imports
-
చౌక దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం
న్యూఢిల్లీ: చైనా సహా పలు ఆసియా దేశాల నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమలను కాపాడేందుకు కేంద్రం కఠిన చర్య తీసుకుంది. వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ లు, అల్యూమినియం ఫాయిల్ సహా ఐదు ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. సాఫ్ట్ ఫెరైట్ కోర్స్, ట్రైక్లోరో ఇసోసైనారిక్ యాసిడ్, పాలీ వినిల్ క్లోరైడ్ పేస్ట్ రెజిన్పై యాంటీ డంపింగ్ సుంకాలు మోపింది. చైనా సహా పలు దేశాలు సాధారణ ధరలకంటే చౌకగా ఈ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి కుమ్మరిస్తున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక నోటఫికేషన్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీఐటీ) అండ్ కస్టమ్స్ (రెవెన్యూ విభాగం) జారీ చేసింది. సాఫ్ట్ ఫెరైట్ కోర్స్, వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ , ట్రిక్లోరో ఇసోసైనారిక్ యాసిడ్పై ఐదేళ్లపాటు యాంటీ డంపింగ్ సుంకాలు అమలవుతాయని పేర్కొంది. ఐదేళ్ల పాటు అమల్లో..: ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జర్లు, టెలికం పరికరాల్లో సాఫ్ట్ ఫెరైట్ కోర్స్ను వినియోగిస్తుంటారు. వీటిపై 35 శాతం అదనపు సుంకాన్ని సీబీఐటీ కస్టమ్స్ విధించింది. వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ లపై టన్నుకు 1,732 డాలర్ల యాంటీ డంపింగ్ సుంకం అమలు కానుంది. పాలీ వినిల్ క్లోరైడ్ పేస్ట్ రెజిన్పై టన్నుకు 89 డాలర్ల నుంచి 707 డాలర్ల మధ్య చైనా, దక్షిణ కొరియా, మలేషియా, నార్వే, తైవాన్, థాయిలాండ్ నుంచి వచ్చే దిగుమతులకు ఐదేళ్లపాటు వర్తిస్తుంది. -
2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..
ఆహార ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు భారత ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్1, 2024 నుంచి మార్కి 31, 2025)లో మూడు మిలియన్ టన్నుల (ఎంటీ) గోధుమలను బహిరంగ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంది. ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ, మార్కెట్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ఈ చర్యలను అమలు చేసినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇటీవల కాలం వరకు మిగులు గోధుమ నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద 2024 ఆర్థిక సంవత్సరంలో బల్క్ కొనుగోలుదారులకు రికార్డు స్థాయిలో 10 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించడం విశేషం.లభ్యత తగ్గుదల2023-24 పంట సంవత్సరానికి భారతదేశ గోధుమ ఉత్పత్తి 113.29 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ఇది బలమైన సరఫరాను నిర్ధారిస్తుంది. అయితే మిగులు నిల్వలను మార్కెట్ డిమాండ్లతో సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం గతంలో సవాళ్లు ఎదుర్కొంది. కానీ ఇటీవల దేశీయ గోధుమల లభ్యత తగ్గిపోవడంతో దిగుమతులపై ఆధారపడుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో మూడు మూడు మెట్రిక్ టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవడం ద్వారా తక్కువ కాలంలో ధాన్యం లభ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.వేలంలో తగ్గిన ధరలుబల్క్ కొనుగోలుదారులు, ప్రాసెసర్లకు ధాన్యాన్ని విక్రయించడానికి ఇటీవల నిర్వహించిన వీక్లీ ఆక్షన్లో ఎఫ్సీఐ 0.49 మెట్రిక్ టన్నుల గోధుమలను విక్రయించింది. అంతకుముందు వారంకంటే క్వింటాలుకు కనీసం రూ.200 తక్కువకు అమ్ముడయ్యాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి. కొత్త మార్కెటింగ్ సీజన్ (2025-26) కోసం మధ్యప్రదేశ్లో మార్చి 15న సేకరణ కార్యకలాపాలు ప్రారంభంకానున్నందున వీక్లీ ఇ-ఆక్షన్ కొనసాగే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ అధికారికంగా ఎఫ్సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్తో సహా ఇతర రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి రైతుల ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు గోధుమలను కొనుగోలు చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోని మండీలకు తాజా పంట రావడం ప్రారంభమైందని, ఇది సరఫరాను పెంచుతుందని తెలిపాయి.బఫర్ కంటే అధికంగానే నిల్వలుగతేడాది ఏప్రిల్ 1న ఎఫ్సీఐ వద్ద 7.46 మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉండగా, ఈసారి 13.55 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం గోధుమ నిల్వలు ఈ ఏడాది ఏప్రిల్ 1న 10-11 మెట్రిక్ టన్నుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది బఫర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 2024-25 సీజన్లో కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2425 కంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో క్వింటాలుకు రూ.125 బోనస్ ప్రకటించించారు. దాంతో రాబోయే రెండు వారాల్లో పంట రాబడి పుంజుకున్న తర్వాత మండీ ధరలు క్వింటాలుకు రూ.2600 వరకు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.ఈసారి సేకరణ ఇలా..2025-26 రబీ మార్కెటింగ్ సీజన్ (ఏప్రిల్-జూన్)లో ఏజెన్సీల ద్వారా గోధుమల సేకరణ 31 మెట్రిక్ టన్నులుగా ఉంటుందని ఆహార మంత్రిత్వ శాఖ గత వారం అంచనా వేసింది. ఇది 2024-25 మార్కెటింగ్ సీజన్లో వాస్తవ కొనుగోలు 26.6 మెట్రిక్ టన్నులతో పోలిస్తే 26 శాతం అధికంగా ఉంది. 2021-22 సీజన్లో రికార్డు స్థాయిలో 43.3 మెట్రిక్ టన్నుల సేకరణను సాధించిన తరువాత ఎంఎస్పీ, తక్కువ ఉత్పత్తి కారణంగా 2022-23 సీజన్లో రికార్డు స్థాయిలో 18.8 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. అయితే 2023-24 సీజన్లో ఇది 40 శాతం పెరిగి 26.2 మెట్రిక్ టన్నులకు చేరుకుంది.ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్ సీక్రెట్ ఇదే..2023-24 పంట సంవత్సరంలో గోధుమ ఉత్పత్తి 113.29 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాసెసింగ్ పరిశ్రమ అంచనాల ప్రకారం ప్రస్తుత పంట సంవత్సరంలో (2024-25) గోధుమ ఉత్పత్తి 110 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరానికి (2024-25) ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,275 ఉంది. -
ప్లాటినం అల్లాయ్ దిగుమతులపై నిబంధనలు కఠినతరం
విలువైన లోహాలపై దిగుమతి సుంకం ఎగవేతను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 99 శాతం స్వచ్ఛత కలిగినవి మినహా ప్లాటినం అల్లాయ్ దిగుమతులు ఇక నుంచి నియంత్రిత కేటగిరీ కిందకు వస్తాయని ప్రకటించింది. దిగుమతి సుంకాలను తప్పించుకునేందుకు కొంతమంది దిగుమతిదారులు బంగారం ఉత్పత్తులను ప్లాటినం అల్లాయ్గా మారుస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న భారత్ చాలా కాలంగా దిగుమతి సుంకాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్లాటినం అల్లాయ్ దిగుమతులపై స్పష్టమైన వర్గీకరణ ఉండడం ద్వారా ప్రభుత్వం వాణిజ్య పద్ధతులపై నియంత్రణను కఠినతరం చేసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం ప్లాటినం మిశ్రమ దిగుమతులను ‘ఉచితం’గా వర్గీకరించారు. అంటే ఇది సాపేక్షంగా నియంత్రణ లేని వాణిజ్యానికి అనుమతిస్తుంది. అయితే, దీన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలున్నాయి. దాంతోపాటు ఇటీవల కాలంలో బంగారం ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు అధికమవుతుండడంతో వాటిని ప్లాటినం అల్లాయ్లుగా మార్చి వాణిజ్యానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.ఈ చర్యలు బంగారు నగలు, విలువైన లోహాల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. 99 శాతం స్వచ్ఛత కలిగినవి మినహా ప్లాటినం అల్లాయ్ దిగుమతులు ఇక నుంచి నియంత్రిత కేటగిరీ కిందకు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పన్ను ఎగవేతను అరికట్టే ప్రయత్నాలు చేపడుతోంది. పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు మారాల్సిన అవసరాన్ని ఇది చర్చ నొక్కి చెబుతుంది. పరిశ్రమ వ్యూహాలను ఎప్పటికప్పుడు పునఃసమీక్షిస్తూ మందుకుసాగాలని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..ప్రభుత్వ చర్యల ప్రభావం ఇలా..సుంకాల ఎగవేతను అరికట్టడం: అధిక దిగుమతి సుంకాలను దాటవేసేందుకు దిగుమతిదారులు బంగారం ఉత్పత్తులను ప్లాటినం అల్లాయ్గా మలచకుండా నిరోధించడమే ఈ విధానం లక్ష్యం. ఈ లొసుగును కట్టడి చేయడం ద్వారా ప్రభుత్వం ఆదాయ మార్గాలను పరిరక్షించవచ్చు. న్యాయమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారించవచ్చు.ఆభరణాల పరిశ్రమపై ప్రభావం: ప్లాటినం మిశ్రమాలపై ఆధారపడే నగల వ్యాపారులకు ఖర్చులు పెరగడానికి ఈ చర్యలు దారితీయవచ్చు. ఇది ప్లాటినం ఆభరణాల అధిక ధరలకు అవకాశం కల్పిస్తుంది. ఇది వినియోగదారుల డిమాండ్ను ప్రభావితం చేస్తుంది.ప్రాసెసింగ్ను ప్రోత్సహించడం: ఈ చర్య ప్లాటినం మిశ్రమాల దేశీయ ప్రాసెసింగ్ను ప్రోత్సహిస్తుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. -
ట్రేడ్ వార్ టెర్రర్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 10%, యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై 25% తాజా సుంకాల ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 74వేల స్థాయి దిగువన 73,198 వద్ద నిలిచింది. నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోయి 22,125 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,471 పాయింట్లు క్షీణించి 73,141 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు కుప్పకూలి 22,105 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. → అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఇండెక్సుల వారీగా.. ఐటీ సూచీ 4.20% పతనమైంది. టెలి కమ్యూనికేషన్, ఆటో ఇండెక్సు 4%, కన్జూమర్ డి్రస్కేషనరీ 3%, ఆయిల్అండ్గ్యాస్ 2.50%, విద్యుత్ ఇండెక్స్ 2% నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2.33%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.16 క్షీణించాయి. → స్టాక్ మార్కెట్ 2% పతనంతో శుక్రవారం ఒక్కరోజే రూ.9.08 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.384.01 లక్షల కోట్లకు దిగివచ్చింది. → సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2%) తప్ప మిగిలిన అన్ని షేర్లూ పతనమయ్యాయి. అత్యధికంగా టెక్ మహీంద్రా 6%, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.5%, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్టెల్ 5%, టైటాన్ 4.5% పడ్డాయి.→ గతేడాది సెపె్టంబర్ 27 నాటి సెన్సెక్స్ రికార్డు గరిష్టం(85,978) నుంచి 12,780 పాయింట్లు(15%), నిఫ్టీ జీవితకాల గరిష్టం(26,277) నుంచి 4,153 పాయింట్లు(16%) క్షీణించాయి. ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనలు, ట్రంప్ వాణిజ్య విధానాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దీనికి కారణయ్యాయి. పతనానికి కారణాలుతారస్థాయికి వాణిజ్య యుద్ధ భయాలు: చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 10% సుంకాలు విధించిన ట్రంప్.. అదనంగా మరో 10% విధిస్తున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 25% సుంకాల విధింపు ఉంటుందన్నారు. వీటికి తోడు భారత్తో సహా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఏప్రిల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెక్సికో, కెనడాల దిగుమతులపై ప్రతిపాదించిన 25% సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి.టెక్ షేర్లు క్రాష్: టెక్ దిగ్గజం ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అంచనాలతో వాల్ స్ట్రీట్లో అధిక మార్కెట్ విలువ కలిగిన టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగ షేర్లపైనా పడింది. నెలరోజుల కనిష్టానికి ప్రపంచ మార్కెట్లు: వాణిజ్య యుద్ధ భయాలకు తోడు టెక్ రంగ షేర్ల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నెలరోజుల కనిష్టానికి దిగివచ్చాయి. ఆసియాలో దక్షిణ కొరియా, ఇండోనేషియా, హాంగ్కాంగ్, జపాన్ సూచీలు 3.50% నుంచి 3% కుప్పకూలాయి. చైనా, సింగపూర్ తైవాన్ ఇండెక్సులు 2–1% నష్టపోయాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి.బలపడుతున్న డాలర్ ఇండెక్స్: వాణిజ్య యుద్ధ భయాలతో అమెరికా కరెన్సీ డాలర్ ఇండెక్స్ 10 వారాల గరిష్టానికి (108) చేరుకుంది. దీంతో భారత్తో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారింది. ఆగని ఎఫ్ఐఐల అమ్మకాలు: దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం దలాల్ స్ట్రీట్ పతనానికి మరో ప్రధాన కారణం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ ఫిబ్రవరిలోనే రూ.58,988 కోట్ల ఈక్విటీలు అమ్మేశారు.రూపాయి 19 పైసలు పతనం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 87.37 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి చేరుకోవడం, వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 35 పైసలు బలహీనపడి 87.53 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా, ఫిబ్రవరి 10న రూపాయి 87.94 వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకింది. -
యూరప్పై యూఎస్ సుంకాల మోత.. ఎంతంటే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చీరాగానే కార్యనిర్వాహక ఉత్తర్వులను(ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) జారీ చేసి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఆందోళనలను రేకిత్తించారు. అనుకున్న విధంగానే ప్రమాణ స్వీకారం తర్వాత వరుసగా వివిధ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి చేసే దిగుమతులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఈయూ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించేందుకు తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్ల దిగుమతులపై ప్రత్యేక దృష్టి సారించి సుంకాలు విస్తృతంగా వర్తిస్తాయని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య లోటును ప్రధాన సమస్యగా పేర్కొంటూ ఈయూ అమెరికాను వినియోగించుకుంటుందని తెలిపారు.సుంకాలు తొలిసారి కాదు..ట్రంప్ సుంకాలతో ఈయూను టార్గెట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. తన మొదటి పదవీకాలంలో యూరప్ చేసుకున్న ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై సుంకాలు విధించారు. ప్రస్తుతం ‘అమెరికా ఫస్ట్’ అనే విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో యూరప్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్లు విధించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఈయూతో అమెరికాకు ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యాల కంటే ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఎఫ్సీఐ చూపు.. రుణాల వైపుఆర్థిక ప్రభావాలుప్రతిపాదిత సుంకాలు గణనీయమైన ఆర్థిక ప్రభావాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అధిక టారిఫ్ల వల్ల స్థానికంగా యూఎస్లో తయారీ పరిశ్రమను పరుగులు పెట్టించే అవకాశం ఉంటుంది. లేదంటే తప్పకుండా వినియోగదారులు అవే వస్తువులు వాడాలనుకుంటే మాత్రం ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇలా ఉత్పత్తులపై పెరిగే ఖర్చులు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త టారిఫ్లపై ‘గట్టిగా, వెంటనే’ ప్రతిస్పందిస్తామని యూరోపియన్ కమిషన్ హెచ్చరించింది. స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్ ట్రంప్ అభిప్రాయాన్ని తప్పుబట్టారు. -
జపాన్ ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకోవడం ద్వారా ఇండియా జపాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతూకాన్ని తీసుకురానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–జనవరిలో జపాన్కు దేశీ ఎగుమతులు 21 శాతంపైగా ఎగసి 5.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతుల విలువ 9.1 శాతం పెరిగి 15.92 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి 10.82 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది. గతేడాది(2023–24)లో జపాన్కు భారత్ ఎగుమతులు 5.15 బిలియన్ డాలర్లుకాగా.. దిగుమతులు 17.7 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటు 12.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సమతూకానికి చర్యలు చేపట్టినట్లు గోయల్ తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. తద్వారా పరస్పర లబ్దికి వీలుంటుందని ఇండియా–జపాన్ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల(ఎకానమీ అండ్ ఇన్వెస్ట్మెంట్) సదస్సులో గోయల్ తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, హైటెక్ సెమీకండక్టర్ల తయారీ, ఎల్రక్టానిక్స్ గూడ్స్, ఏఐ తదితర విభాగాలలో మరింత సహకారానికి జపనీస్ సంస్థలను ఆహ్వానించారు. సమీకృత స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(సీఈపీఏ)పై రెండు దేశాలు 2011లో సంతకాలు చేశాయి. 1,400కుపైగా జపనీస్ కంపెనీలు భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పలు జపనీస్ కంపెనీలతో 8 రాష్ట్రాలలో 11 పారిశ్రామిక టౌన్షిప్లు విస్తరించాయి. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ముంబై, అహ్మదాబాద్ హైస్పీ డ్ రైల్ సహా ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రో వ్యవస్థలు దేశీ అభివృద్ధిలో జపనీస్ కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తున్నట్లు గోయల్ ప్రస్తావించారు. సమీప భవిష్యత్లో ముంబై, అహ్మదాబాద్ల మధ్య బుల్లెట్ ట్రయిన్ సరీ్వసులు ప్రారంభంకాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ట్రంప్ ‘ఉక్కు’ పాదం..!
న్యూఢిల్లీ: అన్ని రకాల ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై పాతిక శాతం టారిఫ్లు వడ్డించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచన భారత పరిశ్రమలను కలవరపరుస్తోంది. దీనితో బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భారత్ ఉక్కు ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు అయిదు శాతం లోపు ఉంటోంది. అయినప్పటికీ భారతీయ ఉక్కు ఎగుమతిదార్లు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో కొంత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హుయ్ తింగ్ సిమ్ తెలిపారు. అమెరికా టారిఫ్ల దెబ్బతో మిగతా దేశాల్లో సరఫరా పెరిగిపోయి, భారత్ ఎగుమతులకు ప్రతికూలం కావచ్చని పేర్కొన్నారు. గత పన్నెండు నెలలుగా భారీ స్థాయిలో ఉక్కు దిగుమతులతో ధరలు, ఆదాయాలు పడిపోయి దేశీ ఉత్పత్తి సంస్థలు ఇప్పటికే సతమతమవుతున్నట్లు వివరించారు. ఇదే సమయంలో టారిఫ్ల వల్ల అమెరికాలోని ఉక్కు ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని సిమ్ చెప్పారు. అక్కడ దేశీయంగా ఉక్కుకు డిమాండ్ పెరిగి, ధరలూ పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. సుంకాల విధింపుతో అమెరికాకు ఉక్కు ఎగుమతులు 85 శాతం మేర తగ్గిపోవచ్చని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్ఏ) ప్రెసిడెంట్ నవీన్ జిందాల్ తెలిపారు. ఇలా మిగిలిపోయేదంతా, ప్రస్తుతం వాణిజ్యపరమైన ఆంక్షలు లేని అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన భారత మార్కెట్లోకి వెల్లువెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అల్యూమినియం పరిశ్రమపై ప్రభావం గట్టిగా పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే భారత అల్యుమినియం ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 12 శాతం ఉంటుంది. గతేడాది నవంబర్ నాటికి 777 మిలియన్ డాలర్ల అల్యూమినియం ఎగుమతులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమతో పోలిస్తే అల్యుమినియం రంగంపై టారిఫ్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్తో నిర్వహించబోయే సమావేశంలో టారిఫ్ల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2018 వ్యూహం.. ట్రంప్ 2018 వ్యూహాన్నే మళ్లీ అమలు చేస్తే వాణిజ్యానికి సంబంధించి బేరసారాలు ఆడేందుకు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. 2018లోనూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా, అప్పట్లో మిగతా దేశాలతో పోలిస్తే భారత్పై పెద్దగా ప్రభావం పడలేదు. ప్రతిగా 2019లో 28 అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ కూడా అదనపు సుంకాలు విధించింది. 2023లో భారత్ నుంచి ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్లు తొలగించింది. తాజాగా టారిఫ్ల పెంపు అనేది అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేసే జపాన్, యూరప్ దేశాలు, కెనడా, మెక్సికోపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ సరఫరా పెరిగిపోయి, ధరలు పడిపోవడం వల్ల భారత్కి కూడా కాస్త ప్రతికూలంగానే ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. ఆందోళన చెందనక్కర్లేదు: ఉక్కు శాఖఅమెరికాకు భారత్ ఉక్కు ఎగుమతులు అంతగా లేవు కాబట్టి టారిఫ్ల గురించి దేశీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ తెలిపారు. ‘గతేడాది మనం 14.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తే అందులో అమెరికాకు ఎగుమతి చేసింది చాలా తక్కువే. కాబట్టి, టారిఫ్ల పెంపు పెద్ద సమస్య కాబోదు‘ అని ఆయన చెప్పారు. దేశీయంగా ఉక్కు వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో డిమాండ్కి తగ్గట్లుగా పరిశ్రమ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చని వివరించారు. -
టారిఫ్ వార్.. బొమ్మాబొరుసు!
సాక్షి, బిజినెస్ డెస్క్: ట్రంప్ దూకుడు చూస్తుంటే.. ఇతర దేశాలను కాళ్లబేరానికి తెచ్చుకునే వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రేపోమాపో మనకూ సుంక‘దండన’తప్పకపోవచ్చు. ఇప్పటికే పలుమార్లు భారత్ను ‘అమెరికాకు అతిపెద్ద టారిఫ్ ముప్పు’గా అభివర్ణించారు కూడా. డీ–డాలరైజేషన్ చర్యల నుంచి వెనక్కతగ్గకపోతే బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా హెచ్చరించారు. అయితే, అమెరికా టారిఫ్లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని స్వయంగా ఆ దేశ ఆర్థిక వేత్తలు, నిపుణులే హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కకావికలం అవుతాయని, దీంతో ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి.. ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు దారితీస్తుందని చెబుతున్నారు. సుంకాల విధింపుతో ఎగుమతిదారులు ఆమేరకు రేట్లు పెంచుతారు. అమెరికా ప్రజలు కూడా ఆయా దేశాల ఉత్పత్తులను అధిక ధరలకు కొనుక్కోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.మన ఎగుమతులకు లాభమేనా?ట్రంప్ టారిప్ వార్తో ప్రస్తుతానికి కొన్ని రంగాల్లో ఎగుమతిదారులకు కొంత లాభమేనని పరిశ్రమవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుతానికి మనపై సుంకాలు విధించకపోవడంతో చైనా ఉత్పత్తులతో పోలిస్తే మన ఎగుమతులకు పోటీతత్వం పెరుగుతుందని భారతీయ ఎగుమతిదారుల సంఘం (ఫియో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. అయితే, భారత్లోకి చైనా సహా పలు దేశాల నుంచి చౌక దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, ఇది మన పరిశ్రమలకు ముప్పుగా మారొచ్చని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకాల విషయంలో తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ సూచించారు.ఆటోమొబైల్: భారత వాహన విడిభాగాల సంస్థలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా ఉంది. పరిశ్రమ అసోసియేషన్ (ఏసీఎంఏ) ప్రకారం 2024–25లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. ఇందులో 3.67 బిలియన్ డాలర్లు, అంటే 28 శాతం అమెరికాకే వెళ్లాయి. తాజాగా ఇతర దేశాలపై టారిఫ్ల పెంపుతో యూఎస్లో మన వాటా పెంచుకోవడానికి సదవకాశమని కొంతమంది పరిశ్రమవర్గాలు చెబుతున్నారు. ‘ఆహార, వ్యవసాయ రంగాలతో పాటు వాహన విడిభాగాల రంగాలు తక్షణం ప్రయోజనం పొందుతాయి. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి’అని వాణిజ్య విధాన విశ్లేషకుడు ఎస్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.టెక్స్టైల్స్: ట్రంప్ తాజా టారిఫ్లు భారత టెక్స్టైల్ రంగానికి బూస్ట్ ఇస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది’అని తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం (టీఈఏ) అధ్యక్షుడు కె.ఎం. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.ఫార్మా: భారత ఫార్మా రంగం అప్రమత్తతతో పాటు ఆశావహ ధోరణితో వేచిచూస్తోంది. ‘జెనరిక్స్లో చైనా చాలా పటిష్టంగానే ఉన్నప్పటికీ, అమెరికాకు పెద్దగా ఎగుమతి చేయడం లేదు. ప్రధానంగా యాక్టివ్ ఫార్మా ఇన్గ్రీడియెంట్స్ (ఏపీఐ), కెమికల్స్ వంటివి ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు మనకు వీటిని కూడా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. అయితే, మనం వాటి కోసం చైనాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి’అని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) మాజీ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.స్టీల్: ట్రేడ్ వార్ మరింత ముదిరితే సరఫరా వ్యవస్థల్లో తీవ్ర కుదుపులకు ఆస్కారం ఉంది. వివిధ దేశాల నుంచి భారత్కు దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, పరిస్థితులను నిశితంగా గమనించి చర్యలు చేపట్టాలని జేఎస్డబ్ల్యూ స్టీల్ సీఈఓ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. చైనా స్టీల్ ఉత్పత్తి భారీగానే కొనసాగనున్న నేపథ్యంలో యూఎస్ దెబ్బకు ఇతరత్రా అందుబాటులో ఉన్న దేశాలకు ఎగుమతులను మళ్లించవచ్చని ఆర్సెలర్ మిట్టల్ వైస్–ప్రెసిడెంట్ రంజన్ ధార్ తెలిపారు.ఎలక్ట్రానిక్స్: చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలతో తక్షణం ప్రయోజనం పొందే రంగాల్లో ఇదొకటి. అయితే, తక్షణం దీని ప్రయోజనం పొందేలా పాలసీ రూపకర్తలు, పరిశ్రమ వర్గాలు చర్యలు తీసుకోవాలని భారతీయ సెల్యులర్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. భారత్ను ఎగుమతి హబ్గా చేసుకుంటున్న యాపిల్తో పాటు మోటరోలా వంటి చైనా బ్రాండ్లు మన దగ్గరున్న టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, డిక్సన్ వంటి తయారీదారుల నుంచి అమెరికాకు ఎగుమతులను మరింత పెంచే అవకాశం ఉంది. యాపిల్, శాంసంగ్ దన్నుతో 2024లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 20.4 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో యాపిల్ వాటా 65 శాతం కాగా (12.8 బిలియన్ డాలర్లు), శాంసంగ్ వాటా 20 శాతంగా (4 బిలియన్ డాలర్లు) ఉంది.దిగుమతులు, రూపాయి, స్టాక్ మార్కెట్కు దెబ్బ...ట్రేడ్ వార్ 2.0... ప్రపంచ దేశాల కరెన్సీ మార్కెట్లను సైతం కుదిపేస్తోంది. అనేక దేశాల కరెన్సీలతో డాలర్ విలువ మరింత బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ ఇప్పటికే 110 స్థాయికి చేరింది. దీంతో మన రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కిపోతోంది. తాజాగా డాలరు మారకంలో 87 కిందికి పడిపోయింది. ఒకపక్క, ఎగుమతిదారులకు కాస్త ఊరట లభించినప్పటికీ.. మన వాణిజ్యం ఇప్పటికీ లోటులోనే ఉన్న నేపథ్యంలో దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. ఇక అమెరికా టారిఫ్ల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెంపు భయాలు పెరిగాయి.యూఎస్లోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇవ్వడంతో డాలర్ జోరుకు ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రభావంతో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) మన స్టాక్ మార్కెట్ నుండి పొలోమంటూ నిధులను వెనక్కి తీసేసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి రివర్స్ గేర్లో ఉన్న ఎఫ్పీఐలు ట్రంప్ విజయం తర్వాత ఇంకాస్త జోరు పెంచారు. ఈ ఏడాది జనవరిలోనే రూ.87,000 కోట్ల విలువైన షేర్లను భారత్ మార్కెట్లలో విక్రయించడం విశేషం. దీంతో స్టాక్ సూచీలు ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి 10 శాతం పైగానే కుప్పకూలాయి. వెరసి టారిఫ్ వార్ దేశీ స్టాక్ మార్కెట్లకూ అతిపెద్ద ముప్పుగా మారుతోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా...2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గతేడాది అమెరికాకు భారత ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు మన ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి.అనుకూలం⇒ ఫార్మా – చైనాపై టారిఫ్ల నేపథ్యంలో మన జెనరిక్ కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి.⇒ టెలికం పరికరాలు – ఇతర దేశాలతో పోలిస్తే మన ఎగుమతులు జోరందుకుంటాయి.⇒ ఎలక్ట్రానిక్స్ – దేశీ తయారీ కంపెనీలకు అమెరికా మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది.⇒ టెక్స్టైల్స్ – భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.⇒ ఫుడ్–అగ్రి ప్రోడక్టŠస్ – ఆహార, వ్యవసాయ రంగాలకు తక్షణ ప్రయోజనం.⇒ ఆటోమొబైల్ విడిభాగాలు – యూఎస్లో మన కంపెనీల ఎగుమతుల వాటా పెంచుకోవడానికి సదవకాశం.⇒ పెట్రోలియం ఉత్పత్తులు – ఎగుమతులు పుంజుకోవడానికి చాన్స్.⇒ ఐటీ సేవలు – రూపాయి పతనంతో మరింత ఆదాయం సమకూరుతుంది.ప్రతికూలం⇒ రూపాయి – డాలర్ భారీగా బలపడటంతో దేశీ కరెన్సీ విలువ మరింత పడిపోవచ్చు.⇒ స్టాక్ మార్కెట్ – విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో పెట్టబడులు తరలిపోయి.. మార్కెట్ ఇంకా పడిపోవచ్చు.⇒ ముడిచమురు – దిగుమతులు మరింత భారమై.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ⇒ బంగారం – రూపాయి పతనంతో విదేశీ మార్కెట్తో పోలిస్తే ధరలు కొండెక్కవచ్చు.⇒ యంత్రపరికరాలు – దేశీ కంపెనీలు దిగుమతి చేసుకునే పరికరాలు, సామగ్రి ధరలు మరింత పెరుగుతాయి.⇒ వంటనూనెలు – భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల నూనె ధర మరింత హీటెక్కవచ్చు.⇒ ఎరువులు – వ్యవసాయానికి అవసరమైన ఎరువుల దిగుమతి భారమవుతుంది. -
యూఎస్ సుంకాలపై నిర్మలా సీతారామన్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా దేశాల దిగుమతులపై సుంకాలు విధించిన నేపథ్యంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఓ మీడియా సమావేశంలో టారిఫ్లకు సంబంధించి అడిగిన అంశాలపై ఆమె సమాధానమిచ్చారు. అమెరికా ఇటీవల తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయం వల్ల నేరుగా భారత్పై పరిణామాలను అంచనా వేయడం ప్రస్తుతం తొందరపాటు అవుతుందన్నారు. అయితే భారత్ అప్రమత్తంగా ఉందని, టారిఫ్ల అంశాలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు.అమెరికా తాజాగా కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించింది. ఈ సెగ భారత్కు సైతం తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా విధించిన సుంకాలు ప్రభావం భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వాణిజ్య సంఘర్షణ భారతీయ విధానకర్తలు, వ్యాపారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి నిర్మతా సీతారామన్ మాట్లాడుతూ..‘అమెరికా కెనడా, మెక్సికో, చైనాలపై విధించిన సుంకాల ప్రభావం కచ్చితంగా భారత్పై ఎలా ఉంటుందో ప్రస్తుతం అంచనా వేయలేం. కానీ తప్పకుండా భారత్పై కొంత పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి భారత్ అన్నింటినీ గమనిస్తోంది. అప్రమత్తంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. బడ్జెట్ అనంతర జరిగిన మీడియా సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ భారత్పై ఈ సుంకాల పరోక్ష ప్రభావాలను అంగీకరించారు.పరిశ్రమలకు ప్రోత్సాహంవాణిజ్య పరిధిని విస్తరించడం, ఆత్మనిర్భరత (స్వావలంబన-దేశీయ తయారీని ప్రోత్సహించడం)పై దృష్టి సారించడం వల్ల అమెరికా సుంకాల నుంచి ఎదురయ్యే ఊహించని సవాళ్ల ప్రభావాన్ని తగ్గించవచ్చని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషించడానికి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ), ఎగ్జిమ్ బ్యాంక్ వంటి వాణిజ్య సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. నిత్యావసర సరుకులకు సంబంధించి దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలని భారత్ లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడే అంతరాయాలను నిర్వహించడానికి స్థానిక పరిశ్రమలు బాగా సన్నద్ధమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: అమెరికా సుంకాలకు కారణాలు.. భారత్పై ప్రభావంటారిఫ్లు ఎందుకంటే..అక్రమ వలసలు, అమెరికాలోకి మాదకద్రవ్యాల ప్రవాహానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను విధించాలని నిర్ణయించారు. ఈ టారిఫ్లు ప్రపంచ వాణిజ్యంపై గణనీయమైన ప్రభావాలను చూపుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం వంటి పరిశ్రమలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కీలక ఖనిజాలపై సుంకాల రద్దు
న్యూఢిల్లీ: కీలకమైన 12 ఖనిజాలు, లిథియం అయాన్ బ్యాటరీల స్క్రాప్, సీసం, కొబాల్ట్ ఉత్పత్తులు, జింకు మొదలైన వాటితో పాటు క్యాన్సర్, ఇతరత్రా అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 36 ఔషధాలపై దిగుమతి సుంకాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. కీలక ఖనిజాలపై సుంకాల తగ్గింపుతో వాటి ప్రాసెసింగ్, రిఫైనింగ్కి ఊతం లభిస్తుందని, వాటిపై ఆధారపడిన రంగాలకు సదరు ఖనిజాల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సెస్సు వర్తించే 82 ఉత్పత్తుల కేటగిరీలపై సామాజిక సంక్షేమ సర్చార్జిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకటికి మించి సెస్సు లేదా సర్చార్జీని విధించకుండా ప్రతిపాదన చేశారు. నౌకా నిర్మాణ సంబంధిత ప్రయోజనాలు అందడానికి సుదీర్ఘ సమయం పడుతుంది కాబట్టి ముడి వస్తువులు, విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును మరో పది సంవత్సరాలు పొడిగించారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న పేషంట్లకు ఊరటనిచ్చేలా బీసీడీ నుంచి పూర్తిగా మినహాయింపు ఉండే ఔషధాల జాబితాలోకి 36 ఔషధాలను చేరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై బీసీడీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచగా, ఓపెన్ సెల్ మొదలైన వాటిపై అయిదు శాతానికి తగ్గించారు. -
‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’
అమెరికా పన్నుల వ్యవస్థను పునర్నిర్మించే సాహసోపేత చర్యలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక విధానాలు అనుసరించాలని చెప్పారు. అమెరికన్ పౌరులకు ఆదాయపు పన్నును రద్దు(abolishing income tax) చేయాలని ప్రతిపాదించారు. దాని స్థానంలో పౌరుల డిస్పోజబుల్ ఆదాయాన్ని(కనీస అవసరాలు, ఈఎంఐలు.. వంటి వాటికి ఖర్చు చేశాక మిగిలే మొత్తం) పెంచే లక్ష్యంతో దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను ప్రవేశపెట్టాలని ట్రంప్ సూచించారు. హౌస్ రిపబ్లికన్ మెంబర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.1870-1913 మధ్య కాలంలో అమెరికా ప్రత్యేక టారిఫ్(tariff)లను ప్రవేశపెట్టి వాటివల్ల వచ్చే ఆదాయంపై ఆధారపడిందని ట్రంప్ తెలిపారు. తర్వాత ఆ ప్రత్యేక టారిఫ్లను క్రమంగా తొలగించారని గుర్తు చేశారు. ఈ వ్యూహం అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరోసారి ఊతమిస్తుందని ట్రంప్ అన్నారు. మునుపెన్నడూ లేనంతగా అమెరికన్లను ధనవంతులుగా, మరింత శక్తిమంతులుగా మార్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఆదాయపన్ను రద్దు చేసి, దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచాలనే విధానాలు ప్రవేశపెట్టాలని ట్రంప్ చెబుతుండడం చర్చకు దారి తీసింది.భారత్, చైనాలపై టారిఫ్లుఈ విధానాన్ని పర్యవేక్షించడానికి, టారిఫ్లు, సంబంధిత ఆదాయాల నిర్వహణకు బాధ్యత వహించే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే జనవరి 20న ట్రంప్ తన ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ..‘అమెరికా పౌరులను సంపన్నులుగా చేయడానికి విదేశాలపై సుంకాలు విధిస్తాం. మన ఖజానాకు విదేశీ వనరుల నుంచి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది’ అన్నారు. ట్రంప్ చైనా, భారత్ వంటి దేశాలపై టారిఫ్లు విధిస్తామని చెప్పారు.ఇదీ చదవండి: హైదరాబాద్ అమెజాన్లో రూ.102 కోట్ల మోసంఈ ఆదాయ పన్ను రద్దు పథకంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరిలో ఇది ఉత్సాహాన్ని రేకెత్తించినప్పటికీ, మరికొందరిలో విమర్శలకు దారితీస్తుంది. పెరిగిన దిగుమతి వ్యయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పన్ను పునర్వ్యవస్థీకరణను అమలు చేయడంలో లోపాలు ఎదురవుతాయని అమెరికన్ కాంగ్రెస్లో కొంతమంది చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అమెరికన్ కార్మికులు, వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి నిబద్ధతతో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. ‘అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము వెంటనే వాణిజ్య వ్యవస్థను సమూలంగా మార్చాలని నిర్ణయించుకున్నాం’ అన్నారు. -
‘చాలా చెడ్డ దేశం’.. రాగానే ట్రంప్ చర్యలు షురూ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చీరాగానే దాయాది దేశాలైన కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ తెలిపారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ట్రంప్ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.కెనడా ‘చాలా చెడ్డ దేశం’ట్రంప్ ప్రమాణ స్వీకార ప్రసంగంలో మాట్లాడుతూ అమెరికన్ పౌరులకు ప్రయోజనం చేకూర్చడానికి విదేశాంగ విధానంలో భాగంగా సుంకాలను ఉపయోగించనున్నట్లు చెప్పారు. కెనడా, మెక్సికో పెద్ద సంఖ్యలో వలసదారులను, ఫెంటానిల్(డగ్స్) అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ఆరోపించారు. కెనడాను ‘చాలా చెడ్డ దేశం’గా ముద్రవేశారు. ట్రంప్ ఇంత తీవ్రంగా స్పందించడంతో మరిన్ని దేశాల్లో అమెరికా సుంకాల విధానాలపై ఆందోళనలను రేకెత్తించింది. ఫిబ్రవరి 1 చివరితేది సమీపిస్తుండటంతో అమెరికాతో సరిహద్దు పంచుకుంటున్న ఇరుదేశాలకు ఇరువైపులా వ్యాపారం సాగిస్తున్నవారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందో, ట్రంప్ పాలనలో అమెరికా వాణిజ్య సంబంధాల భవిష్యత్తు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.చర్చలకు సిద్ధంఈ ప్రకటనపై కెనడా, మెక్సికో దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కెనడియన్ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ.. కెనడా యూఎస్ వాణిజ్య విధానాలపై ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మెక్సికన్ అధికారులు సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికాతో చర్చల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ, దీనిపై ట్రంప్ అంత తేలికగా అంగీకరించరనే వాదనలున్నాయి. దాంతో మరికొంత కాలం ఈ దేశాలకు సుంకాల ఇబ్బందులు తప్పవని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇదీ చదవండి: ఈ–త్రీవీలర్స్లోకి టీవీఎస్..సుంకాల పెంపుతో వినియోగదారులపైనే భారంట్రంప్ ప్రవేశపెడుతున్న సుంకాల విధింపు విధానాలపై విమర్శలు వస్తున్నాయి. ఇలా ఇష్టారీతినా టారిఫ్లను పెంచడంవల్ల తుదకు వినియోగదారులపైనే ఆ భారం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. అయితే ట్రంప్ మద్దతుదారులు కొన్ని వస్తువులపై భవిష్యత్తులో తీసుకోబోయే పన్నుల కోతలు, వాటి క్రమబద్ధీకరణ వంటి ఇతర ప్రతిపాదనల వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. -
దిగుమతులపై ఆందోళన అక్కర్లేదు
ఎగుమతుల వాటా పెరుగుతున్నంత వరకూ దిగుమతుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ఎలాంటి వాణిజ్య అసమతుల్యత ఏర్పడడం లేదన్నారు. వాణిజ్యానికి, ఉత్పత్తుల రవాణాకు ప్రతిబంధకాలు సృష్టించే ధోరణులను ప్రపంచ దేశాలు నివారించాలని ఆయన పేర్కొన్నారు.‘ప్రపంచమంతా 3–3.5 శాతం వృద్ధి చెందుతోంటే భారత ఎకానమీ 7 శాతం వృద్ధి సాధిస్తోంది. అలాంటప్పుడు భారత్లో వినియోగం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దిగుమతులూ పెరుగుతాయి. అయితే, ఎగుమతుల్లో దిగుమతుల పాత్ర కూడా చాలా కీలకం. ఎగుమతుల్లో దిగుమతుల వాటాను (దిగుమతి చేసుకున్న వాటిని మరో రూపంలో ఎగుమతి చేయడం) మెరుగుపర్చుకుంటున్నంత వరకు మనం దిగుమతుల గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు‘ అని సునీల్ బరత్వాల్ చెప్పారు.ఇదీ చదవండి: సినిమా చూసి భావోద్వేగానికి గురైన సింఘానియాఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఉత్పత్తుల ఎగుమతులు 3.18 శాతం పెరిగి 252.28 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 5.77 శాతం పెరిగి 416.93 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మరోవైపు, సంపన్న దేశాల్లో వలసలు, మొబిలిటీ విషయంలో గందరగోళం నెలకొందని బరత్వాల్ తెలిపారు. భారతీయులు లేదా భారతీయ కంపెనీలు ఇతర దేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయా దేశాలకు ప్రొఫెషనల్స్ రాకపోకలు సాగించాల్సిన (మొబిలిటీ) అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరాటంకమైన మొబిలిటీకి వెసులుబాటు కల్పించాలని భారత్ అడుగుతోందే తప్ప వలసలను అనుమతించమని కోరడం లేదని బరత్వాల్ స్పష్టం చేశారు. -
అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు
ఒట్టావా: కెనడా దిగుమతులపై అధిక పన్నుల భారం వేస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కెనడా సైతం దీటుగా స్పందించడంపై దృష్టి సారించింది. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. దక్షిణ, ఉత్తర సరిహద్దుల గుండా మాదకద్రవ్యాలు, వలసదారుల అక్రమచొరబాట్లను నిలువరించకపోతే అటు మెక్సికో, అటు కెనడా దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంవేళ ఓటర్లకు వాగ్దానాలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్యం బలోపేతంపై ఉపప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టినా ఫ్రీలాండ్, అంతర్గత వ్యవహారాలు, ఇతర శాఖల మంత్రులు, అమెరికాలో కెనడా రాయబారి కిస్టెన్ హిల్మ్యాన్లతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ అధిక పన్నులు మోపడంపై చర్చించారు. ఐక్య ఫ్రంట్ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. అయితే కెనడాను మెక్సికోను ఒకే గాటిన కట్టడం అన్యాయమని మంత్రులు జస్టిన్ వద్ద ప్రస్తావించారు. కెనడా నుంచి వలసలను తగ్గించడానికి, వనరులను అందించడానికి, ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయడానికి సిద్దమేనని ఈ సందర్భంగా ట్రూడో అన్నారు. మాదక ద్రవ్యాలు తమ దేశం సమస్య కాదని, సుంకాలు రెండు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని కెనడా మంత్రులు అభిప్రాయపడ్డారు. అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా ఉత్పత్తులు కెనడా నుంచే వస్తున్నాయి. ప్రతిరోజూ దాదాపు రూ.22,000 కోట్ల విలువైన వస్తుసేవలు కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ముడిచమురు అవసరాల్లో 60 శాతం కెనడానే తీరుస్తోంది. 85 శాతం అమెరికా విద్యుత్ ఉపకరణాలు కెనడా నుంచే వస్తున్నాయి. 34 అత్యంత విలువైన ఖనిజధాతువులు, లోహాలు కెనడా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రతీకార సుంకాల పరిశీలన.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించే అవకాశాలను కెనడా పరిశీలిస్తోందని సీనియర్ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కెనడా సిద్ధమవుతోందని, ప్రతీకారంగా ఏ వస్తువులపై సుంకాలు విధించాలనే విషయంపై చర్చిస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అధిక సుంకాలు విధించినప్పుడు, ఇతర దేశాలు ప్రతీకార సుంకాలతో ప్రతిస్పందించాయి. గతంలోనూ 2018లో కెనడా నుంచి దిగుమతి అయిన స్టీల్, అల్యూమినియంపై అమెరికా అదనపు పన్నలు విధించింది. దీనికి ప్రతికా కెనడా సైతం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై వేలకోట్ల పన్నులను ముక్కుపిండి వసూలుచేసింది. మెక్సికోతో ట్రంప్ చర్చలు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో అద్భుతమైన చర్చ జరిగిందని ట్రంప్ బుధవారం చెప్పారు. ‘‘వలసదారులు అమెరికా దక్షిణ సరిహద్దు గుండా లోపలికి అక్రమంగా చొరబడకుండా ఇకపై మెక్సికో సమర్థవంతంగా అడ్డుకోనుంది. ఈ చర్యలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఈ చర్యలు అమెరికా చేపడుతున్న అక్రమ ఆక్రమణ నిరోధక కార్యక్రమాలకు ఎంతగానో దోహదపడుతుంది. క్లాడియా షీన్బామ్కు ధన్యవాదాలు’’అని ట్రంప్ పోస్ట్చేశారు. ‘‘అమెరికాలోకి భారీగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన ఉమ్మడి చర్యలపై క్లాడియాతో చర్చించా’’అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ భేటీ తర్వాత అమెరికా అధిక పన్నుల భారం నుంచి మెక్సికోకు ఉపశమనం లభిస్తుందో లేదో తెలియరాలేదు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తీసుకునే నిర్ణయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. -
పేపర్ పరిశ్రమకు దిగుమతుల దెబ్బ
న్యూఢిల్లీ: పేపర్, పేపర్బోర్డ్ దిగుమతులు 2024–25 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 9,92,000 టన్నులకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 3.5 శాతం పెరిగాయని ఇండియన్ పేపర్ మాన్యూఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) తెలిపింది. చైనా నుండి ఎగుమతులు గణనీయంగా అధికం కావడమే ఇందుకు కారణమని అసోసియేషన్ వెల్లడించింది. దేశంలో తగినంత ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో చైనా నుండి కాగితం, పేపర్బోర్డ్ దిగుమతులు 44 శాతం దూసుకెళ్లాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం అధిక ఎగుమతులు కారణంగా 2023–24లో ఆసియాన్ దేశాల నుండి ఈ ఉత్పత్తుల దిగుమతులు 34 శాతం పెరిగి 19.3 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలతో జరిగిన ప్రీ–బడ్జెట్ సమావేశాలలో అసోసియేషన్ తన గళాన్ని వినిపించింది. కాగితం, పేపర్బోర్డ్ దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 10 నుండి 25 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమ.. రెండు కోవిడ్ సంవత్సరాల్లో కొంత నియంత్రణ తర్వాత.. భారత్కు కాగితం సరఫరా పెరుగుతూనే ఉందని ఐపీఎంఏ ప్రెసిడెంట్ పవన్ అగర్వాల్ తెలిపారు. ‘దేశీయ తయారీ పరిశ్రమ వృద్ధిని దిగుమతులు దెబ్బతీస్తున్నాయి. దీంతో ఇక్కడి ప్లాంట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. పరిశ్రమ నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతోంది. చైనా, చిలీ, ఇటీవల ఇండోనేíÙయా నుండి పెరుగుతున్న దిగుమతుల దృష్ట్యా వర్జిన్ ఫైబర్ పేపర్బోర్డ్ను దేశీయంగా తయారు చేస్తున్న కంపెనీలకు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ దేశాల నుంచి భారత్కు సరఫరా 2020–21 నుండి మూడు రెట్లు ఎక్కువయ్యాయి. దేశీయ కాగితపు పరిశ్రమ ఇప్పటికే సామర్థ్యాలను పెంపొందించడానికి గణనీయంగా మూలధన పెట్టుబడులు పెట్టినప్పటికీ, వాటి ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. దోపిడీ దిగుమతులు పెరగడం వల్ల లాభదాయత ప్రభావితమైంది’ అని వివరించారు. -
వంట నూనెల దిగుమతులు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు 2023–24 ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరానికి 3.09 శాతం తగ్గి 159.6 లక్షల టన్నులు నమోదయ్యాయి. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెరగడం, అధికం అవుతున్న ధరలతో డిమాండ్ తగ్గడం ఈ క్షీణతకు కారణమని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) తెలిపింది.ప్రపంచంలో అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్.. 2022–23 నవంబర్–అక్టోబర్ ఆయిల్ మార్కెటింగ్ ఏడాదికి 164.7 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. విదేశాల నుంచి భారత్ కొనుగోలు చేసిన ఈ నూనెల విలువ 2022–23తో పోలిస్తే రూ.1,38,424 కోట్ల నుంచి 2023–24లో రూ.1,31,967 కోట్లకు పడిపోయింది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ ధరలు స్థిరపడ్డాయి. ఇది దేశీయ ధరల పెరుగుదలతో ప్రతిబింబించింది. అలాగే కొంత మేరకు దిగుమతులను తగ్గించింది’ అని అసోసియేషన్ తెలిపింది. విభాగాల వారీగా ఇలా.. ముడి పామాయిల్ దిగుమతులు 75.88 లక్షల టన్నుల నుంచి 69.70 లక్షల టన్నులకు వచ్చి చేరాయి. ఆర్బీడీ పామోలిన్ 21.07 లక్షల టన్నుల నుంచి 19.31 లక్షల టన్నులకు క్షీణించింది. సోయాబీన్ నూనె 35.06 లక్షల టన్నుల నుంచి 34.41 లక్షల టన్నులు నమోదైంది. పొద్దుతిరుగుడు నూనె 30.01 లక్షల టన్నుల నుంచి 35.06 లక్షల టన్నులకు ఎగసింది. శుద్ధి చేసిన నూనెల వాటా అయిదేళ్లలో 3 నుంచి ఏకంగా 12 శాతానికి దూసుకెళ్లింది. -
చైనా వస్తువుల దిగుమతులకు చెక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా చైనా నుంచి దిగుమతయ్యే ఐదు వస్తువులపై ఐదేళ్లపాటు అమలయ్యేలా యాంటీడంపింగ్ డ్యూటీకి తెరతీసింది. వీటిలో గ్లాస్ మిర్రర్, సెల్ఫోన్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్ తదితరాలున్నాయి. తద్వారా పొరుగు దేశం నుంచి భారీగా దిగుమవుతున్న వస్తువులకు చెక్ పెట్టింది. దీంతో చౌక దిగుమతుల నుంచి దేశీ తయారీదారులకు రక్షణ లభించనుంది.యాంటీడంపింగ్ డ్యూటీ విధించిన చైనా వస్తువుల జాబితాలో ఐసోప్రొపిల్ ఆల్కహాల్, సల్ఫర్ బ్లాక్, సెల్ఫోల్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్, థెర్మోప్లాస్టిక్ పాలీయురెథేన్, అన్ఫ్రేమ్డ్ గ్లాస్ మిర్రర్ చేరాయి. సాధారణ ధరలకంటే తక్కువ ధరల్లో ఈ వస్తువులు చైనా నుంచి భారత్కు దిగుమతి అవుతున్నాయి. రెవెన్యూ శాఖ, పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ విడిగా జారీ చేసిన ఐదు నోటిఫికేషన్ల ద్వారా డ్యూటీలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయని వెల్లడించింది.మెడికల్, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఐసోప్రొపిల్ ఆల్కహాల్పై టన్నుకి 82 డాలర్ల నుంచి 217 డాలర్ల మధ్య వివిధ కంపెనీలపై సుంకాన్ని విధించింది. చర్మంపై యాంటీసెప్టిక్, హ్యాండ్ శానిటైజర్గానూ ఈ ప్రొడక్ట్ వినియోగమవుతోంది. టెక్స్టైల్ డయింగ్, పేపర్, లెదర్ తయారీలో వినియోగించే సల్ఫర్బ్లాక్పై టన్నుకి 389 డాలర్ల సుంకాన్ని ప్రకటించింది.ఇదీ చదవండి: డాలర్లు దండిగా.. కొరతలోనూ చింత లేని బంగ్లాదేశ్!ఈ బాటలో ఆటోమోటివ్, మెడికల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో వినియోగించే థెర్మోప్లాస్టిక్ పాలీయురెథేన్పై కేజీకి 0.93 డాలర్ల నుంచి 1.58 డాలర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్గా వినియోగించే సెల్ఫోన్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్పై కేజీకి 1.34 డాలర్లు చొప్పున డ్యూటీ విధించింది. అన్ఫ్రేమ్డ్ గ్లాస్ మిర్రర్లపై టన్నుకి 234 డాలర్ల యాంటీడంపింగ్ సుంకాన్ని ప్రకటించింది. వాణిజ్య శాఖ పరిశోధన విభాగం డీజీటీఆర్ సూచనలమేరకు ప్రభుత్వం తాజా చర్యలను చేపట్టింది. -
పెట్రోలియం దిగుమతులకు చెక్!
