MCX
-
ఎన్పీసీఐకి ప్రవీణా రాయ్ రాజీనామా: ఎంసీఎక్స్లో కొత్త బాధ్యతలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ప్రవీణా రాయ్' తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం 'మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్' (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు స్వీకరించారు.ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణా రాయ్ ఎంసీఎక్స్లో నియామకానికి 'సెబీ' ఆమోదం తెలిపింది. రాయ్ ఎన్పీసీఐలో చేరటానికి ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీలలో కూడా పనిచేశారు.ఇదీ చదవండి: బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూతఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ప్రవీణా రాయ్.. ఐఐఎం అహ్మదాబాద్లో పేజీ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో చేరినప్పుడు ఈమె క్యాష్ మేనేజ్మెంట్ పోర్ట్ ఫోలియో నిర్వహించారు. ఆ తరువాత హెచ్ఎస్బీసీలో ఆసియా - పసిఫిక్ రీజియన్ హెడ్గా బాధ్యతలు చేపట్టారు. ఎన్పీసీఐలో రాయ్ మార్కెటింగ్, ప్రొడక్ట్, టెక్నాలజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఆపరేషన్ డెలివరీ వంటి బాధ్యలు నిర్వహించారు. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు చేపట్టారు.PRESS RELEASE - Ms. Praveena Rai takes charge as MD & CEO of MCXClick here to read more: https://t.co/114IrR0cYL#pressrelease pic.twitter.com/yZW5GGEmbT— MCX (@MCXIndialtd) October 31, 2024 -
డాలరు బలం: దిగొచ్చిన పసిడి, వెండి కూడా అదే బాటలో
Today Gold and Silver Prices: దేశీయ మార్కెట్లో వెండి బంగారం ధరలు మళ్లి దిగివస్తున్నాయి. గత కొన్ని సెషన్లుగా లాభ నష్టాల మధ్య బంగారం ధర బుధవారం మరింత పడింది. ద్రవ్యోల్బణం,పెరుగుతున్న వడ్డీ రేట్లు, డాలర్ బలం కారణంగా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి 280 రూపాయలు క్షీణించి రూ. 59,450 వద్ద ఉంది.అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 పతనమై 54,500వద్ద ఉంది. కిలో వెండి ధర 600 రూపాయలు తగ్గి 74, 200 గా ఉంది.హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి 59,450 గాను, 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి 54, 500 గాను ఉంది. అలాగే కిలో వెండి రూ. 77వేలు పలుకుతోంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.58,843 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో, ట్రాయ్ ఔన్స్కు 1,903.35 డాలర్లుగా ఉన్నాయి. వెండి కూడా 71,260 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ ఇండెక్స్లో బలం పుంజుకోవడంతో బంగారం ధరలు నిన్న ఏకంగా 1.59 శాతం నష్టపోయాయి.మరోవైపు గత రెండు సెషన్లుగా బలహీనంగా ఉన్న దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం పాజిటివ్గా ఉన్నాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా కొనుగోళ్లు పుంజుకోవడం లాభాల్లోకి మళ్లాయి. నిఫ్టీ 19700 పైకి, సెన్సెక్స్ 66వేల ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి కూడా స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. -
పండగ వేళ పసిడి పరుగు, వెండి ఎంత తగ్గిందంటే!
Today Gold and Silver Prices: దేశంలో బంగారం , వెండి ధరలు పైపైకే చూస్తున్నాయి. గతరెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర సోమవారం మరింత ఎగిసింది. అటు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పరుగాపక పయనిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పెరుగుతున్న చమురు, డాలరు బలం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) (సెప్టెంబర్ 18, సోమవారం నా డు )లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి.అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 105 పెరిగి 10 గ్రాములకు రూ.59,098గా ఉంది. అదేవిధంగా, డిసెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 307 లేదా 0.43 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 72,461 వద్ద ట్రేడవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర 140 రూపాయిలు పెరిగి, 10గ్రాములకు 55,050 గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పుంజుకుని 60.050పలుకుతోంది. అటు వెండి కిలో స్వల్పంగా 200 రూపాయిలు తగ్గి కిలో వెండి 74,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు వరస లాభాలకుచెక్ చెప్పిన దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాల్లోకి జారుకున్నాయి.మరోవైపు పెరుగుతున్న చమురు ధరల కారణంగా భారత కరెన్సీ రూపాయి డాలరు మారకంలో 83.22 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. -
షాకిస్తున్న బంగారం ధర: కొనగలమా? నవంబరు నాటికి..!
Today Gold and Silver prices రికార్డు స్థాయి నుంచి కిందికి దిగివచ్చినట్టే వచ్చిన పసిడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. రానున్న పండుగల సీజన్లో బంగారానికి డిమాండ్ పెరనున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలను పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో వెండి బంగారం మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. శనివారం నాడు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ. 55,000కి చేరుకున్నాయి .అలాగే భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 60వేల దిశగా కదులుతోంది.(జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) శనివారం నాడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగి రూ. 54,900 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 220పెరిగి రూ. 59,890 వద్ద ఉంది. అటే వెండి కూడా లాభాల్లోనే ఉంది. రూ. 700రూపాయలు ఎగిసి కిలోవెండి ధర రూ. 78,200 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం డిమాండ్ ఉండే బ్యాక్-టు-బ్యాక్ పండుగల నేపథ్యంలో సెప్టెంబరు- నవంబర్ త్రైమాసికంలో పసిడి మెరుస్తూనే ఉంటుందని,ఈ నవంబర్ 2023 చివరి నాటికి 62 వేలకు దాటవచ్చనేది అంచనా. యూఎస్ ఆర్థిక డేటా , డాలర్ , ముడి చమురు ధరలలో పెరుగుదలో అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఔన్సు 2,090డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,923 డాలర్ల వద్ద ముగిసింది. ఏది ఏమైనా బంగారం ధరలు యూఎస్ ఫెడ్ ధోరణి, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా కరెన్సీ డాలరు కదలికల ఆధారంగా మారుతూ ఉంటాయి అనేది గమనార్హం. (భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు) -
గోల్డ్ లవర్స్కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం
Today Gold and Silver Price పండుగల వేళ బంగారం ప్రియులకు తీపి కబురు. భారతీయ మార్కెట్లో రెండు రోజులు వరుసగా పెరిగిన వెండి బంగారం ధరలు (సెప్టెంబర్ 13, 2023 )బుధవారం దిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా వెండి బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి.22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.340 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.380లు తగ్గి 59,450 పలుకుతోంది. వెండి కిలో ఏకంగా వెయ్యి రూపాయిలు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 73,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పతనాన్ని నమోదు చేశాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 74 లేదా 0.13 శాతం స్వల్ప తగ్గుదల నమోదు చేసిన తర్వాత, 10 గ్రాములకు రూ. 58,592 వద్ద ఉంది. క్రితం ముగింపు రూ.58,626గా నమోదైంది. అదేవిధంగా డిసెంబర్ 5, 2023న వెండి ఫ్యూచర్స్ రూ. 385 లేదా 0.54 శాతం పతనాన్ని చవిచూశాయి .మునుపటి ముగింపు రూ. 71,934తో పోలిస్తే కిలోకు రూ. 71,750 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లో కూడా బుధవారం నాడు బంగారం ధరలు పడిపోయాయి. అయితే మునుపటి సెషన్లో రెండు వారాల కనిష్ట స్థాయికి స్వల్పంగా అధిగమించాయి. . అమెరికా మార్కెట్, ద్రవ్యోల్బణ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందా అనే కీలక అంశాలకోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ ఔన్స్కు 0.1 శాతం తగ్గి 1,910.87 డాలర్లు వద్ద ఉంది. ఆగస్టు 25 తరువాత నిన్న(మంగళవారం) 1,906.50 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్ ఔన్స్కు 0.8 శాతం తగ్గి 22.92 డాలర్ల స్థాయికి చేరుకుంది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు ప్రారంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్నాయి.సెన్సెక్స్ ఏకంగా 330 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 20090 వద్ద రికార్డు స్తాయిలో కొనసాగుతోంది. -
వామ్మో! హీటెక్కుతున్న బంగారం ధరలు
Today Gold and Silver prices: బంగారం, వెండి ధరలు మళ్లీ మండుతున్నాయి. ఆల్ టై హై నుంచి కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ, డాలర్ బలంతో మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు వేగం పుంజకున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.54,750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 270పెరిగి రూ. 59,670 పలుకుతోంది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలోకు రూ. 200 పెరిగిన వెండి ధర కిలోకు 77. 100గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. MCX మార్కెట్లో వరుసగా రెండో రోజు జంప్ ఆగస్టు 29, మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం , వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 90 లేదా 0.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.58,949గా ఉంది.అదేవిధంగా, సెప్టెంబరు 5, 2023న మెచ్యూరయ్యే వెండి ఫ్యూచర్లు కూడా రూ. 162 లేదా 0.22 శాతం పెరిగి కిలోకు రూ. 73,700 వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధర స్పాట్ గోల్డ్ ఔన్స్కు 0.3 శాతం పెరిగి 1,924.84కి చేరుకుంది, ఆగస్టు 10 నుండి అత్యధికం. అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,952.90 డాలర్ల వద్ద ఉన్నాయి. వెండి ఔన్స్కు 0.3 శాతం పెరిగి 24.32 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడ్ సెప్టెంబర్ పాలసీ నిర్ణయం, ఆగస్ట్ లేబర్ మార్కెట్ డేటా ఆధారంగా బంగారం ధరలు కదలాడుతాయని మార్కెట్వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయింది. సోమవారం నాటి ముగింపు 82.62 తో పోలిస్తే మంగళవారం 82.70 వద్ద ముగిసింది. -
గుడ్ న్యూస్: అమెరికా షాక్, దిగొస్తున్న పసిడి
Today Gold and silver Price: దేశంలో పసిడి ధరలు శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గురువారం రూ. 250 తగ్గిన పసిడి ఈ రోజు మరింత దిగి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 54,550 వద్ద ఉంది. గురువారం ఈ ధర రూ. 54,700గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.59, 510 గా ఉంది. దాదాపు ఉభయ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో విలువైన మెటల్ వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. స్వల్పంగా పడి కిలో వెండి ధర రూ.76200 వద్ద కొనసాగుతుంది. (లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?) అంతర్జాతీయంగానూ వెండి,బంగారం ధరలు వెనకడుగువస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో గురువారం పెరిగిన ధరలు నేడు దిగివ చ్చాయి. ఎంసీక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబర్ 5) చివరి లెక్కన 10 గ్రాములకు రూ. 58,810 వద్ద స్థిరంగా ఉంది. వెండి ఫ్యూచర్స్ (సెప్టెంబర్ 5) 0.12 శాతం లేదా రూ.86 తగ్గి కిలో రూ.69,895 వద్ద ఉంది.గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ను రూ. 59,200 స్టాప్ లాస్తో రూ. 59,950 వద్ద విక్రయించాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. అయితే జూలై డేటా ప్రకారం అమెరికా వినియోగదారుల ధరలు మధ్యస్తంగా ఉన్నాయి. గురువారం బంగారం ధరలు పెరిగాయి. అలాగే ఫెడ్ వడ్డీ వడ్డనలో కాస్త ఉపశమనం లభిస్తుందనే అంచనాలున్నాయి. సీపీఐ నెమ్మదిగా తగ్గుతూ ఉండటంతో, ముఖ్యంగా సెప్టెంబర్ రివ్యూలో వడ్డీ రేట్లను పెంపు ఉండకపోవచ్చని హై రిడ్జ్ ఫ్యూచర్స్ మెటల్స్ ట్రేడింగ్ డైరెక్టర్ డేవిడ్ మెగర్ అన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 312 కుప్పకూలి 65, 365 వద్ద ఉండగా,నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 19,444 వద్ద కొనసాగుతోంది. -
