kitchen
-
మాదాపూర్: శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లోని శ్రీచైతన్య విద్యా సంస్థల (Sri Chaitanya Educational Institutions) సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్(Food Safety Department) రద్దు చేసింది. శుక్రవారం ఈ కిచెన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ వండే భోజనాన్ని హాస్టళ్లలోని వేల మంది విద్యార్థులకు రోజూ అందజేస్తున్నారు.వేల మందికి భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. సుమారు 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు.కిచెన్, స్టోర్ రూమ్లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు.. కిచెన్ను సీజ్ చేయడంతో పాటు ఫుడ్ లైసెన్స్ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు అధికారులు మాదాపూర్(ఖానామెట్)లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కిచెన్లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం: మంత్రి పొన్నం -
బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వంటగది ఇంటీరియర్ డిజైన్..!
రోజులో సగకాలం గడిచేది వంటింట్లోనే! అది ఎంత శుచిగా.. ఆహ్లాదంగా ఉంటే వంటలు అంత రుచిగా చవులూరిస్తూంటాయి. అలాంటి వంటల్లో.. ఆ వంటగది ఇంటీరియర్లో ఇండియన్ స్టయిలే వేరు! ఆ అలంకరణను మీ కిచెన్లో సెట్చేసుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టాలేమో అనుకునేరు.. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఆ గ్రేస్ను తీసుకురావచ్చు!కుండలు, టెర్రకోట వస్తువులు, బుట్టలు, ఇత్తడి పాత్రలతో కిచెన్కు సంప్రదాయ, ఆధునికతల ఫ్యూజన్ను అద్దవచ్చు. మన ఇళ్లల్లోని తరతరాల పాత్రల వైభవాన్నీ కొలువుదీర్చవచ్చు.ఉపయోగంలో లేని పాత్రలకు పెయింట్ వేసి వాటిల్లో మొక్కల తొట్లను పెట్టి.. వంటిగదికి ప్రకృతి శోభతో గార్నిష్ చేయవచ్చు.కిచెన్లోనూ, డైనింగ్ టేబుల్పైనా చక్కటి డిజైన్ల హ్యాండ్లూమ్ క్లాత్స్ను పరచి కొత్త కళతో మెరిపించవచ్చు. సంప్రదాయ మండల డిజైన్లు, ప్రకృతి దృశ్యాల కళాకృతులతో డెకరేట్ చేయవచ్చు.గాజు జాడీలతో ఉన్న ఓపెన్ షెల్ఫ్లు అందంగానే కాదు.. వంటకు కావల్సిన దినుసులు అందుకోవడానికీ అనువుగా ఉంటాయి.– ఎన్.ఆర్ (చదవండి: అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!) -
కృత్రిమ మేధాజాలం వంటింట్లో మయాజాలం
‘రేపటికి పాల ప్యాకెట్ వేయించుకోవాలి రాత్రికి ఇడ్లీ పిండి నానబెట్టుకోవాలి రెండు రోజుల్లో జామకాయలు పాడైపోతాయి నాలుగు రోజుల్లో బియ్యం అయిపోతాయి’ఇవన్నీ మన అమ్మో, అమ్మమ్మో గుర్తుచేసే మాటలు కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కిచెన్ అలర్ట్స్. ఇవే కాదు, ఏం తినాలి? ఏం తింటే మంచిది?తింటున్న ఆహారం ఎంతవరకు ఆరోగ్యకరం? ఇంట్లో ఏమేం కూరగాయలు మిగిలి ఉన్నాయి?వాటితో రేపు ఏం కూర చేసుకోవచ్చు? ఇలా ఎన్నో సలహా సూచనలు వినొచ్చు. మనం ఆఫీస్కి వెళ్లినా, ఔటింగ్కి వెళ్లినా, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా, వినోదాల్లో మునిగి తేలుతున్నా వంటింటిని భద్రంగా చూసుకునే బాధ్యత ఇకపై ఏఐదేనట!∙సంహిత నిమ్మనప్రతి ఇంటికి వంట తప్పనిసరి పని. కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల నుంచి గ్యాస్స్టవ్ల వరకు సాగిన వంటింటి ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. వంటిళ్లు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లకు కూడా తొందర్లోనే కాలం చెల్లిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో (ఏఐ) పనిచేసే స్మార్ట్ పరికరాలు వంటిళ్లలోకి చేరుతున్నాయి. వీటిలో స్మార్ట్ స్టవ్లు, ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు సహా నానా రకాలు ఉంటున్నాయి. వంటింటి పనిని ఇవి మరింత సునాయాసం చేయనున్నాయి.రోజూ ఉదయాన్నే కిచెన్లోకి వెళ్లేసరికి, ‘హాలో మేడమ్/సర్! మీ వంటశాలకు స్వాగతం. ఈరోజు మీకు ఏం టిఫిన్ కావాలి? భోజనంలో ఏం స్పెషల్ కావాలి? డిన్నర్ ఏం ప్లాన్ చేయమంటారు?’ అంటూ అడిగి తెలుసుకుని మరీ వండిచ్చే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఈ ఊహ అదిరింది కదా? కానీ ఫ్యూచర్లో దీన్నే నిజం చేయబోతుంది ఏఐ. అందుకు ఇప్పటికే రొబోటిక్ కిచెన్ మెషిన్స్ సాయంతో తొలి అడుగులు ప్రారంభమయ్యాయి.అంచెలంచెలుగా మనిషి సాధించిన ఆధునిక సాంకేతికతకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోడైంది. ఏఐతో ప్రపంచ ఊహాచిత్రమే పూర్తిగా మారబోతుంది. ఈ కృత్రిమ మే«ధ, మానవ మేధను తలదన్నే స్థాయికి ఎదుగుతోంది. ఇప్పటికే వైద్యరంగం నుంచి వాణిజ్యరంగం వరకూ ప్రతి రంగమూ ఏఐ అధీనంలోకి వచ్చేసింది. ఇక భవిష్యత్తులో ఏఐనే మీ వంటింటి మహారాణి కాబోతుందంటే నమ్ముతారా? నమ్మితీరాలి!అహో, అద్భుతం! అనుకున్న 3జీ, 5జీల కాలాన్ని మించిందే ఈ ఏఐ కాలం. ఏ విషయంలోనైనా తొందరపడి, ఆత్రం కనబరిస్తే, ‘తినకముందే రుచి దేనికి?’ అంటుంటారు పెద్దలు. కానీ తినబోయే ముందే రుచి చూపిస్తాననడం ఏఐ స్పెషాలిటీ. మనిషి ఊహలకు రూపాన్నిస్తూ, నిమిషాల్లోనే కళ్లప్పగించేలా మాయాజాలం చేయగలదు ఏఐ. త్వరలో ఏఐ రోబోలు ఇంటి మనుషులుగా మారి వండి వారుస్తాయి. షెఫ్గా, సర్వెంట్గా ఇలా రకరకాల పాత్రల్లో సేవలను అందిస్తాయి. ఆ సేవలు ఎలా ఉండబోతున్నాయి? కిచెన్ను ఏ దిశగా ఏఐ తీసుకెళ్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.సాధారణంగా వంటగదిలో కావాల్సిన ముఖ్యమైన యంత్రాలు నాలుగే నాలుగు రకాలు. ఒకటి: వండి వార్చేవి. రెండు: వంటకు కావాల్సిన పొడులను, గుజ్జులను సిద్ధం చేసేవి. మూడు: వండిన వాటిని నిల్వ చేసేవి. నాలుగు: వండిన పాత్రలను శుభ్రం చేసేవి. అయితే వండివార్చే వాటిలో ఓవెన్స్, కుకర్స్, స్టవ్స్, గ్రిల్స్, బ్రెడ్ అండ్ పిజ్జా మేకర్స్, కాఫీ అండ్ టీ మేకర్స్ ఇవన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాగే వంటకు కావాల్సిన పదార్థాలను తయారు చేసేవాటిలో మిక్సీలు, చాపర్స్, గ్రైండర్స్, బ్లెండర్స్, జ్యూసర్స్ ఇవన్నీ లెక్కకొస్తాయి. ఇక వండిన వాటిని, వండని వాటినీ నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్, వంటపాత్రలను శుభ్రం చేయడానికి డిష్వాషర్ ఇవన్నీ లగ్జరీ కిచెన్కి అవసరమయ్యే యంత్రాలే! ఈ యంత్రాలన్నిటినీ ఏఐకి అనుసంధానం చేయగలిగితే, వంటింటిని రోబోటిక్ కిచెన్లా మార్చేయవచ్చు. అందుకు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు ఈ ఏఐ గాడ్జెట్స్ మచ్చుతునకలు. రానున్న రోజుల్లో ప్రపంచమంతా ప్రతి రంగాన్నీ ఏఐతో కలిపి చూడటం అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ యూజర్స్కి ఏఐ సేవలను మిళితం చేసి, అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ను అందించడానికి ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే ‘థింక్యూ కేర్’ అనే యాప్తో ఎల్జీ స్మార్ట్ వర్షన్స్కి ఏఐను అనుసంధానం చేస్తోంది ఎల్జీ కంపెనీ. ఇక స్మార్ట్ ఎల్జీ గాడ్జెట్స్ వేటిని కొన్నా యాప్ సాయంతో ఏఐ సేవలను పొందవచ్చు. గాడ్జెట్ సేవల్లో అంతరాయాలను అంచనా వేయడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి ఏఐ సహకరిస్తుంది. సాంకేతికతతో కూడిన అధునాతన జీవనశైలిని అలవాటు చేస్తుంది. వంటగదిని ఏఐ సాంకేతికతతో అమర్చుకుంటే, మొత్తం ఇల్లే ‘స్మార్ట్ హోమ్’లా మారిపోతుంది. హైటెక్ కిచెన్ గాడ్జెట్స్తో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఏఐ మరింత బలోపేతం చేస్తుంది. ఇలానే చాలా కంపెనీలు తమ సొంత యాప్స్ను పరిచయం చేస్తూ, లేటెస్ట్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తున్నాయి.పాకశాస్త్రంలో ఏఐ ప్రవేశం కొత్త సవాళ్లకు నాంది అంటున్నారు కొందరు నిపుణులు. భవిష్యత్తులో వంటశాలలన్నీ ఏఐ వశమైతే.. డేటా గోప్యతకు భంగం వాటిల్లడం, ఉద్యోగ భద్రతకు భరోసా లేకపోవడం, వంటల తయారీలో మానవ ప్రాధాన్యం తగ్గడం, మనుషుల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తవచ్చని సామాజికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ సవాళ్లను ఏఐ అధిగమిస్తుందని కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.సిగ్నేచర్ కిచెన్ సూట్స్ ట్రాన్సిషనల్ సిరీస్ ఓవెన్ ఈ ఓవెన్ లో కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇది ఏఐ సాంకేతికతను ఏకం చేస్తూ, పని చేస్తుంది. వంట ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అబ్జర్వేషనల్ అసిస్టెంట్గా పని చేయడంతో పాటు స్వయంగా వివిధ పదార్థాలను గుర్తిస్తుంది. వంటకాలను సూచిస్తుంది. ఇంట్లో వంట చేసేవారు వంటగదిలో కొత్త వంటకాలు, పదార్థాలు, పద్ధతులను ప్రయత్నించడానికి ఈ ఓవెన్ నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఇది రోజువారీ వంట ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. అలాగే జూన్ ఇంటెలిజెంట్ ఓవెన్ అనే మరో ఏఐ కిచెన్ గాడ్జెట్కి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ నడుస్తోంది. దానిలో 85 రకాల వంటకాలను గుర్తించే అంతర్నిర్మిత వ్యవస్థ ఉంది. ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంతో దానిలో వంట చేసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్తో అనుసంధానం చేసుకోవచ్చు.కుకింగ్ రోబోవంటను వేగవంతం చేయడం, రకరకాల రెసిపీలతో వండిపెట్టడమే లక్ష్యంగా చేసుకుని రూపొందిన ‘కోడీ 29’ కుకింగ్ రోబో ఆప్షన్ ్సని బట్టి 1500 వంటకాలను అందిస్తుంది. ఇది 21 రకాల మోడ్స్తో పని చేస్తుంది. అంతర్నిర్మితంగా ఉన్న డిస్ప్లేతో కృత్రిమ మేధస్సు సాయంతో ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఫంక్షన్ ్స, పార్టీస్ ఉన్నప్పుడు ఈ రోబో భలే చక్కగా సహకరిస్తుంది. మల్టీఫంక్షనల్, స్మార్ట్ ఆప్షన్ ్సతో ఇది ఉపయోగపడుతుంది. హ్యాండ్స్–ఫ్రీ యూజర్లా ఆకట్టుకుంటుంది. వాయిస్ కమాండింగ్స్తో యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది.హెస్టన్ క్యూ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్ఇది ఏఐతో అనుసంధానమైన పవర్డ్ పాన్. లేదా ఇండక్షన్ బర్నర్. ఇది ‘స్మార్ట్’ సాంకేతికతతో వంట ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వంట ఎలా చేసుకోవాలో, ఏ పదార్థం ఎప్పుడు వేయాలో చెబుతూ, మనతోనే మరింత మహత్తరంగా వంట చేయిస్తుంది. వంట రానివారికి ఇది బెస్ట్ గైడ్గా నిలుస్తుంది. టెంపరేచర్, టైమ్ అడ్జస్ట్మెంట్లతో ఇది చక్కగా శ్రమ తెలియనీయకుండా పనిచేస్తుంది. వంటకాల కోసం ఇంటరాక్టివ్ వీడియోలను కూడా అందిస్తుంది. కొత్త పద్ధతులను నేర్చుకోవాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కోసం ఏఐ ఫీచర్లతో కూడిన స్మార్ట్ సామ్సంగ్ రిఫ్రిజిరేటర్. దీనిలో కెమెరాలు ఉంటాయి. అవి ఫుడ్ ఇన్వెంటరీని ట్రాక్ చేసి ఏవి ఎన్ని ఉన్నాయి? ఏవి నిల్వ ఉంటాయో, ఏవి ఉండవో కనిపెడుతుంటాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాంతో ఈ రిఫ్రిజిరేటర్ కారణంగా చాలా ప్రయోజనాలుంటాయి. ఇది ఇంటి కిరాణా అవసరాలపై ఓ అవగాహన కల్పిస్తుంది.న్యూట్రిబుల్లెట్ బ్యాలెన్ ్స స్మార్ట్ బ్లెండర్ఈ డివైస్తో ఆరోగ్యకరమైన స్మూతీస్ను సులభంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు సులభంగా సహాయపడటానికి ఏఐ పవర్డ్ న్యూట్రిషనల్ ట్రాకింగ్తో కూడిన బ్లెండర్ ఇది. దీనికి అంతర్నిర్మిత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో జ్యూస్ ఐటమ్స్ లేదా చట్నీలకు కావాల్సిన ఆహార పదార్థాలను జోడించేటప్పుడు, వాటికి సంబంధించిన పోషకాహారాల వివరాలను తెలియజేస్తుంది. ఫిట్నెస్ లక్ష్యంగా ఆహార ప్రాధాన్యాన్ని చెబుతుంది. తమ ఆరోగ్యానికి తగిన కేలరీలను తీసుకునే వారికి ఈ బ్లెండర్ చక్కగా ఉపయోగపడుతుంది.సీర్ పర్ఫెక్టా గ్రిల్ బార్బెక్యూ ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో పనిచేసే గ్రిల్ ఇది. ఆటోమేటెడ్ పద్ధతిలో చాలా రకాల రెసిపీలను సిద్ధం చేయగలదు. వంట ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఆన్ బోర్డ్ సెన్సర్లను, ప్రత్యేక సాంకేతికతను వినియోగిస్తుంది. ఆహారాలను మారినేట్ చేసి సిస్టమ్కి అందిస్తే సరిపోతుంది. గ్రిల్ రెండు వైపుల నుంచి అధిక ఉష్ణోగ్రతలను అందిస్తూ ఇన్ ఫ్రారెడ్ కుకింగ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. స్వయంచాలక పద్ధతిలో ఆహారాన్ని వండడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించే ఈ గ్రిల్ ఏఐ ఆదేశాలతో చక్కగా పని చేస్తుంది.స్టెయిన్లెస్ స్టీల్ ఏఐ స్లో జ్యూసర్హురోమ్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్తో రూపొందిన ఈ ఏఐ స్లో జ్యూసర్.. చాలా అప్డేటెడ్ వర్షన్ లో పని చేస్తుంది. 200 వాట్ల శక్తిమంతమైన ఏఐ మోటార్తో సుదీర్ఘమైన వారంటీతో ఆకట్టుకుంటున్న ఈ గాడ్జెట్.. పల్ప్ కంట్రోల్ ఆప్షన్స్తో వినూత్నంగా ఉపయోగపడుతుంది. స్క్వీజింగ్ స్క్రూ 60 రిజల్యూషన్ తో, స్పిన్నింగ్ బ్రష్ నిమిషానికి 23 సార్లు తిరుగుతూ జ్యూస్ను అందిస్తుంది. కాస్త వంపు కలిగిన దీని ట్యాప్ నుంచి జ్యూస్ను గ్లాసులోకి లేదా పాత్రలోకి తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్లో డిప్స్, చట్నీస్, స్మూతీస్, మిల్క్షేక్స్తో పాటు డ్రై మసాలాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డివైస్లో జ్యూసర్ యూనిట్తో పాటు రెండు రకాల ఫిల్టర్స్, జ్యూస్ కంటైనర్, పల్ప్ కంటైనర్, క్లీనింగ్ బ్రష్లు, రెసిపీ బుక్ ఇలా చాలానే లభిస్తాయి.ఫుడ్ స్కానర్ఈ గాడ్జెట్, ఆహారాన్ని స్కాన్ చేసి ఏది తినడానికి పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది పాడైపోయినది? ఏది ఇంకా నిల్వ ఉండే పరిస్థితుల్లోనే ఉంది? లాంటి ఎన్నో వివరాలను అందిస్తుంది. ఈ నువిలాబ్ ఏఐ ఫుడ్ స్కానర్ 3.0 వర్షన్ ఆహార వ్యర్థాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన సూచనలను జారీ చేస్తుంది. ఈ స్కానర్ వినియోగించే యూజర్స్కి పోషకాహారానికి సంబంధించిన సలహాలను అందిస్తుంది. న్యూట్రిషనల్ హెల్త్కేర్కి ఏ ఆహారం సరైనదో తెలియజేస్తుంది.త్వరలోనే ఏఐ రోబో షెఫ్!మనిషి శ్రమను ప్రతి స్థాయిలోనూ తగ్గించడానికి రోబోల తయారీలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాఠాలు చెప్పే టీచర్ల దగ్గర నుంచి యుద్ధం చేసే సైనికుల వరకు ప్రతి రంగంలోనూ మనిషి కష్టానికి రీప్లేస్మెంట్ కావాలంటే, అది రోబోతోనే సాధ్యమన్నట్లుగా దూసుకునిపోతోంది టెక్నాలజీ. నిజానికి ఒక బరువైన వస్తువును ఒక చోట నుంచి మరోచోటకి తరలించడం ఒక పని. ఆమ్లెట్ లేక దోసెను పెనంపై వేసి, కాల్చడమూ ఒక పనే! పాలలో కాఫీ పొడి వేసి, కలిపి కాఫీ పెట్టడమూ ఒక పనే! అయితే మనిషి సామాన్యంగా చేయగలిగే ఈ పనులన్నింటినీ ఒక మరబొమ్మ నేర్చుకోవడమంటే మాటలు కాదు. అందుకోసమే శాస్త్రవేత్తలు.. మనిషికి, మెషిన్కి అనుసంధానంగా ఏఐని ఎంచుకున్నారు. సాధారణ పనులను ఏవిధంగా చెయ్యాలో ఇప్పుడు రోబోలు ఏఐ సాయంతో సులభంగా నేర్చుకోగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోబోలకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఓపెన్ స్టోర్ సిస్టమ్ని రూపొందించారు. మనిషి చేయగల సాధారణ పనులను ఓ డేటాలా మార్చి, దాన్ని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రోబోలకు తెలియజేస్తూ వస్తున్నారు. దాంతో రోబోలకు దాదాపు ఇంటి పనులపై కనీస అవగాహన ఉందని, వీటికి చాలా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఆ శిక్షణతో ఏమాత్రం పరిచయంలేని వంటింట్లో కూడా రోబోలు అలవోకగా పనిచేసే స్థాయికి రూపాంతరం చెందుతున్నాయని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ఏఐ రోబో వంటింటికి వస్తే, మనం వంటగదిలోకి అడుగుపెట్టాల్సిన పనే ఉండదు. హోటల్స్లో ఆర్డర్ ఇచ్చినట్లు మెనూ చూసుకుని, ఆర్డర్ ఇచ్చుకోవడమే! ఏఐనా మజాకా! -
టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!
ఇల్లు అంటే మొదట చెప్పుకోవాల్సింది వంటిల్లే. ఇల్లు ఎంత పెద్దదైనా చిన్నదైనా ప్రధానంగా ఉండాల్సిన గది వంటగది. ఆ వంటగదిలోకి అడుగుపెట్టకుండా పెద్దయిపోయే పిల్లల తరం కాదిది. సరదాగా వంటగదిలో ప్రయోగాలు చేస్తున్న కొత్త యువతరం మొదలైంది. రాబోయే ఏడాది యూత్ ట్రెండ్ అంతా వంటగది కేంద్రంగా ఉండబోతోంది. అలాగే టీనేజ్లో ఉన్న పిల్లలకు తల్లితో అనుబంధం పెరిగేది వంటగదిలోనే. ఇందుకోసం చదువుకున్న తల్లి పాటిస్తున్న నాలుగు సూత్రాలివి. పిల్లలను వంటగదిలోకి ఆహ్వానించేటప్పుడు, వారి చేత వంట చేయించేటప్పుడు వాళ్లకు ఇష్టమైన వంటనే చేయాలి, వారి చేత చేయించాలి. వంటల పుస్తకం లేదా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోమని సూచించాలి. ఇంటికోసం వంట చేయడమే కాకుండా చారిటీ కోసం వంట చేయడం అలవాటు చేయాలి. ఏదైనా వండి వాటిని అమ్మగా వచ్చిన డబ్బును అనాథలకు ఇవ్వడం ఒక పద్ధతి. అలాగే అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో ఉండే వాళ్ల కోసం వండి తీసుకెళ్లి పంచడం అలవాటు చేయాలి. తల్లి తనతోపాటు పిల్లలను కూడా కుకరీ క్లాసులకు తీసుకెళ్లడం ద్వారా అందరూ కలిసి ఒక కొత్త వంటను నేర్చుకోవడం, కలిసి వండడం గొప్ప అనుభూతి. అనుబంధాల అల్లిక కూడా. పిల్లలకు ఒక మోస్తరుగా వంట వచ్చిన తర్వాత ఓ చిట్కా పాటించవచ్చు. ఒక రోజు పూర్తిగా లంచ్కి అవసరమైన మెనూ అంతా వాళ్లే సిద్ధం చేయాలి. అంటే ఆ ఒక్కరోజుకు చెఫ్గా నియామకం అన్నమాట. ఏం వండాలో నిర్ణయించుకుని, అవసరమైన వాటిని మార్కెట్ నుంచి తెచ్చుకుని, వండి, వడ్డించడం వరకు వారిదే బాధ్యత అన్నమాట. ఆ రోజు సర్వీస్కి గాను బయటి నుంచి వచ్చిన షెఫ్కి ఇచ్చినట్లే పిల్లలకు కూడా పేమెంట్ ఇవ్వాలి. మోడరన్ ఉమెన్ చాలామంది ఇలా పిల్లలను వారానికోరోజు షెఫ్ డ్యూటీకి సిద్ధం చేస్తున్నారు కూడా. ఏం వెతికారో తెలుసా? మన యువత 2024లో కూడా ఇంటర్నెట్లో వంటల కోసం విపరీతంగా సెర్చ్ చేసినట్లు చె΄్తోంది గూగుల్. ఇంతకీ ఈ ఏడాది ఏయే వంటకాల కోసం వెతికారో తెలుసా? పోర్న్స్టార్ మార్టినీ... దీని పేరు మీద అనేక అభ్యంతరాలున్నాయి. కానీ అదే పేరుతో వ్యవహారంలో ఉంది. ఈ లండన్ లోకల్ డ్రింక్ని వెనీలా వోడ్కా, ఫ్రూట్ లిక్కర్, వెనీలా షుగర్లతో చేస్తారు. రెండవ స్థానంలో మన మామిడికాయ పచ్చడి ఉంది. మూడవ స్థానంలో ఉత్తరాది వంటకం ధనియా పాంజిరి ఉంది. ధనియాల పొడి, చక్కెర, నెయ్యి, రకరకాల గింజలతో చేస్తారు. ఇది కృష్ణాష్టమి రోజు చేసే నైవేద్యం. ఆయుర్వేదం సూచించిన ఆరోగ్య మూలికలతో చేసే ఔషధాహారం. నాలుగో స్థానంలో ఉన్న మన ఉగాది పచ్చడే. ఐదవస్థానంలో ఉన్న ఆహారం ఉత్తరాది రాష్ట్రాల చర్నామృత్. పాలు, చక్కెర, పెరుగు, తేనె, నెయ్యి, తులసి ఆకులు, డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వుతో చేస్తారు. మన పంచామృతం వంటిది. పూజాదికాలలో భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా పంచుతారు. ఆరో స్థానంలో ఉన్నది భూటాన్ వాళ్ల ఇమాదత్శీ. మీగడ పెరుగులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు నానబెట్టి తింటారు. ఆహారప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఉదయాన్నే తాగే వెచ్చటి కాఫీ కోసం అది కూడా రెస్టారెంట్ స్టైల్ క్రీమీ కాఫీ ఎలా చేయాలోనని సెర్చ్ చేశారు. ఎనిమిదో స్థానంలో ఉన్నది కంజి. ఇది ఉత్తరాదిన హోలీ సందర్భంగా తాగే డ్రింక్లాంటిదే. బీట్రూట్, క్యారట్, ఆవాలు, ఇంగువతో చేసి రాత్రంతా పులియ బెడతారు. యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోబయాటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. శక్కర్ పారా... ఇది మహారాష్ట్ర వంటకం. గోధుమ పిండి, చక్కెర కలిపి చేస్తారు. గోధుమ పిండిలో చక్కెర బదులు ఉప్పు, జీలకర్ర కలిపి కూడా చేస్తారు. పిల్లలకు చక్కటి చిరుతిండి, పెద్దవాళ్లకు టీ టైమ్ స్నాక్. ఇక పదవ వంటకం చమ్మంతి... ఇది కేరళ కొబ్బరి పచ్చడి. మన తెలుగు వాళ్లకు కూడా అలవాటే. కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండుతో చేస్తారు. ఇడ్లీ, దోశె, అన్నంలోకి కూడా బాగుంటుంది. గూగుల్ ఇచ్చిన లిస్ట్ చూస్తే ఈ వంటకాల గురించి సెర్చ్ చేసింది యూత్ అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఇవన్నీ సులువుగా చేయగలిగిన వంటలే. పండుగల సమయంలో మాత్రమే చేసే ధనియా పాంజిరి, ఉగాది పచ్చడి, చర్నామృత్ల కోసం సెర్చ్ చేశారంటే వాళ్లు వంటలో చెయ్యి తిరిగిన వాళ్లు కాదని ఒప్పుకోవాల్సిందే. అలాగే మామిడికాయ పచ్చడి, కొబ్బరి పచ్చడి కూడా. ఇక మనవాళ్లు ఆసక్తిగా బయటి వంటకాల కోసం తొంగి చూసింది లండన్ డ్రింక్, క్రీమీ కాఫీల విషయంలో మాత్రమే. ఇవి కూడా యూత్ ఇంటరెస్ట్ జాబితాలోనివే. మరో విషయం... బాదం పప్పులు నానబెట్టి రోజూ తినడానికి కారణాలు, ప్రయోజనాలను తెలుసుకున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్ గురించి కూడా. -
భాగ్యనగరాన్ని.. కమ్మేస్తున్న క్లౌడ్స్..
దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో.. విభిన్న ఆహార రుచులకు కేంద్రమైన నగరాల్లో హైదరాబాద్ కూడా ప్రముఖమైనది. ప్రస్తుత కాంటినెంటల్ వంటకాలే కాదు నిజాం కాలం నాటి స్థానిక సాంస్కృతిక వంటకాలతోనూ మన భాగ్యనగరం ‘బౌల్ ఆఫ్ డెలీíÙయస్ డిష్’గా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా నగరంలో స్థానిక వంటకాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రుచులు కూడా ఆదరణ పొందుతున్నాయి. ఈ రుచుల కోసమే ప్రత్యేకంగా రెస్టారెంట్లు కూడా వెలిశాయి. అయితే కరోనా అనంతరం ఈ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా క్లౌడ్ కిచెన్. ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడంతో మొదలైన ఈ కల్చర్.. వెళ్లే అవకాశమున్నా ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టేంతగా మార్పు చెందింది. నగరంలో విభిన్న రుచులు విభిన్న సంసంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ బిర్యానీ మొదలు ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ వరకూ అన్ని రుచులూ ఆన్లైన్, డిజిటల్ వేదికగా ఒక్కొక్క ఆర్డర్తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్థానిక వంటకాలే కాదు చైనీస్, కొరియన్, మొగలాయి, కరాచి వంటి రుచులను అందించే రెస్టారెంట్లు తమ డోర్ స్టెప్ సేవలను అందిస్తున్నాయి. వీరికి వారధులుగా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ వేదికలు ఉన్నాయన్న విషయం విధితమే. అయితే.. ఈ కోవలోకి స్టార్ రెస్టారెంట్లు కాస్త విముఖతను ప్రదర్శించాయి. నాణ్యత, బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ సేవలు అందించలేదనేది నిపుణుల మాట. కానీ ప్రస్తుతం నగరంలోని టాప్ 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు సైతం క్లౌడ్కిచెన్కు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి పాకశాస్త్ర నైపుణ్యాలతో నాణ్యత, ప్యాకింగ్, బ్రాండ్ వాల్యూ వంటి అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సేవలు ప్రారంభిస్తున్నాయి. విలాసవంతమైన జీవితాల్లో ఈ లోటును పూడ్చడానికి స్టార్ హోటళ్ల యాజమాన్యం ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా గమనించాలి. జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల డిజిటల్ ఫుడ్ సేవలు ఊపందుకున్నాయి. అందరూ అదే దారిలో.. డైనింగ్తో పాటు ఈ క్లౌడ్ కిచెన్లో కూడా మంచి లాభాలు వస్తుండటంతో పలు రెస్టారెంట్లు ఈ డిజిటల్ ఇన్నోవేషన్కు సై అంటున్నాయి. కానీ స్టార్ హోటళ్లు మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే గత కొంత కాలంగా 5 స్టార్ హోటళ్లు సైతం క్లౌడ్ కిచెన్ను ప్రారంభించాయి. వాటి బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూనే, పాకశాస్త్ర నైపుణ్యాలను డిజిటల్ వేదికతో అనుసంధానం చేస్తూ సేవలందిస్తున్నాయి. ఇక క్లౌడ్ కిచెన్ సేవలను నగరవాసులు ఆస్వాదిస్తున్న తీరు అద్భుతం. ఈ నేపథ్యంలో వారికి మా సేవలను సైతం అందంచాలనే లక్ష్యంతో ఐటీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫుడ్టెక్ సేవలు ప్రారంభించాం. స్విగ్గీ, జొమాటో వంటి వేదికలతో అనుసంధానమై మా పసందైన రుచుల పండుగను ఆహార ప్రియుల వద్దకే చేర్చుతున్నాం. ముఖ్యంగా మా ప్రయత్నంలో అధిక–నాణ్యత భోజనాన్ని అందించడంతో పాటుగా పర్యావరణహితమైన ప్యాకింగ్ను కొనసాగిస్తున్నాం. డిజిటలీకరణతో అద్భుత ఫలితాలు ఫుడ్, హోటల్స్ రంగంలో అధునాతన డిజిటలీకరణ అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్లో పాకశాస్త్ర నిపుణులైన స్టార్ హోటల్ చెఫ్లు, కిచెన్ మేనేజర్లు విశేషమైన శిక్షణ ఉండటంతో ఈ విధమైన క్లౌడ్ కిచెన్కు మంచి ఆదరణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా వివిధ దశల్లో ఆహార పదార్థాల తనిఖీ, తయారీ విధానంలోనూ అధునాతన సాంకేతికత వినియోగించడంతో పాటు శాటిలైట్ కిచెన్లలో ఉపయోగించే యాప్లు ఈ వంటలకు మరింత నాణ్యతను, ఖచి్చతత్వాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ ఫుడ్ టెక్ సేవలలో సుస్థిరతే ప్రధాన లక్ష్యంగా స్టార్ హోటల్స్ ప్యాకింగ్ను వినూత్నంగా చేపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, మారే ఉష్ణోగ్రతలు ఆహారాన్ని పాడు చేయకుండా స్పిల్లేజ్ ప్రూఫ్ కంటైనర్లను ఉపయోగిస్తుండటం విశేషం. ఫుడ్ లవర్స్ అభిరుచికి అనుగుణంగా.. నగరంలోని ఫుడ్ లవర్స్ ఇష్టపడే రుచులకు అనుగుణంగా, మా నాణ్యతా ప్రమాణాలను పెంచుకుంటూ 3 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందులో భాగంగా ప్రముఖ మాస్టర్ చెఫ్లచే రూపొందించబడిన దాల్ మఖీ్న, కబాబ్లు, ర్యానీలతో సహా గౌర్మెట్ నార్త్ ఇండియన్ వంటకాలను అందించడానికి ‘ఐటీసీ మాస్టర్ చెఫ్ క్రియేషన్స్’, ఆరోగ్యానికి హితమైన మిల్లెట్ కిచిడీ, ఇంటి వంటలను తలపించే చపాతీలు, అన్నం వంటి వాటికోసం ‘ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్’, క్రోసెంట్స్, బేగెల్స్, గౌర్మెట్ బ్రెడ్లు వంటి బేకరీ ఐటమ్స్ కోసం ‘ఐటీసీ సన్ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్’ సేవలు ఉన్నాయి. ఈ మూడు రకాల సేవలను హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నైలోని 19 క్లౌడ్ కిచెన్లలో ప్రారంభించాం. – రోహిత్ భల్లా, ఫుడ్ టెక్ బిజినెస్ హెడ్, ఐటీసీ లిమిటెడ్. -
లిటిల్ చెఫ్స్: వంటలు నేర్చుకోవడం వల్ల పిల్లలు..!