న్యూఢిల్లీ: భారీ పరిమాణంలో మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుతో శిలాజ ఇంధనాలైన పెట్రోలియం తదితర ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సూచించారు. థర్మల్ ప్లాంట్లపై ఆధారపడడం భవిష్యత్తులో తగ్గుతుందంటూ.. మెథనాల్ తయారీకి పరిశ్రమ ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మెథనాల్ను శుద్ధ ఇంధనంగా పేర్కొంటూ, భారీ వాణిజ్య వాహనాల్లోనూ దీన్ని వినియోగించొచ్చన్నారు. మెథనాల్తో నడిచే ఓడను నిర్మించాలంటూ ఓ విదేశీ కంపెనీ కోచి్చన్ షిప్యార్డ్ లిమిటెడ్కు ఆర్డర్ ఇచి్చనట్టు చెప్పారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలోని మనేక్షా కేంద్రంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ మెథనాల్ సెమినార్, ఎక్స్పోను నీతి ఆయోగ్ నిర్వహిస్తున్నట్టు సారస్వత్ ప్రకటించారు. 2016లో అమెరికాకు చెందిన మెథనాల్ ఇనిస్టిట్యూట్తో నీతిఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకోగా.. ఈ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టులు, ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించి సాధించిన పురోగతిని సెమినార్లో తెలియజేస్తామని చెప్పారు. ఉత్పత్తులు, టెక్నాలజీలను ఈ ఎక్స్పోలో ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెథనాల్ తయారీ, వినియోగానికి వీలుగా ప్రభుత్వం ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తోందని, ఆ తర్వాత పెద్ద స్థాయి మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలతో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 0.7 మిలియన్ మెట్రిక్ టన్నుల మెథనాల్ తయారీ సామర్థ్యం ఉండగా.. డిమాండ్ 4 మిలియన్ టన్నులు మేర ఉండడం గమనార్హం. -
ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్
భారతదేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు బంగారం దిగుమతులు 22.70 బిలియన్ డాలర్లు పెరిగాయి. దేశంలో పసిడికి డిమాండ్ పెరగటం వల్ల దిగుమతులు గతంలో కంటే కూడా గణనీయంగా పెరిగాయి.బంగారం దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణం.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, పండుగ సీజన్లో పెరిగిన డిమాండ్తో నగల వ్యాపారులు కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా యూనియన్ బడ్జెట్లో గోల్డ్ ట్యాక్స్ తగ్గించడం అని తెలుస్తోంది. అయితే రత్నాలు, రత్నాలకు సంబంధించిన ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి.2024 మొదటి త్రైమాసికం కంటే.. రెండో త్రైమాసికంలోనే బంగారం దిగుమతులు పెరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్ కూడా పెరిగింది. పండుగ సీజన్ కోసం దేశం సిద్ధమవుతున్నందున, పెరుగుతున్న బంగారం డిమాండ్ను తీర్చడానికి రిటైలర్లు తమ స్టోర్ నెట్వర్క్లను విస్తరిస్తున్నారు.జులై యూనియన్ బడ్జెట్లో బంగారం మీద ట్యాక్ తగ్గించడం కూడా బంగారం కొనుగోళ్లను బాగా పెంచింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసొచ్చింది. మొత్తం మీద 2024లో భారతదేశంలో బంగారం డిమాండ్ 850 టన్నులకు చేరుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 12 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: ఏఐకు అదో పెద్ద సవాలు: తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చుపెరుగుతున్న ధరలుదేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నెలలోనే తులం బంగారం ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. ఈ రోజు (సెప్టెంబర్ 17)న గోల్డ్ రేటు రూ. 74890 (తులం 24 క్యారెట్స్) వద్ద ఉంది. ఈ ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
నాలుగేళ్ల ఆంక్షలు ఎత్తివేత!
వాహన దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. అక్టోబర్ 1, 2024 నుంచి వివిధ దశల్లో ఈ నిర్ణయం అమలవుతుందని పేర్కొంది. కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభానికి గురైన శ్రీలంక 2020లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. 2022లో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దాంతో స్థానిక ప్రభుత్వం రద్దయింది. దానికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక అనిశ్చితులు నెలకొన్నాయి. తర్వాత శ్రీలంకలో ఇతర పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. క్రమంగా స్థానిక ఆర్థిక పరిస్థితులు గాడినపడుతున్నాయి.ఐఎంఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్రోగ్రామ్ నిబంధనల్లో భాగంగా దేశీయంగా వివిధ దశల్లో వాహన దిగుమతులు పెంచాలని శ్రీలంక నిర్ణయించింది. మొదట దశలో అక్టోబర్ 1, 2024న ప్రజా రవాణా వాహనాలు, రెండో దశ కింద డిసెంబర్ 1, 2024 నుంచి వాణిజ్య వాహనాలు, మూడో దశ ఫిబ్రవరి 1, 2025 నుంచి ప్రైవేట్ మోటార్ వాహనాల దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే విదేశీ మారక నిల్వల నిర్వహణకు మాత్రం అదనపు కస్టమ్స్ సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏప్రిల్ 2022లో భారీగా క్షీణించిన విదేశీ మారక నిల్వలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.ఇదీ చదవండి: ఐదు లక్షల మంది రైతులకు సాయంభారత్లో వాహన తయారీ కంపెనీలైన మారుతీసుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్..వంటి కంపెనీలకు శ్రీలంక ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరగనుంది. ఆ దేశానికి ఎక్కువగా ఈ కంపెనీలు వాహనాలు సరఫరా చేస్తుంటాయి. దాంతో రానున్న రోజుల్లో కంపెనీల రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
వంటనూనె ధరలు పెంపు..?
వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దాంతో వచ్చే పండగ సీజన్లో వీటి ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.భారత్లో ఎక్కువగా వినియోగిస్తున్న పామాయిల్, సోయానూనె, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గితే వాటి ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. రానున్న పండగ సీజన్లో సగటు వినియోగదారులపై ఈ భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్లో దిగుమతి సుంకాన్ని పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశీయ నూనెగింజల రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్ఫ్లవర్ ఆయిల్పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.భారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని బెస్ట్ కంపెనీలుఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం అది 20 శాతంగా ఉంది.పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు..?మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
దేశీ స్టీల్ పరిశ్రమకు చైనా ముప్పు!
న్యూఢిల్లీ: చైనాలో డిమాండ్ పడిపోవడంతో ఆ దేశం నుంచి ఉక్కు దిగుమతులు దేశాన్ని ముంచెత్తుతున్నాయంటూ కేంద్ర ఉక్కు శాఖ మాజీ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా తెలిపారు. ‘‘ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల పరంగా చూస్తే దిగుమతులు పెద్ద సమస్యగా ఉంది. చైనాలో వినియోగం పడిపోవడం మన మార్కెట్ను కుదిపేస్తోంది’’అని సిన్హా పేర్కొన్నారు.‘ఇండియన్ ఐరన్ ఓర్, పెల్లెట్’ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెరిగిపోతున్న దిగుమతులతో స్థానిక ఉక్కు ఉత్పత్తుల ధరలపై, స్టీల్ తయారీ సంస్థల లాభాలపై ప్రభావం పడుతుందన్నారు. ‘‘చైనా నుంచి అనుచితంగా దిగుమతులు వచ్చి పడుతున్నాయి. దీని పట్ల భారత ప్రభుత్వం సకాలంలో స్పందించాలి’’ అని అన్నారు. చైనా తదితర దేశాల నుంచి ముంచెత్తుతున్న చౌక స్టీల్ దిగుమతులను అడ్డుకోవాలంటూ పరిశ్రమ ఇప్పటికే ఎన్నో పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం గమనార్హం.ప్రపంచ ఉక్కు ఎగుమతుల కేంద్రంగా భారత్ మారాలన్న లక్ష్యానికి విరుద్ధంగా.. మన దేశం నికర దిగుమతుల దేశంగా మారుతుండడం పట్ల పరిశ్రమ ఆందోళనను వ్యక్తం చేసింది. దిగుమతులపై సంకాల విధింపునకు ఏడాది, ఏడాదిన్నర సమయం తీసుకుంటే, అది దేశీ పరిశ్రమకు మేలు చేయబోదని సిన్హా అభిప్రాయపడ్డారు. -
భారీగా పెరుగుతున్న డిమాండ్.. బంగారం కంటే ప్రియం!
సోలార్ ప్యానెల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం భారతదేశపు వెండి దిగుమతులు దాదాపు రెండింతలకు చేరుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే బంగారం కంటే వెండికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.బంగారం, వెండి వినియోగంలో భారత్ ప్రధానంగా చెప్పుకోదగ్గ దేశం. భారత్ గతేడాది 3,625 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం వెండి దిగుమతి 6500 నుంచి 7000 టన్నుల వరకు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2024 ప్రథమార్థంలోనే భారతదేశపు వెండి దిగుమతులు 560 టన్నుల నుంచి 4,554 టన్నులకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ దిగుమతులు పెరగటానికి మరో కారణం ట్యాక్స్ తగ్గించడం కూడా. స్మగ్లింగ్ను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంని ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించడం జరిగింది.భారత్ ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, చైనా నుంచి వెండిని దిగుమతి చేసుకుంటుంది. ఈ రోజు దేశీయ మార్కెట్లో రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 91700 రూపాయలకు చేరింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేజీ వెండి ధర త్వరలోనే రూ. 1 లక్షకు చేరుకునే అవకాశం ఉంది. -
రష్యా నుంచి రూ.23,240 కోట్ల చమురు
న్యూఢిల్లీ: రష్యా నుంచి జూలై నెలలో 2.8 బిలియన్ డాలర్ల చమురు భారత్కు దిగుమతి అయింది. రష్యా చమురు ఎగుమతులు చైనా తర్వాత భారత్కే ఎక్కువగా వచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతుల్లో చైనా అగ్ర స్థానంలో ఉంది. ఇక గత నెలలో భారత్కు అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ తర్వాత యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు దూరం కావడం తెలిసిందే. దీంతో మార్కెట్ కంటే కొంత తక్కువ ధరకే చమురును రష్యా అందిస్తుండడంతో, భారత్ దిగుమతులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం లోపే ఉండేది. అది ఇప్పుడు 40 శాతానికి పెగిపోయింది. రష్యా నుంచి చమురు ఎగుమతుల్లో 47 శాతం చైనాకు వెళుతుంటే, 37 శాతం భారత్కు, యూరప్కు 7 శాతం, టరీ్కకి 6 శాతం చొప్పున సరఫరా అవుతున్నాయి. ఈ వివరాలను సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లియర్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక వెల్లడించింది. బొగ్గుకు సైతం డిమాండ్.. ఇక రష్యా నుంచి బొగ్గు దిగుమతులకు సైతం చైనా, భారత్ ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2022 డిసెంబర్ 5 నుంచి 2024 జూలై వరకు రష్యా బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనాయే సొంతం చేసుకుంది. ఆ తర్వాత అత్యధికంగా 18 శాతం బొగ్గు భారత్కు దిగుమతి అయింది. టరీ్కకి 10 శాతం, దక్షిణ కొరియాకి 10 శాతం, తైవాన్కు 5 శాతం చొప్పున రష్యా నుంచి బొగ్గు ఎగమతులు నమోదయ్యాయి. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతుండడం తెలిసిందే. జూలై నెలలో 19.4 మిలియన్ టన్నుల చమురు దిగుమతుల కోసం భారత్ 11.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. సీఆర్ఈఏ నివేదిక ప్రకారం రష్యా సముద్ర చమురు ఎగుమతుల్లో 36 శాతమే ట్యాంకర్ల ద్వారా జరిగింది. పాశ్చాత్య దేశాలు విధించిన ధరల పరిమితి వీటికి వర్తించింది. ఇది కాకుండా మిగిలిన చమురు అంతా షాడో ట్యాంకర్ల ద్వారా రష్యా సరఫరా చేసింది. ఇవి అనధికారికం కనుక ధరల పరిమితి పరిధిలోకి రావు. మరీ ముఖ్యంగా విలువ పరంగా చూస్తే జూలై నెలలో 81 శాతం రష్యా చమురు సరఫరా షాడో ట్యాంకర్ల రూపంలోనే జరిగినట్టు సీఆర్ఈఏ నివేదిక వెల్లడించింది. -
బంగ్లాదేశ్లో ఉద్రిక్తత.. వాణిజ్యంపై ప్రభావం
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని షేక్ హసీనా దేశం వదిలివెళ్లారు. దాంతో అక్కడి పరిపాలన సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ తెలిపింది. సంస్థ వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.భారత్ బంగ్లాదేశ్కు చాలా వస్తువులను ఎగుమతి చేస్తోంది.ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం తగ్గుతుంది. అయితే దీని ప్రభావం పెద్దగా ఉండదు.2023-24లో బంగ్లాదేశ్కు భారత్ 11 బిలియన్ డాలర్లు(రూ.92 వేలకోట్లు) విలువ చేసే వస్తువులను ఎగుమతి చేసింది. అంతకుముందు ఏడాది నమోదైన 12.21 బిలియన్ డాలర్లతో(రూ.1 లక్ష కోట్లు) పోలిస్తే ఇది తక్కువ.గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లా నుంచి భారత్కు దిగుమతుల విలువ రెండు బిలియన్ డాలర్ల(రూ.16 వేలకోట్లు) నుంచి 1.84 బిలియన్ డాలర్లకు(రూ.15 వేలకోట్లు) తగ్గింది.ఇదీ చదవండి: 16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!ఎగుమతులు: కూరగాయలు, కాఫీ, టీ, మసాలాలు, పంచదార, చాక్లెట్లు, శుద్ధిచేసిన పెట్రోలియం, రసాయనాలు, పత్తి, ఇనుము, ఉక్కు, వాహనాలు.దిగుమతులు: చేపలు, ప్లాస్టిక్, తోలు ఉత్పత్తులు, దుస్తులు. -
‘ప్రమాదంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ’
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతులు పెరుగుతుండడం వల్ల దేశీయ సంస్థల ఉత్పత్తి ప్రమాదంలో పడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హెచ్చరించింది. దీనివల్ల స్థానిక కంపెనీల స్థిరత్వంపై ప్రభావం పడుతుందని నివేదికలో పేర్కొంది.సీఐఐ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ క్లిష్ట దశలో ఉంది. దిగుమతి ఆధారిత ఉత్పత్తులు పెరుగుతున్నాయి. విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఉత్పత్తులను తయారుచేసుకునేందుకు బదులుగా దేశీయంగా తయారవుతున్న పరికరాలను వినియోగించుకోవాలి. ఈ రంగంలో దేశీయ విలువ జోడింపు 15% వద్దే ఉంది. దీన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ పరిశ్రమ ఊపందుకునేందుకు ఏటా 6-8% చొప్పున వృద్ధి నమోదవ్వాలి. ఎంపిక చేసిన విడిభాగాలను స్థానిక కంపెనీలు వినియోగించేలా, అందుకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందించేలా పథకాలను రూపొందించాలి. 25-40% సబ్సిడీతో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే మాడ్యూల్స్ తయారీకి అవసరమయ్యే కాంపోనెంట్స్ దిగుమతి సుంకాలను తగ్గించాలి. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.ఇదీ చదవండి: రూ.కోట్లు సంపాదించిన శ్రేయో ఘోషల్.. ఆమె భర్త ఏం చేస్తారో తెలుసా?‘చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీదారులకు గత నాలుగేళ్లలో 15 బిలియన్ డాలర్ల (రూ.1.2లక్షల కోట్లు) మేరకు నష్టం వాటిల్లిందని అంచనా. దాంతో పాటు 1,00,000 కొలువులపై ప్రభావం పడింది. కొన్ని చైనా కంపెనీలు భారత్లో తమ కార్యకలాపాలు పెంచుతున్నాయి. అయితే ఆయా ఉత్పత్తుల్లో ఇతర దేశాల్లో తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్స్ విడిభాగాలను వినియోగిస్తున్నారు. దానివల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చైనాతో వాణిజ్య సంబంధాలను సమీక్షించాలి. యురోపియన్ యూనియన్, ఆఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలి’ అని సీఐఐ తెలిపింది. -
భారీగా బంగారం వెండి దిగుమతులు
న్యూఢిల్లీ: యూఏఈ నుంచి బంగారం, వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం లో గణనీయంగా పెరిగాయి. 210 శాతం అధికంగా 10.7 బిలియన్ డాలర్లు (88,810 కోట్లు) విలువైన బంగారం, దిగుమతులు నమోదైనట్టు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీ యేటివ్ (జీటీఆర్ఐ) సంస్థ అధ్యయనంలో తెలిసింది. 2022–23లో బంగారం, వెండి దిగుమతుల విలువ 3.5 బిలియన్ డాలర్లుగానే ఉంది. భారత్–యూఏఈ సమగ్ర ఆరి్థక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కింద యూఏఈకి భారత్ కలి్పంచిన కస్టమ్స్ డ్యూటీ రాయితీలే ఈ పెరుగుదలకు కారణమని జీటీఆర్ఈ ఓ నివేదికలో వెల్లడించింది. పెరిగిన దిగుమతులను నియంత్రించేందుకు కస్టమ్స్ డ్యూటీ రాయితీలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. యూఏఈ నుంచి వెండి దిగుమతులపై 7 శాతం టారిఫ్ రాయితీని భారత్ కల్పిస్తోంది. దిగుమతుల పరిమాణంపై ఎలాంటి పరిమితి విధించలేదు. అదే బంగారం అయితే ఒక ఆరి్థక సంవత్సరంలో 160 మెట్రిక్ టన్నుల వరకు ఒక శాతం డ్యూటీ రాయితీ కింద అనుమతించింది. 2022 మే నుంచి రెండు దేశాల మధ్య సీఈపీఏ అమల్లోకి వచ్చింది. దీనికితోడు గిఫ్ట్ సిటీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సే్ఛంజ్’(ఐఐబీఎక్స్) ద్వారా యూఏఈ నుంచి ప్రైవేటు సంస్థలు బంగారం, వెండి దిగుమతులకు ప్రభుత్వం అనుమతించింది. బంగారం, వెండి మినహా యూఏఈ నుంచి ఇతర ఉత్పత్తుల దిగుమతులు గత ఆరి్థక సంవత్సరంలో క్షీణించాయి. 2022–23లో 48 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు యూఏఈ నుంచి భారత్కు రాగా, 2023–24లో 9.8 శాతం తక్కువగా 48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.ఇదే ధోరణి ఉండకపోవచ్చు.. యూఈఏ నుంచి బంగారం, వెండి దిగుమతులు ఇక ముందూ ఇదే స్థాయిలో కొనసాగకపోవచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఎందుకంటే యూఏఈలో బంగారం లేదా వెండి తవ్వకాలు (మైనింగ్) లేవని, కనుక ఆ దేశానికి ఈ ఉత్పత్తుల ఎగుమతులతో ఒనగూడే అదనపు విలువ ఏమంత ఉండదన్నారు. ‘‘ప్రస్తుతం భారత్లో బంగారం, వెండి, ఆభరణాల దిగుమతులపై 15 శాతం సుంకం అమలవుతోంది. ఇదే అసలు మూలంలోని సమస్య. టారిఫ్లను 5 శాతానికి తగ్గించినట్టయితే అక్రమ రవాణా, దురి్వనియోగానికి అడ్డుకట్ట పడుతుంది’’అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. యూఏఈ నుంచి దిగుమతులపై తక్కువ టారిఫ్ నేపథ్యంలో ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ను నియంత్రించేందుకు రాయితీతో కూడి కస్టమ్స్ సుంకాలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. బంగారం మాదిరే వెండి దిగుమతులపై వార్షిక పరిమితిని అయినా విధించాలని సూచించారు. దీనివల్ల ఆదాయ నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు. గిఫ్ట్ సిటీ ద్వారా బంగారం, వెండి దిగుమతుల విషయంలో నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు. -
ఎకానమీకి వాణిజ్యలోటు పోటు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేలో 9 శాతం (2023 ఇదే నెలతో పోల్చి) పెరిగాయి. విలువలో 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులుసైతం సమీక్షా నెల్లో 7.7 శాతం పెరిగి 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారీగా 7 నెలల గరిష్ట స్థాయిలో 23.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత భారీ వాణిజ్యలోటు ఎకానమీకి ఒక్కింత ఆందోళన కలిగించే అంశం. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. → అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, జౌళి, ప్లాస్టిక్స్ వంటి రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. → మొత్తం దిగుమతుల్లో చమురు విభాగంలో 28 % పెరుగుదలను నమోదుచేసుకుని విలువలో 20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. → పసిడి దిగుమతులు మాత్రం స్వల్పంగా తగ్గి 3.69 బిలియన్ డాలర్ల నుంచి 3.33 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్– మే నెలల్లో వృద్ధి 5.1 శాతం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు–ఏప్రిల్, మేలలో ఎగుమతులు 5.1 శాతం పెరిగి 73.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 8.89 శాతం పెరిగి 116 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 42.88 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ నెలల్లో ఒక్క చమురు దిగుమతుల విలువ 24.4 శాతం పెరిగి 36.4 బిలియన్ డాలర్లకు చేరింది. సేవలూ బాగున్నాయ్... సేవల రంగం ఎగుమతులు మేలో 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తొలి అంచనా. 2023 మేలో ఈ విలువ 26.99 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ ఇదే కాలంలో 15.88 బిలియన్ డాలర్ల నుంచి 17.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్ మరోవైపు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి ఒక ప్రకటన చేస్తూ, మేనెల్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 5 శాతం తగ్గి రూ.20,713.37 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. 2023 ఇదే నెల్లో ఈ విలువ రూ.21,795.65 కోట్లు (2,647 మిలియన్ డాలర్లు). -
టాప్ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్!
ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తి చేసే టాప్ 5 దేశాలతో పోలిస్తే భారత్లోనే వృద్ధి నమోదైనట్లు ప్రపంచ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్ఏ) నివేదిక వెల్లడించింది. స్టీల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనా ఏప్రిల్ నెలలో 85.9 మిలియన్ టన్నులతో 7 శాతం క్షీణించినట్లు డబ్ల్యూఎస్ఏ తెలిపింది.డబ్ల్యూఎస్ఏ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు చైనా ఉక్కు ఉత్పత్తి 343.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2023తో పోలిస్తే 3% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ఏప్రిల్లో 3.6% పెరుగుదలతో 12.1 మిలియన్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య 49.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి 8.5% వృద్ధి సాధించింది. జపాన్, అమెరికా, రష్యాలు మొదటి త్రైమాసికంలో 2-6% క్షీణించాయి. జనవరి-ఏప్రిల్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇండియా మినహా మిగతా నాలుగు అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రొడక్షన్ తగ్గింది.ఇదీ చదవండి: ఏఐతో మరింత అందంగా: రిలయన్స్ఇండియాలో స్టీల్ను ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ ప్రపంచ డిమాండ్ ఇంకా కోలుకోలేదని డేటా సూచిస్తుంది. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ సెహుల్ భట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉక్కు వినియోగిస్తున్న రంగాల్లో డిమాండ్ తగ్గింది. 2023లో ఐరన్ఓర్(ముడి ఉక్కు) ఉత్పత్తిలో ఎలాంటి మార్పులులేవు. ఈ ట్రెండ్ 2024లోనూ కొనసాగుతుందని అంచనా. ఈ ధోరణి భారతీయ ఉక్కు తయారీదారుల మార్చి త్రైమాసిక ఆదాయాలపై ప్రభావం చూపింది. దేశంలో అధిక ఐరన్ఓర్ దిగుమతి కారణంగా ధరలు ప్రభావితమయ్యాయి’ అని చెప్పారు. -
ఇరాన్ అధ్యక్షుడు హఠాన్మరణం.. భారత్తో వాణిజ్యం ఎలా ఉందంటే..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్(బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పరం ప్రతీకార దాడులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాలు భారత్తో జరుపుతున్న వాణిజ్యం ఏమేరకు ప్రభావం పడుతుందోననే ఆందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటివరకైతే రెండు దేశాలతో భారత్ మెరుగైన సంబంధాలను కలిగి ఉంది. ఏటా ఆయా దేశాలతో చేసే వాణిజ్యాన్ని పెంచుకుంటుంది. ప్రధానంగా వాటి నుంచి జరిపే దిగుమతులు, ఎగుమతులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.2022-23లో 2.33 బిలియన్డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అది 21.7 శాతం అధికం. భారత్ నుంచి ఇరాన్కు చేసే ఎగుమతులు 1.66 బి.డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 14.34శాతం అధికం)గా ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ చేసుకునే దిగుమతులు 672 మిలియన్ డాలర్లు(ముందు ఏడాదితో పోలిస్తే 45.05 శాతం)గా ఉన్నాయి.భారత్ నుంచి ఇరాన్ వెళ్తున్న వాటిలో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ పౌడర్, షుగర్, పండ్లు, ఫార్మా ఉత్పత్తులు, కూల్డ్రింక్స్, పప్పుదినుసులు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో మిథనాల్, పెట్రోలియం బిట్యుమెన్, యాపిల్స్, ప్రొపేన్, డ్రై డేట్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఆల్మండ్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లుఇజ్రాయెల్తోనూ భారత్కు మెరుగైన సంబంధాలే ఉన్నాయి. ఇబ్రాయెల్కు భారత్ ఎగుమతుల్లో ప్రధానంగా ఆటోమేటివ్ డీజిల్, కెమికల్ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లాస్టిక్, టెక్స్ట్టైల్, మెటల్ ఉత్పత్తులు ఉన్నాయి ఫెర్టిలైజర్ ఉత్పత్తులు, రంగురాళ్లు, పెట్రోలియం ఆయిల్స్, డిఫెన్స్ పరికరాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. -
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
బఠానీలను ఉచితంగా దిగుమతి చేసుకునే గడువును ప్రభుత్వం అక్టోబర్ 2024 వరకు పొడిగించింది. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.గతేడాది డిసెంబరులో ప్రభుత్వం బఠానీల దిగుమతిపై ఎలాంటి సుంకం విధించకూడదని నిర్ణయించింది. దాంతో కొన్ని నిబంధనలు తయారుచేసి మార్చి 2024 వరకు అవి అమలులో ఉంటాయని పేర్కొంది. తర్వాత వాటిని జూన్ వరకు పొడిగించారు. తాజాగా ఈ నిబంధనలు అక్టోబర్ వరకు అమలవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.డీజీఎఫ్టీ నోటిఫికేషన్ ప్రకారం.. బఠానీల ఇంపోర్ట్స్కు సంబంధించి కనీస దిగుమతి ధర (ఎంఐపీ) షరతులు వర్తించవు. ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్కు లోబడి ఎంతైనా దిగుమతి చేసుకోవచ్చు. ఎలాంటి సుంకం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 235.92 మిలియన్ డాలర్ల విలువైన బఠానీలను దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. -
అధిక దిగుమతి సుంకాలపై కీలక నివేదిక
న్యూఢిల్లీ: బియ్యం వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు కొనసాగించడం, దేశీయ వ్యవసాయ రంగాన్ని తక్కువ టారిఫ్లకు అనుకూలంగా మార్చాలన్న ఒత్తిళ్లను నిరోధించడం అన్నవి భారత్ ప్రజల ఆహార భద్రత, స్వావలంబనకు కీలకమని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భారత్ వెజిటబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, ఇది దిగుమతుల బిల్లును తగ్గిస్తుందని తన తాజా నివేదికలో పేర్కొంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన ఆవనూనె, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని సూచించింది. ప్రపంచంలో భారత్ అతిపెద్ద వంట నూనెల దిగుమతిదారుగా ఉన్న విషయాన్ని పేర్కొంది. 2017–18 సంవత్సరంలో 10.8 బిలియన్ డాలర్ల విలువైన నూనెలు దిగుమతి అయితే, 2023–24లో ఇది 20.8 బిలియన్ డాలర్లకు పెరగడాన్ని ప్రస్తావించింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు అధిక సుంకాల విధింపు చర్యలతో యూఎస్, ఈయూ తమ వ్యవసాయ రంగానికి మద్దతుగా నిలుస్తున్నట్టు గుర్తు చేసింది. ఆ్రస్టేలియా వంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలపై వ్యవసాయ ఉత్పత్తుల సబ్సిడీలు, టారిఫ్లు తగ్గించాలనే ఒత్తిడిని తీసుకువస్తూనే ఉంటాయని తెలిపింది. ‘‘భారత్ కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై 30–100 శాతం మధ్య టారిఫ్లు అమలు చేస్తోంది. సబ్సిడీ సాయంతో వచ్చే దిగుమతులను నిరోధించడానికి ఇది మేలు చేస్తోంది. ఎఫ్టీఏ భాగస్వామ్య దేశాలకు సైతం టారిఫ్లు తగ్గించడంలేదు. ఈ చర్యలు వంట నూనెలు మినహా దాదాపు అన్ని రకాల సాగు ఉత్పత్తుల విషయంలో భారత్ స్వావలంబన శక్తికి సా యపడుతున్నాయి’’అని ఈ నివేదిక వివరించింది. ఇదే విధానం కొనసాగాలి ‘‘తక్కువ టారిఫ్, సబ్సిడీలతో కూడిన దిగుమతులకు దేశీ వ్యవసాయ రంగాన్ని తెరవకుండా ఉండాలన్న ప్రస్తుత విధానాన్ని భారత్ కొనసాగించాలి. సున్నితమైన ఉత్పత్తులపై అధిక టారిఫ్లు కొనసాగించాలి. టారిఫ్లు తగ్గించాలన్న ఒత్తిళ్లకు తలొగ్గకూడదు. ఎంతో కష్టపడి సాధించుకున్న స్వీయ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం’’అని జీటీఆర్ఐ పేర్కొంది. భారత వ్యవసాయ దిగుమతులు 2023లో 33 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. భారత్ మొత్తం దిగుమతుల్లో ఇది 4.9 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘హరిత, క్షీర విప్లవం తరహా విధానాలపై దృష్టి సారించడం, అధిక దిగుమతి సుంకాలు.. సబ్సిడీ ఉత్పత్తుల దిగుమతులకు భారత వ్యవసాయ రంగం ద్వారాలు తెరవాలన్న అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. 140 కోట్ల ప్రజల ఆహార భద్రత కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద చురుకైన సంప్రదింపులు నిర్వహించడం భారత్ ఈ స్థితిలో ఉండేందుకు దారితీశాయి’’అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: లిథియం దిగుమతుల కోసం ప్రస్తుతం చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతున్న భారత్.. ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా అర్జెంటీనాలో అయిదు లిథియం బ్లాకులను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. భారత అవసరాల కోసం విదేశాల్లో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్), అర్జెంటీనాకు చెందిన క్యాటామార్కా మినరా వై ఎనర్జెటికా సొసైడాడ్ డెల్ ఎస్టాడో (క్యామ్యెన్) ఇందుకు సంబంధించిన ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చలు తుదిదశలో ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో లిథియం నిక్షేపాల అన్వేషణ, గనుల అభివృద్ధిపై భారత్ సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించాయి. భారత్ ఇప్పటికే ఆ్రస్టేలియాలో రెండు లిథియం, మూడు కోబాల్ట్ గనులను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే క్రమంలో లిథియంకు సంబంధించి అర్జెంటీనాతో ఒప్పందం రెండోది కానుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు మొదలైన వాటి బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 25,000 కోట్ల విలువ చేసే లిథియంను చైనా, హాంకాంగ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 98 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉండగా ఇందులో 20 శాతం నిక్షేపాలు అర్జెంటీనాలో ఉన్నాయి. -
సముద్ర మార్గంలో పండ్లు, కూరగాయల ఎగుమతులు
న్యూఢిల్లీ: సముద్ర మార్గంలో తాజా పండ్లు, కూరగాయల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా నియమావళిని (ప్రొటోకాల్) కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకటించారు. అరటి, మామిడి, దానిమ్మ, జాక్ఫ్రూట్ తదితర ఉత్పత్తులను ప్రస్తుతం విమాన రవాణా ద్వారా పంపిస్తున్నారు. ఎగుమతుల పరిమాణం తక్కువగా ఉండడం, పండ్లు పక్వానికి వచ్చే కాలం వేర్వేరుగా ఉండడమే ఇందుకు కారణం. సముద్ర రవాణా ప్రోటోకాల్లో భాగంగా, పండ్లు పరిపక్వానికి వచ్చే నిర్ధిష్ట కాల వ్యవధి, ఒక్కో ఉత్పత్తి శాస్త్రీయంగా ఎన్ని రోజులకు పండుతుంది? నిర్దేశిత సమయంలో వాటిని సాగు చేయడం, రైతులకు శిక్షణ ఇవ్వడం వంటివి భాగంగా ఉంటాయి. ఒక్కో పండు, కూరగాయకు ఇది వేర్వేరుగా ఉంటుంది. సముద్ర మార్గంలో రవాణాతో తక్కువ వ్యయానికి, ఎక్కువ మొత్తంలో పంపించుకోవచ్చని రాజేష్ అగర్వాల్ తెలిపారు. ‘‘ఇప్పటి వరకు వీటిని వాయు మార్గంలోనే ఎగుమతి చేస్తున్నాం. అగ్రి ఉత్పత్తుల ఎగుమతులకు సముద్ర రవాణాను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చన్నది పరీక్షించి చూస్తున్నాం. అందుకే సముద్ర ప్రొటోకాల్ను అభివృద్ధి చేస్తున్నాం’’అని రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం విమానయానం ద్వారా పంపిస్తుండడంతో, ధరల పరంగా పోటీ ఇచ్చే సానుకూలత ఉండడం లేదన్నారు. అపెడా, ఇతర భాగస్వాములతో కలసి అరటి పండ్ల ఎగుమతులకు సంబంధించిన ప్రోటోకాల్ను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ‘‘ఖాళీ కంటెయినర్లో పరీక్షించి చూశాం. ప్రత్యక్ష పరిశీలనలో భాగంగా రోటెర్డ్యామ్కు మొదటి షిప్పింగ్ను పంపించాం. ఇది విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంది. ఒక్కసారి ఇది పూర్తయితే దిగుమతిదారులు ఆమోదించడం మొదలవుతుంది. అప్పుడు పెద్ద మొత్తంలో ఎగుమతులకు వీలు కలుగుతుంది’’అని అగర్వాల్ వివరించారు. అరటి సాగులో నంబర్ 1 ప్రపంచంలో అరటి తయారీలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అయినా కానీ, ప్రపంచ అరటి ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం 1% మించి లేదు. ప్రపంచ అరటి ఉత్పత్తిలో భారత్ వాటా 26. 45 శాతంగా ఉంది. ఇది 35.36 మిలియన్ మెట్రిక్ టన్నులకు సమానం. గత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద చేసిన అరటి ఎగుమతులు ఏ మాత్రం మార్పు లేకుండా 176 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్ట్ వరకు మామిడి ఎగుమతులు 19% పెరిగి 48 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మన దేశం నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతులు 13% వృద్ధితో 2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
రష్యా నుంచి భారీగా దిగుమతులు
న్యూఢిల్లీ: రష్యా నుంచి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 36.27 బిలియన్ డాలర్లు విలువైన (రూ.3.01లక్షల కోట్లు) దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతుల్లో 65 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2022 ఏప్రిల్–అక్టోబర్ మధ్య రష్యా నుంచి దిగుమతులు 22.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముడి చమురు, ఎరువులు ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో భారత్ దిగుమతులకు రష్యా రెండో అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన దేశ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం ఒక్కశాతమే. కానీ, ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో రష్యా 40 శాతం వాటా ఆక్రమించేసింది. ఉక్రెయిన్పై దాడికి ప్రతీకారంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్కు మార్కెట్ కంటే తక్కువ ధరకే చుమురు సరఫరాకు రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్ భారీగా చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. దేశాల వారీగా.. ► ఇక ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా నుంచి దిగుమతులు 60.02 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.60.26 బిలియన్ డాలర్ల వద్దే ఉన్నాయి. ► అమెరికా నుంచి దిగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు 16 శాతం తగ్గి 24.89 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► యూఏఈ నుంచి దిగుమతులు 21 శాతం తగ్గి 24.91 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ► అంతేకాదు సౌదీ అరేబియా, ఇరాక్, ఇండోనేíÙయా, సింగపూర్, కొరియా నుంచి కూడా దిగుమతులు క్షీణించాయి. ► స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో 10.48 బిలియన్ డాలర్లుగా ఉంటే, అవి ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 13.97 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. ► మరో వైపు భారత్ ఎగుమతులకు కేంద్రంగా ఉన్న టాప్–10 దేశాలలో, ఆరు దేశాలకు ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు ప్రతికూలంగా నమోదయ్యాయి. అమెరికా, యూఏఈ, సింగపూర్, జర్మనీ, బంగ్లాదేశ్, సౌదీ అరేబియాకు తగ్గాయి. ► బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్కు ఎగుమతులు వృద్ధి చెందాయి. ► చైనాకు ఎగుమతులు 8.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో ఇవి 8.85 బిలియన్ డాలర్లు. -
టాప్గేర్లో టెస్లా దిగుమతులు..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ నుంచి ఆటో విడిభాగాల దిగుమతిని రెట్టింపు చేసుకునే యోచనలో ఉంది. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్ (కాలిఫోరి్నయా)లోని కంపెనీ ప్లాంటును సందర్శించిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ విషయం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా గోయల్ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కలవలేకపోయారు. ‘టెస్లా అధునాతన ప్లాంటును సందర్శించాను. మొబిలిటీ ముఖచిత్రాన్ని మారుస్తున్న టెస్లా వృద్ధి ప్రస్థానంలో పలువురు భారతీయ ఇంజ నీర్లు, ఫైనాన్స్ నిపుణులు సీనియర్ల స్థాయిలో పాలుపంచుకుంటూ ఉండటం సంతోషం కలిగించింది. అలాగే టెస్లా సరఫరా వ్యవస్థలో భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతుండటం గర్వకారణం. భారత్ నుంచి టెస్లా దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా ముందుకెడుతోంది. మస్క్ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను‘ అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్లో గోయల్ ట్వీట్ చేశారు. ‘మీరు టెస్లా ప్లాంటును సందర్శించడం సంతోషం కలిగించింది. కాలిఫోరి్నయాకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను‘ అని దానికి ప్రతిస్పందనగా మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా 2022లో భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే విడిభాగాలను దిగుమతి చేసుకోగా, ఈసారి 1.9 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు గోయల్ ఇటీవలే తెలిపారు. పరిశీలనలో మినహాయింపులు.. టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దిగుమతులతో ప్రారంభించి ఇక్కడ డిమాండ్ను బట్టి ప్లాంటును నెలకొల్పే యోచనలో ఉన్నట్లు రెండేళ్ల క్రితం మస్క్ చెప్పారు. అయితే, భారీ స్థాయి దిగుమతి సుంకాల విషయంలో భారత్ తమకు కొంత మినహాయింపు కల్పించాలని కోరారు. కానీ, టెస్లా కూడా ఇతర సంస్థల బాటలోనే రావాల్సి ఉంటుందని కేంద్రం అప్పట్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్లో అమెరికాలో ప్రధాని మోదీతో మస్క్ సమావేశం అనంతరం.. దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలను ఆకర్షించేందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామంటూ కేంద్రం వెల్లడించడం గమనార్హం. దీనితో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం చేసేలా కంపెనీకి వెసులుబాట్లునిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంచనాలు నెలకొన్నాయి. -
జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!
న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్మెంట్కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి. దీంతో భారత్తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్బర్గ్లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి. -
110 సంస్థలకు అనుమతులు..
-
110 సంస్థలకు అనుమతులు
న్యూఢిల్లీ: ల్యాప్టాప్లు, కంప్యూటర్లు వంటి ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు 110 సంస్థలకు కేంద్రం అనుమతినిచి్చంది. యాపిల్, డెల్, లెనొవొ, హెచ్పీ ఇండియా సేల్స్, అసూస్ ఇండియా, ఐబీఎం ఇండియా, షావోమీ టెక్నాలజీ ఇండియా, శాంసంగ్ ఇండియా ఎల్రక్టానిక్స్ మొదలైనవి వీటిలో ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అనుమతుల కోసం మొత్తం 111 దరఖాస్తులు వచి్చనట్లు వివరించారు. అయితే, ’నిరాకరణ జాబితా’లో ఉన్న ఒక హైదరాబాద్ సంస్థకు మాత్రం అనుమతి లభించలేదని పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్దిష్ట ఐటీ హార్డ్వేర్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా అనుమతులకు లోబడి దిగుమతి చేసుకునే వెసులుబాటు కలి్పంచింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆథరైజేషన్ విధానం 2024 సెపె్టంబర్ వరకు అమల్లో ఉంటుంది. అక్టోబర్ 31న పరిశ్రమ వర్గాలతో సమావేశమైన డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) అనుమతుల ప్రక్రియ గురించి వివరించారు. ’నిరాకరణ జాబితా’లో ఉన్న సంస్థలకు అనుమతులు లభించవు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ఎగుమతి నిబంధనలను పాటించని సంస్థలు, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఈ జాబితాలో ఉంటాయి. ఐటీ హార్డ్వేర్ సంబంధ దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 8.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ల్యాప్టాప్లు సహా పర్సనల్ కంప్యూటర్లు దిగుమతయ్యాయి. అత్యధికంగా చైనా (5.11 బిలియన్ డాలర్లు), సింగపూర్ (1.4 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (807 మిలియన్ డాలర్లు) నుంచి ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తులు దిగుమతవుతున్నాయి. -
భారీగా పెరిగిన వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వెజిటబుల్ నూనెల దిగుమతులు (వంట నూనెలు, వంటకు వినియోగించనివి) ఆగస్ట్ నెలలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 33 శాతం పెరిగి 18.66 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. సుంకాలు తగ్గడం, డిమాండ్ పుంజుకోవడం దిగుమతులు గణనీయంగా పెరగడానికి దారితీసినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) తెలిపింది. 2022 ఆగస్ట్ నెలలో వెజిటబుల్ నూనెల దిగుమతులు 14 లక్షల టన్నులుగా ఉన్నాయి. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) 2022-23 మొదటి పది నెలల్లో (నూనెల సీజన్ నవంబర్-అక్టోబర్) నూనెల దిగుమతులు 24 శాతం పెరిగి 141.21 లక్షల టన్నులుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 113.76 లక్షల టన్నులుగా ఉండడం గమనార్హం. ఆగస్ట్ నెలలో దిగుమతులను పరిశీలిస్తే.. 18.52 లక్షల టన్నులు వంట నూనెలు కాగా, నాన్ ఎడిబుల్ నూనెలు 14,008 టన్నులుగా ఉన్నాయి. పామాయిల్ దిగుమతులు 11.28 లక్షల టన్నులు ఉండడం గమనించొచ్చు. ‘‘మొదటి పది నెలల్లో 141 లక్షల టన్నుల దిగుమతులను పరిశీలిస్తే.. అక్టోబర్తో ముగిసే నూనెల సంవత్సరంలో మొత్తం దిగుమతులు 160–165 లక్షల టన్నులకు చేరినా ఆశ్చర్యం అక్కర్లేదు’’అని ఎస్ఈఏ పేర్కొంది.దేశీయంగా నూనెల లభ్యత తగినంత ఉందని, అయినప్పటికీ ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్ బాగా పెరిగినట్టు ఎస్ఈఏ తెలిపింది. 2016-17 నూనెల సంవత్సరంలో భారత్ అత్యధికంగా 151 లక్షల టన్నుల వెజిటబుల్ నూనెలను దిగుమతి చేసుకుంది. -
వంట నూనెల ధరలు తగ్గాయి.. దిగుమతులు భారీగా పెరిగాయి!