శ్రావణ శుక్రవారం వచ్చేస్తోంది: దిగొస్తున్న బంగారం, వెండి ధరలు
Today Gold and Silver Price: దేశంలో వెండి, బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్మార్కెట్ పసిడి ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు 100 రూపాయలకుతగ్గి, 54,950వద్ద ఉంది. తద్వారా 55వేల దిగువకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10గాముల బంగారం ధర 110రూపాయలు క్షీణించి 59,950 వద్ద ఉంది. వెండి ధర కూడా అదే బాటలోఉంది. కిలో వెండి ధర రూ.600 క్షీణించి రూ. 76,700 వద్ద ఉంది. (HBDMaheshBabu: మహేష్బాబు నెట్వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వరుసగా రెండు రోజులు భారతీయ మార్కెట్లో దిగువన ఉన్న ధరలు (ఆగస్టు 9 బుధవారం) బంగారం వెండి ధరలు రెండూ పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 82 పెరిగి 10 గ్రాములకు రూ.59,347గా ఉంది. అదేవిధంగా, సెప్టెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 309 లేదా 0.44 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 70,538 వద్ద ట్రేడవుతున్నాయి. (దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ యూఎస్ వృద్ధ రేటును డౌన్గ్రేడ్ గ్లోబల్గా బంగారం ధరలు మునుపటి సెషన్లోని నెల కనిష్టంనుంచి తిరిగి పుంజుకున్నాయి. తాజా మెటల్ నివేదిక ప్రకారం, స్పాట్ బంగారం 0345 GMT నాటికి ఔన్స్కు 0.3 శాతం పెరిగి 1,929.99 డాలర్ల వద్ద ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,963.80 డాలర్ల వద్ద ఉన్నాయి. -
దిగొస్తున్న పసిడి, వెండి భారీ పతనం
Gold Price Today 28th July అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేటుపెంపుతో శుక్రవారం బంగారం ధరలు దిగి వచ్చాయి. శ్రావణ శుక్రవారం సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగిరావడం శుభ సంకేతంగా మారింది. అటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. యూఎస్ ఫెడ్ రీసెంట్ రివ్యూలో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేపు పెంపుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు దూసుకు పోతోందన్న అందోళన మొదలైంది. దీంతో అమెరికా కరెన్సీ డాలరు నష్టాల్లోకి జారుకుంది. ఈ ప్రభావం అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరలపై చూపుతోంది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!) హైదరాబాదులో 22 క్యారట్ల బంగారం 10 గ్రాములకి 350 రూపాయలుదిగి వచ్చి ధర రూ. 55,100 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 380 పతనమై రూ. 60,110 గా ఉంది. వెండి ధర కూడా దిగి వచ్చి 80 వేల దిగువకు చేరింది. ఇటీవలి కాలంలో బాగా పెరుగుతూ వస్తున్న వెండి ధర శుక్రవారం ఏకంగా 2 వేల రూపాయలు పతనమైంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 79,500 గాఉంది. (హానర్ లవర్స్కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్ఫోన్తో రీఎంట్రీ!) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో పసిడి కొద్దిగా పుంజుకుంది. ఆగస్టు ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 59,565 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్లో సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కూడా రూ.128 లేదా 0.17శాతం పెరిగి కిలోకు రూ.73,875 వద్ద ట్రేడవుతున్నాయి. (ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) అంతర్జాతీయంగా బంగారం ధరలు వోలటైల్గా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ 0.3శాతం పెరిగి ఔన్స్కు 1,951.19 డాలర్లుగా ఉంది. అంతకుముందు జూలై 12న కనిష్ట స్థాయిని తాకింది. అలాగే మునుపటి సెషన్లో 1.4 శాతం క్షీణించింది. ఈ వారంలో ఇప్పటివరకు బులియన్ 0.4శాతం పతనాన్ని నమోదుచేసింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్కు 0.2 శాతం పెరిగి 1,950డాలర్ల వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాల్టి బంగారం ధరలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి! -
July 8th 2023: మూడు నెలల కనిష్టానికి బంగారం ధర,మరింత పెరగకముందే కొనేద్దామా?
రోజుకు రోజుకు దిగి వస్తున్న పసిడి ధరలు కొనుగోలు దారులను ఊరిస్తున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ పెంపు ఆందోళన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈప్రభావం బంగారం ధరలపై కూడా చూపిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో బంగారం ధరలు కూడా దిగి వస్తున్నప్పటికీ భారీ ఒడిదుడుకులు మధ్య కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే జూన్ నెలలో బంగారం ధరలు ఏకంగా 3.3 శాతం మేర తగ్గాయి. బంగారం ధరలు జూలై నెల తొలి వారాన్ని పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారంతో ముగిసిన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రా. రూ.392 ఎగిసింది. అయితే ఎంసీఎక్స్లో బంగారం ధర దాదాపు రూ. 58,350 వద్ద మూడు నెలల కనిష్టానికి చేరిన తర్వాత మాత్రమే ఈ ర్యాలీ వచ్చింది. ధరల తగ్గుదల ఆగి పోయిందని భావిస్తున్నప్పటికీ రానున్న కాలంలో ఏ మాత్రం తగ్గినా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా కొనుగోళ్లకు ఉపయోగించు కోవాలని సూచిస్తున్నారు. అమెరికా జాబ్ డేటా ,అమెరికా డాలర్పై కూడా ఒత్తిడి తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రూ.400పెరిగి రూ. 54550 వద్ద ఉంది. అటు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రా. రూ. 59510 వద్ద ఉంది. అలాగే వెండి ధర కిలో వెయ్యి రూపాయలు ఎగిసి హైదరాబాద్లో రూ. 76700 పలుకుతోంది. -
Gold rate 3 April 2023: తగ్గిన పసిడి ధర,గుడ్ న్యూసేనా?
సాక్షి,ముంబై: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం బంగారం ధరలుభారీగా తగ్గాయి. రూ. 500కుపైగా క్షీణించి 10 గ్రాములకు రూ. 59,251స్థాయికి చేరింది. శుక్రవారం 10 గ్రాములు రూ. 59,751గా ఉంది. వెండి ధర కూడా కిలోకి రూ.409 తగ్గి రూ.71,173కి పడిపోయింది. (ఇదీ చదవండి: NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?) హైదరాబాద్మార్కెట్లో రూ. 300 క్షీణించి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59670, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.54700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి కూడా 500 తగ్గి 74000గా ఉంది. (NMACC: డాన్స్తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్కైతే) ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్సైట్ ప్రకారం, సోమవారం (ఏప్రిల్ 3, 2023) పది గ్రాములకు రూ. 59251 వద్ద ట్రేడవుతోంది. అలాగే శుక్రవారం రూ.1582 పెరిగిన కిలో వెండి ధర రూ.71173 వద్ద ట్రేడవుతోంది. (మెక్ డోనాల్డ్స్ అన్ని ఆఫీసులు మూత, ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం!) అటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో కూడా బంగారం వెండి ధరలు బలహీనంగా ఉన్నాయి. ఏప్రిల్ 2023 ఫ్యూచర్స్ రూ. 342.00 పతనంతో రూ. 59,060.00 వద్ద, మే 5, 2023న వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ రూ. 604.00 పతనంతో రూ.71,614.00 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 4.33 డాలర్ల లాభంతో 1,953.72 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్స్కు 0.21 డాలర్లు తగ్గి 23.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారంలో తగ్గిన ఆదాయాలు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2022 లో బంగారం ఇన్వెస్టర్లకు రాబడులను ఇవ్వ లేకపోయింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం తదితర అనిశ్చితులు బంగారం ధరలకు కీలకంగా మారాయి. ఈ ఏడాది డిసెంబర్ 22 వరకు నికరంగా బంగారం ధరలు 2 శాతం క్షీణించాయి. డాలర్తో రూపాయి సుమారు 11.5 శాతం క్షీణించడం వల్ల ఎంసీఎక్స్ గోల్డ్ ధరలు 13 శాతం పెరిగాయి. ఒక సాధనంగా బంగారంపై ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయని బంగారం ధరల్లో అస్థిరతలు తెలియజేస్తున్నాయి. ఈ అస్థిరతలకు దారితీసిన వివిద అంశాలు ఏంటి? 2023లో బంగారంలో పెట్టుబుడులు పెట్టే ఇన్వెస్టర్లకు రాబడుల అంచనాలను పరిశీలిస్తే.. ద్రవ్య విధాన కఠినతరం ప్రతికూలం యూఎస్ ఫెడ్ 2022లో ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం మరింత సంక్లిష్టంగా మారింది. డాలర్ పరంగా బంగారం పనితీరు తగ్గడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకు దవ్య్ర పరపతి విధానాన్ని కఠినతరం చేయమే. అలాగే, బంగారం డిమాండ్ను ఆభరణాల డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనుగోలు డిమాండ్, గోల్డ్ ఈటీఎఫ్ లు, బంగారం బార్లు, నాణేలు నిర్ణయిస్తుంటాయి. నిల్వలు పెంచుకోవడం.. సెంట్రల్ బ్యాంకులు ఏటా తమ బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి. 2022 కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2022 మూడో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు 400 టన్నుల వరకు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా డేటా పేర్కొంది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ సెంట్రల్ బ్యాంకులు నికరంగా కొనుగోళ్లు చేశాయి. దీంతో ఈ ఏడాది నవంబర్ 1 నాటికి 673 టన్నుల కొనుగోలుకు దారితీసింది. 1967 తర్వాత మరే సంవత్సంతో పోల్చినా ఈ ఏడాదే అత్యధిక కొనుగోళ్లు జరిగాయి. ఇక గోల్డ్ ఈటీఎఫ్లు 2022 నవంబర్లో వరుసగా ఏడో నెల నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి నికరంగా గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి 83 టన్నులకు సమానమైన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. కాయిన్లు, ఆభరణాల డిమాండ్ కరోనా సమయంలో నిలిచిపోయిన డిమాండ్ కూడా డోడు కావడంతో, మొదటి మూడు నెలల కాలంలో బంగారం బార్లు, కాయిన్లు, ఆభరణాల స్థిరమైన కొనుగోళ్లకు దారితీసింది. ఒకవైపు ఈ కొనుగోళ్లు, మరోవైపు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావాన్ని కొంత భర్తీ చేసింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా నెలక్నొ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలకు సరైన ప్రోత్సాహం లేదు. 2023పై అంచనాలు అధిక వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్బణం, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రష్యా, చైనాల్లో తిరోగమన పరిస్థితుల వల్ల అంతర్జాతీయ ఉత్పత్తి తగ్గింది. ఐరోపాలో క్షీణిస్తున్న వృద్ధి నేపథ్యంలో మాంద్యంపై చర్చకు దారితీసింది. చైనా వృద్ధి రేటు 4.4 శాతంగా ఉంటుందన్న జూన్ అంచనాలను ప్రపంచబ్యాంకు 2.7 శాతానికి తగ్గించేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో తగ్గడం అన్నది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోనూ క్షీణతకు కారణమవుతుంది. డాలర్కు, కమోడిటీల మధ్య విలోమ సహ సంబంధం ఉంటుంది. రెండేళ్ల పాటు వరుసగా పెరిగిన డాలర్ ఇండెక్స్ ఇటీవల కొంత వరకు తగ్గింది. 2023లోనూ డాలర్ క్షీణత కొనసాగితే.. సహ విలోమ సంబంధం వల్ల బంగారం, వెండి లాభపడనున్నాయి. మరోవైపు మాంద్యం సమయాల్లో సహజంగా బంగారం మంచి పనితీరు రూపంలో రక్షణనిస్తుంది. గత ఏడు మాంద్యం సమయాల్లో ఐదు సందర్భాల్లో బంగారం సానుకూల రాబడులను ఇచ్చింది. కనుక 2023లో బంగారం రెండంకెల రాబడులను ఇస్తుందని అంచనా వేస్తున్నాం. బంగారం ధరలు 10 గ్రాములు రూ.58,000 వరకు పెరగొచ్చు. రూ.48,000–50,000 మధ్య కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతి పతనంలోనూ బంగారాన్ని సమకూర్చుకోవచ్చన్నది మా సూచన. ప్రథమేష్ మాల్య, ఏవీపీ – రీసెర్చ్, ఏంజెల్ వన్ లిమిటెడ్ -
కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి!
