fashion designer
-
నాన్సీ త్యాగీ
లైఫ్స్టయిల్ అండ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. ఉత్తరప్రదేశ్కు చెందిన నాన్సీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)ప్రిపరేషన్ కోసం ఢిల్లీ చేరింది. అక్కడికి వెళ్లాక తెలిసింది తన ప్యాషన్ ఫ్యాషన్ అని. ‘కాల్ మి బే’ సిరీస్ కోసం నటి అనన్య పాండేకి అవుట్ ఫిట్స్ డిజైన్ చేసి బాలీవుడ్ని, కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్ కోసం గౌన్ను డిజైన్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ వరల్డ్లోని తన అనుభవాలను, లైఫ్స్టయిల్ థింగ్స్ని, ఫ్యాషన్ టిప్స్ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @nancytyagi లో షేర్ చేస్తూ సోషల్ మీడియా జర్నీనీ స్టార్ట్ చేసింది. ఆమె చెబుతున్న ఆ సంగతులు, టిప్స్కి దేశంలోని స్మాల్ టౌన్ అమ్మాయిలు, మహిళలు బాగా కనెక్ట్ అయ్యి తక్కువ టైమ్లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. అందుకే ఆమెను ఫోర్బ్స్.. 2024కు గాను ఇండియా టాప్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రకటించింది. -
ట్రెండ్సెట్టర్
‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్తో పాపులర్ అయి, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్సెట్టర్ స్టయిలిస్ట్గా మారిన శ్రుతి మంజరి గురించి కొన్ని విషయాలు..ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్తగా ట్రై చేస్తుంటేనే మనలోని ఓల్డ్ వర్షన్ అంతా పోయి, అప్డేట్ అవుతాం. అచ్చం అలాగే ఫ్యాషన్లోనూ, కొత్తగా ట్రై చేస్తుంటూనే అప్డేట్ అవుతుంటాం. – శ్రుతి మంజరి.చెన్నైలో పుట్టిపెరిగిన శ్రుతికి చిన్నప్పటినుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ మొత్తం ఫ్యాషన్ మ్యాగజైన్స్కే ఖర్చు చేసేది. తర్వాత ప్రముఖ డిజైనర్ల దగ్గర ఇంటర్న్గా చేరి, ఫ్యాషన్పై మరింత ప్రావీణ్యం సాధించింది. ఆ సమయంలోనే రకరకాల డ్రెస్సింగ్ స్టయిల్స్ను గమనించింది. డిజైనింగ్పై దృష్టిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే, తనకున్న ఫ్యాషన్ స్పృహ, సృజనే క్వాలిఫికేషన్గా, ఒక బొటిక్ ప్రారంభించింది. కొత్త కొత్త డిజైన్స్ రూపొందించి, తనకంటూ ఒక సిగ్నేచర్ స్టయిల్ను క్రియేట్ చేసుకుంది.ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంపాదించిన అనుభవంతో స్టయిలింగ్ చేయటం కూడా స్టార్ట్ చేసింది. అదే ఆమెకు సినీ తారల లుక్స్, స్టయిల్ను తీర్చిదిద్దే చాన్స్నిచ్చింది. అలా శ్రుతి తొలిసారి ‘బ్యాడ్ గర్ల్’ అనే తమిళ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్గా పనిచేసింది. అందులోని ఆమె పనితీరు ఆమెకు మరెన్నో సినిమాల్లోనూ స్టయిలింగ్ చేసే అవకాశాన్నిచ్చింది. అలా శ్రుతి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బిజీ స్టయిలిస్ట్గా మారింది. ‘భూమ్’, ‘మోడర్న్ లవ్ చెన్నై’, ‘రఘు తాత’, ‘సొర్గవాసల్’ వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టయిలిస్ట్గా పనిచేసింది. కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, సానియా అయ్యప్పన్, కళ్యాణి ప్రియదర్శిని, ప్రియాంకా మోహన్, గౌరి జి.క్రిష్ణన్ వంటి స్టార్స్కి కొంతకాలం స్టయిలిస్ట్గా పనిచేసింది. -
చివరకు మిగిలేది! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గుండెలు పగిలే స్టోరీ
ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత మన అందరికి తెలిసిందే. అయినా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోం. ఆరోగ్యాన్ని మించిన సంపదలేదు..ఆరోగ్యమే ఐశ్వర్యం అన్న పెద్దల మాటను పెడిచెవిన పెట్టి మరీ సంపద వేటలో పరుగులు పెడుతూ ఉంటాం. న్యాయం, అన్యాయం,విలువలన్నీ పక్కన పెట్టేస్తాం. కానీ అనారోగ్యం చుట్టుముట్టినపుడు గానీ ఆరోగ్యం విలువ తెలిసిరాదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏ సిరిసంపదలూ వెనక్కి తీసుకు రాలేని అందనంత దూరం వెళ్లిపోతాం. ఏం పాపం చేశాననీ నాకీ అవస్థ అంటూ అంతులేని ఆవేదనలో కూరుకుపోతాం...అనారోగ్యంతో మరణమనే కత్తి అంచున వేలాడుతున్న వారి అవేదన ఇది. ఆ ఆవేదనలోంచే తోటి మనుషులకు నాలుగు మంచి ముక్కలు చెప్పాలనే ఆలోచన వస్తుంది. నాలాగా మీరు కాకండి, మీరైనా జాగరూకతతో మసలుకోండనే సందేశాన్నిస్తారు. అలాంటి వాటిలో ఒకటి మీరు చదవబోయే మరణ సందేశం...!ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రచయిత్రి "క్రిస్డా రోడ్రిగ్జ్" కేన్సర్తో బాధపడుతూ చనిపోయింది. బ్లాగర్ కూడా ఈమెను క్రిస్డా రోడ్రిగ్జ్, కిర్జాయ్డా రోడ్రిగ్జ్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల వయసులో (2018, సెప్టెంబర్ 9న) కడుపు కేన్సర్తో ఆమె చనిపోయింది. అయితే చనిపోయే ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ తెలిపేలా ఒక వ్యాసం రాసింది. పది పాయింట్లతో ఆమె రాసిన ఈ వ్యాసం పలువుర్ని కదిలించింది. అనేకమందితో కంటతడి పెట్టించింది. డబ్బు, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు అన్నీ ఉన్నాయి, కానీ అవేవీ తనను కాపాడలేకపోతున్నాయంటూ హృదయాలు మెలిపెట్టేలా కొన్ని జీవిత సత్యాలను తన వ్యాసంలో పేర్కొంది. ఎన్నో ఖరీదైన బట్టలున్నాయి. కానీ చివరికి ఆస్పత్రిలో బట్టలో తన దేహాన్ని చుడతారు. ఇదే జీవితం. ఈ జీవిత సత్యం చాలామందికి ఇంకా అర్థం కాలేదు. దయచేసి వినయంగా ఉండండి, ఇతరులతో దయగా ఉండండి. చేతనైంత సాయం చేయండి, నలుగురితో శభాష్ అనుపించుకోండి. ఎందుకంటేఅదే కడదాకా నిలిచేది. చివరకు మిగిలేది! అంటూ రాసుకొచ్చింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ఆమె రాసిన పది పాయింట్లు నా గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఉంది, కానీ ఇప్పుడు నాకు వీల్చైరే ఆధారం.నా ఇంట్లో అన్ని రకాల బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన బూట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా శరీరం ఆసుపత్రి అందించిన చిన్న గుడ్డలో చుట్టబడి ఉంది.నా దగ్గర బ్యాంకులో చాలా డబ్బు ఉంది. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో ఇపుడేమీ లాభం లేదువిలాసవంతమైన కోట లాంటి భవనం ఉంది. కానీ ఇప్పుడు నేను ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోతున్నాను. ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేదాన్ని. మరి ఇప్పుడు ఒక క్లినిక్ నుండి మరొక క్లినిక్కు తిరుగుతూ ఆసుపత్రిలోనేను వందలాది మందికి ఆటోగ్రాఫ్లపై సంతకం చేసాను కానీ ఇపుడు, వైద్య రికార్డులే నా సంతకం.నా జుట్టును అందంగా తీర్చిదిద్దుకోడానికి ఏడు రకాల సె లూన్లకు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు - నా తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు.ప్రైవేట్ విమానంలో ఎపుడు కావాలంటే అపుడు, ఎక్కడికైనా ఎగరగలను, కానీ ఇప్పుడు నాకు ఆసుపత్రి గేటు వరకు నడవడానికి ఇద్దరు సహాయకులు అవసరం.చాలా ఆహారం ఉంది. కానీ రోజుకు రెండు మాత్రలు, సాయంత్రం కొన్ని చుక్కల ఉప్పు నీరు ఇపుడిదే నా ఆహారంఈ ఇల్లు, ఈ కారు, ఈ విమానం, ఈ ఫర్నిచర్, ఈ బ్యాంకు, మితిమీరిన కీర్తి ఇవేవీ నాకు అక్కరకు రావు. ఇవేవీ నన్ను శాంతింపజేయవు. ఈ ప్రపంచంలో "మరణం తప్ప నిజమైనది మరేదీ లేదు."అన్నింటికన్నా అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం. ఉన్నదాంతోనే సంతోషంగా ఉండండి. కడుపునిండా భోజనం, పడుకోవడానికి స్థలం ఇంతకంటే ఏం కావాలి ఆరోగ్యంగా ఉండండి అంటూ సందేశాన్నిచ్చింది. డెత్ బెడ్పై తన జీవిత దృక్పథాన్ని మార్చుకుంది. భౌతిక ఆస్తుల అశాశ్వతతను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్యం, ప్రాథమిక అవసరాలు ప్రేమ, సంతృప్తి, విశ్వాసం యొక్క అమూల్య మైన విలువను నొక్కి చెప్పింది. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ఆమె న్యూజెర్సీలో ఉండేది. ఫ్యాషన్, స్టైల్, ఫిట్నెస్, పాజిటివిటీ, వెల్నెస్, స్ఫూర్తి లాంటి విషయాలపై రోజువారీ పోస్ట్ల ద్వారా అభిమానులతో పంచుకునేది. రోడ్రిగ్జ్ తొలిసారి 2017 నవంబరులో స్టేజ్ 4 స్టమక్ కేన్సర్ సోకినట్టు ప్రకటించింది.ఈ పోరాటంలో కూడా రెగ్యులర్ విషయాలతోపాటు తన అనుభవాలనూ పంచుకునేది. ఇవీ చదవండి: ‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధుకేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు -
ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్
ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్,సంజనా బాత్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఇండియాలో సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సంజనా బాత్రా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాదాపు పెళ్లైన అయిదేళ్ల తరువాత తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సంజన బాత్రా , అవ్రాల్ బెరి దంపతులకు అభినందనలు తెలిపారు.గర్భధారణను అత్యంత హృద్యంగాసంజన ,ఆమె భర్త అవ్రాల్ బెరి ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ అండ్ వైట్లో ఒక అద్భుతమైన రీల్ను పంచుకున్నారు. ఇందులో వారి పెట్ డాగ్స్తో పాటు తాము తల్లిదండ్రులను కాబోతు న్నామనే విషానే అందంగా ప్రకటించారు. అవర్ ప్యాక్ ఈజ్ గ్రోయింగ్ అనే క్యాప్షన్తో తమ కుటుంబంలోకి మరో ప్రాణం రాబోతోందనే విషయాన్ని వెల్లడించారు. సంజన ఒక ఫ్లోవీ గౌనులో మెరుస్తూ, తన బేబీ బంప్ను అప్యాయంగా పట్టుకుంది. తీగలపై వేలాడుతున్న బేబీ దుస్తులు మరింత అద్భుతంగా కనిపించాయి. సెలబ్రిటీలు,అభిమానులు కాబోయే తల్లిదండ్రులపై ప్రేమను కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Sanjana Batra (@sanjanabatra) ముందుగా అభినందనలు తెలిపినవారిలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఒకరు. ఆమె "అభినందనలు బాచీ" కామెంట్ చేసింది. ఇంకా హీరోయిన్ శిల్పా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇషితా మంగళ్ , ఫ్యాషన్ కన్సల్టెంట్ స్టైలిస్ట్ స్మృతి సిబల్ ,ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ సాక్షి సింధ్వాని తదితరులు లవ్ ఎమోజీలతో తమ సంతోషాన్ని ప్రకటించారు. ముంబైకి చెందిన సంజనా యూనివర్సిటీ ఆఫ్ లండన్లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్లో మాస్టర్ డిగ్రీ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది. క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన ఆమెను ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించేలా చేసింది. బ్యూటీ అండ్ లైఫ్స్టయిల్కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్గా పనిచేస్తున్న సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాకు పనిచేసింది. అలా ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులకు ప్రముఖులకు స్టైలింగ్ చేసింది. అలాగే పద్మావత్, గల్లీ బాయ్ వంటి చిత్రాలలో ఆమె చేసిన కృషికి ఆమె ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. వోగ్ ఇండియా, హార్పర్స్ బజార్ ఇండియా, ఎల్లే ఇండియాతో సహా అనేక మ్యాగజైన్లలో స్టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంజన బాత్రా , కెన్నెల్ కిచెన్ ఫౌండర్ అవ్రాల్ బెరి పదేళ్ల పరిచయం తరువాత2020లో పెళ్లి చేసుకున్నారు. -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్లుక్స్ వరకు ప్రతిదీ సూపర్గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు.అలా చాలామంది బ్రైడల్స్కు బెస్ట్ ఫ్రెండ్గా మారి, వారి ఫొటో షూట్స్కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. ఆ స్టయిలింగ్కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండిమంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందనేది నా నమ్మకం. అందుకే, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడను. బి పాజిటివ్.. బి హ్యాపీ ∙కళ్యాణి కె. -
Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!
పారిస్ ఫ్యాషన్ వీక్ 2025లోభారతీయ ఫ్యాషన్ పరిశ్రమలో ప్రముఖుడైన డిజైనర్ గౌరవ్గుప్తా ప్రత్యేక కలెక్షన్తో అలరించాడు. ఢిల్లీకి చెందిన ఈ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదాన్నే థీమ్ గా మల్చుకుని ఫ్యాషన్ వీక్లో తన దుస్తులను ప్రదర్శించాడు. భార్య నవ్కిరత్ సోధి అగ్ని ప్రమాదాన్నే 'అక్రాస్ ది ఫైర్' థీమ్ గా కోచర్ కలెక్షన్ను ప్రదర్శించాడు. పారిస్ ఫ్యాషన్ వీక్లో గౌరవ్ గుప్తా కలెక్షన్కు వ్యక్తిగత విషాదం ఎలా ప్రేరణనిచ్చింది తెలుసుకుందాం.ఒక చిన్న కొవ్వొత్తి గౌరవ్, నవ్కిరత్ జీవితాలను పెద్ద ప్రమాదంలోకి నెట్టేసింది. ఎనిమిది నెలల క్రితం అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో గౌరవ్ గుప్తా భార్య నవ్కిరత్ దాదాపు మరణానికి చేరువైంది. ఆమె శరీరం 55 శాతం కాలిపోయింది. ఆమె బతికే అవకాశం 50 శాతం అని వైద్యులు చెప్పారు. అయినా నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని విజేతగా నిలిచింది. ఈ ప్రమాదంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నించి గౌరవ్ కూడా గాయపడ్డాడు. ఢిల్లీలోని అటెలియర్ ధ్వంసమైంది. కొంత ఆస్తినష్టం కూడా జరిగింది. కట్ చేస్తే..మొక్కవోని ధైర్యంతో, అద్భతమైన కలెక్షన్తో ప్యాషన్వీక్లో అబ్బుర పర్చారు. ఈ ప్రమాదం కారణంగానే గత సంవత్సరం పారిస్ ఫ్యాషన్ వీక్లో గౌరవ్ గుప్తా పాల్గొనలేకపోయాడు. కానీ ఈ సారి వేగంగా పుంజుకని తన స్టైల్తో అందరి అంచనాలను మించిపోయాడే. తన జీవితభాగస్వామి నవ్కిరత్ సోధి ద్వారా 2025 ఫ్యాషన్ వీక్ పూర్తి న్యాయం చేశాడని ఫ్యాషన్ నిపుణులు కొనియాడటం గమనార్హం. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)ఈ ఈవెంట్లో నవ్కిరత్ సోధి ప్రత్యేకంగా నిలిచింది. క్రీమ్-హ్యూడ్ డ్రెప్డ్ కార్సెట్ గౌనులో రన్వేపై వాక్ చేసింది. ఈ సమయంలో ఆమె శరీరంపై కాలిన గాయాల తాలూకు మచ్చలు కనిపించినపుడు అందరి కళ్లు గౌరవా భిమానాలతో చెమర్చాయి. నవకిరత్ కేవలం కలెక్షన్ను ప్రేరేపించడమే కాదు. ఆమె ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేచి సాధికారత క్షణాలను ప్రపంచానికి చూపించి ప్రశంసలు అందుకుంది. View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial) "ఆమె ఒక పోరాట యోధురాలు . ప్రాణాలతో బయటపడినది... ఆమె ఒక దేవత" అని గౌరవ్ తన అధికారిక పేజీలో షేర్ చేసిన భావోద్వేగ వీడియోలో పేర్కొన్నాడు. నవ్కిరత్ సుదీర్ఘ ప్రయాణం తమ జీవితాలను మార్చడమే కాకుండా, ఒక సృజనాత్మక దృష్టిని మిగిల్చిందన్నాడు. View this post on Instagram A post shared by The Wedding Collective (@theweddingcollectiveofficial)దేశీయంగా అంతర్జాతీయ A-లిస్టెడ్ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్గుప్తా. తాజా ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్లో తన కలెక్షన్స్ను ప్రదర్శించాడు. జర్డోజీ, డబ్కా , నక్షి లాంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎక్కువ. రాహుల్ మిశ్రా ,వైశాలి ఎస్ తర్వాత ఈ కోచర్ వీక్లో ప్రజంట్ చేస్తున్న మూడవ డిజైనర్ గౌరవ్ గుప్తా కావడం విశేషం. 2004లో, అతను తన సోదరుడు సౌరభ్ గుప్తాతో కలిసి తన లేబుల్ని స్థాపించాడు. తరువాత ఇస్తాంబుల్లోని ఒక కంపెనీకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు. చివరికి భారతదేశానికి తిరిగి వచ్చి, 2006లో అధికారికంగా తన లేబుల్ను ప్రారంభించాడు.2006లో ఇండియా ఫ్యాషన్ వీక్లో "అత్యంత వినూత్న ప్రదర్శన"గా ప్రశంసలందుకున్నాడు.2009లో, తన తొలి స్టోర్ను న్యూఢిల్లీలో ప్రారంభించాడు. ముంబై,హైదరాబాద్, కోల్కతా లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో అతని ఫ్లాగ్షిప్ స్టోర్లున్నాయి.2017లో, భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత వస్త్రాన్ని రూపొందించడానికి గౌరవ్ వోగ్ IBM కాగ్నిటివ్ సిస్టమ్ వాట్సన్తో కలిసి పనిచేశాడు. 2022లో, గౌరవ్ గుప్తా బ్రైడ్ - పెళ్లి దుస్తుల్లోకి ప్రవేశించాడు. లిజ్జో, మేగాన్ థీ స్టాలియన్ , దీపికా పదుకొనే , ప్రియాంక చోప్రా , మేరీ జె. బ్లిగే, జెన్నిఫర్ హడ్సన్, సావీటీ, థాలియా, కైలీ మినోచ్యుల్, వయోలెట్, ఒలిట్వియా, ఒలిట్వియా లాంటివి దేశవిదేశాల్లో ప్రజాదరణ పొందాయి. 2022లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోసం డిజైన్ చేసిన దుస్తులు హైలైట్ అయ్యాయి.2023లో జరిగిన పారిస్ హాట్ కోచర్ వీక్లో గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన అద్భుతమైన లెమన్ గ్రీన్ గౌనును అమెరికన్ రాపర్ కార్డి బి,చైనీస్ నటుడు ఫ్యాన్ బింగ్బింగ్ ధరించడం విశేషం. ఇదీ చదవండి : పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ -
హోటల్లో అంట్లు కడిగాడు,ఆత్మహత్యాయత్నం..కట్ చేస్తే.. రూ 500 కోట్లు
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రిటైలర్, నగల డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా టాప్ డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ఈసక్సెస్ అంత ఈజీగారాలేదు. సామాన్య నేపథ్యంనుంచి వచ్చి గ్లోబల్ ఐకాన్గా ఎదగడానికి చాలా కష్టాలుపడాల్సి వచ్చింది. విపరీతమైన డిప్రెషన్, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన సోదరి నుంచి 20వేల రూపాయల అప్పుగా తీసుకొని ప్రారంభించిన ప్రయాణం పాతికేళ్ల తరువాత నేడు రూ. 500కోట్లకు చేరింది. సబ్యసాచి అసలు ఎక్కడివాడు, ఆయన కరీర్ మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి!సబ్యసాచి 1974లో ఒక మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించాడు.తల్లిదండ్రులు బంగ్లాదేశీయులు. అతని తండ్రి బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి శరణార్థిగా వలస వచ్చారు. తండ్రి ఉన్ని మిల్లులో ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. అపుడు 15 ఏళ్ల వయస్సులో గోవాకు పారిపోయాడు సబ్యసాచి. అక్కడ వెయిటర్గా పనిచేశాడు ,గిన్నెలు కడిగాడు. అప్పుడే డిజైనర్ కావాలనే కల కన్నాడు. ఇందుకోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)చదువు కోవాలనుకున్నాడు. కానీ అడ్మిషన్కు డబ్బులు లేవన్నారు. అయినా పట్టువీడలేదు. ఎలాగో అలా కష్టపడి అడ్మిషన్ తీసుకున్నాడు. 1999లో అహ్మదాబాద్లోని ప్రతిష్టాత్మక ఇండియాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత కొన్ని నెలల తర్వాత కేవలం ముగ్గురు సిబ్బందితో కోల్కతాలో తొలి స్టూడియోను ప్రారంభించాడు. అలా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదీ సోదరి దగ్గర 20 వేల రూపాయలను అప్పుగా తీసుకొని మరీ. అలా ప్రస్థానం పాకిస్తాన్ ,యుఎఇ, ఇటలీ , దుబాయ్ ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడే తొలి భారత గ్లోబల్ బ్రాండ్ ప్రస్తానానికి పునాది పడింది. ఇక అప్పటినుంచి అన్నీ అవార్డులు, రివార్డులు, ప్రశంసలే తప్ప వెనక్కి తీరిగి చూసింది లేదు.రేయింబవళ్లు కష్టపడి 2002లో లక్మే ఫ్యాషన్ వీక్లో తన తొలి కలెక్షన్ను ప్రదర్శించి, ఫ్యాషన్ మాస్ట్రోగా మారారు సబ్యసాచి ముఖర్జీ. సింగపూర్లో జరిగిన మెర్సిడెస్-బెంజ్ న్యూ ఆసియా ఫ్యాషన్ వీక్లో తొలి అంతర్జాతీయ అవార్డు (గ్రాండ్ విన్నర్ అవార్డు) గెలుచుకున్నాడు.డిప్రెషన్, ఆత్మహత్యాయత్నంతాను యుక్తవయసులో డిప్రెషన్కు గురయ్యానని, ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు.తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఒక సందర్భంగా సబ్యసాచి వెల్లడించాడు. “నేను నిరాశకు లోనయ్యాను మరియు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. అమ్మ చెంపదెబ్బ కొట్టింది. జలుబు ఎంత సాధారణమో డిప్రెషన్ కూడా అంతే సాధారణం. మీరు డిప్రెషన్లో లేకుంటే, మీరు మామూలుగా లేరు అని అర్థం” అంటూ తన జర్నీని వివరించారు. అంతేకాదు తాను నిరాశను ఎదుర్కోకపోతే, ఫ్యాషన్ దిగ్గజంగా మారడానికి బదులుగా, వేరే కెరీర్ మార్గాన్ని అనుసరించేవాడినని పేర్కొన్నాడు. బహుశా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ వంటి కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. చదవండి: పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్సబ్యసాచి ముఖర్జీ కెరీర్ మైలు రాళ్లుసబ్యసాచి ముఖర్జీ 2001లో ఫెమినా బ్రిటీష్ కౌన్సిల్ యొక్క మోస్ట్ ఔట్స్టాండింగ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డుఅసాధారణ డిజైనర్ జార్జినా వాన్ ఎట్జ్డోర్ఫ్తో ఇంటర్న్షిప్ కోసం లండన్. 2002లో ఇండియన్ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న తర్వాత చాలా మీడియా దృష్టిని ఆకర్షించారు. 2003లో తొలి విదేశీ "గ్రాండ్ విన్నర్ అవార్డ్" గెలుచుకున్న తరువాత పారిస్లో జీన్-పాల్ గౌల్టియర్ , అజెడిన్ అలైతో వర్క్షాప్కు దారితీసింది.2004లో మయామి ఫ్యాషన్ వీక్లో ‘ ది ఫ్రాగ్ ప్రిన్సెస్ కలెక్షన్,’, భారతీయ వస్త్ర సౌందర్యం ప్రపంచానికి మరింత బాగా తెలిసి వచ్చింది.బ్లాక్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ అవార్డుప్రపంచవ్యాప్త గుర్తింపు2005లో ది నాయర్ సిస్టర్స్ను ప్రారంభించాడు. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీలు, బగ్రూ లాంటి కలెప్రేరణ పొందిన వసంత-వేసవి సేకరణ. అతని క్రియేషన్స్ ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వార్షిక బ్లాక్-టై ఛారిటీ డిన్నర్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించడానికి ఆహ్వానం2006లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో సబ్యసాచి ప్రారంభ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 07 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. న్యూయార్క్, మిలన్ మరియు లండన్ అనే మూడు ప్రధాన ఫ్యాషన్ వారాల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫ్యాషన్ డిజైనర్.సబ్యసాచి న్యూయార్క్ ,లండన్ ఫ్యాషన్ వీక్స్, అలాగే బ్రైడల్ ఆసియా 2007, లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ , 2007లో భారతదేశంలో జరిగిన వోగ్ లాంచ్లకు హాజరయ్యాడు. 2008లో నగల కలెక్షన్కూడా షురూ చేశాడు. GAJA బ్రాండ్ సహకారంతో 2016 వోగ్ వెడ్డింగ్ షోలో ప్రారంభమైంది. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో 2012లో ఒక క్యాలెండర్ను రూపొందించారు, ఆ తరువాతఫ్రెంచ్ లగ్జరీ పాదరక్షలు మరియు దుస్తులు డిజైనర్ క్రిస్టియన్ లౌబౌటిన్తో భాగస్వామిగా పనిచేశాడు.బ్రైడల్ కలెక్షన్తో పాపులర్2007లో తన తొలి బ్రైడల్ కలెక్షన్ను ఆవిష్కరించాడు,యు తన డిజైన్లతో వివాహ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించాడు. భారతీయ సంప్రదాయ వస్త్రాలు, చేనేత, చేతితో తయారు చేసిన తనదైన శైలితో డిజైనర్ వెడ్డింగ్ దుస్తులకు పేరుగాంచాడు.హై-ఎండ్ లగ్జరీ ఇండియన్ టెక్స్టైల్స్ను ఉపయోగించిన తొలివ్యక్గాపేరుతెచ్చకున్నాడు. బంధాని, గోటా వర్క్, బ్లాక్-ప్రింటింగ్ , హ్యాండ్-డైయింగ్ లాంటి వర్క్స్తో ట్రెండ్ క్రియేట్ చేశాడు.బాలీవుడ్ సినిమాలకుసబ్యసాచి సంజయ్ లీలా బన్సాలీ చిత్రం బ్లాక్కి కాస్ట్యూమ్ డిజైనర్గా అరంగేట్రం చేశారు. 2005లో ఒక ఫీచర్ ఫిల్మ్కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ అవార్డుతో సహా చిత్రానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. బాబుల్,లాగ చునారి మే దాగ్,రావణ్, గుజారిష్, పా,నో వన్ కిల్డ్ జెస్సికా,ఇంగ్లీష్ వింగ్లీష్,బ్లాక్ లాంటి అనేక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్స్ అందించారు.ప్రముఖుల వివాహాలు నటి విద్యాబాలన్ ,అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, నిక్ జోనాస్ , ప్రియాంక, అలియా పీవీ సింధు వివాహ దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. ఇంకా శ్రీదేవి, కత్రినా కైఫ్, టబు, షబానా అజ్మీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్,శ్రద్ధా కపూర్, సుస్మితా సేన్, కరీనా, నీతా అంబానీ, శ్లోకా, ఇషా, రాధిక అంబానీ సహసబ్యసాచి సెలబ్రిటీ క్లయింట్లే కావడం విశేషం. 25 సంవత్సరాల కృషి తర్వాత, సబ్యసాచి ముఖర్జీ బ్రాండ్ రూ. 500 కోట్ల విలువకు చేరింది. ఈ ఘనతను సాధించిన భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్గా ఎదిగింది. -
హైలైఫ్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
జియో వరల్డ్లో మనీష్ మల్హోత్రా: బాలీవుడ్ తారలు, నీతా వెరీ స్పెషల్
-
మాదాపూర్ : ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
అయ్యారే... లేడీస్ టైలర్..ఈ డిజైన్స్కి మగువలు ఫిదా!
