LG Polymers
-
నాడు తక్షణమే అందిన సాయం.. భరోసా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్లో విషవాయువు లీకేజీ ఘటనలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందించిన తీరుకు.. నేడు ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన దుర్ఘటన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుకూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. నాడు ఎల్జీ పాలిమర్స్లో విషవాయువులు (స్టైరిన్ గ్యాస్) లీకైన సంఘటన 2020 మే 7వ తేదీ వేకువజామున 3.40 గంటలకు జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజామున 5 గంటలకు కలెక్టరు, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. » 6 గంటలకు అప్పటి ప్రజాప్రతినిధులు ముత్తంశెట్టి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్రాజ్ తదితర నేతలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. » వేకువజాము నుంచే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి 11 గంటలకే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. » ఆ రోజుల్లో కోవిడ్ కేసులు భారీగా ఉండి.. బహిరంగంగా తిరిగేందుకు ఆందోళన చెందుతున్న పరిస్థితులున్నాయి. అయినా, కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి నష్టపరిహారంగా రూ.కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. » ఆ తర్వాత బాధితులను గుర్తించి ప్రకటించిన నష్టపరిహారం అందించారు. అంతేకాక.. మూడ్రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.10 లక్షలు, చికిత్స పొంది వెంటనే డిశ్చార్జి అయిన వారికి రూ.లక్ష ప్రకటించారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే రూ.30 కోట్ల నిధులను విడుదల చేశారు. » విషవాయువులు వ్యాపించిన నేపథ్యంలో ప్రతీ కుటుంబ సభ్యుడికి రూ.10 వేల చొప్పున ఐదు గ్రామాల ప్రజలకు అందజేశారు. » నెలరోజులుభోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు 29 పునరావాస కేంద్రాల్లో 20 వేల మందికి వసతి కల్పించారు. » విష వాయువుల ప్రభావంలేదని ప్రకటించినప్పటికీ ఇంకా ప్రజల్లో భయాలు నెలకొనడంతో వారిలో భరోసా నింపేందుకు వీలుగా ప్రజాప్రతినిధులైన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్రాజ్, తిప్పల నాగిరెడ్డి తదితరులు రాత్రి సమయాల్లో నిద్రించి ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. » ఏకంగా డీజీపీ స్థాయి అధికారి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడునెలల పాటు హెల్త్ క్యాంపులూ నిర్వహించారు. -
కాలుష్యంపైనా ద్వంద్వ ప్రమాణాలా!
కొన్ని వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు విడుదలైన సందర్భంగా ఆ సంస్థను వెంటనే మూసివేయా లని ఏపీ ప్రతిపక్ష టీడీపీ ఎంతగా గగ్గోలు పెట్టిందో అందరికీ తెలిసిందే. కానీ అమర్రాజా బ్యాటరీస్ సంస్థకు కాలుష్య నివారణపై నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో... ఉత్పత్తిని ఆపివేయమని ఏపీ కాలుష్యనియంత్రణ మండలి ఆదేశాలిస్తే ఇదే టీడీపీ గగ్గోలు పెడుతోంది. దక్షిణాదిలో ఇతర నగరాల్లోని పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా ‘కాలుష్య కాసారం’ పేరుతో గతంలో వరుస కథనాలు దంచిన ఇదే మీడియా... ఇప్పుడు మాత్రం టీడీపీ ఎంపీకి చెందిన పరిశ్రమపై చేయివేస్తే ఊరుకోనంటూ ఎగిరెగిరిపడుతోంది. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అన్నది ప్రశ్న.కొన్ని నెలల క్రితం విశాఖ సమీపంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి కాలుష్యం విడుదల అయిన ఘటనలో పదమూడు మంది మరణించారు. అనేక మంది అస్వస్థతకు గురి అయ్యారు. ఆ సమయంలో ఒక వర్గం మీడియాలో వచ్చిన కథనాలు గుర్తు చేసుకోండి. ఆ సంస్థతో వైఎస్సార్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, అందుకే దానిని మూసివేయడం లేదని ఆరోపించే కథనాలు ఎక్కువగా వచ్చాయి. ఆ కంపెనీ రసాయనాన్ని దక్షిణ కొరియాకు తరలిస్తుంటే కూడా చాలా యాగీ చేశాయి. ప్రతిపక్ష టీడీపీ ఆ సంస్థను మూసివేయాలని డిమాండ్ చేసింది. ఆ సంస్థ లైసెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిందని, ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదని, రకరకాల ఆరోపణలు టీడీపీ నేతలు సాగించారు. సీఎం జగన్ వెంటనే ఎల్జీ పాలిమర్స్ సంస్థ మూసివేతకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, ఆ సంస్థ ఉన్నతాధికారులనూ అరెస్టు చేయించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అది అప్పటి సంగతి. తాజాగా చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ ద్వారా విడుదల అవుతున్న సీసం వంటి కాలుష్య పదార్థాలు ప్రజల, ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనలో వెల్లడైంది. దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని కాలుష్యమండలి ఆదేశించింది. కానీ సంస్థ యాజమాన్యం స్పందించలేదన్నది అభియోగం. దాంతో మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది. దానిపై ఆ సంస్థ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. అదే హైకోర్టు.. కాలుష్య మండలి కాలుష్య నివారణకు చేసిన సూచనలు పాటించాలని స్పష్టం చేసింది. ఈలోగా అమరరాజా సంస్థ తన కొత్త యూనిట్ను తమిళనాడులో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందని వార్తలు. ఇంకేముంది, ఒక పరిశ్రమ వెళ్లిపోతోందని ఆ వర్గం మీడియా గగ్గోలు పెట్టింది. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలన్న ఆలోచన తప్ప, తెలుగుదేశం పార్టీని జాకీలు వేసి లేపాలన్న ఉద్దేశం తప్ప ఇంకో ఆలోచనతో వీరు పనిచేయడం లేదు. మరి అమరరాజా బాటరీస్ సంస్థ ద్వారా కాలుష్యం ఏర్పడుతోందా? లేదా? అనేక మందిని పరీక్షించినప్పుడు ఎక్కువమందిలో ప్రమాదకరమైన సీసం ఉన్నట్లు గుర్తించారా? లేదా? అలా సీసం కారణంగా ఉద్యోగులు, లేదా ప్రజల ప్రాణాలకు ప్రమాదం కాకుండా ఆ సంస్థ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందా? లేదా? అలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఆ సంస్థపై ఎవరైనా చర్య తీసుకుంటే అది తప్పు అవుతుంది. ఒకవేళ కాలుష్య నియంత్రణ మండలిపై ఏవైనా అనుమానం ఉంటే, వేరే స్వతంత్ర సంస్థతో పరీక్షలు జరిపించి ఆ ఫలితాలను వెల్లడి చేయవచ్చు కదా? ఇలా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా ఆ పరిశ్రమవారు వెళ్లిపోతామని బెదిరిస్తే ఏమి చేయాలి? ఈ ఒక్క కంపెనీకి మాత్రమే నోటీసు ఇస్తే ఆలోచించవచ్చు. మరో 54 కంపెనీలకు కూడా కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోకపోతే మూసివేయవలసి వస్తుం దని హెచ్చరించిందా? లేదా? అమరరాజా సంస్థ టీడీపీ వారిది కాకపోతే ఒక వర్గం మీడియా ఈ కాలుష్యంపై ఎలాంటి వార్తలు ఇచ్చేది? దేశంలో ఎక్కడైనా కాలుష్య కారక పరిశ్రమలు ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశిస్తాయి. అందుకే కాలుష్య నియంత్రణ మండళ్లు ఏర్పాటు అయ్యాయి.1980వ దశకంలో భోపాల్లో యూనియన్ కార్బైడ్ సంస్థ నుంచి వెలువడ్డ విషవాయువులు ఎన్ని వేలమందిని బలిగొన్నది, ఎన్నివేలమంది శారీరకంగా ఎలాంటి రుగ్మతలకు గురైంది ఈ మీడియాకు గుర్తు ఉండాలికదా? అంతదాకా ఎందుకు.. తూర్పు గోదావరి జిల్లాలో ఒక మందుల పరిశ్రమ కాలుష్యం వెదజల్లుతోందంటూ టీడీపీనే ఆందోళనకు దిగింది కదా? విశాఖలోని కొన్ని సంస్థలు విడుదల చేసే వాయువుల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుంటారో చెప్పనవసరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలలో రొయ్యల పరిశ్రమల వల్ల భూగర్భ జలాలన్నీ కలుషితం అయి తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఏర్పడింది. తుందుర్రు అనే గ్రామంలో ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఉద్యమమే జరిగింది. ఆ ఆందోళనకారులను మహిళలని కూడా చూడకుండా గత ప్రభుత్వం అరెస్టు చేసింది. తమిళనాడులో స్టెరలైట్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఆ పరిశ్రమను మూసివేయాలని న్యాయస్థానమే ఆదేశించింది. అప్పుడు ఈ మీడియా కాని, టీడీపీ వంటి పార్టీలు కాని, ఆ పరిశ్రమను ఎలా మూసివేస్తారని ప్రశ్నించలేదు. ఇక తాజాగా అక్కడి కాలుష్యాన్ని ఏమి చేస్తారు? ఇక్కడి కాలుష్యాన్ని ఏమి చేస్తారని ఒక మీడియా కథనాలు ఇస్తుంటే, తిరుపతిలో అమరరాజా బ్యాటరీస్ కాలుష్యమే సృష్టించడం లేదంటూ మరో మీడియా ప్రచారం ఆరంభించింది. నిజంగానే రాజకీయ కోణంలోనే అమరరాజాకు ప్రభుత్వం నోటీసులు ఇస్తే ఎవరూ ఒప్పుకోరాదు. అదే సమయంలో ఆ సంస్థలో కాలుష్యం ఉంటే దానిని ఎవరూ సమర్థించరాదు. ఏ పరిశ్రమ అయినా ప్రజలకు ఉపాధి కల్పించాలి. అందుకు ప్రభుత్వాలు సహకరించాలి. కావాలని ఏ పరిశ్రమనూ వేధించరాదు. అలా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తే ప్రభుత్వ నేతలు వెంటనే స్పందించాలి. ఇంతవరకు తప్పు లేదు. కానీ అదే సమయంలో పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని అరికట్టాలని కోరడం తప్పు కాదు. 13 వేలమందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోం దని చెబుతున్నారు. మంచిదే. అదే సమయంలో అందుకు రెట్టింపు మంది ఆరోగ్యానికి ముప్పు తెచ్చే విధంగా ఆ సంస్థ వ్యవహరిస్తే ఏమి చేయాలి? దానిని నిరోధించడం ప్రభుత్వ బాధ్యత. గతంలో హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరు ప్రాంతంలో పరిశ్రమలు విడుదల చేసిన రసాయనాలతో కూడిన నీరు, వాయువులతో అనేక మంది చర్మవ్యాధులకు గురయ్యేవారు. అప్పట్లో ఈ వర్గం మీడియానే ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా కాలుష్య కాసారం పేరుతో అనేక కథనాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆయా కంపెనీలను వేరేచోటుకు తరలించవలసి వచ్చింది. ఆ సంగతిని మర్చిపోకూడదు. ఇప్పుడు అదే మీడియా కాలుష్యాన్ని సమర్థిస్తూ వార్తలు ఎందుకు ఇస్తోందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స మాట్లాడుతూ తాము అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ వెళ్లిపోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే పరిశ్రమ కాలుష్యాన్ని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం చెబుతోంది. దానికి అనుగుణంగా చర్యలు చేపడితే మంచిది. లేకుంటే తమిళనాడుకు వారి యూనిట్ను తీసుకు వెళ్లినంత మాత్రాన, అక్కడి ప్రభుత్వం ఎలాంటి కాలుష్యాన్ని అయినా భరించడానికి ఒప్పుకుం టుందా? నిజంగానే పరిశ్రమను తరలిస్తే, అక్కడ కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం చేయకుండా ఉండడానికి ఏ రాష్ట్రంలోని ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా? తమిళనాడుకు వందల కోట్లు వ్యయం చేసి తరలించే బదులు కాలుష్య నియంత్రణమండలి చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా. ప్రభుత్వ అధికారులు కూడా ఈ దిశలో ఆ కంపెనీని ఒప్పించే యత్నం చేయాలి. ఎల్.జి. పాలిమర్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉపాధి కల్పిస్తోంది. అయినా అప్పుడు ఆ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేసినవారు, ఇక్కడ మాత్రం భిన్నంగా వాదిస్తున్నారు. ఇది రాజకీయానికి సంబంధించిన అంశం కాదు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య. కనుక ప్రభుత్వం అయినా, పరిశ్రమ అయినా బాధ్యతగా వ్యవహరించడం అవసరం అని చెప్పక తప్పదు. ఎందుకంటే పరిశ్రమలు ముఖ్యమే. ఉపాధి ముఖ్యమే. అలాగే కాలుష్య నివారణ కూడా అంతకన్నా ముఖ్యం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఎల్జీ పొలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు ఇవాళ్టితో ఏడాది పూర్తి
-
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు ఏడాది పూర్తి
-
విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్లో గతేడాది విషవాయువులు లీకైన దుర్ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తినిచ్చాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. బాధితులకు పరిహారం అందించడంలో సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన కార్యాచరణ నివేదికను అంగీకరిస్తున్నట్టు తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన 12 మంది కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున, రెండుమూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన 485 మందికి రూ.లక్ష చొప్పున అందజేయడంతోపాటు 12 మందిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించినట్టు ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిపింది. గతేడాది మే 7న జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరించిన విషయం విదితమే. ‘ఆర్ఆర్వీ పురం, నందమూరి నగర్, కంపరపాలెం, పద్మనాభ నగర్, ఎస్సీ, బీసీ కాలనీ, మేఘాద్రిపేట కాలనీల్లోని 17 వేల ఇళ్ల నుంచి 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి 23 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశాం. ఆస్పత్రుల్లో వెంటిలేటర్పై ఉన్న వారికి రూ.10 లక్షల చొప్పున, ప్రాథమిక చికిత్స పొందిన 99 మందికి రూ.25 వేల చొప్పున అందజేశాం. ప్రభావిత ప్రాంతాల్లోని 19,893 మందికి రూ.10 వేల చొప్పున, చనిపోయిన 25 జంతువులకు సంబంధించి యజమానులకు రూ.8,75,000 అందజేశాం. ఎన్జీటీ, ఢిల్లీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వద్ద రూ.50 కోట్లు డిపాజిట్ చేశాం’ అని సంబంధిత అధికారులు తెలియజేశారని వెల్లడించింది. 437 మందిని విచారించి 12 మందిపై క్రిమినల్ చర్యలు ప్రారంభించడంతోపాటు సంస్థ సీఈవో, డైరెక్టర్లు, సీనియర్ అధికారుల పాస్పోర్టులు సీజ్ చేసినట్టు తెలిపారని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ చీఫ్ కంట్రోల్ ఎక్స్ప్లోజివ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. చదవండి: పేదల గూటికి టీడీపీ గండి! ఎస్ఈసీకి ఎదురుదెబ్బ.. ఆ అధికారం మీకెక్కడుంది!? -
నిర్వహణ లోపం వల్లే ఎల్జీపాలిమర్స్ ప్రమాదం
-
విశాఖ గ్యాస్ లీకేజీ: నిందితులకు రిమాండ్
-
ఎల్జీ పాలిమర్స్ సీఈవోకు రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్లో స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి ఆ సంస్థ సీఈవో, డైరెక్టర్తో పాటు అరెస్ట్ చేసిన 12 మందిని పోలీసులు బుధవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. కోవిడ్–19 కారణంగా న్యాయమూర్తి జూమ్ యాప్ ద్వారా విచారణ నిర్వహించి.. నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అంతకుముందు నిందితులందరికీ కేజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. మే నెల 7న చోటుచేసుకున్న దుర్ఘటనలో కంపెనీ యాజమాన్యం, ఉద్యోగుల నిర్లక్ష్యం ఉన్నట్టు హైపవర్ కమిటీ నిపుణుల బృందం స్పష్టం చేసింది. ఆ బృందం నివేదిక ఆధారంగా పోలీసులు సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుంకీ జియోంగ్, టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషినల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పిచ్చుక పూర్ణచంద్రమోహన్, ఎస్ఎంహెచ్ ఇన్చార్జి హెచ్వోడీ కోడి శ్రీనివాస్కిరణ్కుమార్, ప్రొడక్షన్ టీమ్ లీడర్ రాజు సత్యనారాయణ, ఇంజనీర్లు చంద్రశేఖర్, గౌరీ శంకర నాగేంద్ర రాము, ఆపరేటర్ రాజేష్, నైట్ డ్యూటీ ఆఫీసర్ బాలాజీ, జీపీపీఎస్ ఇన్చార్జి అచ్యుత్, ఇంజనీర్ కె.చక్రపాణి, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఆఫీసర్ వెంకట నరసింహ రమేష్ పట్నాయక్లను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని బుధవారం మధ్యాహ్నం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా.. 12 మందికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు వారిని విశాఖలోని సెంట్రల్ జైలుకు తరలించారు. -
విశాఖ ఘటన: నిందితులకు 14 రోజుల రిమాండ్
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన కేసులో అరెస్టు అయిన 12 మందిని విశాఖ పోలీసులు బుధవారం సెకండ్ అడిషనల్ ఛీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు మందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 12 మందిని కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరు పరచగా వీరికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా స్టైరీన్ గ్యాస్ ప్రమాద ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి కేజీఎచ్లో నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 213గా కేసు నమోదు చేయగా, ఐపీసీ 304(2),278, 284 285, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్) గోపాలపట్నం ప్రాంతంలో ఆర్ఆర్ వెంకటాపురంలో మే 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో స్టైరీన్ వాయువు లీకైన ఘటనలో స్థానికులు 12 మంది మృతి చెందగా.. 585 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బాదితులని పరామర్శించి ఆదుకుంటామని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమని తేలితే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి బాధితులకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రెండు రోజుల్లోనే కోటి రూపాయిల నష్టపరిహారం చెల్లించారు. బాధిత గ్రామాల ప్రజలందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఉచిత వైద్య సేవలకి వెంకటాపురంలో పది పడకల క్లినిక్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. (ఎల్జీ గ్యాస్ లీకేజీ : ప్రమాదానికి కారణమదే) అనంతరం ఎల్జీ పాలిపర్స్ ప్రమాదంపై సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని నియమించగా, రెండు నెలలపాటు ఆయా గ్రామాల ప్రజలు, అన్ని వర్గాలను సంప్రదించి 350 పేజీల నివేదికను హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సమర్పించింది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని హైపవర్ కమిటీ తేల్చి చెప్పిన వెంటనే నివేదిక ఇచ్చిన 24 గంటలలోపే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎల్జీ పాలిపర్స్ సీఈఓ, డైరక్టర్లు సహా విశాఖ పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సస్పెన్షన్ చేసింది. -
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్..12 మంది అరెస్టు
-
ఎల్జీ సీఈఓ అరెస్ట్
-
ఎల్జీ సీఈఓ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి: స్టైరీన్ గ్యాస్ ప్రమాద ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గోపాలపట్నం ప్రాంతంలో ఆర్ఆర్ వెంకటాపురంలో మే 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో ఎమ్–6 స్టోరేజ్ ట్యాంక్ నుంచి స్టైరీన్ వాయువు లీకైన ఘటనలో స్థానికులు 12 మంది మృతి చెందగా.. 585 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన రోజునే వెంకటాపురం రెవెన్యూ అధికారి ఎంవీ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్ మీనా పర్యవేక్షణలో పోలీసుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. కంపెనీపై కేసు నమోదు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై విచారణకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు రెండు నెలల పాటు అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ప్రమాదానికి గత కారణాలతో నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేసింది. నివేదిక ఇచ్చిన 24 గంటల్లోనే కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా మొత్తం 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. సరిగ్గా ప్రమాదం జరిగిన రెండు నెలల్లో పోలీసులు సైతం ప్రమాదానికి గల కారణాలపై అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా కంపెనీ ప్రతినిధుల నిర్లక్ష్యం ఉన్నట్లు నిర్ధారణ అవడంతో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుంకీ జియోంగ్, టెక్నికల్ డైరెక్టర్ డి.ఎస్.కిమ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పి.పూర్ణచంద్రమోహన్ రావు, ఎస్ఎంహెచ్ ఇన్చార్జ్ హెచ్ఓడీ కె.శ్రీనివాస్ కిరణ్కుమార్, ప్రొడక్షన్ టీమ్ లీడర్ ఆర్.సత్యనారాయణ, ఇంజినీర్లు సీహెచ్ చంద్రశేఖర్, కె. గౌరీ శంకర నాగేంద్ర రాము, ఆపరేటర్ ఎం.రాజేష్, నైట్ డ్యూటీ ఆఫీసర్ (ఆపరేషన్స్) పి.బాలాజీ, జీపీపీఎస్ ఇన్చార్జ్ ఎస్. అచ్యుత్, ఇంజినీర్ కె.చక్రపాణి, నైట్షిఫ్ట్ సేఫ్టీ ఆఫీసర్ కె. వెంకట నరసింహ రమేష్ పట్నాయక్లను అరెస్టు చేశారు. నివేదిక అందిన 24 గంటల్లోనే స్పందించిన ప్రభుత్వం విశాఖ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ప్రమాదానికి బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. రెండు నెలల క్రితం జరిగిన ప్రమాద ఘటనపై హైవపర్ కమిటీ నివేదిక సమర్పించిన 24గంటల్లోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 మంది కంపెనీ బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఒకవైపు కంపెనీ సీఈవో, కీలకమైన ఇద్దరు డైరెక్టర్లతో సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేసే లోపే మరోవైపు ప్రభుత్వం ముగ్గురు అధికారులపై వేటు వేసింది. నాడు చెప్పారు.. నేడు చేశారు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే విశాఖకు వెళ్లి దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించి వారం రోజుల్లోనే అందించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. క్షతగాత్రులను శరవేగంగా ఆదుకున్న వైఎస్ జగన్ సర్కార్ అంతే వేగంగా ఇప్పుడు బాధ్యులపైనా చర్యలు తీసుకున్నారు. మే 7న క్షతగాత్రులను పరామర్శించడం కోసం హుటాహుటిన విశాఖపట్నం వెళ్లిన సీఎం వైఎస్ జగన్ దోషులెంతటివారైనా ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నాడు ప్రకటించినట్టుగానే సరిగ్గా రెండు నెలల్లోనే... మే 7న ప్రమాదం జరగ్గా జూలై 7న చర్యలు తీసుకోవడం విశేషం. -
ఎల్జీ పాలిమర్స్ ఘటన.. కీలక పరిణామం
