Kaleshwaram Lift Irrigation Project
-
సుందిళ్ల బ్యారేజీ ఇంజినీర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
సాక్షి ,హైదరాబాద్ : సుందిళ్ల బ్యారేజీల నిర్మాణల కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగం(సీడీవో) ఇంజినీర్లపై కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీల నిర్మాణాలపై అఫిడవిట్లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా ఇంజినీర్లు సమాధానాలు చెప్పడంపై మండిపడింది. నిర్మాణాలపై తప్పుడు సమాధానాలు చెబితే క్రిమినల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజి సహా కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్షేత్రస్థాయి ఇంజినీర్లతో జరిపిన రెండు రోజుల పాటు జరిపిన బహిరంగ విచారణ జరిపింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్ తొలిరోజైన సోమవారం మేడిగడ్డ, రెండో రోజైన మంగళవారం సుందిళ్ళ బ్యారేజి నిర్మాణాలపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగాని(సీడీవో)కి చెందిన ఏఈఈ,డీఈ,ఈఈ,డీసీఈ’ 16మంది ఇంజినీర్లను కమిషన్ సుందిళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగింది. కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలకు ఇంజినీర్లు తప్పుడు సమాధానాలు చెప్పిటన్లు తెలుస్తోంది. అఫిడవిట్లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా సమాధానాలు మార్చి చెప్పడంపై కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుందిళ్ళ బ్యారేజి బ్లాక్ 2ఏను డిజైన్ లేకుండానే నిర్మాణం చేశామని ఇంజినీర్లు కమిషన్కు వెల్లడించారు. దీంతో డిజైన్ లేకుండానే బ్లాక్ ఎలా నిర్మించారు? ఎలా సాధ్యమైంది? అని కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ ప్రశ్నకు.. ఒకటో బ్లాక్,మూడు బ్లాక్ల మధ్య 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని ఒకసారి..రెండు,మూడు బ్లాక్ల మధ్య నిర్మాణం చేశామని బదులిచ్చారు. మధ్యలో రెండో బ్లాక్ తర్వాతే 2ఏ బ్లాక్ కట్టామని కమిషన్కు ఓ ఇంజినీర్ వివరించారు. 2ఏ బ్లాక్కు డిజైన్ లేకపోవడంతో రెండో డిజైన్ ఆధారంగా 2ఏ బ్లాక్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పటి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే డిజైన్ లేకపోయినా 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని కమిషన్కు వివరించారు.ఇలా ఇంజినీర్లు చెప్పిన తప్పుడు సమాధానాలపై అవసరమైతే క్రిమినల్ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని కమిషన్ హెచ్చరించింది. 16 మంది ఇంజినీర్ల నుండి బ్యారేజ్ పనుల రికార్డులపై సంతకాలు తీసుకుంది. ఆ రికార్డ్లను స్వాధీనం చేసుకున్న అనంతరం కమిషన్ తన విచారణను ముగించింది.తొలిరోజు మేడిగడ్డ నిర్మాణాలపై ప్రశ్నల వర్షంతొలిరోజు మేడిగడ్డ ఏడో బ్లాక్లో పియర్స్ కుంగుబాటుకు కారణాలతో పాటు ఇతర నిర్మాణలపై కమిషన్ ఇంజినీర్లకు పలు ప్రశ్నలు సంధించింది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ముందే సిద్ధం చేసుకుని వచ్చిన సమాధానాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణలకు సంబంధించిన ఇంజినీర్లు సమర్పించిన రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్.. వారితో సంతకాలు చేయించుకుని విచారణను నిలిపివేసిందిఇవాళ (మంగళవారం) సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపై ఇంజినీర్లను కమిషన్ బహిరంగంగా విచారించింది. విచారణలో ఇంజినీర్లు చెప్పిన సమాధానాలకు కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
కాళేశ్వరం కమిషన్ విచారణ.. మూడుసార్లు హరీష్ రావు పేరు ప్రస్తావన
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి శనివారం హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయన్ను విచారించింది. విచారణలో భాగంగా మాజీ జలవనరులశాఖ మంత్రి హరీష్ రావు పేరును సుధాకర్ రెడ్డి మూడుసార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం చేసిన టెస్టుల రిపోర్టులను వ్యాప్కోస్ సంస్థకు ఇవ్వనని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని, ఆయనే ఆదేశించారని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టింది అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనేనని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో 40 వేల కోట్ల నుంచి 127 వేల కోట్లకు పెంచారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేవలం అదనంగా రెండు లక్షల ఎకరాల కోసమా?: కమిషన్డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్కు డబ్బులు ఇచ్చాం-సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ టెండర్ల ప్రాసెస్ జరిగిందా? కమిషన్టెండరింగ్ ప్రాసెస్ జరగలేదు. నామినేషన్ ప్రాసెస్ ద్వారా వ్యాప్కొస్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు- సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ ప్రాసెస్ ఎందుకు చేయలేదు చెయ్యొద్దు అని ఎవరు ఆదేశించారు?- కమిషన్బ్యారేజీ పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఏ సమయంలో ఇస్తారు?- కమిషన్దాదాపు 90 శాతం పనులు పూర్తయితే సబ్ స్టాన్షల్ సర్టిఫికేట్ విడుదల చేస్తారు?- సుధాకర్ రెడ్డిపనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చేముందు ఫీల్డ్ విజిట్ లేదా డాక్యుమెంట్స్ చెక్ చేశారా?- కమిషన్ఫీల్డ్ విసిట్, డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు?- కమిషన్42.2b క్లాజ్ ఉపయోగించి సర్టిఫికెట్ను రిజెక్ట్ చేసే అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ఆపలేదు?- కమిషన్సర్టిఫికెట్ ఇచ్చేముందు అసలు నిజాలు చూడకుండా ఎలా గుడ్డిగా సంతకాలు పెడుతారు?- కమిషన్కాపర్ డ్యాం నిర్మాణం తొలగింపు కోసం అదనంగా ఖర్చు చేసే నిధులు ప్రభుత్వానికి నష్టమే కదా?- కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఆలస్యం ఎందుకు అయ్యాయి? - కమిషన్అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయి,.మేడిగడ్డ బ్యారేజీ ఫైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదు.- సుధాకర్ రెడ్డిబిల్లుల చెల్లింపుల అంశంలో కాళేశ్వరం కార్పొరేషన్ ప్రస్తావన..కాళేశ్వరం కార్పొరేషన్ ఎవరు పెట్టారు? పెట్టమని ఎవరు ఆదేశించారు;- కమిషన్కాళేశ్వరం కార్పొరేషన్ ప్రభుత్వం పెట్టింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగింది. సుధాకర్ రెడ్డిమేడిగడ్డ బ్యారేజీ కింద బొగ్గు గనుల ఆనవాళ్లు ఉన్నట్లు జోధాపూర్ యూనివర్సిటీ సర్దార్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. సుధాకర్ రెడ్డిబ్యారేజీలలో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చా చేస్తే ఎంత చేయొచ్చు?- కమిషన్మేడిగడ్డ బ్యారేజీలో 100 మీటర్ల లెవెల్ వరకు స్టోర్ చేయొచ్చు.- సుధాకర్ రెడ్డిచేసుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ నిధులు ఏజెన్సీకి పే చేస్తే అది ప్రభుత్వానికి నష్టమే కదా- కమిషన్డిజైన్లలో లోపాల వల్ల బ్యారేజీల వద్ద డ్యామేజ్ జరిగింది నిజమేనా? - కమిషన్మేడిగడ్డ బ్యారేజీ లోని బ్లాక్ లలో లెన్త్ అండ్ విడ్త్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్లే డ్యామేజి జరిగింది- సుధాకర్ రెడ్డి వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయి-సుధాకర్ రెడ్డి. -
లోపాలు తేలినా.. నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో లోపాలపై 2021 అక్టోబర్, నవంబర్లలో తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇచ్చినా.. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేంద్రరావు ఆరోపించారు. బరాజ్ల ఎగువన, దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపో యాయని, దిగువన వేరింగ్ కోట్ దెబ్బతిన్నదని నివేదికలలో తెలిపామని వివరించారు. ప్రాజెక్టుల ఈఈలు, ఎస్ఈలు, సీఈలు దీనికి బాధ్యులని.. బరాజ్లలో లోపాలున్నట్టు ఎన్నడూ నల్లా వెంకటేశ్వర్లు తమకు నివేదిక సమర్పించలేదని పేర్కొ న్నారు.కాళేశ్వరం బరాజ్లపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం బి.నాగేంద్రరావును మూడున్నర గంటలకుపైగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 120కిపైగా ప్రశ్నలు వేసింది. నిర్వహణ, పర్యవేక్షణ (ఓఅండ్ఎం) విభా గానికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ లేదని.. క్షేత్ర స్థాయి అధికారులకు ప్రాజెక్టుల నిర్వహణపై ఎప్ప టికప్పుడు ఆదేశాలిస్తామని ఈ సందర్భంగా కమి షన్కు నాగేంద్రరావు వివరించారు. తమ తనిఖీల నివేదికలను కమిషన్కు అందజేశారు. డిఫెక్ట్ లయ బిలిటీ పీరియడ్లో బరాజ్లకు రక్షణ చర్యలు తీసు కోవాలని.. వర్షాకాలానికి ముందు, తర్వాత, మధ్య లో పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించాలని తాము కోరినా రామగుండం ఈఎన్సీ చేయలేదని వివరించారు. ఐఎస్ కోడ్, కేంద్ర జలసంఘం మా న్యువల్స్ను కూడా పాటించలేదని ఆరోపించారు. బరాజ్ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసినట్టు నల్లా వెంకటేశ్వర్లు నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. గేట్ల నిర్వహణలో ఆపరేషన్ ప్రోటోకాల్ పాటించినట్టు సమాచారం లేదని.. వరద ఉధృతితో దిగువన రక్షణ పనులు దెబ్బతినడానికి అది ఒక కారణం కావొచ్చని తెలిపారు. మరమ్మతులు చేయడం కోసం బరాజ్ లలో నీటి నిల్వలను తగ్గించాలని నిర్మాణ సంస్థలు కోరినా పట్టించుకోలేదా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఈ దిశగా తమ కార్యాలయం ఆదేశాలేమీ ఇవ్వలేదని, అయితే నిల్వలను పెంచాలని నల్లా వెంకటేశ్వర్లు మౌఖిక ఆదేశాలిచ్చారని నాగేంద్రరావు వివరించారు.ఈఎన్సీ పోస్టు అలంకారానికా?‘బరాజ్ల వైఫల్యానికి నిర్వహణ వైఫల్యం ఓ కారణం కాదా? ఈఎన్సీ (ఓఅండ్ఎం) పోస్టు ఎందుకు ఉంది? అలంకారానికా?’ అని కమిషన్ నిలదీయగా.. నిర్వహణ బాధ్యత క్షేత్రస్థాయి సీఈలదేనని నాగేంద్రరావు బదులిచ్చారు. నిర్వహ ణ మాన్యువల్స్, సర్క్యులర్లు జారీచేసి వాటిని పాటించాలని కోరడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. నిరంతర నిల్వలతో బరాజ్ల ఎగువ భాగంలో మరమ్మతులు సాధ్యం కాలేదని, దిగువన అవకాశమున్నా మరమ్మతులు చేయలేదని వివరించారు. అయితే ‘నీటి నిల్వ అవసరాలకు బరాజ్లు పనికిరావని ఐఎస్ కోడ్లో ఉన్న విషయం మీకు తెలియదా? నిల్వ చేయాలని ఆదేశించినది ఎవరు? నిల్వలతోనే పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి బరాజ్లు దెబ్బతిన్నాయా?’ అని కమిషన్ ప్రశ్నించగా.. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే నీళ్లు నిల్వ చేశా రని నాగేంద్రరావు వివరించారు. నిల్వలతో ఇసుక కొట్టుకుపోయి దెబ్బతినే అవకాశాలుంటాయని అంగీకరించారు. మూడు బరాజ్ల పనులు సంపూర్ణంగా పూర్తయ్యాయా? అని కమిషన్ ప్రశ్నించగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్ల పనులు పూర్తయ్యా యని, మేడిగడ్డ బరాజ్లో నిబంధనల ప్రకారం పనులు జరగలేదని నాగేంద్రరావు తెలిపారు.నాణ్యతా పరీక్షలకు మనస్సాక్షి అంగీకరించలేదా?‘వరదల అనంతరం బరాజ్ల పరిస్థితి ఏమిటి? ఏమైనా దెబ్బతిన్నాయా? నిర్మాణం సరిగ్గా జరిగిందా? లేదా? అని పరిశీలించాలని మీ మనస్సాక్షి అంగీకరించలేదా?’ అని క్వాలిటీ కంట్రోల్ రిటైర్డ్ సీఈ అజయ్కుమార్ను పీసీ ఘోష్ కమిషన్ నిలదీసింది. అయితే నిర్మాణ దశలో, బిల్లుల చెల్లింపుల సమయంలోనే నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తామని, నిర్మాణం పూర్తయిన తర్వాత అవసరం ఉండదని అజయ్కుమార్ బదులిచ్చారు. ఇక అసంపూర్తి పనులను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు నోటీసులిచ్చామని కమిషన్కు మాజీ ఈఈ సర్దార్ వివరించారు. గురువారం కమిషన్ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుకు రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. -
కాంట్రాక్టర్లకు బిల్లుల కోసమే ‘కాళేశ్వరం’ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసమే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటైందని నీటిపారుదల శాఖ చీఫ్ అకౌంట్స్ అధికారి పద్మావతి, కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారి కొమర్రాజు వెంకట అప్పారావు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ముగ్గురు అధికారులను వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలను సమీకరించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా కొమర్రాజు వెంకట అప్పారావు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్కు స్వతహాగా ఆదాయం ఏమీ లేదన్నారు. రుణా లు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని.. వాటిపై వచ్చే వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. కాంట్రాక్టర్ల బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలను సైతం కార్పొరేషన్ అవసరాలకు వాడుకుంటున్నామని వివరించారు. పూర్తయిన పనులన్నింటినీ కార్పొరేషన్ ఆస్తులుగానే పరిగణిస్తామని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్, ఎనీ్టపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించిన బిల్లులు 2023 నుంచి వస్తున్నాయని వివరించారు. కొలతలు చూశాకే బిల్లులు ఇస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిద్ధం చేసిన బిల్లులను పేఅండ్అకౌంట్స్ విభాగం పరిశీలించి కార్పొరేషన్కు పంపిస్తుందని, తర్వాత చెల్లింపులు చేస్తామని బదులిచ్చారు. కాగ్ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు.మిమ్మల్ని మీరే రక్షించుకోవాలినీటి పారుదల శాఖ బడ్జెట్ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటని ఆ శాఖ చీఫ్ అకౌంట్స్ అదికారి పద్మావతిని కమిషన్ ప్రశ్నించగా.. చీఫ్ ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తానని ఆమె బదులిచ్చారు. కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపు కోసం ప్రభు త్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ అభ్యంతరాల విషయంలో మీ అభిప్రాయమేంటి? రుణాలపై నిర్వహించిన సమావేశాల్లో గత ప్రభుత్వంలోని సీఎంఓ అధికారులు పాల్గొన్నారా? ప్రాజెక్టుతో ఆర్థికభారం పడే అవకాశం ఉండటంతో ఆర్థిక క్రమశిక్షణ కోసం సలహాలు ఏమైనా ఇచ్చారా?’ కమిషన్ ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పడే ఆర్థిక భారం? దీనికి మీ సమర్థన ఉందా? రాష్ట్రంపై ఈ భారం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? మీ బాధ్యతగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారా?’ అన్న ప్రశ్నలకు తాను జవాబు చెప్పలేనని పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించగా.. అది చాలా విస్తృతమైన అంశమని, దానిపై తానేమీ చెప్పలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో కమిషన్ కొంత ఘాటుగా స్పందిస్తూ.. ‘‘విచారణ సందర్భంగా ఎవరినో రక్షించే ప్రయత్నం చేయవద్దు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. విచారణలో వాస్తవాలనే తెలపాలి. దాపరికాలు వద్దు’’ అని పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సిఫారసు చేయడమే తన బాధ్యత అని వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ కమిషన్కు వివరించారు. కాగ్ నివేదికలోని ఒకటి రెండు విషయాలు మాత్రమే వాస్తవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచి్చందని తెలిపారు. -
కాళేశ్వరం కమిషన్కు కీలక విషయాలు వెల్లడించిన ఇంజినీర్లు
సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లుగా పనిచేసిన ఈఈ, సీఈ,ఎస్ఈ శనివారం(సెప్టెంబర్21)నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో కమిషన్ ముందు హాజరయ్యారు.మూడు బ్యారేజీలలో క్వాలిటీ కంట్రోల్ వింగ్ పోషించిన పాత్రపై అధికారులను కమిషన్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకుగాను క్వాలిటీ కంట్రోల్ అధికారులు కమిషన్కు విభిన్న సమాధానాలు చెప్పడం గమనార్హం.బ్యారేజీల సైట్ విజిట్ ఎన్ని రోజుల కొకసారి చేసేవారని అధికారులను కమిషన్ ప్రశ్నించింది.రెండు మూడు నెలలకొకసారని ఒకరు,అసలు సైట్ విజిట్ చేయలేదని మరొకరు పొంతన లేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది.అన్నారం బ్యారేజ్ డిజైన్ సరిగా లేదని అన్నారం బ్యారేజ్ ఈఈ కమిషన్కు చెప్పారు.వరదకు తగ్గట్టుగా అన్నారం బ్యారేజ్ డిజైన్ లేదని తెలిపారు.తక్కువ వరదకు డిజైన్ చేస్తే ఎక్కువ వరద వస్తోందన్నారు. ఎత్తిపోతలకు బ్యారేజ్ అనుగుణంగా లేదని సమాధానమిచ్చారు.ఇదీ చదవండి.. కాళేశ్వరం తెలంగాణకు వెయ్యి ఏనుగుల బలం: హరీశ్రావు -
కేటీఆర్ కాళేశ్వరం పర్యటన ఒక విహారయాత్ర: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై ఇప్పటికైనా బీఆర్ఎస్ తప్పు ఒప్పుకోవాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వాస్తవాలు తెలిసి కూడా తప్పును కప్పి పుచ్చుకోవడానికి విహార యాత్రగా కాళేశ్వరంగా వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.కాగా, బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజక్ట్ పర్యటనపై జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కేటీఆర్ కాళేశ్వరం పర్యటన ఓ విహారయాత్ర. మూడు లిఫ్ట్ల్లో నీటిని తరలిస్తే 30వేల కోట్లు అయ్యే ప్రాజెక్ట్కు లక్షా 20వేల కోట్లు చేశారు. అప్పులకు కేసీఆరే బాధ్యుడు. ఈ ప్రాజెక్ట్లో నిర్మాణాత్మకంగా లోపాలు ఉన్నాయి. మూడు ప్రాజెక్ట్ల్లో నీటిని నిల్వ చేయకుడదని ఎన్డీఎస్ఏ స్పష్టం చెబుతోంది. విజిలెన్స్ కూడా ఇదే నివేదిక ఇవ్వబోతోంది.వాస్తవాలు తెలిసి కూడా ఇలా విహారయాత్రకు వెళ్లినట్టు వారంతా అక్కడికి వెళ్లారు. ఒకవైపు న్యాయవిచారణ జరుగుతోంది. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ అనుభవం ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించడానికి ఒకేఒక అవకాశం ఉంది. మారో మార్గమే లేదు. గత బీఆర్ఎస్ వల్లే ఈ పరిస్థితి నెలకొంది. తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారు. 148 మీటర్ల ఎత్తుతో నీటిని తరలిస్తే ప్రాణహిత నీళ్లు ఒక్క లిఫ్ట్తో ఎల్లంపల్లికి నీళ్లు వచ్చేవి. కేసీఆర్ కమీషన్ల కోసం లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులకు ప్రజలను క్షమాపణ కోరండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కాళేశ్వరం లిఫ్టులపైనా విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం(అన్నారం), గోలివాడ (సుందిళ్ల) పంప్ హౌస్ల నిర్మాణంపై సైతం జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలు, లోపాలపై విచారణ నిర్వహించే బాధ్యతలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు అప్పగించగా, విచారణలో అనుబంధ అంశాలుగా పంప్హౌస్లను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్లతో పాటు పంప్ హౌస్లపై సైతం విచారణ జరిపించాలని పలువురు కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1 ప్యాకేజీలో భాగంగా ఈ పంప్హౌస్ల నిర్మాణం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నుంచి చీఫ్ ఇంజనీర్ (సీఈ) స్థాయి వరకు.. పంప్హౌస్ల నిర్మాణంలో భాగస్వాములైన అధికారులందరూ సోమవారం విచారణకు హాజరు కావాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తాజాగా ఆదేశించడం చర్చనీయాంశమైంది. పంప్హౌస్ల నిర్మాణానికి జారీ చేసిన పరిపాలన అనుమతులు, సాంకేతిక పరిశీలనలు, ఏ మేరకు నీటిని పంపింగ్ చేయడానికి వీటికి అనుమతినిచ్చారు? చేసిన పంపింగ్ ఎంత? వీటి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎన్నిసార్లు అంచనాలు సవరించారు? గత ఐదేళ్లుగా పంప్ హౌస్ల పరిస్థితి ఏంటి? అనే అంశాలపై కమిషన్ ఆరా తీయనున్నట్టు సమాచారం. మూడేళ్ల కింద గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్హౌస్లు నీట మునగడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా, శనివారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ తన కార్యాలయంలో కమిషన్కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీతో సమావేశమై చర్చలు జరిపారు. సత్వరంగా నివేదిక సమర్పించాలని వారిని కోరారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక సమర్పించాలిమేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ తుది నివేదికను సత్వరం సమర్పించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ చంద్రఘోష్ ఆదేశించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్తో ఆయన శనివారం ఫోన్లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్లపై విచారణ ప్రక్రియలో ఈ నివేదిక కీలకమని స్పష్టం చేశారు. తుది నివేదిక కోసం కమిషన్ తరఫున ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ అధికారులను సైతంఆయన ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నిర్వహిస్తున్న విచారణకు సంబంధించిన తుది నివేదికను కూడా సత్వరం తెప్పించుకోవాలని ఆయన సూచించారు. త్వరలో క్రాస్ ఎగ్జామినేషన్జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ త్వరలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇప్పటికే విచారణకు హాజరైన అధికారులందరినీ అఫిడవిట్ రూపంలో తమ వద్ద ఉన్న సమాచారాన్ని, వాదనలను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన అనంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు జారీ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు హాజరు కావాలని ఆదేశించే అవకాశముంది.ఇదిలా ఉండగా కమిషన్ను తప్పుదోవపట్టించే క్రమంలో కొందరు అధికారులు పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో సమర్పించినట్టు తెలిసింది. దీంతో వీరిని సైతం మళ్లీ క్రాస్ఎగ్జామినేషన్కు కమిషన్ పిలవనుంది. ఇక బరాజ్లు దెబ్బతినడానికి కారణాలేంటో తెలుసుకోవాలని కమిషన్ ఓ అధికారిని పుణెలోని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు పంపించింది. విచారణ ముగింపులో బహిరంగ విచారణను సైతం కమిషన్ నిర్వహించనుందని సమాచారం. తొలుత అఫిడవిట్ల పరిశీలన, ఆ తర్వాత నోటీసుల జారీ, క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం బహిరంగ విచారణ ఉంటుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. -
అన్నారం నుంచి నీటి తరలింపునకు కసరత్తు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్ గుండా ఖరీఫ్ సీజన్లో నీటిని ఎగువకు తరలించడానికి రాష్ట్ర ఇరిగేషన్ సాంకేతిక ఉన్నతాధికారుల బృందం శనివారం కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈఎన్సీ జనరల్ గుమ్మడి అనిల్కుమార్ బృందంతోపాటు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజెషన్ (సీడీఓ) మోహన్కుమార్, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటకృష్ణల బృందాలు, రామగుండం సీఈ సుధాకర్రెడ్డి మేడిగడ్డ (లక్ష్మి) అన్నారం (సరస్వతీ) బరాజ్లను పరిశీలించారు. ముందుగా అన్నారంలో చేపట్టిన సీపేజీ మరమ్మతు లను పరిశీలించిన అనిల్కుమార్.. వాటిని త్వరగా పూర్తిచే యాలని ఆదేశించారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ ద్వారా నీటిని తరలించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న 11 మోటార్ల టెస్ట్ రన్లు, రిపేర్లు పూర్తిచేసి సిద్ధంగా ఉంచినట్లు అధికారు లకు ఆయనకు చెప్పారని సమాచారం. అదేకాకుండా అన్నా రం బరాజ్ పెద్దవాగు, మానేరు వాగులతోపాటు చిన్నచిన్న వాగుల ద్వారా నీటిలభ్యత ఉందని ఇంజనీర్లు ఈఎన్సీతో పేర్కొన్నారు. ఇప్పటికే అన్నారం బరాజ్లో ఉన్న మొత్తం 66 గేట్లను మూసి ఉంచారు. నీటి తరలింపు అంశంపై పరిశీలన చేయాలని ఇంజనీర్లను ఆయా బృందాలు ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఎగువ నుంచి ప్రాణహిత ద్వారా 20 వేల క్యూసెక్కులకుపైగా నీరు వస్తోంది. ఉన్నతాధికారుల బృందం వెంట ఎస్ఈ కరుణాకర్, ఈఈలు యాదగిరి, తిరుపతిరావు ఉన్నారు. -
మరో రెండు గేట్లు పైకి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు చెందిన మరో రెండు రేడియల్ గేట్లను ఇంజనీరింగ్ అధికారులు గురువారం పైకి ఎత్తారు. గతేడాది అక్టోబర్లో 21న మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లతో పాటు వంతెన కుంగి, పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. గత నెల 17న 15వ పియర్లోని రేడియల్ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా, 20వ పియర్ ముందు బొరియలు ఏర్పడి భారీ శబ్ధం, ధ్వనులు వినిపించాయి. దీంతో బొరియల్లో సిమెంట్, ఇసుకతో గ్రౌటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 6న 7వ బ్లాక్లోని 16, 17 రేడియల్ గేట్లను బలంగా పైకి ఎత్తారు. 8వ తేదీన అదే బ్లాక్లోని 22వ రేడియల్ గేటును ఎత్తారు. గురువారం 18, 19 గేట్లను 100.50 మీటర్ల మేర ఎత్తారు. దీంతో ఈ బ్లాక్లోని మొత్తం 8 గేట్లకు గాను 5 గేట్లు ఎత్తినట్టయ్యింది. గేట్ల కటింగ్ పనులు వేగవంతం: ప్రాజెక్టులోని 19, 20, 21 గేట్ల కటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 20వ గేటును కట్ చేసి విడిభాగాలు తొలగించి, బయటకు తీసుకెళ్లేందుకు వీలుగా చేశారు. ఆ గేట్ల వద్ద ఉన్న కేబుల్స్, ఇతర పరి కరాలు తొలగించడానికి సమ యం పట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా 7వ బ్లాక్లో షీట్ఫైల్స్ పనుల్లో వేగం పెంచారు. చెల్లాచెదురైన సీసీ బ్లాక్లను సరైన స్థానంలో అమర్చుతున్నారు. మంత్రి ఉత్తమ్ పర్యటన అనంతరం మరమ్మతుల్లో వేగం పెరిగిందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అటు అన్నారంలో బోర్తో డ్రిల్లింగ్ వేసి రంధ్రాలు చేస్తున్నారు. 25 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా కింద మట్టి దృఢంగా ఉండడంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలిసింది. -
‘కాళేశ్వరం’ విచారణ.. నేడు కమిషన్ ముందుకు 18 మంది మాజీలు
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో తాజా మాజీ అధికారులు కమిషన్ ముందు హాజరు కానున్నారు. విచారణలో భాగంగా.. కాళేశ్వరం కమిషన్ ముందుకు 18 మంది తాజా మాజీ అధికారులు హాజరు కానున్నారు. ఈ ఇరిగేషన్ అధికారులు మధ్యాహ్నాంలోపే నేరుగా కమిషన్ కార్యాలయానికి వెళ్తారని, కమిషన్ అడిగిన వివరాలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరంపై ఇంజినీర్లు, రిటైర్డ్ఇంజినీర్లకు నోటీసులు ఇస్తూ వివరాలు రాబడుతున్నారు. ఇంకో నాలుగైదు రోజులు జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్రంలోనే ఉండి, విచారణ చేయనున్నారు. మరికొంతమందికి నోటీసులు జారీ చేసి, ఎంక్వైరీకి పిలువనున్నారు.నిన్నటి విచారణకు..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో భాగంగా.. తన ఎదుట చెప్పిన అంశాలను రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో అందజేయాలని న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది. ఈ అఫిడవిట్లన్నీ రహస్యంగా ఉంటాయని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజికి గల కారణాలతోపాటు డిజైన్లు, నిర్వహణ, ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయాలు, అంచనాల పెంపు తదితర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా సోమవారం పలువురు ఇంజినీర్లు కమిషన్ ఎదుట హాజరయ్యారు. మాజీ ఈఎన్సీలు మురళీధర్ (జనరల్), వెంకటేశ్వర్లు (కాళేశ్వరం), నరేందర్రెడ్డి (డిజైన్స్)తో పాటు డిజైన్స్ విభాగంలో ఎస్ఈలుగా పనిచేసిన చంద్రశేఖర్, బసవరాజు, సుందిళ్ల, అన్నారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఓంకార్సింగ్, యాదగిరి తదితరులు హాజరయ్యారు. మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన గడువు కోరినట్లు తెలిసింది. బ్యారేజీలకు సంబంధించి మీ అనుభవాలను, అభిప్రాయాలను నిజాయతీగా, స్వేచ్ఛగా వెల్లడించాలని వారిని కమిషన్ కోరినట్లు తెలిసింది.జూన్లోపు పూర్తి కాదుకాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో ఇంజినీర్లను విడివిడిగా విచారించే ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తికాదని విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని, వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నారు. ‘మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో విచారణలో కొంత జాప్యం చోటుచేసుకుంది. సోమవారం ఏడుగురిని విచారణకు పిలిపించాం. ఆనకట్టల బాధ్యతలు పర్యవేక్షించిన ఇంజినీర్ల నుంచి ఈ రోజు వివరాలు సేకరించాం. త్వరలో నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా పిలుస్తాం. మంగళవారం విచారణకు రావాలని 18 మందికి నోటీసులిచ్చాం. సాంకేతికాంశాలపై విచారణ జరుగుతోంది. ఇది పూర్తయ్యాక, ఆర్థికాంశాలు, అవకతవకలపై విచారణ మొదలు పెడతాం. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కమిషన్ సూచనల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది’ అని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల భేటీజస్టిస్ పీసీ ఘోష్తో సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశమయ్యారు. బ్యారేజీలపై విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలు, ఇటీవల క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. 54 ఫిర్యాదులు:జస్టిస్ పీసీ ఘోష్కాళేశ్వరం విచారణ వేగంగా సాగుతోందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ‘ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును సందర్శించాను. విచారణకు హాజరు కావాల్సిన అధికారులు, ఇంజినీర్లకు నోటీసులిస్తున్నాం. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయి. విజిలెన్స్ విభాగం వద్ద ఉన్న అన్ని వివరాలను ప్రభుత్వం అందజేసింది. వాటిని కూడా పరిశీలిస్తాం. కమిషన్కు ఇప్పటి వరకు 54 ఫిర్యాదులొచ్చాయి. వాటిలో భూసేకరణ, నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కమిషన్కు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తాం. బ్యారేజీల రక్షణ చర్యలు, మరమ్మతులనేవి నా పని కాకపోయినా.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తగిన భద్రత చర్యలు చేపట్టాలని సూచించాను. ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు స్పందించి పనులు చేపట్టాయి’ అని ఆయన వివరించారు. -
పనికిరాని ప్రాజెక్టుకు మరమ్మతులెందుకు?