ఉన్నత లక్ష్యాలను సాధించే తెగువే కాదు.. ప్రాథమిక అవసరాలను తీర్చుకునే నైపుణ్యమూ తెలుసుండాలి! వాటిల్లో వంట మొదటిది! అందుకేనేమో ఇప్పుడు పదసంపదలోకి ఫుడ్ లిటరేట్స్ అనే పదం చేరింది! చదువు, ఆట, పాటలతో పాటు పాకం కూడా తప్పక నేర్చుకోవలసిన విద్య అయింది! అర్బన్ స్కూళ్లలో, న్యూక్లియర్ కుటుంబాల్లో కుకింగ్ అనేది జెండర్ – న్యూట్రల్ యాక్టివిటీ అయింది! ఇదివరకు.. ఏ ఇంట్లో అయినా ఆడుకోవడానికి ఆడపిల్లలకైతే వంట పావులు.. మగపిల్లలకైతే కార్లు, బ్యాట్, బాల్ బొమ్మలుండేవి. ఇప్పుడు ఆ సీన్ అంతగా కనపడట్లేదు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో.. కరోనా తర్వాత. కరోనా లాక్ డౌన్ అందరికీ అన్నీ వచ్చుండాలనే పాఠం నేర్పింది. ఎమ్సెట్ ఎంట్రెన్స్ కంటే ముందు కిచెన్లోకి ఎంటర్ కావాలని చెప్పింది. అందుకే కరోనా తర్వాత చాలా కార్పొరేట్ స్కూళ్లు కుకింగ్నీ సిలబస్లో చేర్చాయి. అయితే లింగవివక్షను చెరిపేయడానికి చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ (విద్యారణ్యతోపాటు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు) వంటి నగరాల్లోని చాలా స్కూళ్లు ఎప్పటి నుంచో కుకింగ్ క్లాసెస్ను తమ కరిక్యులమ్లో భాగం చేశాయి. కరోనా కష్టంతో పట్టణాలు, మధ్యతరగతి కుటుంబాలూ ఈ విషయంలో అలెర్ట్ అయ్యాయి. ఊహ తెలిసినప్పటి నుంచే పిల్లలకు వంట గదిని పరిచయం చేస్తున్నాయి. వంటసామాగ్రితో స్నేహం చేయిస్తున్నాయి. దీనివల్ల పిల్లల పదసంపద పెరుగుతుంది. ప్రయోగాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వస్తువులను గుర్తించే జ్ఞానం అలవడుతుంది. కొలతలు అర్థమవుతాయి. మోతాదు మించినా, తగ్గినా వచ్చే ఫలితాల పట్ల అవగాహన కుదురుతుంది. బాధ్యత, బ్యాలెన్స్లు తెలుస్తాయి. సర్దుబాటు అలవాటవుతుంది. టీమ్ వర్క్, ఆ స్పిరిట్ బోధపడతాయి. ఎదుటివారికి సాయపడే గుణం అబ్బుతుంది. ఇతరులను జడ్జ్ చేయకూడదనే స్పృహా కలుగుతుంది. ఇలా కిచెన్ ఇటు అకడమిక్స్కు, అటు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను బోధిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాస్మోపాలిటన్, మెట్రో నగరాల్లో కొన్ని సంస్థలు పిల్లల కోసం కుకింగ్ వర్క్ షాప్స్ని కూడా నిర్వహిస్తున్నాయి. లిటిల్ షెఫ్స్తో టీవీ చానళ్లు కుకింగ్ షోస్నూ ప్రసారం చేస్తున్నాయి. అల్లరి పిల్లల్ని సంభాళించడానికి కిచెన్ని మించిన ప్లేస్ లేదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఇల్లు పీకి పందిరేసే పిల్లలను పేరెంట్స్ తమ అసిస్టెంట్స్గా వంటగదిలోకి పట్టుకెళ్లి.. వారి ముందు క్యాబేజ్ లాంటి కూరగాయలను పెట్టి.. దాని ఆకులను వేరు చేయమని పురమాయించాలని చెబుతున్నారు. అలాగే ఒక టబ్లో వాళ్ల చేత నీళ్లు పోయించి, అందులో కాసింత ఉప్పు వేయించి.. వాళ్ల చేతికి కూరగాయలిచ్చి ఆ టబ్లో వేయించాలి. వాళ్ల చిట్టి చిట్టి అరచేతులతో చిన్న చిన్న ఉల్లిపాయలను ప్రెస్ చేయించాలి. తడిపిన చపాతి పిండిని వాళ్ల ముందు పెట్టి.. చిన్న చిన్న లడ్డూలు చేయమనాలి. ఈ యాక్టివిటీస్తో వాళ్లు కుదురుగా ఉండటమే కాకుండా చాలా విషయాలు నేర్చుకుంటారు. చిన్నపాటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుందంటున్నారు నిపుణులు. అలా చిన్నప్పుడే వంటింట్లో గరిట పట్టుకుని, తమ వంటల ఘుమఘుమలతో ఇంట్లో వాళ్లనే కాదు ఇరుగు పొరుగునూ ఆశ్చర్యపరుస్తున్న ఆ బాలనలభీములను పరిచయం చేసుకుందాం.. వైభవి మెహ్రోత..ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్కు చెందిన ఈ అమ్మాయికిప్పుడు పదహారేళ్లు. కానీ తొమ్మిదేళ్ల వయసులోనే అమ్మ చేయి పట్టుకుని వంటింట్లోకి అడుగుపెట్టింది.. వంటలో అమ్మకు చేయందించేందుకు. పోపు దినుసుల దగ్గర్నుంచి పసుపు, ఉప్పు, కారం వంటివన్నీ ఎంత మోతాదులో పడితే వంటకు రుచి వస్తుందో పర్ఫెక్ట్గా తెలుసుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూర ఉడుకుతుండగానే దాని వాసన చూసి చెప్పగలదు అందులో ఏం తక్కువైంది, ఏం ఎక్కువైందన్నది! బేకింగ్లో వైభవీని మించిన వారు లేరు. ‘లాక్డౌన్ టైమ్లోనే నాకీ పర్ఫెక్షన్ వచ్చింది. లాక్డౌన్లో మా చుట్టుపక్కల వాళ్లకు, చుట్టాలకు కేక్స్ చేసి పంపేదాన్ని సరదాగా! ఆ ప్రాక్టీస్తో కేక్స్ చేయడంలో పర్ఫెక్ట్ అయిపోయాను. నా ఫేవరిట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ చాక్లెట్ కేక్!’ అని చెబుతుంది వైభవీ. హోమ్ బేకరీ, తర్వాత ఒక కేఫ్నీ పెట్టాలనేది ఈ యంగ్ షెఫ్ ఆలోచన, లక్ష్యం! ’ 'vabhavi's bake diaries' పేరుతో ఆమెకో యూట్యూబ్ చానల్ కూడా ఉంది. సునిధి మెహతా..మహారాష్ట్ర, పుణేకి చెందిన ఈ అమ్మాయికిప్పుడు పద్నాలుగేళ్లు. కానీ నాలుగేళ్ల వయసులోనే వంట మీద ఆసక్తి పెంచుకుంది. సునిధి వాళ్ల మేనత్త బ్రౌనీస్ చేస్తుంటే కళ్లింతింత చేసుకుని చూస్తుండేదట. ఆ పిల్ల ఇంట్రెస్ట్ గమనించిన మేనత్త ఆ అమ్మాయి చేయి పట్టుకుని అన్నీ చేయించేదట. ఇదంతా చూసి సునిధి వాళ్ల నాన్న .. కూతురికి అక్షరజ్ఞానం వచ్చాక వంటల పుస్తకాన్ని తెచ్చిచ్చాడట. ‘అదే నా ఫస్ట్ అండ్ ఫరెవర్ ఫేవరిట్ గిఫ్ట్’ అంటుంది బ్రౌనీలు, బిస్కట్స్, స్వీట్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన సునిధి. ‘బ్రౌన్ సుగర్, దాల్చిన నాకిష్టమైన ఇన్గ్రీడియెంట్స్. నా ఫేవరిట్ అండ్ కంఫర్ట్ ఫుడేమో పానీపూరీ. ఎప్పటికైనా కేక్ అండ్ కాఫీ స్టోర్ పెట్టాలన్నదే నా గోల్’ అని చెబుతుంది. రణవీర్ కల్బాగ్..మహారాష్ట్ర, పుణేకి చేందిన రణ్వీర్కిప్పుడు పద్నాలుగేళ్లు. కానీ అయిదేళ్ల వయసులోనే సాస్ తయారీకి ఏప్రాన్ వేసుకున్నాడు. రణ్వీర్ వాళ్ల నాన్న ప్రొఫెషనల్ చెఫ్. ప్రతి ఆదివారం ఇంట్లో వాళ్ల నాన్నే వంట చేస్తాడు. దాంతో రణ్వీర్ కూడా నాన్నకు సాయంగా వంటింట్లోకి దూరేవాడు. అలా వంట మీద ఇష్టం ఏర్పడింది ఆ అబ్బాయికి. ‘మాస్టర్ బేకింగ్ లేదా మిక్సాలజిస్ట్.. నా ఎయిమ్’ అని చెబుతాడు. స్వీట్స్ అంటే ప్రాణం పెడతాడు. ‘అందుకే బటర్ అండ్ సుగర్ అంటే చాలా ఇష్టం. అవి రెండు కలిసి చేసే మ్యాజిక్ అలాంటిది మరి!’ అంటాడు.మేధా భట్..కర్ణాటక, మంగళూరుకు దగ్గర్లోని ఆర్యపు అనే చిన్న పల్లెటూరికి చెందిన ఈ అమ్మాయికిప్పుడు పదిహేనేళ్లు. కానీ మూడవ తరగతిలో ఉన్నప్పుడే డిసైడ్ అయింది పెద్దయ్యాక రెస్టరటర్ అవ్వాలని. తను పెట్టబోయే హోటల్కి పేరు కూడా రెడీచేసి పెట్టుకుంది ‘తందురుస్తీ హోటల్’ అని. ఆమెకు స్ఫూర్తి వాళ్లమ్మ చూసే యూట్యూబ్ వంటల చానళ్లు. ఆ చానళ్లలో రకరకాల దినుసులన్నీటితో చక్కటి డిష్ని తయారుచేయడం చూసి ఆశ్చర్యపోయేదట మేధా. ‘చిటికెడు ఉప్పుతో వాళ్లు బాండిడు కూరకు రుచి తేవడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉండేది’ అంటూ ఇప్పటికీ సర్ప్రైజ్ అవుతుంది. మేధా తన ఎనిమిదో ఏట పోపుల పెట్టె పట్టుకుంది. ‘నిజానికి మేధా హైపర్ యాక్టివ్ కిడ్. వంట వల్లే తను నెమ్మది అయింది. ఇప్పటికీ మేధాను చూస్తుంటే నాకు వండరే! ఒక్క క్షణం కాలు నిలువని పిల్ల.. అంత ఓపిగ్గా వంట ఎలా చేయగలుతుంది అని!’ అంటుంది మేధా వాళ్లమ్మ. చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డేలకు కస్టమైజ్డ్ కేక్స్ చేస్తున్న మేధాకు చాక్లెట్, బంగాళదుంప అంటే ఇష్టం. (చదవండి: ఐదేళ్లకే పుస్తకాన్ని రచించి రికార్డు సృష్టించింది..!) -
వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్కు మించి బ్యాక్టీరియా
వంట చేయడం ఒక ఎత్తయితే...అంట్ల గిన్నెలను తోమడం, కడగడం అంతకు రెండింతలు. శుభ్రంగా తోమాలి. ఎలాంటి మరకలు లేకుండా కడగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆరోగ్యానికి చేటే. మన ఇంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే మన ఇంటికి, ఒంటికీ అంత మంచిది. కానీ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే వంట గిన్నెల్ని శుభ్రం చేసే స్క్రబ్బర్, స్పాంజ్ల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సోకవచ్చని తాజా పరిశోధనలో తేలింది. ప్రస్తుతం కాలంలో వంట పాత్రల్ని శుభ్రం చేసేందుకు ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్ని, లేదా స్పాంజ్ని వాడుతూ ఉంటాం కదా. ఈ డిష్ స్క్రబ్బింగ్ స్పాంజ్ హానికరమైన బాక్టీరియాకు హాట్స్పాట్ అంటే నమ్ముతారా? ఇది టాయిలెట్ బౌల్ కంటే ఎక్కువ ప్రమాదాలను కలిగిస్తుందని తాజా స్టడీ తేల్చింది. కిచెన్ స్పాంజ్లు ఎందుకు ప్రమాదకరం?డ్యూక్ యూనివర్శిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీర్లు స్పాంజ్లు తేమతో కూడిన నిర్మాణం కారణంగా సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయని ధృవీకరించారు. ఒక చిన్న క్యూబిక్ సెంటీమీటర్ స్క్రబ్బర్లో 54 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. 5 శాతం వరకు సాల్మొనెల్లాను కలిగి ఉండవచ్చు. దీంతో తేలికపాటి గ్యాస్ట్రోఎంటెరిటిస్ మాత్రమే కాకుండా మెనింజైటిస్, న్యుమోనియా, అధిక జ్వరాలు, బ్లడీ డయేరియా, ప్రాణాంతక బ్లడ్ పాయిజిన్లాంటి తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్తో ఆహార సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటికి చికిత్స చేయకపోతే ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అంతేకాదు అందులో ఉండే రకరకాల బ్యాక్టీరియాలతో కిడ్నీ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఈ స్పాంజ్లలో వృద్ధి చెందే ఈ-కొలి కారణంగా మూత్రపిండ వైఫల్య ప్రమాదం కూడా ఉంది. దీన్నే హిమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ అంటారు. ఇది ఆహార కాలుష్యం వల్ల వస్తుంది. స్టెఫిలోకాకస్ అనేది స్పాంజ్లలో కనిపించే మరొక వ్యాధికారకం. చర్మ వ్యాధులకు, ఇంపెటిగో, సెల్యులైటిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. పరిష్కారం ఏమిటి? ఏం చేయాలి. పాత్రలను శుభ్రం చేసే స్పాంజ్లు,స్క్రబ్బర్లు తరచుగా మారుస్తూ ఉండాలి. అలాగే ఏరోజుకారోజు శుభ్రంగా క్లీన్ చేయాలి. తడి లేకుండా బాగా పిండేసి, తర్వాత వాటిని గాలిలో ఆరనివ్వాలి. మాంసం కంటైనర్లు, ఇతర పాత్రలు..ఇలా అన్నింటికి ఒకటే కాకుండా వేరు వేరువస్తువులను శుభ్రం చేయడానికి వేరు వేరు స్పాంజిని ఉపయోగించాలి. బాక్టీరియా ప్రమాదాన్ని నివారించేందుకు స్పాంజ్లను తడిపి రెండు నిమిషాలు మైక్రోవేవ్లో ఉంచాలి.డిష్ గ్లోవ్స్ ధరించడం వల్ల కలుషితమైన స్పాంజ్లతో వచ్చే చర్మ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించు కోవచ్చు. స్పాంజ్లకు ప్రత్యామ్నాయాలుప్లాస్టిక్ స్పాంజ్లను తరచుగా వాడి పారేయడం పర్యావరణ అనుకూలమైనది కాదు, కాబట్టి సెల్యులోజ్ ఆధారిత స్పాంజ్ లాంటి ప్రత్యామ్నాయాలుఎంచుకోవాలని పరిశోధకులు సూచించారు. స్పాంజ్లను ఉపయోగించడంలో అసౌకర్యంగా ఉన్నవారు, స్క్రబ్ బ్రష్లు, సిలికాన్ బ్రష్లు, సింగిల్ యూజ్ మెటల్ స్క్రబ్బీలు, డిష్వాషర్లు లాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలింటున్నారు. -
కొంచెం స్మార్ట్గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు
వంట చేయం అనుకున్నంత ఈజీకాదు. భయపడినంత కష్టమూ కాదు. కాస్త స్మార్ట్గా ముందస్తు ప్రిపరేషన్ చేసుకుంటే చాలు. అన్నం వండాలా,చపాతీ చేయాలి అనేక ముందు నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి ఎలాంటి కూరలు చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. చపాతీ అయితే, పప్పు, లేదా మసాలా కూర చేసుకుంటే సరిపోతుంది. అదే అన్నం అయితే, పప్పు, కూర, పచ్చడి, సాంబారు లేదా చారు, ఇంకా వడియాలు అప్పడాలు ఇలా బోలెడంత తతంగం ఉంటుంది. అంతేకాదు వీటికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు కట్ చేయడం ఒక పెద్ద పని. అయితే ఎలాంటి పని అయినా, ఇబ్బంది లేకుండా కొన్ని చిట్కాలతో సులువుగా చేసుకోవచ్చు. అలాంటివి మచ్చుకు కొన్ని చూద్దాం.చిట్కాలుపచ్చిమిర్చి కట్ చేసినపుడు చేతులు మండకుండా ఉండాలంటే కత్తెరతో కట్ చేసు కోవాలి. చాకుతో కోసినపుడు చేతుల మండుతోంటే పంచదారతో చేతులను రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే, వాటిని ముందు కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాలి.ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లి వాసన రాకుండా ఉండాలంటే, నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన పోతుంది.చపాతీగాని, పరోటాగాని, మెత్తగా ఉండాలంటే 1 స్పూన్ మైదా, ఒక స్పూన్ పెరుగుని గోధుమ పిండిలో వేసి తడిపితే మెత్తగా వస్తాయి.చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది. పచ్చకూరలు వండేటప్పుడు చిటికెడు సోడా వేసి వండితే చూడ్డానికి కంటికి మంచి ఇంపుగా కనబడ్డమే కాకుండా రుచిగా ఉంటాయి.పంచదార జార్లో రెండు లవంగాలు వేస్తే చీమల దరి చేరవు.కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే వాటిని చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది టమోటా ఫ్రెష్గా ఉండాలంటే ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితేచాలు.ఒక్కోసారి గ్లాస్లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి భలే ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో కంగారుపడి, కిందికి మీదికి కొట్టకుండా, పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది. శుభ్రమైన వాతావరణంలో శుభ్రం చేసుకున్న చేతులతో వంటను పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇదీ చదవండి : విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా? -
Vinayaka Chavithi 2024: బుజ్జి గణపయ్యకు.. బొజ్జ నిండా!
రేపే వినాయక చవితి. ఉదయం చంద్రుడిని చూడవద్దు. చందమామ లాంటి కుడుములు చేద్దాం. వినాయకుడికి నివేదన చేద్దాం. ఓ బొజ్జ గణపయ్యా! నీ బంటు నేనయ్యా!! ఉండ్రాళ్లపై దండు పంపమని స్తోత్రం చదువుదాం!!ఉండ్రాళ్లు..కావలసినవి..బియ్యపు రవ్వ– కప్పు;నీరు – 2 కప్పులు;పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు;నెయ్యి– టీ స్పూన్;ఉప్పు – పావు టీ స్పూన్;పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు (ఇష్టమైతేనే)తయారీ..– శనగపప్పును కడిగి 20 నిమిషాల సేపు నీటిలో నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి అందులో శనగపప్పు వేసి వేయించాలి.– శనగపప్పు దోరగా వేగిన తర్వాత అందులో నీరు పోసి ఉప్పు వేసి మూత పెట్టాలి.– నీరు మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి, రవ్వ వేసి ఉండలు లేకుండా గరిటెతో కలపాలి.– కొబ్బరి తురుము వేసి సమంగా కలిసే వరకు కలిపి నీరు ఆవిరైపోయి రవ్వ దగ్గరగా అయిన తర్వాత దించేయాలి.– వేడి తగ్గిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని గోళీలుగా చేస్తే ఉండ్రాళ్లు రెడీ.పూర్ణం కుడుములు..కావలసినవి..బియ్యప్పిండి– కప్పు;నీరు – కప్పు;నెయ్యి – టీ స్పూన్;ఉప్పు – చిటికెడు. పూర్ణం కోసం... పచ్చి శనగపప్పు – అర కప్పు; నీరు – కప్పు;బెల్లం పొడి– ముప్పావు కప్పు;పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు;యాలకుల పొడి– అర టీ స్పూన్తయారీ..– శనగపప్పును కడిగి రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, చల్లారిన తర్వాత నీటిని వంపేసి శనగపప్పును మిక్సీలో వేసి పొడి చేయాలి.– ఈ పొడి డ్రైగా ఉండదు, కొద్దిపాటి తడిపొడిగా ఉంటుంది.– ఒక పాత్రలో బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కరిగే వరకు మరిగించాలి.– కరిగిన తర్వాత మరొకపాత్రలోకి వడపోయాలి.– బెల్లం నీటిలో శనగపప్పు పొడి, కొబ్బరి తురుము వేసి గరిటెతో కలుపుతూ మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు మరిగించాలి.– చివరగా యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.– చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా చేసి, గోళీలుగా చేస్తే పూర్ణం రెడీ.ఇక కుడుముల కోసం..– ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో ఉప్పు, నెయ్యి వేసి వేడి చేయాలి.– నీరు మరిగేటప్పుడు స్టవ్ ఆపేసి బియ్యప్పిండి వేసి గరిటెతో కలపాలి.– వేడి తగ్గిన తరవాత చేత్తో మర్దన చేస్తూ చపాతీల పిండిలా చేసుకుని ఎనిమిది భాగాలు చేయాలి.– ఒక్కో భాగాన్ని గోళీలాగ చేసి పూరీలా వత్తాలి.– ఇందులో పూర్ణం పెట్టి అంచులు మూసేయాలి. ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి.– ఒక వెడల్పు పాత్రకు నెయ్యి రాసి పూర్ణకుడుములను అమర్చాలి.– ప్రెషర్ కుకర్లో నీరు పోసి కుడుముల పాత్ర పెట్టి మూత పెట్టి ఎనిమిది నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆపేయాలి.– చల్లారిన తర్వాత తీసి వినాయకుడికి నివేదన చేయాలి. -
ఈ కిచెన్వేర్స్ని నిమ్మకాయతో అస్సలు క్లీన్ చేయకూడదు !
వంటగదిలో క్లీన్ చేయడానికి లేదా శుభ్రంగా ఉంచడానికి మొట్టమొదటగా ఉపయోగించేది నిమ్మకాయలనే. దీనిలోని ఆమ్లత్వం, తాజా సువాసన కారణంగా వీటిని మిరాకిల్ క్లీనర్గా పిలుస్తుంటారు. చెప్పాలంటే ఏదైనా చెడు వాసన పోగొట్టేందుకు, క్రిమిసంహారక క్లీనర్గానూ నిమ్మకాయాలు బెస్ట్. ఈ నిమ్మకాయలు క్లీనింగ్కి, సువాసన కోసం ఉపయోగించినప్పటికీ కిచెన్లోని ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయలతో క్లీన్ చేయకూడదు. నిమ్మకాయలకు దూరంగా ఉంచాల్సిన వంటగది వస్తువులు ఏవంటే..మార్బుల్, గ్రానైట్ కౌంటర్టాప్లు: ఇళ్లలోని ఫ్లోర్ ఎక్కువగా మార్బుల్ లేదా గ్రానైట్ రాయిని వినియోగిస్తున్నారు. వీటిని క్లీన్ చేసేందుకు నిమ్మకాయలను ఉపయోగించకూడదు. దీనిలోని అధిక ఆమ్లత్వం కారణంగా నష్టం వాటిల్లుతుందే తప్ప అవి క్లీన్ అవ్వవు. పైగా వాటికి ఉండే సహజ మెరిసే గుణం పోతుంది. వీటిని క్లీన్ చేసేందుకు పీహెచ్ తటస్థ క్లీనర్లను ఎంపిక చేసుకుంటే అవి మెరుస్తుంటాయి. కాస్ట్ ఐరన్ పాన్లు: తొందరగా వేడేక్కే బెస్ట్ పాన్లు. వీటిని కూడా నిమ్మకాయలతో క్లీన్ చేయకూడదు. ఎందుకంటే దీనిలోని ఆమ్లత్వం తుప్పు పట్టేలా చేస్తుంది. పైగా పాన్లపై నూనెకు సంబంధించిన జిగటను నిరోధించే రక్షిత పొరకు నష్టం వాటిల్లేలా చేస్తుంది. వీటిని శుభ్రం చేసేందుకు బ్రష్, వేడి నీటిని ఉపయోగించండి. కత్తులు వంటి వాటికి..కత్తులు వంటి పదునైన వస్తువులను క్లీన్ చేసేందుకు నిమ్మకాయను అస్సలు వాడకూడదు. ఇది రియాక్షన్ చెంది ఆక్సీకరణం చేయడంతో కత్తులు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇది క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వీటిని శుభ్రపరిచేందుకు ఉపయోగించకపోవడమే మంచిది. ఇలాంటి పదునైన వస్తువులను క్లీన్ చేసేందుకు డిష్ సబ్బును ఉపయోగించండి, క్లీన్ చేసిన వెంటనే తడి లేకుండా ఆరనివ్వాలి. ఇలా చేస్తే వాటి పదును పోదు, ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. చెక్క పాత్రలు, చెక్క కట్టింగ్ బోర్డులు..చెక్ పాత్రలు, చెక్ కట్టింగ్ బోర్డులు నిమ్మకాయతో క్లీన్ చేస్తే గనుక..దీనిలోని ఆమ్లత్వం పొడిగా అయిపోయి పగళ్లు తెప్పిస్తుంది. పైగా బ్యాక్టీరియాను ఆశ్రయించేలా చేస్తుంది. వీటిని క్లీన్ చేసేందుకు తేలికపాటి సబ్బును ఉపయోగించండి. మంచిగా ఉండేందుకు నూనె అప్లై చేయండి.అల్యూమినియం పాత్రలు..అల్యూమినియం పాత్రలను నిమ్మకాయలతో శుభం చేయడం హానికరం. ఎసిడిటీ వల్ల రంగు మారడం, మెరుపు కోల్పోవడం జరుగుతుంది. అంతేగాదు ఆ పాత్ర ఉపరితలంపై చిన్న రంధ్రాలను కూడా ఏర్పరుస్తుంది. వీటిని క్లీన్ చేసేందుకు డిస్ సోప్ వినియోగించండి. కొత్తగా కనిపించేలా చేసేందుకు స్పాంజ్తో క్లీన్ చేయండి. (చదవండి: ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్!) -
రుచులతో ప్రయాగాలు చేయడం.. కబితా సింగ్ అభిరుచి!
