Earth quake
-
Delhi Earthquake : డబ్బు కాదు భయ్యా.. బతకాలంటే దమ్ముండాలే!
దేశ రాజధాని నగరం ఢిల్లీని భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడం జనం భయంతో పరుగులుతీశారు. దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. బలమైన ప్రకంపనలతో చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం సమయంలో ఇళ్ల బయట నిలబడి ఉన్న వ్యక్తులు వణుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదు.ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై చాలామంది ఆందోళనవ్యక్తం చేశారు . ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ఢిల్లీ భూకంపంపై పలు మీమ్స్ను సృష్టించారు. #earthquake హ్యష్ట్యాగ్తో రూపొందించిన మీమ్స్ వైరల్గా మారాయి. ఢిల్లీలో నెలకొన్ని పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. పొద్దున్న కాలుష్యం, సాయంత్రం గ్రహణం, రాత్రికి భూకంపం అంటూ నిరాశను ప్రకటించారు. Money is the second thing you need to survive in Delhi, the first is still the courage to live in that city#earthquake pic.twitter.com/E4Jq0XqKY6— isHaHaHa (@hajarkagalwa) February 17, 2025#earthquake #Delhi earthquake to Delhi people: pic.twitter.com/vAYLFraIZo — Yash Khandelwal (@yashk1140) February 17, 2025ఢిల్లీలో జీవించడానికి కావాల్సింది డబ్బులు కాదు భయ్యా, ముందు ధైర్యం కావాలి అంటూ మీమ్ తయారు చేశారు. రెండు నెలలకోసారి టెక్నో ప్లేట్స్ ఢిల్లీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయంటూ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు ఒక పక్క ప్రాణ భయంతో ఢిల్లీ వాసులు అల్లాడిపోతే, సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తూ కామెడీ చేయడం విమర్శలకు దారి తీసింది. Tectonic plates in Delhi NCR in every few months : #earthquake pic.twitter.com/vDJSw14sI3— UmdarTamker (@UmdarTamker) February 17, 2025 సాధారణంగా మీమ్స్ను జనాలకు వినోదం పండిస్తాయి. మానసిక ఉల్లాసాన్నిస్తాయి. చాలా తక్కువ సమయంలో సంబంధిత సమాచారాన్ని చేరవేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల వ్యవహార శైలిపై వేసే మీమ్స్ ఆలోచన రగిలిస్తాయి. క్రికెట్మ్యాచ్లు, సినిమా రివ్యూల్లో వచ్చే మీమ్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. చాలా క్రియేటివ్గా ఉండే ఈ మీమ్స్ ఒకవైపు సమాచారాన్ని ఇస్తూనే, మరోవైపు బోలెడంత హాస్యాన్ని పండిస్తాయి. भूकंप कुछ ऐसा ही था आज Delhi NCR में, बहुत तेज #earthquake pic.twitter.com/pGhsanaidT— बलिया वाले 2.0 (@balliawalebaba) February 17, 2025 -
నిజమవుతున్న నోస్ట్రాడమస్, బాబా వంగా హెచ్చరికలు?
న్యూఢిల్లీ: భూకంపం.. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయలేకపోతున్న ఒక ప్రకృతి విపత్తు. కొన్ని వేల ఏళ్లుగా భూకంపాలు పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 17)న దేశరాజధాని ఢిల్లీలో సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను భయకంపితులను చేసింది. అయితే భవిష్యత్ అంచనాల గురించి తెలిపిన నోస్ట్రాడమస్, బాబా వంగా భూకంపాలు, ప్రకృతి విపత్తులపై ఎటువంటి హెచ్చరికలు చేశారు?నోస్ట్రాడమస్ తన కవితలలో తరచుగా ప్రకృతి వైపరీత్యాల గురించి తెలిపేవాడు. భూమి కంపించటం, నదులు ఉప్పొంగటం లాంటి పర్యావరణ సంక్షోభ హెచ్చరికలను ముందుగానే తెలియజేశాడు. 2025లో వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని నోస్ట్రాడమస్ ముందుగానే తెలిపాడు. ఈయన చెప్పినట్లే సముద్ర మట్టాలు పెరగడం, మంచు వేగంగా కరగడం, వాతావరణంలో వేగవంతమైన మార్పుల గురించి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు. నోస్ట్రాడమస్ తన పుస్తకంలో కార్చిచ్చు, కరువు, భారీ వరదలు మొదలైన వాటి గురించి రాశాడు. భూకంపం లేదా ఆకస్మిక భారీ వర్షపాతం మొదలైన ప్రకృతి వైపరీత్యాలను జనం చూస్తారని నోస్ట్రాడమస్ పేర్కొన్నాడు.2025లో సంభవించే ప్రకృతి విపత్తుల గురించి నోస్ట్రాడమస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతాయి. సూడాన్లో కరువు, పరిమిత సహాయం, పెద్ద ఎత్తున వలసలు లాంటి మానవతా సంక్షోభం ఎదురవుతుందన్నాడు. దీనికి అనుగుణంగానే బషర్ అల్-అసద్ పతనం తర్వాత సిరియాలో అనిశ్చిత వాతావరణం నెలకొంది.బాబా వంగా 2025లో సంభవించే విపత్తుల గురించి కొన్న అంచనాలు అందించారు. యూరప్లో భీకర యుద్ధం ప్రారంభమవుతుంది. ఫలితంగా ఈ ఖండంలోని అధిక జనాభా నాశనమవుతుంది. బాబా వంగా జోస్యం ఒకవేళ నిజమైతే 2025లో రష్యా.. ప్రపంచాన్నంతటినీ శాసిస్తుంది. బాబా వంగా చెప్పినదాని ప్రకారం 2025లో అమెరికా పశ్చిమ తీరంలో భూకంపం వస్తుంది. పలు అగ్నిపర్వతాలు పేలే అవకాశాలున్నాయి. నోస్ట్రాడమస్ 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు. అతని అంచనాలు కొన్ని శతాబ్దాలుగా నిజమవుతున్నాయి. బల్గేరియన్ మహిళ బాబా వంగా చెప్పిన 9/11 దాడి, యువరాణి డయానా మరణం లాంటి అంచనాలు నిజమయ్యాయి.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
‘బాంబు పేలింది’.. భూకంపం అనుభవాల వెల్లువ
న్యూఢిల్లీ: ఈరోజు (సోమవారం) ఢిల్లీ ప్రజలు తెల్లవారుజామున నిద్ర నుంచి లేస్తూనే భూకంప ప్రభావానికి లోనయ్యారు. భయంతో వణికిపోతూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 5 గంటల 36 నిముషాలకు సుమారు 55 సెకెన్లపాటు ఢిల్లీలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయ్యింది. భూకంపం వచ్చిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను పలువురు ట్వట్ల ద్వారా పంచుకున్నారు. Earthquake in Delhi NCR pic.twitter.com/XQwyhc8PvI— Navneet K Singh (@Navneet_K_Singh) February 17, 2025‘ఎక్స్’ ప్లాట్ఫారంపై నవనీత్ సింగ్ అనే యూజర్ భూకంపం సమయంలో తమ ఇంటిలో కదులుతున్న ఫ్యానుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మరో యూజర్ బాంబు పేలిందని అనుకున్నామని రాశారు.You know it's a massive one when it forces you out of your sleep and out of bed. #earthquake— Sarah Waris (@swaris16) February 17, 2025@swaris16 అనే యూజర్ ‘ఆ సమయంలో వచ్చిన భారీ శబ్ధం నిద్ర ఎగిరిపోయేలా చేసింది’ అని రాశారు. దీనిని చూసిన ఒక యూజర్ ‘ఆ శబ్ధం ఉలిక్కిపడేలా చేసిందని’ పేర్కొన్నారు.Severe #earthquake tremors in #Delhi at 0537 amI was in hospital. Yet to evacuate all a patients down. Told those who can walk to go down— Anish K Gupta (@optionurol) February 17, 2025అనిష్ అనే యూజర్ ‘ఢిల్లీలో ఉదయం 05:37కు తీవ్రమైన ప్రకంపన వచ్చింది. ఆ సమయంలో నేను ఆస్పత్రిలో ఉన్నాను. ఇక్కడి సిబ్బంది అందరినీ బయటకు పంపించివేశారు’ అని రాశారు.Very strong earthquake for a couple of seconds here in delhi. The whole society is up!— Worah | #WalkingInDelhi (@psychedelhic) February 17, 2025ఇంకొక యూజర్ ‘ఢిల్లీలో కొద్ది సెకెన్లపాటు భూకంపం వచ్చింది. సొసైటీలోని వారంతా ఉలిక్కిపడ్డారు’ అని రాశారు. మరొకరు ‘ఇది భయానక అనుభవం’ అని పేర్కొన్నారు. -
మళ్లీ ప్రకంపనలు రావొచ్చు.. అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఈరోజు (సోమవారం) ఉదయం బలమైన భూకంపం సంభవించింది. దీంతో జనం భయాందోళనలకు గురయ్యారు. భూ ప్రకంపన తీవ్రంగా ఉండటంతో భూమి కొన్ని సెకన్ల పాటు దీని ప్రభావం కనిపించింది. జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. దీని కేంద్రం ఢిల్లీ చుట్టూ ఉందని సమాచారం. భూ ప్రకంపనలతో పాటు, ఏదో విరిగిపోతున్నట్లు శబ్దం కూడా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ శబ్ధాలకు జనం మరింత భయాందోళనలకు గురయ్యారు.CCTV में कैद दिल्ली-NCR में भूकंप के तेज झटकेसुबह-सुबह भूकंप के झटकों से कांपी दिल्ली, 4.0 तीव्रता. दिल्ली में सोमवार सुबह भूकंप के जोरदार झटके महसूस किए गए. भूकंप के कारण लोगों की नींद भी खुल गई. कंपन इतनी ज्यादा थी कि कई सेकंड तक धरती डोलती रही.#earthquake | #delhincr |… pic.twitter.com/2zsuG2ZyKe— NDTV India (@ndtvindia) February 17, 2025ఈ భూకంప ప్రకంపనల గురించి స్థానికుడు సుమన్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘భూమి కింద ఏదో విరిగిపోతున్నట్లు అనిపించింది. ఆ పెద్ద శబ్దంతో నేను నిద్రలో నుంచి మేల్కొన్నాను. ఎంతో భయాందోళనలకు లోనయ్యాను. నేను నా ఐదేళ కుమారుడిని ఎత్తుకుని, ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంటి నుండి బయటకు పరుగులు తీశాను. నాలాగే చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిలబడ్డారు’ అని తెలిపారు. కాగా చాలా కాలం తర్వాత ఢిల్లీలో ఈ స్థాయి భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.బీహార్, హర్యానాలో..ఢిల్లీతో పాటు బీహార్,హర్యానాలలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. బీహార్లోని సివాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైంది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. హర్యానాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, రోహ్తక్, సోనిపట్లలో భూమి కంపించింది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న బహదూర్గఢ్లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. Prime Minister Narendra Modi tweets, "Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation." pic.twitter.com/KX9qCArbG3— ANI (@ANI) February 17, 2025ప్రధాని మోదీ ట్వీట్ఢిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భూకంపం పై ఢిల్లీ ప్రజలెవరూ ఆందోళనకు గురి కావొద్దని, సురక్షితంగా ఉండేందుకు ముందు జాగ్రత్తలతో వ్యవహరించాలని తెలిపారు. మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. భూకంపాలకు కారణమిదే..భూమి నాలుగు పొరలతో కూడి ఉంటుంది. ఇవి ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్. వీటిలో క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్ను లిథోస్పియర్ అని అంటారు. ఈ 50 కి.మీ మందపాటిగా ఉన్న పొర అనేక భాగాలుగా విభజితమై ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. భూమి లోపల ఇలాంటి ఏడు ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు భూప్రకంపనలు సంభవిస్తాయి. భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్ ఆధారంగా కొలుస్తారు. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అని కూడా అంటారు. భూకంపం కేంద్రం నుంచి తీవ్రత ఎంతనేది కొలుస్తారు. భూకంపం సంభవించినప్పుడు ఆ సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను లెక్కించి భూకంపం ఏ తీవ్రతతో ఉందనేది చెబుతారు. భూగర్భ శక్తి విడుదలయ్యే ప్రదేశానికి కొంచెం దిగువన భూకంప కేంద్రం ఉంటుంది. ఈ కంపనం ఫ్రీక్వెన్సీ ఎంత దూరం ఉంటే.. దాని ప్రభావం అంత తగ్గుతూ ఉంటుంది. రిక్టర్ స్కేల్పై 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత ఉంటే దానిని భారీ భూకంపంగా గుర్తిస్తారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా స్టన్నింగ్ లుక్! -
జపాన్లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ
టోక్యో:జపాన్(Japan)లో సోమవారం(జనవరి13) భారీ భూకంపం(EarthQuake) సంభవించింది. క్యుషు ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదైంది. 37 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యురోపియన్ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఎలాంటి పప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని సమాచారం. అయితే ముందు జాగ్రత్తగా కొన్ని తీర ప్రాంతాలకు సునామీ(Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది ఆగస్టు 8న క్యుషు ప్రాంతంలో రెండు భారీ భూకంపాలు రాగా జనవరి 1 2024న 7.6 తీవ్రతతో సుజు,వజీమాలో భారీ భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు టెక్టానిక్ ప్లేట్లు కలిసే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో జపాన్ ఉండడంతో ఇక్కడ తరచు భూకంపాలు వస్తుంటాయి. -