ఈ బుజ్జిగాణ్ణి మన రాజేంద్ర ప్రసాద్ని పిలిచినట్టు ‘లేడిస్ టైలర్’ అనంటే ఊరుకోడు. ‘ఐ యామ్ ఏ ఫ్యాషన్ డిజైనర్’ అంటాడు. ఎనిమిదేళ్ల వయసులో పిల్లలు ఆటపాటల్లో మునిగిపోయి ఉంటారు కానీ అమెరికాకు చెందిన మాక్స్ అలెగ్జాండర్ మాత్రం కొత్త బట్టలు, సరికొత్త ఫ్యాషన్లు, నూతన ఆలోచనలు అంటూ హడావిడిగా ఉంటాడు. అతి చిన్న ఫ్యాషన్ డిజైనర్గా పేరు తెచ్చుకున్న మాక్స్ రూపొందించే దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కీలకమైన వేడుకల్లో అతను తయారు చేసే బట్టలే వేసుకుంటామని కొందరు సెలబ్రెటీలు హటం చేస్తారు. అనగా మంకుపట్టు పడతారు.మాక్స్కి నాలుగేళ్ల వయసున్నప్పుడు అతని తల్లి షెర్రీ మాడిసన్స్ అతనికో బొమ్మ ఇచ్చింది. దాని కోసం కస్టమ్ కోచర్ గౌన్ కుట్టాడు మాక్స్. అప్పటి నుండి ఇప్పటిదాకా 100 కంటే ఎక్కువ కస్టమ్ కోచర్ గౌన్లు కుట్టాడు. అతని ఆస్తకిని గమనించి తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. తాను తయారుచేసిన దుస్తులతో అనేక రన్వే షోలను నిర్వహించి, ప్రపంచంలో అతి చిన్న వయస్కుడైన రన్ వే ఫ్యాషన్ డిజైనర్గా మాక్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అతను తయారు చేసిన దుస్తుల్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించారు. బట్టలు కుట్టేసి ఇచ్చేయడం మాత్రమే మాక్స్ పని కాదు. అవి వేసుకునేవారు ఏం కోరుతున్నారు, వారి ఇష్టాయిష్టాలు ఏమిటి, ఎలాంటి దుస్తులు సౌకర్యంగా అనిపిస్తాయి, ఎలాంటి రంగులు వారి ఒంటికి నప్పుతాయి వంటి అంశాలన్నీ ఆలోచించి డిజైన్ చేస్తాడు. ఈ కారణంగానే అతను రూ΄÷ందించే బట్టలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతోపాటు పనికిరాని వస్తువులతో కూడా కొత్త రకమైన బట్టలు తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇన్స్ట్రాగామ్లో మాక్స్కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మరిన్ని కొత్త ఫ్యాషన్లు రూపొందించాలని, అందుకోసం మరింత సాధన చేయాలని అతను అంటున్నాడు. -
వావ్, వావ్..యానివర్సరీ వీక్ అంటే ఇలా, మంచు పూల జల్లుల్లోన (ఫోటోలు)
-
అనుసృజన
అను పెళ్లకూరు.. ఫ్యాషన్ రంగంలో బాగా వినబడే పేరు. ఫ్యాషన్పై ఆమెకున్న పిచ్చి పద్దెనిమిదేళ్ల వయసులోనే మిస్ యూఏఈ ఫైనలిస్ట్ కోసం దుస్తులను డిజైన్ చేసే కాంట్రాక్ట్ను తెచ్చిపెట్టింది. కేవలం రూ. పదిహేను వేలతో అద్భుతమైన మూడు డిజైన్స్ను అందించి, అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు, తన పేరును ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ జాబితాలో చేర్చుకుంది.ఫ్యాషన్పై ఉన్న ప్యాషన్తో ఇంటర్ అయిపోయిన వెంటనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయింది అను. కానీ, ఆ రంగంలో ఆచరణాత్మక అనుభవం చాలా ముఖ్యమని గ్రహించింది. దాంతో తరగతులకు హాజరవక.. కాలేజ్ డ్రాప్ అవుట్గా మిగిలింది. తన అభిరుచిని గైడ్గా తలచి, అనుభవాన్ని పాఠాలుగా మలచుకుంది. సోదరుడు సూర్య సహకారంతో ‘ఎస్ అండ్ ఏ (సూర్య అండ్ అను)’ పేరుతో ఓ మల్టీ డిజైనర్ స్టోర్ను ప్రారంభించింది. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. అలా పాపులారిటీ సంపాదించుకోవడంతోపాటు తన డిజైన్స్ సెలబ్రిటీల కంట పడేలా చేసుకుంది. అది వర్కవుట్ అయి.. సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసే చాన్స్ కొట్టేసింది. నిహారిక కొణిదెల, రుహానా శర్మ, వితికా షేరు, రెజీనా కసాండ్రా, ఈషా రెబ్బ, వైష్ణవి చైతన్య వంటి సెలబ్రిటీలందరికీ అను పెళ్లకూరు ఫేవరిట్ డిజైనర్ అయింది. ఆ ప్రోత్సాహంతోనే ‘తనాషా’ పేరుతో సొంత బ్రాండ్ను స్థాపించింది. అంతేకాదు, ఇటీవల ప్రతిష్ఠాత్మక బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్లో ‘స్వర్ణిరహ’ పేరుతో తన లేటెస్ట్ కలెక్షన్స్ను ప్రదర్శించి.. ప్రశంసలు అందుకుంది. ఆ ఈవెంట్కు గ్లామర్ను జోడిస్తూ ప్రఖ్యాత నటీమణులు శ్రియా సరన్, మృణాల్ ఠాకూర్ షో స్టాపర్స్గా ర్యాంప్ వాక్ చేశారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి రెండింటి మేళవింపుగా ఉండే ఆమె డిజైన్స్కు స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగానూ గుర్తింపు లభించింది. దుబాయ్, శ్రీలంక, సింగపూర్ దేశాల్లో జరిగిన పలు ఫ్యాషన్ షోస్లో అను తన డిజైన్స్ను ప్రదర్శించింది.అనుభవాన్ని మించిన గురువు ఉండరు. అది నాకు చాలా నేర్పింది. మొదట్లో ఎన్నో సవాళ్లను, ఇంకెన్నో అవమానాలను ఎదుర్కొన్నా. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని నమ్మాను. అదే నిజమైంది.– అను పెళ్లకూరు. -
అద్దాల మిలమిలల్లో పెళ్లికూతురి లుక్ వైరల్
ప్రముఖ స్టైలిస్ట్ ఆకృతి సెజ్పాల్ డ్రీమ్ వెడ్డింగ్ నెట్టింట ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె ధరించిన ముసుగు, లెహంగా అతిథులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా మొత్తం అద్దాలతో తయారు చేసిన లెహెంగాలో వధువు ‘ఆకృతి’ మరింత ఆకర్షణగా నిలిచింది.వధువు ఆకృతి సెజ్పాల్ 3డీ డిజైన్, పూర్తిగా పూలతో చేసిన పెళ్లి కూతురు వేసుకునే మేలి ముసుగులను చూశాం. కానీ పూర్తిగా మిర్రర్ వర్క్తో రూపొందించడం విశేషంగా నిలిచింది. లెహెంగాకు తోడుగా ఏమాత్రం క్లాత్ వాడకుండా తయారు చేసిన దుపట్టా కమ్ మేలి ముసుగుతో పెళ్లి కళతో కళకళలాడింది ఆకృతి. ఇంకా స్వీట్హార్ట్-నెక్లైన్ బ్లౌజ్, హెవీ లెహంగా స్కర్ట్, ఓపెన్ హెయిర్స్టైల్పై పిన్ చేసిన షీర్ దుపట్టాలో అందంగా మెరిసిపోయింది. చోకర్ నెక్పీస్, మ్యాచింగ్ జుమ్కీలు, పాపిట బిళ్లతో తన లుక్ను మరింత అద్భుతంగా ముస్తాబైంది.< View this post on Instagram A post shared by Itrh (@itrhofficial)br> -
తోట కాని తోట : చిరస్థాయిగా నిలిచిపోయే తోట!
అరటి గెల, గుమ్మడికాయలు, పనస, పైనాపిల్... ఇవన్నీ తోటలో పండుతాయి. డిజైనర్ జెంజుమ్ ఇత్తడి నమూనాలతో ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉండే పండ్లను, కూరగాయలను సృష్టించాడు. ‘ప్రకృతికి, అతని తల్లికి, తన జీవితానికి గుర్తుగా వీటిని సృష్టించాను’ అని చెబుతాడు జెంజుమ్. అరుణాచల్ ప్రదేశ్లోని టిర్బిన్ అనే చిన్న గ్రామంలో జన్మించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జెంజుమ్. తన చిన్ననాటి జ్ఞాపకాలను బతికించుకోవాలన్నది అతని తాపత్రయం. వినోదం అందుబాటులో లేని ప్రదేశంలో పెరిగినందున, 1980లలో చిన్న పిల్లవాడిగా అతని తీరిక పనిలో చెట్లు ఎక్కడం, తేనెటీగలను వెంబడించడం, నదుల్లో ఈత కొట్టడం, చేపలు పట్టడం, పర్వతాలలో హైకింగ్ చేయడం వంటివి ఉన్నాయి. ప్రకృతి అతని ఏకైక ఆట స్థలం. ఇప్పుడు ఆ ప్రకృతినే తన తొలి ఆర్ట్ షో ‘అపాసే’ను ప్రదర్శనకు పెట్టాడు, ఇది బెంజుమ్ స్థానిక గాలో మాండలికంలో అక్షరాలా ’వివిధ రకాల పండ్లు’ అని అర్ధం.జ్ఞాపకాల తోట‘‘మా ఊరిలో ప్రతి ఇంటికీ తోట ఉంటుంది. పువ్వులకు బదులుగా వాటిలో కూరగాయలు, పండ్లు పండిస్తాం. రైతు అయిన నా తల్లి ఎప్పుడూ గ్రామంలోనే ఉంటూ తన జీవితమంతా మా తోటలో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఉండేది. వాటికి విత్తనాలు నిల్వచేసేది. అక్కడ సమయం గడపడం నా సృజనాత్మక పనిని లోతుగా ప్రభావితం చేసింది. ప్రకృతితో ఈ కనెక్షన్ ఇప్పుడు నా డిజైన్లలోకి విస్తరించింది. ఆ జ్ఞాపకాలను మళ్లీ పునశ్చరణ చేసి, వాటికి ఒక సాక్షాత్కార రూపం ఇవ్వాలన్న నా ప్రయత్నమే ‘అపాసే’’’ అని బెంజుమ్ చెబుతారు. ఇత్తడి ఫ్రూట్స్ఇత్తడితో రూపొందించిన 16 త్రీ–డైమెన్షనల్ ఫ్రూట్ మోడల్ అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కళారూపం బెంజుమ్ తల్లి తోట నుండి ఒక పండు, కూరగాయలను సూచిస్తుంది. ఈ డిజైన్స్తో బెంజుమ్ ప్రదర్శన కూడా నిర్వహించాడు. 12, 44 అంగుళాల అరటి గెల, పైనాపిల్స్, బొప్పాయిలు, జాక్ఫ్రూట్స్, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, దానిమ్మపండ్లు – కళాకారుడి పనితీరును వెలుగులోకి తెచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్లోని రూపా అనే చిన్న గ్రామంలో టిబెటన్ మఠాల కోసం సాంప్రదాయ ఇత్తడి వస్తువులను రూ పొందించడంలో నైపుణ్యం కలిగిన స్థానిక కళాకారులు ఉన్నారు. రాష్ట్రంలోని పశ్చిమాన ఉన్న తవాంగ్, ఆసియాలో అతి ప్రాచీనమైన, రెండవ అతిపెద్ద బౌద్ధ ఆశ్రమానికి నిలయం ఉంది. ఆ ఆశ్రమాలను సందర్శించిన బెంజుమ్ నిజమైన పండ్లను అచ్చులుగా ఉపయోగించడం, వాటిని శాశ్వతమైన ఇత్తడి ప్రదర్శనలుగా మార్చడంపై ఆసక్తిని పెంచింది. బెంజూమ్ ఢిల్లీలో నివసిస్తున్నాడు. తన ఢిల్లీ తోటలో బెంజుమ్ మామిడి, బొ΄్పాయి, అవకాడో, సీతాఫలం, అరటి, నిమ్మకాయలు వంటి వివిధ రకాల పండ్లను సీజన్ను బట్టి పండిస్తాడు. అయితే అతనికి ఇష్టమైనది నారింజ. ‘‘నారింజ చెట్లు సాధారణంగా ముళ్లతో ఉంటాయి, కానీ చెట్ల వయస్సు పెరిగే కొద్దీ ముళ్ళు తగ్గిపోతాయి. నారింజ పండ్లను కోయడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం, ముళ్ల నుండి వచ్చిన కొద్దిపాటి గాయాలను తీర్చే పండ్ల మాధుర్యం నాకు చిన్ననాటి జ్ఞాపకాలుగా ఉన్నాయి’’ అని బెంజుమ్ గుర్తు చేసుకుంటాడు. కళను బతికించాలి..ఈశాన్య ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే కొద్దిమంది డిజైనర్లు, కళాకారులలో బెంజుమ్ ఒకరు. ‘ప్రక్రియ నెమ్మదిగా ఉంది, కానీ మొత్తానికి ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ప్రాంతం నుండి కొత్త తరం యువ కళాకారులు ఉద్భవించడాన్ని నేను గమనించాను. వారిలో ఈ కళ పట్ల అవగాహన పెంచాలి, సృజనాత్మకతను మెరుగుపరచాలి’ అని వివరిస్తాడు బెంజుమ్. బెంజుమ్ ప్రతిభ బట్టలు డిజైన్ చేయడం, సినిమాల్లో నటించడం వరకే కాదు ఇప్పుడు ఈ కళారూపాలతో బిజీ అయిపోతే తిరిగి పెద్ద స్క్రీన్పై ఎప్పుడు చూస్తామని అక్కడి వారు అడుగుతుంటారు. బెంజుమ్ నవ్వుతూ ‘ముందు చేస్తున్న పనిపైనే సంపూర్ణ దృష్టి పెడుతున్నాను’ అంటారు జెంజుమ్. -
హైదరాబాద్ : ఫ్యాషన్ వీక్లో మెరిసిన..రెజీనా..ఈషారెబ్బా.. (ఫొటోలు)
-
బుల్లి డిజైనర్ బ్రూక్...
స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఆ అమ్మాయి ఫ్యాషన్ షోగా భావించేది. పోటీదారులకు దుస్తుల డిజైనింగే కాదు స్టయిలింగ్ కూడా చేసేది! ఫ్యాషన్ మీద ఆమెకున్న ఇష్టాన్ని అమ్మ, అమ్మమ్మ కూడా గుర్తించి, ప్రోత్సహించడంతో అతి చిన్న వయసులోనే పలువురు మెచ్చే ఫ్యాషన్ డిజైనర్గా మారింది! బ్రాండ్నీ క్రియేట్ చేసింది! ఆ లిటిల్ స్టయిలిస్టే బ్రూక్ లారెన్ సంప్టర్.బ్రూక్ లారెన్ సంప్టర్ చిన్నప్పటి నుంచి దుస్తులు, నగలు, పాదరక్షలు.. ఏవైబుల్లి డిజైనర్ బ్రూక్...నా సరే తనకిష్టమైనవే వేసుకునేది. బర్త్డేలు, పండుగలప్పుడే కాదు మామూలు రోజుల్లోనూ అదే తీరు! ఇంకా చెప్పాలంటే నైట్ గౌన్స్ పట్ల కూడా శ్రద్ధ చూపేది. ఈ తీరును మొదట్లో వాళ్లమ్మ ఎర్రిస్ ఆబ్రీ.. కూతురి మొండితనంగా భావించింది. కానీ రెండేళ్ల వయసు నుంచే బ్రూక్ తనకి స్టయిలింగ్లో సలహాలు ఇవ్వటం, ఫ్రెండ్స్ కోసం పిక్నిక్ టేబుల్, ఫ్లవర్ పాట్స్, గిఫ్ట్ బాక్స్ను డిజైన్ చేయడం వంటివి చూసి.. కూతురిలో ఈస్తటిక్ సెన్స్, క్రియేటివిటీ మెండు అని గ్రహించింది. బ్రూక్ చూపిస్తున్న ఆసక్తిని ఆమె అమ్మమ్మా గమనించి మనమరాలికి దుస్తులు కుట్టడం నేర్పించింది. దాంతో స్కూల్ నుంచి రాగానే ఫ్యాబ్రిక్ని ముందేసుకుని డిౖజñ న్ చేయడం మొదలుపెట్టేది. అలా కేవలం ఐదేళ్ల వయసులోనే బ్రూక్ తన మొదటి ఫ్యాషన్ షోను నిర్వహించింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో రెండు కుట్టుమిషన్లను కొనిపించుకుంది. అమ్మా, అమ్మమ్మను తన అసిస్టెంట్లుగా పెట్టుకుంది. వందకు పైగా డిజైన్స్ను క్రియేట్ చేసేసింది. అవి ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2022 చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఎమ్మీ అవార్డు వేడుక కోసం ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, నటి తబితా బ్రౌన్కి బ్రూక్ సంప్టర్ ఒక అందమైన గౌన్ను డిజైన్ చేసింది. దీంతో ఎమ్మీ వేడుకల కోసం దుస్తులను డిజైన్ చేసిన అతి పిన్న వయస్కురాలిగా బ్రూక్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు. బార్బీ సంస్థకు బేస్ బాల్ బార్బీ, ఫొటోగ్రాఫర్ బార్బీ అనే రెండు థీమ్ డిజైన్స్నూ అందించింది. ఈ మధ్యనే తన పేరు మీద ‘బ్రూక్ లారెన్’ అనే ఫ్యాషన్ బ్రాండ్నూ స్థాపించింది. ఇప్పుడు ఆ బ్రాండ్ టర్నోవర్ కోటి డాలర్లకు (రూ.84 కోట్లు) పైమాటే! చిన్నపిల్లల కోసం ఈ బ్రాండ్.. చక్కటి దుస్తులను డిజైన్ చేస్తోంది. ఇవి ఎంత ఫ్యాషనబుల్గా కనిపిస్తాయో అంతే కంఫర్ట్గానూ ఉంటాయి. అదే బ్రూక్ ‘బ్రాండ్’ వాల్యూ! కొన్ని నెలల కిందటన్ బ్రూక్ ‘టామ్రాన్ హాల్’ షోలోనూ కనిపించింది. అందులో తన డిజైన్స్, ఫ్యాషన్ పరిశ్రమలో తనకెదురైన అనుభవాలు, సాధించిన విజయాలను వివరించింది. కలను సాకారం చేసుకోవడానికి కావాలసింది పట్టుదల అని, లక్ష్య సాధనలో వయసు ఏ రకంగానూ అడ్డు కాదని నిరూపించింది బ్రూక్ లారెన్. స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో గెలవటం కంటే ఆడియన్స్ నా డిజైన్స్ను చూసి, కేరింతలతో ఇచ్చే ప్రశంసలే నాకు ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఆ పోటీల్లో నాతో పాటు నా ఫ్రెండ్స్కీ డ్రెసెస్ డిజైన్ చేసేదాన్ని.– బ్రూక్ లారెన్ సంప్టర్ -
ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్లో అనన్య పాండే : శభాష్ అంటున్న నెటిజన్లు
ఫ్యాషన్ ప్రపంచంలో బాగా వినిపించే పేరు నటి అనన్య పాండే పేరు. ఇటీవల తన కజిన్ సోదరి నిశ్చితార్థ వేడుకలో మరింత ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే సాంప్రదాయ బద్ధంగా డిజైనర్ చీర లేదా గౌను ధరించడానికి బదులుగా, అనన్య 21 ఏళ్ల నాటి పాత డ్రెస్ను ఎంచుకుంది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ఇలా ఎందుకు చేసిందంటే..సన్నిహిత బంధువు దియా ష్రాఫ్ నిశ్చితార్థానికి ఆక్వా బ్లూ కలర్ డ్రెస్ అందంగా కనిపించింది. అయితే ఈ డ్రెస్ ఫ్యాషన్ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రఖ్యాత దివంగత డిజైనర్ రోహిత్ బాల్ తన తల్లి భావనా పాండే కోసం తయారు చేసిన ఆక్వా-బ్లూ గోల్డ్ ఎంబ్రాయిడరీ కుర్తా సూట్ను ధరించింది.దీనికి సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది అనన్య పాండే. దీంతో నెటిజన్లు ఘనమైన నివాళి. ఈ డ్రెస్ మీకూ చాలా బావుంది అంటూ ప్రశంసించారు.నిజానికి అమ్మలు, అమ్మమ్మల చీరలు, అందమైన లెహంగాలను కూతుళ్లు అపురూపంగా ధరించడం కొత్తేమీ కాదు. కానీ అనన్య పాండే ఒక డిజైనర్ పట్ల గౌరవ సూచకంగా రెండు దశాబ్దాల క్రితం ఆయన డిజైన్ చేసిన సూట్ను ధరించడం విశేషంగా నిలిచింది. 2024 అక్టోబరులో లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా, అనన్య రోహిత్ బాల్ కోసం ర్యాంపవాక్ చేసిన ఘనత అనన్య సొంతం చేసుకుంది. ఇక వర్క్ పరంగా చూస్తే CTRL మూవీతో ఆకట్టుకుంది. అలాగే ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్లో అతిధి పాత్ర లో కనిపించింది అనన్యపాండే చిత్రనిర్మాత, కరణ్ జోహార్ సారద్యంలో అనన్య నటించిన రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని భావిస్తున్నారు.కాగా 2023 నుండి గుండె జబ్బుతో బాధపడుతున్న రోహిత్ బాల్, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిని మాత్రం వదల్లేదు. చివరికి ఆరోగ్య విషమించడంతో ఈ నెల ఆరంభంలో (నవంబర్ 1న) కన్నుమూశారు. ఆయన మరణం ఫ్యాషన్ ప్రపంచానికి తీరటి లోటు అని అభిమానులు ,ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. < View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
ప్రముఖ డిజైనర్ మృతి.. ఇంద్ర హీరోయిన్ ఎమోషనల్!
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ మృతిపట్ల సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే సంతాపం తెలిపారు. అతనితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు. మీరు అద్భుతమైన డిజైనర్ అని అందరికీ తెలుసని అన్నారు. అంతే కాకుండా మీతో ల యూ హమేషా అనే చిత్రంలో నటించిన రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. అతన్ని సోనాలి కేవలం డిజైనర్గానే కాకుండా సహ నటుడిగా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన లవ్ యు హుమేషా మూవీ థియేటర్లలో విడుదల కాలేదు.కాగా.. రోహిత్ బాల్ను నవంబర్ 1న కన్నుమూశారు. ఆయన 63 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. దీంతో హీరోయిన్ సోనాలి బింద్రే.. రోహిత్ బాల్కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు. ఆమెతో పాటు నటుడు అర్జున్ రాంపాల్ కూడా దివంగత ఫ్యాషన్ డిజైనర్కు నివాళులర్పించారు. రోహిత్ బాల్తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. కాగా.. ఆయన జ్ఞాపకార్థం సోమవారం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రార్థనా సమావేశం నిర్వహించారు.కశ్మీర్కు చెందిన రోహిత్ బాల్ తన గొప్ప డిజైన్లతో బాలీవుడ్లో ప్రసిద్ధి చెందాడు. చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు ఆయన పనిచేశారు. అతని డిజైన్లను పమేలా ఆండర్సన్, ఉమా థుర్మాన్, సిండి క్రాఫోర్డ్, నవోమి కాంప్బెల్ లాంటి అంతర్జాతీయ స్టార్స్ సైతం ధరించారు. కాగా.. సోనాలి బింద్రే తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్లో ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించింది. -
ఫ్యాషన్ డిజైనర్ కార్ టైర్లు కోసేసి.. షాప్ యజమానిని అడిగితే బెదిరింపులు
బంజారాహిల్స్: దుస్తులు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ కారు టైర్లు ధ్వంసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెల్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో నివసించే ఫ్యాషన్ డిజైనర్ జి.కీర్తిరెడ్డి ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసేందుకు బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ర్యాన్గ్రడ్జ్ ఫ్యాబ్రిక్ స్టోర్కు వచ్చారు. తన కారు టీఎస్ 09 ఈజెడ్ 1221ను ర్యాన్గ్రడ్జ్ ఫ్యాబ్రిక్ స్టోర్ ముందు పార్కింగ్ చేసి ఓ షాపులోకి వెళ్లి పది నిమిషాల్లో తిరిగి వచ్చారు. 👉 కారు స్టార్ట్ చేసేందుకు ప్రయతి్నంచగా రెండు టైర్లు పూర్తిగా దెబ్బతిని కనిపించాయి. ఇనుప చువ్వలతో కారు టైర్లను కోసేసి గాలి తీశారని తెలిపారు. సదరు షాపులో పనిచేసే ఉద్యోగి తన కారును ధ్వసం చేశాడని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులను కోరారు. తాను స్టోర్ యజమానికి ఫిర్యాదు చేయగా అసభ్యంగా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన షాపు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలిన కోరారు. పోలీసులు ఆ స్టోర్ ఉద్యోగిపై బీఎన్ఎస్ సెక్షన్ 324(4), 125, 351(2), రెడ్విత్ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాషన్ స్టైలిష్ట్ మెటర్నిటీ ఫోటో షూట్స్.. అర్థవంతంగా, అద్బుతంగా!
న్యూఢిల్లీకి చెందిన లండన్ ఫ్యాషన్ స్టైలిస్ట్ ప్రేరణ చాబ్రామరికొద్ది రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఫ్యాషన్ డిజైనర్గా, యూట్యూబర్గా అభిమానులకు దగ్గరైన ఆమె ఈ సందర్భాన్ని సంతోషాన్ని ఇన్స్టాలో షేర్ చేసుకుంది. అంతేకాదు తన భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం చేసింది. అలాగే తను ఎందుకు మెటర్నిటీ ఫోటో షూట్ చేసుకున్నదీ వివరించింది.అసలు మెటర్నీటి ఫోటో షూట్ అవసరమా అని ఆలోచించి చివరికి రెండు రకాలు ఫోటోషూట్ చేసుకున్నాను అంటూ ఇన్స్టాలో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్ను కాబట్టి క్రియేటివ్గా ఉంటాను, కనుక మెటర్నిటీ ఫోటోషూట్కూడా విభిన్నంగా ఉండాలని ఆలోచించానని ఆమె తెలిపారు. (పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్)‘‘మొదటి ఫోటో షూట్ కోసం పర్పుల్ అండ్ పింక్ కలర్ డ్రెస్ ఎంచుకున్నా..దీన్నే ది పెర్ల్స్ ఆఫ్ జాయ్ అంటాం. త్వరలోనే తల్లికాబోతుండటం ఆనందాన్ని తీసుకొచ్చింది. ఇపుడు అమ్మగామారబోతున్నాను.. దాదాపు కలలో జీవిస్తున్నాను. స్వేచ్ఛకు ప్రతీక అయిన పసుపు రంగులో రెండో ఫోటోషూట్ చేశాను. దీన్ని గోల్డెన్ బ్లూమ్ అంటాం. ఈ సందర్భంగా అమ్మ నాతో ఉండటం ఇంకా సంతోషం’’ అంటూ ఇన్స్టా పోస్ట్లో ప్రేరణ వెల్లడించింది. -
మెటర్నిటీ ఫోటోషూట్తో భర్తను పరిచయం చేసిన ఫ్యాషన్ డిజైనర్
-
'ఖాదీ'.. గాంధీ చూపిన దారే!
ఖాదీ అనేది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్రంగా ఉంటుంది. ఆ వస్త్రం ధరిస్తే ఓ పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ఖాదీ వలస పాలన విముక్తికి చిహ్నాంగా నిలిచి అందరిలోనూ స్వరాజ్య కాంక్ష రగిల్చేందుకు కారణమయ్యింది. అందుకు ఊపిరిపోసింది మహాత్మ గాంధీ. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ఖాదీతో ఆయన ఎలా స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికారు?. ఆ ఫ్యాబ్రిక్ నేడు ఫ్యాషన్ ప్రపంచంలో 'జయహో ఖాదీ' అనేలా ఎలా రాజ్యమేలుతుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందాం.!ఖాదీ అనేది పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్. భారతీయుల సంప్రదాయ వస్త్రంగా కీర్తించబడుతోంది. అలాంటి ఈ వస్త్రమే స్వరాజ్య కాంక్షకు ఊపిరిపోసి భారతీయులను వలస పాలకుల విముక్తికై పాటు పడేలా చేసింది. దీనికి శ్రీకారం చుట్టింది మహాత్మాగాంధీనే. 1918లో భారతదేశంలోని గ్రామాలలో నివసించే పేద ప్రజల కోసం ఖాదీ ఉద్యమాన్ని చేపట్టారు. నాడు వారికి ఉపాధి లేకుండా చేసి పొట్టకొడుతున్న విదేశీ వస్తువులకు ముగింపు పలికేలా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. నిజమైన స్వాతంత్ర్య కాంక్షకు కావల్సింది మనల్ని బానిసలుగా చేసి బాధపెడుతున్న విదేశీయల వస్తువులున బహిష్కరించి స్వదేశీ వస్తువులకు ప్రాముఖ్యత ఇవ్వడమే అని ఓ గొప్ప పాఠాన్ని బోధించారు.ఆయన ఇచ్చిన ఈ పిలుపు ప్రతి ఒక్కడి భారతీయుడి గుండెల్లో స్వతంత్ర కాంక్ష ఉవ్వెత్తున ఎగిసిపడేలా రగిల్చారు. అలా మొదలైన 'ఖాదీ' హవా..ఇప్పటికీ తన వైభవాన్ని చాటుతూ దేశ విదేశాల ప్రజల మన్నలను అందుకుంది. మన ప్యాషన్ పరిశ్రమలో తనదైన ముద్రతో సత్తా చాటుతుంది. మన భారతీయ డిజైనర్లు దీన్ని కనుమరగవ్వనివ్వకుండా పునరుజ్జీవింప చేశారు. తమదైన సృజనాత్మకతతో ఖాదీతో చేసిన లెహంగాలు, కోట్లు, వంటి లగ్జరియస్ వస్తువులను తీసుకొచ్చి ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడి ధరించేలా రూపొందించారు.ఖనిజో, అనీత్ అరోరా, రినా ధాకా, అనవిలా 11.11 లేబుల్ సహ వ్యవస్థాపకులు షానీ హిమాన్షు అండ్ మియా మోరికావా కొ వంటి దిగ్గజ డిజైనర్లు ఎంతో విలక్షణమైన ఖదీ డిజైన్ల కలెక్షన్లను అందించారు. అలాగే 2019లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్లో, డిజైనర్ రాహుల్ మిశ్రా తన ఖాదీ సేకరణ ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక రెండేళ్ల క్రితం ఎఫ్డీసీఐ ఎక్స్ లాక్మే ఫ్యాషన్ వీక్లో, ఫ్రెంచ్ డిజైనర్ మోస్సీ ట్రారే ఖాదీ డిజైన్ని ప్రదర్శించి అందర్ని విస్మయానికి గురిచేశాడు. ఇక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా పేరుగాంచిన సబ్యసాచి ముఖర్జీకి బ్రైడల్ డిజైనర్ మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఆయన ఎన్ని రకాలఫ్యాబ్రిక్లతో డిజైన్ చేసినా.. ఖాదీ సరిసాటి రాదన్నారు. దీనికి మించిన విలాసవంతమైన వస్త్రం ఇంకొటి ఉండదు అంటూ ఖాదీపై తనకున్నా ఆకాశమంతా అభిమానాన్ని చాటుకునన్నారు. ప్రస్తుతం సామాజికి కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు పర్యావరణ స్ప్రుహతో గాంధీ చూపిన దారిపై దృష్టి సారించి..ఖాదీకి పెద్ద పీటవేశారు. ఎందుకంటే..ఖాదీకి పరిమిత విద్యుత్ సరిపోతుంది. అంతేగాదు ఒక మీటరు ఖాదీకి మూడు లీటర్ల నీరు చాలు. అదే మిల్లులో ఉత్పత్తి అయ్యే బట్టకు 55 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అలా స్వతంత్ర పోరాటానికి చిహ్నమైన ఖాదీ ఫ్యాషన్ పరిశ్రమలో తన దైన ముద్రవేసి అందరికీ చేరువయ్యింది. అంతేగాదు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ప్రకారం, 2013-14 ఏడాదిలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తి ₹811.08 కోట్లు అయితే, 2023-24లో అది ₹3,206 కోట్లకు చేరుకుంది. ఇక 2022-23 ఏడాదికల్లా ఖాదీ వస్త్రాల ఉత్పత్తి ₹2,915.83 కోట్లుగా ఉండటం విశేషం.(చదవండి: బాపూ సమరం తెరపై చూపుదాం) -
Fashion: లైట్ కలర్స్తో.. లగ్జరీ లుక్!
