యి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
మీడియాపై దాడులను అడ్డుకుందాం
కొరుక్కుపేట : మీడియాపై దాడులను అడ్డుకునేందుకు చెన్నైలో జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఇందులో దాడుల అడ్డుకట్టకు, మీడియా భద్రతకు ఐదు తీర్మానాలు చేశారు. వీటిని కేంద్రంతోపాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించనున్నారు. ఫెడరేషన్ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా లీడ్ పేరుతో మీడియాపై దాడులు– బెదిరింపులు – మీడియాలో నేటి పరిస్థితిపై జాతీయ సదస్సు ఆదివారం జరిగింది. సదస్సు కోఆర్డినేటర్ సంధ్య రవిశంకర్ సంధానకర్తగా రెండు సెషన్లతో కార్యక్రమం జరిగింది. ఇందులో సాక్షి మీడియా తరఫున ఈడీ రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, ది హిందూ చైర్మన్ ఎన్.రామ్, ఎడిటర్ ముకుంద్ పద్మనాభన్, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ అరుణ్ రామ్, నటి గౌతమి, తమిళనాడు తమిళ భాష అభివృద్ధి శాఖ మంత్రి ఎం.పాండియరాజన్, ఎన్డీ టీవీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావిస్ కుమార్, డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, వెటరన్ జర్నలిస్ట్ భాస్కర్, తమిళ మీడియా సంపాదకులు పాల్గొన్నారు. సదస్సులో మీడియాపై దాడులు, ప్రభుత్వాల తీరు, మీడియా సంస్థల్లో ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. -
కత్తులు దూసినా పొత్తులు తప్పవా!
డేట్లైన్ హైదరాబాద్ ఇక తెలుగుదేశం అవసరం తెలంగాణలో ఎవరికైనా, ఏ రూపంలోనైనా ఉంటుందో లేదో తెలియదు కానీ, పొత్తుల అవసరం ఆ పార్టీ మనుగడకు మాత్రం చాలా ముఖ్యం. అందుకే కాంగ్రెస్తో కలసి పోటీ చేద్దామని ఒకరు, లేదు టీఆర్ఎస్తో కలిసి నడుద్దామని మరొకరు తెలుగుదేశంలోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్తో కలసి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అధినేత చంద్రబాబు నాయుడిదేనని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ అప్పుడే రాజకీయ పార్టీలలో పొత్తుల ముచ్చట జోరందుకున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆలోచిస్తున్న విధంగా జమిలి ఎన్నికలు జరిగేటట్టయితే 2018 చివరలోనే ప్రజా తీర్పు కోరవలసి ఉంటుంది. ఈ ముందస్తుకైనా ఏడాది సమయం ఉంది. ఎక్కడైనా బలహీనంగా ఉన్న పార్టీలే పొత్తుల గురించి ఎక్కువ ఆలోచిస్తాయి. బలహీనం అంటే సిద్ధాంతరీత్యా కాక ఎన్నికలలో ప్రజాబలం రీత్యా అని అర్ధం చేసుకోవాలిక్కడ. కొన్ని పార్టీలైతే రెండు విధాలా బలహీనంగా ఉంటాయి. వాటికి పొత్తులు మరీ అవసరం. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో కొన్ని పార్టీలలో ఈ పొత్తుల వెంపర్లాట అప్పుడే బాహాటంగా కనిపిస్తున్నది. మరికొన్ని పార్టీలు లోపల ఆందోళన పడుతున్నా, దానిని బయట పడనీయకుండా గుంభనంగా ఉన్నాయి. చంద్రబాబు స్వయంకృతం 2014లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పొత్తు పెట్టుకున్నాయి. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో మాత్రం ఆ ఎన్నికలలో అరకొర విజయంతో సరిపెట్టుకోవడమే కాకుండా, ఈ మూడేళ్లలో చిరునామా లేకుండా పోయింది. దానికి కారణం ప్రజలు నిరాకరించడం కాదు. అది ఆ పార్టీ నేత చంద్రబాబునాయుడు చేజేతులా కొనితెచ్చుకున్న దీనావస్థ. ఈసారి ఎన్నికలలో మాత్రం తెలంగాణలో తెలుగుదేశంతో కలసి పోటీ చేసే సమస్యే లేదని బీజేపీ రాష్ట్ర శాఖ బహిరంగంగానే చెబుతున్నది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ లోలోపల గొణుక్కుం టున్నది. పొత్తు గురించి అక్కడ స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. పొత్తుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలోనే ఎక్కువ కదలిక కనిపిస్తున్నది. ఇతర పార్టీలలో కంటే తెలుగుదేశంలోనే ఆ హడావుడి మరీ ఎక్కువగా కనిపించింది గతవారం. ఈ హడావుడి గురించే చంద్రబాబునాయుడు స్వయంగా హైదరాబాద్కి వచ్చి ప్రస్తుతానికి ఆపండని చెప్పి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. ఆదివారం నాడు ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తెలంగాణ తెలుగుదేశం ముఖ్యులను సమావేశపరచి సమయం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం అందరితో చర్చించి పొత్తుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందనీ, అప్పటిదాకా ఎవరూ నోరు మెదపవద్దని చెప్పారనీ ఆ వార్తల సారాంశం. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ కలసి పోటీ చేస్తే బాగుంటుందనీ, వీరితో బీజేపీ కూడా కలిస్తే మరింత మెరుగ్గా ఉంటుందనీ ఒక ప్రచారం ఈ మధ్యనే మొదలైంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు, మా విజయం అప్రతిహతం. కాబట్టి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అనవచ్చు. అందుకు రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికలను ఉదాహరణగా చూపవచ్చు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనులలో కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఇటీవలనే జరిగిన ఎన్నికలను ఉదహరించవచ్చు. సింగరేణిలోని 11 డివిజన్లలో టీబీజీకేఎస్ 9 గెల్చుకున్న మాట నిజమే కానీ, ఓట్ల సంగతేంటి? ఓట్లేసిన సింగరేణి కార్మికులలో 50 శాతానికి పైగా అధికార పక్షానికి చెందిన కార్మిక సంఘానికి వ్యతిరేకంగా ఓటేసిన విషయం మరచిపోకూడదు. అధికార పక్షం భూమ్యాకాశాలను తలకిందులు చేసినా ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావడంతో ఈ ఫలితం వచ్చిందన్న విషయం గ్రహించలేనంత అమాయకులు కాదు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఫలితాలు వెలువడగానే నిర్వహించిన పత్రికా గోష్టిలో ఆయన మాట్లాడిన తీరును బట్టే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. గెలిచాం కదా అని విర్రవీగకూడదు, ఒదిగి ఉండాలి అని చెపుతూనే, నెహ్రూ నుంచి సోనియాగాంధీ దాకా కాంగ్రెస్ మీద ఆయన విరుచుకుపడిన తీరు, మొట్టమొదటిసారిగా కోదండరాం పట్ల ప్రదర్శించిన తీవ్ర అసహనం సింగరేణి ఫలితాన్ని ఆయన ఎట్లా చూస్తున్నారో స్పష్టం చేస్తున్నది. అదే పత్రికా గోష్టిలో ఆయన టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత, ఇతర నాయకులు సరిగా పని చేయలేదని కూడా తెరాస నేత ఆక్షేపించారు. నిజానికి స్థానికంగా టీబీజీకేఎస్ నాయకత్వం పట్ల కార్మికులలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత కారణంగానే సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది. ప్రభుత్వం ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేయాలని సంకల్పించినా, అధినేతకు ఎంతటి జనాకర్షణ ఉన్నా క్షేత్రస్థాయిలో నాయకత్వం సరిగా లేకపోతే గెలుపు అంత సులభం కాదని చెప్పడానికి సింగరేణి ఎన్నికల ఫలితం మంచి ఉదాహరణ. కేసీఆర్ వ్యూహం ఏమిటో? ఈ పరిస్థితులలో ప్రస్తుతం మాకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని అధికార టీఆర్ఎస్ చెప్పినా, ఎన్నికలు సమీపించే నాటికి కేసీఆర్ వ్యూహం ఎట్లా ఉండబోతున్నదో ఊహించవచ్చు. ఇప్పటికైతే ఆయనకు దీటైన నాయకుడు ఎవరూ ప్రతిపక్షాలలో కనిపించడంలేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అని ముఖ్యమంత్రి వేసిన ఎదురు ప్రశ్నలో చాలావరకు వాస్తవం ఉన్నా, ఆ పార్టీకి తెలంగాణలో ఒక వర్గం మద్దతు ఇప్పటికీ ఉన్నదన్న విషయం కేసీఆర్కు బాగా తెలుసు. ఆ సామాజిక వర్గం ప్రస్తుతానికి మచ్చిక అయినట్టు కనిపిస్తున్నా, దానిని పూర్తిగా నమ్మడానికి ఆయన సిద్ధంగా లేరు. అందుకే వీలయినంత ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకోడానికీ లేదా తటస్థం చెయ్యడానికీ ఏ అవకాశం వచ్చినా వదులుకోవడంలేదు. మొన్నటికి మొన్న ప్రత్యేక విమానంలో ఆ సామాజిక వర్గానికే చెందిన నాయకులనూ, ఒక పత్రిక యజమానినీ వెంట పెట్టుకుని అనంతపురంలో పరిటాల రవి కుమారుడి పెళ్లికి వెళ్లి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడదీస్తే మానవబాంబునవుతానని