న్యూఢిల్లీ: వెజిటబుల్ నూనెల దిగుమతులు జూలై నెలలో భారీగా పెరిగిపోయాయి. 17.71 లక్షల టన్నుల మేర దిగుమతులు నమోదైనట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. 2022 జూలై నెలలో నమోదైన 12.14 లక్షల టన్నుల దిగుమతులతో పోలిస్తే 46 శాతం పెరిగినట్టు తెలిపింది. 2022–23లో తొలి తొమ్మిది నెలల సీజన్లో (నవంబర్–అక్టోబర్) దిగుమతులు 23 శాతం పెరిగి 122.54 లక్షల టన్నులుగా ఉన్నట్టు పేర్కొంది. వెజిటబుల్ నూనెల్లో వంటకు వినియోగించేవే కాకుండా, వంటకు వినియోగించనివి (ఆహార పదార్థాల్లో వినియోగానికి) కూడా ఉంటాయి. ఇక ఈ ఏడాది జూలైలో వంట నూనెల దిగుమతుల వరకే చూస్తే 46 శాతం పెరిగి 17.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 12.05 లక్షల టన్నుల మేర దిగుమతి అయ్యాయి. ఇతర నూనెల దిగుమతులు 9,069 టన్నుల నుంచి 15,999 టన్నులకు పెరిగాయి. దేశీయంగా వంట నూనెల ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్ తిరిగి పెరిగినట్టు ఎస్ఈఏ తెలిపింది. దేశంలో 45 రోజుల వినియోగానికి సరిపడా వంట నూనెల నిల్వలు ఉన్నాయని, పండుగల రోజుల్లో నూనెల సరఫరా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. పామాయిల్ను ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుండగా, అర్జెంటీనా నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతి అవుతోంది. సన్ఫ్లవర్ నూనె ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తోంది. -
ఆకస్మిక ఆంక్షలు: షాక్లో దిగ్గజ కంపెనీలు, దిగుమతులకు బ్రేక్!
ల్యాప్టాప్లు,కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం నిర్ణయం చైనా కంపెనీలతో సహా ,ఆపిల్, శాంసంగ్,హెచ్పీ లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో చైనా లైసెన్సు లేకుండానే చిన్న టాబ్లెట్ల నుంచి ఆల్ ఇన్ వన్ పీసీల దిగుమతులపై ఆంక్షలు ఆయా కంపెనీల ఆదాయంపై భారీగా ప్రభావం చూపనుంది. ల్యాప్టాప్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, మేకిన్ఇండియా, స్థానిక ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) లైసెన్స్లను తప్పనిసరి చేయడంతో ప్రపంచంలోని అతిపెద్ద పీసీ మేకర్స్, ఇతర కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. భారతదేశానికి ల్యాప్టాప్లు టాబ్లెట్ల కొత్త దిగుమతులను నిలిపివేశాయి. అయితే ఆకస్మిక లైసెన్సింగ్ ప్రకటించడం పరిశ్రమను అతలాకుతలం చేసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ సంస్థల బహుళ-బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఇది భారీ గండి కొడుతుందని అంచనా. రానున్న దీపావళి షాపింగ్ సీజన్,బ్యాక్-టు-స్కూల్ కాలం సమీపిస్తున్నందున డిమాండ్ పుంజుకోనున్న టైంలో లైసెన్సులను ఎలా త్వరగా పొందాలనే దానిపై సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) గ్లోబల్ ఇన్వెంటరీ, అమ్మకాల వృద్ధిని పునఃప్రారంభించడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న తయారీదారులకు ఈ అవసరం అదనపు తలనొప్పిని సృష్టిస్తుందనీ, ఫలితంగా దేశీయ లాంచ్లు ఆలస్యం కావడానికి లేదా విదేశీ సరుకులపై ఇప్పటికీ ఎక్కువగా ఆధారపడే కంపెనీల్లో ఉత్పత్తి కొరతకు దారితీయవచ్చనేది ప్రధాన ఆందోళన. కాగా దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ముఖ్యంగా చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో తీసుకున్న ఈ నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్టాప్లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్లో ఎక్కువగా హెచ్సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. మరోవైపు దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ల్యాప్టాప్లు, టాబ్లెట్లు ఇతర హార్డ్వేర్ తయారీదారులను ఆకర్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం 170 బిలియన్ రూపాయల ($2.1 బిలియన్) ఆర్థిక ప్రోత్సాహక ప్రణాళిక కోసం దరఖాస్తులను కోరుతున్న సంగతి తెలిసిందే. -
ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులు: సంచలన నిర్ణయం
Restrictions on Imports కేంద్ర ప్రభుత్వం ల్యాప్టాప్లు, టాబ్లెట్లు కంప్యూటర్ల దిగుమతిపై తక్షణమే ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి నేడు (ఆగస్ట్ 3 న) వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. పరిమితులు విధించిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్తో దిగుమతికి అనుమతి ఉంటుందని పేర్కొంది.బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై పరిమితులు వర్తించవు ఈ దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే అమలయ్యేలా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్లు ,అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై హెచ్ఎస్ఎన్ 8741 కింద ఈ పరిమితులు విధిస్తున్నట్టు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై ఆంక్షలు వర్తించవని మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాగేజీ నియమాలు భారత సరిహద్దులోకి ప్రవేశించే లేదా బయటికి వచ్చే ప్రతి ప్రయాణీకుడు కస్టమ్స్ నిబంధనలు పాటించాలి. అలాగే పోస్ట్ లేదా కొరియర్. దిగుమతులు వర్తించే విధంగా సుంకం చెల్లింపునకు లోబడి ఉంటాయి. అలాగే విదేశాల్లో రిపేర్ అయిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు సంబంధించి, వాటి రిపేర్కి ఇవ్వడానికి, తిరిగి తీసుకోవడానికి సంబంధించిన దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) సెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, బెంచ్మార్కింగ్ ఇతర సమయాల్లో దిగుమతిదారులు దిగుమతి లైసెన్స్ అవసరం లేకుండా సరుకుకు 20 వస్తువులను తీసుకురావచ్చు. అయితే, ఈ ఐటెమ్లు తప్పనిసరిగా నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగింలాలి. తిరిగి విక్రయించడానికి లేదు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరిన తర్వాత, ఉత్పత్తులను నాశనం చేయాలి లేదా తిరిగి ఎగుమతి చేయాలి. -
ఎగుమతులు భారీ పతనం.. మూడేళ్లలో ఇదే తొలిసారి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మందగమన ప్రభావం ముఖ్యంగా అమెరికా, యూరోప్ మార్కెట్ల నిరాశావాద ధోరణి భారత్ వస్తు ఎగుమతులు–దిగుమతులపై ప్రభావం చూపుతోంది. జూన్లో వస్తు ఎగుమతులు 22 శాతం క్షీణించి 32.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడచిన మూడేళ్లలో (కరోనా సంక్షోభ సమయం 2020 మే నెల్లో 36.47 శాతం క్షీణత) ఇంత స్థాయిలో వస్తు ఎగుమతుల పతనం ఇదే తొలిసారి. ఇక దిగుమతులు కూడా 17.48 శాతం క్షీణించి 53.10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు జూన్లో 20.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికంలో క్షీణతే.. ఇక ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) చూస్తే వస్తు ఎగుమతులు 15.13 శాతం క్షీణించి 102.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 12.67%క్షీణించి 160.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 57.6 బిలియన్ డాలర్లుగా ఉంది. విభాగాల వారీగా... జూన్లో చమురు దిగుమతుల విలువ 33.8 శాతం తగ్గి 12.54 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఏప్రిల్–జూన్ మధ్య 18.52 శాతం క్షీణతతో 43.4 బిలియన్ డాలర్లుగా ఉంది. పసిడి దిగుమతులు జూన్లో 82.38 శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికాన్ని చూస్తే, 7.54 శాతం తగ్గి 9.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. జూన్లో వెండి దిగుమతులు 94.36 శాతం పడిపోయి 0.79 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 21 క్షీణత నమోదుచేసుకున్నాయి. వీటిలో పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్, రెడీమేడ్ దుస్తులు, ఇంజనీరింగ్, రసాయనాలు, రత్నాభరణాలు, తోలు, మెరైన్ ఉత్పత్తులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు జూన్లో 45.36% పెరిగి 2.43%గా నమోదయ్యాయి. ఏప్రిల్–జూన్లో ఈ ఎగుమతులు 47% పెరిగి 6.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్: లైసెన్స్ ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: కొన్ని రకాల బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతులపై కేంద్ర సర్కారు ఆంక్షలు విధించింది. అత్యవసరం కాని దిగుమతులను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్పత్తుల దిగుమతి విధానం తక్షణమే అమలులోకి వచ్చేలా ఉచిత నుంచి పరిమితంగా సవరించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక ప్రకటనలో పేర్కొంది. బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతి కోసం దిగుమతిదారు ఇకపై లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉండగా, దీన్ని ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. అయితే భారత్-యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పరిధిలో చేసుకునే దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించవని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే మధ్య కాలంలో ముత్యాలు, విలువైన, పాక్షిక విలువైన రాళ్ల దిగుమతులు 25.36 శాతం తగ్గి 4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో బంగారం దిగుమతులు కూడా దాదాపు 40 శాతం తగ్గి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. -
చైనా దిగుమతుల్లో మారిన తీరు.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?
న్యూఢిల్లీ: భారత్ దిగుమతుల్లో చైనా వాటా తగ్గుతోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 - 22లో భారత్ మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 15.43 శాతం. ఇది 2022 - 23లో 13.78 శాతానికి తగ్గింది. అయితే విలువల్లో మాత్రం ఈ పరిమాణం ఇదే కాలంలో 94.57 బిలియన్ డాలర్ల నుంచి 98.51 బిలియన్ డాలర్లకు చేరింది. గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో చైనాకు భారత్ ఎగుమతులు కూడా 21.26 బిలియన్ డాలర్ల నుంచి 15.32 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రష్యా (369 శాతం), ఇండోనేషియా (63 శాతం), సౌదీ అరేబియా (23 శాతం), సింగపూర్ (24 శాతం) కొరియా (21 శాతం)లకు భారత్ ఎగుమతులు పెరిగాయి. -
దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు
న్యూఢిల్లీ: భారత్ బంగారం దిగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 30 శాతం పడిపోయాయి. దిగుమతులుమొత్తం విలువ 31.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది యల్లో మెటల్ దిగుమతుల విలువ 2021-22 ఇదే కాలంలో 45.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 ఆగస్టు నుంచి దిగుమతుల్లో పెరుగుదల లేకపోగా, క్షీణత నమోదుకావడం దీనికి నేపథ్యం. బంగారంపై అధిక దిగుమతి సుంకం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు విలువైన లోహం దిగుమతులు తగ్గడానికి కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది కేంద్రం పసిడిపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. పసిడి దిగుమతులను నిరుత్సాహ పరచడం, తద్వారా ఈ బిల్లును తగ్గించడం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరక్కుండా కట్టడి చేయడం ఈ నిర్ణయం లక్ష్యం. వెండి వెలుగులు.. కాగా, వెండి దిగుమతులు మాత్రం 2022-23 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 66 శాతం పెరిగి 5.3 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం. -
అభివృద్ధికి బాటలు
(నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : తీర ప్రాంతాలు, వాటి సమీపంలోని పట్టణాల శాశ్వత ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో అడుగులు ముందుకు వేస్తోంది. పూర్వపు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని జాతీయ రహదారులతో ఎక్కడికక్కడ కొత్త మార్గాలతో అనుసంధానించాలనే ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలతతో అభివృద్ధి వేగం అందుకోనుంది. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో పోర్టు/ఫిషింగ్ హార్బర్.. ఏదో ఒకటి ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారు. దీనికి తోడు లాజిస్టిక్ పార్కులు, పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు రూపు దిద్దుకుంటున్నాయి. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు చెన్నై– కోల్కతా, కత్తిపూడి– త్రోవగుంట తదితర జాతీయ రహదారులు, రైలు మార్గాలు ఇప్పటికే ఉన్నాయి. పోర్టులు, హార్బర్లతో ఎన్హెచ్ల అనుసంధానానికి భారత్మాల పరియోజనలో భాగంగా నూతన రోడ్ల నిర్మాణం.. నాలుగు, ఆరు వరుసలకు విస్తరించడం ద్వారా సమీప పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. సరుకు రవాణా వేగవంతం, పరిశ్రమల ఏర్పాటు.. తద్వారా వర్తక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా వ్యవహరించాలని ఢిల్లీ పర్యటనల సమయంలో ప్రధానితో పాటు సంబంధిత శాఖల మంత్రుల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదిస్తూ వచ్చారు. ఫలితంగా నెలల వ్యవధిలోనే పోర్టుల అనుసంధానానికి నిర్ణయాలు వేగవంతమయ్యాయి. 22 పోర్టు అనుసంధాన ప్రాజెక్టులు రాష్ట్రంలోని పోర్టులను అనుసంధానిస్తూ 22 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.18,896 కోట్ల అంచనాలతో 446 కిలోమీటర్ల మేర విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నుంచి ఎన్హెచ్లను అనుసంధానిస్తూ నూతన రహదారులు నిర్మితం కానున్నాయి. రెండు మార్గాలకు సంబంధించి పురోగతిలో ఉన్న వాటిలో.. అచ్చంపేట జంక్షన్ (ఎన్హెచ్ –216) నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్టు – వాకలపూడి లైట్ హౌస్ (ఎన్హెచ్–516 ఎఫ్) వరకు రూ.140.50 కోట్లతో 13.19 కి.మీ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలోగా పనులు పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టు సంస్థకు సూచించింది. విశాఖపట్నం పోర్టును అనుసంధానించేలా ఈస్ట్ బ్రేక్ వాటర్ (ఎన్హెచ్–216) నుంచి కాన్వెంట్ జంక్షన్ (ఎన్ హెచ్–516సి) వరకు 3.49 కి.మీలను రూ.40 కోట్లతో ఫేజ్–1 కింద నాలుగు లేన్ల రహదారి పనులను నిర్మాణ సంస్థ చేపట్టాల్సి ఉంది. బిడ్ల పరిశీలన.. డీపీఆర్ కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి మూడు ప్రాజెక్టుల కింద రూ.2,109.61 కోట్లతో 58.50 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధికి సంబంధించిన బిడ్లు పరిశీలన దశలో ఉన్నాయి. ఇందులో భాగంగా సబ్బవరం నుంచి షీలానగర్ వరకు 12.50 కి.మీ మేర రూ.1,028.26 కోట్లతో ఆరు లైన్ల మార్గాన్ని భారతమాల పరియోజన కింద విశాఖ పోర్టు వరకు చేపట్టనున్నారు. విశాఖ, కృష్ణపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, నిజాంపట్నం, గంగవరం పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి 148.08 కి.మీ మేర రహదారి నిర్మాణానికి రూ.8,963 కోట్లతో ఆరు ప్రాజెక్టులుగా చేపట్టడానికి డీపీఆర్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం, వైజాగ్ పోర్టు కంటెయినర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి మీదుగా ఆనందపురం జంక్షన్ వరకు, గుంటూరు– నారాకోడూరు– తెనాలి– చందోలు మీదుగా నిజాంపట్నం పోర్టుకు, గంగవరం పోర్టు నుంచి తుంగలం వరకు, ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి పవిత్ర సంగమం మీదుగా కృష్ణా రివర్ టెర్మినల్ వరకు, విశాఖ పోర్టుకు సంబంధించి ఈస్ట్ బ్రేక్ వాటర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి. కాగా, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అనుసంధానానికి 106.7 కి.మీ మేర రూ.2,870 కోట్లతో ఐదు ప్రాజెక్టుల కింద రహదారుల నిర్మాణానికి డీపీఆర్ల తయారీకి కన్సల్టెంట్లను ఎన్హెచ్ఏఐ నిర్ణయించాల్సి ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో భరోసా విశాఖలో ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) దేశంలోనే పారిశ్రామిక ప్రగతికి భవిష్యత్ వేదిక ఆంధ్రప్రదేశ్ అనే విశ్వసనీయతను పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్లో కల్పించింది. రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన 386 ఒప్పందాల ద్వారా దాదాపు 20 రంగాలలో ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ఉండటం, సుదీర్ఘ సముద్రతీరంతో తూర్పు ఆసియా దేశాలకు ముఖ ద్వారం కావడం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైలు కనెక్టివిటీ కలిగి ఉండటం ప్రగతికి సోపానాలే. తద్వారా చెన్నై–కోల్కతా ఎన్హెచ్ వెంబడి, ఈ రెండింటికి మధ్యలో విశాఖ, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు గూడూరు తరహా పట్టణాలు, పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయి. ఆక్వా అదనపు అవకాశం కోస్తా జిల్లాల్లో 5.30 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆక్వా రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆక్వా రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు దేశీయ ఎగుమతుల్లో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వాటా ఐదు శాతం నుంచి రానున్న ఏడేళ్లలో పది శాతానికి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఏపీ నుంచి వివిధ ఆహార ఉత్పత్తులు, అన్ని రంగాల వర్తక వాణిజ్యాల ముడి సరుకుల ఎగుమతులు, దిగుమతులను పెంచే ప్రణాళికతో వ్యవహరిస్తోంది. అగ్రిమెంట్ దశలో ఐదు ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లోని జాతీయ రహదారులతో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులను నాలుగు, ఆరు వరుసల రహదారులతో అనుసంధానించే ఐదు ప్రాజెక్టుల కాంట్రాక్టులు అవార్డు పూర్తయి అగ్రిమెంటు దశలో ఉన్నాయి. వీటిని రూ.3,745 కోట్లతో 104 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ♦ కాకినాడ పోర్టును అనుసంధానించేలా 12.25 కి.మీ మేర సామర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు రహదారి ♦ కృష్ణపట్నం పోర్టును కనెక్టు చేసే చిలకర్రు క్రాస్ రోడ్డు నుంచి తూర్పు కనుపూరు మీదుగా పోర్టు దక్షిణ గేటు వరకు 36.06 కి.మీ రోడ్డు ♦ నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరు (ఎన్హెచ్–71) వరకు 34.88 కి.మీ రోడ్డు ♦ 11 కి.మీ మేర విశాఖ పోర్టు రోడ్డు అభివృద్ధి ♦ కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ జంక్షన్ (ఎన్హెచ్–516సీ) రోడ్డు అభివృద్ధి 22 పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు 446 కి.మీ మొత్తం దూరం రూ.18,896 కోట్లు ప్రాజెక్టుల వ్యయం పోర్టులు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్ట్, కాకినాడ యాంకరింగ్, కాకినాడ రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం రానున్నవి మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ గేట్వే ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో దశ కింద బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నారు. -
జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయం
న్యూఢిల్లీ: కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల కోసం భారత్కు చైనా కంటే జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయమని మెడికల్ టెక్నాలజీ అసోసియేష్ ఆఫ్ ఇండియా (ఎంటాయ్) పేర్కొంది. ఇతర దేశాల మాదిరే భారత్ సైతం తన మెడికల్ టెక్నాలజీ అవసరాల కోసం ప్రధానంగా అమెరికా, జపాన్, యూరప్, బ్రిటన్, చైనా, సింగపూర్ దేశాలపై ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేసింది. చైనా నుంచి మెడికల్ టెక్నాలజీ దిగుమతుల విలువ పెరుగుతుండడం ఆందోళనకరమని, ప్రాధాన్య ప్రాతిపదికన ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించింది కొన్ని రకాల వైద్య పరికరాలకు భారత్ తగినంత తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకుందని చెబుతూ.. క్లిష్టమైన సాంకేతికతతో కూడిన ఉపకరణాల కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు తెలియజేసింది. నాణ్యమైన, అత్యాధునిక వైద్య పరికరాల దిగుమతులు కష్టమేమీ కాబోదంటూ.. చైనా నుంచి ఈ తరహా ఉత్పత్తుల విలువ పెరగడం ఒక్కటే ఆందోళన కలిగిస్తున్నట్టు ఎంటాయ్ చెప్పింది. చైనా–భారత్ మధ్య గత మూడేళ్లుగా సరిహద్దు, ద్వైపాక్షిక విభేదాలు నెలకొనడం తెలిసిందే. అయినా కానీ కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల విలువ 2020–21లో 327 బిలియన్ డాలర్ల నుంచి 2021–22లో 515 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ‘‘వైద్య పరికరాలు, విడిభాగాల దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద పలు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించడం విలువైన చర్యే. కానీ, ఇది ఫలితాలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు భారత్ అత్యవసరంగా చైనాకు ప్రత్యామ్నాయాలను చూడాలి’’అని ఎంటాయ్ చైర్మన్ పవన్ చౌదరి పేర్కొన్నారు. -
పెరిగిన ఎరువుల దిగుమతి
న్యూఢిల్లీ: భారత్ ఎరువుల దిగుమతి పరిమాణం జనవరిలో 3.9 శాతం పెరిగి 19.04 లక్షల టన్నులకు చేరింది. 2022 జనవరిలో ఈ పరిమాణం 18.33 లక్షల టన్నులు. ఎరువుల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. ► 2023 జనవరి మొత్తం 19.04 లక్షల టన్నుల దిగుమతుల్లో యూరియా 10.65 లక్షల టన్నులు. డీ అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) 5.62 లక్షల టన్నులు. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) 1.14 లక్షల టన్నులు. కాంప్లెక్స్లు 1.63 లక్షల టన్నులు. 2022 జనవరిలో యూరియా దిగుమతుల పరిమాణం 12.48 లక్షల టన్నులు. డీఏపీ 2.45 లక్షల టన్నులు. ఎంఓపీ 3.40 లక్షల టన్నులు. ఎంఓపీ పరిమాణం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు రెండింటి వినియోగానికి ఉద్దేశించినది. ► ఈ ఏడాది జనవరిలో దేశీయ ఎరువుల ఉత్పత్తి 2022 ఇదే నెలతో పోల్చితే 32.16 లక్షల టన్నుల నుంచి 39.14 లక్షల టన్నులకు పెరిగింది. ► అంతర్జాతీయ మార్కెట్లో పలు రకాలు ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయి. యూరియా ధరలు (రవాణాకు సిద్ధమైన) ఈ ఏడాది జనవరిలో టన్నుకు 44.26 శాతం క్షీణించి 897 డాలర్ల నుండి 500 డాలర్లుగా నమోదయ్యాయి.డీఏపీ ధరలు 26.28 శాతం క్షీణించి టన్నుకు 679 డాలర్లకు చేరాయి. ఫాస్పరిక్ యాసిడ్ ధర 11.65 శాతం తగ్గి, టన్నుకు 1176 డాలర్లకు తగ్గింది. అమోనియా రేటు 17.42 శాతం తగ్గి, టన్నుకు 928 డాలర్లకు దిగివచ్చింది. సల్ఫర్ ధర కూడా టన్నుకు 52.51 శాతం తగ్గి 161 డాలర్లకు చేరింది. ► కాగా, ఎంఓపీ ధర మాత్రం 2023 జనవరిలో 2022 జనవరితో పోల్చి టన్నుకు 32.58 శాతం పెరిగి 445 డాలర్ల నుంచి 590 డాలర్లకు చేరింది. రాక్ ఫాస్పేట్ ధర సైతం ఇదే కాలంలో 68.06 శాతం పెరిగి టన్నుకు 144 డాలర్ల నుంచి 242 డాలర్లకు ఎగసింది. -
AP: ‘బొమ్మ’ అదిరింది..రాష్ట్రంలో బొమ్మల తయారీకి సర్కారు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: దేశీయ బొమ్మల పరిశ్రమ దశ తిరిగింది. ఈ రంగం ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. ఇంతకాలం చిన్నపిల్లల ఆట వస్తువుల కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఏకంగా ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంటోంది. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో బొమ్మల ఎగుమతులు ఆరు రెట్లకు పైగా పెరిగాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో దేశీయ బొమ్మల ఎగుమతులు రూ.167 కోట్లుగా ఉంటే అది 2021–22 నాటికి రూ.2,601 కోట్లకు చేరుకుంది. కానీ, దేశీయ ఎగుమతులు భారీగా పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో ఇది ఒక శాతంలోపే ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ బొమ్మల ఎగుమతుల మార్కెట్ విలువ రూ.12,64,000 కోట్లుగా ఉంది. భారత్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక దేశీయ బొమ్మల ఎగుమతుల్లో 77 శాతం అమెరికాకే జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో దేశంలో బొమ్మల దిగుమతులు భారీగా పడిపోయాయి. 2018–19లో భారత్ రూ.2,960 కోట్ల విలువైన ఆట బొమ్మలను దిగుమతి చేసుకుంటే అది 2021–22 నాటికి 70 శాతం తగ్గి రూ.870 కోట్లకు పరిమితమయ్యింది. ఇందులో 90 శాతం చైనా నుంచే వస్తున్నాయి. ‘వోకల్ ఫర్ లోకల్ టాయ్స్’తో సత్ఫలితాలు మరోవైపు..స్థానిక ఆట బొమ్మలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వోకల్ ఫర్ లోకల్ టాయ్స్’ విధానం సత్ఫలితాలిస్తోంది. దేశీయ ఆట బొమ్మల మార్కెట్ను ఎటువంటి ప్రమాణాల్లేని చైనా వస్తువులు ఆక్రమించడంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. స్థానిక చేతి వృత్తి కళాకారులు తయారుచేసే బొమ్మలకు ప్రచారం కల్పిస్తూనే మరోపక్క దిగుమతులకు అడ్డుకట్ట పడే విధంగా వివిధ ఆంక్షలను విధించింది. ముఖ్యంగా ఆటబొమ్మల దిగుమతులపై సుంకాన్ని 2020లో 20 శాతం నుంచి ఏకంగా 60 శాతానికి పెంచింది. అంతేకాక.. పిల్లల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం చూపకుండా ఉండేందుకు దిగుమతి అయ్యే బొమ్మలపై క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ను తప్పనిసరి చేసింది. ఇదే సమయంలో బొమ్మలు తయారుచేసే ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహించడానికి రూ.55.65 కోట్లతో ఒక ఫండ్ను ఏర్పాటుచేసింది. రూ.3,500 కోట్లతో మరో పథకం అదే విధంగా.. ఇతర దేశాలతో పోటీపడేలా బొమ్మల తయారీని పెద్దఎత్తున ప్రోత్సహించడానికి రూ.3,500 కోట్లతో ఉత్పత్తి ఆధారిత, ప్రోత్సాహక ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉంది. ఈ చర్యలు రాష్ట్రంలోని బొమ్మల తయారీ కళాకారులకు చేయూతనిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను వన్ డిస్ట్రిక్ వన్ ప్రోడక్ట్ కింద చేర్చి ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో 2021–22లో రాష్ట్రం నుంచి రూ.3.66 కోట్ల విలువైన బొమ్మలు ఎగుమతి అయినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ఆ విస్కీ దిగుమతుల్లో ఫ్రాన్స్ను దాటేసిన భారత్.. మరీ అంతలా తాగుతున్నారా..?
ఖరీదైన ఫారిన్ మద్యం స్కాచ్ విస్కీ దిగుమతుల్లో భారత్.. ఫ్రాన్స్ను దాటేసింది. 2021తో పోల్చుకుంటే 2022లో ఈ విస్కీ దిగుమతులు ఏకంగా 60 శాతం పెరిగాయి. స్కాట్ల్యాండ్కు చెందిన స్కాచ్ విస్కీ అసోసియేషన్ లెక్కల ప్రకారం.. భారత్ 2021లో 205 మిలియన్ల 70సీఎల్ (700 ఎంఎల్) బాటిళ్ల విస్కీని దిగుమతి చేసుకుంటే 2022లో 219 మిలియన్ల బాటిళ్లను దిగుమతి చేసుకుంది. ఈ లెక్కన భారత్ స్కాచ్ మార్కెట్ పదేళ్లలో 200 శాతం వృద్ధి చెందింది. మరోవైపు రెండంకెల వృద్ధి ఉన్నప్పటికీ ఇండియన్ విస్కీ మార్కెట్లో స్కాచ్ విస్కీ వాటా కేవలం రెండు శాతమే. యూకే-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్లో తమ మార్కెట్ను మరింత విస్తరించునేందుకు స్కాట్ల్యాండ్ విస్కీ కంపెనీలకు వీలు కలిగిందని స్కాచ్ విస్కీ అసోసియేషన్ పేర్కొంది. రానున్న ఐదేళ్లలో 1 బిలియన్ బ్రిటిష్ పౌండ్ల మేర వృద్ధి ఉంటుందని అభిప్రాయపడింది. 2021లో భారత్కు స్కాచ్ ఎగుమతుల విలువ 282 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు. తైవాన్, సింగపూర్, ఫ్రాన్స్ల తర్వాత ఇది అయిదో స్థానం. 2022లోనూ యూరోపియన్ యూనియన్ను ఆసియా పసిఫిక్ రీజియన్ అధిగమించి అతిపెద్ద ప్రాంతీయ మార్కెట్గా అవతరించింది. కోవిడ్ అనంతరం భారత్ సహా తైవాన్, సింగపూర్, చైనాలకు స్కాచ్ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. (ఇదీ చదవండి: లైసెన్స్ లేకుండా అమ్ముతారా..? అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు నోటీసులు!) -
అవసరంలేని దిగుమతులను గమనిస్తున్నాం
న్యూఢిల్లీ: అవసరం లేని దిగుమతులను గమనిస్తున్నామని, ఆయా ఉత్పత్తుల దేశీ తయారీ పెంచడం తమ ప్రాధాన్యతని కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి సత్య శ్రీనివాస్ తెలిపారు. ఈ తరహా దిగుమతులను నివారించగలిగితే, వాణిజ్య లోటు దిగొస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వాణిజ్య లోటు 198 బిలియన్ డాలర్లకు పెరిగిపోవడం తెలిసిందే. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వాణిజ్య లోటు 115 బిలియన్ డాలర్లుగానే ఉంది. ఎన్నో సవాళ్లు నెలకొన్నా భారత్ నుంచి ఎగుమతులు బలంగా ఉన్నట్టు మీడియాతో చెప్పారు. గతేడాది అసాధారణ స్థాయిలో ఎగుమతులు పెరగడంతో, ఆ బేస్ ప్రభావం వల్ల ఈ ఏడాది పెద్దగా వృద్ధి కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అన్ని శాఖలకు నెలవారీగా దిగుమతులు పెరుగుతున్న సమాచారాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. స్థానికంగా తయారీని పెంచాలన్నదే ఇందులో వ్యూహంగా పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం మన దేశ ఎగుమతులపై ప్రభావం పడింది. కానీ, దేశీ వినియోగ డిమాండ్ బలంగా ఉండడంతో దిగుమతులు పెరుగుతున్నాయి. దీంతో వాణిజ్య లోటు విషయంలో ఒత్తిడి నెలకొంది’’అని వివరించారు. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
పసిడికి ఏమైంది?? వెండి వెలుగులు
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (2022-23, ఏప్రిల్-అక్టోబర్) 17.38 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో ఈ విలువ 29 బిలియన్ డాలర్లు. దేశీయంగా డిమాండ్ తగ్గడం దీనికి కారణం. ఒక్క అక్టోబర్ నెలను తీసుకున్నా, దిగుమతులు 27.47 శాతం పడిపోయి 3.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ దాదాపు వార్షికం 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. కాగా, దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్-అక్టోబర్ మధ్య 1.81 శాతం పెరిగి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనవరి నుంచి ఎగుమతులు మరింత ఊపందుకుంటాని పరిశ్రమ భావిస్తోంది. వెండి దిగుమతులు అప్... ఇక వెండి దిగుమతులు అక్టోబర్లో 34.80 శాతం తగ్గి 585 మిలియన్ డాలర్లుగా నమోదయ్యితే, ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో మాత్రం భారీగా పెరిగాయి. 2021-22 ఏడు నెలల్లో ఈ విలువ 1.52 బిలియన్ డాలర్లయితే, తాజా సమీక్షా నెల్లో ఈ విలువ ఏకంగా 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. పసిడి, వెండి దిగుమతుల విలువ కలిపిచూస్తే, కరెంట్ అకౌంట్కు దాదాపు మిశ్రమ ఫలితంగానే ఉండడం గమనార్హం. దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం లెక్కలను ‘కరెంట్ అకౌంట్’ (లోటు లేదా మిగులు రూపంలో) ప్రతిబింబిస్తుంది. -
ఎగుమతుల్లో పైపైకి..
సాక్షి, అమరావతి: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. గ్రామస్థాయిలో ప్రభుత్వం కల్పిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలిస్తున్నాయి. తొలి రెండేళ్లు కరోనా మహమ్మారికి ఎదురొడ్డి మరీ ఎగుమతులు సాగాయి. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఊపందుకున్నాయి. ఉదా.. 2018–19లో రూ.8,929 కోట్ల విలువైన 31.48 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.13,855 కోట్ల విలువైన 2.62 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి జరిగితే.. 2021–22 నాటికి అవి రూ.19,902 కోట్ల విలువైన 79.33 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.20వేల కోట్ల విలువైన 3.24 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. ఇది అరుదైన రికార్డు అని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) చెబుతోంది. ఇక ఈ ఏడాది (2022–23) తొలి అర్ధ సంవత్సరంలో రూ.9,782 కోట్ల విలువైన 35.90 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు, రూ.13వేల కోట్ల విలువైన 2.15 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఆహార, ఆక్వా ఉత్పత్తులు కలిపి టీడీపీ ఐదేళ్లలో గరిష్టంగా 2018–19లో రూ.22,784 కోట్ల విలువైన 34.10లక్షల టన్నులు ఎగుమతి అయితే 2021–22లో ఏకంగా రూ.39,921 కోట్ల విలువైన 82.57 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. టీడీపీ హయాంలో జరిగిన గరిష్ట ఎగుమతులను ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే సీఎం వైఎస్ జగన్ సర్కార్ అధిగమించడం విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్దఎత్తున ఎగుమతులు జరగలేదని అధికారులతో పాటు ఎగుమతిదారులూ చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈ ఏడాది కోటి లక్షల టన్నుల మార్క్ను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎగుమతుల్లో నాన్ బాస్మతీ రైస్దే సింహభాగం రాష్ట్రం నుంచి ప్రధానంగా నాన్ బాస్మతీ రైస్, మొక్కజొన్న, జీడిపప్పు, బెల్లం, అపరాలు, గోధుమలు, శుద్ధిచేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలతో పాటు పెద్దఎత్తున ఆక్వా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. నాన్ బాస్మతీ రైస్ ఉత్పత్తుల ఎగుమతులకు కేరాఫ్ అడ్రస్గా ఏపీ నిలిచింది. మొత్తం ఎగుమతుల్లో సింహభాగం నాన్ బాస్మతీ రైస్దే. 2018–19లో రూ.7,324కోట్ల విలువైన 29.22 లక్షల టన్నులు ఎగుమతి అయితే.. 2021–22లో రూ.17,225 కోట్ల విలువైన 68.57 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. ఇక ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలోనే రూ.7,718 కోట్ల విలువైన 29.48 లక్షల టన్నుల నాన్ బాస్మతీ రైస్ ఎగుమతి అయ్యింది. ఏపీ నుంచి ఎక్కువగా మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుండగా, గతేడాది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్, అరబ్ దేశాలకు ఎగుమతైంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పోటీపడుతున్న వ్యాపారులు ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం, గ్రామస్థాయిలో కల్పించిన సౌకర్యాలతో గత మూడు సీజన్లలో వ్యవసాయ విస్తీర్ణంతో పాటు నాణ్యమైన దిగుబడులు పెరిగాయి. మూడేళ్లలో ఏటా సగటున 14 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తుల దిగుబడులు అదనంగా వచ్చాయి. కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆహార ఉత్పత్తులకూ రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించడం, ధరలు తగ్గిన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారులు సైతం పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే.. ► మూడేళ్ల క్రితం క్వింటాల్ రూ.4,500 కూడా పలకని పసుపు ఈ ఏడాది ఏకంగా రూ.10 వేలకు పైగా పలికింది. ► రెండేళ్ల క్రితం రూ.4,800 ఉన్న పత్తి నేడు రూ.9,500 పలుకుతోంది. ► అలాగే, రూ.5 వేలు పలకని మినుములు రూ.7వేలు, వేరుశనగ సైతం రూ.6వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతున్నాయి. ► కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు సైతం ఎమ్మెస్పీకి మించి ధర పలుకుతున్నాయి. ► అరటి, బత్తాయి వంటి ఉద్యాన ఉత్పత్తులకు కూడా మంచి ధర లభిస్తోంది. ► ఇక దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 36 శాతం, రొయ్యల్లో 67 శాతం మన రాష్ట్రం నుంచే విదేశాలకు వెళ్తున్నాయి. నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో యాంటీబయోటిక్స్ రెసిడ్యూల్స్ శాతం కూడా గణనీయంగా తగ్గడం ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు. 14వేల టన్నులు ఎగుమతి చేశాం 2021–22లో ఏపీ నుంచి 50 వేల నుంచి 60 వేల టన్నుల అరటి ఎగుమతులు జరిగాయి. మా కంపెనీ ఒక్కటే 14 వేల టన్నులు ఎగుమతి చేసింది. ఇరాన్, మలేసియా, దుబాయ్ దేశాలకు ఎగుమతి చేశాం. ఈ ఏడాది కూడా ఎగుమతులు ఆశాజనకంగా ఉండబోతున్నాయి. – ఎం. ప్రభాకరరెడ్డి, ఏపీ కోఆర్డినేటర్, దేశాయ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కంపెనీ ఎగుమతులు పెరగడం రైతుకు లాభదాయకం గతేడాది రికార్డు స్థాయిలో ఆక్వా ఎగుమతులు జరిగాయి. రైతులకు కూడా మంచి రేటు వచ్చింది. రొయ్యలతో పాటు సముద్ర మత్స్య ఉత్పత్తులను కూడా వ్యాపారులు పోటీపడి కొన్నారు. విశాఖ, కాకినాడ, నెల్లూరు పోర్టుల నుంచి ఆక్వా ఉత్పత్తులు భారీగా ఎగుమతి అయ్యాయి. – ఐసీఆర్ మోహన్రాజ్, అధ్యక్షుడు, జాతీయ రొయ్య రైతుల సమాఖ్య ‘గాప్’ సర్టిఫికేషన్తో మరిన్ని ఎగుమతులు గతంలో ఎన్నడూలేని విధంగా 79 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులతో పాటు 20వేల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అయ్యాయి. వచ్చే సీజన్ నుంచి రైతులకు ‘గాప్’ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ జారీచేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. అది ఉంటే యూరోపియన్ దేశాలకు ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహంవల్లే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, కల్పించిన మార్కెటింగ్ సౌకర్యాల ఫలితంగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏటా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవడం సంతోషదాయకం. ఆహార, ఆక్వా ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు పెద్దఎత్తున ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నాం. – కాకాణి గోవర్ధన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
రెండేళ్ల తర్వాత ఎగుమతులు ‘మైనస్’
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు రెండేళ్ల తర్వాత అక్టోబర్లో క్షీణతను చవిచూశాయి. సమీక్షా నెల్లో అసలు వృద్ధిలేకపోగా 17 శాతం పడిపోయి (2021 ఇదే నెలతో పోల్చి) 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గ్లోబల్ డిమాండ్ పడిపోవడం దీనికి నేపథ్యం. ద్రవ్యోల్బణం,, కరెన్సీ విలువల్లో విపరీతమైన ఒడిదుడుకులు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలూ భారత్ ఎగుమతులకు ప్రతికూలంగా నిలిచా యి. ఇక ఇదే నెల్లో దిగుమతులు 6 శాతం పెరిగి 56.69 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం–వాణిజ్యలోటు 26.91 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►రత్నాలు–ఆభరణాలు (21.56%), ఇంజనీరింగ్ (21.26%), పెట్రోలియం ఉత్పత్తులు (11.28%), రెడీమేడ్ వస్త్రాలు–టెక్స్టైల్స్ ((21.16%), రసాయనాలు (16.44%), ఫార్మా (9.24%), సముద్ర ఉత్పత్తులు (10.83%), తోలు (5.84%) సహా కీలక ఎగుమతి రంగాలు అక్టోబర్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ►అయితే ఆయిల్ సీడ్స్, ఆయిల్మీల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, పొగాకు, టీ, బియ్యం ఎగుమతుల సానుకూల వృద్ధిని నమోదుచేశాయి. ►ఆర్థిక వృద్ధి, దేశీయ వినియోగం పెరగడం కూడా దిగుమతుల పురోగతికి దోహదపడుతోంది. ►మొత్తం దిగుమతుల్లో చమురు బిల్లు 29.1 శాతం వృద్ధితో 15.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ►పసిడి దిగుమతుల విలువ 27.47 శాతం తగ్గి 3.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్–అక్టోబర్ మధ్య వృద్ధి 12.55 శాతం కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలూ (ఏప్రిల్–అక్టోబర్) మధ్య ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు ఇదే కాలంలో 33.12 శాతం పెరిగి 436.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 173.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో వాణిజ్యలోటు 94.16 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ దాదాపు 400 బిలియన్ డాలర్లు. 2022–23లో ఈ లక్ష్యం 450 బిలియన్ డాలర్లు. అయితే ప్రస్తుత ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యం సాధన కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రష్యా ఆయిల్ కొనొద్దని ఎవరూ కోరలేదు
వాషింగ్టన్: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్ తనకు అనువైన దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటుందని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయొద్దని భారత్ను ఏ దేశం కోరలేదని స్పష్టంచేశారు. శుద్ధ ఇంధనంకు సంబంధించి వాషింగ్టన్లో అమెరికా ఇంధన మంత్రి జెన్నీఫర్ గ్రహోల్మ్తో భేటీ సందర్భంగా హర్దీప్ మీడియాతో మాట్లాడారు. ‘ పెట్రోల్, డీజిల్ వినియోగం అత్యంత ఎక్కువగా ఉండే భారత్ విషయంలో ఇలాంటి చర్చ అనవసరం. తనకు అనువైన దేశం నుంచే భారత్ చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇండియా–అమెరికా గ్రీన్ కారిడార్ ఆలోచనపై జెన్నీఫర్ సానుకూలంగా స్పందించారు’ అని హర్దీప్ చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా రష్యాపై గుర్రుగా ఉన్న పశ్చిమదేశాలు ఆంక్షల కొరడా ఝులిపించాయి. దీంతో తక్కువ ధరకే అందివచ్చిన రష్యా చమురును భారత్ భారీస్థాయిలో దిగుమతిచేసుకున్న విషయం విదితమే. -
భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టంచింది. ఎట్టకేలకు ఆమె మంగళవారం రాత్రి తైవాన్లో అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చైనా కస్సుమంటూ జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలోనే తైవాన్ పై చైనా కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా తైవాన్ దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు తైవాన్ నుంచి దిగుమతి అయ్యే పళ్లను, చేపల ఉత్పత్తులతోపాటు సహజ సిద్ధంగా లభించే ఇసుకను చైనా నిషేధించింది. ఆయా ఉత్పత్తుల్లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయని, పైగా ఆ ప్యాకేజిలపై చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్గా వచ్చిందంటూ సాకులు చెబుతూ తైవాన్ దిగుమతులను నిషేధించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తైవాన్ సహజ సిద్ధ ఇసుకను నిషేధిస్తూ కారణాలను వెల్లడించకుండానే నోటీసులు జారీ చేసింది. ఇలా తైవాన్ ఎగుమతులను చైనా నిషేధించడం తొలిసారి కాదు. ఇలా మార్చి 2021లో తైవాన్ ఎగుమతి చేసే పైనాపిల్లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయంటూ నిషేధించింది. పైగా రాజకీయపరంగానే ఇలా కక్ష పూరిత చర్యకు చైనా పాల్పడిందని సమాచారం. అదీగాక 2016 నుంచి తైవాన్ అధ్యక్షురాలిగా సాయ్ ఇంగ్ వెన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తైవాన్ పై ఒత్తిడి పెంచింది చైనా. ఆమె తమ దేశాన్ని సార్వభౌమ దేశంగానూ, వన్ చైనాలో భాగంగా కాదు అన్నట్లుగా భావించడంతోనే చైనా ఈ సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇదిలా ఉండగా తైవాన్ని చుట్టుముట్టి ప్రత్యక్ష మిలటరీ డ్రిల్ను నిర్వహిస్తున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు. తైవాన్లోని కీలక ఓడరేవుల్లోనూ, పట్టణా ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని చైనా బెదిరింపులు దిగుతుందని తైపీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తైవాన్ సరిహద్దు ప్రాంతానికి సుమారు 20 కిలో మీటరల దూరంలో మిలటరీ ఆపరేషన్లు చేపట్టినట్లు చైనీస్ పిపుల్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. అయినా దాదాపు 23 మిలయన్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజలు ఎప్పటికైన చైనా దండయాత్ర చేస్తుందన్న దీర్ఘకాలిక భయాలతోనే జీవిస్తున్నారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హయాంలో ఆ ముప్పు మరింత తీవ్రతరమైంది. (చదవండి: హైటెన్షన్.. తైవాన్లో నాన్సీ పెలోసీ.. రెచ్చగొట్టేలా ట్వీట్లు.. పరిణామాలపై చైనా హెచ్చరిక) -
ఎగుమతుల క్షీణత... వాణిజ్యలోటు తీవ్రత
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతులకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా 0.76 శాతం క్షీణించి (2021 జూలై నెలతో పోల్చి) 35.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక ఎగుమతులు 44 శాతం పెరిగి 66.26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 31.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 జూలైలో భారత్ వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లు మాత్రమే. పసిడి దిగుమతులు జూలైలో వార్షికంగా సగానికి సగం పడిపోయి 2.37 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఏప్రిల్ నుంచి జూలై వరకూ...: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ ఎగుమతుల విలువ 156 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 48 శాతం ఎగసి 256 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్ల సాధన నెరవేరింది. 2022–23లో కూడా 470 బిలియన్ డాలర్ల లక్ష్య సాధన నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు. డిమాండ్–సరఫరాల సవాళ్లు, నియంత్రణలు, కోవిడ్–19 సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎగుమతుల విభాగం చక్కని పనితీరునే కనబరుస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటనలో పేర్కొంది. -
ఉక్రెయిన్ వార్.. భారత్కు అలా కలిసొచ్చిందా!