తమ క్రియేటివ్ డిజైన్స్తో ఇతరులను అందంగా చూపే ఫ్యాషన్ డిజైనర్లు తమ కోసం వార్డ్ రోబ్ను ఎంత ఘనంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ విషయమై హైదరాబాద్లో మోడల్స్కి, ఫ్యాషన్ షోల కోసం డిజైన్స్ క్రియేట్ చేసే హేమంత్ సిరి ‘లెస్ ఈజ్ క్లాసీ’ అంటూ సింపుల్గా ఉండే తన వార్డ్ రోబ్ను పరిచయం చేస్తున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి చేనేతలు అంటే బాగా ఇష్టం ఉండేది. దీంతో మా అమ్మ, అమ్మమ్మల చీరలను నాకు అనువుగా డిజైన్ చేసుకునేదాన్ని. నేను డిజైన్ చేసిన దుస్తులను వేసుకున్నవారు అందంగా కనిపించాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. అయితే, నన్ను నేను కూడా బెస్ట్గా చూసుకోవాలి. నా విషయానికి వచ్చేసరికి కొన్ని ఎక్స్పర్మెంట్స్తో ΄ాటు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాను. మోడల్స్కి, ఫ్యాషన్ షోస్ కోసం డిజైన్ చేయడంలో ఫ్యాబ్రిక్, కలర్స్ మీద ప్రత్యేక దృష్టి పెడతాను. నాకోసం అయితే ఇండోవెస్ట్రన్ లుక్ ఉండేలా చూసుకుంటాను. కొంచెం ్ర΄÷ఫెషనల్గా ఉండాలి అనుకుంటే హ్యాండ్లూమ్ శారీస్ ఎంచుకుంటాను.లెస్ ఈజ్ క్లాసీ..ఏదైనా ఈవెంట్కి వెళ్లాలి అనుకుంటే ముందు నన్ను నేను తెలుపు, క్రీమ్ కలర్ డ్రెస్లో ఊహించుకుంటాను. అంతేకాదు, ఆర్గానిక్ కలర్స్, ఆర్గానిక్ ఫ్యాబిక్స్ర్తో సింపుల్గా ఫార్మల్ లుక్ని ఇష్టపడతాను. హెవీ శారీస్ అయినా సరే సింపుల్గా ఉండే బ్లౌజ్నే ఉపయోగిస్తుంటాను. లెస్ ఈజ్ క్లాసీ అనిపించేలా ఉంటాను.లగ్జరీ కలర్స్..పేస్టల్ కలర్స్లో లైట్ క్రీమ్, పింక్, గోల్డ్.. ఇష్టపడతాను. ఈ రంగులు ఒక లగ్జరీ లుక్తో ఆకట్టుకుంటాయి. క్రీమ్ లేదా ఐవరీ అంటేనే లగ్జరీ కలర్స్. లైట్ బ్లూ, లైట్ గ్రీన్.. వంటివి డే ఫంక్షన్స్కి, లైట్ సిల్వర్, లైట్ క్రీమ్ డ్రెస్సులు, శారీస్ నైట్ ఈవెంట్స్కి వాడతాను.ప్రయాణాల్లో సౌకర్యం..ఖ΄్తాన్స్ ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. పలాజోలు, జీన్స్, లైట్, ఫ్లోరల్ కలర్ నీ లెంగ్త్ ఫ్రాక్స్ని ఉపయోగిస్తాను.బొట్టుతో గుర్తింపు..నా పర్సనల్ స్టైలింగ్లో బొట్టు సిగ్నేచర్ అయిపోయింది. ముందు స్టికర్స్ వాడేదాన్ని. ఆర్గానిక్ కలర్స్పైన గ్రిప్ వచ్చాక కుంకుమ తయారు చేసుకుని, వాడుతున్నాను. వివాహవేడుకల వంటి ఎంత పెద్ద ఈవెంట్ అయినా సింపుల్ జ్యువెలరీనే ఉపయోగిస్తాను’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!
పర్నియా కురేశీ.. పరిచయానికి చాలా విశేషణాలనే జోడించాలి. ఆమె కూచిపూడి డాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్, యాక్ట్రెస్, ఆథర్ ఎట్సెట్రా! వివరాలు కావాలంటే కథనంలోకి వెళ్లాల్సిందే! పర్నియా పుట్టింది పాకిస్తాన్లో. పెరిగింది ఢిల్లీలో. చదువుకుంది అమెరికాలో. తండ్రి.. మోయిన్ అఖ్తర్ కురేశీ భారతీయుడు. బిజినెస్మన్. తల్లి.. నస్రీన్ కురేశీ పాకిస్తానీ నటి. తండ్రి నుంచి వ్యాపార మెలకువలు, తల్లి నుంచి కళలు వారసత్వంగా అందుకుంది. నాలుగో ఏటనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ మొదలుపెట్టింది. తొలి గురువు తల్లే. తర్వాత రాజా–రాధారెడ్డి దగ్గర కూచిపూడి నేర్చుకుంది. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ‘లా’ చదివింది. లా చదివేటప్పుడే ఫ్యాషన్ రంగంలో ఇంటర్న్గా చేరింది. ఆ క్రమంలోనే ఫ్యాషన్ మీద ఆసక్తి పెరిగింది. అకడమిక్స్ కంటే తన క్రియేటివిటీకే ఎక్కువ మార్కులు పడసాగాయి. దాంతో ఫ్యాషన్నే సీరియస్గా తీసుకుని హార్పర్స్ బజార్, ఎల్ లాంటి ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. తర్వాత ఫ్రెంచ్ డిజైనర్ క్యాథరిన్ మలండ్రీనో దగ్గర పీఆర్ ఇంటర్న్గా చేరింది. ఇవన్నీ ఆమెలోని ఫ్యాషన్సెన్స్కి మెరుగులు దిద్దాయి. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఆమె ఎక్కడా తన డాన్స్ని నిర్లక్ష్యం చేయలేదు. సాధన చేస్తూనే ఉంది. ప్రదర్శనలిస్తూనే ఉంది. ఇండియా తిరిగిరాగానే.. ఫ్యాషన్ రంగంలో ఆమెకు ఇబ్బడిముబ్బడి అవకాశాలు కనిపించాయి. ఆ దిశగా అడుగులు కదిపేలోపే సోనమ్ కపూర్ హీరోయిన్గా నటించిన ‘ఆయశా’కు కాస్ట్యూమ్ డిజైనర్గా చాన్స్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఇక్కడ ఆన్లైన్లో డిజైనర్ వేర్ అందుబాటులో లేదని గ్రహించింది. అందుకే ఆ మూవీ అయిపోగానే, 2012లో Pernia's Pop-Up Shop పేరుతో ఆన్లైన్ స్టోర్ని లాంచ్ చేసింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ డిజైనర్స్ డిజైన్ చేసిన దుస్తులు లభ్యమవుతాయి. అంట్రప్రెన్యూర్గా మారినా డిజైనింగ్ను ఆపలేదు. ఈ దేశ సంస్కృతి, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్నివర్గాల మహిళలకు అన్ని రకాల దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. తన స్టయిలింగ్ని కోరుకునే వాళ్లకోసం ‘పర్నియా కురేశీ’ లేబుల్ని, ఇండియన్, ఫ్యూజన్ తరహా కావాలనుకునేవారికి ‘"Amaira' ’ లేబుల్ని స్టార్ట్ చేసింది. కిడ్స్ వేర్, జ్యూల్రీ డిజైనింగ్లోకీ అడుగుపెట్టింది. పర్సనల్ స్టయిలిస్ట్గా కాకుండా బాలీవుడ్ ఈవెంట్స్, రెడ్ కార్పెట్ వాక్ కోసం కోరిన సెలబ్రిటీలకు మాత్రం స్టయిలింగ్ చేస్తోంది.సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల ఫ్యాషన్ షోల్లో మోడల్గా ర్యాంప్ మీద మెరుస్తోంది. ‘జాన్ నిసార్’ అనే చిత్రంలోనూ నటించింది. ఫ్యాషన్, స్టయిలింగ్కి సంబంధించిన వివరాలు, సలహాలు, సూచనలతో ‘"Be Stylish, with Pernia Qureshi'’ పేరుతో పుస్తకాన్నీ రాసింది. ‘మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్తో క్లాసికల్ డాన్సర్నయ్యాను. నాన్న ఇన్స్పిరేషన్తో అంట్రప్రెన్యూర్నయ్యాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్నయ్యాను. ఉత్సుకతతో పుస్తకం రాశాను. చాన్స్ రావడంతో యాక్ట్రెస్నయ్యాను. లైఫ్లో నేను పోషించిన, పోషిస్తున్న ఈ రోల్స్ అన్నిటిలోకి నాకు క్లాసికల్ డాన్సర్ రోల్ అంటేనే ఇష్టం. డాన్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేను. డాన్స్ ప్రాక్టీస్ లేని షెడ్యూల్ ఉండదు. సక్సెస్ అంటే నా దృష్టిలో చాలెంజెస్ని హ్యాండిల్ చేయడమే! దీనికి ఓర్పు, నేర్పులే టూల్స్!’ అంటుంది పర్నియా కురేశీ. (చదవండి: శ్లోకా మెహతా స్టైలిష్ లెహంగాలు రూపొందించిందే ఆ మహిళే..!) -
జస్ట్ రెండు కుట్టు మిషన్లతో.. ఏకంగా వెయ్యి కోట్ల సామ్రాజ్యం!
మనం మనీష్ మల్హోత్రా, రీతూ కుమార్, సబ్యసాచి ముఖర్జీ, అబు జానీ సందీప్ ఖోస్లా, తరుణ్ తహిలియానీ వంటి అగ్రశేణి ఫ్యాషన్ డిజైనర్ల గురించి విన్నాం. వారికంటే ముందే ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలి అత్యంత ధనిక ఫ్యాషన్ డిజైనర్ పేరుగాంచిన మహిళ గురించి ఇంతవరకు వినలేదు. జస్ట్ రెండు కుట్టు మిషన్లతో ఏకంగా వెయ్యి కోట్ల ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని సృష్టించి అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్గా అవతరించింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 270 స్టోర్లతో వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఆమెను విజయం అంత తేలిగ్గా వరించలేదు. ఎన్నో అవమానాలు, చీత్కారాలు నడుమ నిరాశ నిస్ప్రుహలతో యుద్ధం చేసి విజయతీరాలను అందుకుంది. ఎవరామె అంటే..ఆమె పేరే ది రైజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే. ఆమె అక్టోబర్ 3, 1963న ముంబైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి పుష్పా సావ్లానీకి కుట్టు పనిలో అపారమైన ప్రతిభ ఉంది. అదే ఆమెకు సంక్రమించి..ఫ్యాషన్ డిజైన్ పట్ల మక్కువ ఏర్పరుచుకుంది. ఈ రంగంలో తక్కువ భారతీయ రిటైల్ బ్రాండ్లు ఉన్నాయని గ్రహించి..సరసమైన ధరల్లో లభించేలా డిజైనర్వేర్లను రూపొందించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తండ్రి నుంచి కొద్ది మొత్తం రుణం తీసుకుని తన సోదరితో కలిసి పాశ్చాత్య శైలిలో ఉండే దుస్తుల మాదిరిగా డిజైన్ చేయడం ప్రారంభించారు. వాటిని ప్రధాన బ్రాండ్లకు విక్రయించడం ప్రారంభించారు. అయితే ఆ క్రమంలో ఎన్నో మాల్స్లోని బ్రాండ్ల నుంచి గట్టి స్థాయిలో తిరస్కరణలు ఎదురయ్యాయి. చాలా ఎదురదెబ్బలు తినాల్సి వచ్చింది. అయినా సరే తగ్గేదే లే అంటూ ఆత్మవిశ్వాసంతో సాగింది. ఇక లాభం లేదని తానే అనితా డోంగ్రే అని తన పేరుతో స్వంత లేబుల్ ప్రారంభించింది. ఇది అనాధికాలంలోనే ప్రసిద్ధ బ్రాండ్గా మారింది. 2015లో ఏఎన్డీ పేరుతో డిజైన్లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత తన కంపెనీని హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా రీబ్రాండ్ చేసింది. అలా ఏఎన్డీ.. గ్లోబల్ దేశీ, అనితా డోంగ్రే బ్రైడల్ కోచర్, అనితా డోంగ్రే గ్రాస్రూట్, అనితా డోంగ్రే పింక్ సిటీ తోసహా పలు విజవంతమైన వెంచర్లతో భారతదేశంపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ఆమె ప్రస్థానం సాగింది. అంతేగాక నీతా అంబానీ, రాధిక మర్చంట్, ఇషా అంబానీ, శ్లోకా అంబానీ, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే వంటి బాలీవుడ్ అగ్ర తారలకు డిజైనర్గా మారింది. ఆమె వ్యక్తిగత జీవితం వచ్చేటప్పటికీ..60 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ అనితా వ్యాపారవేత్త ప్రవీణ్ డోండ్రేని వివాహం చేసుకున్నారు. వారికి యష్ డోంగ్రే అనే కుమారుడు ఉన్నాడు. అతడు బెనైషా ఖరాన్ని వివాహం చేసుకున్నాడు. ఆమె కుటుంబ నేపథ్యం గురించి పెద్దగా మీడియాకి తెలియదు ఎందుకంటే ఆమె కుటుంబం హంగు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంది.సంపద పరంగా..భారతదేశంలో ఆమె కంపెనీకి సంబంధించిన 270కి పైగా స్టోర్లు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆమె రిటైల్ టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లకు చేరుకుందని అనితా డోంగ్రే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే ఆమె ఆదాయం ఇప్పుడు వెయ్యి కోట్లకు మించవ్చని అంచనా. అలాగే ఆమెను ఫోర్బ్స్ భారతదేశంలో అత్యంత ధనిక మహిళా ఫ్యాషన్ డిజైనర్గా పేర్కొంది. (చదవండి: 80 ఏళ్ల స్విమ్మర్! ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయం..కానీ..!) -
అన్లైన్ ఫ్యాషన్.. సేవల ఓషన్
శ్రీనగర్కాలనీలో నివసించే దివ్య గచ్చిబౌలిలోని బొటిక్లో డ్రెస్ స్టిచ్చింగ్ కి ఇచ్చారు.. స్టిచ్చింగ్ పూర్తయ్యాక వాళ్ల ఇంటికి ర్యాపిడో ద్వారా పంపారు. తీరా ఇంటికి వచ్చిన డ్రెస్ ధరించి చూస్తే కొన్ని ఆల్టరేషన్స్ అవసరం అని అర్థమైంది.. బొటిక్ వారిని సంప్రదిస్తే.. తమకు ఆ డ్రెస్ని ఇస్తే ఆల్టరేషన్స్ చేసి మరో రెండు రోజుల్లో పంపిస్తామన్నారు. కానీ దివ్య అదే రోజు ఫంక్షన్కు వెళ్లాల్సి ఉంది.. మరేం చేయాలి? ‘ఇలాంటి సమస్య మాతో రాదు మేం డ్రెస్ని మాత్రమే ఇంటికి పంపం. టైలర్, కుట్టుమిషన్తో సహా పంపిస్తాం. ఏవైనా మార్పు చేర్పులు ఉంటే క్షణాల్లో చేసేసి ఇస్తాం’ అంటోంది ఓ ఆన్లైన్ స్టిచ్చింగ్ సంస్థ. అమెరికాలో ఉంటున్న నగరవాసికి సిటీలోని ఓ ప్రముఖ వస్త్ర షోరూమ్లో ఓ చీర నచ్చింది. అయితే అది కొని తన దగ్గరకు పంపించినా, ఆ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్, సీకో వర్క్ వగైరాల కోసం అమెరికాలో వెదకడానికి సమయంతో పాటు వ్యయం కూడా ఎక్కువే..! మరేం చేయాలి? ‘అంత కష్టం మీకక్కర్లేదు. ఆ షోరూమ్లో మీరు కొన్న చీర నేరుగా మాకే వస్తుంది. దానికి అవసరమైన బ్లౌజ్, వర్క్స్ పూర్తి చేసి భద్రంగా అమెరికా చేర్చే బాధ్యత మాదే’ అంటోంది మరో స్టిచ్చింగ్ సంస్థ. ఒకటా రెండా.. దుస్తులు/ఫ్యాబ్రిక్స్ కొనడం, వాటిని కుట్టించడం, అంతేనా.. అందంగా చీర కట్టించడం.. దాకా కాదు ఏ సేవాకు ఆన్లైన్లో అసాధ్యం అంటున్నాయి నగరంలో పుట్టుకొచి్చన పలు ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్స్. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆన్లైన్ టైలరింగ్ సేవలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విజృంభిస్తూ.. అనూహ్యమైన రీతిలో దూసుకుపోతున్నాయి. ఈ తరహా ఆన్లైన్ విప్లవాలకు సారథ్యం వహిస్తున్న సంస్థల్లో అత్యధిక భాగం మహిళల ఆధ్వర్యంలోనే ఉండడం విశేషం. యాప్లోని మార్కెట్ ప్లేస్ ద్వారా.. ‘పలు చోట్ల పరిమిత విస్తీర్ణంలో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ ఔట్లెట్స్ ఏర్పాటు చేశాం. వీటిలో ఒక డిజైనర్, ఒక కుట్టుమిషన్ వగైరాలు అందుబాటులోకి తెచ్చాం. కస్టమర్లు నేరుగా సంప్రదింపులు చేసి అక్కడే ఆర్డర్స్ ఇచ్చి వెళ్లొచ్చు. చిన్న చిన్న ఆల్టరేషన్స్ కూడా చేయించుకోవచ్చు.. ఇలాంటివెన్నో కస్టమైజ్డ్ డ్రెస్సింగ్కు జత చేస్తున్నాం. అలాగే కస్టమర్స్ మా యాప్లోని మార్కెట్ ప్లేస్ ద్వారా నగరంలోని పలు షోరూమ్స్ నుంచి కొనుగోలు చేసిన చీరలు, డ్రెస్మెటీరియల్స్ మాకు చేరిపోతాయి. వాటికి అవసరమైన హంగులన్నీ జతచేసి తిరిగి కస్టమర్కు చేరవేసే బాధ్యత మాది. చీరకు బ్లౌజ్ వగైరాలు కుట్టడం మాత్రమే కాదు, అవసరమైతే చీర కట్టడం కూడా మా సిబ్బందే చేస్తారు.. విభిన్న రకాల శారీ డ్రేపింగ్స్ సైతం చేస్తారు. అంటూ నగరవాసులకు తాము అందిస్తున్న సేవల జాబితాను ‘సాక్షి’కి వివరించారు సుషి్మత. నగరవ్యాప్తంగా దాదాపుగా 80కిపైగా డిజైనర్లు, పదుల సంఖ్యలో షోరూమ్స్తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారామె. నగరంలో మాత్రమే కాకుండా బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లోనూ క్లౌడ్ టైలర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సాఫ్ట్వేర్ నుంచి డిజైనర్ వేర్ దాకా.. ‘ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఏ సంస్థ లేదండీ. అలా చూస్తే ఇప్పుడు అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే’ అంటారు సుషి్మత. మంచి ఆదాయాన్నిచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని, అంతకు మించిన ఆత్మసంతృప్తిని ఆశిస్తూ.. ఓ రెండేళ్ల క్రితం నగరంలో క్లౌడ్ టైలర్ పేరిట టైలరింగ్ సేవల్ని ప్రారంభించా. ఇంటి దగ్గరకే వచ్చి కొలతలు తీసుకుని ఫ్యాబ్రిక్స్ తీసుకెళ్లి, స్టిచి్చంగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికే తెచ్చి ఇవ్వడం అనే ఏకైక సేవతో వేసిన తొలి అడుగుకే అద్భుతమైన స్పందన వచి్చంది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో మా సేవల్ని కూడా విస్తరించాం. – సుష్మిత లక్కాకుల, ఫ్యాషన్ డిజైనర్కుట్టుమిషన్తో సహా పంపిస్తాం.. విదేశాల్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేసిన అనుభవం ఉన్న రుహిసుల్తానా.. నగరానికి వచ్చి ఆన్లైన్ టైలరింగ్ సేవల్ని అర్బన్ సిలాయీ పేరుతో ప్రారంభించారు. అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యారు.. పిక్, స్టిచ్, డెలివర్ అనే కాన్సెప్్టతో ఆమె ప్రారంభించిన ఈ సంస్థ పూర్తిగా ఆన్లైన్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ‘ఇప్పుడీ రంగంలో మరికొందరు కూడా ఉన్నారు. అయితే చెప్పిన సమయానికి ఏ మాత్రం తేడా రాకుండా ఖచ్చితత్వంతో ఇచ్చే డెలివరీలో మాకు సాటి లేదు. అదే విధంగా ఇంటికి డ్రెస్ మాత్రమే కాదు ఆల్టరేషన్స్ అవసరమైతే కస్టమర్ కళ్ల ముందే దాన్ని కంప్లీట్ చేయడానికి ఓ మాస్టర్ని కుట్టుమిషన్తో సహా పంపిస్తాం’ అంటూ చెప్పారు. బంజారాహిల్స్లో ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నా.. విదేశాల్లో సైతం మాకు కస్టమర్స్ ఉన్నారు. వారికి షిప్పింగ్ ద్వారా సేవలు అందిస్తున్నాం. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనున్నాం. – రుహిసుల్తానా, అర్బన్ సిలాయీ నిర్వాహకురాలు -
Lakshmi Lehr: అదీ స్టయిల్ అంటే! సింపుల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట!
అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతాలను క్రియేట్ చేసేవాళ్లను నేర్పరులు అంటారు. ఆ కేటగరీలో లక్ష్మీ లెహర్ను చేర్చొచ్చు. పర్ఫెక్షన్ కోసం ప్రపంచంలో ఉన్న ద బెస్ట్ని ఆర్డర్ చేయదు. కళ్ల ముందున్న వాటితోనే ప్రపంచానికి ద బెస్ట్ని చూపిస్తుంది. అందుకే ఆమె సెలబ్రిటీ స్టయిలిస్ట్ అయింది.లక్ష్మీ ముంబై నివాసి. ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాడ్యుయేషన్ తర్వాత పలు ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. ప్రాక్టికల్ ఎక్స్పీరియెన్స్ కోసం ప్రముఖ సెలబ్రిటీ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ స్టయిలింగ్ కంపెనీ ‘స్టయిల్ సెల్’లో చేరింది. ఆమె సృజనకు, పనితీరుకు అనాయితా ఇంప్రెస్ అయింది. ఆమె స్థాయి స్టార్ స్టయిలింగ్ అని గ్రహించింది. లక్ష్మీని సెలబ్రిటీ సర్కిల్కి పరిచయం చేసింది. ముందుగా.. కరీనా కపూర్ ఎయిర్ పోర్ట్ అపియరెన్స్కి స్టయిలింగ్ చేసింది లక్ష్మీ. ఆ కూల్ లుక్స్కి.. కరీనాను క్యాప్చర్ చేయడానికి ఫాలో అయిన పాపరాట్సీ ఫిదా అయిపోయారు.కరీనా ఫ్యాన్స్ అయితే క్రేజీ.. చెప్పక్కర్లేదు. ఆ స్టయిల్ని కరీనా కూడా కంఫర్ట్గా ఫీలై.. స్పెషల్ అకేషన్స్కి ఆమెను స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకుంది. లక్ష్మీ స్టయిలింగ్ని కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, శ్రద్ధా కపూర్, రశ్మికా మందన్నా, సమంత, పూజా హెగ్డేలూ కోరుకున్నారు.ఆ సెలబ్రిటీల క్యాజువల్ లుక్ నుంచి రెడ్ కార్పెట్ వాక్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎండార్స్మెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్లు.. అంతెందుకు వాళ్లు గడపదాటాలంటే చాలు లక్ష్మీ వాళ్లను స్టయిలింగ్ చేయాల్సిందే! అంత డిమాండ్లో ఉంది ఆమె. సెలబ్రిటీ ఒంటి తీరు, బాడీ లాంగ్వేజ్ని బట్టి స్టయిలింగ్ చేస్తుంది లక్ష్మీ. సింపుల్ చేంజెస్తోనే వైబ్రెంట్గా కనిపించేలా వాళ్లను మారుస్తుంది. ఫిమేల్ సెలబ్రిటీలే కాదు మేల్ సెలబ్రిటీలూ ఆమెకు ఫ్యాన్సే! వాళ్లలో రితిక్ రోషన్ ముందుంటాడు. తర్వాత సైఫ్ అలీ ఖాన్. ఆ ఇద్దరికీ లక్ష్మీ స్టయిలింగ్ చేస్తోంది.స్టయిల్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్! స్టయిలింగ్ కోసం ప్రపంచ బ్రాండ్స్ అన్నిటినీ వార్డ్రోబ్లో నింపక్కర్లేదు. ఉన్న రెండు జతలతో కూడా స్టయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మనకు ఏది నప్పుతుంది.. ఏది సౌకర్యంగా ఉంటుందనే స్పృహ ఉండాలి. అంతేకాదు మనమున్న చోటునూ దృష్టిలో పెట్టుకోవాలి. నలుగురిలో కలసిపోయినట్టు ఉంటూనే మన ప్రత్యేకతతో మెరిసిపోవాలి. అదీ స్టయిల్ అంటే! సింపుల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట. నేను స్టయిలింగ్ చేసిన సెలబ్రిటీల్లో నాకు.. కరీనా, జాక్వెలిన్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్లు అంటే చాలా ఇష్టం! – లక్ష్మీ లెహర్ఇవి చదవండి: ధైర్యసాహసాలు అనగానే మరో ఆలోచనే.. చమేలీ.. ఓ ధీశాలి! -
Kalpana Shah: 'The Whole 9 Yards' దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది..