బెదిరించి, డిసెంబర్ తొమ్మిది ప్రకటన మరునాడే జేసీ దివాకర్ రెడ్డితో కలసి ఆంధ్రప్రాంతానికి చెందిన అన్ని పార్టీల శాసనసభ్యుల రాజీనామాలను సేకరించడంలో ప్రధాన పాత్ర వహించిన పయ్యావుల కేశవ్తో ఆప్యాయంగా ముచ్చటించారు. ఇక తెలుగుదేశం అవసరం తెలంగాణలో ఎవరికైనా, ఏ రూపంలోనైనా ఉంటుందో లేదో తెలియదు కానీ, పొత్తుల అవసరం ఆ పార్టీ మనుగడకు మాత్రం చాలా ముఖ్యం. అందుకే కాంగ్రెస్తో కలసి పోటీ చేద్దామని ఒకరు, లేదు టీఆర్ఎస్తో కలిసి నడుద్దామని మరొకరు తెలుగుదేశంలో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలసి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అధినేత చంద్రబాబునాయుడిదేనని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. తద్వారా పార్టీ శ్రేణులలోకీ, ప్రజలలోకీ ఎట్లాంటి సంకేతాలు వెళతాయో చూద్దామని ఆయనే ఈ ఆలోచనను ప్రచారంలోకి తెచ్చారని సమాచారం. తీరా గందరగోళం అయ్యేసరికి ప్రస్తుతానికి ఎవరూ మాట్లాడవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఎన్టీ రామారావు నాయకత్వంలో ఏర్పడినది తెలుగుదేశం పార్టీ. కానీ రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలో అదే కాంగ్రెస్తో టీడీపీ చెట్టపట్టాలు వేసుకుని తిరిగేట్టు చేసినవారు చంద్రబాబు. అంతకుముందు 2009లో కాంగ్రెస్ను ఓడించడం కోసం టీఆర్ఎస్, వామపక్షాలతో కలసి మహాకూటమి కట్టారు. అయినా ఓడిపోయారు. ఒకచోట అధికారాన్ని నిలుపుకోవడానికీ, మరొకచోట అస్తిత్వాన్ని కాపాడుకోడానికీ ఏ పార్టీతో అయినా చంద్రబాబు జత కడతారనడానికి ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబునాయుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారా, ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా మిగిలిపోతారా అనేది 2019 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తేల్చేస్తాయి. ఆయన ఖేదం, ఈయన నిర్వేదం మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం సీనియర్ నాయకుడు. తనకు గవర్నర్ పదవి వస్తుందనీ, ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి చంద్రబాబునాయుడు ఆ పదవి ఇప్పిస్తారని కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. మోదీ నాకే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఇక గవర్నర్ పదవి ఏమిస్తారని మొన్నటి సమావేశంలో చంద్రబాబునాయుడు ఒక నిట్టూర్పుతో సరిపెట్టారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్తో కలసి పోటీ చేయవచ్చునన్న మాట చెప్పింది ఈ నర్సింహులు గారే. దానికి ఆయన ఒక సూత్రీకరణ కూడా చేశారు. మనది కాంగ్రెస్ వ్యతిరేక పునాది మీద ఏర్పడిన పార్టీ కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి రాకుండా నిలువరించడానికే ఈ ప్రతిపాదన అన్నారు. అదే ఎన్టీ రామారావును దుర్భాషలాడి పార్టీ నుంచి వెళ్లిపోయి స్వతంత్రంగా పోటీ చేసిన నాయకుడు, కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి తిరిగొచ్చిన నాయకుడు నర్సింహులు ఈ కాంగ్రెస్ వ్యతిరేకత సూత్రాన్ని ముందుకు తేవడం ఆశ్చర్యకరం. పలికినవాడు నర్సింహులు పలికించినవారెవరో మనకు తెలుసు. ‘టీఆర్ఎస్తో పొత్తు అంటే నన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు’ అన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తీవ్రమైన టీఆర్ఎస్ వ్యతిరేకత ఆయనను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కొంత దగ్గర చేసింది. అవసరార్థం కాంగ్రెస్తో కలవడంలో తప్పు లేదన్న సూత్రం నీవు నేర్పిన విద్యయే కదా అని ఆయన ఇప్పుడు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి అదృష్టం కొద్దీ చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసులో ఫోన్ సంభాషణలో దొరికారు కానీ, లేకుంటేæ రేవంత్ను ఒంటరిని చేసి ఆ వ్యవహారంలో తనకు ఏమీ సంబంధం లేదని పార్టీ నుంచి వెళ్లగొట్టి ఉండేవారు. రేపటి రోజున నర్సింహులు ప్రతిపాదనలే కార్యరూపం దాలిస్తే రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయ మార్గం కాంగ్రెస్ తప్ప మరొకటి లేదు. అయితే అక్కడ ఆయన క్యూలో నిలబడే నాయకుల్లో ఏ వందో వాడో అవుతారు. ‘రెంటికీ చెడ్డ రేవంత్’ కాకూదదనుకుంటే కాంగ్రెస్ వరుసలో నిలబడక తప్పదేమో! దీర్ఘకాలం వెనుకబడిన తరగతుల వారికోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న బీసీ నాయకుడు, తెలంగాణ తెలుగుదేశం 2014 సీఎం అభ్యర్థి, శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో కొనసాగనేమో అని ఇటీవలే ఒక సభలో ప్రకటించారు. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో ఆయన ప్రకటనతో అర్థం అయిపోలేదా? దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
చరిత్రను రాజకీయం చేయవద్దు
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికార ఉత్సవంగా జరపకపోవడానికి గల కారణాలను గురించి తలలు బద్దలు కొట్టుకోనక్కరలేదు. అవి చాలా సుస్పష్టం. మజ్లిస్తో స్నేహం చెడగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే, ముస్లింలను సంతోషపరుస్తున్నాననుకుంటూ పొద్దున్న లేస్తే నిజాం నవాబును, ఆయన పరిపాలనను వేనోళ్ల స్తుతిస్తూ విమోచన దినం అధికారికంగా ఎట్లా నిర్వహించడం అనేది మరో కారణం. ఒకవైపు కాళోజీని, దాశ రథిని కొనియాడుతూ, మరో వైపు నిజాం రాజును స్తుతించడం కేసీఆర్కే చెల్లింది. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విలీనమైన ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు ఏటా విమోచన దినోత్సవం జరుపుతాయి. ఆంధ్రప్రదేశ్లో కలసిన తెలంగాణ ప్రాంతంలో కూడా అదే రీతిలో సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలన్న డిమాండ్ ఉంది. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా దీని గురించి వింటూనే ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఏనాడూ ఆ పని చెయ్యడానికి అంగీకరించలేదు. ఎక్కువకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లోనో మరెక్కడో పార్టీ పరంగా మొక్కుబడిగా ఉత్సవాలు జరిపిందే తప్ప ఆరోజు ప్రాముఖ్యాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఆ రెండు పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఉత్సవాలు అధికారికంగా జరిగాయి. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నాయకత్వాన్నీ, ఆయన ప్రతిష్టనూ తన సొంతం చేసుకోవడానికి తపిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని ఏటా కోరుతోంది. సర్దార్ పటేల్ నామస్మరణ తప్ప, నెహ్రూ, గాంధీ వంటి నాయకుల పేర్లను ఉచ్చరించడమే పాపం అన్నట్టుగా బీజేపీ వ్యవహరించడం ఈ మూడున్నర ఏళ్లుగా చూస్తున్నాం. మహాత్ముడిని ‘చతుర్ బనియా’(తెలివిగల వ్యాపారి) అని హేళనగా మాట్లాడే నాయకత్వం కలిగిన పార్టీ బీజేపీ. ఉక్కు మనిషిగా ఖ్యాతి చెందిన సర్దార్ పటేల్ జ్ఞాపకాన్ని మహాత్ముడి జన్మస్థానం గుజరాత్లో చిరస్మరణీయం చెయ్యాలన్న ఆలోచన బీజేపీది. పాత ప్రభుత్వాల బాటనే టీఆర్ఎస్ సెప్టెంబర్ 17 విషయానికి వద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతకాలం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అసలు ఈ విషయంలో ఒక అవగాహన కానీ, అధ్యయనం కానీ లేవు. ఏ రాజకీయ పార్టీకైనా చరిత్ర పట్ల అవగాహన అవసరం. ఆ చరిత్ర పట్ల తనకంటూ ఒక రాజకీయ వైఖరి కూడా ఉండటమూ తప్పనిసరి. కానీ తెలుగుదేశం పార్టీకీ, దాని అధినాయకత్వానికీ ముఖ్యంగా ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చరిత్ర అంటే అస్సలు గిట్టదు. చరిత్రను అధ్యయనం చెయ్యడం శుద్ధ దండగ అని ఆయన అభిప్రాయం. కాబట్టి వారి కాలంలో కూడా అధికారికంగా ఉత్సవాలు జరగలేదు. ఇప్పుడిక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచించడం కూడా అనవసరం. ఆ పార్టీ ఇక్కడి నుంచి జెండా ఎత్తెయ్యడం స్వయంకృతమే. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సెప్టెంబర్ 17ను అధికారిక ఉత్సవంగా నిర్వహించడానికిఅంగీకరించడం లేదు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన చివరి దశ ఉద్యమానికి నాయకత్వం వహించిన 13 సంవత్సరాల కాలంలో ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్, దాని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలుమార్లు సెప్టెంబర్ 17న రెండు పొరుగు రాష్ట్రాల మాదిరిగానే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని అప్పటి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ రోజును అధికారికంగా జరుపుతామని పలుమార్లు ప్రకటించారు. ఒపీనియన్స్ మార్చుకోని వాడు పొలిటీషియన్ కాడు అంటాడు గిరీశం, ‘కన్యాశుల్కం’లో. చాలా విషయాల్లో మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు గిరీశమే ఆదర్శమనిపిస్తుంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కానీ, ఇంటికో ఉద్యోగం, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య కానీ చివరికి సెప్టెంబర్ 17 న ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం విషయంలో కూడా ఆయనది గిరీశం బాటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మూడేళ్లలో మళ్లీ ఈ డిమాండ్ ముందుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ డిమాండ్ విషయంలో అనుసరించిన వైఖరే ఇప్పుడు చంద్రశేఖరరావు ప్రభుత్వ వైఖరి కూడా. ఎందుకీ చర్చ? ఇంతకూ సెప్టెంబర్ 17 ప్రాముఖ్యం ఏమిటి, ఇంత చర్చ ఎందుకు? 1948 సంవత్సరం అదే రోజున భారత ప్రభుత్వ సైన్యాలు జనరల్ చౌదురి నాయకత్వంలో నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సంస్థానాన్ని లోబరుచుకున్నాయి. భారత సైన్యంతో యుద్ధం చేసే శక్తి లేని నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ పటేల్కు లొంగిపోయి రాజప్రముఖ్గా గౌరవం, సుఖసౌఖ్యాలూ అనుభవించాడు. అప్పుడు జరిగింది విలీనమా, విమోచనా లేక విద్రోహమా అన్న చర్చ ఈ రోజుకూ జరుగుతూనే ఉంది. సర్దార్ పటేల్ నాయకత్వంలో ఆనాడు జరిగింది విమోచనే అయితే నిజాం రాజుకు అన్ని మర్యాదలెందుకు జరిగాయి? ఆనాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలను నానా హింసలకు గురిచేసి వేలాది మంది వీరుల మరణానికి కారకులయిన నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్లలో ఒక్కడికైనా శిక్ష పడిందా? పరమ కిరాతకుడైన రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ దేశం విడిచి సురక్షితంగా పాకిస్తాన్కో, మరెక్కడికో ఎట్లా పారిపోగలిగాడు? ఆనాడు జరిగింది విమోచన కాదు అని వాదిస్తున్న వారి నుంచి వస్తున్న ప్రశ్నలివి. అందుకే ఇది విలీనం మాత్రమే అంటున్న వాళ్లూ ఉన్నారు. అసలు ఆ రెండూ కాదు, ఆనాడు జరిగింది నిజాం పాలనను ఎదిరించి ధైర్యంగా సాయుధ పోరాటం చేసిన తెలంగాణ రైతాంగం జరిపిన అలుపెరుగని పోరాటానికి, అసువులు బాసిన అమర వీరులకు జరిగిన విద్రోహం అన్న వాదన కూడా బలంగా ఉన్నది. ఈ చర్చ అట్లా ఉంచితే సెప్టెంబర్ 17ను ప్రభుత్వం ఘనంగా అధికార ఉత్సవంగా నిర్వహించాలని బీజేపీ తదితర ప్రతిపక్షాలూ, ససేమిరా అని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడెందుకు పట్టుబట్టి కూర్చున్నాయన్న విషయం మాట్లాడుకుందాం. బీజేపీ పట్టు సెప్టెంబర్ 17 తేదీని విమోచన దినంగా ప్రభుత్వమే నిర్వహించాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న మాట నిజం. ప్రజలను కదిలించే ప్రాంతీయ అంశాలను తీసుకుని 2019 ఎన్నికల్లో దక్షిణాదిన కూడా పాగా వెయ్యాలన్న అధిష్టానం ఆలోచనలో భాగంగా ఈసారి తెలంగాణలో విమోచన దినం డిమాండ్ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకుపోయేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వారం రోజుల యాత్ర నిర్వహించారు. అదే క్రమంలో తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలను కూడా బీజేపీ నాయకులు పోయిన చోటల్లా ఎండగట్టారు. పాపం స్థానిక నాయకత్వం ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీ నుంచి ఒక కేంద్రమంత్రి వచ్చి ‘కేసీఆర్ ప్రభుత్వం భేష్!’అని కితాబిస్తాడు. మహారాష్ట్ర గవర్నర్గారు వచ్చి తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తున్నదని పొగుడుతారు. ఇంకో వైపు నుంచి బిహార్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇక్కడి సుపరిపాలన గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు. ఇదేమిటి అని అడిగితే ప్రభుత్వాల మధ్య సంబంధాలు వేరు, పార్టీల ఎజెండాలు వేరు అని ఒక బలహీన వాదన వినిపిస్తారు. దక్షిణాదిన పట్టు సాధిస్తాం, తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం అన్న ఆలోచనకు ప్రస్తుతం మోదీ, అమిత్ షా ద్వయం స్వస్తి చెప్పిందనడానికి నిదర్శనం– ఉన్నఒకే ఒక్క కేంద్రమంత్రి, తెలంగాణ వాది, వెనుకబడిన తరగతుల సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయను క్యాబినెట్ నుంచి తొలగించడం. 2019లో కలసి నడవడానికి కేసీఆర్లో ఒక మంచి మిత్రుడిని వారు వెతుకుతున్నట్టు వార్తలొస్తున్నాయి. సర్వేల పేరుతో మళ్లీ అధికారం తమదే అని బయటికి చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగా తెలిసిన ముఖ్యమంత్రి కూడా బీజేపీకి స్నేహహస్తం చాచక తప్పని పరిస్థితే. మజ్లిస్తో మైత్రి వదలలేకే! తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికార ఉత్సవంగా జరపకపోవడానికి గల కారణాలను గురించి తలలు బద్దలు కొట్టుకోనక్కర లేదు. అవి చాలా సుస్పష్టం. మజ్లిస్తో స్నేహం చెడగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే, ముస్లింలను సంతోషపరుస్తున్నాననుకుంటూ పొద్దున్న లేస్తే నిజాం నవాబును, ఆయన పరిపాలనను వేనోళ్ల స్తుతిస్తూ విమోచన దినం అధికారికంగా ఎట్లా నిర్వహించడం అనేది మరో కారణం. ఒకవైపు కాళోజీని, దాశరథిని కొనియాడుతూ, మరో వైపు నిజాం రాజును స్తుతించడం కేసీఆర్కే చెల్లింది. అయినా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఒక మతానికి వ్యతిరేకంగా కాదు, రాజరిక వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిస్తూ కమ్యూనిస్టుపార్టీ చేసిన ప్రకటన మీద సంతకాలు చేసిన ముగ్గురిలో కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజాకవి మక్దూం మొహియుద్దీన్ ముఖ్యుడు. ఆయన స్వయంగా అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటంలో పాల్గొన్నాడు. నిజాంను వ్యతిరేకిస్తూ రజాకార్లకు వ్యతిరేకంగా, భూస్వాముల గూండాలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అనేక మందిలో షోయేబుల్లా ఖాన్, బందగి వంటి వారు కూడా ఉన్నారు. ఈ చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియకే సెప్టెంబర్ 17 పట్ల విముఖంగా ఉన్నారని అనలేం. అన్నిటిని మించిన అసలు కారణం 2001 కంటే ముందు తెలంగాణ చరిత్రకు సంబంధించి దేనినీ గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేకపోవడమే. 2001లో తాను తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తరువాత 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా జరిగిందే చరిత్రలో నిలిచిపోవాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తున్నది. 1969లో కానీ, అంతకు ముందు కానీ తెలంగాణలో సమరశీలపోరాటాలు జరిగాయని, వాటి పునాదుల మీదనే తమ నేతృత్వంలో జరిగిన మలి దశ టీఆర్ఎస్ ఉద్యమ విజయం సాధ్యం అయిందని ఆయన అంగీకరించరు. చరిత్ర అడగొద్దు, మేం చెప్పింది వినాలి అంటే కుదరదు. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిపిన సుదీర్ఘ పోరాటాల ఫలితమే 69 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఇండియన్ యూనియన్లో విలీనమైందన్న మాట వాస్తవం. సెప్టెంబర్ 17ను దాని చారిత్రిక నేప«థ్యాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు అందరూ మానేస్తే మంచిది. చరిత్రను పాలకులు విస్మరిస్తారేమో కానీ, ప్రజలు మాత్రం మరవరు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘నంద్యాల’ విజేత నల్లధనమే!