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం త ప్పుదారిలో పడింది. ఈ ని ర్ణయం వల్ల కాంగ్రెస్కే నష్టం జరుగుతుంది. పనికిరాని ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం సరికాదు’అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో విశ్వేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా చూస్తే ఎన్నికల వరకే కొట్లాటలు ఉంటాయని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పరిధిలోని జంట జలాశయాల పరిరక్షణకు సంబంధించి గత ప్ర భుత్వం జీఓ 111 రద్దు చేసినా, దాని కంటే కూడా నిరర్థకమైన జీఓ 69ను కొత్తగా తీసుకొచ్చిందని విమర్శించారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధి కూడా జరగాలంటే ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్ ఏరియా’గా ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలలో విషం నింపిందని మండిపడ్డారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని, దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ వేవ్తోనే తాను చేవెళ్లలో పెద్ద మెజారిటీతో గెలుపొందానని చెప్పారు. కేంద్ర కేబినెట్లో మీకు పదవి ల భించనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు విశ్వేశ్వర్రెడ్డి స్పందిస్తూ ‘కేంద్రమంత్రి అయితే నాకు రాజకీయంగా నష్టం. దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన బాధ్యతల కారణంగా చేవెళ్ల ప్రజలకు దూరం అవుతా. కానీ నాకున్న పరిజ్ఞానం దేశం మేలు కోసం ఉపయోగించాలని ఉంది’ అని అన్నారు. -
మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మి) కుంగిపోయిన అంశంపై ఏర్పాటు చేసిన జ్యుడీíÙయల్ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ మంగళవారం.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఆయన రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్పాటిల్తో కలసి మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బ్యారేజీకి వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్లో కుంగిన 20వ నంబర్ పియర్.. దానికి అటూఇటూ ఉన్న 19, 21 పియర్లను.. వాటి కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. వంతెనపై కాలినడకన వెళ్లి చూశారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ల కుంగుబాటు, ఇతర అంశాలపై ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ఎల్అండ్టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. భోజనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం వచ్చినట్టు తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో కలసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని, ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందన్నారు. తాను ఇంజనీర్ను కాదని, టెక్నికల్ టీం వాటిని పరిశీలిస్తుందని వివరించారు.మేడిగడ్డకు ఇంకా గండమే!» బ్యారేజీకి మరింత ముప్పును తోసిపుచ్చలేమన్న నిపుణుల కమిటీ» తాత్కాలిక చర్యలను సిఫార్సు చేస్తూ మధ్యంతర నివేదిక» నివారణ చర్యలు తీసుకున్నా తాత్కాలికమేనని వెల్లడి» మూడు బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందేనని సూచనసాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ వద్ద ప్రస్తుతం చేపట్టే ఎలాంటి చర్యలైనా తాత్కాలికమే నని.. మరింత దెబ్బతినకుండా ఉండటాకేనని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. 7వ బ్లాక్ మరింత ప్రమాదానికి లోన య్యే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నీటి ఒత్తి డి పడకుండా.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని.. బ్యారేజీ ల దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు, అప్రాన్ లను పునరుద్ధరించాలని సూచించింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లను అవసరమైతే తొలగించాల ని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం చేసి, పునరుద్ధరణకు తీసు కోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ‘నేషన ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ అయ్యర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పరిశీలన జరిపి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసరంగా చేపట్టాల్సిన తా త్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనా లను సిఫారసు చేస్తూ మధ్యంతర నివేదిక సమర్పించింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నివేదికను పంపించారు.కుంగిపోయిన 7వ బ్లాక్కు సంబంధించి చేసిన సూచనలివీ..» పియర్లు, ర్యాఫ్ట్ ఫ్లోర్కు ఏర్పడిన పగుళ్లలో వచ్చే మార్పులను టెల్–టేల్స్ వంటి తగిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి.» 16 నుంచి 20వ నంబర్ వరకు పియర్లు స్వల్పంగా ఒరిగిపోవడం/ పగుళ్లు ఏర్పడటం జరిగింది. ఆ పగుళ్లు మరింత చీలకుండా తగిన రీతిలో బ్రేసింగ్ చేయాలి. అవసరమైతే బాక్స్ గ్రిడ్డర్, లాటిస్ గ్రిడ్డర్/ట్రస్ వంటిని వాడవచ్చు.» బ్యారేజీ పునాదిలోని ప్రెషర్ రిలీజ్ వాల్వŠస్ దెబ్బతిన్నాయి. మరమ్మతులైనా చేయాలి, కొత్తవైనా ఏర్పాటు చేయాలి.» బ్లాక్–7లోని అన్ని పియర్లపై ఆప్టికల్ టార్గెట్ పరికరాలను ఏర్పాటు చేసి, మార్పులను సమీక్షిస్తూ ఉండాలి.» ఎగువ, దిగువ సెకెంట్ పైల్స్, ఎగువ, దిగువ పారామెట్రిక్ జాయింట్ల పరిస్థితిని సమగ్రంగా మదించాలి.» దెబ్బతిన్న ప్లింత్ శ్లాబును తొలగించి నదీ గర్భాన్ని సరిచేయాలి. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోకుండా చూసే ఇన్వర్టెడ్ ఫిల్టర్లను తగిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.» 7వ బ్లాక్కు దిగువన నదీ గర్భంలో షీట్పైల్స్ను 9 మీటర్ల లోతు వరకు ఏర్పాటు చేయాలి. ర్యాఫ్ట్ చివరి కొన, ప్లింత్ శ్లాబు, షీట్పైల్ ఉపరితల భాగం మధ్యలో సిమెంట్, ఇసుక మిశ్రమంతో సీల్ వేసినట్టు జాయింట్లు వేయాలి.» ర్యాఫ్ట్కు సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో రంధ్రాలు చేసి... దాని దిగువన ఏర్పడిన ఖాళీల్లోకి ఇసుక, సిమెంట్, నీటి మిశ్రమాన్ని పంపి పూడ్చివేయాలి. -
కాళేశ్వరంపై న్యాయ విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం హైదరాబాద్కు చేరుకున్న ఆయన బీఆర్కేఆర్ భవన్లో తనకు కేటాయించిన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.నీటిపారుదల శాఖపై ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ నిర్వహించిన దర్యాప్తు నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలతో పాటు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లను జస్టిస్ చంద్రఘోష్ కు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు అందజేసినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలపై న్యాయ విచారణ కోసం ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం తెలిసిందే. కాగా, 26 లేదా 27 తేదీల్లో బ్యారేజీల సందర్శనకు ఆయన వెళ్లే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. నేడు అధికారులతో మళ్లీ భేటీ గురువారం ఉదయం 10 గంటలకు నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వం ఆయనకు అందజేయనున్నట్టు తెలిసింది. కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లకు నోటీసుల జారీపై గురువారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
కేసీఆర్కు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,ఢిల్లీ: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో వాటర్ మేనేజ్మెంట్ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత సూర్యాపేటలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భట్టి సోమవారం ఢిల్లీలో స్పందించారు. ‘చలికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా పాలనలో ఇంకా వర్షాకాలం రానే రాలేదు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ అని డబ్బా కొట్టారు అది కూడా కూలిపోయింది. నీళ్లు ఉంటే ఇప్పటికే అది మొత్తం కూలిపోయేది. కేసీఆర్ హయాంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. కేసీఆర్ పదేళ్లలో ఎస్ఎల్బీసీ ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదు. కాళేశ్వరం కార్పొరేషన్ బకాయిలు చెల్లిస్తాం. డిఫాల్ట్ కాబోము. ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతోంది. ఐఐటీలో చదివిన ఐఏఎస్లను డిస్కంలకు చీఫ్లను చేశాం. కేసీఆర్ మాత్రం ఒక అకౌంటెంట్ను సీఎండీ చేశారు’ అని భట్టి విమర్శించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్రెడ్డి -
మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్డీఎస్ఏ ప్రకటించింది. వచ్చే వారం ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రానుంది. చదవండి: మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్యలేవీ? -
లోక్సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ మళ్లీ పోరు బాట పట్టనుంది. తర్వలో నీటి పోరు యాత్ర చేసేందుకు పార్టీ యోచిస్తోంది. దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్తో జోష్లో ఉన్న బీఆర్ఎస్ ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు దానిని ఖండిస్తున్నారు. కానీ ఎన్నికల వేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పొత్తుపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్రెడ్డి -
అన్నారం బ్యారేజీని పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం నేడు(మంగళవారం) రాష్ట్రానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం(సరస్వతీ) బ్యారేజీలను ఎన్డీఎస్ఏ అధికారులు పరిశీలించారు. ముందుగా అన్నారం బ్యారేజీలోని 39వ పియర్ వద్ద ఏర్పడిన సీపేజీ పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో కుంగిన ప్రాంతాన్ని వీక్షించారు. నది గర్భంలో బ్యారేజీ కిందకు వెళ్లి ఇరువైపు ఏర్పడిన పగుళ్లను పరిశీలించారు. కాగా బ్యారేజీలో వాటర్ లీకేజీ విషయాన్ని ఇంజనీర్లు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దృష్టికి తీసుకెళ్లగా.. మూడు బ్యారేజిల్లో నీళ్ల స్టోరేజి అంశాన్ని ఎన్డీఎస్ఏకు ప్రభుత్వం అప్పగించింది. ఎన్డీఎస్ఏ ఇచ్చే నివేదికతోనే మరమ్మత్తులు చేయాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరమత్తుల కోసం అన్నారం బ్యారేజీలో ఇప్పటికే స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్డీఎస్ఏ సూచించిన క్రమంలో రాత్రికి రాత్రే గేట్లు తెరిచి నీటిని పూర్తిగా విడుదల చేశారు అధికారులు. బ్యారేజీలో నిలువ ఉన్న మొత్తం 2.5 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. ఇక అన్నారం నీళ్లు వదలడంతో మేడిగడ్డ దగ్గర పనులు ఆగిపోయాయి. కాగా ఈ బ్యారేజీలోపలుమార్లు సీపేజ్లు ఏర్పడగా.. ఆప్కాన్స్ సంస్థ ఇప్పటికే కెమికల్ గ్రౌటింగ్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మరోచోట చిన్న చిన్న సీపేజ్లు కనిపిస్తున్నాయి. దీంతో సీపేజ్లకు పూర్తిస్థాయి ట్రీట్మెంట్ చేయడంతోపాటు బ్యారేజీలోని లోపాలను కనుగొనేందుకు ప్రభుత్వం పార్సన్ సంస్థకు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను అప్పగించింది. అయితే నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో బ్యారేజీ పొడవునా 1.6 కిలోమీటర్ల దూరం వరకు లక్ష క్యూబిక్ మీటర్ల మేర గేట్ల వద్ద అర మీటరు ఎత్తులో ఇసుక పేరుకుంది. దీంతో బ్యారేజీలో సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తీయకపోతే ఫౌండేషన్, పియర్, ర్యాప్ట్ల కింద ఖాళీ ప్రాంతం ఎక్కడ ఎంత మేర ఉందనేది తెలియదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇసుక తొలగించిన తరువాతనే సీపేజీ లీకేజీపై విశ్లేషణ సాధ్యం అవుతుందని అంటున్నారు. గేట్లు కూడా పాడైపోయినట్లు సమాచారం. చదవండి: HYD: పంటి చికిత్స కోసం వెళితే ప్రాణం పోయింది.. -
రీ–ఇంజనీరింగ్తో 122% పెరిగిన వ్యయం!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో రూ.38,500 కోట్ల అంచనాతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టగా.. తెలంగాణ వచ్చాక రీ–ఇంజనీరింగ్ ద్వారా కాళేశ్వరం, ప్రాణహిత అనే రెండు ప్రాజెక్టులుగా విభజించడంతో అంచనా వ్యయం రూ.85,651.81 కోట్లకు చేరిందని కాగ్ నివేదికలో పేర్కొంది. అంటే ప్రాజెక్టు వ్యయం 122శాతం పెరిగిందని.. కానీ లక్షిత ఆయకట్టు 52.22శాతమే పెరిగిందని వివరించింది. ఆ తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పు లు, చేర్పులు చేయడంతో అంచనా వ్యయం రూ. 1,47,427.41 కోట్లకు చేరినా.. ప్రయోజనాలేమీ పెరగలేదని పేర్కొంది. కాళేశ్వరంపై 2021–22 ఆర్థిక ఏడాది చివరినాటికి కాగ్ నిర్వహించిన ఆడిట్ నివేదికను ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. నివేదికలోని ముఖ్యాంశాలివీ.. పంపింగ్ పెంచడంతో అదనపు వ్యయం కాళేశ్వరం డీపీఆర్ను 2018 జూన్లో కేంద్ర జలసంఘం ఆమోదించడానికి ముందే రూ.25,049.99 కోట్ల విలువైన 17 పనులను నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లకు అప్పగించింది. తొలుత గోదావరి నుంచి రోజుకు 2టీఎంసీలను ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. తర్వాత అవసరం లేకున్నా పంపింగ్సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచడంతో రూ.28,151 కోట్ల అదనపు వ్యయం అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపారు. ఇతర ప్రాజెక్టుల కింద ఒక టీఎంసీ నీళ్లు 10వేల ఎకరాలకే సరిపోతాయని చూపగా.. కాళేశ్వరం కింద 17,668 ఎకరాలకు అందించవచ్చని లెక్కించారు. తాజా అంచనా రూ. 1.47 లక్షల కోట్లలెక్కన చూస్తే.. ప్రాజెక్టు ప్రయోజన–వ్యయ నిష్పత్తి 0.52గా తేలుతోంది. అంటే వెచ్చించే ప్రతి రూపాయికి 52 పైసలే ప్రయోజనం అందుతుంది. ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ చార్జీలు, నిర్వహణ కలిపి రూ.10,647.26 కోట్ల ఖర్చు అవుతుంది. ఒక్కో ఎకరాకు సాగునీరు అందించడానికి ఏటా రూ.46,364 లెక్కన వ్యయం అవుతుంది. చెల్లింపుల వాయిదాతో మరింత భారం కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలను తిరిగి చెల్లించడానికి వచ్చే 14ఏళ్లలో మొత్తం రూ.1,41,544.59 కోట్లు అవసరం కానున్నాయి. కొన్ని రుణాల తిరిగి చెల్లింపు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాయిదా కోరింది. దీనితో రూ. 8,182.44 కోట్ల మేర అదనపు వడ్డీ భారం పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 21 ఒప్పందాల పరిధిలో పంపులు, మోటార్లు, అనుబంధ పరికరాల కొనుగోళ్ల కోసం వాస్తవ ధరల కంటే అధికంగా వ్యయా న్ని అంచనా వేశారు. వీటిలోని నాలుగు పనుల్లో కాంట్రాక్టర్లకు రూ.2,684.73 కోట్ల మేర అనుచిత లబ్ధి కలిగే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఐదు ఒప్పందాల్లో టెండర్లు పూర్తయ్యాక ధరల సర్దుబాటుతో అధిక చెల్లింపులు జరిగాయి. నీరిచ్చింది 40,888 ఎకరాలకే.. ప్రాజెక్టు కింద 18.26లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును ప్రతిపాదించారు. ఇందులో 14.83లక్షల ఎకరాల మేర మాత్రమే కాల్వల వ్యవస్థను అభివృద్ధి పనులను చేపట్టారు. 2022 మార్చి చివరినాటికి వాస్తవంగా నీళ్లిచ్చింది 40,888 ఎకరాలకే. ఇక మల్లన్నసాగర్ జలాశయం ప్రాంతంలోని భూగర్భంలో నిటారుగా పగుళ్లు ఉన్నాయని, భూకంపాలకు అవకాశం ఉందని నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. -
మాది ప్రజా ప్రభుత్వం.. భయపెడితే భయపడం: సీఎం రేవంత్
LIVE Updates గత ప్రభుత్వంలో మేడిగడ్డను ఎవ్వరినీ చూడనివ్వలేదు: సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే నల్గొండ సభ పెట్టారు కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము. మేడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది... అన్నారం సుందిల్లా సున్నం అయింది. మేడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమానించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్రావు మద్దతు పలికారు. తీర్మానం పై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం... భయపెడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్ కు ప్లా్రైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుత్వం అంటూ న్యూ యార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ను చూపించారు కేసీఆర్ నల్గొండ లో మాట్లాడటం కాదు - అసెంబ్లీ కి రావాలి ఇరిగేషన్ పై రేపు శ్వేతపత్రం పెడతాం... కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మేడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వయం ఉంది. కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యం గా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి L AND T సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా అనేది కసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు... ఇప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు... అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటన కు వెళ్ళాలి వస్తానన్న బీజేపీ MLA లను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ BRS ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ BRS చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. *కేసీఆర్ అవినీతి ని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది: మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించినా రాలేదు వాస్తవాలు తెలుస్తాయనే భయపడుతున్నారు మేడిగడ్డ చేరుకున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం, మంత్రులు. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం బృందం మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న అధికారులు. మేడిగడ్డ పర్యటనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం, మంత్రులు మరో గంటన్నరలో మేడిగడ్డకు చేరుకోనున్న సీఎం బృందం కాంగ్రెస్ సభ్యులతో కలిసి వెళ్లిన సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 3.30కు మేడిగడ్డ చేరుకోనున్న సీఎం, మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టు, కుంగిన పిల్లర్లను సందర్శించనున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం Hon’ble CM Sri. A.Revanth Reddy will participate in Medigadda Barrage site visit, Today https://t.co/o1kwK1stM5 — Telangana Congress (@INCTelangana) February 13, 2024 కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది: రేవంత్ రెడ్డి ట్వీట్ మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా...కేసీఆర్ నోరు మెదపడం లేదు రూ. 97 వేల కోట్ల వ్యయం చేస్తే 97 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. మేడిగడ్డ మరమత్తులకు పనికిరాదు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి… 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు… pic.twitter.com/GPGGtBX8Lf — Revanth Reddy (@revanth_anumula) February 13, 2024 కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు: హరీష్ రావు మిగతా బ్యారేజీలు కూడా చూడాలి రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శన బ్యారేజీ పిల్లర్లు కుంగితే ఇష్యూ చేస్తున్నారు గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నం మేడిగడ్డకు బయల్దేరిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం, మంత్రులు రోడ్డుమార్గాన మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం, మంత్రుల రాకతో మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు. మేడిగడ్డ సందర్శనకు సీపీఐ, ఎంఐఎం సభ్యులు. బీఆర్ఎస్, బీజేపీ దూరం. సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం నేడు సందర్శించనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో అక్కడికి వెళ్లనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బస్సులు సిద్ధంగా ఉన్నాయి. అసెంబ్లీ నుంచి బస్సుల్లో నేరుగా మేడిగడ్డకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జి, కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రుల మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి.. హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. -
కాళేశ్వరం అవినీతికి బీజేపీ మద్ధతు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సాక్షి: బాధ్యతలు తీసుకుని నెలైనా గడవక ముందే తమ ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో సీబీఐ విచారణ డిమాండ్ చేసే క్రమంలో కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చేసిన రాజకీయ విమర్శలకు మంత్రి ఉత్తమ్ మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చారు. కిషన్రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు ఇచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రూల్స్ మార్చారు. స్వాతంత్రం తరువాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు. బ్యాంక్ లు, రూరల్ ఎలాక్ట్రిఫిషల్ ద్వారా లోన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం ఇప్పించింది. పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్కు నిబంధనలు మార్చేసి మరీ లోన్ ఇచ్చింది. ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. లక్షా 27 వేల కోట్లు మంజూరు చేశారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకే రూ. 60వేల కోట్ల లోన్ బీజేపీ ఇప్పించింది. ‘‘దోచుకుందాం’’ అని లక్షల కోట్లు ఇచ్చారా?.. మేడిగడ్డ 5 పిట్లు కుంగితే కనీసం కిషన్ రెడ్డి పరిశీలన చెయ్యలేదు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితె ఎందుకు విజిట్ చెయ్యలేదు?. మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు?. 80వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1లక్ష 27వేల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది?. సీబీఐ-ఈడీ అంటూ ఇప్పుడు కిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ఈడీ కేసులు వేసిన బీజేపీ.. కేసీఆర్ పై ఎందుకు వెయ్యలేదు?. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోడీ, జేపీ నడ్డా పదే పదే అన్నారు కదా.. మరి ఎందుకు విచారణకు అదేశించలేదు? .. లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. పదేళ్ల పాటు లక్షల కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు తిన్నారు అని బీజేపీ ఆరోపణ చేసింది మరి సీబీఐ విచారణ ఎందుకు కోరలేదు. మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుంది. ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం. .. కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జ్యుడీషియల్ విచారణ ఈ వారంలోనే మొదలు పెట్టాం. పదేళ్లపాటు అవినీతి కోసం బీజేపీ-బీఆర్ఎస్లు కలిసి పని చేశాయి. బాధ్యతలు తీసుకుని 20 రోజలైనా గడవక ముందే మాపై విమర్శలా?. కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదు. ఎవరు తప్పు చేసినా మేం వదిలిపెట్టం అని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అంతకు ముందు.. కాళేశ్వరం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు. ‘‘కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించాం. కేసీఆర్ను రక్షించేందుకే బీజేపీ సీబీఐ విచారణ అడుగుతోంది. జ్యుడీషియల్ విచారణకు కేంద్రం ఉన్న బీజేపీ న్యాయ శాఖ సుప్రీం, లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జీని నియమించాలి. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే.. కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి’’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘కాళేశ్వరం అవినీతి.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య సయోధ్యనా?’ -
రివైండ్ 2023.. 'వెలుగు' నీడలు..
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఒకేసారి ఏడు ప్రభుత్వ కాలేజీల ప్రారం¿ోత్సవం, వచ్చే సంవవత్సరానికి మరో ఏడు జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు. ఇది సాకారం అయితే దేశంలోనే ప్రతిజిల్లాలోనూ మెడికల్ కాలేజీలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కుతుంది. సాగునీటిరంగంలో కాళేశ్వం ప్రాజెక్టు లోపాలు పెద్ద కుదుపుగా చెప్పవచ్చు. పింఛన్లు పెంపు ఆసరా లబ్ధిదారులకు కొంత ఊరట కలిగించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులకు బ్రేక్ పడింది. కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి కారణంగా ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యం జరిగింది. వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏడాది సాధించిన ప్రధాన విజయాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించడంగా చెప్పవచ్చు. 2023–24 సంవత్సరంలో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే మెడికల్ విద్యార్థులు వాటిల్లో చేరారు. ఇక 2024–25 సంవత్సరంలోనూ జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుంది. అంటే 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 33 జిల్లాలకుగాను ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకాగా, తాజాగా అనుమతించిన 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజీ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుంది. ఇవి పూర్తయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య మొత్తం 34కు చేరుతుంది. తాజా నిర్ణయంతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్టే. అంటే మొత్తంగా రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. పీఆర్ అండ్ ఆర్డీ పింఛన్ రూ. 3,016 నుంచి రూ.4,016కు పెంపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విషయానికొస్తే..ప్రధానంగా ఆసరాలో భాగంగా దివ్యాంగుల పింఛన్ రూ.3,016 నుంచి రూ. 4,016కు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. పెంపునకు అనుగుణంగా 5,11,656 మందికి నెలకు రూ.205.48 కోట్లు అందజేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ♦ జీపీలు, సర్పంచ్లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విడుదలలో జాప్యం గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పటికప్పుడు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పలు జీపీల్లో సర్పంచ్లు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. వివిధ పనుల కోసం సొంత నిధులు ఖర్చు చేసినా ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాలేదు. ఈ బిల్లుల కోసం ఎదురుచూస్తూ, ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి కొందరు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లోనూ నిధుల సమస్య ఉపాధి హామీ అమల్లో భాగంగా... తెలంగాణలో నియమ,నిబంధనలు, మార్గదర్శకాలు సరిగ్గా పాటించడం లేదంటూ రాష్ట్రానికి కేంద్రం నిధులు నిలిపేసింది. అయితే కేంద్రం పక్షపాతం ప్రదర్శిస్తూ సకాలంలో నిధులు విడుదల చేయడం లేదంటూ బీఆర్ఎస్ సర్కార్ విమర్శలు సంధించింది. ఇదిలా ఉంటే...ఈ పథకంలో భాగంగా ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్, ఔట్సోర్సింగ్–కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి గత రెండు, మూడు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మా‘స్టార్’ ఏదీ? ♦ సాగని పదోన్నతులు... ఆగిన బదిలీలు ఆఖరులో తప్పని ♦ టెట్ చిక్కులు.. టీచర్ పోస్టులకూ బ్రేకులు ♦ ఉన్నత విద్యామండలిలో మహా నిశ్శబ్దం దీర్ఘకాలిక డిమాండ్ అయిన బదిలీలు, పదోన్నతులుపై ఆశలు రేకెత్తిందీ ఈ ఏడాదే. 10 వేలమంది టీచర్లు ప్రమోషన్లపై కలలుగన్నారు. దాదాపు 50 వేలమంది స్థానచలనం ఉంటుందని ఆశించారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన ఊరట ఎంతోకాలం నిలవలేదు. అడ్డుపడ్డ కోర్టు వ్యాజ్యాలు టీచర్ల ఆనందాన్ని ఆవిరి చేసింది. ప్రమోషన్లకూ బ్రేకులు పడటం 2023 మిగిల్చిన చేదు జ్ఞాపకమే. ఉపాధ్యాయ కొలువుల భర్తీపై నిరుద్యోగుల గంపెడాశలకు 2023 నీళ్లు చల్లింది. విద్యాశాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా, 5 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ రావడం, అదీ అర్ధంతరంగా ఆగిపోవడం నిరుద్యోగులకు 2023 అందించిన ఓ పీడకల. జాతీయ ర్యాంకుల్లో మన విశ్వవిద్యాలయాల వెనుకబాటు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం జరిగిన ఉద్యమాలు దూరమయ్యే కాలంలో కని్పంచిన దృశ్యాలు. బాసర ట్రిపుల్ ఐటీలో వెంటవెంట జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థిలోకాన్ని కలవరపెట్టాయి. టెన్త్ పరీక్షల సరళీకరణ, ఇంటర్ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం 2023లో కనిపించిన కొత్తదనం. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలిలో కుదుపులకు గతించే కాలమే సాక్షీభూతమైంది. మండలి చైర్మన్, వైస్చైర్మన్ తొలగింపుతో కార్యకలాపాలే మందగించిపోవడం ఈ ఏడాదిలో ఊహించని పరిణామమే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు విద్యార్థులు పోటెత్తడం ఈ సంవత్సరంలో కనిపించిన విశేషం. కరోనా కాలం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న జేఈఈ మెయిన్ కాస్తా గాడిలో పడింది. రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి ♦ 2022–23 సీజన్లో వరి ఉత్పత్తి ♦ 2.58 కోట్ల టన్నులు రికార్డులు బద్దలు కొట్టిన తెలంగాణ వ్యవసాయరంగం రాష్ట్రంలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ధాన్యం 2.58 కోట్ల టన్నులు ఉత్పత్తి అయ్యింది. వానాకాలం సీజన్లో 1.38 కోట్ల టన్నులు, యాసంగిలో 1.20 కోట్ల టన్నులు ఉంది. ఈ మేరకు తుది నివేదికను ఈ ఏడాది ప్రభుత్వం విడుదల చేసింది. వానాకాలం సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఉత్పాదకత ఎకరానికి 2,124 కిలోలు వచ్చింది. కాగా, ఈ యాసంగిలో 57.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పాదకత ఎకరానికి 2,091 కిలోలు వచ్చింది. మొత్తంగా చూస్తే ఈ రెండు సీజన్లలో 1.22 కోట్ల ఎకరాల్లో వరి సాగు కాగా, ఎకరానికి 2,108 కిలోల ఉత్పాదకత వచ్చింది. ఆ మేరకు 2.58 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత మార్చి 15వ తేదీన విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. కాగా, ఈ ఏడాది వరకు 11 విడతల్లో కలిపి రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సాయం రూ. 72,815 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం 12వ విడత సొమ్మును కొత్త ప్రభుత్వం అందజేసే ప్రక్రియ చేపట్టింది. అందులో ఒక ఎకరాలోపు రైతులకు రైతుబంధు సొమ్ము అందజేస్తున్నారు. కాళేశ్వరం ‘కుదుపు’ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో మసకబారిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను కుంగదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బయటపడిన లోపాలు.. 2023 చివరి త్రైమాసికంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపివేశాయి. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పియర్లు గత అక్టోబర్ 21వ తేదీన కుంగిపోగా, కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడ్డాయి. ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులోని పియర్లు కుంగినట్టు ..నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. 7వ బ్లాక్ను పూర్తిగా పునర్నిర్మించాల్సిందేనని సిఫారసు చేసింది. ఇతర బ్లాకులూ విఫలమైతే బ్యారేజీని పూర్తిగా పునర్నిర్మించక తప్పదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకి సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించడంతో భవిష్యత్లో వాటికి సైతం ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చని ఎన్డీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. అన్నారం బ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీకి బుంగలు ఏర్పడినట్టు ఎన్డీఎస్ఏ బృందం మరో నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను సొంత ఖర్చులతో చేస్తామని గతంలో హామీ ఇచ్చిన నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మాట మార్చింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయం ఎవరు చేపట్టాలని అన్న అంశంపై ఎల్అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదు. మిల్లుల్లోనే రూ. 22 వేల కోట్ల విలువైన బియ్యం పేదలకు ఉచిత బియ్యం పంపిణీతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించే బృహత్తర బాధ్యత నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ 2023లో కొన్ని తప్పటడుగులు వేసింది. తద్వారా కార్పొరేషన్కు అప్పులు గుదిబండగా మారాయి. 2022 రబీ(యాసంగి)లో రైతుల నుంచి సేకరించిన సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి అప్పగించకపోవడంతో ఆ భారం సంస్థపై పడింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల బియ్యం విరిగి తమకు నష్టం వస్తుందని, అందుకే మిల్లింగ్ చేయలేమని రైస్మిల్లర్ల వాదనను అంగీకరించింది. మిల్లర్ల పట్ల ఉదారత చూపి, ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా, ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో మిల్లుల్లోనే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. వీటితో పాటు అంతకు ముందు లెక్క తేలని ధాన్యం కలిపి సుమారు రూ. 22వేల కోట్ల విలువైన 83 ఎల్ఎంటీ ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు మిల్లర్లు చూపారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఈ లెక్కలు తీసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల సంస్థ ఏకంగా రూ.56వేల కోట్ల అప్పులు ఉన్నట్లు లెక్కలు చెప్పారు. ఇవి కాకుండా రూ. 11వేల కోట్లు సంస్థ నష్టపోయినట్లు తేల్చారు. మిల్లర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగా 2023లో ఆ సంస్థ ప్రజల్లో పలుచనైపోయిందన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. -
కాళేశ్వరం ఖర్చు రూ.93,872.07 కోట్లు ..