చీర.. సంప్రదాయ కట్టే! కానీ ఆధునికంగానూ ఆకట్టుకుంటోంది! క్యాజువల్, కార్పొరేట్ నుంచి రెడ్ కార్పెట్ వాక్, స్పెషల్ సెలబ్రేషన్స్ దాకా సందర్భానికి తగ్గ కట్టుతో ‘శారీ’ వెరీ కన్వీనియెంట్ కట్టుగా మారింది! అలా ఆ ఆరు గజాల అంబరాన్ని పాపులర్ చేసిన క్రెడిట్ శారీ డ్రేపర్స్కే దక్కుతుంది! ఆ లిస్ట్లో కల్పన షాహ్.. ఫస్ట్ పర్సన్!కల్పనా షాహ్ ముంబై వాసి. ఆమెకిప్పుడు 75 ఏళ్లు. 1980ల్లో బ్యుటీషియన్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఒకసారి తన కమ్యూనిటీలో జరిగిన ఓ ఫంక్షన్కి ఆమె హాజరైంది. అప్పుడు ఆ హోస్ట్కి చీర కట్టడంలో సాయపడింది. ఆ కట్టు ఆ వేడుకకు హాజరైన ఆడవాళ్లందరికీ నచ్చి కల్పనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పటి నుంచి ఆమె చీర కట్టునూ తన ప్రొఫైల్లో చేర్చింది. అలా 1980ల్లోనే ‘శారీ డ్రేపర్’ అనే ప్రొఫెషన్ని క్రియేట్ చేసింది కల్పన. అది మొదలు ఆమె పేరు సామాన్యుల నుంచి సెలబ్రిటీల స్థాయికి చేరింది. ముంబై ఫ్యాషన్ ప్రపంచమూ కల్పన గురించి విన్నది.ప్రముఖ డిజైనర్స్ అంతా తమ ఫ్యాషన్ షోలకు ఆమెను ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఘాఘ్రా నుంచి దుపట్టాతో డిజైన్ అయిన ప్రతి డిజైనర్ వేర్కి .. మోడల్స్ని ముస్తాబు చేయాల్సిందిగా కోరసాగారు. ఆ వర్క్ కల్పనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చీర, చున్నీలను అందంగానే కాదు సౌకర్యంగానూ ఎన్నిరకాలుగా చుట్టొచ్చో.. ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసి మరీ ఎక్స్పర్టీజ్ తెచ్చుకుంది. దాంతో ఆమె నైపుణ్యం ఫ్యాషన్ రంగంలోనే కాదు బాలీవుడ్లో, ఇండస్ట్రియలిస్ట్ల క్లోజ్ ఈవెంట్లలోనూ కనిపించి.. అతి తక్కువ కాలంలోనే ఆమెను సెలబ్రిటీ శారీ డ్రేపర్గా మార్చింది.ఒకప్పటి టాప్ మోడల్ మధు సప్రే నుంచి బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ వహీదా రహమాన్, అంట్రప్రెన్యూర్స్ నీతా అంబానీ, శోభనా కామినేని, నేటితరం బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోణ్, ఆలియా, కరీనా కపూర్, రశ్మికా మందన్నా, యామీ గౌతమ్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. వాళ్లందరికీ కల్పనా ఫేవరెట్ శారీ డ్రేపర్. అంతెందుకు మొన్న అంబానీ ఇంట జరిగిన అనంత్, రాధికల పెళ్లి వేడుకల్లో కూడా కల్పన పాల్గొంది.. రాధికా మర్చంట్ ఆత్మీయంగా పిలుచుకున్న శారీ డ్రేపర్గా. ఒకట్రెండు వేడుకల్లో రాధికా.. కల్పనచేతే చీర కట్టించుకుని మురిసిపోయింది.ఆథర్గా.. చీర కట్టును ప్రమోట్ చేయడానికి కల్పన 2012లో ’The Whole 9 Yards’ పేరుతో ఒక పుస్తకం రాసింది. చీర కట్టుకు సంబంధించి దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది. అంతేకాదు దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కల్పన.. 24 గంటల మారథాన్ శారీ డ్రేపింగ్తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 226 రకాల చీర కట్టులను ప్రదర్శించింది. ఆమె మొత్తం 300 రకాలుగా చీరను కట్టగలదు. శారీ డ్రేపింగ్లో ‘కల్పన కట్టు’ అనే ప్రత్యేకతను సాధించి.. ఫ్యాషన్ వరల్డ్లో చీరకు సెలబ్రిటీ హోదా కల్పించిన కల్పన షాహ్.. నేటికీ శారీ డ్రేపింగ్ మీద శిక్షణా తరగతులు, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ చురుగ్గా ఉంటోంది! -
Riya Kapoor: ఖూబ్సూరత్! ఆమె ప్రతిభకు విశేషణం జోడించాలంటే..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల జామ్నగర్ ప్రీవెడింగ్ సెలబ్రేషన్ గుర్తుండే ఉంటుంది! ఆ వేడుకలో కళ్లు తిప్పుకోనివ్వని ముస్తాబుతో మెరిసిపోయింది పెళ్లికూతురు. అంతేకాదు ఆ ఈవెంట్కి హాజరైన ఆలియా భట్, కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్, నతాశా పూనావాలాలూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. రాధికా మర్చంట్ సహా వాళ్లందరినీ అంత అందంగా తయారుచేసిన స్టయిలిస్ట్ రియా కపూర్! ఆమె నైపుణ్యానికి ఆ సంబరాన్ని మించిన ఉదాహరణ లేదేమో! ఆమె ప్రతిభకు విశేషణం జోడించాలంటే.. ‘గివ్ ఏ గర్ల్ ద రైట్ షూస్ అండ్ షి కెన్ కాంకర్ ద వరల్డ్!’ అని హాలీవుడ్ స్టార్ మార్లిన్ మాన్రో మాట. దాన్ని నిజం చేసి చూపించింది రియా కపూర్.. ప్రొడ్యూసర్, సెలబ్రిటీ స్టయిలిస్ట్ అండ్ ఆంట్రప్రెన్యూర్గా.. అని చెప్పాలి!ఇండియాలో ఫ్యాషన్ ఇండస్ట్రీ.. కాలు మోపలేనంత మంది ఉద్దండులతో నిండిపోయుంది. అలాంటి రంగంలోకి ‘డ్రమాటిక్ లిటరేచర్’ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో.. ఫ్యాషన్ మీద ఆసక్తి అనే ఒకే ఒక్క క్వాలిఫికేషన్తో తల దూర్చి.. తన స్టయిల్ను ప్రదర్శించగలిగేంత స్పేస్.. గుర్తింపు పొందగలిగేంత ప్రత్యేకతను సాధించింది రియా కపూర్! ఈ మొత్తం ప్రయాణంలో ఆమెక్కడా తన తండ్రి పరపతిని ఉపయోగించుకోలేదు. తన శక్తినే నమ్ముకుంది! ఇంతకీ వాళ్ల నాన్న ఎవరంటే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.ఆయనకు రియా రెండో సంతానం. నటి సోనమ్ కపూర్కి చెల్లి. వాళ్లమ్మ సునీతా కపూర్ జ్యూలరీ డిజైనర్. ‘మా చిన్నప్పుడు మా అమ్మ, పిన్ని ఇద్దరూ పెయింటింగ్ వేస్తుంటే అదేంటో నాకు తెలిసేది కాదు.. గోడల మీద పెయింట్ వేసినట్టే అనిపించేది. నాకు ఊహ తెలిశాక ఒకసారి మా అమ్మ పెయింట్ చేసిన చిన్న ఫ్రేమ్లో ఒక ఇంటర్నేషనల్ జ్యూలరీ బ్రాండ్ లాకెట్ను చూశాను. అప్పుడు తెలిసింది మా అమ్మ పెయింటింగ్ వాల్యూ! అప్పటి నుంచి నాకు డిజైనింగ్.. ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది’ అని చెబుతుంది తన స్టయిలింగ్ పునాది ఎక్కడ పడిందో గుర్తుచేసుకుంటూ! అయినా అకడెమిక్గా ఆర్ట్స్ని ఎంచుకుంది. న్యూయార్క్లో ‘డ్రమటిక్ లిటరేచర్’ చదివింది.దానికి తగ్గట్టే తొలుత నిర్మాతగా మారింది ‘ఆయశా’ చిత్రంతో! తర్వాత ఖూబ్సూరత్, వీరే ది వెడింగ్, థాంక్యూ ఫర్ కమింగ్, క్రూ సినిమాలనూ ప్రొడ్యూస్ చేసింది. ఖూబ్సూరత్, వీరే ది వెడింగ్ మూవీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒకరకంగా ఆ సినిమాలతోనే ఆమె స్టయిలింగ్ కెరీర్ కూడా మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ‘ఆయశా’ స్టయిలిస్ట్ అయిన పర్నియా కురేశీకి రియా అసిస్టెంట్గా వ్యవహరించింది. ఆ లెక్కన ఆమె తొలి క్లయింట్ తన సోదరి సోనమ్ కపూరే! రియా పూర్తి స్టయిలిస్ట్గా మారింది మాత్రం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్కి సోనమ్ను తీర్చిదిద్ది! అప్పటి నుంచి అక్కకు పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ అయింది.తన బ్యానర్లోని సినిమాల కథానాయికలకూ తనే స్టయిలింగ్ చేస్తోంది. అలా కరీనా కపూర్, భూమి పెడ్నేకర్, టబు, కృతి సనన్ మొదలైన హీరోయిన్లకూ స్టయిలింగ్ చేసింది రియా! ప్రముఖ స్టయిలిస్ట్లు అభిలాషా దేవ్నానీ, తాన్యా ఘావ్రీలతోనూ పనిచేసింది. అక్కతో కలసి ‘రిసోన్’అనే ఫ్యాషన్ బ్రాండ్నూ స్టార్ట్ చేసింది. అంతేకాదు వీగన్ ఫుట్వేర్ బ్రాండ్ ‘ద సీఐఏ స్టోర్’తోనూ కలసి ప్లస్ సైజ్ మహిళల కోసం ‘ఆర్కే’ పేరుతో షూస్ని డిజైన్ చేసింది. ఇలా అన్ని రంగాల్లో తన మార్క్ చూపిస్తూ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది రియా కపూర్!కొత్తగా ఆలోచించడం.. కొత్తగా చేయడం.. ఆ క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం. నా జర్నీని మోటివేట్ చేసేది అదే! స్టయిల్ అంటే సెలబ్రేటింగ్ ద మూడ్. మన కట్టుబొట్టు ద్వారా మన మూడ్ని అవతలి వాళ్లకు కమ్యూనికేట్ చేయడం! ఆత్మను పట్టుకోవడం! ఇంకా చెప్పాలంటే కంఫర్ట్! ఫ్యూచర్ అంతా క్రూయల్టీ ఫ్రీ ఫ్యాషనే! అంటే వీగన్ ఫ్యాషన్! ఈ రంగంలోకి వచ్చే వాళ్లెవరైనా ఫలితాన్ని ఆశించి కాదు.. ఆ ప్రయాణాన్ని నమ్మి రావాలి! – రియా కపూర్ -
ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మ వామికా గబ్బి.. ఇండియా కౌచర్ వీక్ ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
బ్రైడల్ కలెక్షన్స్ తో గ్రాండ్ గా ఎక్స్ ఫో...సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)
-
వయసు ఆపని పరుగు
సాధారణంగా 53 ఏళ్ల వయస్సులో ఉన్న ఫ్యాషన్ డిజైనర్ని మీ లక్ష్యాలేమిటి? అంటే.. ప్రపంచమంతా బొటిక్స్ తెరవడమో మరొకటో అంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మారథాన్స్ లను పూర్తి చేయడం అన్నారంటే అది డిజైనర్ నమ్రత జోషిపురా అయి ఉంటారు. అందుకే ఇప్పుడామె బాలీవుడ్ టాప్ డిజైనర్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ మారథాన్ రన్నర్ కూడా. ఇటీవల హైదరాబాద్లోని ఓ కార్యక్రమంలో తనను తాను ‘సిక్స్ స్టార్ ఫినిషర్‘ అని సగర్వంగా పరిచయం చేసుకున్న ఢిల్లీ డిజైనర్ నమ్రత సాక్షితో పంచుకున్న విశేషాలు...‘స్కూల్లో, కాలేజ్లో ఉండగా హాకీ ఆడేదాన్ని. బీకామ్ చేసినా సృజనాత్మక రంగంలోనే భవిష్యత్తు బాగుంటుందని ఫ్యాషన్ డిజైనింగ్లోకి వచ్చాను. ఢిల్లీ నిఫ్ట్లో కోర్సు చేస్తున్నపుడు నా టైమ్ పూర్తిగా దానికే కేటాయించాల్సి వచ్చేది. దాంతో ఫిట్నెస్, హాకీ అన్నీ అటకెక్కాయి. అయితే వాకర్స్కు బెస్ట్ సిటీ అయిన న్యూయార్క్లో ఉన్నప్పుడు సుదూరాలు నడవడం అలవాటై ఫ్యాషన్ రంగంలో బిజీగా ఉంటూనే మినీ మారథాన్ లో పాల్గొన్నా. ఆ క్రమంలోనే ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచంలోని 6 పెద్ద మారథాన్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా. ఢిల్లీ మారథాన్ తో మొదలుపెట్టి 2018లో లండన్, 2019లో చికాగో, 2021లో బోస్టన్ , 2022 బెర్లిన్ లో తాజాగా టోక్యో మారథాన్స్ పూర్తి చేశాను’ ఆగని పరుగు..‘వెర్టిగో, ఆస్తమా, పోస్ట్ మెనోపాజ్ సమస్యలు నన్ను బాధించేవి. రెండుసార్లు కోవిడ్తో బాధపడినప్పటికీ మారథాకు ట్రైనింగ్ షెడ్యూల్ను కోల్పోలేదు, అయితే ఢిల్లీలో కాలుష్యం వల్ల ఆరు బయట రన్ కష్టమైంది. ట్రెడ్మిల్పై 25–30 కిలోమీటర్లు పరిగెత్తడం కష్టతరమైన పని. ఇవి దృష్టిలో పెట్టుకుని శిక్షణలో మార్పులు చేస్తూ వచ్చిన నా కోచ్ నకుల్ బుట్టాకు థ్యాంక్స్ చె΄్పాలి’మహిళ... గుర్తించాలి తన కల...‘తన కప్పు ఖాళీగా ఉంచుకుని పక్కనవారి కప్పుని నిండేలా చేయడం అసాధ్యం. ఇంటికోసం మాత్రమే కాదు. తన పట్ల కూడా మహిళకు బాధ్యత ఉండాలి. శారీరక, మానసిక, భావోద్వేగపరమైన ఆరోగ్యాలు కా΄ాడుకుంటూ వ్యక్తిగత లక్ష్యాలు సాధించుకోవాలి’ఆగను... అలుపెరుగను...‘ఫ్యాషన్ రంగంలో కూడా మరింతగా విస్తరించాలి.. కొత్త స్టోర్స్ ్రపారంభించాలి. నా తదుపరి లక్ష్యం కొన్ని ట్రయల్ రన్నింగ్ ఈవెంట్లు. ఎంతకాలం వీలైతే అంత కాలం పరుగు తీస్తూనే ఉంటా’ అంటున్న నమ్రత తన కలను నెరవేర్చుకోవాలని కోరుకుందాం. – సత్యబాబు -
ఫ్యాషన్ ప్రపంచంలో.. తనదొక సైలెంట్ నేమ్!
రాహుల్ విజయ్.. ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సైలెంట్ నేమ్! అతని స్టయిలింగే కనిపిస్తుంటుంది గొప్ప గొప్ప ఈవెంట్లలో.. పెద్ద పెద్ద పార్టీల్లో! కంప్లీట్ డీటేయిలింగ్తో స్టయిల్ని క్రియేట్ చేస్తాడు క్లాసిక్గా! అందుకే ఏ రంగంలోని సెలబ్రిటీలకైనా అతను మోస్ట్ వాంటెడ్ స్టయిలిస్ట్!రాహుల్ విజయ్ పుట్టి, పెరిగింది ఢిల్లీలో. ఫ్యాషన్ డిజైనింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఎందరో గ్రాడ్యుయేట్స్లాగే అతనూ హార్పర్స్ బజార్లో ఫ్యాషన్ ఇంటర్న్గా చేరాడు. అయితే ఆరేళ్లలో ఫ్యాషన్ ఎడిటర్ స్థాయికి ఎదిగాడు. ఫ్యాషన్ రంగంలో ఎదగడానికి ఢిల్లీ కన్నా ఆర్థిక రాజధాని, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ముంబై అయితే బెస్ట్ అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా ముంబైలో ల్యాండ్ అయ్యాడు.హార్పర్స్ బజార్ ఎక్స్పీరియెన్స్తో వెంటనే అతనికి అక్కడ ‘ఎల్’లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ కొలువు దొరికింది. ముగ్గురు స్టయిలిస్ట్లున్న టీమ్ని లీడ్ చేశాడు. అతనిలోని క్రియేటివిటీ, పనిపట్ల అతనికున్న కమిట్మెంట్.. రెండేళ్లకే ‘జీక్యూ ఇండియా’లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ కుర్చీలో కూర్చోబెట్టాయి.. స్టయిలింగ్ కవర్స్, ఫ్యాషన్ ఎడిటోరియల్స్ బాధ్యతలతో. దీంతోపాటు ఈ దేశపు ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ షో ‘లాక్మే ఫ్యాషన్ వీక్’కి డైరెక్టర్గానూ ఉన్నాడు రాహుల్ .. ముగ్గురు క్రియేటివ్ డైరెక్టర్స్లో ఒకడిగా!ఓవైపు ఇవన్నీ చేస్తూనే.. సెలబ్రిటీ స్టయిలింగ్లోకీ అడుగుపెట్టాడు రాహుల్.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టికి పర్సనల్ స్టయిలిస్ట్గా! పర్సనల్ స్టయిలింగ్లో.. ముందుగా క్లయింట్ నేపథ్యం, పర్సనాలిటీ, అభిరుచులు, పాత ఫొటోలు.. వంటివన్నీ స్టడీచేసి ఒక అవగాహన కుదిరాకే స్టయిలింగ్ పట్ల దృష్టిపెడ్తాడు రాహుల్. తను చేసిన ఆ రీసెర్చ్ ప్రకారమే క్లయింట్ డ్రెస్ డిజైనింగ్ని డిసైడ్ చేస్తాడు.ఎందుకంత డీటేయిలింగ్ అంటే ‘మన స్టయిల్ని రిఫ్లెక్ట్ చేసేది మన లైఫ్స్టయిలే కాబట్టి’అంటాడు. అయితే అతని డిజైనర్స్ లిస్ట్లో బ్రాండ్ ఇమేజ్ ఉన్న డిజైనర్సే కాదు అసలు బయటి ప్రపంచానికి తెలియని డిజైనర్స్ కూడా ఉండొచ్చు. ఎక్కువగా కొత్త కొత్త దేశీ డిజైనర్స్నే తన క్లయింట్కి ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు. ఆ తీరే సెలబ్రిటీ స్టయిలింగ్లో అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.అతని స్టయిల్ క్లాసిక్గా ఉంటుందనే కాంప్లిమెంట్నీ ఇస్తోంది. అందుకే మృణాల్ ఠాకుర్, అర్జున్ కపూర్, రాజ్కుమార్ రావు, క్రికెటర్ కేఎల్ రాహుల్ లాంటి సెలబ్రిటీలూ రాహుల్ విజయ్ని తమ పర్సనల్ స్టయిలిస్ట్గా ఎంచుకున్నారు. జగమెరిగిన డిజైనింగ్ హౌసెస్ అండ్ బ్రాండ్స్కీ ఫ్రీలాన్స్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్గా తన సృజనాత్మక సేవలను అందిస్తున్నాడు రాహుల్ విజయ్.ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు సొంత ఈస్తెటిక్ సెన్స్ని డెవలప్ చేసుకోవాలి. 12 ఏళ్ల నా ఫ్యాషన్ ఎడిటోరియల్స్ ఎక్స్పీరియెన్స్ ఫ్యాషన్కి సంబంధించి భిన్న దృక్ఫథాన్ని అందించింది. ట్రెండ్స్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, వాటిలోంచి మనదైన స్టయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి వంటి ఎన్నో విషయాలను నేర్పింది. ఇది నా కెరీర్కి ముఖ్యంగా పర్సనల్ స్టయిలింగ్లోకి వచ్చాక ఎంతో ఉపయోగపడింది. స్టయిలింగ్ అనేది ఇప్పుడు ఇమేజ్ మేకింగ్లా మారింది. అందుకే స్టయిలిస్ట్ల పాత్ర రోజురోజుకీ పెరుగుతోంది! – రాహుల్ విజయ్ -
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్లో, న్యూయార్క్లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్లు, బెల్ట్లు... అన్నీ హ్యాండ్మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్లో ఒక ఫ్యాబ్రిక్కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
విజయవాడ : అదరహో అనిపించిన ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
Tanya Ghavri: స్టయిలింగ్లో తనతో పోటీ అంటే.. కొంచెం కష్టమే!
స్టయిలింగ్లో తాన్యా ఘావ్రీతో పోటీ అంటే కొంచెం కష్టమే! శాంపుల్కి జాన్వీ కపూర్, అనన్య పాండేలను చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది! అందుకే తాన్యాను ఇండియన్ స్టయిలింగ్ ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్స్గా కొనియాడుతుంటారు.తాన్యా ఘావ్రీ.. మాజీ టెస్ట్ క్రికెటర్ కర్షణ్ ఘావ్రీ కూతురు. ముంబైలో పుట్టిపెరిగింది. ఇంటర్ అయిపోయాక.. చాలామంది విద్యార్థుల్లాగే తాన్యా కూడా చదువుల చౌరస్తాలో నిలబడిపోయింది అయోమయంగా.. ఏ దారిన వెళ్లాలో తెలియక! తన బలాబలాలను బేరీజువేసుకుందోసారి. తనకు క్రియేటివ్ బోన్ ఉన్నట్లు అర్థమైంది. అందుకే ఫ్యాషన్ వైపు మళ్లింది. న్యూయార్క్, పార్సన్స్ ఆఫ్ స్కూల్లో ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ చేసింది.ఇండియా తిరిగొచ్చాక ఎస్ఎన్డీటీ (శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాకర్సీ) యూనివర్సిటీలో దుస్తుల తయారీ డిజైన్కి దరఖాస్తు పెట్టుకుంది. ఆ కోర్స్ అయిపోగానే అవకాశాలు క్యూ కడతాయనే ఉద్దేశంతో! కానీ చదువైపోయిన రెండున్నరేళ్లకు వచ్చింది ఒక చాన్స్.. ‘ఆయశా’ అనే హిందీ సినిమాకు అసిస్టెంట్ స్టయిలిస్ట్గా! ఆ చిత్రానికి స్టయిలిస్ట్ పర్నియా కురేశీ. ఆమెకు సహకారం అందించడమే తాన్యా పని. దానికి ముందు ఆ రెండున్నరేళ్లు.. ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్లో, స్టయిలిస్ట్లు అనాయితా ష్రాఫ్, అర్చనా వాలావల్కర్లాంటి వాళ్ల దగ్గర ఇంటర్న్షిప్ చేసింది.ఆమె స్టయిలింగ్ జర్నీ మొదలైంది మాత్రం ‘ఆయశా’ సినిమాతోనే! అందులోని కథానాయిక సోనమ్ కపూర్కి తాన్యా పనితనం నచ్చింది. తన పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకుంది. తాన్యా స్టయిలింగ్తో సోనమ్ ఫ్యాషన్ ఐకాన్ అయింది. అది గమనించిన ఐశ్వర్యా రాయ్ బచన్.. తనకూ స్టయిలింగ్ చేసిపెట్టమని తాన్యాను కోరింది. ఆ అపురూప సౌందర్యరాశికి అప్ టు డేట్ ఫ్యాషన్ని టచప్ చేసి.. అక్కాచెల్లెళ్లు కరిష్మా, కరీనా కపూర్ల దృష్టిలో పడింది తాన్యా. వాళ్ల నుంచీ సేమ్ రిక్వెస్ట్ అందుకుంది. ఫిజిక్ని బట్టే ఫ్యాషన్, సౌకర్యాన్ని బట్టే స్టయిల్ అని నమ్మే తాన్యా ఆ సూత్రాన్నే అప్లయ్ చేసి కపూర్ సిస్టర్స్ అపియరెన్స్నే మార్చేసింది.వాళ్ల వయసులో చెరో పదేళ్లు తగ్గించేసింది. ఆశ్చర్యపోయింది కరిష్మా, కరీనాల ఆప్తురాలు మలైకా అరోరా! సీక్రేట్ ఏంటని అడిగింది. తాన్యా అడ్రస్ చెప్పారు వాళ్లు. వెళ్లి వాలింది మలైకా! తాన్యాకు మారు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా తన వెంట రమ్మంది. అప్పటి నుంచి మలైకాకూ స్టయిలింగ్ సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టింది తాన్యా. ఆ డిమాండ్ను కత్రినా కైఫ్ కూడా గుర్తించింది. ఉఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే మాధురీ దీక్షిత్, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్యా పాండే, దిశా పాట్నీ, శ్రద్ధా కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఫ్రీదా పింటోలూ చేరి ఆ జాబితా పెరిగిపోతుంది.తాను ఎస్ఎన్డీటీలో జాయిన్ అయ్యేముందు ఊహించుకున్నట్టే తనను అవకాశాల వెల్లువ ముంచెత్తుతోంది. ఈ అచీవ్మెంట్ వయసు పదిహేనేళ్లు. స్టార్స్కి మెరుగులు అద్దుతూనే అంట్రప్రెన్యూర్షిప్ గురించీ ఆలోచించింది. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగలు, పబ్బాలకు డిజైనర్ దుస్తులను అందించే ‘ధూమ్ ధామ్ వెడ్డింగ్స్’ అనే కంపెనీనీ స్థాపించి అంట్రప్రెన్యూర్గానూ మారింది."నా వర్క్ని రొటీన్గా ఎప్పుడూ ఫీలవను. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినట్టు భావిస్తాను. అందుకే వర్క్ని బాగా ఎంజాయ్ చేస్తాను. నేనెప్పటికీ మరచిపోలేని ఈవెంట్.. ఆస్కార్ పార్టీ కోసం ఫ్రీదా పింటోకి స్టయిల్ చేయడం. నా పర్సనల్ స్టయిల్ విషయానికి వస్తే జీన్స్, స్కర్ట్స్, షర్ట్స్, బ్లౌజెస్.. ఏ డ్రెస్ అయినా నాకు ఓకే. అయితే ఏదైనా ఓవర్ సైజ్డ్ స్టఫ్నే ఇష్టపడతా. నేను షార్ట్గా ఉంటాను కాబట్టి.. షార్ట్ డ్రెస్లు వేసుకుని ఓవర్ సైజ్డ్ షర్ట్తో కానీ జాకెట్తో కానీ నా హైట్ని బ్యాలెన్స్ చేస్తా"! – తాన్యా ఘావ్రీ -
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ అరుణా గౌడ్ (ఫొటోలు)
-
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరిసింది. ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. గతేడాదే తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్పై కనిపించిన ఆలియా.. ఈ ఏడాదిలో తళుక్కున మెరిసింది. అయితే ఈవెంట్లో ఆలియా ధరించిన శారీపైన బీటౌన్లో పెద్ద చర్చ మొదలైంది. తన స్టైలిశ్ లుక్తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆలియా ధరించిన శారీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.ఆలియా భట్ ధరించిన ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీ.. దానికి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా షోలో ప్రత్యేకంగా నిలిచింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పూల చీరలో అలియా స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. దీంతో ఆమె రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియావైపై ఉన్నాయి. అయితే ఈ చీర రూపొందించడంలో పెద్ద కథ ఉందనే విషయం బయటకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ఆలియా భట్ మాట్లాడింది. ఆలియా చీర వెనుక కథమెట్ గాలా ఈవెంట్లో ప్రపంచ వేదికపై మనదేశ మూలాలను చాటి చెప్పేందుకు భారతీయత ఉట్టిపడేలా శారీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ శారీ కోసం దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు. ఆలియా చీరను రూపొందించేందుకు 163 మంది హస్తకళాకారులు అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిపారు. అయితే ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం. ఇందులో పాల్గొన్న కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో ఆకట్టుకోవడమే కాదు.. తన మాటలతోనే ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?
మెట్ గాలా( MET Gala ).. అనేది సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్. ఈ కార్యక్రమం ప్రతి మే నెలలో మొదటి సోమవారం నిర్వహిస్తారు. ఈ మెట్ గాలా ఈవెంట్ని మ్యాజియం కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం డబ్బు సేకరించేందుకు వినియోగిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ సెలబ్రెటీలు, ప్రహుఖులు, లెజెండ్లు, అథ్లెట్లు, రాజకీయనాయకుల ఒక రాత్రి అంతా స్టే చేసి మరీ ఈ ఫ్యాషన్ వేడుకను జరుపుకుంటారు.ఈ ఈవెంట్ 1948 నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్లో తెలుగు మహిళ సందడి చేయనుంది. సినిమాలకు సంబంధం లేని ఓ మహిళ ఇందులో పాల్గొనే అవకాశం రావడం విశేషం. ఈ మహిళ మన హైదరాబాదీనే. ఆమె పేరు సుధారెడ్డి. ఆమె ఈ గాలా ఈవెంట్లో మరోసారి తళుక్కుమంటోంది. ఇంతకుమునుపు 2021లో ఇదే గాలా ఈవెంట్లో సందడి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎవరీమె అంటే..సుధారెడ్డి మన నగరానికి చెందిన బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా. సుధారెడ్డి ఫస్ట్ టైమ్ 2021లో ‘మెట్ గాలా రెడ్ కార్పెట్’పై తళుక్కుమని మెరిశారు. మళ్లీ ఈ ఏడాది మెట్ గాలా రెడ్ కార్పెట్పై మరోసారి మయమరిపించనున్నారు. అంతేగాదు తన ష్యాషన్ డిజైనర్ దుస్తులతో మద్రు వేసేందుకు సుధారెడ్డి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఇద్దరు ప్రముఖ డిజైనర్లను సెలక్ట్ చేసుక్నున్నారు. ఈ మేడాది మే 6న ఈ మెగా ఈవెంట్ని నిర్వహించనున్నారు. అందులో మన తెలుగు మహిళ సుధారెడ్డి అలెగ్జాండర్ మెక్ క్వీన్, తరుణ్ తహిలియానిని డిజైన్ చేసిన దుస్తులను ధరించనున్నారు. బిగ్గెస్ట్ నైట్గా ప్రసిద్ధి చెందిన ఈ మెగా గాలా ఈవెంట్కి మరోసారి రావడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ ష్యాషన్ వేడుకలో తన దుస్తులు మరింత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తోంది సుధారెడ్డి.ఈసారి ఆమె ఈ ఫ్యాషన్ వేడుకలో భారతీయ సంస్కృతిని టచ్ చేసేలా విభిన్నమైన వస్త్రాలంకరణతో మెరవనుంది. నిజానికి ఈ మెట్ థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవాకనింగ్ ఫ్యాషన్" అంటే..చారిత్రక వస్త్రాలంకరణపై దృష్టి పెట్టేలా చేయడమే ఈ వేడుక ముఖ్యోద్దేశం. ఇక ఈ ఏడాది మెట్ గాలా థీమ్ వచ్చేటప్పటికీ గార్డెన్ ఆఫ్ టైమ్. అందుకు తగ్గట్టుగానే సెలబ్రిటీలు, డిజైనర్లు తమ సొంత ప్రతిభను వెలికితీసి మరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకలో ఎన్నో రకాల ఫ్యాషన్ డిజైన్వేర్లు సందడి చేయనున్నాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
Eka Lakhani: ఇటు ఫ్యాషన్.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీస్లో మోస్ట్ వాంటెడ్ తాను!
ఏకా లఖానీ.. డైరెక్టర్స్ కాస్ట్యూమ్ డిజైనర్. స్టార్ బాడీలాంగ్వేజ్ని కాదు.. పర్సనాలిటీని బట్టి స్టయిల్ని క్రియేట్ చేసే స్టయిలిస్ట్! అందుకే ఆమె ఇటు ఫ్యాషన్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీస్లో మోస్ట్ వాంటెడ్!ఫ్యాషన్ డిజైనర్ కావాలని, సినిమాల్లో పనిచేయాలని ఎప్పుడూ అనుకోలేదు ఏకా లఖానీ. ఇంటర్లో సైన్స్ స్టూడెంట్. మంచి మార్కులతోనే ఇంటర్ పాస్ అయింది. తర్వాత ఏం చేయాలో తెలీలేదు. తనేం చేయగలదో కూడా ఆమెకు ఐడియా లేదు. కానీ ఆ తండ్రికి తెలుసు.. తన కూతురికి మంచి ఈస్తెటిక్ సెన్స్ ఉందని, ఆర్ట్లో కానీ.. ఫ్యాషన్ రంగంలో కానీ చక్కగా రాణించగలదని! అందుకే ఆమెను ఆ దిశగా ప్రోత్సహించాడు.ఆ ప్రోత్సాహం ఏకాను తన టాలెంట్ని గ్రహించేలా చేసింది. ముంబైలోని ఎస్ఎన్డీటీ (Sreemati Nethabai Damodar Thackersey) విమెన్స్ (women's) యూనివర్సిటీలో చేరింది. అక్కడ డిగ్రీ పూర్తయ్యాక న్యూయార్క్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ కూడా చేసింది. ఆ టైమ్లోనే పిలుపు వచ్చింది ప్రముఖ ఫ్యాషన్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ సబ్యసాచీ ముఖర్జీ మణిరత్నం సినిమాకు పని చేస్తున్నాడని.. అతను ఒక అసిస్టెంట్ కోసం చూస్తున్నాడు.. రమ్మని! వచ్చేసింది.. వర్క్ చేసి మణిరత్నంని ఇంప్రెస్ కూడా చేసింది.అది ‘రావణ్’ సినిమా. అక్కడి నుంచి మణిరత్నంతో అసోసియేట్ అవుతూ వస్తోంది మొన్నటి పొన్నియన్ సెల్వన్ వరకు! ‘రావణ్’ చేస్తున్నప్పుడే ఆమె పనితీరు నచ్చి, మెచ్చి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ సంతోష్ శివన్ ఆమెకు తను తీసిన ‘ఊర్మి’కి కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసే చాన్స్ ఇచ్చి ఏకాను మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.మరి బాలీవుడ్కి? ‘నేను చేసిన సౌత్ ఇండియన్ మూవీస్ వర్క్తోనే బాలీవుడ్ నన్ను గుర్తించి అక్కడ చాన్సెస్ ఇచ్చింది. అందుకే మణిరత్నం సర్కి సదా కృతజ్ఞురాలిని’ అంటుంది ఏకా లఖానీ. బాలీవుడ్లో ఆమె.. రాజ్కుమార్ హిరానీ, కరణ్ జోహర్ లాంటి దర్శకులకు ఆస్థాన కాస్ట్యూమ్ డిజైనర్గా మారింది. ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే ఈస్తెటిక్స్, ట్రెండ్స్ మాత్రమే కాదు.. కల్చర్, క్లయిమేట్ అండ్ పర్సనాలిటీల పరిశీలన, అవగాహన అండ్ విశ్లేషణ అని ఆమె అభిప్రాయం.అది ఆమె ఆచరణలోనూ కనిపిస్తుంటుంది తన వస్త్రధారణలో అయినా.. సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినా.. సెలబ్రిటీలకు స్టయిల్ని సెట్ చేసినా! ఈ లక్షణమే ‘సంజు’ లాంటి బయోపిక్స్, ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి పీరియాడికల్ డ్రామాస్, ‘షేర్షా’ లాంటి వార్ డ్రామాస్, ‘జుగ్ జుగ్ జియో’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, ‘క్వీన్’ లాంటి వెబ్సిరీస్కి పనిచేసి ఈరోజు ఆమెను వర్సటైల్ కాస్ట్యూమ్ డిజైనర్గా నిలబెట్టింది. ఆ నైజమే రణ్వీర్ సింగ్, కరణ్ జోహార్, రణ్బీర్ కపూర్ లాంటి సెలబ్రిటీలకు స్టయిలిస్ట్గా ఆపర్చునిటీని తెచ్చిపెట్టింది. ‘ఈ డీటేయిలింగ్ నేర్పింది కూడా మణి సరే’ అంటూ మళ్లీ మణిరత్నంకే క్రెడిట్ ఇస్తుంది ఏకా!డ్రైవింగ్ ఫోర్స్..భిన్న భాషల్లో.. విభిన్నమైన పాత్రలను ఆకళింపు చేసుకుంటూ డిజైన్ చేసే ఆమె కాస్ట్యూమ్స్ యాక్టర్స్కి ప్రత్యేక గుర్తింపునే కాదు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడినీ సృష్టిస్తున్నాయి. ఆమెనో డ్రైవింగ్ ఫోర్స్గా మలస్తున్నాయి. ఏకా లఖానీ అవసరాన్ని అనివార్యం చేస్తున్నాయి. ట్రెండ్స్తో ఇన్ప్లుయెన్స్ కాక చేస్తున్న సినిమా స్పిరిట్ని గ్రహించి దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ని తయారుచేయాలని మణి సర్ దగ్గర, ఫస్ట్ షాట్తోనే ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ ఉండాలని రాజు (రాజ్కుమార్ హిరానీ) సర్ దగ్గర, కొత్తగా.. వావ్ అంటూ ఆడియెన్స్ అబ్బురపడే ఫ్యాషన్ని చూపించాలని కరణ్ దగ్గర నేర్చుకున్నాను. ఇలా నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్, నేను స్టయిల్ చేస్తున్న ప్రతి సెలబ్రిటీ దగ్గర ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నా పనికి మెరుగులు దిద్దుకుంటున్నాను. ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ పాఠాలకన్నా వర్క్ ద్వారా నేర్చుకుంటున్నదే ఎక్కువ! – ఏకా లఖానీఇవి చదవండి: Nidhi Bhist: మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే..! కానీ ఇప్పుడు నిధి ద బెస్ట్!! -
మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్..
ఇంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంటుంది. అభిరుచిని మెరుగుపరుచుకోవాలన్నా సమయమే సరిపోదనిపిస్తుంది. కానీ, కొందరు మాత్రమే ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమతోపాటు మరికొందరికి ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు సవిత ఆలంపల్లి. తెలంగాణలోని జహీరాబాద్ వాసి అయిన సవిత కాటన్ ఫ్యాబ్రిక్పైన సహజసిద్ధమైన పువ్వులు, ఆకులతో సహజమైన ప్రింట్లను తీసుకువస్తుంది. అదే ఫ్యాబ్రిక్ని ఉపయోగిస్తూ మోడ్రన్ డ్రెస్సులను డిజైన్ చేస్తోంది. వర్క్షాప్స్ నిర్వహిస్తూ, బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేసి, సెల్ఫ్ మేడ్ బిజినెస్ ఉమన్గా తనని తాను నిరూపించుకుంటుంది. ఆసక్తిని ఉపాధిగా మలుచుకునేందుకు చేసిన ప్రయాణంలో తాను వేసిన అడుగుల గురించి ఆనందంగా వివరించింది.‘‘డిగ్రీ వరకు చదువుకున్న నేను పెళ్లయ్యాక మావారు రామకృష్ణతో కలిసి అమెరికాకు వెళ్లాను. గృహిణిగానే కొన్నాళ్లు ఉండిపోయాను. న్యూయార్క్ ఎఫ్ఐటిలో ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన కోర్స్ చేశాను. పదేళ్ల క్రితం ఇండియా వచ్చి బెంగళూరులో స్థిరపడ్డాం. రోజంతా ఇంటిపనులు, పిల్లల పనులు ఉన్నా నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకునేదాన్ని.ఫాస్ట్ ఫ్యాషన్లో ఉపయోగించే ఫ్యాబ్రిక్ తీవ్రమైన కాలుష్యానికి గురి చేస్తుందని తెలుసుకున్నాను. అప్పటినుంచి నా వంతుగా ఏదైనా చేయాలనుకుని ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. ఫ్లోర్ క్లీనర్స్, సుగంధ ద్రవ్యాలు వంటివి ఇంట్లో తయారు చేస్తుండేదాన్ని. వాటివల్ల ఇంట్లో వాళ్లు కూడా చాలా మెచ్చుకునేవారు. ఎకో ప్రింటింగ్, సస్టెయిన్బుల్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయడం మొదలుపెట్టాను. ప్రకృతి ద్వారా లభించే వస్తువులతో రోజూ ఏదో ఒక ప్రయోగం చేస్తుండేదాన్ని. ఆకులు – పువ్వులు..పూజలు, ఇతర సంప్రదాయ వేడుకలలో పువ్వులు, ఆకులను కూడా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా వాటిని ఉడకబెట్టి, టై అండ్ డై చేస్తుంటారు. నేను వాటిని ఎండబెట్టి, కొన్నింటిని తాజాగా ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ మీద చల్లి, దగ్గరగా చుట్టి, కొన్ని రోజులు అలాగే ఉంచి ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయత్నాలు చేయగా చేయగా ఫ్యాబ్రిక్పైన రకరకాల డిజైన్స్ అమితంగా నన్ను ఆకట్టుకున్నాయి. మోదుగ, శంఖపుష్ప, పారిజాత.. వంటివే కాదు అరుదుగా పూసే పువ్వులనూ సేకరిస్తాను. వాటిని ఎండబెట్టి నిల్వ ఉంచుతాను. మామిడి, జామ, మందార ఆకులనూ డిజైన్కు వాడుతుంటాను. ఏ మాత్రం రసాయనాలు లేని ప్రయోగం ఇది.ఇంటి నుంచి స్టూడియో వరకు..రసాయనాలతో పండించే పత్తి కాకుండా వర్షాధార పంటద్వారా వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్ను కలెక్ట్ చేసి, నా ప్రయత్నాలను ఇంకా విరివిగా చేయడం మొదలుపెట్టాను. సస్టెయిన్బుల్ డ్రెస్సులు అంటే చాలావరకు వదులుగా ఉండే దుస్తులు అనుకుంటారు. కానీ, మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్ చేయాలనుకున్నాను.కార్పొరేట్ ఉమెన్కు నప్పే విధంగా, అలాగే టీనేజ్ కలెక్షన్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ప్రింటింగ్.. డ్రెస్సులు ధరిస్తే ఒంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న అనుభూతి సొంతం అవుతుంది. ఏడెనిమిదేళ్లుగా సస్టెయినబిలిటీ మీద రకరకాల ప్రయోగాలు చేసి, ఐదేళ్ల క్రితం ‘టింక్టోరియా’ పేరుతో బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేశాను. ఆకులలో ఉండే జీవాన్ని టింక్టోరియా అంటారు.దానిని ఫ్యాబ్రిక్ మీదకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం కాబట్టి అదే పేరును నా డిజైన్స్కు పెట్టాను. ఇంటినుంచి స్టూడియోదాకా మారేందుకు చేసిన రకరకాల ప్రయోగాల వల్ల ఇప్పుడు నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. మేమంతా కలిసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్కు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పని చేస్తుంటాం.అవగాహనకు వర్క్షాప్స్..ఎకోప్రింటింగ్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి హైదరాబాద్, బెంగళూరు ఇతర క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లలో ఉచితంగా వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను. స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాను. అక్కడి వచ్చి, ఆసక్తితో నేర్చుకుంటాను అనేవారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ప్రింటింగ్ ్రపాసెస్ అడుగుతుంటారు. చాలా మందికి ఆకులతోనూ, పువ్వులతోనూ డిజైన్ చేస్తారని తెలియదు. ఈ డిజైన్ ఉతికితే పోతుందేమో అనుకుంటారు. కానీ, సరైన విధంగా చేస్తే రంగు ఏ మాత్రం పోదు.ముందు కుంకుడుకాయ రసంతో ఫ్యాబ్రిక్ను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత ఆకులను, పువ్వులను అనుకున్న డిజైన్స్లో అమర్చి, దగ్గరగా చుట్టి, ఆవిరిమీద ఉంచుతాం. ఆ తర్వాత బయటకు తీసి, ఒకరోజంతా అలాగే ఉంచుతాం. ఆ తర్వాత పూర్తిగా విప్పి, క్లాత్ని శుభ్రం చేస్తాం. సరైన డిజైన్ రావడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. షిబోరి, టై అండ్ డై, కలంకారీ డిజైన్స్తోపాటు నేతకారులతో ముందే మాట్లాడి ఫ్యాబ్రిక్ డిజైన్లో మోటిఫ్ ప్రింట్స్ వచ్చేలా గైడెన్స్ ఇస్తుంటాను.కొన్ని రకాల ఆకులు, పువ్వుల ప్రింటింగ్లో థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. ప్రకృతిపైన ప్రేమ, ఇష్టంతో నన్ను నేను కొత్తగా మార్చుకునే క్రమంలో ఎంచుకున్న మార్గం ఇది. ఇంట్లో వాడాల్సిన కెమికల్స్ స్థానంలో ఏ మాత్రం రసాయనాలు లేని వస్తువులను తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాను. ఈ విధానం వల్ల ఐదారేళ్లలో నాదైన ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను అనిపిస్తుంది’ అని ఆనందంగా వివరిస్తారు సవిత. – నిర్మలారెడ్డిఇవి చదవండి: Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే? -
క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి..
నెయిల్ ఆర్ట్ గురించి మనకు తెలిసిందే. ఎన్నో డిజైన్లు మన చూపు తిప్పుకోనివ్వవు. ఆర్టిఫిషియల్ నెయిల్స్ని అతికించి మరీ చూడచక్కని డిజైన్లతో చేసే ఆ అలంకారం వేలి కొసలలో మెరుపులుగా కనువిందు చేస్తుంది. ఇప్పుడు వాటి స్థానాన్ని నెయిల్ జువెలరీ ఆక్రమిస్తోంది. ఫింగర్ క్లారింగ్స్గా ఈ నెయిల్ జ్యువెలరీ ఆధునికమైన టచ్తో అందంగా రూపుకడుతుంది. ప్రాచీనకాలంలో రక్షణలో భాగంగా చేరిన ఈ ఆభరణం ఇప్పుడు సొగసైన అలంకార జాబితాలో చేరి ప్రత్యేకతను చాటుతోంది. బంగారు, వెండి, ఇతర లోహాలలోనూ ఈ నెయిల్ జ్యువెలరీ అందుబాటులో ఉంది. సంప్రదాయం, ఆధునికం ఏ వేడుకైనా కొత్తగా వెలిగిపోవాలని కోరుకునే వారికి ఈ నెయిల్ రింగ్స్ సరైన ఎంపిక అవుతాయి. లోహపు డిజైన్లలో ముత్యాలు, రత్నాలు, ఎనామిల్.. వంటివి జతచేసిన డిజైన్ల ఎంపిక మనదైన ప్రత్యేకతను చాటుతుంటుంది. లోహాన్ని బట్టి, డిజైన్ను బట్టి ధరలు వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. చరిత్రలో నెయిల్ జువెలరీ.. ప్రాచీన చైనా, ఈజిప్ట్ రాజులు, రాణుల ఈ నెయిల్ క్లా జ్యువెలరీ విరివిగా ధరించేవారు. పొడవాటి గోర్లు సంపదకు చిహ్నంగా భావించేవారు. వాటి వల్ల శారీర శ్రమæ చేయవలసి అవసరం లేదు. అలా శ్రమ చేయాల్సిన అవసరం లేని వారు, స్థితిమంతులుగా జాబితాలో ఉండేవారు. అంతేకాదు, నెయిల్ గార్డ్గా పిలిచే ఈ ఆభరణాన్ని ధరించడం ప్రాచీన చైనీస్ మహిళలు శక్తికి, అందానికి చిహ్నంగా భావించేవారు. నెయిల్ క్లా లేదా గార్డుల తయారీలో సాధారణంగా లోహాలు లేదా సముద్ర తీరాల్లో లభించే ఆల్చిప్పల పెంకులను కూడా ఉపయోగించేవారు. అయితే, ఎక్కువగా బంగారం, వెండి, కాంస్య లేదా పోత పోసిన లోహంతో తయారు చేస్తారు. ముత్యాలు, విలువైన రాళ్లను వాటిలో పొదుగుతారు. వేలిగోళ్ల గార్డు ధరించిన వారి సామాజిక స్థితిని తెలియజేసేది. 3సెం.మీ నుండి దాదాపు 15 సెంటీ మీటర్ల వరకు ఉండేలా డిజైన్ చేయించేవారు. కొన్నిసార్లు చిటికెన వేలు, ఉంగరపు వేలికి సరిపోయేలా డిజైన్ చేయించుకునేవారు. కుడిచేతి, ఎడమ చేతి డిజైన్లు భిన్నంగా ఉండేవి. తమ దేశ సంప్రదాయ ఆభరణాలలో భాగంగా ఉన్నా, రక్షణ కోసం ఉపయోగించేవిగా పేరొందాయి. వారి వారి దేశాల్లోని నాణేలు, జంతువులు, పక్షులు, మొక్కల బొమ్మలను నెయిల్ గార్డ్స్పైన డిజైన్ చేయించేవారు. మహారాణి కళ.. జువెలరీ డిజైన్ సృష్టి, ఎంపిక అనేవి మన భావ వ్యక్తీకరణ పట్ల నుండి పుట్టుకు వచ్చిన ఆలోచన. నా డిజైన్స్ ఎక్కువగా బంజారా సంస్కృతికి అద్దం పడతాయి. ఎన్నో ఏళ్లుగా చూసిన వివిధ జాతుల సంస్కృతి, కళలు నా డిజైన్స్లో కనిపిస్తాయి. క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ అలంకరణ మహారాణి కళను తీసుకువస్తుంది. – భవ్య రమేష్, జ్యువెలరీ డిజైనర్ -
Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’..
కల ఉన్న చోట కష్టం ఉంటుంది. ‘మరింత కష్టపడతాను’ అంటూ ముందుకువెళ్లాలి. లక్ష్యం ఉన్న చోట సవాలు ఎదురొస్తుంది. సరిౖయెన జవాబు చెప్పి ఆ సవాలును వెనక్కి పంపించాలి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ శృతి మల్హోత్రా. జార్ఖండ్లోని రాంచికి చెందిన శృతి ఎన్నో చిన్న బ్రాండ్లను పెద్ద సక్సెస్ చేసింది. సక్సెస్కు సరిౖయెన అడ్రస్గా పేరు తెచ్చుకుంది. శృతి మల్హోత్రా బాల్యంలోకి వెళితే.. ప్రతిరోజు రాత్రి నలుగురు అక్కాచెల్లెళ్లు వార్తలు వినడానికి రేడియో ముందు కూర్చునేవారు. కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలను రూల్ నోట్ ΄్యాడ్లో రాసుకునేవారు. మరుసటి రోజు తండ్రితో వాటి గురించి చర్చించేవారు. తండ్రి వాటి గురించి మరిన్ని కొత్త విషయాలు వివరంగా చెప్పేవాడు. శృతి తండ్రి పిల్లలకు తరచుగా చెప్పే మాట.. ‘స్వతంత్రంగా ఉండండి’ ‘పెద్ద కలలు కనడానికి వెనకాడ వద్దు’ ‘ఈ ప్రపంచంలో మీకు అత్యున్నత స్నేహితుడు.. విద్య’ తండ్రి మాటలు అక్షరాలా ఆచరించడం వల్లే పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది శృతి మల్హోత్రా. మిషనరీ స్కూల్ నుంచి దిల్లీ యూనివర్శిటీలో చదువుకోవడం వరకు ‘స్వతంత్రంగా ఉండడం’ అనే లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దీనివల్ల ఆమె చాలామందికి‘రెబెల్’గా కనిపించేది. ‘ఏదైనా చేయాలి. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’ అనే లక్ష్యాన్ని కాలేజీ రోజుల్లోనే నిర్దేశించుకుంది మల్హోత్రా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్ కంపెనీ ‘బెనెటన్’తో ప్రొఫెషనల్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నైకీ, ప్లానెట్ స్పోర్ట్స్లో కూడా అద్బుతమైన ఇన్నింగ్స్ను ప్రదర్శించింది. స్థూలంగా చెప్పాలంటే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ జైనింగ్లలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. 2007లో ఎథికల్ బ్యూటీబ్రాండ్ ‘ది బాడీ షాప్’లో చేరింది. ఇది తన ప్రయాణ గతిని మార్చేసింది. రిటైల్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్లలో అడుగుడుగునా పురుషాధిక్యత కనిపించే కాలంలో మహిళలు అడుగు వేసి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ‘వేరే వారి కంటే ఒక మెట్టుకింద ఉండడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. సవాలుగా తీసుకున్నాను. రెట్టింపు కష్టపడ్డాను’ అంటుంది మల్హోత్రా. ఆ కాలంలో బ్యూటీప్రొడక్ట్స్కు సంబంధించిన రిటైల్ బిజినెస్ ఫార్మసీ, డిపార్ట్మెంటల్ స్టోర్లలో మాత్రమే కనిపించేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జీరో నుంచి ప్రయాణంప్రొరంభించాను’ అంటుంది మల్హోత్రా. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అనే సన్నాయి నొక్కుల నుంచి ‘ఈ రంగంలో పెద్ద పేరున్న మహిళ’ అనే ప్రశంస వరకు శృతి మల్హోత్రా ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో పాఠాలు నేర్చింది. ఎందరికో గుణపాఠాలు చెప్పింది. ‘క్వెస్ట్ రిటైల్’ గ్రూప్ సీయీవోగా ఎంతో పేరు తెచ్చుకుంది. ‘శృతి మల్హోత్రా సీయీవో మాత్రమే కాదు ఎన్నో బ్రాండ్స్ను విజయవంతం చేసిన డ్రైవింగ్ ఫోర్స్’ అంటాడు ఫ్యాషన్ కంపెనీ లకొస్టే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీయీవో రాజేష్ జైన్. తన సక్సెస్కు కారణం తల్లిదండ్రులు అని చెబుతుంది మల్హోత్రా. చదువు చెప్పించడం నుంచి కలల సాధనలో వెన్నుదన్నుగా నిలవడం వరకు వారి పాత్ర ఎంతో ఉందని చెబుతోంది. ‘వృత్తి జీవితంలో ఎంతోమంది మేల్ కొలీగ్స్తో పనిచేశాను. ఎప్పుడూ ఎవరితోటీ సమస్య రాలేదు. పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం లేకపోవడమే అసలు సమస్య. మహిళలకు సమానావకాశాలు కల్పించడం విషయంలో ఎన్నోసార్లు పోరాడాను’ అంటుంది మల్హోత్రా. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది ముఖ్యం’అనేది శృతి మల్హోత్రాకు ఇష్టమైన మాట. ఇవి చదవండి: Sagubadi: మార్కెట్ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం.. -
కర్ణికా బుద్ధిరాజా - జషన్ ఘుమాన్ వివాహ వేడుక (ఫోటోలు)
-
చేనేత సాంస్కృతిక వారసత్వం గొప్పది
సాక్షి, యాదాద్రి: మన చేనేత సాంస్కృతిక వారసత్వం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి ముందుకు తీసుకుపోవడంలో చేనేత కళాకారుల సహకారం గొప్పదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. చేనేత రంగంలో గురు, శిష్య సంప్రదాయం ప్రకారం వృత్తి నైపుణ్యాలు తరతరాలుగా అందించడం మంచి సాంప్రదాయమని ప్రశంసించారు. ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త డిజైన్లు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో చేనేత పరిశ్రమకు ఫ్యాషన్ డిజైనర్లు సహకరించాలని కోరారు. ఇందులో శిక్షణ ఒక ముఖ్యమైన అంశమని ఆమె అన్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్పోచంపల్లిని సందర్శించారు. ఇక్కత్ వస్త్రాలు తయారు చేసే చేనేత కళాకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత దేశ వారసత్వంలో ఒక భాగమైన చేనేత వృత్తి గురించి తెలుసుకోవడానికి పోచంపల్లి గ్రామానికి వచ్చి పట్టు చీరలు ఎలా తయారు చేస్తారో చూడడం సంతోషం కలిగిస్తోందని రాష్ట్రపతి చెప్పారు. ఇక్కడి నుంచి తాను ఇంత గొప్ప చేనేత ఇక్కత్ వృత్తి నైపుణ్య జ్ఞానాన్ని తీసుకువెళుతున్నానని అన్నారు. తమ ప్రాంతానికి చెందిన కొందరిని పోచంపల్లికి తీసుకువచ్చి చేనేత వృత్తిని పరిచయం చేయిస్తానని తెలిపారు. యూఎన్డబ్ల్యూటీవో (యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) 2021లో పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి చేనేత రంగంలో విశిష్టత కలిగిన అవార్డు గ్రహీతలు వచ్చారంటూ.. చేనేత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతున్న వారిని అభినందించారు. చేనేత రంగం ద్వారా ప్రతిరోజు 35 లక్షల మంది జీవనోపాధి కల్పించుకుంటున్నారని, తెలంగాణాలో నేసిన వ్రస్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని చెప్పారు. పోచంపల్లితో పాటు రాష్ట్రంలోని వరంగల్, సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, పుట్టపాక వస్త్రాలకు జీఐ ట్యాగ్ వచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు ముగ్గురు చేనేత కళాకారులు కొన్ని ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. అంతకుముందు ఆమె పోచంపల్లిలోని శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్ను సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్ను సందర్శించారు. ముడిపట్టు నుంచి పట్టును తీయడం, వ్రస్తాలను తయారు చేయడం లాంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు చరఖాలతో నూలు వడకడాన్ని వీక్షించారు. ప్రత్యేక స్టాళ్లను, ఆచార్య వినోభాబావే ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతికి చీరల బహూకరణ చేనేత అవార్డు గ్రహీతలు బోగ సరస్వతి, లోక శ్యామ్కుమార్, కూరపాటి వెంకటేశం.. చేనేత రంగంలో తమ వృత్తి నైపుణ్యాలను, ఇబ్బందులను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా పొట్ట బత్తిని సుగుణ రాష్ట్రపతికి చీరను బహూకరించారు. బోగ సరస్వతి డబుల్ ఇక్కత్ వ్రస్తాన్ని అందజేశారు. వేదికపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క.. రాష్ట్రపతికి చీరలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచనా సాహు, రాష్ట్ర జౌళి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమారెడ్డి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే, రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్బాబు తదితరులు పాల్గొన్నారు. స్పృహ తప్పి పడిపోయిన ఏసీపీ భూదాన్ పోచంపల్లి/భువనగిరి క్రైం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్పోచంపల్లి పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. హెలీపాడ్ వద్ద విధుల్లో ఉన్న ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న ఇంకో అధికారి మీద పడడంతో ఇద్దరూ కింద పడ్డారని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. హెలీకాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరగడంతో వేరే విధంగా ప్రచారం జరిగిందని వివరణ ఇచ్చారు. హెలీకాప్టర్ ఫ్యాన్ గాలి ఉధృతికి కార్పెట్ పైకి లేవడంతో ఆయన గాయపడినట్టు తొలుత ప్రచారం జరిగింది. కాగా చేతికి గాయమైన ఏసీపీని వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నూలు డిపో ఏర్పాటు చేయాలి పలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న చేనేత వృత్తికి అండగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15 శాతం నూలు సబ్సిడీని సకాలంలో పొందలేకపోతున్నాం. ఇందుకోసం భూదాన్ పోచంప ల్లిలో నూలు డిపో ఏర్పాటు చేయాలి. తద్వారా వే లాది మంది చేనేతలకు మేలు జరుగుతుంది. డబు ల్ ఇక్కత్, కాటన్, మస్రైస్ వస్త్రాల తయారీ కోసం వందలాది మగ్గాలు నడుస్తాయి. చేనేత కుటుంబాలకు మరింత ఉపా«ధి లభిస్తుంది. – బోగ సరస్వతి సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి పోచంపల్లి కళాకారులకు రంగులు అద్దకం, డిజైన్ల తయారీ, నూతన ప్రక్రియల కోసం శిక్షణ ఇప్పించాలి. చేనేత యువతకు శిక్షణ ఇప్పించడానికి చేనేత సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి. మమ్మల్ని చేనేత కార్మికులుగా కాకుండా చేనేత కళాకారులుగా పిలవాలి. మా వృత్తికి విరమణ లేదు. మాకు అండగా ఉండాలి. – లోక శ్యామ్కుమార్ డూప్లికేట్ను నియంత్రించాలి టై అండ్ డై చీరలు, వ్రస్తాలను డూప్లికేట్ చేస్తున్నారు. మా వృత్తిని దెబ్బతీసే విధంగా మిల్లుల నుంచి టై అండ్ డై వస్త్రాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో మేము ఉపాధి కోల్పోతున్నాం. ఇక్కత్ బ్రాండ్ను కాపాడాలి. చేనేత వృత్తిని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. వస్త్రాల అమ్మకంపై డిస్కౌంట్ ఇవ్వాలి. పోచంపల్లి బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. – కూరపాటి వెంకటేశం -
రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలుసా? గ్లోబల్ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు
సాధించాలన్న పట్టుదల ఉండాలి. వృత్తి పట్ల ప్రేమ,నిబద్ధత ఉండే చాలు..ఎన్నిఅడ్డంకుల్నైనా అధిగమించి విజయ బావుటా ఎగుర వేయొచ్చు. సవాళ్లు ఎన్ని వచ్చినా దారిలో ముళ్లను ఏరి పారేసినట్టు వాటిని అధిగమించి శభాష్ అనిపించు కోవచ్చు. స్ఫూర్తినిచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకున్న అద్భుత మహిళ గురించి తెలుసుకుందాం. కుట్టు మిషన్తో ఏం సాధిస్తాంలే అనుకోలేదు. కేవలం రెండే రెండు కుట్టు మిషన్లతో ప్రారంభించి కోట్లకు అధిపతిగా అవతరించిన అనితా డోంగ్రే సక్సెస్ జర్నీ .. తను చేసేపని పట్ల స్పష్టమైన దృక్పథం , అంతకుమించిన నిబద్ధత, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మల్చుకుని తానేంటో అనితా డోంగ్రే నిరూపించుకున్న వైనం స్ఫూర్ది దాయకం. అవమానాల్నికూడా లెక్క చేయకుండా రెండు దశాబ్దాల కృషితో దేశవ్యాప్తంగా 270కి పైగా షాపుల నెట్వర్క్తో , వందల కోట్ల సంపదతో అనితా డోంగ్రే భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళా ఫ్యాషన్ డిజైనర్గా రాణించారు. View this post on Instagram A post shared by Anita Dongre (@anitadongre) అమ్మేప్రేరణ, ఆది గురువు అనితా డోంగ్రే కు ఫ్యాషన్ ప్రపంచ మీద ఆసక్తి ఏర్పడింది తల్లి ద్వారానే. తల్లి ఒక వస్త్ర దుకాణంలో టైలర్గా పనిచేసేది.అలాగే తనకు, తన తోబుట్టువులకు తల్లి రూపొందించిన దుస్తులు చూసి ప్రేరణ పొందింది. తల్లిలోని ఇ నైపుణ్యమే అనితను ఫ్యాషన్ డిజైనర్గా అద్భుతమైన కెరీర్కు పునాదులు వేసింది. అలా 19 ఏళ్ల వయసులో అనితాకు ప్యాషన్ డిజైనర్గా అవతరించింది. ఈ క్రమంలోనే వర్కింగ్ విమెన్కు అందుబాటు ధరలో దుస్తులను అందించే భారతీయ రీటైల్ కంపెనీ లేదని గుర్తించారు. ఫ్యాషన్ డిజైనర్గా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీనికి బంధువులు, స్నేహితులు నిరుత్సాహపర్చినా, తల్లి మాత్రం వెన్ను తట్టి ప్రోత్సహించింది. అనితా డోంగ్రే సొంత వ్యాపారం 1995లో అనిత ,ఆమె సోదరి కలిసి ఒక చిన్న ఫ్లాట్లో పాశ్చాత్య దుస్తులను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో బ్లాండ్లనుంచి గానీ, మాల్స్నుంచి దాకా వీరి ఉత్పత్తులకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు సరికదా ఎద్దేవా చేశారు. కానీ ఆమె మాత్రం నిరాశ పడలేదు. మరింత పట్టుదల పెరిగింది. తన స్వంత కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. AND డిజైన్స్ పేరుతో ప్రారంభించిన బిజినెస్ పెద్దగా సక్సెస్ లేదు. అయినా ఏ మాత్రం తగ్గలేదు. 2015లో ఈ కంపెనీ పేరును హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా మార్చారు. ఇక అంతే అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. తనదైన ప్రత్యేకమైన శైలిలో రూపొందించిన అనిత ఫ్యాషన్ దుస్తులకు విపరీతమైన ప్రజాదరణ లభించింది. రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా ఘనతకు దక్కిచు కున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతను భారతీయ సాంప్రయదాయం,కళలకు స్టయిల్ జోడించి హైబ్రిడ్ దుస్తులతో తనదైన ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని రూపొందించింది. అలా ఒక చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రెండు కుట్టు మిషన్లతో ప్రారంభమైం ఇప్పుడు దేశవ్యాప్తంగా 270 అవుట్లెట్లకు విస్తరించింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలోని అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరుగా నిలిచారు అనితా. కంపెనీ విలువ రూ.1400 కోట్లకు పైమాటే. సంపన్న వివాహాల నుండి అంతర్జాతీయ రెడ్ కార్పెట్లగాలాస్ దాకా ప్రతిచోటా మహిళలకోసం అద్భుతమైన సృష్టిని చూడవచ్చు. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్, అంతర్జాతీయ పాప్ గాయని బియాన్స్ నోలెస్ , ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి సెలబ్రిటీలు అనితా డోంగ్రే కస్టమర్లలో ఉన్నారంటే ఆయన క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. AND, గ్లోబల్ దేశీ, గ్రాస్రూట్, అనితా డోంగ్రే బ్రాండ్స్తో ఆమె వ్యాపారం దూసుకుపోతోంది. వేడుక ఏదైనా సరే.. ఆమె ఫ్యాషన్ స్టయిల్ ఒక ఐకాన్గా నిలుస్తుంది. అంతేకాదు ఇటీవల ఆమె పర్యావరణ అనుకూలమైన లాండ్రీ జెల్ను లాంచ్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Grassroot by Anita Dongre (@grassrootbyanitadongre) -
టీడీపీ బండారు వ్యాఖ్యలపై శిల్ప రెడ్డి ఫైర్..!