బీహార్ భూకంపం: 90 ఏళ్ల క్రితం ఇదేవిధంగా.. చెరగని ఆనవాళ్లు
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 53 మంది మృతి చెందారు. ఈ భూకంప ప్రభావం భారత్లోని ఢిల్లీ, బీహార్లోనూ కనిపించింది. బీహార్లో పట్నా, సమస్తీపూర్, సీతామర్హి తదితర జిల్లాల్లో కొన్ని సెకెన్ల పాటు భూమి కంపించింది. ఈ నేపధ్యంలో 90 ఏళ్ల క్రితం బీహార్లో సంభవించిన భారీ భూకంపం గురించి తమ పూర్వీకులు చెప్పిన విషయాలను స్థానికులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.1934 జనవరి 15న బీహార్లో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆనవాళ్లు ఇప్పటికీ బీహార్లో కనిపిస్తాయి. తాజాగా భూకంపం సంభవించిన దరిమిలా 90 ఏళ్ల క్రితం నాటి బీతావహ భూకంపం జ్ఞాపకాలను స్థానికులు గుర్తుచేసుకున్నారు. బీహార్ ప్రాంతం భూకంపాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. 1934లో సంభవించిన భూకంపం కారణంగా బీహార్ మొత్తం ధ్వంసమైంది. నాటి ఆ భూకంపం మధుబని జిల్లాలోని రాజ్నగర్ను శిథిలాల నగరంగా మార్చివేసింది. కోసి ప్రాంతంలో రైలు కనెక్టివిటీ విధ్వంసానికి గురైంది. నేటికీ ఇక్కడ నాటి ఆనవాళ్లు కనిపిస్తాయి.బీహార్లో పలుమార్లు భూకంపాలు సంభవించాయి. 1764, 1833లో బీహార్ ప్రాంతంలో భూకంపాలు సంభవించినట్లు చరిత్ర చెబుతోంది. బీహార్లో 1988, ఆగస్టు 21న 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అయితే 1934లో 8.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. బీహార్లో భూకంప ప్రభావంపై నిపుణులు(Experts) అధ్యయనం చేసినప్పుడు ముజఫర్పూర్, దర్భంగా, ముంగేర్ వంటి జిల్లాల్లో ప్రకంపనలు అధికంగా వచ్చాయని వెల్లడయ్యింది.1934లో సంభవించిన భూకంపం కారణంగా దర్భంగాలో 1,839 మంది, ముజఫర్పూర్లో 1,583, ముంగేర్లో 1,260 మంది మృతిచెందారు. మొత్తంగా 7253 మంది మృతిచెందారు. దాదాపు 3,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూకంప ప్రభావం కనిపించింది. నాటి భూకంపం తీవ్రతకు రాజ్నగర్ నగరం పూర్తిగా శిథిలమయ్యింది. ఇప్పటికీ ఈ నగరాన్ని శిథిలాల నగరం అని పిలుస్తారు. నాటి భూకంపంలో దేశంలోని మూడు అత్యుత్తమ ప్యాలెస్లలో ఒకటైన రాజ్నగర్లోని రామేశ్వర్ విలాస్ ప్యాలెస్(Rameshwar Vilas Palace) పూర్తిగా ధ్వంసమైంది.బీహార్లో భూకంపాలు అనేకసార్లు విధ్వంసం సృష్టించాయి. శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఎప్పుడైనా పెద్ద ఎత్తున భూకంపాలు సంభవించవచ్చనే ఆందోళనను వ్యక్తం చేశారు. బీహార్లోని ప్రతి జిల్లాకు భూకంపం ముప్పు పొంచి ఉంది. 38 జిల్లాల్లో ఎనిమిది జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా భావించే జోన్-5లో ఉన్నాయి. ఇక్కడ ఎత్తయిన భవనాలను నిర్మించడాన్ని నిషేధించారు. ఇది కూడా చదవండి: నాడు సస్పెండ్.. నేడు కుంభమేళా బాధ్యతలు.. ఎవరీ వైభవ్ కృష్ణ? -
నేపాల్ లో భారీ భూకంపం..
-
టిబెట్లో భారీ భూకంపం.. 53 మంది మృతి!
ఢిల్లీ : నేపాల్ (nepal), దాని సరిహద్దు ప్రాంతమైన టిబెట్లో భారీ భూకంపం(earthquake) సంభవించింది. మంగళవారం ఉదయం రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.1గా (7.1 magnitude earthquake) నమోదైంది. ఈరోజు పలు దేశాల్లో భూకంపంసంభవించింది. మొత్తం ఆరు చోట్ల భూకంపం వచ్చింది. టిబెట్, నేపాల్తో పాటు భారత్లోని కోల్కతా, బిహార్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.కాగా, టిబెట్ రీజియన్లోని పర్వత ప్రాంతాల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో 53 మంది మృతి చెందగా, ఓవరాల్గా 62 మంది మృత్యువాత పడ్డారు. యూనైటెడ్ జియోలాజికల్ సర్వే (usgs)ప్రకారం.. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6:35 గంటలకు నేపాల్లో లుబోచికి 93 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి కంపించింది. నేపాల్తో పాటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో, బీహార్, కోల్కతాలోని కొన్ని జిల్లాల్లో భూమి కంపించినట్లు యూఎస్జీఎస్ అధికారులు తెలిపారు. భూకంప ప్రభావం తీవ్రతతో కొద్ది సేపు భూమి కంపించడంపై ప్రజలు ప్రాణ భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.#WATCH🚨 | Kathmandu | An earthquake with a magnitude of 7.1 on the Richter Scale hit 93 km North East of Lobuche, Nepal at 06:35:16 IST today: USGS Earthquakes#NepalEarthquake #Nepal pic.twitter.com/DMnTbHptTF— MIDDLE EAST NEWS (@middleeastnevs) January 7, 2025మరోవైపు భారత్,నేపాల్తో పాటు ఇతర ప్రాంతాల్లో భూకంప తీవ్రతను గుర్తించి,సహాయక చర్యల చేపట్టేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగింది. అధికారులు సైతం భూకంపంపై అప్రమత్త మయ్యారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. 2015లో తొమ్మిదివేల మంది దుర్మరణంప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో నేపాల్ ఒకటి. ఇక్కడ తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. చివరి సారిగా ఏప్రిల్ 25, 2015న నేపాల్లో 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం సుమారు 9వేలమందిని పొట్టన పెట్టుకుంది. 10లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి.దీన్ని బట్టి ఇవాళ సంభవించిన భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఖాట్మండ్ జనాభాలో మూడోవంతు నేపాల్లో తొలిసారిగా అభయ మల్ల రాజు పాలనలో 7 జూన్ 1255లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత నమోదైంది. నాడు సంభవించిన భూకంపం కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండ్ జనాభాలో మూడోవంతు మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నేపాల్ రాజు అభయ మల్ల రాజు సైతం ఉన్నారు. -
చిలీలో భూకంపం..6.2 తీవ్రత నమోదు
శాంటియాగో:చిలీలో భారీ భూకంపం వచ్చింది. కలమాకు 84 కిలోమీటర్ల దూరంలోని అంటోఫగాస్టాలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదైంది. 104 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్(ఈఎమ్ఎస్సీ) ఒక ప్రకటనలో తెలిపింది.Another video of the M6.1 earthquake that hit Chile earlier....pic.twitter.com/w4FyDegf4n— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025భూకంపం కారణంగా జరిగిన ప్రాణ,ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల్లో నమోదైన భూకంపం దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూకంపం ధాటికి భవనాలు కొద్ది సేపు అటు ఇటు ఊగుతుండడం ఆ వీడియోల్లో కనిపించింది. CCTV of the M6.1 earthquake in Chile a short while ago. That was a long one 👀pic.twitter.com/SvyBLoZZhU— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025 -
ప్రకాశం జిల్లాలో మరోసారి కంపించిన భూమి
ప్రకాశం: ముండ్లమూరు (Mundlamuru)లో తాజాగా, మరోసారి భూప్రకంపనలు (Earthquake) కలకలం సృష్టించాయి. గత డిసెంబర్ నెల మూడు,నాలుగు వారాల్లో ఇదే ముండ్లమూరులో మూడుసార్లు భూకంపించింది. తాజాగా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 43 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో, రెండు నెలల (డిసెంబర్లో మూడు సార్లు,జనవరిలో ఒకసారి) వ్యవధిలో నాలుగు సార్లు భూకంపం సంభవించడంపై ప్రజలు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
అమెరికాలో భారీ భూకంపం
కాలిఫోర్నియా:అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతంలో అమెరికా కాలమానం ప్రకారం గురువారం(డిసెంబర్5) ఉదయం 10.44 గంటలకు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై ఏడుగా నమోదైంది. ఫెర్నడెల్ పట్టణంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియోగ్రఫికల్ సర్వే విభాగం వెల్లడించింది.తీర ప్రాంతంలో భారీ భూకంపం రావడంతో అమెరికా సునామీ కేంద్రం ముందస్తు చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి.Shocking Footage of California's 7.0 Mega Quake Captured on Cam!Mother Earth just showed off her raw power with a 7.0 shaker in Cali, and folks, it's all on camera! From swimming pools doing the wave to dogs sensing the rumble before humans, this earthquake video is the talk of… pic.twitter.com/j2hHVBj7JL— 𝕏VN (@xveritasnow) December 5, 2024ఉత్తర దిశలో వచ్చన భూ ప్రకంపనలు దక్షిణ ప్రాంతంలోని శాన్ఫ్రాన్సిస్కో దాకా వచ్చాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.భూకంపం వల్ల భవనాల్లోని ప్రజలు కొంత సేపు అటుఇటు ఊగిపోయారు. భూకంపం ముగిసిన తర్వాత కూడా అనంతర ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి ప్రాణ,ఆస్తి నష్టాలు ఏమైనా సంభవించాయా అనేది తెలియాల్సి ఉంది. -
భూకంపాలు ఎందుకు వస్తాయి?
-
రాజమండ్రిలో భూకంపం.. ఆందోళనలో ప్రజలు
-
కంపించిన భూమి.. పరుగులు తీసిన జనం
-
జార్ఖండ్లో భూకంపం.. వణికిన రాంచీ, జంషెడ్పూర్
రాంచీ: జార్ఖండ్లో భూకంపం సంభవించింది. రాజధాని రాంచీ, జంషెడ్పూర్తో పాటు చుట్టుపక్కల పలు జిల్లాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.జార్ఖండ్లోని ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 9:20 గంటలకు భూకంపం వచ్చింది. వెంటనే జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి.. -
జమ్ము కశ్మీర్లో స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం
జమ్ము కశ్మీర్లో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. బారాముల్లా, పూంచ్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.9, 4.8గా నమోదైంది.జమ్ము కశ్మీర్లో సంభవించిన భూకంపాలకు ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే బారాముల్లాలో సంభవించిన భూకంపం నుండి ప్రాణాల్ని కాపాడుకునేందుకు భవనంపై నుండి దూకినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని అత్యవసర చికిత్స నిమిత్తం బారాముల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాధితుడికి వైద్య సేవలందిస్తున్నారు. VIDEO | Tremors of an earthquake with a magnitude of 4.8 felt in Jammu and Kashmir earlier today. Visuals from Baramulla.#earthquake pic.twitter.com/8zbcMySOC6— Press Trust of India (@PTI_News) August 20, 2024 -
తైవాన్లో భూకంపం
తైపే: తైవాన్ తూర్పుతీరంలో శుక్రవారం(ఆగస్టు16) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్డర్స్కేల్పై 6.1గా నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియలాజికల్సర్వే తెలిపింది. హులియెన్ నగరం సమీపంలో 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు తైవాన్ కేంద్ర వాతావారణ కేంద్రం వెల్లడించింది.భూకంపం విషయాన్ని తైవాన్ వాతావరణ కేంద్రం ముందుగానే పౌరులకు మొబైల్ఫోన్ సందేశాల రూపంలో చేరవేసింది. ఎక్కడివారక్కడ జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తైవాన్ నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. -
పెరూలో భారీ భూకంపం
పెరూ: దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో శుక్రవారం(జూన్28) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డవారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది అనే దానిని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని ప్రధాని గుస్తావో అడ్రియన్జెన్ తెలిపారు. -
అమెరికాలో భూకంపం!