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి రూ.19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి, 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 98,570 ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేశారు. మొత్తం రూ.1,27,872.28 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటివరకు రూ.93,872.07 కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ద్వారా సమీకరించిన రూ.61,665.20 కోట్ల రుణాలతోపాటు రూ. 32,206.87 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందులో ఉన్నాయి. కాళేశ్వరం కింద 18,64,970 ఎకరాల మిగులు ఆయకట్టును 2028–29 నాటికి అభివృద్ధి చేసేందుకు గత ప్రభు త్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలపై మంత్రుల బృందానికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు అర్ధంతరంగా విరమించుకున్నారు? ఆ ప్రాజెక్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచి్చంది? వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు, నిధుల సమీకరణ, విద్యుత్ అవసరాల విషయంలో రెండు ప్రాజెక్టుల మధ్య తేడాలేంటి? మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో తలెత్తిన లోపాలు, సమస్యలేంటి? వాటికి పరిష్కార మార్గాలేంటి? అన్న అంశాలతో నీటిపారుదల శాఖ పీపీటీని సిద్ధం చేసింది. వడ్డీ రూపంలో రూ.16,201.94 కోట్లు ఇప్పటివరకు తీసుకున్న రుణంలో అసలు రూ.4,696.33 కోట్లు మాత్రమే చెల్లించగా, గత ఐదేళ్లలో వడ్డీలు రూ.16,201.94 కోట్లు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి రూ.21,157.87 కోట్లు చెల్లించా రు. కాళేశ్వరం కార్పొరేషన్లో భాగమైనపాలమూరు–రంగారెడ్డికి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కాగా.. పవర్ఫైనాన్స్ కార్పొరేషన్రూ.7,721.51 కోట్లు విడుదల చేసింది. ఇంకో రూ.2,278.49 కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు గత మూడేళ్లలో రూ.1,522.8 కోట్ల వడ్డీ చెల్లించగా, అసలు చెల్లింపులు ఇంకా మొదలుకాలేదు. 17.08 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ దిగువ మానేరు జలాశయం కింద ఎస్సారెస్పీ స్టేజ్–1కి సంబంధించిన పాత ఆయకట్టుతోపాటు ఎస్సారెస్పీ స్టేజ్–2, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద పాత ఆయకట్టుకు 2023–24 ఖరీఫ్, రబీ సీజన్లలో కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించారు. దీంతో మొత్తం 17,08,230 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించినట్టు నీటిపారుదల శాఖ మంత్రులకు నివేదించనుంది. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా 456 చెరువులను నింపగా, వాటి కింద 39,146 ఎకరాల ఆయకట్టు ఉంది. కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీ–1, 2, నిజాంసాగర్ కాల్వల ద్వారా 2,143 చెరువులకు తరలించగా, వాటి కింద మరో 1,67,050 ఎకరాల ఆయకట్టు ఉంది. ♦ 2020–21 రబీ నుంచి 2023–24 ఖరీఫ్ వరకు కుందెల్లి వాగు, హల్దివాగు, 66 చెక్డ్యామ్ల కింద ఉన్న మొత్తం 20,576 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలను విడుదల చేశారు. -
కేసీఆర్ సర్కారు కంపుని ఎలా భరిస్తున్నారు?: రేవంత్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కోదండరాంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హెచ్చరించారు. కోదండరాం కాంగ్రెస్ కోసం పోటీ చేయకపోతే కేఏ పాల్ బీఆర్ఎస్ కోసమే పోటీ చేయడం లేదా చెప్పాలని ఫైర్ అయ్యారు. శనివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అని ఆరోపించారు. ఈ కుటుంబాన్ని శిక్షించడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. కాళేశ్వరంపై జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కోరారు. మేడిగడ్డ బ్యారేజ్కు జరిగిన డ్యామేజ్ పై చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి వాసననే పడని మోదీ కేసీఆర్ సర్కారు కంపుని ఎలా భరిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. మోదీకి కంపు కొట్టకుండా కేసీఆర్ ఏదైనా సెంటు కొట్టి వశీకరణ చేస్తున్నారా? చెప్పాలన్నారు.ఇద్దరం ఒకటే అని కేసీఆర్,మోదీ చెప్పదలచుకున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారన్నారు.కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆలోచనలు మారి ఆశలు పెరిగాయన్నారు. ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు,నిర్మాణం వేరుకావడం వల్లే మునిగిపోతున్నాయి.కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగింది. కాళేశ్వరం కోసం తన మెదడును ఖర్చు చేశానని చెప్పిన కేసీఆర్ లోపాలు బయట పడగానే తప్పించుకుంటున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారు. కమిషన్లు నొక్కేయడానికే కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ప్లాన్ వేశారు’అని రేవంత్ విమర్శించారు. -
మేడిగడ్డ ఏడో బ్లాక్ పరిధిలో పనులు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. బ్యారేజ్ దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయపరమైన విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు బ్యారేజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరోవైపు డ్యామేజ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. పిలర్లు కుంగిపోయిన ఏడో బ్లాక్ పరిధిలో పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. నీటిని మళ్లించినా ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి బ్యారేజ్కు నీరు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఎగువ నుంచి 26,350 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 61 గేట్లు ఎత్తి 22,590 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నదిలో కాఫర్ డ్యాం పనులు సాగుతున్నట్లు తెలుస్తోంది. అన్నారం బుంగల కోసం గ్రౌటింగ్ అన్నారం (సరస్వతి) బ్యారేజీ బుంగలు ఏర్పడిన విషషయమూ తెలిసిందే. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇసుక, రాళ్లతో కూడిన సంచులు వేసినా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని సమాచారం. దీంతో రెండు పియర్ల వద్ద సీపేజీ (బుంగలు) ఏర్పడగా వాటి మరమ్మతులకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం రానున్నట్లు సమాచారం. 2020లో ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా పాలియూరిథిన్ (పీయు) గ్రౌటింగ్ ద్వారా బుంగలను పూడ్చారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని అవలంబించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్ మూసివేత -
మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్ మూసివేత
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుపై జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా ఉండడం.. అది కాస్త రాజకీయ విమర్శలకు దారి తీయడం తెలిసిందే. మరోవైపు మేడిగడ్డ సందర్శన కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతుండడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యారేజ్ను పరిశీలించగా.. తాజాగా బీజేపీ నేతలు బ్యారేజ్ సందర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్ శనివారం బ్యారేజ్ వద్దకు వెళ్లనున్నారు. హెలికాఫ్టర్లో బ్యారేజ్ను పరిశీలించే అవకాశం ఉంది. మేడిగడ్డతో పాటు అన్నారం (సరస్వతీ) బ్యారేజ్ను కూడా సందర్శించనున్నట్లు సమాచారం. బారికేడ్లు ఏర్పాటు మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. రాహుల్ పర్యటన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బ్యారేజ్ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యారేజ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇనుప రేకులు, బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ బ్యారేజ్ వైపు ఎవరినీ వెళ్లకుండా చూస్తున్నారు. ప్రస్తుతానికి అధికారులు, సిబ్బందిని మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు. నివేదిక ఇలా.. బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ కుంగిపోయి దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ అక్టోబర్ 24వ తేదీన బ్యారేజ్ను సందర్శించింది. ప్రాజెక్టకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం నుంచి కోరింది. కానీ, తెలంగాణ సర్కార్ పూర్తి వివరాలు అందించలేదని సదరు కమిటీ తాజాగా తన నివేదిక విడుదల చేసింది. అంతేకాదు.. ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పియర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. 7వ నంబర్ బ్లాక్లో తలెత్తిన తీవ్ర ప్రతికూల పరిస్థితితో బ్యారేజీ పనితీరుపై తీవ్ర దుప్రభావం పడిందని, ప్రస్తుత పరిస్థితిలో అది ఉపయోగానికి పనికిరాదని స్పష్టం చేసింది. సంబంధిత వార్త: డిజైన్కు విరుద్ధంగా మేడిగడ్డ నిర్మాణం! రాజకీయ విమర్శలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు.. మేడిగడ్డ ఎన్డీఎస్ఏ నివేదిక విమర్శల్ని మరింతగా గుప్పించేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ నివేదికపై అధికార బీఆర్ఎస్ మండిపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కుటప్రూరితంగా నివేదిక ఇచ్చిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కమిటీ రావడం, అధ్యయనం చేయడం, నివేదిక ఇవ్వడం అంతా మూడు రోజుల్లోనే జరిగిపోయిందని, ఈ వేగం చూస్తే దేశంలో మిగతా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో.. ఇదీ అలాగే చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. -
మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పియర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. 7వ నంబర్ బ్లాక్లో తలెత్తిన తీవ్ర ప్రతికూల పరిస్థితితో బ్యారేజీ పనితీరుపై తీవ్ర దు్రష్పభావం పడిందని, ప్రస్తుత పరిస్థితిలో అది ఉపయోగానికి పనికిరాదని స్పష్టం చేసింది. 7వ నంబర్ బ్లాక్ మొత్తం పునాదులతో సహా తొలగించి పూర్తి స్థాయిలో కొత్తగా పునర్నిర్మించిన తర్వాతే బ్యారేజీ ఉపయోగంలోకి వస్తుందని తెలిపింది. ఈ సమయంలో బ్యారేజీలో నీళ్లు నింపితే పరిస్థితి మరింతగా దిగజారుతుందని హెచ్చరించింది. బ్యారేజీ నిర్మాణ సారూప్యతలను పరిగణనలోకి తీసుకుంటే ఇతర బ్లాకులూ ఇదే రీతిలో విఫలమయ్యే పరిస్థితులున్నాయని, అదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించక తప్పదని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై ఎన్డీఎస్ఏ సభ్యుడు, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా ఎన్డీఎస్ఏ చైర్మన్కు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలతో ఎన్డీఎస్ఏ చైర్మన్ సంజయ్కుమార్ సిబల్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్కు ఈ నెల 1న లేఖ రాశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పునాది కుంగడం వల్లే.. ర్యాఫ్ట్ (పునాది) కుంగడమే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి మూలకారణం. బ్యారేజీకి 3.3 మీటర్ల లోతుతో కాంక్రీట్ పునాది నిర్మించారు. ర్యాఫ్ట్కి ముందు, వెనుక రెండువైపులా 15 మీటర్ల లోతులో సెకెంట్ పైల్స్ (కటాఫ్ వాల్స్) నిర్మించారు. ర్యాఫ్ట్ కుంగడంతో దానిపై నిర్మించిన పియర్లూ (బ్యారేజీ గేట్ల మధ్య పిల్లర్లుగా ఉండే కాంక్రీట్ నిర్మాణం) కుంగి, వాటికి పగుళ్లు ఏర్పడ్డాయి. ర్యాఫ్ట్ కుంగడానికి పలు కారణాలుండవచ్చు. ర్యాఫ్ట్ కింది ఇసుక కొట్టుకుపోవడం/ ఆ ఇసుకకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం (బేరింగ్ కెపాసిటీ) లేకపోవడం/ బ్యారేజీ బరువు (లోడ్), ఇతర కారణాలతో ర్యాఫ్ట్కి ముందు భాగంలోని సెకెంట్ పైల్స్ విఫలం కావడం వంటి కారణాలు ఉండవచ్చు. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ నిర్మాణంలో నాణ్యత లోపం నాణ్యత పర్యవేక్షణలో వైఫల్యాలతో బ్యారేజీ కింద ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ నిర్మాణంలో లోపాలు జరిగాయి. పక్కపక్కనే ఉండే సెకెంట్ పైల్స్ ఒకదానికి ఒకటి అతుక్కుని ఉండాలి. మధ్యలో గ్యాప్ ఉండకూడదు. కానీ గ్యాప్ ఏర్పడడంతో వాటి మధ్య నుంచి నీళ్లు పారి ర్యాఫ్ట్ కింద ఇసుక కొట్టుకుపోయింది. డిజైన్కు విరుద్ధంగా నిర్మాణం ఫ్లోటింగ్ స్ట్రక్చర్ (తేలియాడే కట్టడం)గా బ్యారేజీని డిజైన్ చేసి, రిజిడ్ స్ట్రక్చర్(దృఢమైన కట్టడం)గా నిర్మించారు. అంటే ఇసుక మీద బ్యారేజీ కట్టే పద్ధతుల మేరకు డిజైన్ రూపొందించి, దానికి భిన్నంగా రాతి మీద బ్యారేజీ నిర్మించే పద్ధతుల్లో నిర్మాణం జరిపారు. భూగర్భంలో రాయి తగిలే దాకా బ్యారేజీకి ఎగువ, దిగువన కాంక్రీట్ గోడలు (సెకెంట్ పైల్స్) నిర్మించారు. నీటి ప్రవాహానికి బ్యారేజీ అడ్డంకిగా ఉండడంతో ఏర్పడే ఊర్ధ్వ పీడనం (అప్లిఫ్ట్ ఫోర్స్) బ్యారేజీ పునాదుల కింది నుంచి నిష్క్రమించకుండా ఈ కాంక్రీట్ గోడలు అడ్డంకిగా మారాయి. దీంతో ఊర్ధ్వ పీడనం తీవ్రమై ర్యాఫ్ట్ కింద ఇసుకను బ్యారేజీ బయటికి తన్నడంతోనే ర్యాఫ్ట్ కుంగిపోయింది. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం జరిగింది. నిర్మాణం పూర్తైన నాటి నుంచి ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత నిర్వహించాల్సిన సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలను జరపలేదు. ఏదైన లోపాలుంటే గుర్తించడానికి వర్షాకాలానికి ముందు, తర్వాత తనిఖీలు జరపాలని తెలంగాణకు ఎన్డీఎస్ఏ క్రమం తప్పకుండా సూచించినా పట్టించుకోలేదు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లోని చాప్టర్ 10 సెక్షన్ 41(బీ) కింద దీనిని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. చాలా విషయాల్లో ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. ఇది చాలా తీవ్రమైన విషయం. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. అడిగిన సమాచారం ఇవ్వలేదు.. నిపుణుల కమిటీ 20 రకాల సమాచారాన్ని కోరగా, నీటిపారుదల శాఖ 11 రకాల వివరాలను మాత్రమే అందజేసింది. ఇన్స్ట్రుమెంటేషన్ డేటా, వర్షాలకు ముందు తర్వాత బ్యారేజీ తనిఖీల సమాచారం, ప్రాజెక్టు కంప్లీషన్ రిపోర్టు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, గేట్ల స్థితిగతులు తెలిపే వివరాలు.. లాంటి అనేక రకాల సమాచారాన్ని ఇవ్వలేదు. ఇవ్వడానికి వారి వద్ద ఎలాంటి సమాచారం లేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతోంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం లభ్యత ఉన్న సమాచారం బ్యారేజీ అధికారులు ఇవ్వకుండా నిరాకరించడానికి ఆస్కారం లేదు. సమగ్ర దర్యాప్తు జరపాలి.. బ్యారేజీ వైఫల్యానికి దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి. దర్యాప్తులో తేలిన వివరాలతో పాటు బ్యారేజీ పునరుద్ధరణ ప్రతిపాదనలను ఎన్డీఎస్ఏకు తెలపాలి. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో ఇదే ప్రక్రియను అనుసరించాలి. అన్నారం, సుందిళ్లకూ ప్రమాదమే! కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించారు. దీంతో ఈ రెండు బ్యారేజీలు కూడా భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువన నీళ్లు ఉబికిరావడం (బాయిలింగ్) వైఫల్యానికి ముందస్తు సూచిక లాంటిదే. బ్యారేజీల పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడాన్ని సాంకేతిక పరిభాషలో పైపింగ్ అంటారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద పైపింగ్ను అత్యవసరంగా పరీక్షించాలి. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది: కిషన్ రెడ్డి
-
‘కేసీఆర్ ఇంజనీర్గా మారి కట్టడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలోనే ప్రాజెక్టు కుంగిపోయిందని, నాణ్యత లేని నాసిరకం నిర్మాణం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్లో శుక్రవారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుపై ప్రభుత్వం కనీసం సమాధానం చెప్పలేదని పరిస్థితి నెలకొందనన్నారు. కాళేశ్వరంపై పాదదర్శకత లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుకు వచ్చేది రూ.40 వేలు అయితే.. ప్రాజెక్టు నిర్వహణకు ఎకరాకు రూ. 85 వేలు ఖర్చవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇంత వ్యత్యాసం ఉందంటే.. ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం కట్టినట్లా? కాంట్రాక్టర్ల కోసం కట్టినట్లా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం కట్టారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మీద ఆర్థిక భారం మోపే ప్రాజెక్టు అని విమర్శించారు. డ్యాం సేఫ్టీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని దుయ్యబటారు. ప్రాజెక్టుపై 9 అంశాలకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంజనీర్గా మారి కట్టడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. చదవండి: పప్పు వ్యాఖ్యలపై కేటీఆర్కు రేవంత్ రెడ్డి కౌంటర్.. ‘కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా కట్టినట్లు బీఆర్ఎస్ చెప్పుకుంది. డిస్కవరీ ఛానల్లో కూడా ప్రచారం చేసుకున్నారు. ప్రజాధనం మొత్తం రాళ్లు, నీళ్ల పాలయింది. కాంగ్రెస్ హయాంలో 30 వేల కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ కేసీఆర్ రీడిజైన్ పేరిట 1.30 లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించారు. ఇంజినీరింగ్ మార్వల్ అని గొప్పలు చెప్పుకున్నారు. జబ్బలు చరుచుకున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్నారు. అలాంటి ప్రాజెక్టు కట్టిన నాలుగేళ్ళకే పిల్లర్లు కుంగిపోయాయి. ఆ పిల్లర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. కాంట్రాక్టు ఎవరికిచ్చారు? ఎంత ఖర్చయింది అనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన జలశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక డాక్యుమెంట్లు ఇవ్వలేని పరిస్థితి. లో క్వాలిటీ సాండ్ మెటీరియల్ వాడారని నిపుణుల నివేదికలో తేలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిపుణులు, ఇంజినీర్ల మాటలు పక్కనపెట్టి తానే ఇంజినీర్ లాగా వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల ప్రాజెక్టు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది. పిల్లర్లు కుంగిపోవడంపై కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. కేసీఆర్ కమీషన్లు తీసుకోవడంలో, తెలంగాణ సొమ్ము దోచుకోవడంలో సక్సెస్ అయ్యారు.. కానీ ప్రాజెక్టు విషయంలో ఫెయిలయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతాం. బాధ్యులు ముఖ్యమంత్రి అయినా, కాంట్రాక్టర్లు అయినా వందకు వంద శాతం చర్యలు తీసుకుంటాం. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళతాం’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది : సీఎం కేసీఆర్ -
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక
-
కాళేశ్వరం మేడిగడ్డపై NDSA సంచలన నివేదిక
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది. అంతేకాదు.. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్లపై తెలంగాణ సర్కార్ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్ అథారిటీ పేర్కొనడం గమనార్హం. పిల్లర్లు కుంగడానికి NDSA చెప్పిన కారణాలు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ని ఉపయోగించడానికి అవకాశం లేదు ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుంది అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపైనా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాలి. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయి’’ అని తన నివేదికలో డ్యామ్ అథారిటీ పేర్కొంది. కాళేశ్వరం మేడిగడ్డపై డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి కమిటీ కోరినా.. మేడిగడ్డ బ్యారేజ్ 2019లో నిర్మించబడింది. 2023 అక్టోబర్ 21వ తేదీన బ్యారేజ్ పునాది భారీ శబ్దంతో కుంగిపోయింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ అక్టోబర్ 24వ తేదీన మేడిగడ్డ డ్యామ్ను సందర్శించింది. అక్టోబర్ 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. కానీ, సర్కార్ పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్ 29లోపు పూర్తి డేటాను ఇవ్వకపోతే బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని భావించాల్సి వస్తోందని కమిటీ చెప్పినా కూడా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. -
కాళేశ్వరం ఏటీఎంలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ప్రచారం చేసుకుంటోంది. అధికార బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించే క్రమంలో వెరైటీ కాన్సెప్ట్లతో ముందుకు వస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న హస్తం.. ఇప్పుడు ఆ ఆరోపణలనూ ప్రచారానికి వాడుకుంటోంది. తాజాగా.. కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించి ప్రచారంలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫొటోతో కూడిన కాళేశ్వరం ఏటీఎంను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. ఆ ఏటీఎంలపై కాళేశ్వరం కరప్షన్ రావు( KCR) పేరుతో వినూత్నంగా కేసీఆర్ ఫొటోను.. కాళేశ్వరం కరప్షన్ రాకెట్ బ్యాంక్.. అలాగే కేసీఆర్ పేరుతో లక్ష కోట్ల నోటును రిలీజ్ చేసింది. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం అంటూ ఏటీఎంపై పేర్కొంది కాంగ్రెస్. -
జంతర్ మంతర్వద్ద వైఎస్ షర్మిల ధర్నా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, అయినా ఇప్పటివరకు దీనిపై ఎటువంటి విచారణ చేపట్టలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షరి్మల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పోరాడేందుకు ఎంపీలు కూడా తనతో కలసి రావాలని ఆమె సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ మంగళవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనుందని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఎస్సారెస్పీ ఫేజ్–2, ఎల్లంపల్లి, వరద కాలువ, దేవాదుల, మిడ్మానేర్ లాంటి ప్రాజెక్టులు నీళ్లు ఇస్తుంటే అవి కాళేశ్వరం నుంచి వస్తున్న ట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు సిగ్గు లేకుండా మద్దతిస్తున్నారని మండిపడ్డారు. -
కాళేశ్వరానికి ‘అదనపు’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనపు టీఎంసీ ఎత్తిపోసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాళేశ్వరం అదనపు టీఎంసీ డీపీఆర్కు అనుమతుల జారీ ప్రక్రియ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు ఇటీవల లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాల్లో స్టేటస్ కో కొనసాగించాలని కేంద్ర న్యాయ శాఖ సూచించినట్లు గోదావరి బోర్డుకు జలశక్తి శాఖ తెలియజేసింది. దీంతో కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను ప్రస్తుతానికి గోదావరి బోర్డు పక్కనబెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అదనపు టీఎంసీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అనుమతుల ప్రక్రియకు సైతం బ్రేక్ పడినట్టు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూ. 85 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అదనపు టీఎంసీ సహా ఇతర పనుల పూర్తికి మరో రూ. 30 వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. డీపీఆర్ పరిశీలనకు గోదావరి బోర్డు నో గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అన్ని రకాల అనుమతులతో చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ తర్వాత అదనపు టీఎంసీ తరలింపు పనులను మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండానే మొదలుపెట్టింది. అయితే ఈ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిన కేంద్ర జలశక్తి శాఖ... 6 నెలల్లోగా అనుమతి పొందాలని 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఆదేశించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... అదనపు టీఎంసీ తరలింపు కోసం చేపడుతున్న పనులు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని... అందువల్ల అనుమతిలేని ప్రాజెక్టుల జాబితా నుంచి దీన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సవరించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. కేంద్ర జలసంఘానికి ఇప్పటికే సవరించిన డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించగా హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు లభించాయి. అనంతరం సవరించిన డీపీఆర్ను గోదావరి బోర్డుకు సాంకేతిక అనుమతుల కోసం పంపింది. బోర్డు ఈ డీపీఆర్ను పరిశీలించి సంతృప్తి చెందితే కేంద్ర జలశక్తి శాఖలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం కోసం సిఫారసు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియను తాజాగా గోదావరి బోర్డు పక్కన బెట్టింది. మరికొంత కాలం తప్పని జాప్యం... పరిహారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొందరు ప్రాజెక్టు భూనిర్వాసితులు... రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే అదనపు టీఎంసీ పనులు చేపడుతోందని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అంశాలపై స్టేటస్ కో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ తుది తీర్పునకు లోబడి చర్యలు ఉండాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
గోదావరి బోర్డుకు కాళేశ్వరం సవరణ డీపీఆర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్ను గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ)కు సమర్పించింది. తొలుత రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలు ఎత్తిపోసే లక్ష్యంతో కాళేశ్వరాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దానికి సంబంధించిన అనుమతులన్నీ కేంద్రం నుంచి పొందింది. తర్వాత మరో టీఎంసీ అదనంగా తరలించే పనులను చేపట్టింది. అయితే కేంద్రం ఈ మూడో టీఎంసీ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చుతూ.. ఆరునెలల్లో అనుమతి తీసుకోవాలని 2021 జూలై 15న ఆదేశించింది. అయితే రోజుకు రెండు టీఎంసీలు తరలించే ప్రాజెక్టు, అదనపు టీఎంసీ తరలించే పనులు వేర్వేరు కాదని, రెండూ కాళేశ్వరంలో అంతర్భాగమేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనితో సవరించిన కాళేశ్వరం డీపీఆర్ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సవరణ డీపీఆర్ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు సమర్పించి హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు పొందింది. తాజాగా రూ.1.15 లక్షల కోట్ల అంచనాతో సవరించిన డీపీఆర్ను గోదావరి బోర్డుకు అందించింది. గోదావరి బోర్డు డీపీఆర్పై సాంకేతిక పరిశీలన జరిపాక.. సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఓకే చేస్తుంది. చివరిగా అపెక్స్ కౌన్సిల్లో డీపీఆర్పై చర్చించి ఆమోదముద్ర వేస్తారు. మరో రూ.30వేల కోట్లు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.85 వేలకోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. కొత్త డీపీఆర్ ప్రకారం మిగతా పనుల పూర్తికి ఇంకో రూ.30వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఆర్ఈసీ, పీఎఫ్సీతోపాటు పలు బ్యాంకుల నుంచి కాళేశ్వరం కార్పొరేషన్కు రావాల్సిన రుణాలు ఏప్రిల్ నుంచి నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర బడ్జెట్ నిధులే దిక్కు అని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కాళేశ్వరం వృథా కాదు.. ఆదా! -
కాళేశ్వరంతో ఎంత ఆదాయం వచ్చింది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఆదాయం వస్తుందా? ఇప్పటి వరకు వచ్చిందెంత?.. అని ప్రాజెక్టు నిర్మాణానికి రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాయి. ఈ వివరాలి వ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరా యి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.65,454 కోట్ల ప్రత్యక్ష ఆదాయం రానుందని బ్యాంకులకు సమర్పించిన టెక్నో–ఎకనామిక్ వయబిలిటీలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. నీటి తీరు వా పన్నులు, పరిశ్రమలకు ముడి నీటి సరఫ రా, జంట నగరాలు, గ్రామాలకు తాగునీరు సరఫరాకు వసూలు చేయనున్న చార్జీలు, తదితర మార్గాల్లో ఈ మేరకు ఆదాయం రానుందని ప్రభుత్వం తెలిపింది. దీని ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణానికి రుణాలిచ్చాయి. బ్యాంకులు, రుణసంస్థలతో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభు త్వం రుణాలను తిరిగి చెల్లించాలి. గత మా ర్చి 31 నాటికి కాళేశ్వరం పూర్తై వాణిజ్యపర కార్యకలాపాలను ప్రారంభించిందని కాళేశ్వ రం ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు లిమిటెడ్ (కేఐపీసీఎల్).. బ్యాంకుల కన్సార్టియంకు నివేదించింది. ఇప్పటి వరకు ప్రభుత్వమే తన బడ్జెట్ నుంచి ప్రాజెక్టు కోసం తీసుకున్న రు ణాలకు వడ్డీలు చెల్లిస్తోంది. కాళేశ్వరం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందని ప్రక టించిన నేపథ్యంలో గత జూన్ నుంచి అసలు రుణాల వాయిదాలతో పాటు వడ్డీ చెల్లింపు ను ప్రాజెక్టు ద్వారా వస్తున్న ఆదాయంతో కట్టాలి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చిందో సమాచారమివ్వాలని బ్యాంకులు తాజాగా కేఐపీసీఎల్ను కోరాయి. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) సి.మురళీధర్ తాజాగా రాష్ట్ర ప్ర భుత్వానికి రాసిన లేఖలో ఈ విషయాలను పొందుపరిచారు. ఈ క్రమంలో వివిధ రూపా ల్లో వస్తున్న ఆదాయాన్ని కాళేశ్వరం కార్పొరేషన్కు సాధ్యమైనంత త్వరగా బదిలీ చేయాలని ఆయన ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే.. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.86,064 కోట్ల రుణాలను వివి ధ బ్యాంకులు, సంస్థల నుంచి తీసుకుంది. మొత్తం రూ.97,445 కోట్ల రుణాలు రావాల్సి ఉండగా, మిగిలిన రుణాలు కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో నిలిచిపోయాయి. జంట నగరాల్లో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటిని సరఫరా చేస్తుండటంతో జలమండలికి వచ్చే ఆదాయం పడిపోయింది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు సరఫరా చేసే నీళ్లకు సైతం నీటి కుళాయి చార్జీలు వసూలు చేయట్లేదు. రాష్ట్రంలో నీటి తీరువా పన్నుల వసూళ్లను ఎప్పుడో ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. నీటి తీరు వా పన్నులు, కుళాయి చార్జీలను రాష్ట్ర ప్రభు త్వం సబ్సిడీల రూపంలో కాళేశ్వరం కార్పొరే షన్ ఖాతాలోకి జమ చేయక తప్పని పరిస్థితి.. దీనికి బ్యాంకులు, రుణ సంస్థలు అంగీకరిస్తాయా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
‘కాళేశ్వరం’ విద్యుత్ బకాయిలు 3,114 కోట్లు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 140 టీఎంసీల నీటిని తరలించగా మొత్తం రూ. రూ. 3,600 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. అయితే బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు జరిపిన చెల్లింపులు పోగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు రూ. 2,575.58 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు రూ. 538.51 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ రెండు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ. 3,114.09 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రెండు డిస్కంలు నీటిపారుదల శాఖకు తాజాగా లేఖలు రాశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకమ్మసాగర్లకు నీళ్లను ఎత్తిపోయడానికి మూడేళ్లలో మొత్తం రూ.866.21 కోట్ల విద్యుత్ బిల్లులు రాగా, రూ. 327 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ నీటి తరలింపునకు రూ. 25.71 కోట్ల మేర విద్యుత్ చార్జీల వ్యయమైంది. అలాగే ఎకరం సాగుకు విద్యుత్ బిల్లుల రూపంలో రూ. 21,810 ఖర్చయింది. భవిష్యత్లో మరింత భారం... కాళేశ్వరం ఎత్తిపోతల కింద నెలకొల్పిన 19 పంపు స్టేషన్లలోని 82 మోటర్ల వినియోగానికి 4,627 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. అంటే కనీసం 13,558 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం ఉంటుందని భావించింది. ఈ లెక్కన ఒక్కో యూనిట్కు రూ. 6.30 ల చొప్పున (పెరిగిన విద్యుత్ చార్జీలు కాకుండా) మొత్తం సంవత్సరానికి రూ. 8,541.54 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తం 20 లిఫ్టులు ఈ ప్రాజెక్టుకు చెందిన లింకు ప్యాకేజీల్లో భాగం. కానీ ఇందులో 8 చోట్ల వినియోగించిన మోటారు పంపులకు మూడేళ్లలోనే రూ. 3,060 కోట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇక పూర్తిస్థాయిలో అన్ని పంపుస్టేషన్లలో మోటారు పంపులను వినియోగిస్తే మరింత విద్యుత్ భారం పెరుగుతుందని ఇరిగేషన్, విద్యుత్తు శాఖల అధికారులు చెబుతున్నారు. పెరిగిన విద్యుత్ వ్యయం... ఈ ప్రాజెక్టుకు మొదట విద్యుత్ చార్జీలు యూనిట్కు వ్యయం రూ. 5.80 ఉంటే దానిని రూ. 6.30 పైసలకు పెంచారు. ఫిక్స్డ్ చార్జీలు కిలోవాట్కు రూ. 165 ఉంటే దానిని రూ. 275కి పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో 99 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 2019–20లో 66 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా 1906.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది. దీనికి గాను ఒక యూనిట్కు రూ.5.80 చొప్పున 1105.82 కోట్ల ఖర్చయింది. 2020–21లో 33 టీఎంసీల నీటిని తరలించగా 1,697.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. పెరిగిన చార్జీల ప్రకారం రూ. 984.77 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 5 వరకు మూడేళ్లలో ఎత్తిపోసిన మొత్తం 140 టీఎంసీలకు రూ. 3,600 కోట్ల విద్యుత్ వినియోగం జరగ్గా రూ. 2,575.58 కోట్ల మేరకు బకాయిలు ఉన్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. -
లక్ష్మీపంప్హౌస్లో పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్లు.. కొత్తవాటికి ఆర్డర్?