రుచులతో ప్రయాగాలు చేయడం కబితా సింగ్ అభిరుచి. అందులో ఆమెకు అపారమైన ప్రజ్ఞ ఉంది. కబితా గరిట పట్టిందంటే చాలు నలభీమ పాకం ఇలాగే ఉంటుందేమో అన్నంత టేస్టీగా ఘుమఘుమలాడిపోతుంది ఆ వంటకం. అలా తను చేసే డిఫరెంట్ వంటకాల గురించి లోకానికి చెప్పాలనుకుంది.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే పర్ఫెక్ట్ అనుకుంది. అందుకే 2014లో Kabita's Kitchen పేరుతో యూట్యూబ్ చానెల్ను స్టార్ట్ చేసింది. అందులో ఆమె చేప్పే 10 మినిట్స్ ప్రెషర్ కుకర్ రెసిపీస్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా, నాన్ ఆయిలీ ఆలూ పాలక్ నుంచి పాస్తా, పిజ్జా, సాలిడ్స్, సూప్స్ దాకా అన్ని రకాల వంటలకు ఊహించని రీతిలో రెస్పాన్స్ మొదలైంది. 2017కల్లా మిలియన్ల వ్యూస్కి చేరుకుంది. ఇప్పుడు ఆమె చానెల్కి (2023 లెక్కల ప్రకారం) కోటీ 34 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.ఈ పాపులారిటీ వల్ల ఆమె చానెల్కి బ్రాండ్ ప్రమోషన్స్ పెరిగాయి. 2023 గణాంకాల ప్రకారం యాడ్స్ వల్ల ఆమె ఏడాదికి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్జిస్తోందని అంచనా. అకార్డింగ్ టు వేరియస్ వెబ్సైట్స్ Kabita's Kitchen వాల్యూ 5 నుంచి 6 కోట్లు ఉండొచ్చట. చూశారా.. తిరగమోతకూ తిరుగులేని విలువుంటుంది. అందుకే వంటలో నైపుణ్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి!ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను.. -
ఆ ఉత్తరం ఈ దక్షిణం అన్ని రుచులూ అద్భుతః
మన వంటగదికి పొరుగింటి రుచిని అద్దుదాం. కేరళ కొబ్బరితో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పెరుగుతో పంజాబీ కడీ చేద్దాం. శనగలతో జైసల్మీర్ చనే కూడా ట్రై చేద్దాం. పిల్లలకు అన్ని రుచులూ అలవాటైతే... పై చదువులకు ఏ రాష్ట్రానికి వెళ్లినా సరే... మన ఇంట్లో భోజనం చేసినట్లే ఉంటుంది.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;నీరు– వంద మిల్లీలీటర్లు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా– చిటికెడు.తయారీ..బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీటలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.మిక్సీలో బియ్యంతోపాటు కొబ్బరి తురుము కూడా వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇది ఆపం పిండి ∙బాణలిలో నీటిని పోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి. రాత్రి గ్రైండ్ చేసి పెడితే ఉదయానికి పొంగుతుంది.ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో బాగా కలపాలి.మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి. అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసుకోవచ్చు.ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.ఈ ఆపం అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.నూనె వేయాల్సిన పని లేదు. ఆపం పెనం లేకపోతే దోశె పెనం (ఫ్లాట్గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు.పంజాబీ కడీ..కావలసినవి..– శనగపిండి మిశ్రమం కోసం: శనగపిండి– కప్పు;పెరుగు– 2 కప్పులు;నీరు– 4 కప్పులు;పసుపు– చిటికెడు.– కడీ కోసం: ఆవనూనె లేదా వేరుశనగ నూనె– టేబుల్ స్పూన్;పసుపు – అర టీ స్పూన్;ఇంగువ– పావు టీ స్పూన్;ఆవాలు – టీ స్పూన్;జీలకర్ర – టీ స్పూన్;మెంతులు – అర టీ స్పూన్;లవంగాలు – 3;ఎండుమిర్చి – 2;కరివేపాకు – 3 రెమ్మలు;ఉల్లిపాయ – 1 పెద్దది (తరగాలి);అల్లం– అంగుళం ముక్క (తరగాలి);వెల్లుల్లి– 4 రేకలు (తరగాలి);మిరపొ్పడి– అర టీ స్పూన్;ధనియాల పొడి –2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్;గరం మసాలా– అర టీ స్పూన్;ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు లేదా పచ్చి మామిడి గుజ్జు టేబుల్ స్పూన్;కసూరీ మేథీ (ఎండిన మెంతి ఆకుల పొడి)– 2 టీ స్పూన్.– తడ్కా కోసం: నూనె – టేబుల్ స్పూన్;ఎండుమిర్చి– 2;కశ్మీరీ మిర్చిపౌడర్– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– టేబుల్ స్పూన్తయారీ..ఒక పెద్ద పాత్రలో పెరుగు, శనగపిండి వేసి బాగా కలిసేటట్లు చిలకాలి. అందులో పసుపు వేసి, నీరు పోసి మళ్లీ చిలికి అరగంట సేపు పక్కన ఉంచాలి.స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి వేగనివ్వాలి.అవి వేగిన తర్వాత మిర్చిపౌడర్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి.ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి– పెరుగు మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించిన తర్వాత ఆమ్చూర్ పౌడర్, కసూరీ మేథీ, గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి.బాణలి పెట్టి నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, కశ్మీరీ మిర్చిపౌడర్ వేసి వేగిన తర్వాత ఉడికించిన కడీ మిశ్రమాన్ని పోసి చివరగా కొత్తిమీర చల్లితే పంజాబీ కడీ రెడీ.ఇది అన్నంలోకి బాగుంటుంది. పంజాబీ కడీలో నీరు ఎక్కువగా కలిపి పలుచగా చేసుకుని సూప్లా కూడా తాగుతారు.వర్షాకాలం, చలికాలం ఈ సూప్ తాగుతుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తేలిగ్గా, హాయిగా ఉంటుంది.జైసల్మీరీ చనే..కావలసినవి..ముడి శనగలు – కప్పు;నెయ్యి – టేబుల్ స్పూన్;ఇంగువ – చిటికెడు;జీలకర్ర– అర టీ స్పూన్;జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి – 2 టీ స్పూన్లు;మిరపొ్పడి – టేబుల్ స్పూన్;పసుపు– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పెరుగు– ఒకటిన్నర కప్పులు;శనగపిండి –3 టేబుల్ స్పూన్లు;కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..శనగలను శుభ్రంగా కడిగి ఆరింతలుగా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయం నీటిని వంపేసి మరోసారి కడిగి ప్రెషర్ కుకర్లో వేసి నాలుగు కప్పుల నీటిని పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.దించేసిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక వెడల్పు పాత్రలో శనగపిండి, పెరుగు, పసుపు, మిరపొ్పడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఇంగువ వేయాలి.జీలకర్ర చిటపట పేలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వేసి అడుగుపట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.ప్రెషర్కుకర్లో ఉడికించి సిద్ధంగా ఉంచిన శనగలను నీటితో సహా ఉడుకుతున్న శనగపిండి, పెరుగు మిశ్రమంలో వేసి కలిపి మరో ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ జైసల్మీరీ చనే కర్రీ రోటీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? -
వర్షాకాలంలో కిచెన్ క్లీన్గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వర్షాకాలం అనంగానే సీజనల్ వ్యాధులు పగబట్టినట్లుగా మనుషులపై దాడి చేస్తాయి. అందుకు ప్రధాన కారణం బ్యాక్టీరియా, వైరస్లే. వాతావరణంలోని తేమ కారణంగా సులభంగా బ్యాక్టీరియా, ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిచెన్లోని వస్తువులు పాడవ్వడం లేదా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కిచెన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచితే అంత ఆరోగ్యం ఉంటాం. నిత్యం మన ఉపయోగించే కిచెన్లోని వస్తువులు పాడవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సినవి సవివరంగా తెలుసుకుందామా..!వర్షాకాలంలో కిచెన్ని సురక్షితంగా ఉంచేలా పాటించాల్సినవి ఇవే..కిచెన్ చిమ్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్: వంటగదిలో సూర్యరశ్మి వచ్చేలా, తేమ చేరకుండా ఉండేలా చూసుకోమని చెబుతుంటారు పెద్దలు. కానీ వర్షాకాలంలో అలా అస్సలు కుదరదు. ఎండ అనేది పెద్దగా ఉండదు, పైగా వాతావరణంలోని తేమ కారణంగా కిచెన్ను పొడిగా ఉంచడం కాస్త ఇబ్బందే. అలాంటప్పుడూ కిచెన్కి ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను శుభ్రపరిచి ఆన్ చేసి ఉంచాలి. అలాగే వంటగది చిమ్నీ కూడా డెస్ట్ లేకుండా ఉంచుకుంటే తేమ చేరకుండా కాపాడుకోగలుగుతాం. కిచెన్ కూడా పొడిగా ఉంటుంది.అలాగే వంటగదిలో సరుకులు పాడవ్వకూడదంటే గాలి చొరబడిన క్లోజ్డ్ కంటైనర్లలో భద్రపరుచుకోండి. సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులను తేమ, బ్యాక్టీరియా చేరకుండా ఉండేలా గాలి చొరబడిని గాజు పాత్రలో ఉంచాలి. ఇక వంటగదిలో పంచదార, కొన్ని రకాలు పొడులు అవి పాడ్వకుండా ఉండేందుకు వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులతో సమస్యను నివారించండి. దాల్చిన చెక్క, లవంగాలు వంటి వాటిని నిల్వ ఉంచే పొడులకు చేర్చితే పాడవ్వకుండా ఉంటాయి. సింక్ పైపులను శుభ్రంగా ఉంచండి: వంటగదిలోని సింక్పైపులు చక్కగా ఉండేలా చూడండి. ఎలాంటి లీక్లు లేవనేది నిర్థారించుకోండి. దీనివల్ల దోమలు, ఈగలు రాకుండా కాపాడుకోగలుగతాం. ఈ సీజన్ ప్రారంభమయ్యే ముందే ఈ జాగ్రత్తలను తప్పనసరి తీసుకోవాలి. అలాగే కాలానుగుణ పండ్లను, కూరగాయలను తీసుకోండి. వాటిని తాజాగా నిల్వ ఉంచుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!) -
ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి..
ఇంట్లోని ఇలాంటి చిన్న చిన్న వస్తువులను మన్నికగా, శుభ్రంగా ఉంచడంలో ఇబ్బంది పడుతున్నరా!? అయితే ఈ సూపర్ కిచెన్ టిప్స్ మీకోసమే.బట్టల మీద పడిన ఇంక్ మరకలు పోవాలంటే.. ఇంక్ మరకలపై కొద్దిగా నీళ్లు చల్లాలి. ఇప్పుడు టూత్ పేస్టును అప్లై చేసి బ్రష్తో రుద్ది నీటితో వాష్ చేస్తే ఇంక్ మరకలు ఇట్టే పోతాయి.మినరల్ వాటర్ క్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, టీస్పూను బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ రసం, కొద్ది గోరువెచ్చని నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తరువాత క్యాన్ను పైకీ కిందకు బాగా గిలకొట్టాలి. పది నిమిషాలపాటు ఇలా గిలకొట్టి రెండుమూడుసార్లు నీటితో కడగాలి. తరువాత డిష్ వాష్ లిక్విడ్తో వాటర్ క్యాన్ బయటవైపు తోముకుంటే క్యాన్ మురికి వదిలి కొత్తదానిలా మెరుస్తుంది.స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీ స్పూను డిష్ వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములూ దరిచేరవు. దీనిలో ఎటువంటి రసాయనాలు లేవు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే.ఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
లైఫ్లో మర్చిపోలేని వంటింటి చిట్కాలివిగో!
వంట చేసేటపుడు వంటకు చక్కటి రుచి రావాలన్నా, వంటను సులభంగా పూర్తి చేయాలన్నా, వంట ఇంట్లో పనులను ఈజీగా చక్కబెట్టుకోవాలన్నా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కచ్చితంగా తెలియాలి. అలాంటి వాటిల్లో కొన్నింటిని ఇక్కడ చూద్దాం! బెండకాయలు ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండాలంటే వాటి చివర్లను కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిజ్లో పెట్టాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు బియ్యంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం పువ్వులా ఉడుకుతుంది.యాలకుల తొడిమలను పొడి చేసి టీ చేసేటప్పుడు చక్కెరతోపాటు అందులో వేయాలి. టీ రుచి అద్భుతంగా, సువాసనగా ఉంటుంది.పూరీలు తెల్లగా రావాలంటే వేయించేటప్పుడు నూనెలో కొన్ని జామ ఆకులు వేయాలి.అప్పడాలు ఎక్కువ నూనె పీల్చకూడదు అనుకుంటే వేయించే ముందు కాసేపు ఎండలో పెట్టాలి.పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్కలు అందులో వేయండి.బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలోఉంచితే తొందరగా మెత్తబడవు. కూరగాయల్ని, లేదా ఆకుకూరల్ని తరిగే ముందు ఉప్పు, పసుపు వేసిన నీటిలో కడిగితే క్రిములు పైకి తేలతాయ. అపుడు సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.కారంపొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే తొందరగా పురుగుపట్టదు.నెయ్యి కాచేటపుడు రెండు లవంగాలుగానీ, తమలపాకు గానీ వేస్తేమంచి వాసన వస్తుంది. పాలు గడ్డగా తోడుకోవాలంటే.. పాలు బాగా మరిగించి, కాస్త వేడిగా ఉండగానే మజ్జిగ లేదా ఉండలులేని పెరుగు వేసి బాగా కలపాలి.అల్లం వెల్లుటి పేస్ట్ తయారు చేసేటపుడు, అల్లం, వెల్లుల్లి పొట్టు తొందరగారావాలంటే నీళ్లలో నానబెడితే మంచిది.ఇడ్లీ, దోసె పిండి, ఎక్కువ రోజులుతాజాగా ఉండాలంటే..పైన రెండు తమలపాకులు వేయండి. -
మొబైల్లో ఆర్డర్చేసి కిచెన్లోకి వెళితే వంట రెడీ!
వై-ఫైతో అనుసంధానమయ్యే గ్యాడ్జెట్లు మన హాల్ నుంచి తిన్నగా వంట గదిలోకి ప్రవేశిస్తున్నాయి. ఎలాగంటారా.. కిచెన్లోనూ స్మార్ట్ పరికరాల సంఖ్య పెరుగుతోంది. హాల్లో ఎక్కువగా స్మార్ట్ టీవీ, స్మార్ట్ హోం థియేటర్, స్మార్ట్ ఫ్యాన్, సెన్సార్ డోర్లు.. వంటి పరికరాలు వాడుతుంటాం. మరి కిచెన్లోనూ వై-ఫైతో అనుసంధానమయ్యే ఏఐ పరికరాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కరెంట్ లేకపోయినా ఇండక్షన్ కుకర్ పనిచేస్తే.. మనకేం కావాలో మొబైల్లో ఆర్డర్ పెట్టి కిచెన్లోకి వెళితే వంట సిద్ధంగా ఉంటే.. మైక్రోఓవెన్లో పెట్టే పదార్థాలు ఎంత సమయంలో వేడి అవుతాయో ముందుగానే తెలిస్తే.. ఊహించుకుంటేనే ఆహా అనిపిస్తుంది కదా. ఇటీవల సీయాటెల్లో జరిగిన స్మార్ట్ కిచెన్ సమ్మిట్(ఎస్కేఎస్)లో కంపెనీలు ఇలాంటి పరికరాలనే ప్రదర్శించాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.మొబైల్లో ఆర్డర్పెట్టి కిచెన్లోకి వెళితే..స్మార్ట్ కిచెన్ సమ్మిట్లో చెఫీ అనే కంపెనీ కొత్తరకం పరికరాన్ని పరిచయం చేసింది. కంపెనీకు చెందిన యాప్లో మనకు కావాల్సిన వంటను ఆర్డర్పెట్టి కాసేపయ్యాక కిచెన్లోకి వెళితే ఆ వంట సిద్ధంగా ఉంటుంది. ఎలాగంటారా.. కిచెన్లో వంటచేసే స్మార్ట్ పరికరాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో వంటకు కావాల్సిన కూరగాయలు, పప్పులు, ఇతర ధాన్యాలు, బియ్యం..వంటివాటిని ఏర్పాటుచేసుకోవాలి. ట్రేల్లో వాటికి కేటాయించిన ప్రత్యేక సెటప్లో పెట్టుకోవాలి. కిచెన్లోని పరికరం వై-ఫైకు అనుసంధానమై ఉంటుంది. దాంతో యాప్ ద్వారా మనకు కావాల్సిన పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే అందుకు తగ్గట్టుగా ముందే ఉంచిన ట్రేల్లోని ముడి పదార్థాలను ఉపయోగించుకుని వంట సిద్ధం చేస్తుంది. ఈమేరకు కంపెనీ ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Chefee Robotics (@chefeerobotics)బ్యాటరీతో పనిచేసే ఇండక్షన్ కుకర్ఇంపల్స్ ల్యాబ్స్ తయారుచేసిన ఇండక్షన్ కుక్టాప్ కరెంట్ లేకపోయినా పనిచేస్తుంది. ముందుగా వినియోగించినపుడు విద్యుత్ ద్వారా కుకర్లో ఉండే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. కరెంటులేని సమయంలో తిరిగి ఆ బ్యాటరీల ద్వారా కుకుర్ను వేడిచేసి వంట చేసుకునే వీలుంటుంది.ముందే సమయాన్ని చెప్పే థర్మామీటర్మైక్రోఓవెన్లో ఏదైనా పదార్థాన్ని వేడి చేయాలనుకున్నప్పుడు కంబషన్ కంపెనీ తయారుచేసిన థర్మామీటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా మనం వేడి చేయాలనుకున్న ఆహారంపై థర్మామీటర్ ఉంచాలి. అందులోని ఎనిమిది సెన్సార్లు అది ఎలాంటి పదార్థమే గుర్తించి తినడానికి అనువుగా వేడి అవ్వాలంటే ఎంతసమయం పడుతుందో తెలియజేస్తుంది.ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’స్మార్ట్ కిచెన్ సమ్మిట్లో కలినరీ టెక్నాలజిస్ట్ స్కాట్ హెమెండెంగర్ మాట్లాడుతూ..‘ఈ సమ్మిట్లో ఎన్నో అద్భుతమైన ప్రాడక్ట్స్ ప్రదర్శించారు. ఇవన్నీ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే మన కిచెన్లు స్మార్ట్గామారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Wife అయితే గరిటెను ఎలా అయినా వాడుతుంది. కానీ Wi-Fi మాత్రం గరిటెను స్మార్ట్ కిచెన్ కోసమే వాడుతుంది’ అన్నారు. -
కిచెన్ని కళాత్మకంగా సర్దుకోండిలా..!
వంటిల్లు అంటే నూనె జిడ్డు, మాడు వాసన కాదు. వంటిల్లు అంటే.. సమతూకంలో ఉడికే దినుసుల కమ్మదనం, ఆరోగ్యాన్ని వడ్డించే నైపుణ్యం! మనసుండాలే కానీ కిచెన్కూ కళాత్మకతతో పోపు పెట్టొచ్చు ఇలా..ఇండిపెండెంట్ ఇంట్లో సరే.. అపార్ట్మెంట్లలోనూ కిచెన్కి బాల్కనీ ఉంటుంది చిన్నదో పెద్దదో! ఇందులో తులసి సరే.. కొత్తిమీర, మెంతి, పుదీనా, పాలకూర, బచ్చలి వంటివి వేసి.. దీన్ని హెర్బల్ గార్డెన్గా మలచుకోవచ్చు. తాజా ఆకు కూరలతో ఆరోగ్యమే కాదు.. పచ్చదనంతో మనసూ మురుస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్తో వంటిల్లూ మెరుస్తుంది. కాస్తోకూస్తో ఖర్చూ కలిసొస్తుంది. అందమైన పాత్రలు ఇప్పుడు మళ్లీ రాగి, ఇత్తడి పాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. యాంటిక్ డిజైన్లో దొరికే ఆ పాత్రలతో అరలను సర్దితే.. రాజసం ఉట్టిపడుతుంది వంటిల్లు. పింగాణీ పాత్రలతో దీనికి టచప్ ఇవ్వొచ్చు. ఫుడ్ థీమ్ ఆర్ట్కిచెన్ వాల్స్ని షెల్వ్స్తో నింపేయకుండా.. ఒక్క చోటనైనా ఖాళీగా ఉంచాలి. దాన్ని నచ్చిన వంటకాలు లేదా నట్స్.. లేదా ఫ్రూట్స్.. వెజిటబుల్స్ పెయింటింగ్స్తో అలంకరించాలి. కుక్ బుక్స్వంటింట్లో వంట సామాగ్రికే కాదు వంటకు సంబంధించిన పుస్తకాలకూ స్పేస్ ఇవ్వొచ్చు. స్థానిక సంప్రదాయ వంటల పుస్తకాల నుంచి వరల్డ్ ఫేమస్ షెఫ్లు రాసిన కుక్ బుక్స్ దాకా అన్నిటినీ ర్యాక్స్లో పేర్చుకుంటే.. కిచెన్కి ఇంటలెక్చువల్ లుక్ వస్తుంది. వెరైటీ వంటకాల పట్ల మనకు ఇంట్రెస్టూ పెరుగుతుంది. తెలుసు కదా.. కుకింగ్ అనేది ఆర్టే కాదు.. స్ట్రెస్ బస్టర్ కూడా! వంటలకు రుచెంతో.. అలంకరణకు అభిరుచీ అంతే! సో.. టేస్ట్కి తగ్గట్టు సర్దుకోండిక!.(చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్మ్యాన్..) -
కిచెన్ని క్లీన్గా ఉంచడంలో టూత్పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!
టూత్పేస్ట్ దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు. మన కిచెన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతుంది. ముఖ్యంగా స్టీల్ సింక్లు, ట్యాప్లు, ఎంత ఘోరంగా ఉంటాయో తెలిసిందే. అలాంటి వాటిపై ఉండే మొండి మరకలను క్లీన్ చేయడంలో టూత్పేస్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎలా ఈ టూత్ పేస్ట్ మన కిచెన్లో ఉన్న వస్తువులను క్లీన్గా ఉంచుతుందో సవివరంగా తెలుసుకుందాం.! మన ఇంట్లో వేస్ట్గా మిగిలిపోయిన పాత పేస్ట్లు వస్తువులను శుభ్రం చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నీటిలోని ఫ్లోరైడ్ కారణంగా కొన్ని రకాల స్టీల్ వస్తువులపై తెల్లటి మరకలు ఉండిపోతాయి. అవి ఓ పట్టాన పోవు. అలాంటి వాటిని వదలగొట్టడంలో టూత్పేస్ట్ అద్భతంగా పనిచేస్తుంది. అలాంటి వాటిని క్లీన్ చేయడంలో ఎలా సహకరిస్తుందంటే..స్టెయిన్లెస్ స్టీల్ సింక్లు..వంటగదిలోని సింక్ మిలమిల మెరుస్తు కాంతిగా ఉండాలంటే టూత్పేస్ట్ని ఉపయోగించటం మంచిది. దానిపై పడు గీతలు, ఒక విధమైన తెల్లటి మరకలను వదలగొట్టడంలో టూత్ పేస్ట్ భలే పనిచేస్తుంది. స్పాంజ్ సాయంతో కాస్త ప్రెజర్ ఉపయోగించి క్లీన్ చేస్తే సులభంగా మరకలు, గీతలు వదిలిపోతాయి. కుళాయిలు..నీటి కుళాయిలపై ఉండు మచ్చలు, మరకులతో కాస్త అసహ్యంగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని టూత్పేస్ట్ని పూసి క్లాత్తో క్లీన్ చేస్తే చక్కగా మెరుస్తూ అందంగా ఉంటుంది. గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్లు..గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్ టాప్లపై మరకలు, వండిన పదార్థాల అవశేషాలను నీటిగా వదలించడంలో టూత్పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మగ్స్పై కాఫీ, టీ మరకలు..కొన్ని రకాల టీ కప్పుల్లో కాఫీ, టీ మరకలు ఓ పట్టాన వదలవు. అలాంటప్పడు టూత్పేస్ట్ని ఉపయోగిస్తే నీటిగా వదిలిపోతాయి. కటింగ్ బోర్డ్..కూరగాయలు కోసే కటింగ్ బోర్డ్లు వివిధ రకాల ఆహార పదార్థాల వాసనలతో, మరకలతో ఉంటాయి. వాటిని టూత్పేస్ట్తో శ్రభం చేస్తే చూడటానికి అందంగానే గాకుండా మంచి సువాసనతో ఉంటుంది. టూత్పేస్ట్ల్ ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, రాపిడి వాసనలను తొలగించి ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..) -
చూడడానికి పాములా భయపెడుతుంది.. కానీ చల్లగా కాపాడుతుంది..
పొట్లకాయ.. స్నేక్గార్డ్. చూడడానికి పాములా భయపెడుతుంది. కానీ.. ధైర్యంగా నమిలి మింగేస్తే సరి. పొట్టలోకి వెళ్లి చల్లగా కాపాడుతుంది. సమ్మర్ గార్డ్ ఫ్యామిలీలో ఇదీ ఒకటి. పొట్టను కాపాడే కాయ.. పొట్లకాయ. వేడి నుంచి రక్షించే.. కూరగాయ ఇది. దీనినే ఎన్నో రకాలుగా వండవచ్చు. ఎంతో రుచిగా మార్చవచ్చు. అలాగే పచ్చడి చేసి నిల్వ చేయవచ్చు కూడా. మరి ఈ పొట్లకాయ రుచుల తీరేంటో తెలుసుకుందాం.. పొట్లకాయ పెసరపప్పు.. కావలసినవి.. పొట్లకాయ ముక్కలు– 2 కప్పులు; పెసరపప్పు – అర కప్పు ; కొబ్బరి తురుము – అర కప్పు ; ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – 2 టీ స్పూన్లు ; ఎండుమిర్చి – 2 ; కరివేపాకు – 2 రెమ్మలు ; ఇంగువ– పావు టీ స్పూన్ ; నూనె లేదా నెయ్యి – టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; చక్కెర – టీ స్పూన్. తయారీ.. బంగాళాదుంపను శుభ్రం చేసి నిలువుగా కోసి గింజలను తొలగించిన తర్వాత ముక్కలు చేయాలి. పెసరపప్పు కడిగి పక్కన పెట్టాలి. పాత్రలో రెండు కప్పుల నీటిని పోసి మరిగేటప్పుడు పొట్లకాయ ముక్కలు, పెసరపప్పు వేసి ఉడికించాలి. పప్పు ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత ఉప్పు కలిపి పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ముక్కలు ఉడకడానికి నీరు సరిపోకపోతే మరికొంత నీటిని చిలకరించి ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. మినప్పప్పు వేగిన తర్వాత చక్కెర, ఉడికించి సిద్ధంగా ఉంచిన పొట్లకాయ – పెసరపప్పును వేసి కలపాలి. తేమ ఆవిరి అయ్యే వరకు కలియబెడుతూ వేయించి చివరగా కొబ్బరి తురుము వేసి కలపాలి. కొబ్బరి రుచి కూరగాయ ముక్కలకు పట్టడం కోసం ఓ నిమిషం పాటు గరిటెతో కలియబెడుతూ వేయించి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గే కొద్దీ కూర రుచి ఇనుమడిస్తుంది. ఇది సాంబార్, రసం అన్నంలోకి సైడ్ డిష్గా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పెసరపప్పు, పొట్లకాయ పొరిచ్చ కొళంబు పొట్లకాయ పొరిచ్చ కొళంబు.. కావలసినవి: కందిపప్పు – అరకప్పు; పొట్లకాయ ముక్కలు – 3 కప్పులు ; సాంబారు పొడి – టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మకాయ రసం – ఒక టేబుల్ స్పూన్. పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్లు; పచ్చి శనగపప్పు – 2 టీ స్పూన్లు ; ఎండుమిర్చి – 2; మినపప్పు– టీ స్పూన్ ; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు ; ఇంగువ – చిటికెడు ; నూనె – టీ స్పూన్. పోపు కోసం: నూనె – టీ స్పూన్ ;ఆవాలు – టీ స్పూన్ ; మినప్పప్పు – టీ స్పూన్ ; కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ.. కందిపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుకర్లో వేసి తగినంత నీటిని పోసి ఉడికించి పక్కన ఉంచాలి. పొడి కోసం తీసుకున్న దినుసులను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. పొట్లకాయను శుభ్రంగా కడిగి తరిగి గింజలు తొలగించి ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఒక పాత్రలో ఉప్పు, సాంబారు, పొట్లకాయ ముక్కలు వేయాలి. ముక్కలు మునిగేటట్లు నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన కందిపప్పు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో ఉడికించిన పొట్లకాయ ముక్కలను, మసాలా పొడి వేసి నీరు పోసి కలిపి ఉడికించాలి. పప్పు, కూరగాయ ముక్కలు, మసాలా పొడి అన్నింటి రుచి కలిసే వరకు ఉడికించి, నిమ్మరసం కలిపి దించేయాలి. రుచి చూసి అవసరమైతే ఉప్పు, నిమ్మరసం మరికొంత చేర్చుకోవచ్చు పోపు కోసం మందపాటి పాత్ర తీసుకోవాలి. పాత్రలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత మినప్పప్పు వేయించి కరివేపాకు వేసి ముందుగా ఉడికించి సిద్ధంగా ఉంచిన కందిపప్పు కూరగాయ ముక్కల మిశ్రమాన్ని పోసి కలిపి దించేయాలి. ఘుమఘుమలాడే పొట్లకాయ పొరిచ్చ కొళంబు రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది. పొట్లకాయ పచ్చడి కావలసినవి: పొట్లకాయ ముక్కలు – కప్పు; ఎండుమిర్చి –3 ; మినప్పప్పు – టేబుల్ స్పూన్ ; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్ ; వేరు శనగపప్పు లేదా నువ్వులు లేదా కొబ్బరి తురుము – పావు కప్పు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి లేదా నూనె – టేబుల్ స్పూన్; చింతపండు– అంగుళం ముక్క ; బెల్లం పొడి– టీ స్పూన్ (ఇష్టమైతేనే). పోపు కోసం: నూనె– టేబుల్ స్పూన్ ; ఆవాలు– టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్ ; ఎండుమిర్చి– ఒకటి; ఇంగువ– చిటికెడు ; కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ.. మందపాటి బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి మినప్పప్పు, పచ్చి శనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చిని దోరగా వేయించి మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. అదే బాణలిలో పొట్లకాయ ముక్కలను వేసి పచ్చిదనం తగ్గేవరకు వేడి చేసి ఆపేయాలి. చల్లారిన తరవాత మిక్సీలో గ్రైండ్ చేయాలి, అందులోనే చింతపండు, బెల్లం, ఉప్పు కలిపి మరో రౌండ్ తిప్పాలి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసి మరొక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేసి వేగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి పచ్కడిలో వేసి కలపాలి. ఇది అన్నంలోకి ఇడ్లీ, దోసెల్లోకి కూడా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పచ్చడి, పొట్లకాయ వేపుడుకూర పొట్లకాయ వేపుడుకూర.. కావలసినవి: పొట్లకాయ ముక్కలు – పావుకేజీ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; జీలకర్ర– టీ స్పూన్ ; పసుపు– పావు టీ స్పూన్ ; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; ఇంగువ– చిటికెడు ; కారం – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నెయ్యి– టేబుల్ స్పూన్ ; నీరు– పావు కప్పు ; వేరుశనగ పప్పుల పొడి లేదా శనగపిండి– టేబుల్ స్పూన్. తయారీ.. బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ధనియాలపొడి, కారం పొడి, పసుపు, ఇంగువ వేసి కలపాలి. పచ్చిదనం పోయిన తర్వాత ఇందులో ఉప్పువేసి, కొద్దిగా నీటిని పోసి కలపాలి. మసాలా పొడులన్నీ సమంగా కలుస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బాణలిలో పొట్లకాయ ముక్కలు వేసి మసాలా సమంగా పట్టేటట్లు కలపాలి. ముక్కలకు మసాలా సమంగా పట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ముక్కల్లో నీటిని పోసి కలిపి మంట తగ్గించి మూత పెట్టాలి. రెండు నిమిషాలకోసారి మూత తీసి గరిటెతో ముక్కలను కలిపి మళ్లీ మూత పెడుతుండాలి. పది నిమిషాలకు ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. ముక్కలు ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించి మళ్లీ మూత పెట్టి ఉడికించాలి. చివరగా వేరుశనగపప్పు పొడి లేదా శనగపిండి చల్లి బాగా కలిపి దించేయాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి రుచిగా ఉంటుంది. ఇవి చదవండి: Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..? -
యాక్టర్ ఆలీ చేతులమీదగా అతియాస్ కిచెన్ గొప్ప ప్రారంభం (ఫొటోలు)
-
'ఇఫ్తార్' విందుకై.. ఇంట్లోనే సులువుగా చేయండిలా..