-
అందాల తార శ్రీలీల ధరించిన లంగావోణి ధర తెలిస్తే షాకవ్వుతారు!
శ్రీలీల.. తెలుగు ప్రేక్షకుల మైండ్లో రిజిస్టర్ అయిన పేరు.. హార్ట్లో ప్రింట్ అయిన రూపు!. మన హద్దుల్లో మనం ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు చిత్ర పరిశ్రమ అనేది గౌరవనీయమైన ఇండస్ట్రీనే. హీరోయిన్ అవ్వాలనుకునే తెలుగమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఇదే అని అంటోంది ముద్దగుమ్మ శ్రీలీల. ‘పెళ్లిసందడి’తో తెరంగేట్రం చేసిన ఆమె అటు సినిమాలతో ఇటు తన ఫ్యాషన్ స్టయిల్తో అభిమానులను అలరిస్తోంది. శ్రీలీల వార్డ్ రోబ్లోని ఫ్యాషన్ బ్రాండ్స్లో ఒకట్రెండు ఇక్కడ.. నితికా గుజ్రాల్.. చాలామంది సెలబ్రిటీస్కి ఇది ఇష్టమైన బ్రాండ్. ముంబైకి చెందిన నితికా అతి చిన్న వయసులోనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగింది. అల్లికలు, కుందన్ వర్క్స్తో అందమైన డిజైన్స్ రూపొందించడంలో ఆమెది ప్రత్యేక ముద్ర. ఈ డిజైన్స్కి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అయితే వీటి ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. శ్రీలీల ధరించిన నితికా గుజ్రాల్ ధర రూ. 72,500/- మంగత్రాయ్ జ్యూయెల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్లో మంగత్రాయ్ జ్యూయెల్స్ ఒకటి. 1905లో చంగల్ లాల్ గుప్తా, అతని కుమారుడు దర్పణ్ గుప్తా కలసి ఈ బంగారు అభరణాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయ డిజైన్స్ తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ప్రతి ఆభరణాన్ని అత్యంత నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు తయారు చేస్తారు. అదే వీరి ప్రత్యేకత. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్లైన్లోనూ లభ్యం. --దీపిక కొండి (చదవండి: అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?) -
ఎయిర్ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందికి త్వరలో కొత్త యూనిఫాం రానుంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యూనిఫామ్స్ను డిజైన్ చేయనున్నారు. 10,000లకుపైగా ఉన్న ఫ్లయిట్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ ఉద్యోగులు 2023 చివరినాటికి నూతన డ్రెస్లో దర్శనమీయనున్నారు. ఎయిర్ ఇండియాలో కొనసాగుతున్న ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఇది మరో అడుగు అని సంస్థ తెలిపింది. -
FDCI ICW 2023 Photos: ర్యాంప్వాక్లో సినీ తారల హోయలు (ఫోటోలు)
-
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ ఫ్యాషన్ డిజైనర్గా..
ఫ్యాషన్ డిజైనర్కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్ష్ అగర్వాల్కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్ అగర్వాల్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు.... రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్ అగర్వాల్ ఫ్యాషన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్కు నోటిఫికేషన్ల వరద మొదలైంది. పాపులర్ ఇంగ్లిష్ సింగర్ హారీ స్టైల్స్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్ చేయించేవాడు హర్ష్. ‘ఎకనామిక్స్ అండ్ బిజినెస్’లో పట్టా పుచ్చుకున్న హర్ష్ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్’ ఇంటర్న్షిప్ న్యూయార్క్లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్ డిజైనర్లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్’ అనే మెన్స్వేర్ లేబుల్కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్లో టైలర్లు, జూనియర్ డిజైనర్లు, ప్రొడక్షన్ ఇన్చార్జ్లు ఉన్నారు. ‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్ అగర్వాల్. ఒక డిజైన్ హిట్ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లపై వర్క్ చేస్తుంటాడు హర్ష్. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్ రూపొందిస్తాడు. 105 పీస్లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్ కోసం సోషల్ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బయర్స్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్ క్లాతింగ్ రిటైలర్లలో మ్యాచెస్ ష్యాషన్–లండన్, సెసెన్స్(మాంట్రియల్), ఎల్ఎమ్డీఎస్–షాంఘై, బాయ్హుడ్–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్ పాయింట్గా మారింది. బ్రాండ్ అభిమానుల్లో ఇంగ్లాండ్కు చెందిన టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ డిజైనర్ టాన్ ఫ్రాన్స్ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్ బ్రాండ్ గురించి విన్నాను. నా నెట్ఫ్లిక్స్ షో కోసం అతడు డిజైన్ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్గా అనిపించాయి. డిజైనింగ్లో హర్ష్కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్ ఫ్రాన్స్. హర్ష్ కొత్త కలెక్షన్ డిజైన్ స్కెచ్లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్ వర్క్లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్ లుక్ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్టైల్ ఇనోవేషన్ ప్రాజెక్ట్ ‘అంబ’ ఫౌండర్ హేమ ష్రాఫ్ పటేల్. -
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య.. సూసైడ్కి ముందు వీడియో రిలీజ్
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్లోని తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలె ముంబై నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లిన ఆమె గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సరదాగా భోజనం చేసింది. ఆ మరుసటి రోజు ఉదయం ముస్కాన్ తల్లి వెళ్లి చూడగా ఆమె గదిలో లేదు. ఇళ్లంతా వెతికినా ఎక్కడ కనిపించకపోవడంతో ఇంటి పైనున్న స్టోర్ రూమ్కి వెళ్లి చూడగా ముస్కాన్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. చదవండి: నాని30లో హీరోయిన్ శ్రుతి హాసన్.. మరి మృణాల్ సంగతి? దీంతో ఆమెకు కిందికి దింపి ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే ముస్కాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సూసైడ్కు కొన్ని గంటల ముందు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసిన ముస్కాన్.. ఇదే తన చివరి వీడియో అని చెప్పడం గమనార్హం. 'ఇదే నా లాస్ట్ వీడియో. ఇకపై నేను మీకు కనిపించను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ రివర్స్లో వాళ్లే నన్ను కన్విన్స్ చేసేందుకు చూశారు. నేను చేసే దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి ఎవరిని నిందించకండి అంటూ చివర్లో కామెడీతో వీడియోను ముగించింది. చదవండి: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మీటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. View this post on Instagram A post shared by Muskan Narang (@muskan_narang99) -
పెళ్లికి ముందే విడిపోయిన హీరో.. ఎంగేజ్మెంట్ రద్దు
ఇండస్ట్రీలో ఈమధ్య ప్రేమ-విడాకులు కామన్ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరికొందరేమో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కాకుండానే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఊసరవెల్లి, శక్తి, తుపాకీ సినిమాల్లో నటించిన విద్యుత్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన విద్యుత్ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్తో ప్రేమలో ఉన్నాడు. 2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటే ఇలా బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చారు. రీసెంట్గా అనన్య కజిన్ పెళ్లికి విడివిడిగా హాజరైన విద్యుత్-నందితా పెడమొహంగా కనిపించారు. ఇన్స్టాగ్రామ్లో కూడా బ్రేకప్కు సంబంధించిన కొటేషన్స్ని షేర్ చేశారు. బీటౌన్ క్యూట్ కపుల్గా కనిపించిన ఈ జంట బ్రేకప్ ఫ్యాన్స్కు షాకిచ్చినట్లయ్యింది. -
Ruchi Varma: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..
సొంతంగా ఏదైనా సాధించాలనే కల అందరిలోనూ ఉంటుంది. ఆ కల కోసం నిరంతరం శ్రమిస్తేనే అనుకున్న ఫలితాలను అందుకోగలం. కానీ, కుటుంబ బాధ్యతలలో చాలా వరకు కలలు కల్లలుగానే ఉండిపోతాయి. ఉద్యోగం చేస్తున్న రుచివర్మ పరిస్థితి మొదట్లో అలాగే ఉండేది. వ్యాపారం వద్దని అడ్డుకున్న కుటుంబాన్ని మెప్పించింది, కాబోయే తల్లులకు డ్రెస్ డిజైన్స్ పేరుతో రెండున్నర లక్షలతో మొదలు వ్యాపారం మొదలుపెట్టి, రెండేళ్లలో ఏడాదికి 5 కోట్ల టర్నోవర్ చేరుకునేలా కృషి చేసింది. ఉద్యోగం వదులుకున్న పరిస్థితి నుంచి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన తన తపన నేడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ‘‘మాది బీహార్లోని దర్భంగా పట్టణం. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న బ్యాంకు ఉద్యోగి, అమ్మ గృహిణి. ముగ్గురు అక్కచెల్లెళ్లం. దర్భంగా నుండి ముంబైకి ఫ్యాషన్ డిజైనర్గా నా ప్రయాణం సాగింది. ► అమ్మ కోరుకున్నదని.. ప్రతి తల్లిదండ్రిలాగే మా అమ్మ కూడా మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం ఇంజనీర్లు కావాలని కోరుకునేది. ఆమె కల నెరవేర్చడానికి చాలా ప్రయత్నించాను. కానీ, ఆ కోచింగ్ ఖర్చు భరించడం పెద్ద విషయంగా అనిపించింది. అమ్మనాన్నల గురించి ఆలోచించినప్పుడు నా మనసులో చాలా గందరగోళం ఏర్పడింది. ఇవన్నీ ఆలోచించి నా శక్తి మేరకు ప్రయత్నించి, ఆ కోచింగ్ నుంచి ఆరు నెలల్లో తిరిగి వచ్చేశాను. ► ఫ్యాషన్ పరిశ్రమ వైపు మనసు దర్భంగా భూమి కళలకు ప్రసిద్ధి. మా ఇంటి పక్కన టైలర్గా పనిచేసే ఆమె వర్క్ నన్ను బాగా ఆకట్టుకునేది. ఈ విషయం ఇంట్లో చెప్పలేకపోయాను. ధైర్యం తెచ్చుకుని నాకు ఆర్ట్స్ అంటే ఆసక్తి ఉందని, ఇంజినీరింగ్ చదవలేనని నాన్నకు చెప్పాను. నాన్న అంతా గ్రహించి, ఏ చదువు కావాలో దానినే ఎంచుకోమన్నారు. దీంతో నేను నిఫ్ట్లో చేరాను. ► ప్రతి నిర్ణయమూ కష్టమే నిఫ్ట్ పరీక్షలో పాసయ్యాక ముంబైకి వెళ్లాలనే నిర్ణయం కష్టమే అయ్యింది. ఒంటరిగానా?! అని భయపడ్డారు. కానీ, కొన్ని రోజుల ప్రయత్నంలో నా ఇష్టమే గెలిచింది. అది నా జీవితాన్ని మార్చింది. కాలేజీ నుంచి వెళ్లి ఓ ఎక్స్పోర్ట్ హౌజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ మెటర్నిటీ వేర్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. మూడేళ్లపాటు ఆ ఎక్స్పోర్ట్ హౌస్లో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఆఫీసు, ఫ్యాక్టరీ ఒకే చోట ఉండడం వల్ల డిజైనింగ్ కాకుండా ప్రింటింగ్, స్టిచింగ్, శాంపిల్, ప్రొడక్షన్ నేర్చుకున్నాను. ఆ వర్క్ నాకు చాలా ఉపయోగపడింది. ► ఎక్కడో ఏదో లోటు. 2012 లో మొదటి ఉద్యోగం వస్తే 2019 నాటికి, నేను నాలుగు కంపెనీలలో డిజైనర్ నుండి సీనియర్ డిజైనర్ స్థానానికి చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి మాత్రం లభించలేదు. పని పెరుగుతూ వచ్చింది. స్థిర జీతం అలవాటుగా మారింది. కానీ ఎప్పుడూ ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. బాల్యంలో టైలర్ ఆంటీని స్ఫూర్తిగా తీసుకుంటే టెన్త్ క్లాస్ వచ్చేనాటికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నా ఆదర్శంగా ఉండేవారు. ‘నేను కూడా నా సొంత బ్రాండ్ని ప్రారంభించాలనుండేది. నేను ఉద్యోగం కోసమే ఈ కోర్సు ఎంచుకోలేదు.. ఎలా?’ అనే ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనిచ్చేవి కావు. ► ఇంట్లో వాళ్లు మాట్లాడలేదు... 2019లో ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం మానేసినట్లు తల్లిదండ్రులు, భర్తకు చెప్పినప్పుడు వారు సంతోషించలేదు. మొదట నా భర్త చాలా నిరాకరించాడు. తరువాత నా తల్లిదండ్రులు కూడా సెటిల్డ్ లైఫ్ ను ఎందుకు వదిలేయాలి అనే మాటలే. ఇంట్లో ఉన్నవాళ్లంతా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లకు నా బాధ అర్థం కాకుండాపోయింది. నేనే ఓ రోజు నిర్ణయం తీసుకుని ఉద్యోగం వదిలేశాను. ఉద్యోగం మానేసినందుకు నా భర్త కొన్ని రోజులు మాట్లాడలేదు. రీసెర్చ్ వర్క్ చేశాక, వచ్చే 34 నెలల ప్లానింగ్ని మా అమ్మనాన్నలకు చెప్పాను, అప్పుడు వాళ్ళు కొద్దిగా కన్విన్స్అయ్యారు. నేను రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. ► చులకనగా మాట్లాడేవారు.. ఈ రంగంలోకి రాకముందే చాలా పరిశోధనలు మొదలుపెట్టాను. మార్కెట్లో ఏ సెక్షన్ కు డిమాండ్ పెరుగుతుందో కనిపించింది. కాబోయే తల్లుల దుస్తుల విషయంలో చాలా లోటు కనిపించింది. ఇంతకు ముందు ఇదే రంగంలో పనిచేశాను కాబట్టి కొంచెం ఆత్మవిశ్వాసం వచ్చి ఈ ప్రొడక్ట్ని ఎంచుకున్నాను. అయితే, రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. వన్ మ్యాన్ ఆర్మీలా అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం డిజైనింగ్ వర్క్ మాత్రమే చేశాను. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ లైన్, లోగో డిజైనింగ్, ప్యాకేజింగ్, డెలివరీ ఫైనాన్స్లాంటివన్నీ చేశాను. ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ అతిపెద్ద సమస్య ఏర్పడింది. నా అవస్థ చూసి ఎగతాళి చేసినవారున్నారు. చులకనగా మాట్లాడినవారున్నారు. ‘ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్లకు డ్రెస్ డిజైన్స్ ఏంటి?!’ అని నాతో పని చేయడానికి వర్కర్స్ నిరాకరించేవారు. దీంతో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొన్నాను. కానీ, నా పట్టుదలను వదిలిపెట్టలేదు. రెండేళ్లలో 2.5 లక్షల వ్యాపారం కోట్లకు కోవిడ్ కాలం అందరికీ కష్టంగా ఉండేది. దీంతో ఆఫ్లైన్ పనులు ప్రారంభం కాలేదు. అప్పుడు నా వ్యాపారం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలని ఆలోచించాను. ఇది నాకు ప్రయోజనకరంగా మారింది. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ సైట్స్తో మాట్లాడాను. ముందు నా ప్రతిపాదనను వాళ్లు అంగీకరించలేదు. దీంతో నా సొంత సైట్లో ‘ఆరుమి’పేరుతో కాబోయే తల్లుల కోసం చేసిన నా డిజైన్స్ పెట్టాను. ప్రారంభించిన 24 గంటల్లోనే ఆర్డర్లు రావడం మొదలయింది. ఈ రోజు నా బ్రాండ్ అన్ని ఆన్లైన్ మార్కెట్లోనూ సేల్ అవుతోంది’’ అని వివరించే రుచివర్మ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? వధువు ఎవరంటే!
తెలుగు స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తనదైన యాంకరింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఒకవైపు పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ఇదిలా ఉంటే బులితెరపై ఎంతో క్రేజ్ను సొంతం చేసుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చదవండి: ఈ స్టార్ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే! అందుకే తరచూ పెళ్లి రూమర్స్తో వార్తల్లో నిలుస్తుంటాడు ప్రదీప్. తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తలు తెరపై వచ్చాయి. అయితే గతంలో ఇప్పటికే పలుమార్లు ప్రదీప్ పెళ్లంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ప్రతిసారి ఖండించాడు. కానీ ఈసారి మాత్రం ప్రదీప్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి పేరు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. నవ్య.. ప్రదీప్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ని, ఆ పరిచయమే స్నేహం, ప్రేమగా మారిందంటున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంలో ఇరుకుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి ఇరుకుంటుంబాలు చర్చించుకుంటున్నారట. త్వరలోనే ప్రదీప్ గుడ్న్యూస్ చెప్పబోతున్నాడని సన్నిహితవర్గాలంటున్నాయి. అయితే వీరి మతాలు కూడా వేరే అనేది విశ్వసనీయ సమాచారం. మరీ ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ప్రదీప్ నుంచి క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. నవ్య.. ప్రదీప్తో పాటు చాలా మంది సెలబ్రెటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుందట. బిగ్బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) -
వాటిని ఆస్వాదించడంలో హైదరాబాద్ తర్వాతే ఏదైనా: అమిత్ అగర్వాల్
జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై ఆయనో స్టార్.. దేశవ్యాప్తంగా మోడ్రన్ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ట్రెండీ డిజైనర్ అమిత్ అగర్వాల్. నగరం వేదికగా నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొనడానికి ఇటీవల వచ్చిన ఆయన.. గురువారం ‘సాక్షి’తో ముచ్చటించారు. సిటీ అంటే తనకెంతో ఇష్టమని, క్రియేటివిటీ ఉండాలే గాని ఫ్యాషన్ రంగంలో అవకాశాలకు కొదవ లేదని, ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా ఫ్యాషన్ ఔత్సాహికులకు విభిన్నమైన అవకాశాలున్నాయంటున్న అమిత్ ఆలోచనలు. అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి, హైదరాబాద్ ఆస్వాదించడంలో హైదరాబాద్ తర్వాతే.. ►ఫ్యాషన్ అనేది ఒక ప్రాంతానికో, నగరానికో పరిమితమయ్యేది కాదు. సంస్కృతిలో భాగంగా అధునాతన హంగులను ప్రతిబింబిచేది. హైదరాబాద్ వంటి నగరంలో ఫ్యాషన్ ఈ మధ్య వచ్చింది కాదు. ఇక్కడ మొదటి నుంచే అధునాతన జీవన విధానం, ఫ్యాషన్ హంగులకు కేంద్రం. అంతర్జాతీయంగా మారుతున్న మార్పులను ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకుంటోంది. కరోనాకు ముందు ఇక్కడ అతిపెద్ద ఫ్యాషన్ వీక్లో పాల్గొన్నాను. మళ్లీ ఈ మధ్యనే నిర్వహించిన ఫ్యాషన్ షోలో నా డిజైన్స్ను ప్రదర్శించాను. ►సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమ, ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా నిర్మాణమవుతున్న సినిమాలు బాలీవుడ్కు దీటుగా ఫ్యాషన్ ట్రెండ్లను వాడుకుంటున్నాయి. కొత్త ఐడియాలను ఎప్పటికప్పుడు ఆస్వాదించడంలో నగరం తర్వాతే ఏదైనా. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలను దక్షిణాదిన డబ్ చేసేవారు. ప్రస్తుతం ఇక్కడి సినిమాలు బాలీవుడ్లో రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు, త్రీడీ సినిమాలు అవలీలగా తీసేయడం అభినందనీయం. దక్షిణాదిలో స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి సంస్కృతిని సినిమాల్లో చూపించే విధానం బాగుంటుంది. సౌత్లో నిర్మించిన సూపర్ డీలక్స్ చిత్రం నన్నెంతగానో ఆకట్టుకుంది. చదవండి: (హైదరాబాద్లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ) సంస్కృతుల సమ్మేళనమే ‘వైవిధ్యం’.. ►నా జీవితంతో ఫ్యాషన్ విడదీయరాని అనుబంధంగా మారిపోయింది. తక్కువ సమయంలోనే ఫ్యాషన్ నా కెరీర్గా నిర్ణయించుకున్నాను. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి జీవితం సంతృప్తినిచ్చేది ఫ్యాషన్ అనే నమ్ముతాను. డిజైనింగ్లో మల్టిఫుల్ కలర్స్ వాడటం ఎంతో ఇష్టం. నా ప్రత్యేకత కూడా. మోల్డింగ్, గ్రిప్పింగ్లో జాగ్రత్తలు తీసుకుంటాను. ఫ్యాషన్ డిజైనింగ్లో ఎవరి ప్రత్యేకత వారిదే. విభిన్నంగా, వినూత్నంగా, సరికొత్తగా డిజైన్లను రూపొందిస్తున్న వారికి అవకాశాలకు కొదవ లేదు. ►కరోనా అనంతరం ఫ్యాషన్ రంగం మరింత అభివృద్ధి చెందింది, అవకాశాలు పెరిగాయి. అధునాతన స్టైల్స్, కలర్ కాంబినేషన్, ఆకట్టుకునే కలర్ మిక్సింగ్ డిజైనర్ భవిష్యత్ను నిర్దేషిస్తాయి. ఈ రంగంలో రాణించాలంటే వివిధ ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనం, వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో నైపుణ్యం సాధించాలి. అందుకే విభిన్న ప్రాంతాల వేదికలపై అనుభవాన్ని సాధించాలి. అలాంటి వారికి మంచి భవిష్యత్తో పాటు అమితమైన ప్రేమ, ఆదరణ లభిస్తుంది. దాని విలువ ఆ స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. -
చిత్రవిచిత్ర డ్రెస్సులు, ఉర్ఫీ వెనకాల ఉన్నది ఎవరంటే?
అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే దడ.. ఆ మీకు దడ.... ఈ పాట ఇప్పుడున్న సెలబ్రిటీలలో ఉర్ఫీ జావెద్కు కరెక్ట్గా సరిపోతుంది. అవును, ఆమె వేసుకున్న డ్రెస్సులు అలా ఉంటాయి మరి! ఆమె ఫ్యాషన్ను మరెవ్వరూ ఫాలో కాలేరు. కొందరు ఆమె డ్రెస్సింగ్ చూసి వారెవ్వా అనుకుంటే మరికొందరికేమో ఇదేం ఫ్యాషన్ అని దడ పుడుతుంది. అది అందమో, అరాచకమో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు. వేస్ట్లో నుంచి కూడా బెస్ట్ బయటకు తీస్తూ రకరకాల డ్రెస్సులు ట్రై చేసింది ఉర్ఫీ. కాగితాలతో, వైర్లతో, చైన్లతో, అద్దాలతో, గోనె సంచితో ఇలా ఒక్కటేమిటి.. కళ్లకు కనిపించిన దేన్నీ వదిలిపెట్టలేదు. మరి ఇలా ఆమెకు చిత్రవిచిత్ర డ్రెస్సులు డిజైన్ చేసేది ఎవరో తెలుసా? ముంబైకి చెందిన శ్వేత శ్రీవాస్తవ. ఉర్ఫీ బోల్డ్గా కనిపిస్తే ఆమె బోల్డ్గా మాట్లాడుతుంది. తమ ఆలోచనలను వేసుకునే దుస్తుల ద్వారా వ్యక్తపరుస్తున్నామంటున్నారు. ఏదైనా గాజువస్తువుతో డ్రెస్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఉర్ఫీ అడిగితే.. పగిలిన గాజు అద్దంతోనే తయారు చేసేస్తే పోలా అని వత్తాసు పలుకుతుంది శ్వేత. వీళ్లిద్దరి మధ్య 15 ఏళ్ల పరిచయం ఉంది. ఆ చనువుతోనే ఒకరికొకరు కొత్త కొత్త ఐడియాలు చెప్పుకుంటారు. వెంటనే దాన్ని శ్వేత అమల్లోకి తీసుకువస్తే ఆ డ్రెస్ వేసుకుని కెమెరాల ముందుకు వచ్చేస్తుంది ఉర్ఫీ. అలా శ్వేత డిజైన్ చేసిన ఎన్నో డ్రెస్సులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే! వీరి ఫ్యాషన్ను మెచ్చుకున్నా, బాలేదని తిట్టిపోసినా అన్నింటినీ ఒకేలా తీసుకున్నారిద్దరూ. ఎవ్వరేమనుకున్నా డోంట్ కేర్ అంటున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) చదవండి: ఆదిరెడ్డి ముఖంపై కాలు పెట్టిన గీతూ విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్లో అశ్లీల వీడియోలు, ఫొటోలు -
చీరపైన బాపూ బొమ్మ
బాపు బొమ్మల అందం గురించి ఎంత వర్ణించినా.. మనవైన చేనేతల ఘనత గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. ఇక, ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన కళా సోయగాలను ఎంత చూసినా తనివి తీరవు. ఆ అందమైన కాంబినేషన్ను నారాయణపేట చేనేత చీరల మీదకు వచ్చేలా రూపుకట్టారు హైదరాబాద్ వాసి, ఫ్యాషన్ డిజైనర్ హేమంత్సిరి. ఈ కొత్త కాంబినేషన్ గురించి, ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఆమె మాటల్లోనే.. ‘నాలుగేళ్లుగా ప్రతి యేడాది ఆగస్టు నెలలో మన తెలుగురాష్ట్రాల చేనేత కారులతో కలిసి ‘తస్రిక’ పేరుతో ఒక వేడుక నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా గతంలో హ్యాండ్లూమ్స్ని యువత కోసం ఇండోవెస్ట్రన్ డ్రెస్లు రూపొందించాను. ఈ క్రమంలోనే నారాయణ పేట చేనేతకారులను కలిసినప్పుడు, వారి డిజైన్స్ చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నారాయణ పేట చీరలు సాధారణంగా ప్లెయిన్లోనే ఉంటాయి. అయితే అందరినీ ఆకర్షించాలంటే వీటిలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు అనిపించింది. దీంతో కిందటేడాది లేపాక్షి డిజైన్స్ని నారాయణ పేట్ కాటన్ శారీస్మీదకు తీసుకువచ్చాం. బాపూ స్మరణం ఈ నెలలో బొమ్మల బాపూ వర్ధంతి ఉంది. హ్యాండ్లూమ్ డే కూడా ఈ ఆగస్టు నెలలోనే. బాపూగారిని తలుచుకోగానే మనకు ఆ ముగ్గులు, బొమ్మలు.. మన మదిలో అలా నిలిచిపోతాయి. దీంతో ఈ యేడాది బాపూ బొమ్మలను డిజిటల్ ప్రింట్లుగా నారాయణ పేటæపట్టు చీరల మీదకు తీసుకువచ్చాను. ఆ బొమ్మల రూపును నా డ్రెస్ డిజైన్స్పైకి తీసుకురావాలనే ఆలోచన కొన్నాళ్లుగా ఉంది. కానీ, నారాయణ పేట హ్యాండ్లూమ్స్కైతే మరింత బాగుంటుందని అనుకున్నాను. నారాయణæపేట పట్టు చీరల మీద డిజిటల్ ప్రింట్ల అందం గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకున్నది కూడా దీని వెనక ఉన్న ఉద్దేశ్యం. ఈ బాపూ బొమ్మల కాన్సెప్ట్ని ఐఎఎస్ హరిచందన, ఇతర అధికారులు చాలా అభినందించారు. చేనేత కారులకు మార్కెటింగ్ ప్లెయిన్గా ఉన్న హ్యాండ్లూమ్స్కి మరిన్ని హంగులు అద్దడం వల్ల ప్రజల్లోకి వీరి చేనేతలు మరింత వేగంగా వెళతాయి. చీరలపై డిజిటల్ ప్రింట్లు సులువుగానూ వేయచ్చు. స్థానికంగా బ్లాక్ప్రింట్, డిజిటల్ ప్రింట్ యూనిట్స్ని ప్రభుత్వం గానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఏర్పాటు చేయగలిగితే చేనేత కారులకు మరిన్ని అవకాశాలు మెరుగవుతాయి. నారాయణ పేటæ చీరలు అనగానే పెద్దవాళ్లు కట్టుకునేవి అనే అభిప్రాయం ఉండేది. ఆ ఆలోచన మార్చాలనే టీనేజర్స్ కూడా ఇష్టపడేలా పేస్టల్ కలర్స్, మోటిఫ్స్లోనూ మార్పులు తీసుకురావడంపై కృషి జరుగుతోంది. చేనేతకారులకు అవకాశాలు మెరుగవడానికి చేస్తున్న చిరు ప్రయత్నం ఇది’ అని వివరించారు ఈ ఫ్యాషన్ డిజైనర్. – నిర్మలారెడ్డి -
విదిశా టూ విదేశ్.. తొలి భారత ‘మహిళా డిజైనర్’గా ఘనత
భోపాల్: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చేసి చూపించారు ఓ యువతి. రోజుకు రూ.250 సంపాదించేందుకు ఇబ్బందులు పడిన స్థాయి నుంచి దేశం గర్వించే స్థితికి చేరుకున్నారు. తాను ఎంచుకున్న వృత్తినే నమ్ముకుని తన ప్రతిభతో.. విదిశా నుంచి విదేశాలకు భారత కళను తీసుకెళ్లారు. ఆమెనే మధ్యప్రదేశ్లోని విదిశా నగరానికి చెందిన వైశాలి షడంగులే. వైశాలి ఎస్ లేబుల్తో ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ ప్రారంభించారు. పారిస్ హాట్ కోచర్ వీక్లో తన డిజైన్లను ప్రదర్శించిన తొలి భారతీయురాలిగా నిలిచారు తన విజయంతో భారతీయ వస్త్రాలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్.. వైశాలి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని తన ట్విట్టర్లో షేర్ చేశారు. విదిశా టూ విదేశ్ అంటూ వైశాలిపై ప్రశంసలు కురింపించారు మంత్రి. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పారిస్ హాట్ కోచర్ ఫ్యాషన్ వీక్లో తన డిజైన్లను ప్రదర్శించిన తొలి భారతీయురాలిగా నిలిచారని కొనియాడారు. Vaishali from Vidisha to Videsh How her struggle to make Rs 250 led Vaishali Shadangule to become the first Indian female designer to reach the Milan fashion week and Paris Haute Couture Week, putting Indian textiles on global map. pic.twitter.com/CE0P0z3UYi — Piyush Goyal (@PiyushGoyal) July 18, 2022 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు.. 17 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చిన వైశాలి.. హాస్టల్లో ఉంటూ పలు ఉద్యోగాలు చేశారు. ఈ క్రమంలో వస్త్రధారణ ఎలా ఉండాలి, స్టైల్ లుక్ కోసం తన స్నేహితులు, తెలిసినవారికి సూచనలు ఇచ్చేవారు. దీంతో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని కొందరు సూచించారు. కానీ, ఆ పదమే ఆమెకు కొత్త. తన స్నేహితుడి సాయంతో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్కు వెళ్లి వివరాలు సేకరించారు. 2001లో సొంత లేబుల్తో మలాద్లో చిన్న బొటిక్ తెరిచారు వైశాలి. భారత వస్త్రాలతో ఆధునిక హంగులు జోడించి కొత్త కొత్త డిజైన్లు చేయటంపై దృష్టి సారించారు. విభిన్నమైన వస్త్రాలతో వినియోగదారులను ఆకట్టుకున్న వైశాలి.. మరో రెండు స్టోర్సు తెరిచారు. ఆ తర్వాత తన లేబుల్ను వివిధ ఫ్యాషన్ వీక్లలో ప్రదర్శించటం ప్రారంభించారు. అదే నా కల.. 2021, జులైలో జరిగిన పారిస్ హాట్ కోచర్ ఫ్యాషన్ వీక్లో తన డిజైన్లను తొలిసారి ప్రదర్శించారు వైశాలి. దాంతో భారత వస్త్రాలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారు.‘భారత వస్త్రాలను, డిజైన్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేదే నా కల. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇంటర్నేషనల్ డిజైనర్లను చూస్తాము. వారు మన నైపుణ్యాన్ని, డిజైన్లను ఉపయోగిస్తారు. ఆ డిజైన్లనే మనమెందుకు చేయలేమని ఆలోచిస్తుంటాను.’ అని పేర్కొన్నారు వైశాలి. సోనమ్ కపూర్, కల్కీ కోచ్లిన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వైశాలి వద్దకు వస్తుంటారు. ఇదీ చదవండి: ఫైటర్ జెట్లో ‘బోరిస్’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్! -
శ్రద్ధా దాస్ చీర, చెవి జుంకాల ఖరీదెంతో తెలుసా?