న్యూయార్క్: యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. అమెరికాలో పలు రాష్ట్రాల్లో భూకంపం సంభించినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు 4.8 తీవ్రతతో భూకంపం సంభించింది. పొరుగున ఉన్న న్యూజెర్సీ సైతం భూకంపం భారీన పడిందని పలు వెలుగులోకి రాగా..భూకంపం ప్రభావం ఏ మేరకు చూపందనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. బ్రూక్లిన్లోని భవనాలు కంపించాయని ఏఎఫ్పీ మీడియా ప్రతినిధి నివేదించారు. భూకంపం వచ్చిన సమయంలో న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గాజాలో పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం నిర్వహిస్తుంది. ప్రకంపనలతో సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. Notable quake, preliminary info: M 4.8 - 7 km N of Whitehouse Station, New Jersey https://t.co/DuTYZ1kb4X — USGS Earthquakes (@USGS_Quakes) April 5, 2024 ఫిలడెల్ఫియా నుండి న్యూయార్క్ వరకు తూర్పు వైపు లాంగ్ ఐలాండ్ వరకు భూకంపం సంభవించినట్లు నెటిజన్లు ట్వీట్లు,పోస్ట్లు పెడుతున్నారు. #WATCH : Streamer captures moment earthquake hit New Jersey and felt in New York City#NewYorkCity #NewYork #earthquake #JUSTIN #LatestNews #USNews #USA #NewJersey pic.twitter.com/spo8RcHI17 — upuknews (@upuknews1) April 5, 2024 https://t.co/pf77R31SX6 — SkyQueen (@Triquetra331) April 5, 2024 -
వీడియోలు: భూకంపంతో తల్లడిల్లిన తైవాన్.. సునామీ హెచ్చరిక జారీ
తైపీ: తైవాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తైవాన్లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల వివిధ ప్రాంతాల్లో 7 మంది మృతి చెందగా.. సుమారు 730 మంది గాయపడినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఆస్తి నష్టం జగరినట్లు సమాచారం. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. గత 25 ఏళ్లలో ఇదే భారీ భూకంపమని అధికారులు తెలిపారు. 🚨🇹🇼 Building Collapse in Taiwan Due to Earthquakes | Visible Structural Damage Source: @northicewolf https://t.co/cpytWyIx4y pic.twitter.com/Qc0XS4ZXXx — Mario Nawfal (@MarioNawfal) April 3, 2024 మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిపడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. JUST IN: 7.5 magnitude earthquake strikes Taiwan, rocking the whole island and even causing several buildings to collapse. The earthquake triggered a tsunami warning of up to 10 feet from Japan. "Tsunami is coming. Please evacuate immediately. Do not stop. Do not go back,"… pic.twitter.com/E1783aoN3k — Collin Rugg (@CollinRugg) April 3, 2024 భూకంపం కారణంగా తైవాన్ రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయి. జపాన్లోని కొన్ని దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూప్రకంపనాలు సంభవిస్తున్న సమయంలో ఓ స్విమ్మింగ్ పూల్ నీళ్లు.. సముద్రంలో అలల్లా స్విమింగ్ పూల్లో అలజడికి గురయ్యాయి. స్మిమింగ్పూల్ ఉన్న భయభ్రాంతులకు గురయ్యాడు. దీనికిసంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. This is not just another funny video on social media. These visuals capture the scary moment a 7.4 earthquake hit Taiwan, even affecting a swimming pool. Prayers for Taiwan & Japan. 🙏 #Taiwan #Japan pic.twitter.com/iuGtutTeMo — Prayag (@theprayagtiwari) April 3, 2024 -
రాజమౌళి తనయుడి ట్వీట్.. నెటిజన్స్ ఆగ్రహం!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం ప్రస్తుతం జపాన్లో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడ స్వల్ప భూకంపం వచ్చిందని ఆయన కుమారుడు కార్తికేయ తన ఎక్స్ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. జపాన్లో ఒక భారీ బిల్డింగ్ 28వ ఫ్లోర్లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించిందని కార్తికేయ రాసుకొచ్చాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా భూకంపం ద్వారా కలిగే అనుభూతిని పొందానని రాసుకొచ్చారు. మండిపడ్డ నెటిజన్స్.. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఎస్ఎస్ కార్తికేయ తీరుపై మండిపడుతున్నారు. భూకంపం అంటే అదేమైనా జోక్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ రాస్తూ భూకంపం అనేది నీ బకెట్ లిస్ట్లో ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాన్ని ఫన్నీగా ట్వీట్ చేయడంపై కార్తికేయపై మండిపడుతున్నారు. అలాగే ఇండియా బోర్డర్కు వెళ్లి బాంబుల మోత కూడా ఆస్వాదించు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఏదేమైనా కార్తికేయ భూకంపంపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోను ఊపేస్తోంది. Felt a freaking earthquake in Japan just now!!! Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D — S S Karthikeya (@ssk1122) March 21, 2024 Experiencing an Earthquake is in your bucket list ? Weird — RAVI SANKAR GARIMELLA (@ravis_g239) March 21, 2024 Experience an earthquake box ticked. ✅ --> WTF 😒 😒 — KK (@krishjlk) March 21, 2024 Pls go to Indian border and EXPERIENCE A BOMB BLAST also ... Tick it bro — KK (@krishjlk) March 21, 2024 -
అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రత
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం రిక్కర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలాజీ(NCS) వెల్లడించింది. Earthquake of Magnitude:4.3, Occurred on 03-02-2024, 10:11:01 IST, Lat: 36.77 & Long: 97.17, Depth: 60 Km ,Location: 975km N of Pangin, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept @moesgoi pic.twitter.com/HZ6G2yFf0z — National Center for Seismology (@NCS_Earthquake) February 3, 2024 ఉదయం 10. 11 గంటలకు సుమారు 60 కిలోమీటర్ల లోతుగా భూకంపం కేంద్రీకృతం అయినట్లు పేర్కొంది. ఈ భూకంపంలో ఎటువంటి ఆస్తీ, ప్రాణ నష్టం జరగలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. -
Indonesia Talaud Islands Earthquake: ఇండోనేషియాలో భూకంపం
జకర్తా: ఇండోనేషియాలోని తలాడ్ దీవుల సమీపంలో భూకంపం సంభవించింది. రిక్ట్కార్ స్కేల్పై 6.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించింది. Earthquake of Magnitude:6.7, Occurred on 09-01-2024, 02:18:47 IST, Lat: 4.75 & Long: 126.38, Depth: 80 Km ,Location: Talaud Islands,Indonesia for more information Download the BhooKamp App https://t.co/Ughl0I9JG3 @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju @Ravi_MoES — National Center for Seismology (@NCS_Earthquake) January 8, 2024 అయితే ఈ భూకంపం ద్వారా ఎటువంటి ఆస్తీ, ప్రాణ నష్టం జరగనట్లు తెలుస్తోంది. ఇటీవల జపాన్లో చోటుచేసుకున్న భూకంపం తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. చదవండి: ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’ -
జపాన్ లో పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య
-
ప్రపంచంలో భారీ భూకంపం ఏది? తీవ్రత ఎంత?
జపాన్లో సంభవించిన భూకంపం అందరినీ వణికిస్తోంది. ఈ విపత్తు పరిణామాలు ఒక్కొక్కటిగా వెలికివస్తున్నాయి. నిజానికి జపాన్ను భూకంపాలకు కేంద్రంగా పరిగణిస్తుంటారు. ఇటీవల జపాన్లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పుటివరకూ ప్రపంచంలో సంభవించిన అత్యంత తీవ్రత కలిగిన భూకంపం చిలీలోని వాల్డివియాలో చోటుచేసుకుంది. 1960లో వాల్డివియాలో సంభవించిన భూకంపం దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది. ఇది చాలా తీవ్రమైనది. ఈ సమయంలో అక్కడ సునామీ కూడా సంభవించింది. ఈ భారీ భూకంపానికి సముద్ర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 9.5 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం చరిత్రలో భారీ భూకంపంగా నిలిచింది. చిలీ తీర ప్రాంతం వాల్డివియాలో 1960, మే 22న ఈ భూకంపం సంభవించింది. సాధారణంగా కొన్ని సెకన్ల పాటు సంభవించే భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వాల్డివియాలో చోటుచేసుకున్న భూకంపం నగరంలో 10 నిమిషాలపాటు భయోత్పాతాన్ని సృష్టించింది. ఆ తర్వాత చాలా శక్తివంతమైన సునామీ వచ్చింది. ఇది పలు దేశాలకు సైతం వ్యాపించింది. ఈ భూకంపం కారణంగా వాల్డివియా నగరం మొత్తం ధ్వంసమైంది. ఈ నగరంలో జనాభా అంతగా లేనందున, ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆరు మాత్రమేనని చెబుతుంటారు. ఇంతటి తీవ్రతతో భూకంపం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇదే ఇప్పటివరకు సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపంగా పరిగణిస్తుంటారు. ఇది కూడా చదవండి: జపాన్లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి -
ఆ విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా: జూనియర్ ఎన్టీఆర్
జపాన్లో భూకంపం రావడంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత వారం రోజులుగా అక్కడే ఉన్నానని ఆయన తెలిపారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జపాన్ ప్రజల ధైర్యానికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తన ట్విటర్లో రాస్తూ..'జపాన్ నుంచి ఈరోజే ఇంటికి తిరిగి వచ్చా. అక్కడ భూకంపం వచ్చింది అని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను వారం రోజులుగా అక్కడే ఉన్నా. ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటున్నా. కష్ట సమయంలో జపాన్ ప్రజల ధైర్యానికి కృతజ్ఞతలు. ఈ విపత్తు నుంచి జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రంలో నటిస్తున్నారు. Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected. Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵 — Jr NTR (@tarak9999) January 1, 2024 -
జపాన్ను తాకిన సునామీ
కొత్త సంవత్సరం తొలిరోజే.. తూర్పు ఆసియా ద్వీప దేశం జపాన్ భారీ భూ కంపం, సునామీతో వణికిపోయింది. సోమవారం కేవలం గంటన్నర వ్యవధిలోనే 21సార్లు భూమి కంపించింది అక్కడ. సునామీ ధాటికి అలలు ఎగిసి పడడంతో.. తీర ప్రాంత ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరిన్ని ప్రకంపలు వచ్చే అవకాశం.. సునామీ ముప్పు ఇంకా తొలగిపోకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు సునామీ తీర ప్రాంతాలన్నింటికి తాకవచ్చని అక్కడి ప్రభుత్వం టీవీ ఛానెల్స్ ద్వారా హెచ్చరించింది. ఇషికావాలో ఐదు మీటర్ల ఎత్తులో అలలు ఎగసి పడొచ్చని అంచనా వేసింది. అంతకు ముందు.. తీర ప్రాంత ప్రజలు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ అలలు ఎగసిపడే పరిస్థితులు కనిపిస్తే వెంటనే పరుగులు తీయాలని ప్రజలకు సూచించింది. మరోవైపు భూకంపం తర్వాత టయోమా, ఇషికావా, న్నిగాటాలో దాదాపు 35 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇతర నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. HAPPENING NOW: First visuals of HUGE wave hitting Suzu City in Japan#Earthquake #Japan #tsunami pic.twitter.com/1KH8D5yCTw — JAMES - ONTHERIGHT (@Jim_OnTheRight) January 1, 2024 భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. మొదట 5.7 తీవ్రతతో ఆ ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక దశలో తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. A #tsunami warning was issued after the #earthquake in #Japan. And warnings are being made that the western coastal areas should be evacuated and everyone should move to higher ground. pic.twitter.com/QLp5ImoSxe — Daenerys Targaryen (@ve95153819) January 1, 2024 ఉత్తర కొరియా, రష్యా కూడా.. ఈ భారీ భూకంపంతో జపాన్తో పాటు ఉత్తర కొరియా, రష్యాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలను రష్యా అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది. జపాన్కు సమీపంలో ఉన్న సఖాలిన్ ద్వీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రి వెల్లడించారు. ఇంకోవైపు రెండు మీటర్ల ఎత్తునన అలలు ఎగసి పడే అవకాశం ఉండడంతో ఉత్తర కొరియా తన రేడియో ఛానెల్ ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. Strange behaviour of birds at time of earthquake in #Japan. #Tsunami #石川県 #緊急地震速報 #地震 #震度7 #津波#SOS pic.twitter.com/qY3wLcDM7r — Yamaan Shahid (@realYamaan) January 1, 2024 I am deeply saddened by the news of the earthquake and the tsunami warning in Japan. I hope the people of Japan are safe and supported in this time of crisis.#Japan #Tsunami #earthquake #Ishikawa pic.twitter.com/SKfK1OtMhX — Darshan Ahirrao (@Darsh_D_Ahirrao) January 1, 2024 భారత్ ఎమర్జెన్సీ నెంబర్లు జపాన్లోని భారత రాయబార కార్యాలయం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. సహాయం కోసం ఆయా నెంబర్లను సంప్రదించాలని సూచించింది. Embassy has set up an emergency control room for anyone to contact in connection with the Earthquake and Tsunami on January I, 2024. The following Emergency numbers and email IDs may be contacted for any assistance. pic.twitter.com/oMkvbbJKEh — India in Japanインド大使館 (@IndianEmbTokyo) January 1, 2024 రేడియో ఆక్టివిటీ ఛాయల్లేవ్ సునామీ ఆందోళన నేపథ్యంలో.. అక్కడి న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రాల నుంచి అణుధార్మికత విడుదలై ఉంటుందా? అనే ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే.. ఇంకా భూకంప భయం వీడకపోవడంతో ఏదైనా జరగవచ్చే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Frightening visuals from Japan as it begins new year suffering a massive 7.6 magnitude earthquake. pic.twitter.com/e3gyiVkq8f — Science girl (@gunsnrosesgirl3) January 1, 2024 -