డేట్లైన్ హైదరాబాద్ ఒక్కసారి శోభా నాగిరెడ్డి మరణం సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉండగా ప్రమాదంలో మరణిస్తే కనీసం ఆ పిల్లలను పలకరించని, ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించని చంద్రబాబు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం పట్టుపడితే తప్ప మొక్కుబడిగా సంతాప తీర్మానం కూడా పెట్టని బాబు, ఆయన పార్టీ పాపం తల్లితండ్రులు లేని పసిపిల్లలు అని ఇప్పుడు సానుభూతి చూపడం ఓట్లు దండుకోవడానికే కదా! ఏ ఆట అయినా గెలవడానికే ఆడతారు ఎవరయినా! ఏ ఎన్నికలో అయినా గెలవాలనే పోటీ చేస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా! ఫలితాలు వెలువడిన తరువాత సమీక్షించుకోవడం సహజం. ఈ సమీక్ష మామూలుగా ఓడిన పక్షం వైపే ఎక్కువగా జరుగుతుంది. ఏయే కారణాల వల్ల ఓడిపోయాం? ఎక్కడ పొరపాటు జరిగింది? భవిష్యత్తులో గెలవడానికి పనితీరును ఎట్లా మెరుగు పరుచుకోవాలి...? ఇలా, ఈ రీతిలో సమీక్షించుకుంటారు. సోమవారం దేశ వ్యాప్తంగా జరిగిన నాలుగు శాసనసభా స్థానాల ఉప ఎన్నికల్లో అధికార పక్షాలే గెలుపొందాయి. గోవాలో రెండు స్థానాలనూ అక్కడి అధికార పక్షం భారతీయ జనతా పార్టీ, ఢిల్లీలో ఒక స్థానం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల స్థానాన్ని అధికార పక్షం తెలుగుదేశం పార్టీ గెల్చుకున్నాయి. మందీ మార్బలం, హంగూ ఆర్భాటం, అధికార యంత్రాంగం తమ పక్షాన పనిచేస్తాయి కాబట్టి సాధారణంగా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అధికార పక్షాన్నే గెలుపు వరించడం సహజం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉప ఎన్నికల్లో అధికార పక్షం ఓడిపోవడం చూస్తాం. ఉప ఎన్నికలలో ఇది మామూలే ఇటీవలి చరిత్ర పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఫలితాలను మనం చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2006లో కేంద్ర మంత్రి పదవికీ, కరీంనగర్ లోక్సభ స్థానానికీ రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అధికార కాంగ్రెస్ అభ్యర్థి మీద రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, పార్లమెంట్ సభ్యత్వానికీ రాజీనామా చేసి కడప పార్లమెంట్ స్థానానికి మళ్లీ పోటీ చేసినప్పుడు అద్భుతమయిన ఆధిక్యం సాధించారు. ఆయనతో బాటు డాక్టర్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి కూడా పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ మంచి మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తరువాత జగన్మోహన్రెడ్డికి మద్దతుగా శాసనసభ్యత్వాలకూ, పార్లమెంట్ సభ్యత్వాలకూ రాజీనామాలు చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యధికులు గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత తెలంగాణలో కూడా పలువురు వివిధ పార్టీల శాసనసభ్యులు రాజీ నామా చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఈ అన్ని సందర్భాల్లోనూ కొన్ని స్పష్టమయిన అంశాలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. కేసీఆర్ పోటీ చేసినప్పుడు, ఆ తరువాత తెలంగాణలో పలువురు శాసనసభ్యులు పోటీ చేసిన ప్పుడు ఉప ఎన్నికల మీద తెలంగాణ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉండటం చూశాం. జగన్మోహన్రెడ్డి పోటీ చేసిన ఉప ఎన్నిక తండ్రి మరణానంతరం ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి బలంగా ప్రభావం చూపింది. ఆ తరువాత కాలంలో వైఎస్ఆర్ సీపీలో చేరిన ఇతర పార్టీల ఎంఎల్ఏల ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇదే అంశం అధికార పక్షం ఓడిపోడానికి కారణం అయింది. 2004 నుంచి 2014 దాకా చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో 40కి పైగా శాసనసభా స్థానాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగితే ఎక్కడా తెలుగుదేశం పార్టీ గెలవకపోగా 20 స్థానాలకు పైగా డిపాజిట్లు కూడా కోల్పోవడం గమనార్హం. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే కొందరు తెలుగుదేశం మంత్రులు, నాయకులు విజయోత్సాహం తట్టుకోలేక ప్రతిపక్షం పని అయిపోయింది, ఇక జగన్మోహన్రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుంది అని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మరి అంత దీనస్థితిలోకి తెలుగుదేశం పార్టీ ఆనాడు దిగజారితే ఆ పార్టీకి నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎందుకు సన్యాసం తీసుకోలేదు? నంద్యాలలో శిల్పా మోహన్రెడ్డి ఓటమికి ఆనాడు టీడీపీ వారి ఓటమికి ఎక్కడయినా పోలిక ఉందా? తప్పించుకోలేరు కాబట్టే... ఇక నంద్యాల ఉప ఎన్నిక విషయానికి వద్దాం. ఈ అసెంబ్లీ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందినది. ఈ స్థానం నుంచి గెలిచి, పార్టీ ఫిరాయించి అధికార పక్షానికి వలసపోయిన నాగిరెడ్డి మరణం కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరిగింది. నంద్యాలతో బాటు తమ పార్టీ నుంచి అధికార పక్షానికి వలసపోయిన మరో 20 శాసనసభా స్థానాలకు కూడా ఆ ఎంఎల్ఏలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే ఉంది. అందుకు ఏ మాత్రం సాహసం చెయ్యని చంద్రబాబునాయుడుకు నాగిరెడ్డి ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నికకు వెళ్లక తప్పలేదు. ఇప్పుడు నంద్యాలలో గెలిచాక ఇకపైన ఎక్కడ ఎన్నిక జరిగినా తమ పార్టీయే గెలుస్తుందని ప్రకటించుకున్నారు. అదేక్షణం మరి మిగిలిన 20 స్థానాలకు ఉప ఎన్నికలకు సిద్ధమేనా అంటే సమాధానం దాటవేసి వెళ్లిపోయారు. ఆ ఇరవై స్థానాలలో కూడా జరిగితే...! నిజంగానే నంద్యాల ప్రజలు ఈ మూడేళ్ల రెండుమాసాల కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసిన తీరుకు ముచ్చట పడి ఓట్లేసి గెలిపించి ఉంటే మిగిలిన 20 స్థానాల్లో కూడా ఎన్నికలను ఎదుర్కోడానికి వెనకాడటం ఎందుకు? ఆ సాహసం ఆయన చేయరన్న విషయం అందరికీ తెలుసు. అదే చేయవలసి వస్తే ఓ నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యాలి. ఒక్క ఎన్నిక కాబట్టి నంద్యాలలో 200 కోట్లతో సరిపెట్టారు. అట్లాగే ఒక్కచోటే ఎన్నిక కాబట్టి మొత్తం మంత్రివర్గాన్నీ, ఎంఎల్ఏలనూ, ఎంపీలనూ నెల రోజులపాటు నంద్యాలలోనేవిడిది చేయించారు. అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మోహరింప చెయ్యగలిగారు. ఫలితం వెలువడగానే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు, నంద్యాల ఉప ఎన్నిక కారణంగా రాష్ట్రమంతటా అభివృద్ధి ఆగిపోయిందని. ఒక్క ఉప ఎన్నిక కోసం మొత్తం అధికార యంత్రాంగాన్ని నంద్యాలకు తరలించమని ఎవరు చెప్పారు ఆయనకు? ఆ అవసరం ఎందుకొచ్చిందట! ఇంత చేస్తే ఈ మాత్రం గెలుపు సాధించగలిగారు. నంద్యాల