సాక్షి, విశాఖపట్నం: సంచలనం కలిగించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మంగళవారం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. (నిర్లక్ష్యమే కారణం) ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో కమిటీ పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని నివేదికలో కమిటీ పేర్కొంది. -
నిర్లక్ష్యమే కారణం
సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని హైపవర్ కమిటీ నిగ్గు తేల్చింది. భద్రతా నియమాలను సక్రమంగా పాటించకపోవడం, ప్రమాద సంకేతాలను హెచ్చరికలుగా పరిగణించకపోవడం వల్లే ఈ అనర్థం సంభవించిందని స్పష్టం చేసింది. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి నివేదిక సమర్పించింది. కమిటీ సభ్యులైన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్తో కలసి నాలుగు వేల పేజీల నివేదికను నీరబ్ కుమార్ ముఖ్యమంత్రికి అందజేశారు. ఇందులో నివేదిక 350 పేజీలు కాగా అనుబంధాలతో కలిపి మొత్తం 4,000 పేజీలు ఉన్నట్లు నీరబ్ కుమార్ మీడియాకు తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎం... నివేదిక అందిన అనంతరం కమిటీ సభ్యులుగా ఉన్న విశాఖ కలెక్టర్ వినయ్చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కేంద్ర ప్రభుత్వం నియమించిన సభ్యులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డైరెక్టర్ డాక్టర్ అంజన్రాయ్, చెన్నైకి చెందిన సీపెట్ డైరెక్టర్ ఎస్కే నాయక్, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ డైరెక్టర్ భరత్ కుమార్ శర్మలతో సీఎం జగన్¯ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు ► ఎల్జీ పాలిమర్స్లో ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడంలో తప్పు జరిగింది. ఎల్జీ పాలిమర్స్లో 2019 డిసెంబర్లో రిఫ్రిజిరేటర్ పైపులు మార్చారు. దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది. అప్పట్లో ఫ్యాక్టరీలో ఉష్టోగ్రతను కొలిచే పరికరాన్ని ట్యాంకు కింది భాగంలో అమర్చారు. దీనివల్ల ట్యాంకు మధ్యభాగం, పైభాగంలో ఎంత టెంపరేచర్ ఉందో తెలుసుకోలేకపోయారు. ఈ తరహా గ్యాస్ లీకేజీ ఘటన దేశంలోనే మొదటిది. ► స్టైరీన్ పాలిమరైజేషన్ అవుతోందని డిసెంబర్లోనే రికార్డు అయినా యాజమాన్యం దీన్ని హెచ్చరికగా భావించలేదు. ► ఒకవైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత భారీగా పెరగడం, స్టైరీన్ బాష్పీభవనం చెందడం (బాయిలింగ్ పాయింట్), ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ► స్టైరీన్ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడానికి కారణాలను బొమ్మల రూపంలో కమిటీ నివేదికలో వివరించింది. పలు రకాలుగా సమాచార సేకరణ... ► ఎల్జీ పాలిమర్స్లో గత మే 7వ తేదీన తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరగ్గా మే 10న కమిటీ ప్రమాద స్థలాన్ని సందర్శించింది. సాంకేతిక నిపుణులతో కలిసి పరిశ్రమలో ప్రమాదానికి కారణమైన ట్యాంక్, కంట్రోల్ రూంతో, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. యాజమాన్యాన్ని ప్రశ్నించి సమాధానాలు రాబట్టింది. ► సాంకేతిక నిపుణులైన ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కేవీ రావు, ఐఐపీఈ ప్రొఫెసర్ వీఎస్ఆర్కే ప్రసాద్, ఏయూ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎస్.బాలప్రసాద్కు బాధ్యతలు అప్పగించి కమిటీ సమాచారాన్ని సేకరించింది. ► బాధితులతో పాటు ప్రత్యక్ష సాక్షులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణవేత్తలు, పరిశ్రమల అభిప్రాయాలను తీసుకుంది. సీబీఆర్ఎన్, ఎన్డీఆర్ఎఫ్, సీఎస్ఐఆర్, ఎన్ఈఈఆర్ఐ, ఏపీపీసీబీ నుంచి కూడా పూర్తి వివరాలను సేకరించింది. ► విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ , వీఎంఆర్డీఏ, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, సీఈఎస్ఓ, బాయిలర్స్ డిపార్ట్మెంట్, ఏపీపీసీబీ, పరిశ్రమల శాఖ, కార్మికశాఖ, అగ్ని మాపక శాఖల నివేదికలను పరిశీలించింది. ► జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నుంచి నియమితులైన కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సీహెచ్వీ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ పి.జగన్నాధరావును కలిసి సమాచారం సేకరించింది. ► 250 ఈ మెయిల్స్, 180 ఫోన్కాల్స్తో పాటు 1,250 ప్రశ్నలతో వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం తీసుకుంది. మీడియా, వివిధ రాజకీయ పక్షాల నుంచి కూడా సమాచారం సేకరించింది. ► కమిటీలో ఐదుగురు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, నలుగురు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిపుణులున్నారు. 11 వాల్యూమ్లతో 4 వేల పేజీల నివేదికను కమిటీ రూపొందించింది. కమిటీలోని 9 మంది సభ్యులూ నివేదికను ఆమోదించారు. అయితే మీడియాలో వచ్చినట్లుగా ఇది గ్యాస్ లీక్ కాదని, ‘అన్ కంట్రోల్డ్ స్టైరీన్ వేపర్ రిలీజ్’ అని కమిటీ పేర్కొంది. ప్రమాదాల నియంత్రణకు నివేదికే దిక్సూచి: సీఎం వైఎస్ జగన్ ► ఎల్జీ పాలిమర్స్లో చోటు చేసుకున్న ప్రమాదంపై హైపవర్ కమిటీ అందచేసిన నివేదిక భవిష్యత్తులో పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకంగా ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పరిశ్రమల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఈ నివేదిక ఒక ఆరంభం కావాలన్నారు. అవసరమైతే ప్రస్తుత చట్టాల్లో మార్పులు, సవరణలు చేస్తామన్నారు. ► ప్రమాదం జరిగినప్పుడు హెచ్చరించే అలారం పరిశ్రమలో 36 చోట్ల ఉన్నప్పటికీ అవి సక్రమంగా పని చేయలేదని హైపవర్ కమిటీ నివేదికలో పొందుపర్చిందని సీఎం చెప్పారు. అలారం మోగకపోవడం లాంటి లోపాల వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం చోటు చేసుకుంటోందన్నారు. తరలింపు లేదా మార్పులు.. ► ఘటనపై హైపవర్ కమిటీ నివేదిక మేరకు నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలించడం లేదా గ్రీన్, వైట్ కేటగిరీ పరిశ్రమలుగా మార్పులు చేసుకోవాలని నిర్దేశిస్తామని సీఎం జగన్ చెప్పారు. ► పరిశ్రమలకు సంబంధించి అన్ని శాఖలు మరింత పటిష్టంగా కార్యాచరణ ప్రణాళికతో పాటు ప్రొటోకాల్ సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రజల రక్షణ, పరిశ్రమల్లో భద్రత పట్ల ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసేలా హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించారు. -
ఎల్జీ గ్యాస్ లీకేజీ: ప్రమాదానికి కారణమదే
సాక్షి, అమరావతి : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సమర్పించింది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషాయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదికలో పేర్కొంది. సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. విశాఖలో జరిగింది కేవలం గ్యాస్లీకేజీ మాత్రమే కాదని అనియంత్రిక స్టైరిన్ కూడా పెద్ద ఎత్తున విడుదలైందని తెలిపారు. ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడం చాలా కీలకమైన విషయామని, అయితే ఎల్జీ పాలిమర్స్ విషయంలో తీవ్ర తప్పదం జరిగిందని పేర్కొన్నారు. 2019 డిసెంబర్లో రిఫ్రిజిరేషన్ పైపులు మార్చారని, దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామని చెప్పారు. (ఎల్జీ గ్యాస్ లీకేజీపై హైపర్ కమిటీ నివేదిక) సైరన్ ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం ‘ఫ్యాక్టరీలో ఉష్టోగ్రత కొలిచే పరికరం ట్యాంకు కింది భాగంలో అమర్చారు. దీనివల్ల ట్యాంకు మధ్యభాగంలో పైభాగంలో ఎంత టెంపరేచర్ నమోదు అవుతోంది తెలుసుకోలేకపోయారు. స్టైరిన్ పాలిమరైజేషన్ అవుతోందని వారికి డిసెంబర్లోనే రికార్డు అయింది. కానీ దీనిని వారు హెచ్చరికగా భావించలేదు. ఓ వైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరగడం, స్టైరిన్ బాయిలింగ్ పాయింట్కు చేరడం, ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. స్టైరిన్ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడానికి కారణాలేంటో పూర్తిగా డయాగ్రామ్ రూపంలో నివేదికలో పొందుపరిచాం. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే... స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫ్యాక్టరీలో 36 చోట్ల అల్లారం పాయింట్లున్నాయి.. ప్రమాదం జరిగినా సైరన్ మోగించలేదు. ఎల్జీ పాలిమర్స్లో అల్లారం ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం. స్టైరిన్ను అదుపు చేసేందుకు కావాల్సిన రసాయనాలు పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలో లేవు. ఒకవేళ ఇలాంటి రసాయనాలు అందుబాటులో ఉంటే స్టైరిన్ను త్వరగా న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉండేది. ఈ రసాయనాలను గుజరాత్ నుంచి తెప్పించాల్సి వచ్చింది. అప్పటికే ట్యాంకుల్లో టెంపరేచర్ పూర్తిగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాలపై అధ్యయనం కేవలం ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికే పరిమితం కాకుండా దీనికి సంబంధించిన అన్ని విభాగాల పనితీరుపైనా మేము విచారణ చేశాము. పారిశ్రామిక అభివృద్ధి ముఖ్యమే కాని.. దానితోపాటు పరిశ్రమల భద్రత, పర్యావరణ సంరక్షణ కూడా ముఖ్యమే. దీని కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో చర్చించాము. ఎల్జీ పాలిమర్స్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన ఫ్యాక్టరీ జనావాసాల్లో ఉండేందుకు వీల్లేదు అని నివేదికలో స్పష్టంగా చెప్పాము. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలపై అధ్యయనం చేసి ఇలాంటి ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండాలనే దానిపై సూచనలు చేశాం. చాలా ఫ్యాక్టరీల్లో స్టైరిన్లాంటి కెమికల్స్ వాడుతుంటారు ఇలాంటి ఫ్యాక్టరీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిబంధనలు సూచించాం. పరిశ్రమల భద్రతకు సంబంధించి ఒకే ఏజన్సీకి అధికారాలివ్వాలని సూచించాం. ప్రమాదకర రసాయనాల ఫ్యాక్టరీలను జనావాసాల కంటే దూరంగా ఏర్పాటుచేయాలి. మాస్టర్ ప్లాన్ తయారు చేసే సమయంలోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ను వేరే ప్రాంతానికి తరలించడం మంచిది అనే మా అభిప్రాయం’ అని నివేదికలోని వివరాలు వెల్లడించారు. -
అల్లారం ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం
-
సీఎం జగన్కు నివేదిక ఇచ్చిన హైపవర్ కమిటీ
-
ఎల్జీ గ్యాస్ లీకేజీపై హైపర్ కమిటీ నివేదిక
సాక్షి, తాడేపల్లి : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన కమిటీ సభ్యులు, గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నివేదికను సమర్పించారు. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 7న ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్లో ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృత్తం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను కమిటీ తన నివేదికలో పొందుపరిచింది. (ప్రభుత్వం గొప్పగా వ్యవహరించింది) అలాగే ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, సీనియర్ జర్నలిస్ట్లు, అధికారులతో హైపవర్ కమిటీ చర్చించింది. నివేదిక సమర్పన సందర్భంగా విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వినయ్ చంద్, నగర కమిషనర్ ఆర్కే మీనా పాల్గొన్నారు. కాగా విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్జీ పాలిమర్స్లో మే 7 వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారాంత ప్రభుత్వ సహాయంతో చికిత్స పొంది కోలుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించి బాధితులను ఆదుకుంది. -
ఎల్జీ పాలిమర్స్ ఘటన: నేడు హైపవర్ కమిటీ నివేదిక
సాక్షి, తాడేపల్లి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై హైపవర్ కమిటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నేడు నివేదికను సమర్పించనుంది. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మే 7న ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ ఘటనపై ఆరు ప్రత్యేక కమిటీలతో పాటు హైపవర్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఐదు గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, సీనియర్ జర్నలిస్ట్లతో హైపవర్ కమిటీ చర్చించింది. ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను కమిటీ ఇవ్వనుంది. -
‘సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ చౌదరికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే సమయం లేదు గానీ, అవినీతికి పాల్పడిన టీడీపీ గజ దొంగలను మాత్రం పరామర్శించేందుకు వెళ్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చురకలంటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారని విమర్శించారు. పేదల కష్టార్జితాన్ని దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించారని తెలిపారు. శుక్రవారం మంత్రి వెల్లంపల్లి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ‘ఈఎస్ఐ స్కాంలో తన పేరు ఎక్కడ బయట పెడతారోననే భయంతో లోకేష్ అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిలువుగా, అడ్డంగా పెరిగితే బాహుబలి కాదు. ప్రజల సమస్యలను పరిష్కరించే సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి. మీరందరూ కాలకేయుల్లాంటోళ్లు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పడిపోయింది. వైఎస్ రాజారెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్కు ఉందా. గతంలో ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే అరెస్టులు చెయలేదా. లోకేష్ను కూడా టీడీపీ నేతలు పరామర్శించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మంగళగిరి మందలగిరికి, జయంతి వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి లోకేష్. మాట్లాడితే అచ్చెన్నాయుడిని హత్య చేయాలని ప్రభుత్వం చూస్తోందని అంటున్నారు. హత్యలు చేసే సంస్కృతి టీడీపీది. వంగవీటి రంగను నడిరోడ్డుపై చంపిచింది ఎవరు? టీడీపీ అధికారంలో ఉన్నపుడే వంగవీటి రంగను హత్య చేయించలేదా..? హత్యా రాజకీయాలకు పేరు ప్రఖ్యాతులు గడిచింది నారా చంద్రబాబు’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: ఎవరి వాటా ఎంత?) (అందరం కలిసికట్టుగా ఈ చీకటిపై పోరాడుదాం) -
ఎల్జీ పాలిమర్స్ ఘటన.. త్వరలోనే తుది నివేదిక
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సేకరించిన సమాచారం ఆధారంగా తుది నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కమిటీ ఇప్పటికే సంబంధం ఉన్న అందరి నుండి సలహాలు, సూచనలు ప్రశ్నలు సేకరించడం జరిగిందన్నారు. దానిలో భాగంగా 243 రిప్రజెంటేషన్ 175 టెలిఫోన్, పబ్లిక్, వాట్సాప్ ను రిసీవ్ చేసుకున్నామని పేర్కొన్నారు. దాని ఆధారంగా కమిటీ ఒక ప్రశ్నావళి రూపొందించి ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఇతర రెగ్యులేటరీ అథారిటీ ద్వారా అందించడం జరిగిందని, ఇంకా ఎల్జీ పాలిమర్స్ నుంచి జవాబు అందాల్సి ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైపవర్ కమిటీ తుది జాబితాలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. మే నెలలో విశాఖపట్నం సందర్శించిన హైపవర్ కమిటీ స్టేక్ హోల్డర్స్ అందరితో సుదీర్ఘ చర్చలు నిర్వహించిందన్నారు. జూన్ 15న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఘటనలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే వారంలో హైపవర్ కమిటీ మరిన్ని సమావేశాలు రెగ్యులేటరీ ఆథారిటీతో కలిపి నిర్వహించనుందని ఆయన తెలియజేశారు. -
ప్రభుత్వం గొప్పగా వ్యవహరించింది
సాక్షి, అమరావతి: ‘విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఎంతో గొప్పగా వ్యవహరించింది. ఈ ఘటనలో మృతి చెందిన ప్రతి ఒక్కరికీ కోటి రూపాయల భారీ తక్షణ నష్టపరిహారం అందించింది. ఇది చాలా గొప్ప విషయం. ఇంత భారీ మొత్తాన్ని పరిహారంగా ఇచ్చిన ప్రభుత్వ మానవతా దృక్పథాన్ని.. దయార్ద హృదయాన్ని అభినందిస్తున్నాం’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. కరోనా వల్ల కోర్టులు పనిచేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులను కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్ కోరుతున్న విధంగా న్యాయవాదులకు వడ్డీ రహిత రుణాలు ఇచ్చేలా బ్యాంకులను కోర్టులు ఆదేశించజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాదులను ఆదుకునేందుకు ఇప్పటికే కేటాయించిన రూ.100 కోట్ల విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ దేవానంద్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులే.. లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు ఎస్బీఐ ద్వారా వడ్డీ రహిత వ్యక్తిగత రుణంగా రూ.లక్ష ఇప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎం.గిరిబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. ఇవి పూర్తిగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులేనని, కేంద్ర నిధులు కావని స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని బార్ కౌన్సిల్ ద్వారా న్యాయవాదుల కోసం ఉపయోగించాలని నిర్ణయించిందన్నారు. ఈ విషయంలో జీవో జారీ చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని తెలిపారు. -
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ప్రశంసలు కురిపించింది. విశాఖ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం గొప్పగా వ్యవహరించిందని గుర్తు చేసింది. గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి తక్షణ పరిహారం ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొంది. ప్రభుత్వం మానవతా దృక్పథం, దయార్థ హృదయాన్ని అభినందిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా గ్యాస్ లీకేజీ ఘటనపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు పదిరోజుల్లోనే పరిహారం అందించారు. (చదవండి: బాధిత కుటుంబాలకు రూ. కోటి బాసట) -
‘వచ్చే ఏడాది మహానాడు జైలులోనే’
సాక్షి, విశాఖపట్నం: పేదల సొమ్మును టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, కొందరు అధికారులు పందికొక్కుల్లా తిన్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ ధ్వజమెత్తాడు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాక ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి టైం దొరకని చంద్రబాబుకు, ఒక దొంగను అరెస్ట్ చేస్తే పరామర్శించడానికి టైం దొరికిందా అని ప్రశ్నించారు. అచ్చెంనాయుడు అరెస్ట్ను కిడ్నాప్గా అభివర్ణిస్తూ, రాజకీయం చేసి కులాలకు ఆపాదించారని, అవినీతికి కులం, మతం ఉండదని చంద్రబాబుకు తెలుసన్నారు. చంద్రబాబు హయంలో హెచ్పీసీఎల్, ఒఎన్జీసీ ఘటనలు జరిగిన బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. (ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ) తన సొంత ప్రయోజనాల కోసం, పబ్లిసిటీ కోసం గోదావరీ పుష్కరాల్లో 29 మందిని బలితీసుకున్నా టీడీపీ తరుపున ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్ బాధిత ప్రాంతంలో నివసిస్తున్న 20 వేల జనాభాను ఆదుకుందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఆరు లక్షల కోట్ల అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. తాను చేసిన అరాచకాలు, అన్యాయాలు మర్చిపోయి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజల మీద ఉన్నది సవతి ప్రేమ అని, ఆయన అక్రమాలను తెలుగు ప్రజలు మర్చిపోరు అని అన్నారు. మొన్న మహానాడునను జూమ్ యాప్లో చేసుకున్న చంద్రబాబు వచ్చే ఏడాది జైలులో చేసుకోవాల్సిందే అని అమర్నాధ్ ఎద్దేవా చేశారు. (అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం) -
ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ
సాక్షి, న్యూ ఢిల్లీ : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై పెండింగ్లో ఉన్న పిటిషన్ల విచారణ వీలైనంత త్వరగా ముగించాలని హైకోర్టుకు సూచిస్తామని తెలిపింది. వచ్చే వారం చివరి నాటికి హైపర్ కమిటీ విచారణ ముగించాలంది. సుమోటోగా కేసు తీసుకునే అధికారం ఉందని ఇప్పటికే ఎన్జీటీ స్పష్టం చేసిందని పేర్కొంది. ఎన్జీటీ ఆదేశాలతో డిపాజిట్ చేసిన 50 కోట్ల పంపిణీని 10 రోజులు ఆపాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ప్రధాన ఆదేశాలను సవాలు చేస్తూ అప్లికేషన్ సమర్పించాలని పిటిషనర్కు సూచన చేసింది. ( గ్యాస్ లీకేజీ ఘటన: ముగిసిన విచారణ ) ప్లాంట్ను సీల్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు ఎల్జీ పాలిమర్స్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ. ప్లాంట్ సీల్, కంపెనీ డైరెక్టర్ల పాస్ పోర్టులను సమర్పించాలన్న హైకోర్టు ఆదేశాలను సవాలు చేశామన్నారు. ప్లాంట్ను సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న రోహత్గీ వాదనపై జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ స్పందిస్తూ.. ప్లాంట్ను సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని భావించట్లేదన్నారు. కంపెనీ లోపం వల్ల గ్యాస్ లీక్ అయిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఇందులో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ముకుల్ రోహత్గీ కోరిన నేపథ్యంలో పిటిషన్పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
గ్యాస్ లీకేజీ ఘటన: ముగిసిన విచారణ
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మూడు రోజుల విచారణ పూర్తి అయింది. దీనిపై ఈ నెల 20 లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హైపవర్ కమిటీ చైర్మన్, భూమి శిస్తు చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఎ) నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. (ఎల్జీ పాలిమర్స్కు ఎన్వోసీ ఇవ్వలేదు) గ్యాస్ లీక్ అయిన సమయంలో పని చేసిన జర్నలిస్టులు, జీవీఎంసీ ఫైర్ సిబ్బంది అభిప్రాయాలను కమిటీ సభ్యులు సేకరించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రతినిధులు హైపవర్ కమిటీకి పలు సూచనలు చేశారు. మనుషులు, జంతువులపై స్టైరిన్ గ్యాస్ ప్రభావంపై పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఆధారంగా ఇతర ప్రమాదకర పరిశ్రమల స్థితిగతులపైనా అధ్యయనం చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రజల్లో మానసిక ఆందోళన తొలగించే ప్రయత్నం అత్యవసరమని పేర్కొన్నారు. (‘మేఘాద్రి’లో స్టైరిన్ లేదు) -