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీపంప్హౌస్లోకి గత నెల 14న వరద నీరు చేరి రక్షణ గోడ కూలి మోటార్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీవాటరింగ్ ప్రక్రియ పూర్తయింది. పంప్హౌస్లోకి తాత్కాలికంగా నిచ్చెనలు తయారు చేసి కూలీలు, ఇంజనీర్లు దిగుతున్నారు. దీంతో పంప్హౌస్లో మొత్తం 17 మోటార్లు, పంపులకు గాను ఆరు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. దీంతో ఫిన్లాండ్, ఆస్ట్రియా దేశాలకు ఆరు మోటార్ల కోసం సీడీఓ (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్)కు డిజైన్స్ పంపినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ అధికారులంతా అదేపనిలో పడ్డట్లు సమాచారం. ఇక్కడి ఇంజనీర్లు మోటార్లకు సంబంధించిన కంపెనీలకు చెందిన విదేశాల్లోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. మిగతా మోటార్లలో ఐదు వరకు.. ఉన్న స్థానం నుంచి పక్కకు జరిగి వంగినట్లు చెబుతున్నారు. మరికొన్ని మోటార్లు పాక్షికంగా చెడిపోయినట్లు సమాచారం. రక్షణ గోడ పూర్తిగా నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోర్బేకు పంప్హౌస్ మధ్యలో పొడవునా మళ్లీ పూర్తిగా నిర్మాణం చేయడానికి డిజైన్స్ రెడీ చేసినట్లు తెలిసింది. కాగా, వర్షాకాలం కావడంతో గోడ నిర్మాణం సాధ్యం కాదని, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత చేపట్టనున్నారని ఇంజనీర్లు చెబుతున్నారు. కాళేశ్వరంలో గోదావరి ఉధృతి తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం వద్ద గోదావరి 11.70 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. 7.30 లక్షల క్యూసెక్కుల నీరు లక్ష్మీబ్యారేజీకి తరలిపోతోంది. ములుగు జిల్లా పేరూరు వద్ద సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు చేరింది. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. టేకులగూడెం గ్రామ చివరన 163 నంబర్ జాతీయ రహదారి మునిగిపోవడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
నదులకు నడకనేర్పిన కేసీఆర్... కాళేశ్వరం మోటార్లకు ఈత నేర్పలేదా?
సాక్షి, సిద్దిపేట: ‘నదులకే నడకను నేర్పినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పుకుంటున్నారు కదా.. వర్షాలకు నీళ్లలో మునిగిన కాళేశ్వరం మోటార్లకు ఈత ఎందుకు నేర్పించలేకపోయారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తోనే ముంపునకు గురయ్యాయన్నా రు. ఇరిగేషన్ ఇంజనీర్ అవతారమెత్తి రీడిజైన్ పేరు తో రూ.30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.1.30 లక్షల కోట్లకు పెంచి ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. గురు వారం సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్పల్లి నుంచి బీజేపీ చేపట్టిన ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీని సంజయ్.. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. ప్రజల బాధలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ‘దేశ్ కీ నేత.. దిన్ బర్ పీతా.. మోదీపే రోతా.. ఫాంహౌస్ మే సోతా.. అమాస పున్నానికి ఆతా..’ అంటూ ఎద్దేవా చేశారు. అడుగడుగునా అవమానించినా అల్లుడికి సిగ్గులే దని, నోటి నిండా అబద్ధాలే వల్లిస్తున్నాడంటూ హరీశ్రావుపై మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొల్లగొట్టిన వారికి మద్దతుగా ఆందోళనలు చేయ డం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ఈడీ విచారణను ఎదు ర్కోక తప్పదని హెచ్చరించారు. రైతులకు రైతుబంధు మాత్రమే ఇచ్చి అన్ని బంద్ చేశార న్నారు. తడిసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబపాలనకు చరమగీతం పాడాలి కేసీఆర్ కుటుంబపాలనకు చరమగీతం పాడాలని మురళీధర్రావు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, ప్రజలకు అండగా ఉండేందుకే ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవుడినీ మోసం చేసిన ఘనుడు సిరిసిల్ల/వేములవాడరూరల్: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ.వంద కోట్లు ఇస్తానన్న సీఎం కేసీఆర్.. ఇవ్వకుండా దేవుడినీ.. వీఆర్ఏల సమస్యలు పరిష్కరి స్తానని అసెంబ్లీలో చెప్పి వీఆర్ఏలనూ మోసం చేశారని బండి సంజయ్ విమర్శించారు. ప్రజలకు అందుబాటులో లేకుండా వేముల వాడ ఎమ్మెల్యే ఏ దేశంలో తిరుగుతున్నారని, అతనిపై సీఎం కేసీఆర్కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. గురువారం సిరిసిల్ల, వేములవాడల్లో పర్యటించారు. వేములవాడలో ‘జనం గోస– బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా బైక్ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు నిర్వహించిన సంబరాల్లో బండి సంజయ్ డోలు వాయించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. -
కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కాళేశ్వరానికి పెట్టుబడులు అనుమతులు లేవని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని కేంద్ర నీటి జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు స్కీంలోకి కాళేశ్వరాన్ని చేర్చే అర్హతలేదని వెల్లడించారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానికి లేఖలు రాసినట్లు పేర్కొంది. లోక్సభలో ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అన్నారు. జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలని, హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు. చదవండి: హైదరాబాద్ మెట్రోలో డ్యాన్స్.. యువతికి షాకిచ్చిన అధికారులు -
Kaleshwaram Project: వందల కోట్ల నష్టమనే ప్రచారం అవాస్తవం: రజత్కుమార్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంపుహౌస్లు నీట మునగడంతో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. వరదలతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేరకు మాత్రమే నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. ఒప్పందం మేరకు ఈ నష్టాన్ని కూడా నిర్మాణ సంస్థలే భరిస్తాయని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. 45 రోజుల్లోగా కాళేశ్వరం పంపుహౌస్లకు మరమ్మతులు పూర్తి చేస్తామని.. సెప్టెంబర్లోగా పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వాటిల్లిన నష్టంపై రజత్కుమార్ బుధవారం జలసౌధలో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు వరదల ప్రభావాన్ని సరిగా అంచనా వేయకుండానే కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మించడంతో పంపుహౌస్లు నీటమునిగాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎవరూ సరిగా అంచనా వేయలేదు వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ వంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో పంపుహౌస్లు నీటమునిగాయని రజత్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర జల సంఘంలోని 18 విభాగాల నుంచి అనుమతులు లభించాకే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. భారత వాతావరణ శాఖ, యూరోపియన్ శాటిలైట్ ఏజెన్సీలు సైతం వర్షాలు, వరదల తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేక పోయాయని చెప్పారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశామని.. అందువల్లే రికార్డు స్థాయిలో వరద వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవడంతోనే కడెంకు భారీ వరద వచ్చిందన్నారు. పోలవరంతో తెలంగాణలో భారీ ముంపు గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తెలంగాణలో లక్ష ఎకరాల మేర ముంపు బారినపడతాయని రజత్కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం, పర్ణశాలతోపాటు పలు చారిత్రాక ప్రదేశాలు మునిగిపోతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం జరపాలని కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. -
Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరానికి వరద పోటు
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/మంథని/ మోపాల్: కనీవినీ ఎరుగని రీతిలో గోదావరికి వచ్చిన భారీ వరద కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రభావం చూపింది. ప్రాజెక్టు పరిధిలోని సరస్వతి (అన్నారం), మేడిగడ్డ (లక్ష్మి) పంపుహౌస్లు పూర్తిగా నీట మునిగాయి. పంపుహౌస్లలోని పంపులు, మోటార్లు, ప్యానెల్ బోర్డు, విద్యుత్ పరిక రాలూ నీట మునిగాయి. ఇంకా భారీగా వరద కొనసాగుతున్న నేపథ్యంలో పంపుహౌస్లలో నీటిని తోడేసే అవకాశం లేదని.. నీటిని తోడేస్తేనే నష్టంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. వాగులో నీళ్లు వెనక్కి తన్ని.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు సమీపంలోని సరస్వతి (అన్నారం) పంపుహౌస్ను వరద ముంచెత్తింది. ఇక్కడ సరస్వతి బ్యారేజీ దిగువన చందనాపూర్ వాగు గోదావరిలో కలుస్తుంది. అయితే గోదావరిలో భారీ వరదతో వాగు ప్రవాహం వెనక్కి తన్నడంతో.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో చందనాపూర్ వాగు పోటెత్తింది. సరస్వతి పంపుహౌజ్కు, వాగుకు మధ్య రక్షణగా ఉన్న ఇసుక కరకట్టపై నుంచి ప్రవాహం పొంగి.. పంపుహౌజ్లోకి ప్రవేశించింది. కొద్దిగంటల్లోనే పంపుహౌజ్ పూర్తిగా నీట మునిగింది. 12 పంపులతోపాటు స్కాడా వ్యవస్థ, కంట్రోల్ ప్యానెళ్లు, స్టార్టర్లు సహా ఎలక్ట్రికల్ పరికరాలన్నీ మునిగిపోయాయి. దీనితో నష్టం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గరిష్టంగా 100 మీటర్ల వరదను తట్టుకునేలా వీలుగా అన్నారం పంపుహౌజ్ను డిజైన్ చేయగా.. అనూహ్యంగా 113 మీటర్ల వరద పోటెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. పంపుహౌజ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న 120 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్ష్మి పంపుహౌస్ గోడకు గండ్లు గోదావరి వరద ఉధృతి భారీగా ఉండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) పంపుహౌస్ కూడా నీట మునిగింది. గోదావరి ప్రధాన నదిలో 16 లక్షల క్యూసెక్కులు, ప్రాణహిత నుంచి మరో 12 లక్షల వరద కలిసి.. ఏకంగా 28 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం రావడంతో పంపుహౌజ్పై ఒత్తిడి పెరిగింది. 106.7 మీటర్ల వరదను తట్టుకునేలా పంపుహౌజ్ను డిజైన్ చేయగా, 108 మీటర్లకుపైగా వరద రావడంతో.. పంపుహౌస్ అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటర్ నుంచి భారీగా వరద సర్జ్పూల్లోకి చేరింది. సర్జ్పూల్లోని ఫోర్బే, పంపుహౌస్కు మధ్య ఉండే కాంక్రీట్ గోడ (బ్రెస్ట్ వాల్) ఒత్తిడికి గురై గండ్లు పడ్డాయి. దీనితో పంపుహౌజ్లోని 17 పంపులు పూర్తిగా నీటమునిగాయి. కంట్రోల్ రూంలో ఉన్న కంట్రోల్ ప్యానెళ్లు, స్కాడా ఆపరేటింగ్ సిస్టం, ప్రొజెక్టర్లు, ఏసీలు, ఇతర విలువైన ఎలక్ట్రిక్ సామగ్రి, రెండు లిఫ్ట్లు నీటితో నిండాయి. నిజానికి అధికారులు బుధవారం రాత్రి నుంచి పంపుహౌస్లోకి వస్తున్న వరదను ఆపడం కోసం మోటార్లు నడిపించేందుకు సిద్ధమ య్యారు. కానీ భారీ వర్షాలతో అన్నారం నుంచి వచ్చే 220 కేవీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో మోటార్లను నడిపించలేకపోయారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ట్రాన్స్కో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆలోగా పంపుహౌజ్ పూర్తిగా నీట మునిగింది. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21, 22లో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ శివారులో నిర్మిస్తున్న గడ్కోల్ పంపుహౌస్లోకి కూడా వరద నీరు చేరింది. 1986 నాటి వరదను తట్టుకునేలా నిర్మాణం: శ్యాంప్రసాద్రెడ్డి మునిగిన పంపుహౌస్లలో నీటిని తొలగించి అన్ని పరికరాలను పరీక్షించాకే వాస్తవ నష్టాన్ని అంచనా వేయగలమని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాంప్రసాద్రెడ్డి తెలిపారు. 1986లో వచ్చిన వందేళ్ల గరిష్ట వరదను తట్టుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసినా..అంతకు మించిన వరద రావడంతో పంపులు నీటమునిగాయని పేర్కొన్నారు. -
కాళేశ్వరానికి సాయమేది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకుంటున్నా.. కేంద్రం నుంచి దక్కే ఆర్థిక సాయం మాత్రం తేలేలా లేదు. ఈ ప్రాజెక్టును సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ)లో చేరుస్తామంటూ ఆరు నెలల కిందటే కేంద్రం సంకేతాలు ఇచ్చినా దీనిపై మళ్లీ ఊసే లేదు. అడపాదడపా ప్రాజెక్టుకు ఉన్న అనుమతులు, ఇతర అంశాలపై లేఖలు రాస్తున్నా.. ఇంతవరకు నయాపైసా విదల్చలేదు. దీంతో కేంద్ర నిధులపై రాష్ట్రం ఆశలు పూర్తిగా నీరుగారినట్లే కన్పిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం ఎటూ తేలకపోవడంతో కనీసం ఏఐబీపీ పథకంలోనైనా చేర్చి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట కేంద్రాన్ని కోరింది. అప్పట్లోనే ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించింది. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలను తీసుకుంటూ రూ.80,190 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు వివరించింది. ఏఐబీపీలో ప్రాజెక్టును చేర్చాలని కోరే నాటికే ప్రాజెక్టు కింద సుమారు రూ.50 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేశామని, మిగతా నిధుల అవసరాలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది మేలో ఏఐబీపీ పథకాన్ని 2026 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయించి, అందులో కాళేశ్వరాన్ని చేర్చేందుకు సద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రాజెక్టు సమగ్ర వివరాలు కోరింది. దీంతో ఆ వివరాలను మరోసారి కేంద్రానికి పంపింది. దీనిపై పలుసార్లు పర్యావరణ, అటవీ అనుమతులు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు, కాస్ట్ అప్రైజల్ అనుమతులు, భూసేకరణ, ఆర్అండ్ఆర్ వివరాలు కోరగా, వాటినీ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ అన్ని అంశాలపై సమగ్ర పరిశీలన చేసిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని మానిటరింగ్ అండ్ అప్రైజల్ డైరెక్టరేట్ ప్రాజెక్టును ఏఐబీపీలో చేర్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కేంద్రానికి నివేదించింది. తర్వాత కూడా ప్రాజెక్టుపై చేసిన వ్యయం, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ప్రాజెక్టుపై వెచ్చించేందుకు నిర్ణయించిన బడ్జెట్పై వివరణలు కోరింది. ఇన్ని వివరాలు అడిగినా ఇప్పటివరకు ప్రాజెక్టును ఏఐబీపీలో చేరుస్తున్నట్లు కేంద్రం ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. అదనపు టీఎంసీ పనులకు కష్టమే.. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రూ.30 వేల కోట్లతో చేపట్టిన అదనపు టీఎంసీ పనులను ఏఐబీపీలో చేర్చాలని కోరుదామంటే, ఈ పనులన్నీ కొత్తగా చేపట్టినవని, వీటికి అపెక్స్ కౌన్సిల్ సహా, బోర్డుల అనుమతులు ఉండాలని కేంద్రం పేర్కొంటోంది. ఇప్పుడు చేర్చినా ఫలితం కొంతే.. కాళేశ్వరం మొత్తం వ్యయం రూ.80 వేల కోట్లలో ఇప్పటికే ప్రభుత్వం రూ.68 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ నిధుల కోసం రుణ సంస్థల నుంచి నిధులు సేకరించింది. రుణాల ద్వారా సేకరించిన వాటి నుంచే రూ.45 వేల కోట్ల వరకు ఖర్చు జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును ఏఐబీపీలో చేర్చినా పెద్దగా ఫలితం ఉండదని చెబుతున్నారు. మిగిలిన రూ.12 వేల కోట్ల పనుల్లో ఏఐబీపీ కింద కేంద్రం గరిష్టంగా రూ.3–5 వేల కోట్లు ఇచ్చినా.. ఆ నిధులతో ప్రాజెక్టుకు ఒరిగే ప్రయోజం ఏమీ ఉండదు. పైగా ఈ నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్రం రెండు, మూడేళ్లు గడువు పెడుతోంది. అప్పట్లోగా ప్రాజెక్టు పనులన్నీ పూర్తవుతాయి. -
TS: జలదృశ్యం సాకారం
సిద్దిపేటజోన్: గతంలో సాగుచేసేందుకు రైతులు కిలోమీటర్ల దూరం నుంచి పైపుల ద్వారా నీటిని తరలించడానికి పైపులు వాడి నానాపాట్లు పడేవారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మించడం వల్ల చిన్నకోడూర్ ప్రాంత రైతులకు సుదూరం నుంచి సాగునీటిని తీసుకొచ్చే వ్యథ తప్పింది. దీంతో నీటి తరలింపునకు వాడిన పైపులు చెట్టు పైన మూటకట్టిన దృశ్యాన్ని.. ముంగిట్లో గోదావరి జలాల స్థితిగతులు వివరిస్తోన్న ఓ ఫొటో ‘సాక్షి’ప్లస్లో మంగళవారం ప్రచురితమైంది. ‘సాక్షి’లో వచ్చిన ఫొటోపై మంత్రి హరీశ్రావు ‘తెలంగాణ జలదృశ్యం సాకారం’అని వ్యాఖ్యానిస్తూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి కొద్దినిమిషాల్లోనే వందల కొద్దీ లైకులు వచ్చాయి. తెలంగాణ జలదృశ్యం కలసాకారం..#Kaleshwaram pic.twitter.com/s3ET7TAVBR — Harish Rao Thanneeru (@trsharish) October 5, 2021 -
గోదావరిలో జల సవ్వడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు.. మొన్నటి వరకు కొనసాగిన కాళేశ్వరం ఎత్తిపోతల నేపథ్యంలో గోదావరిలో జల సవ్వడి నెలకొంది. మేడిగడ్డ మొదలు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎల్లంపల్లి, కడెం, మిడ్మానేరు, లోయర్ మానేరులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి సైతం ప్రవాహాలు పెరిగాయి. ప్రస్తుత సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని లోయర్ మానేరు నుంచి ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ శాఖ సిద్ధమవుతోంది. అవసరాలకు తగ్గట్లు ఆయకట్టుకు.. జూన్ తొలి వారంలో వర్షాలు కురిసినా ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. జూన్ మూడో వారం నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టింది. ప్రాణహితలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా 12 టీఎంసీల మేర నీటిని మేడిగడ్డ నుంచి దిగువ కొండపోచమ్మ వరకు తరలించింది. ప్రస్తుతం పంపులను పూర్తిగా నిలిపివేయగా మేడిగడ్డ వద్ద 55 వేల క్యూసెక్కులకుపైగా నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 25 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారంలో 10.87 టీఎంసీలకుగాను ప్రస్తుతం 8.50 టీఎంసీల మేర నిల్వ ఉండగా సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 6 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను సోమవారం 17.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండగా 15 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతోపాటు కాళేశ్వరం ద్వారా ఇప్పటికే లోయర్ మానేరు, మిడ్ మానేరును నింపారు. లోయర్ మానేరులో 24 టీఎంసీలకుగాను 21.10 టీఎంసీలు నిల్వ ఉండగా 4 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. ఇక్క డి నుంచి సూర్యాపేట వరకు ఎస్సారెస్పీ కాల్వల కింద నీటిని అందించేందుకు గేట్లు ఎత్తాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. మిడ్మానేరులో సైతం 25.87 టీఎంసీలకుగాను 23.34 టీఎంసీల నిల్వ ఉంది. ఇక మిడ్మానేరు నుంచి నీటిని ఎత్తిపోయ డంతో మలక్పేట, రంగనాయక్సాగర్లలో మూడే సీ టీఎంసీల నిల్వలు ఉండగా 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్లో సైతం 6.80 టీఎంసీల నిల్వ ఉం ది. బ్యారేజీలు, రిజర్వాయర్లలో ఉన్న నీటితో అవసరాలకు తగ్గట్లుగా ఆయకట్టు కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. ఇక గోదావరి బేసిన్లోని ఎస్సారెస్పీకి వరద ప్రవాహం పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి ఇన్ఫ్లో సోమవారం రాత్రి 9 గంటలకు 90 వేల క్యూసెక్కులకు చేరింది. నీటి మట్టం 1075.20 (40.203 టీఎంసీలు) అడుగులకు చేరింది. సమ్మక్క బ్యారేజీ నుంచి 1.35 లక్షల క్యూసెక్కులు విడుదల ఏటూరునాగారం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ గేట్లను ఇరిగేషన్ అధికారులు సోమవారం తెరిచారు. 59 గేట్లలో 36 గేట్లను తెరిచి లక్షా 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 6.9 టీఎంసీలుకాగా ప్రస్తుతం 1.3 టీఎంసీలను నిల్వ చేశారు. -
‘ఇవన్నీ కేసీఆర్ గొర్రెలు అంటున్నరు.. ఇంకా నయం కేసీఆరే గొర్రె అంటలేరు.’