సాక్షి,ముంబై: బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ధరలు దూసు కెడుతున్నాయి. ఇటీవల కాస్త స్తబ్దుగా ఉన్న పసిడి ధర భారీగా పెరిగింది. అటు వెండి ధర గణనీయంగా పుంజుకుంది. తాజాగా గ్రాము బంగారం రూ.54 వేల మార్క్ను దాటేసింది. దీంతో త్వరలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకునే సూచనలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మరో విలువైన మెటల్ వెండి కూడా ఇదే బాటలో ఉంది. వెయ్యిరూపాయలకు పైగా జంప్ చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర 350 రూపాయలకు పైగా పెరిగింది. ఎంసీఎక్స్ ఫిబ్రవరి కాంట్రాక్ట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.362 లేదా 0.67 శాతం పెరిగి రూ. 54212కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో కిలో వెండి ధర రూ.850-900 పెరిగింది. ఫిబ్రవరి డెలివరీ వెండి ధర ప్రస్తుతం రూ.851 లేదా 1.28 శాతం పెరిగి కిలో రూ.67300కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక డిమాండ్ పెరగడం ఈ గణనీయమైన పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత ఆరు నెలల్లో ఎంసీఎక్స్ బంగారం ధర రూ.54,000కి చేరడం ఇదే తొలిసారి. (StockMarketUpdate: కోలుకున్న మార్కెట్లు, కుప్పకూలిన రూపాయి) దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.227 పెరిగి రూ.54,386కి చేరుకుంది. వెండి కూడా కిలోకు రూ.1,166 పెరిగి రూ.67,270కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో సానుకూల సంకేతాల మధ్య డిసెంబర్ 5 సోమవారం ముంబై స్పాట్ మార్కెట్లోరం 999 స్వచ్ఛత బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ.53,972గా ఉంది, శుక్రవారం ముగింపు ధర రూ.53,656 నుంచి రూ.316 పెరిగింది. అలాగే 999 స్వచ్ఛత వెండి కిలో రూ. 65,891గా ఉంది. (ఈ స్కీంలో నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు) ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 11.15 డాలర్లు లేదా 0.62 శాతం పెరిగి 1,820.75 డాలర్ల వద్ద, వెండి ఔన్స్కు 0.245 డాలర్లు లేదా 1.01 శాతం బలంతో 23.485 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో ట్రెండ్ బుల్లిష్గా ఉందని బులియన్ వర్తకులు చెబుతున్నారు. డాలర్ బలహీనత కారణంగా, చమురు ధరల సెగ కారణంగా బంగారం ధరలు పెరిగాయని ఎనలిస్టుల అంచనా. (అందాల ఐశ్వర్యమా, కింగ్ లాంటి కుర్రాడా? ఎవరు కావాలి?) -
షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం ధరలు..వెండి వెయ్యికి పైగా..!
అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, సిల్వర్ ధరలు సోమవారం రోజున భారీగా పెరిగాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్యవిధానాలను కఠినతరం చేసే అవకాశాలు, రష్యా-ఉక్రెయిన్ వార్, ప్రపంచ ద్రవ్యోల్భణ ప్రభావంతో గోల్డ్, సిల్వర్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక సిల్వర్ ఒకరోజులోనే రూ. 1000కిపైగా పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .53, 148 వద్ద ట్రేడవుతోంది. ఇక సీల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్సీఎక్స్లో రూ.69, 976వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. హైదరాబాద్లో సోమవారం 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.320కి పైగా పెరిగి రూ. 54,380కి చేరుకుంది. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి, రూ.49,850కి పెరిగింది. సిల్వర్ ధరలు సోమవారం ఏకంగా రూ. 1000పైగా పెరిగి కిలో సిల్వర్ ధర రూ. 75,200కు చేరుకుంది. మంగళవారం సిల్వర్ ధరలు కాస్త తగ్గాయి. కేజీ సిల్వర్ ధర రూ. 300 తగ్గి రూ. 74,900 వద్ద ఉంది. చదవండి: ఆరు వారాల్లో అతిపెద్ద నష్టం -
బంగారం కొనేవారికి షాకింగ్ న్యూస్..! రెండు రోజుల్లో ఏకంగా...
మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా వున్నాయి. కాగా రెండు రోజుల వ్యవధిలో నే బంగారం ధరలు సుమారు రూ. 500 వరకు పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో అంతర్జాతియంగా గోల్డ్ ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్సీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .52,860 వద్ద ట్రేడవుతోంది. కాగా నేడు 10 గ్రాముల బంగారం ధర రూ. 18 తగ్గడం విశేషం. ఇక సీల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్సీఎక్స్లో కిలోకు రూ.147 పెరిగి రూ.68,937 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.440కి పైగా పెరిగి ₹53,460కి చేరుకుంది. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010కి పెరిగింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 గా వుంది.. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.53,020 నుంచి రూ.53,460కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. -
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!
బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో గోల్డ్ ధర 0.05 శాతం పెరిగి ₹51,840 వద్ద ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం రోజు రోజుకి మరింత తీవ్రతరం కావడంతో ఆ ప్రభావం ఇప్పుడు పెట్రోల్, బంగారం ధరల మీద భారీగా పడింది. దీంతో, అంతర్జాతీయంతో పాటు దేశీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ క్షీణించడం కూడా పుత్తడి ధరలు పెరిగడానికి ఒక కారణం అని నిపుణులు భావిస్తున్నారు. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛతతో కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.600కి పైగా పెరిగి ₹51,567కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600కి పైగా పెరిగి ₹47,235కు చేరుకుంది. అలాగే, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46700 నుంచి రూ.47,700కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.1000 పెరిగింది అన్నమాట. #Gold and #Silver Opening #Rates for 02/03/2022#IBJA pic.twitter.com/gFFu4Yu0wP — IBJA (@IBJA1919) March 2, 2022 ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.1090 పెరిగి రూ.52,040కి చేరుకుంది. అలాగే, ఇక పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1700కి పైగా పెరిగి రూ.₹67,030కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: యూజర్ల మతిపోగొడుతున్న జీప్ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు..!) -
బంగారంలోనూ భారీగా తగ్గిన లావాదేవీలు
ముంబై: కొద్ది నెలలుగా బుల్ ధోరణిలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్ల కారణంగా కమోడిటీలలో ట్రేడింగ్ క్షీణిస్తూ వస్తోంది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజీ(ఎంసీఎక్స్)లో లావాదేవీల పరిమాణం నీరసిస్తోంది. ఎంసీఎక్స్లో ప్రధానమైన పసిడిలో లావాదేవీలు కొన్నేళ్ల కనిష్టానికి చేరాయి. వెరసి కమోడిటీ ఎక్ఛేంజీలో నిరుత్సాహకర పరిస్థితులు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇతర విభాగాలలోనూ ట్రేడింగ్ తగ్గుతూ వచ్చినట్లు తెలియజేశారు. 2011 గరిష్టంతో పోలిస్తే పరిమాణం తగినంతగా పుంజుకోలేదని వివరించారు. ఇదీ తీరు 2011లో రోజువారీగా ఎంసీఎక్స్లో సగటున రూ. 48,326 కోట్ల టర్నోవర్ నమోదైంది. ప్రస్తుతం రూ. 28,972 కోట్లకు పరిమితమవుతోంది. ఇది 40 శాతం క్షీణతకాగా.. పసిడి ఫ్యూచర్స్లో లావాదేవీలు మరింత అధికంగా 54 శాతం పతనమయ్యాయి. రోజువారీ సగటు టర్నోవర్ రూ. 5,723 కోట్లకు చేరింది. 2011లో రూ. 12,436 కోట్లు చొప్పున రోజువారీ సగటు టర్నోవర్ నమోదైంది. చమురు డీలా ఎంసీఎక్స్లో మరో ప్రధాన విభాగమైన చమురులో ట్రేడింగ్ సైతం ఇటీవల వెనుకంజ వేస్తోంది. చమురు ఫ్యూచర్స్లో రోజువారీ సగటు టర్నోవర్ 2012లో రూ. 9,421 కోట్లను తాకింది. మొత్తం ఎఫ్అండ్వోను పరిగణిస్తే రూ. 9,963 కోట్లుగా నమోదైంది. అయితే 2021లో రూ. 5,280 కోట్లకు ఈ పరిమాణం పడిపోయింది. 2014 నుంచీ ఎంసీఎక్స్లో ట్రేడింగ్కు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు), ఈటీఎఫ్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు)ను అనుమతించినప్పటికీ లావాదేవీలు పుంజుకోకపోవడం గమనార్హం! చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!! స్టాక్ ఎక్ఛేంజీల స్పీడ్ దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ట్రేడర్లను భారీగా ఆకట్టుకోవడంతో ఎంసీఎక్స్ వెనుకబడుతూ వచ్చింది. ప్రస్తుతం బీఎస్ఈలో 7.8 కోట్ల మంది, ఎన్ఎస్ఈలో 4.5 కోట్లమంది ప్రత్యేకతరహా రిజస్టర్డ్ క్లయింట్లు(యూసీలు) నమోదై ఉన్నారు. 2003 నుంచి బులియన్, చమురు ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో పోటీయేలేని ఎంసీఎక్స్ 2021 జులైకల్లా 69.86 లక్షల మంది యూసీలను మాత్రమే కలిగి ఉంది. అయితే ఇదే కాలంలో ఎంసీఎక్స్ షేరు మాత్రం 2013 ఆగస్ట్లో నమోదైన రూ. 290 నుంచి 2020 అక్టోబర్కల్లా రూ. 1,875కు చేరింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 7,482 కోట్లను తాకింది. ప్రధానంగా సుప్రసిద్ధ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా ఎంసీఎక్స్లో 5 శాతం వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో షేరు ర్యాలీ చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కోటక్ వాటా 15శాతం.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం కోటక్ గ్రూప్ 15 శాతం వాటాను కలిగి ఉంది. 2021 మార్చికల్లా రూ. 685 కోట్ల నగదు నిల్వలను కలిగి ఉంది. ఇటీవల సాంకేతిక సేవల కోసం టీసీఎస్ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో ఎంసీఎక్స్ ట్రేడింగ్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తోంది. కొంతకాలంగా పసిడిలో స్పాట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్కు వీలైన టెక్నాలజీని సొంతం చేసుకోవడంలో ఎంసీఎక్స్ సమస్యలు ఎదుర్కొంటోంది. కాగా.. ఎక్సే్ఛంజీలలో 100 శాతం యాజమాన్యవాటాకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించనుందన్న వార్తలతో ఎంసీఎక్స్ షేరుకి మరింత బూస్ట్ లభించే అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
పెరుగుతున్న బంగారం ధర
ముంబై: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం కొంతమేరకు ధరలు తగ్గగా.. ఈ సోమవారం (జూలై 26, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్కి సంబంధించి ప్రారంభ సెషన్లో రూ.94.00 పెరిగి రూ.47628.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.118.00 పెరిగి రూ.47902.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం రూ.48,000 పైకి చేరుకున్న పుత్తడి చివరి సెషన్లలో కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక వెండికి సంబంధించి సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.189.00 పెరిగి రూ.67213.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.205.00 పెరిగి రూ.68380.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత క్షీణించాయి. డెల్టా వేరియంట్ భయాలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లు సేఫ్గా భావించడంతో ఆ ప్రభావం ధరలపై కనిపించింది. -
Gold Prices: మళ్లీ పెరుగుతున్న ధరలు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో పుత్తడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. శుక్రవారం అంతర్జాతీయంగా యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి బంగారం ధరలు ఔన్స్ ధర 1,902.90 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 5 డెలివరీ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో బంగారు ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 49,346 రూపాలు పలుకుతోంది. డాలరు బలహీనం, బ్లాండ దిగుమతి పుత్తడి ధరలను ఊతమిస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనాల మధ్య ఫెడరల్ రిజర్వ్ సరళ ద్రవ్య విధానం సరిపోదని విశ్లషకులు భావిస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) అధికారిక ట్విటర్ సమాచారం ప్రకారం స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 48,750 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి పది గ్రాములకు రూ. 47,090, 18 క్యారెట్ల బంగారం రూ. 39,000 గాను ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 300 రూపాయలు ఎగిసిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 50,500 వద్ద, 22 క్యారెట్ల బంగారం 10 గ్రా ధర రూ.46,100గా ఉంది. 1000 రూపాయలు పెరిగిన కిలో వెండి ధర రాజధాని నగరంలో వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 71224 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో ఏకంగా 1000 రూపాయలు ఎగిసింది. కిలో వెండి రూ. 77100 గా ఉంది. కాగా గత వారం 10 గ్రాముల బంగారం ధర 49,700 రూపాయల వద్ద ఐదు నెలల గరిష్ట స్థాయిని తాకిన తరువాత బంగారం ధరలు దిగొచ్చాయి. వరుసగా సెషన్లలో క్షీణించి రికార్డు స్థాయి నుంచి సుమారు 7వేల రూపాయలు మేర పడిపోయింది. అయితే 49500 స్థాయిల వద్ద రెసిస్టెన్స్ ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంచనాలకు అనుగుణంగానే పసిడి ధర మళ్లీ పుంజుకుంటోంది. చదవండి: Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ! stockmarkets: రికార్డుల మోత -
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. అటు స్పాట్, ఇటు ఫ్యూచర్స్ మార్కెట్లో వరుసగా ఆరో రోజు క్షీణించాయి. ఈ బాటలో విదేశీ మార్కెట్లోనూ వెనకడుగులో కదులుతున్నాయి. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో బంగారం(24 క్యారట్స్) 10 గ్రాములు తాజాగా రూ. 239 నష్టపోయి రూ. 45,568కు చేరింది. ఎంసీఎక్స్లోనూ రాత్రి 8 గంటల ప్రాంతంలో రూ. 98 నీరసించి రూ. 46,028 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 45,861 వరకూ క్షీణించింది. ఇది 8 నెలల కనిష్టంకావడం గమనార్హం! ఇక న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) 0.2 శాతం తక్కువగా 1,772 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి ఏప్రిల్ ఫ్యూచర్స్కాగా.. స్పాట్ మార్కెట్లో 1,773 డాలర్ల వద్ద కదులుతోంది. ఇవి మూడు నెలల కనిష్టం! దశాబ్ద కాలంలోనే అత్యధిక రాబడి... కొత్త ఏడాది(2021)లో బంగారం ధరలు వెనకడుగు వేస్తున్నప్పటికీ గత కేలండర్ ఏడాది(2020)లో 25 శాతంపైగా జంప్చేశాయి. ప్రపంచదేశాలను వణికించిన కోవిడ్–19 నేపథ్యంలో గతేడాది పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో లిక్విడిటీ పెరిగి పసిడిలోకి పెట్టుబడులు మళ్లినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్యం బారినపడటం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెప్పారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా భావించే సంగతి తెలిసిందే. దీంతో పసిడిలో పెట్టుబడులకు వివిధ దేశాల కేంద్ర బ్యాం కులతోపాటు.. ఈటీఎఫ్ సంస్థలు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం జోరుకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా 2020లో దశాబ్ద కాలంలోనే అత్యధికంగా రాబడి ఇచ్చినట్లు తెలిపారు. గరిష్టం నుంచి రూ. 10,000 పతనం గత ఆగస్ట్లో 10 గ్రాముల పసిడి ఎంసీఎక్స్లో రూ. 56,200ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. తదుపరి ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగింది. అయితే ఇటీవల అమ్మకాలు పెరగడంతో డీలా పడుతూ వచ్చింది. దీంతో 2021లో ఇప్పటివరకూ 8 శాతం లేదా రూ. 4,000 క్షీణించింది. వెరసి రికార్డ్ గరిష్టం నుంచి చూస్తే ఆరు నెలల్లో 18 శాతం(రూ. 10,000) కోల్పోయింది. ఇక విదేశీ మార్కెట్లోనూ ఆగస్ట్ 7న ఔన్స్ 2072 డాలర్లను అధిగమించింది. ఆర్థిక వ్యవస్థకు దన్నునిచ్చే బాటలో యూఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లకుపైగా ప్యాకేజీకి సన్నాహాలు చేస్తుండటం పసిడి ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు మిల్వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక సీఈవో నిష్ భట్ అభిప్రాయపడ్డారు. ఈల్డ్స్ పుంజుకుంటే పసిడిని హోల్డ్ చేసే వ్యయాలు పెరుగుతాయని, దీంతో ట్రేడర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. ఆర్థిక రికవరీ సంకేతాలు... ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం అంటే యూఎస్ ఆర్థిక రికవరీకి సంకేతంగా భావిస్తామని భట్ పేర్కొన్నారు. సాంకేతికంగా చూస్తే రూ. 46,000 ధర.. ఫిబోనకీ రీట్రేస్మెంట్ ప్రకారం 50 శాతానికి దగ్గరగా ఉన్నట్లు క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ నిపుణులు క్షితిజి పురోహిత్ పేర్కొన్నారు. రోజువారీ చార్టుల ప్రకారం చూస్తే 200 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే దిగువన కదులుతున్నట్లు వివరించారు. రూ. 46,000 స్థాయిలో పసిడిలో కొనుగోళ్లకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే వీలున్నట్లు అంచనా వేశారు. స్వల్పకాలిక ట్రెండ్ బలహీనంగా ఉన్నప్పటికీ రూ. 44,500 వద్ద పటిష్ట మద్దతు లభించగలదని అంచనా వేశారు. సహాయక ప్యాకేజీ కారణంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టవచ్చన్న అంచనాలు పెరిగినట్లు కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే ఇటీవల పసిడి క్షీణత నేపథ్యంలో మరింత పతనంకావచ్చన్న అంచనాలు సరికాదని అభిప్రాయపడింది. వెరసి ఫ్రెష్ షార్ట్సెల్లింగ్ను చేపట్టకపోవడం మేలని ట్రేడర్లకు సూచించింది. ఇవీ కారణాలు.. ► పసిడి వెనకడుగుకు పలు కారణాలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ధరలు బలహీనపడటంతో ఈల్డ్స్ పుంజుకుంటున్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతుండటం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలియజేశారు. ► యూఎస్ కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ భారీ ఉపశమన ప్యాకేజీకి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. జీడీపీ రికవరీ సాధిస్తే అధిక రిస్క్– అధిక రిటర్నుల సాధనాలకు పెట్టుబడులు మళ్లుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారంకంటే ఈక్విటీలు తదితరాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు. ► ఇటీవల కోవిడ్–19 కట్టడికి గ్లోబల్ ఫార్మా కంపెనీలు పలు దేశాలలో వ్యాక్సిన్లను విడుదల చేయడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో పసిడిలో సెంటిమెంటు బలహీనపడిందని విశ్లేషకులు తెలియజేశారు. ► దేశీయంగా చూస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 2.5% తగ్గించడం కూడా దీనికి జత కలసింది. వెరసి తాజాగా పసిడి ధరలు సాంకేతికంగా కీలకమైన రూ. 46,000 మార్క్ దిగువకు చేరినట్లు పేర్కొన్నారు. -