పగలంతా రోజాతో అల్లా ధ్యానం. రాత్రికి ఇఫ్తార్తో ఆరోగ్యధ్యానం. నీరసించిన దేహానికి శక్తి కావాలి. ఆ శక్తి దేహానికి తక్షణం అందాలి. ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. గార్నిషింగ్తో పదార్థం రుచి పెరగాలి. రుచి.. ఆరోగ్యానికి మేళవింపు కావాలి. ఇఫ్తార్ కోసం పొరుగు దేశాలు ఏం వండుతున్నాయి? దహీ చికెన్ను బ్రెడ్లో పార్సిల్ చేశాయి. నాలుగు పప్పులు.. రెండు ధాన్యాలు.. కలిపి హలీమ్ వండుతున్నాయి. అచ్చం మనలాగే. చికెన్ బ్రెడ్ పార్సిల్.. కావలసినవి: చికెన్ బోన్లెస్ – 200 గ్రా. మారినేషన్ కోసం.. మిరియాల పొడి – టీ స్పూన్; మిరపొ్పడి – టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్; వెనిగర్ – టేబుల్ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; తందూరీ మసాలా పొడి – టేబుల్ స్పూన్; పెరుగు– అర కప్పు. పోపు కోసం.. నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు. పార్సిల్ కోసం.. మిల్క్ బ్రెడ్ – 10 స్లయిస్లు; మైదా – టేబుల్ స్పూన్; కోడిగుడ్లు – 2; లెట్యూస్ – నాలుగు ఆకులు (క్యాబేజ్ని పోలి ఉంటుంది); నూనె – వేయించడానికి తగినంత. తయారీ.. చికెన్ను శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పాత్రలో వేసి మారినేషన్ కోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేసి సమంగా కలిసే వరకు కలిపి (మారినేషన్) అరగంట సేపు కదిలించకుండా పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి. మూత తీసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొంత సేపు చిన్న మంట మీద ఉంచాలి. ఉప్పు కూడా సరి చూసుకుని అవసరాన్ని బట్టి మరికొంత వేసుకోవచ్చు. చికెన్ ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి రెండు నిమిషాల సేపు (తేమ పోయే వరకు) వేయించి స్టవ్ ఆపేయాలి ఒక కప్పులో మైదా పిండి తీసుకుని తగినంత నీటితో గరిట జారుడుగా కలుపుకోవాలి కోడిగుడ్లను పగుల గొట్టి ఒక పాత్రలో వేసి, అందులో మిరియాల పొడి వేసి చిలికి సిద్ధంగా ఉంచుకోవాలి బ్రెడ్ స్లయిస్ల అంచులు చాకుతో కట్ చేసి తీసేయాలి. బ్రెడ్ను అప్పడాల కర్రతో వత్తాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ పొడి పొడిగా రాలిపోకుండా చికెన్ స్టఫ్ పెట్టి నూనెలో వేయించడానికి అనువుగా మారుతుంది. ఇలా చేసుకున్న బ్రెడ్ స్లయిస్లో ఒక స్పూన్ చికెన్ స్టఫ్ పెట్టి, కర్రీ బయటకు రాకుండా బ్రెడ్ అంచులకు మైదా పిండి ద్రవం రాసి అతికించాలి. నలుచదరంగా ఉండే బ్రెడ్ స్లయిస్ సాండ్విచ్లాగ త్రిభుజాకారపు పార్సిల్ తయారవుతుంది. ఇలా అన్నింటినీ చేసుకుని పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ పార్సిల్ను కోడిగుడ్డు సొనలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీసి టిష్యూ పేపర్ మీద వేయాలి. నూనె వదిలిన తరవాత ఈ బ్రెడ్ పార్సిళ్లను, టొమాటో కెచప్, లెట్యూస్తో కలిపి సర్వ్ చేయాలి. చికెన్ హలీమ్.. కావలసినవి: ఎర్ర కందిపప్పు – టేబుల్ స్పూన్; బాసుమతి బియ్యం– టేబుల్ స్పూన్; గోధుమలు– టేబుల్ స్పూన్; బార్లీ– టేబుల్ స్పూన్; కందిపప్పు– టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు– టేబుల్ స్పూన్; అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్లు– ఒక్కొక్కటి టేబుల్ స్పూన్; చికెన్ (బోన్లెస్)– పావు కేజీ; చికెన్ స్టాక్ – అరకప్పు; హలీమ్ మసాలా పొడి– టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – కప్పు; మిరప్పొడి – అర టీ స్పూన్; పసుపు– అర టీ స్పూన్; పెరుగు – అర కప్పు; ఉప్పు – అర టీ స్పూన్. పోపు కోసం.. నెయ్యి– అర కప్పు; జీలకర్ర– టీ స్పూన్; వెల్లుల్లి– 10 రేకలు; పుదీన ఆకులు – టేబుల్ స్పూన్. గార్నిషింగ్ కోసం.. జీడిపప్పు – పావు కప్పు; నిమ్మకాయ– ఒకటి (పలుచగా తరగాలి); అల్లం తరుగు– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – కప్పు. తయారీ.. బియ్యం, కందిపప్పులు, పచ్చి శనగపప్పు, బార్లీ, గోధుమలను ఒక పెద్ద పాత్రలో వేసి శుభ్రంగా కడిగి, మూడింతలు మంచి నీటిని పోసి పది నిమిషాలసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్టులు వేసి కలిపి, పప్పులు, ధాన్యాలు మెత్తబడే వరకు ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత వీటిని మెత్తగా మెదపాలి. గింజలు ఉడికేలోపు బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి తీసి పక్కన సిద్ధంగా ఉంచుకోవాలి చికెన్ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి అందులో హలీమ్ మసాలా పొడి, మిరప్పొడి, పసుపు, ఉప్పు, పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, చికెన్ స్టాక్ను (చికెన్ స్టాక్ లేకపోతే మంచి నీటిని పోయాలి) వేసి ఉడికించాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత అందులోని నీటిని పప్పులు, ధాన్యాలు ఉడికించిన మిశ్రమంలోకి వంపి చికెన్ ముక్కలను మాత్రమే పాత్రలో ఉంచి ఆ ముక్కలను మెదపాలి. మెదిపిన చికెన్ను కూడా ధాన్యాలు, పప్పులు ఉడికించిన మిశ్రమంలో వేసి కలిపి మంట తగ్గించి అన్నింటి రుచి కలవడం కోసం మళ్లీ ఉడికించాలి ఉల్లిపాయ ముక్కలు వేయించిన బాణలిలో మిగిలిన నేతిలో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పుదీన వేసి అర నిమిషం పాటు వేయించి ఈ పోపును చిన్నమంట మీద ఉడుకుతున్న చికెన్, పప్పులు, ధాన్యాల మిశ్రమంలో వేసి కలిపితే హలీమ్ రెడీ గార్నిష్ చేయడానికి ఒక పాత్రలో కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, జీడిపప్పులు, ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పులో వేడి వేడి హలీమ్ వేసి పై గార్నిష్ కోసం సిద్ధం చేసిన మిశ్రమాన్ని కొద్దిగా చల్లి, నిమ్మకాయ ముక్క పెట్టి సర్వ్ చేయాలి. ఇవి చదవండి: కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి! -
ఇంగువతో ఇన్ని లాభాలా? బరువును తగ్గించే మ్యాజిక్ డ్రింక్
అసాఫెటిడా, హింగ్ లేదా ఇంగువగా ప్రసిద్ధి చెందింది. రుచి , ఘాటైన వాసనతో ఉండే భారతీయ వంటకాల్లో వాడే కీలకమైన సుగంధ ద్రవ్యం. పూర్వకాలం నుంచే భారతీయులు సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంగువను ప్రతిరోజు వంటకాలలో ఉపయోగిస్తే శరీరానికి మంచిదని ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు గురించి తెలుసుకుందాం. సాంబారు, పప్పు, పులుసుకూరలు, పచ్చడి తాలింపులలో మాత్రమే వాడుతారు అనుకుంటే పొరపాటే. మంచి వాసన, రుచితోపాటు, ఇంగువ అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఇంగువ ఆరోగ్య ప్రయోజనాలు బరువు తగ్గడానికిమ్యాజిక్ డ్రింక్: ఇంగువ నీరు తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇంగువలో ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంగువ నీరు మ్యాజిక్లా పనిచేస్తుందని చెబుతారు. ♦జీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు వంటి కడుపు రుగ్మతల నివారణలో ఉపయోగపడుతుంది. కడుపు పూత,కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడేవారు ఇంగువ వాడి, దీన్ని అధిగమించవచ్చు. ఛాతీపై పూయడం వల్ల ఆస్తమా, కోరింత దగ్గు, ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ యాంటీవైరల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది ఉబ్బసం, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. ♦ ఇంగువ సహజ యాంటిడిప్రెసెంట్.ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్తో బాధపడేవారికి ఇంగువ మంచి మందు. ♦లైంగిక సమస్యలకు: నపుంసకత్వ సమస్యలలో బాధపడుతున్న పురుషులకు ఇది బాగా సహాయపడుతుంది. అకాల స్కలన సమస్యకు కూడా బాగా పనిచేస్తుందని అని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ,పురుషుల్లో లైంగిక వాంఛను గణనీయంగా పెంచుతుందట కేన్సర్ ప్రమాదం: కేన్సర్ కణితి, పరిమాణాన్ని తగ్గించడంలో ఇంగువ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. కేన్సర్ వ్యాప్తిని అరికడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కేన్సర్ కణాలతో పోరాడుతాయి. ♦ఊపిరితిత్తులు, కాలేయం ,మూత్రపిండాలలో మెటాస్టాసిస్ నివారణలో పనిచేస్తుంది. మెదడులోని రక్త నాళాలలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయ పడుతుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. ♦ యాంటీ ఏజింగ్: చర్మం ముడతలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు ముఖంపై ముడతలను కూడా తొలగిస్తుంది. ఇందులోని టైరోసిన్ నిస్తేజమైన చర్మానికి మెరుపునిస్తుంది. ♦ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది కీళ్ల నొప్పి, వాపు తగ్గించే అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,రిలాక్సింగ్ లక్షణాలను కలిగి ఇంగులో ఉన్నాయి. ♦ పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరితో బాధపడుతుంటే ఇంగువ దివ్యవౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు బహిష్టు సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు ఇతర సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ♦ పంటి నొప్పికి కూడా ఇంగువ మంచి ఫలితాలనిస్తుంది.ఇంగువలో నొప్పి నివారణ గుణాలు అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి. -
వంట దినుసులే కదా అని తేలిగ్గా తీసుకోకండి!
మన వంట గదే ఔషధాల నిలయం. మనకు తెలియకుండానే మన పూర్వీకులు, పెద్ద వాళ్లు అలవాటు చేసిన, చెప్పిన పద్దతుల ద్వారా కొన్ని ఆరోగ్యకరమైన దినుసులు, మసాలాలను వాడుతుంటాం. ముఖ్యంగా పసుపు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇలా ప్రతిదీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే! ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు, వాడాల్సిన పద్దతిలో వీటిని వాడితే అదనపు రుచిని అందిస్తాయి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. పసుపు: అనేక యాంటి బయోటిక్ గుణాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రతీ కూరలోనూ చిటికెడు పసుపు వేయడం మన భారతీయులకు అలవాటు. పసుపులో ఉండే కర్కుమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి నుంచి కాపాడుతుంది. జలుబు చేసినపుడు పసుపు ఆవిరిపట్టడం, పసుపు,పాలు తాగడం, గాయాలకు పూయడం లాంటివి కూడా మంచిదే. అల్లం: రోజువారీ వినియోగంలో అల్లం పాత్ర చాలా పెద్దదే. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం శ్వాసకోశ మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. శ్లేష్మం తగ్గించడంలో సాయపడుతుంది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లంతో శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్లా చేసుకుని తాగినా మంచిదే. వెల్లుల్లి: వెల్లుల్లి వంటలకు రుచి, వాసనను అందిచడమే కాకుండా జీర్ణ ప్రక్రియను సులభ తరం చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే,జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు శరీర బరువు కూడా తగ్గించేందుకు దోహద పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీలు వ్యాధులకు నివారణలో పని చేస్తాయి. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అలోసిన్-సల్ఫర్ సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఒరేగానో: వంటకాల్లో ఉపయోగించే ఒరేగానో హెర్బ్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వాపు, క్షయవ్యాధి నివారణకు సహాయపడుతుంది. రుమాటిజం, తిమ్మిరి, మైగ్రేన్లు, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, కామెర్లు , వంటి ఇతర కాలేయ వ్యాధులకు ఒరేగానోను ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు మొదలైన బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సాయపడుతుంది. -
మన దేశంలోని టాప్ మహిళా చెఫ్లు వీరే!
ఇంతవరకు రెస్టారెంట్లో పురుషులే చెఫ్లుగా రాణించడం గురించి విన్నాం. అదీగాక మన పురాణాల్లో కూడా నల భీములు పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి కథలుగా విన్నాం. అందుకు తగ్గట్టుగానే పురుష చెఫ్లు ఈ రంగంలో సత్తా చాటారు, వారే ఈ రంగంలో మహారాజుల్లా ఏలుతున్నారు. అలాగే టీవీ షోల్లో కూడా ప్రముఖ రెస్టారెంట్ చెఫ్లు సంజయ్ కపూర్ వంటి దిగ్గజ చెఫ్లను చూశాం. అయితే ఇదే రంగంలో సత్తా చాటుతున్న టాప్ మహిళా చెఫ్లు ఉన్నారు. అంతేగాదు వాళ్లే రెస్టారెంట్లను స్వయంగా నిర్వహించి కిచెన్ క్వీన్స్లా రాణిస్తున్నారు. ఆ టాప్ మహిళా చెఫ్లు ఎవరంటే..? గరీమా ఆరోరా ఉత్తర భారతదేశానికి చెందిన ఈమె మనదేశంలో టాప్ -10 ఫీ మేల్ చెఫ్ లలో ఒకరు.. బ్యాంకాక్ లో 'గాతో' అనే పేరుతో ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది సూపర్ సక్సెస్ కావడంతో మిచెలి స్టార్ పేరుతో మరో రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది. ఈమెకు పాక శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే రెస్టారెంట్ల వ్యాపారంలో శరవేగంగా దూసుకుపోతోంది. 'గాతో' రెస్టారెంట్కు బ్యాంకాక్లో మంచి ఫేమ్ ఉంది. View this post on Instagram A post shared by Vikas Khanna (@vikaskhannagroup) అనహిత దొండి పార్సికి చెందిన యువతి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకుంటా అంటే కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆమె ఇష్టాన్ని తెలుసుకొని గౌరవించారు. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసిన వెంటనే ఆమెనే సొంతంగా రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. పార్సి వంటకాలను తన కస్టమర్లకు పరిచయం చేశారు. అందులోనూ కొత్త కొత్త రకాలను సృష్టించి కస్టమర్ల నోటికి సరికొత్త రుచులు అందిస్తున్నారు. ఔత్సాహిక చెఫ్ గా అనహిత దొండి పేరు గడించారు. రీతు దాల్మియా పాత తరం మహిళ చెఫ్లలో ఈమెకు అగ్ర తాంబూలం దక్కుతుంది. పురుషాధిక్యమైన హోటల్ బిజినెస్ లో.. ఈమె ప్రవేశించి సత్తా చాటారు. తన కస్టమర్లకు తానే స్వయంగా వంట వండి పెడతారామే. ముఖ్యంగా నార్త్ ఇండియన్ వంటకాలు చేయడంలో ఈమె దిట్ట. పెద్ద పెద్ద వ్యాపారులు ఈమె వంటకు డైలీ కస్టమర్లు అంటే అతిశయోక్తి కాదు. శిఫ్రా ఖన్నా నార్త్ ఇండియాకు చెందిన ఈ యువతికి వంట చేయడం అంటే చాలా ఇష్టం. అలా అనేక రకాల వంటలను ఆమె సృష్టించింది.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని రకాల వంటల్లోనూ ప్రయోగాలు చేసింది. ఏకంగా మాస్టర్ చెఫ్ రెండవ సీజన్లో విజేతగా నిలిచింది. టీవీ హోస్ట్గా కూడా పనిచేస్తోంది. ఈమెకు ఒక క్లౌడ్ కిచెన్ ఉంది. కాకపోతే అందులో వెస్ట్రన్ డిషెస్ మాత్రమే లభిస్తాయి. పంకజ్ బదౌరియా మనదేశంలో మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేతగా పంకజ్ బదౌరియా నిలిచింది. సంప్రదాయ వంటలకు ఆధునిక మేళవింపు అద్దడంలో పంకజ్ ముందు వరుసలో ఉంటుంది. అలా వంట చేస్తుంది కాబట్టే ఆమె మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేత అయింది. ప్రస్తుతం ఈమె ఒక రెస్టారెంట్ నిర్వహిస్తోంది.. అందులో అన్ని రకాల వంటకాలూ లభిస్తాయి. పూజా దింగ్రా ఈమె టాప్ పేస్ట్రీ చెఫ్లలో పూజా ఒకరు. పేస్ట్రీ తయారీలో తనకు ఉన్న నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ధైర్యంగా ఓపెద్ద పేస్ట్రీ తయారీ యూనిట్ నెలకొల్పింది. అలా రకరకాల పేస్ట్రీలు తయారుచేసి యువతను బాగా ఆకట్లుకున్నారు. అంతేగాదు వెస్ట్రన్ పేస్ట్రీస్ కోసం ఏకంగా మకరాన్ అనే పేరుతో పెద్ద హోటల్ కూడా ఏర్పాటు చేసింది.. బనీ నందా మన దేశానికి ఫ్రెంచ్ డిసర్ట్స్ను పరిచయం చేసిన ఘనత బని నందాకు దక్కుతుంది. ఇటీవల అంబానీ ఇంట్లో వేడుకలు జరిగినప్పుడు.. ఈమె రెస్టారెంట్ నుంచే అక్కడికి ఫ్రెంచ్ వంటకాలు వెళ్లాయి. Le cordn bleu పేరుతో ఆమె రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. తేజస్వి చండేలా యూరోపియన్ వంటకాలు వండటంలో తేజస్వీకి మంచి ప్రావిణ్యం ఉంది. యూరోపియన్ పేస్ట్రీలకు మోడ్రన్ టచ్ ఇచ్చి అద్భుతంగా తయారు చేయగల నేర్పరితనం ఈమె సొంతం. ఈమె తయారు చేసే పేస్ట్రీలకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఆమె తయారుచేసే విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంజిలత్ ఫాతిమా నవాబ్ అవధ్ కుటుంబానికి చెందిన మహిళ ఈమె. నవాబు వంటకాలను వండటంలో ఫాతిమాకు మంచి ప్రావిణ్యం ఉంది. అందువల్లే ఆమె పలు రెస్టారెంట్లు ఓపెన్ చేసి కస్టమర్లకు నవాబుల వంటకాలను రుచి చూపిస్తున్నారు. బిర్యానీలో రకాలు మాత్రమే కాకుండా, చికెన్, మటన్తో తయారు చేసే ప్రత్యేకమైన వంటకాలను కస్టమర్లకు అందిస్తోంది. (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!) -
నిమ్మచెక్కతో వంటిటి సమస్యలకు ఇలా చెక్పెట్టండి!
వంటిట్లో పనిచేస్తున్నప్పుడూ కొన్ని సమస్యలు తరుచుగా ఎదురవ్వుతుంటాయి. ఓ పట్టాన వాటిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా చేపలు, వెల్లుల్లి వంటి వాటిని బాగు చేస్తున్నప్పడూ చేతుల వాసన ఓ పట్టాన వదలదు. ఎంతలా సబుతో రుద్ది కడిగినా వదలదు. అలాగే కూరగాయాలు తరిగే చెక్క, కుళాయిలపై ఉండే మరకలు కూడా అస్సలు వదలవు. అలాంటి సమస్యలకు జస్ట్ నిమ్మకాయతో చెక్పెట్టేయొచ్చట. పైగా క్రిములు చేరవు ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..\ చేపలూ, ఉల్లిపాయ, వెల్లుల్లి.. వంటివి తరిగినప్పుడు వాటి వాసన చేతులకు అంటుకుంటుంది. అప్పుడు టీపొడిని కొద్దిగా రాసుకుని ఐదు నిమిషాలయ్యాక సబ్బుతో కడిగేస్తే చాలు. కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై మాంసం కోసినా.. నిమ్మచెక్కతో రుద్దితే క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది. ఫ్రిజ్లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి. స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు. వేపుడు కూరలనగానే నూనె గుర్తొచ్చి భయం వేస్తుంది. కానీ ఇలా చేస్తే నూనె తక్కువగా రుచికరమైన వేపుడు కూరలను ఆస్వాదించవచ్చు. బెండకాయ వేపుడులో నూనె తగ్గిస్తే జిగురు అడుగున నల్లగా పట్టేస్తుంటుంది. కాబట్టి అడుగు పట్టకుండా వేగడానికి నూనె ఎక్కువ వేయాల్సి వస్తుంది. బెండకాయ ముక్కల్లో ఒక స్పూన్ పెరుగు లేదా మజ్జిగ లేదా పాలు వేస్తే జిగురు విరిగిపోయి ముక్కలు అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి, తక్కువ నూనెతో చక్కగా వేగుతాయి. దొండకాయ వేపుడు చేసేటప్పుడు ధనియాల పొడి వేస్తే నూనె ఎక్కువ వేయాల్సిన పని ఉండదు. (చదవండి: స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు! అచ్చం ఉపాధ్యాయుడి మాదిరిగా..) -
ఫ్యామిలీ వ్యాన్ లైఫ్
ఒక ఎస్యువి ఉంటే భ్రమణకాంక్ష ఉన్న జీవిత భాగస్వామి దొరికితే ఆ వెహికల్నే ఇల్లుగా మార్చుకుని దేశంలోని అందమైన ప్రకృతిని చూస్తూ గడిపేయవచ్చా? చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ప్రయాణాలకు తగ్గట్టుగా మార్చుకున్న వాహనంలో ఇలాగే తిరుగుతున్నారు. వైరల్ అయిన వారి ‘ఫ్యామిలీ వ్యాన్ లైఫ్’ గురించి... తిరిగే వాళ్లు ఎలాగైనా తిరుగుతారు. కాని కొందరు స్పెషల్. సొంతగా క్రెటా, మహింద్రా 400, ట్రైబర్... లాంటి పెద్ద బండి ఉంటే దానిని కస్టమైజ్డ్ ఇంటీరియర్స్తో క్యాంపర్ వ్యాన్గా మార్చుకుని కుటుంబం మొత్తం తిరిగే బృందాలు ఇప్పుడు ఇండియాలో పెరిగాయి. క్యాంపర్ వ్యాన్ ఉంటే రిజర్వేషన్లు అక్కర్లేదు. హోటల్ రూమ్లు అవసరం లేదు. సమయానికి చేరుకోకపోతే ఫ్లయిట్ మిస్ అవుతామన్న ఆందోళనా లేదు. బండే బస. బండే ప్రయాణ సాధనం. చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సొంత ఫ్యామిలీ వ్యాన్లో దేశమంతా తిరుగుతూ, ‘ఘుమ్మక్కడ్ బగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. వీరికి ఐదు లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. మహింద్రా 500 వాహనం డిక్కీని వీరు పూర్తి స్థాయి కిచెన్గా తయారు చేయించుకున్నారు. లోపలి సీట్లను బెడ్స్గా మార్చుకునేలా ఆల్టర్ చేయించారు. ఇవి కాకుండా హాల్ట్ చేసిన చోట బండి మీద టాప్ టెంట్ వేసుకుంటారు. బండికి ఆనుకుని చేంజింగ్ రూమ్ ఫాలిథిన్ కవర్స్తో ఏర్పాటు చేసుకుంటారు. దూరంగా గుంత తవ్వి చుట్టూ పాలిథిన్ çకవర్స్తో లావెటరీ ఏర్పాటు చేసుకుంటారు. బండిలోనే గ్యాస్, వంట దినుసులు, కూరగాయలు అన్నీ పెట్టుకునే వీలుంటుంది. కపిల్ బండి నడిపితే ఆగిన చోటల్లా చకచకా వంట ముగిస్తుంది చిక్కి. బయటి తిండి వల్ల ఆరోగ్యం పాడవడం ఒక్కటే కాదు.. సమయానికి తిండి దొరక్కపోతే ఇబ్బంది కనుక ఈ ఏర్పాటు. అందుకే వీరు దిగులూ చింతా లేకుండా తిరుగుతూ ఉంటారు. వీరి పాపులారిటీ చూసి మరికొన్ని కుటుంబాలు తమ క్యాంపర్ వ్యాన్లతో వీరిని కలుస్తుంటాయి. అందరూ కలిసి గ్రూప్ క్యాంపింగ్ చేసి సరదాగా వొండుకుంటూ, ప్రకృతిని చూస్తూ. అక్కడే నిద్రపోతూ హాయిగా గడిపేస్తుంటారు. జీవితం అంటే అందమైన ప్రయాణం. చిక్కి, కపిల్ వీడియోల మీద ఆదాయం గడించడమే కాదు... గ్రూప్ క్యాంపింగ్ నిర్వహిస్తూ అలా కూడా డబ్బు గడిస్తున్నారు. టెన్ టు ఫైవ్ ఆఫీసుకు వెళుతూ సంపాదించేవారు ఎక్కువ మందైతే ఇలా రోజుకో కొత్త ప్రాంతంలో గడుపుతూ సంపాదించడం భిన్నమే కదా. -
హైదరాబాద్ శరత్ సిటీ మాల్ లో అత్యాధునిక థీమ్ తో A19 క్లబ్, కిచెన్ ప్రారంభం (ఫొటోలు)
-
చెట్టినాడు ఘుమఘుమలు!
'చెట్టినాడు రుచుల్లో కరివేపాకు ప్రధానం. తోడుగా కొబ్బరి కూడా ఉంటుంది. అన్నంలోకి అధరవుగానూ ఉంటాయి. సాయంత్రాలకు స్నాక్గా కుదురుతాయి. కడుపు నిండుగా ఆరోగ్యం మెండుగా ఉంటాయి.' ఉర్లయ్ రోస్ట్.. కావలసినవి: బేబీ పొటాటోలు – అరకిలో; మసాలా పొడి కోసం: ఎండుమిర్చి – 4; ధనియాలు – టీ స్పూన్; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; యాలక్కాయ – 1; లవంగం– 1; సోంపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు. పోపు కోసం: వేరుశనగ నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూన్; మినప్పప్పు – అర టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; ఉల్లిపాయలు – 2 (మీడియం సైజువి, తరగాలి); పచ్చిమిర్చి – 2 (చీరాలి); అల్లంవెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; మిరపొ్పడి– టీ స్పూన్; ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్. తయారీ: తయారీ.. బంగాళాదుంపలను ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టాలి బాణలి వేడి చేసి మసాలా పొడి కోసం తీసుకున్న దినుసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వేసి వేగి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టాలి బాణలిలో ఆయిల్ వేడి చేసి ఆవాలు వేయాలి వేగిన తర్వాత మినప్పప్పు, కరివేపాకు వేయాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి తరుగు వేసి వేగిన తర్వాత మసాలా పొడిని చల్లాలి ఆ తరవాత మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఉడికించి తొక్క తీసి సిద్ధంగా ఉంచిన బంగాళాదుంపలను వేసి మసాలా సమంగా పట్టేవరకు వేయించాలి చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి దీనిని ఈవెనింగ్ స్నాక్గానూ, అన్నంలోకి సైడ్ డిష్గానూ తినవచ్చు. గమనిక: ఉర్లయ్ అంటే బంగాళాదుంప. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల బంగాళాదుంపను ఉర్లగడ్డ అంటారు. చెట్టినాడు ఫిష్ ఫ్రై.. కావలసినవి: చేప ముక్కలు – నాలుగు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; టొమాటో ముక్కలు – పావు కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; చింతపండు రసం– టేబుల్ స్పూన్; ఆవాలు – టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 8 (తరగాలి); అల్లం తరుగు – టీ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; సోంపు గింజలు– టీ స్పూన్; మిరియాలు – పది; మిరపొ్పడి– టీ స్పూన్; పసుపు– టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. చేప ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టాలి బాణలి వేడి చేసి కరివేపాకు, వెల్లుల్లి, ధనియాలు, సోంపు, మిరియాలు వేయించి చల్లారిన తర్వాత పొడి చేయాలి పొడి చేసేటప్పుడు కొద్దిగా నూనె వేయాలి ఇప్పుడు చింతపండు రసం, టొమాటో ముక్కలు, అల్లం, పసుపు, మిరపొ్పడి, ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి ఈ పేస్ట్ను ఒకసారి రుచి చూసి అవసరమైతే ఉప్పు మరికొంత కలుపుకోవాలి ఇందులో మసాలా పొడిని కూడా కలిపి ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించాలి ఇరవై నిమిషాల తర్వాత బాణలిలో నూనె వేడి చేసి చేప ముక్కలను నూనెలో అమరేటట్లు ఒకదాని పక్కన ఒకటిగా పెట్టాలి ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద కాలిన తర్వాత ముక్కలను జాగ్రత్తగా తిరగేయాలి చేప ముక్కల అంచులు కరకరలాడే వరకు వేగిన తర్వాత తీసి నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. నారియల్ సోయా పనీర్ వడ.. కావలసినవి: తురిమిన పనీర్– 4 కప్పులు; తురిమిన టోఫూ – 2 కప్పులు; అల్లం తరుగు – 3 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – టేబుల్ స్పూన్; వెల్లుల్లి తరుగు – 3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; గరం మసాలా పొడి– టీ స్పూన్; దాల్చిన చెక్క పొడి– టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; కొబ్బరి పొడి– 5 టేబుల్ స్పూన్లు; మైదా లేదా కార్న్ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు; బ్రెడ్ పొడి– 10 టేబుల్ స్పూన్లు; నూనె – వేయించడానికి తగినంత. తయారీ.. టోఫూ, పనీర్లను పలుచని క్లాత్లో కట్టి నీరు కారిపోవడానికి కనీసం ఓ అరగంట సేపు ఉంచాలి ఇప్పుడు పనీర్, టోఫూ తురుముని ఒక పాత్రలో వేసి మెత్తగా చిదమాలి అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, గరం మసాలా, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి, కొబ్బరి పొడి వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకుని పక్కన పెట్టాలి మైదా లేదా కార్న్ఫ్లోర్లో తగినంత నీటిని పోసి జారుడుగా కలుపుకోవాలి పనీర్ మిశ్రమం గోళీలను వడల్లా వత్తి కార్న్ప్లోర్ లో ముంచి ఆ తర్వాత బ్రెడ్ పొడిలో వేసి వడ అంతటికీ బ్రెడ్ పొడి పట్టేటట్లు రోల్ చేయాలి ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో వడను జాగ్రత్తగా నూనెలో వేసి తిరగేస్తూ రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసి టిస్యూ పేపర్ మీద వేయాలి నూనె వదిలిన తర్వాత సర్వ్ చేయాలి. ఇవి చదవండి: కలిసి మీరూ రాయండి -
కొండెక్కిన వెల్లుల్లి ..ఈ చిట్కాలు ఫాలోకండి!