అనూహ్య పరిణామాల మధ్య ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైందన్న సంగతి తెలిసిందే. ప్రపంచదేశాలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ మారణహోమాన్ని ఆపలేకపోయాయి. మరో వైపు యుద్ధం కారణంగా పలు దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో మొదట్లో రష్యా కాస్త తడబడినా చివరికి ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ కనిపించింది. దేశంలో చమురు సంస్థలకు ఈ అంశం కలిసొచ్చిందనే చెప్పాలి. యుద్ధ ప్రభావంతో గతంలో కంటే రష్యా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంది భారత్. నివేదికల ప్రకారం.. ఉ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే రష్యా దిగుమతులు 3.7 రెట్లు పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఈ రెండు నెలల కాలంలోనే జరిగిన దిగుమతులు ఏడాది దిగుమతుల్లో సగం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాపై వివిధ దేశాల ఆంక్షలు, తక్కువ ధరకే క్రూడ్ అయిల్ వంటి కారణాల వల్ల ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు భారత్ 8.6 బిలియన్ డాలర్ల వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. గత సంవత్సరం ( 2021)లో ఇది 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో ముడి చమురు, ఎరువులు, వంటనూనెలు, బొగ్గు, ఉండగా, మరోవైపు ఖరీదైన రాళ్లు, వజ్రాలు వంటి దిగుమతులు మాత్రం తగ్గాయి. చదవండి: SBI Change Rule: ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా? -
దిగుమతులకు రూపాయి సెగ
న్యూఢిల్లీ: రూపాయి విలువ క్షీణత ఎన్నో రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ముడిచమురు దగర్నుంచి, ఔషధాల ముడిసరుకు దిగు మతులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతుల వరకు అన్నీ భారంగా మారుతున్నాయి. అదేవిధంగా విదేశీ విద్య కోసం వెళ్లేవారు, విదేశీ పర్యటనకు వెళ్లేవారిపై మరింత ప్రభావం పడనుంది. డాలర్తో రూపాయి మారకం ఇటీవలే 8 శాతానికి పైగా క్షీణించడం గమనార్హం. రూపాయి విలువ క్షీణత ప్రభావం తక్షణం ఎదుర్కొనేది దిగుమతిదారులే. అంతకుముందు రోజులతో పోలిస్తే వారు దిగుమతుల కోసం మరింత మొత్తాన్ని వెచి్చంచాల్సి వస్తుంది. అదే సమయంలో ఎగుమతి రంగానికి రూపాయి విలువ క్షీణత కలిసొస్తుంది. డాలర్-రూపాయి మారకంలో వారికి మరిన్ని నిధులు లభిస్తాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. అక్కడి నుంచి అవి కొంత మేర తగ్గుముఖం పట్టాయి. కానీ, ఇదే కాలంలో రూపాయి విలువ క్షీణత.. చమురు ధరల తగ్గుదల ప్రయోజాన్ని తుడిచిపెట్టేసింది. డాలర్తో రూపాయి మారకం విలువ గురువారం రూ.79.99కు పడిపోగా, శుక్రవారం సైతం 79.91 వద్ద స్థిరపడింది. దిగుమతులే ఎక్కువ.. మన దేశ ముడిచమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవే కాకుండా వంట నూనెలు, బొగ్గు, ప్లాస్టిక్ మెటీరియల్, రసాయనాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఇలా దిగుమతి జాబితా పెద్దదిగానే ఉంది. దిగుమతుల్లో ప్రధానంగా ముడిచమురు వాటాయే ఎక్కువగా ఉంటోంది. వీటి కోసం అధిక మొత్తాన్ని చెల్లించుకోవాలి. ఉదాహరణకు ఆరు నెలల క్రితం డాలర్తో రూపాయి మారకం విలువ 74 స్థాయిలో ఉంది. ఇప్పుడు 80కు చేరింది. ఆరు నెలల్లోనే రూపాయి 8 శాతం విలువను కోల్పోయింది. కనుక ఆరు నెలల క్రితం కొన్న ఒక ఫోన్కు ఇప్పుడు మరింత మొత్తం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. రానున్న రోజుల్లో రూపాయి 82 స్థాయి వరకు వెళుతుందన్న అంచనాలు ఉన్నాయి. ముడిచమురుతోపాటు మొబైల్ ఫోన్లు, ఖరీదైన టీవీలు, సంపన్న కార్లు, కీలక ముడిపదార్థాల దిగుమతుల కోసం ఇప్పుడు 8 శాతం అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక ఈ పరిస్థితులు ఎగుమతిదారులకు, విదేశాల్లో సంపాదిస్తూ స్వదేశంలోని తల్లిదండ్రులకు నగదు పంపించే వారికి అనుకూలం. రూపాయి క్షీణించడం వల్ల మారకంలో మరిన్ని రూపాయలు వీరు పొందగలరు. జూన్ నెలలో దిగుమతులు 57 శాతం పెరిగి 66.31 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021 జూన్లో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 9.60 బిలియన్ డాలర్లు ఉంటే, 2022 జూన్ నెలలో 173 శాతం పెరిగి ఇది 26.18 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. రూపా యి బలహీనత వల్లేనని భావించాలి. విద్యుత్ అవసరాలకు బొగ్గును సైతం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జూన్ నెలలో చమురు దిగుమతుల విలువ రెట్టింపై 21.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వంట నూనెల దిగుమతులు 26 శాతం పెరిగి 1.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సబ్సిడీల భారం.. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోయిన ఎరువుల ధరల ప్రభావం మనమీదా పడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఎరువుల సబ్సిడీల బిల్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కోట్లకు చొరొచ్చన్న అభిప్రాయం నెలకొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీలకు కేంద్రం రూ.1.62 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఫారెక్స్ నిల్వల భారీ పతనం భారత్ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) జూలై 8వ తేదీతో ముగిసిన వారంలో (అంతక్రితం జూలై 1తో ముగిసిన వారంతో పోల్చి) భారీగా 8.062 డాలర్లు తగ్గి 580.252 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఎగుమతులకన్నా, దిగుమతులు పెరగడం, వెరసి వాణిజ్యలోటు భారీ పెరుగుదల, రూపాయి పతనాన్ని అడ్డుకోడానికి మార్కెట్లో ఆర్బీఐ పరిమిత జోక్యం వంటి అంశాలు ఫారెక్స్ నిల్వల తగ్గుదలకు కారణంగా కనబడుతోంది. 2021 సెపె్టంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. -
పెరిగిన పామాయిల్ దిగుమతులు, ఎన్నిటన్నులంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పామాయిల్ దిగుమతులు స్వల్పంగా వృద్ది చెంది జూన్ మాసంలో 5,90,921 టన్నులు నమోదైంది. సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 12 శాతం ఎగసి 2.30 లక్షల టన్నులు, పొద్దు తిరుగుడు నూనె 32 శాతం తగ్గి 1.19 లక్షల టన్నులకు వచ్చి చేరింది. టారిఫ్ రేట్ కోటా కింద డ్యూటీ ఫ్రీ ముడి సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె దిగుమతులకై కేటాయింపులు పెంచాల్సిందిగా సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. క్రితం ఏడాదితో పోలిస్తే వంటలకు ఉపయోగించే నూనెలతోసహా అన్ని రకాల నూనెలు 9.96 లక్షల టన్నుల నుంచి ఈ ఏడాది జూన్లో 9.91 లక్షల టన్నులకు దిగొచ్చాయి. మొత్తం దిగుమతుల్లో పామాయిల్ వాటా ఏకంగా 50 శాతముంది. టారిఫ్ రేట్ కోటా కింద 2022–23, 2023–24 సంవత్సరాలకుగాను ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనె ఒక్కొక్కటి 20 లక్షల టన్నులు దిగుమతికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. -
పసిడి లవర్స్కు భారీ షాక్, కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా భగ్గుమంటున్న ముడి చమురు ధరలు, దేశీయంగా నెలకొన్న కొరత, వినియోగదారుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పెట్రోల్, డీజిల్పై ఎగుమతి పన్ను, దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై విండ్ఫాల్ పన్ను విధించింది.దీంతోపాటు పసిడిదిగుమతులకు కళ్లెం వేసేందుకు కూడా ఆర్థికమంత్రిత్వశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతున్న ఆందోళనల నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది కూడా చదవండి: కేంద్రం కొత్త పన్నుల షాక్, రిలయన్స్,ఓఎన్జీసీ ఢమాల్! బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరడంతో బంగారం డిమాండ్ను తగ్గించాలనే లక్ష్యంతో తాజా నిర్ణయం తీసుకుంది. మే నెలలో మొత్తం 107 టన్నుల బంగారం దిగుమతి కాగా జూన్లో కూడా గణనీయంగా దిగుమతులు పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బంగారం దిగుమతులు పెరగడం కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో కస్టమ్స్ సుంకాన్ని పెంచివేసింది. గతంలో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం ఉండగా, ఇప్పుడు 12.5 శాతానికి చేరనుంది. దీనికి 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి పన్నుతో కలిపి బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి చేరింది. దీనికి 3 శాతం జీఎస్టీ అదనపు భారం. తాజా నిర్ణయంతో ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకున్నాయి. కాగా ఇంధన దిగుమతులు,ఎగుమతులను నియంత్రించే చర్యల పరంపరలో, ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాలను విధించింది. పెట్రోలుపై లీటరుకు రూ.6 డీజిల్పై లీటరుకు రూ.13 పన్ను విధించింది. ముడి చమురుపై టన్నుకు రూ.23,250 (ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) లేదా విండ్ఫాల్ పన్ను విధించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటరుకు రూ. 6 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న ఇండియా బంగారం డిమాండ్లో చాలా వరకు దిగుమతుల ద్వారానే. ఇది రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది. ఫలితంగా దేశీయ కరెన్సీ రోజుకో రికార్డు కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే. -
ఎకానమీకి ‘వాణిజ్య’ పోటు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు మేలో రికార్డు స్థాయిలో 24.29 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2021 మేలో ఈ విలువ కేవలం 6.53 బిలియన్ డాలర్లు. సమీక్షా నెల్లో భారత్ వస్తు ఎగుమతుల విలువ 20.55% పెరిగి (2021 మేనెల గణాంకాలతో పోల్చి) 38.94 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇక వస్తు దిగుమతుల విలువ 62.83% ఎగసి 63.22 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... ఎగుమతుల రీతి.. ► ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 12.65 శాతం పెరిగి 9.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో ఎగుమతులు 60.87 శాతం ఎగసి 8.54 బిలియన్ డాలర్లకు చేరాయి. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021 మేలో 2.96 బిలియన్ డాలర్లుంటే, తాజా సమీక్షా నెల్లో 3.22 బిలియన్ డాలర్లకు చేరాయి. ► రసాయనాల ఎగుమతులు 17.35% పెరిగి 2.5 బి. డాలర్లకు చేరాయి. ► ఫార్మా ఎగుమతులు 10.28 శాతం వృద్ధితో 2 బిలియన్ డాలర్లకు చేరాయి ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 28% పెరిగి 1.41 బి. డాలర్లకు చేరాయి. ► ముడి ఇనుము, జీడిపప్పు, హస్తకళలు, ప్లాస్టిక్స్, కార్పెట్, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. దిగుమతుల పరిస్థితి.. ► మే నెల్లో పెట్రోలియం అండ్ క్రూడ్ ఆయిల్ దిగుమతులు 102.72 శాతం ఎగసి 19.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రిక్విటీస్ దిగుమతుల విలువ 2 బిలియన్ డాలర్ల నుంచి 5.5 బిలియన్ డాలర్లకు చేరింది. ► పసిడి దిగుమతుల విలువ 2021 మేలో 677 మిలియన్ డాలర్లుంటే, 2022 మేలో 6 బిలియన్ డాలర్లకు చేరింది. రెండు నెలల్లో..: ఏప్రిల్–మే నెలల్లో ఎగుమతులు 25 శాతం పెరిగి 78.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఇదే కాలంలో దిగుమతులు 45.42 శాతం ఎగసి 123.41 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరిసి ఆర్థిక సంవత్సరం (2022–23) రెండు నెలల్లో వాణిజ్యలోటు 44.69 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండు నెలల్లో వాణిజ్యలోటు 21.82 బిలియన్ డాలర్లు. సేవల దిగుమతుల తీరిది... ఇక వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మేలో సేవల దిగుమతుల విలువ 45.01 శాతం పెరిగి 14.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో సేవల దిగుమతులు 45.52 శాతం పెరిగి 28.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
బంగారం దిగుమతులు: ఆర్బీఐ కొత్త నిబంధనలు
ముంబై: బంగారం భౌతిక దిగుమతుల్లో మరింత పారదర్శకత లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం కీలక నిబంధనలు జారీ చేసింది. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ ఐఎఫ్ఎస్సీ (ఐఐబీఎక్స్) లేదా భారతదేశంలోని క్వాలిఫైడ్ జ్యువెలర్ల అధికారిక ఎక్సే్ఛంజ్ ద్వారా పసిడి దిగుమతులకు ఉద్దేశించి ఈ నిబంధనలను రూపొందించడం జరిగిందని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఆర్బీఐ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ద్వారా నామినేట్ అయిన ఏజెన్సీలతో పాటు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) ఆమోదించిన క్వాలిఫైడ్ జ్యువెలర్స్ (క్యూజే) బంగారం దిగుమతికి గత జనవరిలో సెంట్రల్ బ్యాంక్ అనుమతించింది. అయితే దిగుమతులకు సంబంధించిన తాజాగా నిబంధలు జారీ అయ్యాయి. నిబంధనావళి ప్రకారం... ♦ ఐఎఫ్ఎస్సీ చట్టం కింద జారీ అయిన విదేశీ వాణిజ్య విధానం, నిబంధనలకు అనుగుణంగా ఐఐబీఎక్స్ ద్వారా బంగారం దిగుమతి కోసం క్వాలిఫైడ్ జ్యువెలర్లు బ్యాంకులకు 11 రోజుల ముందస్తు చెల్లింపులు చేయవచ్చు. ♦ బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు ముందస్తుగా చెల్లించే సొమ్ముకు సంబంధించి రుణ సౌలభ్యతకు లేదా ముందస్తు చెల్లింపుల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు ఏ రూపంలోనూ అనుమతి ఉండదు. ♦ ఐఎఫ్ఎస్సీఏ అధీకృత ఎక్స్ఛేంజ్ ద్వారా బంగారం దిగుమతికి సంబంధించి ముందస్తు చెల్లింపులు, దిగుమతులు కార్యరూపం దాల్చకపోవడం, లేదా దిగుమతి ప్రయోజనం కోసం చేసిన అడ్వాన్స్ రెమిటెన్స్ అవసరమైన మొత్తం కంటే ఎక్కువగా ఉండడం, ఉపయోగించని అడ్వాన్స్లు తిరిగి చెల్లించడం వంటి లావాదేవీలను సంబంధిత బ్యాంక్లో నిర్దిష్ట 11 రోజుల కాలపరిమితిలోపు నిర్వహించే వీలుంది. ♦ ఐఐబీఎక్స్ ద్వారా బంగారం దిగుమతుల కోసం క్వాలిఫైడ్ జ్యువెలర్స్ చేసే అన్ని చెల్లింపులు ఐఎఫ్ఎస్సీఏ ఆమోదించిన విధంగా ఎక్స్ఛేంజ్ యంత్రాంగం ద్వారా జరుగుతాయి. ♦ 2022 ఏప్రిల్లో బంగారం దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 72 శాతం తగ్గి 6.23 బిలియన్ డాలర్ల నుంచి 1.72 బిలియన్ డాలర్లకు చేరిన నేపథ్యంలో తాజా నిబంధనావళి జారీ కావడం గమనార్హం. -
ఏప్రిల్లో ఎగుమతుల రికార్డు
న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్ ఎగుమతులకు సంబంధించి రెండవ విడత సవరిత గణాంకాలు మరింత మెరుగ్గా వెలువడ్డాయి. ఎగుమతులు 30.7 శాతం పెరిగి 40.19 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. భారత్ ఎగుమతుల చరిత్రలో ఈ స్థాయి గణాంకాల నమోదు ఇదే తొలిసారి. ఇక దిగుగుమతులు 30.97 శాతం పెరిగి 60.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 20.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 ఏప్రిల్లో ఈ లువ 15.29 బిలియన్ డాలర్లు. కాగా పసిడి దిగుమతులు 72 శాతం పడిపోయి 1.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవలకు సంబంధించి ఎగుమతుల విలువ ఏప్రిల్లో 53 శాతం పెరిగి 27.60 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతుల విలువ 62 శాతం పెరిగి 16 బిలియన్ డాలర్లకు ఎగసింది. చదవండి: ఉక్రెయిన్ సంక్షోభం.. ఎగుమతుల్లో ఇండియా రికార్డ్! -
ఎగుమతులు ‘రికార్డు’ శుభారంభం
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో కొత్త రికార్డు నెలకొల్పాయి. 24 శాతం పెరుగుదలతో (2021 ఇదే నెలతో పోల్చి) 38.19 బిలియన్ డాలర్లకు ఎగశాయి. భారత్ ఎగుమతులు ఒకే నెలలో ఈ స్థాయి విలువను నమోదుచేయడం ఇదే తొలిసారి. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. భారీ వాణిజ్యలోటు... ఇక సమీక్షా నెల్లో దిగుమతుల విలువ కూడా 26.55 శాతం ఎగసి 58.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 20.07 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం తొలి నెల్లో ఈ లోటు 15.29 బిలియన్ డాలర్లు. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► పెట్రోలియం ప్రొడక్టులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, రసాయనాల రంగాల ఎగుమతులు మంచి పురోగతిని సాధించాయి. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 15.38 శాతం ఎగసి 9.2 బిలియన్ డాలర్లకు చేరాయి. పెట్రోలియం ప్రొడక్టుల విలువ భారీగా 113.21 శాతం పెరిగి 7.73 బిలియన్ డాలర్లకు చేరడం సానుకూల అంశం. ► కాగా, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2.11 శాతం క్షీణించి 3.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► ఇక మొత్తం దిగుమతుల్లో చమురు బిల్లును చూస్తే 81.21% పెరిగి 19.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 2021 ఏప్రిల్లో 2 బిలియన్ డాలర్లయితే, ఈ విలువ తాజా సమీక్షా నెల్లో ఏకంగా 4.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► అయితే పసిడి దిగుమతులు మాత్రం భారీగా 6.23 బిలియన్ డాలర్ల నుంచి 1.68 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మరింత ఊపందుకుంటాయ్... ఎగుమతుల రికార్డు ఎకానమీకి పూర్తి సానుకూల అంశం. ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)సహా పలు దేశాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ), పీఎల్ఐ స్కీమ్ సానుకూలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో నమోదయిన విలువ మొత్తాన్ని (400 బిలియన్ డాలర్లకుపైగా) అధిగమిస్తాయన్న భరోసాను కల్పిస్తున్నాయి. – ఏ శక్తివేల్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
అమెరికా వార్నింగ్స్.. భారత్ బేఖాతర్..
ద్రవ్యోల్బణం ఎఫెక్ట్తో ఇప్పటికే అనేక వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి దీనికి తోడు కావడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఈ తరుణంలో ఇండియా ప్రపంచ వాణిజ్యంలో ధైర్యంగా అడుగులు వేస్తోంది. మన దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా సంక్షోభం, ఒపెక్ దేశాల మొండిపట్టు, ఉక్రెయిన్పై రష్యా దాడి, మిడిల్ ఈస్ట్లో రెచ్చిపోతున్న రెబల్స్ గ్రూపులతో ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ వాణిజ్యంలో రష్యాను ఒంటరిని చేసే లక్ష్యంతో అమెరికా, నాటో దేశాలతో పాటు యూరప్ కంట్రీస్ అనేక ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యాతో వాణిజ్య లావాదేవీలు క్లోజ్ చేస్తున్నాయి. అంతేకాదు మిగిలిన ప్రపంచ దేశాలు తమ బాటలోనే ప్రయాణించాలని కోరుతున్నాయి. పెరుగుతున్న ముడి చమురు కారణంగా దేశంలో పెట్రో మంట మొదలైంది. ఇదే తీరుగా పెట్రోలు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది ఇండియాలో. దీంతో ప్రపంచ దేశాలు చేస్తున్న సూచనలకు పక్కన పెట్టి నుంచి డిస్కౌంట్ ధరకు ముడి చమురు కొనేందుకు రెడీ అవుతోంది భారత్. ఈ మేరకు గతంలో జరిగిన ఒప్పందాలతో పాటు కొత్తవి చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. రష్యా నుంచి ముడి చమురుతో పాటు ఇప్పుడు కుకింగ్ కోల్ను భారీ ఎత్తున దిగుమతి చేసుకునే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది భారత్. స్టీలు తయారీలో ఉపయోగించే కుకింగ్ కోల్ను ఎక్కువగా విదేశాల నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటోంది. కుకింగ్ కోల్ను భారత్కి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా ఆరవ స్థానంలో ఉంది. అయితే తాజాగా యూరప్, అమెరికా ఆంక్షల కారణంగా ఆయా దేశాలకు ఎగుమతి చేయాల్సిన కుకింగ్ కోల్ని తక్కువ ధరకే అందించేందుకు రష్యా రెడీగా ఉంది. దీంతో క్రూడ్ ఆయిల్తో పాటు కుకింగ్ కోల్ని రష్యా నుంచి దిగుమతి చేసుకునే అంశాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. అమెరికా, యూరప్తో పాటు ఏషియాలోని జపాన్ సైతం రష్యాపై ఆంక్షలు విధించి వాణిజ్య సంంబంధాలు కట్ చేసుకుంటున్నాయి. తమ బాటలోనే ప్రయాణించాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నేరుగా ఇండియాని ఉద్దేశించి మాట్లాడుతూ.. రష్యాపై ఆంక్షలు విధించే విషయంలో ఇండియా తడబడుతోంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ మాటలను భారత్ బేఖారు చేస్తోంది. తక్కువ ధరకు ముడి సరుకు లభించే రష్యా నుంచి అధికంగా కుకింగ్ కోల్, ముడి చమురు దిగుమతి చేసుకోవాలని ఇండియా డిసైడ్ అవుతోంది. ఈ మేరకు అమెరికా సూచనలు, సుతిమెత్తని హెచ్చరికలను పక్కన పెట్టింది. చదవండి: Russia Ukraine War: భారత్ వణుకుతోంది.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
Putin: పుతిన్.. ఏం మెలిక పెట్టావయ్యా!
ఆంక్షలతో రష్యాను ఇరకాటంలో పెట్టాలని అమెరికా, పాశ్చాత్య దేశాలు(ఈయూ దేశాలతో కలిపి) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ, తగ్గేదే లే అనుకుంటూ ఉక్రెయిన్పై మిలిటరీ చర్యలను కొనసాగిస్తూనే ఉంది రష్యా. ఈ క్రమంలో.. రష్యా ఆర్థిక స్థితి కొద్దికొద్దిగా దిగజారుతోంది. తాజాగా పుతిన్ ‘మిత్రపక్షంలో లేని దేశాలకు’ పెద్ద షాకే ఇచ్చాడు. సహజ వాయువుల ఉత్పత్తులు కావాలంటే చెల్లింపులను రష్యన్ కరెన్సీ రూబుల్స్లో మాత్రమే చెల్లించాలంటూ కండిషన్ విధించాడు. లేదంటే ఉత్పత్తిని ఆపేస్తానని హెచ్చరించాడు. క్రెమ్లిన్ను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు, రష్యన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. యూరోపియన్ దేశాల కరెన్సీ విశ్వసనీయతపై ప్రభావవంతంగా ఒక గీతను గీయడం, ఆ కరెన్సీల నమ్మకాన్ని దెబ్బతీయడం ద్వారా.. తన దారికి తెచ్చుకోవాలన్నది పుతిన్ ఫ్లాన్ అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే యూరోలు, డాలర్లకు బదులు.. రష్యన్ రూబుల్స్లోనే రష్యన్ గ్యాస్ కోసం చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పైగా ఈ షరతు పుతిన్కు పెద్ద అడ్వాంటేజే. ఒకవేళ ఈ షరతు.. రష్యాకు మునుముందు ఇబ్బందికరంగా గనుక మారితే వెంటనే ఎత్తేసే ఆలోచనలోనూ పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ మొత్తం 90 శాతం సహజ వాయువుల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. కరెంట్ తయారీకి, ఇళ్ల వెచ్చదనానికి, పరిశ్రమల కోసం ఈ గ్యాస్లనే ఉపయోగించుకుంటున్నాయి. అందులో 40 శాతం ఉత్పత్తి రష్యా నుంచి కావడంతోనే.. ఈయూ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూబుల్ ఎలా ఉంటుందో తెలీదు ఇదిలా ఉంటే పుతిన్ రూబుల్ షరతుపై యూరోపియన్ యూనియన్ దేశాలు గగ్గోలు మొదలుపెట్టాయి. ‘నాకు తెలిసి యూరప్లో.. ఏ దేశానికీ రష్యా రూబుల్ ఎలా ఉంటుందో తెలిసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రూబుల్స్లో ఎలా చెల్లిస్తారు?’ అని స్వోవేనియా ప్రధాని జనెజ్ జన్సా అంటున్నారు. జర్మన్ ఛాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మరియో డ్రాఘి తదితరులు కూడా ఇవే అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బెల్జియం లాంటి దేశం.. ఆకాశాన్ని అంటిన గ్యాస్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ పుతిన్ గనుక ఇదే ధోరణితో ముందుకు వెళ్తే గనుక.. కాంట్రాక్ట్ ఉల్లంఘనల కింద చర్యలకు దిగుతామని కొన్ని దేశాలు చెబుతున్నాయి. చదవండి: పుతిన్ పక్కన కూర్చోవడమా? నా వల్ల కాదు! -
చమురు బిల్లు తడిసి మోపెడు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్ – 2022 మార్చి) ముడి చమురు దిగుమతుల బిల్లు 125 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) దాటిపోనుంది. క్రితం ఆర్థిక సంవత్సరం బిల్లుతో పోలిస్తే ఇది రెట్టింపు పరిమాణం. అంతర్జాతీయంగా చమురు ధరలు ఏడేళ్ల గరిష్టాలకు చేరడంతో దిగుమతులపై మరింత మొత్తం వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు 11 నెలల్లో చమురు దిగుమతుల కోసం వెచ్చించిన మొత్తం 110 బిలియన్ డాలర్లుగా ఉంది. పెట్రోలియం శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనలైసిస్ సెల్ (పీపీఏసీ) ఈ గణాంకాలను విడుదల చేసింది. ఒక్క జనవరిలోనే ముడి చమురు కోసం 11.6 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 2021 జనవరిలో ఈ మొత్తం 7.7 బిలియన్ డాలర్లుగానే ఉంది. చమురు ధరలు పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. ఉక్రెయిన్–రష్యా సంక్షోభంతో చమరు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 110 డాలర్ల వరకు వెళ్లడం తెలిసిందే. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. దిగుమతి చేసుకున్న చమురును ఆయిల్ కంపెనీలు రిఫైనింగ్ ప్రక్రియ ద్వారా పెట్రోల్, డీజిల్గా మారుస్తాయి. మన దేశానికి సంబంధించి రిఫైనింగ్ సామర్థ్యం మిగులు ఉంది. కొన్ని పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తున్నాం. ఎల్పీజీని సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పెట్రోలియం ఉత్పత్తులదీ అదే పరిస్థితి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 33.6 మిలియన్ టన్నులుగా ఉంది. వీటి విలువ 19.9 బిలియన్ డాలర్లు. అదే కాలంలో 33.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 51.1 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు నమోదయ్యాయి. భారత్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు కోసం 62.2 బిలియన్ డాలర్లను (196.5 మిలియన్ టన్నులు) ఖర్చు చేసింది. కరోనా కారణంగా చమురు ధరలు స్థిరంగా ఉండడం లాభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతులు జనవరి చివరికి 175.9 మిలియన్ టన్నులు దాటిపోవడం గమనార్హం. కరోనా ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో 227 మిలియన్ టన్నుల ముడి చమురును నికరంగా దిగుమతి చేసుకున్నాం. ఇందుకోసం చేసిన ఖర్చు 101.4 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతుల బిల్లు పెరిగిపోతే అది స్థూల ఆర్థిక అంశాలపై ప్రభావం చూపిస్తుంది. దేశీయంగా తగ్గిన చమురు ఉత్పత్తి దేశీయంగా చమురు ఉత్పత్తి పెరగకపోగా, ఏటా క్షీణిస్తూ వస్తోంది. ఇది కూడా దిగుమతులు పెరిగేందుకు దారితీస్తోంది. 2019–20లో 30.5 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి అయింది. 2020–21లో ఇది 29.1 మిలియన్ టన్నులకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు చేసిన ఉత్పత్తి 23.8 మిలియన్ టన్నులుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఉత్పత్తి 24.4 మిలియన్ టన్నులుగా ఉండడం గమనించాలి. ఎల్ఎన్జీ దిగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో 6.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి చివరకు 9.9 బిలియన్ డాలర్లకు పెరిగిపోయాయి. స్టోరేజీ నుంచి సరఫరాలు.. ధరలు తగ్గేందుకు కేంద్రం చర్యలు ప్రపంచ ఇంధన మార్కెట్లలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు చమురు శాఖ తాజాగా పేర్కొంది. రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ భయాల నేపథ్యంలో సరఫరా అవాంతరాలు, తదితర సవాళ్లను పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో అవసరమైతే ధరలు తగ్గేందుకు వీలుగా వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఇటీవల అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్కు దాదాపు 110 డాలర్లవరకూ ఎగసిన విషయం విదితమే. ఉక్రెయిన్పై రష్యా మిలటరీ దాడుల కారణంగా సరఫరాలకు విఘాతం కలగవచ్చన్న అంచనాలు ప్రభావం చూపాయి. రష్యాపై పశ్చిమ దేశాల తీవ్ర ఆంక్షలతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రపంచ దేశాలలో సరఫరా మార్గాలకు అవాంతరాలు లేకుంటే æచమురు ధరల తీవ్రత నెమ్మదించే వీలుంది. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను నిరోధించేందుకు భారత్ తగిన చర్యలు సైతం చేపడుతోంది. ఇందుకు అనుగుణంగా అమెరికా, జపాన్ బాటలో గతేడాది నవంబర్లో వ్యూహాత్మక నిల్వల నుంచి భారత్ 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేసేందుకు అంగీకరించింది. తీవ్ర ధరల నేపథ్యంలో ఎన్నికలు పూర్తవడంతోనే ధరలు రూ.10 వరకూ పెంచే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నిరాటంకంగా రష్యన్ వజ్రాల సరఫరా: జీజేఈపీసీ యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లు అందరికీ వజ్రాలను నిరాటంకంగా సరఫరా చేస్తామని రష్యాకు చెందిన డైమండ్ మైనింగ్ సంస్థ అల్రోసా భరోసా ఇచ్చింది. రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా ఈ విషయం తెలిపారు. అల్రోసా ఉత్పత్తి చేసే మొత్తం రఫ్ డైమండ్లో దాదాపు 10 శాతాన్ని భారత్ దిగుమతి చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాపారం యథాప్రకారంగానే కొనసాగుతోందని, రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫిబ్రవరి 28న జీజేఈపీసీకి అల్రోసా నుంచి లేఖ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల భారం
న్యూఢిల్లీ: భారత పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల విలువ ఫిబ్రవరిలో భారీగా 67 శాతం పెరిగింది. విలువలో 15 బిలియన్ డాలర్లకు చేరింది. సమీప భవిష్యత్లో భారత్లో ధరల పెరుగుదలకు సంకేతంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన ఫిబ్రవరి ఎగుమతులు–దిగుమతుల గణాంకాల్లో ఈ అంశం కీలకాంశంగా ఉంది. గణాంకాల్లో కీలకాంశాలు... ► ఫిబ్రవరిలో మొత్తం ఎగుమతుల విలువ 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక దిగుమతుల విలువ 35 శాతం పెరిగి 55 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు భారీగా 21.19 డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ కేవలం 13.12 బిలియన్ డాలర్లు. ► ఎగుమతుల్లో ఇంజనీరింగ్ (31.34 శాతం పెరిగి 9.27 బిలియన్ డాలర్లు), పెట్రోలియం (66.29 శాతం పెరిగి 4.1 బిలియన్ డాలర్లు), రసాయన రంగాలు (25 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లు) మంచి పనితీరును ప్రదర్శించాయి. కాగా, ఫార్మా ఎగుమతులు 3.13 శాతం క్షీణించి 1.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ► ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29 శాతం పెరిగి 6.24 బిలియన్ డాలర్లకు చేరింది. 400 బిలియన్ డాలర్ల లక్ష్యం సాకారం! ఇక భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ) 374.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 45.80 శాతం అధికం. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 176.07 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం, భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఈ ఏడాది రెట్టింపైన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ నవంబర్ ఎగుమతి–దిగుమతుల తాజా గణాంకాలు వెలువడ్డాయి. 2020 ఇదే నెలతో పోల్చితే ఎగుమతులు 27.16 శాతం పెరిగి 30.04 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతుల విలువ ఇదే నెల్లో 56.58 శాతం పెరిగి 52.94 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి రెండింటిమధ్య వాణిజ్యలోటు 22.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది నవంబర్ వాణిజ్యలోటు 10.19 బిలియన్ డాలర్లతో పోల్చితే ఇది రెట్టింపు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా ప్రకటనలో ముఖ్యాంశాలు.. ఎగుమతుల తీరిది... - నవంబర్లో పెట్రోలియం ప్రొడక్టులు, ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. - వార్షిక ప్రాతిపదికన పెట్రోలియం ప్రొడక్ట్స్ 154.22 శాతం పెరిగి 3.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు 37 శాతం పెరిగి 8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 30 శాతం పెరిగి 1.12 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్గానిక్– ఆర్గానిక్యేతర రసాయన ఎగుమతుల విలువ 32.54 శాతం పెరిగి 2.24 బిలియన్ డాలర్లకు చేరాయి. - సేవల ఎగుమతులు 16.88 శాతం పెరిగి 20.33 బిలియన్ డాలర్లకు చేరాయి. వస్తువులు, సేవలు కలిపితే ఎగుమతుల విలువ 22.80 శాతం ఎగసి 50.36 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతుల వరుస... - దిగుమతుల విషయానికి వస్తే.. పసిడి విలువ 40 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. - బొగ్గు,కోక్, బ్రికెట్లు 135.81 శాతం పెరిగి 3.57 బిలియన్ డాలర్లకు చేరాయి. - పెట్రోలియం, క్రూడ్, సంబంధిత ఉత్పత్తుల దిగుమతులు 132.43 శాతం పెరిగి 14.67 బిలియన్ డాలర్లకు ఎగశాయి. - వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతులు 78.82 శాతం పెరిగి 1.75 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఆర్థిక సంవత్సరంలో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఎగుమతులు 51.34 శాతం పెరిగి 263.57 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతులు ఇదే కాలంలో 74.84 శాతం పెరిగి 384.34 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 120.76 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 45.66 బిలియన్ డాలర్లు. 2022 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను దేశం సాధించగలదన్న విశ్వాసాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
చైనా ఉత్పత్తులపై చర్యలు తీసుకోకుంటే.. మన వాళ్లకు కష్టమే !
న్యూఢిల్లీ: చౌకగా వచ్చి పడుతున్న చైనా వైద్య పరికరాల ముందు దేశీ పరిశ్రమ వెలవెలబోతోంది. కరోనా మహమ్మారి ఉధృత రూపం చూపించిన సమయంలో.. వైద్య ఉత్పత్తులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీంతో దేశీ పరిశ్రమ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. కానీ, ఇప్పుడు సరైన అమ్మకాల్లేక 33 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కన్జ్యూమబుల్స్, డిస్పోజబుల్స్, తక్కువ ధరలతో కూడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు మరింత ప్రతికూలతలను చూవిచూస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ (ఏఐఎంఈడీ) గణాంకాలను పరిశీలిస్తే.. కరోనా రాక ముందు ఏటా 6.24 మిలియన్ల పీపీఈ కిట్ల ఉత్పత్తి దేశీయంగా నడిచేది. కానీ, ఈ ఏడాది జూన్ నాటికి పీపీఈ కిట్ల సామర్థ్యం 234 మిలియన్ పీసులకు పెరిగింది. 3,360 వెంటిలేటీర్ల తయారీ సామర్థ్యం నుంచి 7,00,000 వెంటిలేటర్లకు పెరిగింది. మాస్క్ల ఉత్పత్తి అయితే ఏకంగా 31 కోట్ల నుంచి 355 కోట్లకు పెరిగిపోయింది. ‘‘కరోనా రెండో విడత విరుచుకుపడిన ఈ ఏడాది మార్చి–ఏప్రిల్లో కంపెనీలు పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేశాయి. అయినా కానీ కొంత కొరత నెలకొంది’’ అని ఏఐఎంఈడీ ఫోరమ్ కోర్డినేటర్ రాజీవ్నాథ్ తెలిపారు. కానీ, ఇప్పుడు 40 శాతం ఉత్పత్తి సామర్థ్యమే నడుస్తోందని చెప్పారు. చెన్నైకు చెందిన మాస్క్ల తయారీ కంపెనీ శాన్సిఫి అయితే మూడింత ఒక వంతు ఉత్పత్తి సామర్థ్యాన్నే (ఎగుమతులతో కలసి) ప్రస్తుతం వినియోగించుకోగలుగుతున్నట్టు సంస్థ సీఈవో సుధీర్రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో మిలియన్ డాలర్లతో సామర్థ్యాన్ని పెంచుకున్నామని, ఇప్పుడు స్థిర వ్యయాలే భారంగా మారినట్టు చెప్పారు. ‘‘పరిస్థితి ఇదే మాదిరిగా మరో ఆరు నెలలు కొనసాగితే అప్పుడు మెషినరీని విక్రయించడం లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు’’ అని సుధీర్రెడ్డి అన్నారు. దిగుమతుల పాత్ర.. ఒకవైపు కొంత డిమాండ్ తగ్గిన మాట వాస్తవమే కానీ, దేశీయ పరిశ్రమ సామర్థ్యం మేరకు పనిచేయకపోవడానికి చైనా నుంచి వస్తున్న చౌక దిగుమతులు కూడా కారణమేనని పరిశ్రమ అంటోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి వైద్య పరికరాల దిగుమతులు 75 శాతం పెరిగాయి. భారత్కు వైద్య పరికరాల ఎగుమతిదారుల్లో చైనానే ముందుంటోంది. అమెరికా, జర్మనీలు వెనుకనే ఉన్నాయి. మన దేశ అవసరాల్లో 80 శాతం పరికరాలను దిగుమతి చేసుకుంటున్నట్టు (సుమారు రూ45,000 కోట్ల విలువైన) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) కింద దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ, ఇప్పటికే తయారీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఎదుర్కొంటుంటే.. పీఎల్ఐ కింద అదనంగా పరిశ్రమలను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్న ఎదురవుతోంది. చైనా నుంచి దిగుమతులు పెరగడం ఆందోళన కలిగించేదిగా రాజీవ్నాథ్ అన్నారు. ప్రభుత్వం దేశీ పరిశ్రమను, ఇన్వెస్టర్లను మరింత ప్రోత్సహించే చర్యలతో ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కనీసం కీలకమైన పరికరాలను అయినా పీఎల్ఐ పరిధిలోకి చేర్చాలన్నారు. లేదంటే టారిఫ్లతో (దిగుమతి సుంకాలు) అయినా దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమకు రక్షణ కల్పించాలని అభిప్రాయపడ్డారు. స్థానిక కంపెనీల్లో ఉత్సాహం కరవు.. వైద్య పరికాల పీఎల్ఐ పథకం కింద ఎక్కువ దరఖాస్తులు బహుళజాతి కంపెనీల నుంచే వచ్చాయని, స్థానిక కంపెనీలు పెద్దగా ముందుకు రాలేదని స్కాన్రే టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఆల్వ తెలిపారు. ఇన్వేసివ్ వెంటిలేటర్ల తయారీలో స్కాన్రే ప్రముఖ సంస్థగా ఉంది. చైనా నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించడం లేదంటే టారిఫ్లు పెంచడం అంత సులభం కాదని దేశీ వైద్య పరికాల పరిశ్రమ భావిస్తోంది. ‘‘ప్రభుత్వం నిజంగా నిషేధం విధించలేదు. ఎందుకంటే ఈ చర్యతో దేశీ పరిశ్రమ కూడా ఇబ్బందుల పాలవుతుంది. ఎందుకంటే విడిభాగాల కోసం దేశీ పరిశ్రమ చైనాపై ఆధారపడుతోంది. మా స్కాన్రే కంపెనీ విషయాన్నే పరిశీలిస్తే.. 80 శాతం విడిభాగాలు స్థానికంగానే సమకూర్చుకుంటున్నాం. అయినప్పటికీ మరో 20 శాతం కీలక విడిభాగాలపై చైనాపై ఆధారపడాల్సిందే. నిషేధిస్తే మేము సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆల్వ వివరించారు. చదవండి: చైనా నుంచి నెమ్మదిగా సైడ్.. భారత్ మార్కెట్ కోసం మైక్రోసాఫ్ట్ మాస్టర్ ప్లాన్ -
కంప్యూటర్లు, బంగారం, యూరియా... వీటి దిగుమతులపై కేంద్రం నజర్
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు గణనీయంగా పెరిగిపోతున్న ఉత్పత్తుల జాబితాను కేంద్రంలోని వివిధ శాఖలకు వాణిజ్య శాఖ అందజేసింది. కోకింగ్ కోల్, కొన్ని రకాల మెషినరీ, రసాయనాలు, డిజిటల్ కెమెరాలు ఇలా మొత్తం మీద 102 ఉత్పత్తులను గుర్తించింది. స్థానికంగానే వీటి ఉత్పత్తిని పెంచే మార్గాలపై దృష్టి సారించాలని కోరింది. తద్వారా దిగుమతులను తగ్గించొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దిగుమతుల బిల్లును తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర వాణిజ్య శాఖ ఈ ఉత్పత్తులకు సంబంధించి పూర్తిస్థాయి అధ్యయనం కూడా నిర్వహించింది. దీర్ఘకాలం నుంచి వీటి దిగుమతులు క్రమంగా పెరుగుతూనే ఉన్నట్టు గుర్తించింది. 2021 మార్చి నుంచి ఆగస్ట్ వరకు దేశ దిగుమతుల బిల్లులో ఈ 102 ఉత్పత్తుల వాటానే 57.66 శాతంగా ఉన్నట్టు తెలుసుకుంది. బంగారం, ముడి పామాయిల్, ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్లు, పర్సనల్ కంప్యూటర్లు, యూరియా, స్టెయిన్లెస్ స్టీల్ స్క్రాప్, శుద్ధి చేసిన రాగి, కెమెరాలు, పొద్దుతిరుగుడు నూనె, ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా వీటిల్లో ఉన్నాయి. 2021 ఏప్రిల్–అక్టోబర్ వరకు దేశ దిగుమతుల బిల్లు 331 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 79 శాతం అధికంగా ఉంది. -
భారత్ దెబ్బ.. చైనాకు ఏకంగా 50వేల కోట్లు నష్టం
న్యూఢిల్లీ: భారత్ను దెబ్బ తీయాలని నానా ప్రయత్నాలు చేస్తున్న చైనాకు భారీ షాక్ తగలనుంది. ప్రస్తుత దీపావళి సీజన్లో చైనా వస్తువులను భారత వ్యాపారులు నిషేదించడంతో డ్రాగన్ దేశ ఎగుమతిదారులు కొన్ని వేల కోట్లు నష్టపోనున్నారు. ఈ దీపావళికి చైనా సరకులను బాయ్ కాట్ చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( సీఏఐటీ) వ్యాపారులకు పిలుపునిచ్చింది. దీంతో చైనాకు సుమారు 50 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు సీఏఐటీ తెలిపింది. ఇటీవల గమనించిన ముఖ్యమైన మార్పుని పరిశీలిస్తే.. దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని దీని ప్రభావంతో భారతీయ వస్తువులకు డిమాండ్ను పెరుగుతున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఇటీవల 20 ముఖ్యమైన నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు దీపావళి వస్తువులు, బాణసంచా లేదా ఇతర వస్తువుల కోసం చైనా ఎగుమతిదారులకు భారతీయ వ్యాపారులు లేదా దిగుమతిదారులు ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదని తేలింది. తాజా పరిణామంతో భారతీయ వినియోగదారుల నేరుగా దేశీయ వస్తువుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకి ₹2 లక్షల కోట్ల మేర ఇన్ఫ్లో రాబోతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా సీఏఐటీ చైనీస్ వస్తువులను బహిష్కరణకు పిలుపునిచ్చింది. చదవండి: Exam Result తప్పుగా మెసేజ్ వచ్చింది.. తొందరపడి ప్రాణం తీసుకుంది -
ప్రణాళికతోనే దిగుమతులు తగ్గుతాయి
43 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం కలిగిన భారతదేశంలో 1985 తరువాత నుండి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత ప్రాప్తకాలజ్ఞ్ఞతగా పెరుగుతున్నది. 1985–95 వరకు ఉత్పత్తిలో నిలకడ ఏర్పడింది. 1995 నుండి 2005 వరకు సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఉత్పత్తికి, ఉత్పాదకతకు నష్టం వాటిల్లింది. రాజ్యాంగ రీత్యా రాష్ట్ర జాబితాలో ఉన్న వ్యవ సాయంలో హరిత విప్లవ కాలంలో (1965–85) కేంద్రం చొరవ తీసుకొని అధికోత్పత్తి సాధించింది. 5 కోట్ల టన్నుల నుండి 20 కోట్ల టన్నులకు ఉత్పత్తిని పెంచి, దిగుమతులను అధిగమించి ఎగుమతులు ప్రారంభించింది. ఆ తరువాత కాలంలో నేటి వరకు (2020–21) ఉత్పత్తిగానీ, ఉత్పాదకత గానీ ప్రత్యేక ప్రణాళిక దృష్టితో పెంపుదల చేయలేదు. జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతుండగా, వ్యవసాయో త్పత్తుల పెరుగుదల 4 శాతం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఏనాడూ లక్ష్యం నెరవేరలేదు. ప్రస్తుతం 1.5 శాతం వృద్ధి రేటు కొనసాగుతోంది. ప్రస్తుత ఆహార ధాన్యాల ఉత్పత్తి 30.15 కోట్ల టన్నులుగా ఉంది. 2005 నుండి క్రమంగా భారతదేశం ఆహార ఉత్పత్తు లకు దిగుమతి కేంద్రంగా మారింది. 1.30 లక్షల టన్నుల వంటనూనెలు, 45 లక్షల టన్నుల పంచదార, 58 లక్షల టన్నుల పప్పుధాన్యాలు, 30 లక్షల బేళ్ళ పత్తితోపాటు కోడికాళ్ళు, పాలు, పాల ఉత్పత్తులు దిగుమతులు చేసు కుంటున్నాం. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో 18.50 కోట్ల టన్నులతో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ దిగుమతులు వస్తున్నాయి. రూ.58,600 కోట్ల విలువగల హార్టికల్చర్ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం. సాగు విస్తీర్ణం 34 కోట్ల ఎకరాలలో 9 కోట్ల ఎకరాలు బీళ్ళుగా మారింది. రియల్ ఎస్టేట్, వ్యవసాయేతర అవసరాల కింద మరో 5 కోట్ల ఎకరాల భూమి బీళ్ళుగా మారబోతున్నది. ఉత్పాదకత హెక్టారుకు 2,292 కిలోలు మాత్రమే ఉంది. చైనా హెక్టారుకు 8 వేల కిలోలు, అమెరికా 6 వేల కిలోలు ఉత్పత్తి చేస్తూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. భారత విస్తీర్ణం కన్నా తక్కువ సాగు చేస్తున్న చైనా 80 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయగా, అమెరికా 60 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచంలో 2వ ఆర్థిక దేశంగా పెరుగు తున్నామని చెప్తున్న భారతదేశం వ్యవసాయోత్పత్తిలో ఎక్కడికి పోతున్నామో గమనించాలి. ప్రణాళికబద్ధంగా వ్యవసాయం సాగినప్పుడు మన ఉత్పాదకత పెరిగింది. పరిశోధన కేంద్రాలు, వ్యవసాయ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండటం, రైతులకు మౌలిక వసతులు అనగా విత్తనాలు, రుణాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు నాణ్యమైనవి అందుబాటులో ఉన్నాయి. 2000 సంవత్సరం నుండి ఈ మౌలిక వసతులన్నీ విదేశీ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. విత్తనాలు 4 బడా కంపెనీల చేతుల్లోకి 80 శాతం వెళ్ళాయి. వ్యాపార పోటీ తత్వం కలిగిన జి–7 దేశాలు మన దేశాన్ని అభి వృద్ధిలోకి రాకుండా అడ్డుపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ నిరంతరం భారత వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టి, అభివృద్ధి జరగకుండా అడ్డుపడటం అనేక సందర్భాల్లో బట్ట బయలైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన ఉత్పత్తు లను పెంచుకోటానికి వ్యవసాయ పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ మన పరిశోధనలు గత దశాబ్ద కాలంగా నిలిచిపోయాయి. ఏ దేశ వాతావరణ పరిస్థితులకు అను గుణంగా ఆ దేశంలో వ్యవసాయ పరిశోధనలు జరగాలి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరి కొత్త విత్తనాలను ఉత్పత్తి చేయకపోతే పంటల దిగుబడి తగ్గుతుంది. హరిత విప్లవ కాలంలో 36 డిగ్రీల వేడి కలిగిన పరిస్థితుల నుండి నేడు 42 డిగ్రీల వేడిలో జీవిస్తున్నాం. అందువల్ల సొంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలను నిర్వహించాలి. రాష్ట్రాలలోని భూసార పరీక్షలను నిర్వహించి, దేశ అవసరాలకు కావాల్సిన పంటల విధానాన్ని రూపొం దించాలి. ప్రస్తుతం సాగు అవుతున్న హర్టికల్చర్ విస్తీర్ణం 6.39 కోట్లను మరో 3 కోట్లకు పెంచడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న 30 కోట్ల టన్నుల ఉత్పత్తిని రెట్టింపు పెంచు కునే అవకాశం ఉంది. హార్టికల్చర్ పంటలకు అనుకూలమైన ప్రాంతాలు భారత దేశంలో 10 కోట్ల ఎకరాలకు పైగా ఉన్నాయి. దీని ద్వారా రైతులకు లాభాలే కాకుండ ప్రభుత్వా నికి కూడ ఎగుమతుల ద్వారా ఆదాయం వస్తుంది. ప్రాసె సింగ్ యూనిట్లు పెట్టడం ద్వారా అనేక లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఆహార ధాన్యాల విష యంలో వంటనూనెలు, గోధుమ, మొక్కజొన్న, సోయా, ఆయిల్ పామ్ తోటలను పెద్ద ఎత్తున పెంచాలి. ఇవి బహుళ రూపాలలో వినియోగంలోకి వస్తాయి. ఆయిల్ పామ్, చెరుకు పంటల విస్తీర్ణం పెంచడం వల్ల ఇథనాల్ ఉత్పత్తి చేసి ప్రస్తుతం వినియోగంలో 80 శాతం దిగుమతులు చేసు కుంటున్న పెట్రోలియం ఉత్పత్తులను 40 శాతానికి తగ్గించు కోవచ్చు. బ్రెజిల్, అమెరికా దేశాలను ఉదాహరణగా చూడాలి. నేడు పత్తి వినియోగం దాదాపుగా తగ్గిపోతున్నది. పత్తేతర రూపాల్లో దారం తీసి బట్టలు తయారు చేస్తున్నారు. ఇంతకు ముందు రేయాన్స్ పల్పు ద్వారా ఉత్పత్తి జరిగే బట్టలు నేడు ఇతర పంటల నుండి వచ్చే ఉత్పత్తులతో దారం తీస్తున్నారు. అందుకు అనుగుణమైన పరిశోధన జరపాలి. నీటి సౌకర్యం కలిగినచోట మాత్రమే ఆహార ధాన్యాల ఉత్పత్తిని కొనసాగించాలి. దేశంలో ముడి ఉత్పత్తులను నేరుగా మార్కెట్లలో అమ్ముతున్నాం. వాటిని ప్రాసెస్ చేసి అదనపు విలువను జత చేసి అమ్మలేకపోతున్నాం. దేశంలో 2,477 ప్రధాన మార్కెట్లు ఉండగా వాటికి అనుబంధంగా 4,843 సబ్ మార్కెట్లు పని చేస్తున్నాయి. వీటిల్లో వేలం పాటల హాల్స్, తూకం బ్రిడ్జిలు, గోదాంలు, చిల్లర దుకాణాలు, క్యాంటిన్లు, రహదారాలు, దీపాలు, త్రాగునీరు, పోలీసు స్టేషన్లు, పోస్టాఫీసులు, బోర్వెల్స్, కోల్డ్ స్టోరేజీలు, రైతుల విశ్రాంతి భవనాలు, నీటిశుద్ధి ప్లాంటు, భూసార పరీక్షల ల్యాబ రేటరీలు, టాయ్లెట్స్ లాంటి సౌకర్యాలు లేని మార్కెట్లు ఉన్నాయి. మార్కెట్ విధానాన్ని మార్చి ఇనాం విధానం తెచ్చి ఆది విఫలమైందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ప్రతి రాష్ట్రంలో మార్కెట్ యార్డుల వద్ద, లేదా రైతులకు అందుబాటులో ఉన్నచోట ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆత్మహత్యలను నివారించవచ్చు. రైతులకు లాభం కలిగే విధంగా, దిగుమతులు నివారించి దేశ ప్రయోజనం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ‘శాస్త్రీయ వ్యవసాయ ప్రణాళిక లను’ రూపొందించాలి. -సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త ఏఐకెఎస్ ఉపాధ్యక్షులు మొబైల్: 94900 98666 -
చక్కెర ఎగుమతులపై తాలిబన్ ఎఫెక్ట్ ?