కుప్పకూలిన పసిడి- వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: డెమొక్రటిక్ నేత జో బైడెన్ యూఎస్ కొత్త ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. ఇందుకు ప్రధానంగా 10ఏళ్ల కాలపరిమితిగల అమెరికన్ ట్రెజరీ ఈల్డ్స్ 1 శాతానికిపైగా పుంజుకోవడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 90 ఎగువకు బలపడటం వంటి అంశాలు కారణమైనట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి వారాంతాన దేశ, విదేశీ మార్కెట్లో పల్లాడియంసహా విలువైన లోహాల ధరలు ఉన్నట్టుండి పతనమయ్యాయి. దేశీయంగా ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి రూ. 2,000(4 శాతం) క్షీణించగా.. వెండి కేజీ మరింత అధికంగా రూ. 6,000(9 శాతం)కుపైగా పడిపోయింది. ఇక న్యూయార్క్ కామెక్స్లోనూ ఔన్స్ పసిడి 78 డాలర్లు కోల్పోయింది. వెండి అయితే ఏకంగా 10 శాతం కుప్పకూలింది. ఔన్స్ 25 డాలర్ల దిగువకు చేరింది. వివరాలు చూద్దాం.. (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? ) వ్యాక్సిన్ల ఎఫెక్ట్ అమెరికా, బ్రిటన్సహా పలు దేశాలు కోవిడ్-19 కట్టడికి వీలుగా వ్యాక్సిన్ల వినియోగాన్ని ప్రారంభించాయి. ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు అత్యవసర ప్రాతిపదికన గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడనున్న అంచనాలు బలపడుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు మార్చి తదుపరి ట్రెజరీ ఈల్డ్స్ గరిష్టానికి చేరడంతో పసిడిని హోల్డ్ చేసే వ్యయాలు పెరగనున్నట్లు తెలియజేశారు. మరోవైపు 8 నెలల తరువాత డిసెంబర్లో వ్యవసాయేతర రంగంలో నిరుద్యోగిత పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఫలితంగా కొత్త ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీలకు ఆమోదముద్ర వేయనున్న అంచనాలు బలపడ్డాయి. కాగా.. సాంకేతిక విశ్లేషణ ప్రకారం సమీప కాలంలో ఔన్స్ పసిడి 1705 డాలర్ల వరకూ వెనకడుగు వేయవచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే 1780-1767 డాలర్ల స్థాయిలో సపోర్ట్స్ లభించవచ్చని అభిప్రాయపడ్డాయి. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్ ) పతన బాటలో ఎంసీఎక్స్లో వారాంతాన 10 గ్రాముల బంగారం రూ. 2,086 క్షీణించి రూ. 48,818 వద్ద ముగిసింది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ప్రారంభంలో రూ. 50,799 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 48,818 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 6,112 దిగజారి రూ. 63,850 వద్ద నిలిచింది. రూ. 69,825 వద్ద హుషారుగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 63,719 వరకూ తిరోగమించింది. (బంగారు హెడ్ఫోన్స్ @ రూ. 80 లక్షలు) కుప్పకూలాయ్ న్యూయార్క్ కామెక్స్లో శుక్రవారం పసిడి ఔన్స్ 4.1 శాతం పతనమై 1,835 డాలర్ల వద్ద స్థిరపడింది. స్పాట్ మార్కెట్లోనూ 3.5 శాతం నష్టంతో 1,849 డాలర్ల వద్ద నిలిచింది. వెండి మరింత అధికంగా ఔన్స్ దాదాపు 10 శాతం పడిపోయి 24.64 డాలర్ల వద్ద ముగిసింది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్
న్యూయార్క్/ ముంబై: కరోనా కొత్త స్ట్ర్రెయిన్ కారణంగా మరోసారి బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. దేశీయంగా ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి రూ. 51,610కు చేరగా.. వెండి కేజీ రూ. 70,640 వద్ద ట్రేడవుతోంది. ఇక న్యూయార్క్ కామెక్స్లోనూ సోమవారం భారీగా బలపడటం ద్వారా పసిడి ఔన్స్ 1950 డాలర్లకు చేరగా.. వెండి 27.6 డాలర్లను తాకింది. వెరసి పసిడి ధరలు 8 వారాల గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం నవంబర్ 9న మాత్రమే పసిడి ఈ స్థాయిలో ట్రేడయినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. బ్రిటన్లో కఠిన లాక్డవున్ ఆంక్షలకు తెరతీయగా.. టోక్యోసహా పలు ప్రాంతాలలో జపాన్ ఎమర్జెన్సీ విధించనున్న వార్తలు పసిడికి డిమాండ్ను పెంచినట్లు తెలియజేశాయి. (స్ట్ర్రెయిన్ ఎఫెక్ట్- పసిడి, వెండి హైజంప్) గత వారం అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు మెరుస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ రూపు మార్చుకుని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మళ్లీ సంక్షోభ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు నిపుణులు వివరించారు. హుషారుగా.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 186 బలపడి రూ. 51,610 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 51,333 వద్ద కనిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 51,649 వద్ద గరిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 604 జంప్చేసి రూ. 70,640 వద్ద కదులుతోంది. రూ. 70,060 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 70,695 వరకూ దూసుకెళ్లింది. లాభాలతో.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.2 శాతం పెరిగి 1,950 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.15 శాతం బలపడి 1,945 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1 శాతం పుంజుకుని 27.61 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
స్ట్ర్రెయిన్ ఎఫెక్ట్- పసిడి, వెండి హైజంప్
న్యూయార్క్/ ముంబై: కరోనా కొత్త స్ట్ర్రెయిన్ కారణంగా బ్రిటన్లో ఓవైపు కఠిన లాక్డవున్ ఆంక్షలను అమలు చేస్తుంటే.. మరోపక్క టోక్యోసహా పలు ప్రాంతాలలో జపాన్ సైతం ఎమర్జెన్సీ విధించనున్న వార్తలు పసిడికి ఒక్కసారిగా డిమాండ్ను పెంచాయి. దీంతో న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్ పసిడి 1.6 శాతం పుంజుకుని 1926 డాలర్లకు ఎగసింది. ఇది 8 వారాల గరిష్టంకాగా.. ఈ బాటలో దేశీయంగా ఎంసీఎక్స్లోనూ రూ.565 బలపడింది. విదేశీ మార్కెట్లో వెండి మరింత అధికంగా 3 శాతం జంప్చేయగా.. దేశీయంగానూ రూ. 1,400 పెరిగింది. గత వారం అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు మెరుస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ రూపు మార్చుకుని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మళ్లీ సంక్షోభ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు బులియన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా.. న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్ పసిడికి నేటి ట్రేడింగ్లో 1914-1928 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్మార్ట్ డైరెక్టర్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇదేవిధంగా 1884-1870 డాలర్ల వద్ద సపోర్ట్స్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. చదవండి: (9వ రోజూ జోరు- సెన్సెక్స్@ 48,000) లాభాలతో ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 565 బలపడి రూ. 50,809 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,300 వద్ద హుషారుగా ప్రారంభమైన పసిడి తదుపరి 50,892వద్ద గరిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 1,394 జంప్చేసి రూ. 69,517 వద్ద కదులుతోంది. రూ. 68,499 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 70,259 వరకూ దూసుకెళ్లింది. (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్) హుషారుగా న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 31 డాలర్లు(1.35 శాతం) పెరిగి 1,926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1.3 శాతం బలపడి 1,923 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 3.1 శాతం జంప్చేసి 27.22 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
మెరుస్తున్న పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: కొత్త కరోనా స్ట్రెయిన్కుతోడు అమెరికా ప్రభుత్వ భారీ ప్యాకేజీ నేపథ్యంలో పసిడి, వెండి ధరలు మెరుస్తున్నాయి. అయితే కోవిడ్-19 కట్టడికి అమెరికా, యూకేసహా పలు దేశాలు అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతిస్తుండటంతో కొంత ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడటం కూడా పసిడి ధరలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్ పసిడికి నేటి ట్రేడింగ్లో 1896-1910 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్మార్ట్ డైరెక్టర్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇదేవిధంగా 1870-1855 డాలర్ల వద్ద సపోర్ట్స్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. నేటి ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) లాభాలతో ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.82 బలపడి రూ. 50,121 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,179 వద్ద ప్రారంభమైన పసిడి తదుపరి 50,106 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 670 జంప్చేసి రూ. 68,767 వద్ద కదులుతోంది. రూ. 69,000 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 68,500 వరకూ బలహీనపడింది. హుషారుగా న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.35 శాతం పుంజుకుని 1,889 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం బలపడి 1,885 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1.5 శాతం జంప్చేసి 26.59 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. మంగళవారం న్యూయార్క్ కామెక్స్లో పసిడి 1883 డాలర్ల వద్ద నిలవగా.. వెండి 26.22 డాలర్ల వద్ద ముగిసింది. -
పసిడి, వెండి- యూఎస్ ప్యాకేజీ జోష్
న్యూయార్క్/ ముంబై: కొత్త ఏడాదిలో పదవి నుంచి తప్పుకోనున్న అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ యూటర్న్ తీసుకుంటూ 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో పసిడి, వెండి ధరలు జోరందుకున్నాయి. నిరుద్యోగులకు తొలుత ప్రతిపాదించిన 600 డాలర్లను 2,000కు పెంచుతూ గత వారం యూఎస్ కాంగ్రెస్ ప్యాకేజీని ఆమోదించినప్పటికీ ట్రంప్ వ్యతిరేకించారు. అయితే ఉన్నట్టుండి ఆదివారం సహాయక ప్యాకేజీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ భారీ ప్యాకేజీలో 1.4 ట్రిలియన్ డాలర్లు ప్రభుత్వ ఏజెన్సీలకు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ మార్కెట్లో పసిడి, వెండి ధరలు బలపడ్డాయి. న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్ పసిడి 1900 డాలర్లకు చేరగా.. దేశీయంగా ఎంసీఎక్స్లో వెండి కేజీ రూ. 2,000కుపైగా జంప్చేసింది. ఇతర వివరాలు చూద్దాం.. (ఐపీవో బాటలో- ఫ్లిప్కార్ట్ బోర్డు రీజిగ్) లాభాలతో ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 495 ఎగసి రూ. 50,568 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,200 వద్ద ప్రారంభమైన పసిడి తదుపరి 50,577 వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 2,159 జంప్చేసి రూ. 69,668 వద్ద కదులుతోంది. రూ. 69,000 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 69,800 వరకూ దూసుకెళ్లింది. (దిగివచ్చిన పసిడి, వెండి ధరలు) హుషారుగా న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.9 శాతం పుంజుకుని 1,899 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.6 శాతం బలపడి 1,895 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 3.6 శాతం జంప్చేసి 26.82 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. వారాంతాన న్యూయార్క్ కామెక్స్లో పసిడి 1883 డాలర్ల వద్ద నిలవగా.. వెండి 25.94 డాలర్ల వద్ద ముగిసింది. -
దిగివచ్చిన పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: ముందురోజు దూకుడు చూపిన పసిడి, వెండి ధరలు తాజాగా దిగివచ్చాయి. కరోనా వైరస్ రూపు మార్చుకుని యూకేలో వేగంగా విస్తరిస్తున్నట్లు వెలువడిన వార్తలతో సోమవారం పసిడి, వెండి ధరలు హైజంప్ చేసిన విషయం విదితమే. 900 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకోవడం, ప్రపంచ దేశాలు యూకేకు ప్రయాణాలను నిలిపివేయడం వంటి అంశాలతో ముందురోజు పసిడి, వెండి ధరలు హైజంప్ చేశాయి. కాగా.. కొత్త తరహా కరోనా వైరస్ను సైతం వ్యాక్సిన్లు అడ్డుకోగలవని ఫార్మా వర్గాలు, హెల్త్కేర్ కంపెనీలు స్పష్టం చేయడంతో కొంతమేర ఆందోళనలు ఉపశమించినట్లు నిపుణులు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం.. (మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు) నేలచూపులో ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 274 క్షీణించి రూ. 50,142 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,095 వద్ద కనిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 50,540 వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 1,418 నష్టంతో రూ. 67,600 వద్ద కదులుతోంది. తొలుత రూ. 69,797 వద్ద నీరసంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 67,403 వరకూ వెనకడుగు వేసింది. బలహీనంగా.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.6 శాతం తక్కువగా 1,872 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం బలహీనపడి 1,869 డాలర్లను తాకింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 2.2 శాతం పతనమై 25.91 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ కలకలంతో సోమవారం పసిడి 1,910 డాలర్లకు జంప్చేయగా.. వెండి 27 డాలర్లను అధిగమించిన విషయం విదితమే. -
పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా?