ఫలితం వెలువడ్డ తరువాత పలువురు తెలుగుదేశం సీనియర్ నాయకులు సంతోషానికి బదులు దిగులు పడ్డారట. ఎందుకంటే ఒక్క నంద్యాల ఎన్నికకే 50 స్థానాల్లో పోటీ చేసినంత కష్టపడ్డాం, ఇక 2019 ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలో అని ఆందోళన చెందారట. అట్లాంటిది ఇప్పుడు 20 స్థానాలకు ఒక్కసారే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది? అందుకే చంద్రబాబు ఆ పనికి సిద్ధంగా లేకపోగా మీ ఎంపీలతో రాజీనామా చెయ్యించండని వైఎస్ఆర్ కాంగ్రెస్కు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? సక్రమంగా గెలిచిన పార్లమెంట్ సభ్యులు రాజీనామా చెయ్యడమా, అక్రమంగా పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలు రాజీనామా చెయ్యడమా? దబాయించేస్తే సరిపోతుంది అనుకుంటే ఎలా? గెలుపు ఎవరిది? ఇంతకీ నంద్యాలలో ఎవరు గెలిచారు? మొత్తం ఎన్నికల కాలంలో ఒక్క క్షణం కూడా నోరు విప్పని భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారా, ఆయనకు టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గెలిచారా? సాంకేతికంగా గెలిచింది తెలుగుదేశం అభ్యర్ధి బ్రహ్మానందరెడ్డి అయినా, అసలు గెలిచింది మాత్రం మితిమీరిన అధికార దుర్వినియోగం, వందల కోట్ల రూపాయల నల్లధనం, అభివృద్ధి పేరిట జరిగిన విధ్వంసం, గెలిపించకపోతే అభివృద్ధిని ఆపేస్తామన్న బెదిరింపులు. నిజానికి నంద్యాల ఉపఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనవ్వుల పాలయ్యారు. పెద్ద నోట్ల రద్దు (డిమోనిటైజేషన్)తో నల్లధనం మొత్తం బయట పడిపోయిందని మోదీ చెబుతుంటే ఆయన మిత్రపక్షం తెలుగుదేశం మాత్రం నంద్యాల వీధుల్లో నల్లధనం పారిం చింది. భూమా నాగిరెడ్డి మరణం, అంతకు ముందే ఆయన భార్య శోభా నాగిరెడ్డి మరణం ఈరెండింటినీ సానుభూతిగా మలచి తనకు అనుకూలంగా మార్చుకోడానికి కూడా చంద్రబాబునాయుడు ఏ అవకాశమూ వదిలిపెట్టలేదు. తల్లీతండ్రీ లేని పిల్లలను చూసి తెలుగుదేశంకు ఓటు వెయ్యండని నంద్యాల వీధుల్లో ఆ ఇద్దరి మరణానికి సంబంధించిన వీడియోలు, లేజర్ షోలు చూపించారు. ఒక్కసారి శోభా నాగిరెడ్డి మరణం సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉండగా ప్రమాదంలో మరణిస్తే కనీసం ఆ పిల్లలను పలకరించని, ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించని చంద్రబాబునాయుడు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం పట్టుపడితే తప్ప మొక్కుబడిగా సంతాప తీర్మానం కూడా పెట్టని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పాపం తల్లితండ్రులు లేని పసిపిల్లలు అని ఇప్పుడు సానుభూతి చూపడం ఓట్లు దండుకోవడానికే కదా! నంద్యాలలో ఓడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి పార్టీ ఫిరాయింపుల విషయంలో జాతీయ స్థాయిలో చర్చకు తెర తీయడంలో విజయం సాధించారు. ఆరేళ్ల శాసన మండలి సభ్యత్వానికి శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన రాజీనామా చిన్న త్యాగం కాదు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవాల్సింది ఎవరు? సాధారణంగా ఏ ఎన్నిక ఫలితాన్నయినా సమీక్షించుకునేది ఓడిపోయిన పక్షమే. కానీ ఇక్కడ అష్టకష్టాలు పడి, అన్ని అడ్డదారులూ తొక్కి గెలిచి ఓడిన అధికార పక్షమే సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
నైతికతకు పట్టం కట్టాల్సిన పోరు
డేట్లైన్ హైదరాబాద్ నంద్యాల ఉపఎన్నికలో గెలవడానికి చంద్రబాబు ఇంత అవస్థ ఎందుకు పడుతున్నారు? ఆయనా, ఆయన మంత్రులు, అనుచరగణం కలసి వందలు, వేల కోట్ల రూపాయల పనులు చేస్తామని నంద్యాల ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? తన పాలన పట్ల ప్రజాభిప్రాయం ఎట్లా ఉందో ఆయన చేయించుకున్న సర్వేలే స్పష్టం చేశాయి మరి. ఏ మాత్రం వీలున్నా, ఎన్నికల కమిషన్ కూడా స్పీకర్ల వ్యవస్థ లాగా తన చెప్పుచేతల్లో నడిచేదే అయితే, తప్పకుండా ఆయన ఈ ఉపఎన్నికను జరగకుండా ఆపించి ఉండేవారు. నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో కాంగ్రెస్ వాళ్లను తిట్టడానికి ఒక మాట వాడేవారు. ఆయనకు ఆ మాటంటే చాలా మోజు. పదే పదే వాడే వారు. జనానికి కూడా బాగా నచ్చింది. ఆయన నోటి వెంట ఆ మాట వచ్చిన ప్రతిసారీ సభ ఆవరణ అంతా ఈలలూ, చప్పట్లతో మార్మోగేది. కొన్ని వందల బహిరంగ సభల్లో ఆయన ఆ మాట వాడి ఉంటారు. రాజకీయాల్లో ఆ మాట బాగా ప్రసిద్ధి చెందింది కూడా ఆయన కారణంగానే. ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్లను తిట్టడానికి ఆయన వాడిన ఆ మాట ‘‘కుక్కమూతి పిందెలు’’. రాజకీయాల్లో అక్కడక్కడ కుక్కమూతి పిందెలు మొలవడం సహజమే. కానీ, తాను స్థాపించిన పార్టీయే తరువాత కాలంలో, తన సొంత అల్లుడి నేతృత్వంలోనే కుక్కమూతి పిందెలకు నిలయం అవుతుందని మహానుభావుడు ఎన్టీ రామారావు ఊహించి కూడా ఉండరు. ఆయనే జీవించి ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ఆయన అదుపులోనే ఉంటే కచ్చితంగా ఈ కుక్కమూతి పిందెలను ఎరివేసేవారు, అది సాధ్యం కాదనుకుంటే పార్టీనే రద్దు చేసి ఉండేవారు. కొందరు ఆయన చర్యలను మూర్ఖత్వం కింద కొట్టిపారేసినా, నమ్మిన దానికోసం అధికారాన్నే తృణప్రాయంగా ఎడమ చేత్తో విదిలించి పారేసిన నాయకుడు ఎన్టీఆర్. విలువలకు పట్టంగట్టిన నేత ఎన్టీఆర్ ఆయన రాజకీయ జీవితం కేవలం పద్నాలుగు సంవత్సరాలే. ఆ స్వల్ప కాలంలోనే ఆయన రెండుసార్లు అధికారం కోల్పోతానని తెలిసి కూడా తాను చెయ్యదల్చుకున్నది చేసేశారు. అంతే తప్ప, అధికారాన్ని కాపాడుకోవాలని, పట్టుకుని వేళ్లాడాలని కుక్క మూతి పిందెలను దరిచేరనివ్వలేదు. ఎన్నికల ముంగిట్లో నిలబడి కూడా మంత్రి వర్గాన్ని మొత్తంగా రద్దు చేసి పారెయ్యగలిగిన ధైర్యం ఆయనది. ఆ కారణంగానే ఆయన 1989లో అధికారం కోల్పోయారు. మళ్లీ 1995లో అదే జరిగింది. శ్రేయోభిలాషుల సలహా పాటించి ఒంటరిగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు ఏర్పాటు చేసిన క్యాంప్కు వెళ్లి ఎంఎల్ఏలను కలసి ఉంటే అల్లుడి రాజకీయ జీవితం అక్కడితో ముగిసి ఉండేది. వైస్రాయ్ హాటల్ క్యాంప్ రాజకీయాలను ఒక ప్రధాన దినపత్రిక ముఖ్య విలేకరిగా ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్ట్గా ఆ మాట కచ్చితంగా చెప్పగలను. విలేకరులం ఆ క్యాంప్లోని ఏ శాసన సభ్యుడిని కదిలించినా ఎన్టీ రామారావుకు ద్రోహం చేస్తున్నామన్న బాధ, ఆవేదన వారిలో స్పష్టంగా కని పించేది. ఒక్కసారి అన్నగారు క్యాంప్కు వచ్చి భరోసా ఇస్తే మూకుమ్మడిగా ఆయన వెంట బయటికి వెళ్లిపోయి ఉండేవారు ఎంఎల్ఏలు. ఎక్కువ మంది ఎంఎల్ఏలు క్యాంప్లో ఉండిపోయి చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వడానికి కారణం ఎన్టీఆర్ శాసన సభ రద్దు కోసం గవర్నర్కు సిఫారసు చెయ్యబోతున్నాడనే