10 అనూహ్య ఘటనలు.. ‘రివైండ్- 2023’
2023 సంవత్సరం కొద్ది రోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాది ప్రపంచంలో ఎన్నో అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించి, చైనాను వెనక్కి నెట్టివేసింది. అదే సమయంలో హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2023లో ప్రపంచంలో చోటుచేసుకున్న పది అనూహ్య ఘటనలివే.. టర్కీ-సిరియా భూకంపం: ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవించాయి. 7.8 తీవ్రతతో సంభవించిన సంభవించిన మొదటి ప్రకంపన తరువాత అనేక బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భారీ భూకంపం కారణంగా టర్కీలో 59 వేల మంది, సిరియాలో ఎనిమిది వేల మంది మరణించారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడి: అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్పై అనూహ్య దాడికి దిగి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్లో 1,200 మంది మరణించారు. హమాస్ దాదాపు 240 మందిని బందీలుగా పట్టుకుంది. ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 18 వేల మందికి పైగా జనం మరణించారు. అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ : 2023లో చైనాను దాటి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. భారతదేశ జనాభా అంచనా 1.43 బిలియన్లు (ఒక బిలియన్ అంటే వంద కోట్లు). రాబోయే దశాబ్దాల్లో భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగే అవకాశాలున్నాయి. ఫ్రెడ్డీ తుపాను: చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఉష్ణమండల తుపాను ఫ్రెడ్డీ 2023లో సంభవించింది. ఇది మలావి, మొజాంబిక్, నైరుతి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో 14 వందలమందికిపైగా ప్రజలను బలిగొంది. జీ 20కి ఆతిథ్యం: సెప్టెంబర్ 9-10 తేదీలలో భారతదేశం జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా 43 మంది వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. కాప్-28 సమ్మిట్: వాతావరణ మార్పులపై కాప్-28 సమ్మిట్ దుబాయ్లో నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది. ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటి వరకూ నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచింది. ప్రపంచ నేతలంతా ఈ సదస్సులో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై చర్చించారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్.. జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో హత్యకు గురయ్యాడు. ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న పలు పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అమెరికాలో ఎగిరిన చైనా బెలూన్లు: జనవరి 28 నుండి ఫిబ్రవరి 4 వరకు, చైనా బెలూన్లు అమెరికా ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. ఈ బెలూన్ల సాయంతో చైనా గూఢచర్యం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను పంపి బెలూన్లను ధ్వంసం చేసింది. ఈ ఘటన చైనా-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్స్గా మారిన ట్విట్టర్: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ గత సంవత్సరం ట్విట్టర్ను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ఆయన ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ గా మార్చారు. ట్విట్టర్ లోగోను కూడా మార్చారు. ఆఫ్ఘనిస్తాన్ భూకంపం: అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో నాలుగు వేల మందికి పైగా ప్రజలు మరణించారు. 9 వేల మందికి పైగా జనం గాయపడ్డారు. 13 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇది కూడా చదవండి: వందల ఏళ్ల మూఢనమ్మకాన్ని చెరిపేసిన సీఎం -
దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆదివారం, నవంబర్ 26) ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని సోనిపట్లో ఉదయం 4 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై మూడుగా నమోదైంది. రెండో భూకంప కేంద్రం అస్సాంలోని దర్రాంగ్లో భూమికి 22 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇది ఉదయం 7:36 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై మూడుగా నమోదయ్యింది. అయితే ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. తాజాగా సంభవించిన భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో దాని ప్రభావం కనిపించలేదు. ప్రజలు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. Earthquake of Magnitude:3.0, Occurred on 26-11-2023, 04:00:43 IST, Lat: 29.15 & Long: 76.97, Depth: 5 Km ,Location: Sonipat, Haryana, India for more information Download the BhooKamp App https://t.co/71kQ5wTDF1@Dr_Mishra1966 @KirenRijiju @Indiametdept @ndmaindia @Ravi_MoES pic.twitter.com/AtUSHA5KJ5 — National Center for Seismology (@NCS_Earthquake) November 25, 2023 గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 3న నేపాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. దీని కారణంగా 70 మందికి పైగా జనం మరణించారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా భూకంపం సంభవించింది. భయాందోళనకు గురైన జనం ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ స్వల్ప భూకంపాలు భారీ భూకంపాలకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం -
నేపాల్లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు!
భారత్ పొరుగు దేశమైన నేపాల్లో ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదయ్యిందని, భూకంప కేంద్రం మక్వాన్పూర్ జిల్లాలోని చిట్లాంగ్లో ఉందని నేపాల్ సైన్స్ సెంటర్ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా నవంబర్ 3న, నేపాల్లోని జాజర్కోట్లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 153 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా ఇప్పటికీ గుడారాలలో నివసిస్తున్న దుస్థితి నెలకొంది. చలికి వీరంతా అల్లాడుతున్నారు. విపరీతమైన చలి కారణంగా ఐదుగురు మృతిచెందారు. కాగా నవంబర్ 17న మయన్మార్లో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం 5.7 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. షాన్ రాష్ట్రంలోని కెంగ్ టంగ్ నగరానికి నైరుతి దిశలో భూకంపం కేంద్రీకృతమయ్యింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు? -
జమ్మూకశ్మీర్లో కంపించిన భూమి.. 3.9 తీవ్రత నమోదు!
జమ్మూకశ్మీర్లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్లోని దోడాలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం భయానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి, రోడ్లపైకి చేరారు. ఎన్సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం (నవంబర్ 16) ఉదయం 9:34 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కాగా నవంబర్ 4 న నేపాల్లో సంభవించిన భూకంపంలో 70 మందికి పైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, వేలాది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు.. స్వల్ప స్థాయి భూకంపాలు భారీ భూకంపానికి సంకేతంగా నిలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంప ప్రకంపనలు తరచూ సంభవించడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇది కూడా చదవండి: 19 అగ్నిపర్వతాలు ఏకకాలంలో పేలాయా? Earthquake of Magnitude:3.9, Occurred on 16-11-2023, 09:34:19 IST, Lat: 33.05 & Long: 76.18, Depth: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/oRC4OXqC4F@Indiametdept @ndmaindia @KirenRijiju @Dr_Mishra1966 @Ravi_MoES @DDNational pic.twitter.com/uukXdJuS7T — National Center for Seismology (@NCS_Earthquake) November 16, 2023 -
పాకిస్తాన్లో భూకంపం.. 5.2 తీవ్రత నమోదు!
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భూకంప సంఘటనలు గణనీయంగా పెరిగాయి. ప్రతిరోజూ ఏదోఒకచోట భూమి కంపిస్తూనే ఉంది. ఒకే రోజులో అధిక భూకంపాలు వచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.2గా నమోదైంది. తెల్లవారుజామున 5.35 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. దీనిని గమనించిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఏడాది టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. గత సెప్టెంబర్ 8న మొరాకోలో సంభవించిన భూకంపం, అక్టోబర్ 7న ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపం, నవంబర్ 3న నేపాల్లో సంభవించిన భూకంపాలు కూడా విధ్వంసాన్ని సృష్టించాయి. తరచూ భూకంపాలు చోటుచేసుకోవడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: బిర్సా ముండా ఎవరు? ప్రధాని మోదీ ఆయన జన్మస్థలికి ఎందుకు వెళుతున్నారు? -
అసోంలో భూకంపం.. భయంతో జనం పరుగులు!
అసోంలోని ధుబ్రిలో ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అసోంలోని ధుబ్రిలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించినప్పుడు జనం గాఢ నిద్రలో ఉన్నారు. భూ ప్రకంపనలను గుర్తించిన వెంటనే జనం తమ ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. భయంతో ఇళ్ల వెలుపలే చాలా సేపు ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం తెల్లవారుజామున 3.01 గంటలకు 17 కి.మీ లోతులో సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.1గా నమోదైంది. గత సోమవారం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.0గా నమోదైంది. సెప్టెంబర్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి, చంబా జిల్లాల్లో రిక్టర్ స్కేల్పై 2.8, 2.1 తీవ్రతతో తేలికపాటి భూకంపాలు సంభవించాయి. కాగా తాజాగా సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? Earthquake of Magnitude:3.1, Occurred on 01-10-2023, 03:01:33 IST, Lat: 26.08 & Long: 90.05, Depth: 17 Km ,Location: Dhubri, Assam, India for more information Download the BhooKamp App https://t.co/8bErjjuCfL@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/1mxvy1CAQ5 — National Center for Seismology (@NCS_Earthquake) September 30, 2023 -
జమ్మూ కాశ్మీర్లో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేలుపై..
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఈరోజు తెల్లవారు జామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 37 గా నమోదైంది. మంగళవారం తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ. భూమి ఉపరితలానికి 5 కి.మీ లోతున భూకంపం సంభవించిందని వారు తెలిపారు. అక్కడక్కడా చిన్నగా భూమి అదిరినట్టుగా అనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ భూకంపం తీవ్రత కొంచెం ఎక్కువైనా భదేర్వా, కిష్త్వార్, ఉధంపూర్, ధోడా పరిసరాల్లో తీవ్ర నష్టం వాటిల్లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు 2-5 సెకన్ల వరకు భూమి కంపించినట్లు చెబుతున్నారు స్థానికులు. ఆ సమయానికి అందరూ గాఢనిద్రలో ఉంటారని అదృష్టవశాత్తు భూకంపం తీవ్రత పెద్దగా లేదని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎంపీగా లోక్సభలోకి రాహుల్ -
World's Most Dangerous Day: సెకెన్ల వ్యవధిలో ఊహకందని ఘోరం.. 8 లక్షలమంది..