ముంబై, సాక్షి: కొత్త ఏడాదిలో బంగారం ధరలు 8-10 శాతం స్థాయిలో క్షీణించవచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు ఫండమెంటల్, టెక్నికల్ అంశాలను ప్రస్తావిస్తున్నాయి. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది పసిడి, వెండి ధరలు ర్యాలీ బాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే 2021లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే యూకే, యూఎస్ తదితర దేశాలలో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగంలోకిరాగా.. తాజాగా మోడర్నా తయారీ వ్యాక్సిన్కు సైతం యూఎస్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సైతం పలు దేశాలలో ఆశలు రేపుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పడితే.. కంపెనీల ఆర్జనలు మెరుగుపడే వీలుంటుంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సరళతర విధానాలనుంచి దృష్టి మరల్చవచ్చు. దీంతో పసిడి, వెండి ధరలు 8-10 శాతం స్థాయిలో దిద్దుబాటు(కరెక్షన్)కు లోనుకావచ్చని బులియన్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా జరిగితే పసిడిలో పెట్టుబడులు చేపట్టడం దీర్ఘకాలంలో మేలు చేయగలదని అభిప్రాయపడ్డారు. (పసిడి, వెండి.. 3 రోజుల లాభాలకు బ్రేక్) సెకండ్ వేవ్తో ప్రస్తుతం యూఎస్, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో కొన్ని దేశాలలో కఠిన ఆంక్షలను సైతం విధిస్తున్నారు. నిజానికి సంక్షోభ పరిస్థితుల్లో పసిడిని రక్షణాత్మక పెట్టుబడిగా భావిస్తుంటారు. దీంతో కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్ సంస్థలు, ఇన్వెస్టర్లు పసిడిలో కొనుగోళ్లకు ఆసక్తి చూపే విషయం విదితమే. దీనికితోడు ఇటీవల డాలరు ఇండెక్స్ 30 నెలల కనిష్టానికి చేరింది. వెరసి మరికొంతకాలం కోవిడ్-19 ప్రభావం కొనసాగితే పసిడి ధరలు రూ. 50,000కు ఎగువనే కొనసాగవచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు నెలలుగా ఎంసీఎక్స్లో పసిడి 10 గ్రాములు రూ. 48,000-51,000 మధ్య కదులుతుండటం గమనార్హం! (మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు) అంచనాలు ఇలా.. పసిడి ధరలపై సాంకేతికంగా చూస్తే ఇలియట్ వేవ్ విశ్లేషణ ప్రకారం గత నాలుగేళ్లలో రూ. 25,000-56,000 మధ్య 5 వేవ్స్ పూర్తయ్యాయి. దీంతో సమీప భవిష్యత్లో కరెక్షన్కు చాన్స్ ఉన్నట్లు సాంకేతిక నిపుణులు తెలియజేశారు. తద్వారా కొంతకాలం కన్సాలిడేషన్ జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. రూ. 54,000 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఇక మరోవైపు రూ. 48,500, 46,000, 44,300 వద్ద సపోర్ట్స్ కనిపించవచ్చని ఊహిస్తున్నారు. వెరసి 2021లో పసిడి సగటున 40,000- 50,000 శ్రేణిలో సంచరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్ట్లో రికార్డ్ కోవిడ్-19 భయాలతో న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్లో పసిడి 10 గ్రాములు ఎంసీఎక్స్లో రూ. 57,100కు ఎగసింది. ఇది బులియన్ చరిత్రలోనే అత్యధికంకాగా.. తదుపరి ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్లపై ఆశలు కారణంగా పసిడి వెనకడుగు వేస్తూ వచ్చింది. ప్రస్తుతం కామెక్స్లో 1,885 డాలర్లకు చేరింది. ఇక ఎంసీఎక్స్లోనూ రూ. 50,300కు దిగింది. అయినప్పటికీ 2020లో పసిడి 35 శాతంపైగా ర్యాలీ చేయడం గమనార్హం! వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరాల ప్రకారం 2019లో పసిడి 1,393 డాలర్ల సమీపంలో నిలిచింది. దేశీయంగా రూ. 38,200 స్థాయిలో ముగిసింది. కాగా.. క్రెడిట్ స్వీస్ అంచనాల ప్రకారం 2021లో గరిష్టంగా 2,100 డాలర్ల సమీపానికి బలపడవచ్చు. ఇది 11 శాతం వృద్ధి. -
పసిడి, వెండి.. నెల రోజుల గరిష్టం నుంచి డీలా
న్యూయార్క్/ ముంబై: వరుసగా మూడు రోజులు ర్యాలీ బాటలో సాగిన పసిడి, వెండి ధరలు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప వెనకడుగుతో కదులుతున్నాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా లిక్విడిటీ చర్యలను కొనసాగించనున్నట్లు యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పేర్కొన్న నేపథ్యంలో పసిడి జోరందుకున్న విషయం విదితమే. వెరసి గురువారం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్ పసిడి 1900 డాలర్లను అధిగమించింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా.. దేశీయంగానూ ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 50,000ను దాటింది. వెండి సైతం కేజీ రూ. 68,000ను దాటేసింది. కొద్ది రోజులుగా ఫెడ్ నెలకు 120 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా వ్యవస్థలో లిక్విడిటీని పంప్ చేస్తోంది. కాగా.. మరోపక్క 700 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీపై యూఎస్ కాంగ్రెస్ సమీక్షను చేపట్టనున్నట్లు వెలువడిన వార్తలు సైతం పసిడికి జోష్ నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. (మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు) స్వల్ప వెనకడుగు.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 100 క్షీణించి రూ. 50,290 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. 50,358 వద్ద బలహీనంగా ప్రారంభమైన పసిడి తదుపరి రూ. 50,242 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 712 క్షీణించి రూ. 67,555 వద్ద కదులుతోంది. తొలుత రూ. 67,999 వద్ద ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. 67,456 వరకూ బలహీనపడింది. అక్కడక్కడే.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం పసిడి ఔన్స్ స్వల్పంగా 0.1 క్షీణించి 1,888 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.2 శాతం బలహీనపడి 1,882 డాలర్లను తాకింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.7 శాతం వెనకడుగుతో 25.98 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
మళ్లీ పసిడి, వెండి.. మెరుపులు
న్యూయార్క్/ ముంబై: ఆర్థిక వ్యవస్థకు దన్నుగా లిక్విడిటీ చర్యలను కొనసాగించనున్నట్లు యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా పేర్కొంది. కొద్ది రోజులుగా ఫెడ్ నెలకు 120 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా వ్యవస్థలో లిక్విడిటీని పంప్ చేస్తోంది. కాగా.. మరోపక్క 700 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీపై యూఎస్ కాంగ్రెస్ సమీక్షను చేపట్టనున్నట్లు వెలువడిన వార్తలు సైతం పసిడికి జోష్ నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి వరుసగా మూడో రోజు పసిడి, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్లోనూ సానుకూలంగా కదులుతున్నాయి. వివరాలు చూద్దాం.. (రెండో రోజూ పసిడి, వెండి పరుగు) సానుకూలంగా.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 243 పుంజుకుని రూ. 49,840 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 49,877 వద్ద గరిష్టాన్నీ.. రూ. 49,720 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 952 వృద్ధితో రూ. 66,863 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 66,932 వరకూ ఎగసిన వెండి రూ. 66,588 వద్ద కనిష్టాన్ని సైతం చవిచూసింది. హుషారుగా.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.65 లాభంతో 1,871 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.2 శాతం బలపడి 1,868 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1.7 శాతం ఎగసి 25.48 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం పసిడికి 1870-1884 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చు. ఇదేవిధంగా 1840-1828 డాలర్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. -
రెండో రోజూ పసిడి, వెండి పరుగు
న్యూయార్క్/ ముంబై: వరుసగా రెండో రోజు పసిడి, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్లోనూ సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నెల 18న యూఎస్ కాంగ్రెస్ సహాయక ప్యాకేజీపై సమీక్షను చేపట్టే వీలున్నట్లు వెలువడిన వార్తలు పసిడికి జోష్ నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండున్నరేళ్ల కనిష్టం 90.62కు చేరడం, యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టడం వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే యూకే, కెనడా, యూఎస్ తదితర దేశాలలో వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకావడంతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశంలేదని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. (పసిడి ధరలకు కోవిడ్-19 పుష్) సానుకూలంగా.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 137 పుంజుకుని రూ. 49,580 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత 49,510 వద్ద ప్రారంభమైంది ఇది కనిష్టంకాగా.. తదుపరి రూ. 49,626 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 318 వృద్ధితో రూ. 65,171 వద్ద కదులుతోంది. రూ. 65,000 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో రూ. 65,324 వద్ద గరిష్టానికి చేరింది. (పసిడికి ఉద్యోగ గణాంకాల దెబ్బ) హుషారుగా.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.3 లాభంతో 1,861 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.2 శాతం బలపడి 1,857 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.75 శాతం ఎగసి 24.83 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. మంగళవారం పసిడి ఫ్యూచర్స్ 1855 డాలర్ల వద్ద స్థిరపడగా.. వెండి 24.64 డాలర్ల వద్ద ముగిసింది. బులియన్ వర్గాల అంచనాల ప్రకారం పసిడికి 1870-1884 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చు. ఇదేవిధంగా 1840-1828 డాలర్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. -
పసిడి ధరలకు కోవిడ్-19 పుష్
న్యూయార్క్/ ముంబై: ముందురోజు వాటిల్లిన నష్టాల నుంచి పసిడి, వెండి కోలుకున్నాయి. ప్రస్తుతం అటు న్యూయార్క్ కామెక్స్, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్లో లాభాలతో ట్రేడవుతున్నాయి. సెకండ్ వేవ్లో భాగంగా కోవిడ్-19 విజృంభిస్తుండటంతో అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండున్నరేళ్ల కనిష్టం 90.62కు చేరింది. దీంతో తాజాగా పసిడికి బలమొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే యూకే, కెనడా, యూఎస్ తదితర దేశాలలో వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకావడంతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశంలేదని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. సానుకూలంగా.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 285 పుంజుకుని రూ. 49,224 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 49,260 వద్ద గరిష్టాన్నీ, ఆపై రూ. 49,007 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 429 వృద్ధితో రూ. 63,900 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 64,026 వద్ద గరిష్టానికీ, రూ. 63,599 వద్ద కనిష్టానికీ చేరింది. హుషారుగా.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.6 లాభంతో 1,843 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.65 శాతం బలపడి 1,839 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.7 శాతం ఎగసి 24.22 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