దేశంలో ఇటీవల కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉల్లి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. మొన్నమొన్నటి నుంచి తగ్గుతూ రాగా, ఇప్పుడు వెల్లుల్లి ధరలు అమాంతం కొండెక్కాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర రూ.400 నుంచి రూ. 500 వరకు పలుకుతుంది. ఇలాంటప్పుడూ మహిళలు స్పైసీ కూరలు ఎలా వండి పెట్టగలం అన్న సందిగ్ధంలో పడిపోతారు. పైగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని తాలింపుల దగ్గరి నుంచి ప్రతి దాంట్లోని తప్పనిసరిగా వాడేస్తుంటారు. అలాంటిది వెల్లుల్లి వాడకం లేకుండా గడపడం అంటే..కొందరికి చాల కష్టం. అలాంటివారు ప్రత్యామ్రాయంగా ఇలాంటి వాటితో వెల్లుల్లి ప్లేస్ని భర్తీ చేసుకోవచ్చు. వెల్లుల్లి బదులుగా ఏం ఉపయోగించొచ్చంటే.. సింపుల్ చిట్కాలు.. ముందుగా మీ కిచెన్ కప్బోర్డ్లో ఎన్ని వెల్లులిపాయలు ఉన్నాయో చూడండి. వాటిని పాయలుగా విడదీయండి. ఆ తర్వాత చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వండి. ఇక వాటిని చక్కగా పొడి చేసుకుని పాడవ్వకుండా చిన్న లవంగ మొగ్గ వేసి గాలి చొరబడి డబ్బాలో నిల్వ ఉంచండి. ఈ పొడి వెల్లులి మాదిరి రుచిని సువాసనను తెప్పిస్తుంది కూరకి. ఇది మంచి ప్రత్యామ్నాయం. అలాగే ఈ వెల్లుల్లి పొడికి కాస్త ఉప్పు చేరిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే కూరల్లో ఈ పొడిని ఉపయోగిస్తున్నట్లయితే కాస్త ఉప్పు తగ్గించండి. అప్పుడు కూర రుచికి వెల్లుల్లికి దగ్గదగ్గరగా మంచి రుచిని అందిస్తుంది. అస్సలు ఇంట్లో వెల్లుల్లి లేదంటే పచ్చి ఉల్లిపాయాలను ఎండలో ఎండబెట్టి చక్కగా పొడి చేసుకుంటే వెల్లులి మాదిరిగా టేస్ట్ వస్తుంది కూరకి. అయితే కూరలో తక్కువ ఉల్లిపాయలను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆర్థిక పరంగా సమస్య రాకుండా కొద్దిపాటి చిట్కాలతో ఇంటిని చక్కగా చక్కబెట్టుకుంటే ఆరోగ్యానికా ఆరోగ్యమే గాక ధరల సమస్యకు చెక్ పెట్టొచ్చు. (చదవండి: కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్ ఉంటే చాలు!) -
కొత్తిమీర తాజాగా, పకోడీలు క్రిస్పీగా, క్రంచీగా: ఈ టిప్స్ పాటించండి!
వంట చేసేటపుడు కొన్ని చిట్కాలు పాటించడమో, లేదా కొన్ని ఇంగ్రీడియంట్స్ అదనంగా కలపడమో తప్పని సరి. లేదంటే ఎంత కష్టపడి చేసిన వంట అయినా రుచిని కోల్పోతుంది. అలాగే ముఖ్యమైన పోషకాలను కోల్పోతాం. లేదా ఒక్కోసారి అసలు టేస్టే లేకుండా పోతుంది. అందుకే ఈ టిప్స్ ఒకసారి చూడండి. ♦ పకోడీలు మెత్తబడకుండా ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉండాలంటే పావు కేజీ శనగపిండిలో గుప్పెడు మొక్కజొన్న పిండి కలపాలి. ♦ పూరీలు నూనె తక్కువ పీల్చుకుని, పొంగి కరకరలాడాలంటే పూరీలు వత్తేటప్పుడు బియ్యప్పిండి చల్లుకోవాలి. ♦ కూరగాయలను తొక్క తీసి, తరిగిన తర్వాత నీటిలో శుభ్రం చేస్తే అందులోని పోషకాలు నీటిలో కరిగిపోతాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లను నష్టపోతాం. కాబట్టి తొక్క తీయడమైనా, తరగడమైనా నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అలాగే తరిగిన వెంటనే వండాలి. పై నియమాన్ని వంకాయలకు పాటించడం కష్టం. ఎందుకంటే తరిగిన వెంటనే నీటిలో వేయకపోతే వంకాయ ముక్కలు నల్లబడడంతోపాటు చేదుగా మారతాయి. కాబట్టి ముందుగా వంకాయలను ఉప్పు నీటిలో కడిగి ఆ తర్వాత తరిగి మళ్లీ నీటిలో వేయాలి. ♦ యాపిల్ను కట్ చేసి, ఆ ముక్కలను ప్లేట్లో అమర్చి సర్వ్ చేసే లోపే ముక్కలు రంగు మారుతుంటాయి. కాబట్టి కట్ చేసిన వెంటనే ఆ ముక్కల మీద నిమ్మరసం చల్లితే ముక్కలు తాజాగా ఉంటాయి. చాకును నిమ్మరసంలో ముంచి కట్ చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ♦ కొత్తిమీరను పలుచని క్లాత్ బ్యాగ్లో పెట్టి ఫ్రిజ్లో నిల్వ ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. -
దినుసులన్నీ కలిపితే.. ఈ రకరకాల 'రుచి కారము పొడులు' మీకే!
'సంక్రాంతి రుచుల తియ్యటి రుచి బయటపడాలనిపిస్తోందా! నోటికి కారంగా, పొట్టకు తేలిగ్గా ఉండే ఆహారం తినాలనిపిస్తోందా! ఉన్నది ఆరు రుచులే.. కానీ జిహ్వ మరింత రుచిని కోరుకుంటుంది. నాలుకకు మమకారం మాత్రమే కాదు రుచి కారమూ ఇష్టమే. పోపుల పెట్టెలో దినుసులన్నీ కలిపి రకరకాల కారం పొడులు చేద్దాం.' నువ్వుల పొడి.. కావలసినవి: తెల్ల నువ్వులు – వంద గ్రాములు; ఎండు మిర్చి– 10; మినప్పప్పు – అర టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు– రుచికి తగినంత. తయారీ.. మందపాటి బాణలిలో నువ్వులు వేసి మీడియం మంట మీద దోరగా వేయించి పక్కన పెట్టాలి. మరొక బాణలిలో ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేయించి చివరగా జీలకర్ర వేసి దించేయాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో నువ్వులు, పోపు దినుసులు, ఇంగువ, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఈ పొడిని అన్నం, ఇడ్లీ, ఉప్మాల్లో తినవచ్చు. కూరల్లో కలుపుకోవచ్చు. వేపుళ్లలో పైన చల్లుకోవచ్చు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి వారంలో కనీసం మూడు రోజులు ఆహారంలో ఈ పొడి ఉండేలా చూసుకోవడం మంచిది. కొబ్బరి పొడి.. కావలసినవి: ఎండుకొబ్బరి తురుము – వంద గ్రాములు; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; వేయించిన శనగపప్పు – టీ స్పూన్; మిరప్పొడి– టేబుల్ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. బాణలిలో పచ్చి శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత వేయించిన శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. వేడి తగ్గిన తర్వాత అన్నింటినీ మిక్సీ జార్లో వేసి మిరప్పొడి, ఉప్పు కలిపి పొడి చేయాలి. ఇడ్లీ, దోశెలు, అన్నంలోకి బాగుంటుంది. వేపుళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి కలిపితే రుచి ఇనుమడిస్తుంది. కరివేపాకు పొడి.. కావలసినవి: కరివేపాకు– వందగ్రాములు (మంచి నీటిలో శుభ్రం చేసి ఆరబెట్టి ఈనెలు తీసిన ఆకులు); ఎండు మిర్చి– పది; ఆవాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టేబుల్ స్పూన్; వేరుశనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు – అర టీ స్పూన్; చింతపండు – అర అంగుళం పాయ; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ పొడి– పావు టీ స్పూన్; నూనె – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత. తయారీ.. బాణలిలో నూనె వేడి చేసి వేరు శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు దోరగా వేయించాలి. అవి వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆకులో పచ్చిదనం పోయే వరకు చిన్న మంట మీద వేయించాలి. ఆకు వేగిన తర్వాత చింతపండు, ఇంగువ, వెల్లుల్లిరేకలు, ఉప్పు వేసి దించేయాలి. చల్లారే కొద్దీ ఆకు పెళపెళలాడుతుంది. పూర్తిగా చల్లారిన వెంటనే మిక్సీలో వేసి పొడి చేయాలి. రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవాలి. ఈ పొడి వేడి అన్నం, ఇడ్లీ, దోశెల్లోకి రుచిగా ఉంటుంది. ఆకలి మందగించినప్పుడు, నోటికి ఏదీ రుచించనప్పుడు ఈ పొడి తింటే జీర్ణవ్యవస్థ క్రమబద్ధమవుతుంది. గమనిక: చల్లారిన వెంటనే పొడి చేయకపోతే ఆలస్యమయ్యే కొద్దీ ఆకు మెత్తబడి పోతుంది. సరిగ్గా మెదగదు. అవిశె గింజల పొడి.. కావలసినవి: అవిశె గింజలు – వందగ్రాములు; ఎండు మిర్చి – పది; ఆవాలు – అర టీ స్పూన్; మిరియాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; వేరు శనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; ఇంగువ– అర టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. బాణలిలో అవిశె గింజలను మీడియం మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. మరొక బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, వేరు శనగపప్పు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. దినుసులన్నీ చక్కగా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు అవిశె గింజలు, ఇంగువ వేసి కలిపి దించేయాలి. వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరోగ్యకారకం. గుండె వ్యాధుల నివారణ, డయాబెటిస్ నియంత్రణకు డాక్టర్లు అవిశె గింజలను సూచిస్తున్నారు. రుచి కోసం చూడకుండా రోజూ ఒక స్పూన్ అన్నంలో లేదా బ్రేక్ఫాస్ట్లలో ఏదో ఒకరకంగా తీసుకోవడం మంచిది. ఇవి చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్మెంట్ని చూపించిన ప్రదాని మోదీ! -
‘బంగారం’లాంటి కలగన్నాడు.. మృత్యువు ఒడికి చేరాడు!
ప్రతీ మనిషి కల కంటాడు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అవి నెరవేరితే.. సంతోషం. నెరవేరకపోతే!. అయితే.. ఆ కల ఆధారంగా అత్యాశకి పోతేనే అసలు సమస్య మొదలయ్యేది. ఆ ప్రయత్నంలో.. ప్రాణం కూడా పోవచ్చు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. పేరాశకు పోయి ప్రాణం పొగొట్టుకున్నాడు ఇక్కడో పెద్దాయన. ఆయన వయసు ఏడు పదులపైనే. ఓరోజు నిద్రలో తన ఇంటి నేల కింద బంగారం ఉన్నట్లు కలగన్నాడట. అంతే.. అప్పటి నుంచి వంట గదికే పరిమితం అయ్యాడు. ఏడాది కాలం అదే పనిగా ఆ గదిలో తవ్వుకుంటూ పోయాడు. అలా.. 130 అడుగుల లోతుదాకా పోయాడు. ఈ మధ్యలో రాళ్లు అడ్డుపడితే డైనమెట్లను కూడా ఉపయోగించాడట. దీంతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిసింది. అది ప్రమాదకరమని హెచ్చరించినా.. అధికారులతో చెప్పించినా ఆ పెద్దాయన వినలేదు. చివరకు.. ఆ భారీ గొయ్యిలోనే అదుపు తప్పి పడిపోయి ప్రాణం విడిచాడు. దాదాపు 12 అంతస్థుల భవనం లోతు ఉన్న గొయ్యలో పడి తల పగిలి.. కాళ్లు చేతులు విరిగి అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అలా.. కలను నిజం చేసుకోవాలని.. అదీ ఈ వయసులో అత్యాశకు పోయి ప్రాణం విడిచిన ఆ పెద్దాయన పేరు జోయో పిమెంటా. ఊరు.. బ్రెజిల్లోని మినాస్ గెరైస్. అందుకే.. పేరాశ ప్రాణాంతకం అని ఈయనలాంటి పెద్దలు ఊరికే అనలేదు. ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం.. ఇదే మార్గం! -
సంక్రాంతి మాధుర్యం మన వంటింట్లోనే..
'కాలం మారింది.. అరిశె కోసం జనవరి వరకు ఎదురు చూడక్కర్లేదు. స్వగృహ ఫుడ్స్ ఏడాదంతా అందిస్తున్నాయి. అయినా సరే.. సంక్రాంతి వస్తోందంటే ఇంట్లో బెల్లం కాగాల్సిందే. పాకం వాసనకు పక్కింటి వాళ్ల నోరూరించాల్సిందే. కాలం ఎంత మారినా సరే.. అసలైన అరిశె రుచి అంటే.. మన వంటింటి అరిశె రుచే. మరి అవేంటో చూద్దాం!' పూతరేకులు.. కావలసినవి: బెల్లం పొడి – కేజీ; సగ్గుబియ్యం– ముప్పావు కేజీ; జీడిపప్పు, పిస్తా – పావుకేజీ (చిన్న పలుకులు చేయాలి); ఏలకుల పొడి– 5గ్రా.; నెయ్యి– 100 గ్రా. తయారి.. సగ్గుబియ్యాన్ని ఉడికించి చిక్కటి గంజి చేసుకోవాలి. పూత రేకు చేయడానికి మంద పాటి నూలు వ్రస్తాన్ని నలుచదరంగా కత్తిరించి సిద్ధం చేసుకోవాలి. కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తరువాత వ్రస్తాన్ని సగ్గుబియ్యం గంజిలో ముంచి కుండ మీద అతికించినట్లు పరిచి వ్రస్తాన్ని తీసేయాలి. గంజి కుండకు అంటుకుని వేడికి పలుచని పొరలాగా వస్తుంది. ఆ పొర చిరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి. ఇలా ఎన్ని రేకులు కావాలంటే అన్నింటికీ ఇదే పద్ధతి. రేకు ఏ సైజులో కావాలంటే క్లాత్ను ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఒకపాత్రలో బెల్లం పొడి, జీడిపప్పు, పిస్తా పలుకులు, ఏలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రేకులను రెండు పొరలు తీసుకుని వాటికి నెయ్యి రాయాలి. ఆ తర్వాత బెల్లం పొడి, జీడిపప్పు పలుకులు, ఏలకుల పొడి మిశ్రమాన్ని పలుచగా వేసి పైన మరొక పొర రేకును వేసి మడత వేయాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. బెల్లపు అరిశెలు కావలసినవి: బియ్యం – ఒకటింపావు కిలో; బెల్లం – కిలో; నువ్వులు, గసగసాలు– కొద్దిగా; నెయ్యి లేదా నూనె– కాల్చడానికి సరిపడినంత తయారి.. బియ్యాన్ని ముందు రోజు రాత్రి శుభ్రంగా కడిగి, మునిగేటట్లు నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని సన్నని రంధ్రాలున్న జల్లెడతో జల్లించాలి. జల్లించేటప్పుడు పిండి ఆరి΄ోకుండా జాగ్రత్త తీసుకోవాలి. గాలికి ఆరకుండా ఎప్పటికప్పుడు ఒక పాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి. పెద్దపాత్రలో ఒక గ్లాసు నీటిని, బెల్లం ముక్కలను వేసి పాకం వచ్చేదాకా మరగనిచ్చి బియ్యప్పిండి కలుపుకుంటే పాకం పిండి సిద్ధం. ఇప్పుడు బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకంపిండిని పూరీకి, చపాతీకి తీసుకున్నట్లుగా తీసుకుని గోళీ చేసి గసాలు లేదా నువ్వులలో లేదా రెండింటిలోనూ అద్దాలి. ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి. ఆ పిండిని పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది, కాగిన నూనెలో వేసి రెండువైపులా దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నూనె కారిపోయేటట్లు వత్తాలి. అరిశెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి. వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు వత్తేయవచ్చు. గమనిక: అరిశె నొక్కులు పోకుండా వలయాకారంగా అంతా ఒకే మందంలో రావాలంటే చేతితో అద్దడానికి బదులుగా పూరీ ప్రెస్సర్ వాడవచ్చు. అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపిగా, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ముదరు పాకం పట్టాలి. ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూనుతో కొద్దిగా తీసుకుని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్ చేయాలి. జారిపోకుండా రౌండ్ వచ్చిందంటే పాకం వస్తున్నట్లు. ఆ రౌండ్ను పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ముదురు పాకం కావాలనుకుంటే ఆ పాకం బాల్ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చే దాకా మరగనివ్వాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్న సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిశెలాగా వేడిగా, మెత్తగా వస్తాయి. ఒవెన్ ఉంటే తినే ముందు ఒక మోస్తరుగా వేడి చేసుకుంటే అప్పుడే చేసిన అరిశెల్లాగా తాజాగా ఉంటాయి. చక్కెర అరిశెలు చేయాలంటే బెల్లం బదులు చక్కెరతో పాకం పట్టాలి. కొబ్బరి బూరెలు కావలసినవి: బియ్యప్పిండి– అరకేజీ; బెల్లం – 300గ్రా.; పచ్చికొబ్బరి– ఒక చిప్ప; ఏలకులపొడి – ఒక టీ స్పూను; నెయ్యి– టేబుల్ స్పూన్; నూనె – కాలడానికి సరిపడినంత. తయారి.. బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరిసెలకు చేసుకున్నట్లే తడిబియ్యాన్ని దంచుకోవాలి. జల్లించి పిండి ఆరిపోకుండా మూతపెట్టి పక్కన ఉంచాలి. పచ్చికొబ్బరిని తురిమి సిద్ధంగా ఉంచాలి. బెల్లాన్ని పాకం పట్టాలి. బూరెలకు పాకం ముదరకూడదు. లేతపాకం సరిపోతుంది. పాకం వచ్చిన వెంటనే కొబ్బరి తురుము వేసి కలపాలి. కొబ్బరి కలిసిన తరువాత మూడు – నాలుగు గుప్పెళ్ల బియ్యప్పిండి వేసి మంట మీద నుంచి దించేయాలి. ఇప్పుడు ఏలకుల పొడి, మిగిలిన బియ్యప్పిండిని వేసి ఉండలు కట్టకుండా సమంగా కలిసే వరకు కలిపి పైన నెయ్యి వేసి అద్ది మూత పెట్టాలి. కొబ్బరి బూరెల పిండి సిద్ధం అన్నమాట. బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. ఈ లోపుగా బూరెల పిండి చిన్న గోళీ అంత తీసుకుని అరచేతిలో కాని పాలిథిన్ పేపరు మీద కాని అరిసెలాగా వేళ్లతో ఒత్తి కాగిన నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా వేగిన తరువాత తీయాలి. తీసిన పదినిమిషాలకు వేడి తగ్గి బూరె రుచి ఇనుమడిస్తుంది. ఇవి చదవండి: మన ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ మయమా? అదే సుగర్కి కారణమా? -
డబుల్ సైడ్ మల్టీమేకర్! నూనె లేకుండా..
శ్రమ లేకుండా సౌకర్యాలను అందించడంతో పాటు.. కిచెన్కి లగ్జరీ లుక్నీ ఇచ్చే ఈ డబుల్ సైడ్ హీటింగ్ బేకింగ్ మెషిన్.. యూజర్ ఫ్రెండ్లీగా డిమాండ్లో ఉంది. ఇందులో ఇండిపెండెంట్ టెంపరేచర్ కంట్రోల్, డబుల్ పాల్ గ్రిల్లింగ్, త్రీ టైప్స్ ఆఫ్ బేకింగ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. మూడు లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ మేకర్.. రకరకాల రుచులను నిమిషాల్లో సిద్ధం చేస్తుంది. ఈ మేకర్లో గ్రిల్ లేదా ఫ్రై చేసుకోవాలంటే నూనె చాలా తక్కువ మోతాదులో సరిపోతుంది. క్లీన్ చేసుకోవడమూ సులభమే. ఇది రోజువారీ వంటకాలకే కాకుండా పార్టీలు, ఫంక్షన్స్లో వెరైటీ వంటకాలు చేసుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో కూరలు, సూప్స్ వంటివి సిద్ధం చేసుకోవడంతో పాటు.. పాన్ కేక్స్, కట్లెట్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. దీనితో షార్ట్ సర్క్యూట్ సమస్య రాదు. దీనికి అటాచ్డ్ మూతతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ మూత విడిగా లభిస్తుంది. (చదవండి: ఈ కొత్త రకం కుక్కర్ లో వంటలు చాలా సులభం) -
సర్దుకు పోవద్దు.. సర్దుకుందాం ఇలా..!
కిచెన్ను శుభ్రంగా ఉంచుకోవడంలో మొదటి మెట్టు... వంట పూర్తి కాగానే.. కిచెన్ ప్లాట్ఫామ్, స్టౌను వెంటనే శుభ్రం చేసేసుకోవడం. స్టవ్ మీద, ప్లాట్ఫామ్ మీదా మనం వండిన వంటలోని చిందులు, నూనె మరకలు పడటం సహజం. అలాంటి వాటిని వంట అవగానే వెంటనే తుడిచేయాలి. గోరువెచ్చటి నీళ్లలో వెనిగర్ కలిపి శుభ్రం చేస్తే.. క్రిములు తొలగిపోతాయి. స్టౌ మీద పడిన నూనె మరకలను తొలగించడానికి, కిచెన్ ప్లాట్ఫామ్ శుభ్రం చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ని ఉపయోగించచ్చు. అవి కాసింత ఖరీదైనవి కావడం వల్ల చాలామంది కిచెన్ టవల్స్నే వాడతారు. ఒకోసారి కిచెన్లో నూనె ఒలికిపోతుంటుంది. వెంటనే ఆ నూనె మీద గోధుమ పిండి లేదా బియ్యప్పిండిని చల్లి కాసేపటి తరువాత పేపర్తో తుడిస్తే జిడ్డులేకుండా శుభ్రపడుతుంది. కిచెన్ ప్లాట్ఫామ్పై మరకలు ఉంటే.. వంటసోడా వేసిన నీళ్లతో కిచెన్ ప్లాట్ఫామ్ తుడిస్తే చాలు. అంతేకానీ బ్లీచింగ్, అమోనియా లాంటివి వాడటం వల్ల క్యాబినెట్కున్న రంగులు, టైల్స్ దెబ్బతింటాయి. కూరగాయలు తరగడం పూర్తయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయకపోతే అక్కడున్న తేమ, కాయగూరల అవశేషాలు వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల్ని త్వరగా ఆకర్షిస్తాయి. తరిగేటప్పుడే ఓ డబ్బా పెట్టుకొని, తొక్కలు, తొడిమల్లాంటివి దాంట్లో వేసి తర్వాత చెత్తడబ్బాలో పడేస్తే.. శుభ్రంగా ఉంటుంది. కిచెన్ టవల్స్ను కూడా... కిచెన్ ప్లాట్ఫామ్ని, స్టవ్నీ క్లీన్ చేసేందుకు ఉపయోగించే కిచెన్ టవల్ని సరిగా శుభ్రం చేయకపోతే దానికి ఉండే బ్యాక్టీరియా వల్ల అంతవరకు మనం చేసినదంతా నిరర్థకమవుతుంది. కిచెన్ టవల్స్ జిడ్డుగా ఉంటే గోరువెచ్చని నీటిలో సర్ఫ్, వాషింగ్ లిక్విడ్ వేసి కాసేపు నానబెట్టిన తర్వాత బట్టలుతికే బ్రష్తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతాయి. కిచెన్ క్యాబినెట్ కిచెన్ ప్లాట్ఫామ్ కింద లేదా పైన సామాన్లు పెట్టుకోవడం కోసం ఉంచిన ర్యాక్స్, క్యాబినెట్ పుల్స్, హ్యాండిల్స్పై కూడా సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటిని క్రిమిసంహారక వైప్తో క్లీన్ చేస్తే మంచిది. వెనిగర్ని క్లాత్పై స్ప్రే చేసి వాడండి. దీనివల్ల వేలిముద్రలు, నీటి గుర్తులు పోయి తెల్లగా మెరుస్తాయి. ఫ్రిజ్ క్లీన్గా.. ఫ్రిజ్లో మనం చాలా స్టఫ్ పెడుతుంటాం. కానీ, దానిని ఎప్పుడో ఓసారి క్లీన్ చేస్తుంటాం. అలా కాకుండా దీనిని కూడా మరకలు లేకుండా శుభ్రంగా తుడవడం మంచిది. ఫ్రిజ్ కింద, డోర్స్, లోపల గ్లాసెస్.. ఇలా అన్నింటిని తడిగుడ్డతో తుడిస్తే త్వరగా క్లీన్ అవుతుంది. ఇక మిగిలిపోయిన ప్రతిదానిని ఫ్రిజ్లో తోసేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చాలా మంచిది. సింక్ క్లీన్.. కిచెన్ క్లీన్ చేయాలంటే ముందుగా సింక్ని క్లీన్ చేయాలి. సింక్ బేసిన్ నీట్గా ఉందో లేదో చూసుకోండి. కౌంటర్ చుట్టూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటివి దూరమవుతాయి. అందుకే, ముందు దీనిని క్లీన్ చేయండి. సింక్ సరిగ్గా లేకపోతే అందులో నుంచే ఎక్కువ బొద్దింకలు, వాటి ద్వారా వ్యాధులు వస్తాయి. కొద్దిగా బ్లీచింగ్ పౌడర్, డిష్వాష్, బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే సరి. సింక్లో మాంసాహారం కడిగిన తర్వాత దాన్ని సోప్ వాటర్తో శుభ్రం చేసేస్తే సింక్ దుర్వాసన రాకుండా ఉంటుంది. కాస్త తీరిక దొరికినప్పుడు ఓ క్లాత్ తీసుకుని వాటర్ స్ప్రే చేస్తూ కిచెన్ గోడలు, కౌంటర్స్ని క్లీన్ చేయండి. ఇందుకోసం మార్కెట్లో దొరికే స్ప్రేలను కూడా ఉపయోగించవచ్చు.. ఇప్పుడు డోర్ ఫ్రేమ్స్ని క్లీన్ చేయండి. వంటగదిని అన్ని వస్తువులు సులభంగా దొరికేలా సర్దుకుంటే వంట చేయడం ఈజీ అవుతుంది. ఎలాగో చూద్దాం... ట్రాన్స్పరెంట్ డబ్బాలు వంట చేసుకునేప్పుడు ఏ డబ్బాలో ఏముందా? అని వెతుక్కోవడానికే సమయం వృథా అవుతుంది. అలా కాకుండా షెల్ఫుల్లో ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు లేదా స్టీల్ డబ్బాలూ గాజు సీసాలూ అందుబాటులో ఉంటాయి. వాటిని ప్రయత్నించి చూడండి. పని సులభం అవుతుంది. సరుకులనూ వేరు చేయడం వంట గదిలో షెల్ఫులలో అన్ని సరుకుల్ని అన్ని షెల్ఫుల్లో సర్దేయకుండా ఎక్కువగా వంటకు వాడే వాటిని ఒకచోట, తక్కువగా వాడే పదార్థాల్ని వేరే షెల్ఫులో, బేకింగ్ సామగ్రిని మరో దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. (చదవండి: కార్ డిజైనర్ థార్ డిజైనర్!) -
మొన్న తల్లిదండ్రులు.. నిన్న కుమారుడు.. అనాథగా మారిన కూతురు!
హైదరాబాద్: ఫిలింనగర్లోని మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో మూడ్రోజుల క్రితం వంట గ్యాస్ లీకై దంపతులు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి కుమారుడు గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో నివసించే మిర్యాల రమేష్.. ఇంట్లోని వంట గ్యాస్ లీకై న విషయాన్ని గ్రహించకుండా.. కరెంటు స్విచ్ వేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకొని గాయాలపాలయ్యారు. అదే రోజు రమేష్ మృతి చెందాడు. మరుసటి రోజు ఆయన భార్య శ్రీలత ఆస్పత్రిలో కన్నుమూసింది. తీవ్ర గాయాలపాలైన కుమారుడు హర్షవర్ధన్ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనతో వడ్డెర బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోదరుడు మృతి చెందడంతో చెల్లెలు అనాథగా మారింది. ప్రస్తుతం ఈ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
పన్నీర్ పాడవ్వకుండా ఉండాలంటే..ఇలా చేయండి!
కొన్ని కిచెన్లో ఉపయోగించే సరుకులు పాడవ్వకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తులు తీసుకోవాలో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొసారి పాడేపోతాయి. దీనికి తోడు ఆయా సీజన్లు కూడా తోడైతే కొన్నింటిని నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారకోసమే ఈ వంటింటి చిట్కాలు ఇక మీరు ఆ విధమైన సమస్యల నుంచి ఈజీగా బయటపడండి. పచ్చిమర్చి తాజాగా ఉండాలంటే.. మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తడిలేకుండా ఆరిన మిరపకాయల తొడిమలు తీసేసి టిష్యూపేపర్లో వేసి చుట్టి, జిప్లాక్ బ్యాగ్లో వేసి రిఫ్రిజిరేటర్లో ్చనిల్వ చేయాలి. ఇలా పెట్టిన పచ్చి మిరపకాయలు నెలరోజులపాటు పాడవకుండా చక్కగా ఉంటాయి. ఇంట్లో చేసే నూడుల్స్ రెస్టారెంట్లలోలాగా పొడిపొడిగా రావాలంటే... నీటిలో రెండు టీస్పూన్ల నూనె, కొద్దిగా ఉప్పువేసి నూడుల్స్ను మరిగించాలి. నూడుల్స్ చక్కగా ఉడికిన తరువాత వేడి నీటి నుంచి తీసి చల్లటి నీటితో కడగాలి. నీరంతా పోయేలా వంపేసి నూడుల్స్ పైన టీస్పూన్ నూనెను వేసి కలుపుకుంటే నూడుల్స్ పొడిపొడిగా వస్తాయి. వీటికి మసాలా జోడిస్తే ఎంతో రుచిగా ఉంటాయి. పనీర్ను నీటిలో వేసి, పైన కాటన్ వస్త్రాన్ని కప్పి ఉంచి రిఫ్రిజిరేటర్లో ఉంచితే రెండు మూడు వారాలపాటు తాజాగా ఉంటుంది. పనీర్ ముక్కలు మునిగే అన్ని నీళ్లు పోయాలి. ఈ నీటిని రెండు మూడు రోజులకొకసారి మార్చుకుంటూ ఉంటే మరిన్ని రోజులపాటు తాజాగా ఉంటుంది. (చదవండి: మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..) -
మణికేరళం
ఎక్కడి కేరళ? ఎక్కడి మణిపుర్? అయితే మానవత్వానికి భౌగోళిక సరిహద్దులతో పనిలేదు అని నిరూపించే విషయం ఇది. కేరళ కోచిలోని ఆర్సీపీ రెస్టారెంట్లో మణిపుర్కు చెందిన సుస్మిత పనిచేస్తుంది. సర్వీస్ స్టాఫ్లో ఒకరైన సుస్మిత ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. మూడుసార్లు ‘బెస్ట్ ఎంప్లాయీ’గా అవార్డ్ కూడా అందుకుంది. అలాంటిది... ఓ రోజున సుస్మిత డల్గా ఉండడం చూసి ‘ఏమైంది?’ అని అడిగాడు జనరల్ మేనేజర్. తన రాష్ట్రం మణిపుర్లో జరుగుతున్న అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తల్లి, సోదరి గురించి ప్రస్తావిస్తూ ‘వారికేమైనా అవుతుందేమో’ అంటూ భయపడింది. విషయం తెలిసిన చెఫ్ పిళ్లై, అతని టీమ్ మణిపుర్ నుంచి ఆమె తల్లి, సోదరిలను రప్పించి కోచిలో బస ఏర్పాటు చేశారు. సుస్మిత తల్లి ఇబెంచదేవి, సోదరి సర్ఫిదేవిలకు ‘ఆర్సీపీ కోచి కిచెన్’లో ఉపాధి కల్పించారు. ఈ స్టోరీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. -
కొత్త మార్గంగా డబ్బావాలా క్లౌడ్ కిచెన్!