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ
-
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ
-
హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, భూమి శిస్తు చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఎ) నీరబ్కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ వినయ్చంద్ పాల్గొన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. సంఘటన ఎలా జరిగింది. లీకేజీకి సంబంధించిన అంశాలు విపులంగా పరిశీలించనుంది. వివిధ కమిటీల నివేదికలను పరిశీలించి, పర్యావరణ, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలు తెలుసుకొని, ప్రజల వినతులు అధ్యయనం చేసి.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి నుంచి సమాచారం సేకరించడానికి కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు నివేదికలు రావడంతో పూర్తిస్థాయి ముసాయిదా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇందుకోసం మూడు రోజులపాటు హైపవర్ కమిటీ వివిధ వర్గాలతో వరుసు భేటీలు నిర్వహించనుంది. చదవండి: బాబాయ్ భ్రష్టు పట్టించారు -
బయటపడ్డ రంగనాయకమ్మ కేసుల చిట్టా
సాక్షి, గుంటూరు : విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ కేసుల చిట్టాలను పోలీసులు బయటపెట్టారు. ఆమెపై ఇదివరకు పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రంగనాయకమ్మపై 2011 నుంచి పలు క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు జిల్లా పోలీసులు గుర్తించారు. 2011లో ఓ కేసులో ఆమెకు గుంటూరు కోర్డు 5వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే 2014లో ఆమెపై నమోదైన ఓ సివిల్ కేసు విచారణ సందర్భంగా రూ.15.40 లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించిట్లు రికార్డులో తేలింది. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!) ఇక వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ 2014, 2015ల్లో నమోదైన 3 క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గుంటూరు, మార్కాపురం కోర్టుల్లో 4 క్రిమినల్ కేసుల్లో విచారణ జరుగుతోంది. అవికాక తాజాగా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల కేసులోనూ రంగనాయకమ్మ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇకపోతే ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన రంగనాయకమ్మ వ్యవహారశైలిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమె చేసిన గత పోస్టులన్నింటినీ గమనిస్తే కావాలనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నట్లు అర్థమవుతోందని వారందరూ అభిప్రాయపడుతున్నారు. -
ఎల్జీ పాలిమర్స్కు ఎన్వోసీ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలో కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం ఎల్జీ పాలిమర్స్కు నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇచ్చామనడం శుద్ధ అబద్ధమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. లాక్డౌన్ 3.0 మార్గదర్శకాల ప్రకారం.. కేంద్రం పలు సడలింపులు ఇచ్చిందని, దీని ప్రకారం తమ పరిశ్రమ కార్యకలాపాల నిర్వహణకు అనుమతినివ్వాలని ఎల్జీ పాలిమర్స్ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకుందని వివరించింది. అనుమతి కావాలంటే పరిశ్రమ కంటైన్మెంట్, బఫర్ జోన్లో లేదని డిక్లరేషన్ ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్కు చెప్పామని, అయితే ఆ కంపెనీ డిక్లరేషన్ను సమర్పించలేదంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఇప్పటికే కంపెనీ నిర్వహణ, ఉత్పత్తికి అనుమతిని ఉపసంహరించిందని వివరించింది. విశాఖపట్నంలో మే 7న ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ విషవాయువు విడుదలై 12 మంది మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటో పిల్గా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇదే ఘటనపై మరో రెండు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాల్లో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల వన్ కౌంటర్ దాఖలు చేశారు. స్టైరీన్ వాయువు కాదని, అది ద్రావణమని, ట్యాంక్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్లే స్టైరీన్ లీకైందని వలవన్ వివరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమీప గ్రామాల ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిందన్నారు. మృతులకు భారీ నష్టపరిహారం, ఇతరులకు వైద్య సాయం, పరిహారం అందించామన్నారు. ప్రాణ నష్టానికి ఎల్జీ పాలిమర్స్దే బాధ్యత : ఎన్జీటీ విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ప్రాణ నష్టానికి çపూర్తి బాధ్యత ఎల్జీ పాలిమర్స్దేనని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతుల్లేకుండా ప్లాంటు నడిపించారని, 1989 నాటి పర్యావరణ అనుమతులను కూడా కంపెనీ ఉల్లంఘించిందని బుధవారం నాటి రాతపూర్వక ఉత్తర్వుల్లో పేర్కొంది. జస్టిస్ శేషశయనారెడ్డి కమిటీ నివేదిక స్టైరీన్ గ్యాస్ నిల్వలను కంపెనీ సరైన రీతిలో నిర్వహించలేకపోయినట్టు తెలిపిం దని వివరించింది. కంపెనీ జమ చేసిన రూ.50 కోట్లను బాధితులకు నష్టపరిహారంగా, పర్యా వరణ పునరుద్ధరణకు వెచ్చించాలని తెలిపింది. -
ఎల్జీ పాలిమర్స్ ఘటన: ఎన్జీటీ తీర్పు
న్యూఢిల్లీ: విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు, బాధితులకు పంచాలని ఆదేశించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు రెండు నెలల్లో ప్రణాళిక రూపొందించాలని పేర్కొంది. ఇందుకోసం కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కమిటీని రెండు వారాల్లో ఏర్పాటు చేయాలన్న ఎన్జీటీ.. రెండు నెలల్లో నివేదిక అందజేయాల్సిందిగా కమిటీని ఆదేశించింది. అదే విధంగా తుది నష్టపరిహారాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ.. కాలుష్య నియంత్రణ మండలి కలిసి అధ్యయనం చేయాలని సూచించింది. (‘మేఘాద్రి’లో స్టైరిన్ లేదు) ఇక కంపెనీకి అనుమతుల విషయంలో చట్ట ప్రకారంగా నడుచుకోని అధికారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. అదే విధంగా చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఎల్జీ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ కంపెనీకి అనుమతులు ఇస్తే వాటి వివరాలు ట్రిబ్యునల్కు తెలియజేయాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ పర్యవేక్షణ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని.. అదే విధంగా రసాయన పరిశ్రమల పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది.(నివేదిక వచ్చాక నిర్ణయం: సీఎం జగన్) కాగా గ్యాస్ లీకేజీ ఘటనపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. కోటి రూపాయిల ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు పదిరోజుల్లోనే పరిహారం అందించారు. అదే విధంగా విషాదానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు తెలుసుకునేందుకు నిపుణులతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో 6 కమిటీలను ప్రభుత్వం నియమించింది. కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా యాజమాన్యంపై చర్యలు ఉంటాయని వెల్లడించింది. -
‘మేఘాద్రి’లో స్టైరిన్ లేదు
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకైన ఘటనలో మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ స్టైరిన్తో కలుషితమైపోయిందన్న అనుమానాల్ని నివృత్తి చేస్తూ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరీ) మంగళవారం నివేదికను విడుదల చేసింది. దుర్ఘటన జరిగిన తర్వాత తీసిన శాంపిల్స్లో ఎలాంటి స్టైరిన్ అవశేషాలు లేవంటూ నాగ్పూర్లోని నీరీ సంస్థ రిపోర్టులో వెల్లడించింది. పంపించిన శాంపిళ్ల నివేదికను నీరీ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. నీటిలో ఏయే లవణాలు ఎంత మోతాదులో ఉన్నాయి. ఇతర పరిమాణాలు ఎలా ఉన్నాయనే విషయాల్ని సీఎస్ఐఆర్–నీరీకి చెందిన 15 మంది శాస్త్రవేత్తల బృందం పూర్తిస్థాయిలో పరిశీలించింది. మే 12 నుంచి 16వ తేదీ వరకు మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్లోని నీటి శాంపిళ్లను పరీక్షలకు సేకరించింది. నీటి నాణ్యత పరీక్షలతో పాటు బయో ఎస్సే పరీక్షలు కూడా నిర్వహించారు. రిజర్వాయర్ నీటిలో స్టైరిన్ అవశేషాలు అతి స్వల్పంగా ఉన్నాయని.. దానితో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. పీహెచ్ లెవెల్స్ కూడా సాధారణంగా ఉన్నాయని తెలిపింది. సోడియం, ఇతర గాఢ లవణాల శాతం ఎక్కువగా ఉందనీ, ఈ కారణంగా నేరుగా తాగునీటి కోసం వినియోగించొద్దని నీరీ సూచించింది. గాఢ లవణాలు తీసేస్తే, కంబైన్డ్ ఓజోన్ యాక్టివేటెడ్ కార్బన్ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా శుద్ధి చేసిన తర్వాత మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్లోని నీటిని యథాతథంగా వినియోగించవచ్చని స్పష్టం చేసింది. స్టైరిన్ అవశేషాలు మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్లోని నీటిలో లేవంటూ నీరీ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా చెప్పారనీ, అయితే నివేదిక ఇంకా తమ చేతికి అందలేదని జీవీఎంసీ కమిషనర్ జి.సృజన స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాతే నీటిని వినియోగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: సెల్లో ఫొటోలు తీసి... ఆపై గర్భవతిని చేసి -
చంద్రబాబు వచ్చారు.. వెళ్లారు
సాక్షి, అమరావతి: హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు నానా హడావుడి చేసిన చంద్రబాబు రెండ్రోజులు కూడా గడవకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఉండవల్లి నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఆయన రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 25న ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్రానికి వచ్చేందుకు చంద్రబాబు డీజీపీ అనుమతి కోరారు. ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన రాష్ట్రానికి వచ్చేందుకు డీజీపీ అనుమతిచ్చారు. కానీ, ఆ రోజు రాష్ట్రంలో ప్రారంభం కావాల్సిన విమాన ప్రయాణాలన్నీ రద్దుకావడంతో బాబు విశాఖకు వెళ్లకుండా రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. వచ్చిన తర్వాతైనా విశాఖ వెళ్లే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదు. రెండ్రోజులపాటు ఆన్లైన్లో మహానాడు నిర్వహించారు. అది ముగిసిన తర్వాతైనా విశాఖ వెళ్తారని పార్టీ నాయకులు భావించారు. కానీ, అనూహ్యంగా అది ముగిసిన మర్నాడే చంద్రబాబు సైలెంట్గా హైదరాబాద్ వెళ్లిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. -
నివేదిక వచ్చాక నిర్ణయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : విశాఖలో గ్యాస్ లీక్ దుర్ఘటనపై లోతుగా దర్యాప్తు జరుగుతోందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు ఆ దిశగా పని చేస్తున్నాయని, నివేదికలు వచ్చాక ఒక నిర్ణయానికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఘటన తర్వాత బాధితులను వేగంగా ఆదుకున్నామని, కేవలం పది రోజుల్లోనే దాదాపు రూ.50 కోట్ల మేర ఆర్థిక సాయం చేశామని తెలిపారు. పరిశ్రమలు– మౌలిక సదుపాయాలపై గురువారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేధోమథన సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. (టీటీడీ ఆస్తుల విక్రయం నిషిద్ధం) చట్టంలో మార్పు చేస్తాం ► ప్రజలు ఎక్కువగా ఉన్నచోట ఆరెంజ్, రెడ్ పరిశ్రమలు లేకుండా కాలుష్య నియంత్రణ చట్టాన్ని మార్చబోతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ► సదస్సులో మంత్రులు మేకపాటి గౌతమ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామిక వేత్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు (ఏపీకి ప్రత్యేక బలం ఉంది : సీఎం జగన్) ► రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని పేర్కొంటూ ఇటీవల విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనను సీఎం జగన్ ప్రస్తావించారు. ఎల్జీ పాలిమర్స్లో జరగకూడని ఘటన జరిగిందని, దురదృష్టవశాత్తూ ప్రజలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన విషయంలో రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచన చేశానని సీఎం పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే దురుసుగా వ్యవహరించి ఉంటే పారిశ్రామిక వర్గాల్లో భయాన్ని రేకెత్తిస్తున్నారనే విమర్శలు వచ్చేవని, అదే సమయంలో ఏమీ చేయకుంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే విమర్శలు కూడా చేస్తారన్నారు. అందుకనే రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచన చేశానన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి ముఖ్యమని, అయితే దానివల్ల ప్రజలకు నష్టం జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. ► ఏం జరిగిందో తెలుసుకోకుండా, వాస్తవాలు గుర్తించకుండా కఠిన చర్యలు తీసుకుంటే పారిశ్రామిక వర్గాలలో ఒక భయానికి ఆస్కారం ఇచ్చినవాళ్లం అయ్యేవాళ్లం. అదే సమయంలో ప్రజల ప్రాణాలు, బాగోగులు ముఖ్యం. అందుకే రాష్ట్రానికి ఒక తండ్రిగా అన్నీ చూడాలి, అభివృద్ధి జరగాలి, అటు ప్రజలకు నష్టం జరగకూడదు కాబట్టి ప్రభుత్వం రంగంలోకి దిగి 10 రోజుల్లోనే బాధితులకు దాదాపు రూ.50 కోట్ల మేర ఆర్థిక సాయం చేశాం. ► ఘటన జరిగిన సమయంలో అలారం ఎందుకు మోగలేదనే విషయాన్ని దర్యాప్తు కమిటీలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. ప్రజల సందేహాలను కూడా నివృత్తి చేసేందుకు పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చామన్నారు. ప్రజల బాగోగులను దృష్టిలో ఉంచుకుని అక్కడ ఉన్న రసాయనాన్ని తరలించామన్నారు. (నేటి ముఖ్యాంశాలు..) -
పొరపాట్లు జరిగితే మర్చిపోండి
సాక్షి, అమరావతి: పార్టీలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మర్చిపోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు కార్యకర్తల్ని కోరారు. పొరపాట్లు మళ్లీ జరక్కుండా చూసుకుంటానని, అందరూ పార్టీ కోసం పనిచేయాలన్నారు. భవిష్యత్తు అవసరాల్ని బట్టి పార్టీ యంత్రాంగాన్ని తయారుచేస్తానని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి బుధవారం జూమ్ వెబ్నార్ ద్వారా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం.. మృతిచెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మృతులకు సంతాపం తెలిపారు. పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్ రమణ మాట్లాడిన తర్వాత చంద్రబాబు ప్రసంగించారు. గడచిన సంవత్సరం చాలా బాధాకరమైనదని.. ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని.. ఈ ఏడాదిలో ఎదుర్కొన్నన్ని సమస్యలు ఎప్పుడూ లేవని, పార్టీ నాయకుల్ని అన్ని రకాలుగా దెబ్బతీశారని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో ఉంది. కేంద్రం నుంచి డబ్బులు వస్తాయో లేదో తెలీదు. ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం జీఓ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు తీసుకొచ్చింది మనమే. రాయలసీమకు కృష్ణా జలాలను బనకచర్ల మీదుగా తీసుకెళ్లేలా ప్లాన్ చెప్పా. ► సంవత్సరంలో 34 సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేశారు. పెట్టుబడులు పోయాయి. రైతులు దివాళా తీశారు. వారికి మద్దతు ధర ఇచ్చే పరిస్థితిలేదు. ► 2016లో చేసిన నిర్ణయాన్ని రివర్స్ చేశామంటున్నారు. ఆస్తుల వేలం నిలిపేసి క్షమాపణ చెప్పాలి. తిరుమల ఆస్తులను చౌకగా కొట్టేయాలని చూస్తున్నారు. ► ఎల్జీ గ్యాస్ ఘటనలో మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఇస్తాం. ► కరెంటు ఛార్జీలు పెంచారు. మద్యం, ఇసుక, సిమెంటు అన్ని రేట్లు పెంచేశారు. ఇరిగేషన్లో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ప్రత్యేక హోదా ఏమైంది. ► రూ.80 వేల కోట్ల అప్పులు చేశారు. వాటితో అభివృద్ధి చేయలేదు. ఏడు తీర్మానాలు.. సీఎం జగన్పై ఆరోపణలకే మహానాడులో తొలిరోజు ఏపీకి సంబంధించి ఏడు తీర్మానాలు చేయగా అవన్నీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనే పెట్టడం గమనార్హం. 8 ‘విద్యుత్ చార్జీల పెంపు–మాట తప్పిన జగన్’ తీర్మానాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ‘కరోనా విజృంభణ–వలస కార్మికుల కష్టాలు’ తీర్మానం గుంటూరు ఎంపీ జయదేవ్.. ‘టీటీడీ ఆస్తుల అమ్మకం’పై వేమూరి ఆనంద్సూర్య.. ‘అరాచక పాలనకు ఏడాది’ తీర్మానాన్ని వర్ల రామయ్య.. ‘అన్నదాత వెన్నువిరిచిన జగన్ సర్కార్’ తీర్మానాన్ని సోమిరెడ్డి.. ‘సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు’ తీర్మానాన్ని కాల్వ శ్రీనివాసులు.. ‘అక్రమ కేసులు–ఆస్తుల విధ్వంసం’ తీర్మానాన్ని అయ్యన్నపాత్రుడు ప్రవేశపెట్టారు. తెలంగాణకి సంబంధించి రెండు తీర్మానాలు రేపటికి వాయిదా వేశారు. ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరు తొలిరోజు మహానాడుకు ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలిసింది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొనలేదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇంకా పలువురు ముఖ్య నేతలూ సమావేశానికి దూరంగా ఉన్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మొక్కుబడి తంతే.. కరోనా నేపథ్యంలో జూమ్ వెబ్నార్ ద్వారా నిర్వహించిన మహానాడు మొక్కుబడి తంతులా జరగడంతో నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రతిరోజూ చేపట్టే వీడియో కాన్ఫరెన్స్లానే ఉంది తప్ప మహానాడులా లేదని పార్టీ సీనియర్లు పెదవి విరిచారు. కాసేపటికే విసుగొచ్చి చాలామంది లైన్కట్ చేసినట్లు తెలిసింది. ప్రారంభంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లైన్ సరిగా లేకపోవడంతో ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే కట్ చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి ఒకేసారి నాయకులంతా వచ్చి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. జెండా ఆవిష్కరణ, ఎన్టీఆర్కి నివాళులర్పించేటప్పడు నాయకులంతా భౌతికదూరాన్ని బేఖాతర్ చేశారు. -
ఇంద్రభవనంలో విశ్రమించి ఇప్పుడొచ్చారు
సాక్షి, అమరావతి: కోట్లాది రూపాయలతో హైదరాబాద్లో నిర్మించుకున్న ఇంద్రభవనంలో రెండు నెలలకుపైగా విశ్రాంతి తీసుకొని చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీకి రాగానే పూలు జల్లించుకున్న చంద్రబాబు, భౌతిక దూరం పాటించలేదని, టీడీపీ నేతలు మాస్క్లు కూడా ధరించలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు మీద ఎన్నికేసులు పెట్టాలని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలన బ్రహ్మాండంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు, ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరు, సహాయక కార్యక్రమాలను దేశం మొత్తం ప్రశంసించింది. ► హైదరాబాద్లో ఉండి చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లారు. ఇప్పుడు వైజాగ్ వెళ్లి ఏం చేస్తారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ వెళ్లవచ్చుకదా? కరకట్ట ఇంటికి ఎందుకు వచ్చారు. తాను విశాఖ వెళ్తుంటే ఎయిర్పోర్టులు మూసివేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. ► ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తారు. ► అందరికీ లబ్ధి చేకూరేలా సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతోంది. జగన్కు మంచిపేరు వస్తుందనే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. -
ఎల్జీ పాలిమర్స్ సీజ్
విశాఖపట్నం: స్టైరీన్ గ్యాస్ లీకేజీ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీని జిల్లా రెవిన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఈ నెల 7వ తేదీన జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృత్యువాతపడగా 585 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపడుతోంది. ముందుగా కంపెనీని సీజ్ చేయడంతో పాటు డైరెక్టర్ల పాస్పోర్టులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం విశాఖ ఆర్డీఓ పెంచల కిషోర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎ.రామలింగరాజు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రసాద్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సీజ్ చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కంపెనీని మూసివేసినట్లు ఆర్డీఓ తెలిపారు. -
‘వారు ఇప్పుడు గుర్తుకొచ్చారా’
సాక్షి, విశాఖపట్నం: ఇరవై రోజుల తర్వాత ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు పరామర్శిస్తానని చెప్పడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే వస్తున్నారని విమర్శించారు. గ్యాస్ ఘటనలో బాధితులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి ఆదుకున్న ఘనత దేశ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. సీబీఐ విచారణకు చంద్రబాబు స్వాగతించడం ఆయన నీచ రాజకీయానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తన అవినీతిని వెలికి తీస్తారని అధికారంలో ఉన్నప్పుడు సీబీఐకు నో ఎంట్రీ అన్న చంద్రబాబు సీబీఐ కావాలని ఎలా అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, అయ్యన్నలు.. రంగనాయకమ్మ పోస్ట్ను షేర్ చేసి అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత పాలనలో రాష్ట్రాన్ని దోచుకుతిన్న టీడీపీ నేతలు దోచుకోవడం గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఉమాశంకర్ విమర్శించారు. -
రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!
సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ వ్యవహారశైలిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన గత పోస్టులన్నింటినీ గమనిస్తే కావాలనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నట్లు అర్థమవుతోందని వారందరూ అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఆమె చేస్తున్న దుష్ప్రచారంపై సీఐడీ కేసు నమోదుచేసి విచారణకు పిలిస్తే టీడీపీ అగ్రనేతలు రంగనాయకమ్మకు దన్నుగా నిలవడం చూస్తుంటే సర్కారుపై ఆ వర్గం కావాలనే బురదజల్లే కార్యక్రమం చేపట్టినట్లు అర్థమవుతోందని వారు తీవ్రంగా ఎండగట్టారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మీకు ఈ డ్రామాలు దేనికమ్మా అంటూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నెటిజన్లు శనివారం ముక్తకంఠంతో ప్రశ్నించారు. పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడంలేదా అంటూ నిలదీశారు. పెద్ద వయస్సు అంటూ మీరు చేసిన నేరాన్ని తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని. ఆ వయసులో ప్రభుత్వం మీద పోస్టింగులు ఎలా పెట్టారని ప్రశ్నించారు. చరిత్రలో ఇంత గొప్పగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన ప్రభుత్వం మరొకటి ఉందా? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చే పథకాలేమిటి? అంత గొప్ప నాయకుడైతే ఎందుకు చిత్తుగా ఓడాడు? అంటూ నిలదీశారు. దేశ చరిత్రలోనే జగనన్న ప్రభుత్వం రికార్డు స్థాయిలో 28 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీకి రంగం సిద్ధంచేసింది. ఏ రకంగా చూసుకున్న సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులు ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అంటూ వివరించారు. -
కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్లో విషవాయువు లీకై ప్రాణనష్టం జరిగిన ఘటనకు సంబంధించి ఆయా కమిటీల నుంచి నివేదికలు రావాల్సి ఉందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఈ నివేదికలు అందిన వెంటనే కోర్టు ముందుంచుతామని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనను హైకోర్టు సుమోటో పిల్గా పరిగణించి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే పలు కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీల్లో ఏదో ఒక కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించినా అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే తమ డైరెక్టర్లు పాస్పోర్టులను అధికారులకు స్వాధీనం చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ఇరుపక్షాలను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. భూముల విక్రయంపై పిల్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు రాష్ట్రంలో ఖాళీ భూములను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించతలపెట్టిన భూముల్లో గతంలో ప్రైవేటు వ్యక్తులు ప్రజాప్రయోజనార్థం ఇచ్చిన భూములు కూడా ఉన్నాయని, అందువల్ల ఆ భూ విక్రయాలను అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తోట సురేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. -
ఆందోళనల 'పొగ'
మల్కాపురం (విశాఖ పశ్చిమ): మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నిప్పులు చెరుగుతున్న వేళ.. కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. ఉక్కుపోత, చెమటతో ఇళ్లలో ఉండలేక.. చాలామంది ఆరుబయటికొచ్చారు. సరిగ్గా అదే సమయంలో సమీపంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) రిఫైనరీ వద్ద గోధుమ వర్ణంలో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమేస్తున్న దృశ్యం చూసి మల్కాపురం, వెంకటాపురం తదితర చుట్టుపక్కల ప్రాంతాలవారు బెంబేలెత్తిపోయారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన ఇంకా కళ్లముందే మెదులుతుండగానే.. హెచ్పీసీల్ నుంచి రేగుతున్న ఈ పొగ స్థానికుల్లో ఆందోళనను రాజేసింది. మళ్లీ ఏ విపత్తు ముంచుకొస్తుందోన్న భయంతో ఇళ్లలో ఉన్నవారు సైతం రోడ్లపైకి వచ్చేసి దూరప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. ఇంకొందరు రిఫైనరీ గేటు వద్దకు చేరుకొని వాకబు చేయసాగారు. ఇంతలోనే ఐదు పది నిమిషాల వ్యవధిలోనే పొగలు ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలా పొగలు రావడం సాధారణమేనని.. అయితే ఈసారి కాస్త మోతాదు పెరిగిందని, దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని హెచ్పీసీఎల్ అధికారులు వివరించారు. ఎఫ్సీసీఎల్ యూనిట్–1 కంబర్షన్ సమయంలో పైప్లైన్లో నిలిచిన వ్యర్థాల కారణంగా పొగ ఎక్కువగా వచ్చిందని.. ఇందులో ఎటువంటి రసాయనాలు గానీ, విషవాయువులు గానీ లేవని భరోసా ఇచ్చారు. దాంతో కొంత శాంతించినప్పటికీ.. భవిష్యత్తులో పెనువిపత్తులు సంభవించకుండా తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న కలెక్టర్ వినయ్ చంద్ ములగాడ తహసీల్దార్ రమామణిని అప్రమత్తం చేశారు. వెంటనే హెచ్పీసీఎల్కు చేరుకున్న ఆమె సంస్థ ప్రతినిధులతో చర్చించి వివరాలు సేకరించారు. స్థానికులకు పరిస్థితిని వివరించి ఆందోళన విరమింపజేశారు. ఇది ప్రమాదమే కాదు యూనిట్లో కంబర్షన్లో స్వల్ప లోపం తలెత్తడం వల్లే ఒక్కసారిగా పొగ వ్యాపించింది. ప్లాంట్లో ఇది సర్వసాధారణమే తప్ప ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. స్థానికులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా పొగను అదుపులోకి తీసుకొచ్చాం. 35 నుంచి 40 డిగ్రీల మధ్యలో ట్యాంకు ఉష్ణోగ్రత ఉంటుంది. దాన్ని హయ్యర్ టెంపరేచర్ వద్ద మండించి వేపర్ చేసి రకరకాల చర్యలతో ఉత్పత్తులు తయారవుతాయి.– నారిశెట్టి రాజారావు, సీనియర్ జనరల్ మేనేజర్, హెచ్పీసీఎల్ ప్రాణాలు పోతాయని భయమేసింది పొగ చూడగానే ఏడుపు వచ్చింది. ప్రాణాలు పోతాయని భయమేసింది. వీధిలో ఉన్న అందరం బిగ్గరగా అరిచాం. ఇళ్ల నుంచి బయటికి వచ్చి అందరం రోడ్లపై నిలుచున్నాం. పొగ మొత్తం కమ్మేసింది. అయితే కొద్ది నిమిషాల్లోనే మాయమైపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం. – బి.స్వప్న, ప్రియదర్శిని కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం మధ్యాహ్నం కరెంట్ లేకపోవడంతో ఇంటి నుంచి బయటికి వచ్చాం. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ కనిపించడంతో భయపడ్డాం. ఎల్జీ పాలిమర్స్లోలా ప్రమాదం జరిగిందేమోనని ఉలిక్కిపడ్డాం. ఇళ్ల నుంచి వెళ్లిపోదామనుకునేలోగా పొగ మాయమైపోయింది. –చట్టి నూకరాజు యాదవ్, మల్కాపురం -
'ఇలాంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు'
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా వైరస్ నియంత్రణకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రోజున తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. వలస కూలీల అంశంలో సీఎం మానవతా దృక్పథంలో వ్యవహరించాలని సూచించారు. నడచి వెళ్తున్న కూలీలకు భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. కేంద్ర సూచనలను అమలు చేయడంలో కూడా ఏపీ ముందంజలో ఉంది. చదవండి: 'ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు' ప్రజల పట్ల ప్రభుత్వం ఎలా స్పందించాలన్నది విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో సీఎం జగన్ చూపించారు. నిర్లక్ష్యం వహిస్తే పరిశ్రమలు నిర్వహించేవారు భయపడేలా బాధితులకు భారీ పరిహారం ప్రకటించారు. 10 రోజుల్లో బాధిత కుటుంబాలు, గ్రామాలకు అన్ని సహాయక చర్యలు అందించారు. కరోనా సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు ఏకకాలంలో సీఎం జగన్ అమలు చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. ప్రభుత్వం మంచి చేస్తున్నా విమర్శలు చేయడమే టీడీపీ నేతల పని. టీడీపీ నేతల ఆలోచనలు రోజురోజుకు దిగజారుతున్నాయి. కరోనా వైరస్ కంటే అత్యంత డేంజరస్ వైరస్.. ఎల్లో వైరస్' అంటూ సజ్జల మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా బాబు చేసిందేంటి..? కరోనా కట్టడి అనేది సక్సెస్ లేదా ఫెయిల్యూర్ కాదు. కరోనా నియంత్రణకు ప్రయత్నం చేయాలి. ఎక్కువ కరోనా కేసులు వచ్చాయని భయపడకూడదు. తక్కువ కేసులు వచ్చాయని ఆనంద పడకూడదు. చంద్రబాబు ఆలోచనలు మాత్రం దుర్బుద్ధితోనే ఉన్నాయి. ఒక్కరోజైనా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చారా? మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు.. సాయంత్రానికి రూ.కోటితో ప్రాణాలు వస్తాయా? అని మాట మార్చారు. రూ.25 లక్షలతో ప్రాణాలు తిరిగి వస్తాయా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఓఎన్జీసీలో ప్రమాదం జరిగితే బాబు ప్రభుత్వంలో రూ.2 లక్షల పరిహారం ఇచ్చింది. ఇలాంటి క్యారెక్టర్ ఉండే నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. చదవండి: మంత్రులకు, ఎమ్మెల్యేలకు సజ్జల లేఖ కరోనా కాలంలో ఉద్యోగులు సహకరిస్తుంటే.. చంద్రబాబు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియదు. చంద్రబాబు అధికారంలో ఉండి రైతు రుణమాఫీని అమలు చేయలేక పోయారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మేనిఫెస్టోలోని అంశాలతో పాటు చెప్పనివి కూడా అమలు చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఏపీలో ఆర్థిక లోటు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. పేదలు ఆర్థికంగా నిలబడేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. సీఎం జగన్ మంచి పరిపాలన చూసి టీడీపీ ఓర్వలేక పోతోంది' అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు. -
హైదరాబాద్ రమ్మంటారా.. విజయవాడ వస్తారా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'చంద్రబాబు .. ఎల్జీ ప్లాంట్కు అనుమతులపై చర్చకు వస్తారా అని అడిగారు. మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?' అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో.. 'రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదు. వీళ్లు 20 లక్షల ఎక్స్ గ్రేషియా డిమాండ్ చేస్తే సీఎం గారు కోటి ఇస్తారు. వీళ్లకు ఆలోచన మెదిలే లోపే ఆయన అమలు చేస్తున్నారు. గొప్ప సలహా ఏదైనా ఇస్తే, పాటించకూడదని పట్టుదలకు పోయే స్వభావం కాదాయనది. కానీ వీళ్లకు ఆ స్థాయి ఏదీ?' అంటూ మండిపడ్డారు. అయితే అంతకు ముందు 'అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. విద్యుత్తు ఛార్జిల పెంపుకు నిరసనగా బషీర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్న చరిత్ర నీది. 20 ఏళ్లైనా ఎవరూ మర్చిపోలేదు' అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: 'ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ' -
మీ బిడ్డే ముఖ్యమంత్రి.. అన్యాయం జరగనివ్వను
మన పనితీరు పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని గర్వంగా చెప్పగలను. ఇలాంటి దుర్ఘటనల్లో ప్రభుత్వం ఏవిధంగా స్పందించాలనేది చూపించాం. ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ.. పది రోజుల్లో పరిహారాన్ని నేరుగా బాధితుల చేతుల్లో పెట్టడం గొప్ప కార్యక్రమం. ఇందుకు అధికారులకు అభినందనలు. మీ బిడ్డనే సీఎంగా ఉన్నారు. బాధితులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అన్ని రకాలుగా అండగా ఉంటుంది. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికతో పాటు, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, సందేహాలను కంపెనీకి ఇచ్చి.. వివరణ తీసుకుందాం. ఆ తర్వాత చర్యలకు ఉపక్రమిస్తాం. బాధ్యులైన వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ దుర్ఘటనలో మరణించిన 12 కుటుంబాల వారికి ఏదో ఒక విధంగా ఉద్యోగం ఇద్దాం. కనీసం గ్రామ సచివాలయాల్లో అయినా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఇందుకు అవసరమైతే నిబంధనలు మారుద్దాం. సాక్షి, అమరావతి: ‘మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వను’ అని విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గ్యాస్ లీక్ దుర్ఘటనకు బాధ్యులెవరైనా సరే వదిలి పెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కంపెనీలో మరోసారి అలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైతే కంపెనీని తరలిస్తామని, ఇప్పటికే 13 వేల టన్నుల స్టైరీన్ను కొరియాకు పంపించామని స్పష్టం చేశారు. గ్యాస్ ప్రభావిత ఐదు గ్రామాలు, ఎనిమిది కాలనీల్లో 19,893 మందికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని సోమవారం ఆయన కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ కలెక్టరేట్కు వచ్చిన బాధితులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఇది బాధాకరం.. అందుకే ఇంత పరిహారం ► ఎల్జీ పాలిమర్స్ సంఘటన దురదృష్టకరం. ఎక్కడైనా సరే ఇలాంటివి జరిగితే ప్రభుత్వం ఏవిధంగా స్పందించాలనేది అధికార యంత్రాంగం చేసి చూపించింది. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ ఘటనలో 22 మంది చనిపోయారు. ఆప్పుడు నేను ఆ గ్రామానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా చూశాను. ఆ ఘటనలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా ఓఎన్జీసీ రూ.20 లక్షలు, కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఇచ్చింది. మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున వచ్చింది. ► అలాంటి దుర్ఘటన జరిగినపుడు ప్రభుత్వం ఏవిధంగా స్పందించాలి? కంపెనీకి ఎలాంటి శిక్ష విధిస్తే ప్రమాదాలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటాయి? అని అలోచించాను. ► ఇలాంటి ఘటనలు విదేశాల్లో జరిగితే, ఎలా పరిహారం ఇస్తారో.. ఇక్కడా అలాగే ఇవ్వాలని కోరాను. పెనాల్టీ భారీగా, షాక్ కొట్టేలా ఉంటుందని ఆ కంపెనీకి భయం ఉంటే, అవి చాలా జాగ్రత్త తీసుకుంటాయని చెప్పి.. కోటి రూపాయలు చొప్పున ఇవ్వాలని నేను ఆ రోజే డిమాండ్ చేశాను. ► ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగినప్పుడు ఓఎన్జీసీ సంఘటన గుర్తుకొచ్చింది. అందుకే దేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చింది. సత్వరమే స్పందనకు అభినందనలు ► కంపెనీ నుంచి స్టైరీన్ గ్యాస్ లీకేజీ తెల్లవారుజామున చోటుచేసుకుంది. అ సమయంలో అధికార యంత్రాంగం చూపించిన సత్వర స్పందన దేశంలోనే గతంలో ఎక్కడా చూసి ఉండం. 4.30 గంటలకే అధికారులంతా సంఘటనా స్థలికి చేరుకున్నారు. ► 110 అంబులెన్స్లు వచ్చాయి. రెండు గంటల వ్యవధిలోనే ఊర్లలో అస్వస్థతకు గురైన వందలాది మందిని ఆసుపత్రుల్లో చేర్పించారు. కలెక్టర్, కమిషనర్, పోలీసులు, వైద్య సిబ్బంది, వైద్యులు.. ఇలా అధికార యంత్రాంగం అందరికీ అభినందనలు. పలు కమిటీలతో అధ్యయనం ► ఈ దుర్ఘటనపై పలు కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. సంఘటన జరిగిన వెంటనే పది మంది వైద్య నిపుణులతో కమిటీ వేశాం. బాధితులకు తగిన వైద్య పరీక్షలు, చికిత్స చేసేందుకు ఆదేశాలు ఇచ్చాం. ఇందుకు అవసరమైన ఉపకరణాలు సమకూర్చాం. ► ఇలాంటి దుర్ఘటనల్లో కంపెనీలపై ఏవైనా చర్యలు తీసుకోవాలంటే ముందు నిజమేమిటో తెలియాలి. అదేమిటో తెలుసుకోవడానికి, అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయడానికి ఏం చేయాలనే విషయమై పలు కమిటీలు వేశాం. ► ప్రమాదానికి కారణమైన స్టైరీన్ గ్యాస్.. కంపెనీలో ఉండకూడదనే ఉద్దేశంతో 13 వేల టన్నులను రెండు షిప్ల ద్వారా దక్షిణ కొరియాకు తిరిగి పంపించేశాం. అనుమతులన్నీ బాబు హయాంలోనే ► ఈ కంపెనీకి ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా మన ప్రభుత్వం ఇవ్వలేదు. 1996లో ఎల్జీ కెమికల్స్ సంస్థ పాలిమర్స్ కంపెనీని టేకోవర్ చేయడం నుంచి మొదలు 2015లో ఇచ్చిన కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్ సర్టిఫికెట్, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ వరకూ రెన్యువల్స్ కానీ, విస్తరణ ప్రాజెక్టు కానీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చినవే. ► ప్రమాదం జరిగిన తర్వాత ఇవన్నీ వారే చేశారని ఒక్క మాట కూడా అనకుండా సహాయ కార్యక్రమాల్లో మునిగిపోయాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు విశాఖలోనే ఉండి సహాయ, పునరావాస కార్యక్రమాలన్నీ పర్యవేక్షించారు. మానవతా దృక్పథంతో ఆదుకున్నాం ► బాధితులను ఆదుకునేందుకు ఎంతో మానవతా దృక్పథం ప్రదర్శించాం. చనిపోయిన 12 మంది కుటుంబాలకు పది రోజుల వ్యవధిలోనే దేశంలో మరెక్కడా లేనివిధంగా రూ.కోటి చొప్పున ఇచ్చాం. ► ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఎక్కడా స్ట్రెస్కు గురికాకూడదనే ఉద్దేశంతో పెద్దలు, పిల్లలనే భేదం లేకుండా 19,893 మందికి రూ.10 వేల చొప్పున ఇచ్చాం. ► ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్యం పొందినా సరే రూ.25 వేల చొప్పున, రెండు రోజులకు మించి ఆసుపత్రుల్లో వైద్యం పొందినవారికి రూ.లక్ష చొప్పున, వెంటిలేటర్పై ఉన్న వారికి రూ.10 లక్షలు సహాయంగా ఇచ్చాం. అధికారులు బాగా పని చేశారు ► ‘గుడ్ జాబ్ వినయ్ (విశాఖ కలెక్టర్).. మీరంతా చాలా బాగా పని చేశార’ని సీఎం అభినందించారు. ‘అ«ధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు చక్కగా పని చేశారు. గ్రామంలో పడుకుంటానని మంత్రి కన్నబాబు స్వయంగా ముందుకు వచ్చారు. ఇది ఎందరికో స్ఫూర్తి దాయకం. నా మంత్రివర్గంలో ఇంత మంచి వారున్నారని నిజంగా సంతోషపడ్డాను. అధికారులకు కృతజ్ఞతలు. అక్కడ ఉన్న వారందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అన్నారు. ► మంత్రి కె.కన్నబాబు స్పందిస్తూ.. ‘మీరు (సీఎం) చరిత్రలో నిలిచిపోతారు. మీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాము. మానవీయ కోణంలోనూ మీకెవ్వరూ సాటిరారు’ అన్నారు. ► ‘ఇంకా 12 ఇళ్లలోని వారి బ్యాంక్ ఖాతాల వివరాలు అందాల్సి ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్చంద్ తెలిపారు. ఆయా గ్రామాల్లో ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన 10 మంది వైద్య నిపుణులతో వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మంత్రులు, అధికారుల స్పందన బాగుంది గ్యాస్ లీకేజి ప్రమాదం జరిగినప్పటి నుంచి నేటి వరకు అధికారులు, మంత్రుల స్పందన బాగుంది. ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ మాలాంటి పేద ప్రజలకు ధైర్యం చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచన ప్రకారం మంత్రులు, అధికారులు సత్వర రీతిలో చర్యలు తీసుకుని మాలో భయాందోళన తగ్గిపోయేలా చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ధైర్యం పెంచారు. స్థానిక గ్రామాల్లోని ప్రజలు ఇప్పడు ఎంతో సంతోషంగా ఉన్నారు. – మామిడి రామకృష్ణ, నందమూరినగర్ కుటుంబ పెద్దలా ఆదుకున్నారు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో బాధితులందరికీ సీఎం జగన్ కుటుంబ పెద్దలా సాయపడ్డారు. తల్లికి కొడుకులా, ఇంటికి పెద్దలా ఆలోచించారు. ఎవరూ ఊహించని విధంగా ఆదుకున్నారు. పాలిమర్స్ కంపెనీ బాధిత కుటుంబాలకు పెద్ద దిక్కయ్యాడు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఎవరూ ఊహించలేనిది. చికిత్స పొందిన వారికి రూ.10 లక్షలు, రూ.లక్ష, రూ.25 వేలు ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వారందరికి తలో రూ.10 వేలు ఇచ్చారు. ఇది మాకెంతో మేలు చేస్తోంది. ఇప్పటికే అమ్మఒడి, ఫీజురీయింబర్స్మెంట్.. తదితర ఎన్నో పథకాల ద్వారా పేదలను ఆదుకుంటున్నారు. ఇంత చేస్తున్న నాయకుడికి అండదండగా నిలిచి రుణం తీర్చుకుంటాం. – యల్లపు చంద్రమణి, ఆర్ఆర్వీ పురం కొండంత భరోసాగా అనిపిస్తోంది కుటుంబాన్ని కోల్పోయి బాధల్లో ఉన్న నాకు మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. కొండంత భరోసాగా అనిపిస్తోంది. నా భర్త చనిపోవడంతో చాలా బాధపడ్డాను. కుటుంబ పెద్దను కోల్పోయి ఒంటరి అయ్యాను. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురాడానికి మేము 20 ఏళ్లు చాలా కష్టపడ్డాము. మాకు జరిగిన అన్యాయానికి ఊహించని విధంగా రూ.కోటి ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన నాకు రూ.లక్ష నా ఖాతాలో వేశారు. కుటుంబానికి అండగా నిలిచారు. నా పెద్ద కుమార్తె కొడుకు, నా మనవడు ఎంటెక్ పాసయ్యాడు. ఇతనికి ఉద్యోగం ఇప్పిస్తే నాకు తోడుగా ఉంటాడు. మీ పరిపాలన చాలా బాగుంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. – మేక సుశీల (మృతుడు మేక కృష్ణమూర్తి భార్య), వెంకటాపురం, వెంకటాద్రి గార్డెన్స్ మీరున్నారనే ధైర్యం వచ్చింది ఘటన జరిగిన వెంటనే మాకు ఏమీ అర్థం కాలేదు. అర గంట పాటు ఏం జరిగిందో కూడా తెలియదు. పరుగులు తీసి స్పృహ కోల్పోయి పడిపోయాం. తర్వాత అధికారులొచ్చి మమ్మల్ని ఆస్పత్రుల్లో చేర్చారు. మాలో కొండంత ధైర్యాన్ని నింపారు. మా కుటుంబాలకు అండగా నిలిచారు. మాకు బెహరా కాలేజీలో బస ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పినప్పటికీ.. ఆ తర్వాత మా పరిస్థితి ఏమిటన్న భయం మమ్మల్ని వెంటాడింది. అయితే ఊహించని విధంగా మీరు నష్ట పరిహారం ప్రకటించారు. మీరిచ్చిన భరోసా మాలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పటికే నాకు అమ్మ ఒడి పథకంలో రూ.15 వేలు వచ్చింది. నా భర్త ఆటోడ్రైవర్. అతనికి రూ.10 వేలు వచ్చాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మా కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.40 వేలు ఇచ్చారు. మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు. భవిష్యత్తులో ఏమి జరిగినా మీరున్నారన్న ధైర్యం వచ్చింది. మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలి. – పొట్నూరి పరమేశ్వరి ఎస్సీ, బీసీ కాలనీ రోడ్డున పడకుండా ఆదుకున్నారు ఆ రాత్రి గ్యాస్ లీక్ కాగానే పోలీసులు వచ్చారు. సైరన్ మోగించారు. మమ్మల్ని అప్రమత్తం చేశారు. ఆ వెంటనే అధికారులు వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ఆస్పత్రుల నుంచి శిబిరానికి తరలించి మంచి ఆహారం పెట్టారు. చిన్న పిల్లలకు కోడిగుడ్లు కూడా పెట్టారు. మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చి మా యోగ క్షేమాలు విచారించారు. మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. అక్కడి నీళ్లు తాగొద్దని, మంచినీరు సరఫరా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం ప్రకటించారు. గతంలో కొంత పరిహారం ప్రకటించినా, అది ఎప్పుడిస్తారో.. ఎవరిని కలవాలో కూడా తెలిసేది కాదు. కానీ మీరు ప్రకటించిన పరిహారాన్ని మా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు మంత్రులు, అధికారులు మా వద్దకు వచ్చి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. – గంగరాజు, పద్మనాభపురం కొంతమంది భయపెట్టారు.. గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగాక, మా లాంటి వారిని ఎవరు ఆదుకోరేమో అని భయపడ్డాము. కొంత మంది అయితే మళ్లీ మా గ్రామాలకు వెళ్లొద్దని చెప్పి భయభ్రాంతులకు గురిచేశారు. ఏం చేయాలో అర్థం కాక ఆందోళనకు గురయ్యాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసాతో మాలో ధైర్యం వచ్చింది. మంత్రులు, అధికారులను రాత్రుళ్లు గ్రామాల్లో బస చేయించడంతో మాలో మానసిక స్థైర్యం మరింత పెరిగింది. వారు మా గ్రామాల్లో బసచేసి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దీంతో మాకందరికీ ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. దీంతో స్థానికంగా కొంత మంది చెబుతున్న మాటలు వినడం మానేశాం. మేము ఊహించని విధంగా సాయం చేసిన సీఎంకు ధన్యవాదాలు. – మామిడి గౌరి, నందమూరి నగర్ -
గ్యాస్ లీకేజీ: బాధితుల అకౌంట్లలోకి రూ. 20 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ చాలా బాధాకరమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విశాఖపట్నంలో విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్కు తమ ప్రభుత్వ హయాంలో ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని... 13 వేల టన్నుల స్టైరీన్ను రెండు షిప్పుల ద్వారా వెనక్కి పంపినట్లు తెలిపారు. విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులతో సీఎం జగన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి నుంచి బటన్ నొక్కిన సీఎం వైఎస్ జగన్.... ఒకేసారి సుమారు 20 వేల మందికి గ్యాస్ లీకేజీ బాధితుల అకౌంట్లలో పది వేల రూపాయిల చొప్పున మొత్తం 20 కోట్లు జమ చేశారు. విశాఖ కలెక్టరేట్ నుంచి మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్ రాజ్, పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, జీవీఎంసి కమీషనర్ సృజన, జేసీ వేణుగోపాలరెడ్డి, అరుణ్ బాబు, విశాఖ పశ్చిమ ఇన్ ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, బాధితులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.(22న సీఎం చేతుల మీదుగా) 2 గంటల్లో గ్రామాలు ఖాళీ చేయించారు ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలో.. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చనిపోయారు. ఆ ప్రమాదంలో ప్రమాదంలో సంస్థ రూ. 20 లక్షలు,.. కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం 2 లక్షలు అందించాయి. ఘటన జరిగినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుంటామని.. కంపెనీలకు హెచ్చరిక ఉండేలా ప్రభుత్వాలు స్పందించాలి. ఓఎన్జీసీ ఘటనలో బాధితులకు రూ.కోటి ఆర్థికసాయం ఇవ్వాలని కోరాను. ఎల్జీ పాలిమర్స్ ఘటనలోనూ నాకు అదే గుర్తొచ్చింది. అందుకే ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వం వేగంగా స్పందించింది. కలెక్టర్, కమిషనర్తో పాటు 110 అంబులెన్స్లు కూడా ఘటనా స్థలికి చేరుకున్నాయి. 2 గంటల్లోనే గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. అధికారులు స్పందించిన తీరును అభినందనీయం ’’ అని ప్రశంసించారు. మానవతా దృక్పథంతో ముందుకు సాగాం.. ‘‘మనం అధికారంలోకి వచ్చాక ఎల్జీ పాలిమర్స్కు ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. ఆ సంస్థకు అనుమతి గాని, విస్తరణ గాని... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. అయినా ఎక్కడా మనం రాజకీయ ఆరోపణలు చేయలేదు. మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలని మాత్రమే ప్రయత్నించాం.10 రోజుల్లోపే పరిహారంతో పాటు వైద్య సేవలను పూర్తిగా అందించాం. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రజల ఆందోళన చెందకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. ప్రభావిత గ్రామాల్లోని ప్రతి వ్యక్తికి రూ.10 వేలు ఆర్థికసాయం. వెంటిలేటర్పై ఉన్నవారికి రూ.10 లక్షలు ఆర్థికసాయం రెండ్రోజులకు పైగా ఆస్పత్రుల్లో ఉన్నవారికి రూ.లక్ష... ప్రాథమిక చికిత్స చేయించుకున్నవారికి రూ.25 వేలు ఆర్థికసాయం అందించాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఫిర్యాదులు ఉంటే స్వీకరించండి ఎల్జీ పాలిమర్స్ ఘటనపై అధ్యయనానికి వేసిన కమిటీలు ఇచ్చే నివేదికల ద్వారా తప్పు ఎవరివల్ల జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కంపెనీకి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే ప్రభావిత ప్రాంతాల్లో.. ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్ను ఆదేశించారు. కాగా ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక శానిటేషన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. బాధితులకు ప్రత్యేక వైద్యసదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాబోయే నెలరోజుల పాటు గ్రామాల్లోనే.. వైద్యులను, అంబులెన్స్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అంతేగాక తాత్కాలికంగా విలేజ్ క్లినిక్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో వైద్య సేవలందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. -
పరిహారం సంపూర్ణం
సాక్షి, విశాఖపట్నం: ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులందరికీ న్యాయం చేస్తామన్న మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు, ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహారం అందచేయగా కంపెనీ పరిసరాల్లోని ఐదు ప్రభావిత గ్రామాలు, ఎనిమిది కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆ మేరకు సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.20 కోట్ల మేర పరిహారాన్ని జమ చేయనున్నారు. ► 12 మంది మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబీకుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని ఇప్పటికే జమ చేశారు. ► తీవ్ర అస్వస్థతతో కేజీహెచ్లో మూడు రోజులకు పైగా చికిత్స పొందిన 319 మందికి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్న 166 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేశారు. వెంటిలేటర్పై ఉన్న ఒకరికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించారు. ► అస్వస్థతతో సీహెచ్సీల్లో చికిత్స పొందిన 94 మందికి, కేజీహెచ్లో చికిత్స పొంది డిశ్చార్జి అయిన మరో ఐదుగురికి రూ.25 వేలు చొప్పున చెక్కులు అందజేశారు. ► స్టైరీన్ ప్రభావిత ఐదు గ్రామాలు, పరిసర ఎనిమిది కాలనీల్లో ప్రతి ఒక్కరికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామన్న సీఎం హామీ మేరకు అధికారులు తాజాగా ఎన్యూమరేషన్ పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో 6,297 ఇళ్లు ఉండగా 20,554 మంది నివాసం ఉంటున్నారు. వారికి పరిహారంగా ప్రభుత్వం రూ.20.55 కోట్లు (రూ.20,55,40,000) మంజూరు చేసింది. ► డోర్ లాక్ కారణంగా 163 ఇళ్లల్లో ఎన్యూమరేషన్ జరగలేదు. అవి మినహా 6,134 ఇళ్లలోని 20,013 మందికి సోమవారం రూ.20 కోట్లు (రూ.20,01,30,000) అందజేయనున్నారు. నేడు బ్యాంకు ఖాతాల్లో జమ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాలు, కాలనీల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి అర్హుల జాబితా వార్డు సచివాలయాల్లో ఉంచాం. ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్తోపాటు ఇంటి యజమాని లేదా కుటుంబ సభ్యుడి బ్యాంక్ ఖాతా వివరాలను వలంటీర్లు సేకరించారు. దీని ప్రకారం పరిహారం బ్యాంకు ఖాతాలో సోమవారం జమ కానుంది. – డాక్టరు జి.సృజన, కమిషనర్, జీవీఎంసీ మిగతా వారికీ అందజేస్తాం... కొంత మంది ఇప్పటివరకు తమ ఇంటికి తిరిగిరాలేదని ఎన్యూమరేషన్లో గుర్తించాం. డోర్ లాక్ చేసి ఉన్న 163 ఇళ్లల్లోని 541 మందికి కూడా పరిహారం మంజూరైంది. వారు తిరిగి వచ్చిన వెంటనే ఎన్యూమరేషన్ పూర్తిచేసి పరిహారాన్ని అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. – వి.వినయ్చంద్, కలెక్టర్, విశాఖ -
పాలిమర్స్ బాధితులకు నష్టపరిహారం
ఆరిలోవ(విశాఖ తూర్పు)/రాజాం/సంతకవిటి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన దుర్ఘటనలో అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన 147 మందికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం చెక్కులు అందజేశారు. ఆరిలోవ హెల్త్సిటీ అపోలో ఆస్పత్రిలో మంత్రి ఒకొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. విచారణ కమిటీ రిపోర్టును ఆధారంగా కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే చంద్రబాబు రాజకీయం చేస్తూ బాధితులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, డీఎం అండ్ హెచ్వో డాక్టర్ తిరుపతిరావు పాల్గొన్నారు. మెడికో కుటుంబానికి రూ.కోటి అందజేత ఈ ప్రమాదంలో మృతిచెందిన మెడికో విద్యార్థి అన్నెపు చంద్రమౌళి తల్లిదండ్రులు పద్మావతి, ఈశ్వరరావులకు కూడా శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని కావలి గ్రామంలో రూ.కోటి చెక్కును మంత్రి ధర్మాన కృష్ణదాస్ శనివారం రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ పాల్గొన్నారు. -
ఆ గ్రామస్తులకు ఏ కష్టం రాకూడదు
విశాఖపట్నం: ‘విష వాయువు ప్రభావిత గ్రామస్తులకు ఏ కష్టం రాకూడదు.. వారి సంక్షేమం, ఆరోగ్యం విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడండి’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్చంద్ను ఆదేశించారు. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితుల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్యాస్ ప్రభావానికి గురైన గ్రామాల్లో పరిస్థితులు, బాధితుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అలాగే జిల్లాలో స్టైరీన్ గ్యాస్ తరలింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీనిపై కలెక్టర్ వినయ్చంద్ మాట్లాడుతూ గ్యాస్ పీడిత బాధితులకు ఇప్పటికే పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించామని చెప్పారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు అందించడానికి గ్రామస్తుల ఎన్యుమరేషన్ ప్రస్తుతం జరుగుతోందని, ఇది శనివారం సాయంత్రానికి పూర్తవుతుందని తెలిపారు. ఆ జాబితాలను వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించి సోమవారం నాటికి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 18 నాటికి ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అదే రోజు ఉదయం వలంటీర్లు నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి లేఖలు అందించే ఏర్పాట్లు చేయాలని, అదే రోజు లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ చేయాలని స్పష్టం చేశారు. గ్యాస్ తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలి ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదానికి కారణమైన స్టైరీన్ గ్యాస్ను పూర్తిగా అక్కడ నుంచి తరలించాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ వినయ్చంద్ జిల్లాలో ఉన్న 13 వేల టన్నుల స్టైరీన్ను రెండు ఓడల ద్వారా దక్షిణ కొరియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 8 వేల టన్నుల స్టైరీన్ను ఒక ఓడలోకి పంప్ చేయించారు. తాజాగా సీఎం వీడియో కాన్ఫరెన్స్లో స్టైరీన్ తరలింపు విషయాన్ని మరోసారి ప్రస్తావించడంతో శనివారం ఉదయానికి మిగతా 5 వేల టన్నుల స్టైరీన్ గ్యాస్ను రెండో ఓడలోకి పంప్ చేసి జిల్లా నుంచి తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగాక అధికారులు స్పందించిన తీరు, బాధిత గ్రామాల్లో తీసుకున్న చర్యలు, సత్వర పరిహారం అందేలా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను సీఎం అభినందించారు. -
స్టైరిన్ పూర్తిగా తరలించాం: కరికాల వలవన్
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ను పూర్తిగా తరలించినట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్టైరిస్ గ్యాస్తో రెండో వెస్సెల్ వెళుతోందని, పరిశ్రమ చుట్టుపక్కల అయిదు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పరిశ్రమ చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆహారం, మంచి నీళ్ళు, పాలు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అలాగే విశాఖలో 20 కెమికల్ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించినట్లు కరికాల వలవన్ వెల్లడించారు. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టామన్నారు. ఇతర జిల్లాల్లో 35 పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టి, నివేదిక కూడా అందించారన్నారు. వాటికి సర్టిఫికెట్లు జారీ చేశాక మాత్రమే తిరిగి ప్రారంభించాలన్నారు. (బాధిత కుటుంబాలకు రూ. కోటి బాసట) కాగా ఎల్జీ పాలిమర్స్లో జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ చైర్మన్గా, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు అయింది. (అణువణువూ శోధన) అందుబాటులో హెల్ప్లైన్ నంబర్లు ఇక గ్యాస్ లీకేజీతో అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందిచడానికి, ఇతర సహాయక చర్యలు చేపట్టేందుకు ఎల్జీ పాలీమర్స్ యాజమాన్యం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. గ్యాస్ ప్రభావంతో అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చివవారికి అన్నవిధాలా సాయం అందించనున్నట్లు తెలిపింది. బాధితులకు, వారిక కుటుంబాలకు వైద్యం,నిత్యావసర సరకులు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పని చేస్తామని ప్రకటించింది. గ్రామస్తులు ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించేందుకు హెల్ప్లైన్ నంబర్లు 0891-2520884 0891-252338 వినతులు, వివాదులు, సమస్యలపై ఈమెయిల్ fpicrr@fchem.comకి పంపించవచ్చు. -
‘టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు’
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన పలువురికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బాధితులను పరామర్శించి ప్రభుత్వ పరిహారాన్ని చెక్కుల రూపంలో అందించారు. ప్రభుత్వం కేవలం ఆర్థిక సహాయం ప్రాతిపదికగా కాకుండా పూర్తిగా ఆరోగ్యం నిలకడగా మారేంతవరకు సహాయం అందిస్తుందని దీనికి ఎంత భారమైనా భరించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజయసాయిరెడ్డి ప్రజలను కోరారు. -
బాధితులంతా డిశ్చార్జ్
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో వెలువడిన స్టైరీన్ గ్యాస్ ప్రభావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరూ పూర్తిగా కోలుకున్నారు. బుధ, గురువారాల్లో మొత్తం 300 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందించి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ► కేజీహెచ్లో చేరిన 321 మందిలో 21 మందికి ఆరోగ్యం నయమవడంతో రెండు రోజుల క్రితమే వైద్యులు ఇంటికి పంపించారు. మిగిలిన 300 మందిలో 287 మందికి బుధవారం రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. ► బాధితులు గ్రామాలకు వెళ్లడానికి భయపడే అవకాశాలు ఉండడంతో అధికారులు గోపాలపట్నంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిశ్చార్జ్ అయిన వారిని ప్రత్యేక బస్సులలో అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ► బుధవారం రాత్రికి 180 మంది ఆ కేంద్రాలకు వెళితే.. మిగిలిన 107 మంది వారి సొంత వాహనాలలో ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన 13 మంది కూడా గురువారం రూ.లక్ష చెక్కు తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. అధికారులు వీరిని బస్సులో పునరావాస కేంద్రానికి తరలించారు. ► గ్రామాల్లో ప్రస్తుతం స్టైరీన్ అవశేషాలు పూర్తిగా తొలగిపోవడంతో పునరావాస కేంద్రాల్లో 42 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స అందిస్తాం ప్రమాదానికి గురైన మొత్తం బాధితులందరూ గురువారం నాటికి డిశ్చార్జ్ అయిపోయారు. ఎవరికైనా ఏ చిన్న పాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తారు. గతంలో డిశ్చార్జ్ అయిన వాళ్లు నేరుగా కేజీహెచ్కు వచ్చినా చికిత్స అందిస్తాం. – అర్జున, కేజీహెచ్ సూపరింటెండెంట్ -
టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు..
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని.. కానీ అసమర్థ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న గ్యాస్ లీకేజ్ బాధితులను గురువారం ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదీప్రాజ్, తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రూరల్ అధ్యక్షులు సరగడం చిన్నప్పల నాయుడు, వైఎస్సార్సీపీ నేతలు ఆదిరెడ్డి మురళీ ఉన్నారు. (‘భవిష్యత్తులో కూడా ఆదుకుంటాం’) టీడీపీ తప్పుడు ప్రచారం.. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఆయన కుమారుడు అప్పల నాయుడు చేస్తోన్న దుష్ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలో తండ్రీకొడుకులు నియోజకవర్గాన్ని దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారం దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గ్యాస్ లీకేజ్ ఘటనపై ఆరుగురు సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వకుండానే కంపెనీ తెరుస్తున్నారంటూ టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. (వలస కూలీలపై సీఎం జగన్ ఆవేదన) రూ.10 వేలు పరిహారం.. విష వాయువు ప్రభావిత 5 గ్రామాలు మాత్రమే కాకుండా సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను కూడా ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆయన వివరించారు. గ్యాస్ లీక్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితులంతా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు కూడా డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తామని.. ఒక పర్మినెంట్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.10వేల పరిహారాన్ని కూడా ప్రజలకు అందిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
‘భవిష్యత్తులో కూడా ఆదుకుంటాం’
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులను పరామర్శించి మానసిక ధైర్యం అందించారని పేర్కొన్నారు. ఐదుగురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు కూడా బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో భరోసా నింపారన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా బాధితులందరికీ తక్షణ పరిహారం అందించామని మంత్రి పేర్కొన్నారు. (మార్గదర్శకాలను పాటించాలి: కేంద్ర బృందం) స్టైరిన్ను కొరియా తరలించాం.. బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంప్లు నిర్వహించామని, వైఎస్సార్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి అవంతి వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ప్రమాదానికి కారణమైన స్టైరిన్ కూడా కొరియా కు తరలించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, బాధిత గ్రామ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. (‘ఆ దిశగా ఆలోచిస్తే బాగుండేది’) -
‘టీడీపీ జూమ్ పార్టీలా మారింది’
సాక్షి, విశాఖపట్నం : గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని శాఖలు సత్వరం స్పందించడంతో నష్టం తగ్గిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలతో బాధితులందరికి పరిహారం కూడా అందించామని చెప్పారు. ఆస్పత్రుల్లో బాధితులందరికీ వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రెండు రోజులుగా బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి ఉందన్నారు. ఎరవరికీ సమస్యలు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగిలిన వారికి కూడా పరిహారం అందిస్తామన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతుంటే.. ఒక్క టీడీపీ నేత కూడా సహాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. టీడీపీ ఇప్పుడు జూమ్ పార్టీలా మారిందన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో జూమ్ ద్వారా మెసేజ్లు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ నియమించామని, నివేదిక వచ్చిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని బొత్స వ్యాఖ్యానించారు. -
దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్యాకేజీ