ఇరవై ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న అఫ్గనిస్తాన్లో తాలిబన్ల రాకతో మరోసారి అలజడి రేగింది. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను కొత్తగా అధికార పీఠం కైవసం చేసుకున్న తాలిబన్లు గౌరవిస్తారా ? లేదా ? అసలు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై వ్యాపార వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతి దారులు అఫ్గన్లో సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నారు. మంచి సంబంధాలు ఆఫ్ఘనిస్తాన్ , ఇండియాల మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారంలో నిరంకుశ తాలిబన్లు ఉన్నా, అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వం ఉన్నా ఎగుమతులు, దిగుమతులు బాగానే జరిగాయి. ముఖ్యంగా అఫ్గన్ నుంచి ఇండియాకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా దిగుమతి అవుతుండగా ఇండియా నుంచి అఫ్గన్కి చక్కెర, తృణధాన్యాలు, టీ, సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. 826 మిలియన్ డాలర్ల ఎగుమతులు గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం అఫ్గన్ నుంచి ఇండియాకు జరిగిన దిగుమతుల విలువ 509 మిలియన్ డాలర్లు ఉండగా ఇండియా నుంచి జరిగిన ఎగుమతుల విలువ 826 మిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. ఎగుమతులు వన్ బిలియన్కి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా అఫ్గన్లో సంక్షోభం తలెత్తింది ఇబ్బందులు తప్పవా ? ఇండియా నుంచి అఫ్గన్కి జరుగుతున్న ఎగుమతుల్లో ప్రధానమైంది చక్కెర. అఫ్గన్లో ఇండియా చక్కెరను భారీగా ఉపయోగిస్తారు. ఇండియా నుంచి సముద్ర మార్గంలో కరాచీ పోర్టుకు చేరకున్న చక్కెర అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అఫ్గన్ చేరుకుంటుంది. గతేడాది 6.24 లక్షల టన్నుల చక్కెర అఫ్గనిస్తాన్కి ఎగుమతి అయ్యిందని ఆలిండియా సుగర్ ట్రేడ్ అసోసియేషన్ తెలిపింది. ప్రస్తుత సంక్షోభంతో ఈ ఎగుమతి డోలాయమానంలో పడిందంటూ వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అఫ్గన్ లాంటి పెద్ద మార్కెట్ను కోల్పోతే ఇబ్బందులు తప్పవంటున్నారు. పరిస్థితులు చక్కబడతాయి మరోవైపు తాలిబన్లు అత్యవసర వస్తువులపై ఎక్కువగా దిగుమతి సుంకం విధించని, గతంలో 1996 నుంచి 2001 వరకు వారితో వ్యాపారం సజావుగానే జరిగిందంటున్నాడు పాతకాలం వర్తకులు. అధికార పీఠం గురించి జరిగే వివాదాలు సద్దుమణిగితే పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బంగారం రుణాల్లోకి షావోమీ ! -
హైదరాబాద్ బిర్యానీపై తాలిబన్ ఎఫెక్ట్!
ఆఫ్గనిస్తాన్లో కొనసాగుతున్న పరిస్థితులు ఇలాగే మరికొంత కాలం కొనసాగితే బిర్యానీ రేట్లు పెంచక తప్పదంటున్నారు హైదరాబాద్ హోటళ్ల నిర్వాహకులు. తాలిబన్ల వల్ల చెలరేగిన అల్లకల్లోలం త్వరగా సద్దుమణగకపోతే బిర్యానీ భారం కావడం ఖాయం అంటున్నారు. నోరూరించే బిర్యానీ కమ్మని నోరూరించే హైదరాబాద్ బిర్యానీపై తాలిబన్ ప్రభావం పడనుంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే వన్నె తెచ్చిన బిర్యానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. జిల్లా కేంద్రాలతో పాటు ఓ మోస్తరు పట్టణాల్లో సైతం బిర్యానీ సెంటర్లు వెలిశాయి. సెలవు రోజులు వస్తే ఇళ్లలో సైతం బిర్యాణీ ఘుమఘుమలాడుతోంది. అయితే త్వరలో బిర్యానీ ధర పెరగడంతో లేక రుచిలో తేడా కావడంతో తప్పదంటున్నారు హోటల్ నిర్వహాకులు. రుచి కోసం డ్రై ఫ్రూట్స్ బిర్యానీ తయారీలో మాంసం, బాస్మతి రైస్లే ప్రధానమైనా ఆ వంటకు అద్భుతమైన రుచి తేవడంలో డ్రై ఫ్రూట్స్ది కీలక పాత్ర. ఎండుద్రాక్ష, ఆల్మండ్, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్లో సింహభాగం అఫ్గనిస్తాన్ నుంచే దిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పేరున్న పెద్ద హోటళ్లు బిర్యానీ తయారీలో సగటున యాభై కేజీల వరకు బాదం పప్పును వినియోగిస్తున్నాయి. ఇదే స్థాయిలో మిగిలిన డ్రై ఫ్రూట్స్ అయిన జీడిపప్పు, కిస్మిస్ల వినియోగం కూడా ఉంటోంది. హాట్ న్యూస్ : కొండెక్కిన కోడి ఇప్పటికైతే ఓకే హైదరాబాద్లో బిర్యానీకి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొందరు అఫ్గన్ వ్యాపారులు హైదరాబాద్లోనే ఉంటూ ఎండు పళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఎండు పళ్లను అఫ్గన్ నుంచి తెప్పించి ఇక్కడి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు డ్రై ఫ్రూట్ నిల్వలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే ప్రస్తుతం ఇక్కడి వ్యాపారులకు అఫ్గన్లోని ఎగుమతి దారులతో సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల రాకతో అక్కడ అశాంతి నెలకొంది. రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే డ్రై ఫ్రూట్స్ కొరత ఎదుర్కొక తప్పదని ఎండు పళ్ల వ్యాపారులు అంటున్నారు. పన్నులు పెరిగే ఛాన్స్ ఇప్పటి వరకు ఇండియా, ఆఫ్గన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవని, పన్నులు కూడా తక్కువగా ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. తాలిబన్ల పాలనలోకి వచ్చాక డ్రై ఫ్రూట్స్ ఎగుమతులపై ఆంక్షలు పెట్టినా, పన్నులు పెంచినా ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో ఉన్న బిర్యానీ సెంటర్లకు సైతం డ్రై ఫ్రూట్ ఇబ్బందులు తప్పేలా లేవు. ధర పెంచడమే మార్గం కోవిడ్ ఆంక్షల కారణంగా బిర్యానీ వినియోగం తగ్గిపోయిందని, ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటుండగా ఆఫ్గన్ సంక్షోభం వచ్చిపడందంటున్నారు హోటల్ నిర్వాహకులు. డ్రై ఫ్రూట్ ధరలు పెంచితే బిర్యానీ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఫేమస్ అయిన హోటల్ నిర్వాహకులు పేర్కొంటుండగా... ఎండు పళ్ల వాడకం తగ్గించేస్తామంటున్నారు చిన్న బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు -సాక్షి, వెబ్డెస్క్ -
తాలిబన్ల దెబ్బకు ఇండియాకు భారీ నష్టం
రెండు దశాబ్దాల తర్వాత అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు భారతదేశంతో జరిగే అన్ని దిగుమతులు, ఎగుమతులను నిలిపివేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఇఓ) బుధవారం తెలిపింది. పాకిస్తాన్ రవాణా మార్గాల ద్వారా సరుకు రవాణాను తాలిబన్లు నిలిపివేశారని, ఫలితంగా ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ సహాయ్ తెలిపారు. "వాస్తవానికి, మేము ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద భాగస్వాములలో ఒకటి. అఫ్గనిస్తాన్కు ఎగుమతుల విలువ సుమారు 835 మిలియన్ డాలర్లు, దిగుమతుల విలువ $510 మిలియన్ డాలర్లు. కానీ, వాణిజ్యంతో పాటు అఫ్గనిస్తాన్లో సుమారు 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన 400 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి" అని సహాయ్ తెలిపారు. ప్రస్తుతం భారతదేశం చక్కెర, ఫార్మాస్యూటికల్స్, దుస్తులు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, ట్రాన్స్ మిషన్ టవర్లను అఫ్గనిస్తాన్కు ఎగుమతి చేస్తుంది అని అన్నారు. ఆ దేశం నుంచి భారత్ గమ్, ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
జూలైలో రికార్డు స్థాయిలో పెరిగిన దేశ ఎగుమతులు
న్యూఢిల్లీ: గత నెల జూలైలో భారత్ రికార్డు స్థాయిలో 35.2 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇది కీలక పాశ్చాత్య మార్కెట్లలో వేగవంతమైన ఆర్థిక రికవరీకి సంకేతం. దీంతో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి దారితీసింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రాథమిక డేటాలో మర్కండైజింగ్ దిగుమతులు కూడా $46.4 బిలియన్ల వరకు పెరిగాయి. ఇది చరిత్రలో రెండవ అత్యధికం. ఇక వాణిజ్య లోటు $11.2 బిలియన్లకు పెరిగింది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెల్జియం దేశాల ఎగుమతుల విలువ భారీగా పెరగగా, మలేషియా, ఇరాన్, టాంజానియాల ఎగుమతులు అత్యధికంగా క్షీణించాయి. అదేవిధంగా యుఎఇ, ఇరాక్, స్విట్జర్లాండ్ దేశాల దిగుమతులలో విలువ భారీగా పెరిగితే.. ఫ్రాన్స్, జర్మనీ, కజకస్తాన్ దిగుమతులు క్షీణించాయి. జూలైలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలను ఎక్కువగా ఎగుమతి జరిగాయి. ఇక అగ్ర దిగుమతి వస్తువులలో ముడి చమురు, బంగారం, విలువైన రాళ్ళు, వంట నూనెలు ఉన్నాయి. జూలై 2021లో భారతదేశం మర్కండైజింగ్ ఎగుమతుల విలువ 35.17 బిలియన్ డాలర్లు, గత ఏడాది జూలై కంటే ఈ ఏడాది జూలై నెలలో ఎగుమతుల విలువ 34% పెరిగాయి. 'ఆత్మనిర్భర్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారి దార్శనికత ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది' అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి 500 బిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల మర్కండైజింగ్ ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించింది. "కాబట్టి, రాబోయే ఆరు సంవత్సరాలలో సేవల ఎగుమతులు $500 బిలియన్లు, మర్కండైజింగ్ ఎగుమతులు $1 ట్రిలియన్లు ఉంటాయి. వార్షిక $1.5 ట్రిలియన్ల మొత్తం ఎగుమతులతో ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం గణనీయమైన వాటాను కలిగి ఉంటుంది" అని వాణిజ్య కార్యదర్శి బి.వి.ఆర్. సుబ్రమణియన్ గత నెలలో తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) గత వారం 2021 ప్రపంచ వృద్ధి అంచనాలో ఎటువంటి మార్పులు చేయకుండా 6% శాతం వద్దే ఉంచింది. ఇక మనదేశ వృద్ది అంచనాను ఐఎంఎఫ్ ఏప్రిల్ లో అంచనా వేసిన 12.5% నుంచి 9.5% తగ్గించింది. -
Oil Prices: అమెరికాలో కరువు.. ఇండియా వంటగదిలో పిడుగు
న్యూఢిల్లీ : అమెరికా, బ్రెజిల్లలో వచ్చిన కరువు.. ఇండియా పాలిట శాపంగా మారింది. అక్కడ పంట ఉత్పత్తులు తగ్గితే దాని ఎఫెక్ట్ ఇండియాపై పడింది. అక్కడ నూనె గింజల ఉత్పత్తి తగ్గితే ఇక్కడ వంట నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తగ్గిన దిగుబడి ఇండియాను మించిన విధ్వంసాన్ని అమెరికా, బ్రెజిల్లలో సృష్టించింది కరోనా మహమ్మారి. లక్షల సంఖ్యలో కేసులు వేల సంఖ్యలో మరణాలు అక్కడ నమోదు అయ్యాయి. దీంతో గతేడాది ఆ రెండు దేశాల్లో వంట నూనె తయారీలో ఎక్కువగా ఉపయోగించే సోయా దిగుబడి తగ్గిపోయింది. అమెరికా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే ఐదేళ్ల కనిష్ట స్థాయికి సోయా దిగుబడులు అక్కడ తగ్గిపోయి కేవలం 87 మిలియన్ టన్నులకే పరిమితమైంది. పెరిగిన ధరలు అమెరికాలోనే దాదాపు డెబ్బై శాతం మేర సోయా పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో ఒక్కసారిగా సోయా ధరలు పెరిగాయి. మరోవైపు మలేషియాలోనే ఇదే పరిస్థితి నెలకొంది. టన్ను పామాయిల్ గింజల ధర ఏకంగా 1007 డాలర్లు పెరిగింది. 2008 తర్వాత ఈ స్థాయిలో ధర పెరగడం ఇదే ప్రథమం. ఒకేసారి ఇటు సోయా, అటు పామాయిల్ పంట ఉత్పత్తుల ధరలు పెరగడంతో దాని ప్రభావం మన వంట నూనెపై పడింది. దిగుమతులపైనే ఆధారం మన వంట నూనె అవసరాల్లో దేశీయంగా ఉత్పత్తి అవుతోంది కేవలం 35 శాతమే. మిగిలిన 65 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గరున్న విదేశీ కరెన్సీ నిల్వల్లో పెట్రోలు, బంగారం తర్వాత అథ్యధికంగా ఖర్చు చేస్తోంది వంట నూనెలకే. ఇటు అమెరికా, అటు మలేషియా, ఇండోనేషియాలలో వంట నూనె ముడి పదార్థాల ధర పెరగడంతో నాలుగైదు నెలల్లోనే వంట నూనెల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. తగ్గేది ఉందా ? ప్రస్తుతం వంట నూనెలపై 35 సుంకాన్ని ప్రభుత్వం విధిస్తోంది. ఇప్పటికిప్పుడు వంటి నూనెల సెగ నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలగాలంటే ఈ పన్ను తగ్గించడం ఒక్కటే మార్గం లేదంటే. మరోసారి అమెరికా, బ్రెజిల్, మలేషియాలలో వంట నూనె మూల ఉత్పత్తుల దిగుబడి పెరిగే వరకు ఈ ఇబ్బందులు తప్పవు. వంట నూనెల ధరలు పెరగడంతో గత ఏప్రిల్లో వంట నూనె అమ్మకాలు 3 శాతం క్షీణించాయి. చదవండి : గల్వాన్ ఎఫెక్ట్: చైనా ఉత్పత్తులపై భారీ దెబ్బ -
చైనాకు కలిసొస్తున్న కరోనా..!
అమెరికాసహా పలు దేశాల్లో రికవరీ, డిమాండ్ పటిష్టంగా ఉండడంతో ప్రపంచ పటంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ– చైనా దీనిని తనకు పూర్తి అనుకూలంగా మార్చుకుంటోంది. చైనాతో పోటీ పడుతున్న పలు దేశాలు కరోనా సెకండ్ వేవ్ సవాళ్లలో కూరుకుపోవడం దీనికి నేపథ్యం. చైనా ప్రపంచ ఎగుమతులు ఏప్రిల్లో (2021 ఇదే కాలంతో పోల్చి) ఏకంగా 32.3 శాతం పెరిగాయి. విలువలో 263.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు సైతం 43.1 శాతం పెరిగి 221.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ ఎగుమతులు 24.1 శాతం అంచనాలకు మించి పెరగడం గమనార్హం. మార్చిలో వృద్ధి రేటు 30.6 శాతం. ఇక దిగుమతుల విషయానిక వస్తే, మార్చిలో పెరుగుదల రేటు 38.1 శాతం. అమెరికా, ఈయూలతో వాణిజ్యం ఇలా... ఇక ఒక్క అమెరికాకు ఏప్రిల్లో చైనా ఎగుమతుల విలువ 38.8 శాతం పెరిగి 42 బిలియన్ డాలర్లకు చేరాయి. అమెరికా గూడ్స్ దిగుమతుల విలువ 23.5 శాతం పెరిగి 13.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 27 దేశాల యూరోపియన్ యూనియన్కు ఎగుమతులు 23.9 శాతం పెరిగి 39.9 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతుల విలువ 43.3 శాతం పెరిగి 26.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చైనా ప్రపంచ వాణిజ్య మిగులు 42.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే చైనా వస్తు డిమాండ్ మెరుగుపడిందని తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. ముడి ఇనుము, ఇతర కమోడిటీ ధరలు అంతర్జాతీయంగా పెరగడం కూడా చైనా ఎగ్జిమ్ (ఎగుమతులు–దిగుమతులు) డిమాండ్కు సానుకూలత చేకూర్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే కోవిడ్–19 నేపథ్యంలో ఇతర దేశాలతో పోల్చితే చైనా ఎకానమీ ముందే ప్రారంభంకావడం గమనార్హం. మాస్కులు, ఇతర వైద్య సంబంధ ఎగుమతులు చైనా నుంచి భారీగా పెరిగాయి. కంటైనర్లకు అదనపు ప్రీమియంలు తమ దేశం నుంచి ప్రపంచ దేశాలకు భారీగా ఎగుమతులు పెరగడానికి చైనా వినూత్న విధానాలను చేపడుతోందన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ వార్తల ప్రకారం భారత్ వంటి పలు దేశాలఎగుమతుల్లో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదుకావడానికి కంటైనర్ల కొరతే ప్రధాన కారణం. ఫిబ్రవరి చివరి వారంలో విపరీతమైన కంటైనర్ల కొరత ఏర్పడింది. ‘‘ఈ ప్రాంతంలో కంటైనర్ల కొరత ఉండడం ఇక్కడ ఒక సమస్య. చైనా నుంచి భారీ ఎగుమతుల కోసం ఖాళీ కంటైనర్లు ఆ దేశానికి పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయి. ఇలా ఖాళీ కంటైనర్లు చైనాకు తిరిగి వెళ్లడానికి షిప్పింగ్ లైన్స్, కంటైనర్ కంపెనీలకు చైనా అధిక ప్రీమియంలనూ చెల్లిస్తోంది’’ అని ఎఫ్ఐఈఓ (భారత ఎగుమతి సంఘాల సమాఖ్య) ప్రెసిడెంట్ ఎస్కే షరాఫ్ ఇటీవల పేర్కొనడం గమనార్హం. ఏప్రిల్లో భారత్ ఎగుమతి–దిగుమతులు... భారత్ ఎగుమతులు 2021 ఏప్రిల్లో 30.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే కాలంలో దిగుమతుల విలువ 45.45 బిలియన్ డాలర్లుగా ఉంది. వృద్ధి బాటన అడుగులు.. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన, వర్థమాన, పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా వైరస్ సవాళ్లతో అతలాకుతలం అవుతుంటే, వైరెస్ సృష్టికి కారణమైన చైనా మాత్రం పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. 2020 తొలి త్రైమాసికం మినహా మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ మధ్యా ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్ డాలర్లు) నమోదుచేసుకుంది. అయితే గడచిన 45 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత తక్కువ స్థాయిలో దేశం వృద్ధి రేటు నమోదుకాలేదు. ఇక 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) అమెరికా తరువాత రెండవ అతిపెద్ద ఎకానమీ అయిన చైనా, ఏకంగా 18.3 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. విలువలో 24.93 ట్రిలియన్ యువాన్ (దాదాపు 3.82 ట్రిలియన్ డాలర్లు)లుగా నమోదయ్యింది. 1993లో చైనా జీడీపీ గణాంకాల ప్రచురణ ప్రారంభమైంది. అటు తర్వాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో వృద్ధి రేటు (18.3 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక 2021లో దేశ ఎకానమీ పదేళ్ల గరిష్ట స్థాయిలో 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని ఈ నెల మొదట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. చైనా ప్రభుత్వం మాత్రం 6 శాతం వృద్ధి లక్ష్యంతో పనిచేస్తోంది. మరోవైపు సెకండ్వేవ్ సవాళ్లలో పీకల్లోతు కూరుకుపోయిన భారత్ 2021, 2021–22 వృద్ధి అంచనాలకు భారీగా కోత పడుతోంది. 10 శాతం దిగువకే వృద్ధి రేటు పరిమితం అవుతుందని ఇప్పటికే దిగ్గజ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. దీనికీ బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నాయి. -
భారీగా పెరిగిన పసిడి దిగుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్ పటిష్టంగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) బంగారం దిగుమతులు 22.58 శాతం పెరిగాయి. విలువలో ఇది 34.6 బిలియన్ డాలర్లు (దాదాపు 2.54 లక్షల కోట్లు). 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 28.23 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2 లక్షల కోట్లు). ఇక వెండి దిగుమతుల విలువ ఇదే కాలంలో ఏకంగా 71 శాతం పెరిగి 791 మిలియన్ డాలర్లకు చేరింది. పసిడి దిగుమతులు పెరగడం వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) పడుతోంది. ఇది కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం)పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. పసిడి దిగుమతులు పెరగడానికి దేశీయ డిమాండ్ ప్రధాన కారణమని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా తెలిపారు. రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. పసిడిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉంటుంది. వార్షికంగా 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో యల్లో మెటల్పై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇందులో 7.5 శాతం కస్టమ్స్ సుంకం కాగా, 2.5 శాతం వ్యవసాయ మౌలిక వనరులు, అభివృద్ధి సెస్కు ఉద్దేశించినది. -
471 శాతం ఎగిసిన బంగారం దిగుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్నభారత్లో మార్చి నెలలో రికార్డు దిగుమతులనునమోదు చేసింది. గత నెలలో భారతదేశ బంగారు దిగుమతులు 471 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో160 పుంజుకున్నాయని ప్రభుత్వ వర్గాలు గురువారం రాయిటర్స్తో చెప్పాయి. దిగుమతి పన్నుల తగ్గింపు, పుత్తడి ధరలు రికార్డు స్థాయినుంచి దిగి వచ్చిన నేపథ్యంలో రీటైల్ కొనుగోలుదారులు, జ్యుయల్లర్ల నుంచి డిమాండ్ ఊపందుకోవడమే దీనికికారణమని పేర్కొంది. 2020 ఆగస్టులో ఆల్-టైమ్ హై దాదాపు 17శాతం పసిడి ధరలు దిద్దుబాటునకు గురైనాయి. పసిడి దిగుమతుల పెరుగుదల భారతదేశ వాణిజ్య లోటును పెంచుతుంది. అలాగే డాలరు మారకంలో రూపాయి విలువనుప్రభావితం చేస్తుంది. మార్చి త్రైమాసికంలో భారత్ రికార్డు స్థాయిలో 321 టన్నులు బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాది ఇది 124 టన్నులు. ఏడాది క్రితం 1.23 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం బంగారం దిగుమతులు 8.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి వెల్లడించారు. రిటైల్ డిమాండ్ పెంచేందుకు, దేశంలోకి అక్రమ రవాణాను తగ్గించడానికి ఫిబ్రవరిలో బంగారంపై దిగుమతి సుంకాలను 12.5శాతం నుండి 10.75శాతానికి కేంద్రం తగ్గించింది. అధిక ధరల కారణంగా చాలా మంది వినియోగదారులు కొనుగోలును వాయిదా వేసుకున్నారనీ, ధరలు బాగా దిగిరావడంతో కొనుగోళ్లకుఎగబడ్డారని కోల్కతా నగరంలోని హోల్సేల్ వ్యాపారి జెజె గోల్డ్ హౌస్ యజమాని హర్షద్ అజ్మెరా అన్నారు. మార్చిలో, స్థానిక బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములక పుత్తడి ధర రూ. 43,320 వద్ద ఏడాది కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో రెండోదశలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్లో భారత బంగారం దిగుమతులు 100 టన్నులకంటే తక్కువగానే ఉండనున్నాయని ఆభరణాల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను అదుపుచేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే దిగుమతులు ప్రభావితం కానున్నాయని ఒక డీలర్ అభిప్రాయపడ్డారు. కాగా దేశంలో శుక్రవారం (ఏప్రిల్ 2) వెలువరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు ప్రకారం ఒక్కరోజులోనే 72,330 కొత్త కేసులు నమోదయ్యాయి. -
అక్టోబర్లో తగ్గిన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ దిగుమతులు భారీగా తగ్గిపోతున్న నేపథ్యంలో– ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సింగిల్ డిజిట్లో నమోదవుతోంది. అక్టోబర్లో ఇది 8.71 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వాణిజ్యలోటు 11.53 బిలియన్ డాలర్లు. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఆరు నెలల క్షీణత తర్వాత సెప్టెంబర్లో వృద్ధిబాటకు (5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లు) వచ్చిన ఎగుమతులు అక్టోబర్లో మళ్లీ నిరాశను మిగిల్చాయి. సమీక్షా నెల్లో 5.12 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో 24.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక దిగుమతులు కూడా 11.53 శాతం క్షీణతతో 33.60 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరిసి వాణిజ్యలోటు కేవలం 8.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఎగుమతులు భారీగా పడిపోయిన ప్రొడక్టుల్లో పెట్రోలియం ఉత్పత్తులు (–52 శాతం), జీడిపప్పు (–21.57 శాతం), రత్నాలు, ఆభరణాలు (–21.27 శాతం) తోలు (–16.67 శాతం), మేన్ మేడ్ యార్న్/ఫ్యాబ్రిక్స్ (12.8 శాతం), ఎలక్ట్రానిక్ గూడ్స్ (–9.4 శాతం), కాఫీ (–9.2 శాతం), సముద్ర ఉత్పత్తులు (– 8 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–3.75 శాతం) ఉన్నాయి. అయితే బియ్యం, ఆయిల్ మీల్స్, ముడి ఇనుము, చమురు గింజలు, కార్పెట్లు, ఫార్మా, సుగంధ ద్రవ్యాలు, పత్తి, రసాయనాల ఎగుమతుల్లో వృద్ధి కనిపించింది. ► అక్టోబర్లో చమురు దిగుమతులు 38.52 శాతం పడిపోయి, 5.98 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతుల విలువ 27.62 బిలియన్ డాలర్లు. ఏడు నెలల్లో ఎగుమతులు 19 శాతం క్షీణత కాగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2020 వరకూ చూస్తే, ఎగుమతులు 19.02 శాతం పడిపోయి 150.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 36.28 శాతం పడిపోయి 182.29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు సమీక్షా కాలంలో 32.15 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో చమురు దిగుమతులు 49.5 శాతం క్షీణించి 37.84 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కరెంట్ అకౌంట్కు సానుకూలం దిగుమతుల క్షీణత నేపథ్యంలో కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్లోనూ భారత్ మిగులను నమోదుచేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు (0.1 శాతం) నమోదయ్యింది. ఒక నిర్థిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) కరెంట్ అకౌంట్ ‘మిగులు’ను నమోదుచేస్తుంది. ఈ విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అగ్రి ఎగుమతులు ప్రోత్సాహకరం... అగ్రి, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి నమోదుకావడం ప్రోత్సాహకర అంశం. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత కల్పించే కీలక దేశాల్లో ఒకటిగా భారత్ ఎదగడానికి సమయం ఆసన్నం అయ్యింది. గడచిన రెండు పంట కాలాల్లో దేశం మంచి ఉత్పత్తులను సాధించిన విషయం ఇక్కడ గమనార్హం. ఫార్మా, రసాయనాలుసహా పలు పారిశ్రామిక రంగాలు ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లోనూ ప్రపంచ మార్కెట్లో సత్తా చాటుతుండడం గమనార్హం. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ వ్యవస్థాపక చైర్మన్ -
భారీగా కుంగిన బంగారం దిగుమతులు
ముంబై : కోవిడ్-19 నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో బంగారం దిగుమతులు ఏకంగా 57 శాతం పతనమై రూ 50,658 కోట్లకు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ 1,10,259 కోట్ల విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. వెండి దిగుమతులు సైతం ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్లో ఏకంగా 63.4 శాతం పతనమయ్యాయి. కరోనా వైరస్ విజృంభణతో ఖరీదైన లోహాలకు డిమాండ్ తగ్గడంతోనే బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గాయి. బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గడంతో దేశ వర్తక లోటు కొంత మేర మెరుగుపడింది. గత ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్లో దేశ వర్తక లోటు 8892 కోట్ల డాలర్లు కాగా, ఇప్పుడది ఏకంగా 2344 కోట్ల డాలర్లకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా భారత్ ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇక ఈ ఏడాది దేశం నుంచి జెమ్స్, జ్యూవెలరీ ఎగుమతులు కూడా 55 శాతం మేర దెబ్బతిన్నాయి. చదవండి : అప్పటి వరకూ.. పసిడి పరుగే! -
టెలివిజన్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: టీవీల తయారీలో ఉపయోగించే కీలకమైన ఓపెన్ సెల్ దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 5 శాతం సుంకాన్ని మళ్లీ అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దేశీయంగా వీటిని తయారు చేసేందుకు మరికాస్త సమయం కావాలని గతేడాది పరిశ్రమ కోరడంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 దాకా కస్టమ్స్ సుంకం నుంచి కేంద్రం మినహాయింపునిచ్చినట్లు వివరించాయి. ఈ గడువు తీరిపోతుండటంతో అక్టోబర్ 1 నుంచి మళ్లీ 5 శాతం సుంకం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, సుంకం విధింపుతో టీవీల ధరలు దాదాపు 4 శాతం దాకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 32 అంగుళాల టీవీల రేట్లు రూ. 600 మేర, 42 అంగుళాల టీవీ రేటు రూ. 1,200–1,500 దాకా పెరుగుతాయని పేర్కొన్నాయి. అయితే, ఓపెన్ సెల్ ప్రాథమిక ధరను బట్టి చూస్తే దిగుమతి సుంకం భారం రూ. 150–250కి మించదని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఓపెన్ సెల్ వంటి కీలకమైన ఉత్పత్తులను ఎల్లకాలం దిగుమతి చేసుకుంటూ ఉంటే దేశీయంగా టీవీల తయారీ రంగం ఎదగలేదని పేర్కొన్నాయి. ఇలాంటి వాటిని దేశీయంగా తయారు చేయడానికి సుంకం విధింపు తోడ్పడగలదని వివరించాయి. -
డాలర్ల కోసం బ్యాంకర్ల డిమాండ్
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు తగ్గి 73.64 వద్ద ముగిసింది. బ్యాంకర్లు, చమురు దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్లకు భారీ డిమాండ్ దీనికి కారణం. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... సోమవారం రూపాయి ముగింపు 73.48. మంగళవారం 73.33 వద్ద సానుకూలంగానే ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే డాలర్ల కోసం భారీ డిమాండ్తో ఒక దశలో 73.72 కనిష్టానికి కూడా చూసింది. రోజంతా ఈ శ్రేణి (73.33–73.72)లోనే రూపాయి తిరిగింది. పోర్టిఫోలియో ఇన్ఫ్లోల (ఈక్విటీల్లో విదేశీ అమ్మకాలు) పరిస్థితుల్లో డాలర్ల అవసరాల రీత్యా ఆర్బీఐ తరఫున బ్యాంకులు డాలర్లు కొనుగోలు చేస్తున్నట్లు భావిస్తున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. (నేడు ప్రతికూల ఓపెనింగ్?! ) ఇక చమురు దిగుమతిదారుల నుంచి కూడా డాలర్లకు డిమాండ్ ఉన్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్లో సీనియర్ రిసెర్చ్ విశ్లేషకులు (కమోడిటీ అండ్ కరెన్సీ) జితిన్ త్రివేది తెలిపారు. 73.40–73.50 మధ్య రూపాయి నిలకడగా ఉండడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని పేర్కొన్నారు. అయితే సమీప భవిష్యత్తులో 73.90–74.10 వరకూ రూపాయి వెళ్లే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. ఇక అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై భారీ క్షీణ రేట్ల అంచనా కూడా రూపాయి సెంటిమెంట్ను దెబ్బతీస్తోందని నిపుణుల అంచనా. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). 73.83 వద్ద నిరోధం, 73.20 వద్ద మద్దతు ఉందని హెచ్డీఎఫ్సీ రిటైల్ రిసెర్చ్ డిప్యూటీ హెడ్ దేవర్షి వకీల్ పేర్కొన్నారు. (ఎస్బీఐ ఏటీఎంకు మొబైల్ తీసుకెళ్లండి!) -
ఎగుమతులు, దిగుమతుల్లో సానుకూలత
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల ధోరణులు ఆశాజనకంగా ఉన్నాయని.. ముఖ్యంగా ఎగుమతులు ఈఏడాది ఏప్రిల్లో కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్థాయి నుంచి క్రమంగా గత ఏడాది స్థాయిలకు చేరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఈ వివరాలను వాణిజ్య శాఖ శుక్రవారం ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయంగా భారత వాణిజ్యానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకు మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా పథకం కింద రాయితీలకు రూ.2 కోట్ల పరిమితి విధించడం 98%ఎగుమతిదారులపై ప్రభావం చూపించబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకం స్థానంలో ఆర్వోడీటీఈపీ అనే కొత్త పథకాన్నిఇప్పటికే ప్రకటించడం గమనార్హం. వరుసగా ఐదో నెల జూలైలోనూ ఎగుమతులు 10% క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్ షిప్పింగ్’ స్థానిక తయారీ టగ్ బోట్లనే వాడాలి ∙ ప్రధాన పోర్టులను కోరిన కేంద్రం స్వావలంబన భారత్ (ఆత్మ నిర్భర్) కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే చర్యలను కేంద్రం అనుసరిస్తోంది. దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలంటూ ప్రధాన పోర్టులను (ఓడరేవులు) షిప్పింగ్ మంత్రిత్వ శాఖా తాజాగా ఆదేశించింది. తద్వారా దేశీ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆత్మనిర్భర్ షిప్పింగ్ కోసం చేపట్టిన చర్యగా దీన్ని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ అభివర్ణించారు. సవరించిన ఆదేశాలను ప్రధాన పోర్టులు పాటించాల్సి ఉంటుందన్నారు. టగ్ బోట్ అన్నది తొట్టి ఆకారంతో కూడిన పడవ. ఓడలు పోర్టుల్లోకి వచ్చేందుకు వీటి సాయం అవసరమవుతుంది. భారత షిప్ బిల్డింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, భారత్లో షిప్ బిల్డింగ్ కోసం కొన్ని దేశాలతో చర్చలు కూడా కొనసాగుతున్నాయని కేంద్ర షిప్పింగ్ శాఖా తన ప్రకటనలో తెలిపింది. -
రొయ్యల్లో వైరస్ : దిగుమతులపై చైనా నిషేధం
బీజింగ్ : కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమైన చైనా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీజ్ చేసిన రొయ్యల ప్యాకేజీలో కరోనా వైరస్ను గుర్తించిన తరువాత చైనా ఈక్వెడార్ కు చెందిన మూడు కంపెనీల నుండి ఆహార దిగుమతులను తాత్కాలికంగా నిషేధించింది. అలాగే అధిక ప్రమాదం ఉన్న దేశాల నుండి దిగుమతి చేసుకున్న శీతలీకరించిన ఆహార ఉత్పత్తులను పరీక్షించాలంటూ దేశవ్యాప్త ప్రచారం ప్రారంభించింది. ఇటీవల బీజింగ్లో కరోనా విస్తరించడంతో రిఫ్రిజిరేటెడ్ వస్తువులపై తాజా పరిశీలన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమ్స్ అథారిటీ మూడు ఈక్వడోరియన్ కంపెనీల నుండి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించింది. డాలియన్, జియామెన్ నౌకాశ్రయం నుంచి దిగుమతైన వైట్లెగ్ రొయ్యల ప్యాకేజింగ్ నుండి తీసిన నమూనాల పరీక్షల్లో పాజిటివ్ తేలిందని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అధికారి బీ కెక్సిన్ విలేకరుల సమావేశంలో చెప్పారు. జిన్ఫాడి క్లస్టర్ను కనుగొన్నప్పటి నుంచి అధికారులు 220,000 శాంపిల్స్ను పరీక్షించినట్టు తెలిపారు. ఇక్కడ దిగుమతి చేసుకున్న రొయ్యల ప్యాకేజీ బోర్డులో వైరస్ కనుగొన్నారు. అయితే లోపల ప్యాకేజీలోను, రొయ్యల్లోనూ వైరస్ లేదని తేలింది. అయినప్పటికీ మరోసారి ఆహార దిగుమతులపై చైనా నిషేధాన్ని ప్రకటించింది కాగా గత నెలలో చైనా రాజధాని బీజింగ్ నగరంలో జిన్ఫాది హోల్సేల్ మార్కెట్ ద్వారా కరోనా వైరస్ రెండో దశలో విజృంభించిన సంగతి తెలిసిందే. తొలిదశలో అమెరికానుంచి టైసన్ పాల ఉత్పత్తులను, జర్మన్ మాంసం ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. -
చైనా నుంచి దిగుమతులకు చెక్!
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్పై నలువైపులా ఒత్తిడి పెంచేందుకు భారత్ సిద్ధమవుతోంది. టిక్టాక్ సహా చైనాకు చెందిన 50 యాప్లను ఇప్పటికే బహిష్కరించిన ప్రభుత్వం బీజింగ్ నుంచి దిగుమతులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను సూచించాలని పీఎంఓ వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది. గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రాగన్పై పెంచుతున్నదౌత్య, ఆర్థిక ఒత్తిళ్లలో భాగంగా ఈ ప్రక్రియ సాగుతోంది. చైనా నుంచి దిగుమతులను వీలైనంతగా తగ్గించేందుకు సూచనలు ఇవ్వాలని పీఎంఓ అధికారులు వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏ)ను సైతం పీఎంఓ సమీక్షిస్తోంది. ఎఫ్టీఏ పేరుతో భారత్కు చవకైన వస్తువులను గుమ్మరిస్తున్న దేశాలకు చెక్ పెట్టేందుకు కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. స్వయం సమృద్ధ భారత్ నినాదం కింద చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్ సహా ఆసియాన్ దేశాల దిగుమతులపై కూడా ప్రభుత్వం సమీక్షించనుంది. ఆత్మనిర్భర్ మిషన్ కింద దేశీయంగా తయారీని ప్రోత్సహించడంతో పాటు చైనా నుంచి వచ్చే తక్కువ నాణ్యతతో కూడిన దిగుమతులను నిరోధించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. చదవండి : కోవిడ్-19 : చైనాను దాటేసిన ముంబై -
చైనా, పాక్కు ‘పవర్’ కట్!