మనిషి లక్షలాది సంవత్సరాలుగా ఊహికందని ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇటువంటి సమయాల్లో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతుండగా, లెక్కకు అందని సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారుతున్నారు. ఇక నిరాశ్రయులయ్యేవారి సంఖ్య చెప్పనలవి కాదు. ఇప్పుడు మనం ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత భారీ విపత్తు గురించి తెలుసుకుందాం. ప్రపంచానికే అత్యంత ప్రమాదకరమైన రోజు.. సైన్స్ అలర్ట్లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం 1556 జనవరి 23.. ఆరోజు మానవాళి పెను విపత్తును భీకర భూకంపం రూపంలో ఎదుర్కొంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో 8 లక్షలమంది జీవితాలు బుగ్గిపాలయ్యాయి. ఈ ఒక్క ఘటనతో చైనాలో అప్పటివరకూ సంతరించుకున్న నాగరిత సర్వనాశనం అయ్యింది. ఎంత శక్తివంతమైన భూకంపం అంటే.. సాధారణంగా ఎక్కడో ఒకచోట భూకంపం వస్తూనే ఉంటుంది. అయితే 1556 జనవరి 23న సంభవించినంతటి పెను భూకంపం ఇంతవరకూ ఎన్నడూ సంభవించలేదు. సాధారణంగా స్వల్పస్థాయి భూకంపాలు రిక్టర్ స్కేలుపై 2.3 లేదా 3.2గా నమోదవుతుంటాయి. అయితే 1556 జనవరి 23న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 8.0 నుంచి 8.3 మధ్యలో నమోదయ్యింది. ఇది పెను విపత్తుకు దారితీసింది. భూకంప కేంద్రం నగరం మధ్యలో ఉండటమే ఇంతటి భారీ విపత్తుకు కారణంగా నిలిచింది. మానవ నాగరికత భవిష్యత్కు సన్నాహాలు ఈ భారీ వినాశకర భూకంపం భవిష్యత్లో ఇటువంటి ఉత్పాతాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. ఈ ఘటన అనంతరం చైనాలో అత్యధికశాతం ఇళ్లను తేలికపాటి కలపతో నిర్మించసాగారు. అయితే ఇప్పటి ఆధునిక సాంకేతికతతో భూకంపాలను ముందుగానే పసిగట్టే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. భూకంపాల నుంచి ఎలా తప్పించుకోవాలనే విధానాలను కనుకొన్నారు. ఇదేవిధంగా తుపానులను, ఇతర ప్రకృతి వైపరీత్యాలను మనిషి ముందుగానే గుర్తించగలుగుతున్నాడు. ఇది కూడా చదవండి: పక్కింట్లో పార్టీ హోరు.. నిద్ర పట్టని ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే.. -
పసిఫిక్ ద్వీపదేశంలో భారీ భూకంపం
పోర్ట్ మోర్స్బీ: తరచూ భూకంపాల బారిన పడే ఫసిఫిక్ ద్వీపదేశం.. పపువా న్యూ గినియా Papua New Guinea మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. ఈ వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు స్థానిక విపత్తుల విభాగం. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. తీర ప్రాంత పట్టణమైన వెవాక్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో చంబ్రీ లేక్ కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. దాదాపు 62 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఈ ప్రాంతం.. ఇండోనేషియా సరిహద్దుకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తని నేల స్వభావం వల్ల.. భూకంపం సంభవించిన ప్రాంతంలో నష్టం భారీగానే కలిగే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే అభిప్రాయపడింది. అయితే.. సునామీ సంకేతాలు లేకపోవడం వల్లే హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. తరచూ భూకంపాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భూకంప కేంద్రానికి 250 కిలోమీటర్ల దూరంలోని హైలాండ్ ప్రావిన్స్లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. సుమారు 45 సెకండ్లపాటు భారీగా భూమి కంపించిందని స్థానికుడొకరు చెప్తున్నాడు. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటిగా ఉన్న పపువా న్యూ గినియా.. బయోడైవర్సిటీకి ఫేమస్. అలాగే అక్కడ కొండ ప్రాంతాలు అధికం. భూకంపాలు సంభవించిన సమయంలో కొండచరియలు విరిగి పడడం ద్వారా భారీగా నష్టం చేస్తుంటుంది. తద్వారా పేదరికంలో ఉన్న దేశం పరిస్థితి.. నానాటికీ మరింతగా దిగజారిపోతోంది. కిందటి ఏడాది సెప్లెంబర్లో.. 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 21 మంది బలి తీసుకుంది. ఇక 2018లో సంభవించిన భూకంపం ఏకంగా 200 మందిని పొట్టనబెట్టుకుంది. వీళ్లలో కొండచరియల కింద నలిగి మరణించిన వాళ్లే అధికం. -
Fact Check: ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో భారీ భూకంపం?
న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మార్చి 21న అఫ్గనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో 187 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.5 గా నమోదైంది. భూకంపం దాటికి ప్రజలు ఆందోళనకు గురై. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే తాజాగా ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో మరోసారి భారీ భూకంపం రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో దేశ రాజధానిలో రిక్టర్ స్కేల్పై 9.8 తీవ్రతతో భూకంపం సంభవించనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని జాతీయ మీడియా సంస్థ (timesnow) ఫ్యాక్ట్ చెక్ చేయగా వీటిని అసత్య ప్రచారాలుగా తేల్చింది. ఏప్రిల్లో ఢిల్లీలో భూకంపం చోటు చేసుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. అదంతా ఫేక్ అని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. మార్చి 21న ఢిల్లీతోపాటు పాకిస్తాన్, అఫ్గనిస్తాన్లో పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదైంది. భూకంపం ధాటికి కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి, కొండచరియలు విరిగిపడ్డాయి. పాక్లో భూకంపం ధాటికి ఇద్దరు మహిళలు సహా 9 మంది ప్రాణాలు కోల్పోగా 160 మందికిపైగా గాయపడ్డారు. అఫ్గనిస్తాన్ ఈశాన్య లాగ్మాన్ ప్రావిన్స్లో ఇద్దరు మరణించగా ఎనిమిదిమంది గాయపడ్డారు. చదవండి: చీరకట్టులో ఫుట్బాల్ ఇరగదీసిన మహిళలు.. వీడియో వైరల్.. -
వైరల్ వీడియో: భూకంపం వచ్చినా ఆపకుండా సర్జరీ చేసిన వైద్యులు
న్యూఢిల్లీ: మంగళవారం అర్థరాత్రి ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్లోనూ గట్టిగానే ఉంది. భూప్రకంపనల వల్ల ప్రజలంతా భయభ్రాంతులకు గరవుతున్న సమయంలో కొందరు వైద్యులు ఏ మాత్రం బెదరకుండా ఓ మహిళకు డెలివరీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్లోని ఎస్డీహెచ బిజ్బెహరా ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు సిజేరియన్ పద్ధతిలో డెలివరీ చేస్తున్నారు. ఆ సమయంలో భూకంపనలు వచ్చాయి. అయినా సరే ఏ మాత్రం కంగారు పడకుండా వైద్యులు సురక్షితంగా సర్జరీ చేసి బిడ్డను వెలికితీశారు. అంతటి క్లిష్ట సమయాల్లో కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా తమ బాధ్యతను పూర్తి చేశారు. ఒక్క కాశ్మీర్ మాత్రమే కాదు, ఉత్తర భారతదేశం చాలా వరకు ఈ ప్రకంపనల ప్రభావం ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ భూకంప కేంద్రం ప్రకారం.. పాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిజ్స్తాన్ వంటి ఇతర దేశాలు కూడా ఈ ప్రకంపనల వల్ల ప్రభావితమయ్యాయి. Emergency LSCS was going-on at SDH Bijbehara Anantnag during which strong tremors of Earthquake were felt. Kudos to staff of SDH Bijbehara who conducted the LSCS smoothly & Thank God,everything is Alright.@HealthMedicalE1 @iasbhupinder @DCAnantnag @basharatias_dr @DHSKashmir pic.twitter.com/Pdtt8IHRnh — CMO Anantnag Official (@cmo_anantnag) March 21, 2023 -
టర్కీలో మరోసారి భూకంపం
టర్కీ aka తుర్కియేను మరోసారి భూకంపం వణికించింది. శనివారం ఉదయం గోక్సన్ జిల్లాలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆ ప్రకంపనలతో భీతిల్లిన జనం వీధుల వెంట పరుగులు తీశారు. గోక్సన్ జిల్లాకు నైరుతి వైపున ఆరు కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రకంపనలు వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రకంపనల ధాటికి నష్టం ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి మొదటి వారంలో సంభవించిన భారీ భూకంపంతో ఇప్పట్లో కోలుకోలేని విధంగా టర్కీ నష్టపోయింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. మరోవైపు టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియా సైతం భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. ఇదిలా ఉండగా.. టర్కీ భూకంప బాధితుల సహాయార్థం కేరళ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 10 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: కరోనా పుట్టుకపై మరో షాకింగ్ కోణం! -
టర్కీ భూకంప బాధిత చిన్నారుల కోసం ఫుట్బాల్ ప్రేమికులు ఏం చేశారో చూడండి..!
ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ దేశాన్ని భారీ భూకంపం (రిక్టర్ స్కేలుపై 7.8 మ్యాగ్నిట్యూడ్) అతలాకుతలం చేసిన విషయం విధితమే. ఈ మహా విలయంలో దాదాపు 50000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఘనా స్టార్ ఫుట్బాలర్, న్యూకాస్టిల్ వింగర్ క్రిస్టియన్ అట్సూ కూడా ఉన్నాడు. ఈ భారీ భూకంపం టర్కీతో పాటు సిరియా దేశంపై కూడా విరుచుకుపడింది. భూకంపం తెల్లవారు జామున 4:17 గంటల సమయంలో రావడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది. ఇదిలా ఉంటే, టర్కీ సూపర్ లీగ్లో భాగంగా ఫిబ్రవరి 26న అంటాల్యాస్పోర్-బెసిక్టాస్ క్లబ్ల మధ్య జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా బెసిక్టాస్ అభిమానులు తమ మానవతా దృక్పథాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. ఈ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోని బెసిక్టాస్ అభిమానులు టర్కీ, సిరియా భూకంప బాధిత చిన్నారుల కోసం ఖరీదైన బొమ్మలు, గిఫ్ట్లు, కండువాలను మైదానంలోకి విసిరారు. ఊహించని విధంగా ఇలా జరగడంతో లీగ్ నిర్వహకులు మ్యాచ్ను కాసేపు (4 నిమిషాల 17 సెకెన్ల పాటు) నిలిపివేసి దాతలను ఎంకరేజ్ చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. చిన్న పిల్లల కోసం బెసిక్టాస్ అభిమానులు చేసిన వినూత్న సాయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి దాతృత్వ హృదయాలకు జనం సలాం కొడుతున్నారు. -
Turkey Syria Earthquake: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్
టర్కీలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. టర్కీలో సరిగ్గా అదే సమయంలో ఓ ఆస్పత్రిలోని నర్సులు మాత్రం భూకంప ప్రకంపనాలకు భయంతో పారిపోలేదు. అక్కడే ఉండి ఇంక్యుబేటర్లో ఉన్న నవజాత శిశువులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఇంక్యుబేటర్లో ఉన్న శిశువల ఉన్న గది వద్దకు త్వరిత గతిన చేరుకుని, అక్కడే ఉండి వాటిని పడిపోకుండా పట్టుకుని అలానే నుంచొని ఉన్నారు. వారు చేసిన ప్రయత్నాల కారణంగా ఆ ఇంక్యుబేటర్లు కింద పడిపోకుండా ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోని టర్కీలోని ఫాత్మా సాహిన్ అనే రాజకీయవేత్త ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా టర్కీ, సీరియాలలో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 30 వేల మందికి చేరుకున్న సంగతి తెలిసిందే. Sağlıkçılarımız şahane insanlar👏#GaziantepBüyükşehir İnayet Topçuoğlu Hastanemiz yenidoğan yoğun bakım ünitesinde, 7.7'lik #deprem esnasında minik bebekleri korumak için Hemşire Devlet Nizam ve Gazel Çalışkan tarafından gösterilen gayreti anlatacak kelime var mı? 🌹🌼💐👏👏👏 pic.twitter.com/iAtItDlOwb — Fatma Şahin (@FatmaSahin) February 11, 2023 (చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం) -
Turkey–Syria Earthquake: శిథిలాల కింద బాధితుల వేదన
ఆంటాక్యా/జందారిస్: ఆశలు అడుగంటుతున్నాయి. శిథిలాల కింద సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న వారిని కాపాడగలమన్న నమ్మకం తగ్గిపోతోంది. ఉష్ణోగ్రతలు మైనస్ అయిదు డిగ్రీలకు చేరుకోవడంతో సహాయ చర్యలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు తుర్కియే, సిరియాల్లో 19 వేల మందికి పైగా మరణించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా శిథిలాల కింద లక్షలాది మంది ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సహాయ చర్యల్లో లోపాలున్నాయని తుర్కియే అధ్యక్షుడు తయిపీ ఎర్డోగన్ స్వయంగా అంగీకరించారు. ఈ స్థాయిలో ప్రళయం సంభవిస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. భూకంపం వచ్చిన ప్రాంతం దేశంలో ఒక మారుమూల ఉండడంతో సహాయ బృందాలను పంపించడంలో ఆలస్యమైందని అన్నారు. మరోవైపు భూకంపానికి ఇళ్లు కోల్పోయిన వారు వీధుల్లోనే కాలం గడుపుతున్నారు. చలి తట్టుకోలేక వారంతా తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. చాలా మంది రాత్రి వేళల్లో రోడ్లపై పార్క్ చేసి ఉంచిన కార్లలో ఉంటున్నారు. ఆ 72 గంటలు ముగిశాయ్..! భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదటి మూడు రోజులే అత్యంత కీలకం. ఈ 72 గంటల్లో ఎంతమందిని కాపాడారన్నదే ముఖ్యం. ఆ తర్వాత శిథిలాలు తొలగించినా ప్రాణాలతో బయటపడేవారి సంఖ్య చాలా తక్కువ. గురువారం ఉదయానికి 72 గంటలు గడిచిపోవడంతో ఇంకెన్ని మరణాలు సంభవిస్తాయోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. భూకంపాల సమయంలో మొదటి మూడు రోజుల్లో సర్వ సాధారణంగా 90శాతం మందిని బాధితుల్ని రక్షిస్తారు. మూడు రోజులు దాటితే శిథిలాల కింద ఉన్న వారికి మంచినీళ్లు, ఆహారం అందించాలి. అవి అందక మిగిలిన వారు ప్రాణాలతో బయటపడడం కష్టంగా మారుతుంది. ఆరేళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం తుర్కియేలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) శిథిలాల కింద నలిగిపోతున్న ఆరేళ్ల బాలికను కాపాడాయి. మన దేశం నుంచి వెళ్లిన మూడు బృందాలు అలుపెరుగకుండా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నాయని కేంద్ర హోంశాఖ ట్వీట్ చేసింది. ‘‘భారత్కు చెందిన సహాయ బృందం నర్డగి ప్రాంతంలో ఆరేళ్ల బాలికను కాపాడింది. ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న సహాయానికి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ట్వీట్ చేశారు. ఆ బాలికను కాపాడిన వీడియోను కూడా షేర్ చేశారు. హైపోథెర్మియా ముప్పు తుర్కియేలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న అడియమాన్ ప్రావిన్స్లో బాధితులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భూకంపం వచ్చి నాలుగు రోజులైనా సహాయ సిబ్బంది ఎవరూ రాలేదని రెసాట్ గొజ్లు అనే బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. శిథిలాల కింద ఉన్న వారిలో చాలా మంది హైపోథెర్మియా పరిస్థితులతో మరణించారని తెలిపారు. శరీరంలో ఉష్ణం పుట్టే వేగం కంటే, ఉష్ణం కోల్పోయే వేగం ఎక్కువగా ఉంటే దానిని హైపోథెర్మియా అని అంటారు. గట్టకట్టించే చలిలో బాధితుల శరీర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోయి మరణిస్తారు. దేశమే జరిగింది...! తుర్కియే (టర్కీ)లో సంభవించిన భూకంపం ధాటికి ఆ దేశం భౌగోళికంగా అయిదు నుంచి ఆరు మీటర్లు పక్కకి జరిగి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ (ఫలకాలు) తీవ్రమైన రాపిడి కారణంగానే ఇది సంభవించినట్టు తెలిపారు. సిరియాతో పోల్చి చూస్తే తుర్కియేలో రెండు ఫలకాల మధ్య ఏర్పడిన ఒత్తిడి వల్ల రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని, ఫలితంగా దేశమే కాస్త జరిగిందని ఇటలీకి చెందిన సెసిమాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డొగ్లోని చెప్పారు. భూ పొరల్లో ఉన్న అనతోలియా ప్లేట్ వాయవ్య దిశగా ఉన్న అరేబికా ప్లేట్ వైపు జరగడంతో ఇలా దేశమే భౌగోళికంగా కదిలే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక టెక్టోనిక్ ప్లేట్ పశ్చిమ వైపు, మరో ప్లేట్ తూర్పు వైపు కదలడంతో భారీ భూకంపం సంభవించిందని ఆయన వివరించారు. వాలీబాల్ ఆట కోసం అడియామాన్కు వచ్చిన కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు 39 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. ఫమగుస్తా కాలేజీకి చెందిన ఈ బృందం ఏడంతస్తులున్న ఒక హోటల్లో బస చేశారు. కాపాడడమూ కష్టమే..! భూకంపం శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించి వారిని కాపాడడం అంత తేలిౖMðన విషయం కాదు. సహాయ సిబ్బందితో పాటు బాధితులు కూడా సహకరించాలి. అందుకు ఈ ఫొటో నిదర్శనం. తుర్కియేలోని తీవ్ర విధ్వంసం జరిగిన హతేలో ఇంటి పైకప్పు మొత్తం మీద పడిపోవడంతో కాళ్లు కదల్చలేని స్థితిలో అబ్దుల్అలీమ్ అనే వ్యక్తి ఉన్నాడు. అంత పెద్ద శ్లాబుని తొలగించి అతనిని బయటకు తీసుకురావడం సహాయ సిబ్బందికి కష్టమైంది. అబ్దుల్ను కాపాడినా అతని భార్య, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం విషాదం. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఒక ప్రాణాన్ని కాపాడడానికి 10 లక్షల డాలర్లు ఖర్చు అవుతుందని తుర్కియే ప్రభుత్వం అంచనా వేస్తోంది. సిరియాలో సహాయానికి అంతర్యుద్ధమే అడ్డు భూకంపం సంభవించిన ప్రాంతాలు ఎవరి అధీనంలో? అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో సంభవించిన భూకంపంలో సహాయ కార్యక్రమాలు సరిగా కనిపించడం లేదు. దేశంలోకి వెళ్లడానికి కేవలం రెబెల్స్ అధీనంలో ఒకే ఒక మార్గం తీసి ఉంది. సాయం అందించడం కోసం వచ్చిన అంతర్జాతీయ సంస్థలు సిరియాలో ఒక్కో ప్రాంతం ఒక్కొక్కరి అధీనంలో ఉండడంతో ముందుకు వెళ్లడానికి సవాలక్ష అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. కుర్దులు, సిరియన్ తిరుగుబాటుదారులు, జిహాదీ శక్తులు, తుర్కియే మిలటరీ మద్దతున్న రెబెల్స్, సిరియా ప్రభుత్వం ఇలా దేశం మొత్తం పలువురి అధీనంలో ఉండడం సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా మారింది. -
కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. తన ప్రాణాలు అడ్డేసి కుమారుడ్ని కాపాడిన తండ్రి
ఇస్తాన్బుల్: టర్కీలో సోమవారం సంభవించిన భూకంపం వేల మందికి బలికొంది. తవ్వేకొద్ది మృతదేహాలు లభిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిలో చాలా మంది చనిపోగా.. మరికొంత మంది ప్రాణాలతో బయపడ్డారు. అయితే ఓ తండ్రీకొడుకుల వీడియో మాత్రం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఓ వ్యక్తి తన ప్రాణాలను అడ్డేసి కుమారుడి ప్రాణాలు నిలిపాడు. శిథిలాల కింద చిక్కుకుని అతను కన్నుమూసినా కుమారుడు మాత్రం క్షేమంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ये वीडियो ह्रदयविदारक है .. 💔💔 पिता ने साँस छोड़ दी पर अपने बच्चे को बचाने के लिए उसका साथ और हाथ नहीं छोड़ा .. बच्चा बच गया ❤️#TurkeySyriaEarthquake pic.twitter.com/l9GW72J9fJ — Vinod Kapri (@vinodkapri) February 8, 2023 సహాయక బృందాలు శిథిలాలు తొలగిస్తున్న సమయంలో మొదట మట్టిలోక కూరుకుపోయి ఉన్న తండ్రి విగతజీవిగా కన్పించాడు. అతను కౌగిలించుకుని ఉన్న కుమారుడు కూడా మరణించి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు చిన్నారి ప్రాణాలతోనే ఉన్నాడు. దీంతో సహాయక సిబ్బంది వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చదవండి: షాకింగ్.. భూకంపం ధాటికి 6 మీటర్లు పక్కకు జరిగిన టర్కీ! -
Turkey Earthquake: మృతులకు ప్రధాని మోదీ సంతాపం
టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగా మృతి చెందారు. ఈ టర్కీ ఘటనపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో.. "టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు చింతిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రడాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. టర్కీ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది. అలాగే టర్కీ ఈ విషాధాన్ని తట్టుకునేలా అన్ని విధాల సహాయాన్ని అందించేందుకు భారత్ సదా సిద్ధంగా ఉంది అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, టర్కీలోని కొన్నిప్రావిన్స్లలో మూడు సార్టు భూమి కంపించినట్లు సమాచారం. అలాగే మరి కొన్నిప్రాంతాల్లో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ప్రధాని మోదీ కోసం వక్కలపేటా, హారం ) -
ఢిల్లీలో భారీగా భూప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో భూకంపం చోటు చేసుకుంది. మంగళవారం పలు ప్రాంతాల్లో భారీగా భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో బయటకు పరుగులు తీశారు జనాలు. ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్ ప్రాంతంలో భూకంప కేంద్ర నమోదు అయ్యింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 గం. ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతగా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. జనం బయటకు పరుగులు తీయగా, మరికొందరు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. #earthquake captured in camera.#delhi pic.twitter.com/wW3ikxFZCc — Knowledge ABC (@AbcKnowledge) January 24, 2023 Strong #earthquake tremors felt in #Delhi pic.twitter.com/4vjVVbY0xj — JK CHANNEL (@jkchanneltv) January 24, 2023 It's an earthquake again. Tremors felt are pretty scary.#Delhi#earthquake#delhincr #delhiearthquake #NoidaEarthquKe #Noida pic.twitter.com/FN3md3t7qQ — Aakash Biswas (@aami_aakash) January 24, 2023 -
చైనాలో తీవ్ర భూకంపం, 46 మంది మృతి.. ఫోటోలు, వీడియోలు వైరల్
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లుడింగ్ కౌంటీలో సోమవారం సంభవించిన భూకంపంతో 46 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. నీరు, విద్యుత్ సరఫరా, రవాణ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కరువు పరిస్థితులు, కోవిడ్ ఆంక్షలతో ఈ ప్రావిన్స్ జనం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. చైనాలో భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. #earthquake in #Sichuan Province captured by car monitor lens. You can see the date and time of the quake. pic.twitter.com/y5V4x7nUk8 — Jennifer Zeng 曾錚 (@jenniferatntd) September 5, 2022 🇨🇳#CHINA 🚨#URGENTE | Más imágenes de como se percibió el #sismo de magnitud 6.6 con epicentro a 43 km al SE de Kangding, en la provincia de #Sichuan. #RochexRB27#earthquake #Terremoto #Temblor pic.twitter.com/odk9fFlR1v — Rochex Rababel Robinson Bonilla (@RochexRB27) September 5, 2022 Imágenes del fuerte #sismo M6.8 en Ganzi, #Sichuan #China 🇨🇳 El movimiento telúrico ocurrió el 5 de septiembre a las 04:52 UTC (M6.6 según el USGS) Video vía @TripInChina pic.twitter.com/g7upfqwX19 — Geól. Sergio Almazán (@chematierra) September 5, 2022 6.6 magnitude earthquake hits Western #Sichuan,China#Sismo #China. #Sichuan #China #earthquake #ChinaEarthquake pic.twitter.com/98xS7zq8mA — Prateek Pratap Singh (@PrateekPratap5) September 5, 2022 Forty-six people have been #killed in a 6.8-magnitude #earthquake that jolted Luding County in #southwest #China's #Sichuan Province on Monday#Chinaearthquake pic.twitter.com/R6hWEWgzKz — Himanshu Purohit (@Himansh256370) September 6, 2022 చదవండి: UK PM Election Results 2022: బ్రిటన్ పీఠం ట్రస్దే -
జపాన్లో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.3గా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఉత్తర జపాన్లోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైందని తెలుస్తోంది. భూకంపం నేపథ్యంలో జపాన్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈశాన్య తీరంలో అలలు మీటర్ ఎత్తు వరకు ఎగసిపడవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు భూకంపం ధాటికి సుమారు 20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ పేర్కొంది. కాగా, 2011లో కూడా ఉత్తర జపాన్లో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు ఉద్భవించిన సునామీ అణు విపత్తుకు కారణమైంది. చదవండి: కిల్లింగ్ స్టోన్: ఆ రాయిని తాకిన అందరూ చనిపోయారు.. ఈ మధ్యే.. -
ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. విషయం తెలియక..!