ప్రచారాన్ని చంద్రబాబు బలంగా వ్యాపింప చెయ్యడమే. ఎన్టీఆర్ స్వయంగా, ఒంటరిగా వచ్చి, అట్లా చెయ్యబోనని ఒక్కమాట అని ఉంటే ఆ భరోసాతో వారు ఆయనతో వెళ్లి ఉండే వారు. చంద్రబాబు పని ఆనాడే ‘‘ఖేల్ ఖతం దుకాన్ బంద్’’ అయ్యుండేది. కానీ ఎన్టీఆర్ ఆ పని చెయ్యలేదు. అధికారం కోల్పోయారు. అయితేనేం విలువలకు కట్టుబడి ఉన్న పేరు నిలిచిపోయింది. అధికారం శాశ్వతం అనో లేదా అది శాశ్వతంగా తనకే ఉండాలనో కోరుకున్న వారు కాదు కాబట్టే ఎన్టీ రామారావు ఆ పని చెయ్యగలిగారు. ఆయన చనిపోయి రెండు దశాబ్దాలు దాటినాక, ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవడం ఇప్పుడెందుకు? అని ఎవరయినా అడగొచ్చు. కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ స్థానానికి ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న సందర్భంగా... అటు అధికార పక్షం అయిన తెలుగుదేశం పార్టీ, దాని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలకిందులుగా చేస్తున్న విన్యాసాలనూ, ఇటు రాజకీయాల్లో విలువలను ముందుకు తీసుకుపోతానని చెప్పడమే కాదు, పాటించి చూపుతున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్నీ పోల్చి చూస్తుంటే ఎన్టీఆర్ నడిపిన రాజకీయాలను గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది. అధర్మ యుద్ధం సాగిస్తున్న అధికార పక్షం ఎన్టీ రామారావు జీవించి ఉంటే జగన్మోహన్రెడ్డిని, శిల్పా చక్రపాణిరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందించి ఉండేవారు. ఒక పార్టీ ద్వారా ఎన్నికై, ఇంకో పార్టీలోకి వెళ్లాలనుకునే వారు వారి పదవులకు రాజీనామా చెయ్యాల్సి ఉంటుందని పార్టీ పెట్టిన కొద్ది రోజులకే తిరుపతి మహానాడులో నిర్ణయించి, దానికి కట్టుబడనందుకు ఆదయ్య, నారాయణ వంటి వారిని పార్టీ నుండి బహిష్కరించారు. అలాంటి తన విగ్రహానికి మొక్కుబడిగా దండలు వేసి తన విధానాలను, విలువలను ఏట్లోకి విసిరేసిన నేటి తెలుగుదేశం పార్టీని, దాని ప్రస్తుత నాయకుడిని కచ్చితంగా ఛీత్కరించుకుని ఉండేవారు. ఎన్టీఆర్ కోరుకున్న విలువలను పాటిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన చీదరించుకున్న, ద్వేషించిన కుక్కమూతి పిందెలతో నిండిన అధికార పక్షం చేస్తున్న అధర్మ యుద్ధాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో సమర్థించి ఉండేవారు కాదు. తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి, దొంగ వేషాలూ దొడ్డి దారులూ వెతుక్కోకుండా, స్పీకర్ ఫార్మాట్లో ఆ రాజీనామాను సమర్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిన చక్రపాణిరెడ్డి రాజీనామాను పది రోజుల్లో ఆమోదించారు. ఈ పని వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి ఫిరాయించి అధికార పక్షం పంచన చేరిన 21 మంది శాసన సభ్యుల విషయంలో ఎందుకు జరగలేదు. ఆ 21 మందిలో ఒకరు చనిపోయారు, ఆ కారణంగానే నంద్యాలకు ఉప ఎన్నిక అవసరం అయింది. మిగిలిన 20 మంది తమ పదవులకు రాజీనామాలు ఎందుకు చెయ్యలేదు? అందులో నలుగురు మంత్రివర్గంలో చేరిన పూటే రాజీనామాలు సమర్పించారని, అవి స్పీకర్కు అందాయని చివరి నిముషంలో చెప్పారు. అలాంటప్పుడు చక్రపాణిరెడ్డి రాజీనామాతో బాటు ఆ నలుగురి రాజీనామాలను కూడా ఆమోదించి ఉండాలి కదా, అదెందుకు జరగలేదు? చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదంలో చూపిన వేగం, వారి విషయంలో ఎందుకు లేకుండా పోయింది? దీనికి సమాధానం చెప్పడం చాలా సులభం. ప్రజాభిప్రాయం, ప్రజాభి మతం, ప్రజామోదం ఎవరి వైపు ఉంటాయో వారికే నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం బలంగా ఉంటాయి. వారు ఏ నిర్ణయం అయినా నిబ్బరంగా తీసుకోగలరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉన్నది, తెలుగుదేశం పార్టీకి లేనిది అదే. దివాలాకోరు రాజకీయాలను ప్రజలు క్షమించరు, తిరస్కరిస్తారు, బుద్ధి చెపుతారు కాబట్టి వీలయినంత కాలం పదవులు పట్టుకు వేళ్లాడుదామని చూసే వాళ్లనే ఎన్టీ రామారావు కుక్క మూతి పిందెలు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో గెలిచి పదవులు వీడకుండా అధికార పక్షం వైపు వలసపోయిన వాళ్లు ఆ కోవకు చెందిన వారే. నంద్యాల కోసం ఎందుకిన్ని పాట్లు అసలు చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి ఇంత అవస్థ ఎందుకు పడుతున్నారు? ఆయన అధికారంలోకి వచ్చాక మూడేళ్లు నంద్యాల వైపు తొంగి కూడా చూడని ఆయనా, ఆయన మంత్రివర్గ సహచరులూ, పార్టీ నాయకులూ, కిరాయికి తెచ్చిన వందలాది మంది నకిలీ కార్యకర్తలూ కలసి వందలు, వేల కోట్ల రూపాయల పనులు చేస్తామని నంద్యాల ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నంద్యాలలో ఓడిపోతే చంద్రబాబు ప్రభుత్వం ఏమీ పడిపోదు. అదసలు ఆయన పార్టీ గెలిచిన స్థానమే కాదు. ఇదో ఉప ఎన్నిక, మేం చేసిన అభివృద్ధిని చూసి జనం ఓట్లేస్తారని, అభ్యర్థిని ప్రకటించి, ప్రచార బాధ్యతలను స్థానిక నాయకత్వానికి అప్పజెప్పి.. తాను ప్రభుత్వాన్ని నడిపే పని చెయ్యెచ్చు కదా! ఈ నెల మూడవ తేదీన జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు 2019లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నాంది అని చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. అసలు ఉపఎన్నికలు రావడమే ఆయనకు ఇష్టం లేదు. తన పాలన పట్ల ప్రజాభిప్రాయం ఎట్లా ఉందోనని పలుమార్లు ఆయన స్వయంగా చేయించుకున్న సర్వేలు స్పష్టం చేశాయి, మరి. కానీ భూమా నాగిరెడ్డి హఠాత్తుగా చనిపోవడంతో, ఏదో సామెత చెప్పినట్టు చంద్రబాబు ప్రాణం మీదికి వచ్చింది. ఏ మాత్రం వీలున్నా, ఎన్నికల కమిషన్ కూడా స్పీకర్ల వ్యవస్థ లాగా తన చెప్పు చేతల్లో నడిచేదే అయితే, తప్పకుండా ఆయన ఈ ఉపఎన్నికను జరగకుండా ఆపించి ఉండేవారు. ఎన్నిక తప్పనిసరి కావడంతో ఆయన నంద్యాల ప్రజలకు చంద్రుడిని కూడా తెచ్చిస్తానని చెపుతున్నారు. అయితే నంద్యాలలో మకాం వేసిన మంత్రివర్యులంతా ‘‘మరి చంద్రబాబు నాయుడు చంద్రుడిని సగం దూరం తెచ్చారు, మీరు ఈ ఉప ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించకపోతే ఆ చంద్రుడు వెనక్కి వెళ్లి పోతాడు’’ అన్నట్టు రోజూ హెచ్చరిçకలు చేస్తూ వీధుల వెంట తిరుగుతున్నారు. ఎవరు గెలిచినా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా జరగాల్సిందే. ప్రతిపక్షాల నియోజకవర్గాలు అభివృద్ధికి, సంక్షేమానికి పనికి రావు అని మన రాజ్యాంగం చెప్పలేదు, చట్టాల్లో రాసి లేదు. అదే నిజమయితే అధికార పక్షం ఓడిపోయిన ప్రతి నియోజక వర్గమూ వెనకబడి పోవాల్సిందే కదా. నంద్యాల ప్రజలకు, ఆ మాట కొస్తే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలం దరికీ ఆ విషయం బాగా తెలుసు. నిజానికి ప్రస్తుత నంద్యాల ఉపఎన్నికను మిగిలిన అన్ని అంశాలనూ పక్కన పెట్టి రాజకీయాల్లో నైతికత, అనైతికత మధ్య పోరాటంగా పరిగణించి ఓటర్లు తీర్పు చెప్పాలి. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘దక్షిణం’ కోసం ప్రదక్షిణలు