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దమ్మున్న సీఎం అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారం రాత్రి విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్పై ఉన్న వారికి రూ.10 లక్షలు, రెండు రోజులకు మించి ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.లక్ష చొప్పున.. ఊహించనంత పరిహారం అందజేయడం, ఎల్జీ పాలిమర్స్లో ఉన్న 13 వేల టన్నుల స్టైరీన్ గ్యాస్ను దక్షిణ కొరియాకు వెనువెంటనే తరలించడం వంటి చర్యలు ఆయన దమ్మున్న సీఎం అనే విషయాన్ని మరోసారి రుజువు చేశాయన్నారు. ఇంకా ఏం చెప్పారంటే.. ► గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశంలో మరే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దేశ చరిత్రలో ఇదే అతి పెద్ద ప్యాకేజీ. ► మృతుల్లో 8 కుటుంబాల వారికి రూ.కోటి చొప్పున చెల్లించాం. నలుగురి కుటుంబ వారసులకు గురువారం అందజేస్తాం. ► కేజీహెచ్లో రెండు రోజులకు పైగా చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ మేరకు రూ.లక్ష చెల్లిస్తున్నాం. ప్రమాదం జరిగిన ఐదు రోజుల్లోగానే పరిహారం చెల్లించిన ఘనత జగన్కే చెల్లింది. ► బాబు హయాంలో నగరంలో జరిగిన గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటన, పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ సరదా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి ఎంత పరిహారమిచ్చారో ఆయన గుర్తు చేసుకోవాలి. ► ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో బాబు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ► ఎల్జీ పాలిమర్స్ కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్కు బాబే అనుమతులిచ్చారు. 2015లో 128 ఎకరాల అప్పన్న భూములను చంద్రబాబే ధారాదత్తం చేశారు. దీనిపై చర్చకు వస్తారా? బాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు పోతిరెడ్డిపాడుపై ఈనెల 5నే జీవో విడుదల చేసినా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇప్పటివరకు తన అభిప్రాయాన్ని ఎందుకు చెప్పలేదని ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేని ప్రతిపక్ష నేత ఒక నేతా అని నిలదీశారు. ► విశాఖకు వ్యతిరేకంగా ఆయన ఎంతకైనా తెగిస్తారు. అందులోభాగంగానే ఎల్లో మీడియాలో కుట్రపూరిత రాతలు రాయిస్తున్నారు. అమరావతిపై ప్రేమతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. ► విలేకరుల సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మృతుని భార్యకు రూ.కోటి చెక్కు స్టైరీన్ లీకైన ఘటనలో మృతి చెందిన ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత మేనేజర్ గంగాధర చౌదరి భార్య ఎస్.లక్ష్మికి రూ.కోటి చెక్కును ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం అందజేశారు. మృతుని భార్య లక్ష్మి మాట్లాడుతూ ఇంత త్వరగా పరిహారం అందిస్తారని ఊహించలేదని అన్నారు. -
అందరి ఆర్యోగానికి భరోసా
సాక్షి, విశాఖపట్నం: ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన, షెల్టర్ల నుంచి ఇళ్లకు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వి.వినయ్చంద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హుటాహుటిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నెల రోజులపాటు నిర్వహించనున్నారు. గ్రామాల్లో అంబులెన్స్లు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెనువెంటనే ఆస్పత్రులకు తరలిస్తారు. 20 పడకలతో వైఎస్సార్ క్లినిక్ ► వెంకటాపురం గ్రామంలో 20 పడకల సామర్థ్యంతో వైఎస్సార్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని గ్రామాలకు అందుబాటులో ఉండేలా.. శాశ్వత భవన నిర్మాణం జరిగే వరకూ తాత్కాలికంగా ఉన్నత పాఠశాల వద్ద దీనిని నిర్వహిస్తారు. ప్రాథమిక వైద్య చికిత్స నిర్వహించేందుకు వైద్యులు, స్టాఫ్ నర్సులను, ఇతరత్రా నర్సింగ్ సిబ్బందిని నియమిస్తున్నారు. ► గోపాలపట్నం సీహెచ్సీ, పెందుర్తి ప్రభుత్వాస్పత్రి రిఫరల్ ఆస్పత్రులుగా ఉంటాయి. అక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు వెంటలేర్లు అందుబాటులో ఉంచారు. ► ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అధ్యక్షతన 10 మంది నిపుణులైన వైద్యులతో కమిటీ నియమించారు. స్టైరీన్ ప్రభావం వల్ల బాధితుల్లో ఎవరికైనా కళ్లు, ఊపిరితిత్తులు, శ్వాస, చర్మం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయోమే పరీక్షించేందుకు గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, పల్మనాలజిస్టు, ఆప్తమాలజిస్టు, డెర్మటాలజిస్టులతో పాటు పీడియాట్రిక్స్, కమ్యూనిటీ మెడిసిన్ వైద్య నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ► మానసిక సమస్యలు తలెత్తితే వైద్యమందించేందుకు సైకియాట్రిస్ట్ కమిటీలో ఉన్నారు. ప్రభావిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఈ కమిటీ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకయ్యే ఖర్చులను వైఎస్సార్ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వమే భరిస్తుంది. ► గ్యాస్ ప్రభావిత ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలతో డేటా (బేస్లైన్ రిపోర్ట్) సేకరిస్తారు. దీని ఆధారంగా వైఎస్సార్ హెల్త్ మానిటరింగ్ కార్డు జారీ చేస్తారు. ► ఈ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి వైద్యానికి ఆంధ్రా మెడికల్ కాలేజీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ► రానున్న వారంలో రెండుసార్లు, తర్వాత నెలలో 15 రోజులకు ఒకసారి, ఆ తర్వాత నుంచి నెలకొకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వివరాలతో ఏఎంసీ వద్ద డేటాను అప్డేట్ చేస్తారు. ► అన్ని వయసుల వారికి హిమోగ్లోబిన్, లివర్, కిడ్నీల పనితీరు పరీక్షలతో పాటు ఎక్స్రేలు తీస్తారు. ► గర్భిణులకు స్కానింగ్ చేసి తరచూ పరీక్షలు చేస్తారు. బిడ్డ పుట్టాక ఏడాదిపాటు ఎదుగుదలను పర్యవేక్షిస్తారు.. ఏడాది తర్వాత కూడా ఏమైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే జీవితాంతం వైద్యం అందిస్తారు. 15 వేల హెల్త్ కార్డులు గ్యాస్ లీకేజీ బాధితులతో పాటు వెంకటాపురం, నందమూరి నగర్, కంపర పాలెం, ఎస్సీ, బీసీ కాలనీ, పద్మనాభ నగర్ గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో వీటిని తయారు చేయించే పనిని అధికారులు శరవేగంగా చేపట్టారు. ఒకట్రెండు రోజుల్లోనే ముద్రణ పూర్తి చేసి ఆ గ్రామాల ప్రజలకు అందజేస్తారు. బాధితులకు గులాబీ కార్డులు, గ్రామ ప్రజలకు తెల్ల కార్డులు జారీ చేస్తారు. రూ.లక్ష చొప్పున పరిహారం అందజేత కేజీహెచ్ నుంచి 287 మంది డిశ్చార్జ్ 282 మందికి చెక్కుల పంపిణీ ఎల్జీ ఘటన బాధితురాలికి బుధవారం లక్ష రూపాయల చెక్కుఅందిస్తున్న మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు స్టైరీన్ ప్రభావానికి గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో పూర్తిగా కోలుకున్న 287 మందిని బుధవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. వారిలో 282 మందికి రూ.లక్ష చొప్పున పరిహారాన్ని మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు పంపిణీ చేశారు. అనంతరం వారిని ప్రత్యేక బస్సుల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.కోటి, వెంటిలేటర్పై ఉన్న వారికి రూ.10 లక్షలు, మూడు రోజులు దాటి చికిత్స పొందే వారికి రూ.లక్ష, స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ.25 వేలు, ఐదు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించిన విషయం విదితమే. ప్రమాదానికి గురైన తమకు మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు రూ.లక్ష పరిహారం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. కేజీహెచ్లో ఇంకా 13 మందికి వైద్యం అందిస్తున్నారు. -
వక్రీకరణ అలా.. వాస్తవం ఇలా
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా స్టైరీన్ వాసన వస్తోందా.. ఇళ్లలో ఊపిరి (గాలి) అందడం లేదా.. ఉండలేకపోతున్నారా.. పెద్ద సంఖ్యలో జనం ఇంకా ఆసుపత్రులకు వస్తున్నారా.. సమీపంలోని మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్లోని నీటిపై గ్యాస్ పేరుకుపోయిందా.. ఓ వర్గం మీడియాలో వస్తున్న కథనాలన్నీ వాస్తవమేనా? నిజంగానే అక్కడ ఇంకా అంత ప్రమాదకర పరిస్థితి ఉందా? స్టైరీన్ గ్యాస్ ఇంకా తన ప్రతాపం చూపుతోందా? ఇంతకూ ఏది వక్రీకరణ.. ఏది వాస్తవమో తెలుసుకుందాం. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం వలంటీర్పై స్టైరీన్ ప్రభావమా? వక్రీకరణ : ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి ఆనుకుని ఉన్న వెంకటాపురం గ్రామంలో విషవాయువు ప్రభావం ఇంకా ఉందని, కొందరికి ఊపిరి అందడం లేదని.. ఈ క్రమంలో వార్డు వలంటీర్ నూకరత్నం స్పృహ తప్పి పడిపోయిందని ఓ వర్గం మీడియాలో పేర్కొన్నారు. వాస్తవం: వెంకటాపురం నడి బొడ్డున ఉన్న సచివాలయంలో వార్డు వలంటీర్ నూకరత్నం.. ప్రమాదం జరిగాక శనివారం మొదలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 దాటే వరకు నిరంతరాయంగా విధులు నిర్వర్తించింది. మంగళవారం ఉదయం కూడా ఎన్యూమరేషన్లో భాగంగా తనకు కేటాయించిన 50 ఇళ్లకు వెళ్లి వచ్చారు. 11 గంటల సమయంలో గ్రామ సచివాలయానికి మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ రావడంతో సచివాలయ గది జనంతో కిక్కిరిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె డీ హైడ్రేషన్తో బీపీ పెరిగి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న జీవీఎంసీ ఏఎంహెచ్వో లక్ష్మీ తులసి ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత గోపాలపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సాయంత్రం 4 గంటల వరకు చికిత్స తీసుకుని తర్వాత ఇంటికి వెళ్లిపోయింది. ఇబ్బంది ఉంటే మేమెలా పని చేయగలం? ప్రతి రోజూ వెంకటాపురం ఊరు మధ్యలో ఉన్న వార్డు సచివాలయంలోనే పని చేస్తున్నాం. రమాదేవి, ఆశాజ్యోతి, సత్య తులసితో పాటు సచివాలయ ఇన్చార్జ్ బాధ్యుడిగా నాతో సహా అందరం అక్కడే పని చేస్తున్నాం. ఘటన తర్వాత ఇక్కడికొచ్చినప్పుడు మొదట్లో కాస్త వాసన వచ్చింది. తర్వాత ఎలాంటి వాసన రావడం లేదు. నిజంగా ఇబ్బందికర పరిస్థితులుంటే మేమెలా పనిచేయగలం? – నాయుడు, వెంకటాపురం వార్డు సచివాలయం ఇన్చార్జ్ ఊపిరి అందనంతటి విషమ పరిస్థితి ఉందా ? వక్రీకరణ : ఆ గ్రామాల్లోని ఇళ్లలో ప్రజలకు ఊపిరి ఆడటం లేదు. జనం పెద్ద సంఖ్యలో గోపాలపట్నం ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు. (ఓ దినపత్రికలో వార్త) వాస్తవం: ‘నిజానికి ఊపిరి అందని విషమ పరిస్థితి ఎవరికీ లేదు. చిన్న చిన్న సమస్యలతో వచ్చి చికిత్స (ఇంజక్షన్) చేయించుకుని మందులు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇంత వరకు ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్ కాలేదు. అంతా ఓపీ (అవుట్ పేషెంట్) విభాగానికి వచ్చి వెళ్లిపోతున్నారు’ అని గోపాలపట్నం ఆసుపత్రి ఇన్చార్జ్ డాక్టర్ శాంతిప్రభ స్పష్టం చేశారు. ’ఊపిరి అందడం లేదు..’ అని రాయడం సరికాదు.. నేను ఓ డాక్టర్గా చెబుతున్నాను.. అలా ఎలా రాస్తారో నాకు అర్థం కావడం లేదు. గ్యాస్ లీకైన నాలుగైదు రోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఇళ్ల తలుపులు ఒక్కసారిగా తెరిస్తే.. అప్పటి వరకు మూసుకుపోయిన గదుల్లోని గ్యాస్ కాస్త బయటకు వస్తుంది. ఆ ప్రభావంతో కొందరు కొద్ది క్షణాలు ఇబ్బంది పడి ఉండొచ్చు. అలాంటి వారు మా వద్దకు వస్తే ప్రాథమిక చికిత్స చేసి పంపించేస్తున్నాం. అంతే కానీ ఊపిరి అందని పరిస్థితి ఎవ్వరికీ లేదు. నిజానికి నాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ ఓ మాట చెబుతాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచితనాన్ని కొందరు అలుసుగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా ఇంత చేసినా ఇంకా రాజకీయాలు చేస్తున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. స్టైరీన్ లేదని ప్రతీ రిపోర్టులో వచ్చింది ఘటన జరిగినప్పటి నుంచి ప్రతి రోజూ నీటి శాంపిళ్లు ల్యాబొరేటరీకి పంపించాం. 7, 8 తేదీల్లో తీసిన శాంపిళ్ల రిపోర్టుల్లో స్టైరీన్ లేదని వచ్చింది. ఇప్పటికీ నీటిని పరీక్షలకు పంపిస్తున్నాం. నిజంగా స్టైరీన్ నీటిలో కలిసిపోతే.. అందులోని చేపలు, ఇతర జీవులన్నీ ఇప్పటికే చనిపోవాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రతి రిపోర్టులోనూ స్టైరీన్ మోతాదు లేనట్లు నివేదిక వచ్చినా, నీటిని ఒకటికి రెండు సార్లు శుద్ధి చేశాకే సరఫరా చేస్తాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ మేఘాద్రిగెడ్డపై ‘విష’ ప్రచారం వక్రీకరణ: ఘటన జరిగిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాద్రిగెడ్డలో విషవాయువు స్టైరీన్ కారణంగా నీటిపై పచ్చని రంగు తెట్టు ఏర్పడిందంటూ ఓ పత్రికలో ఫొటో ఐటం వచ్చింది. వాస్తవం: నీటిపై రంగు తెట్టు కాదు.. నాచు ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఎల్జీ పాలిమర్స్కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ నుంచి నగరంలోని 45, 46, 47, 48, 49వ వార్డుల్లోని 6,590 ఇళ్లకు నీటిని సరఫరా చేస్తుంటారు. అదేవిధంగా ఆర్మీకి చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్), తూర్పు నౌకాదళానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ప్రాజెక్టŠస్(డీజీఎన్పీ)కు బల్క్ నీటి కనెక్షన్ అందిస్తున్నారు. మొత్తంగా మేఘాద్రిగెడ్డ నుంచి 8 మిలియన్ గ్యాలన్ల నీటిని ప్రతి రోజూ సరఫరా చేస్తుంటారు. ► ఈ నెల 7వ తేదీన దుర్ఘటన జరిగిన వెంటనే నీటి సరఫరా నిలిపేశారు. ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు అందించేలా జీవీఎంసీ నీటి సరఫరా విభాగం చర్యలు తీసుకుంది. ► మేఘాద్రిగెడ్డలోని నీరు విషతుల్యం అయ్యిందా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు జీవీఎంసీ చర్యలు ప్రారంభించింది. విశాఖలోని రీజనల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ప్రతినిధులు ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆ నీటి శాంపిళ్లను పరీక్షల కోసం తీసుకెళ్లారు. ► 7, 8వ తేదీల్లో తీసుకున్న శాంపిళ్లలో స్టైరీన్ మోనోమర్ అవశేషాలు లేవని స్పష్టం చేశారు. నీటిలో ఉన్న లవణాలు, ఇతర వాల్యూస్ అన్నీ.. వినియోగించేందుకు సురక్షితంగా ఉన్నాయని రిపోర్టులో స్పష్టం చేశారు. స్టైరీన్ కలిసి ఉంటే జలచరాలు చనిపోలేదే! రీజనల్ లేబొరేటరీ ఇచ్చిన తొలి రోజు రిపోర్టు, ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే.. నీటిలో ఎలాంటి విషవాయువు అవశేషాలు కలవలేదని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ నీరు కలుషితమై ఉంటే అందులో ఉండే జలచరాలు మృత్యువాత పడేవి. కానీ అది జరగలేదు. స్టైరీన్ బరువైన వాయువు కాబట్టి నీటి ఉపరితలంపై పొరలా ఏర్పడిందనుకుంటే నీటిలోని ఆక్సిజన్ తగ్గి ఉండాలి. ఫలితంగా జలచరాలు మృత్యువాత పడి ఉండాలి. కానీ అదేమీ జరగలేదు. నిల్వ ఉండే నీటిలో నాచు ఉండదా? మేఘాద్రిగెడ్డ నీటిని 7వ తేదీ నుంచి వాడటం లేదు. గేటు సమీపంలో ఎప్పటికప్పుడు నాచు ఏర్పడుతుంటుంది. దాన్ని 10 రోజులకోసారి శుభ్రం చేస్తుంటాం. ఘటన జరిగిన తర్వాత.. ఆ నీటిని పూర్తిగా వినియోగించడం లేదు. నిల్వ ఉండే నీటిలో నాచు ఏర్పడటం సహజం. దానిని చూసి.. రంగు పొరలు ఏర్పడ్డాయనడం సరికాదు. భయపడాల్సిన అవసరం లేదు. – వేణుగోపాల్, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్ఈ నాచు ఎందుకు ఏర్పడిందంటే.. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 61 అడుగులు కాగా, ప్రమాదం సంభవించే సమయానికి 57.5 అడుగుల నీటి మట్టం ఉంది. 9వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి మరో అడుగు నీరు రిజర్వాయర్లో చేరి ప్రస్తుతం 58.6 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి గెడ్డల్లో నీరు రిజర్వాయర్లో చేరినప్పుడు గెడ్డల నుంచి వచ్చే నాచు ఇక్కడ పొరలుగా ఏర్పడిందే తప్ప.. విషవాయువు ప్రభావం వల్ల కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఊపిరి అందనిది ఎల్లో బ్యాచ్కే : బొత్స చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓ దుర్ఘటన జరిగిన వెంటనే బాధితులకు పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లింపుతో పాటు శరవేగంగా పునరావాసం, నష్ట నివారణ చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. అయితే జనానికి మంచి చేస్తే చూడలేని విషపు మీడియా ఇష్టారాజ్యంగా కథనాలు వండి వారుస్తోంది. అందులో భాగంగానే ‘ఈనాడు’లో అసత్య వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. వెంకటాపురం గ్రామానికి చెందిన కొద్ది మంది ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే.. గ్రామాల్లో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వార్తలు రాయడం అమానుషం. ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా.. అధికారులకు మార్గదర్శకం చేసే విధంగా వార్తలు ఉండాలి కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా విషం చిమ్మడం సరికాదు. బాబు జమానాలో అరకొర పరిహారం అందులోనూ జాప్యం.. హుద్హుద్ తుపాన్, విశాఖ తుపాన్ విరుచుకుపడిన తేదీ: 2014 అక్టోబర్ 13 మృతులు: 46 మంది ప్రకటించిన ఎక్స్గ్రేషియా: రూ.5 లక్షలు ఇచ్చిన తేదీ: 2015 జనవరి 20 (వంద రోజుల తర్వాత ఇచ్చారు) గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, రాజమండ్రి ఘటన జరిగిన తేదీ: 2015 జూలై 14 మృతులు: 29 మంది ప్రకటించిన ఎక్స్గ్రేషియా: రూ.10 లక్షలు ఇచ్చిన తేదీ: క్షతగాత్రులకు 4 నెలల తర్వాత అరకొరగా చెల్లింపు కృష్ణా నదిలో బోటు మునక, విజయవాడ ఘటన జరిగిన తేదీ: 2017 నవంబర్ 12 మృతులు: 21 మంది ప్రకటించిన ఎక్స్గ్రేషియా : రూ.10 లక్షలు ఇచ్చిన తేదీ : 2017 నవంబర్ 30 తిత్లీ తుపాన్, ఉత్తరాంధ్ర తుపాన్ విరుచుకుపడిన తేదీ: 2018 అక్టోబర్ 11 మృతులు: 8 మంది ప్రకటించిన ఎక్స్గ్రేషియా : రూ.5 లక్షలు ఇచ్చిన తేదీ : 2018 నవంబర్ 6 గోదావరిలో బోటు మునక, వాడపల్లి–మంటూరు, తూర్పుగోదావరి జిల్లా ఘటన జరిగిన తేదీ: 2018 మే 17 మృతులు : 22 మంది ప్రకటించిన ఎక్స్గ్రేషియా : రూ.10 లక్షలు ఇచ్చిన తేదీ : 2018 మే 28 స్కూల్ ఆటో బోల్తా, ఫిరంగిపురం, గుంటూరు జిల్లా ఘటన జరిగిన తేదీ: 2017 డిసెంబర్ 28 మృతులు : ఐదుగురు విద్యార్థులు,ఆటో డ్రైవర్ ప్రకటించిన ఎక్స్గ్రేషియా : రూ.5 లక్షలు ఇచ్చిన తేదీ : 2018 మార్చి 31 అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరేచర్లలో జరిగిన పాదయాత్రలో దీనిపై అప్పటి సీఎం చంద్రబాబును నిలదీశారు. దీంతో కొద్ది నెలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియాలో మూడు లక్షలు కోత పెట్టి రూ.2 లక్షలు చెల్లించింది. గ్యాస్ పైప్లైన్ పేలుడు, నగరం, తూ.గో. జిల్లా మృతులు: 22 మంది ఘటన జరిగిన తేదీ : 2014 జూన్ 27 ప్రకటించిన ఎక్స్గ్రేషియా : రూ.3 లక్షలు ఇచ్చిన తేదీ: 2014 జూన్ 30 (గెయిల్, కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల్లోనే ఎక్స్గ్రేషియా చెల్లించటంతో రాష్ట్ర వాటా పరిహారం అదే రోజు ఆ మొత్తంతో కలిపి ఇచ్చారు.) ఇప్పుడు విశాఖ ఘటనలో.. రూ. కోటి పరిహారం 5 రోజుల్లో చెల్లింపు -
విశాఖకు ఎల్జీ ఉన్నత స్థాయి బృందం రాక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరిపేందుకు దక్షిణ కొరియా నుంచి యాజమాన్యం తరఫున 8మందితో కూడిన ఉన్నతస్థాయి బృందం బుధవారం విశాఖ చేరుకుంది. వీరంతా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక విమానంలో ఉదయం 11.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ వారికి కోవిడ్-19 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆ బృందం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్కు చేరుకుంది. (ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ తరలింపు) ఎల్జీ కెమికల్స్ ప్రెసిడెంట్ నోహ్ కుగ్ లే ఆధ్వర్యంలో ఎనిమిది మంది ప్రతినిధుల బృందం కంపెనీని సందర్శించింది. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపింది. బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాతే వారికి ఎలాంటి సహయ సహకారం అందిస్తారనే విషయాలను స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వనుంది. స్థానిక అధికార యంత్రాంగం ద్వారా నష్టపోయిన కుటుంబాలకు సహాయం చేస్తామని ఎల్జీ యాజమాన్యం ప్రకటించింది. (విశాఖలో సాధారణ పరిస్థితులు) -
ఊహించని విధంగా ఎల్జీ పాలిమర్స్పై చర్యలు
సాక్షి, విశాఖపట్నం: ఎవరూ ఊహించని విధంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై చర్యలు ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కంపెనీలో భద్రతాపరంగా చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం వైఫల్యమే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో శాశ్వత వైఎస్సార్ క్లినిక్లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కుట్రలను నమ్మవద్దని కోరారు. ప్రభావిత గ్రామాల్లో అయిదుగురు మంత్రులు, ఎంపీలు బస చేసినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు యథాస్థితికి వచ్చేవరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. స్వార్థపూరిత రాజకీయాలకు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీయొద్దని హితవు పలికారు. చంద్రబాబు అబద్దాల ప్రచారం మానుకోవాలని సూచించారు. తప్పుడు కథనాలతో తప్పుదోవ పట్టించొద్దు: కన్నబాబు మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలోనైనా ఈనాడు విలువలు పాటించాలన్నారు. బాబును సంతోష పరిచే ఎజెండాలో భాగంగా ఈనాడు తప్పుడు కథనాలు ఇస్తుందని ధ్వజమెత్తారు. భయానక వాతావరణం ఉందని చిత్రీకరించి తప్పుడు వార్తలతో ప్రజలని తప్పుదోవ పట్టించద్దని కోరారు. చంద్రబాబు హయాంలో విశాఖపై సవతి ప్రేమ చూపించారు.. కానీ ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. అమరావతి కోసం విశాఖను నిలువెల్లా మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు విద్యుత్ బిల్లులు పెంచారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజ్పై ఇకనైనా రాజకీయం మానేయండని సూచించారు. ఈ ఘటనలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులంతా కోలుకున్నారని తెలిపారు.స్టైరిన్ తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఒక టన్ను స్టైరిన్ కూడా ఉండడానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. -
ఈ కమిటీలన్నీ చంద్రబాబు చెబితే వేశారా?