-
నన్నెవరూ ఆపలేరు: సీఎం కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: ‘కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు.. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు నేను అనుకున్నవన్నీ జరిగాయి. లక్ష్యశుద్ధి.. చిత్తశుద్ధి.. వాక్శుద్ధి ఉంటే.. ఏదైనా కచ్చితంగా అయి తీరుతుంది’ అని సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్తో కలసి రాజన్నసిరిసిల్ల జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ మార్కెట్ యార్డును ఆదివారం ప్రారంభించారు. కలెక్టరేట్లో కేసీఆర్ సుదీర్ఘంగా (గంటసేపు) మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఏం సాధించామో అందరి కళ్లముందే కనిపిస్తోందని తెలిపారు. రాజకీయాల్లో కిరికిరిగాళ్లు ఎప్పుడూ ఉంటారని, సన్నాసులు ఎప్పుడూ సన్నాసులేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక పాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, కొత్త కలెక్టరేట్ నమూనాలను ఆర్కిటెక్చర్ ఉషారెడ్డి, ఇంజినీర్ గణపతిరెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. రైతుల ఇళ్లలో బంగారు వాసాలు కావాలే గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెడితే అది అయితదా.. పోతదా.. అని అనుమానపడ్డారని, ఏం జరిగిందో కళ్లముందే ఉందని కేసీఆర్ అన్నారు. మల్టీ స్టేజీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తాను చెబితే కొందరు అపవాదులు వేశారని తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీతోనే పంచాయితీ పెట్టుకున్నానని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి మిడ్మానేరు వరకే 40 లక్షల ఎకరాలు పారుతోందని స్పష్టం చేశారు. ఎంతో శ్రమించి కాళేశ్వరం కడితే.. కరెంట్ ఖర్చు రూ.10వేల కోట్లు అంటూ.. కొందరు మాట్లాడుతున్నారని, రైతుల బాగుకోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఇళ్లలో బంగారువాసాలు కావాలన్నారు. చెంబుతో నీళ్లు ముంచుకోవచ్చు... ఆరేళ్లలో ఎంతో అద్భుతం జరిగిందని, వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుతో మహబూబ్నగర్, సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, ఇంకా మధ్యలో చిన్నచిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ఇప్పుడు రిజర్వాయర్గా మారిందని, 365 రోజులు చెంబుతో నీళ్లు ముంచుకోవచ్చన్నారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ ప్రాజెక్టులతో 180 కిలోమీటర్లు గోదావరి సజీవ జలదృశ్యం ఆవిష్కృతమైందని స్పష్టం చేశారు. గతంలో వర్షాలు పడితే.. చెరువులు తెగిపోయేవని, ప్రస్తుత ప్రభుత్వం చెరువులను బాగు చేయడంతో అధిక వర్షాలు పడినా చెరువులు మంచిగా ఉన్నాయన్నారు. బతుకమ్మ చీరలపైనా రాజకీయం.. ఒకప్పుడు సిరిసిల్లలో ఆత్మహత్యలు వద్దు.. అనే నినాదాలు గోడలపై కనిపించాయని, అవి తనను ఎంతో కలిచివేశాయన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల తయారీ ఇస్తే.. దాన్ని కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. సిరిసిల్లలో పద్మశాలి భవన్ కు రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పల్లె, పట్టణ ప్రగతిని బాగా చేయండి ‘మీకు దండం పెడతా.. పల్లె ప్రగతి.. పట్టణ ప్రగతిని పకడ్బందీగా చేయండి’ అంటూ సీఎం కోరారు. ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు. హరితహారం ఉజ్వలమైన కార్యక్రమం అని.. అందరూ భాగస్వాములు కావాలని కోరారు. భవిష్యత్లో మన పిల్లలకు ఇచ్చే సంపద ప్రకృతి మాత్రమేనని, పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ఏడాది లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు. అయినా ఒక్కో పనిని చేసుకుంటూ పోతున్నామని, దుబారా లేకుండా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, రఘోత్తమరెడ్డి, భానుప్రసాద్రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. నర్సింగ్ విద్యార్థుల స్టై ఫండ్ పెంపు.. మొదటి సంవత్సవం వారికి ప్రస్తుతం రూ.1500 స్టైఫండ్ ఇస్తున్నారు.. దాన్ని రూ.5 వేలకు పెంచుతున్నం. రెండో సంవత్సరం వారికి ఇచ్చే రూ.1600 స్థానంలో రూ.6వేలు, మూడో సంవత్సరం వారికి ఇచ్చే రూ.1900 స్థానంలో రూ.7వేలు ఇస్తం. గర్వంగా చెబుతున్నా... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఉంది. ప్రతీ ఊరిలోనూ వైకుంఠధామాలు ఉన్నాయని నేను గర్వంగా చెబుతున్నా. రూ.10వేల కోట్లు... రూ.10వేల కోట్లతో హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తున్నం. రెండో విడత గొర్రెల పంపిణీని రూ.4వేల కోట్లతో చేపడతం. -
పార్వతీ బ్యారేజీ: డెలివరీ సిస్టర్న్ వద్ద కుంగిన భూమి
మంథని: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం సమీపంలో నిర్మించిన పార్వతీ బ్యారేజీ డెలివరీ సిస్టర్న్కు ఉన్న పైపులైన్లో నాల్గో మోటార్ పైపు వద్ద భూమి కుంగిపోయింది. పంపు మోటార్ నీటి ప్రవాహం తాకిడికి పైపు పైకి లేచింది. సుమారు 200 మీటర్ల మేర పైపుపై ఉన్న మట్టి కొట్టుకుపోయింది. మంథని మండలం గుంజపడుగు సమీపంలోని సరస్వతీ పంపుహౌస్ నుంచి 12 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి పార్వతీ బ్యారేజీకి పైపులైన్ నిర్మించారు. ఈనెల 18 నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి వరదనీరు పైపులైన్ కిందకు చేరింది. పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్న క్రమంలో పైపులైన్లో వేగంగా నీటి ప్రవాహం ఉండటంతో డెలివరీ సిస్టర్న్ నుంచి వచ్చే ప్రెషర్కు పైపు పైకి లేచింది. సుమారు మూడు మీటర్ల ఎత్తున పైపుపైకి లేచి వంకర తిరిగింది. ఎత్తిపోతలకు అంతరాయం ఏర్పడంతో తేరుకున్న నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతు చేపట్టారు. భూమి కుంగిన చోట మొరం పోస్తున్నారు. డెలివరీ సిస్టర్న్ వద్ద మట్టిని తవ్వడం, అటు తర్వాత నింపడంతో భూమి కుంగిపోయిందని, ఇలా జరగడం సర్వసాధారణమని అధికారులు అంటున్నారు. మంగళవారం ఐదు మోటార్ల ద్వారా 14,,650 క్యూసెక్కుల నీటిని పార్వతీ బ్యారేజీలో ఎత్తిపోశారు. -
తెలుగు ఘనతకు దృశ్య సాక్ష్యం
రేపు అంటే జూన్ 25 రాత్రి 8 గంటలకు ప్రతిష్టాత్మక డిస్కవరీ చానెల్లో ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డాక్యుమెంటరీ టెలికాస్ట్ కానుంది. తెలుగువారి ఘనతకు సాక్ష్యంగా నిలిచిన ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ మహా నిర్మాణ ఉత్కృష్టతను దేశానికే కాదు ప్రపంచానికీ తెలియచేయనున్న డాక్యుమెంటరీ ఇది. దీని దర్శకుడు తెలుగువాడైన కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స. గతంలో ‘ఇన్సైడ్ తిరుమల’ డాక్యుమెంటరీ తీసి 52 దేశాల్లో ప్రసారం చేసిన రాజేంద్ర డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్గా తెలుగువారి ఘనతను చూపుతూ తన ఘనతనూ నిరూపించుకుంటున్నారు. ఆయన పరిచయం. ఫిక్షన్లో కల్పన ఉంటుంది. నాన్ ఫిక్షన్లో వాస్తవాల ఆధారం ఉంటుంది. వాస్తవాలను నిరూపించడం, సాక్ష్యాధారాలతో నిక్షిప్తం చేయడం ఉంటుంది. నాన్ ఫిక్షన్ విభాగానికి వచ్చే డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్ ఒక విధంగా చరిత్రకారుడి పని చేస్తాడు. వర్తమానాన్ని చరిత్ర కోసం, చరిత్రను వర్తమానం కోసం అన్వేషిస్తాడు. కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స అలాంటి అన్వేషకుడు. ఆయన అన్వేషణ తెలుగువారి కోసం, తెలుగువారి తరఫున సాగడం తెలుగువారికి మేలు చేస్తోంది. లిఫ్టింగ్ ఏ రివర్ ‘జటిలమైన విషయాలను సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడమే అసలైన కష్టం’ అంటారు 52 సంవత్సరాల రాజేంద్ర శ్రీవత్స. ఢిల్లీ నుంచి టెలిఫోన్ ద్వారా ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డాక్యుమెంటరీ గురించి ఇంటర్వ్యూ ఇస్తూ ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప నిర్మాణం. ఈ స్థాయిలో ప్రాజెక్టులు కొన్ని ఉండొచ్చు. కాని అవన్నీ ఒకేచోట నిర్మితమయ్యాయి. కాళేశ్వరం పథకం అలాంటిది కాదు. అది మల్టీ లొకేషన్ ప్రాజెక్ట్. సాగునీటి కోసం తాగు నీటి కోసం సాగిన ఈ నిర్మాణం గురించి తెలుగువారే కాదు ప్రపంచమంతా తెలుసుకోవాలని ఈ డాక్యుమెంటరీ తీశాను. ఒక గంట దీని నిడివి’ అంటారు రాజేంద్ర. రెండేళ్ల కృషి ‘నేను ఢిల్లీలో ఉంటాను. 2017లో ఒక డాక్యుమెంటరీ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు న్యూస్పేపర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చదివాను. అరె... నేను తెలంగాణావాణ్ణి. పైగా మీడియాలో ఉన్నాను. నాకే దీని గొప్పతనం పూర్తిగా తెలియకపోతే సామాన్యుడికి ఏం తెలుస్తుంది. ఈ మొత్తం నిర్మాణాన్ని ఫాలో అవుతూ డాక్యుమెంటరీ తీద్దాం అనుకున్నాను’ అంటారు రాజేంద్ర. అనుకున్నదే తడవు తన సంస్థ పల్స్ మీడియా తరఫున డాక్యుమెంటరీ నిర్మాణ పనుల్లో దిగారాయన. ‘రెండేళ్ల పాటు ప్రాజెక్ట్ పనులను ఫాలో అవుతూ ఇంజనీర్లను కలుస్తూ ఇంటర్వ్యూలు చేస్తూ ఇమేజ్ లు కాప్చర్ చేస్తూ వందల గంటల ఫుటేజ్ తీశాం. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో సంవత్సరం పట్టింది. తీసిన ఫుటేజ్ మొత్తం చూడటానికే 3 నెలలు పట్టింది. నేను తప్పక పాటించిన విషయం ఏమిటంటే అంతా ఆన్ లొకేషన్గా ఉండేలా చూడటం. యాక్చువల్ సౌండ్ను ప్రేక్షకులకు వినిపించడం. ఈ డాక్యుమెంటరీ చూసినవారు ప్రాజెక్ట్లో తిరిగిన భావనకు లోనవుతారు. సౌండ్ రికార్డిస్ట్ పి.డి.వాల్సన్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ప్రశాంత్ కారంత్, స్క్రిప్ట్ రైటర్ పూర్ణిమా రావు... వీరందరూ గొప్పగా పని చేయడం వల్ల ఇది సాధ్యమైంది’ అన్నారు రాజేంద్ర. ‘ఇంత గొప్ప నిర్మాణం అన్నిసార్లు సాధ్యం కాదు. దీనిని జీవితంలో ఒకసారి దొరికే అవకాశం అనుకుంటాను. అంతేకాదు శివుడి (కాళేశ్వరుడి) ఆజ్ఞతో ఈ పని జరిగి ఉండొచ్చనిపిస్తుంది’ అంటారు రాజేంద్ర. అంతర్జాతీయ చానెల్స్తో ‘2002లో నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ భారతదేశం నుంచి ప్రొడ్యూస్ అయ్యే కంటెంట్ను ప్రసారం చేయదలిచి డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్స్ ను ఆహ్వానించింది. ఎంతోమంది అప్లై చేశారు. ఇద్దర్ని మాత్రమే ఎంచుకున్నారు. వారిలో నేనొకణ్ణి’ అంటారు రాజేంద్ర. ‘అదృష్టవశాత్తు దేశంలో శాటిలైట్ చానల్స్ వృద్ధి, నా కెరీర్ ఒకేసారి మొదలయ్యాయి. నా కెరీర్ మొదట్లోనే నేషనల్ జియోగ్రాఫిక్, డిస్కవరీ చానల్స్తో పని చేయడం వల్ల నాణ్యతతో ఎలా డాక్యుమెంటరీలు తీయాలో నాకు తెలిసింది. నిజానికి ఆ చానల్సే నాకు పని నేర్పాయి. దూరదర్శన్ దగ్గరి నుంచి అల్ జజీరా వరకూ అన్ని చానెల్స్కు డాక్యుమెంటరీలు చేశాను.’ అంటారు రాజేంద్ర. తిరుమల ఖ్యాతి నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ కోసం రాజేంద్ర తీసిన ‘ఇన్సైడ్ తిరుమల తిరుపతి’ 60 నిమిషాల డాక్యుమెంటరీ విశేష జనాదరణ పొందింది. ‘రోజూ 80 వేల మంది నుంచి లక్ష మంది భక్తులు తిరుమలకు వస్తారు. కాని అంతమందిని ఎంతో గొప్పగా పర్యవేక్షిస్తారు. తిరుమల అంటే దర్శనం, ప్రసాదం మాత్రమే కాక ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అని ఆ డాక్యుమెంటరీ తీశాను. తెలుగువారి ఈ ఘన పుణ్యక్షేత్రం గురించి 2017లో ప్రసారం అయినప్పుడు సాధారణ టిఆర్పి కొలమానాలు ఆ ప్రేక్షకాదరణను కొలవడానికి పనికి రాలేదు. ఆ డాక్యుమెంటరీ 52 దేశాలలో ప్రసారమయ్యి తెలుగు వారి పుణ్యక్షేత్ర ఘనతను చాటింది ’ అంటారు రాజేంద్ర. ఇది కాకుండా దూరదర్శన్ కోసం ఎన్నో సైన్స్ కార్యక్రమాలు చేశారు రాజేంద్ర. అలాగే ‘స్వర్ణదేవాలయం’ మూలాలను తెలియ చేసే డాక్యుమెంటరీ ‘సీక్రెట్స్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్’, 2010 కాలంలో భారతదేశంలో ఊపందుకున్న సరొగసీ ధోరణిని డాక్యుమెంట్ చేస్తూ తీసిన ‘ఫైండింగ్ ఏ ఊంబ్’ రాజేంద్రకు చాలా పేరు తెచ్చాయి. సానుకూల దృక్పథం ‘దేశంలోగాని తెలుగు ప్రాంతాలలో గాని మంచి పనులు జరుగుతున్నాయి. కాని మనం చెడును మాట్లాడుకున్నట్టుగా మంచి మాట్లాడుకోము. ఉదాహరణకు దేశంలో సైన్స్ పురోగతి కోసం గొప్ప కృషి జరుగుతోంది. దానిని ప్రజలకు చెప్పడం లేదు. ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనులు చెప్పడం లేదు. మంచి మాట్లాడుతూ ఉంటే మంచి పనుల కొనసాగింపు ఉంటుంది’ అని ముగించారు కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స. ‘లిఫ్టింగ్ ఏ రివర్’ ప్రసార సమయాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స తీసిన 60 నిమిషాల డాక్యుమెంటరీ ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డిస్కవరి చానల్లో జూన్ 25 రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతోంది. 6 భాషలలో దీనిని చూడొచ్చు. అలాగే డిస్కవరీ సైన్స్ చానెల్లో జూన్ 28 రాత్రి 9 గంటలకు, డిస్కవరీ టర్బో చానల్లో జూన్ 29 రాత్రి 9.50కు ఇది ప్రసారం కానుంది. డిస్కవరీ ఓటిటి చానల్ ‘డిప్లస్’లో జూన్ 25 నుంచి వీక్షణకు ఉంటుంది. పక్కా హైదరాబాదీ కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స పుట్టింది పెరిగింది హైదరాబాద్లో. తండ్రి సుధాకర రావు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్లో పని చేసేశారు. తల్లి శాంత. రాజేంద్ర నిజాం కాలేజ్లో డిగ్రీ చేసి తర్వాత ఢిల్లీ జె.ఎన్.యూలో పి.జి ఫిలాసఫీ చేయడానికి వెళ్లారు. ‘శ్రీధర్బాబు (మంథని ఎం.ఎల్.ఏ, మాజీ మంత్రి) నేనూ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఢిల్లీలో అతను జెఎన్యూకు ‘లా’ చేయడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిజాం కాలేజీలో నువ్వు క్రియేటివ్గా పనులు చేసేవాడివి కదా... ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్లు అని అతడు ప్రోత్సహించేవాడు. అలా నేను ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చాను’ అంటారు రాజేంద్ర. ‘నా భార్య మమతది వరంగల్. మా అబ్బాయ్ అమోఘ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు’ అని తెలియచేశారు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కాళేశ్వరం అద్భుత సృష్టి.. ఈనెల 25న డిస్కవరీ చానల్లో
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ఓ అద్భుతం. ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఘనత, ప్రాముఖ్యత మరోమారు అంతర్జాతీయ స్థాయిలో మారు మోగనుంది. ఇప్పటికే కాళేశ్వరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ ప్రాజెక్టుపై ప్రఖ్యాత డిస్కవరీ చానల్ ఓ డాక్యుమెంటరీని ప్రపంచ ప్రజల ముందుంచనుంది. ప్రాజెక్టు నిర్మాణాల్లో వినియోగించిన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచంలో మరెక్కడా లేని అతి భారీ పంపులు, మోటార్లు, ఇంజనీర్లు, కార్మికుల శ్రమ, అన్నిటికీ మించి తమ కలల ప్రాజెక్టు సాకారానికి ప్రభుత్వం చేసిన కృషిని వివరించనుంది. గంట డాక్యుమెంటరీ గోదావరి జలాలను ఎత్తిపోస్తున్న వైనంపై ‘లిఫ్టింగ్ ఎ రివర్’పేరిట డిస్కవరీ కథనాన్ని ప్రసారం చేయనుంది. ఈ నెల 25న శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలుగు, ఇంగ్లిష్ సహా ఆరు భారతీయ భాషల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. దీనిపై ప్రచారాన్ని మొదలు పెట్టిన డిస్కవరీ చానల్.. అన్ని దేశాల్లో తన మీడియా వ్యవస్థల ద్వారా ప్రోమోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. మనుషులు, మెషీన్లు కలిసి అసాధ్యమనుకున్న కార్యాన్ని ఏ విధంగా సుసాధ్యం చేశాయో తెలుసుకోవాలంటే దీన్ని వీక్షించాలని చెబుతోంది. అన్ని అంశాలూ కవర్ చేస్తూ.. 2017లో ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తి చేసిన నిర్మాణాలను చూపుతూనే.. నీటిని ఆయకట్టు ప్రాంతాలకు తరలించే క్రమంలో ఎదురైన అనుభవాలను డాక్యుమెంటరీలో చూపనుంది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకం కింద 20 పంపుహౌస్లలోని 104 భారీ పంపులు, మోటార్లను ఏర్పాటు చేయడంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేసిన కృషిని వివరించనుంది. ముఖ్యంగా గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం లోని 139 మెగావాట్ల భారీ పంపులు, మోటార్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. డిస్కవరీ వీటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. రూ.80 వేల కోట్లకు పైగా వ్యయంతో 40 లక్షల ఎకరాలకు సాగునీటినిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చుకున్న విధానాలు, రైతులు, పారిశ్రామిక రంగాల వారికి ప్రయోజనాలు, వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే తీరు తదితర అంశాలను చానెల్ విశ్లేషించనుంది. రెండ్రోజుల కిందట కామారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ డాక్యుమెంటరీ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన అద్భుతాన్ని అంతర్జాతీయ సమాజం తెలుసుకుంటుందన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం, ఆర్ధిక సం ఘం, నీతిఆయోగ్, వివిధ రాష్ట్రాల సీఎంలు, నిపుణులు, విదేశీ ప్రముఖులు కొనియాడటం గమనార్హం. -
‘కాళేశ్వర ఫలం’: 2.70 లక్షల ఎకరాలకు తొలి తడి
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తొలిసారి కొత్త ఆయకట్టుకు నీరందనుంది. ఇప్పటివరకు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగానే ఎత్తిపోతలు కొనసాగగా.. మొదటిసారి 2.70 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు గోదావరి పారనుంది. అన్నీ కుదిరితే వచ్చే నెల చివరి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా సాగునీటి శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో ఈ ఏడాది నుంచి పాక్షికంగా అందుబాటులోకి రానున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద సైతం 55వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందనుంది. అన్ని రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 18.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 18.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొదలైన కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 పరిధిలో ఉన్న 13 లక్షల ఎకరాలకు గానూ లోయర్ మానేరు దిగువున ఉన్న ఆయకట్టు సుమారు 8 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారానే నీరందిస్తున్నారు. మిడ్మానేరు దిగువున కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్న రిజర్వాయర్లన్నింటినీ నింపినా వాటి చెరువులు నింపేందుకు మాత్రమే నీటిని వదిలారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో మాత్రం తొలిసారి కాళేశ్వరంలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్మానేరు కింద 50 వేల ఎకరాలు.. మిడ్మానేరు కింద 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఇటీవలే నిర్ణయించగా, దీనితో పాటు అనంతగిరి రిజర్వాయర్ కింద 20 వేల ఎకరాలు, రంగనాయక్ సాగర్ కింద 55 వేల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 55 వేల ఎకరాలు, కొండపోచమ్మ సాగర్ కింద 70 వేల ఎకరాలకు కొత్తగా నీరివ్వాలని నిర్ణయించారు. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. 95 శాతం మేర పనులు ఇప్పటికే పూర్తవగా, జూలై 20 నాటికి మిగతా పనులు పూర్తి చేయనున్నారు. ఇందులో 50 టీఎంసీలకు గానూ మొదట 10 టీఎంసీలు నింపి, తర్వాత ప్రతి మూడు నెలలకు మరో 10 టీఎంసీలు నింపుతూ వెళ్లనున్నారు. తొలిసారిగా నింపే నీటి నుంచే సుమారు 55 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కాల్వల పనులు పూర్తి చేస్తున్నారు. ఇక 15 టీఎంసీల సామర్ధ్యం గల కొండపోచమ్మ కింద తొలి ఏడాదిలో 7.8 టీఎంసీలు మాత్రమే నింపగా, ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపనున్నారు. దీనికింద సంగారెడ్డి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, జగదేవ్పూర్, తుర్కపల్లి, ఎం.తుర్కపల్లి, రావెల్ కోల్ వంటి కాల్వలు ఉండగా, 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో జగదేవ్పూర్, గజ్వేల్, రామాయంపేట, తుర్కపల్లి కాల్వల పనులు పూర్తయ్యాయి. వీటికింద కనీసంగా 70 వేల ఎకరాలకు సాగు నీరందించేలా పనులు జరిగాయి. ఇక కాళేశ్వరంలోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన పైప్లైన్న్ వ్యవస్థ నిర్మాణాలు పాక్షికంగా పూర్తవడంతో ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లివ్వనున్నారు. ఆయకట్టుకు నీటిని ఇవ్వడంతో ఈ రిజర్వాయర్ల కింద కనీసంగా 300 వరకు చెరువులు నింపే ప్రణాళిక సైతం సిద్ధమైంది. వానాకాలం, యాసంగిలో నీటి లభ్యత పెంచేలా చెరువులను పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. అయితే తొలిసారిగా ఈ సీజన్లో ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్మానేరు కింద 50 వేల ఎకరాలు, అనంతగిరి 20 వేల ఎకరాలు రంగనాయక్ సాగర్- 55 వేల ఎకరాలు మల్లన్న సాగర్ - 55 వేల ఎకరాలు కొండపోచమ్మ సాగర్- 70 వేల ఎకరాలు కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద - 20 వేల ఎకరాలు కలిపి మొత్తం 2.70 లక్షల ఎకరాలకు సాగు నీళ్లివ్వనున్నారు. -
అపూర్వం.. 30 ఏళ్ల తర్వాత తొలిసారి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను నీరందని ప్రాంతాలన్నింటికీ తరలిస్తున్న ప్రభుత్వం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గత నెల 23న కూడవెళ్లి వాగు ద్వారా విడుదల చేసిన కాళేశ్వరం జలాలు అప్పర్ మానేరు ను చేరడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం అలుగు దుంకుతోంది. సుమారు 30 ఏళ్ల తర్వాత నిండు వేసవిలో ప్రాజెక్టు నిండుకుండలా మారడం ఇదే తొలిసారి. కూడవెళ్లి వాగు నుంచి సుమారు 70 కి.మీ. మేర ప్రయాణించిన గోదావరి జలాలు దారిలో 39 చెక్ డ్యామ్లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరగా 11 వేల ఎకరాల మేర ఆయకట్టుకు సాగునీరు అందించగలిగింది. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్యాకేజీ-9 పనులు ఆలస్య మవుతున్న నేపథ్యంలో కూడవెళ్లి వాగు ద్వారా తర లించిన జలాలు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి. ప్యాకేజీ-9 ఆలస్యమైనా చింతలేకుండా.. అప్పర్ మానేరు ప్రాజెక్టును సుమారు 50 ఏళ్ల కింద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా పూడిక కారణంగా ప్రస్తుతం అందులో 2.20 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉంటోంది. దీని కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించొచ్చు. అయితే వర్షాకాలంలో మినహాయిస్తే జనవరి తర్వాత ఇందులో నీటి లభ్యత ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు 11.635 టీఎంసీలను తరలిస్తూ మొత్తంగా 60 వేల ఎకరాల కొత్త ఆయ కట్టు, 26 వేల ఎకరాల స్థిరీకరణ చేయాలన్న లక్ష్యం తో ప్యాకేజీ-9 పనులను చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ. 996 కోట్లతో చేపట్టగా రూ. 600 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా 12 కి.మీ. టన్నెల్లో 7 కి.మీ. టన్నెల్ పని పూర్తవ్వగా మిగతా లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. మొదటి పంప్హౌస్లో 30 మెగావాట్ల సామర్థ్యంగల 2 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక దాని బిగింపు పనులు పూర్తయ్యాయి. రెండో దాని పనులు మొదలుపెట్టనున్నారు. ఈ పంప్హౌస్ నుంచి నీళ్లు మలక్పేట రిజర్వాయర్కు... అటు నుంచి సింగసముద్రం చెరువుకు 18 కి.మీ. గ్రావిటీ ద్వారా వెళ్తాయి. అక్కడ ఉన్న రెండో పంప్హౌస్లో 2.25 మెగావాట్ల సామర్థ్యంగల రెండు మోటార్ల ద్వారా 5.70 కి.మీ. ప్రెషర్ మెయిన్ నుంచి బట్టల చెరువు, అటు నుంచి 3.35 కి.మీ. గ్రావిటీ ద్వారా ప్రయాణించి అప్పర్ మానేరు చేరేలా డిజైన్ చేశారు. దీని ద్వారా అప్పర్ మానేరుకు నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్యాకేజీ-9 పనుల్లో మరో 30 శాతం మేర పనులు పూర్తికాలేదు. రెండో పంప్హౌస్లో మోటార్ల బిగింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. జూలై చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్యాకేజీలో 1,279 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 605 ఎకరాలు పూర్తయింది. మిగతా భూసేకరణకు రూ. 25 కోట్ల తక్షణ అవసరాలున్నాయి. వాటి విడుదలలో ప్రభుత్వ జాప్యంతో పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్... కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్రణాళికను అమల్లో పెట్టారు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్కు వెళ్లే గ్రావిటీ కెనాల్ 7వ కి.మీ. వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని కూడవెళ్లి వాగులోకి తరలించేలా పనులు పూర్తి చేశారు. దీంతో గత నెల 23న మంత్రి హరీశ్రావు, ఈఎన్సీ హరిరామ్ ఈ కాల్వ నుంచి 1,300 క్యూసెక్కుల నీటిని వాగులోకి విడుదల చేశారు. ఈ నీరు దారిలోని 39 చెక్డ్యామ్లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరింది. మొత్తంగా 2 టీఎంసీల మేర నీరు అప్పర్ మానేరు చేరడంతో అది ప్రస్తుతం పూర్తిగా నిండి సోమవారం సాయంత్రం నుంచి అలుగు దుంకుతోంది. జూన్లో వర్షాలు ఆలస్యమైనా.. ప్యాకేజీ–9 పనులు పూర్తి కాకపోయినా కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరు కింది ఆయకట్టుకు ఇప్పుడు కొండంత భరోసా ఉంటుందని నీటిపారుదల ఇంజనీర్లు చెబుతున్నారు. -
వందల టీఎంసీల పంపింగ్లో కాళేశ్వరం రికార్డ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించిన ప్రపంచంలోనే పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ఆనతి కాలంలోనే నీటి పంపింగ్లో రికార్డ్ సాధించింది. ఈ పథకంలోని ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుంచి వంద టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తి పోసింది. లింక్-1లోని మేడిగడ్డ లక్ష్మీ దాదాపు 100 టీఎంసీలకు దగ్గరగా ఉండగా, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టీఎంసీల చొప్పున పంపింగ్ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ను పూర్తి చేయడమే కాకుండా ఆనతికాలంలోనే వందల టీఎంసీల నీటిని ఎంఈఐఎల్ పంపింగ్ చేసింది. దశాబ్దాలుగా నీరందని తెలంగాణ పొలాలు ఇప్పుడు పచ్చని పైరును కప్పుకుని కళకళలాడుతున్నాయి. ఎంతో కాలంగా నీటి కోసం ఎదురుచూసిన రైతన్నలు కాళేశ్వరం నీటి రాకతో తమ బీడు భూములను సస్యశ్యామలం చేసుకుంటున్నారు. ఇంతటి బహుళార్ధక ఎత్తిపోతల పథకం తెలంగాణ దశనే మార్చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టుదలతో పాటు మేఘా శక్తి సామర్ధ్యాలతో ఇది సాధ్యమైంది. అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. కాళేశ్వరంలోని ఏ పంప్ ఎంత నీటిని ఎత్తిపోసిందంటే? భూ ఊపరితలంపైన అతి పెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్ను జూలై 6, 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 522 రోజుల పాటు పని చేసి దాదాపు 100 టీఎంసీల నీటిని పంప్ చేసింది. ఇక కీలకమైన ఈ పంప్ హౌస్లో 3వ మిషన్ 1,110 గంటల పాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటల పాటు పనిచేసింది. కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్ ఇదే. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుంచే ప్రారంభమవుతుంది. లక్ష్మీ పంప్ హౌస్ను పార్వతి పంప్ హౌస్కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజుల పాటు నీటిని ఎత్తిపోసింది. వంద టీఎంసీలను నీటిని ఎగువకు తరలించింది. ఇందులో మొదటి మిషన్ 1,347 గంటలు పాటు పని చేసింది. అతి తక్కువగా 12వ మిషన్ 195 గంటల పాటు పనిచేసింది. లింక్-1లో చివరిదైన పార్వతి పంప్ హౌస్ సైతం సత్తా చాటింది. ఏకంగా 504 రోజుల పాటు నీటిని పంప్ చేసింది. వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. ఇందులో అత్యధికంగా రెండో మిషన్ 1,076 గంటల నీటిని ఎత్తపోసింది. అత్యల్పంగా 14వ మిషన్ కేవలం 333 గంటల పాటు పని చేసింది. అతి కీలకంగా ఉన్న గాయత్రి పంప్ హౌస్ లింక్-2లో భూగర్భ అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్ను ఆగస్టు 11, 2019లో ప్రారంభించిన మేఘా ఆనతికాలంలోనే 100 టీఎంసీలు ఎత్తిపోసింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలించింది. ఈ పంప్ హౌస్లో రెండో మిషన్ అత్యధికంగా 1,703 గంటల పాటు నీటిని పంపింగ్ చేయగా, మొదటి మిషన్ 1,367 గంటల పాటు పనిచేసి 111 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది. గాయత్రిలోని 7 మిషన్లలో ఒక్కొక్క మిషన్ నుంచి 3,150 క్యుసెక్కుల నీటిని విడుదల చేశాయి. ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీ స్థాయిలో పంపుహౌస్లను ఈ పథకంలో ఏర్పాటు చేసింది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకంలో 20 పంపుహౌస్ల కింద మొత్తం 104 మెషీన్లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాను మేఘా నిర్మించింది. ఎంఈఐఎల్ కాళేశ్వరంలో భారీ విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం - ట్రాన్స్ మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం 5,159 మెగావాట్ల విద్యుత్ అంటే అంతే పంపింగ్ సామర్థ్యం మిషన్లు అవసరం కాగా అందులో ఎంఈఐఎల్ 4,439 మెగావాట్ల విద్యుత్ అంటే అంత సామర్థ్య పంపింగ్తో పాటు విద్యుత్ సరఫరా చేసే 6 సబ్ స్టేషన్లు, వాటి లైన్లు నిర్మించింది. సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్లు, మోటార్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైమ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు సమకూర్చాయి. ఇంతవరకూ ప్రపంచంలో ఒక పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. ఒక్క మేడిగడ్డలోనే మొట్ట మొదటిది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపు హౌస్లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేశారు. లింక్--1లోని ఈ మూడు పంపుహౌస్ల కిందే 1,720 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపులు, మోటార్లు ఏర్పాటయ్యాయి. అన్నారం సరస్వతిలో 12 పంపింగ్ యూనిట్లు, సుందిళ్ల పార్వతి పంపింగ్ కేంద్రంలో 14 యూనిట్లు ఆనతి కాలంలోనే పూర్తయ్యాయి. మొత్తం 43 మిషీన్లు వినియోగంలోకి వచ్చాయి. అన్నిటికన్నా ప్రధానంగా ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో 7 రోజులకు 2 టీఎంసీలు పంపు చేసేలా 7 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపిగ్ సామర్ధ్యం ఉందంటే ఎంతపెద్దదో అర్ధమవుతోంది. ఆ తరువాత రంగనాయక సాగర్లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్హౌస్ల నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటయ్యాయి. -
కాల్వలతో కాదు.. పైపులతో పారిద్దాం
ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందుతుంది. ప్రధాన కాల్వల నుంచి పిల్ల కాల్వల ద్వారా సాగునీరు రైతుల పొలాలకు చేరుతుంది. అయితే ముందుగా తమ క్షేత్రానికి నీరు అందాలనే ఆత్రంలో పిల్ల కాల్వలకు, గట్లకు గండికొట్టడం ద్వారా నీళ్లు మళ్లిస్తుంటారు. ఫలితంగా రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటాయి. పైపెచ్చు కాల్వల ద్వారా సాగునీటిని అందించే క్రమంలో దాదాపు 30 శాతం వరకు నీరు వృథా అవుతుంది. అలాకాకుండా మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందినట్లుగా... పైపుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందితే ఎలాగుంటుంది? అద్భుతం కదూ! నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు ఇలాగే పైపుల ద్వారా నీరందనుంది. పంటకు నీరు పెట్టాలనుకుంటే చేనుకు సమీపంలోని వాల్వ్ను స్వయంగా రైతులు తిప్పుకోవచ్చు. ఈ రెండు లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి సాగవుతోంది. పైపుల ద్వారా సాగునీరు అందడం వల్ల పంట మార్పిడికి అవకాశం ఏర్పడనుంది. రైతులు వరికి బదులు అరుతడి, వాణిజ్య పంటలు వేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాగునీటిని తీసుకొచ్చే పైపులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను అనుసంధానిస్తే సరిపోతుంది. పైపుల ద్వారా సరఫరా కాబట్టి నీటి వృథా గణనీయంగా తగ్గుతుంది. దీనికి డ్రిప్ తోడైతే... ప్రతి చుక్కా సద్వినియోగం కానుంది. చివరి ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పైపులైన్ ద్వారా నీటి సరఫరా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన ఈ పైప్లైన్ వ్యవస్థ నిర్మాణాలు యుధ్ద ప్రాతిపదికన జరుగుతుండగా, ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఫోర్షోర్ నుంచి నీటిని తీసుకుంటూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా కాళేశ్వరంలో ప్యాకేజీ–20, 21, 21(ఎ) పనులు చేపట్టారు. ప్యాకేజీ–20లో బినోల సమీపంలోని ఎస్సారెస్పీ ఫోర్షోర్ నుంచి అప్రోచ్ చానల్, 17.82 కిలోమీటర్ల టన్నెల్, 30 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న 3 మోటార్లతో సారంగాపూర్ వద్ద పంప్హౌస్ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ.935 కోట్లతో చేపట్టిన ఈ పనులు 85 శాతం వరకు పూర్తయ్యాయి. సారంగాపూర్ పంప్హౌస్ నుంచి నిజాంసాగర్ కెనాల్కు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి రెండు మార్గాల్లో పైప్లైన్ల ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు చేపట్టారు. సాధారణంగా కాల్వల నిర్మాణం చేపడితే 7 వేల నుంచి 8 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అదే పైప్లై¯Œ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద భూగర్భాన పైప్లైన్ ఏర్పాటు చేస్తారు. తద్వారా పైన యథావిధిగా వ్యవసాయం చేసుకునే అవకాశముంది. భూసేకరణ తప్పుతుంది. ఇక కాల్వల ద్వారా నీటి వృథా దాదాపు 30 శాతం వరకు ఉండగా... పైప్లై¯న్తో వృథా అతి తక్కువ. దీంతోపాటు పైప్లై¯న్తో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. నిర్ణీత ఆయకట్టులో రెండో పంటకు సైతం నీరు అందించవచ్చనే అంచనాతో ఈ పనులు చేపట్టారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అమలవుతున్న ఈ వ్యవస్థను మోడల్గా తీసుకొని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. పంప్హౌస్లో సిద్ధమైన మోటార్లు పైప్లైన్ నిర్మాణ పనులు ఇలా... ఎస్సారెస్పీ ఫోర్షోర్ నుంచి నిజాంసాగర్ కెనాల్లోకి చేరే నీటిని రెండు భాగాలుగా విభజించి నీటిని తరలించేలా పైప్లైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒక పైప్లైన్ వ్యవస్థను మెట్పల్లి సెగ్మెంట్గా, మరో పైప్లైన్ వ్యవస్థను గడ్కోల్ సెగ్మెంట్గా విభజించి పనులు చేపట్టారు. ఫోర్షోర్ నుంచి నీటిని తరలించే క్రమంలో నిజాంసాగర్ కెనాల్ను 23.10 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే పనులు, గడ్కోల్ సెగ్మెంట్కు నీటిని సరఫరా చేసే అప్రోచ్ చానల్, టన్నెల్, పంప్హౌస్ నిర్మాణ పనులను ప్యాకేజీ–21 కింద చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ.807 కోట్లతో చేపట్టగా, రూ.372 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ లభ్యత నీటిని తీసుకుంటూ మెట్పల్లి సెగ్మెంట్లో కొంత భాగానికి నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్పల్లి సెగ్మెంట్లో 1.15 లక్షల ఎకరాలు (11.7 టీఎంసీ), గడ్కోల్ సెగ్మెంట్లో 85 వేల ఎకరాలకు(8 టీఎంసీ) నీరందించేలా ప్యాకేజీ–21(ఎ) కింద పనులను రూ. 2,950.31 కోట్లతో చేపట్టారు. ఇందులో ఇప్పటికే 1,430కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. తొలి ప్రాధాన్యతగా మెట్పల్లి సెగ్మెంట్ పరిధిలోని ప్రధాన పైప్లైన్ వ్యవస్థను పూర్తి చేసి దీనికింద ఈ వానాకాలంలోనే 20 వేల ఎకరాలకు పైపుల ద్వారా నీటిని అందించేలా పనులు జరుగుతున్నాయి. మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడ్కోల్ సెగ్మెంట్ పరిధిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికింద భూసేకరణ సమస్యలు ఉండటంతో దీని పనులను రెండో ప్రాధాన్యం కింద పెట్టుకున్నారు. నీటి తరలింపు ఇలా... తొలి ప్రాధాన్యంగా తీసుకున్న మెట్పల్లి సెగ్మెంట్ కింద 1.15 లక్షల ఎకరాల్లో 20 వేల ఎకరాలకు ఈ వానాకాలంలో నీటి తరలించేలా ప్రస్తుతం పైప్లైన్ వ్యవస్థ సిధ్దమైంది. నిజాంసాగర్ కాల్వల నుంచి వచ్చే 650 క్యూసెక్కుల నీటిని పైప్లైన్లోకి తోసేలా మెంట్రాజ్పల్లి (డిచ్పల్లి మండలం)లో పంప్హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. 2.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 10 మోటార్ల ద్వారా నీటిని 92 మీటర్ల మేర లిఫ్టు చేసి నిర్ణీత నీటిని 3 మీటర్ల డయాతో ఉండే ఒకే ఒక్క పెద్ద ఎంఎస్ పైప్లోకి తరలించేలా పంప్హౌస్ను నిర్మిస్తున్నారు. ఈ పంప్హౌస్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. దీనికి విద్యుత్ను అందించే సబ్స్టేషన్ నిర్మాణం పనులు వేగిరం చేశారు. ఈ పైప్లైన్లోకి నీటిని తరలించే క్రమంలో ఎలాంటి చెత్తాచెదారం రాకుండా మూడు దశల్లో నీటిని ఫిల్టర్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన పైప్లైన్ నుంచి నీటిని వివిధ జోన్ల కింది ఆయకట్టుకు తరలించేలా మరో చిన్న పైప్లైన్ వ్యవస్థ, ఈ వ్యవస్థ నుంచి జోన్ల పరిధిలోని ఆయకట్టుకు నీటిని అందించేలా మరో పిల్ల పైప్లైన్ వ్యవస్థను మూడు రకాల పైపులతో సిధ్దం చేస్తున్నారు. పైప్లైన్ వ్యవస్థలో భాగంగా నిర్మిస్తున్న మెంట్రాజ్పల్లి పంప్హౌస్ ప్రధాన పైప్లైన్ 3 మీటర్ల నుంచి ఒక మీటర్ వరకు ఉండే ఎంఎస్ పైపుల వ్యవస్థ కాగా, ఈ పైప్లైన్ నుంచి నీటిని 900 మిల్లీమీటర్ల నుంచి 350 మిల్లీమీటర్లు ఉండే డీఐ పైపులు, అటునుంచి 315–40 మిల్లీమీటర్లు ఉండే హెచ్డీపీఈ పైపుల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని అందిస్తారు. మెట్పల్లి సెగ్మెంట్ పరిధిలో 88.17 కిలోమీటర్ల మేర ఎంఎస్ పైపుల నిర్మాణం చేయాల్సి ఉండగా, ఇందులో 75.37 కిలోమీటర్ల వ్యవస్థ పూర్తయింది. 192 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ పైప్లైన్లో 114 కిలోమీటర్లు, 3,319 కిలోమీటర్ల హెచ్డీపీఈలో 1,052 కిలోమీటర్లు మేర పూర్తి చేశారు. పెద్ద పైపులైన్ నుంచి డీఐ, హెచ్డీపీఈ పైపులకు నీటిని తరలించే క్రమంలో ఓఎంఎస్ చాంబర్, డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ అని ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారానే ఎంతమేర నీటిని తరలించాలి, ఏ ప్రాంతానికి నీటిని తరలించాలి అన్నది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 20 కిలోమీటర్ల మేర నీటిని తరలించేలా పైప్లైన్ వ్యవస్థ 95 శాతం పూర్తవగా, మార్చి చివరికి 100 శాతం పనులు పూర్తి చేయనున్నారు. కొన్ని అడ్డంకులు... ఈ పైప్లైన్ పనులకు ప్రధానంగా భూసేకరణ లేకున్నా... రైతులు సాగు చేస్తున్న భూముల్లోంచే పైపులు వేయాల్సి ఉంది. భూమిని తవ్వి 1.20 మీటర్ల దిగువన పైపులు వేయాలి. ఆ లైన్లు వెళుతున్న మార్గాలన్నీ ప్రస్తుతం సాగులో ఉన్న భూములే కావడంతో పనులకు రైతులు అడ్డుపడుతున్నారు. వ్యవసాయ పనులు సాగని రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో మాత్రమే పైపులు వేయాల్సి వస్తోంది. దీంతో ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పైపులు వెళ్లే భూములకు నష్టపరిహారం చెల్లిస్తే యాసంగి సీజన్లో పనులు పూర్తి చేస్తామని ఏజెన్సీ సహా ప్రజాప్రతినిధులు కోరినా ప్రభుత్వం దీనికి అంగీకరించకపోవడంతో రైతుల సమ్మతి దొరికిన చోటే పనులు కొనసాగించాల్సి వస్తోంది. దీనికి తోడు ఓఎంఎస్ ఛాంబర్స్, డిస్ట్రిబ్యూటరీ ఛాంబర్స్ నిర్మాణాలకు గుంట కన్నా తక్కువ భూమే అవసరమవుతున్నా, దాన్ని ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఇక రెండు చోట్ల రైల్వే క్రాసింగ్, నేషనల్ హైవే క్రాసింగ్లు వెళుతున్నాయి. మరోవైపు నిజాంసాగర్ కాల్వల వెడల్పుకు దాని పరిధిలోని భూ ఆక్రమణలు, పంటల సాగు ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్నారు. ఈ చాంబర్లు ఎలా పనిచేస్తాయంటే.. చివరి ఆయకట్టు వరకు నీటిని తరలించేలా ఓఎంఎస్ (ఔట్లెట్ మేనేజ్మెంట్ సిస్టమ్) చాంబర్ ఏర్పాటు చేస్తుండగా, ఈ ఛాంబర్లోకి వచ్చిన నీటిని 3 నుంచి 6 ఔట్లెట్ పైపుల ద్వారా బయటకు పంపించేలా ఏర్పాట్లుంటాయి. ఔట్లెట్ పైపుల ద్వారా నీటిని తరలించే వాల్వ్లను పూర్తిగా సాంకేతిక సహాయంతోనే ఆపరేట్ చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎంతమేర నీటిని తరలిస్తున్నారన్నది తెలుసుకునేలా దీనిలో వాటర్ మీటర్, ప్రెషర్ మీటర్లు అమర్చారు. దీనికి అవసరమయ్యే విద్యుత్కై సోలార్ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం నిర్ణయించిన 20 వేల ఎకరాల పరిధిలోనే 1,892 ఓఎంఎస్ చాంబర్స్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడి నుంచి ఔట్లెట్ ద్వారా తరలించే ఒక్కో పైప్లైన్కు దిగువన ప్రతి 3 ఎకరాలకు నీటిని అందించేలా మళ్లీ 5–7 వరకు చిన్న పైపుల ద్వారా నీటిని తరలించేందుకు డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఛాంబర్స్లో ఉండే పైపులన్నింటికీ వాల్వ్లను బిగించారు. అవసరమైతేనే నీటిని వాడుకునేలా ఈ వాల్వ్లు ఉపయోగపడతాయి. వాటిని రైతులే ఆపరేట్ చేసుకుంటారు. -