డేట్లైన్ హైదరాబాద్ తనను తీవ్రంగా వ్యతిరేకించి, అవమానకరంగా వ్యవహరించిన నితీశ్నే అక్కున చేర్చుకున్న మోదీ చంద్రబాబు ఆనాడు చేసిన అవమానాన్ని తమ రాజకీయ ప్రయోజనం కంటే ఎక్కువ సీరియస్గా తీసుకుంటారా? అదేమైనా మనసులో ఉన్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, అన్ని వర్గాలనూ దూరం చేసుకున్న పరిస్థితిలో మునుగుతున్న పడవలో ప్రయాణం చెయ్యాలని ఎవరనుకుంటారు? ఈ ఆగస్టులో ఏపీ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఏం చేయాలని అనుకుంటున్నది? తెలంగాణలో అధికారపక్షాన్ని తన దారికి తెచ్చుకుని, ఆంధ్రప్రదేశ్లో అధికారపక్షంతో తెగతెంపులు చేసుకోవాలని అనుకుంటున్నదా? మిత్రుపక్షాలైనా సరే, భారంగా మారతాయనిపిస్తున్న పార్టీలను వదిలించుకుని కొత్త స్నేహాల కోసం బీజేపీ చేయి చాస్తున్నట్టు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదేదో రెండు తెలుగురాష్ట్రాలలో తన వ్యూహంగా మాత్రమే బీజేపీ చేస్తున్నట్టు లేదు. 2019 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీకి గతంలో కంటే ఎక్కువ స్థానాలను సాధించుకోవడంతో బాటు, రాష్ట్రాల్లో కూడా తమ ప్రభుత్వం లేదా తమ మిత్రుల ప్రభుత్వాలు అధికారంలో ఉండేటట్టు చూసుకోవడం నరేంద్ర మోదీ, అమిత్ షా తాజా వ్యూహం. తద్వారా లోక్సభతో బాటు రాజ్యసభలో కూడా తమ మాట నెగ్గేటట్టు చేసుకుంటే ఇక అడ్డు ఉండదన్నది ఆ నాయకద్వయం ఆలోచన. సంపూర్ణ అధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్న ఈ నాయకులు ఇద్దరికీ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల మీద ప్రత్యేకమైన ప్రేమ కానీ, ద్వేషం కానీ లేవు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను నూటికి నూరు పాళ్లు నిజం చేస్తూ మొన్ననే బిహార్లో నితీశ్కుమార్ మోదీ శిబిరంలో చేరిపోవడం, మోదీని మించిన నాయకుడు ఈ దేశంలోనే లేరు అనేంత దాకా వెళ్లడం చూశాం. ఇంకెవరయినా ఈ మాటలు మాట్లాడితే ఆశ్చర్యపోనక్కర లేదు. నితీశ్ బీజేపీతో జత కట్టడాన్ని ఘర్వాపసీ అంటున్న వాళ్లంతా మోదీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ససేమిరా అనే నితీశ్ ఎన్డీఏ కూటమిని వీడిన విషయం, ఒక దశలో బీజేపీయేతర పార్టీలన్నిటికీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొచ్చిన విషయం మరిచిపోయినట్టున్నారు. ఇటీవలే జరిగిన బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యు) మధ్య జరిగిన మాటల యుద్ధం కూడా గుర్తు చేసుకోవాలి వాళ్లు. నైతికమా అనైతికమా, న్యాయమా అన్యాయమా, చట్ట విరుద్ధమా రాజ్యాంగ బద్ధమా అన్న చర్చ చేయడానికి కేంద్రంలోఅధికారంలో ఉన్న మోదీ షా జోడీ ఆలోచించేందుకు సిద్ధంగా లేదు. దేశాన్నంతటినీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా ముందుకు పోతున్నారు. తమిళనాడు పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం కదా! ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాడు ఇక బీజేపీ అదుపులోకి వచ్చినట్టే. బిహార్ బీజేపీ బుట్టలో పడనే పడింది. దీంతో 15 రాష్ట్రాలు బీజేపీ పాలనలోకి వచ్చేసినట్టే. నియోజకవర్గాల పెంపు లేకపోతే... తమిళనాడులో ఏఐడీఎంకే గ్రూపులు దారికి రాకపోతే రాష్ట్రపతి పాలన విధించి 2018లో మరికొన్ని రాష్ట్రాలతో బాటు ఎన్నికలు నిర్వహించవచ్చు. దక్షిణాదిలో కూడా అధికారంలోకి రావాలన్న బీజేపీ వ్యూహకర్తల లక్ష్యంలో భాగంగా తమిళనాడును దారికి తెచ్చుకునే పనిలోపడ్డట్టున్నారు. కర్ణాటకలో గతంలో అధికారం అనుభవించిన బీజేపీ మళ్లీ అధికారం లోకి వచ్చే అవకాశాల పట్ల ఆశతోనే ఉంది. కేరళ కొరకరాని కొయ్య. ఇక పోతే దక్షిణాదిలో మిగి లింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్–రెండు తెలుగు రాష్ట్రాలు. ఇటీవలి పరిణామాల నేప«థ్యంలో ఈ రెండు రాష్ట్రాలలో మోదీ షా జోడీ ఏం చేయబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ అధికార పక్షాలు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లో మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను మాత్రం కచ్చితంగా పెంచేందుకు కేంద్రాన్ని ఒప్పించగలమన్న ధీమాతో ఎడా పెడా ప్రతిపక్షాల నుంచి శాసనసభ్యులను చేర్చుకుని కూర్చున్నారు. తెలంగాణలో 25 మంది, ఆంధ్రప్రదేశ్లో మరో 21 మంది శాసనసభ్యులు, కొంతమంది లోక్సభ సభ్యులు అధికార పక్షానికి వలసపోయారు. ఇద్దరికీ మిత్రుడిగా, తమ ప్రయోజనాల పరిరక్షకుడిగా చంద్రశేఖర్రావు, చంద్రబాబునాయుడు భావించిన వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి పదవికి పంపించడం, ఆ వెంటనే, నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని స్పష్టం చెయ్యడంతో ఇద్దరు నేతలూ దిక్కు తోచని స్థితిలో పడ్డారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రిని కలసి నియోజకవర్గాల పెంపు విషయంలో స్పష్టమయిన ప్రకటన చేయించుకు రావాలని గట్టి ఆలోచనతో వెళ్లారు. చంద్రబాబునాయుడుకు య«థావిధిగానే ప్రధానమంత్రి అపాయిం ట్మెంట్ దొరకలేదు. అయితే ప్రధానితో సమావేశం కోసం వేచి ఉండకుండా తొందర పనులు ఉన్నందున చంద్రబాబే విజయవాడకు వెళ్లిపోయారని ఆయన అనుయాయులు నమ్మించే ప్రయత్నం చేశారనుకోండి! ఇక ప్రధానమంత్రి అపాయింట్మెంట్ పొంది మరునాడు ఆయనను కలసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఆ అంశం మరిచిపోవచ్చునని మీడియా మిత్రులకు చెప్పారు. నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినా మాకేం ‘ఫరక్’ పడదు అని ఆయన గాంభీర్యం ప్రదర్శించినా కొంచెం స్వరం మారడం గమనించవచ్చు. గత సంవత్సరం మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన వెంటనే తీవ్రంగా స్పందించి, తెలివి తక్కువ చర్యగా వర్ణించిన చంద్రశేఖర్రావు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి ఉపదేశం విన్నాక కనువిప్పు కలిగి అదొక విప్లవాత్మక నిర్ణయం అని కొనియాడారు. ఏం మతలబు జరిగిందో ఆయనకే తెలియాలి. ఇంతమాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే మొన్న ప్రధానిని కలసి బయటికొచ్చాక అదే చంద్రశేఖర్రావు పెద్ద నోట్ల రద్దు సత్ఫలితాలు ఏమీ కనిపించలేదని మీడియాకు చెప్పారు. సొంతంగా ఎదిగేందుకు బీజేపీ కృషి ఈ మధ్యకాలంలో ఒకపక్క తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శల బాణాలు విసురుతూనే ఉన్నా స్నేహబంధం కుదిరిపోయిందనీ, ఈ పార్లమెంట్ సమావేశాల తరువాత టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరనుందనీ వార్తలు వచ్చాయి. కేసీఆర్ కూడా అమిత్ షాను విమర్శించినా కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ మీద ఈగ వాలనివ్వక పోవడం ఆ ప్రచారానికి ఆస్కారం కల్పించింది. అంతెందుకు, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చి మర్యాద పూర్వకంగా కలుస్తానన్నా కనీసం ఫోన్లో కూడా ఆమెతో మాట్లాడటానికి సిద్ధపడక పోవడం బీజేపీ మెప్పు కోసమే అన్న విమర్శ అయితే ఉంది. సొంతంగానే పోటీ చేస్తాం అని శ్రేణుల్లో ఉత్సాహం కలిగించడం కోసం మాట్లాడుతున్నా టీఆర్ఎస్ అధినేతకు పరిస్థితులు బాగా తెలుసు, వచ్చే ఎన్నికలలో గెలుపు నల్లేరు మీద నడక కాదని. నియోజకవర్గాల పెంపు లేకపోతే అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం. ఆ విధంగా తెలంగాణ లో అధికారపక్షం తమతో పొత్తుకు ముందుకు రాక తప్పని పరిస్థితి కల్పిస్తూనే సొంతంగా ఎదిగే ప్రయత్నంలో బీజేపీ పడ్డట్టుంది. మోదీ అమిత్ షా ఎత్తుగడలను తట్టుకుని టీఆర్ఎస్ సొంతంగానే నిలబడుతుందా, సర్దుకుపోతుందా చూడాలి. టీడీపీతో బెడిసిన సంబంధాలు ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. వాజ్పేయి, అడ్వానీల కాలం నాటి ఎన్డీఏ కాదనీ మోదీ, అమిత్ షాల కాలమనీ గుర్తించడానికి చంద్రబాబునాయుడుకు ఎక్కువ కాలం పట్టలేదు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబునాయుడుకు ముందు వరుసలో స్థానం కేటాయించారని అనుకూల మీడియాలో రాయిం చుకోవడం కేవలం ఢిల్లీలో ఇంకా తమకు సముచిత గౌరవం ఉందని చెప్పుకోవడానికే. ఈ మూడేళ్లకాలంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం నడుస్తున్న తీరు తెలియనంత అజ్ఞానంలో బీజేపీ నాయకత్వం ఉండదు కదా! కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చు చేస్తున్న తీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దల వ్యవహార శైలి ఎప్పటికప్పుడు తెలుసుకుం టున్న కేంద్ర నాయకత్వం ఇక్కడ కూడా సొంతంగా పార్టీని బలోపేతం చేసే ఆలోచనతో బాటు, ప్రత్యామ్నాయ మిత్రులను వెతుక్కోవడం సహజంగానే జరుగుతున్నది. ఇక్కడొక విషయం మాట్లాడుకోవాలి. దేశమంతా ఇంతకాలం బీజేపీకి దూరంగా ఉన్న పలు పార్టీలు దగ్గరై ఎన్డీఏలో చేరడానికి సిద్ధపడుతుంటే, పాత భాగస్వామి తెలుగుదేశం ఎందుకు దూరమవుతున్నది అన్నదే ఆ విషయం. రాజకీయ దురంధరుడినని తనకు తానే కితాబు ఇచ్చుకునే చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్కు ప్రాణవాయువు వంటి ప్రత్యేక హోదా మొదలైన అన్ని హామీలను గాలికి వదిలేసి అణిగి మణిగి ఉన్నా ఎందుకు బెడిసింది? కాంగ్రెస్ను పూర్తిగా బలహీనపరిచే క్రమంలో వీలైనన్ని పార్టీలను తమ కూటమిలో చేర్చుకోజూస్తున్న బీజేపీ ఆయనను ఎందుకు దూరం పెడుతున్నది? నేలకు ఒరిగిపోతున్న చంద్రబాబు రాజకీయ ప్రతిష్ట వెన్నుకు వెదురు బద్దలు కట్టి నిటారుగా నిలబెట్టే ప్రయత్నంలో తలమునకలవుతున్న ఆయన మిత్ర మీడియా చెప్పినట్టు వాజ్పేయి హయాంలో ఎన్డీఏ కన్వీనర్గా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి తొలగించాలని పట్టుపట్టి ఢిల్లీ ఆంధ్రభవన్లో మూడు గంటలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించినందుకే ఇప్పుడు మోదీ చంద్రబాబును దూరం పెడుతున్నారా? తనను తీవ్రంగా వ్యతిరేకించి, అవమానకరంగా వ్యవహరించిన నితీశ్నే అక్కున చేర్చుకున్న మోదీ చంద్రబాబు ఆనాడు చేసిన అవమానాన్ని తమ రాజకీయ ప్రయోజనం కంటే ఎక్కువ సీరియస్గా తీసుకుంటారా? అదేమైనా మనసులో ఉన్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, అన్ని వర్గాలనూ దూరం చేసుకున్న పరిస్థితిలో మునుగుతున్న పడవలో ప్రయాణం చెయ్యాలని ఎవరనుకుం టారు? ఇక ఎవరి సర్వేలు వాళ్లకు ఉంటాయికదా! హనీమూన్ ఇక ముగిసినట్టే. ఈ ఆగస్టు మాసంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తి కరమైన మలుపులు తిరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక ఇదే నెలలో జరుగుతున్నది, అక్కడ జరుగుతున్న అధికారదుర్వినియోగం, ధన ప్రవాహం అధికార పక్షం ఎంత దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిందో స్పష్టం చేస్తున్నది. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
'సూటి మాట’ ఆవిష్కరణ
విజయవాడ: రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాజకీయాల విశ్లేషణపై సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ రాసిన సూటి మాట పుస్తకాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. చరిత్రకు సాక్ష్యాధారాలుగా అమర్ రాసిన పుస్తకం పనికి వస్తుందని వక్తలు కొనియాడారు. రాష్టానికి సంబంధించిన వివిధ సంఘటలను కళ్ళకు కట్టినట్లు పుస్తకంలో వివరించారని, పత్రికల్లో సంపాదకీయం రాయడం కొంతమందికి మాత్రమే సాధ్యమని, వారిలో అమర్ ఒకరని అన్నారు. పేరుకు తగ్గట్టుగానే పుస్తకంలో అమర్ అన్ని విషయాలు సూటిగా రాశారన్నారు. విభజన తరువాత రెండు రాష్ట్రాల ఆర్థిక విధానాల్లో పెద్దగా మార్పు లేదనన్నారు. ప్రధానంగా ప్రజా సమస్యలపై మీడియా దృష్టి సారించాలన్నారు. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ తనకు అమర్తో 32 ఏళ్ల పరిచయం ఉందని, ఏదైనా సూటిగానే కాదు కర్కశంగా కూడా చెబుతారని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సాక్షి, ఈనాడు పేపర్లు చదువుతానని, ఈ రెండు పేపర్లు చదివితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. జర్నలిజం ప్రజాహితాన్ని కోరాలన్నారు. మనం ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాం అన్నది ఆలోచించాలి అని సూచించారు. రాజకీయాల్లో అసహనం పెరిగిపోయింది: అమర్ పాతికేళ్లుగా కాలమ్స్ రాస్తున్నానని, మధ్యలో ఐదు సంవత్సరాలు ప్రెస్ అకాడమి ఛైర్మన్ గా ఉన్నప్పుడు మాత్రమే కాలమ్స్ రాయలేదని, సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి ప్రోత్సహంతోనే రెండవసారి కాలమ్స్ మొదలుపెట్టానని అమర్ చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో అసహనం పెరిగిపోయిందని, తాము తప్ప రాజకీయాల్లో ఎవరూ ఉండకూడదనే భావన పెరిగిపోయిందని అన్నారు. సమాజానికి రాజకీయ, న్యాయ వ్యవస్థ ఎంత అవసరమో మీడియా కూడా అంతే అవసరమన్నారు. మీడియాను అణగదొక్కాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అయితే వారికి అది కుదరడం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ పక్షాల్లో పెరిగిన అసహనం కారణంగానే కాలమ్స్ రాస్తున్నానంటూ ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు ప్రజలు ఎప్పటికీ కలిసే ఉండాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ సచివాలయాన్ని పాడు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
'సూటి మాట’ ఆవిష్కరణ