సాక్షి, విశాఖపట్నం : విశాఖ గ్యాస్ లీక్ ఘటన బాధితులలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులంతా కోలుకున్నారని చెప్పారు. డిశ్చార్జ్ అవుతున్న అందరికీ రూ. లక్ష ఆర్థిక సాయం అందించామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనంత ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ ఇస్తే.. చంద్రబాబు నాయుడు హోమ్ క్వారంటైన్లో ఉండి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి : విశాఖ గ్యాస్ లీకేజీ: ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు) ‘ గ్యాస్ లీక్ ఘటన జరిగిన గంటల్లోనే సీఎం జగన్ బాధితులను పరామర్శించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ అందించనంత రూ.కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. బాధితుల్లో భరోసా నింపేందుకు గ్రామాల్లో మంత్రుల కమిటీ బస చేసింది. స్టెరిన్ తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఒక్క టన్ను స్టెరిన్ కూడా ఉండడానికి వీల్లేదని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. ఇంట్లో కూర్చొని చంద్రబాబు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా నగరం ప్రమాదంలో 21 మంది చనిపోయారు. రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ వల్ల 29 మంది చనిపోయారు. అప్పుడు వారికి చంద్రబాబు ఎలాంటి సహాయం అందించారు.. ఇప్పుడు సీఎం జగన్ ఎలాంటి సహాయం అందించారో చర్చకు సిద్ధమా’ అని టీడీపీ నేతలకు మంత్రి కన్నబాబు సవాల్ విసిరారు. టీడీపీకి సంబంధించిన ఏ నిపుణడు వచ్చినా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే చంద్రబాబు ఈ రోజు టీడీపీ సమావేశంలో డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. ఘటన జరిగిన వెంటనే 6 కమిటీలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించాం.. ఈ కమిటీలు అన్ని చంద్రబాబు చెబితేనే వేశామా అని ప్రశ్నించారు. సింహాచల భూములను డీనోటిఫై చేసి ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి అప్పగించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. మంతనాలు, లాలూచీ పడే అలవాటు చంద్రబాబుకు మాత్రమే ఉందని కన్నబాబు విమర్శించారు. -
కుట్రలు చేయడమే చంద్రబాబు పని
సాక్షి, విశాఖపట్నం : ప్రతీ విషయాన్ని రాజకీయకోణంలో చూసి కుట్రలు చేయడమే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పని అని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించి బాధితులని ఆదుకునే ప్రయత్నం చేసిందో గమనించుకోవాలన్నారు. బుధవారం గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బాధిత గ్రామాలలో ప్రస్తుతం సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి. నిన్నటి నుంచి బాధిత గ్రామాలలో 24 గంటలపాటు పనిచేసేలా వైద్య బృందాలను ఏర్పాటు చేశాం. ఆయా గ్రామాల ప్రజలకోసం 15 పడకలతో వైఎస్సార్ క్లీనిక్ ప్రారంభిస్తున్నాం. సంఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు ప్రజల భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఎల్జీ పాలిమర్స్లో ఉన్న స్టైరిన్ని వెనక్కి పంపిస్తున్నాం. ఇప్పటికే ఫ్యాక్టరీలోఉన్న స్టైరిన్ని ట్యాంక్ల ద్వారా పోర్టుకి తరలించాం. ( విశాఖ గ్యాస్ లీకేజీ: ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు ) పోర్టు నుంచి దక్షిణ కొరియాకి షిప్ ద్వారా తరలిస్తున్నాం. విశాఖలో మిగిలిన స్టైరిన్ను సైతం ఒకటి రెండు రోజులలో మరో షిప్ ద్వారా తరలిస్తాం. బాధిత గ్రామాలలో ప్రజల ఆరోగ్య సమస్యలపై ధీర్ఘకాలం పనిచేసేలా ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో 10 మంది వైద్య నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ రోజు సాయంత్రం లోపు కోలుకున్న బాధితులని కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పరిహారాన్ని కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యే బాధితులకి అందజేసి బస్సులలో గ్రామాలకి తరలిస్తాం. ఒక్క టన్ను స్టైరిన్ కూడా ఉండటానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు’’ అని అన్నారు. -
విశాఖ గ్యాస్ లీకేజీ: ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎల్జీ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వెంకటాపురంలో 10 పడకలతో వైఎస్సార్ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు వైద్య నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు బాధిత గ్రామాలలో 24 గంటలలో పాటు 3 షిఫ్టులలో 6 వైద్య బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ బృందం ప్రజల ఆరోగ్య సమస్యలపై దీర్ఘకాలికంగా పర్యవేక్షించడానికి 10 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించామన్నారు. ఈ వైద్య నిపుణుల కమిటీ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను పరీక్షించడంలో దీర్ఘకాలికంగా పనిచేస్తుందని చెప్పారు. (బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు) ఇందులో న్యూరో, పల్మనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కంటి, జనరల్ మెడిసిన్, పాథాలజీ, చిన్న పిల్లల వైద్య నిపుణులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ కమిటీకి తాను చైర్మన్గా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యలపై ఈ కమిటీ అధ్వర్యంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయమైన పద్దతిలో అధ్యయనం చేయడమే కాకుండా నిరంతరాయంగా పర్యవేక్షణ చేయనున్నామన్నారు. ఇక బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్లో వారి ఆరోగ్యంపై ఇబ్బందులు రాకుండా ఈ నిపుణుల కమిటీ పనిచేస్తుందన్నారు. స్టెరైనా గ్యాస్ వ్యవహారం, బాధితుల భవిష్యత్తు వైద్య సమస్యలపై ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రాజీవ్ గర్గ్, ఇన్సిట్యూట్ ఆప్ న్యూక్లియర్ మెడిసిన్ నిపుణులతోనూ చర్చిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరపు నుంచి హెల్త్ కార్డులను కూడా జారీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. (‘మంత్రుల బసతో బాధితుల్లో ధైర్యం’) -
ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ తరలింపు
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరిన్ తరలింపును అధికారులు ప్రారంభించారు. విశాఖలో మొత్తం 13048 టన్నుల స్టెరైన్ను జిల్లా యంత్రాంగం గుర్తించింది. మంగళవారం రాత్రి నుంచి ట్యాంకర్ల ద్వారా స్టైరిన్ అధికారులు తరలిస్తున్నారు. 13వేల టన్నుల స్టైరిన్ దక్షిణ కొరియాకు తరలిస్తున్నామని విశాఖ కలెక్టర్ వినయ్చంద్ తెలిపారు. (విశాఖలో నెలరోజుల పాటు మెడికల్ క్యాంప్) ఎల్జీ పాలిపర్స్ వద్ద ఉన్న యమ్ 5,111ఏ, 111బీ ట్యాంకులలోని 3209 స్టెరైన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. నిన్నరాత్రి నుంచి 20 టన్నుల చొప్పున ఫ్యాక్టరీ నుంచి స్టెరైన్ని రోడ్డు మార్గంలో అధికారులు తరలించారు. పోర్టు ప్రాంతంలో టీ2, టీ3 ట్యాంకులలో ఉన్న 9869 టన్నుల స్టెరైన్ని వెనక్కి పంపించేందుకు పోర్టు అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడారు. టీ2, టీ3 ట్యాంకుల నుంచి 7919 టన్నుల స్టెరైన్ని వెజల్ అర్హన్లోకి లోడింగ్ పూర్తి చేశారు. మిగిలిన స్టెరైన్ని వెజల్ నార్డ్ మేజిక్ ద్వారా మే 17 లోపు దక్షిణకొరియా తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. (స్టైరీన్ను వెనక్కి పంపిస్తున్నాం: కన్నబాబు) -
ప్రభుత్వం బస.. పల్లెలకు భరోసా
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రభావిత ఐదు గ్రామాల ప్రజలు ఐదు రోజుల తర్వాత మంగళవారం సరికొత్త ఉదయాన్ని చూశారు. సోమవారం రాత్రి వారి మధ్యనే మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బస చేసి కొండంత భరోసా ఇచ్చారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, జీవీఎంసీతోపాటు అన్ని విభాగాల అధికారులు కంటిమీద కునుకు లేకుండా ఆయా గ్రామాల్లో రాత్రంతా కాపలా కాశారు. సోమవారం రాత్రి ఇళ్లకు చేరుకున్న గ్రామస్తులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నైతిక స్థైర్యం కల్పించారు. ఆ గ్రామాల్లో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ప్రజాప్రతినిధుల నిద్రతో ఆ ప్రాంతాల్లో నవోదయం వెల్లివిరిసింది. ఐదు రోజుల్లోనే గ్రామస్తుల దైనందిన జీవనం యథావిధిగా ప్రారంభమైంది. ఉదయాన్నే చాలామంది నిర్భయంగా మార్నింగ్ వాక్కు వెళ్లారు. కిరాణా, పాలు, కూరగాయలు తదితర షాపులన్నీ తెరుచుకున్నాయి. దినపత్రికలు సరఫరా అయ్యాయి. గ్రామాల్లో మంత్రుల నిద్ర ఆ ఐదు గ్రామాల్లో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ప్రసాద్ సోమవారం రాత్రి బస చేశారు. గ్రామస్తులతో ముచ్చటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సాధకబాధకాలు తెలుసుకున్నారు. రాత్రి వారితోనే కలిసి భోజనం చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు: కన్నబాబు వెంకటాపురం: జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు సోమవారం రాత్రి 8 గంటలకు వెంకటాపురం చేరుకున్నారు. గడపగడపకూ తిరిగారు. గ్రామస్తులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు వెంకటాపురంలోనే ఒక ఇంట్లో నిద్ర చేశారు. ఉదయం 6 గంటలకు లేచి రెడీ అయ్యి మళ్లీ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం అన్నివిధాలా గ్రామస్తులను ఆదుకుంటుందని ధైర్యాన్ని ఇచ్చారు. కాలుష్యం కారణంగా భవిష్యత్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కొంతమంది ఆందోళన వ్యక్తం చేయగా.. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు శాఖల వైద్యాధికారులు గ్రామాల్లోనే ఉంటారని చెప్పారు. ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రాథమిక శిబిరాల్లో పరీక్షలు నిర్వహించి అవసరమైతే పెద్దాస్పత్రులకు పంపించడం జరుగుతుందన్నారు. కన్నబాబు వెంట మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఉన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుంది: ముత్తంశెట్టి పద్మనాభనగర్లో: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం రాత్రి 8 గంటలకు గ్యాస్ పీడిత గ్రామాలను సందర్శించారు. వెంకటాపురం, పద్మనాభనగర్లలో స్థానికులతో మాట్లాడారు. అనంతరం రాత్రి 10 గంటలకు గ్రామస్తులతో కలిసి భోజనం చేసి పద్మనాభనగర్లోని ఒక ఇంట్లోనిద్రించారు. ఉదయం 5.45 గంటలకు లేచి గ్రామంలో తిరిగారు. ఆవులకు పశుగ్రాసం వేశారు. బోర్ వాటర్ను పరిశీలించారు. అనంతరం ఇళ్లకు వెళ్లి స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్ ఉన్నారు. 9 గంటలకు మిగిలిన నాలుగు గ్రామాలు కూడా సందర్శించి అక్కడ పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కంపెనీ మూతపడే ఉంది: బొత్స నందమూరి నగర్లో: మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం రాత్రి 8 గంటలకు నందమూరినగర్లో ఇంటింటికీ వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 6 గంటలకే నిద్రలేచి గ్రామం మొత్తం కలియతిరిగారు. స్థానికుల సమస్యలను సావధానంగా విన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం కంపెనీ మూతపడి ఉందని, కమిటీ నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా ఉన్నారు. వెంకటాపురంలో ఎన్యుమరేషన్ తీరును పరిశీలిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్టైరీన్ తరలిస్తున్నాం :ధర్మాన ఎస్సీ, బీసీ కాలనీలో: మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం రాత్రి 9 గంటలకు ఎస్సీ, బీసీ కాలనీకి చేరుకుని ఓ ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకే నిద్ర లేచి గ్రామంలోని ప్రతి వీధీ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నిపుణుల సూచనలు ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భవిష్యత్లో ప్రమాదాలు జరగకుండా స్టైరీన్ గ్యాస్ను తరలించేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. గ్రామస్తులతో ఎంపీల మాటామంతి సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయా గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో ముచ్చటించారు. స్థానికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం అక్కడే ఒక ఇంట్లో మేడమీద ఆరు బయటే నిద్రించారు. తిరిగి ఉదయం 5.45 గంటలకు లేచారు. గ్రామాల్లో కలియతిరిగారు. వెంకటాపురం, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రజలను కలిశారు. వెంకటాపురంలో కొంతమంది తమ సమస్యలను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి నాలుగు ఇళ్లకు ఒక పారిశుధ్య కార్మికుడు నిత్యం పనులు చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ ఎంవీవీ సోమవారం రాత్రి 8 గంటలకు కంపరపాలెం గ్రామాన్ని సందర్శించారు. మంత్రులతో కలిసి అన్ని గ్రామాలకు వెళ్లి అక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు. స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 10 గంటలకు స్థానికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం 11 గంటలకు ఓ ఇంట్లో నిద్ర చేశారు. ఉదయం 6 గంటలకు రెడీ అయ్యి మళ్లీ అన్ని గ్రామాల్లో కలియతిరిగారు. -
చంద్రబాబు.. యూటర్న్ నాయుడు
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ నుంచి 13 వేల టన్నుల స్టైరిన్ను విదేశాలకు తరలిస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు (బుధవారం) ఉదయం 8వేల స్టైరిన్ను ఒక షిప్ ద్వారా వెనక్కి పంపిస్తున్నామని.. మే 17లోపు మిగిలిన స్టైరిన్ను కూడా పంపిస్తామని వెల్లడించారు. బాధిత గ్రామాల్లో మెడికల్ బృందాలు అనుక్షణం పనిచేస్తాయని తెలిపారు. బాధిత గ్రామం వెంకటాపురంలో ప్రత్యేకంగా వైఎస్సార్ క్లినిక్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజ్ ఘటనపై కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు. (స్టైరీన్ను వెనక్కి పంపిస్తున్నాం: కన్నబాబు) ఆ కంపెనీతో సంబంధం లేదు.. ఇప్పటివరకు మృతుల కుటుంబాల్లో 8 మందికి రూ.కోటి సాయం అందించామని.. మిగిలిన వారికి రేపటిలోగా పరిహారం వారి ఖాతాల్లో వేస్తామన్నారు. తనకు, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలో రవీందర్రెడ్డి అనే వ్యక్తి పనిచేస్తున్నాడని.. తనకు బంధువని టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాలను ఆయన ఖండించారు. చంద్రబాబును యూటర్న్ నాయుడిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. (చదవండి: స్టైరిన్ తరలింపు ప్రక్రియ ప్రారంభం) -
స్టైరీన్ను వెనక్కి పంపిస్తున్నాం: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: బాధితులకు భరోసా ఇచ్చేందుకే విషవాయువు ప్రభావిత గ్రామాల్లో బస చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. తిరిగి జన జీవనం కొనసాగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్ని గ్రామాల్లో పూర్తిగా పారిశుధ్య పనులతో పాటు.. ఇళ్లను శుభ్రం చేయించామని తెలిపారు. ఇళ్ల ముందున్న చెట్లను తొలగించామని పేర్కొన్నారు. 10 మంది వైద్యులతో కమిటీ ఏర్పాటు చేశామని.. గ్రామాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు వైద్యుల కమిటీ పరిశీలన చేస్తోందని తెలిపారు. (‘అప్పుడు గుర్తుకు రాలేదా బాబూ..’) బాధితులకు హెల్త్కార్డులు.. ఇలాంటి ఘటన మొదటిసారి జరిగింది కాబట్టి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. ప్రతి బాధిత గ్రామంలో 24 గంటలు పనిచేసేలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వెంకటాపురంలో ‘వైఎస్సార్ క్లినిక్’ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇన్ పేషంట్ ఉండేలా ఈ క్లినిక్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. బాధిత గ్రామాల ప్రజలకు ఒక ఏడాదిపాటు వైద్య సేవలు అందే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. (మన నీళ్లను తీసుకుంటే తప్పేంటి?: సీఎం జగన్) స్టైరీన్ను వెనక్కి పంపిస్తున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా రసాయన పరిశ్రమలను తనిఖీ చేస్తామన్నారు. విశాఖలో 20 రసాయన పరిశ్రమలను గుర్తించామని.. వచ్చే 4 రోజుల్లో పరిశ్రమల్లోని భద్రతా ప్రమాణాలు తనిఖీ చేస్తామని కన్నబాబు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు స్టైరీన్ను దక్షిణ కొరియాకు వెనక్కి పంపిస్తున్నామని పేర్కొన్నారు. రేపు ఉదయానికి ఒక షిప్ వెనక్కి వెళ్లనుందని తెలిపారు. తప్పుడు ప్రచారాలు దుర్మార్గం.. గ్యాస్ ఘటన బాధితులు మంగళవారం కొంతమంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని..రేపు(బుధవారం) మరి కొంతమంది డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన చిన్నారి గ్రీష్మ తల్లిపై కేసులు నమోదు చేశామని తప్పుడు ప్రచారాలు చేయడం దుర్మార్గమని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయొద్దని కన్నబాబు హితవు పలికారు. -
గ్రీష్మ తల్లిపై ఏ కేసు పెట్టలేదు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన మృతి చెందిన చిన్నారి గ్రీష్మ తల్లిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఓ వర్గం మీడియా కావాలనే అసత్యం ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఘటన బాధిత కుటుంబాలపై కేసులు నమోదు చేశారని ఓ వర్గం మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. 50 మందిపై పోలీసులు కేసులు పెట్టారన్న ప్రచారం కూడా అవాస్తవమే అన్నారు. (చదవండి : అయ్యో గ్రీష్మ.. అప్పుడే నూరేళ్లు..!) ఇంటింటి సర్వే గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గ్రామాల్లో గడ్డి వినియోగించరాదని పశుసంవర్ధశాఖ సూచించింది. గ్రామాల్లోని చెట్ల ఫలాలను కూడా వినియోగించరాదని పేర్కొంది. బాధితులను పరామర్శించిన విజయసాయిరెడ్డి కేజీహెచ్లో గ్యాస్ లీకేజీ బాధితులను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు పరామర్శించారు. రాజేంద్రప్రసాద్ వార్డులో బాధితులకు ఎంపీ విజయసాయిరెడ్డి పరిహారం చెక్కులను అందజేశారు. వీరంతా గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి రవాణా సౌకర్యం కల్పిస్తామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. ఇంటికి వెళ్లాక కూడా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే గ్రామాల్లోని అన్ని వీధుల్లో మంత్రులు, ఎంపీల బృందం పర్యటించి గ్రామస్ధులతో మాట్లాడారు. గ్రామాలలో బ్లీచింగ్ చల్లడం, శానిటైజేషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగం 700 మంది శానిటరీ సిబ్బందిని ఏర్పాటు చేసింది. నేడు కూడా బాధితులకి ఆయా గ్రామాల్లోనే భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భోజనం సిద్ధం చేయడానికి ప్రతీ గ్రామంలో 50 మందికి పైగా వంట చేసేవారిని ఏర్పాటు చేశారు. సుమారు పది వేల మందికి పైగా ప్రజల కోసం అయిదు గ్రామాల్లో భోజనం సిద్ధమతోంది. ప్రతీ గ్రామంలో భోజనాలు తయారు చేసి అక్కడే అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితుల భోజనం మెనూలో వెజిటబుల్ బిర్యానీ, పెరుగు చట్నీ, రైస్తో పాటు బంగాళా దుంప కూర, ఎగ్ కర్రీ, పప్పు, సాంబారు, పెరుగు, స్వీటు, అరటి పండు అందించనున్నారు. -
విశాఖ గ్యాస్ ప్రమాదం గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు
-
గ్యాస్ లీకేజీ: ఆ బాధ్యత అంతా ప్రభుత్వానిదే
సాక్షి, విశాఖపట్నం : విశాఖ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు సమీక్ష చేపడుతోంది. దీనిలో భాగంగానే గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో మంగళవారం మంత్రులు, వైఎస్సార్సీపీ ఎంపీలు పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటన వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. (నేటి నుంచి ఎన్యూమరేషన్ ప్రారంభం) గ్రామ వాలంటీర్ ద్వారా ఇంటింటి సర్వే చేస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాన్ని పూర్తి సేఫ్ &గ్రీన్ జోన్గా తయారు చేస్తామన్నారు. స్థానికంగా ఉన్నపశువుల కోసం 25 టన్నుల పశుగ్రాసం సరఫరా చేస్తున్నామని ప్రకటించారు. అలాగే ప్రజలకు మధ్యాహ్నం, సాయంత్రం భోజనంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాంతమంతా మామూలు పరిస్థితికి వచ్చేంతవరకు.. బాధ్యత అంతా ప్రభుత్వానిదే అని మరోసారి స్పష్టం చేశారు. అధికారులు, ప్రభుత్వం కృషితో ఇప్పటికే సాధారణ పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక పరిస్థితులపై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారని జిల్లా కలెక్టర్ అన్నారు. కంటి, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మానికి సంబంధించి వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. నెలరోజుల పాటు మెడికల్ క్యాంప్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ప్రకటించారు. గ్రామాల్లో ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి ప్రాథమిక నివేదిక ఇచ్చామని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘మంత్రుల బసతో బాధితుల్లో ధైర్యం’
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సోమవారం రాత్రి నలుగురు మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ఎంపీ విజయ సాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో నిద్ర చేశారు. బాధిత గ్రామంలో ఆరుబయట నిద్రించిన ఎంపీ విజయ సాయిరెడ్డి మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. పరిహారం ఇవ్వడం కాదు ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పద్మనాభనగర్లోని ఓ బాధితుడి ఇంట్లో నిద్ర చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని, ప్రజలతో పాటు గ్రామంలో నిద్రించామని ఆయన తెలిపారు. (చిన్నారులు సహా ప్రతి ఒక్కరికీ సాయం) వెంకటాపురంలో బాధితుల ఇంటిలో బస చేసిన ఇన్ఛార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. బాధిత గ్రామాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారని ఆయన తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో స్వయంగా మంత్రులే గ్రామాల్లో బస చేయడంతో ప్రజలలో ధైర్యం పెరిగిందని ఆయన తెలిపారు. వెంకటాద్రి నగర్లో ఓ బాధితుని ఇంటిలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ బసచేశారు. ఎస్సీ, బీసీ కాలనీలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం రాత్రి నిద్రచేశారు. ప్రతీ గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు కానున్నాయని మంత్రులు తెలిపారు. నేటి నుంచి వాలంటీర్ల సహకారంతో ఎన్యూమరేషన్ ప్రారంభం కానుందని మంత్రులు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జగన్పై బురద జల్లటమే చంద్రబాబు పని
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నియంత్రణలో, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్లీక్ దుర్ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరుకు ప్రపంచమంతా మెచ్చుకుంటూంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకే చందంగా కువిమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్ ఇబ్బందుల్లో ఈ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి జగన్ యుద్ధ ప్రాతిపదికన బాధితులను ఆదుకుని భరోసా నింపారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వ ఖజానా నుంచి భారీ ఆర్థిక సాయం అందించిన ఘనత సీఎం జగన్దేనని అన్నారు. దీన్ని చంద్రబాబు మెచ్చుకోక పోగా రకరకాలుగా మాట్లాడుతున్నారని అంబటి మండి పడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... ► ఎల్జీ పాలిమర్స్ వారితో లాలూచి పడ్డారని అంటూ కువిమర్శలు చేస్తున్నారు. ఆ కంపెనీతో లాలూచి పడవల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. వారితో పరిచయంగాని, బంధం, బాంధవ్యం గాని జగన్ ప్రభుత్వానికి లేవు. అలాంటి బంధాలు చంద్రబాబుకే ఉంటాయి. ► రూ. కోటి ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందా అని చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ► ఎఫ్ఐఆర్ సరిగ్గా కట్టలేదంటున్నారు. అది ప్రాథమిక దర్యాప్తు నివేదిక మాత్రమే. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబుకు ఇది తెలియదా? ► కంపెనీ వారిని అరెస్టు చేయలేదంటున్నారు. రుజువులు లేకుండా అరెస్టులు చేస్తారా? పుష్కరాల్లో 29 మంది మరణిస్తే ఎంత మందిని అరెస్టు చేశారు. ► గెయిల్ ప్రమాదంలో మృతులకు సంస్థ రూ 20 లక్షల పరిహారం ఇస్తే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది రూ 3 లక్షలే. ఈ ప్రమాదంలో చంద్రబాబు ఎంత మందిని అరెస్టు చేశారు? ► విశాఖలో పర్యటించడానికి కేంద్రం ఎందుకు అనుమతి నివ్వలేదో అడిగే సాహసం చంద్రబాబు చేస్తారా? -
ఎల్జీ పాలిమర్స్కు మేం అనుమతివ్వలేదు