పసిడికి ఉద్యోగ గణాంకాల దెబ్బ
న్యూయార్క్/ ముంబై: ఈ నెల తొలి వారంలో ఆన్లైన్ సైట్స్ ద్వారా సగటున 10.7 మిలియన్ ఉద్యోగాల కోసం ఆఫర్లు నమోదైనట్లు యూఎస్ సంస్థ జిప్రిక్రూటర్ వెల్లడించింది. నవంబర్లో నమోదైన 10.9 మిలియన్లతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ కోవిడ్-19 సెకండ్ వేవ్లోనూ ఉపాధి కల్పన బలపడటం ఆర్థిక రికవరీని సంకేతిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 91 ఎగువకు బలపడింది. దీంతో బుధవారం న్యూయార్క్ కామెక్స్లో పసిడి, వెండి ధరలు పతనమయ్యాయి. ఔన్స్ పసిడి 1840 డాలర్లకు చేరింది. ఇక దేశీయంగా ఎంసీఎక్స్లోనూ ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 49,000 సమీపానికి నీరసించింది. ఈ బాటలో వెండి కేజీ రూ. 63,000 మార్క్ సమీపంలో ట్రేడవుతోంది. దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. (వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం) నష్టాలతో.. ఎంసీఎక్స్లో బుధవారం పతనమైన బంగారం, వెండి ధరలు మరోసారి డీలాపడ్డాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 221 క్షీణించి రూ. 49,039 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 49,313 వద్ద గరిష్టాన్నీ, ఆపై రూ. 48,935 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 350 నష్టంతో రూ. 63,149 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 63,747 వద్ద గరిష్టానికీ, రూ. 62,931 వద్ద కనిష్టానికీ చేరింది. (ఫేస్బుక్ నుంచి విడిగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్?) అక్కడక్కడే.. న్యూయార్క్ కామెక్స్లో బుధవారం భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) నామమాత్ర లాభంతో 1,840 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో 0.4 శాతం నష్టంతో 1,833 డాలర్లకు చేరింది. వెండి సైతం స్వల్ప వెనకడుగుతో ఔన్స్ 23.97 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం
న్యూయార్క్/ ముంబై: కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు బంగారం ధరలను దెబ్బతీశాయి. దీంతో న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్ పసిడి 10 డాలర్లు పతనంకాగా.. వెండి సైతం 1 శాతం క్షీణించింది. ఇక దేశీయంగా ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 50,000 దిగువకు చేరింది. ఈ బాటలో వెండి కేజీ రూ. 65,000 మార్క్ను కోల్పోయింది. కొద్ది రోజుల కన్సాలిడేషన్ తదుపరి మంగళవారం బంగారం, వెండి ధరలు రెండు వారాల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. యూఎస్లోనూ ఫైజర్ వ్యాక్సిన్కు అనుమతులు లభించనున్న వార్తలతో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్లో అమ్మకాలకు దిగినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల డేటాను పరిశీలించిన యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ ఎలాంటి లోపాలూ కనిపించలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో యూఎస్లోనూ ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభంకానున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే యూకేలో ఫైజర్ వ్యాక్సిన్ను అత్యవసర ప్రాతిపదికన వినియోగిస్తున్న విషయం విదితమే. దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) నేలచూపుతో.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 395 క్షీణించి రూ. 49,714 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 49,850 వద్ద నీరసంగా ప్రారంభమైంది. ఆపై రూ. 49,634 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ మరింత అధికంగా రూ. 890 పతనమై రూ. 64,302 వద్ద కదులుతోంది. ముందురోజుతో పోలిస్తే రూ. 64,542 వద్ద నష్టాలతో ప్రారంభమైన వెండి తదుపరి రూ. 64,163 వరకూ వెనకడుగు వేసింది. ముందురోజు పసిడి రూ. 50,109 వద్ద, వెండి రూ. 65,192 వద్ద ముగిశాయి. వెనకడుగులో.. న్యూయార్క్ కామెక్స్లో వరుసగా రెండు రోజులపాటు బలపడిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలా పడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.55 శాతం క్షీణించి 1,864 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.6 శాతం నష్టంతో 1,860 డాలర్లకు చేరింది. వెండి సైతం 1 శాతం వెనకడుగుతో ఔన్స్ 24.49 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. మంగళవారం పసిడి 1875 డాలర్ల వద్ద, వెండి 24.74 డాలర్ల వద్ద ముగిశాయి. మంగళవారం పసిడి 1875 డాలర్ల వద్ద, వెండి 24.74 డాలర్ల వద్ద ముగిశాయి. కాగా.. పసిడికి 1884-1900 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని పృథ్వీ ఫిన్మార్ట్ డైరెక్టర్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇదేవిధంగా సమీప భవిష్యత్లో 1858-1840 డాలర్ల వద్ద సపోర్ట్స్ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. -
పసిడి, వెండి- 2 వారాల గరిష్టం
న్యూయార్క్/ ముంబై: కొద్ది రోజుల కన్సాలిడేషన్ తదుపరి మళ్లీ బంగారం ధరలు మెరుస్తున్నాయి. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ట్రంప్ ప్రభుత్వం చైనాతో వాణిజ్య వివాదాలకు మళ్లీ తెరతీయనున్న వార్తలు పసిడికి డిమాండ్ను పెంచినట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం తాజాగా 12 మంది చైనా వ్యక్తులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్పై ఈ నిర్ణయాలు ప్రభావం చూపే వీలున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోపక్క కోవిడ్-19 కట్టడికి బైడెన్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీలకు మద్దతు పలుకుతున్న విషయం విదితమే. దీనికితోడు తాజాగా జపాన్ ప్రభుత్వం సైతం 708 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి సన్నాహాలు చేస్తున్నట్లు వెలువడిన వార్తలు రెండు రోజులుగా పసిడి, వెండి ధరలకు జోష్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్ పసిడి 1874 డాలర్లను తాకగా.. దేశీయంగా ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి రూ. 50,000 మార్క్ దాటింది. దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. హుషారుగా.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 192 పెరిగి రూ. 50,138 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,175 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,045 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం స్వల్పంగా రూ. 67 బలపడి రూ. 65,566 వద్ద కదులుతోంది. తొలుత రూ. 65,666 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 65,363 వరకూ వెనకడుగు వేసింది. లాభాలతో.. న్యూయార్క్ కామెక్స్లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.45 శాతం పుంజుకుని 1,874 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం లాభంతో 1,870 డాలర్లను అధిగమించింది. వెండి సైతం 0.2 శాతం లాభంతో ఔన్స్ 24.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. నవంబర్ 23 తదుపరి ఇవి గరిష్ట ధరలుకావడం గమనార్హం! -
పసిడి, వెండి ధరల మెరుపులు
న్యూయార్క్/ ముంబై: వరుసగా మూడో రోజు దేశ, విదేశీ మార్కెట్లో పసిడి, బంగారం ధరలు జోరు చూపుతున్నాయి. నవంబర్ నెలలో నమోదైన నష్టాలను పూడ్చుకుంటూ మంగళవారం పసిడి 1800 డాలర్లను అధిగమించడంతో మరింత బలపడే వీలున్నట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సాంకేతికంగా చూస్తే ఇంతక్రితం బ్రేక్డౌన్ అయిన 1851 డాలర్ల వద్ద బంగారానికి రెసిస్టెన్స్ కనిపించవచ్చని అంచనా వేశారు. ఈ స్థాయిల నుంచి ఒకవేళ బలహీనపడితే తొలుత 1801 డాలర్ల వద్ద, తదుపరి జులై కనిష్టం 1756 డాలర్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండున్నరేళ్ల కనిష్టానికి చేరడం, సెకండ్వేవ్లో భాగంగా కరోనా కేసులు పెరుగుతుండటం, యూఎస్ ప్యాకేజీపై అంచనాలు తాజాగా పసిడికి జోష్నిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. హుషారుగా.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 253 పెరిగి రూ. 49,200 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 49,270 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,136 వద్ద కనిష్టం నమోదైంది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 347 బలపడి రూ. 63,672 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,860 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 63,515 వరకూ వెనకడుగు వేసింది. లాభాలతో.. న్యూయార్క్ కామెక్స్లో వరుసగా మూడో రోజు బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.45 శాతం పుంజుకుని 1,838 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లో 0.2 శాతం లాభంతో 1,835 డాలర్లను అధిగమించింది. వెండి సైతం 0.3 శాతం లాభంతో ఔన్స్ 24.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. -
రెండో రోజూ పసిడి, వెండి ధరల దూకుడు