తెలంగాణ: వేసవిలోనూ చెరువులకు జలకళ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ఆరంభమైన నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ఆయకట్టు పంటలకు ఎలాంటి నీటి కొరత లేకుండా చెరువులు, చెక్డ్యామ్ల్లో నీటి నిల్వలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎల్లంపల్లి దిగువ నుంచి కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులను వంద శాతం నీటితో నింపాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచనల మేరకు ఇరిగేషన్ శాఖ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇప్పటికే చెరువుల్లో నీటిని నింపే ప్రక్రియ మొదలవగా, మొత్తంగా 2,074 చెరువులకు నింపేలా ప్రణాళిక రచించింది. ఈ చెరువుల ద్వారా 1.20 లక్షల ఎకరాల మేర నీరందించనుంది. చదవండి: (ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్) ఎస్సారెస్పీ కింద చెరువులకు జలకళ... ముఖ్యంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వ పుష్కలంగా ఉండటంతో ఆ నీటి ద్వారా లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకు కాల్వల ద్వారా పంటలకు నీరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ఉంచడం మేలనే ఉద్దేశంతో ఎల్ఎండీ దిగువన కాళేశ్వరం ఎత్తిపోతల నీటిని వాడుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద సుమారు మరో 3.50 లక్షల ఎకరాలకు నీరందించేలా ఇప్పటికే కాల్వల ద్వారా నీటి విడుదల జరగ్గా, దీని కింద 942 చెరువులున్నాయి. ఈ చెరువులకు నీటిని అందించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తూ నీటి విడుదల కొనసాగుతోంది. ఇప్పటికే చాలా చెరువులకు నీరందించేలా తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, వాటి ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఈ చెరువులను నింపడం ద్వారా వాటికింద ఉన్న సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండగా, 10 టీఎంసీల మేర నిల్వలు సాధ్యపడనున్నాయి. ఇక ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద మొత్తంగా 3.52 లక్షల ఎకరాలకు నీరందించనుండగా, 866 చెరువుల పరిధిలో కనీసంగా 30 వేల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ చెరువులన్నింటినీ ముందుగా నింపేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవలే నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు చేశారు. చదవండి: (ప్రధాని మాటలు ఆచరణలోకి రావాలి: కేటీఆర్) మిడ్మానేరు దిగువన... ఇక మిడ్మానేరు దిగువన అనంతగిరి రిజర్వాయర్ మొదలు కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్కు పుష్కలంగా నీటి లభ్యత ఉంది. ఈ నీటితో మొత్తంగా 266 చెక్డ్యామ్లు, చెరువుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని చెరువులను నీటితో నింపుతున్నారు. ఈ మొత్తం చెరువులు, చెక్డ్యామ్ల కింద 18 వేలకు పైగా ఎకరాలకు నీరందే అవకాశం ఉండగా, 8.60 టీఎంసీల మేర నీటి నిల్వలకు అవకాశం ఉంది. ఇందులో అనంతగిరి కింద బెజ్జంకి మండల పరిధిలో 16, ఇల్లంతకుంటలో 9, రంగనాయక్సాగర్ కింద చిన్నకోడూరు మండలంలో 23, నంగనూర్–49, నారాయణ్పేట–22, సిద్దిపేట–4, ఇల్లంతకుంట–3, తంగనపల్లి–10, ముస్తాబాద్–5 చెరువులు, వీటితో పాటు మరో 35 చెక్డ్యామ్లు ఉన్నాయి. మల్లన్నసాగర్లో తవ్విన ఫీడర్ చానల్ ద్వారా తొగుట–6, దుబ్బాక–సిద్దిపేట–25, ముస్తాబాద్–6, కొండపోచమ్మసాగర్ పరిధిలో జగదేవ్పూర్ కెనాల్ ద్వారా మర్కూక్–23, జగదేవ్పూర్–5, తుర్కపల్లి కెనాల్ ద్వారా మర్కూక్–5, ఎం.తుర్కపల్లి–9, బొమ్మలరామారం–5. గజ్వేల్ కెనాల్ ద్వారా మర్కూక్–3, గజ్వేల్–1 చెరువులను నింపుతున్నారు. -
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది: సీఎం కేసీఆర్
సాక్షి , వరంగల్: తెలంగాణ రైతుల కలలను సాకారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతులు సాగునీటి కోసం గోస పడొద్దనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. వేసవిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనూ ఇంజనీర్లు, అధికారులు, వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. అనుకున్న సమయంలో అనుకున్న విధంగా ప్రాజెక్టు పూరై్త నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా జరుగుతుండటంపై సీఎం సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్ మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం ద్వారా తన సతీమణి శోభతో కలసి ఆలయానికి చేరుకొని కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ముందుగా గణపతిపూజ చేసిన కేసీఆర్ దంపతులు.. గర్భగుడిలో ప్రత్యేకంగా మహాన్యాసకపూర్వక రుద్రాభిషేక పూజలను పంచామృతాలతో నిర్వహించారు. అనంతరం శ్రీశుభానందదేవి (పార్వతి) అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం దంపతులకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చదవండి: (ప్రధాని బొమ్మను పెట్టాల్సిందే) మంగళవారం మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ సందర్శన సందర్భంగా గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ దంపతుల పుష్పాభిషేకం. చిత్రంలో మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, కొప్పుల అనంతరం మంత్రులు, ఇతర నాయకులు, అధికారులతో కలసి సీఎం దంపతులు గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ (విహంగ వీక్షణం) ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన ఆయన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో పంచుకున్నారు. సముద్రాలను తలపిస్తున్న బ్యారేజీలు... ‘సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోస పడింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేలా సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్నాం. అటు ప్రాణహిత, ఇటు గోదావరి రెండు నదుల నీళ్లు కలిసిన తర్వాత బ్యారేజీ నిర్మాణం చేపడితే ఎక్కువ కాలంపాటు కావలసినంత నీటిని పంపింగ్ చేయవచ్చని వ్యూహం రూపొందించాం. వ్యాప్కోస్తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి మేడిగడ్డ పాయింట్ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించడం వల్ల 7 నెలలపాటు నీటిని పంపింగ్ చేయవచ్చని అంచనా వేశాం. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతోంది. 99.7 మీటర్ల ఎత్తులో 16.17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిర్మాణాలన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగాయి’అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం ప్రాజెక్టు జ్ఞాపకాలను పంచుకున్నారు. చదవండి: (వినయ్రెడ్డి మనోడే!) ‘నీటి పంపింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగుతోంది. మేడిగడ్డ పాయింట్ నుంచి 54 కిలోమీటర్ల వరకు ప్రాణహితలో, 42 కిలోమీటర్ల వరకు గోదావరిలో నీరు నిల్వ ఉండటంతో జలకళ ఉట్టి పడుతోంది. బ్యారేజీలు సముద్రాలను తలపిస్తున్నాయి. ఏ సమయం ఎట్ల వచ్చినా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ఏటా నీరందుతుంది. ప్రాజెక్టు వద్ద అధికారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తదితరులు నిజాం సాగర్కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవసరమైన పక్షంలో ఎస్సారెస్పీకి కూడా ఈ ప్రాజెక్టు నుంచే నీటి పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తుపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీంటినీ త్వరగా పూర్తిచేసి రైతుల సాగునీటి గోసను శాశ్వతంగా రూపుమాపాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అధికారులకు అభినందన.. ‘మేడిగడ్డ బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ, దుమ్ముగూడెం బ్యారేజీలకు సంబంధించి కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలి. సమయానుగుణంగా రూల్స్ను అమలు చేయాలి’అని సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో కృషి చేసిన నీటిపారుదల శాఖ అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను కేసీఆర్ అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నాయని, ఈ ఎండాకాలమంతా ఈ నీటితో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులవారీగా ఆపరేషన్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితోనే రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, నారదాసు లక్ష్మణ్రావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్రావు, నల్లా వెంకటేశ్వర్లు, భూపాలపల్లి, రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, నడపల్లి దివాకర్రావు, దాసరి మనోహర్రెడ్డి, పెద్దపల్లి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్లు పుట్టా మధు, గండ్ర జ్యోతి పాల్గొన్నారు. గోదావరిని చూసి పులకించిన ముఖ్యమంత్రి కాళేశ్వరాలయంలో పూజల అనంతరం ప్రగతిరథం బస్సులో మంత్రులతో కలసి కేసీఆర్ దంపతులు గోదావరి వద్దకు వెళ్లారు. గోదావరి నిండుగా ఉండటం చూసి కేసీఆర్ పులకించిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ బ్యాక్వాటర్తో నిండుగా ఉందని అధికారులతో అన్నారు. గతంలో వచ్చినప్పుడు కాలినడకన ఇసుకలో కిలోమీటర్ మేర నడిచే వాళ్లమని గుర్తుచేసుకున్నారు. నిత్యం భక్తుల రద్దీ ఉంటుందా? ఘాట్లో భక్తులు స్నానాలు చేస్తున్నారా? అప్పటికీ, ఇప్పటికీ భక్తుల సంఖ్య పెరిగిందా అంటూ పక్కనే ఉన్న అర్చకులతో వాకబు చేశారు. గతంలో కంటే భక్తుల రద్దీ పెరిగిందని, నిత్యం వేల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు వారు బదులిచ్చారు. ఆ తర్వాత గోదావరి మాతకు ప్రత్యేకంగా పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, పాలను సమర్పించిన కేసీఆర్ దంపతులు.. నదిలో నాణేలను వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాం. 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనూ వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. భూసేకరణతోపాటు వివిధ క్రాసింగ్లకు సంబంధించిన అంశాలను అధికారులు సమయోచితంగా, సమర్థంగా పరిష్కరించారు. మొత్తంగా రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఆవశ్యకమైన ప్రాజెక్టు నిర్మాణం పూరై్త వినియోగంలోకి రావడంతో సంతోషంగా ఉంది. తెలంగాణ రైతుల కల నెరవేరినందుకు, సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా ఉంది. -
కాళేశ్వరం చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంగళవారం ఉదయం బయల్దేరారు. కాళేశ్వరం చేరుకుని నేరుగా కాళేశ్వర.. ముక్తేశ్వర స్వామివార్ల దర్శనానికి వెళ్లారు. సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మంత్రులకు వేద పండితులు ఘన స్వాగతం పలికి ఆలయం లోపలకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లారు. యాసంగి సీజన్లో కాళేశ్వరం ద్వారా.. నీటిని పంపించే విధానాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఈ పర్యటన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లోని ప్రధాన బ్యారేజ్లు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగి సీజన్లో పంటలకు జలాలను పంపింగ్చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం రిజర్వాయర్ను పరిశీలిస్తారు. లక్ష్మీ బరాజ్ చేరుకొని.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు. ఈ సందర్భంగా మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. బ్యారేజ్ వద్ద సీఎం కేసీఆర్ భోజనం చేసి అక్కడి నుంచి హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు తిరిగి వెళ్లనున్నారు. సీఎం వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సాగునీటి అధికారులు ఉన్నారు. -
కాళేశ్వరంలో మళ్లీ ఎత్తిపోతలు
కాళేశ్వరం/మంథని: కాళేశ్వరం పథకం ద్వారా మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి లక్ష్మీపంపుహౌస్లో ఆదివారం ఇంజనీరింగ్ అధికారులు రెండు మోటార్లను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. లక్ష్మీపంపుహౌస్ నుంచి ఇప్పటికే 11 మోటార్లతో 22 పంపుల ద్వారా గడిచిన రెండు సీజన్లలో నీటిని ఎత్తిపోసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది ఆగస్టులో భారీ వర్షా లతో ఇంజనీర్లు మోటార్లను నిలిపివేశారు. అప్పటి నుంచి పంపుహౌస్లో ఎత్తిపోతలు జరగలేదు. లక్ష్మీబ్యారేజీకి జలకళ: ఈ నెల 1 నుంచి మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీలోని 85 గేట్లు మూసివేసి నీటిని నిల్వచేస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల వరకు నిల్వ ఉంది. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం వరకు బ్యాక్ వాటర్ 20 కిలోమీటర్ల మేరకు పెరగడంతో ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తాజాగా ఎత్తిపోతలు ప్రారంభించారు. 10.5 టీఎంసీల లక్ష్యం: లక్ష్మీపంపుహౌస్ మోటార్ల ద్వారా డెలివరీ సిస్టర్న్లో ఎత్తిపోసే నీరు.. అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా 13.5 కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నారం సరస్వతీ బ్యారేజీలోకి చేరుతుంది. అక్కడి నుం చి ఎగువన ఉన్న లోయర్ మానేరుకు 8 టీఎంసీలు, ఎల్లం పల్లికి 2.5 టీఎంసీలు.. మొత్తం కలిపి 10.5 టీఎంసీల నీటిని తరలించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏకకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంపుహౌస్లలో రెండు చొప్పున మొత్తం పది మోటార్లు రన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఒక చోటనుంచి మరో చోటుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. 3,150 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరుకు, అక్కడి నుంచి ఎల్ఎండీకి తరలించనున్నారు. ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీరు బోయినపల్లి(చొప్పదండి): కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ప్రారంభం కావడంతో దానికి అనుగుణంగా శ్రీరాజరాజేశ్వర (మిడ్మానేరు) ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న కరీంనగర్ ఎల్ఎండీ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం నీటి ని విడుదల చేశారు. మిడ్మానేరు ప్రాజెక్టు 12, 13 గేట్లను ఎత్తడంతో ఒక్కో గేటు ద్వారా 1,500 క్యూసెక్కుల చొప్పు న 3 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ ప్రాజెక్టులోకి వెళ్తోంది. గాయత్రి పంప్హౌస్ నుంచి వరద కాలువ మీదుగా మిడ్మానేరు ప్రాజెక్టులోకి 3 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 25.57 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్మానేరు నుంచి ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. దేవాదుల పంపింగ్ షురూ కన్నాయిగూడెం(ములుగు): దాదాపు ఐదు నెలల తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ మళ్లీ ప్రారంభమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న జె.చొక్కారావు దేవాదుల పథకంలోని ఫేజ్–1, ఫేజ్–2లో ఒక్కో మోటారు చొప్పున శనివారం రాత్రి ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. ‘కాళేశ్వరం’ సందర్శనకు పర్యాటకులకు అనుమతి కాళేశ్వరం: దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లి లక్ష్మీ పంప్హౌస్ వద్ద పర్యాటకుల ప్రవేశానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చి 20 నుంచి పర్యాటకులకు అనుమతులు ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జూన్ 8న ఆలయాలకు వెళ్లేందుకు భక్తులకు అనుమతులిచ్చినా.. ఇక్కడి పంప్హౌస్, బ్యారేజీల్లోకి మాత్రం బ్యారేజీ ఏజెన్సీ సంస్థలు అనుమతించడం లేదు. తాజాగా ఆదివారం నుంచి పంప్హౌస్లోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు. -
అదనపు టీఎంసీ... ఆగినట్లే!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించేలా చేపట్టిన పనులకు బ్రేక్ పడనుంది. కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్రానికి అందిన ఆదేశాలు, ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వెలువరించిన ఉత్తర్వుల నేపథ్యంలో.. నెలరోజుల కిందటే రూ.21 వేల కోట్లతో చేపట్టిన పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. మూడో టీఎంసీ ఎత్తిపోత పనులను కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నందున... ఆ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థల నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చే వరకు పనులు కొనసాగించే అవకాశాలు లేవని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆదిలోనే హంసపాదు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరంభించి కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఈ ఏడాది మార్చిలో టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా నాలుగు ప్యాకేజీలకు రూ.9,747.30 కోట్లతో, మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు మరో నాలుగు ప్యాకేజీలకు రూ.11,710.70 కోట్లతో టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రక్రియ మే నెలలో ముగిసింది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. డీపీఆర్లు సమర్పించాలని, కేంద్ర అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించరాదని తెలిపింది. ఫలితంగా రాష్ట్రం ముందడుగు వేయలేదు. ఎన్జీటీ ఉత్తర్వులు అడ్డంకే దీంతో పాటే అదనపు టీఎంసీ పనులపై కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై అక్టోబర్లో తుదితీర్పును వెలువరించిన ఎన్టీటీ, కేంద్ర జల్శక్తి శాఖ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ‘గోదావరి బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లొద్దని ఆగస్టులోనే కేంద్రమంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విస్తరణ పనులకు ఎలాంటి ప్రతిపాదన తమవద్దకు రాలేదని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. దీనికి కొత్తగా అనుమతులు అవసరమని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 2న తెలంగాణ సీఎం కేంద్రానికి రాసిన లేఖను జల్శక్తి శాఖ పరిశీలించాల్సి ఉంది. అనంతరం కేంద్ర జల్శక్తి శాఖ తీసుకునే నిర్ణయానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి’అని తన తుదితీర్పులో ఎన్జీటీ పేర్కొంది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో గతనెలలో ఎనిమిది ప్యాకేజీల పరిధిలో అదనపు టీఎంసీ పనులను రాష్ట్రం ఆరంభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి లేఖపై ఈనెల 11న స్పందించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, అదనపు టీఎంసీ పనులను పూర్తిగా కొత్త డిజైన్గానే చూస్తామని, మార్పు ఏదైనా జరిగినప్పుడు కేంద్ర హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పెట్టుబడులు, పర్యావరణ తదితర అనుమతులను పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ నుంచి మదింపు తప్పనిసరని, అది జరిగే వరకు ప్రాజెక్టుపై ముందుకెళ్లరాదని స్పష్టం చేశారు. ఇప్పటికే వెలువడిన ఎన్జీటీ ఉత్తర్వులు, కేంద్రం తాజా ఆదేశాల నేపథ్యంలో పనులను కొనసాగించే అవకాశం ఇరిగేషన్ శాఖకు లేకుండా పోయింది. కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. పనులను ఏమాత్రం కొనసాగించినా పిటిషనర్లు తిరిగి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. మిగతా ప్రాజెక్టుల డీపీఆర్లకు ఓకే కాళేశ్వరంతో పాటు సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్ గంగపై బ్యారేజి, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్కు నీటి మళ్లింపు ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాలని, బోర్డుల మదింపు జరగనంతవరకు ముందుకు వెళ్లరాదని సైతం కేంద్రమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల డీపీఆర్లను ఇరిగేషన్ శాఖ సిధ్దం చేస్తోంది. అయితే మిగతా చోట్ల పనులను పూర్తిగా నిలిపివేసే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై కోర్టులను ఆశ్రయించే అవకాశాలను సైతం రాష్ట్రం పరిశీలిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో న్యాయనిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ ఏడు ప్రాజెక్టులు ఆపండి..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల్శక్తి శాఖ తాజాగా తెలంగాణకు ఓ లేఖ రాసింది. అదిప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ లేఖలో ఏం ఉందంటే? కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదిత ప్రాజెక్టుసహా ఏడు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టుల నిర్వచనం పరిధిలోకి వస్తున్నందున వాటిపై ముందుకు వెళ్లొద్దని పేర్కొంది. కాళేశ్వరం మూడో టీఎంసీ, సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్గంగపై బ్యారేజీ, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్కు నీటి మళ్లింపు తదితర ఏడు ప్రాజెక్టులకు గోదావరి నదీజలాల యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నుంచి మదింపు కానంత వరకు ముందుకు వెళ్లరాదని తెలంగాణకు స్పష్టం చేసింది. నీటి వివాదాలపై అక్టోబర్ 2న పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాసిన లేఖకు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులిస్తూ నాలుగు పేజీల సమాధానం పంపారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో శుక్రవారం(డిసెంబర్ 11) జల్శక్తి మంత్రిని కలిసిన రోజే ఈ లేఖను పంపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. 1. ‘‘కృష్ణా, గోదావరి నదులలో నీటి వాటా, వినియోగానికి సంబంధించి మీరు అక్టోబర్ 2, 2020న రాసిన లేఖలోని అనేక అంశాలు అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో చర్చకు వచ్చాయి. అయితే మీరు లేవనెత్తిన అన్ని అంశాలపై కేంద్ర జల్శక్తి శాఖ మంత్రిగా స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇంకా లేఖలో ఏ ఏ అంశాలున్నాయంటే..కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీపై..‘కృష్ణా నదీజలాల వాటా, నీటి వినియోగంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి మీరు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా కోసం మీరు చేసిన ప్రయత్నాలను వివరించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 పరిధిలోని సెక్షన్ 3 ద్వారా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2014, 2018లో కోరినప్పటికీ కేంద్రం ఏడేళ్లుగా నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని మీరు ఆరోపించారు. ఈ సెక్షన్ పరిధిలో కాకుండా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ఆధారంగా పరిష్కరించాలని ట్రిబ్యునల్కు సూచించారని మీరు నివేదించారు. దీనివల్ల తెలంగాణ ఉపశమనం పొందలేదని మీరు చెప్పారు. అయితే ఈ విషయంలో మీరు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అది ఇంకా పెండింగ్లో ఉంది. ఇది అక్కడ పరిష్కారమైతేనే కేంద్రం చర్య తీసుకోగలదు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు ఈ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. మీరు ఉపసంహరించుకుంటే న్యాయ సలహా తీసుకుని నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అభ్యర్థనను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జల్శక్తి శాఖ అంగీకరించింది. గోదావరి జలాల విషయంలో కూడా రెండు రాష్ట్రాలు ఈ సెక్షన్ పరిధిలో అభ్యర్థన ఇచ్చేందుకు సమ్మతించాయి. అభ్యర్థన రాగానే సానుకూల నిర్ణయం తీసుకుంటామని నాటి సమావేశంలో జల్శక్తి శాఖ అంగీకరించింది’ 2. పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణపై .. ‘మీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్, దాని విస్తరణ గురించి ప్రస్తావించారు. ఇది అనధికార విస్తరణ అని, దీని వల్ల తెలంగాణ హక్కులు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని మీరు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014(ఏపీఆర్ఏ) ప్రకారం కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లను మూల్యాంకనం కోసం కేఆర్ఎంబీకి సమర్పించడానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. తదుపరి అపెక్స్ కౌన్సిల్ వాటిని అనుమతిస్తుంది. కృష్ణా నదీజలాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1)లో గానీ, ఏపీఆర్ఏలో గానీ ప్రస్తావించినవీ లేదా ప్రస్తావన లేనివీ అయినప్పటికీ.. సీడబ్ల్యూసీ ద్వారా సాంకేతిక, ఆర్థిక మదింపు జరగని పక్షంలో, జల వనరుల విభాగం సలహా కమిటీ ఆమోదం పొందని పక్షంలో అవి కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అది ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించినా, తరువాత ప్రతిపాదించినా ఈ షరతు మాత్రం సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్టు స్వభావంలో మార్పు చోటుచేసుకున్నా కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ మేరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీల సాంకేతిక మదింపు లభించనంతవరకు ముందుకు వెళ్లరాదని కేఆర్ఎంబీ, జల్శక్తి శాఖ ఆంధ్రప్రదేశ్కు పలుమార్లు లేఖ రాశాయి. ఈమేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్లు పంపేందుకు అంగీకరించారు’ 3. కేఆర్ఎంబీ స్పందించలేదన్న ఆరోపణలపై.. ‘పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆపడంలో కేఆర్ఎంబీ విఫలమైందని మీరు పేర్కొన్నారు. అలాగే ఏపీ కృష్ణా బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటి తరలించడాన్ని కూడా కేఆర్ఎంబీ ఆపలేకపోయిందని రాశారు. టెండర్ ప్రక్రియను ఆపడంలో కూడా విఫలమైందన్నారు. ఏపీ అక్రమంగా జలాలు వినియోగించడాన్ని పర్యవేక్షించడానికి టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 2016లో జల్శక్తి శాఖ చేసిన సూచనలు అమలు చేయడంలో కేఆర్ఎంబీ విఫలమైందని రాశారు. అలాగే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నుంచి విద్యుదుత్పత్తిని ఆపాలని తెలంగాణను కేఆర్ఎంబీ కోరడం తప్పని మీరు రాశారు. కేడబ్ల్యూడీటీ–1 ఆదేశాల మేరకు శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తికి, నీటిని దిగువకు విడుదల చేయడానికి, తాగునీరు మాత్రమే కాకుండా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఆపరేషన్, నియంత్రణను ఇవ్వమని మీరు అభ్యర్థించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ డీపీఆర్లను మదింపు చేసే వరకు ముందుకు వెళ్లవద్దని కేఆర్ఎంబీతోపాటు జల్శక్తి మంత్రిత్వ శాఖ ఏపీని నిరంతరం కోరుతూ వచ్చింది. దీనికి ఏపీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చకు వచ్చింది. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల సహా రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు పంపాలని మేం నిర్ణయించిన సంగతి మీకు తెలిసిందే. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించాం. నోటిఫై చేయడం పూర్తయితే విద్యుదుత్పత్తి సహా శ్రీశైలం నుండి దిగువకు నీటిని విడుదల చేయడం, నియంత్రించడం వంటి అంశాలను కేఆర్ఎంబీ నిర్దేశిస్తుంది. ఇక టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు వ్యయం భరించాలని 2016లో జరిగిన 1వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించారు. దీనిపై పదేపదే అభ్యర్థన చేసినప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించలేదు. రెండు రాష్ట్రాలు ఈ దిశగా వ్యయం భరిస్తే టెలిమెట్రీ వ్యవస్థ స్థాపించడం పూర్తవుతుంది’ 4. సెక్షన్ 89 అంశంపై.. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89కు సంబంధించిన సమస్యల గురించి మీరు రాశారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కేంద్రం రెఫర్ చేయనందున కృష్ణా నదీజలాలను పునఃపంపిణీ చేసే అంశం పరిశీలించలేమని, సెక్షన్ 89 పరిధిలో మాత్రమే పరిశీలన జరుగుతుందని కేడబ్ల్యూడీటీ–2 అభిప్రాయపడ్డట్టు మీరు రాశారు. సెక్షన్ 3 పరిధిలో కొత్త ట్రిబ్యునల్ గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్గానీ కృష్ణా నదీజలాల పునఃపంపిణీ జరిపేలా రెఫర్ చేయాలని మీరు కోరారు. కేంద్రం స్పందించలేదని మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను ఉపసంహరించుకుంటే మేం మీ అభ్యర్థనను పరిశీలించేందుకు సిద్ధమని చెప్పగా అపెక్స్ కౌన్సిల్లో మీరు కూడా అంగీకరించారు’ 5. ఆ ఏడు ప్రాజెక్టుల్లో ముందుకు వెళ్లొద్దు.. ‘తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను మీరు మీ లేఖలో ప్రస్తావించారు. మీరు గోదావరిపై చేపట్టిన ఏడు ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినవని మీరు ప్రస్తావించారు. భారీ ముంపు నష్టం లేకుండా కొన్ని ప్రాజెక్టుల స్థలాన్ని మార్చినట్టు, మెరుగైన సామర్థ్యం కనబరిచేలా కొన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేసినట్టు మీరు చెప్పారు. జల్శక్తి మంత్రిత్వ శాఖ కూడా కాళేశ్వరం (2 టీఎంసీ) ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినట్టు, ఆ స్థలంలో నీటి లభ్యత కారణంగా 3వ టీఎంసీ విస్తరణకు ముందుకు వెళ్లినట్టు మీరు మీ లేఖలో తెలిపారు. అయితే, ఆగస్టు 7న మీకు నేను రాసిన లేఖను గుర్తు చేయాలనుకుంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు 2 టీఎంసీల ప్రతిపాదనకు జల్శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ 2018 జూన్లో అంగీకరించింది. కానీ, ·ఈ ప్రాజెక్ట్ పరిధిని 3 టీఎంసీలకు పెంచుతూ మీరు మార్చారు. అలాంటి మార్పు ఏదైనా ఉన్నప్పుడు కేంద్రం నుంచి హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పెట్టుబడులు, పర్యావరణ తదితర అనుమతులను పొందాల్సి ఉంటుందని మీకు రాశాను. ఈ మార్పు కారణంగా ఏపీఆర్ఏ–2014ను అనుసరించి జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ నుంచి మదింపు తప్పనిసరి. ఏపీ అభ్యంతరం చెప్పినట్టుగా ఈ ఏడు ప్రాజెక్టుల డీపీఆర్ల మదింపు జరగకుండా ముందుకు వెళ్లరాదని కూడా ఆ లేఖలో చెప్పాం. దీనిపై అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కూడా చర్చించాం. జీఆర్ఎంబీకి డీపీఆర్లు పంపేందుకు మీరు సమ్మతించారు. అందువల్ల మీరు కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదన, సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్గంగపై బ్యారేజి, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్కు నీటి మళ్లింపు ప్రాజెక్టులకు జీఆర్ఎంబీ మదింపు జరగనంతవరకు ముందుకు వెళ్లరాదని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను’ 6. గోదావరి జలాల పంపిణీపై.. ‘గోదావరి నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.2 టీఎంసీలు కేటాయించారని మీరు ప్రస్తావించారు. తెలంగాణకు 1950 టీఎంసీల వాటా దక్కాలని మీరు రాశారు. ఏపీ, తెలంగాణల మధ్య గోదావరి జలాలను పంచుకునే విషయంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు తక్షణం అభ్యర్థన పంపుతామని ఇరు రాష్ట్రాలు అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించాయి. అభ్యర్థన రాగానే ఈ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది’అని మంత్రి పేర్కొన్నారు. ‘రెండు రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్యం, నీటి వినియోగ సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై వేగంగా ముందుకు సాగుతున్నామని ఆశిస్తున్నాను. తద్వారా రెండు రాష్ట్రాల చట్టబద్ధమైన నీటి హక్కులు త్వరితగతిన సాకారం అయ్యేలా చూసుకోవచ్చు’అని జల్శక్తి మంత్రి షెకావత్ పేర్కొన్నారు. ఆ ఏడు ప్రాజెక్టులు ఇవే.. కాళేశ్వరం మూడో టీఎంసీ సీతారామ ఎత్తిపోతలు జీఎల్ఐఎస్ ఫేజ్–3 తుపాకులగూడెం ప్రాజెక్టు తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు లోయర్ పెన్గంగపై బ్యారేజీ రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్కు నీటి మళ్లింపు -
ఎత్తిపోతకు.. గట్టిమోతే!
సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. నీళ్లున్నాయి... యాసంగిలో పంటలకు ఢోకా లేదు. అంతవరకు బాగానే ఉంది కానీ... నీటిని ఎత్తిపోయాలి. దీనికి భారీగా విద్యుత్ కావాలి. రాష్ట్రంలో ప్రధాన ఎత్తిపోతల పథకాల కింద గరిష్ట ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఏకంగా 4,720 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని నీటి పారుదల శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల కిందే అత్యధికంగా 2,200 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని లెక్కగట్టింది. ఖరీఫ్ సీజన్లో మంచి వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ఎత్తిపోతల పథకాలలో కరెంట్ మోత తప్పింది. యాసంగిలో మాత్రం బిల్లుల మోత గట్టిగానే ఉండనుంది. కాళేశ్వరం ద్వారా 50 టీఎంసీలు వానాకాలంలో స్థానిక పరీవాహకం నుంచి గరిష్ట ప్రవాహాల రాకతో రిజర్వాయర్లన్నీ నిండాయి. మోటార్ల ద్వారా ఎత్తిపోతల అవసరం గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లోని భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద 31 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 30 టీఎంసీల మేర తక్కువ. ఈ ఎత్తిపోతల పథకాల పరిధిలోని రిజర్వాయర్లలో స్థానిక ప్రవాహాల నుంచి నీరు చేరడంతో ఒకటి రెండు మోటార్ల ద్వారానే నీటిని ఎత్తిపోçశారు. దీంతో విద్యుత్ వినియోగం పెద్దగా జరుగలేదు. ఇక దేవాదుల కింద కూడా కేవలం 7 టీఎంసీల నీటి ఎత్తిపోతే జరిగింది. దీని పరిధిలోని వెయ్యికి పైగా చెరువులు వర్షాలతోనే నిండాయి. కాళేశ్వరం ద్వారా వానాకాలంలో 15 టీఎంసీల కన్నా తక్కువే నీటి ఎత్తిపోతల జరిగింది. దీంతో మొత్తంగా 2 వేల మిలియన్ యూనిట్లకన్నా తక్కువే విద్యుత్ వినియోగం జరిగింది. అయితే ప్రస్తుత యాసంగి సీజన్లో ప్రధాన ప్రాజెక్టుల కింద నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా 33 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. ఈ స్ధాయిలో ఆయకట్టుకు నీరివ్వాలంటే 330 టీఎంసీలు అవసరమని లెక్కగట్టింది. ఇందులో ప్రధాన ఎత్తిపోతల పథకాలైన దేవాదుల కింద 2.07లక్షల ఎకరాలకు 11.77 టీఎంసీలు, ఏఎంఆర్పీ కింద 2.67 లక్షల ఎకరాలకు 36 టీఎంసీలు, కల్వకుర్తి కింద 2.78 లక్షల ఎకరాలకు 37 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–1, 2ల కింద కలిపి 13 లక్షల ఎకరాలకు 120 టీఎంసీలు అవసరం ఉంటుందని లెక్కగట్టింది. ఈ స్థాయిలో నీటిని ఇచ్చేందుకు ఎన్ని మోటార్లు... ఎప్పటినుంచి నడపాలి, ఎంత నీటిని ఎత్తిపోయాలి, ఎంత విద్యుత్ వినియోగం అవుతుందని ఇరిగేషన్ శాఖ అంచనాలు వేసింది. ఇందులో కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ మొదలు, ప్యాకేజీ–8లోని గాయత్రి పంప్హౌజ్ వరకు ఐదు పంప్హౌజ్లను కనీసంగా 60 నుంచి 80 రోజుల వరకు నడపాల్సి ఉంటుందని తేల్చింది. ఎస్సారెస్పీ కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వాలంటే కాళేశ్వరం ద్వారానే కనీసంగా 50 టీఎంసీల మేర నీటిని జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎత్తిపోయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. దీనికే 2,200 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇక దేవాదుల పరిధిలోనూ ఈ ఏడాది 11 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలకు 779 మిలియన్ యూనిట్లు, మహబూబ్నగర్ ప్రాజెక్టుల కింద 800 మిలియన్ యూనిట్లు, ఏఎంఆర్పీ కింద 250 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ అవసరం ఉంటుందని గుర్తించారు. మిగతా చిన్న ఎత్తిపోతల పథకాలు, ఐడీసీ పథకాలు కలిపి మొత్తంగా యాసంగిలో 4,720 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరాలను తేల్చారు. గత సీజన్తో పోలిస్తే ఈసారి రెట్టింపు విద్యుత్ వినియోగం ఉండనుంది. -
కేంద్ర నిర్ణయానికి కట్టుబడాలి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎత్తిపోతల సామర్థ్యాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచడానికి ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న తెలంగాణ వాదనతో విభేదించింది. ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తెలిపింది. 2008 నుంచి 2017 వరకు ప్రాజెక్టు నిర్మాణంలో పలు మార్పులు జరిగినప్పటికీ పర్యావరణ అనుమతులు విస్మరించినట్లు గుర్తించామని స్పష్టం చేసింది. ఎత్తిపోతల సామర్థ్యం పెంపు పనులకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలసంఘం, పర్యావరణ శాఖల అనుమతులు తప్పనిసరి అని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్లాలే కానీ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయరాదని తెలిపింది. పర్యావరణ ఉల్లంఘనలకు బాధ్యులెవరనేది గుర్తించాలని, ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నెలలోగా ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. కమిటీ నివేదిక ఆరునెలల్లో అందజేయాలని పేర్కొంది. కాళేశ్వరం విస్తరణ పనులను ఆపాలంటూ తెలంగాణకు చెందిన హయతుద్దీన్, తుమ్మనపల్లి శ్రీనివాస్ తదితరులు వేర్వేరుగా వేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ‘‘ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం పర్యావరణ ఉల్లంఘనలు గుర్తించాం. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో పూర్వస్థితి తీసుకురావడం సాధ్యంకాదు. కానీ, ఉపశమన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత, జవాబుదారీతనం ఎంతైనా అవసరం. బహుళ ప్రయోజనంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు కావడంతో పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదన సరికాదు. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లరాదని ట్రిబ్యునల్, హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. విస్తరణ పనులకు ముందు నిపుణుల కమిటీ అంచనా వేయాల్సిందే. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లొద్దని కేంద్ర జల్శక్తి మంత్రి 7.8.2020న తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విస్తరణ పనులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర జలసంఘం కూడా పేర్కొంది. అనుమతులు అవసరమని తెలిపింది. ఈ పరిస్థితుల్లో 2.10.2020న తెలంగాణ ముఖ్యమంత్రి రాసిన లేఖను కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ పరిశీలించాల్సిన అవసరం ఉంది. అనంతరం జల్శక్తి శాఖ తీసుకునే నిర్ణయానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి’’ అని తీర్పులో పేర్కొంది. -
కాళేశ్వరంపై ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ఇప్పుడు ఉపశమన చర్యల తీసుకోవాల్సిన బాధ్యత ఉందిని తెలిపింది. సరైన పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, పర్యావరణ అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఈ మేరకు ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణాలకు.. జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావసం అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పింది. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేయాలని కమిటీకి ఆదేశాలిచ్చింది. కమిటీ పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ తన తీర్పులో వెల్లడించింది. ప్రాజెక్టు విస్తరణపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని తేల్చి చెప్పింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్లో చెప్పినట్లు డీపీఆర్లు సమర్పించి, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. -
‘కాళేశ్వరం’ మరింత విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రచించింది. గోదావరి జలాల ఆధారంగా చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకంలో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని రిజర్వా యర్ల ద్వారా నీరందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మల్లన్నసాగర్, గంధమల రిజర్వా యర్ల నుంచి లింక్ కెనాల్లను తవ్వి దేవాదుల లోని 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిం చాలని భావిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకట్రెండు రోజుల్లో సమీక్షించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మల్లన్న’ ద్వారా 1.37 లక్షల ఎకరాలు.. దేవాదులలో భాగంగా గంగాపురం ఇన్టేక్ పాయింట్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుకు నీటిని తరలించాలంటే సుమారు 200 కి.మీ.కిపైగా నీటిని తరలించాల్సి ఉంది. ఇందుకోసం కనీసం 460 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. ఈ స్థాయిలో ఎత్తి పోతలు చేసినా చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా ఉందని భావించిన ప్రభుత్వం... కాళేశ్వ రంలోని వివిధ రిజర్వాయర్ల నుంచి దేవాదుల చివరి ఆయకట్టుకు నీటిని తరలించే అంశాలపై అధ్యయనం చేసింది. కాళేశ్వరం ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటికి తోడు అదనంగా మరో టీఎంసీని తీసుకొనేలా పనులు చేపట్టినందున ఈ నీటిని మరింత సద్వినియోగం చేసుకొనేలా దేవాదులతో అనుసంధాన ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా మల్లన్నసాగర్ నుంచి దేవాదులలోని తపాస్పల్లి రిజర్వాయర్కు నీటిని తరలించే అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 11 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్ నిర్మించి రోజుకు 44 క్యూమెక్కుల మేర నీటిని కనీసం 4 నెలలపాటు తీసుకెళ్లేలా ఇంజనీర్లు ప్రతిపాదనలు రూపొందించారు. కనీసం 15–16 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా తపాస్పల్లి కింద నిర్ణయించిన 82,500 ఎకరాలతోపాటు కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్దనూరు దారి పొడవునా ఉండే చెరువుల కింద కలిపి మరో 55 వేల ఎకరాలు కలిపి 1.37 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనకు మొత్తంగా రూ. 80 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. గంధమల కెనాల్ నుంచి మరో 1.03 లక్షల ఎకరాలు.. ఇక మల్లన్నసాగర్ దిగువన ఉన్న గంధమల నుంచి బస్వాపూర్కు నీటిని తీసుకెళ్లే మెయిన్ కెనాల్ నుంచి లింక్ కెనాల్ తవ్వడం ద్వారా దేవాదుల కింద అశ్వరావుపల్లి, చిట్టకోడూరు, నవాబ్పేట మండలాల్లో ఉన్న ఆయకట్టుకు నీరిచ్చేలా మరో ప్రతిపాదన సిద్ధమైంది. గంధమల నుంచి బస్వాపూర్ వెళ్లే ప్రధాన కాల్వ 17వ కి.మీ. వద్ద నుంచి నీటిని మళ్లించేలా మరో 20 కి.మీ. లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించాలన్నది ప్రతిపాదన. ఈ లింక్ కెనాల్ ద్వారా అశ్వరావుపల్లి కింద 34 వేల ఎకరాలు, చిట్టకోడూరు కింద 9 వేలు, నవాబ్పేట కింద 54 వేల ఎకరాలతోపాటు ఆ దారిలోని చెరువుల కింద ఉన్న మరో 4 వేల ఎకరాలు కలిపి మొత్తంగా 1.03 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు. ఈ లింక్ కెనాల్ ద్వారా 120 రోజులపాటు 10 టీఎంసీల మేర నీటిని తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదనకు రూ. 30–35 కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టారు. మొత్తంగా 25 టీఎంసీల మేర కాళేశ్వరం జలాలను వినియోగిస్తూ దేవాదులలోని 2.40 లక్షల ఎకరాలకు సుమారు రూ. 100 కోట్ల ఖర్చుతోనే నీటిని అందించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి త్వరలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. -
అదనపు టీఎంసీతో లబ్ధి ఎంత?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రస్తుతం ఉన్న 2 టీఎంసీల నీటి ఎత్తి పోతలకు అదనంగా మరో టీఎంసీ నీటి ఎత్తిపోతలకు సంబంధించి చేపడుతున్న పనులతో ఎంత కొత్త ఆయకట్టు వినియోగంలోకి వస్తుందో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని స్పష్టం చేసిన కేంద్రం, పర్యావరణ అనుమతులపై సైతం ఆరా తీయగా, తాజాగా అదనపు టీఎంసీతో చేకూరే ప్రయోజనాలపై వివరణ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం రాష్ట్రానికి లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2015లో సమర్పించిన వ్యయ అంచనాల మేరకు టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందని లేఖలో ప్రస్తావిస్తూ, ప్రస్తుత అంచనా వ్యయాలు ఎంతో చెప్పాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. 98 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున 195 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు మాత్రమే టీఏసీ అనుమతిచ్చిందని గుర్తుచేసింది. అయితే అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన ఏదైనా సిద్ధం చేశారా? అలాంటి ప్రతిపాదన ఉంటే.. ఆ వివరాలను తమకు తెలపాలని కేంద్రం ఆదేశించింది. ఇక అదనపు టీఎంసీ పనులపై కేంద్ర జల సంఘానికి ఏవైనా ప్రతిపాదన పంపారా? అని ప్రశ్నిం చింది. నీటి వినియోగానికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్నంత తమకు అందజేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలనూ కోరింది. పాత ఆయకట్టునే కొత్తగా చూపిస్తున్నారంటూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులతో కొత్తగా వృధ్ధిలోకి వచ్చే ఆయకట్టు పెద్దగా లేదని, ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టునే కాళేశ్వరం ఆయకట్టు కింద చూపుతున్నారని వివిధ పార్టీల ఎంపీలు, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ వివరాలను కోరినట్లుగా తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను సమర్పించాలని పలుమార్లు కోరినా రాష్ట్రం స్పందించలేదు. కాళేశ్వరం అంచనా వ్యయం రూ.80,150 కోట్లుగా గతంలో పేర్కొన్నారని, ప్రస్తుతం సవరించిన అంచనాలు ఎంతో తెలపాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై కొనసాగింపుగా ప్రస్తుతం ప్రాజెక్టు అదనపు టీఎంసీతో వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు, ప్రయోజనాల వివరాలను కోరడంతో కేంద్రం కాళేశ్వరం అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లు కనబడుతోందని ఇరిగేషన్ వర్గాలే అంటున్నాయి. -
ఉప్పొంగుతున్న ప్రాణహిత
సాక్షి, హైదరాబాద్ : గోదావరి ఎగువన రెండ్రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు నిండి ఆ నీరంతా వచ్చి చేరుతుండటంతో ప్రాణహిత ఉప్పొంగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద గోదావరిలో 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఈ మొత్తం సీజన్లో ఇవే గరిష్ట ప్రవాహాలు కాగా, మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం ఇప్పటికే తెలంగాణతో పాటు పరీవాహక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్నారం, ఎల్లంపల్లి, మిడ్మానేరు.. అన్నారం బ్యారేజీలోకి స్థానికంగా ఉన్న మానేరు నది నుంచి 24 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీనిలో 10.87 టీఎంసీలకు 9.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండటంతో 8 పంపుల ద్వారా 20వేల క్యూసెక్కులకు పైగా నీటిని సుందిళ్లలోకి పంపింగ్ చేస్తున్నారు. సుందిళ్లకు వస్తున్న నీటిని వచ్చినవి వచ్చినట్లు ఎల్లంపల్లికి పంపింగ్ చేస్తున్నారు. ఎగువ పంపింగ్ చేస్తున్న నీటికి తోడు స్థానిక ప్రవాహాలు కలిసి ఎల్లంపల్లిలోకి ప్రస్తుతం 25,916 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వ 20.18 టీఎంసీలకు గాను 12 టీఎంసీలకు చేరింది. ఇక్కడి నుంచి నంది, గాయత్రి పంప్హౌస్ల ద్వారా మిడ్మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మిడ్మానేరులోకి 21వేల క్యూసెక్కుల మేర నీటిని ఎత్తిపోస్తుండగా నిల్వ 25.87 టీఎంసీలకు 15.31 టీఎంసీలకు చేరింది. అన్నారం నుంచి మిడ్మానేరు వరకు కాళేశ్వరం ద్వారా గోదావరి ఎత్తిపోతలను మరో వారం పాటు కొనసాగించనున్నారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున కనీసంగా 14 టీఎంసీల నీటిని ఎత్తిపోసినా మిడ్మానేరు, ఎల్లంపల్లి పూర్తిగా నిండనున్నాయి. ఇక శ్రీరాంసాగర్లోకి నీటి ప్రవాహాలు స్థిరంగా నమోదవుతున్నాయి. ప్రాజెక్టులోకి 23,522 క్యూసెక్కుల మేర వరద వస్తుండగా, ప్రాజెక్టులో నిల్వ 90 టీఎంసీలకుగాను 41 టీఎంసీలకు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి మొత్తంగా 27 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. ‘కాళేశ్వరం’ జలజల కాళేశ్వరం వద్ద ఏటా జూన్ రెండో వారం నుంచే ప్రవాహాలు మొదలవుతుండగా, ఈ ఏడాది జూలై మొదటి వారం నుంచి ప్రవాహాలు మొదలయ్యాయి. గతేడాది జూలై మొదటి వారం నుంచే 50వేల క్యూసెక్కులకు పైగా నీరు రాగా, ఈ ఏడాది జూలై చివరి వారం నుంచి 50వేల నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహాలు వచ్చా యి. అయినా అవి మళ్లీ 80వేల క్యూసెక్కులకు తగ్గిపోయాయి. ఇటీవలి వర్షాలతో కాస్త పుంజుకొని, ఈ నెల 11న 83వేల క్యూసెక్కుల మేర నమోదుకాగా, 12న 2లక్షల క్యూసెక్కులకు పెరిగాయి. ఇక 13న గురువారం ఏకంగా 3.79 లక్షల క్యూసెక్కులకు చేరింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో ఇప్పటికే 16.17 టీఎంసీలకు గాను 9.20 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండటంతో అన్ని గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇక మేడిగడ్డ పంప్హౌస్లోని పంపులను సైతం నిలిపివేశారు. -
శ్రీశైలంలోకి 2.13 లక్షల క్యూసెక్కులు
సాక్షి, హైదరాబాద్ :పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, ఉప నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లు నిండుకుండలుగా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 2,13,486 క్యూసెక్కులు చేరుతుండగా..ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 40,259 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా శ్రీశైలంలోకి వచ్చిన గరిష్ట వరద ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలంలో 855.80 అడుగుల్లో 94.02 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 121 టీఎంసీలు అవసరం. ఇదేరీతిలో వరద ప్రవాహం మరో వారం రోజులపాటు వస్తే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం నుంచి విడుదల చేసిన వరద ప్రవాహం చేరుతుండటంతో నాగార్జునసాగర్లో నీటిమట్టం 559.40 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 230.99 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 82 టీఎంసీలు అవసరం. ఎగువన తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. అప్పర్ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీలు నిండిపోవడంతో భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. సింగటలూరు బ్యారేజీ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతుండటంతో తుంగభద్ర డ్యామ్లోకి 1.16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్లో 66.96 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. డ్యామ్ నిండాలంటే ఇంకా 34 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో మరో ఆరు రోజులు కొనసాగితే డ్యామ్ నిండుతుంది. అప్పర్ కృష్ణ, అప్పర్ తుంగభద్ర బేసిన్లలో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు కనీసం వారం నుంచి పది రోజులు ఇదే రీతిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. సరస్వతీ బ్యారేజీకి 6 టీఎంసీలు కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ పంపుహౌస్ నుంచి 9 మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో నాలుగు రోజుల్లో (శనివారం వరకు) అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి 6 టీఎంసీల నీరు తరలిపోయింది. మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురుస్తుండటంతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఆ వరద నీరు కలుస్తున్నది. ఇన్ఫ్లో 19,844 క్యూసెక్కులు.. లక్ష్మీ పంపుహౌస్ నుంచి సరస్వతీ బ్యారేజీకి 19,844 క్యూసెక్కుల ఇ¯Œ ఫ్లో వస్తోంది. బ్యారేజీలో నీటి నిల్వ 10.87 టీఎంసీలకుగాను 9.47 టీఎంసీల నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 119 ఎఫ్ఆర్ఎల్ కాగా ప్రస్తుతం 118.40 ఎఫ్ఆర్ఎల్కు చేరింది. -
నీటి నిర్వహణ కత్తిమీద సామే!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింది కాల్వలన్నీ నిండుగా పారుతున్నా నీటి నిర్వహణ ‘కత్తిమీది సాములా’మారింది. అన్ని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నీటి నిర్వహణకు అవసరమైన వర్క్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లు, లష్కర్లు లేరు. దీంతో నీటి నిర్వహణ ఇరిగేషన్ ఇంజనీర్లకు అగ్ని పరీక్షలా మారింది. సిబ్బందిలేమి.. నీటి పంపిణీకి ఇబ్బంది ఎగువ నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు మొదలయ్యాయి. కాళేశ్వరం మొదలు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలు ఆరంభమయ్యాయి. కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నీటిపంపిణీ ఆటంకాల్లేకుండా సాగా లంటే ఆపరేటర్లు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, హెల్ప ర్లు, లష్కర్లు, ఎలక్ట్రీషియన్లు కీలకం. రాష్ట్రంలో మొత్తంగా ఈ తరహా సిబ్బంది 6 వేల మంది అవసరముండగా ప్రస్తుతం1,700 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వల పరిధిలోని మెయిన్కెనాల్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రు, బ్రాంచ్ కెనాల్ల పరిధిలో ప్రతి 6 కిలోమీటర్లకు ఒకరు చొప్పున లష్కర్ ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక్కరు కూడా లేరు. మొత్తం గా 3,800 మంది లష్కర్లు అవసరముండగా, 1,400 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వలకు గండ్లు పడుతున్నా... గోదావరి జలాల ద్వారా ఎస్సారెస్పీ పరిధిలోని 250 కిలోమీటర్ల మేర కాల్వలు పారుతున్నాయి. దీని పరిధిలో సుమారు 400 మంది లష్కర్లు అవసరముండగా 50, 60 మందితోనే నెట్టుకొస్తున్నారు. కనీసం 200 మంది లష్కర్లను అత్యవసరంగా నియమించాలని ఏడాదిగా ఇంజనీర్లు కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. నాగార్జునసాగర్ పరిధిలోనూ ఇదే పరిస్థితి. కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ల కింద 400 మంది లష్కర్లు, 60 మంది ఆపరేటర్లు, 75 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎలక్ట్రీషియన్లు, 15 మంది ఫిట్టర్లు కావాలని ఏడాదిగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన సరిగాలేదు. దీంతో ఇక్కడ కాల్వలకు గండ్లు పడుతున్నా, కొన్నిచోట్ల అక్రమంగా కాల్వలను తెంచుతున్నా పట్టించుకునేవారులేరు. కిన్నెరసాని, కడెం, జూరాల, మూసీ, సింగూరు వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా సరిపడా సిబ్బంది లేరు. గత ఏడాది సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో మూసీ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
‘కాళేశ్వరం’ ఎత్తిపోతలు షురూ
కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్లో బుధవారం రాత్రి ఆరు మోటార్లను ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. మే 11వ తేదీన గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో మోటార్లను నిలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే, ప్రాణహిత వరద కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద అప్రోచ్ కెనాల్ నుంచి ఫోర్ బే వరకు నీరు నిల్వ అయింది. వరద కూడా పెరుగుతుం డటంతో లక్ష్మీ పంపుహౌస్లోని 11 మోటార్లలోని ఆరు మోటార్లను ఆన్ చేయగా.. 12 పంపుల ద్వారా గ్రావిటీ కాల్వలోకి నీరు ఎత్తిపోస్తోంది. ఈ నీరు 13.41 కిలోమీటర్ల దూరంలోని అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి తరలుతోంది. రాత్రిలోగా మిగిలిన మోటార్లను ఒకేసారి నడిపించనున్నట్లు తెలిసింది. ఈ సీజన్లో మోటార్లు ఆన్ చేయడం ఇదే ప్రథమం కావడంతో ఎస్ఈ, డీఈఈ, ఏఈఈ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు పంపుహౌస్ వద్ద పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ కాంతులతో జిగేల్ కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్లో మోటార్ల ద్వారా నీరు డెలివరీ సిస్టర్న్ వద్ద ఎత్తిపోస్తున్నాయి. దీంతో సిస్టర్న్కు రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. దీంతో నీరు రంగు రంగులుగా మారి జిగేల్మంటోంది. -
‘కాళేశ్వరం’పై పోలీసుల నజర్!