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తమ ప్రభుత్వం అనుమతులివ్వలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తామే ఆ కంపెనీకి భూములిచ్చామనడం సరికాదన్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి సోమవారం ఏపీలోని టీడీపీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► హిందుస్థాన్ పాలిమర్స్కు 1964 నవంబర్ 23న కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జీవో 2177 ద్వారా 213 ఎకరాల భూమిని ఇచ్చింది. ఈ భూమికి 1992 అక్టోబర్ 8న అప్పటి ప్రభుత్వం జీవో 1033 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. హైకోర్టు సూచనల మేరకే టీడీపీ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది. ► ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఉత్పత్తిని, స్టైరీన్ ఉత్పత్తితో ముడిపెట్టడం దివాలాకోరుతనం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే ఎక్స్పాండబుల్ పాలిస్టైరీన్ ఉత్పత్తికి అనుమతించి కేంద్రానికి సిఫారసు చేసింది. ► గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బిడ్డ చనిపోయి బాధలో ఉన్న తల్లి, తండ్రిపై కేసు పెట్టారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు అండగా ఉన్న ప్రతిపక్షాల నాయకులపై కేసులు పెట్టారు. కోటి వద్దు కూతురే కావాలనే తల్లిపై కేసు పెట్టడం అమానుషం. ► లీకేజీ దుర్ఘటనను సాధారణ ప్రమాదంగా చూపించి కంపెనీకి కొమ్ము కాయడం దారుణం. విమానాశ్రయంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడటం, కోటి పరిహారం ప్రకటించడం, మల్టీ నేషనల్ కంపెనీగా కితాబివ్వడం, అందులోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడం అంతా వెనకేసుకురావడమే. ► నిందితులకు సానుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడటం విచారణను నీరుగార్చడమే. కంపెనీని మూసేయాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తుంటే అందులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎలా అంటారు? ► ఎల్జీ పాలిమర్స్ కంపెనీ డైరెక్టర్ రవీంద్రనాథ్రెడ్డి, విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధాలు ఏమిటి? ఈ కంపెనీతో భారతి పాలిమర్స్, నందిని పాలిమర్స్కు ఉన్న వ్యాపార లావాదేవీలు ఏమిటి? -
ఎల్జీకి అనుమతులు టీడీపీ నిర్వాకమే
సాక్షి, అమరావతి: హైదరాబాద్లోని ఇంద్రభవనంలో సేద తీరుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయనకు అలవాటైన రీతిలో దగాకోరు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ సలహాదారు( ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. విశాఖలో జరిగిన ప్రమాదంపై రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్జీ పాలిమర్స్కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ నిస్సిగ్గుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే.. 7 ఏళ్ల పాటు అనుమతులిచ్చిన టీడీపీ సర్కారు ► ఎల్జీ పాలిమర్స్ సంస్థ విస్తరణ, ఉత్పత్తి ప్రారంభించడానికి 2018లో చంద్రబాబు సర్కారే అనుమతులు ఇచ్చింది. కంపెనీ విస్తరణ కోసం కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్కు ఎల్జీ పాలిమర్స్ 2018, నవంబర్ 29న దరఖాస్తు చేయగా అదే ఏడాది డిసెంబర్ 7న తనిఖీలు నిర్వహించారు. 2018 డిసెంబర్ 21న కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో మొక్కుబడిగా చర్చించి డిసెంబర్ 27నే అనుమతులు జారీ చేసేశారు. ► ఏకంగా ఏడేళ్లపాటు అనుమతులు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2018, డిసెంబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు లేకుండానే టీడీపీ ప్రభుత్వమే అనుమతులిచ్చేసింది. దీంతోనే ఆ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. ఇవన్నీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల్లో ఉన్న వాస్తవాలే. సింహాచలం భూములు కట్టబెట్టిన బాబు ► సింహాచలం దేవస్థానానికి చెందిన 162 ఎకరాలను ఎల్జీ పాలిమర్స్కు కట్టబెడుతూ 2015లో చంద్రబాబు ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చింది. ఆమేరకు ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు వీలుగా డీ నోటిఫై చేస్తూ 2015 ఆగస్టు 17న టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో తాము ఆ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. ఎల్జీ పాలిమర్స్ ఆ భూములకు సంబంధించి వేసిన పిటిషన్పై హైకోర్టు స్పందిస్తూ తగిన నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్పింది. ఆ సాకుతో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఆ భూములను ఎల్జీ పాలిమర్స్కు కట్టబెట్టేసింది. ► సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి వేలాది మంది సామాన్యులకు ప్రయోజనం కల్పించేలా పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తానని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. ఎల్జీ పాలిమర్స్కు మాత్రం ఆగమేఘాల మీద 162 ఎకరాలను ధారాదత్తం చేశారు. -
ఆపదలో ఆదుకుంది
మహారాణిపేట/ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): విష వాయువు లీకేజీ ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలుత సోమవారం 8 కుటుంబాలకు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగాయి. రూ.కోటి చొప్పున పరిహారాన్ని జమ చేసినట్లు గోపాలపట్నం తహసీల్దార్ బి.వి.రాణి తెలిపారు. నలుగురు మృతుల కుటుంబ సభ్యులకు కేజీహెచ్లో మంత్రులు పరిహారానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ప్రభుత్వం ఆదుకుంది.. కష్టాల్లో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంది. ఘటన జరిగిన ఐదు రోజుల లోపే పరిహారం చెల్లించింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడం బాధగా ఉంది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మమ్మల్ని అన్ని వి«ధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. ఇలాంటి సీఎం నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి. – గండబోయిన శ్రీనివాస్ (శ్రియ తండ్రి) ఏ ప్రభుత్వమూ ఇలా స్పందించలేదు... గతంలో ఏ ప్రభుత్వాలూ మాలాంటి పేదలను ఇంతగా ఆదుకోలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన తీరు చాలా బాగుంది. ప్రభుత్వం అందించిన భరోసాతో కుదుటపడ్డాం. భర్తను కోల్పోయానన్న బాధ ఉంది. కుటుంబంతో సుఖంగా జీవిస్తున్న మాకు ఈ ఘటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. భర్త లేని లోటు తీర్చలేనిది. ముఖ్యమంత్రి జగన్ మమ్మల్ని ఆదుకున్న తీరు అభినందనీయం. – పిట్టా యల్లమ్మ (మృతుడు శంకరరావు భార్య) జనావాసాల్లో వద్దు.. మాది పెందుర్తి మండలం నరవ. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో నా భర్త మృతిచెందాడు. నా భర్త కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబ పోషణ కష్టంగా మారుతుందని బాధపడుతున్న సమయంలో ప్రభుత్వం ఆదుకుంది. మాకు ఆర్థిక సహాయం చేసిన సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నా. అదే చేతులతో జనావాసాల్లో ఇలాంటి కంపెనీలు వద్దని వేడుకుంటున్నా. – చిన్న నాగమణి (మృతుడి చిన్న గంగరాజు భార్య), నరవ పెందుర్తి మండలం ఐదు ఊళ్లు ఊపిరి పీల్చుకున్నాయి... నా భర్త సింహాచలం ఆర్టీసీ డిపోలో హెల్పర్గా పనిచేస్తున్నాడు. 15 ఏళ్లుగా వెంకటాపురంలో నివాసం ఉంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. బాబు పార్ధు (13) ఏడో తరగతి చదువుతున్నాడు. ఐదో తరగతి చదివే మా పాప గ్రీష్మ (10) ఈ దుర్ఘటనతో మాకు శాశ్వతంగా దూరమైంది. నిత్యం ఇంట్లో చలాకీగా తిరిగే పాప ఇక లేదనే సంగతి మమ్మల్ని కలచివేస్తోంది. డబ్బు కంటే ప్రాణం ముఖ్యమే అయినా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. అధికారులు, మంత్రులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల ఐదు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. – నాగులాపల్లి లత (గ్రీష్మ తల్లి) పిల్లలను బాగా చదివిస్తా ఈ ఘటనలో నా భర్త గోవిందరాజు చనిపోవడం చాలా బాధగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో పిల్లలను చదివించి మంచి ప్రయోజకులను చేస్తా. గ్యాస్ లీకేజీతో ఐదు ఊళ్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అన్ని రకాలుగా ప్రభుత్వం స్పందించడం వల్ల కష్టాల నుంచి బయట పడ్డాం. తరలించిన వారికి షెల్టర్లలో అన్ని వసతులు కల్పించడం. చాలా బాగుంది. కంపెనీకి అనుకుని ఉన్న మా ఇళ్లను కూడా శుభ్రం చేస్తున్నారు. ఆర్ధికంగా కూడా చేయూతనిచ్చారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వంతున ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం గొప్ప విషయం. ప్రభుత్వం ప్రజలను ఆదుకున్న తీరు బాగుంది. – శివకోటి వెంకట లక్ష్మి (మృతుడు శివకోటి గోవిందరాజుల భార్య) కూలి పనుల కోసం వచ్చాం... మాది విజయనగరం జిల్లా, ఎల్ కోట మండలం, కల్లేపల్లి రేగ .కూలి పనుల కోసం వెంకటాపురం వచ్చాం. గ్యాస్ లీక్ దుర్ఘటనలో నా భార్య ప్రాణాలు కోల్పోయింది. పోయిన ప్రాణాలను తీసుకురాలేకపోయినా ముఖ్యమంత్రి రూ.కోటి చొప్పున ఆర్ధిక సాయం అందించడం ఊరటనిచ్చింది. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. – రావాడ సత్యమంతుడు (మృతురాలు రావాడ నారాయణమ్మ భర్త ఊరటనిచ్చినా.. మాది పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామం. గ్యాస్ లీకేజీ ప్రమాదంలో నా భర్త మేకా కృష్ణమూర్తి మృతిచెందాడు. ప్రభుత్వం అందించిన రూ.కోటి సహాయం ఊరటనిచ్చినా నా భర్త లేరనే విషయం మనసును తొలిచివేస్తోంది. – మేకా సుశీల (మృతుడు మేకా కృష్ణమూర్తి భార్య) అందివచ్చే సమయంలో అకాల మరణం అందివస్తున్న నా కుమారుడు అకాల మరణం చెందడం బాధగా ఉంది. చిన్నతనం నుంచి కష్టపడి చదివే అన్నెపు చంద్రమౌళి (19) పేదలకు మరింత సేవ చేసేందుకు డాక్టర్ కావాలని కోరుకున్నాం. విశాఖ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఎంతో బాగా చదువుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మా కుమారుడు లేడనే బాధ మర్చిపోలేనిది. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారాన్ని ప్రకటించడం మంచి నిర్ణయం. – అన్నెపు ఈశ్వరరావు, వెంకటాపురం (వైద్య విద్యార్థి అన్నెపు చంద్రమౌళి తండ్రి) (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ) -
విషాద జ్ఞాపకాల్ని కడిగేసి..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విష వాయువు చేదు జ్ఞాపకాలను కడిగేశారు. స్టైరీన్ అవశేషాలు ఒక్క శాతం కూడా లేకుండా తుడిచేశారు. మూగజీవాల మృత కళేబరాలను తొలగించారు. ప్రతి గ్రామం.. వీధి.. ప్రతి ఇంటినీ జల్లెడపట్టి కాలుష్య ఛాయలు లేకుండా క్లీన్ చేశారు. ప్రమాదానికి గురైన ఆర్ఆర్ వెంకటాపురం, నందమూరి నగర్, కంపర పాలెం, పద్మనాభ నగర్, ఎస్సీ, బీసీ కాలనీ రూపురేఖలను కేవలం ఐదు రోజుల్లో మార్చేసిన ప్రభుత్వ యంత్రాంగం గ్రామాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చింది. (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ) సీఎం ఆదేశాలతో.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు 5 గ్రామాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇందుకోసం 700 మంది సిబ్బందిని మోహరించారు. ► గ్రామాల్లోని ప్రధాన, అంతర్గత రహదారులను శుభ్రం చేశారు. వాయు కాలుష్యానికి మాడిపోయిన చెట్లు, మొక్కలను, కాలువల్లో పూడికను తొలగించారు. చనిపోయిన పశు కళేబరాలను తరలించారు. ► వాటర్ ట్యాంకర్ల సాయంతో ఇళ్ల లోపల కూడా రసాయనిక వాయువుల జాడ లేకుండా శుభ్రం చేశారు. ► 30 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో 5 బెల్ మిస్ట్ భారీ యంత్రాలు, 6 టాటా ఏస్ వాహనాల ద్వారా ప్రధాన రోడ్లపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేసి బ్లీచింగ్ చల్లారు. ► వ్యాధులు ప్రబలకుండా 100 మంది మలేరియా సిబ్బంది పర్యవేక్షణలో పనులు చేపట్టారు. గ్రామాల్లోకి వచ్చాక ప్రజలు చేయాల్సిన పనులు, చేయకూడని పనులను వివరిస్తూ అవగాహన కల్పించారు. ► సోమవారం సాయంత్రానికి ఐదు గ్రామాల ప్రజలను వారి ఇళ్లకు తరలించారు. ► వాటర్ వర్క్స్ ఏఈల ఆధ్వర్యంలో స్టోరేజ్ ట్యాంకుల్లో నీటిని శుభ్రం చేశారు. గ్రామాల్లో తాగునీరు, ఇతర అవసరాలకు ఎస్ఈ వేణుగోపాల్ ఆదేశాలతో 30 ట్యాంకర్లతో 80 ట్రిప్పులు సరఫరా చేశారు. ► కుళాయిల ద్వారా కూడా గృహాలకు మంచినీటి సరఫరా చేశారు. అలాగే యూసీడీ పీడీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం రాత్రికి గ్రామస్తులకు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించారు. ► ఐదు గ్రామాల ప్రజలకు 20 వేల మాస్కులను పంపిణీ చేశారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అన్ని వసతులు కల్పించారు ప్రభుత్వం చెప్పిన విధంగానే మాకు అన్ని వసతులు కల్పించారు. ఈ ప్రాంతంలో అంతటి ప్రమాదం జరిగిందన్న ఆనవాళ్లు లేకుండా ఊళ్లను శుభ్రం చేయించారు. – పుల్లేటికుర్తి పుష్ప, వెంకటాపురం ప్రభుత్వ చర్యలు బాగున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించిన తీరు అద్భుతం. ఆసుపత్రుల్లో ఉన్న బాధితులకు సైతం భరోసా కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా బాగుంది. – వెంకటరమణరావు, న్యాయవాది, వెంకటాపురం జీవితాంతం రుణపడి ఉంటాం ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే మమ్మల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చారు. సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటాం. – యడ్ల వరలక్ష్మి, వెంకటాపురం నాలుగు రోజుల తర్వాత అమ్మ ఒడికి... నాలుగు రోజుల తర్వాత చంటి బిడ్డ కనిపించడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో అస్వస్థతకు గురైన ఎ.నాగమణి ఈ నెల 7 నుంచి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. సోమవారం ఆమె కోలుకోవడంతో రెండు నెలల పసికందును బంధువులు తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. కన్నబిడ్డకు కడుపునిండా పాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నానని నాగమణి కంటతడి పెట్టడంతో అక్కడున్న అందరి కళ్లూ చెమర్చాయి. దీంతో మంత్రులు, ఇతర అధికారులు ఆమెను ఓదార్చారు. ఊళ్లకు కళొచ్చింది స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనతో చెల్లాచెదురైన గ్రామాలు కోలుకున్నాయి. ఐదు గ్రామాలను అన్నివిధాలా నివాసయోగ్యంగా తీర్చిదిద్దటంతో ప్రజలను వారి ఇళ్లల్లోకి సోమవారం అనుమతించారు. రాత్రి సమయానికి 70 శాతం ప్రజలు ఇళ్లకు చేరుకున్నారు. క్షేమంగా చేరారు ► ఎల్జీ పాలిమర్స్కి ఆనుకుని ఉన్న వెంకటాపురంలో 1,250 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ నివసించే 5 వేల మందిలో 3 వేల మంది ఇళ్లకు చేరుకున్నారు. మిగతా వారు షెల్టర్లు, బంధువుల ఇళ్లలో ఉన్నారు. అస్వస్థతకు గురైన వారు కేజీహెచ్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారు. ► కంపెనీకి కిలోమీటరు దూరంలో ఉన్న నందమూరి నగర్లో 600 వరకూ ఇళ్లు, 2,250 మంది జనాభా ఉన్నారు. వారిలో 70 శాతం మంది సోమవారమే తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. ► 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభ నగర్లో 500 వరకూ ఇళ్లు, 2,200 మంది జనాభా ఉంది. గ్రామస్తులంతా ఇళ్లకు చేరుకున్నారు. మేఘాద్రి గెడ్డ నీరు సురక్షితమే ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకైన ఘటనలో మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ స్టైరీన్తో కలుషితమైపోయిందన్న సందేహాలను నివృత్తి చేస్తూ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక విడుదల చేసింది. దుర్ఘటన జరిగిన నాటి నుంచి రోజూ రిజర్వాయర్ నీటి శాంపిళ్లని పరీక్షల కోసం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ రీజనల్ వాటర్ లేబొరేటరీకి పంపించింది. ఈ నెల 7న పంపించిన శాంపిళ్లకు సంబంధించిన నివేదికను జీవీఎంసీకి కాలుష్య నియంత్రణ మండలి అందించింది. తొలి రోజు తీసుకున్న శాంపిళ్లలో స్టైరీన్ మోనోమర్ అవశేషాలు లేవని నివేదికలో పేర్కొంది. నీరు వినియోగించేందుకు సురక్షితంగా ఉందని తెలిపింది. -
బాధిత కుటుంబాలకు రూ. కోటి బాసట
పరిహారం కోసం పడిగాపులు లేవు..కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి లేదు..ప్రజా ప్రతినిధుల రికమండేషన్లతో పనిలేదు..ప్రాణాలకు వెలకట్టే వ్యాపారిలా కాకుండా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా ప్రభుత్వం నిలబడింది! మానిపోని గాయానికి మానసిక స్థైర్యాన్ని అందిస్తూ..బాధితులకు భరోసా కల్పిస్తూ బాసటగా నిలిచింది. ఘటన జరిగిన రోజే ప్రకటించిన పరిహారాన్ని కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే అందించి ఆదుకుంది. కన్నీటి సుడులు తిరుగుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలబడ్డారు. సాక్షి, విశాఖపట్నం: విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు దేశంలో ఏ ప్రభుత్వమూ ఆదుకోనంత సాయాన్ని అందచేసి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన దానికంటే రెట్టింపు పరిహారం ఇస్తామని విశాఖలో దుర్ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం ఐదు రోజుల్లోనే బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ఆదివారమే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల సోమవారం అందచేశారు. బాధిత కుటుంబాలకు భరోసా.. విశాఖ కేజీహెచ్లో జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబుతోపాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ వి.వినయ్చంద్ కలిసి మృతుల కుటుంబాలకు అకౌంట్లల్లో నగదు జమ చేశారు. పరిహారానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. సంబంధిత పత్రాలతోపాటు ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖను కూడా అందించారు. తొలి విడతగా మృతుల చట్టబద్థ వారసులుగా నిర్థారించిన 8 మందికి ఒకొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. బాధితులందరినీ ఆదుకుంటామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రులు అన్ని విధాలా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మాటగా భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అదనపు డీజీపీ రాజీవ్కుమార్ మీనా, ఏఎంపీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ పాల్గొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు: మంత్రి బొత్స ► ఎల్జీ పాలిమర్స్ సమీప గ్రామాల్లో నీటి నమూనాలను పరీక్షల కోసం పుణె ల్యాబ్కు పంపాం. సుమారు 500 మంది సిబ్బందితో గ్రామాల్లో శానిటైజేషన్ నిర్వహిస్తున్నాం. ► గ్యాస్ లీకేజీ ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు నిపుణులతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో 6 కమిటీలను నియమించాం. కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా యాజమాన్యంపై చర్యలు ఉంటాయి. ► ఈ ప్రభుత్వానికి ప్రజలపైనే ప్రేమ ఉంటుంది. కంపెనీలపై కాదు. ► గత సర్కారు చేసిన తప్పిదాలను మా ప్రభుత్వం సరిదిద్దుతోంది. ► టీడీపీ సర్కారు ఇచ్చిన అనుమతుల కారణంగానే ఆ కంపెనీ పనిచేస్తోంది. గ్రామాల్లో మెడికల్ క్యాంప్ : మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ► స్టైరీన్ గ్యాస్ పూర్తిగా అదుపులో ఉంది. ఇప్పటికే ఐదు గ్రామాలను మేమంతా పరిశీలించాం. జీవీఎంసీ 500 మంది సిబ్బందితో అణువణువు శుభ్రం చేస్తోంది. ► సాయంత్రం గ్రామాల్లోకి వచ్చిన ప్రజలందరికీ భోజన వసతి కల్పిస్తున్నాం. ► ప్రజల భద్రత విషయంలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ► గ్రామాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాం. అనుమతులిచ్చింది గత సర్కారే: మంత్రి కన్నబాబు ► గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కారణంగానే ఎల్జీ పాలిమర్స్లో లీకేజీ ఘటన సంభవించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ► రూ.కోటితో మృతి చెందిన వారి ప్రాణాలు తీసుకురాలేం కానీ బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలనే గొప్ప మనసుతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ► అస్వస్థతకు గురైన వారందరిని మంగళవారం డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. డిశ్చార్జి అయిన వారికి గ్రామ వలంటీర్లే నేరుగా ఇంటికి వెళ్లి పరిహారం అందజేస్తారు. ► నిపుణుల సలహా మేరకు ఐదు గ్రామాల్లో శానిటైజేషన్ చేయించాం. ట్యాంక్లో విషవాయువులు సాధారణ స్థితికి వచ్చాయి. ప్రజలెవరూ అధైర్యపడొద్దు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. బాధిత గ్రామాల్లో మంత్రుల బస విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ధైర్యం చెప్పేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి గ్రామాల్లోనే బస చేశారు. మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, బి. సత్యవతి బాధిత గ్రామాల్లో రాత్రంతా ప్రజలతో పాటునిద్రపోయారు. అంతకుముందు బాధిత గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో చేపడుతున్న చర్యలను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా,ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి కోలుకొని గ్రామాలకు వచ్చిన ప్రజలకు ప్రభుత్వం సోమవారం రాత్రి భోజన సౌకర్యం ఏర్పాటు చేసింది. మంత్రుల నేతృత్వంలో నాణ్యమైన భోజనాన్ని అందించారు. వెజ్, నాన్వెజ్ వంటకాలతో ఐదు గ్రామాల్లోనూ ప్రజలకు భోజనం పెట్టారు. ప్రజలతో కలిసే మంత్రులు కూడా భోజనం చేశారు. (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ) -
‘లాలూచీ పడాల్సిన అవసరం మాకు లేదు’
సాక్షి, తాడేపల్లి : ఎల్జీపాలిమర్స్తో లాలూచీ పడాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆ సంస్థతో లాలుచీ పడి సింహాచల ఆలయ భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ ప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ చేస్తోందని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విశాఖ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డ వేగంగా స్పందంచారని, ప్రమాదం జరిగిన రోజే బాధితులను పరామర్శించారని గుర్తు చేశారు. గ్యాస్ బాధితులకు కనివినీ రీతిలో సాయం చేశారన్నారు. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి సీఎం జగన్ అయితే.. ఎన్ని ప్రాణాలు పోయినా కరగని గుండె చంద్రబాబుది అని విమర్శించారు.(చదవండి : అలాంటి వార్తలు రాయొద్దు: మంత్రి బొత్స) యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభిస్తే.. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల ప్రమాదానికి కారణమైనవారిలో ఎంతమంది అరెస్ట్ చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురదజల్లడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విశాఖకు వచ్చేందుకు చంద్రబాబు కేంద్రం పర్మిషన్ ఇచ్చిందో లేదో తెలియదని, ఆ విషయాన్ని చద్రబాబు ఎందుకు బయటపట్టడం లేదని ప్రశ్నించారు. (చదవండి : గ్యాస్ లీక్ : సీఎం జగన్ సహాయం ఓ నిదర్శనం) బాధితులను పరామర్శించే మనసు ఉంటేకారులో కూడా విశాఖకు రావొచ్చని, కానీ చంద్రబాబుకు ఆ ఉద్దేశమే లేదన్నారు. సీబీఐని రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జీవితమంతా రాజకీయ కుట్రలేనని అంబటి విమర్శించారు. -
ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ తరలింపు
సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్లో లీకైన స్టైరిన్ను తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. స్టైరిన్ను తరలించే ప్రక్రియ ప్రారంభమైందని, ఎల్జీ పాలిమర్స్లో పరిస్థితి అదుపులో ఉందన్నారు. లీకైన ట్యాంక్తో పాటు అయిదు ట్యాంకుల్లో 12 నుంచి 13వేల టన్నుల స్టైరిన్ ఉందని, వాటిని నౌకల ద్వారా కొరియాకు తరలించనున్నట్లు చెప్పారు. మూడు నుంచి అయిదు రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి అవుతుందని కలెక్టర్ వెల్లడించారు. (బాధితులను ఇళ్లకు చేర్చండి: సీఎం జగన్) అలాగే బాధితులకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారని, ఇప్పటికే మృతుల కుటుంబాలకు కోటి పరిహారం అందించినట్లు చెప్పారు. బాధిత గ్రామాలలో ఇంటిలో ప్రతి కుటుంబ సభ్యునికి పదివేల రూపాయలు ఆర్దిక సహాయం అందచేస్తామన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేలు పరిహారం రేపటి (మంగళవారం) నుంచి అందిస్తామన్నారు. ఇవాళ సాయంత్రానికి డీశానిటైజేషన్ పూర్తయ్యాక... కోలుకున్న వారితో పాటు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని గ్రామాలకు తరలిస్తామని, బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తామన్నారు. గ్రామంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇక స్టైరిన్ గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, వైద్య బృందాలు, జీవీయంసీ పారిశుద్ద్య బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయన్నారు. (బాధితులను ఇళ్లకు చేర్చండి: సీఎం జగన్)