ముంబై డబ్బావాలా.. తెల్లటి యూనిఫాంలో లంచ్బాక్సులను సైకిల్స్పై రైల్వే స్టేషన్లకు, రైల్వే స్టేషన్ల నుంచి ఆఫీసులకు అందజేస్తూ బిజీబిజీగా గడిపేవారు. సైకిళ్ల మోత, లంచ్ బాక్సుల చప్పుళ్లతో ఆ రోజులన్నీ కళకళలాడేవి. కోవిడ్ ముంబైని తాకింది. తెల్లగా మెరిసే వారి డబ్బాలు కార్పొరేట్ కార్యాలయాల నుంచి అదృశ్యమయ్యాయి. దుమ్ము పేరుకుపోయిన డబ్బాలు, తుప్పు పట్టిన సైకిళ్లు మిగిలిపోయాయి. వారి తెల్లటి యూనిఫాంలు, గాంధీ టోపీలు అల్మారాలో ముడుచుకున్నాయి. కరోనా ప్రభావం వివిధ వర్గాలతోపాటు వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాలకు లంచ్ బాక్స్లు చేసే డబ్బావాలాలపైనా తీవ్రంగా చూపింది. లాక్డౌన్కు ముందు ముంబైలో సుమారు 5000కుపైగా డబ్బావాలాలుండేవారు. వివిధ కారణాలవల్ల ఈ సంఖ్య రెండు వేలకు చేరింది. ప్రస్తుతం ముంబైలో కేవలం 1,500 డబ్బావాలాలున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడం వారిని కలవర పెడుతోంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్లో ముంబైలో డబ్బావాలాలు కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్ఫ్రమ్ హోమ్తో.. ఒకప్పుడు మేనేజ్మెంట్ గురుగా ప్రపంచంలో గుర్తింపు పొందన ముంబై డబ్బావాలాల ఉనికి ప్రమాదంలో పడింది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ ప్రభావం డబ్బావాలాలపై తీవ్రంగా చూపింది. లాక్డౌన్ సమయంలో రవాణా సదుపాయంలేక వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. అప్పుడు డబ్బావాలాల అవసరమే లేకపోయింది. వారికి అసలు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయి. ట్యాక్సీలు, బస్సులు, లోకల్ రైళ్లు తదితరా రవాణ వ్యవస్థలు యథాస్థితికి వచ్చాయి. అయినప్పటికీ అనేక మంది ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. పని చేస్తున్న మరికొన్ని కార్యాలయాల్లో క్యాంటీన్లు ప్రా రంభించారు. కొందరు ఉద్యోగులు ఇంటి నుంచి లంచ్ బాక్స్లు వెంట తీసుకొస్తున్నారు. కొందరు ఉ ద్యోగులు ఆన్లైన్లో ఆర్డర్చేసుకుంటున్నారు. దీంతో డబ్బావాలాల అవసరం లేకుండా పోయింది. లక్ష నుంచి 50 వేలకు.. ఒకప్పుడు ప్రతీరోజు రెండు లక్షల లంచ్బాక్స్లు చేరవేసిన ఈ డబ్బావాలాలు ఇప్పుడు 40 నుంచి 50 వేల వరకు మాత్రమే అందజేస్తున్నారు. ఫలితంగా వారి ఆదాయానికి గండిపడింది. ఒకప్పుడు ఒక్కో డబ్బావాలా నెలకు రూ.20 నుంచి 25 వేలు సంపాదించేవాడు. లంచ్ బాక్స్ల సంఖ్య తగ్గడంతో ఇప్పుడు రూ.12 నుంచి 15 వేలు ఆదాయం రావడం కూడా గగనమైపోయింది. అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారింది. ఫలితంగా ఈ మార్గాన్ని వదులుకుని మరో ఉద్యోగ వేటలో పడ్డారు. డబ్బావాలాల సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. దివాలో నివసించే 40 ఏళ్ల సచిన్ గావ్డే డబ్బావాలాగా జీవితాంతం పేరు తెచ్చుకున్నాడు. అతని ముత్తాతలు 1952 నుండి ముంబైలో డబ్బాలను పంపిణీ చేస్తున్నారు. అదే అతని గుర్తింపు, జీవనాధారం. వర్క్ ఫ్రమ్ హోమ్ తమ జీవితాలను పూర్తిగా తలకిందులు చేసిందని చెబుతున్నాడు. క్లౌడ్ కిచెన్.. ఆన్లైన్ ఆర్డర్స్ అయితే.. దీన్ని ఎదుర్కోవడానికి డబ్బావాలాల నాల్గోతరం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇటీవలే క్లౌడ్ కిచెన్ను మొదలుపెట్టారు. చాలామంది ఇంటి నుంచే పనిస్తుండటంతో లంచ్ బాక్స్లను డెలివరీ చేసే తమ సంప్రదాయ వ్యాపారం క్షీణించింది. ఈ నేపథ్యంలో మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి వంట చేయడం, హోమ్స్టైల్ మీల్స్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట సాకినాకాలో సెంట్రల్ కిచెన్ను స్థాపించాలని ప్లాన్ చేశారు. ఒక స్థలం నుంచి నగరవ్యాప్తంగా భోజనాన్ని పంపిణీ చేయడం సవాలుగా మారుతుందని భావించి వికేంద్రీకృత విధానాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ముంబయిలోని వివిధ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలతో డబ్బావాలాలు భాగస్వాములు అవుతున్నారు. కొంతమంది మహిళలు కలిసి వండిన ఆహారాన్ని ఆయా ప్రాంతాల దగ్గర్లోని ఆర్డర్లకు సప్లై చేస్తున్నారు. దీనివల్ల మహిళలు జీవనోపాధి పొందడంతోపాటు డబ్బావాలాలకు ఉపాధి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్ మెనూని బ్రౌజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు. శాఖాహార, మాంసాహార భోజనం ఉంటుంది. ధర పరిమాణాన్ని బట్టి రూ. 95 నుంచి ప్రారంభమై రూ.120 వరకు ఉంటుంది. రోజువారీ లేదా నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను తీసుకోవచ్చు. ముందు రోజు సాయంత్రంలోపు ఆర్డర్ చేస్తే లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య డెలివరీ చేస్తున్నారు. (చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!) -
'కిచెన్ క్వీన్స్'..వంటగదితోనే వ్యాపారం సృష్టించారు!
కొందరూ మహిళలు మహమ్మారీ కాలాన్ని చెడు కాలంగా ఫీలై గదులకే పరిమితమైపోలేదు. అవరోధంగా భావించకుండా అవకాశంగా మలుచుకున్నారు. వ్యాపారాన్ని సృష్టించుకునేందుకు అనువైనం కాలంగా క్యాష్ చేసుకున్నారు. వ్యాపారవేత్తలుగా మారి స్త్రీ సత్తా ఏంటో చూపించారు. నిజానికి కరోనా కాలం ఎంత భయానకంగా ఉందో చెప్పనవసరం లేదు. ఆ రోజులు గుర్తొచ్చిన బాబోయ్..! అనిపిస్తుంది. కానీ ఈ మహిళలు దాన్నే వరంగా మార్చుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంతో కుటుంబ ఆదాయన్ని సృష్టించుకుంటే. మరికొందరూ ఆ సక్సెస్ ఇచ్చిన స్థైర్యంతో తమ వ్యాపారాన్ని మరింత విస్తరింప చేసేలా చేసుకున్నారు. ఈ మేరకు లక్నోలో ఉండే 51 ఏళ్ల మీనాక్షి ఆర్య వంటపై తనకున్న ఆసక్తనే అవకాశంగా మలిచుకుంది. ఆ వంటిల్లునే చిన్నపాటి వాణిజ్యసంస్థగా మార్చింది. 'పంజాబీ కధై' అనే పేరుతో వివిధ రుచులను పరిచయం చేసింది. కోవిడ్ రోగులకు ఆహారాన్ని అందించడం ద్వారా ప్రారంభమైన బిజినెస్ కాస్త మరింతగా విస్తరించింది. ఆ టైంలో 'క్లౌడ్ కిచెన్' పేరుతో మహిళలు ఇంటి దగ్గరే స్వయంగా తయారు చేసిన ఆహారాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చాలామందికి ఆధారం అయ్యింది. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా హోటల్స్, రెస్టారెంట్ మూసేయడంతో ఇది ఆ మహిళలకు వరమై మంచి ఆధాయ వనరుగా మారింది. ఇక అప్పుడు ఆ టైంలో ఫుడ్ని మీనాక్షి భర్తే డెలీవరీ చేసేవాడు. ప్రస్తుతం మాత్రం ఆమె ఉబర్లో పనిచేసే వ్యక్తి సాయంతో ఆర్డర్లు డెలివరీ చేస్తూ వ్యాపారాన్ని దిగ్విజయంగా నడుపుతోంది. అదేబాటలో నడిచింది శిక్షా ఖండేల్వాల్ ఆమె కూడా తన ఇంటి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి డెలివరి చేసింది. ఆమె ఎక్కువగా కొరియర్ సర్వీస్లపై ఆధారపడింది. అదీగాక ఆ టైంలో టెక్కీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఉద్యోగాలు పోయి వీధిలో నిలబడి పోయే స్థితిలో ఆమెకు కూడా ఈ క్లౌడ్ కిచెన్ ఆధారమైంది. ఇదే కోవలోనే కోలకతాకు చెందని మాజీ ఐటీ ప్రోఫెషనల్ శిక్ష అత్యంత విజయవంతమైన 'కస్ట్మైజ్డ్ క్లౌడ్ కిచెన్'ని నడుపుతోంది. అదే ఆమె ఆధాయానికి బాసటయ్యింది. అలాగే తనలా ఇబ్బంది పడుతున్న ఐటీ వాళ్లకు కూడా ఈ వ్యాపారాన్ని పరిచయం చేసి..తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించే యత్నం చేస్తోంది. ఆమె శాఖాహారం, మాంసహారాన్ని ఎలాంటి డెలీవరీ చార్జీలే లేకుండానే అందిస్తున్నారు. వాటి తోపాటు పచ్చళ్లు, మురబ్బా, పాపడ్, తదితర వాటిని కూడా విక్రయిస్తుంది. ఏదీ ఏమైనా మనసు ఉండాలే గానీ చెడుకాలాన్ని కూడా చెడుగుడు ఆడేలా చక్కటి అవకాశం మార్చుకోవచ్చు అని నిరూపించారు ఈ మహిళలు. (చదవండి: కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్!ఏంటంటే ఇది!) -
ఈ కెటిల్ను.. వండుకున్నాక మడతెయ్యొచ్చు..
గ్రేడ్ సిలికాన్ బాడీతో స్టెయిన్ లెస్ స్టీల్ బాటమ్తో రూపొందిన ఈ ఫోల్డబుల్ కెటిల్.. గ్యాస్ స్టవ్ మీదైనా, ఇండక్షన్ స్టవ్ మీదైనా చక్కగా పని చేస్తుంది. దీని సామర్థ్యం సుమారుగా రెండు లీటర్ల వరకు ఉంటుంది. దీన్ని ఫోల్డ్ చేస్తే చిత్రంలో ఉన్న విధంగా చాలా చిన్నగా మారిపోతుంది. ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. అలాగే.. హీట్ ఇన్సులేషన్ హ్యాండిల్, యాంటీ–స్కాల్డ్ లిడ్తో క్యాంపింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో 3 నుంచి 5 నిమిషాలలో ఓట్ మీల్ లేదా కాఫీ లేదా టీ వంటివి తయారు చేసుకోవచ్చు. గుడ్లు, జొన్నకండెలు, చికెన్, మటన్, కూరగాయలు ఇలా వెజ్, నాన్వెజ్ అని తేడా లేకుండా అన్నింటినీ ఇందులో కుక్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డబుల్ కెటిల్ ధర 194 డాలర్లు (రూ.15,972). -
సంక్షోభం నేర్పిన పాఠం! నగరాల్లోకి 'పెరటి తోటలొచ్చాయ్'!
కోవిడ్–19 మహమ్మారి ప్రభావాల నుంచి కోలుకుంటున్న దశలో శ్రీలంకను 2022లో మరో సంక్షోభం చుట్టుముట్టింది. ఆహారం, ఇంధన కొరతతో కూడిన పెద్ద ఆర్థిక సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకోవడానికి డబ్బులేకపోయింది. ఈ సంక్షోభం తీవ్రత ఎంతంటే.. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంచనా ప్రకారం సంక్షుభిత శ్రీలంకలో ప్రజలు భోజనాల సంఖ్యను 37% తగ్గించుకున్నారు. తినే ఆహారాన్ని 40% తగ్గించుకున్నారు. తక్కువ ఇష్టపడే ఆహారాలను తినటం 68% తగ్గించుకోవాల్సి వచ్చింది. కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ) ఆవరణలో పచ్చికను తొలగించి కూరగాయలు సాగు చేస్తున్న దృశ్యం బయటి నుంచి ఆహారోత్పత్తులు నగరానికి రావటం తగ్గినప్పుడు ఉన్న పరిమితులకు లోబడి నగరంలోనే కూరగాయలు, పండ్లు వంటివి పండించుకోవటం తప్ప వేరే మార్గం లేదు. దేశ రాజధాని కొలంబో అతిపెద్ద నగరమైన కొలంబో(అప్పటి) మేయర్ రోసీ సేననాయక (మార్చి 19న ఆమె పదవీ కాలం ముగిసింది) ఈ దిశగా చురుగ్గా స్పందించారు. కొలంబో మునిసిపల్ కౌన్సిల్ (సీఎంసీ) మద్దతుతో నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆహార పంటలను పండించేలా చొరవ చూపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కూరగాయలు, పండ్ల సాగు ప్రారంభమైంది. కొలంబో విస్తీర్ణం 37 చ.కి.మీ.లు. జనాభా 6.26 లక్షలు (2022). నిజానికి ప్రజల స్థాయిలో టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ప్రయత్నాలకు కొలంబో గతం నుంచే పెట్టింది పేరు. అయితే, పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సెంట్రల్ కొలంబోలో కూరగాయల మొక్కలతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ కరోనాకు ఆర్థిక/ఆహార సంక్షోభం తోడైతే తప్ప కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ)కి, శ్రీలంక ప్రభుత్వానికి అర్బన్ అగ్రికల్చర్ ప్రాధాన్యత ఏమిటో తెలిసిరాలేదు. నగరంలో ఖాళీ స్తలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నంతలో ఆకుకూరలు, కూరగాయల సాగుకు కౌన్సిల్ పచ్చజెండా చూపటమే కాదు.. మొదటి పెరటి తోట కొలంబో టౌన్ హాల్ చుట్టూ ఉన్న పచ్చిక బయలు లోనే ఏర్పాటైంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత 30 సంవత్సరాల క్రితం క్యూబాలోని హవానాలో కూడా ఇలాగే జరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట పచ్చికను తొలగించి కూరగాయ పంటల సాగుకు శ్రీకారం చుట్టిన సందర్భం అది. ఉపయోగించని ప్రతి అంగుళం ఖాళీ స్తలాల్లో ఇంటి పెరటిలో, బాల్కనీలలో, ఇంటి పైకప్పులలోనూ కూరగాయలు పండించమని నివాసితులను, పాఠశాల విద్యార్థులను సీఎంసీ ప్రోత్సహించింది. కొలంబో సిటీ కౌన్సిల్ ఆవరణలో సాగవుతున్న కూరగాయలను పరిశీలిస్తున్న మాజీ మేయర్ రోసీ సేననాయక తదితరులు Good morning from our rooftop terrace #SriLanka #naturelovers #GoodMorningTwitterWorld pic.twitter.com/SkFGeLFr6V— Devika Fernando (@Author_Devika) June 28, 2023 60%గా ఉన్న అల్పాదాయ వర్గాల ప్రజలకు అర్బన్ అగ్రికల్చర్ చాలా అవసరమని సీఎంసీ భావిస్తోంది. కోవిడ్డ మహమ్మారికి ముందు నగరంలో కూరగాయల సాగు ఆవశ్యకతను సీఎంసీలో ఏ విభాగమూ గుర్తించ లేదు. ఇప్పుడు వచ్చిన మార్పు గొప్పది. ఈ సానుకూల ప్రయత్నాలకు శ్రీలంక కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులందరూ పంటలు పండించడానికి శుక్రవారం ఇంట్లోనే ఉండేందుకు వీలు కల్పించింది. సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి, నగర పరిసరాల్లో పడావుపడిన వరి పొలాలు, ఖాళీ ప్రభుత్వ స్తలాలను సాగు చేయడానికి సైన్యాన్ని కూడా నియోగించారు. ప్రైవేటు సంస్థలు కూడా కదిలాయి. సెంట్రల్ కొలంబోలో పూర్తిగా వివిధ కూరగాయ మొక్కలతో రూపొందించిన క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు. పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: దుబాయ్ సిగలో 'రూఫ్టాప్ సేద్యం) -
కిచెన్ క్వీన్ శశికళ.. ఈమె వంటలకు విదేశీయులు కూడా ఫిదా
ఉదయ్పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు. పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది. రాజస్థాన్కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది. ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్పూర్ వస్తుంటారు. -
టమాటా ధర పెరిగిందని టెన్షన్ వద్దు.. ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!
ప్రస్తుతం కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గడిచిన నెలలో ఎండల తీవ్రత.. దీనికి తోడు అకాల వర్షాలు..వీటన్నింటి కారణంగా సరైన దిగుబడి లేకుండా పోయింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో దిగుమతులు కూడాలేవు. దీంతో మొన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న కూరగాయాల ధరలు కాస్తా ఒకేసారి సామాన్యుడు కొనలేనంతగా పైకి ఎగబాకాయి. అందులోనూ.. టమాట ధర సెంచరీ కొట్టేసింది. మొన్నటి వరకు కిలో రూ. 20, రూ. 40గా ఉన్నాయి వంద రూపాయాలు పైనే పలుకుతోంది. అన్ని కూరల్లోనూ గ్రేవీ కోసం టమాటాలను విరివిగా వాడటం సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడూ కొనాలన్నా, ఉపయోగించాలన్న ఆలోచించాల్సిన స్థితి. టమాట వేస్తే ఆ కూర రుచే వేరే. ఆఖరికి రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు సైతం కస్టమర్లకు గ్రేవీతో కూడిన కూర సర్వ్ చేయాలంటే.. అక్కడ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కానీ గృహణులు ఇలాంటి సమయంలోనే తమ పాక శాస్త్ర ప్రావిణ్యాన్ని వెలికితీసి టమాటాకే డౌటు తెప్పించే రుచిగా వండాలి. ఈ ప్రత్యామ్నాయాలతో ఆ కొరతను భర్తీ చేసుకుంటూ టమాటా లాంటి రుచిని తెప్పించి చూపించ్చొఉ. అందుకు కాస్త తెలివిని ఉపయోగిస్తే చాలు. ఇంతకీ అవేమిటో చూద్దామా!. టమాటాలకు అల్ట్రనేటివ్గా వేటిని ఉపయోగించాలంటే.. ►టమాటా వేయగానే కాస్త పులుపు తీపి మిక్సింగ్లతో కూర రుచి అదిరిపోతుంది కదా. దాని ప్లేస్లో చింతపండును చక్కగా ఉపయోగించవచ్చు. అది కూడా కూరకు సరిపడగా పులుపు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడితే ఆ కూర రుచి అదర్స్ అనే చెప్పాలి. ►మార్కెట్లో దొరికే టమాటో పేస్ట్తో కూడా ఆలోటును సులభంగా భర్తి చేసుకోవచ్చు. తాజా టమాటాలు అందుబాటులో లేనప్పుడూ, కొనలేని స్థితిలో ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఇవి మార్కెట్లో కూడా సరసమైన ధరలోనే అందుబాటులో ఉంటాయి. ►ఇక రెడ్ బెల్ పెప్పర్ కూడా టమాటా మాదిరిగా కూరకు రుచిని ఇవ్వగలదు. పైగా కూర మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ►ఇంకోకటి ఆలివ్లు వీటిని ఉడికించి లేదా నేరుగా ఉపయోగించవచ్చు. పండిన ఆలివ్లు అయితే టమాటకు బెస్ట్ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు ►అలాగే ఉసిరి కూడా మంచి పులుపు వగరుతో కూడిని స్వీట్ని అందిస్తుంది. దీనిలో ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు దీనిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కారణంగా క్యాన్సర్-నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న ఆకుపచ్చ ఉసిరికాయ ఆకుపచ్చ టమాటాలను గుర్తుకు తెచ్చే పుల్లని రుచిని అందిస్తుంది. గృహుణులు ఇలాంటి ప్రత్నామ్నాయ చిట్కాలతో టమాటాకు ప్రత్యామ్నాయంగా వాడటం తోపాటు కుటుంబసభ్యులందరికి ఆరోగ్యకరమైన భోజనం పెట్టినవాళ్లం అవుతాం. సో మహిళలు మేథస్సు మన సోంతం. తెలివిగా ఇలాంటి చిట్కాలతో పెరుగుతున్న ధరలకు చెక్పెట్టేలా ఇలా ఇంటిని చక్కబెట్టుకోండి. (చదవండి: మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు) -
వాట్ ఏ క్రియేషన్! కప్పులో దీపాలు!
కప్పులో టీ కామన్.. టీ కప్పులో తుఫాను.. ఒక ఎక్స్ప్రెషన్! టీ కప్పు దీపాలు.. ఇక్కడ విశేషం!! ఇప్పుడు ఇంటి అలంకరణలో ఈ టీ కప్పు దీపాలూ కాంతులీనుతున్నాయి! ఎలాగంటే.. మైనం రంగులు: టీ, కాఫీల్లో ఎన్ని రకాల రుచులు ఉంటాయో.. అన్ని రకాల రంగులు ఉంటాయి. ఆ థీమ్తోనే మైనాన్ని తీసుకొని, కొన్ని రంగులను జత కలిపి.. కప్పులో పోస్తున్నారు. వాటిలో వత్తి వేసి, అందంగా ముస్తాబు చేస్తున్నారు. సువాసనల దీపం: మైనం రంగుల ఎంపికలే కాదు.. వీటికి రకరకాల సువాసనలను జోడిస్తున్నారు. దీంతో ముచ్చటైన వెలుగులు.. ఆ వేడికి కరిగిపోతూ వెదజల్లే రోజ్, జాస్మిన్.. ఫ్లోరల్ పరిమాళాలనూ ఆఘ్రాణించవచ్చు. రీ యూజ్: కప్పులు పాత బడిపోయినా, పగుళ్లు బారినా వాటిని పడేస్తుంటాం. అభిరుచికి పదునుపెడితే పాత టీ కప్పులను మైనపు దీపాలుగా మార్చుకోవచ్చు. డిజైన్ బట్టి ధర: పింగాణీ కప్పుల ధర, ఎంపిక చేసుకున్న పరిమళాలు.. వెలుగులను బట్టి వీటి ధరలు వందల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెట్లోనూ కొనుక్కునే వీలుంది. (చదవండి: ఆత్మవిశ్వాసాన్ని బహుమానంగా గెలుచుకున్నారు) -
వారేవా... వంటల రోబో!
వంట చేయడం కొందరికి ఎంతో హాయి. కొందరికి మాత్రం అయ్ బాబోయ్! ఇలాంటి వారి కోసం వచ్చిందే వంటలు వండే రోబో! నటి, బ్లాగర్ షెహనాజ్ ట్రెజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఏఐ–పవర్డ్ నోష్ రోబోట్ వీడియో వైరల్ అయింది. రోబోట్కు షెహనాజ్ ఆర్డర్ ఇవ్వగానే చకచకమని పెస్టో పనీర్ చేసి పెట్టింది. ఈ రోబోట్లో ఇన్గ్రేడియెంట్స్ యాడ్ చేయడానికి స్లాట్స్ ఉంటాయి. ‘ఏఐ రోబోట్స్ ఇప్పుడు ఇండియన్ కిచెన్లలోకి వచ్చేశాయి’ అని ప్రకటించింది షెషనాజ్. ‘ఈ రోబోట్ చేసే వంట అమ్మ చేసే వంట కంటే బాగుంటుంది’ అనే మాటపై మాత్రం చాలామంది భగ్గుమన్నారు. ‘అవసరమే ఆవిష్కరణకు తల్లిలాంటిది’ అంటారు. ఒక యువకుడు తన ఊరికి దూరంగా వృత్తిరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు అమ్మ చేసే వంటకాలను బాగా మిస్ అయ్యాడు. ఆ లోటు నుంచే ఈ ఏఐ రోబోట్ను సృష్టించాడు! -
ఫన్నీ వీడియో: నీ వంట.. నీ మంట.. నీ ఇష్టం..నేను నా బిడ్డ జంప్
-
టీటీకే ప్రెస్టీజ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ ఎక్స్చేంజీ ఆఫర్
ముంబై: వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్ ‘ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్’ ఎక్స్చేంజ్ ఆఫర్ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రెస్టీజ్ ఉత్పత్తుల ధరపై 24–66% వరకు తగ్గింపుతో ఈ ఆకర్షణీయమైన ఎక్స్చేంజీ ఆఫర్ను పొందేందుకు కస్టమర్లు తమ పాత వంట సామాగ్రిని తీసుకొచ్చి వాటిని మార్పిడి చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ అద్భుతమైన ఆఫర్ జూన్ 30 వరకు కొనసాగుతుంది. ‘‘మా కస్టమర్లు బ్రాండ్కు విధేయులు. ఈ బంపర్ ఆఫర్ ద్వారా వారితో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఆకర్షణీయమైన డీల్స్లో అత్యుత్తమ ఉత్పత్తులు అందిస్తున్నాము’’ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ గార్గ్ తెలిపారు. -
ఆగ‘మేఘాల’ ఘుమ ఘుమల.. ఓ వంటిల్లు.. వందలాది కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: ఆకర్షణీయమైన పరిసరాలు.. అద్భుతమైన ఆహా్వనం.. అభిరుచికి తగిన ఆహారం.. అతిథి దేవోభవ అనిపించే సేవలు.. భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు రెస్టారెంట్లు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. గతంలో హోటల్కు వెళ్లి తినడాన్ని జనం అంతగా ఇష్టపడేవారు కాదు. కొందరు అదేదో లగ్జరీగా భావించేవారు. ఇప్పుడు వీకెండ్లో కుటుంబంతో సహా రెస్టారెంట్కు వెళ్లడం సాధారణంగా మారిపోయింది. ఆన్లైన్ డెలివరీలు పెరిగిన నేపథ్యంలో.. వారంలో రెండు మూడుసార్లన్నా బయట ఆర్డర్ చేసి తెప్పించుకోవడమూ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ బిజినెస్ లాభదాయకమనే భావన ఉన్నప్పటికీ..ఆశించిన ఆదరణ లభించకపోతే భారీ నష్టాన్ని మూటగట్టుకోవడం మాత్రం ఖాయం. ఈ నేపథ్యంలోనే ఫుడ్ బిజినెస్కు సంబంధించి ఓ సరికొత్త ట్రెండ్ మొదలైంది. అదే క్లౌడ్ కిచెన్. దేశ, విదేశాల్లో ఎప్పట్నుంచో ఉన్న ఈ క్లౌడ్ కిచెన్లు ఇప్పుడు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ప్రారంభమవుతూ ఆదరణ పొందుతున్నాయి. ఒక వంటిల్లు.. వందలాది కస్టమర్లు అన్నట్టుగా క్లౌడ్ కిచెన్ల హవా సాగుతోంది. కరోనా సమయంలో ఇవి ఎక్కువగా పుంజుకున్నాయి.మూడేళ్ల క్రితం హైదరాబాద్లో పాతిక మించి లేని క్లౌడ్ కిచెన్లు ఇప్పుడు వందల సంఖ్యకు చేరాయి. విలాసవంతమైన రెస్టారెంట్లు..లేదు లేదు అసలు రెస్టారెంట్ అన్న భావనకు ఇది పూర్తిగా భిన్నం. హంగూ ఆర్భాటాలు ఏమీ ఉండవు. రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిలో 1/3 వంతు సరిపోతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ సిబ్బంది, తక్కువ వ్యయ ప్రయాసలు..స్పష్టంగా చెప్పాలంటే ఒక్క వంటిల్లు మాత్రమే ఉంటుంది. నో డైన్ ఇన్..ఓన్లీ డెలివరీ. కూర్చుని తినడానికి వీలుండదు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సప్లై చేస్తారు..అంతే. క్లిక్ అయితే ఎక్కువ లాభాలు. ఆదరణ లభించకపోయినా అంతంత మాత్రంగానే నష్టం..ఇదే క్లౌడ్ కిచెన్ మూల సూత్రం. షార్ట్ టైమ్.. ఫుల్ పికప్.. జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్స్ సృష్టించిన ఈ ట్రెండ్ కరోనా విజృంభణ సమయంలో పట్టును దక్కించుకుంది. ఇంటర్నెట్ విస్తృత వ్యాప్తి, వ్యాపారంలో సాంకేతికత, ప్రత్యేక యాప్ల పెరుగుదల ఇందుకు దోహదపడింది. పెరుగుతున్న యువ జనాభా ఆదాయం, మారుతున్న జీవనశైలి, సులభమైన.. సురక్షితమైన చెల్లింపు మార్గాలు, వంటింట్లో బిజీబిజీ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం ఇత్యాదివన్నీ కూడా వీటికి ఆదరణ పెరగడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. ఇంట్లో వండినట్టుండే ఆహారం నుంచి స్పెషాలిటీ లగ్జరీ డిన్నర్ల వరకు ప్రతిదానిని అందించడం ద్వారా క్లౌడ్ కిచెన్లు ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తక్కువ రేటుతో, నాణ్యమైన భోజనం, నిమిషాల్లో ఇంటి ముందు ప్రత్యక్షమవుతుండటంతో నానాటికీ వీటికి ఆదరణ పెరుగుతోంది. 2019లో దేశంలో 400 మిలియన్ల డాలర్లుగా ఉన్న క్లౌడ్ కిచెన్ల వ్యాపారం 2024 నాటికి 2 బిలియన్ల డాలర్లకు చేరుతుందని ఎఫ్ అండ్ బీ (ఫుడ్ అండ్ బివరేజెస్) పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం. ఒకేచోట 100కు పైగా.. శాకాహార, ఆరోగ్యకరమైన వంటకాలు, ప్రాంతీయ రుచికరమైన వంటకాలు వంటివి అందించే ఆఫ్లైన్ రెస్టారెంట్ల సంఖ్య పెరగడాన్ని.. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ క్లౌడ్ కిచెన్ల ఏర్పాటును ఈ ఏడాది చూడవచ్చునని నిపుణులు అంటున్నారు. స్విగ్గీ, జొమాటో వంటివి..క్లౌడ్ కిచెన్లకు ఆధారంగా ఉన్నప్పటికీ, భారీ కమీషన్ల ఫలితంగా, కొన్ని క్లౌడ్ కిచెన్లు తమ సొంత యాప్లు, సెల్ఫ్ డెలివరీ ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. నాగచైతన్య వంటి సినిమా తారలను సైతం ఈ క్లౌడ్ కిచెన్స్ ఆకర్షిస్తున్నాయి. నగరంలోని డీఎల్ఎఫ్ ఏరియా లాంటి ఒకేచోట 100కు పైగా క్లౌడ్ కిచెన్లు ఉన్నాయంటే వీటికి లభిస్తున్న ఆదరణను అర్ధం చేసుకోవచ్చు. సినీహీరో నాగచైతన్య ఏర్పాటు చేసిన ‘షోయు’ ఇప్పటికే బాగా ట్రెండింగ్లో ఉంది. ట్రెండ్ను మేం ముందే ఊహించాం.. పాతికేళ్లుగా మేం మిఠాయిల తయారీలో ఉన్నాం. ఈ ట్రెండ్ని ముందే ఊహించి సహదేవ్రెడ్డి టిఫిన్స్ పేరుతో క్లౌడ్ కిచెన్ అందరికీ తెలిసే సమయానికే మేం ప్రారంభించాం. సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్, చాట్ వంటివన్నీ డెలివరీ చేస్తాం. మా కిచెన్ దిల్సుఖ్నగర్లో ఉంది. తెల్లవారుజాము 4 గంటలకే స్టార్ట్ చేసి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ నిర్వహిస్తాం. సిటీలోని అన్ని ప్రాంతాల నుంచీ ఆర్డర్స్ వస్తున్నాయి. వ్యయ ప్రయాసల పరంగా చూస్తే ఇది చాలా మంచి వ్యాపారం. గృహిణులు, యువత దీన్ని బాగా అందిపుచ్చుకుంటున్నారు. –పి.అభి షేక్రెడ్డి, సహదేవ్రెడ్డి టిఫిన్స్ దూకుడు పెరగడం ఖాయం మొదట్లో కొన్ని ఐటమ్స్కే పరిమితమైనా ఇప్పుడు రెస్టారెంట్లో దొరికే వెరైటీలన్నీ అందిస్తున్నాయి. బిర్యానీల కోసం ఒకటి, పరోటాల కోసం ఒకటి, బర్గర్స్, పిజ్జాల కోసం, స్వీట్స్, పేస్ట్రీల కోసం.. ఇలా దేనికదే ప్రత్యేక కిచెన్స్ వచ్చేశాయి. అపరిమితమైన కస్టమర్స్ బేస్ అవకాశాల వల్ల వీటి దూకుడు ఇంకా పెరగడం తథ్యం. –సంకల్ప్, హైదరాబాద్ ఫుడీస్ క్లబ్ హైదరాబాద్ టాప్... గత కొంత కాలంగా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్న మేం లగ్జరీ డైనింగ్ను కెఫెల ద్వారా అందిస్తున్నాం. మా బ్రాండ్కు ముంబయి, బెంగళూరు, చెన్నై సహా ప్రతిచోటా క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్లో మాకు ఆదరణ చాలా స్పీడ్గా పెరిగింది. బంజారాహిల్స్, గచ్చిబౌలి , ఎల్బీనగర్... ఇలా 4 చోట్ల మా కిచెన్స్ నిర్వహిస్తున్నాం. –భాను, లూయిస్ బర్గర్స్ -
చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే?