సాక్షి, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులపై పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లాలో మావోయిస్టులు పట్టు కోసం ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో రాత్రీపగలు గోదావరి తీర ప్రాంతాలు, అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. పల్లెలతో పాటు ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులు విచారించి వదిలేస్తున్నారు. వాహనాల తనిఖీలు కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్ర–తెలంగాణకు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాళేశ్వరం, మహాదేవపూర్, పలిమెల ఎస్సైలు అభినవ్, అనిల్, శ్యాంరాజ్ ఆధ్వర్యాన తనిఖీలు సాగుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపు మహదేవపూర్, పలిమెల మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. మహదేవపూర్, పలిమెల మండలంలోని రేవులపై ప్రత్యేక దృష్టిని సారించారు. గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రోడ్డు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇక మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్, గ్రావిటీ కాల్వల వద్ద నిఘా తీవ్రం చేశారు. జిల్లా ఇన్చార్జి ఎస్సీ సంగ్రామ్సింగ్ పాటిల్, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలిసింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, డిస్ట్రిక్ గార్డులు, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
పునరావాసం కల్పించండి
భువనగిరి టౌన్: బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్న తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు సోమవారం ధర్నాకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్నామని, తమ గ్రామస్తులందరికీ ఒకే దగ్గర భూమి, ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై, అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బైఠాయించారు. అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ సెలవులో ఉన్నారని, తాను సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయినా గ్రామస్తులు వినలేదు. కలెక్టర్ రావాలని పట్టుబట్టారు. సుమారు రెండున్నర గంటలపాటు హైవేపై బైఠాయించడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఏసీపీ భుజంగరావు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. -
రివర్స్ పంపింగ్తో ఉపయోగం ఉందా?
కథలాపూర్/మేడిపల్లి (వేములవాడ): కాళేశ్వరం జలాల రివర్స్ పంపింగ్పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కథలాపూర్ జెడ్పీటీసీ భూమయ్య, మేడిపల్లి మండలం వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ కాటిపెల్లి శ్రీపాల్రెడ్డితో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కడ ఉంది.. దానికి పరిష్కార మార్గాలు.. వరద కాలువలో ప్రవహిస్తున్న కాళేశ్వరం జలాల విషయమై చర్చించారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువలోకి వస్తున్న నీటితో రైతులకు ఏ మేరకు ఉపయోగపడుతోందని ఆరా తీశారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలతోపాటు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలు నాన్ ఆయకట్టు కింద ఉన్నాయని, ఇక్కడ నీటి సమస్య ఉన్నట్లు భూమయ్య, శ్రీపాల్రెడ్డి ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చారు. వరద కాలువ నుంచి లిఫ్ట్ ద్వారా కాలువ పై భాగంలోని చెరువులు, కుంటలు నింపితే సమస్య తీరుతుందన్నారు. వేములవాడ, చొప్పదండి, కోరుట్ల, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని నీటి సమస్య ఉన్న గ్రామాలకు నాలుగు నెలల్లో నీరు అందేలా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రి ప్రశాంత్రెడ్డితో కలసి శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్కు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. -
ఆచితూచి ఎత్తిపోత!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో నదిలో ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు రెండువేల క్యూసెక్కుల మేర ఉన్న ప్రవాహాలు ఆదివారం ఐదు వేలకు పెరిగాయి. ఈసారి మంచి వర్షాలే పడతాయన్న అంచనాల నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా ఆచితూచి, సమగ్ర ప్రవాహ అంచనాతో ఎత్తిపోతలు చేపట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. కడెం నుంచి ప్రవాహాలు మొదలైతే ఎత్తిపోతలు చేపట్టే అవసరం ఉండదని భావిస్తోంది. అన్నీ లెక్క చూసుకొనే ఎత్తిపోత గడిచిన రెండు మూడ్రోజులుగా ఎగువన మహారాష్ట్రలో మంచి వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద పెరిగింది. ఆదివారం ఉదయానికి మేడిగడ్డ వద్ద 5,200 క్యూసెక్కుల మేర వరద కొనసాగగా, సాయంత్రానికి 18 వేల క్యూసెక్కులకు చేరింది. మరిన్ని రోజులు మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే ప్రవాహాలు పెరిగే చాన్స్ ఉంది. రాష్ట్రంలోనూ ఈ ఏడాది మంచి వర్షాలుంటాయనే అంచనాలున్నాయి. దీంతో గోదావరి బేసిన్లోని కడెం ప్రాజెక్టుకు జూన్ చివరి వారం నుంచే ప్రవా హాలు నమోదవుతాయని భావిస్తున్నారు. ప్రస్తు తం కడెంలో 7.60 టీఎంసీలకు 3.14 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. దీనిలోకి గతేడాది గరిష్టంగా 40–50వేల క్యూసెక్కుల వరకు సైతం ప్రవాహాలు కొనసాగిన సందర్భాలున్నాయి. అదే జరిగితే ప్రాజెక్టు ఒక్కరోజులోనే నిండుతుంది. కడెం నుంచి దిగువకు ఏటా 15–20 టీఎంసీల మేర వరద దిగువకు వస్తుంటుంది. ఇది ఎల్లంపల్లికి చేరుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 5.50 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి సైతం నిండితే గ్రావిటీ ద్వారా నీరు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా మేడిగడ్డకు ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. గతేడాది మేడిగడ్డ ద్వారా నీటిని ఎత్తి మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల నింపాక కడెం, ఎల్లంపల్లి నుంచి భారీగా వరద ప్రవాహాలు వచ్చాయి. దీంతో చాలా నీరు తిరిగి నదిలో కలిసిపోయింది. గతానుభవాల దృష్ట్యా, ఈ ఏడాది వర్షపాతం, ఎగువ నుంచి వచ్చే అంచనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరైన అంచనా లేకుండా నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నడిపిస్తే కరెంట్ ఖర్చు అనవసరపు భారం కానుంది. మేడిగడ్డలో నీటి నిల్వ 0.6 టీఎంసీల డెడ్ స్టోరేజీ ఉండగా, అన్నారంలో 2టీఎంసీలు, సుందిళ్లలో 2టీఎంసీల మేర నిల్వలున్నాయి. వీటిని అంచనా వేసుకుంటూ దిగువన ఎల్లంపల్లి మొదలు, మిడ్మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి ఎత్తిపోతలను మొదలుపెట్టే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. -
డీపీఆర్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ పరిధిలో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఈ నెల 10లోగా సమర్పించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో అనుమతిలేని ప్రాజెక్టులపై ముందుకెళ్లరాదని స్పష్టం చేసింది. బోర్డు ఆదేశంతో ప్రాజెక్టుల సాంకేతిక అనుమతి కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘానికి, వాటి ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్కు నివేదికలు సమర్పించేందుకు తెలంగాణ అంగీకరించగా ఏపీ ఇప్పటికే కొన్ని డీపీఆర్లను ఇచ్చింది. మిగిలిన ప్రాజెక్టుల డీపీఆర్లను సాంకేతిక అనుమతి బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్కు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. గోదా వరి బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, నీటి వాటాలు, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ల సమర్పణ, మళ్లింపు జలాల్లో వాటా, టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు గోదావరి బోర్డు శుక్రవారం హైదరాబాద్లోని ‘జలసౌధ’లో సమావేశమైంది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శులు రజత్కుమార్, ఆదిత్యనాథ్దాస్లతోపాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు ఎజెండా అంశాలతోపాటు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై నాలుగు గంటలపాటు చర్చిం చారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లపై వాడివేడిగా చర్చ జరిగింది. ఆ ప్రాజెక్టులన్నీ రీ ఇంజనీరింగ్ చేసినవే: తెలంగాణ బోర్డు భేటీలో పలు అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు వాదనలు బలంగా వినిపించారు. ముఖ్యంగా గోదావరి నదిలో తమకు 967 టీఎంసీల మేర వాటా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రకటించిన విషయాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్కుమార్ గుర్తుచేశారు. తమ వాటా మేరకే నీటి వినియోగాన్ని చేసుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. తమ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తామన్నారు. అయితే దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. బచావత్ అవార్డు ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయలేదని బోర్డు దృష్టికి తెచ్చింది. కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, తమ్మిడిహెట్టి, ఛనాకా–కొరటా, రాజంపేట, పింపార్డ్ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని వాదించింది. ఏపీ వాదనపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ... ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులనే రీ ఇంజనీరింగ్ చేశామని, వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేసింది. దీన్ని ఏపీ ఖండించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులిచ్చే ముందు దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అదేమీ జరగని దృష్ట్యా తెలంగాణకు ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసినట్లు వివరించింది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు ఏపీ మళ్లిస్తున్నందున తమకు 45 టీఎంసీల వాటా రావాలని తెలంగాణ మరోమారు కోరింది. అయితే దీనికి అభ్యంతరం చెప్పిన ఏపీ... ఉమ్మడి రాష్ట్రానికి 45 టీఎంసీలని అవార్డులో ఉందని, ఈ మళ్లింపు జలాల్లో తమకు వాటా దక్కుతుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనకు పంపినందున అక్కడి నుంచి వచ్చే ఆదేశాల వరకు ఆగాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించింది. పోలవరం బ్యాక్ వాటర్ సర్వే చేయాలని తెలంగాణ కోరింది. గరిష్ట వరదలు నమోదైనప్పుడు తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని చెప్పగా ఇప్పటికే కేంద్ర జల సంఘం అధ్యయనం చేసి తెలంగాణకు ఎలాంటి ముంపు లేదని నిర్ధారించిందని ఏపీ స్పష్టం చేసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ టెలిమెట్రీపై నిపుణులతో కమిటీ.. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రధాన ప్రాంతాల్లో నీటి ప్రవాహ లెక్కల నమోదు కోసం టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏయే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలనే విషయమై ఇరు రాష్ట్రాలతోపాటు సీడబ్ల్యూసీ, పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్లోని ఇంజనీర్లతో బోర్డు ఓ కమిటీని నియమించింది. సత్వరమే ‘అపెక్స్’ఎజెండా: చంద్రశేఖర్ అయ్యర్ కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాల గురించి వివరణ ఇవ్వాలని తెలంగాణను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే అపెక్స్ భేటీలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను సత్వరమే పంపాలని కోరగా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు. తెలంగాణ చేపట్టిన పెద్దవాగు ఆధునీకరణ పనులను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఏపీ ఒప్పుకున్నట్లు తెలిపారు. అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఇదివరకే ఇరు రాష్ట్రాలను కోరామని, అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ డీపీఆర్నూ అడగటం విచిత్రం... రాష్ట్రంలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు లేవని బోర్డుకు చెప్పాం. పాత ప్రాజెక్టులకే రీ ఇంజనీరింగ్ చేశాం తప్పితే కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని వివరించాం. కాళేశ్వరం పాత ప్రాజెక్టేనని కేంద్రం లేఖ సైతం ఇచ్చింది. ప్రాజెక్టుల డీపీఆర్లపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక తేలుస్తాం. రాష్ట్రానికి 967 టీఎంసీల వాటా ఉంది. ఈ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తాం. ఇక ఎస్సారెస్పీ ప్రాజెక్టు డీపీఆర్ను అడగటం విచిత్రం. 2014 జూన్ 2కు ముందు పూర్తయిన డీపీఆర్లు అడగొద్దని స్పష్టంగా చెప్పాం.– రజత్కుమార్, నీటిపారుదల శాఖ కార్యదర్శి -
తెలంగాణ వాదనపై ఏపీ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. గోదావరి జలాలపై తెలంగాణ నీటిపారుదల అధికారులు వాదనకు ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేసిందో చూపించాలని ఏపీ అధికారులు నిలదీశారు. కాగా గోదావరి నదిపై రెండు తెలుగు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, వర్కింగ్ మాన్యువల్ ఖరారు, బడ్జెట్, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్లోని జలసౌధలో బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన భేటీ ముగిసింది. (డీపీఆర్లు ఇవ్వాల్సిందే) బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికం గోదావరి బోర్డు సమావేశంలో భాగంగా గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదననలు ఏపీ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన ఆధారంగా గోదావరిలో 967 టీఎంసీలు వాటా ఉంటుందని తెలంగాణ బోర్డు దృష్టికి తీసుకురాగా.. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్లో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చూపలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికంగా తీసుకోవాలని ఏపీ అధికారులు బోర్డు చైర్మన్కు విన్నవించారు. కొత్త ప్రాజెక్టులకు బ్రేక్.. అలాగే బచావత్ ట్రిబ్యునల్లో ఎక్కడా కూడా తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న బోర్డు చైర్మన్ చంద్రశేఖర్.. నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీలోగా ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు. బోర్డు సూచనకు ఇరు ప్రభుత్వాల అధికారులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్ వాదనలు విపించారు. కేంద్రం ఆదేశాలతో.. కాగా విభజన చట్టానికి విరుద్ధంగా, ‘అపెక్స్ కౌన్సిల్’ అనుమతి లేకుండా గోదావరిపై తెలంగాణ చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు, నీటి మళ్లింపు ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచుతుండటాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతించే వరకూ ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేసేలా తెలంగాణ సర్కార్ను ఆదేశించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గోదావరి బోర్డు చైర్మన్కు దిశానిర్దేశం చేశారు. ఈ దృష్ట్యా వాటిని నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్ను గోదావరి బోర్డు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. గురువారంమే కృష్ణా బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. -
భార్య పిటిషన్.. భర్త మరణించాడన్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్ : కరోనా బారిన పడిన తన భర్తను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారని, అయితే ఇప్పటి వరకు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నగరంలోని వనస్థలిపురంకు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం అసలు మధుసూదన్ బ్రతికి ఉన్నాడా? లేడా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సమాధానిస్తూ.. కొద్ది రోజుల క్రితమే అతని కరోనాతో మరణించాడని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ సమాధానంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోగి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. కనీసం కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో శుక్రవారంలోగా అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది. (పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ) ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల సమస్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణంలో ముంపుకు గురవుతున్న ఏటిగడ్డ కిస్తాపూర్ గ్రామం ఖాళీ విషయంపై గురువారం వాడీవేడి వాదనలు జరిగాయి. భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా ఇళ్లను ఖాళీ చేయించడం సరైనది కాదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు చెల్లించిన నష్టపరిహారాలపై పూర్తిస్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి తీర్పు వెలువరించే వరకు గ్రామాన్నిఖాళీ చేయించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. -
చెరువులు నింపి అలుగులు పారిస్తుంటే..
సాక్షి సిద్దిపేట: గోదావరి నీటితో తెలంగాణ వ్యాప్తంగా చెరువులు నింపి అలుగులు పారిస్తుంటే.. కాంగ్రెస్ నేతలకు కళ్లు కనపడటం లేవా అని ఆర్థిక మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీరు రాలేదనడం సిగ్గుచేటని అన్నారు. ఆయన దుబ్బాకకు మంగళవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న దుబ్బాక ప్రాంతానికి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సాగు, తాగునీరు అందడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగా దుబ్బాకకు సాగునీరు వచ్చిందని పేర్కొన్నారు. కెనాల్ ప్యాకేజీ 12 ద్వారా లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. -
కాళేశ్వరంలో ‘మేఘా’ పవర్!
సాక్షి, హైదరాబాద్: లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని కీలకమైన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) దక్కించుకుంది. ప్రాజెక్టులోని అత్యధిక పంపింగ్ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసి ఎంఈఐఎల్ మరోమారు తన ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాన్ని చాటుకుంది. మొత్తం ప్రాజెక్టులో 4,680 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు, మోటార్లు ఏర్పా టు చేస్తుండగా, ఇందులో 3,840 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు, మోటార్ల పనులను చేపట్టిన ఎంఈఐఎల్.. అతి తక్కువ సమయంలోనే 3,767 మెగా వాట్ల పంపింగ్ కేంద్రాలను పూర్తి చేసి సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది. ‘కొండ పోచమ్మ’తో కీర్తి శిఖరాలకు.. కాళేశ్వరంలోని మొత్తం 22 పంపింగ్ కేంద్రాల్లో 96 పంపులు, మోటార్లను 4,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. అందులో 15 పంపింగ్ కేంద్రాల్లో 89 పంపులు, మోటార్లను 3,840 మెగావాట్ల సామర్థ్యంతో మేఘా సంస్థ నిర్మిస్తోంది. ఇక రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్ చేసే విధంగా మేఘా సంస్థ నిర్మించిన కేంద్రాల్లో 9 వినియోగంలోకి వచ్చాయి. మరో 4 పంపింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉండగా, మరో రెండు పంపింగ్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పనులు ప్రారంభించిన మూడేళ్లలోనే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మొదటి దశలోని లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రాలు, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు రెండో దశ ఎత్తిపోతలో గాయత్రి (ప్యాకేజీ–8), నాలుగో దశలో మిడ్మానేరు నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు అన్నపూర్ణ (ప్యాకేజీ–10), రంగనాయక సాగర్ (ప్యాకేజీ–11), మల్లన్నసాగర్ (ప్యాకేజీ –12) కేంద్రాలను సంస్థ వినియోగంలోకి తేగా.. శుక్రవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆరంభించిన అక్కారం, మర్కూక్ (ప్యాకేజీ–14) మోటార్లతో సంస్థ వినియోగంలోకి తెచ్చిన పంపుల సామర్థ్యం 3,767 మెగావాట్లకు చేరింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబీబీ, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్థలు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో నిర్మించిన కొండపోచమ్మ సాగర్కు నీటిని పంపింగ్ చేయడంలో ఎంఈఐఎల్ కీలక పాత్ర పోషించి కీర్తి దక్కించుకుంది. అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉండగా, ఆ తర్వాత లిబియాలోని గ్రేట్ మ్యాన్మేడ్ రివర్ రూపుదిద్దుకుంది. వీటన్నింటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోని హంద్రీ–నీవా ఎత్తిపోతల పథ కం పెదద్ది కాగా ఆ పథకంతో పోలిక లేని స్థాయిలో భారీ బహుళ తాగు, సాగు నీటి పథకంగా ప్రస్తుతం కాళేశ్వరం ప్రపంచా న్ని ఆకర్షిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4,680 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, ఇందులో అత్యధికంగా 3,840 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాల విద్యుత్ సరఫరా సా మర్థ్యం 3,916 మెగావాట్లైతే కాళేశ్వరంలో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థకు దాదాపు సమానంగా ఉంది. సీఎం పట్టుదలతోనే.. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టులో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్ అదృష్టం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు, బీడు భూములను సస్యశ్యామ లం చేసేందుకు ప్రపంచంలో అత్యు త్తమ ఇంజనీరింగ్ సంస్థలతో కలసి పనిచేయడం, అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించిన జీవితకాలపు గౌరవంగా భావిస్తున్నాం. సీఎం చంద్రశేఖర్రావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే ఇంత తక్కువ కాలంలో ప్రాజెక్టు పూర్తి చేయగలిగాం..’ – బి.శ్రీనివాస్రెడ్డి, ఎంఈఐఎల్ డైరెక్టర్ -
ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది
సాక్షి, సిద్దిపేట : రాష్ట్ర చరిత్రలో ఉజ్వల ఘట్టం ఇది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. తలాపున పారుతున్న గోదావరి.. మన చేలు, మన బతుకు ఎడారి అని పాటలు పాడుకున్నాం. ఇప్పుడు గోదావరి జలాలు తెలంగాణలోని ఎత్తైన ప్రాంతం కొండపోచమ్మ రిజర్వాయర్లో ఎత్తిపోశాం. ఇక ఈ ప్రాంతం సాగునీటి కష్టాలు తీరినట్టే. ఇలా ఉద్యమ లక్ష్యాలను ఒకొక్కటిగా నెరవేర్చుకుంటూ పరాయి పాలనలో ఆగమైన తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నాం’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలను చినజీయర్ స్వామితో కలసి విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... నిర్వాసితులకు ఇళ్లు, ఉపాధి.. ప్రాజెక్టులు కడితే సాగునీరు వస్తుంది. ఇదే సందర్భంలో గ్రామాలు, భూములు కోల్పోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి త్యాగానికి వెలకట్టలేం. వారికి ప్రభుత్వం మంచి ప్యాకేజీలు ఇచ్చింది. అయినా వారు గూడులేని పక్షులుగా మారిపోయారు. ఇలా త్యాగం చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్పొరేట్కు దీటుగా వారికి ఇళ్లు కట్టిస్తున్నాం. అదేవిధంగా వారికి ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి కోసం నూతనంగా ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. ఆరేళ్లలోనే పురోగతి... పరాయి పాలనలో ఆగమైన తెలంగాణ... స్వరాష్ట్రం సాధించిన ఆరు సంవత్సరాల్లోనే అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్తోంది. గతంలో కరెంట్ కోతలు, నీటి కష్టాలు ఉండేవి. ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరా అందుతోంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తున్నాం. ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమాను అమలు చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ కూడా అమలు చేస్తున్నాం. ఇందుకోసం ఈ ఏడాది రూ. 1,300 కోట్లు విడుదల చేశాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు, వికలాంగులకు నెలకు రూ. 3 వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమే. సంక్షేమ రంగంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చాం. 53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు« ధాన్య రాసులకు నిలయంగా మారింది. దేశం మొత్తంమీద 83 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే ఒక్క తెలంగాణ నుంచే 53 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం మనం సాధించిన ప్రగతికి నిదర్శనం. ఈ విషయం నేను చెప్పేది కాదు.. ఎఫ్సీఐ సీఎండీ వీవీ ప్రసాద్ చెప్పిన మాటలివి. సాగునీటి ఇబ్బందులు తీర్చుకునేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. 35 టీఎంసీల సామర్థ్యంతో సీతారామ, 7.5 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క–సారక్క, గౌరవెల్లి, గండిపల్లి మొదలైన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ బంగారు పంటలు, భాగ్యరాసులు, పసిడి పంటలు పండే తెలంగాణగా విరజిల్లనున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బ్యారేజీల్లో 40 టీఎంసీలు, రిజర్వాయర్ల ద్వారా 125 టీఎంసీలు మొత్తం 165 టీఎంసీలను నిల్వ చేసుకుంటున్నాం. అదేవిధంగా అన్ని విధాలుగా మొత్తం 530 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యం పొందాం. రంగనాయక సాగర్ ద్వారా ఇప్పటికే చెరువుల్లోకి జలకళ సంతరించుకుంది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా సింగూరు లిఫ్ట్ ఇరిగేషన్తో హల్దీ వాగుకు నీటిని విడుదల చేస్తాం. కామారెడ్డి, గుజ్జులు, కాయగల్ ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాం. ఇకపై పచ్చటి పొలాల తెలంగాణ... ప్రాజెక్టుల నిర్మాణం ఒక ఎత్తయితే పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో ఎత్తు. ఇటువంటి కీలక సమస్యను అధిగమిస్తూ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం రాజనీతిజ్ఞతకు నిదర్శనం. వారిని మెప్పించడమే కాకుండా భూమిపూజకు అక్కడి ముఖ్యమంత్రిని ఆహ్వానించాం. తెలంగాణ అంతా సస్యశ్యామలం చేయాలని నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లతోపాటు రూ. 4 వేల కోట్లతో 1,250 చెక్ డ్యాంలు నిర్మించాం. వ్యవసాయం లాభసాటి చేయాలనే ఆలోచనతో నియంత్రిత సాగు విధానం ప్రవేశపెట్టాం. ఇది నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు. ఇంజనీర్లకు సెల్యూట్.. తెలంగాణ వారు అంటే తెలివితక్కువ వారని చులకన చేసేవారు. అటువంటి తెలంగాణ ఇంజనీర్లు ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి చూపించారు. ప్రాజెక్టు ప్రారంభంలో విమర్శలు, శాపనార్థాలు పెట్టినవారు కూడా ఇప్పుడు మౌనంగా ఉండేలా చూపించారు. సముద్ర మట్టానికి 88 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపొచమ్మ సాగర్కు జలాలు ఎత్తిపోసేలా ఆవిష్కరణ చేసి చూపించిన తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూట్. ఎత్తిపోతల సలహాదారులు పెంటారెడ్డి, ఇతర ఇంజనీర్ల మేధాశక్తితో దశాబ్దాలుపట్టే ప్రాజెక్టులను కేవలం నాలుగు సంవత్సరాల్లోనే నిర్మించి సత్తా చాటారు. ఇందుకు సహకరించిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు ధన్యవాదాలు. అదేవిధంగా 48 డిగ్రీల ఎండలోనూ పనులు చేసిన వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వందనాలు తెలుపుతోంది. 400 మెగావాట్ల విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం పదేళ్లు పట్టేది. కానీ నాలుగు సంవత్సరాల్లోనే 480 మెగావాట్ల విద్యుత్ వినియోగం కోసం 400 కేవీ సబ్స్టేషన్లు ఆరు, 220 కేవీ సబ్స్టేషన్లు ఏడు, 135 కేవీ సబ్ స్టేషన్లు రెండు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం వేగంగా భూసేకరణ చేసిన రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందికి, ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసిన విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. -
ఉవ్వెత్తున గోదారి
సాక్షి, సిద్దిపేట : కరువు నేలను గోదారమ్మ ముద్దాడింది. సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద ప్రవహించే గోదావరి 618 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి ఎగిరి దుంకింది. మేడిగడ్డ నుంచి పది లిప్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. త్రిదండి చినజీయర్ స్వామితో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం మర్కూక్ పంప్హౌస్ వద్ద రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మోటార్లను ఆన్ చేసిన 10 నిమిషాల్లోనే గోదావరి ఉత్తుంగ జలవాహినిలా కొండపోచమ్మ రిజ ర్వాయర్లోకి ప్రవహించింది. పంప్హౌస్ నుంచి రిజర్వాయర్ వద్దకు వచ్చిన సీఎం దంపతులు, చినజీయర్ స్వామి, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు గోదావరి నీటికి స్వాగతం పలికారు. కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలు, నవధాన్యాలు, పూలు, పండ్లను నీటి ప్రవాహంలో వేసి గోదారమ్మకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మం త్రులు తన్నీరు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, ఫారూక్ హుస్సేన్, బి. వెంకటేశ్వర్లు, శేరి శుభాష్రెడ్డి, ఎమ్మెల్యేలు సొలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, సతీష్కుమార్, మదన్రెడ్డి, రసమయి బాలకిషన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. కొండపోచమ్మ ఆలయంలో తీర్థం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు పూజలతో కార్యక్రమానికి శ్రీకారం... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ దంపతులు ముందుగా జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ మండలంలోని కొండపొచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు చండీయాగం చేపట్టగా కేసీఆర్ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మర్కూక్, ఎర్రవెల్లి గ్రామాల్లోని రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వరదరాజుపూర్లోని వరదరాజుల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీయాగంలో పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు చినజీయర్ స్వామితో కలిసి.. ఏ కార్యక్రమం చేపట్టినా యజ్ఞ, యాగాలు నిర్వహించే ఆనవాయితీ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి ముందు కూడా మర్కూక్ పంప్హౌస్ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న సీఎం దంపతులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చినజీయర్కు స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన యాగం నిర్వహించారు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన వారందరికీ చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. అక్కడి నుంచి నేరుగా పంప్హౌస్ వద్దకు చినజీయర్ స్వామితో కలసి సీఎం కేసీఆర్ వెళ్లి పంప్హౌస్లోని రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి కొండపొచమ్మ రిజర్వాయర్లోకి గోదావరి జాలలను వదిలారు. శుక్రవారం కొండపోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన చండీయాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు సతాయించిన రెండో మోటార్ మర్కూక్, జగదేవ్పూర్ (గజ్వేల్): కొండపోచమ్మసాగర్ పంప్హౌస్ ప్రారంభంలో రెండో మోటార్ కొంతసేపు సతాయించింది. పంప్హౌస్లోని రెండు మోటార్లను ప్రారంభించేందుకు మర్కూక్ కట్టపైకి సీఎం కేసీఆర్ చేరుకొని మోటార్లను స్విచ్ ఆన్ చేయగా మొదటి మోటార్ వెంటనే ప్రారంభమైంది. కానీ సాంకేతిక కారణాలతో రెండో మోటార్ ఆన్ కాలేదు. దాన్ని రిపేర్ చేసేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో కేసీఆర్, మంత్రులు అక్కడి నుంచి వరదరాజుపూర్లోని వరదరాజస్వామి దేవాలయానికి వెళ్లారు. అరగంట తర్వాత మోటార్ను బాగు చేశాక సీఎం కేసీఆర్ తిరిగి పంప్హౌస్ వద్దకు చేరుకొని రెండో మోటార్ను ప్రారంభించారు. మర్కూక్ పంప్హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, చినజీయర్స్వామి తదితరులు సుదర్శనయాగంలో నవ దంపతులు మర్కూక్ (గజ్వేల్): కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు మర్కూక్ పంప్హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శనయాగంలో పాల్గొనే అదృష్టం మర్కూక్ మండల ఎంపీపీ తాండ పాండుగౌడ్ నూత న దంపతులకు లభించింది. పాండుగౌడ్కు ఈ నెల 27న మెదక్ జిల్లా మనోహరాబాద్కు చెందిన మేఘనతో వివా హం జరగ్గా పెళ్ల యిన రెండో రో జే అంటే శుక్రవా రం సీఎం కేసీఆర్ సూచనల మేరకు సుదర్శనయాగంలో నూ తన దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతో కలసి ఈ అరుదైన ఘట్టంలో పాలుపంచుకున్నారు. అలాగే త్రి దండి చినజీయర్స్వామి నుంచి ఆశీర్వాదాలు తీసుకు న్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా పాండు గౌడ్ దంపతులను మా ఎంపీపీ దంపతులు అంటూ పరిచయం చేయడంతో వారు ఉప్పొంగిపోయారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో తమకు అవకాశం దక్కడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. -
‘కొండ’నెక్కిన గోదారి గంగమ్మ!