కరీబియన్ దీవులు వేదికగా జరుగుతున్న పురుషుల అండర్-19 ప్రపంచకప్ 2022లో భూకంపం సంభవించింది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ మైదానంలో ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా దాదాపు 20 సెకెన్ల పాటు భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.2గా నమోదైంది. Earthquake at Queen's Park Oval during U19 World Cup match between @cricketireland and @ZimCricketv! Ground shook for approximately 20 seconds during sixth over of play. @CricketBadge and @NikUttam just roll with it like a duck to water! pic.twitter.com/kiWCzhewro — Peter Della Penna (@PeterDellaPenna) January 29, 2022 అయితే భూమి కంపించిన సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లకు విషయం తెలియకపోవడం విశేషం. జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరో ఓవర్ సందర్భంగా భూ ప్రకంపనలు సంభవించినట్లు కొద్దిసేపటి తర్వాత కామెంటేటర్లు చెప్పడంతో విషయం తెలిసింది. భూకంపం సమయానికి కెమెరాలు షేక్ అవుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాగా, ఈ మ్యాచ్లో జింబాబ్వేపై ఐర్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ముజామిల్ షెర్జాద్(5/20) ధాటికి 48.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ కాగా, ఛేదనలో ఐర్లాండ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 32 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. జాక్ డిక్సన్ 78, కెప్టెన్ టిమ్ టెక్టర్ 76 పరుగులతో అజేయంగా నిలిచి ఐర్లాండ్ను విజయతీరాలకు చేర్చారు. చదవండి: "భారత్ను నెం1గా నిలపాలని కష్టపడ్డాడు.. మరో రెండేళ్లు కెప్టెన్గా ఉండాల్సింది" -
కుప్పంలో భూప్రకంపనలు.. భారీ శబ్దాలు..
రామకుప్పం: కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలో చిన్నగెరెగపల్లి, పెద్దగెరెగపల్లి, గడ్డూరు, యానాదికాలనీ, దేసినాయనపల్లి గ్రామాల్లో గురువారం రాత్రి భూమి కంపించింది. తహసీల్దార్ దేవరాజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే శుక్రవారం రాత్రి కూడా భూమి లోపల నుంచి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సొంత గ్రామాలను, ఇళ్లను విడిచి మండల కేంద్రమైన రామకుప్పానికి పరుగులు తీశారు. మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు విజలాపురం బాబురెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నితిన్రెడ్డి, ఎంపీపీ శాంతకుమారి చంద్రారెడ్డి ప్రజలకు రామకుప్పం ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలో వసతులు ఏర్పాటు చేశారు. -
బంగ్లాతో పాక్ టెస్టు... మ్యాచ్ ఆరంభానికి ముందు భూకంపం..
Earthquake hits Chattogram ahead of opening Test: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్26) ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఛటోగ్రామ్ నగరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే భూకంప తీవ్రత మ్యాచ్ నిర్వహణపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అనుకున్న సమయానికే మ్యాచ్ ప్రారంభమైంది. కాగా టీ20 సిరీస్లో పాకిస్తాన్ ఆతిథ్య బంగ్లాదేశ్ను వైట్ వాష్(0-3) చేసింది. దీంతో కనీసం టెస్ట్ సిరీస్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. మరో వైపు బంగ్లా టీ20 కెప్టెన్ మహ్మదుల్లా టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న బంగ్లాదేశ్ 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. చదవండి: IPL 2022 Auction: అప్పుడు 8 కోట్లు... ఇప్పుడు 14 కోట్లకు ఓకే అన్నాడట.. కెప్టెన్గానే! -
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూకంపం..
-
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు..
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల జిల్లాలో కాలేజ్ రోడ్, సున్నంబట్టివాడ, శ్రీశ్రీనగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్, షిర్కేలో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ, జ్యోతినగర్, మల్కాపూర్, నర్రాశాలపల్లె ప్రాంతాలలో 2 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: (ఇది విన్నారా?.. ఇక్కడ కిరాయికి ఇల్లుందా!) -
మూడు అంతస్తుల ఎత్తు లావా బ్లాకులు
లాపాల్మా: స్పానిష్ ద్వీపంలో లాపాల్మాలోని కుంబ్రే వైజా అగ్ని పర్వతం విస్పోటనం జరిగిన మూడు వారాల తర్వాత మూడూ అంతస్తుల భవనం అంత ఎత్తు వరకు లావా బ్లాక్లు ఏర్పడ్డాయని స్పానిష్ నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎన్జీ) తెలిపింది. పైగా ఈ అగ్నిపర్వతం గుండా ఇప్పటికీ ఎర్రటి లావా నదిలా ప్రవహిస్తోందని వెల్లడించింది. సెప్టెంబర్ 19న లాపాల్మాలో అగ్నిపర్వతం విస్పోటనంతో దాదాపు వెయ్యి భవనాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: "సైక్లోథాన్తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు") ఈ మేరకు రిక్టారు స్కేలు పై 3.8 తీవ్రతతో మాజో, ఫ్యూన్కాలియంట్, ఎల్పాసో వంటి గ్రామాల్లో భూమి కంపించిందని పేర్కొంది. అంతేకాదు అగ్నిపర్వత ఉద్గార బిలం పై కప్పు కూలిపోయి ఎర్రటి లావా ఖాళీ చేయించిన లామా క్యామినో డి లా గటా ఇండస్ట్రియల్ ఎస్టేట్ భవనాల వరకు చేరుకుందని ఐఎన్జీ అధికారులు తెలిపారు. ఈక్రమంలో లాపాల్మాలో దాదాపు 83 వేల మంది ఉన్న ఆ ప్రాంతంలో సుమారు ఆరు వేల మంది నివాసితులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు. విస్పోటన సమీపంలో మెరుపులు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. (చదవండి: దాదాపు నెలరోజలు సముద్రంలోనే!) -
Japan: జపాన్లో భారీ భూకంపం
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. టోక్యోలోని చిబా ఫ్రిఫెక్చర్లో 6.1 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. టోక్యోకు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్లో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని వాతావరణ సంస్థ తెలిపింది. ఈ భూకంప ప్రభావంతో అనేక భవనాలు కాసేపు కదిలాయి. కానీ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కొన్ని కార్యాలయాల పైకప్పు భవనాలు కదిలాయి. సునామీ లాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. షింకాన్సెన్ సూపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు టోక్యో బయటే నిలిపివేయబడ్డాయి. భూకంప ఘటనపై నూతనంగా ఎన్నికైన ప్రధాని ఫుమియో కిషిడా స్పందించారు. ‘దయచేసి ప్రజలంతా మీ ప్రాణాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోండి’అంటూ ట్విట్ చేశారు. చదవండి:తాలిబన్లను చర్చలకు ఆహ్వానించిన రష్యా -
మెక్సికోలో భారీ భూకంపం..
-
మెక్సికోలో భారీ భూకంపం, వణికిపోయిన జనం
మెక్సికోలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో కేందద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా రాజధాని నగరంలో భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేశారు. కంపన తీవ్రతకు వందలాది కిలోమీటర్ల దూరంలో పలు భవనాలు కొన్ని సెకన్ల పాటు కదిలిపోయాయి. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ తెలిపారు. ఒక వ్యక్తి మరణించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. కొయుకా డి బెనిటెజ్ నగరంలో యుటిలిటీ పోల్ పడి ఒక వ్యక్తి మరణించాడని, గెరెరో రాష్ట్ర గవర్నర్ హెక్టర్ అస్తుడిల్లో మిలెనియో టీవీకి చెప్పారు. అకాపుల్క్ మేయర్ అదెలా రోమన్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ, చాలా ప్రాంతాలలో గ్యాస్ లీకేజీలు వార్తలు వచ్చినట్టు తెలిపారు. భూకంపం మెక్సికో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. స్నానం చేస్తుండగా, చాలా బలమైన కంపనలు రావడంతో చాలా భయపడిపోయా.. గట్టిగా అరిచాను.. చివరికి బాత్ టవల్తో మాత్రమే బయటపడ్డానంటూ ఒక పర్యాటకుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. "నేను మా అమ్మతో వచ్చాను. హోటల్ 11 వ అంతస్తులో మేముండగా ఒక్కసారిగా కంపించింది. అమ్మ భయపడిపోయింది అంటూ ఏడుస్తున్న తన 86 ఏళ్ల తల్లిని అక్కున చేర్చుకున్నారు. కాగా ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి. 1985, సెప్టెంబర్ 19 న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది భవనాలను ధ్వంసమయ్యాయి. మళ్లీ 2017, సెప్టెంబర్లో వచ్చిన 7.1 భూకంపం కారణంగా 370 మంది మరణించారు. Power flashes from the earthquake in #Mexico. 🎥 @franz_gomez pic.twitter.com/ESXPpIgmSE — Michael Armstrong (@KOCOMichael) September 8, 2021 This is how #earthquakes look in the sky from an 11th floor ⚡ What you hear is the building crashing against the one next to it 🤯#earthquakeinthesky #Mexico #surreal pic.twitter.com/XNJESUdOew — elian huesca 🌋⚡ (@elianhuesca) September 8, 2021 A powerful earthquake struck southwestern Mexico near the beach resort of #Acapulco on Tuesday night, causing rock falls and damaging buildings, though there were no immediate reports of casualties. M7.0 #earthquake (#Sismo) strikes 18 km NE of Acapulco de Juárez (#Mexico) pic.twitter.com/f8LisWFmfx — DailyNews/BreakingNews (@DailyNe25683877) September 8, 2021 -
జపాన్లో భూకంపం: రిక్టర్ స్కేల్పై 5.5 తీవ్రత
టోక్యో: జపాన్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జీయోలాజికల్ సర్వే శనివారం వెల్లడించింది. జపాన్లోని తకాహగికి 125 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు. భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. చదవండి: Hong Kong: జిమ్మీలాయ్కి 14 నెలల జైలు -
ఇండోనేషియాలో భూకంపం 8 మంది మృతి
మలాంగ్: ఇండోనేషియాలోని జావా దీవిలో భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 7 గంటలకు (స్థానిక కాలమానం), 6.0 పరిణామంతో సంభవించిన ఈ భూకంపం కారణంగా 8 మంది మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు చెప్పారు. మలాంగ్ జిల్లాలకు 45 కిలోమీటర్ల దూరంలో 82 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే దీని కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని ఇండోనేషియా ఎర్త్క్వేక్ అండ్ సునామీ సెంటర్ రహ్మద్ త్రియోనో స్పష్టం చేశారు. భూకంపం కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలకు దగ్గరగా ఉండవద్దని, అవి విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూకంపం సమయంలో ప్రజలంతా భయపడుతూ భవనాల నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాలు అక్కడి టీవీల్లో కనిపించాయి. లుమజాంగ్ జిల్లాలో బైక్పై వెళుతున్న మహిళపై కొండ చరియలు విరిగిపడటంతో ఆమె మరణించింది. మరికొన్ని చోట్ల భవనాల కింద మరణించిన వారి శరీరాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. చదవండి: మరోసారి మయన్మార్ సైన్యం కాల్పులు, 82 మంది మృతి! -
జపాన్లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ
-