నాయికా.. ప్రతి నాయికా.. పాత్ర ఏంటి అనేది కాదు.. సినిమాలో ఆ పాత్ర ప్రాధాన్యమెంత అనేదే చూస్తుంది శ్రద్ధా దాస్. అందుకే గ్లామర్ రోల్స్కే పరిమితం కాకుండా నటిగా నిలబడింది. ఇన్నేళ్లయినా ఇంకా లైమ్లైట్లో ఉంది. ఆ పాపులారిటీకి కారణం.. నటన పట్ల ఆమెకున్న ప్యాషన్తో పాటు ఆమెను ఫ్యాషనబుల్గా చూపిస్తున్న ఈ బ్రాండ్స్ కూడా... జ్యూయెలరీ ఇయర్ రింగ్స్ బ్రాండ్: ది జ్యువెల్ గ్యాలరీ ధర: రూ. 6,600 చీర డిజైనర్: ప్లష్ బై అదితి దేశ్పాండే ధర: రూ. 11,000 బ్రాండ్ వాల్యూ: ప్లష్ బై అదితి దేశ్పాండే ఫ్యాషన్, సౌకర్యాలను బ్యాలెన్స్ చేసే బ్రాండే ప్లష్ బై అదితి దేశ్పాండే. అందుకే ఇది కేవలం అమ్మాయిల ఒంపుసొంపులకు అనుగుణంగా రూపొందించే డిజైన్స్కే పరిమితం కాలేదు. ఆధునిక అమ్మాయిల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే దుస్తులను డిజైన్ చేసే సృజనను, కళనూ ఒడిసిపట్టుకుంది. ఆ క్రియేటర్ ఎవరో చెప్పాల్సిన పనిలేదు.. బ్రాండ్ నేమ్లోనే ఉంది.. అవును.. ఆమే.. అదితి దేశ్పాండే. ఈ డిజైనర్ దుస్తులు ఆన్లైన్లో దొరుకుతాయి. ధరలూ అందుబాటులోనే ఉంటాయి. ది జ్యువెల్ గ్యాలరీ ఇది లండన్, జెనీవా బేస్డ్ జ్యుయెలరీ బ్రాండ్. పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన డిజైన్స్.. దీని ప్రత్యేకత. నాణ్యత, డిజైన్స్లో కళాత్మకతే ఈ బ్రాండ్ డిమాండ్ను పెంచుతున్నాయి. క్లయింట్స్ను క్యూలో నిలబెడుతున్నాయి. సరసమైన ధరలు.. ఆన్లైన్లో అందుబాటు ఈ బ్రాండ్ పట్ల క్రేజ్ను పెంచే ఇతర కారణాలు. నేను పుట్టింది, పెరిగింది ముంబైలోనే అయినా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీతో కూడా నా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. అది మా అమ్మమ్మ వాళ్లూరు. రంగురాళ్లకు ప్రసిద్ధి ఆ ఊరు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్లేవాళ్లం. వెళ్లినప్పటి నుంచి తిరిగి ముంబై వచ్చేదాకా ఆ ఊళ్లో మా రంగు రాళ్ల వేట సాగేది. రకరకాల రంగురాళ్లను ఏరుకొచ్చేవాళ్లం. ఆ వేటను లైఫ్లో మరచిపోలేను! – శ్రద్ధా దాస్ View this post on Instagram A post shared by @shraddhadas43 చదవండి: తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్, పిల్లలు పుట్టాక పెళ్లి రాకెట్రీలో ఆ సీన్ మళ్లీ మళ్లీ చూశానన్న నెటిజన్, హీరో దెబ్బకు ట్వీట్ డిలీట్! -
సక్సెస్ స్టోరీ: జేమ్స్బ్రాండ్
జేమ్స్బాండ్ అంటే ఎవరండీ? ‘ఇది రిస్క్ సుమీ’ అని భయపడకుండా దూసుకుపోయేవాడు. పదిరూట్లు కనిపించినా... తనదైన సెపరేట్ రూట్ సృష్టించుకునేవాడు. విజయాలెప్పుడూ తన వెంటపడేలా కనిపించేవాడు. ఈ లక్షణాలు ఉన్న కరణ్ను జేమ్స్బాండ్ అని పిలుచుకోవచ్చు. అయితే తన పేరునే ‘బ్రాండ్’ చేసుకున్న అతడిని కాస్త సరదాగా జేమ్స్‘బ్రాండ్’ అని పిలుచుకుంటే మరీ బాగుంటుంది... ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్గా మారాడు. కరణ్ తొరాని దిల్లీలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ కోర్స్ చేస్తున్న సమయంలో తండ్రి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. ఫ్యాషన్ డిగ్రీ చేతికి అందగానే ‘ఇలా చేయాలి’ ‘అలా చేయాలి’ అనుకున్న తన కలలకు బ్రేక్ పడింది. చదువు పూర్తయిన తరువాత ఇద్దరు డిజైనర్ల దగ్గర పనిచేశాడు. మనసులో ఉన్న తన కల మాత్రం రోజూ పొద్దుటే హలో చెబుతూనే ఉంది. తన లక్ష్యాన్ని గుర్తు చేస్తూనే ఉంది. దీంతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్లు చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘రిస్క్–టేకర్’ అనే బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఫ్యాషన్ కోర్స్ చేయాలనుకున్నప్పుడు చాలామంది వెనక్కి లాగారు. ‘అది అందరికీ వర్కవుట్ కాదు’ అని నిరుత్సాహ పరిచారు. ‘ఎలాగైనా చేయాల్సిందే’ అని అకాడమీ మెట్లు ఎక్కినప్పుడు ‘రిస్క్–టేకర్’ అనే బిరుదు తగిలించారు. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ చేయడానికి బయటికి వచ్చినప్పుడు ‘కడుపులో చల్ల కదలకుండా డబ్బు వస్తుంటే ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు!’ అన్నారు. ‘చేయక తప్పదు’ అని మరోసారి అనుకున్నాడు కరణ్. మొదట తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో తాను డిజైన్ చేసిన గార్మెంట్స్ ఇమేజ్లను పోస్ట్ చేశాడు. అనూహ్యమైన స్పందన లభించింది. వారాల వ్యవధిలోనే అవి మల్టీ–బ్రాండ్ స్టోర్స్లలోకి వెళ్లాయి. హాట్కేకుల్లా అమ్ముడు అయ్యాయి. దీంతో తనలోని ఆత్మవిశ్వాసానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. బాలీవుడ్ అంటే తనకు వల్లమాలిన ఆసక్తి, అభిమానం. బాలీవుడ్లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్గా పేరు తెచ్చుకోవడానికి కరణ్కు ఎంతో కాలం పట్టలేదు. ఫ్యాషన్ ప్రపంచం ‘ఇతడొకడున్నాడు’ అని మన వైపు దృష్టి సారించడానికి, మనలో ‘మనదైన ప్రత్యేకత’ ఉండాలి. మరి కరణ్లోని ప్రత్యేకత గురించి చెప్పడానికి ముందు కాస్త ఫ్లాష్బ్యాక్లోకి వెళితే... దేశవిభజన సమయంలో కరణ్ పూర్వీకులు పాకిస్థాన్లోని సిం«ద్ నుంచి మనదేశానికి వలస వచ్చారు. చిన్నప్పటి నుంచి పూర్వీకుల కథలు వింటూ పెరిగాడు కరణ్. కరణ్ బాల్యం ఎక్కువగా భోపాల్లోని అమ్మమ్మ ఇంట్లో గడిచింది. అది ఇల్లు అనడం కంటే మ్యూజియం అంటే బెటర్. ఎందుకంటే ఇంటినలుమూలలలో చిన్న చిన్న దారుశిల్పాలు కనిపించేవి. అమ్మమ్మ వాటిని అంగట్లో కొని తెచ్చేది. రకరకాల చీరలు కనిపించేవి. చందేరి చీర తనను ఎంతో ఇన్స్పైర్ చేసింది. దిల్లీలోని లజ్పత్నగర్లో తండ్రికి ‘సింధి టెంట్హౌజ్’ ఉండేది. చిన్నప్పుడు తండ్రితో పాటు ఎన్నో వివాహవేడుకలకు వెళ్లేవాడు. ప్రతి పెళ్లివేడుకకు తనదైన గ్లామర్ గ్రామర్ ఉండేది. ఆ పాఠాలన్నీ తన మదిలో అలా నిలిచిపోయాయి. ఈ జ్ఙాపకాలన్నీ తన సృజనాత్మకతకు పదనుపెట్టాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్ను తన విజయసూత్రంగా చేశాయి. కరణ్ డిజైన్లలో జ్ఞాపకాలు పలకరిస్తాయి. కథలు చెబుతాయి. మరీ ఎక్కువగా మోడ్రన్గా ఉండకుండా, అలా అని తక్కువ కాకుండా గార్మెంట్స్ డిజైన్ చేస్తూ పాతజ్ఞాపకాల కొత్తలోకంలోకి తీసుకెళ్లడంలో చేయి తిరిగిన డిజైనర్ అనిపించుకున్నాడు కరణ్. ‘సైకిల్ ఆఫ్ ఫ్యాషన్’ అనే సూత్రాన్ని గట్టిగా నమ్మాడు. అలనాటి ఫ్యాషన్ ట్రెండ్స్ను కొత్త లుక్తో తీసుకువచ్చాడు. ఇద్దరు ఉద్యోగులతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాడు కరణ్. ఇప్పుడు రెండు వందల మంది ఉద్యోగులు అతడి దగ్గర పనిచేస్తున్నారు! -
రంగురంగుల దుస్తులు.. చినుకులతో కలిసి చిందేయ్యండి
వసంతమాసంలోనే పువ్వుల సింగారం గురించి మాట్లాడుకుంటాం. కానీ, చినుకు సందడి చేసే వర్షాకాలంలోనూ పువ్వుల సందడి ఎంత అందాన్నిస్తుందో మాటల్లో చెప్పలేం.పచ్చని ప్రకృతి చినుకు స్నానం చేస్తుంటే.. పూల సింగారం విహారానికి వస్తే..మబ్బు పట్టిన నింగి నుంచి నేలకు మెరుపు దిగివచ్చినట్టే. మీదైన ముద్ర తెలియాలంటే ఈ కాలం రకరకాల ప్రింట్ల దుస్తులను ఎంపిక చేయండి. రంగురంగులుగా చినుకులతో కలిసి చిందేయ్యండి. రంగుల వర్ణాలు వేడి నుండి చినుకులు ఉపశమనం ఇచ్చేదే ఈ సమయం. కాకపోతే చెత్త రోడ్లు, తడిపాదాలు, ట్రాఫిక్ మనకు రకరకాల పరీక్షలను తీసుకువస్తాయి. కాబట్టి, రుతుపవనాలు మీ స్టైల్ను ఎలా తగ్గించబోతున్నాయనే దాని గురించి చింతిస్తున్నట్లయితే ముందుగా, రెయిన్ గేర్ ఎంపిక బెస్ట్ ఎంపిక అంటారు ఇండియన్ డిజైనర్ మసాబా గుప్త. ‘ఈ కాలం ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు, పసుపు, గులాబీ, నీలం రంగులు మబ్బుగా ఉండే వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సరైనవి. లైక్రా లేదా పాలిస్టర్ వంటి లైట్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్లను ధరించడం మంచిది. ఎందుకంటే అవి ముడతలు పడకుండానూ, సులభంగా పొడిగా మారడానికి ఉపయోగపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు బిగుతుగా ఉండే ఏదైనా బాటమ్ను ఎంచుకోండి. కానీ డెనిమ్, కాడ్రాయ్ల నుండి దూరంగా ఉండండి. పలాజోలు కూడా బాటమ్గా ఈ కాలం బాగుంటాయి. ►ఈ కాలం లెదర్ చెప్పులు, బ్యాగులకు దూరంగా ఉండండి. బదులుగా, రంగురంగుల బాలేరినా ఫ్లాట్లు, జెల్లీ షూస్, ఫ్లిఫాప్స్, ఫ్లోటర్లు లేదా క్రోక్స్ను ఎంచుకోండి. వాటర్ప్రూఫ్, టోట్తో చేసిన అధునాతన బ్యాగ్లు వాడటం మేలు. ►తేమతో కూడిన వాతావరణం కారణంగా జుట్టు చిట్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి, చక్కని బన్ను లేదా పోనీ టైల్ మంచిది. హాట్ బ్లో డ్రైయింగ్, కర్లింగ్ లేదా స్ట్రెయిటెనింగ్ ఐరన్లతో కూడిన హెయిర్స్టైల్స్కు ఈ కాలం దూరంగా ఉండటమే మంచిది. ►మేకప్ విషయానికి వస్తే చాలా తక్కువ చేసుకోవాలి. వాటర్ప్రూఫ్ మస్కారాకు బదులు కొద్దిగా పెట్రోలియమ్ జెల్లీతో మీ కనురెప్పలను దిద్దుకోవచ్చు. ముఖం కోసం బ్రౌన్, న్యూడ్ లేదా కాఫీ రంగులో క్లీన్ టోన్లను ఉపయోగించాలి. పీచ్ సూపర్ మ్యాట్ లిప్స్టిక్స్ బాగుంటాయి. ముఖ్యంగా, శుభ్రం చేయడానికి కష్టంగా ఉండే మేకప్కు దూరంగా ఉండాలి’ అని తెలియజేస్తున్నారు. కాంతిమంతం ►అబ్స్ట్రాక్ట్ ప్రింట్లు ఉన్న సిల్క్ డ్రెస్సులు, చీరలు ఈ కాలాన్ని మరింత ఉత్తేజితంగా మార్చేస్తాయి. ►చిన్నపాటి గెట్ టుగెదర్ పార్టీలకు ప్రింటెడ్ ఆర్గంజా వంటివి బాగుంటాయి. అయితే, వర్షంలో తడిస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కనుక ఇబ్బందిగా ఉంటుంది. కానీ, డల్గా ఉన్న వాతావరణాన్ని బ్రైట్గా మార్చేసే సుగుణం ఈ ప్రింట్లకు ఉంటుంది. ►ఓవర్ కోట్స్, జంప్ సూట్స్ .. సౌకర్యంగా ఉండే ఏ డ్రెస్ అయినా ఏదో ఒక చిన్న ప్రింట్ అయినా ఉన్నవి ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. తేలికైన సిల్క్ ప్రింట్లు ‘వర్షాకాల వివాహాలకు పూల ప్రింట్లు సరైనవి. తేలికగా ఉండే షిమ్మర్ బ్లైజ్, సిల్క్ లెహంగాకు పెద్ద పెద్ద బార్డర్లు లుక్కి గ్లామరస్ టచ్ని జోడిస్తాయి. అంతేకాదు రంగుల ఎంపికలలో పీచ్, పగడపు రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి మీదకు చిన్న పొట్లీ వంటి ఆభరణాలు మరింత అందాన్నిస్తాయి’ అంటారు ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి. -
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కారణాలపై విచారణ వేగవంతం
-
హీరోయిన్ సురభి లెహంగా ధర తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే!
‘చలిగాలి చూద్దూ తెగ తుంటరీ.. (జెంటిల్మన్ సినిమా)’ అంటూ యువతను గిలిగింతలు పెట్టిన నటి సురభి పురాణిక్ గుర్తుండే ఉంటుంది.. వరుసగా మూడు సినిమాలు చేసి కాస్త స్లో అయింది. లాక్డౌన్ తర్వాత మళ్లీ బిజీ అయిపోయింది.. కన్నడ, తమిళ సినిమాలతో పాటు తెలుగు తెర మీదా కనిపించబోతోంది. తన యూనిక్ స్టయిల్ కోసం ఈ స్టార్ ఏ బ్రాండ్స్ను అనుసరిస్తుందో చూద్దాం.. కీర్తి కదిరె హైదరాబాద్కు చెందిన కీర్తి కదిరె సెలబ్రిటీస్కు ఫేవరెట్ డిజైనర్. తన పేరు మీదే ఫ్యాషన్ లేబుల్ను క్రియేట్ చేసుకుంది. వెడ్డింగ్ కలెక్షన్స్కు పెట్టింది పేరు. భారతీయ సంప్రదాయ నేత కళ, ఆధునిక ప్రపంచ పోకడ.. ఈ రెండింటి పర్ఫెక్ట్ మ్యాచ్, మన్నికైన ఫాబ్రికే ఆ బ్రాండ్కి వాల్యూ. నాణ్యత, డిజైన్ను బట్టే ధరలు. ఆన్లైన్లో లభ్యం. ఫాష్యన్ జ్యూయెలరీ ఇది కూడా హైదరాబాద్కు చెందిన బ్రాండే. వ్యవస్థాపకురాలు ఐశ్వర్య. 2017లో ఇన్స్టాగ్రామ్, వాట్సప్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తన బ్రాండ్ జ్యూయెలరీ సేల్స్ను స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఇవే ఆ జ్యూయెలరీ అవుట్ లెట్స్. ఈ అవుట్ లెట్స్లాగే ఈ జ్యూయెలరీ ధరలూ అందుబాటులోనే ఉంటాయి. ఒకరకంగా అదే ఆ బ్రాండ్ వ్యాల్యూ. లెహెంగా సెట్ బ్రాండ్: కీర్తి కదిరె ధర: రూ. 1,28,000 జ్యూయెలరీ: గులాబీ రంగు ముత్యాల సెట్ బ్రాండ్: ఫ్యాషన్ జ్యూయెలరీ వెబ్ సిరీస్ ట్రెండ్ కూడా ఫాలో అవుతున్నాను. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ విషయంలో విజయశాంతే నాకు స్ఫూర్తి. – సురభి పురాణిక్ -
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెల్ల ప్రత్యూష ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒంటరితనం, డిప్రెషన్ కారణంగానే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యంత విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే ఆత్మహత్యపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. సెల్ఫీ వీడియో? ప్రత్యూష తన పరిస్థితిని మొత్తం స్నేహితులకు షేర్ చేసినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేగాక ఓ ప్రముఖ హీరోయిన్తో ప్రత్యూష చివరిసారిగా మాట్లాడినట్లు గుర్తించారు. చార్కోల్ గ్రిల్లో కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్ని ఉంచి మంటను రగిలించడం ద్వారా వచ్చే పొగను పీల్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బిల్డింగ్ సెల్లార్లోని బెడ్రూమ్లో రెండు గ్రిల్స్లో కార్బన్ మోనాక్సైడ్ను మండించి సోఫాలో పడుకొని ప్రాణాలు వదిలినట్లు పేర్కొన్నారు. డిప్రెషన్తో! ప్రత్యూష నుంచి సుసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు అందుకే వెళ్ళిపోతున్నాను’ అంటూ లేఖలో పేర్కొంది. గత కొంత కాలంగా ప్రత్యూ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్ నుంచి బయటకు రాలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రత్యూష నుంచి సుసైడ్ నోట్, పెన్డ్రైవ్, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ను పోలీసులు సీజ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్కు శాంపిల్స్ను వైద్యులు పంపారు. అపోలో ఆస్పత్రిలో ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. కాగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తన బొటిక్లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లిన ఆమె.. శనివారం విగతా జీవిగా కనిపించారు. ఐఆర్ఎస్ కుమార్తె అయిన ప్రత్యూష ఫ్యాషన్ డిజైనర్ రంగంలో రాణిస్తున్నారు. దేశంలో 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఆమె ఒకరు. దాదాపు టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేశారామో. -
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన
హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల మృతిపై మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్కు చెందిన ఎంతోమంది హీరోయిన్లకు డిజైనర్గా వ్యవహరించిన ప్రత్యూష శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె సినీ సెలబ్రెటీలు హీరోయిన్లు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన కూడా తన స్నేహితురాలైన ప్రత్యూష మృతికి నివాళులు అర్పించారు. చదవండి: నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు: కమల్ హాసన్ ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘మై బెస్టీ మై డియరెస్ట్ ఫ్రెండ్. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తోంది. ప్రతి విషయంలో ఎంతో ది బెస్ట్గా ఉండేది. ఇక కెరీర్, ఫ్యామిలీ, స్నేహితులు విషయంలోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అలా అన్ని విషయాల్లో ది బెస్ట్గా ఉండే ఆమె కూడా డిప్రెషన్కు గురైంది. ఈ సంఘటన తర్వాత కర్మ అనేది మన జీవితకాలం గుండా పయనిస్తుందనేది నిజమనిపిస్తుంది. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఉపాసన భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కాగా ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూష తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎంతోమంది హీరోహీరోయిన్లకు, సెలబ్రిటీలకు ప్రత్యూష కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. టాలీవుడ్లో శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాదాస్, కాజల్, కీర్తి సురేశ్, కృతి కర్బందా, ఉపాసన, ప్రగ్యా జైస్వాల్, రానా, రామ్ చరణ్లకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించారు. బాలీవుడ్కు చెందిన స్టార్ హీరోయిన్లకు సైతం ఆమె ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేశారు. దీపికా పదుకొనె, పరిణితి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మాధురి దీక్షిత్, విద్యాబాలన్కు కూడా వర్క్ చేశారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్సులను కూడా చాలా మంది సెలబ్రెటీలు ఎండార్స్ కూడా చేశారు. My bestie my dearest friend. Gone too soon - Upset/ Pissed / Sad She had the best of everything, career, friends & family - yet succumbed to depression. Post this incident, truly believe that karmic baggage passes through lifetimes. We pray for her peace. 🙏#rip P pic.twitter.com/1aOXixKh85 — Upasana Konidela (@upasanakonidela) June 11, 2022 -
ప్రత్యూష గరిమెళ్ల రూమ్ లో సూసైడ్ నోట్.. ఏం రాసిందంటే..??
-
Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య
-
Purva Jindal: ఫ్యాషన్ డిజైనర్ నుంచి రైతుగా.. రోజుకు 7 వేలు సంపాదిస్తూ!
‘‘జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలని అనుకుంటే చిన్నపాటి రిస్క్ చేయక తప్పదు. ధైర్యంగా ముందడుగు వేసినప్పుడే అనుకున్నది సాధించగలం’’ అంటోంది పూర్వ జిందాల్. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన పూర్వ.. బీడు భూమిని పంటపొలంగా మార్చి సేంద్రియ కూరగాయలు పండిస్తోంది. తను లక్షలు సంపాదిస్తూ మరికొంత మందికి ఉద్యోగాలిచ్చి ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. రాజస్థాన్కు చెందిన పూర్వ జిందాల్ కుటుంబం ఏళ్లుగా వస్త్ర వ్యాపారం రంగంలో రాణిస్తోంది. కుటుంబ నేపథ్యం టెక్స్టైల్స్ బిజినెస్ కావడంతో తండ్రి ఎన్కే జిందాల్ ప్రోత్సాహంతో ముంబైలో ఫ్యాషన్ డిజైనింగ్ లో ఎమ్బీఏ చదివింది. చదువు పూర్తయ్యాక కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా పొల్గొనేది. కొన్నాళ్ల తరువాత పూర్వకు కొత్తగా ఏదైనా చేయలన్న ఆలోచన వచ్చింది. ఇదే సమయంలో ఇంట్లో రెండు మూడు కూరగాయ మొక్కల్ని పెంచుతుండేది. పెరట్లో పెరిగిన కూరగాయలతో వండిన కూర చాలా రుచిగా ఉండడం గమనించింది. కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం అవసరమని వైద్యులు చెప్పడంతో..సేంద్రియ పంటలను ఆహారంగా చేర్చుకున్నప్పుడే మంచి ఇమ్యూనిటీ లభిస్తుంది అని గ్రహించింది. ఈ రెండు సంఘటనలతో దుస్తుల డిజైనింగ్ను వదిలేసి సేంద్రియ పంటలు పండించాలని నిర్ణయించుకుంది. కానీ కుటుంబంలో ఎవరికీ వ్యవసాయంపై అవగాహన లేదు. తన సర్కిల్లో వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నవారు కూడా లేరు. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా సేంద్రియ పంటలు ఎలా పండించాలి? అనేదానికి సంబంధించిన సమాచారం వెతకడం ప్రారంభించింది. అనుభవం ఉన్న రైతులు, వ్యవసాయ రంగ నిపుణుల వద్ద నుంచి సేంద్రియ పంటల గురించిన సమాచారం తెలుసుకుని సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకుంది. తరువాత రాజస్థాన్లోని ఔజిరా గ్రామంలో కొంత భూమిని ఐదేళ్ల కాలపరిమితితో కౌలుకు తీసుకుంది. రాళ్లూరప్పలతో నిండిన బంజరు భూమి కావడంతో.. సంప్రదాయ పద్ధతుల్లో శుభ్రం చేసి ఆవుపేడ, సేంద్రియ కంపోస్టును వేసి పంట పొలంగా మార్చింది. దీనిలో బఠాణీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టొమాటో, బంగాళ దుంపలు, శనగలు, చెర్రీలు, ఆకుకూరలను పండించడం ప్రారంభించింది. సేంద్రియ ఎరువులు కావడంతో పంటలన్నీ చీడపీడలు లేకుండా ఏపుగా పెరిగాయి. బాగా పండాయి కూడా. అలా పండిన కూరగాయలన్నింటిని దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్కు తరలించి తానే విక్రయిస్తూ రోజుకి ఆరు నుంచి ఏడువేల రూపాయలను ఆర్జిస్తోంది. తన దగ్గర పనిచేసే ఏడుగురు సిబ్బందికి నెలవారి జీతాలు, మిగతా వారికి రోజువారి కూలికి నాలుగు వందల రూపాయల చొప్పున ఇస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఆరోగ్యం అవగాహన.. కుటుంబంలో వ్యవసాయం చేసే తొలి వ్యక్తి తానే కావడంతో పంటలు పండించడంపై అవగాహన వచ్చేంత వరకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది పూర్వ. సాధారణ కూరగాయలకంటే సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు ధర ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే కాకుండా భవిష్యత్లోనూ సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ ఉంటుందని భావించి తన పంటలను ‘సాఖి ఆర్గానిక్’ పేరిట విస్తరించింది. వాట్సాప్ ఆర్డర్లను స్వీకరించి నేరుగా కస్టమర్ల ఇంటికే కూరగాయలను డెలివరీ చేస్తోంది. పూర్వ పంటల గురించి తెలిసిన వారంతా ఆమె వద్ద కూరగాయలు కొనడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. ఈ ప్రోత్సాహంతో ‘ఆగ్రో టూరిజం’పైన అవగాహన కల్పిస్తోంది. గ్రామాలకు దూరంగా నగరాల్లో నివసించేవారిని నెలలో రెండు రోజులు తన పొలానికి ఆహ్వానించి సేంద్రియ వ్యవసాయం గురించి వివరిస్తోంది. ఇలా వచ్చిన వారికి సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు ఎలా పండిస్తున్నారు, ఈ కూరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో వివరిస్తూ వారిలో ఆసక్తి కల్పిస్తోంది. విభిన్న ఆలోచనలకు ధైర్యం తోడైతే సాధించలేనిదంటూ ఏది లేదనడానికి పూర్వ జిందాల్ సేంద్రియ వ్యవసాయమే తార్కాణం. చదవండి: Dragon Fruit: ఒక్కసారి మొక్క నాటితే 20-30 ఏళ్లు పంట.. ఎకరాకు 14 లక్షల ఆదాయం! -
చిట్టి మెదళ్లకు చెట్టు పాఠాలు
చల్లని గాలి కావాలంటే ఏసీ ఉంటే చాలు కదా అనుకుంటారు పిల్లలు. మంచి నీళ్లు కావాలంటే ఫ్రిజ్లోంచి వస్తాయి కదా అనుకుంటారు. పండ్లు కావాలంటే మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు కదా అంటారు. పాలు ప్యాకెట్ల నుంచే వస్తాయని అనుకునే రేపటి తరం ‘పర్యావరణం’ అనే పెద్ద పదం గురించి అర్థం చేసుకోవాలంటే వారి బుర్రలకు మొక్కను పరిచయం చేయాల్సిందే! ‘అయితే అందుకు, ఇంట్లో పెద్దలే పూనుకోవాలి’ అంటారు హైదరాబాద్ మణికొండలో ఉంటున్న సోదరీమణులు రాజశ్రీ, నవ్యశ్రీ. చదువుకుంటూ, సొంతంగా ఫ్యాషన్ డిజైనర్స్గా రాణిస్తున్న ఈ అక్కాచెల్లెళ్లు ఈ వేసవిలో ఓ కొత్త ఆలోచన చేశారు. ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ చేసి, చుట్టుపక్కల పిల్లలకు ఇస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. అదే ఆచరణలో పెట్టారు. పిల్లలను ఆకట్టుకునేలా ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ చేయడం మొదలుపెట్టారు. ‘కాస్త ఫ్రీ టైమ్ కేటాయించుకునే చేస్తున్నాం. కానీ, ఒక టాయ్ పూర్తవడానికి వారం రోజులైనా పడుతుంది’ అంటున్నారు. గ్యాడ్జెట్స్కు కాస్త దూరంగా! ఎండ అని పిల్లలు ఎక్కువ శాతం ఇంటి పట్టునే ఉంటున్నారు. స్కూళ్ళు లేకపోవడంతో కాస్త పెద్ద పిల్లలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ స్క్రీన్లకు తమ కళ్లను అప్పజెప్పేసి వీడియోగేమ్స్తో కుదురుగా కూర్చుంటున్నారు. ‘గ్యాడ్జెట్స్తో ఉండే పిల్లలకు పర్యావరణం గురించి క్లాసు తీసుకుమంటామంటే వింటారా. మనమే ఇప్పుడు అమ్మో, ఏం ఎండలు.. వేడికి తట్టుకోలేకపోతున్నాం..’, ‘చల్లని గాలి అన్నదే కరువైంది. అన్నీ బిల్డింగ్లే... చెట్లు ఎక్కడ ఉన్నాయి’ అంటూ అల్లాడిపోతున్నాం. మరి పిల్లలకు వాతావరణం గురించి అర్థమయ్యేదెలా..?’ అనిపించింది. మా సొంత ఊరు వరంగల్కి వెళ్లినప్పుడు ఈ భావన మరింత బలపడింది. పట్టణాలలో ఉన్న పిల్లలకు చెట్ల గురించి, వాటి పెంపకం గురించి తక్కువ తెలుసు అని. వీటిని కొంతవరకైనా అర్థమయ్యేలా ఆసక్తికరంగా చెప్పడం కోసం ఏం చెయ్యాలా అని ఆలోచించాను’ అని వివరిస్తుంది నవ్యశ్రీ. బొమ్మలతో వివరణ.. ‘పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. కానీ, వాటిలోనూ హానికారకమైనవే ఉన్నాయి. నర్సరీ పిల్లల బుర్రల్లోకి మంచి ఆలోచనలు వచ్చేవిధంగా, అలాగే వారి శరీరానికి, ఆరోగ్యానికి ఏ మాత్రం హాని చేయని బొమ్మలైతే బాగుంటుందనిపించింది. ఈ విషయంగా శోధిస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ ప్లాంట్స్ బొమ్మల ఐడియా బాగా నచ్చింది’ అంటూ తాము ఎంచుకున్న పర్యావరణ కాన్సెప్ట్ను తెలియజేసింది రాజశ్రీ. కొబ్బరి చిప్పలు, వెదురు కొమ్మలు, మట్టి కుండలలో చిన్న చిన్న మొక్కల పెంపకం తెలిసిందే. ఐదేళ్ల లోపు పిల్లల శరీరానికి, మనసుకు హత్తుకునేలా చెప్పగలిగేదే ప్లాంటేషన్. అది ఎప్పుడూ ముచ్చటైనదే. ఫ్యాబ్రిక్తో మేకింగ్.. ‘టెడ్డీబేర్ క్లాత్ను ఉపయోగించి, బొమ్మ ఆకారం వచ్చేలా చేశాను. అందులో కొంత కోకోపిట్ నింపి, తల భాగంలో హెయిర్ ఎలా అయితే ఉంటుంది, అలా గోధుమ గడ్డి పెరిగేలా ఏర్పాటు చేశాను. అక్క వాటికి కళ్లూ, ముక్కు.. వంటివి పెట్టి ఆర్టిస్టిక్గా తయారుచేసింది. బొమ్మ తలభాగంలో పైన కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే వారం రోజుల్లో మొలకలు ఏపుగా పెరిగాయి. అప్పుడు మా చుట్టుపక్కల పిల్లలను పిలిచి, చూపించాం. ఎంత ఆనందించారో మాటల్లో చెప్పలేం. రోజంతా ఈ ప్లాంట్ బొమ్మలతోనే గడిపాశారు. ఆ సమయంలో వాతావరణం గురించి, చెట్ల గురించి ఎన్నో విషయాలు మాట్లాడాం. తరవాత వాటిని వారికే ఇచ్చేశాం. వరి, ఇతర చిరుధాన్యాలతోనూ ఇలాంటి బొమ్మలను సిద్ధం చేశాం. వీలున్నప్పుడల్లా చేస్తున్నాం. పాత క్లాత్స్తో తయారు చేసిన ప్లాంట్ టాయ్స్ని పిల్లలచేతే తయారుచేయించవచ్చు. ఇందుకు ఈ వేసవి సమయం మరింత అనువైది’’ అని తమ ప్రయత్నం గురించి వివరించింది నవ్యశ్రీ. ఆడుకున్నా మేలే.. పిల్లలకు ఈ బొమ్మలు ఏ మాత్రం హానిచేయవు. పొరపాటున నోట్లో పెట్టుకున్నా ఏ హానీ కలగదు. పైగా గోధుమగడ్డి వంటివి ఆరోగ్యానికి మంచివే. వారి ముందే బొమ్మల హెయిర్(గడ్డి) కత్తిరించి జ్యూస్ చేసి, ఇవ్వచ్చు. పిల్లలు ఈ విధానాన్ని బాగా ఆనందిస్తారు. ఈ ప్లాంట్స్తో మొక్కలను ఎలా పెంచవచ్చు, చెట్లు వాతావరణానికి, ఆరోగ్యానికి చేసే మేలేమిటి.. వంటివన్నీ చెప్పవచ్చు. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు’ కూడా అని వివరిస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. రేపటì పర్యావరణ సమతుల్యతకు ఈ రోజే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుకు, పిల్లల్లో మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఎలా పెంచవచ్చో ఇంటి నుంచే మొదలుపెట్టవచ్చు. వాతావరణ కాలుష్యానికి కారకమయ్యే ప్రతీ విషయాన్ని వివరించి, మనం జాగ్రత్తపడటంతో పాటు రేపటితరాన్నీ అప్రమత్తం చేయచ్చు. – నిర్మలారెడ్డి -
Fashion: పలాజో, స్కర్ట్స్, ఓవర్కోట్స్, లాంగ్గౌన్స్.. రితు ప్రత్యేకత అదే!