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్ విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని పేర్కొన్నారు. తనిఖీల తర్వాతైనా అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్ శాఖల మంత్రులతో శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘మనం ఇక్కడ ప్రతీదీ తయారు చేసుకుంటున్నాం. అయినా కూడా భారత్ రూ. 71,000 కోట్ల విలువ చేసే విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులో రూ.21,000 కోట్ల మేర చైనా నుంచి దిగుమతయ్యాయి. మన దేశంలోకి చొరబడే పొరుగు దేశం నుంచి ఈ స్థాయిలో దిగుమతులను అనుమతించలేం. చైనా, పాకిస్తాన్ల నుంచి ఏదీ కొనుగోలు జరిపే ప్రసక్తే లేదు. ఆయా దేశాల నుంచి దిగుమతులకు అనుమతులివ్వబోము. ఈ దిగుమతి చేసుకున్న వాటిల్లో (చైనా నుంచి) ఏ మాల్వేర్ ఉందో ట్రోజన్ హార్స్ ఉందో (వైరస్లు). వీటి సాయంతో వారు అక్కడెక్కణ్నుంచో మన విద్యుత్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయొచ్చు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. టవర్ ఎలిమెంట్లు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు మొదలైనవి భారత్లోనే తయారవుతున్నా.. వాటిని దిగుమతి చేసుకోవడం ఆందోళనకరమైన విషయమన్నారు. ‘మీ డిస్కంలు చైనా కంపెనీల నుంచి పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయొద్దని కోరుతున్నాం’ అని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులకు మంత్రి సూచించారు. స్వయం సమృద్ధి భారత్ నినాదంలో భాగంగా ఇక్కడ లభించే ఏ పరికరాన్నీ చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకోబోదని చెప్పారు. దిగుమతి చేసుకున్న వాటిని కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తుందని, ఆ తర్వాత అవసరమైతే వాటిని రద్దు కూడా చేయొచ్చని కూడా ఆయన తెలిపారు. డిస్కంలకు ఆర్థిక ఊరట... డిస్కంలకు ఆర్థికంగా ఊరటనిచ్చేలా కొత్త పథకాన్ని మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఉదయ్, డీడీయూజీజేవై, ఐపీడీఎస్ పథకాల స్థానంలో ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. కొత్త స్కీమ్ కింద డిస్కంల నష్టాలను తగ్గించేందుకు రాష్ట్రాలు తగు ప్రణాళికలు సమర్పించాల్సి ఉంటుంది. నష్టాలను తగ్గించుకునే ప్రణాళికల్లో లేని డిస్కంలకు ఈ పథకం కింద రుణాలు గానీ గ్రాంట్లు గానీ ఇవ్వడం జరగదని సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో లాగా ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేట్ సంస్థల ద్వారానైనా డిస్కంలను లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. డిస్కంలకు రూ. 90,000 కోట్ల మేర నిధులు అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్యాకేజీ కింద రాష్ట్రాలు రూ. 93,000 కోట్లు అడిగాయని, ఇప్పటిదాకా రూ. 20,000 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చైనా దిగుమతులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి.. చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి విద్యుత్ పరికరాల దిగుమతులకు ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్తో సరిహద్దులున్న దేశాలు.. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యుత్ సరఫరా వ్యవస్థలో వినియోగించేందుకు దిగుమతి చేసుకున్న అన్ని రకాల యంత్రాలు, పరికరాలు, విడిభాగాలతో మాల్వేర్, ట్రోజన్లు, సైబర్ ముప్పులాంటివి పొంచి ఉన్నాయేమో తెలుసుకునేందుకు, భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చూసేందుకు దేశీయంగా పరీక్షించడం జరుగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. విద్యుత్ శాఖ నిర్దేశించిన అధీకృత ల్యాబొరేటరీల్లో టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. టిక్టాక్కు... 45 వేల కోట్ల నష్టం! చైనా యాప్లపై భారత నిషేధం కారణంగా చైనాకు చెందిన బైట్డాన్స్ లిమిటెడ్కు రూ.45,000 కోట్లు(600 కోట్ల డాలర్లు) నష్టం వస్తుందని అంచనా. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్టాక్తో సహా మొత్తం 59 చైనా యాప్లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధ యాప్ల జాబితాలో బైట్డాన్స్కు చెందిన యాప్లు మూడు(టిక్టాక్, విగో వీడియో, హెలో యాప్) ఉన్నాయి. మిగిలిన యాప్ల నష్టాలతో పోల్చితే ఈ మూడు యాప్ల నష్టాలే అధికమని కైయాక్సిన్గ్లోబల్డాట్కామ్ పేర్కొంది. విదేశాల్లో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన చైనా యాప్ల్లో టిక్టాక్ కూడా ఒకటి. టిక్టాక్కు చైనా తర్వాత అత్యధిక యూజర్లు ఉన్నది భారత్లోనే. ఈ ఏడాది తొలి 3 నెలల కాలంలో 61.1 కోట్ల డౌన్లోడ్స్ జరిగాయి. ఇది ప్రపంచవ్యాప్త టిక్టాక్ డౌన్లోడ్స్లో 30 శాతం. -
చైనాతో వాణిజ్య లోటు డౌన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గించుకోవడంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ దేశంతో భారత వాణిజ్య లోటు 48.66 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇది 2018–19లో 53.56 బిలియన్ డాలర్లుగాను, 2017–18లో 63 బిలియన్ డాలర్లుగాను నమోదైంది. తాజాగా 2019–20లో చైనాకు ఎగుమతులు 16.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 65.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చైనాతో ఆందోళనకర స్థాయిలో భారీగా ఉంటున్న వాణిజ్య లోటును, ఆ దేశంపై ఆధారపడటాన్నీ తగ్గించుకునేందుకు భారత్ కొన్నాళ్లుగా పలు చర్యలు తీసుకుంటోంది. పలు ఉత్పత్తులకు సంబంధించి సాంకేతిక, నాణ్యతా నిబంధనలను సవరిస్తోంది. ఇందులో భాగంగానే దేశీ సంస్థలను దెబ్బతీసేంత చౌక రేటుతో భారత్లో చైనా కుమ్మరిస్తున్న పలు ఉత్పత్తులపై యాంటీ–డంపింగ్ సుంకాలు విధిస్తోంది. సాంకేతిక ఆంక్షల రూపకల్పనకు 371 ఉత్పత్తులను గుర్తించింది. వీటిల్లో ఇప్పటికే 150 పైగా ఉత్పత్తులకు నిబంధనలు రూపొందించింది. వీటి దిగుమతుల విలువ దాదాపు 47 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. ఇక నాణ్యతాపరమైన ఆంక్షల విషయానికొస్తే.. గడిచిన ఏడాది కాలంలో 50 పైగా క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు (క్యూసీవో), ఇతరత్రా సాంకేతిక నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ఎలక్ట్రానిక్ గూడ్స్, బొమ్మలు, ఎయిర్ కండీషనర్లు, సైకిళ్ల విడిభాగాలు, రసాయనాలు, సేఫ్టీ గ్లాస్, ప్రెజర్ కుకర్లు, ఉక్కు ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. దిగుమతుల్లో 14 శాతం వాటా భారత దిగుమతుల్లో చైనా వాటా సుమారు 14 శాతంగా ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో ప్రధానంగా మొబైల్ ఫోన్స్, టెలికం, విద్యుత్ పరికరాలు, గడియారాలు, వాయిద్య పరికరాలు, బొమ్మలు, స్పోర్ట్స్ గూడ్స్, ఫర్నిచర్, మ్యాట్రెస్లు, ప్లాస్టిక్, ఎలక్ట్రికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రసాయనాలు, ఉక్కు, ఇనుము ఉత్పత్తులు, ఎరువులు, ఫార్మా ముడిపదార్థాలు, లోహాలు మొదలైనవి ఉంటున్నాయి. తగ్గిన ఎఫ్డీఐలు.. వాణిజ్య లోటుతో పాటు చైనా నుంచి భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) కూడా పరిమాణం కూడా తగ్గింది. 2018–19లో 229 మిలియన్ డాలర్లుగా ఉన్న చైనా ఎఫ్డీఐలు 2019–20లో 163.78 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2000 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో చైనా నుంచి భారత్లోకి 2.38 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువగా ఆటోమొబైల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్ పరికరాలు, సర్వీసులు, ఎలక్ట్రానిక్స్లోకి ఈ ఎఫ్డీఐలు వచ్చాయి. భారత్తో సరిహద్దులున్న పొరుగు దేశాల నుంచి వచ్చే ఎఫ్డీఐలకు సంబంధించి నిబంధనలను కేంద్రం ఇటీవల ఏప్రిల్లో కఠినతరం చేసింది. వీటి ప్రకారం ఆయా దేశాలకు చెందిన కంపెనీలు, వ్యక్తులు ఈ రంగంలో ఇన్వెస్ట్ చేయాలన్నా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. -
చైనాకు కళ్లెం ఎలా?
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను అన్నిరకాలుగా నిలువరించేందుకు భారత్ గట్టి చర్యలే తీసుకుంటోంది. ఇందులో భాగంగా 59 చైనా యాప్స్ను నిషేధించింది. తద్వారా చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో ఇది కీలక పరిణామమే. ఇప్పటికే చైనాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకునే ప్రణాళికలను భారత్ అమలు చేస్తోంది. దేశీయంగా హ్యాండ్సెట్స్ తయారీ మొదలైన వాటిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం మొదలైంది. అయితే, చైనాకు చెక్ పెట్టేందుకు ఇవి సరిపోతాయా అంటే ఇంకా చర్యలు అవసరమనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశీ కంపెనీలు ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి వస్తున్న టెలికం, ఆటోమొబైల్ పరికరాల విషయంలోనూ దేశీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా డ్రాగన్కు చెక్ చెప్పవచ్చని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. టెలికం రంగం.. వార్షికంగా చూస్తే చైనా నుంచి భారత్ గతేడాది దిగుమతి చేసుకున్న సెల్ఫోన్ల సంఖ్య 33 శాతం తగ్గింది. దేశీ సంస్థలు క్రమంగా పుంజుకోవడానికి ఇది శుభసూచనే. ప్రస్తుతం భారత స్మార్ట్ఫోన్స్ మార్కెట్ పరిమాణం రూ. 2 లక్షల కోట్ల పైగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందనుంది. అయితే, ఈ మార్కెట్ను 70–80 శాతం శాసిస్తున్నది చైనా కంపెనీలే. భారీ అమ్మకాలతో చైనా కంపెనీలు గట్టిగా పాతుకుపోయాయి. కానీ దేశీయంగా తయారీకి ఊతం లభిస్తున్నందున భారతీయ సంస్థలు క్రమంగా ఈ మార్కెట్లో చొచ్చుకుపోయేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. ఈ విభాగంలో చైనా బ్రాండ్లను, పరికరాల దిగుమతులను నిషేధించిన పక్షంలో టెలికం రంగం రూపురేఖలే మారిపోతాయని పేర్కొన్నారు. చైనా ప్రమేయం లేకుండా చూసే దిశగా టెండర్లపై మరోసారి కసరత్తు చేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. 4జీ, 5జీ సర్వీసుల్లోకి బీఎస్ఎన్ఎల్ విస్తరిస్తున్న నేపథ్యంలో చైనా పరికరాలను ఉపయోగించవద్దంటూ బీఎస్ఎన్ఎల్కు స్పష్టమైన సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు భవిష్యత్ విస్తరణ ప్రణాళికల్లో చైనా టెలికం పరికరాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలంటూ ప్రైవేట్ రంగ భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు కూడా టెలికం శాఖ (డాట్) అధికారికంగా ఆదేశాలు కూడా ఇ చ్చే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆటోమోటివ్ రంగం.. ఇక దేశీ ఆటోమొబైల్ మార్కెట్లో కూడా భారత్ గట్టిగా నిలదొక్కుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం భారత స్థూల దేశీయోత్పత్తిలో ఆటో పరికరాలు, డిజైన్, అభివృద్ధి, ఈ–బస్సులు, విద్యుత్ వాహనాలు మొదలైన వాటి వాటా 7.5 శాతం స్థాయిలో మాత్రమే ఉంది. ప్రత్యామ్నాయ మార్కెట్లు ఉన్నప్పటికీ దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతులు చేసుకుంటున్నాయి. కార్మికులు అత్యధికంగా అవసరమయ్యే ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించగలదు. ఆటోమోటివ్ విభాగంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు రాబోయే రోజుల్లో గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే అయిదేళ్లలో వాహనాలు, పరికరాల ఎగుమతులను భారీగా ప్రోత్సహించే దిశగా ఇటీవలే భారీ పరిశ్రమల శాఖ పలు చర్యలు తీసుకుంది. ఇక ఇప్పటికే చైనా కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్లను కూడా కంపెనీలు, రాష్ట్రాల ప్రభుత్వాలు పునఃసమీక్షిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితమే 2000 పైచిలుకు ఈ–బస్సుల కోసం మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఒక చైనా కంపెనీకి భారీ ఆర్డర్లు దక్కాయి. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటిని రద్దు చేయాలంటూ అన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటనలు రావాల్సి ఉంది. దేశీయంగా గట్టి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నందున ఈ ఆర్డర్లను భారతీయ కంపెనీలకే ఇచ్చి, దిగుమతులను నిషేధించడం వల్ల ఈ రంగంపై సానుకూల ప్రభావం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దేశీ మార్కెట్ను పటిష్టం చేయడంతో పాటు ఇది ఎకానమీ వృద్ధికి, స్థానికంగా ఉపాధి కల్పనకు ఊతమివ్వగలదని చెబుతున్నాయి. పోర్టుల వద్ద నిలిచిన ఫార్మా ఉత్పత్తులు హైదరాబాద్: దేశంలో పలు పోర్టుల వద్ద ఫార్మా ముడిసరుకులు నిలిచిపోయాయి. కస్టమ్స్ క్లియరెన్సు కోసం ఇవి ఎదురుచూస్తున్నాయి. ముడి సరుకు సమయానికి చేరకపోవడంతో దేశీయంగా తయారీ విషయంలో ఇక్కడి కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా తమకు సభ్య కంపెనీల నుంచి కాల్స్ వస్తున్నాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మెక్సిల్) తెలిపింది. క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఉత్పత్తుల్లో అత్యధికం చైనా నుంచి దిగుమతి అయినవేనని కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. కీలక ముడి పదార్థాలు, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ ఏ కారణంగా పోర్టుల వద్ద నిలిచిపోయాయో పరిశ్రమకు తెలియదంటూ ఫార్మెక్సిల్ చైర్మన్ దినేశ్ దువా కేంద్ర ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీకి లేఖ రాశారు. కీలక ఉత్పత్తులు సైతం.. మెడికల్ డివైసెస్, గ్లూకోమీటర్స్, స్ట్రిప్స్ సైతం పోర్టుల వద్ద నిలిచిపోయాయి. అలాగే కోవిడ్–19 విస్తృతి నేపథ్యంలో కీలకంగా మారిన ఇన్ఫ్రారెడ్ థెర్మామీటర్స్, పల్స్ ఆక్సీమీటర్స్ వంటి డయాగ్నోస్టిక్స్ క్రిటికల్ డివైసెస్ సైతం వీటిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా లేఖలో దినేశ్ దువా కోరారు. -
చైనా దిగుమతులు ఇప్పట్లో తగ్గవు!
సాక్షి, న్యూఢిల్లీ: చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడం రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ తెలిపింది. దేశీయంగా అమ్ముడయ్యే వివిధ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్లో 95 శాతం దేశీయంగానే తయారైనవే ఉంటున్నా.. 25–70 శాతం విడిభాగాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. కరోనా వైరస్ పరిణామాలతో చైనా నుంచి సరఫరా దెబ్బతినడంతో అప్పట్నుంచే విడిభాగాల దిగుమతి కోసం దేశీ సంస్థలు ఇతర మార్కెట్లను పరిశీలించడం ప్రారంభించాయని తెలిపింది. చైనా ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలన్న ఉద్యమం ఊపందుకోవడానికి ముందునుంచే కంపెనీలు దీనిపై దృష్టి పెట్టాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నంది పేర్కొన్నారు. థాయ్లాండ్, వియత్నాం, కొరియా తదితర దేశాలను పరిశీలించాయని వివరించారు. ఎయిర్కండీషనర్లకు సంబంధించిన విడిభాగాలను అత్యధికంగా, వాషింగ్ మెషీన్ల విడిభాగాలను అత్యంత తక్కువగా దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు. దేశీయంగా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి.. ‘పరికరాల కోసం సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దాకా చైనాపై ఆధారపడటాన్ని రాత్రికి రాత్రే తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఇందుకు సమయం పడుతుంది. మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలి‘ అని కమల్ పేర్కొన్నారు. దేశీయంగా ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వీటిని అభివృద్ధి చేసుకునేందుకు కనీసం రెండేళ్లయినా పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వం కూడా దశలవారీ తయారీ పథకం (పీఎంపీ) వంటి స్కీములతో తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని కమల్ చెప్పారు. దీనిపై ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. చైనాయేతర సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ .. బాయ్కాట్ చైనా ఉద్యమంతో చైనాయేతర కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ (మొబైల్ కమ్యూనికేషన్స్) అద్వైత్ వైద్య తెలిపారు. ‘గడిచిన కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడింది. రాబోయే కొద్ది రోజుల్లో వివిధ ధరల శ్రేణిలో కొత్తగా ఆరు హ్యాండ్సెట్స్ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. అలాగే భారత్లో మా ఉత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుకుంటున్నాం. మా మేకిన్ ఇండియా ఉత్పత్తుల గురించి భారీ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం‘ అని ఆయన వివరించారు. ఇక వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్ తాము చైనా నుంచి కొనుగోళ్లను నిలిపివేయనున్నట్లు తెలిపింది. ‘డోక్లాం ఉదంతం జరిగినప్పట్నుంచీ గడిచిన కొన్నాళ్లుగా మేం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం‘ అని సంస్థ ఎండీ చంద్రు కల్రో పేర్కొన్నారు. చైనా నుంచి ఫినిష్డ్ గూడ్స్ కొనుగోళ్లు అన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని, దేశీయంగానే విడిభాగాల వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకోవడంపై కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. భారత మార్కెట్ అవసరాల కోసం టీటీకే ప్రెస్టీజ్ దిగుమతి చేసుకునే వాటిల్లో చైనా వాటా సుమారు 10 శాతం ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతులను 5 శాతానికన్నా తక్కువకే పరిమితం చేసుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రు చెప్పారు. -
గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా ?
సాక్షి, చెన్నై: చైనా దిగుమతుల నిషేధంపై తీవ్ర చర్చోపచర్చలు నడుస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అందుబాటులో లేని, మన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం తప్పు కాదని ఆమె వెల్లడించారు. స్వావలంబన భారతదేశం (ఆత్మనిర్బర్ భారత్ అభియాన్) అంటే దిగుమతులు అస్సలు చేయకూడదని కాదు. పారిశ్రామిక వృద్ధికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవసరమైన దిగుమతులు చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. వృద్ధిని పెంచేందుకు దిగుమతి చేసుకోవడంలో తప్పు లేదు కానీ, గణేష్ విగ్రహాలను కూడా చైనా నుండే ఎందుకు దిగుమతి చేసుకోవాలని ఆమె ప్రశ్నించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకంపై తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో వర్చువల్ గా మాట్లాడిన సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. (చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?) ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా సాంప్రదాయకంగా స్థానికంగా మట్టితో చేసిన గణేశ విగ్రహాల కొనుగోలుకు బదులుగా వాటిని కూడా చైనా నుండి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు. మనం తయారుచేసుకోలేమా..ఇలాంటి పరిస్థితి ఎందుకో ఆలోచించాలన్నారు. ఆఖరికి సబ్బుపెట్టె, ప్లాస్టిక్ వస్తువులు, పూజకు ఉపయోగించే అగర్ బత్తీలాంటి మనం ప్రతి రోజూ వాడే గృహోపకరణాలను దిగుమతి చేసుకోవడం స్వావలంబనకు తోడ్పడుతుందా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేకించి ఇటువంటి ఉత్పత్తులను భారతీయ సంస్థలు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ స్థానికంగా తయారుచేసినప్పుడు మాత్రమే దేశ స్వావలంబన సాధ్యపడుతుందన్నారు. (బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు) దిగుమతులు తప్పు కాదు, అవి ఉత్పత్తిని ప్రోత్సహించడంతోపాటు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, ఉపాధి అవకాశాలు, వృద్ధి లాంటి ప్రయోజనాలను తీసుకురాలేని దిగుమతులు స్వావలంబనకు, భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడవని పేర్కొన్నారు. స్థానికంగా తయారయ్యే అందుబాటులో ఉన్న వస్తువులను దిగుమతి చేసుకునే పరిస్థితి మారాలి. ఆత్మ నిర్బర్ అభియాన్ వెనుకున్న స్వయం ప్రతిపత్తి ఆలోచన ఇదేనని ఆమె పునరుద్ఘాటించారు. ఈ సందర్బంగా గత ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. మోదీ అయ్య (సార్) అంటూ తమిళంలో ప్రసంగించారు. అలాగే జూన్ 15న లద్దాఖ్లో మరణించిన 20 మంది సైనికుల్లో ఒకరైన తమిళనాడుకు చెందిన హవల్దార్ కె పళనికి ఆమె నివాళులర్పించారు. -
ఎలక్ట్రానిక్స్కు ప్రత్యామ్నాయ మార్కెట్లున్నాయ్..
ముంబై: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎలక్ట్రానిక్స్ దిగుమతులను భారత్ నిజంగానే తగ్గించుకోదల్చుకుంటే ప్రత్యామ్నా య మార్కెట్లు చాలానే ఉన్నాయని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముంబై (డబ్ల్యూటీసీ) వెల్లడించింది. సింగపూర్, మలేసియా, తైవాన్, అమెరికా నుంచి దిగుమతులను పెంచుకునే అంశం పరిశీలించవచ్చని పేర్కొంది. డబ్ల్యూటీసీ గణాంకాల ప్రకారం చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ గూడ్స్లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, టీవీ సెట్లు ఉంటున్నాయి. చమురుయేతర ఉత్పత్తుల దిగుమతుల్లో చైనాకు 14% వాటా ఉంటోంది. ‘2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలం లో మొత్తం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతుల విలువ రూ.3.59 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువ సుమారు రూ. 1.42 లక్షల కోట్లు.. అంటే దాదాపు మొత్తం దిగుమతుల్లో 40% వాటా’ అని డబ్ల్యూటీసీ తెలిపింది. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతుల్లో అత్యధిక వాటా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే (కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక దిగుమతులు, కంప్యూటర్, ఐటీ హార్డ్వేర్, మొబైల్ ఫోన్స్ మొదలైనవి) ఉంటోంది. మొబైల్ దిగుమతులు తగ్గినా.. చైనాదే హవా.. గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల దిగుమతులు మొత్తం మీద తగ్గినప్పటికీ చైనా వాటా మాత్రం పెరగడం గమనార్హం. 2019 ఏప్రిల్ – 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో సెల్ ఫోన్ దిగుమతులు సగానికి సగం పడిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోని రూ. 11,304 కోట్ల నుంచి రూ. 6,313 కోట్లకు క్షీణించాయి. దేశీయంగా తయారీ పెరగడం, హ్యాండ్సెట్స్పై దిగుమతి సుంకాలు పెంచడం ఇందుకు కారణం. అయితే, చైనా నుంచి కూడా దిగుమతులు తగ్గినప్పటికీ మొత్తం దిగుమతుల్లో దాని వాటా 55 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది. దేశీయంగా ఉత్పత్తికి ఊతం... కేంద్రం ఇటీవల కొన్నాళ్లుగా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పలు స్కీములను అమలు చేస్తోంది. దీంతో 2014–2020 మధ్య కాలంలో దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 20.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.73 లక్షల ఓట్లుగా ఉన్న స్థానిక ఉత్పత్తి 2019–20లో రూ. 5.33 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ పరిస్థితులు చూస్తే ఇది మరింత వేగంగా వృద్ధి చెందనుందని డబ్ల్యూటీసీ అంచనా వేసింది. అయితే, దేశీయంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగే దాకా చైనా నుంచి దిగుమతులను తగ్గించుకునే క్రమంలో ఇతర మార్కెట్లవైపు చూడవచ్చని తెలిపింది. సింగపూర్, అమెరికా, మలేసియా, జపాన్ నుంచి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, కలర్ టీవీ సెట్లను, సింగపూర్, తైవాన్, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్ నుంచి టెలికం పరికరాలను దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. -
ఎగుమతులు.. మూడోనెలా ‘మైనస్’
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల్లో వరుసగా మూడవనెలా ప్రతికూలతే నమోదయ్యింది. అక్టోబర్లో అసలు వృద్ధిలేకపోగా –1.11 క్షీణరేటు నమోదయ్యింది. అంటే 2018 అక్టోబర్తో పోల్చిన 2019 అక్టోబర్లో ఎగుమతుల విలువ –1.11 శాతం తగ్గి, 26.38 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం (–14.6 శాతం), తివాచీ (–17 శాతం), తోలు ఉత్పత్తులు (–7.6 శాతం), బియ్యం (–29.5 శాతం), తేయాకు (–6.16 శాతం)వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 18 క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. భారత్ ఎగుమతులు ఆగస్టులో –6 శాతం క్షీణతను నమోదుచేసుకుంటే, సెపె్టంబర్లో ఈ క్షీణ రేటు –6.57 శాతంగా ఉంది. దిగుమతులూ మైనస్... దిగుమతులు కూడా 16.31 శాతం పడిపోయాయి. విలువ రూపంలో 37.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు– దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 అక్టోబర్లో ఈ పరిమాణం 18 బిలియన్ డాలర్లు. శుక్రవారం విడుదలైన గణాంకాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... - పసిడి దిగుమతులు 5 శాతం పడిపోయి 1.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. - చమురు దిగుమతులు అక్టోబర్లో –31.74 శాతం క్షీణించి 9.63 బిలియన్ డాలర్లుగా నమోదయితే, చమురేతర దిగుమతులు –9.18 శాతం పడిపోయి 27.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏడు నెలల్లోనూ నిరాశే... ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ చూస్తే, ఎగుమతులు 2.21 శాతం తగ్గి 185.95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు – 8.37 శాతం క్షీణించి 280.67 బిలియన్ డాలర్లకు జారాయి. వెరసి వాణిజ్యలోటు 94.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ 116.15 బిలియన్ డాలర్లు. సేవల రంగం ఇలా... ఇక సేవల రంగానికి సంబంధించి అక్టోబర్ నెల గణాంకాలను కూడా ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది. సేవల ఎగుమతుల విలువ 17.22 బిలియన్ డాలర్లు ఉంటే, దిగుమతుల విలువ 10.92 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు గణాంకాలు తెలిపాయి. తక్షణ వాణిజ్య విధానం అవసరం జారుడుబల్లపై ఉన్న ఎగుమతుల పరిస్థితిని నిలువరించడానికి తక్షణం ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటించాలని ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మందగమనానికి, డిమాండ్లో బలహీనతకు గణాంకాలు అద్దం పడుతున్నాయని భారత వాణిజ్యాభివృద్ధి మండలి చైర్మన్ మోహిత్ సింగ్లా పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య చీఫ్ శరద్ కుమార్ సరాఫ్ మాట్లాడుతూ, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు, రక్షణాత్మక వాణిజ్య విధానాల ప్రభావం భారత్ ఎగుమతులపై కనబడుతోందని తెలిపారు. -
59 నిమిషాల్లోనే రుణ పథకానికి మెరుగులు
న్యూఢిల్లీ: ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేవలం 59 నిమిషాల్లోనే రుణాలను పంపిణీ చేసే పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) మేలు చేసేందుకు గాను, టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించే విధానాన్ని రూపొందించినట్టు మంత్రి చెప్పారు. ఢిల్లీలో గురువారం జరిగిన సీఐఐ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మంత్రి గడ్కరీ మీడియాతో మాట్లాడారు. దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ విధానంలో టెక్నాలజీ వినియోగంతో దిగుమతులను తగ్గించనున్నట్టు తెలిపారు. ‘‘దీనిని ఆరి్థక శాఖకు పంపిస్తున్నాం. ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నా అభిప్రాయం. దిగుమతి చేసుకునే ప్రధాన సరుకులను స్థానికంగా ఉత్పత్తి చేసే ఎంస్ఎంఈలకు నూతన విధానం మద్దతుగా నిలుస్తుంది. దీంతో మనం దిగుమతిదారుగా కాకుండా ఎగుమతిదారుగా మారిపోతాం. ఎంఎస్ఎంఈలు మరింత బలోపేతం అవుతాయి’’ అని మంత్రి చెప్పారు. ఎంఎస్ఎంఈలకు 59 నిమిషాల్లోనే రుణం అందించే పథకాన్ని ప్రధాని మోదీ 2018 నవంబర్లో ప్రారంభించారు. ఆన్లైన్ విధానంలో రుణ పంపిణీ జరుగుతుంది. ఆరంభించిన 4 నెలల్లోనే రూ.35,000 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగింది. అయితే, 59 నిమిషాల్లోనే రుణ పథకం పట్ల చిన్న సంస్థలు ఆసక్తి చూపించడం లేదని బ్యాంకులు అంటున్నాయి. ఈ పథకం పట్ల అవగాహన లేకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పథకాన్ని సమీక్షిస్తున్నట్టు మంత్రి చెప్పడం గమనార్హం. కాగా, దేశంలో డ్రైవర్ రహిత వాహనాలకు అనుమతించబోమని గడ్కరీ తేల్చిచెప్పారు. -
ఏప్రిల్లో భారీగా పెరిగిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: దేశంలోకి పసిడి దిగుమతులు ఏప్రిల్లో భారీగా పెరిగాయి. 2018 ఏప్రిల్ దిగుమతుల పరిమాణం 2.58 బిలియన్ డాలర్లతో పోల్చితే 2019 ఏప్రిల్లో 54 శాతం వృద్ధితో 3.97 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. అయితే ఈ పరిణామం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్ధిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకం మధ్య ఉండే నికర వ్యత్యాసం)పై ప్రభావం చూపడం గమనార్హం. ఏప్రిల్లో క్యాడ్ విలువ 15.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్టస్థాయి. 2018–19 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో పోల్చితే కరెంట్ అకౌంట్ లోటు 2.5 శాతంగా ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ లోటు 2.1 శాతమే కావడం గమనార్హం. భారత్ వార్షికంగా దాదాపు 800 నుంచి 900 టన్నుల విలువైన పసిడిని దిగుమతి చేసుకుంటోంది. -
5.5% తగ్గిన బంగారం దిగుమతులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 5.5 శాతం తగ్గాయి. విలువ పరంగా చూస్తే 29.5 బిలియన్ డాలర్ల మేర బంగారం దిగుమతి అయింది. తద్వారా కరెంటు ఖాతా లోటుపై బంగారం భారం తగ్గిపోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 31.2 బిలియన్ డాలర్ల మేర ఉండడం గమనార్హం. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. అయితే, బంగారం దిగుమతుల విలువ తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గడమే కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో బంగారం దిగుమతుల విలువ ప్రతికూలంగా ఉండగా, జనవరిలో మాత్రం 38.16 శాతం పెరిగి 2.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కానీ, ఫిబ్రవరిలో తిరిగి 10.8 శాతం క్షీణించి దిగుమతులు 2.58 బిలియన్ డాలర్లకు పరిమితయ్యాయి. బంగారాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. ముఖ్యంగా ఆభరణాల కోసమే మనదగ్గర ఎక్కువ కొనుగోళ్లు జరుగుతుంటాయి. జెమ్స్, జ్యుయలరీ ఎగుమతుల్లో క్షీణత ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో జెమ్స్, జ్యూయలరీ ఎగుమతులు 6.3 శాతం తగ్గి 28.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు (ఎగుమతులు, దిగుమతుల విలువ మధ్య అంతరం) జీడీపీలో 2.9 శాతానికి పెరిగిన విషయం గమనార్హం. 2017–18లో బంగారం దిగుమతులు 22.43 శాతం పెరిగి 955.16 టన్నులుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 780 టన్నులుగా ఉండడం గమనార్హం. బంగారం దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలను కూడా అమల్లోకి తెచ్చింది. -
ఫిబ్రవరిలో తగ్గిన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఫిబ్రవరిలో ఉపశమించింది. దిగుమతులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... ► దిగుమతుల విషయంలో ఈ మొత్తం 36.26 బిలియన్ డాలర్లు. గత ఏడాది (2018 ఫిబ్రవరి) ఇదే నెలతో పోల్చిచూస్తే, ఈ విలువ 5.4 శాతం తగ్గింది. ► వెరసి వాణిజ్యలోటు ఫిబ్రవరిలో 9.6 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 2018 ఫిబ్రవరిలో 12.3 బిలియన్ డాలర్లు అయితే, 2019 జనవరిలో ఈ విలువ 14.73 బిలియన్ డాలర్లు. ►పసిడి, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు తగ్గాయి. దీనితో దిగుమతులు మొత్తంగా తగ్గాయి. పసిడి దిగుమతులు 11 శాతం తగ్గి 2.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 2.89 బిలియన్ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 8 శాతం తగ్గి 9.37 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 8.85 శాతం పెరిగి 298.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 9.75 శాతం పెరిగి 464 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు దాదాపు 166 బిలియన్ డాలర్లు. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 149 బిలియన్ డాలర్లు. అవరోధాలను అధిగమిస్తున్నాం: ఎఫ్ఐఈఓ అంతర్జాతీయంగా వాణిజ్య రక్షణాత్మక విధానాలు ఉన్నాయి. కఠిన అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు ఉన్నాయి. దేశీయంగానూ ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఎగుమతులు కొంత సానుకూలంగానే నమోదయ్యాయి. మొత్తం 30 ప్రధాన గ్రూపుల్లో 18 సానుకూల ఫలితాలను అందించాయి. – గణేశ్ కుమార్ గుప్తా, ఎఫ్ఐఈఓ సేవలు తగ్గాయి... సేవల ఎగుమతులు 2018 డిసెంబర్తో పోల్చితే, 2019 జనవరిలో 1.02 శాతం తగ్గాయి. 17.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవల దిగుమతులు కూడా ఇదే కాలంలో 3.07 శాతం తగ్గి 11.03 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ఎగుమతులు పెరిగినా.. వాణిజ్యలోటు భయాలు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు అక్టోబర్లో (2017 అక్టోబర్తో పోల్చి) 17.86 శాతం పెరిగాయి. విలువ రూపంలో చూస్తే 26.98 బిలియన్ డాలర్లు. అయితే ఇదే కాలంలో దిగుమతులు భారీగా 17.62 శాతం పెరిగి 44.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం 17.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అక్టోబర్లో వాణిజ్యలోటు 14.61 బిలియన్ డాలర్లు. గురువారం వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ►గత ఏడాది అక్టోబర్లో మరీ తక్కువ ఎగుమతు లు జరగడం (బేస్ఎఫెక్ట్) ప్రస్తుత ఏడాది అక్టోబర్లో వృద్ధి రేటు భారీగా కనబడ్డానికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్, ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రతినిధులు వ్యాఖ్యానించడం గమనార్హం. ►అక్టోబర్లో ఎగుమతులు పెరిగినా, నెలవారీగా చూస్తే తగ్గాయి. సెప్టెంబర్లో ఎగుమతుల విలువ 27.95 బిలియన్ డాలర్లు. ► అక్టోబర్ ఎగుమతుల్లో మంచి ఫలితాలను సాధించిన రంగాల్లో పెట్రోలియం (49.3 శాతం), ఇంజనీరింగ్ (8.87 శాతం), రసాయనాలు (34 శాతం) ఫార్మా (13 శాతం), రత్నాలు, ఆభరణాలు (5.5 శాతం) వంటివి ఉన్నాయి. ► అయితే కాఫీ, బియ్యం, పొగాకు, జీడిపప్పు, ఆయిల్సీడ్స్సహా పలు వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల ఎగుమతులు ప్రతికూలతను నమోదుచేసుకున్నాయి. ఊ అక్టోబర్లో చమురు దిగుమతులు 52.64 శాతం పెరిగి 14.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 6 శాతం పెరిగి 29.9 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు 13.27 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 191 బిలియన్ డాలర్లు. దిగుమతులు ఇదే కాలంలో 16.37 శాతం పెరిగి 302.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి రెండింటి మధ్యా నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 111.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్యలోటు 91.28 బిలియన్ డాలర్లు. కాగా ఏప్రిల్– అక్టోబర్ మధ్య చమురు దిగుమతులు 50.48 శాతం పెరిగి 83.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్లో 19 శాతం పెరిగిన సేవలు... ఇదిలావుండగా, సెప్టెంబర్కు సంబంధించి సేవల రంగం గణాంకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. ఈ నెలలో సేవల ఎగుమతులు 19 శాతం పెరిగాయి. విలువ రూపంలో 16.38 బిలియన్ డాలర్లు. దిగుమతులు 18 శాతం పెరిగాయి. విలువ 9.95 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ భారత్ సేవల ఎగుమతులు విలువ 101.07 బిలియన్ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతుల విలువ 62.57 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారీగా తగ్గిన పసిడి దిగుమతులు మరోవైపు అక్టోబర్లో పసిడి దిగుమతులు భారీగా 42.9 శాతం తగ్గాయి. విలువలో 1.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో పసిడి దిగుమతుల విలువ 2.95 బిలియన్ డాలర్లు. డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోవడం పసిడి డిమాండ్ను తగ్గించింది. ఇది కరెంట్ అకౌంట్ లోటుకు ప్రతికూల అంశమే. ఆభరణాల పరిశ్రమ నుంచి ప్రధానంగా పసిడికి డిమాండ్ ఉంది. ఆభరణాల పరిశ్రమ నుంచి ఎగుమతులు ఈ నెల్లో 5.5 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 34.9 బిలియన్ డాలర్లు. -
4 శాతం పెరిగిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు ప్రస్తుత ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 4 శాతం పెరిగాయి. విలువ రూపంలో 17.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 ఇదే కాలంలో ఈ విలువ 16.96 బిలియన్ డాలర్లు. వాణిజ్యశాఖ ఈ మేరకు తాజా గణాంకాలను విడుదల చేసింది.వార్షికంగా భారత్ 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ఆభరణాల పరిశ్రమ డిమాండ్ దీనికి నేపథ్యం. పసిడి దిగుమతులు తగ్గించడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. క్యాడ్పై ఆందోళన.. భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే రెండు కమోడిటీల్లో ఒకటి క్రూడ్ కాగా, రెండవది పసిడి. అయితే క్రూడ్ దిగుమతి తప్పనిసరి. అప్రధానమైన పసిడి దిగుమతులు పెరగడం ఇప్పుడు ఆర్థికవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితులు వాణిజ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్)పై ప్రభావం చూపుతాయన్నది వారి ఆందోళనలకు కారణం. ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. ఇక దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే కరెంట్ అకౌంట్లోటు. దేశంపై ఇది రుణ భారం పెంపునకు, తద్వారా దేశీయ మారకపు విలువ కోతకు దారితీస్తుంది. 2018–19 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య వాణిజ్యలోటు 76.66 బిలియన్ డాలర్ల నుంచి 94.32 బిలియన్ డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. ఇక క్యాడ్ 2018–19 మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 2.4 శాతంగా నమోదయ్యింది. -
వంటనూనెల కొరతతో చిక్కులు!
2017–18లో దేశీయ వంటనూనెల వినియోగం 2.5 కోట్ల టన్నులు కాగా ఇందులో 1.5 కోట్ల టన్నులు దిగుమతులు చేస్తున్నారు. దేశీయ ఉత్పత్తి 80 లక్షల టన్నులు దాటడం లేదు. భారత్లో తలసరి నూనెల వాడకం సంవత్సరానికి 17 కే.జీ.లు ఉండగా ప్రపంచంలో 25 కే.జీ.లు ఉన్నది. 2030 నాటికి నూనెల వినియోగం 3.40 కోట్ల టన్నులు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నూనెల దిగుమతుల కోసం ప్రస్తుతం రూ.83,669 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఇందులో కోటీ 20 లక్షల టన్నుల వంట నూనెలకు క్రూడాయిల్ కోసం రూ.69,669 కోట్లు వెచ్చిస్తుండగా, 29 లక్షల టన్నుల రిఫైన్డ్ ఆయిల్ దిగుమతులకు గాను, రూ. 14 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రస్తుతం నూనె గింజల ఉత్పత్తికి 6.65 కోట్ల ఎకరాలు దేశంలో సాగవుతున్నది. వినియోగంలో 46 శాతం పామాయిల్, 16 శాతం సోయా, 14 శాతం మస్టర్, 24 శాతం ఇతర నూనెలు వాడుతున్నాం. భారతదేశం వంటనూనెల దిగుమతులపై అత్యధిక నిధులు వెచ్చిస్తున్నది. దేశంలో 8 కోట్ల సాగునీటి భూమి బీళ్ళుగా మారింది. బీళ్ళుగా మారిన భూమిలో నూనె గింజలు, పప్పుధాన్యాలు పండాల్సింది. కానీ, ఈ రోజు వంట నూనెలతో పాటు 50 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయ అవసరాలకు 2.35 కోట్ల పప్పు ధాన్యాలు అవసరం కాగా, ప్రస్తుతం మన ఉత్పత్తులు 1.85 కోట్ల టన్నులకు మించడం లేదు. పౌష్టిక, కీలక ఆహార సరుకులను దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది తప్ప, బీడు భూములను సాగు చేసి, పైసరుకులలో స్వయంపోషకత్వం కావడానికి ఎలాంటి కృషి జరగడం లేదు. దినదినం నూనెగింజల విస్తీర్ణం తగ్గుతూ ఉంది. నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం బడ్జెట్లో అతి తక్కువ మొత్తాన్ని కేటాయిస్తోంది. ప్రయోగాల ద్వారా నూనె గింజలను పెంచాలని నిధులు విడుదల చేసినా ఎక్కడా దేశంలో నూనె గింజల ఉత్పాదకతకు ఎలాంటి ప్రయోజనాలు రావడం లేదు. ప్రపంచంలో 5 దేశాలు పామాయిల్ ఉత్పత్తిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. 2017–18లో ప్రధమ స్థానంలో ఇండోనేíసియా 2.1 కోట్ల టన్నులు, మలేసియా 1.95 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచ ఉత్పత్తిలో ఈ రెండు దేశాలు 85 శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండోనేసియా, మలేసియా నుండి భారతదేశం వంట నూనెలు దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా నేటికీ 7 లక్షల ఎకరాలలో మాత్రమే పామాయిల్ తోటలు వేశారు. తోటల విస్తరణకు 90 శాతం రాయితీ ఇస్తూ ప్రోత్సహించాలని పథకాలు రూపొందిస్తున్నారు. దళిత, గిరిజనులకు 100 శాతం ఇస్తున్నారు. కానీ, చాలా వరకు ఈ సబ్సిడీ పథకాలు దుర్వినియోగం జరుగుతున్నాయి. కష్టపడి తోటలు వేసే వారికి మాత్రం లభించడం లేదు. తోటల మంజూరుకు పైరవీలు చేయలేక చాలా మంది విరమించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం 13.478 ఎకరాలలో పామాయిల్ తోటలు తీసివేయగా ప్రస్తుతం 3,58,331 ఎకరాలలో మాత్రమే తోటలు ఉన్నాయి. తెలంగాణలో 40,110 ఎకరాలలో తోటలు వేశారు. దేశంలో 68 వేల ఎకరాలను లక్ష్యంగా నిర్ణయించుకొని, 36 వేల ఎకరాలలో మాత్రమే తోటలు వేశారు. ఏపీలో పామాయిల్ తోటల విస్తరణ లక్ష్యం 31 వేల ఎకరాలు కాగా 13 వేల ఎకరాలకు, తెలంగాణలో 5 వేల ఎకరాలు లక్ష్యం కాగా, 1,162 ఎకరాలను మాత్రమే నాటారు. దీనిని బట్టి చూస్తే దేశంలో పామాయిల్ తోటల విస్తరణ పెంచడానికి, ప్రభుత్వ పథకాలు అమలు జరపడానికి అధికార యంత్రాంగం, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. దేశీయ అవసరాలకు ఉత్పత్తికన్నా దిగుమతులు ఎక్కువగా వున్నాయి. ఇక్కడున్న కొద్దిపాటి ఉత్పత్తికి కూడా నిర్ణయించిన ధర ఇవ్వకుండా మధ్యదళారీలు రైతులను నష్టపరుస్తున్నారు. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకాన్ని రూపొందించి పామాయిల్ తోటల పెంపకాన్ని వృద్ధి చేయడం ద్వారా నూనె కొరతను తీర్చవచ్చు. ప్లాంటేషన్ తోట లన్నింటిలో కొనుగోలుదారులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. మధ్యదళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏజెన్సీ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలి. ప్రస్తుతం టన్నుకు రూ. 10,000లు అమ్మినప్పటికీ ఒక సందర్భంలో 6 వేలకు ధరలు తగ్గాయి. ధరల స్థిరత్వం లేకపోవడం వల్ల రైతులలో తోటల పెంపుదలపై ఉత్సాహం కనపర్చడం లేదు. కనీసం టన్నుకు రూ. 15,000 ధర నిర్ణయించడం ద్వారా రైతులకు కొంత ప్రోత్సాహం కలుగుతుంది. కనీస అవసరాలమేరకైనా ప్రతి వ్యక్తీ నూనెల వాడకానికి కావలసిన ఉత్పత్తిని దేశీయంగా చేయాలి. అందుకనుగుణంగా ప్రభుత్వం పథకాలు రూపొందించి ప్రత్యేక శ్రద్ధతో తోటల విస్తరణ చేసి, నూనె దిగుమతులను పూర్తిగా తగ్గించాలి. సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త ఉపాధ్యక్షులు, అఖిల భారత కిసాన్ సభ 94900 98666 -
రూపాయి క్షీణత.. స్టీల్కు మంచి రోజులు
ముంబై: పడుతున్న రూపాయి దేశీయ స్టీల్ రంగానికి లాభం చేకూర్చనుంది. రానున్న నెలల్లో ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందని, అదే సమయంలో దిగుమతుల ధరలు పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తుల ధరలకు ఊతం లభిస్తుందని, దీంతో మొత్తం మీద దేశ స్టీల్ వాణిజ్య లోటు తగ్గిపోతుందని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. రూపాయి డాలర్తో 71.75కు క్షీణించిన విషయం తెలిసిందే. ‘‘2018–19 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో స్టీల్ ఎగమతులు 33 శాతం క్షీణించాయి. అదే సమయంలో దిగుమతులు 11 శాతం పెరిగాయి. దీంతో గత రెండు సంవత్సరాలుగా ఎగుమతి దేశంగా ఉన్న భారత్, నికరంగా స్టీల్ దిగుమతిదారుగా మారింది. సీజన్ వారీగా రెండో క్వార్టర్లో వినియోగం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. అయితే, మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరుగుతుండడం, పంటలకు కనీస మద్దతు ధరల నేపథ్యంలో గ్రామీణ డిమాండ్ మెరుగుపడతుందన్న అంచనాలతో రానున్న నెలల్లో స్టీల్ వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’’ అని ఇక్రా తెలిపింది. -
జపాన్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
టోక్యో: రక్షణాత్మక ధోరణులతో వాణిజ్య యుద్ధాలకు కాలుదువ్వుతున్న అమెరికా ధోరణులను ధిక్కరిస్తూ జపాన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై జపాన్ చాలా మటుకు టారిఫ్లు ఎత్తివేయనుంది. బియ్యం మినహా చీజ్ తదితర ఉత్పత్తులు అనేకం ఈ జాబితాలో ఉండనున్నాయి. అలాగే, జపాన్ ఉత్పత్తులపై దాదాపు 99 శాతం మేర టారిఫ్లను ఈయూ ఎత్తివేయనుంది. కార్ల విడిభాగాలపై టారిఫ్లను తక్షణం ఎత్తివేయనుండగా, డీల్ అమల్లోకి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత నుంచి కార్ల మీద కూడా లెవీలు తొలగించనుంది. ఈ ఒప్పందం ద్వారా రక్షణాత్మక విధానాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నది తమ లక్ష్యమని ఈయూ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ పేర్కొన్నారు. అమెరికా పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండా దాని తీరుపై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతర్జాతీయంగా రక్షణాత్మక ధోరణులు పెరుగుతున్న తరుణంలో స్వేచ్ఛా వాణిజ్యానికి మార్గదర్శకత్వం వహించేందుకు జపాన్, ఈయూ కట్టుబడి ఉన్నాయని ఒప్పందం సందర్భంగా జపాన్ అధ్యక్షుడు షింజో అబే తెలిపారు. ఈ ఒప్పందాన్ని అటు యూరోపియన్ యూనియన్, ఇటు జపాన్ చట్టసభలు ఇంకా ఆమోదించాల్సి ఉంది. -
భారత్ దిగుమతులకు చైనా ప్రోత్సాహకాలు
బీజింగ్ : భారత్ నుంచి ఔషధ దిగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు వాటిపై సుంకాలను తగ్గిస్తూ ఆ దేశంతో ఒప్పందానికి వచ్చినట్టు సోమవారం చైనా వెల్లడించింది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్షీణించిన క్రమంలో భారత్ నుంచి ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులను భారీగా దిగుమతి చేసుకోవాలని చైనా నిర్ణయించింది. మరోవైపు భారత్తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి చర్యలు చేపట్టే క్రమంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆసియా పసిఫిక్ వాణిజ్య ఒప్పందం (ఏపీటీఏ)కు అనుగుణంగా జులై 1 నుంచి భారత్, చైనాలు పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాయి. ఈ గ్రూపులో బంగ్లాదేశ్, లావోస్, దక్షిణ కొరియా, శ్రీలంకలు కూడా సభ్యదేశాలుగా ఉన్నాయి. వ్యవసాయ, రసాయన ఉత్పత్తులు సహా 8549 ఉత్పత్తులపై టారిఫ్స్ను తగ్గించనున్నామని, భారత్ దాదాపు 3142 ఉత్పత్తులపై దిగమతి సుంకాలను తగ్గించనుందని చైనా స్పష్టం చేసింది. -
మరింత పెరిగిన వాణిజ్యలోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కరంగా మారిన వాణిజ్య లోటు తాజాగా మరింత భయపెడుతోంది. మే నెలలో వాణిజ్య లోటు 14.62 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతులు 15 శాతం పెరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. మే మాసానికి సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ 14.62 బిలియన డాలర్లుగా నమోదైందని వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. గత ఏడాది ఇదే కాలానికి వాణిజ్య లోటు 13.85 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఎగుమతులు 28.86 బిలియన్ డాలర్లు. గత ఏడాది 24.01 బిలియన్ డాలర్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 20.18శాతం వృద్ధిని సాధించాయి. దిగుమతులు 43.38 బిలియన్ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన 14.85 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దిగుమతులు గత ఏడాది 37.86 బిలియన్ డాలర్లుగా ఉంది. ముడి చమురు దిగుమతులు 49.46 శాతం పెరిగి 11.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
పప్పు రైతులపై దిగుమతుల పిడుగు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల నుంచి పప్పు దినుసులను దిగుమతి చేసుకోవడానికి దేశంలోని రిజస్టరైన పప్పు దినుసుల వ్యాపారులు, మిల్లర్లు జూన్ ఒకటవ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటోంది. ఈ మేరకు మే 16వ తేదీనే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ను జారీ చేసింది. ‘దేశీయంగానే పప్పు దినుసుల దిగుమతి దండిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి దిగుమతి ఎందుకు, దండగ! అని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ముందుగానే ప్రశ్నించాం. అయితే ప్రపంచ వాణిజ్య సంస్థ నియమ నిబంధనల ప్రకారం విదేశాల నుంచి పప్పు దినుసులను దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో ఊరుకున్నాం’ అని అఖిల భారత పప్పు మిల్లుల సంఘం చైర్మన్ సురేశ్ అగర్వాల్ తెలిపారు. తాము ఈ విషయమైన మే ఆరవ తేదీనే కేంద్ర వాణిజ్య శాఖను కలిసి చర్చలు జరిపినట్లు ఆయన వివరించారు. పప్పు దినుసులను శుద్ధి చేసే సామర్థ్యాన్నిబట్టి మిల్లుల యజమానులు విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఎవరికి ఎంత దిగుమతి కోటా కావాలో స్పష్టంగా తెలియజేస్తూ జూన్ ఒకటవ తేదీ నుంచి కేంద్ర వాణిజ్య విభాగానికి దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన కోటా తక్కువనా, లేక మిల్లర్ కోట్ చేసినది తక్కువనా ? అన్న అంశం ఆధారంగా తక్కువనే ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం దిగుమతుల కేటాయింపులను ఖరారు చేస్తుంది. ఆగస్టు 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ దిగుమతుల వల్ల రైతులు నష్టపోతారా లేక మిల్లర్ నష్టపోతారా? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. పప్పు దినుసుల్లో, వాటి వినియోగంలో భారత్ ప్రపంచంలోనే పెద్ద దేశం. మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు మిల్లర్లు పప్పు దినుసులు కొనగోలు చేసి వాటిని నిల్వ చేస్తారు. తద్వారా ధర పెరిగినప్పుడు అమ్ముకుంటారు. దేశంలో ఉత్పత్తి పెరిగినా, తగ్గినా, విదేశాల నుంచి పప్పుదినుసుల దిగుమతి పెరిగినా, తగ్గినా వ్యాపారులకు, మిల్లర్లకు వచ్చే నష్టం పెద్దగా ఎప్పుడూ ఉండదు. నష్టపోయేది ఎక్కువగా ఎప్పుడూ రైతులే. పప్పుదినుసులు ఎక్కువ పండించినప్పుడు వాటిని నిల్వచేసుకునే సామర్థ్యం వారికి ఎక్కువ ఉండదు. అందుకు అవసరమైన శీతల గిడ్డంగులు వారికి అందుబాటులో ఉండవు. ఇటు రైతుకు, అటు వినియోగదారులకు భారం కాకుండా ధరలు హేతుబద్ధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే కేంద్రం 23 వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. మార్కెట్లో రైతుకు కనీస మద్దతు ధర లభించనప్పుడు ఆ సరకు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కేవలం బియ్యం, గోధుమల కొనుగోలుకే ప్రభుత్వం ఎక్కువగా పరిమితం అవుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. 2016లో తూర్పు ఆఫ్రికాలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడి దేశాలతో ఒప్పందం చేసుకోవడం వల్ల కెన్యా, టాంజానియా దేశాల నుంచి 2017లో భారీ ఎత్తున పప్పు దినుసులు భారత్కు దిగుమతి చేసుకోవడం వల్ల గిట్టుబాటు ధర తగ్గి పప్పుదినుసుల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని లక్షల టన్నుల పప్పు దినుసులకు కొనుగోలుదారులు లేకుండా పోయారు. భారత్తో ఒప్పందం కారణంగా పలు తూర్పు ఆఫ్రికా దేశాల రైతులు ఈసారి తమ పప్పు దినుసుల సాగును మరింత విస్తీర్ణం చేశారు. భారత్తో అవగాహనా రాహిత్యం వల్ల తమ దేశంలో కూడా 20 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు దినుసలకు బయ్యర్లు లేకుండా పోయారని కెన్యాలోని కిటూ కౌంటీ గవర్నర్ చారిటీ కలుకి మీడియాకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి కూడా భారత్ పప్పు దినుసులను దిగుమతి చేసుకుంటే భారతీయ రైతులు మరింత నష్టపోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
వాహన దిగుమతులపైనా టారిఫ్లు!