రెస్టారెంట్ కిచెన్లలో సిబ్బంది మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధిస్తారు యజమానులు. వేడి వాతావరణం, గ్యాస్ లీకైతే పేలుడు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ముందుజాగ్రత్తగా ఫోన్లు తీసుకురావొద్దని చెబుతారు. అయితే ఓ మహిళ మాత్రం ఈ రూల్ను పక్కనపెట్టింది. మొబైల్ ఫోన్ను రెస్టారెంట్ కిచెన్లోకి తీసుకెళ్లింది. ఫ్రై చేస్తున్న సమయంలో ఫోన్లో ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆమె దృష్టిమళ్లింది. వెంటనే జేబులోనుంచి ఫోన్ తీసి చూసింది. అయితే అనుకోకుండా ఆ ఫోన్ ఆమె చేతిలోనుంచి జారి సలసల మరిగే నూనెలో పడిపోయింది. దీంతో షాకైన ఆమె వెంటనే పట్టుకారుతో ఆ ఫోన్ను నూనెలోనుంచి బయటకు తీసింది. కానీ అప్పటికే అంతా అయిపోయింది. ఆ ఫోన్ దేనికి పనికిరాకుండా పోయింది. ఆ మహిళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. Oops pic.twitter.com/acPOyFARHU — cctv ediots 📷 (@cctv_videos) March 2, 2023 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ఆ ఫోన్ను వెంటనే బియ్యంలో పెట్టారా? అలా చేస్తే పనిచేస్తుంది కదా? అని ఓ నెటిజన్ చలోక్తులు విసిరాడు. మరో యూజర్ స్పందిస్తూ.. ఫోన్ సంగతి సరే.. ఆ నూనెను మార్చాల్సి వస్తుందని వారు బాధపడుతున్నారేమో? సలసల మరిగే నూనెలో సెల్ఫోన్ పడితే ఎలాంటి కెమికల్స్ విడుదలవుతాయో ఆ దేవుడికే తెలియాలి అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఫోన్ నూనెలో పడగానే నేనింకా ఆమె చేతితో దాన్ని బయటకు తీస్తుందేమో అనుకున్నా.. అని నవ్వులు పూయించాడు. చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్ -
ఇంట్లోనే ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసే అదిరిపోయే గాడ్జెట్స్.. ధర ఎంతంటే?
పర్యావరణానికి అతిపెద్ద బెడద ప్లాస్టిక్ చెత్త. ప్లాస్టిక్ చెత్త సమస్య పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. వాటిలో భాగమే ప్లాస్టిక్ రీసైక్లింగ్. ఇప్పటివరకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ భారీగా పారిశ్రామిక స్థాయిలోనే అరకొరగా జరుగుతోంది. అయితే, ఇంటిపట్టునే ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే యంత్రం తాజాగా అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ బహుళజాతి సంస్థ ‘క్లియర్డ్రాప్’ ప్లాస్టిక్ను రీసైకిల్ చేసే ‘సాఫ్ట్ ప్లాస్టిక్ కాంపాక్టర్’ను రూపొందించింది. వాషింగ్ మెషిన్లా కనిపించే ఈ యంత్రంలో ప్లాస్టిక్ సంచులు వంటి మెత్తని ప్లాస్టిక్ చెత్తను పడేసి, స్విచాన్ చేస్తే, నిమిషాల్లోనే రీసైక్లింగ్కు పనికొచ్చే ఇటుకలుగా తయారు చేస్తుంది. ఈ యంత్రం పనిచేసేటప్పుడు ఎలాంటి పొగ వెలువడదని, దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని తయారీదారులు చెబుతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది. ధరను ఇంకా ప్రకటించలేదు. -
బిజీ లైఫ్కి బెస్ట్ ఛాయిస్.. ఏ వంటైనా నిమిషాల్లో రెడీ!
బీజీ లైఫ్లో వేళకు వంట కావాలన్నా.. వండిన వంటకం రుచికరంగా ఉండాలన్నా.. ఈ మల్టీఫంక్షనల్ డివైజ్ని వంటింట్లో పెట్టుకోవాల్సిందే. ఇందులో చాలా వెరైటీలను నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఒక వైపు శాండ్విచ్, ఆమ్లెట్స్, వాఫిల్స్, చికెన్ ఫ్రై.. మరోవైపు గుడ్లు ఉడికించుకోవడంతో పాటు తక్కువ మోతాదులో నూడుల్స్, రైస్ ఐటమ్స్, కర్రీస్, సూప్స్ వంటివీ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా బౌల్స్, ట్రేస్, గ్రిల్ ప్లేట్స్ ఇలా చాలానే డివైజ్తో పాటు లభిస్తాయి. ఇందులో పాలు కూడా కాగబెట్టుకోవచ్చు. స్వీట్స్, కేక్స్ వంటి ఎన్నో వెరైటీలను చేసుకోవచ్చు. ఇంకా ఈ డివైజ్ పింక్, మిల్కీ వైట్ రంగుల్లో కూడా లభిస్తున్నాయి. ఇది చూడటానికి కూడా.. మీ వంటగదికి ప్రత్యేకమైన లుక్ని తెచ్చిపెడుతుంది. ఇందులో ఫ్రైడ్ ఎగ్ ఒకే ఒక్క నిమిషంలో, కుడుములు 8 నిమిషాల్లో, శాండ్విచ్ 3 నిమిషాల్లో.. ఇలా ఒక్కో ఐటమ్ చాలా వేగంగా సిద్ధమవుతుంది. చదవండి: ‘ఫ్లిప్కార్ట్ కస్టమర్లకు భారీ షాక్’ -
అదృష్టం అంటే ఇది.. కిచెన్లో బంగారు నాణేలు.. ఊహించని ధరతో షాక్!
అదృష్టం ఆవగింజంత, దురదృష్టం దబ్బకాయంత అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, యూకేలోని ఓ కుటుంబానికి మాత్రం అది వర్తించలేదు. వారికి అదృష్టం కూడా దబ్బకాయంత పట్టుకుంది. పదేళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇంటిలో భారీ ఎత్తున బంగారు నాణేలు లభించిన వార్త సెప్టెంబరు నెలలో చదివే ఉంటారు! తాజాగా ఆ వార్త తాలూకు మరో విషయం వైరల్గా మారింది. ఇంటి వంటగదిలో మరమ్మతులు చేస్తుండగా క్రీ.శ.1700 ప్రారంభ కాలానికి చెందిన 254 గోల్డ్ కాయిన్స్ బయల్పడిన సంగతి తెలిసిందే. అయితే, వాటిని అమ్మితే సుమారు రూ.2.3 కోట్లు (2,50,000 యూకే పౌండ్లు) రావొచ్చని అంచనావేశారు. కానీ, ఆ అంచనా తప్పయింది. అంతకు మూడింతలు అంటే సుమారు రూ.7 కోట్లు ఆ సంపద ధర పలికిందని లండన్కు చెందిన వేలం సంస్థ స్పింక్ అండ్ సన్ ప్రతినిధి గ్రెగరీ ఎడ్మండ్ తెలిపారు. ఫెర్న్లీ-మాయిస్టర్స్ కాలానికి చెందిన నాణేలు కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు. 292 ఏళ్ల పూర్వ కాలానికి చెందిన ఈ సంపదను చేజిక్కిచ్చుకునేందుకు ప్రపంచంలోని చాలామంది ఔత్సాహికులు పోటీ పడ్డారని ఆయన వెల్లడించారు. ముందుగా అనుకున్నదానికంటే మూడు రెట్లు అధికంగా ధర రావడం ఇంతకుముందెప్పుడూ చూడలేదని అన్నారు. కాగా, పాతకాలానికి చెందిన ఆ బంగారు సంపదను చిన్న మొత్తాల్లో విక్రయించారని మెట్రో నివేదిక పేర్కొంది. (చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!) -
TIPS: రోజూ వాడే పాలప్యాకెట్లను పడేస్తున్నారా.. ఇలా వాడుకోవచ్చు
పాలు నిల్వచేయడానికి వాడే ప్యాకెట్ గట్టిగా ఉంటుంది. అందువల్ల ప్యాకెట్లన్నింటిని వెడల్పుగా కత్తిరించి శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత ఒకదానితో ఒకటి కలిపి చిన్న చిన్న బుక్స్కు అట్టలుగా, ప్యాకింగ్ కవర్లుగా వాడుకోవచ్చు. దీనివల్ల నోట్బుక్స్, ప్యాకింగ్ చేసిన వస్తువులు తడవకుండా ఉంటాయి. ►పాలప్యాకెట్లను గరాటు ఆకారంలో రోల్ చేసి ఊడకుండా టేప్తో గట్టిగా అతికించాలి. ఈ గరాటులో ఫుడ్క్రీమ్, మెహిందీ వేసి నచ్చిన విధంగా డిజైన్లు వేసుకోవచ్చు. ∙ఇంట్లో చాలా పాల ప్యాకెట్లు ఉన్నప్పుడు అన్నింటిని కలిపి మ్యాట్లా కుట్టు్టకుని వాడుకోవచ్చు. ►ప్యాకెట్లతో విసనకర్రలా తయారు చేసి వాడుకుంటే చల్లటి గాలి వస్తుంది. ►కుండీల్లో మొక్కలు పెంచే స్థలం లేనప్పుడు పాలప్యాకెట్లలో మొక్కలను పెంచుకోవచ్చు. ప్యాకెట్స్లో కొద్దిగా మట్టి పోసి విత్తనాలు వేసి చిన్నచిన్న మొక్కలు పెంచుకోవచ్చు. -
వంటింటి చెత్తను ఎరువుగా మార్చే డస్ట్ బిన్! ధర ఎంతంటే!
చూడటానికి ఇదేదో కొత్తరకం పీపాలా ఉంది కదూ! అటూ ఇటుగా పీపా ఆకారంలోనే ఉన్న చెత్తబుట్ట ఇది. అలాగని సాదాసీదా చెత్తబుట్ట కాదు, హైటెక్ చెత్తబుట్ట. వంటింటి వ్యర్థాలను ఇది గంటల వ్యవధిలోనే ఎరువుగా మార్చేస్తుంది. ఇందులో రెండులీటర్ల పరిమాణం వరకు వంటింటి ఆహార వ్యర్థాలను వేసుకోవచ్చు. దీని వేగాన్ని ఎంపిక చేసుకునేందుకు నాలుగు బటన్లు, లోపల ఎంతమేరకు ఖాళీ ఉందో తెలుసుకోవడానికి వీలుగా ఎల్సీడీ డిస్ప్లే, ట్రాన్స్పరెంట్ మూత ఉంటాయి. స్టాండర్డ్ మోడ్ ఎంచుకుంటే, నాలుగు గంటల్లోనే ఇందులో వేసిన చెత్తంతా ఎరువుగా తయారవుతుంది. హైస్పీడ్ మోడ్ ఎంచుకుంటే, రెండు గంటల్లోనే పని పూర్తవుతుంది. ఫెర్మెంట్ మోడ్ ఎంచుకుంటే, ఎరువు తయారీకి దాదాపు ఆరుగంటల సమయం పడుతుంది. అయితే, ఈ మోడ్ ఎంపిక చేసుకుంటే, విద్యుత్తు తక్కువ ఖర్చవుతుంది. ఇందులో తయారైన ఎరువును పెరటి మొక్కల కోసం వాడుకోవచ్చు. తక్కువ ధరకు బయట ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఈ హైటెక్ చెత్తబుట్ట ఖరీదు 269 డాలర్లు (రూ.21,336). -
సిటీలో ఊపందుకున్న క్లౌడ్ కిచెన్ ట్రెండ్.. నాగచైతన్య, రానా కూడా..
జొమాటో, స్విగ్గీల వంటి ఫుడ్ యాప్లకు హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కస్టమర్ బేస్ ఉంది. సదరు ఖాతాదారులకు నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలు కోరుకుంటారు. ఫుడ్ యాప్లకు రెస్టారెంట్లుండవు. వారు సిటీలోని పలు రెస్టారెంట్లపై ఆధారపడతారు. ఈ నేపథ్యంలో వారు కోరుకున్న రుచులు శరవేగంగా అందించేందుకు పుట్టుకొచ్చినవే క్లౌడ్ కిచెన్స్. స్పీడ్.. క్లౌడ్.. ∙భోజన ప్రియులను కూర్చోబెట్టి ఆతిథ్యం అందించే రెస్టారెంట్ తరహా వసతులేవీ లేకుండా కేవలం ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుని వండి సరఫరా చేసేవే క్లౌడ్ కిచెన్లు. అలా చాలా రెస్టారెంట్లు సరఫరా చేస్తున్నప్పటికీ, ధర, టైమ్, నాణ్యత, రుచి లో కూడా క్లౌడ్ కిచెన్లు మరింత మెరుగ్గా ఉంటున్నాయంటున్నారు సిటిజనులు. నగరంలో డైన్ ఇన్ సేవలు అందించే కొన్ని పేరొందిన రెస్టారెంట్స్ తమ కిచెన్కు అనుబంధంగా ఈ తరహా క్లౌడ్ కిచెన్లను నిర్వహిస్తుండగా కొన్ని ఇతర బ్రాండ్లకు అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నాయి. కేవలం 100 గజాల స్థలం ఉంటే చాలు కిచెన్ ఏర్పాటు చేసి నిపుణులను నియమించుకుని బిజినెస్ ప్రారంభించేసే అవకాశం ఉండడం అనేక మందిని ఆకర్షిస్తోంది. జాతీయ స్థాయిలో పేరొందిన రెబల్ ఫుడ్స్ నగరంలో 30కిపైగా కిచెన్స్ను నిర్వహిస్తుండగా.. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఈ రంగంలో అడుగుపెట్టాడు. ఇక మన టాలీవుడ్ నటుడు నాగచైతన్య షోయు పేరుతో స్విగ్గీపై తన క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాడు. మరో నటుడు రానా సైతం ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాడు. కోవిడ్.. క్లౌడ్ దౌడ్... ∙కోవిడ్ ఉద్ధృతి టైమ్లో, ఆ తర్వాత కూడా నగరవాసులు రెస్టారెంట్స్లో తినే అలవాటు తగ్గించుకున్నారు. దీంతో డైన్ ఇన్ రెస్టారెంట్స్ బాగా దెబ్బతిన్నాయి. (నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2021లో రెస్టారెంట్ పరిశ్రమ 53 శాతం కుదేలైంది.) ఆ పరిస్థితిలోనే క్లౌడ్ కిచెన్ల ఊపందుకున్నాయి. ∙క్లౌడ్ కిచెన్ల నిర్వహణలో భాగంగా మార్కెటింగ్, డిజిటల్ బ్రాండింగ్పై తప్పనిసరి. ఆహారం ఆర్డర్లు మోసుకొచ్చే జొమాటో, స్విగ్గీ వంటి మధ్యవర్తులకు కమీషన్లు చెల్లించాలి. ఇంట్లో వండే అలవాటు తగ్గుతున్న మధ్య తరగతి వల్ల భవిష్యత్తులోనూ ఈ తరహా కిచెన్లు మరిన్ని రావడం తధ్యమని ఆన్లైన్ రెస్టారెంట్ల పరిశ్రమలో అతిపెద్ద సంస్థ రెబల్ ఫుడ్స్కి చెందిన కల్లోల్ బెనర్జీ అంటున్నారు. ఒకటే కిచెన్ ఆరు బ్రాండ్స్.. అంతకు ముందు నుంచే ఉన్నప్పటికీ...కోవిడ్ సమయంలో క్లౌడ్ కిచెన్స్కు బాగా ఆదరణ పెరిగింది. మేం ప్రస్తుతం 2 బ్రాండ్స్ పేరిట చైనీస్ ఫుడ్, బిర్యానీలు ఆన్లైన్ సప్లయి చేస్తున్నాం గతంలో 6వరకూ అందించిన అనుభవం ఉంది. ఆకట్టుకునే ప్యాకేజీ, అందుబాటు ధర, నాణ్యత మూడూ ఈ బిజినెస్లో చాలా ముఖ్యమైనవి. – రుత్విన్ రెడ్డి, దావత్ క్లౌడ్ కిచెన్స్ పెద్ద ప్లేస్ అక్కర్లేదు. వెయిటర్స్, ఫ్రంట్ డెస్క్ స్టాఫ్ అవసరం లేదు. పార్కింగ్ స్పేస్ ఇవ్వక్కర్లేదు. ఏసీలూ, ఫర్నిచరూ.. వగైరాలూ తప్పనిసరి కాదు. పెట్టుబడి కూడా స్వల్పమే. కానీ ఓ పెద్ద రెస్టారెంట్కి పోటీ ఇవ్వొచ్చు. అదే రెస్టారెంట్కి ఆదాయ వనరుగా కూడా మారొచ్చు. ఊపందుకుంటున్న ఆ వ్యాపారం పేరే క్లౌడ్ కిచెన్. నాగచైతన్య, రానా వంటి సినీ తారలు కూడా ఈ ట్రెండీ బిజినెస్కు మేము సైతం అంటున్నారు. చదవండి: అలా జరిగింది.. రూపాయితో 20 వేలు! -
కిచెన్లోకి వెళ్లిన భార్య ఒక్కసారిగా భయంతో..
శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగరంలోని చాలుక్య నగర్లో మంజునాథ్ అనే వ్యక్తి ఇంటిలో ఓ నాగుపాము వంట గదిలో దూరింది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో మంజునాథ్ భార్య వంట చేయడానికి పాత్రలు తీస్తుండగా ఒక్కసారిగా బుసలు కొట్టడంతో ఆమె భయంతో పరుగు తీసింది. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న స్నేక్ కిరణ్ అక్కడికి చేరుకుని పామును పట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఘటనలో.. బూదిపడగ గ్రామంలో శిలాయుగం నాటి సమాధులు మైసూరు: చామరాజనగర జిల్లా బూదిపడగ గ్రామంలో పురాతన సమాధులు బయటపడ్డాయి. మైసూరు వర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు శాఖ విభాగం సహాయ ప్రాధ్యాపకురాలు వి.శోభ నేతృత్వంలోని అధికారుల బృందం గ్రామ సమీపంలో సుమారు 300 మీటర్ల దూరంలో తవ్వకాలు చేపట్టింది. సుమారు 9 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో ఉన్న కట్టడాలు బయట పడ్డాయి. వీటిని పరిశీలించగా సమాధులుగా గుర్తించారు. ఇవి క్రీ.పూ.1,500 లేదా అంతకంటే ముందునాటివి అయి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చదవండి: ఎస్ఐ పరీక్షలో అక్రమాలు.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు -
క్రాంప్టన్ గ్రీవ్స్ చేతికి బటర్ఫ్లై
న్యూఢిల్లీ: బటర్ఫ్లై బ్రాండ్తో కిచెన్ అప్లయెన్సెస్ విక్రయించే గంధిమతి అప్లయెన్సెస్ను ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ సొంతం చేసుకోనుంది. గంధిమతిలో మెజారిటీ వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా షేరుకి రూ. 1,403 ధరలో 55 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,380 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బటర్ఫ్లై వాటాదారులకు షేరుకి రూ. 1,434 ధరలో ఓపెన్ ఆఫర్ను ప్రకటించింది. సెబీ నిబంధనల ప్రకారం 26 శాతం వాటావరకూ కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 667 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వెరసి గంధిమతి అప్లయెన్సెస్ కొనుగోలుకి రూ. 2,077 కోట్లవరకూ వెచ్చించనుంది. టాప్–3లో ఒకటి..: బటర్ఫ్లై బ్రాండుతో గంధిమతి అప్లయెన్సెస్ మిక్సర్ గ్రైండర్లు, టేబుల్ టాప్ వెట్ గ్రైండర్లు, ప్రెజర్ కుకర్లు, ఎల్పీజీ స్టవ్లు, నాన్స్టిక్ కుక్వేర్, స్టెయిన్లెస్ స్టీల్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్లు తదితరాలను విక్రయిస్తున్న విషయం విదితమే. ఈ విభాగంలో దేశీయంగా టాప్–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ పేర్కొంది. డీల్ వార్తల నేపథ్యంలో బటర్ఫ్లై షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,396 వద్ద నిలవగా.. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 7.5 శాతం జంప్చేసి రూ. 409 వద్ద ముగిసింది. -
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించిన సీఎం జగన్
-
డబ్బావాలాల కొత్త వ్యాపారం సెంట్రల్ కిచెన్
సాక్షి, ముంబై: కరోనా కారణంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ముంబై డబ్బావాలాలు ప్రత్యామ్నాయ వేటలో పడ్డారు. అందులో భాగంగా ‘డబ్బావాల సెంట్రల్ కిచెన్’అనే కొత్త పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ముంబై డబ్బావాలాలు నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. కొత్త వ్యాపారం ద్వారా ప్రతీరోజు సుమారు 70 వేల వినియోగదారులకు భోజన సౌకర్యం కల్పించనున్నారు. 130 ఏళ్ల నుంచి లంచ్ బాక్స్లు చేరవేత మేనేజ్మెంట్ గురుగా పేరు సంపాదించుకున్న ముంబై డబ్బావాలాలు స్వాతంత్య్రానికి ముందు అంటే సుమారు 130 ఏళ్ల నుంచి ముంబైలోని వివిధ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు లంచ్బాక్స్లు చేరవేస్తున్నారు. ఇదివరకు లంచ్ బాక్స్లు తారుమారైన సంఘటనలు లేవు. కార్యాలయాల్లో లంచ్ టైమ్కు ముందే ఉద్యోగుల చెంతకు లంచ్ బాక్స్లు చేరవేసేవారు. క్రమశిక్షణలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కాని కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం 2020 మార్చిలో లాక్డౌన్ అమలు చేసింది. అప్పటి నుంచి ముంబై డబ్బావాలాల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. చదవండి: (భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు..) కార్యాలయాలన్నీ మూసివేయడంతో ఉపాధి కరువైంది. అనేక డబ్బావాలాల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. గత్యంతరం లేక కొందరు సెక్యూరిటీ గార్డులుగా మారారు. మరికొందరు మంది స్వగ్రామాలకు తరలిపోయి అక్కడ వ్యవసాయ కూలీలుగా, మరికొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఎవరు, ఎక్కుడున్నారో తెలియదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఆంక్షలు వి«ధించడంతో ఎవరు, ఎçప్పుడు విధులకు వస్తున్నారో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో డబ్బావాలాలకు ఇప్పటికీ ఉపాధి లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేసి ఉపాధి పొందాలని నిర్ణయం తీసుకున్నారు. -
నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?
కస్టమర్ల కోసం ఇండోర్ సీటింగ్ ఉండదు. వెయిటర్లు ఉండరు. డైనింగ్ రూమ్ ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫుడ్ డెలివరీ వోన్లీ తరహా రెస్టారెంట్లను ‘ఘోస్ట్ కిచెన్’ అంటారు. truthiness అంటే? అమెరికన్ టెలివిజన్ కమెడియన్ స్టిఫెన్ కోల్బర్ట్ ఈ టెర్మ్ను కాయిన్ చేశాడు. సాక్ష్యాలు, ఆధారాలతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని గట్టిగా నమ్మడం... ట్రూతినెస్. sobercurious అంటే? ఆల్కహాల్ ముట్టకుండా ఒక నిర్ణితమైన కాలాన్ని ప్రయోగాత్మకంగా గడపడం. (చదవండి: పూజను 70 లక్షల మంది ఫాలో అవుతున్నారు.. ఎందుకంటే!) హైపర్బొలి అనగా... ఏదైనా విషయాన్ని కాస్త అతిశయంగా చెప్పడమే హైపర్బొలి. భావాన్ని యథాతథం గా తీసుకోవద్దు. కవితల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఉదా: అతని కళ్లు కన్నీటి సముద్రాలు అయ్యాయి. convolution అంటే ఒక విషయం కష్టంగా, సంక్లిష్టంగా ఉండడం. ‘మనం సృష్టించకపోతే పదాలు ఎలా పుడతాయి!’ అనేది ఒక పాలసీ. పాత పదాలనే కొత్తగా కాయిన్ చేయడం అనేది మరో పద్ధతి. ‘ఒరిజనల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్’కు దగ్గరగా తమాషా పదాలను సృష్టించడమే aptagram -
వంటింట్లో పాలు పొంగిపోతున్నాయా?.. ఈ చిట్కా బాగుందే
How To Stop Milk Boiling Over: సాధారణంగా కొత్త ఇల్లు కొన్నవారు గృహప్రవేశ సమయంలో గిన్నెలో పాలు వేసి వాటిని వేడిచేస్తూ పొంగించంటం చేస్తుంటారు. అయితే అది సంప్రదాయంలో భాగంగా చేస్తుంటారు. కానీ సాధారణ సమయంలో స్టవ్ మీద వేడి చేస్తున్నప్పుడు గిన్నెలోని పాలు పొంగిపోవటం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. అయితే గృహిణీలు చాలా మంది స్టవ్ మీద పాలు పెట్టామన్న విషయాన్నే మర్చిపోయి ఇరుగుపొరుగువారితో కబుర్లలో మునిగిపోతారు. కొంత మంది టీవీకే అతుక్కుపోతారు. దీంతో పాలు కిందిపోయి గృహిణీలకు సమస్య మారుతుంది. అయితే తాజాగా పాలు పొంగటాన్ని నియంత్రించే ఓ వంటింటి చిట్కాకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రచయిత, డాక్టర్ నందితా అయ్యార్ తాజాగా ఈ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియోలో పాత్రలోని పాలు పొంగిపోకుండా ఓ చెక్క గరిట నియంత్రిస్తుంది. ‘చెక్క గరిట పాల గిన్నెపై ఉండటం వల్ల పాలు పొంగి కిందపోకుండా ఉంటాయన్న విషయం మీకు తెలుసా?’ అని కామెంట్ చేశారు. పాలు మరిగించినప్పుడు వెలువడే ఆవిరి చెక్క గరిటకు తగలటంతో పాలు మరిగే ఒత్తిడి తగ్గుతుందని ఆమె తెలిపారు. దీంతో పాలు గిన్నె నుంచి పొంగిపోయి కిందకు పడకుండా ఉంటాయనిపేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ఇంతవరకు ఈ చిట్కా తమకు తెలియదని.. నమ్మలేకపోతున్నాము’ అని ఆశ్చర్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ చిట్కా బాగుంది.. అదేవిధంగా ప్రెజర్ కుక్కర్ విజిల్స్ను లెక్కించడానికి కూడా ఎవరైనా ఓ చిట్కా కనిపెట్టాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఈ చిట్కా కొన్నేళ్ల క్రితమే తెలిసి ఉండాల్సింది.. పాలు పొంగిపోయిన ప్రతిసారి మా అమ్మ నాపై గట్టిగా అరిచేది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరి మనం కూడా ఒకసారి ట్రై చేసి ఇది పని చేస్తుందో లేదో చూద్దామా? Did you know keeping a wooden ladle over the milk pan prevents the milk from boiling over? #Cookingtip pic.twitter.com/hDC5mb51iV — Nandita Iyer (@saffrontrail) November 10, 2021 -
కిచెన్లో మహిళ నెత్తిన మంటలు.. వీడియో వైరల్
-
షాకింగ్: కిచెన్లో మహిళ నెత్తిన మంటలు.. వీడియో వైరల్
కిచెన్లో పని చేస్తుండగా పొరపాటున గిన్నెలు, వంటకాలు జారి కింద పడిపోవడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు గ్యాస్ పేలడం వంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు. అందుకే వంటగదిలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. తాజాగా కిచెన్లో వంట చేస్తున్న ఓ మహిళ నెత్తిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ షాకింగ్ ఘటన సెప్టెంబర్ 16 చోటుచేసుకుంది. చదవండి: ‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. వివాదాస్పదంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు వీడియోలో.. ఓ మహిళ వంటగదిలో వంట చేస్తోంది. ఓ వంటకం కోసం కొన్ని పదార్థాలను తీసుకోవడానికి కిందకు వంగి ఓ ప్లేట్ తీసుకుంది. ఆ సమయంలోనే స్టవ్ మంట వద్ద మహిళ జుట్టు తాకడంతో ఆకస్మాత్తుగా ఆమె జుట్టులో మొదట పొగ రావడం కనిపించింది. కానీ దానిని మహిళ గుర్తించలేదు. అప్పుడే కొన్ని వస్తువులు కిందపడదడంతో వాటిని తీసుకొనేందుకు మరోసారి కిందకు వంగారు. అప్పటికీ మంటను గమనించకుండా కిచెన్ అంతా తిరుగుతూ తన పని చేసుకుంటూ పోయారు. చదవండి: అక్కడికి వెళ్తే ఈ స్వీట్ తినడం మాత్రం మర్చిపోకండి.. అద్భుతం.! ఇలా 45 సెకన్ల తరువాత ఆమె తలపై వేడిగా అనిపించడంతో మహిళ జుట్టపై మంటలు అంటుకున్నాయిని గుర్తించారు. వెంటనే ఆమె మంటలను ఆర్పి వేసి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రశాంత్ సాహూ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. వంటగదిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట! -
Viral: అనుకోని అతిథి.. మామూలు నష్టం కాదు
ఏనుగులు మనుషులపై దాడులు చేయడం తరచూ చూస్తుంటాం. మావటి వాళ్లకు, మచ్చిక చేసుకునే వాళ్లకు తప్ప ఎవరీకి అవి లొంగవు. అలాంటిది ఓ అడవి ఏనుగు.. థాయ్లాండ్లో వింతగా ప్రవర్తిస్తోంది. వాసన పసిగట్టి.. ఇళ్లలోకి దూరి కడుపు నిండా లాంగిచేస్తోంది. ఈమధ్య ఓ ఇంటి వంటగది గోడను బద్ధలు కొట్టి.. వంట గదిలో ఉన్న తిండిని లాగించేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. థాయ్లాండ్లో చలెర్మ్కియాపట్టణా గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ ఆ ఇంటి యజమాని రాచధవన్.. వంటగదిలో గజరాజు నిర్వాకం చూసి షాక్ తింది. ఆ వెంటనే ఆ ఘటనను వీడియో తీసింది. కిచెన్ గోడను అమాంతం పలగొట్టేసిన ఆ గజరాజు.. తొండాన్ని అక్కడున్న ర్యాకుల్లోకి పోనిచ్చి చిరు తిండ్లను తీసుకుంది. బస్తా బియ్యాన్ని అమాంతం మింగేసింది. ఈ క్రమంలో వస్తవుల్ని నాశనం చేసిందిక ఊడా. ఆ నష్టం లక్ష రూపాయల దాకా ఉందని అధికారులు అంచనా వేశారు. నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. A wild elephant in Thailand bursts its head through a kitchen wall to steal a bag of rice!#animals #wildworld #elephant #viralvideo #shocking #thailand #thailandnews pic.twitter.com/UJwFniXH1W — Newsflare (@Newsflare) June 21, 2021 కాగా, బూన్చుయే అనే ఆ మగ ఏనుగు.. ఇలా వ్యవహరించడం కొత్తేం కాదు. కయెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్లో ఉండే ఈ ఏనుగు.. తరచూ ఊరి మీదకు వస్తుంటుంది. అయితే అది ఇప్పటిదాకా వయొలెంట్గా ప్రవర్తించలేదని పార్క్ నిర్వాహకులు చెప్తున్నారు. సైలెంట్గా వెళ్లి తిండిని తీసుకుంటుందని, ఎవరైనా తరిమినా అక్కడే కూర్చుని మారం చేస్తుందని, జనాలు కూడా ఆ ఆసియా ఏనుగు పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తారని చెప్తున్నారు. చదవండి: రాక్షసుల కన్నా దారుణంగా వ్యవహరించారు -
మనవరాళ్లతో కలిసి వంట చేసిన మెగాస్టార్
లాక్డౌన్.. అందరికి ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్తా విశ్రాంతి అందించింది. సెలబ్రిటీల నుంచి సాధారణ పౌరుని వరకు ఇంట్లో తమ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు అవకాశం లభించింది. ఖాళీ సమయం దొరకడంతో తమకు నచ్చిన వ్యాపకాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో లాక్డౌన్లో మెగాస్టార్ చిరంజీవి వంటింట్లోకి చేరి తనలోని నలభీముడిని ప్రదర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. నోరూరించే ఉప్మా పెసరెట్టు వేసిన ఆయన అనంతరం మరి కొన్ని వంటకాలను చేసి కుటుంబానికి రుచి చూపించారు. తాజాగా మరోసారి కిచెన్లోకి వెళ్లిన మెగాస్టార్ తన మనవరాళ్లతో కలిసి ఓ స్పెషల్ వంటకాన్ని తయారు చేశారు. దాని పేరు ఫేమస్ కేఎఫ్సీ చికెన్. చదవండి: నాగబాబు బర్త్డేకు చిరంజీవి భావోద్వేగ ట్వీట్ కూతుళ్ల పిల్లలు సంహిత, నివ్రితితో కలిసి కేఎఫ్సీ చికెన్ వంటకాన్ని చేసిన చిరంజీవి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి ‘వంట చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. ముఖ్యంగా పక్కన ఇలాంటి అల్లరి పిల్లలు ఉంటే అది మరింత ఆనందంగా ఉంటుంది. ఇక ఈ వంటకం ఎలా ఉందో చుద్దాం..’ అనే క్యాషన్తో షేర్ చేశారు. ఈ వీడియోలో ముందుగా పిల్లలను ఈ రోజు బోర్ కొడుతుంది ఏం చేద్దాం అని అడుగుతారు. దీంతో సంహిత తనకు కేఎఫ్సీ చికెన్ తినాలని ఉందని చెప్పింది. దీంతో కోవిడ్ సమయంలో బయట నుంచి తీసుకురావడం అంత సురక్షితం కాదని, ఇంట్లనే తయారు చేద్దాం అంటూ తనకు పిల్లలు ఇద్దరు సహాయం చేయాలని కోరారు. దీనికి వాళ్లు ఒకే చెప్పడంతో మెగాస్టార్ వెంటనే చెఫ్గా మారి అద్భుతమైన ఫ్రైడ్ చికెన్ చేసి పెట్టారు. చదవండి: ‘కరోనా’ నేర్పిన పాఠం ఇదే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిరంజీవి వంటకాన్ని పొగడ్తలతో ముంచెత్తిస్తున్నారు. అటు యాక్టింగ్లోనే కాకుండా ఇటు వంటింట్లోనూ చిరంజీవి మెగాస్టార్ అని ప్రశంసిస్తున్నారు. ‘మా అన్నయ్య వంట చేస్తే నోరూరాల్సిందే’నని కామెంట్ చేస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను చేస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్లో నటించనున్నారు. ఈ సినిమాను వివి వినాయక్ తెరకెక్కిస్తున్నారు. -
టీటీడీ వంటశాలలో ప్రమాదం
సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలోని వంటశాల(పొటు)లో ప్రమాదం సంభవించింది. చింతపండు రసం తయారు చేసే విద్యుత్ బాయిలర్ పగిలి అందులోని వేడి నీరు ఐదుగురు పోటు కార్మికులపై పడడంతో గాయాల పాలైయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని తిరుమలలోని ఆశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గాయపడ్డ కార్మికులను టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి పరామర్షించారు. టీటీడీలో ఇప్పటివరకు ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని పోటు ఇంచార్జ్ వరద రాజులు అన్నారు. వారం రోజులకు ఓసారి అధికారులు మాస్ క్లీనింగ్ నిర్వహిస్తారని, ప్రమాదవశాత్తే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఆ స్వామివారు కాపాడారని అన్నారు. (ఘనంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ) -
నాలో మంచి కుక్ ఉందని తెలుసుకున్నా!