Fashion: వేసవిలో ఎక్కువగా వినిపించే పదం కాటన్. వేడిని తట్టుకొని, మేనికి హాయినిచ్చే సుగుణం ఉన్న ఫ్యాబ్రిక్. సింపుల్గా ఉండే కాటన్ని పార్టీవేర్గా మార్చుకోలేం. అనుకునేవారికి రితుబెరి కాటన్ కలెక్షన్ సరైన సమాధానం. లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్గా పేరొందిన రితుబెరి ఇక్కత్, ఖాదీలతో చేసిన రంగుల హంగామా చూడాల్సిందే! సంప్రదాయ డిజైన్స్లోనే ఆధునికతను చూపడం ఈ డిజైనర్ ప్రత్యేకత. పలాజో, స్కర్ట్స్, ఓవర్కోట్స్, లాంగ్గౌన్స్కి రెండు మూడు రంగుల హంగులు అమర్చి చేసే మ్యాజిక్ చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. చేనేతలతో ఎన్ని హంగుల అమరికతో వినూత్నమైన డిజైన్స్ తీసుకురావచ్చో రితుబెరి కలెక్షన్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. క్రింకిల్డ్ ఖాదీ స్కర్ట్స్, ట్రౌజర్స్, ఎంబ్రాయిడీ చేసిన జాకెట్స్, లాంగ్ గౌన్స్.. కాంబినేషన్స్ చూపులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఇకత్ రూపాలు ఇన్నన్ని కావు అని కళ్లకు కడతాయి. ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతాయి. విదేశాలలోనూ మన దేశీయ డిజైన్స్ ప్రత్యేకతను చాటే ఈ డిజైనర్ ఢిల్లీ వాసి. భారతదేశంలోని ఫ్యాషన్ పరిశ్రమలో సృజనాత్మకత, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి లాభాపేక్షలేని ‘ది లగ్జరీ లీగ్’ని ప్రారంభించింది. -రితుబెరి, ఫ్యాషన్ డిజైనర్ చదవండి👉🏾Aparna Balamurali: ఈ హీరోయిన్ కట్టిన చీర ధర 95 వేలు.. స్పెషాలిటీ ఏమిటంటే! చదవండి👉🏾Wedding Season Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే! -
అరవిరిసిన సోయగం... కళ్లు చెదిరే అందగత్తెలు (ఫొటోలు)
-
Summer Collection: రెక్కలు తొడిగిన ప్రింట్లు
వేసవి వేడిని తట్టుకోవడానికి మన డ్రెస్సింగ్లో చాలా మార్పులను కోరుకుంటాం. లైట్ వెయిట్తో ఉండాలి. లేత రంగులు ఉండాలి. ఆకట్టుకునే హంగులూ ఉండాలి. ఇవన్నీ కోరుకునే యువత నచ్చేలా.. వారి మనసుకు నచ్చేలా సంప్రదాయ చేనేతలతో ఆధునికత ఉట్టిపడేలా డిజైన్ చేయచ్చు. ‘ఆ ఆలోచన నుంచే రూపుదిద్దుకున్న డిజైనర్ కలెక్షన్ ఇది అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి. కాలానుగుణంగానే కాదు మారుతున్న నవతరం ఆలోచనలకు తగినట్టుగా డిజైన్స్ మీద దృష్టి పెడతానని వివరించే హేమంత్ సిరి ఇటీవల తను తీసుకువచ్చిన సమ్మర్ కలెక్షన్ గురించి చెబుతూ.. తూనీగ... తూనీగ... ‘‘వేసవి ఆహ్లాద సమయాల్లో మనల్ని చుట్టుముట్టే అందమైన జ్ఞాపకాలలో తేలికైన రెక్కలతో సందడిచేసే తూనీగ ఒకటి. సుతిమెత్త్తని చేనేత మల్ చందేరీ ఫ్యాబ్రిక్ కూడా అలాంటి ఆహ్లాదాన్నే పంచుతుంది. దీనికితోడు తూనీగ రెక్కల్లో ఉండే ముచ్చటైన ట్రాన్స్పరెంట్గా ఉండే లేత రంగులు కూడా ఆకట్టుకుంటాయి. దీని నుంచి స్ఫూర్తి పొంది, మల్చందేరీ ఫ్యాబ్రిక్ మీద వాటర్ కలర్స్తో ఆర్టిస్టులు రూపొందించిన పెయింటింగ్స్ను డిజిటల్ ప్రింట్లుగా తీసుకొస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చేసిన ఆలోచన నుంచి పుట్టుకొచ్చినదే ఈ ‘డ్రాగన్ ఫ్లై కలెక్షన్’. నవతరం ఇష్టపడేలా హుడీ ప్యాటర్న్స్, జిపర్ ప్యాటర్న్స్, లాంగ్ అండ్ షార్ట్ ఫ్రాక్స్, టాప్స్, కంఫర్టబుల్ కట్స్తో డిజైన్ చేసినవి. మొదటిసారి ఈ ప్రత్యేకమైన ప్రింట్స్తో తీసుకొచ్చిన కలెక్షన్ ఇది’’ అని వివరించారు ఈ సీజనల్ డిజైనర్. -హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
పెళ్లి వేడుకలు.. ఘనమైన అలంకారాలతో.. ప్రాచీన కళకు కొత్త హంగులు
సంప్రదాయ వేడుకల్లో తెలుగింటి వేషధారణకే అగ్రతాంబూలం ఉంటుంది. అయితే, రాచకళ తీసుకు రావాలన్నా, మరిన్ని హంగులు అమరాలన్నా ప్రాచీనకాలం నాటి డిజైన్స్కే పెద్ద పీట వేస్తున్నారు నేటి డిజైనర్లు. ‘నవతరం కోరుకుంటున్న హంగులను కూడా సంప్రదాయ డ్రెస్సులకు తీసుకువస్తున్నాం’ అని చెబుతున్నారు వెడ్డింగ్ డ్రెస్ డిజైనర్ భార్గవి అమిరినేని. కాబోయే పెళ్లికూతుళ్లు కోరుకుంటున్న డ్రెస్ డిజైన్స్ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు.. ‘కలంకారీ ప్రింట్స్, బెనారస్, కంచి పట్టులను సంప్రదాయ డిజైన్స్కు వాడుతుంటారు. అయితే, నవతరం మాత్రం వీటితోనే ఆధునికపు హంగులను కోరుకుంటున్నారు. ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్తోనే వెస్ట్రన్ కట్ కోరుకుంటున్నారు. నెక్, హ్యాండ్ డిజైన్స్ విషయంలోనే కాదు తమ ‘ప్రేమకథ’కు కొత్త భాష్యం చెప్పేలా ఉండాలని పెళ్లి కూతుళ్లు కోరుకుంటున్నారు. అందుకే వివాహ వేడుకలకు మరింత కొత్త హంగులు వచ్చి చేరుతున్నాయి. రంగుల కాంబినేషన్లు మాత్రం వేడుకను బట్టి మారిపోతున్నాయి. వీటిలో పేస్టల్ నుంచి గాఢమైన రంగుల వరకు ఉంటున్నాయి. డబుల్ లేయర్ దుపట్టాలు, లేయర్డ్ స్కర్ట్, టాప్స్.. కూడా వీటిలో ఎక్కువ ఉంటున్నాయి’ అని వివరించారు. వివాహ వేడుకలకు సిద్ధమవ్వాలంటే ఘనమైన అలంకారాలతో గొప్పగా సింగారించాలనుకుంటారు. అందుకు తగినట్టే నేటి వేడుకలకు తరతరాలుగా వస్తున్న ప్రాచీన కళకు కొత్త హంగులను అద్దుతున్నారు. మహారాణి దర్పం పెళ్లి కూతురు వేషధారణలో కంచి పట్టుచీర తప్పక ఉంటుంది. దీనికి కాంబినేషన్ బ్లౌజ్తోపాటు కుడివైపున వేసుకునే దుపట్టా కూడా ఓ హంగుగా అమరింది. దుపట్టాను బ్లౌజ్కు సరైన కాంబినేషన్ సెట్ అయ్యేలా మెజెంటా కలర్ను ఎంచుకొని, గ్రాండ్గా మగ్గం వర్క్తో మెరిపించడంతో లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. కాస్ట్యూమ్తోపాటు ఆభరణాలు కూడా పాతకాలం నాటివి ఎంపిక చేయడంతో రాయల్ లుక్ వచ్చేసింది. ఈ గెటప్కి వడ్డాణం లేదా వెయిస్ట్ బెల్ట్ యాడ్ చేసుకోవచ్చు. దుపట్టాను అవసరం అనుకుంటే వాడచ్చు. లేదంటే, ఎప్పటికీ గుర్తుగా కూడా ఉంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ బ్రోచ్లు కూడా అలంకరణలో వచ్చి చేరుతున్నాయి. కాన్సెప్ట్ బ్లౌజ్ పెళ్లికూతురు డ్రెస్ అనగానే అందరికన్నా ప్రత్యేకంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. దీంట్లో భాగంగా పెళ్లికూతురు ధరించే బ్లౌజ్పైన అమ్మాయికి అబ్బాయి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టుగా, అలాగే వారి పేర్లూ వచ్చేలా డిజైన్ చేయడంతో గ్రాండ్గా కనిపిస్తుంది. ఆభరణాల్లో ఉండే పచ్చలు, కెంపులు బ్లౌజ్ డిజైన్లలోనూ వాడుతున్నారు. ఈ బీడ్స్ ధరించే ఆభరణాలకు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నారు. పెద్దంచు మెరుపు సంప్రదాయ లుక్ ఎప్పుడూ అందానికి సిసలైన నిర్వచనంలా ఉంటుంది. పెద్ద అంచు లెహంగా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, దుపట్టా జత చేస్తే చాలు వేడుకలో ఎక్కడ ఉన్నా అందంగా కనిపిస్తారు. అయితే, హాఫ్ శారీ అనగానే గతంలో దుపట్టాలను ఓణీలా చుట్టేసేవారు. ఇప్పుడు ఒకే వైపున వేసుకోవడం కూడా ఫ్యాషన్లో ఉంది. డిజైన్స్లోనే కాదు అలంకారంలోనూ వచ్చిన మార్పు మరింత మెరుపునిస్తుంది. కలంకారికి మిర్రర్ ప్రాచీనకాలం నుంచి వచ్చిన మనవైన కళల్లో కలంకారీ ఒకటి. ఇప్పుడు ఈ ఆర్ట్పీస్ మరింత ఘనంగా సందడి చేస్తోంది. కలంకారీ క్రాప్టాప్కు మిర్రర్తో హ్యాండ్స్, నెక్లైన్ను డిజైన్ చేయడం ఈ డ్రెస్ స్పెషల్. బ్రొకేడ్ లెహెంగా మీదకు ఈ కలంకారీ బ్లౌజ్ జత చేయడంతో మరింత గొప్పగా అమరింది. – నిర్మలారెడ్డి -
ఖరీదైన ఇల్లు కొన్న ప్రముఖ డిజైనర్, ధర ఎంతంటే..
Manish Malhotra Buys 21 Crore Worth Appartment In Mumbai Bandra: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హొత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయినర్స్ సహా పలువురు సెలబ్రిటీలకు అదిరిపోయే దుస్తులు డిజైన్ చేస్తుంటారాయన. బీటౌన్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హొత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే అనేంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బీటౌన్ ఫ్యాషన్ కలల ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఈ కాస్ట్యూమ్ డిజైనర్కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. ముంబైలో భారీ మొత్తానికి మనీష్ మల్హొత్ర ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. బాంద్రా వెస్ట్లోని భోజ్వనీ ఎన్క్లేవ్లో సుమారు రూ. 21 కోట్లు పెట్టి కాస్ట్లీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. -
ఆ బ్రాండ్ మీద మోజు పడ్డ హీరోయిన్, ఈ డ్రెస్ ధర లక్ష పైచిలుకే!
మాళవిక మోహనన్ చేసింది రెండు సినిమాలే.. అయినా ప్రేక్షకులకు ఆమె అంటే క్రేజ్ ఓ రేంజ్లో. ఆమెకూ ఓ క్రేజ్.. ఇదిగో ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ పట్ల... కరిష్మా జూల్రీ కరిష్మా మెహ్రా.. పిట్ట కొంచెం కూత ఘనం లాంటి అమ్మాయి. ఇరవై ఏళ్ల వయసుకే సొంతంగా బంగారు ఆభరణాల దుకాణం ప్రారంభించడమే కాదు.. అనతి కాలంలోనే ఆ దుకాణాన్ని ప్రముఖ జ్యూయెలరీ బ్రాండ్గా తీర్చిదిద్దింది. ఆ బ్రాండ్ పేరే ‘కరిష్మా జూల్రీ’. ఇక్కడ హాల్మార్క్ వెండి, బంగారు ఆభరణాలు లభిస్తాయి. ఈ మధ్యనే తను డిజైన్ చేసిన ట్రావెల్, వెడ్డింగ్ కలెక్షన్స్కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామందికి ఈ జూల్రీ జ్యూయెలరీ ఒక ఫేవరెట్ బ్రాండ్. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. కరణ్ తోరానీ న్యూఢిల్లీకి చెందిన కరణ్ తోరానీ.. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గరే గడిపేవాడు. చుట్టూ చేనేత కళతో ఆ ప్రాంతం ఎప్పుడూ అందమైన వస్త్ర ప్రపంచంలా కరణ్కు కనిపించేది. ఆ ప్రేరణ తో బాల్యంలోనే పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నాడు. ఆ లక్ష్యంతోనే న్యూఢిల్లీలో ‘తోరానీస్’ పేరుతో ఒక బొటిక్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే తోరానీ డిజైన్స్ పాపులరై మంచి గుర్తింపు పొందాయి. చాలామంది సెలబ్రిటీస్ కరణ్తో ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయించుకుంటారు. ఈ దుస్తుల ధర డిజైన్ను బట్టే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లో ఈ డిజైన్స్ లభిస్తాయి. డ్రెస్ డిజైనర్ : కరణ్ తోరానీ ధర: రూ. 1,62,000 జ్యూయెలరీ బ్రాండ్: కరిష్మా జూల్రీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. దుస్తులపై పెద్దగా దృష్టి పెట్టను. కానీ, అందరమ్మాయిల్లాగే నాకూ జ్యూయెలరీ అంటే ఇష్టం. ముఖ్యంగా బోల్డ్ ఇయరింగ్స్ నా ఫేవరెట్. – మాళవిక మోహనన్ -
ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు: డీజే టిల్లు హీరోయిన్
‘మెహబూబా’తో ప్రేక్షకులను తన ప్రేమలో పడేసింది నేహా శెట్టి. ఆమె కూడా లవ్లో పడింది... ఈ ఫ్యాషన్ బ్రాండ్స్తో! దీప్తి.. హైదరాబాద్కు చెందిన డిజైనర్ దీప్తి పోతినేని.. 1980ల నాటి ఫ్యాషన్ను పునః సృష్టించడంలో సిద్ధహస్తురాలు. అప్పటి పట్టు, ప్యూర్ ఆర్గాంజా, టిష్యూ, కాటన్ ఫ్యాబ్రిక్తో రూపొందించే యూనిక్ డిజైనర్ చీరలు దీప్తిని ఎయిటీస్ స్పెషలిస్ట్ డిజైనర్గా నిలబెట్టాయి. ఎక్కువగా సంప్రదాయ ఎంబ్రయిడరీనే వాడుతుంటుంది. ఈ మధ్యనే తన పేరు మీదే హైదరాబాద్లో ఓ ఫ్యాషన్ హౌస్నూ ప్రారంభించింది. డిజైన్ను బట్టే ఉంటాయి ధరలు.. వేల నుంచి లక్షల్లో. ఆన్లైన్లోనూ లభ్యం. చీర డిజైనర్: దీప్తి ధర: రూ. 38,800 కిషన్దాస్ జ్యూయెలర్స్ ఎత్నిక్ అండ్ యాంటిక్ జ్యూయెలరీని రూపొందించడం కిషన్దాస్ జ్యూయెలర్స్ ప్రత్యేకత. సుమారు 145 ఏళ్ల కిందట హరికిషన్దాస్, అతని కుమారుడు కిషన్దాస్.. నిజాం రాజకుటుంబీకులకు ఆస్థాన ఆభరణాల డిజైనర్స్గా పనిచేసేవారట. ఆ వారసత్వాన్నే వారి తర్వాతి తరం వారు అందిపుచ్చుకుని ‘కిషన్దాస్ జ్యూయెలర్స్’ పేరుతో బంగారు నగల వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుతం వారి నాలుగోతరం వారసులు నితిన్, ప్రశాంత్లు దీనిని కొనసాగిస్తున్నారు. బంగారం, వెండి, యాంటిక్ రత్నాలు, ముత్యాలు, అరుదైన రాళ్లతో రూపొందించే ఈ ఆభరణాలకు క్రేజే కాదు ధర కూడా ఎక్కువే. ఈ నగలు ఆన్లైన్లోనూ దొరుకుతాయి. జ్యూయెలరీ బ్రాండ్: కిషన్దాస్ జ్యూయెలర్స్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్పై ఆధారపడి ఉంటుంది. ‘చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్లు వేసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు. ఇక మోడలింగ్ చేసే టైమ్లో ఫ్యాషన్పై అవగాహన పెరిగింది. అందుకే చాలా వరకు నా స్టైలింగ్ మొత్తం నేనే చూసుకుంటా’ – నేహా శెట్టి. -దీపికా కొండి -
ఆలియా వేసుకున్న డ్రెస్ ధర సుమారు లక్షల్లోనే!
బాలీవుడ్ క్యూట్ బ్యూటీ, ఆర్ఆర్ఆర్ సీత అలియా భట్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్లో అలియా యాక్టింగ్కు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఆలియా భట్.. పేరునే పరిచయంగా, ప్రతిభనే ఉనికిగా మార్చుకున్న నటి. ఫ్యాషన్లోనూ అంతే ప్రత్యేకతను చాటుతోంది... ఈ బ్రాండ్స్తో! మాధుర్య క్రియేషన్స్... పేరుకు తగ్గట్టే చక్కటి ఆభరణాలను డిజైన్ చేస్తుందీ సంస్థ. బెంగళూరుకు చెందిన భానుమతి నరసింహన్ స్థాపించిన ‘గిఫ్ట్ ఎ చైల్డ్’ స్వచ్ఛంద సంస్థ కోసం ఈ మాధుర్య క్రియేషన్స్ పనిచేస్తుంది. 2007లో ప్రారంభించిన ఈ సంస్థ, మొదట కేవలం ఆభరణాలనే అందించే వారు. ప్రస్తుతం ఆభరణాలతో పాటు ట్రెడిషనల్ డిజైన్స్లో చీరలు, గృహ అలంకరణ సామాగ్రి కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ఎక్కువగా హస్తకళలకు ప్రాధాన్యం ఇస్తారు. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. పాయల్ ఖండ్వాలా.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్లో పాయల్ ఖండ్వాలా ఒకటి. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్తో లభించే ఈ డిజైన్స్కు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. 2012లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పాయల్ తన పేరు మీదే ‘పాయల్ ఖండ్వాలా’ పేరుతో మొదలుపెట్టిన ఈ ఫ్యాషన్ బ్రాండ్ అంటే ప్రతి ఒక్కరికీ క్రేజే. ధర కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. సందర్భానికి తగ్గట్టు స్పెషల్గా దుస్తులను డిజైన్ చేయించుకునే వీలు కూడా ఉంటుందిక్కడ. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ లభిస్తాయి. పాయల్ ఖండ్వాలా బ్రాండ్ డ్రెస్ ధరలు కుర్తా- రూ. 47,500 పలాజో- రూ. 64,500 దుపట్టా- రూ. 17,500 మాధురి క్రియేషన్స్ బ్రాండ్ జ్యూయెలరీ ధర- రూ. 9,400 'చాలామంది ఫ్రాన్స్కు చెందిన ఫ్రింజ్ ట్రెండ్ అంటే ఇష్టపడతారు కానీ, నాకెందుకో ఆ స్టయిల్ డిజైన్స్ పెద్దగా నచ్చవు. అది తప్ప మిగితా ఫ్యాషన్ ట్రెండ్స్ అన్నింటినీ నేను ఫాలో అవుతా.' అని అలియా తెలిపింది. -
జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం!
‘జంతు చర్మాలు ఒలిచి మనకెందుకు అలంకారం?!’ అంటున్న నవసమాజానికి ‘వీగన్ ఫ్యాషన్’ సమాధానంగా వచ్చేసింది. దీనిలో భాగంగా జంతువుల చర్మంతో కాకుండా మొక్కలు, పండ్ల నుంచి తీసిన గుజ్జుతో బ్యాగ్స్, షూస్, వాలెట్స్, బెల్ట్స్.. తయారు చేస్తున్నారు. డ్రెస్సులను రూపొందిస్తున్నారు. ఈ యేడాది సరికొత్త నిర్ణయంతో వీగన్ వైపు దృష్టి మరల్చి మన ముందుకు వచ్చిన సరికొత్త ఫ్యాషన్ ఇది.. సాధారణంగా జంతుజాలాన్ని చంపి, వాటి చర్మంతో తయారుచేసిన బ్యాగులు, షూస్, బెల్ట్ల రూపేనా మార్కెట్లో విరివిగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు హక్కుల కార్యకర్తలు ఈ విధానం పట్ల ఏ మాత్రం సంతోషంగా లేరు. హింస ఒక్కటే కాదు, తోలు యాక్ససరీస్ ఉత్పత్తుల తయారీలో వెలువడే హానికారకాలు పర్యావరణానికి హాని చేస్తాయని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుకోవాల్సిందే అనే వాదనలూ పెరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచ దృష్టి వీగన్వైపు మళ్లింది. గ్రేప్ లెదర్ స్నికర్స్ తోలు ఉత్పత్తులతో కాకుండా పర్యావరణానికి హానికరం కాని వ్యర్థాల నుండి తయారుచేసిన లెదర్తో రూపొందించిన షూస్. ద్రాక్ష నుంచి, వైన్ వ్యర్థాల నుంచి తయారుచేసిన లెదర్తో శాకాహారి స్నికర్స్ను తయారుచేసింది పంగైయా కంపెనీ. కిందేటాడాది నైక్ పినాటెక్స్తో కలిసి పైనాపిల్ నుంచి రూపొందించిన లెదర్తో ఎయిర్మ్యాక్స్ స్నికర్స్ను తయారుచేసింది. వ్యర్థాలతో రీసైకిల్ స్నికర్స్ బ్రాండ్ ‘వెజా’ ప్లాస్టిక్ సీసాలను రీ సైకిల్ చేసి, మొక్కొజొన్న ఫైబర్తోనూ షూస్ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. (చదవండి: ఎలాన్ మెచ్చిన మన ఎల్లుస్వామి) ఖరీదులోనూ ఘనమైనవే! క్రాస్ బాడీ బ్యాగ్, ట్రావెల్ ఆర్గనైజర్లు, బ్యాక్ప్యాక్లను వీగన్ ప్రియుల కోసం మూన్ రాబిట్ అందిస్తోంది. ఏ మాత్రం జంతుహింస లేని ఈ బ్యాగుల తయారీ తెలిసినవారు వీటిని సొంతం చేసుకుంటున్నారు. వెజిటబుల్ లెదర్తో తయారుచేసిన యాక్ససరీస్ ఖరీదులోనూ ఘనంగానే ఉన్నాయి. వేల రూపాయల్లో ఖరీదు చేసే ఈ వస్తువుల తయారీలో రానున్న రోజుల్లో వచ్చే మార్పులతో అందరికీ అందుబాటులో ఉండనున్నాయి. (హలో గురూ.. జర జాగ్రత్త! అంతా తెలుసు అని కొట్టిపడేయొద్దు.. చిట్కాలివిగో..) ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రాండ్లు అమెరికన్ సోషలైట్ కిమ్ కర్దాషియన్ నుంచి మన బాలీవుడ్ తార దీపికా పదుకొనె వరకు పెటా ఆమోదించిన ‘ఔట్హౌజ్’ వీగన్ అలంకార ఉత్పత్తులను వాడుతున్నారు. కంపెనీ డిజైనర్ సాషా గ్రేవాల్ ‘డిజైనర్లుగా మనం ట్రెండ్ను సెట్ చేస్తున్నప్పుడు, పర్యావరణం పట్ల స్పృహతో కూడా ఉండాలి. మొదటి ఉత్పత్తి సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ జంతు ఆధారిత ఉత్పత్తులను వాడకూడద’నుకున్న నిర్ణయాన్ని వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండెడ్ కంపెనీలన్నీ ఇప్పుడు వీగన్స్ కోసం సరికొత్తగా ఫ్యాషన్వేర్ను తయారుచేస్తున్నాయి. (Health Tips: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే..) గ్లోబల్ ఫౌండేషన్స్ ‘లెయిడ్’ ఫౌండేషన్ సృష్టికర్త డిజైనర్స్టెల్లా మెక్కార్ట్నీ ‘నో–లెదర్, నో–ఫర్’ ప్రతిజ్ఞతో ప్రారంభించి ఈ పని ద్వారా అన్ని వర్గాలకూ చేరవవుతున్నారు. ‘మీ వార్డ్రోబ్లో మరిన్ని శాకాహార ఉత్పత్తులను చేర్చడానికి మేం అన్నివేళలా పనిచేస్తాం’ అంటున్నారు ప్రపంచ ఫ్యాషన్ డిజైనర్లు. (వయ్యారి భామా.. నీ హంస నడకా! ఇండియన్ సిల్క్ క్వీన్ విజేతలు వీరే!)