వాషింగ్టన్: అమెరికాలోకి దిగుమతి అవుతున్న వాహనాలు, ట్రక్కులు, ఆటో ఉపకరణాల వల్ల జాతీయ భద్రతకు విఘాతం కలుగుతుందా? అన్న కోణంలో విచారణ జరపాలని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. తాజా చర్యతో అమెరికా భద్రత, ప్రయోజనాల కోణంలో దిగుమతి అయ్యే వాహనాలు, వాహనోత్పత్తులపై పెద్ద ఎత్తున టారిఫ్లు విధించే అవకాశం కనిపిస్తోంది. 1962 వాణిజ్య విస్తరణ చట్టంలోని (టీఈఏ) సెక్షన్ 232 కింద విచారణ ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని తనను కలసిన వాణిజ్య మంత్రి విల్బర్ రాస్కు ట్రంప్ సూచించారు. దిగుమతి అయ్యే కార్లపై టారిఫ్లు లేదా నియంత్రణలు విధించాల్సిన అవసరం ఉందా? అన్నది పరిశీలించాలని కోరారు. ప్రధాన పరిశ్రమ అయిన ఆటోమొబైల్స్, ఆటోమోటివ్ పార్ట్లు తమ దేశ బలమని ట్రంప్ అభివర్ణించారు. అమెరికా ఈ ఏడాది మార్చిలో ఇదే విధంగా... దిగుమతి అయ్యే స్టీల్పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్లు విధించిన విషయం గమనార్హం. 22 శాతం ఉద్యోగాలకు గండి‘‘గడిచిన 20 ఏళ్లలో అమెరికా కార్ల విక్రయాల్లో దిగుమతి అయ్యే ప్రయాణికుల వాహనాల వాటా 32 శాతం నుంచి 48 శాతానికి పెరిగింది. అమెరికన్లు రికార్డు స్థాయిలో కార్లను కొనుగోలు చేస్తున్నాగానీ 1990 నుంచి 2017 వరకు వాహనోత్పత్తి రంగంలో ఉద్యోగాలు 22 శాతం తగ్గాయి’’ అని అమెరికా వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గట్టిగా ఎదుర్కొంటాం: చైనా తమ హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకుంటామని చైనా వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయాలు బహుపాక్షిక వాణిజ్య విధానాన్ని బలహీనపరచడమేనని, అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలిగించే చర్యలను అమెరికా తీసుకుంటోందని చైనా వాణిజ్య శాఖా ప్రతినిధి గావో ఫెంగ్ బీజింగ్లో మీడియాతో పేర్కొన్నారు. -
దేశీ మార్కెట్లో అమెరికన్ ఆర్గానిక్ యాపిల్స్
సాక్షి, కోల్కతా : అమెరికన్ యాపిల్స్ దేశీయ మార్కెట్లో రుచులను పంచబోతున్నాయి. భారత్ మార్కెట్లో తొలిసారిగా అమెరికాలోని వెనాచీ నుంచి ఆర్గానిక్ యాపిల్స్ను ప్రవేశపెట్టామని పండ్ల దిగుమతి సంస్థ ఐజీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. దేశంలో సహజమైన పండ్లు, కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విదేశీ సంస్థ స్టెమిల్ట్ గ్రోయర్స్తో ఒప్పందం ద్వారా ఆర్గానిక్ యాపిల్స్ను దిగుమతి చేస్తున్నామని తెలిపింది. ఆరోగ్య స్పృహ పెరుగుతున్న క్రమంలో సహజమైన తాజా యాపిల్స్ను ప్రజలకు అందించే ఉద్దేశంతో అమెరికా నుంచి ఆర్గానిక్ యాపిల్స్ను తొలిసారిగా భారత మార్కెట్కు పరిచయం చేస్తున్నామని ఐజీ ఇంటర్నేషనల్ తెలిపింది. దేశంలో పండ్లను ఇష్టంగా తినే వారిలో ఆర్గానిక్ పండ్లపై ఆసక్తి కనబరుస్తారని పేర్కొంది. భారత్లో అరటి పండ్ల తర్వాత అత్యధికంగా యాపిల్స్ను ఎక్కువగా వాడతారు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల పైగా యాపిల్స్ వినియోగం జరుగుతుంది. -
బంగారం దిగుమతుల భారీ పతనం
సాక్షి, ముంబై: భారతీయ బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. తక్కువ డిమాండ్ కారణంగా జనవరి మాసానికి సంబంధించిన బంగారం దిగుమతులు భారీ క్షీణతను నమోదు చేశాయి. భారీగా పెరిగిన ధర, దిగుమతి సుంకంపై కోత ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో బంగారం దిగుమతులు పడిపోయాయని తాజా లెక్కలు తేల్చాయి. జనవరిలో బంగారం దిగుమతులు 17 నెలల కనిష్టాన్ని నమోదు చేశాయని విలువైన లోహాల కన్సల్టెన్సీ జీఎఫ్ఎంఎస్ నివేదించింది. జనవరి మాస పసిడి దిగుమతులు 37 శాతం క్షీణించి 30 టన్నులుగా నమోదైంది. గత ఏడాది ఇది47.9గా ఉందని జీఎఫ్ఎంఎస్ సీనియర్ ఎనలిస్ట్ సుధీష్ నంబియాత్ సోమవారం వెల్లడించారు. ఈ బడ్జెట్లో పన్ను కోత ఉంటుందని పరిశ్రమ ఎదురు చూసిందన్నారు. ధరల పెంపుతో కొనుగోలుదారులు కొనుగోళ్లు వాయిదా వేసినట్టు జీఎఫ్ఎంఎస్ పేర్కొంది. చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతి పెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న భారత్లో కొనుగోళ్లు పడిపోవడం, ఎనిమిది వారాల్లో 7 శాతం పైగా పెరిగిన ప్రపంచ ధరలపై భారీగాఉంటుందని తెలిపింది. తగ్గిన దిగుమతులు కారణంగా డిసెంబర్ మూడేళ్ల గరిష్టాన్ని చేరుకున్న ద్రవ్యలోటును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందని జీఎఫ్ఎంఎస్ వ్యాఖ్యానించింది. కాగా డిసెంబర్ నెలలో బంగారం ధర ఐదు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోగా..జనవరిలో 17 నెలల గరిష్టానికి ఎగబాకాయి. దేశంలో విదేశీ బంగారం కొనుగోళ్లు డిసెంబర్లో 80.4 టన్నులుగా ఉండగా, గత ఏడాదితో పోలిస్తే 61 శాతం పెరిగినట్టు జీఎఫ్ఎస్ఎం గణాంకాలు ద్వారా తెలుస్తోంది. తక్కువ ధరల నేపథ్యంలో డిసెంబరులో భారతీయ బ్యాంకులు బంగారాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నాయనీ, దీంతో జనవరిలో దిగుమతులు తగ్గాయని బులియన్ డీలర్ తెలిపారు. అలాగే ఫిబ్రవరిలో దిగుమతులు పుంజుకుని, 50 టన్నులకు చేరవచ్చని మరో డీలర్ అభిప్రాయపడ్డారు. -
గాడిదలు కావాలండోయ్: చైనా
బీజింగ్ : ఇతర దేశాలకు తమ వస్తువులను ఎగుమతి చేస్తూ తమదైన ముద్ర వేసుకున్న చైనాకు.. ఓ విషయంలో మాత్రం తీవ్ర కొరత ఏర్పడింది. అదేంటో కాదండోయ్.. గాడిద చర్మం. అవును గత కొన్నేళ్లుగా చైనాలో గాడిదల సంఖ్య విపరీతంగా తగ్గిపోయిందంట. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన చైనా ప్రభుత్వం ఇతర దేశాల్లోని తోలు విక్రయదారులను ఆకర్షించే పనిలో పడింది. దీనిలో భాగంగానే గాడిదల దిగుమతులపై విధించే సుంకాన్ని ఏకంగా 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం చైనాలో గాడిద తోలుకు మంచి గిరాకీ ఉండటంతో భారీ రేటు పలుకుతోంది. ఒక్కో గాడిద తోలు మన కరెన్సీలో సుమారు రూ.30వేలు పలుకుతోంది. దీనికి కారణం గాడిద చర్మాన్ని కాచి తీసిన జిగురు పదార్థం జెలిటిన్కు ఫుల్ డిమాండ్ ఉండటమే. దీన్ని చర్మ సౌందర్యాన్ని పెంచే సంప్రదాయ జౌషదాల్లోనూ వాడుతారు. అంతేకాకుండా గాడిద మాంసాన్ని చైనీయులు ఇష్టంగా తింటారు. దీంతో చైనాలో గాడిదల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చైనా దెబ్బకు తమ దేశాల్లోని గాడిదలు తగ్గుతాయని పక్క దేశాలు గొల్లుమంటున్నాయి. -
ఎగుమతులకు ‘గ్లోబల్ డిమాండ్’ బలం!
న్యూఢిల్లీ: మెరుగుపడిన అంతర్జాతీయ డిమాండ్.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. జీఎస్టీ రిఫండ్ ప్రక్రియ సరళీకరణ వెరసి నవంబర్లో భారత్ ఎగుమతుల్లో 30.55 శాతం భారీ వృద్ధి నమోదయ్యింది. విలువ రూపంలో ఎగుమతులు 26.19 బిలియన్ డాలర్లు. 2016 నవంబర్లో భారత్ ఎగుమతుల విలువ 20.06 బిలియన్ డాలర్లు. నిరుత్సాహం నుంచి ఉత్సాహం... 2016 అక్టోబర్ నెలతో పోల్చితే, 2017 అక్టోబర్లో ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా 1.12 శాతం క్షీణత (మైనస్) నమోదయ్యింది. అంతక్రితం నెల సెప్టెంబర్లో ఆరు నెలల గరిష్టస్థాయిలో వృద్ధి నమోదయినా, వెంటనే (అక్టోబర్) క్షీణత నమోదుకావడం అందరినీ నిరాశపరిచింది. అయితే నవంబర్లో మంచి వృద్ధి తీరు పట్ల సంబంధిత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దిగుమతులదీ ఎగువబాటే...: కాగా భారత్ దిగుమతులు కూడా నవంబర్లో 19.61 శాతం పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం వెలువరించిన గణాంకాలు వెల్లడించాయి. విలువ రూపంలో 40 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే నెలలో ఈ విలువ 33.46 బిలియన్ డాలర్లు. దీనితో ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు 13.82 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►రత్నాలు – ఆభరణాలు (33 శాతం) ఇంజనీరింగ్ గూడ్స్(44 శాతం), ఆర్గానిక్, ఆర్గానిక్యేతర రసాయనాలు (54 శాతం), ఫార్మా ప్రొడక్టులు (13 శాతం) ఎగుమతుల్లో చక్కటి వృద్ధి రేటు నమోదయ్యింది. ►బంగారం దిగుమతులు 26% తగ్గి 3.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ►చమురు దిగుమతులు 39.14 శాతం పెరిగాయి. విలువ రూపంలో 9.55 బిలియన్ డాలర్లు. చమురుయేతర దిగుమతులు 14.57 శాతం పెరిగి 30.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► చైనా, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతులు పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే, ఎగుమతులు 12 శాతం పెరిగి 196.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 22 శాతం ఎగసి 296 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. -
ఉల్లి దిగుమతులకు ఓకే
సాక్షి,న్యూఢిల్లీ: ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఎంఎంటీసీ ద్వారా 2000 టన్నుల ఉల్లి దిగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు సరఫరాలు పెంచి ధరలకు కళ్లెం వేసేందుకు దేశీయ మార్కెట్ల నుంచి నాఫెడ్,ఎస్ఎఫ్ఏసీలు 12,000 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసేందుకు సంసిద్ధమయ్యాయని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతులను నియంత్రించేందుకు కనిష్ట ఎగుమతి ధరను తిరిగి విధించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరామని చెప్పారు. ఉల్లి సరఫరాలు తగ్గడంతో దేశంలోని పలు చోట్ల ఉల్లి ధరలు కిలో రూ 50-65 మధ్య పలుకుతున్నాయి. ధరలకు చెక్ పెట్టేందుకు 12,000 టన్నుల ఉల్లిని సేకరించాలని తాము నాఫెడ్, ఎస్ఎఫ్ఏసీలను కోరామని చెప్పారు. ఉల్లి సరఫరాలను పెంచి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. -
చైనా దిగుమతులకు చెక్
న్యూఢిల్లీః విదేశాల నుంచి చౌక దిగుమతులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అయ్యే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులపై అదనపు దిగుమతి పన్ను విధించింది. దిగుమతుల నుంచి దేశీయ స్టీల్ తయారీదారులకు ఉపశమనం కలిగించేలా కొన్ని హాట్రోల్డ్,కోల్డ్ రోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్ దిగుమతులపై 18.95 శాతం అదనపు పన్ను విధించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చైనా నుంచి వెల్లువెత్తుతున్న ఈ దిగుమతులతో దేశంలో స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటున్నదని, దీన్ని నివారించేందుకు దిగుమతులపై అదనపు పన్ను విధించినట్టు తెలిపాయి. ,చైనా, జపాన్, దక్షిణ కొరియాల నుంచి స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ దిగుమతులపై భారత్ ఇప్పటికే యాంటీ డంపింగ్ సుంకాలను విధించింది. -
ఉ.కొరియా దిగుమతులను నిలిపేసిన చైనా
బీజింగ్: ఐక్యరాజ్యసమితి కొత్త ఆంక్షల నేపథ్యంలో.. మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. బొగ్గు, ఇనుము, ముడి ఇనుము, సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతులను మంగళవారం నుంచి నిషేధిస్తున్నామని వెల్లడించింది. గత ఫిబ్రవరి నుంచే బొగ్గు దిగుమతిని నిలిపివేయగా.. తాజాగా ఇనుము తదితరాలను నిలిపివేస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ వెబ్సైట్లో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆంక్షలను అమలు చేయడం వల్ల చైనాకు సుమారు రూ.6,500 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని అంచనా. -
ఎగుమతులు పెరిగినా... వాణిజ్యలోటు భయం!
♦ మేలో 8 శాతం పెరిగిన ఎగుమతులు ♦ దిగుమతులూ 33 శాతం జంప్ ♦ దీనితో 14 బిలియన్ డాలర్లకు ఎగసిన వాణిజ్యలోటు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2017 మే నెలలో 8 శాతం (2016 మే నెల ఎగుమతులతో పోల్చితే) పెరిగాయి. విలువ రూపంలో 24.01 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఇదే నెలలో దిగుమతులూ భారీగా 33 శాతం పైగా పెరిగాయి. విలువ రూపంలో 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు 14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యిందని వాణిజ్యమంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి. ఇది 30 నెలల గరిష్ట స్థాయి. గత ఏడాది ఇదే నెలలో వాణిజ్యలోటు 6 బిలియన్ డాలర్లు. ఎగుమతులు పెరిగినా వాణిజ్యలోటు పెరగడం కొంత ఆందోళనకరమైనదే. ఇదే ధోరణి కొనసాగితే, మొత్తం కరెంట్ అకౌంట్లోటుపై దీని ప్రభావం పడే అవకాశం ఉండడమే దీనికి కారణం. బలాన్నిచ్చిన రంగాలివి... మేలో ఎగుమతులు మంచి పనితనాన్ని ప్రదర్శించడానికి పెట్రోలియం(25 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (8.25 శాతం), జౌళి (8 శాతం) అలాగే రత్నాలు, ఆభరణాల (6 శాతం) రంగాలు మంచి వృద్ధి రేటు సాధించడం కారణమయ్యింది. దిగుమతుల్లో ‘బంగారం’ భారం! మరోవైపు దిగుమతులు భారీగా పెరగడానికి బంగారం కూడా ఒక కారణంగా నిలిచింది. మే నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు మూడు రెట్లు పెరిగాయి. 2016 మే నెలలో 1.47 బిలియన్ డాలర్ల పసిడి దిగుమతులు జరిగితే, ఈ ఏడాది ఇదే నెలలో ఈ విలువ 4.95 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్–మే నెలల్లో... ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు– ఏప్రిల్–మే ఎగుమతులు 14 శాతం పెరిగి 49 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతులు 41 శాతం పెరిగాయి. 76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో వాణిజ్యలోటు దాదాపు 27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వృద్ధి ధోరణి కొనసాగుతుంది: కేంద్రం ఎగుమతుల వృద్ధి ధోరణి రానున్న నెలలోనూ కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్య మంత్రిత్వశాఖ వ్యక్తం చేసింది. భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. దేశ వృద్ధికి సంబంధించి తగిన సమయంలో ఎగుమతుల విభాగం నుంచీ మద్దతు లభిస్తుండడం హర్షణీయమని సమాఖ్య ప్రెసిడెంట్ గణేష్ గుప్తా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు సంవత్సరాల క్షీణతకు (అసలు వృద్ధిలేకపోగా దిగువముఖం) బ్రేక్ వేస్తూ, గడచిన ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 4.71 శాతం వృద్ధితో 262.3 బిలియన్ డాలర్ల నుంచి 274.64 బిలియన్ డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. జీఎస్టీ అమలు, విదేశీ వాణిజ్య విధానం సమీక్షతో భారత్ ఎగుమతులు మరింత పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా తెలిపారు. -
భారీగా పెరిగిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు మే నెలలో భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదేకాలంలో దిగుమతులతో పోలిస్తే నాలుగురెట్లు పెరిగి 2017 మే నెలలో 103 టన్నులను దిగమతి చేసుకుంది. మే 2016లో 25.3 టన్నుల దిగుమతులను రిపోర్ట్ చేసింది. 2017సం.రంలోని మొదటి అయిదునెలలో 144 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ కాలానికి బంగారం దిగుమతులు 424.1 టన్నులకు చేరుకున్నాయని జిఎఫ్ఎస్ఎం తాత్కాలిక డేటా వెల్లడించింది. ముఖ్యంగా జీఎస్టీ బిల్లు అంచనాలతో ఈ వృద్ధిని సాధించిన తాజా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ చివరి వారంలో అక్షయ తృతియ సందర్భంగా మంచి అమ్మకాలు నమోదైనట్టు థామ్సన్ రాయిటర్స్ విభాగం జీఎఫ్ఎం సీనియర్ విశ్లేషకుడు సుధీష్ నంబియాత్ సోమవారం చెప్పారు. ధరల తగ్గముఖం పట్టడంతో మే నెలలో పసిడి కొనుగోళ్లు పుంజుకున్నాయని కోల్తాలోని జె.జె. గోల్డ్ హౌస్ యజమాని హర్షద్ అజ్మార్ చెప్పారు. మే నెలలో రెండో వారంలో ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికలో ఇమ్మాన్యూల్ మాక్రోన్ విజయం సాధించిన నేపథ్యంలో బంగారం ధరలు ఎనిమిది వారాల కనిష్టానికి దిగజారాయి. మరోవైపు పుత్తడిపై జీఎస్టీ 3శాతం పన్ను రేటునిర్ణయంతో మార్కెట్లో జ్యువెల్లరీ కౌంటర్ లో డిమాండ్ పెట్టింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఈ షేర్లు మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా టైటన్ 17 శాతం దూసుకెళ్లగా ఇదే బాటలో పీసీ జ్యువెల్లర్స్, తార జ్యువెల్లరీ తదితర షేర్లు పయనించాయి. రెండవ అతి పెద్ద వినియోగదారుగా ఇండియా దిగుమతులు పెరగడంతో, ఆరు వారాల గరిష్ట వద్దున్న అంతర్జాతీయ ధరలకు మద్దతు ఇస్తుందని, అయితే దక్షిణాసియా దేశాల వాణిజ్య లోటును పెంచవచ్చని ఎనలిస్టుల అంచనా. కాగా పరిశ్రమల అంచనాలకు భిన్నంగా బంగారంపై జీఎస్టీ పన్నురేటును 3శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
అంతరిక్షంలో మేటి.. మరి రక్షణలోనో..!
అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న భారత్.. రక్షణ ఆయుధాల విషయంలో బాగా వెనుకబడింది. ప్రపంచంలోనే ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ప్రధమ స్ధానంలో నిలిచింది. గత ఐదేళ్లుగా ఇదే పొజిషన్లో భారత్ ఉంటోందని స్టాక్హోమ్కు చెందిన అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్ధ(ఎస్ఐపీఆర్ఐ) పేర్కొంది. 2012 నుంచి 2016 మధ్య ప్రపంచంలో ఎగుమతైన ఆయుధాల్లో 13శాతం భారతే దిగుమతి చేసుకున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని చెప్పింది. 2007-2011ల మధ్య ఇది 43 శాతంగా నమోదైనట్లు తెలిపింది. ఇది ప్రపంచదేశాలన్నింటిలో కల్లా చాలా ఎక్కువని చెప్పింది. సొంతంగా ఆయుధాలను తయారు చేసుకుంటూ చైనా ఆయుధాల దిగుమతిని చాలా వరకూ తగ్గించుకుందని తెలిపింది. కానీ భారత్ మాత్రం అందుకు విభిన్నంగా రష్యా, అమెరికా, యూరప్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాల్లాంటి దేశాలపై ఆయుధాల కోసం ఆధారపడుతోందదని చెప్పింది. కోల్డ్వార్ తర్వాతి నుంచి ఆయుధాల రంగంలో గుర్తించదగిన మార్పులు వచ్చినట్లు పేర్కొంది. భారత్ తర్వాత సౌదీ అరేబియా, ఖతార్లు ఆయుధాల దిగుమతిలో ముందున్నట్లు తెలిపింది. గతంతో పోలిస్తే 2012-2016ల మధ్య సౌదీ ఆయుధాల కొనుగోళ్లు 212 శాతం పెరగ్గా.. ఖతార్ కొనుగోళ్లు 245 శాతం పెరిగాయి. ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాల్లో అమెరికా ముందుంది. ప్రపంచంలో ఎగుమతి అవుతున్న ఆయుధాల్లో అమెరికా షేర్ మూడింట ఒక వంతుగా ఉంది. ఆ తర్వాతి స్ధానంలో రష్యా ఉంది. 2012-2016ల మధ్య ఆయుధాల ఎగుమతిలో రష్యా 23 శాతం వృద్ధిని చూసింది. రష్యా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న వారిలో భారత్, వియత్నాం, చైనా, అల్జీరియాలు వరుసగా ఉన్నాయని వెల్లడించింది. -
ఐదో నెలా ఎగుమతులు అప్..!
• జనవరిలో వృద్ధి 4.32%; 22 బిలియన్ డాలర్లు • దిగుమతుల విలువ 32 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా ఐదవనెలా వృద్ధిని నమోదుచేసుకున్నాయి. 2016 జనవరితో పోల్చిచూస్తే... 2017 జనవరిలో ఎగుమతులు 4 శాతం పైగా వృద్ధిని నమోదుచేసుకున్నాయి. విలువ 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతులు ఇదే నెలలో 11 శాతం పెరిగి 32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు – దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2016 జనవరిలో వాణిజ్యలోటు 7.66 బిలియన్ డాలర్లు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ జనవరిలో ఎగుమతుల పెరుగుదలలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ముడి ఇనుములది కీలకపాత్ర. ముడి ఇనుము ఎగుమతులు 10 శాతం పెరిగి 184 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ఈ రేటు 29 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఇంజనీరింగ్ ఉత్పత్తుల విషయంలో ఎగుమతులు 12 శాతం వృద్ధితో 6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ⇔ జనవరిలో ఎగుమతుల వృద్ధి డిసెంబర్ వృద్ధి రేటుకన్నా (5.72%) తక్కువ. ⇔ కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఎగుమతులు కేవలం 1 శాతం పెరిగి, విలువలో 221 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 108 బిలియన్ డాలర్ల నుంచి 86 బిలియన్ డాలర్లకు తగ్గింది. పసిడి వెలవెల...: మరోవైపు పసిడి దిగుమతులు జనవరిలో భారీగా 30 శాతం పడిపోయాయి. విలువలో కేవలం 2.04 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో జనవరిలో డిమాండ్ తగ్గడం పసిడి దిగుమతులపై ప్రధానంగా ప్రభావం చూపింది. డిసెంబర్లో సేవల ఎగుమతులు ఇలా... ఇదిలావుండగా, 2016 డిసెంబర్లో సేవల విభాగం నుంచి ఎగుమతులు 3 శాతం పెరిగాయి. విలువలో 14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2016 నవంబర్లో ఈ విభాగం నుంచి వృద్ధి రేటు 2 శాతం. -
భారీగా తగ్గిన పసిడి దిగుమతులు
ఏప్రిల్–నవంబర్ మధ్య 30 శాతం పైగా డౌన్ న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారీగా 30.5 శాతం పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో దిగుమతులు విలువ 22.64 బిలియన్ డాలర్లు కాగా తాజా సమీక్షాకాలంలో ఈ పరి మాణం 15.74 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత్ ఆర్థిక వ్యవస్థ కోణంలో కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– ఎఫ్ఐఐ, ఎఫ్డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికరవ్యత్యాసం)కు ఇది లాభించే అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం క్యాడ్ను చూస్తే, ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.1 శాతం (22.1 బిలియన్ డాలర్లు)గా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్–నవంబర్లలో రయ్: ఏప్రిల్ నుంచీ చూస్తే దిగుమతులు తగ్గినా... వరుసగా అక్టోబర్, నవంబర్లలో మాత్రం దిగుమతులు పెరిగినట్లు గణాంకాలు తెలిపారు. నవంబర్లో పసిడి దిగుమతులు ఒక్కసారిగా భారీగా23 శాతం పెరగడానికి (4.36 బిలియన్ డాలర్లు) పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్లకుబేరుల నుంచి పసిడి డిమాండ్ భారీగా ఉండడమేనన్న విశ్లేషణలూ ఉన్నాయి. -
పసిడి దిగుమతులు డౌన్
♦ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 55% తగ్గాయ్.. ♦ క్యాడ్ కట్టడికి దోహదం న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2016-17, ఏప్రిల్-సెప్టెంబర్) ఏకంగా 55 శాతం పడిపోయారుు. 7.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యారుు. ఇది కరెంట్ అకౌంట్ లోటుకు (క్యాడ్- ఎఫ్డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) సానుకూల అంశమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నారుు. 2015 ఇదే కాలంలో పసిడి దిగుమతుల విలువ 17.42 బిలియన్ డాలర్లు. ఒక్క సెప్టెంబర్లో చూస్తే, దిగుమతులు 10.3 శాతం పడిపోరుు, 1.8 బిలియన్ డాలర్లుగా నమోదరుునట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపారుు. 2015 సెప్టెంబర్లో క్యాడ్ 10.16 బిలియన్ డాలర్లుగా ఉందని, సెప్టెంబర్లో ఇది 8.33 శాతానికి పడిపోరుుందని పేర్కొన్న అత్యున్నత స్థారుు వర్గాలు, పసిడి దిగుమతులు పడిపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలిపారుు. 2014-15 పూర్తి సంవత్సరంలో క్యాడ్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.3 శాతం (26.8 బిలియన్ డాలర్లు). 2015-16లో ఇది 1.1 శాతానికి (22.1 బిలియన్ డాలర్లు) పడిపోరుుంది. పసిడి దిగుమతులకు సంబంధించి ప్రధాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2015-16లో దేశం 650 టన్నుల పసిడి దిగుమతులు చేసుకుంది. వెండి కూడా...: గణాంకాల ప్రకారం వెండి దిగుమతులు కూడా భారీగా పడిపోయారుు. 2015 సెప్టెంబర్ నెలతో పోల్చితే 2016 సెప్టెంబర్లో 71 శాతం పడిపోరుు, 484.74 మిలియన్ డాలర్ల నుంచి 139.16 మిలియన్ డాలర్లకు చేరారుు. -
భారీగా తగ్గిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: దేశీయ బంగారం దిగుమతులు గణనీయంగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై కాలంలో సుమారు 76శాతం దిగుమతులు తగ్గాయని భారతదేశ అసమాన జాతీయ పంపిణీ నెట్ వర్క్ (ఎంఎంటిసి - పీఏఎంపీ) వెల్లడించింది. ఈ క్వార్టర్ లో 60 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు బంగారం, వెండి, రిఫైనరీ ఎంఎంటీసీ-ప్యాంప్ తెలిపింది. అధిక ఎగుమతి సుంకాలు, ఇతర పన్నుల ప్రభావం బంగారం, వెండి దిగుమతులపై పడిందని వివరించింది. గత ఏడాది 250 టన్నులతో పోలిస్తే ఇది భారీ క్షీణత అని తెలిపింది. అయితే అనధికారికమార్గాలో దాదాపు 80 టన్నుల బంగారం దేశంలోకి వచ్చినట్టు పేర్కొంది. 10 శాతం దిగుమతి సుంకం కారణంగా ఈ పరిణామమని చెప్పింది. అలాగే ఈ నాలుగు నెలల్లో అనధికారిక మార్గాల ద్వారా బంగారం 80 టన్నుల దిగుమతి కావడాన్ని గమనించాలన్నారు. దీన్ని 3-4 శాతం తగ్గించకపోతే ఈ ధోరణి మరింత పెరిగే ప్రమాదముందని ఎంఎంటీసీ ఎండీ రాజేశ్ ఖోస్లా తెలిపారు. తమ సంస్థ దిగుమతులు కూడా గత ఏడాదితో పోలిస్తే 5 టన్నుల పడిపోయిందని నివేదించింది. ప్రపంచంలో బంగారంలో వినియోగంలో చైనా తర్వాత భారత్ నిలుస్తుంది. 2015-16 సం.రంలో 650 టన్నుల బంగారం దిగుమతితో రెండవ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. కాగా ఈ ఏడాది చివర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో డాలర్ స్ట్రాంగ్ కావడంతో గ్లోబల్ మార్కెట్లో క్షీణించిన బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఉదయం నష్టాల్లో నీరసంగా కదలాడిన పుత్తడి ధరలు శుక్రవారం బాగా పుంజుకున్నాయి. ఎంసీఎక్స్లో పది గ్రా. ల బంగారం ధర 133 రూపాయల లాభంతో 31,460 వద్ద ఉంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.05 పైసలు నష్టపోయింది. -
చైనా ఎగుమతులు, దిగుమతులు ఢమాల్!
బీజింగ్ : రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరున్న చైనాలో ఏప్రిల్ నెల ఎగుమతులు, దిగుమతులు పడిపోయాయి. అంచనాల కంటే చాలా తక్కువగా ఎగుమతులు, దిగుమతులు నమోదయ్యాయి. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఎగుమతులు 1.8శాతం పడిపోగా, దిగుమతులు 10.9శాతం పతనమయ్యాయని కస్టమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. వరుసగా 18సార్లు చైనాలో దిగుమతులు కిందకు జారాయి. దేశీయంగా డిమాండ్ ఆందోళనకరంగా ఉండటంతో దిగుమతులు పతనమయ్యాయని, కానీ మౌలిక సదుపాయాల కల్పన, మొదటి త్రైమాసికంలో రికార్డు రుణవృద్ధి ఉండటంతో చైనా ఆర్థికవ్యవస్థ మెల్లగా కోలుకుంటున్నదని కస్టమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆశాభావం వ్యక్తంచేసింది. విదేశాల్లో కూడా చైనా ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో ఎగుమతులు తగ్గినట్టు వెల్లడించింది. చైనాకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న అమెరికాకు గతేడాది కంటే ఈ ఏడాది ఎగుమతులు 9.6శాతం తగ్గాయని తెలిపింది. అయితే, చైనాకు రెండో అతిపెద్ద మార్కెట్ యూరోపియన్ యూనియన్ కు 3.2శాతం ఎగుమతులు పెరిగాయని గణాంకాలు విడుదలచేసింది. ఎగుమతులు 0.1శాతం, దిగుమతులు 5శాతం పడిపోతాయని మార్కెట్ ఆర్థిక నిపుణులు అంచనావేశారు. వారి అంచనాలకంటే ఎక్కువగా ఇవి నమోదయ్యాయి. చైనా ఉత్పత్తుల ఎగుమతులు పెంచడానికి, బ్యాంకు రుణాలను ప్రోత్పహించడం, ఎగుమతుల క్రెడిట్ ఇన్సూరెన్స్ పెంచడం, కొన్ని సంస్థలకు పన్ను మినహాయింపులు పెంచడం వంటి చర్యలను ఆ దేశ ప్రభుత్వం తీసుకుంటోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల చైనా ఆర్థిక వృద్ధి 6.7శాతంగా నమోదైనట్టు గణాంకాలు తెలిపాయి. -
ఎగుమతుల్లో కొనసాగుతున్న నిరుత్సాహం
వరుసగా 16 నెలా క్షీణతే... * మార్చిలో -5.47 శాతంగా నమోదు * 2015-16లో 16 శాతం పతనం న్యూఢిల్లీ: ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణ ధోరణి వరుసగా 16వ నెల మార్చిలోనూ కొనసాగింది. అసలు వృద్ధిలేకపోగా -5.47 శాతం క్షీణత నమోదయ్యింది. మొత్తం ఆర్థిక సంవత్సరం (2015-16, ఏప్రిల్-మార్చిలో 2015-15 ఇదే కాలంతో పోల్చితే) ఎగుమతుల్లో -16 శాతం క్షీణత నమోదయ్యింది. ఒక్క మార్చిని చూస్తే... ఎగుమతులు -5 శాతం క్షీణతతో 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా క్షీణ బాటలోనే ఉన్నాయి. - 22 శాతం పతనంతో 28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతి-దిగుమతుల మధ్య విలువ వ్యత్యాసం వాణిజ్యలోటు 5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం, ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల క్షీణత మొత్తం పరిణామంపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితి దీనికి కారణం. చమురు దిగుమతుల విలువ 36 శాతం క్షీణించి 5 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, చమురు యేతర దిగుమతుల విలువ 18 శాతం క్షీణతలో 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరంలో ఇలా... 2015-16 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ ఎగుమతులు 16 శాతం క్షీణించాయి. 310 బిలియన్ డాలర్ల నుంచి 261 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు కూడా ఇదే స్థాయిలో క్షీణించి 380 బలియన్ డాలర్లకు పడ్డాయి. దీనితో వాణిజ్యలోటు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో 119 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. బంగారం వెలవెల... కాగా మార్చిలో పసిడి దిగుమతులు 80 శాతం క్షీణించాయి. 5 బిలియన్ డాలర్ల నుంచి ఒక బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. 17వ నెలా మైనస్లోనే టోకు ద్రవ్యోల్బణం * మార్చిలో -0.85% నమోదు * క్రూడ్, తయారీ విభాగాల్లో తక్కువ ధరల పతనం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు మార్చిలోనూ అసలు పెరుగుదల లేకపోగా ‘మైనస్’ను నమోదుచేసుకుంది. ఈ నెలలో రేటు క్షీణతలో -0.85 శాతంగా నమోదయ్యింది. అంటే 2015 మార్చితో పోల్చితే 2016 మార్చిలో ధరల సూచీ అసలు పెరక్కపోగా... తగ్గిందన్నమాట. ఇటువంటి ధోరణి ఇది వరుసగా 17నెల. క్రూడ్, తయారీ విభాగాల ధరలు దిగువస్థాయిలో ప్రతిబింబించడం దీనికి ప్రధాన కారణం. కాగా కూరగాయలు, ఆహార ధరలు రానున్న నెలల్లో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సూచీ రానున్న నెలల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణుల వాదన. వార్షికంగా 3 విభాగాలూ వేర్వేరుగా.. ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్లో కూడిన ఈ విభాగం రేటు 2015 మార్చిలో క్షీణతలో -0.17 శాతంగా ఉంటే ఇప్పుడు ఈ రేటు 2.13 శాతానికి ఎగసింది. ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ రేటు 6.27 శాతం నుంచి 3.73 శాతానికి తగ్గింది. ఇక నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు -6.94 శాతం క్షీణత నుంచి 8.09 శాతం పైకి చేరింది. ఇంధనం, లైట్: ఈ రేటులో క్షీణ రేటు -12.23 శాతం నుంచి -8.30కి చేరింది. తయారీ: ఈ విభాగంలో క్షీణత రేటు సైతం -0.19 శాతం నుంచి 0.13 శాతానికి దిగింది. ప్రధాన ఆహార ఉత్పత్తుల ధరలు ఇలా... కూరగాయల ధరలు వార్షికంగా అసలు పెరక్కపోగా -2.26 శాతం తగ్గాయి. తృణ ధాన్యాల ధరలు 2.47 శాతం, పప్పు దినుసుల ధరలు 35 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 18 శాతం, పండ్ల ధరలు 2 శాతం తగ్గాయి. -
ఎగుమతులు 24% డౌన్
సెప్టెంబర్లోనూ మైనస్... ఈ ధోరణి వరుసగా 10వ నెల దిగుమతులూ 25 శాతం క్షీణత.. వాణిజ్యలోటు 10 బిలియన్ డాలర్లుగా నమోదు... న్యూఢిల్లీ: భారత ఎగుమతుల రంగానికి కష్టాలు తొలగిపోలేదు. 2014 సెప్టెంబర్ ఎగుమతులతో పోల్చితే 2015 సెప్టెంబర్లో ఎగుమతులు అసలు పెరక్కపోగా 24 శాతం పడిపోయాయి. విలువ రూపంలో ఎగుమతుల విలువ 22 బిలియన్ డాలర్లు. 2014 సెప్టెంబర్లో 29 బిలియన్ డాలర్లు. ఇలాంటి క్షీణ ధోరణి గడచిన 10 నెలలుగా నెలకొంది. పెట్రోలియం ప్రోడక్టులు, ముడి ఇనుము, ఇంజనీరింగ్ వస్తువులు వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులపై ‘అంతర్జాతీయ మాంద్యం’ ప్రభావం పడుతుండడం... ఈ రంగంలో ప్రతికూలతకు కారణం. ఇది ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక దిగుమతులూ 25 శాతం క్షీణించాయి. విలువ 43 బిలియన్ డాలర్ల నుంచి 32 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎగుమతుల- దిగుమతుల వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు సెప్టెంబర్లో 10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. తొలి ఆరు నెలల్లో చూస్తే... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) మొదటి ఆరు నెలలనూ చూస్తే (ఏప్రిల్-సెప్టెంబర్) ఎగుమతులు 18 శాతం క్షీణించి... 161 బిలియన్ డాలర్ల నుంచి 133 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు సైతం 15 శాతం తగ్గుదలతో 235 బిలియన్ డాలర్ల నుంచి 201 బిలియన్ డాలర్లకు క్షీణించింది. దీంతో ఈ వ్యవధికిగాను వాణిజ్యలోటు 74 బిలియన్ డాలర్ల నుంచి 68 బిలియన్ డాలర్లకు తగ్గింది. 46 శాతం పడిన బంగారం దిగుమతులు కాగా సెప్టెంబర్లో బంగారం దిగుమతులు 46 శాతం తగ్గాయి. ఈ విలువ 3.78 బిలియన్ డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. లక్ష్యం కష్టమే! గతేడాది (2014-15) దేశ ఎగుమతుల విలువ 310.5 బిలియన్ డాలర్లు. ఎగుమతుల విలువ 447.5 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 137 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది 325 బిలి యన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. అయితే తాజా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యం నెరవేరకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆదుకోవాలి: ఎఫ్ఐఈఓ ఎగుమతుల క్షీణ ధోరణి పట్ల భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్ ఎస్సీ రెల్హాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగుమతిదారులను ఆదుకునేం దుకు వడ్డీ సబ్వెన్షన్ (వడ్డీ రాయితీ) పథకం కొనసాగింపు వంటి చొరవలను తక్షణం అమలు చేయాలని కోరారు. -
ఎగుమతులు డీలా...
మే నెలలో 20శాతం క్షీణత - ఆరు నెలలుగా ఇదే ధోరణి - దిగుమతులూ 17 శాతం మైనస్సే - వాణిజ్యలోటు 10 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: ఎగుమతులు క్షీణిస్తూ... ఆర్థిక వ్యవస్థలోని నిరాశాజనక పరిస్థితిని మరోమారు స్పష్టంచేశాయి. అంతర్జాతీయ మందగమన ధోరణికి అద్దం పడుతూ, ఎగుమతులు ఏకంగా 20 శాతం క్షీణించాయి. దేశీయంగా డిమాండ్ లేకపోవటంతో దిగుమతులు సైతం 17 శాతం క్షీణించాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలివీ... - 2014 మేలో ఎగుమతుల విలువ 27.99 బిలియన్ డాలర్లు. 2015 మేలో ఈ విలువ 22.34 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంటే అసలు వృద్ధిలేకపోగా 20 శాతంపైగా క్షీణించాయన్నమాట. ఎగుమతుల విలువ తగ్గడానికి అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో పాటు, క్రూడ్ ధరలు కూడా దిగువ స్థాయిలో కొనసాగుతుండడం కారణం. దీనివల్ల పెట్రో ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తక్కువగా ఉన్నాయి. మెటల్, పలు కమోడిటీ ధరలు కూడా తగ్గాయి. - 2014 మే నెల్లో దిగుమతులు 39.23 బిలియన్ డాలర్లు. ఇవి 2015 మే నెలలో 32.75 బిలియన్ డాలర్లకు పడ్డాయి. అంటే అసలు పెరుగుదల లేకపోగా 17 శాతం క్షీణించాయి. 2014 ఫిబ్రవరి తరువాత దిగుమతులు ఇంత తీవ్ర స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. - వెరసి ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు 10.4 బిలియన్ డాలర్లుగా ఉంది. 2015 ఏప్రిల్ నెలలో ఈ పరిమాణం 11 బిలియన్ డాలర్లయితే, 2014 మే నెలలో ఈ విలువ 11.2 బిలియన్ డాలర్లుగా ఉంది. - మే నెలలో ప్రధాన ఎగుమతుల రంగాలైన పెట్రోలియం ప్రొడక్టులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్, కెమికల్స్ ప్రతికూల ఫలితాలను చూశాయి. - చమురు దిగుమతుల విలువ 40,97 శాతం తగ్గి 8.53 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చమురుయేతర దిగుమతుల విలువ సైతం 2.24 శాతం పడి, 24.21 బిలియన్ డాలర్లుగా ఉంది. - కాగా 2014 మేతో పోల్చితే బంగారం దిగుమతులు 10.47 శాతం పెరిగి 2,19 బిలియన్ డాలర్ల నుంచి 2.42 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రెండు నెలల్లో... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు- ఏప్రిల్, మేలలో ఎగుమతులు (గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోల్చి) 17 శాతం పడ్డాయి. విలువ 44.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 12 శాతం క్షీణించాయి. ఈ విలువ 65.8 బిలియన్ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 21.4 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరలేదు. 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యమయితే, 311 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రం జోక్యం అవసరం: ఎఫ్ఐఈఓ కాగా ఎగుమతుల క్షీణత కొనసాగుతున్న పరిస్థితుల పట్ల భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎస్సీ రల్హాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని, ఎగుమతిదారుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎగుమతులకు సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగితే... ఆర్థిక వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు- ఏప్రిల్, మేలలో ఎగుమతులు (గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోల్చి) 17 శాతం పడ్డాయి. విలువ 44.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 12 శాతం క్షీణించాయి. ఈ విలువ 65.8 బిలియన్ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 21.4 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరలేదు. 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యమయితే, 311 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రం జోక్యం అవసరం: ఎఫ్ఐఈఓ కాగా ఎగుమతుల క్షీణత కొనసాగుతున్న పరిస్థితుల పట్ల భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎస్సీ రల్హాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని, ఎగుమతిదారుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎగుమతులకు సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగితే... ఆర్థిక వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. -
పప్పుల మంట.. కూరగాయలతో తంటా!