జపాన్లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈశాన్య జపాన్లోని మియాగి ప్రిఫెక్చర్ తీరంలో 7.2 తీవ్రతతో శనివారం భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. ఈ భూకంపం తీర ప్రాంతంలో 37 మైళ్ల లోతులో చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఈ భూకంపం తీరం ప్రాంతాల్లో సుమారు ఒక మీటరు దూరంలో తీవ్రమైన సునామిగా మారనున్నట్లు వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక, 2011లో సంభవించిన భూకంపం జపాన్ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. -
భారీ భూకంపం
-
లైవ్లో ప్రధాని, కంపించిన భూమి
-
లైవ్లో ప్రధాని, కంపించిన భూమి
రేక్జావిక్: నైరుతి ఐస్లాండ్ అంతటా మంగళవారం 5.7 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. అయితే ఈ సమయంలో కోవిడ్ -19 మహమ్మారిని తరిమికొట్టడానికి దేశంలో చేపడుతన్న చర్యలపై ప్రధానమంత్రి కాట్రిన్ జాకోబ్స్డోట్టిర్ వాషింగ్టన్ పోస్ట్ లైవ్ స్ట్రీమ్కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ సమయంలో అక్కడ పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో జాకోబ్స్ ఆ శబ్ధం విని జో ‘ఓహ్ మై గాడ్, భూకంపం’ అని పెద్దగా అని తరువాత మళ్లీ యధాస్థితికి వచ్చారు. కాలమిస్ట్ డేవిడ్ ఇగ్నేషియస్ అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. చూడండి: గూగుల్ గుత్తాధిపత్యంపై అమెరికాలో కేసు -
బోరబండ: ఇళ్ల నుంచి జనం పరుగులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండలో మళ్లీ భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భారీ శబ్ధాలు వస్తుండంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భారీ శబ్ధాలతో 4 సెకన్ల పాటు భూమి కంపించింది. రెండు రోజుల క్రితం కంటే భారీ శబ్ధాలు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. కాగా, భూప్రకంపనలపై ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ శ్రీనగేష్ స్పందించారు. భూమి పొరల్లో నీరు చేరుతున్న సమయంలో శబ్ధాలు వస్తాయని అంటున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తల్ని నమ్మొద్దని అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరులో 1600 సార్లు భూమి కంపించిందని తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 12సార్లు భూకంపం వచ్చినట్టు రికార్డ్ నమోదైందని శ్రీనగేష్ వెల్లడించారు. రహమత్నగర్, బోరబండ ప్రాంతాల్లో వచ్చిన భూ ప్రకంపనలు సహజమైనవేని ఆయన స్పష్టం చేశారు. ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశమే లేదని అన్నారు. -
బోరబండలో మళ్లీ స్వల్ప భూకంపం
-
బోరబండలో స్వల్ప భూకంపం
సాక్షి, హైదరాబాద్ : శుక్రవారం.. దాదాపు రాత్రి పది గంటలు దాటింది.. బస్తీల్లోని ప్రజలు అప్పుడప్పుడే భోజనం చేసి నిద్రకు ఉపక్రమిం చారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందారు..ఒక్కసారిగా బాంబులు పేలాయా, లేక ఇళ్లు కూలాయో తెలియక అయోమయంలో ఉన్నారు. భూకంపం వచ్చిందని ఎవరో కేకలు వేశారు. ఒక్కసారిగా పిల్లా, పెద్దా, ముసలి, ముతకా అందరూ ఇళ్ళ నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. బోరబండ డివిజన్ పరిధి లోని ఎన్ఆర్ఆర్పురం సైట్–3లో శుక్రవారం రాత్రి జరిగిన సంఘటన ఇది. సైట్–3 వీకర్సెక్షన్లోని సాయిరామ్నగర్, ఆదిత్యానగర్లలో భూకంపం వచ్చింది. అక్కడి నుంచి పెద్దమ్మనగర్, జయవంత్నగర్, భవానీనగర్, అన్నా నగర్, రహమత్నగర్లోని ఎస్పీఆర్హిల్స్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శబ్దాలు చోటు చేసుకున్నాయి. ప్రజలంతా ప్రాణభయంతో హడలిపోయారు. అయితే క్షణాల్లోనే అంతా సర్దుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మూడేళ్ళ కిందట ఇలాంటి భూకంపం వచ్చిందని, ఇది ప్రమాదకరం కాదని ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనగేశ్ శుక్రవారం ‘సాక్షి’కి తెలియజేశారు. రిక్టర్ స్కేల్పై 1.5 గా మాత్రమే నమోదైందని, ఇది ప్రమాదకరం కాదన్నారు. -
సూర్యాపేట జిల్లాలో భూకంపం
-
భూప్రకంపనలు.. ఇండోనేషియాలో అత్యధికం
జకార్తా : ఇండోనేషియా సహా వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున ఇండోనేషియా, సింగపూర్ సహా భారత్లోని అరుణాచల్ ప్రదేశ్లో భూమి కంపించింది. అత్యధికంగా ఇండోనేషియాలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు కాగా, సింగపూర్లో తెల్లవారుజామున 4.24 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సమీపంలో తెల్లవారుజామున 1:33 గంటలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. జావా తీరం సముద్రగర్భంలో 528 కిలోమీటర్ల లోతులో భూకంపన కేందద్రాన్ని గుర్తించినట్టు ఇండోనేషియా వాతావరణ జియోఫిజిక్స్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని , సునామీ వచ్చే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. M6.1 #earthquake (#gempa) strikes 142 km N of #Semarang (#Indonesia) 7 min ago. Effects reported by eyewitnesses: pic.twitter.com/M19yatlAlO — EMSC (@LastQuake) July 6, 2020 -
మిజోరంలో భూకంపం
ఐజ్వాల్ : ఈశాన్య భారతంలో 12 గంటల వ్యవధిలోనే రెండవ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4:10 గంటలకు మిజోరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( (ఎన్సిఎస్ )పేర్కొంది. దీని ప్రభావం ఎక్కువగా ఛంపాయ్ జిల్లాలో నమోదైందని దాదాపు 27 కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించినట్లు తెలిపింది. అయితే దీని ద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగలేని అధికారులు వెల్లడించారు. వరుస భూకంపాల వల్ల రాష్ర్టంలోని పలు చోట్ల ఇళ్లు ధ్వంసం అవడంతో పాటు రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఆదివారం 4:16 గంటలకు మణిపూర్లో భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్లు మణిపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎర్త్ సైన్స్ విభాగం వెల్లడించిన సంగతి తెలిసిందే. (ముంబైకి మరో ముప్పు ) జూన్ 18న ఐదు ఈశాన్య రాష్ర్టాల్లో భూకంపం సంభవించింది. ఛంపాయ్, షిల్లాంగ్ సహా ఐదు ప్రధాన నగరాల్లో భూకంపం భూ ప్రకంనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. వరుస భూకంపాలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు . ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్తంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకున్నా ఆస్తినష్టం జరిగిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. (రైతు వేషంలో మంత్రి: సినిమా సీన్ను తలపించేలా.. ) -
గుజరాత్లో మరోసారి భూకంపం
గాంధీనగర్: గుజరాత్ను మరోసారి భూకంపం వణికించింది. 24 గంటలు గడవక ముందే రెండోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.57 గంటల సమయంలో రాజ్కోట్ సమీపంలో రెండోసారి భూకంపం చోటు చేసుకుంది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. రాజ్కోట్కు వాయవ్య దిశలో 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్లో ఆదివారం రాత్రి 8 గంటలకు రాజ్కోట్, గుజరాత్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వ్యాయువ్యంగా ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో రాజ్కోట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. -
గుజరాత్లో భూకంపం
సాక్షి, అహ్మదాబాద్: గుజరాత్లో భూకంపం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 8 గంటలకు రాజ్కోట్, గుజరాత్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వ్యాయువ్యంగా ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో రాజ్కోట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. (లాక్డౌన్ పొడిగింపుపై కేంద్రం స్పందన) -
ఢిల్లీలో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.1గా నమోదైంది. ఢిల్లీ, గుర్గావ్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గత రెండు నెలల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో దాదాపు 10 స్వల్ప భూకంపాలు సంభవించాయి.(కేజ్రీవాల్కు రేపు కరోనా పరీక్షలు?) -
ఒంగోలులో స్వల్ప భూ ప్రకంపనలు
-
ఒంగోలులో స్వల్ప భూకంపం!
సాక్షి, ప్రకాశం: ఒంగోలు పట్టణంలో శుక్రవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రెండు సెకండ్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గద్దల కుంట, దేవుడి చెరువు, మామిడిపాలెం ప్రాంతాల్లో భూమి కంపించినట్టు స్థానికులు చెప్పారు. (చదవండి: అడవిలో తప్పిపోయిన మహిళ) -
ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదు అయింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కాగా లాక్డౌన్ సమయంలో ఢిల్లీలో భూమి కంపించడం ఇది మూడోసారి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఢిల్లీలో మళ్లీ భూకంపం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మళ్లీ భూమి స్వల్పంగా కంపించింది. సోమవారం మధ్యాహ్నం తక్కువ తీవ్రత కలిగిన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఇది 2.7గా నమోదైంది. కాగా నిన్న (ఆదివారం) కూడా ఢిల్లీలో భూకంపం వచ్చింది. వరుసగా భూమి కంపించడంతో జనం భయాందోళనలకు గురి అవుతున్నారు. కాగా నగరంలోని కొన్ని ప్రాంతాలలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ( ఎన్సీఎస్) తెలిపింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం గానీ , ప్రాణ నష్టంగానీ వాటిల్లలేదు. 24 గంటలలో ఢిల్లీలో భూమికంపించడం ఇది రెండవ సారి. సోమవారం నాటి భూకంప కేంద్రం భూమికి 5 కిమీల లోతున మాత్రమే ఉండగా ఆదివారం భూకంప కేంద్రం 7 కిమీల లోతున ఉందని జాతీయ భూకంప కేంద్రం (ఎన్సీఎస్) డైరక్టర్ జెఎల్ గౌతం చెప్పారు. -
ఢిల్లీలో భూ ప్రకంపనలు!
-
ఢిల్లీలో భూ ప్రకంపనలు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ-ఎన్ఆర్సీ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూ ప్రకంపనలు 3.5గా నమోదు అయ్యాయి. భూ ప్రకంపనలతో జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి
-
‘అమరావతి భూకంప జోన్లో ఉంది’
సాక్షి, హైదరాబాద్ : అమరావతి భూకంప జోన్లో ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్ విభాగ రిటైర్డ్ అధిపతి రామదాస్ అన్నారు. అమరావతి భూకంపాల తీవ్రత విషయంలో జోన్-3లో ఉందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తే రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 6.5 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ తెల్లవారుజామున కృష్ణ, గుంటూరు ప్రాంతాల్లో వచ్చిన భూకంపం.. అమరావతి ప్రాంతంలో వస్తే దాని వల్ల కలిగే నష్టం అధికంగా ఉంటుందన్నారు. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో భూఅంతర్భాగంలో గ్రానైట్ పొరలు ఉండటంతో ప్రకంపనల తీవ్రత అంతగా కనిపించలేదన్నారు. కానీ అమరావతిలో భూపొరలు అంత పటిష్టంగా లేకపోవడం వల్ల దాని ప్రభావం అధికంగా ఉంటుందని ప్రొఫెసర్ రామదాసు వివరించారు. భూకంప ప్రమాదాల విషయంలో అమరావతితో పోల్చుకుంటే విశాఖ చాలా సురక్షితం అని రామదాసు తెలిపారు. అమరావతి ప్రాంతం భూకంపాల జోన్లో ఉందని గతంలో అనేక నివేదికలు అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి విన్నవించాయని తెలిపారు. అయినా అక్కడే రాజధాని నిర్మాణం ఎందుకు చేపట్టాలనుకున్నారో తెలియడం లేదన్నారు. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలంటే వాస్తవంగా అయ్యే ఖర్చు కంటే పది రెట్లు అధికమవుతుందని... దాని కారణంగా రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుందని రామదాసు హెచ్చరించారు.