లాక్డౌన్తో దొరికిన ఖాళీ సమయం తమన్నాను వంటగదికి దగ్గర చేసింది. తనలో ఓ మంచి కుక్ దాగి ఉందని తమన్నా తెలుసుకునేలా చేసింది. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్కు ముందు షూటింగ్స్తో ఫుల్æబిజీగా ఉండేదాన్ని. మా ఇల్లు నాకు హోటల్లానే అనిపించేది. సినిమాల షూటింగ్స్ మధ్యలో కాస్త విరామం దొరికినా నేను మా ఇంట్లో ఉండేది మూడు రోజులే. అసలు మా ఇంట్లో ఏయే వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో? అవి నాకు ఎంత ఉపయోగపడతాయో? అని కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఈ లాక్డౌన్లో అవన్నీ తెలుసుకున్నాను. అవసరానికి మించిన వస్తువులు ఉన్నాయని గ్రహించాను. ఇదివరకు నేను ఎప్పుడూ వంట చేయలేదు. లాక్డౌన్ వల్ల చాలా సమయం దొరకడంతో వంటలు చేశాను. నాలో ఓ మంచి కుక్ ఉందని నాకు తెలిసింది ఈ సమయంలోనే. అయితే నేను వంట స్టార్ట్ చేసిన మొదట్లో కిచెన్ రూమ్లో టీ పొడి ఎక్కడుంది? పంచదార ఏ డబ్బాలో ఉంది? అనే విషయాలు తెలియక మొత్తం అల్మరా అంతా వెతికేదాన్ని. ఫస్ట్ టైమ్ వంట చేసినప్పుడు చాలా గందరగోళంగా అనిపించింది. ఆ తర్వాత మెల్లిగా అన్నీ తెలుసుకున్నాను. వంట చేయడం అంటే వంటకాలను రుచిగా చేయడమే కాదు. ఆ వంటలు వండిన పాత్రలను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. వంట రూమ్ను శుభ్రంగా ఉంచుకోవాలి’’ అన్నారు తమన్నా. -
ఊరంతా కిచెన్ గార్డెన్
ప్రకృతిని, ఊరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి 84 ఏళ్ల ఓ బామ్మ పలుగూ, పార చేత బట్టింది. వంటిళ్లని పచ్చని కూరగాయలతో నింపడానికి నిత్యం శ్రమిస్తోంది. రకరకాల కూరగాయల నారుపోసి, మొక్కలను పెంచి, వాటిని ఉచితంగా గ్రామ వాసులకు అందిస్తోంది. బామ్మపనికి ముగ్దులైన ఊరి ప్రజలు ‘సూపర్ మామ్మ’ అంటున్నారు. తమిళనాడుకు చెందిన 84 ఏళ్ల నుంజమాల్ ఈ కరోనా టైమ్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, అది కిచెన్లో తయరయ్యే వంటకాల నుంచే వస్తుందని, ఇంటిపంట అలవాటును అందరిలోనూ ప్రోత్సహించడానికి నడుము కట్టింది. రాష్ట్రమంతా కూరగాయల మొక్కలను పంపిణీ చేయాలని ఉందనే ఈ మామ్మ. ‘సొంతంగా కూరగాయలను పండించుకోవడం ద్వారా సేంద్రీయ పద్ధతులను అవలంబిస్తారు. దీనివల్ల పర్యావరణానికీ మేలు కలుగుతుంద’ని చెబుతోంది. ఇప్పుడు నుంజమాల్ అందరిళ్లకు వెళ్లి ఎవరింట్లో ఎన్ని మొక్కలు, ఎలా పెంచుతున్నారు అనే విషయాన్ని స్వయంగా కనుక్కుంటూ తీరికలేకుండా ఉంది. తనే స్వయంగా మొక్కలను నాటి, పాదులు తీసి నీళ్లు పోసి వస్తుంది. ఆమె కృషికి ఏపుగా పెరుగుతున్న కూరగాయల తోటలే నిదర్శనం. ఈ బామ్మ పెరటి తోటలను తయారు చేయడాన్ని మెచ్చుకుంటూ ఒక వార్తాసంస్థ ఆమె ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆ వెంటనే ఈ బామ్మకు మద్దతుగా రీట్వీట్ల వరద మొదలైంది. -
కిచెన్లో బాత్రూమ్: ‘ఓనర్ను జైలులో వేయాలి’
సిడ్నీ : ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన శైలిలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటారు. అలాగే ప్రతి గదిని ప్రత్యేకంగా కట్టుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంటిని వినూత్నంగా నిర్మించాడు. కిచెన్లో గోడలు లేకుండా బాత్రూమ్ను నిర్మించుకున్నాడు. ఈ వింత నిర్మాణం ఆస్ట్రేలియాలో జరిగింది. సాధారణంగా సిడ్నీ నగరం ఖరీదైన రియల్ ఎస్టేట్కు మారుపేరు. అక్కడ స్థలాన్ని ఆదా చేసేలా భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం ఉంటుంది. కానీ సర్రిహిల్స్లో అపార్ట్మెంట్లో మాత్రం ఇంటిని వినూత్నంగా కట్టించాడు. వంట గదిలో గోడలు లేకుండా గాజు గ్లాస్తో బాత్రూమ్ను(టాయిలెట్, షవర్) నిర్మించారు. ఇక వంటగదిని బాత్రూమ్ను కేవలం గాజు గ్లాస్ మాత్రమే వేరుచేస్తుంది. ఇటాలియన్ డిజైనర్ ‘మాడ్రన్ కిచెన్’గా రూపొందించిన ఈ ఫ్లాట్ను ప్రస్తుతం అద్దెకు పెట్టారు. ఒకవేళ ఇది ఎవరికైనా నచ్చితే వారానికి దాదాపు రూ.18 వేల చెల్లించి అద్దెకు ఉండొచ్చు. (‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ ) అయితే దీనికి సంబంధించిన ఫోటోను ఓ వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇవి చూసిన నెటిజన్లు ‘టాయిలెట్ ఇన్ ది కిచెన్ లే అవుట్’ భయంకరంగా ఉందంటున్నారు. బాత్రూమ్ ఎవరికైనా వ్యక్తిగత ప్రదేశమని, అయితే కిచెన్లో బాత్రూమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిర్మించిన వారిని, ఇంటి యాజమానిని జైలులో వేయాలని మండిపడుతున్నారు. కాగా ఈ ఇంటిపై అనేక ప్రతికూల కామెంట్లు వచ్చినప్పటికీ దీనిపై యాజమాని మాట్లాడుతూ.. ఈ ఇంటిపై అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. ఒంటరి వ్యక్తులు, ప్రేమికులు, ఇద్దరు అబ్బాయిలు వంటి వారు అపార్ట్మెంట్ను అద్దెకు కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. (వినూత్నం: గోడలు లేని బాత్రూమ్) -
కిచెన్లో బయటపడ్డ విషపూరిత పాము
కాన్బెర్రా: కొన్నిసార్లు మనకు అనుకోని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్కు చెందిన మైకేల్ హిల్లియార్డ్ కూడా తనకెదురైన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని బతుకుజీవుడా అనుకున్నాడు. వివరాల్లోకి వెళితే మైకేల్.. ఎప్పటిలాగే కిచెన్లో వంట పూర్తి చేసుకున్నాక పాత్రలు కడిగేద్దాం అనుకున్నాడు. వెంటనే ట్యాప్ ఆన్ చేసి పాత్రలు తోమడం ప్రారంభించగా సింక్లో బుసలు కొడుతూ కనిపించిన పాము చూసి షాక్ కొట్టినంత పనైంది. వెంటనే స్నేక్గార్డులకు సమాచారం అందించి పాము కదలికలను మన్ను కొట్టిన పాములా చూస్తుండిపోయాడు. అప్పటివరకు దాని విన్యాసాలను కెమెరాలో బంధించాడు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. (బిడ్డల కోసం రాళ్లు వండుతున్న తల్లి) "దేవుడి దయ వల్ల ఆ పాము నన్నేమీ చేయలేదం"టూ గాఢంగా నిట్టూర్పు విడిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'అంత విషపూరితమైన పాము కిచెన్లోకి ఎలా వచ్చిందబ్బా!' అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా, 'అది కాటు వేసుంటే మరోసారి వంట చేసేందుకు ఆ పెద్ద మనిషి ఉండేవాడు కాద'ని కామెంట్లు చేస్తున్నారు. అతని కిచెన్లో బయటపడ్డ పాము ప్రపంచంలోనే రెండో అత్యంత విషమైన "ఈస్టర్న్ బ్రౌన్ పాము". అది కానీ కాటు వేసిందంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఆస్ట్రేలియాలో ప్రతి యేటా ఈ పాము కాటు వల్ల ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. (ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు ) -
కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్
లాక్డౌన్..నగరవాసిని ఇంటికే పరిమితం చేసింది. దీంతో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడూ దొరకని ఇంత తీరిక ఇప్పుడు లభించడంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. తమకు ఇష్టమైన పనులు చేస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సినీ, టీవీ నటులు అందరూ ఇలా లాక్డౌన్ టైంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఆయన మాటల్లో మీరే వినండి. (న్యూ కట్) నేను ఇంట్లో ఏం చేస్తున్నానో తెలిస్తే మీకు మంచి వినోదం అవుతుంది. ఉదయం టిఫిన్ నా భార్య చేస్తుంది. మధ్యాహ్నం కూరగాయలు అన్నీ కట్ చేసి, నేనే వంట చేస్తున్నా. కృష్ణాజిల్లా పాలకూర చేయడంలో నేను స్పెషలిస్ట్.. అందుకే ఎక్కువగా చేస్తున్నాను. ‘వద్దండి.. నాకు బోర్ కొడుతోంది, నేను చేస్తా’ అని మా ఆవిడ అంటున్నా, వినకుండా నేనే చేస్తున్నా. బీరకాయ పాలకూర, టమోటా రోటి పచ్చడి, (టమోటాలు కొనే పని కూడా లేదు.. ఇంట్లోనే చెట్లు ఉన్నాయి.. కోయడం చేయడమే). (లాక్డౌన్: విరుష్కలు ఏం చేస్తున్నారో చూశారా?) ఈ విధంగా వంటిల్లుని నేను స్వాధీనపరచుకున్నా.. ఇప్పుడు యోధుణ్ణి నేను. ‘అదేంటండి? అంటుంది’ మా ఆవిడ. పనీ పాటా లేదు. ఏదో ఒక పని చేయకపోతే తిన్నది అరగదు అన్నాను. ‘అయితే పనిమనిషి రాలేదు.. బయట ఊడవండి’ అంది. నేను ఊడవను అన్నాను. సరే.. కారు కడగండి అంది. నన్ను డామినేట్ చేసి మా అబ్బాయి బాలాజీ అప్పటికే కారు కడిగేస్తున్నాడు.. సో.. నాకు వంట పని ఒక్కటే కనిపించింది.. చేస్తున్నా. చూడండి మగాళ్లలారా. పని లేదు.. పని లేదు అని ఏడవడం కాదు. నీకు వచ్చిన పనిని సిగ్గు లేకుండా, మొహమాట పడకుండా చేయాలి. నా వ్యక్తిగత అనుభూతి ఏంటంటే వంట చేసేటప్పుడు చాలా రిలాక్స్ అయిపోతున్నాను.. ఆ సమయంలో నా ఒత్తిడి అంతా తగ్గిపోతోంది. – రాజేంద్రప్రసాద్ వంటింట్లో అమ్మకు సాయం చేస్తూ... ఈ ఖాళీ సమయంలో వంటింట్లో అమ్మకు సాయం చేస్తున్నా. శనివారం బెండకాయ వేపుడు చేశా. కనీసం ఈ మూడు వారాలైనా తన తల్లికి సహాయ పడాలని ఆమెపై కొంత పనిభారం తప్పించాలనే ఉద్దేశంతోనే వంటలకు శ్రీకారం చుట్టా. అంతేకాదు ఈ రోజు ఇల్లు కూడా శుభ్రం చేశా. మీరంతా కనీసం ఈ 21 రోజులైనా ఇళ్ళల్లో ఉండి తల్లికి ఇంటి పనుల్లో సాయపడండి. – ప్రదీప్, యాంకర్ (కరోనా ఎఫెక్ట్: ‘ఆమె మాట’కే ఇప్పుడు క్రేజ్) -
రెస్టారెంట్ కిచెన్లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’!
-
రెస్టారెంట్ కిచెన్లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’!
మిచిగాన్: టిక్టాక్ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఓ రెస్టారెంట్ ఉద్యోగి కోతి చేష్టలతో ఉన్న జాబ్ కూడా పోగొట్టుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని జరిగింది. మిచిగాన్లోని వెండీస్ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఉద్యోగి స్నానం చేయడానికి వేరే మార్గమే లేదన్నట్లు సరాసరి కిచెన్లో దూరి అక్కడి సింక్లో సబ్బు నురగ, నీళ్లు నింపి బాత్టబ్లా మార్చేశాడు. వెంటనే అందులోకి దిగి స్నానం చేశాడు. ‘ఇది హాట్ టబ్లా అనిపిస్తుంది. దీన్ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను’ అంటూ పేర్కొనడంతో అక్కడి వాళ్లంతా ఘొల్లున నవ్వారు. మరో ఉద్యోగి ‘నిన్ను నువ్వు తోముకో’ అంటూ ఓ వస్తువును సింక్లోకి విసరడంతో అతను నిజంగానే ఒళ్లు రుద్దుకోవడం ప్రారంభించాడు. (వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్ చేసి..) ఇక దీన్నంతటినీ వీడియో తీసి టిక్టాక్లో అప్లోడ్ చేయగా అది విపరీతంగా వైరల్ అయింది. మిగతా సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియో ప్రత్యక్షం కాగా, నెటిజన్లు ఉద్యోగి తీరుపై తీవ్రంగా స్పందించారు. ‘ఇది ఎంతో అసహ్యకరం. అందరికీ చెప్పేదేంటంటే, దయచేసి ఎవరూ ఇకపై ఆ రెస్టారెంట్కు వెళ్లకండి’ అని ఓ నెటిజన్ సూచించాడు. ‘సింక్ దగ్గరలోనే వంటకు ఉపయోగించే సామాగ్రి ఉంది. ఇది నిజం కాకపోతే బాగుండు’ ‘నీకేమైనా పిచ్చా.. కస్టమర్లకు ఇదేనా నువ్విచ్చే గౌరవం’ అంటూ ఘాటుగా కామెంట్లు చేశారు. ఇక ఈ వీడియోను టిక్టాక్ నుంచి తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతని చేష్టలకు ఆగ్రహించిన యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. (రెస్టారెంట్లో గొడవ.. దుస్తులిప్పి చితకబాదారు) -
బొద్దింకల నుంచి రక్షించుకుందాం!
ఈ లోకంలో దొరికే సమస్త పదార్థాలన్నింటినీ తిని హారాయించుకునే ఏకైక జీవులు బొద్దింకలు. అవి ఎంతకూ అంతరించిపోవట. అందుకే... అణుయుద్ధం సంభవించి జీవజాతులన్నీ అంతరించిపోయినా బొద్దింకలు బతికే ఉంటాయని ఒక అంచనా. అంతేకాదు... బొద్దింక తలను తొలగించినా... అది తొమ్మిది రోజులు బతుకుతుంది. చివరికి మెదడు లేనందకవి మరణించవు గానీ... తల లేకపోవడంతో ఆహారం అందని కారణంగానే అవి చనిపోతాయట. అంతటి పవర్ఫుల్ బొద్దింకలు పెరిగే ప్రధాన ప్రదేశాలు మన వంటిళ్లు. ఈ ప్రపంచంలోని ఏ కిచెన్ కూడా బొద్దింకలకు మినహాయింపు కాదంటే అది అతిశయోక్తి కాదు. ఈ బొద్దింకలనుంచి ఆరోగ్యాలకు వచ్చే ప్రమాదలేవీ వెనువెంటనే రావు. కానీ మన వంటింట్లోని ఆహార పదార్థాలన్నింటినీ అవి కలుషితం చేస్తాయి. ప్రధానంగా రాత్రిపూట మనం వంటింట్లోకి వెళ్లినప్పుడు మనం దాచిన ఆహారపదార్థాలపై అవి స్వైరవిహారం చేస్తూ కనిపిస్తాయి. మళ్లీ పగటిపూట అవి ఎక్కడిదొంగలు అక్కడేలా గప్చిప్గా ఉండిపోతాయి. క్రితం రాత్రి సైలెంట్గా సంచరించిన ఆ బొద్దింకల ప్రభావం కారణంగా మనకు నీళ్ల విరేచనాలు వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. వటితో మనకు వచ్చే మరో అనర్థం ఏమిటంటే... బొద్దింకలు అలర్జీని, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అందువల్ల ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి ఆస్తమా, అలర్జీ రోగులు తమ ఇళ్లలో బొద్దింకల నుంచి వచ్చే ప్రమాదాలను రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మరి బొద్దింకల నుంచి రక్షించుకోవడం ఎలా? బొద్దింకలను తుదముట్టించడానికి మార్కెట్లో దొరికే విషపదార్థాలున్న ద్రావణాలను పిచికారి చేయడం మరింత ప్రమాదం. దాని వల్ల మన కిచెన్ను మనమే విషపూరితం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఈ విషాల్లో సంచరించిన బొద్దికలు మళ్లీ మన ఆహారాలపై తిరిగితే అది మరల మనకే హాని చేసే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మనం తినగా మిగలిగిన ఆహార పదార్థాలను మెష్ ఉండే కప్బోర్డుల వంటి సురక్షితమైన చోట ఉంచుకోవాలి. ఇక బొద్దింకలు బాగా తేమగా, తడిగా, వెలుగు అంతగా ప్రసరించని చోట పెరుగుతాయి. కాబట్టి ఇంట్లోని ప్రతి ప్రదేశమూ పొడిగా, వెలుతురూ, గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకుంటే బొద్దింకలు పెద్దగా పెరగవు. బొద్దింకల సంఖ్య తక్కువగా ఉండేలా చూసుకుంటే వాటితో కలిగే అనర్థాలను సాధ్యమైనంతగా తగ్గించవచ్చు. -
వంటగదిని శుభ్రం చేశారా!
దీపావళి పండగకు ముందుగా ఇళ్లు మొత్తం శుభ్రం చేసుకోనిదే మనసుకు సంతోషం అనిపించదు. అమ్మ, బామ్మ.. ఇంట్లోని ప్రతీ గదిని వరసగా శుభ్రం చేసుకుంటూ దుమ్మ దులపడాన్ని మన చిన్ననాటి రోజుల నుంచి చూస్తున్నదే. శుభ్రం చేసిన తర్వాత కొత్త హంగులతో అలంకారాలతో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఇంటి శుభ్రత లేకుండా పండగ పనులేవీ ముందుకు కదలవు. అన్ని గదుల కన్నా వంటగది శుభ్రత కష్టంగా అనిపిస్తుంటుంది. సులువుగా, మరింత శుభ్రంగా వంటగదిని ఎలా ఉంచాలో చూద్దాం... ►బేకింగ్ సోడా, డిష్వాషింగ్ సోప్, వేడినీళ్లు, వెనిగర్, కిచెన్ను శుభ్రం చేసే టవల్.. ముందు వీటిని సిద్ధం చేసుకోవాలి. వీటితో కిచెన్ జిడ్డును వదిలించడంలో పని సులువు అవుతుంది. ►వంటగదిలో ఎప్పుడూ ఉండే సమస్య క్రిములు. అలాగే చిన్న చిన్న పురుగుల నుంచి బొద్దింకల వరకు అప్పుడప్పుడైనా కనిపిస్తుంటాయి. వీటికి విరుగుడుగా షాపుల్లో పెస్ట్ కంట్రోల్ స్ప్రే లభిస్తుంది. కిచెన్ షెల్ఫ్లో వంటసామానంతా పక్కన పెట్టేసి ఆ పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేయాలి. ►వెచ్చని నీటిలో వెనిగర్, డిష్వాషర్ సోప్ కలుపుకోవాలి. సిద్ధంగా ఉంచుకున్న టవల్ని ఆ నీళ్లలో ముంచి, నీళ్లు కారకుండా పిండి దాంతో షెల్ఫ్లు, కప్బోర్డ్స్ ఉంటే ఆ పై భాగాలను శుభ్రంగా తుడవాలి. దీంతో దుమ్ము, జిడ్డు మరకలన్నీ శుభ్రం అవుతాయి. ►ఆ తర్వాత డబ్బాల్లో మూడు నాలుగు నెలలుగా ఉండిపోయిన దినుసులు ఉంటాయి. ముఖ్యంగా మసాలా దినుసులు.. మరికొన్ని డబ్బాల్లో వాడని, పురుగు పట్టినవి కూడా ఉంటాయి. వాటిని పూర్తిగా తీసేయాలి. ►స్టోర్ నుంచి తెచ్చి, ఇంకా వాడని సరుకుల ప్యాకెట్లపైన ఉన్న తేదీని బట్టి సరిచూసుకొని, షెల్ఫ్ల్లో సర్దుకుంటే వాడడమూ సులువు అవుతుంది. ►ఫ్రిజ్ను శుభ్రం చేయడం పెద్ద పని. వారానికి ఒకసారి శుభ్రం చేసినా లోపలిభాగంలో కొన్ని పదార్థాల మరకలు అలాగే ఉండిపోతుంటాయి. వెనిగర్ కలిపిన వెచ్చని నీటిలో టవల్ను ముంచి ప్రిజ్ లోపలి భాగం అంతా గట్టిగా రుద్దుతూ తుడవాలి. వెనిగర్ లేదంటే నిమ్మరసం కలిపిన నీటితో అయినా తుడిచి, మళ్లీ పొడి టవల్తో తుడవాలి. ►ఉన్న వస్తువులన్నింటితో కిచెన్ షెల్ఫ్లను నింపేయకుండా అంతగా ఉపయోగించని వస్తువులను పైషెల్ఫ్లో సర్దేయాలి. ఏవి ఎంత వరకు అవసరమో ముందే అవగాహన ఉంటుంది కాబట్టి, ఆ మేరకు మాత్రమే సర్దుకుంటే వంటగది పండగకు శుచిగా, అందంగా కనిపిస్తుంది. -
హైటెక్ కిచెన్
బంజారాహిల్స్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మోడ్రన్ కిచెన్ను సినీ నటి నమ్రతా శిరోద్కర్ ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కెఎల్.నారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ కిచెన్ను పూర్తి ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఇక్కడ సౌకర్యాలపై నమ్రతా శిరోద్కర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్సీసీ ఉపాధ్యక్షుడు ముళ్లపూడి మోహన్, కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, కోశాధికారి తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, శైలజ, సుష్మ పాల్గొన్నారు. -
కిచెన్లో నాగుపాము
సాక్షి, కందుకూరు(రంగారెడ్డి జిల్లా): టీ పెట్టేందుకువంటగదిలోకి వెళ్లిన ఓ మహిళ నాగుపాము బుసలు కొడుతూ కనిపించడంతో హడలిపోయింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని నేదునూరులో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చిప్ప మనోహర్ భార్య నాగమణి ఆదివారం సాయంత్రం ఇంట్లో టీ పెట్టేందుకు వంటగదిలోకి వెళ్లింది. బుస్బుస్మని శబ్ధం రావడంతో పరీక్షించి చూడగా వంటగది ప్లాట్ఫారం మీద నాగుపాము పడగ విప్పి కనిపించడంతో హడలిపోయింది. దీంతో కుటుంబసభ్యులు వచ్చి పామును ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టేందుకు దాదాపు గంటసేపు కష్టపడాల్సి వచ్చింది. -
దోసేస్తారు!
షూటింగ్లు, ప్రమోషన్లు, కొత్త సినిమా స్క్రిప్ట్లు వినడం... ఇలా ఆర్టిస్టుల లైఫ్ బిజీ బిజీగా ఉంటుంది. ఎప్పుడో కానీ కాస్త టైమ్ దొరకదు. ఆ టైమ్లో ఎవరికి నచ్చిన పని వారు చేస్తూ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతుంటారు. సోనమ్ కపూర్, శ్రుతీహాసన్ లాంటి హీరోయిన్లు ఖాళీ సమయాల్లో బొమ్మలు వేస్తారు. శ్రియ, దిశా పాట్నీ, పరిణీతి కేటగిరీ వారు సముద్రతీరాలకు వాలిపోతారు. మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం వంటింట్లోకి దూరి గరిటె చేత పట్టుకుని దోశలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ యాప్లో షేర్ చేసుకున్నారు. మరి.. దోశ టేస్ట్ ఎలా ఉందనే విషయం మాత్రం ఈ బ్యూటీనే అడగాలి. వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులు మనసులు దోచేసిన తమన్నా ఇప్పుడు కావాల్సినవాళ్లకు ఇంట్లో దోసెలు వేసి, వారి మనసుని కూడా దోసేస్తున్నారేమో! ఇక సినిమాల విషయానికి వస్తే.. సౌత్లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇటీవల ‘బోలే ఛూడియా’ అనే హిందీ సినిమాకు సైన్ చేశారు.