రాష్ట్రంలో చుక్కలను తాకుతున్న ధరలు వర్షాభావంతో తగ్గిన సాగు.. పడిపోయిన దిగుమతులు 50శాతం వరకు పెరిగిన పప్పుల ధరలు.. రెండింతలైన కూరగాయల ధరలు కందిపప్పు, పెసరపప్పు ధరలన్నీ కిలో రూ.120పైనే టమాటా నుంచి చిక్కుడుదాకా రూ.40కి పైనే ధరల పెరుగుదలకు దోహదపడ్డ ఎంట్రీ ట్యాక్స్ హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలకు పప్పులు, కూరగాయల ధరలు తోడయ్యాయి.. జేబులన్నీ ఖాళీ చేసినా కొన్ని రోజులకు సరిపడా కూరగాయలు, పప్పులు కొనలేని పరిస్థితి నెలకొంది. పప్పుల ధరలు ఇప్పటికే కిలోకు రూ.120ని దాటిపోగా.. కూరగాయల ధరలు నిరుడితో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో పప్పుధాన్యాలు, కూరగాయల సాగు తగ్గిపోవడం, ఇతర రాష్ట్రాల నుంచీ సరఫరా తగ్గిపోవడం, వ్యాపారులు నిల్వలు పెంచేసుకుని కృత్రిమ కొరతను సృష్టించడం ఈ ధరాఘాతానికి కారణమవుతున్నాయి. మరోవైపు ఏపీ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణలో ప్రవేశపన్ను విధిస్తుండడం కూడా కూరగాయల ధరలు పెరగడానికి కారణమవుతోంది. తగ్గిన దిగుబడులు: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయలు, పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది. భూగర్భ జలాలు ఎన్నడూ లేనిరీతిలో అడుగంటడంతో బోర్ల కింద సాగు చతికిలపడింది. 2013-14లో (జూన్ వరకు) 6.25లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగుకాగా.. ఈసారి 4.75లక్షల ఎకరాలకు పడిపోయింది. పప్పుధాన్యాల సాగు సైతం 11.67లక్షల ఎకరాల నుంచి 7.72లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. దీంతో కూరగాయలు, పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీంతో మార్కెట్లో ప్రస్తుత డిమాండ్కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు కిలో రూ.35 నుంచి రూ.40 మధ్య ఉన్నాయి. ఇవి నిరుడితో పోలిస్తే రెట్టింపు కావడం గమనార్హం. పప్పుల మంట: ఇక రాష్ట్రంలో పప్పుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. పెసరపప్పు, కందిపప్పు కిలో రూ.130కి చేరుకోగా.. మినపపప్పు రూ.120 వద్ద ఉంది. చివరికి శనగపప్పు ధర కూడా కిలోకు రూ.70కి చేరుకుంటోంది. ఈ ధరలన్నీ కూడా గత ఏడాదితో పోలిస్తే.. 35 నుంచి 50శాతం మేర ఎక్కువకావడం ఆందోళనకరం. పప్పుధాన్యాల సాగు తగ్గిన నేపథ్యంలో... భవిష్యత్ డిమాండ్ను ముందుగానే ఊహించిన వ్యాపారులు భారీగా పప్పులను నిల్వచేయడం, కొద్దికొద్దిగా మార్కెట్లోకి విడుదల చేస్తూ ధరలను ఇష్టారీతిన నిర్ణయిస్తుండటంతో సామాన్యుడికి ధరాఘాతం తప్పడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి తగ్గిన సరఫరా ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి. సాధారణంగా కూరగాయలు రాష్ట్రంలోనే 32శాతం దాకా ఉత్పత్తవుతుండగా.. ఏపీ నుంచి 26 శాతం, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 42 శాతం దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలన్నిటా వర్షాభావం నేపథ్యంలో దిగుమతులు 30 శాతం వరకు తగ్గాయి. దీంతో కర్నూలు, అనంతపురం, మదనపల్లి నుంచి రావాల్సిన టమాటా, ప్రకాశం, గుంటూరు, అనంతపురం ప్రాంతాల నుంచి రావాల్సిన వంకాయ, బెంగళూరు, చిక్బల్లాపూర్ల నుంచి రావాల్సిన బెండకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు తదితరాల దిగుమతులు తగ్గిపోయాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. కూరగాయల ధరలు.. (కిలోకి రూ.లలో) టమాటా గత ఏడాది రూ.14 ప్రస్తుతం రూ. 32 వంకాయ గత ఏడాది రూ.8 ప్రస్తుతం రూ.28 బెండకాయ గత ఏడాది రూ. 15 ప్రస్తుతం రూ.40 పచ్చిమిర్చి గత ఏడాది రూ.16 ప్రస్తుతం రూ.42 గోరుచిక్కుడు గత ఏడాది రూ.18 ప్రస్తుతం రూ.40 చిక్కుడు గత ఏడాది రూ.30 ప్రస్తుతం రూ.35 బీరకాయ గత ఏడాది రూ.16 ప్రస్తుతం రూ.30 సొరకాయ గత ఏడాది రూ.6 ప్రస్తుతం రూ.20 క్యారెట్ గత ఏడాది రూ.22 ప్రస్తుతం రూ.38 క్యాప్సికం గత ఏడాది రూ.18 ప్రస్తుతం రూ.42 హైదరాబాద్కు కూరగాయల దిగుమతులు.. (క్వింటాళ్లలో) కూరగాయలు ఏప్రిల్ మే టమాటా 964 799 వంకాయ 79 59 బెండకాయ 101 125 పచ్చిమిర్చి 200 224 గోరుచిక్కుడు 94 91 చిక్కుడు 62 10 సొరకాయ 187 57 క్యారెట్ 1,220 1,098 క్యాప్సికం 419 345 -
కొండెక్కిన కూరగాయల ధరలు
-
వెజిట్రబుల్స్
- కొండెక్కిన కూరగాయల ధరలు - ఎండవేడిమికి తగ్గిన దిగుమతులు - వినియోగదారుల అవస్థలు విజయవాడ : కూరగాయల ధరలు కొండెక్కాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ధరలు బాగా పెరిగాయి. ఎండవేడిమి, వడగాడ్పులకు జిల్లాలో ఉత్పత్తులు గణనీయంగా తగ్గడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి టమోటా, బెండ, దొండ, వంకాయల ధరలు రోజుకో రేటుతో చుక్కలనంటుతున్నాయి. స్వరాజ్యమైదానం రైతుబజార్కు వారం రోజుల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గాయి. రోజూ ఇక్కడి రైతుబజార్కు 2,500 క్వింటాళ్ల కూరగాయలు ఉత్పత్తి అవుతుంటాయి. కొద్దిరోజుల నుంచి 1800 క్వింటాళ్లకు తగ్గాయి. దాదాపు 700 క్వింటాళ్ల కూరల ఉత్పత్తులు ఒక్క స్వరాజ్యమైదానం రైతుబజార్లోనే తగ్గాయి. ఇలాగే జిల్లాలోని 17 రైతుబజార్లలో పరిస్థితి ఉంది. వీటిలో రోజుకు దాదాపు 20వేల క్వింటాళ్ల ఉత్పత్తులు దిగుమతి అవ్వాల్సి ఉండగా, కేవలం 14వేల క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో రైతు బజార్లలో సరైన కూరలు లభ్యం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభావంతో ప్రయివేటు మార్కెట్లలో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. -
రక్షణ దిగుమతులకు స్వస్తి చెబుదాం
ఏరో ఇండియా ప్రదర్శనలో ప్రధాని మోదీ భారత్ అతిపెద్ద దిగుమతిదారు అనే పేరు పోవాలి ఇక్కడ ఉత్పత్తిచేసేందుకు విదేశీ కంపెనీలు ముందుకురావాలి బెంగళూరు: రక్షణ రంగంలో దిగుమతులకు స్వస్తి పలికాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ భద్రత దృష్ట్యా ఈ రంగంలో తమ ప్రభుత్వం స్వయంవృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతం సైనిక పరికరాలను దేశంలోనే తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. విదేశీ కంపెనీలు కేవలం పరికరాలు అమ్మేందుకే పరిమితం కాకుండా వ్యూహాత్మక భాగస్వాములుగా మారాలని, భారత్లో తయారీకి ముందుకు రావాలని సూచించారు. బుధవారం బెంగళూరులో 10వ ఏరో ఇండియా ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘రక్షణ పరికరాల దిగుమతుల్లో భారత్ నంబర్ వన్ అన్న పేరు చెరిగిపోవాలి. అందుకు వచ్చే ఐదేళ్లలో 70 శాతం పరికరాలు దేశీయంగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతున్నాం. ఇది సాకారమైతే 1.20 లక్షల నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టించవచ్చు. రక్షణ రం గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాం. అవసరమైతే దీన్ని ఇంకా పెంచుతాం’’ అని చెప్పారు. పరిశోధన, అభివృద్ధి విభాగాలకు పెద్దపీట క్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీటవేస్తోందని మోదీ తెలిపారు. రక్షణ వస్తువుల అభివృద్ధికి సంబంధించి ‘ప్రోటోటైప్’ తయారీకి అవసరమైన నిధుల్లో 80 శాతం వరకు ప్రభుత్వమే అందించేలా నూతన పథకాన్ని త్వరలో అమలు చేయనున్నామన్నారు. కొత్తగా ‘సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి నిధి’ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ విధానంతో విదేశీ కంపెనీలు మన దేశంలో వస్తు ఉత్పత్తికి ఆసక్తి కనబరుస్తున్నాయని మోదీ తెలిపారు. ఆకట్టుకున్న ప్రదర్శన: ‘ఏరో ఇండియా-2015’లో దేశ, విదేశాలకు చెందిన దాదాపు 650 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ నెల 22 వరకు సాగే ప్రదర్శనలో కోట్లాది రూపాయల విలువ చేసే వ్యాపార ఒప్పందాలు ఉంటాయని కేంద్రం భావిస్తోంది. వివిధ దేశాల అత్యాధునిక విమానాల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. భారత్కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, ధ్రువ్, రుద్ర హెలికాప్టర్ల పనితీరును అడిగి తెలుసుకునేందుకు విదేశీ ప్రతినిధులు ఆసక్తి చూపారు. -
వాణిజ్యలోటు జూమ్!
నవంబర్లో ఏడాదిన్నర గరిష్ట స్థాయి 16.8 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య ఉన్న నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు నవంబర్లో భారీగా పెరిగింది. ఇది 16.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సోమవారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, నవంబర్లో ఎగుమతులు 2013 ఇదే నెలతో పోల్చిచూస్తే, 7.27 శాతం వృద్ధితో 25.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు ఇదే నెలలో 26.79 శాతం పెరుగుదలతో 42.82 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితం దేశానికి 16.8 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడింది. ఇది దాదాపు ఏడాదిన్నర గరిష్ట స్థాయి. అక్టోబర్లో ఈ లోటు 13.4 బిలియన్ డాలర్లు. 2013 నవంబర్లో ఈ పరిమాణం 9.2 బిలియన్ డాలర్లు. తాజా సమీక్షా నెల నవంబర్లో చమురు దిగుమతులు 9.7 శాతం తగ్గి, 11.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చమురుయేతర దిగుమతుల విలువ 49.6 శాతం వృద్ధితో 31.10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎనిమిది నెలల్లో... కాగా 2014 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ గడిచిన ఎనిమిది నెలల్లో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఎగుమతుల విలువ 5.02 శాతం వృద్ధితో 215.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 4.65 శాతం వృద్ధితో 316.37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 100.61 బిలియన్ డాలర్లుగా ఉంది. -
సగానికి పడిపోనున్న ఆహారధాన్యాల ఉత్పత్తి
-
దిగుబడులు అంతంతే!
సగానికి పడిపోనున్న ఆహారధాన్యాల ఉత్పత్తి ఖరీఫ్లో 75 శాతానికి దిగజారిన వరి పంటలు 68 శాతానికే పరిమితమైన పప్పుధాన్యాల సాగు రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్లే దుస్థితి వ్యవసాయ శాఖ నివేదికలో తాజా అంచనాలు సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. నెలాఖరుతో సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో పంటల సాగు సాధారణం కన్నా 20 శాతం తక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ఈసారి రుతుపవనాలు నిర్ణీత సమయంలో రాకపోవడమే ఇందుకు కారణం. చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన పంటల పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. ఫలితంగా ఖరీఫ్లో ఆహారధాన్యాల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ ఆందోళన చెందుతోంది. అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్లో రాష్ర్టంలో 20.60 లక్షల హెక్టార్లలో ఆహారధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. 16.41 లక్షల హెక్టార్లలోనే(80%) పంటలను వేశారు. అందులో వరి 10.04 లక్షల హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా.. 7.53 లక్షల హెక్టార్లకే(75%) పరిమితమైంది. ఇక పప్పుధాన్యాలు 4.92 లక్షల హెక్టార్లకు బదులు కేవలం 3.35 లక్షల హెకార్టలో(68%) సాగవుతోంది. ఈ మేరకు పంటల పరిస్థితిపై వ్యవసాయ శాఖ బుధవారం తాజా నివేదికను విడుదల చేసింది. నూనె గింజల సాగు మాత్రం 119 శాతం జరిగిందని పేర్కొంది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఆలస్యంగా పంటలు వేయడంతో దిగుబడి భారీగా తగ్గవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖరీఫ్లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 66.37 లక్షల టన్నులు. అందులో వరి 57.31 లక్షల టన్నులు కాగా, పప్పుధాన్యాల లక్ష్యం 3.22 లక్షల టన్నులు, నూనెగింజల లక్ష్యం 5.58 లక్షల టన్నులుగా ఉంది. అయితే ఈసారి దిగుబడులు ఇందులో సగానికి పడిపోయే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 316 మండలాల్లో లోటు వర్షపాతం ఇటీవల కొంతమేర వర్షాలు కురిసినా.. అంతకుముందు జూన్, జూలై నెలల్లో సరైన వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో వర్షపాతం కొరత ఇంకా ఎక్కువగానే ఉంది. ఇప్పటికీ 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 8 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. కేవలం రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోనే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మండలాలవారీగా పరిశీలిస్తే 316 మండలాల్లో వర్షపాతం కొరత ఉంది. 19 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. కేవలం 106 మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. 23 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికంగా 16 మండలాలు మహబూబ్నగర్ జిల్లాలోనివే. రంగారెడ్డిలో 4, వరంగల్లో రెండు మండలాలు ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు పెద్దగా పెరగలేదు. ఇప్పటికీ తెలంగాణలో గత ఏడాదితో పోల్చితే సాధారణం కన్నా 2.17 మీటర్ల అదనపు లోతులోనే జలాలు ఉన్నాయి. లోటు వర్షపాతం కారణంగా చెరువులు పెద్దగా నిండకపోవడంతో రబీ పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. -
‘వాణిజ్య’ మనీ ల్యాండరింగ్పై సిట్ కన్ను!
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి మనీ ల్యాండరింగ్ (విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించడం, తీసుకురావడం)కు పాల్పడుతున్న ఘటనలపైనా సుప్రీం కోర్టు నల్లధనంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దృష్టి పెట్టింది. త్వరలో జరిగే సిట్ భేటీలో ఈ అంశంపై చర్చించి, చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్ కేంద్రంగా ఎగుమతులు, దిగుమతుల పేరిట తప్పుడు, నకిలీ పత్రాలను తయారుచేసి భారీగా సొమ్మును విదేశాలకు పంపడం, స్వదేశానికి తీసుకురావడం జరుగుతున్నట్లు డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుర్తించింది. -
ఎలక్ట్రానిక్స్ రంగానికి వరాలు !
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వృద్ధికి దోహదపడే పలు చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారని ఈ పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనల కారణంగా దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ జోరు పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆ వర్గాలు అంటున్నాయి. 1. టెలికాం, ఐటీ ఉత్పత్తుల దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ(బీసీడీ)ని విధింపు. దేశీయ ఉత్పత్తికి ఊతమివ్వడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం లక్ష్యాలుగా ఈ చర్య తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్ 1లో లేని ఐటీ, టెలికాం ఉత్పత్తులకు ఈ సుంకం వర్తిస్తుంది. ఈ చర్య కారణంగా వీఓఐపీ ఫోన్లు, కొన్ని టెలికాం నెట్వర్క్ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. 2. పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై ప్రస్తుతం విధిస్తున్న 4 శాతం స్పెషల్ అడిషనల్ డ్యూటీ(ఎస్ఏడీ)ను తొలగించారు. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై విద్యా సుంకాన్ని విధించారు. ఫలితంగా దేశీయంగా తయారయ్యే ఉత్పత్తుల ధర, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ధర ఒకే విధంగా ఉంటుంది. 3. కలర్ పిక్చర్ ట్యూబ్లపై దిగుమతి సుంకం తొలగింపు. దీంతో వీటి ధరలు మరింతగా తగ్గుతాయి. 4. 19 అంగుళాల లోపు ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల తయారీలో ఉపయోగపడే స్క్రీన్లపై 10 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. ఫలితంగా వీటి ధరలు తగ్గుతాయి. 5. ఒక ఏడాదిలో రూ. 25 కోట్లకు మించిన పెట్టుబడులపై 15% మూలధన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఫలి తంగా ఎంఎస్ఎంఈలో పెట్టుబడుల పెరుగుతాయి. -
తుదిమెరుగుల్లో...బల్క్ డ్రగ్ పాలసీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: దేశంలోనే బల్క్ డ్రగ్ రాజధానిగా వెలుగొందుతున్న హైదరాబాద్కు మళ్లీ పూర్వ వైభవం రానుంది. బల్క్డ్రగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న విద్యుత్, ఎక్సైజ్, రెగ్యులేటరీ సంబంధిత పలు సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా త్వరలో బల్క్ డ్రగ్ పాలసీని కేంద్ర ప్రభుత్వం రూపొందించనుందని బల్క్డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎమిరటస్ ఎం. నారాయణ రెడ్డి తెలిపారు. బల్క్డ్రగ్గా వ్యవహరించే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) తయారుచేసే డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, గ్రాన్యూల్స్, దివీస్ ల్యాబొరేటరీస్ తదితర కంపెనీలు దేశంలో అత్యధికంగా హైదరాబాద్ నగరంలో విస్తరించి ఉన్నాయి. రూ. 79,000 కోట్ల ఫార్మా మార్కెట్లో ఏపీఐల వాటా పది శాతం పైగానే ఉంటోంది. హైదరాబాద్ తర్వాత గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఈ పరిశ్రమ విస్తరించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ఎజెండాలో భాగంగా బల్క్ డ్రగ్ విధానంపై తొలి ముసాయిదాను రూపొందించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు నారాయణరెడ్డి చెప్పారు. ఈ ముసాయిదా రూపకల్పనలో భాగంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆరవ చివరి సమావేశంలో పాల్గొన్నప్పుడు పలు అంశాలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ (డీఓపీ) ముందుంచామని ఆయన తెలిపారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలి... బల్క్డ్రగ్స్ ఉత్పత్తిలో చైనా పోటీని తట్టుకొని నిలబడే విధంగా పాలసీని రూపొందించినపుడే దేశీయ కంపెనీలు మనుగడ సాగించగలవని, చైనా డంపింగ్కు అడ్డుకట్ట వేసే విధంగా విధాన రూపకల్పన జరగాలని తాము సూచించామన్నారు. చైనా నుండి దిగుమతి అయిన బల్క్డ్రగ్స్ ల్యాండెడ్ వ్యయం దేశంలో ఉత్పత్తి అయ్యే ఖర్చుతో పోలిస్తే 15-20 శాతం తక్కువగా ఉంటోందన్నారు. దీంతో చైనా ఉత్పత్తులతో మన కంపెనీలు పోటీ పడలేక పోతున్నాయని, మన కంపెనీలకు అడ్వాంటేజ్ కలిగే దిశగా కొత్త పాలసీలో ప్రభుత్వం విధాన ప్రకటన చేయాలని సూచించామన్నారు. దేశంలో 500కి పైగా వివిధ రకాల బల్క్డ్రగ్స్ ఉత్పత్తి అవుతున్నాయని, వీటికి పర్యావరణ అనుమతులు పొందడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఉదాహరణకు ఒక బల్క్డ్రగ్కు పర్యావరణ అనుమతి దరఖాస్తు చేసిన ఆరునెలల్లోగా మంజూరు చేయాలని నిబంధనలున్నా వాస్తవంగా దీనికి నాలుగు ఏళ్లు పడుతోందన్నారు. బల్క్డ్రగ్స్ రంగంలో చిన్న పరిశ్రమలు వందల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని, అయితే దీనికి అనుగుణంగా కామన్ ఎఫ్ల్యూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎగుమతులు మిస్
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు రివర్స్గేర్లోకి జారాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఎగుమతులు 3.15 శాతం క్షీణించి 29.57 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోపక్క, దిగుమతులు సైతం 2.11 శాతం తగ్గుదలతో 40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక వాణిజ్య లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) మార్చి నెలలో స్వల్పంగా తగ్గి 10.5 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 10.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మార్చిలో ఎగుమతులు తగ్గడానికి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇతర కారకాలతో పాటు దేశీయంగా తయారీ రంగం పేలవ పనితీరూ కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అంతంతమాత్రంగానే ఉందని, వచ్చే నెలల్లో మెరుగుపడవచ్చని భారతీయ ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ వ్యాఖ్యానించారు. లక్ష్యానికి కొద్దిగా దూరంలో... గడిచిన 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 325 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా 312 బిలి యన్ డాలర్లు మాత్రమే ఎగుమతులు జరిగాయి. అంటే లక్ష్యానికి 13 బిలియన్ డాలర్లు తగ్గాయి. అయితే, 2012-13లో నమోదైన 300 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే దాదాపు 4 శాతం వృద్ధి నమోదైంది. ఇక దిగుమతులు 2012-13తో పోలిస్తే 8.11% తగ్గుదలతో 451 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 139 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. 2012-13లో వాణిజ్య లోటు 190 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనికి ప్రధానంగా వెండి, బంగారం దిగుమతులు భారీగా దిగిరావడమే కారణం. పుత్తడి-వెండి దిగుమతులు 40% డౌన్... గతేడాది(2013-14)లో వాణిజ్య లోటు కట్టడికి ప్రధానంగా బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గడమే కారణం. ఈ రెండు విలువైన లోహాల దిగుమతులు 40% మేర క్షీణించి 33.46 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన కస్టమ్స్ సుంకం పెంపు(10%కి) ఇతరత్రా ఆంక్షలు వీటికి కళ్లెం వేసేందుకు దోహదపడ్డాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు లోహాల దిగుమతుల విలువ 55.79 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక ఈ ఏడాది మార్చిలో బంగారం, వెండి దిగుమతుల విలువ 2.75 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో 3.33 బిలియన్ డాలర్లతో పోలిస్తే 17.27% దిగుమతుల విలువ తగ్గడం గమనార్హం. -
బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించాలి
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై ఆంక్షలను తొలగించాలని కేంద్ర వాణిజ్య శాఖ కోరింది. దిగుమతులపై ఆంక్షలతో పసిడి లభ్యత తగ్గిపోయి స్మగ్లింగ్ పెరుగుతుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ మంగళవారం ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కరెంటు అకౌంటు లోటు (క్యాడ్)ను అదుపు చేసే చర్యల్లో భాగంగా కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. ఇలాంటి ఆంక్షలను వాణిజ్య శాఖ ఎన్నడూ సమర్థించలేదని ఖేర్ చెప్పారు. ఆంక్షలను దీర్ఘకాలం కొనసాగించడం సబబుకాదనీ అన్నారు. పసిడి దిగుమతుల టారిఫ్ తగ్గింపు బంగారం దిగుమతి విలువను(ఇంపోర్ట్ టారిఫ్) ప్రభుత్వం 10 గ్రాములకు 421 డాలర్లకు సవరించింది. ఈ ధర ఆధారంగా దిగుమతులపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని విధించే సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగారం విలువను 445 డాలర్లుగా నిర్ధారించి సుంకం అమలు చేస్తున్నారు. ఇదే విధంగా వెండి దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని సైతం తగ్గించిం ది. ఇప్పటివరకూ వెండి దిగుమతులపై కేజీ విలువను 694 డాలర్ల చొప్పున లెక్కిస్తూ సుంకాన్ని విధిస్తుండగా ప్రస్తుతం ఈ విలువను 644 డాలర్లకు తగ్గించింది. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: కొద్ది నెలల్నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న భారత్ ఎగుమతులు ఫిబ్రవరి నెలలో హఠాత్తుగా తగ్గాయి. అయితే బంగారం, వెండి దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు సైతం తగ్గింది. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు ఇవీ... 2014 ఫిబ్రవరి ఎగుమతుల్లో (2013 ఫిబ్రవరితో పోల్చితే) అసలు వృద్ధిలేకపోగా - 3.67 క్షీణత నమోదయ్యింది. అంటే 2014 ఫిబ్రవరిలో భారత ఎగుమతుల విలువ 25.68 బిలియన్ డాలర్లు. ఈ పరిమాణం 2013 ఫిబ్రవరిలో 26.66 బిలియన్ డాలర్లు. ఇలాంటి పరిస్థితి (అసలు వృద్ధిలేకపోగా క్షీణత) నమోదుకావడం 8 నెలల్లో ఇదే మొదటిసారి. ఎగుమతుల బాస్కెట్లో ముఖ్యమైన పెట్రోలియం, ఇంజనీరింగ్, ఫార్మా వంటి కీలక రంగాలు ఫిబ్రవరిలో డీలాపడిపోయి క్షీణతను నమోదుచేసుకున్నాయి. ఇక దిగుమతుల విషయానికి వస్తే... దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఇవీ క్షీణతలోనే కొనసాగుతున్నాయి. వార్షికంగా చూస్తే (-) 17.09 శాతం క్షీణతతో 40.79 బిలియన్ డాలర్ల నుంచి 33.81 బిలియన్ డాలర్లకు పడ్డాయి. చమురు దిగుమతులు 3.1 శాతం క్షీణించి 13.60 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు ఫిబ్రవరిలో 24.5 శాతం పడిపోయి, దాదాపు 20.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ నెలలో దిగుమతులు-ఎగుమతులకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు సానుకూల రీతిలో 8.13 బిలియన్ డాలర్లు (2013 ఫిబ్రవరిలో 14.8 బిలియన్ డాలర్లు) ఉంది. ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. విదేశీ కరెన్సీలలో రూపాయి కదలికల నిర్దేశంలో ఒక ప్రధాన కారణంగా నిలిచే కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్)కు ఇది కలిసివచ్చే అంశం. ఒక నిర్దిష్ట యేడాదిలో క్యాపిటల్ ఇన్ఫ్లోస్ (ఎఫ్ఐఐ, ఎఫ్డీఐ, ఈసీబీ) మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్గా పరిగణిస్తాం. 2013-14లో ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 3 శాతంకన్నా తక్కువగానే ఉంటుందని (40 బిలియన్ డాలర్ల లోపు) ఆర్థికమంత్రి ఇప్పటికే స్పష్టంచేశారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు జీడీపీలో 4.8 శాతం (88 బిలియన్ డాలర్లు). 11 నెలల వ్యవధిలో... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య ఎగుమతులు కేవలం 4.79 శాతం వృద్ధితో 282.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే దిగుమతులు మాత్రం క్షీణతలో (-8.65శాతం) 410.86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్యలోటు 128 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద దిగుమతుల విలువ 491.4 బిలియన్ డాలర్లుకాగా, ఎగుమతుల విలువ 300.6 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 190.9 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం 325 బిలియన్ డాలర్లు. కాగా ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో చమురు యేతర దిగుమతుల విలువ 13.4% పడిపోయి 260.23 బిలియన్ డాలర్లుగా ఉంది. చమురు దిగుమతుల విలువ మాత్రం స్వల్పంగా 0.8% వృద్ధితో 150. 63 బిలియన్ డాలర్లుగా నమోదైంది. లక్ష్య సాధన కష్టమే! ఇదిలావుండగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 325 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యానికి మనం ఇంకా 20 బిలియన్ డాలర్ల దూరంలో ఉండిపోయే అవకాశం ఉందని ప్రధాన ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈఓ అధ్యక్షుడు రఫీక్ అహ్మద్ పేర్కొన్నారు. రుణ లభ్యత ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. డ్యూటీ రిఫండ్ క్లెయిమ్స్ బకాయిలు రూ.20,000 కోట్లు ఉన్నట్లు కూడా తెలిపారు. గ్లోబల్ డిమాం డ్ ఉన్నప్పటికీ, క్రెడిట్ పరమైన ఇబ్బందులు ఉండడం వల్లే మన ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన చెప్పారు. పుత్తడి దిగుమతుల కట్టడి క్యాడ్ కట్టడిలో భాగంగా కేంద్రం బంగారం-వెండి దిగుమతులపై కొనసాగిస్తున్న ఆంక్షలు కూడా వాణిజ్యలోటు తగ్గడానికి ఒక కారణం. ఏడాది కాలంలో బంగారం, వెండి దిగుమతుల విలువ భారీగా 71.42 శాతం పడిపోయింది. 2013 ఫిబ్రవరిలో ఈ విలువ 5.7 బిలియన్ డాలర్లు ఉండగా, 2014 ఫిబ్రవరిలో 1.63 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో (2012-13 ఇదే కాలంతో పోల్చితే) రెండు విలువైన మెటల్స్ దిగుమతుల రేటు 41.47 శాతం పడిపోయి 52.4 బిలియన్ డాలర్ల నుంచి 30.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఆంక్షల సడలింపును ఆలోచిస్తున్నాం: కేంద్రం ఇదిలావుండగా... బంగారం దిగుమతులపై కొనసాగుతున్న ఆంక్షలను సడలించే అంశాలను పరిశీలిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ విషయంపై ఆర్థికమంత్రిత్వశాఖ అధికారులతో చర్చిస్తున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు, క్యాడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీతో పోల్చితే ఆరేళ్ల కనిష్ట స్థాయి 2 శాతం ఉంటుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేసింది. అయితే దిగుమతులు పెరగడం వల్ల వచ్చే యేడాది ఇది తిరిగి 2.7 శాతానికి ఎగసే అవకాశం ఉందనీ అభిప్రాయపడింది. -
ఎగుమతుల మందగమనం
డిసెంబర్: భారత ఎగుమతుల వృద్ధి వేగం తగ్గింది. డిసెంబర్లో ఈ రేటు కేవలం 3.49%గా నమోదయ్యింది. ఇది 6 నెలల కనిష్ట స్థాయి. విలువ పరంగా చూస్తే డిసెంబర్లో ఎగుమతులు విలువ 26.34 బిలియన్ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు పడిపోవడం మొత్తం వృద్ధి స్పీడ్ తగ్గడానికి కారణమని వాణిజ్య కార్యదర్శి ఎస్ఆర్ రావు తెలిపారు. 2012 డిసెంబర్లో ఎగుమతుల విలువ 25.45 బిలియన్ డాలర్లు. దిగుమతులు ఇలా.. ఇక డిసెంబర్ నెలలో దిగుమతులు 15.25% పడిపోయాయి. 2012 డిసెంబర్లో ఎగుమతుల విలువ 43.05 బిలియన్ డాలర్లయితే, ఈ విలువ 2013 డిసెంబర్లో 36.48 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు మొత్తంగా ఎగుమతులు-దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు డిసెంబర్లో 10.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2012 ఇదే నెలలో ఈ లోటు 17.6 బిలియన్ డాలర్లు. బంగారం, వెండి ఎఫెక్ట్ దిగుమతులు భారీగా తగ్గడం, దీనితో వాణిజ్యలోటు తగ్గడం వంటి అంశాలపై బంగారం, వెండి మెటల్స్ ప్రభావం పడింది. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి దిగుమతి సుంకాల పెంపుసహా ప్రభుత్వం కొనసాగిస్తున్న పలు కఠిన చర్యల నేపథ్యంలో బంగారం, వెండి దిగుమతులు డిసెంబర్లో కేవలం 1.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2012 ఇదే నెలలో ఈ విలువ 5.6 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు ఈ దిగుమతుల రేటు 69 శాతం పడిపోయిందన్నమాట. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలాన్ని చూస్తే బంగారం, వెండి దిగుమతుల విలువ 30 శాతానికి పైగా పడిపోయాయి. 2012 ఇదే కాలంలో ఈ విలువ 39.2 బిలియన్ డాలర్లయితే 2013 ఇదే నెలల్లో ఈ విలువ 27.3 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ఇక చమురు దిగుమతులు 1.1 శాతం వృద్ధితో 13.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 9 నెలల్లో: కాగా ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో ఎగుమతులు 5.94 శాతం వృద్ధితో 217 బిలియన్ డాలర్ల నుంచి 230 డాలర్లకు పెరిగాయి. దిగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6.55 శాతం క్షీణత(-)తో 364 బిలియన్ డాలర్ల నుంచి 340.37 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 110 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. తొమ్మిది నెలల కాలంలో చమురు దిగుమతుల విలువ 2.6శాతం పెరుగుదలతో 124.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, చమురు రహిత వస్తువుల దిగుమతుల విలువ 11.1శాతం పడిపోయి 215.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం (2012-13) మొత్తంలో దేశం మొత్తం ఎగుమతుల విలువ 300 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 491 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 190 బిలియన్ డాలర్లు. 2013-14లో భారత్ ఎగుమతుల లక్ష్యం 325 బిలియన్ డాలర్లు. -
ఎగుమతులు తగ్గినా... లోటు ఓకే
న్యూఢిల్లీ: భారత ఎగుమతుల వృద్ధి 2013 నవంబర్ నెలలో కొంత నిరాశను మిగిల్చింది. 2012 ఇదే నెలతో పోల్చితే వృద్ధి రేటు కేవలం 5.86 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది 24.61 బిలియన్ డాలర్లు. ఎగుమతులు ఇంత తక్కువ స్థాయిలో జరగడం ఐదు నెలల్లో ఇదే తొలిసారి. 2012 నవంబర్లో ఈ విలువ 23.25 బిలియన్ డాలర్లు. 2013 అక్టోబర్లో 27.27 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతుల విషయానికి వస్తే- 16.3 శాతం తగ్గాయి (2012 నవంబర్తో పోల్చితే). విలువ రూపంలో ఈ పరిమాణం 33.83 బిలియన్ డాలర్లు (2011 మార్చి తరువాత ఇంత తక్కువ స్థాయి దిగుమతుల పరిమాణం నమోదు ఇదే తొలిసారి). 2012 ఇదే నెలలో ఈ పరిమాణం 40.54 బిలియన్ డాలర్లు. దీనితో ఎగుమతులు-దిగుమతులు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు నవంబర్లో 9.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సెప్టెంబర్లో 6.7 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు, మళ్లీ సింగిల్లో ఉండడం 2013-14లో ఇది రెండవసారి. ఎగుమతులు ఎందుకు తగ్గాయ్... పెట్రోలియం ఉత్పత్తులు, రఫ్ డైమండ్స్-ఆభరణాలు-రత్నాలు, ఔషధాల ఎగుమతులు తగ్గడంతో మొత్తంగా వృద్ధి రేటుపై ప్రతికూలత చూపిందని బుధవారం విడుదల చేసిన గణాంకాల సందర్భంగా వాణిజ్య కార్యదర్శి ఎస్ఆర్ రావు వెల్లడించారు. ఆయా అంశాల గురించి రావు వివరిస్తూ, రఫ్ డెమైండ్స్ ధరల్లో పెరుగుదల వల్ల ఈ గ్రూప్ మొత్తం ఎగుమతులపై ప్రభావం చూపినట్లు తెలిపారు. నిర్వాహణా పరమైన సమస్యల కారణంగా రెండు రిఫైనరీలు పనిచేయకపోవడం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని దేశీయ నియంత్రణల వల్ల ఫార్మా ఎగుమతులు తగ్గాయని రావు తెలిపారు. 8 నెలల్లో ఇలా... కాగా 2013-14 తొలి 8 నెలల కాలంలో (ఏప్రిల్-నవంబర్) ఎగుమతులు 6.27 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 191.95 బిలియన్ డాలర్ల నుంచి 203.98 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇది దిగుమతుల్లో అసలు పెరుగుదల లేకపోగా, ఇవి 5.39 శాతం క్షీణించాయి. అంటే గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ విలువ 321.19 బిలియన్ డాలర్ల నుంచి 303.89 డాలర్లకు తగ్గాయి. దీనితో వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. 2013-14లో ఈ లోటు191 బిలియన్ డాలర్లు. బంగారం, వెండి ఎఫెక్ట్ బంగారం, వెండి దిగుమతులు తగ్గడం మొత్తం వాణిజ్యలోటుపై సానుకూల ప్రభావం చూపిందని రావు పేర్కొన్నారు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా నవంబర్లో బంగారం, వెండి దిగుమతులు 80.49శాతం పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలలో 5.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ విలువ 2013 నవంబర్లో 1.05 బిలియన్ డాలర్లకు చేరింది. చమురు దిగుమతులు సైతం 1.1 శాతం పడిపోయి 12.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్యాపిటల్ ఇన్ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ విలువ మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్గా వ్యవహరిస్తాం. రూపాయి క్షీణతకు ప్రధాన కారణాల్లో ఒకటైన ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులను కట్టడి చేసింది. దీనితో ఈ దిగుమతులు జూన్ నుంచీ భారీగా తగ్గుతూ వచ్చాయి. ఫలితం వాణిజ్యలోటు తగ్గుదలపై తద్వారా క్యాడ్ కట్టడిపై ప్రభావం చూపుతూ వచ్చింది. కాగా ఢిల్లీలో జరిగిన ఒక ఆర్థిక సదస్సులో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చీఫ్ సీ రంగరాజన్ మాట్లాడుతూ, ఏడాదికి 30 బిలియన్ డాలర్ల వరకూ బంగారం దిగుమతులు భారత్కు తగిన స్థాయని వివరించారు. -
పసిడిపై మోజు వల్ల ఎన్ని తిప్పలు!
దేశంలోకి బంగారం దిగుమతులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడంలేదు. దిగుమతి సుంకాన్ని పెంచారు. ప్రయోజనంలేదు. ఇప్పుడు మళ్లీ పెంచారు. బంగారం, వెండి ఆభరణాల దిగుమతి సుంకం ప్రస్తుత 10 శాతంగా ఉంది. దానిని 15 శాతానికి పెంచారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆభరణాల విలువ మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, దేశీయ పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బంగారు ఆభరణాలపై రుణ నిబంధనలనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠినతరం చేసింది. ఈ చర్యల ద్వారా ఫలితాలు కనిపించే అవకాశాలు తక్కువ. బంగారానికి మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తరతరాలుగా బంగారాన్ని నమ్ముకున్న జాతి మనది. దురదృష్టమేమిటంటే మన దేశంలో బంగారం ఉత్పత్తి నామమాత్రమే. మనం కొత్తగా వాడుకునే బంగారం మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. పసిడిపై మోజు ఎన్నో తిప్పలు తెస్తోంది. మనవారు వ్యయప్రయాసలకు ఓర్చి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడి డాలర్లు సంపాదించినా, వాటిలో కొంత మొత్తం బంగారం తినేస్తోంది. అంటే పసిడి కోసం ఖర్చయిపోతోంది. ప్రతి ఏటా మన దేశం 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం 50 బిలియన్ డాలర్ల దాకా ఖర్చవుతోంది. ఫలితంగా కరెంట్ అకౌంట్ లోటు విపరీతంగా పెరిగిపోతుంది. కరెంట్ అకౌంట్ తీవ్రలోటుకు గురి చేస్తున్న బంగారం దిగుమతులు తగ్గించడానికి ప్రభుత్వ తీసుకునే చర్యలు ఏవీ సరైన ఫలితాలను ఇవ్వడంలేదు. బంగారం దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తున్నాయి. పైగా విలువైన విదేశీమారక ద్రవ్యం ఖర్చయిపోతుంది. బ్యాంకులు తాము అమ్మిన నాణేలను తిరిగి కొనుగోలు చేయకూడదని ఆర్బిఐ నిబంధన విధించింది. ఈ నాణేలను తిరిగి కొనుగోలు చేస్తే బంగారం దిగుమతులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు కొంతకాలంగా సూచిస్తున్నారు. ప్రభుత్వం గానీ, రిజర్వు బ్యాంకు గానీ ఇతర రకాల ఆంక్షలు విధిస్తున్నాయిగానీ ఆ దిశగా ఆలోచన చేయడంలేదు. బ్యాంకుల నుంచి కొనుగోలు చేసిన బంగారు నాణేలను తిరిగి బ్యాంకులు కొనుగోలు చేసుందుకు అనుమతించాలని ఎప్పటి నుంచో వినియోగదారులు కూడా కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రజలు బ్యాంకు ద్వారా సులభంగా నాణేలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వాటిని తిరిగి అమ్మడానికి మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటుగా అమ్మడం వల్ల కొన్ని సందర్భాలలో వారు పూర్తి విలువను పొందలేకపోతున్నారు. బ్యాంకులు గనుక నాణేలు కొంటే వినియోగదారుకు అమ్మడం తేలికవుతుంది. వారు పూర్తి విలువను పొందగలుగుతారు. బ్యాంకులు బంగారం దిగుమతుల కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దేశంలో నిరుపయోగంగా ఉన్న వేల టన్నుల బంగారం కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ప్రజల దగ్గర 30 వేల టన్నుల బంగారం ఉంటుందని అంచనా. ఇందులో కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు, ఇతర బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయగలిగితే దిగుమతి అవసరాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆర్బిఐ ఆ ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అటువంటిది ఏమీ లేదని ఆర్బిఐ స్పష్టం చేసింది. బంగారం దిగుమతులు తగ్గించుకునేందుకు ఈ అంశాన్ని రిజర్వు బ్యాంకు పునరాలోచించవలసి అవసరం ఉంది. -
సమైక్యానికి సపోర్టు
కాకినాడ, న్యూస్లైన్ : రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికులు... రోజూ పనికి వెళ్తే తప్ప పూటగడవని లారీ వర్కర్లు... బార్జీలపై పనిచేసే సరంగులు, కళాసీలు... ఎగుమతి, దిగుమతులతో నిత్యం రూ.కోట్లలో వ్యాపారం చేసే ఎక్స్పోర్టర్లు... ఇలా అన్నివర్గాలు ఏకతాటిపై నిలిచి సమైక్యరాగాన్ని అందుకున్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ మంగళవారం ఉదయం నుంచి 24 గంటల బంద్కు కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. పోర్టు ఆధారిత వర్గాలన్నీ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొనడం ద్వారా సమైక్యాంధ్ర కోసం సమైక్య ఉద్యమబాట పట్టి మిగిలిన సంఘాలకు స్ఫూర్తిగా నిలిచారు. పోర్టు కార్మికులు, లారీ ఓనర్లు, ఎక్స్పోర్టర్లు, బాడ్జీ యజమానులతో సహా అన్నివర్గాలు స్వచ్ఛంద బంద్ పాటించడంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రధానంగా చాంబర్ పిలుపు మేరకు కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాన నగేష్ ఆధ్వర్యంలో దాదాపు రెండువేల లారీలను పూర్తిగా నిలిపివేశారు. సీరియల్ను కూడా రద్దు చేయడంతో రేవుతోపాటు ఇతర రవాణా కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడింది. మరో వైపు బార్జీలపై పనిచేసే సరంగులు, కళాసీలు, లారీలపై పనిచేసే డ్రైవర్లు, క్లీనర్లు, ఎగుమతి, దిగుమతుల్లో పనిచేసే కార్మికులు వెరసి దాదాపు 15వేల మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. పనికి వెళ్లకపోతే రోజు గడవని స్థితిలో కూడా సమైక్యాంధ్రకు కోసం ఒక్కరోజు పనిలేకపోయినా ఇబ్బంది లేదని, అవసరమైతే మరింతగా ఉద్యమించడానికి కూడా సిద్ధమంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇదిలా ఉంటే పోర్టు రవాణాలో కీలకంగా వ్యవహరించే స్టీల్బార్జీలు కూడా ఎక్కడికక్కడే నిలిపివేశారు. 89 బార్జీలు ఆగిపోయాయి. రేవు కార్యకలాపాలు నిలిచిన సందర్భంగా నిత్యం వేలాదిమంది కార్మికులతో కళకళలాడుతూ కనిపించే యాంకరేజ్పోర్టు ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. బంద్ ప్రభావంతో ఎగుమతి, దిగుమతులు, కార్మికుల వేతనాలు, ఓడలు, రైల్వే రాక్ల డెమరేజ్, లారీల అద్దెలు ద్వారా ఒక్కరోజుకు దాదాపు రూ.10 కోట్లు మేరకు నష్టం వాటిల్లిందని రేవు ఆధారిత వర్గాలు చెప్పాయి. భారీ ర్యాలీ సమైక్యాంధ్ర కోరుతూ కోకనాడ చాంబర్ కార్యాలయం నుంచి సినిమారోడ్డు, మెయిన్రోడ్డు మీదుగా జగన్నాధపురం వంతెన వరకు భారీ ర్యాలీ చేశారు. కాకినాడ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ర్యాలీకి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా చాంబర్ అధ్యక్షుడు దంటు సూర్యారావు మాట్లాడుతూ 1953లో మద్రాస్ నుంచి తట్టాబుట్టతో వెళ్లగొట్టారని, ఇప్పుడు 2013లో అటువంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకునేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి ప్రజా ఉద్యమాన్ని చూసైనా ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో షోర్లేబర్ యూనియన్ అధ్యక్షుడు తలాటం వీరబాబు, స్టీవ్డోర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పితాని నూకరాజు, క్లియరెన్స్ అండ్ ఫార్వర్డింగ్ (సీఅండ్ ఆఫ్) ఏజెంట్ల ప్రతినిధి పీవీ రావు, ఏవీ రంగారావు, రాఘవులు, రావిపాటి రామ్గోపాల్, స్టీవ్డోర్ ఓనర్స్ అధ్యక్షుడు మహేష్, లారీ వర్కర్స్ యూనియన్అధ్యక్షుడు బుద్ధన బాబ్జి, స్టీల్ బార్జీ ప్రతినిధి అనుబాబుతో సహా పెద్దసంఖ్యలో హాజరయ్యారు.