న్యూయార్క్/ ముంబై: వరుసగా రెండో రోజు దేశ, విదేశీ మార్కెట్లో పసిడి, బంగారం ధరలు జోరు చూపుతున్నాయి. వారాంతాన పసిడి ధరలు ఐదు నెలల కనిష్టాన్ని తాకడంతో మంగళవారం ఉన్నట్టుండి బంగారం, వెండి ధరలు జంప్చేశాయి. న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్ వెండి 5 శాతం దూసుకెళ్లగా.. పసిడి 2 శాతం ఎగసింది. వెరసి మంగళవారం పసిడి 200 రోజుల చలన సగటు 1800 డాలర్లను అధిగమించినట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సాంకేతికంగా చూస్తే స్వల్ప కాలంలో మరింత బలపడే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఒకవేళ బలహీనపడితే 1756 డాలర్ల వద్ద బంగారానికి సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. కారణాలివీ ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండున్నరేళ్ల కనిష్టం 91.32కు చేరడం, సెకండ్వేవ్లో భాగంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉండటం వంటి అంశాలతో తాజాగా పసిడికి డిమాండ్ కనిపిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు.. ఇటీవల బంగారం డెరివేటివ్ మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టిన ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలు చేపట్టడం ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశాయి. దీంతో దేశీయంగానూ ముందురోజు బంగారం, వెండి ధరలు భారీగా లాభపడ్డాయి. ఈ బాటలో ప్రస్తుతం మరోసారి ఇటు ఎంసీఎక్స్లోనూ.. అటు విదేశీ మార్కెట్లనూ హుషారుగా కదులుతున్నాయి. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. లాభాలతో ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 424 పెరిగి రూ. 48,699 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,699 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 48,400 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 631 బలపడి రూ. 62,549 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,019 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,425 వరకూ వెనకడుగు వేసింది. సానుకూలంగా.. న్యూయార్క్ కామెక్స్లో మంగళవారం జంప్చేసిన బంగారం, వెండి ధరలు మరోసారి బలపడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.4 శాతం పుంజుకుని 1,826 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం లాభంతో 1,825 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 0.65 శాతం ఎగసి ఔన్స్ 24.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కోలుకున్న పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: దేశ, విదేశీ మార్కెట్లో గత వారం చివర్లో పతన బాటలో సాగిన బంగారం, వెండి ధరలు కోలుకున్నాయి. సెకండ్వేవ్లో భాగంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉండటంతో పసిడికి డిమాండ్ కనిపిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు.. ఇటీవల బంగారం డెరివేటివ్ మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టిన ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలు చేపట్టడం ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా నవంబర్ నెలలో బంగారం ధరలు రూ. 2,500 నష్టపోయినట్లు ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు. కోవిడ్-19 కల్లోలం కారణంగా ఈ ఏడాది ఆగస్ట్లో 10 గ్రాముల బంగారం రూ. 56,200కు చేరడం ద్వారా చరిత్రాత్మక గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు వెలువడనుండటం, అమెరికా కొత్త ప్రెసిడెంట్గా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనుండటం వంటి అంశాలు పసిడి ధరలకు చెక్ పెట్టే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. లాభాలతో ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 108 పుంజుకుని రూ. 47,900 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,272 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 47,900 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 608 బలపడి రూ. 59,730 వద్ద కదులుతోంది. తొలుత రూ. 60,000 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 59,512 వరకూ వెనకడుగు వేసింది. బలపడ్డాయ్.. న్యూయార్క్ కామెక్స్లో బంగారం, వెండి ధరలు తాజాగా బలపడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.5 శాతం పెరిగి 1,790 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం పుంజుకుని 1,786 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 1.5 శాతం ఎగసి ఔన్స్ 22.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కుప్పకూలిన పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: వారాంతాన విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ సెలవుల నేపథ్యంలో డాలరు ఇండెక్స్ బలహీనపడగా.. 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ సైతం నీరసించాయి. అయినప్పటికీ పసిడి ధరలు పతనంకావడం గమనార్హం! దీంతో దేశీయంగానూ ఎంసీఎక్స్లో వరుసగా ఐదో రోజు పసిడి ధరలు డీలాపడ్డాయి. ఇటీవల కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగిన బంగారం ఫ్యూచర్స్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యమిస్తున్నట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా కొత్త ప్రెసిడెంట్గా జో బైడెన్ పదవిని చేపట్టనుండటంతో రాజకీయ అనిశ్చితికి తెరపడనున్నట్లు తెలియజేశారు. దీనికితోడు కోవిడ్-19 కట్టడికి ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకాసహా పలు వ్యాక్సిన్లు వెలువడనున్న వార్తలు సైతం ట్రేడర్లపై ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. కాగా.. శుక్రవారం తలెత్తిన భారీ అమ్మకాల నేపథ్యంలో న్యూయార్క్ కామెక్స్లో పసిడి బలహీనంగా కనిపిస్తున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. దీంతో జులైలో నమోదైన కనిష్టం 1,756 డాలర్ల వద్ద పసిడికి సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదేవిధంగా 1,842 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. నష్టాలతో ఎంసీఎక్స్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 411 క్షీణించి రూ. 48,106 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,647 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 47,800 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 773 నష్టపోయి రూ. 59,100 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 59,950 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 57,877 వరకూ వెనకడుగు వేసింది. గత ఐదు రోజుల్లో ఎంసీఎక్స్లో బంగారం ధరలు రూ. 2,100 వరకూ నష్టపోయినట్లు బులియన్ విశ్లేషకులు తెలియజేశారు. బలహీనపడ్డాయ్.. న్యూయార్క్ కామెక్స్లో బంగారం, వెండి ధరలు తాజాగా డీలా పడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 1.25 శాతం పతనమై 1,788 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లోనూ మరింత అధికంగా 1.55 శాతం(28 డాలర్లు) పడిపోయి 1,788 డాలర్లకు చేరింది. వెండి ఏకంగా 3.5 శాతం కుప్పకూలి ఔన్స్ 22.64 డాలర్ల వద్ద నిలిచింది. గత వారం పసిడి ధరలు 4 శాతంపైగా జారినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
బంగారం- 4 నెలల కనిష్టానికి పతనం
న్యూయార్క్/ ముంబై: మరో నెల రోజుల్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు విడుదలకానున్న వార్తలు బంగారం, వెండి ధరలను దెబ్బతీస్తున్నాయి. గత వారం నాలుగు రోజులపాటు నేలచూపులకే పరిమితమైన బంగారం ధరలు వరుసగా రెండో రోజు పతనమయ్యాయి. వెరసి నాలుగు నెలల కనిష్టాలకు చేరాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి ఈ ఏడాది చివరికల్లా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు విడుదల చేసే వీలున్నట్లు వెలువడిన వార్తలు సోమవారం బంగారం, వెండి ధరలను పడగొట్టినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో దేశ, విదేశీ మార్కెట్లో కొద్ది రోజులుగా అమ్మకాలు పెరిగినట్లు తెలియజేశాయి. కాగా. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్ విజయం సాధించినట్లు తాజాగా యూఎస్ పాలనావర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. దీనికితోడు వ్యాక్సిన్ల వార్తలతో ప్రపంచ ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా ముడిచమురు, ఈక్విటీలు, ట్రెజరీలు వంటి పెట్టుబడి సాధనాలవైపు ఇన్వెస్టర్ల దృష్టి మళ్లుతున్నట్లు వివరించారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో మాత్రమే పసిడికి డిమాండ్ కనిపిస్తుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండో రోజూ.. ఎంసీఎక్స్లో సోమవారం సాయంత్రం పతనమైన పసిడి, వెండి ధరలు వరుసగా రెండో రోజు నీరసించాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 555 క్షీణించి రూ. 48,925 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. రూ. 49,262 వద్ద వెనకడుగుతో ప్రారంభమైంది. ఆపై రూ. 48,923 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 765 నష్టపోయి రూ. 59,760 వద్ద కదులుతోంది. తొలుత రూ. 60,064 వద్ద బలహీనంగా ప్రారంభమైన వెండి తదుపరి రూ. 59,710 వరకూ వెనకడుగు వేసింది. బలహీనంగా.. న్యూయార్క్ కామెక్స్లో సోమవారం ఉన్నట్టుండి పతనమైన బంగారం, వెండి ధరలు మరోసారి డీలాపడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 1 శాతం(18 డాలర్లు) నష్టంతో 1,826 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.8 శాతం నీరసించి 1,824 డాలర్లకు చేరింది. వెండి సైతం 1.4 శాతం బలహీనపడి ఔన్స్ 24.43 డాలర్ల వద్ద కదులుతోంది. -
రెండో రోజూ- లాభాల్లో పసిడి
న్యూయార్క్/ ముంబై: నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ వారాంతాన యూటర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు మరోసారి బలపడ్డాయి. సెకండ్వేవ్లో భాగంగా కోవిడ్-19 అమెరికాసహా యూరోపియన్ దేశాలను వణికిస్తుండటంతో పలు ప్రభుత్వాలు మళ్లీ లాక్డవున్లవైపు చూస్తున్నాయి. దీంతో తాజాగా బంగారానికి డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఫైజర్, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లపై అంచనాలతో గత వారం తొలి నాలుగు రోజులపాటు పసిడి ధరలు క్షీణిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఫలితంగా ట్రేడర్లు పసిడిలో స్క్వేరప్ లావాదేవీలకు ఆసక్తి చూపుతున్నట్లు బులియన్ విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలొ స్వల్ప కాలానికి పసిడి, వెండి ధరలు కన్సాలిడేషన్ బాటలోనే కదలవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. రెండో రోజూ.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 117 బలపడి రూ. 50,329 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,336 వద్ద గరిష్ఠాన్ని తాకింది. రూ. 50,211 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ నామమాత్రంగా రూ. 75 పుంజుకుని రూ. 62,233 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,300 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,055 వరకూ వెనకడుగు వేసింది. సానుకూలంగా.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం బంగారం బలపడగా వెండి స్వల్పంగా నీరసించింది. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) స్వల్ప లాభంతో 1,880 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో 0.2 శాతం ఎగసి 1,875 డాలర్లకు చేరింది. వెండి మాత్రం 0.1 శాతం బలహీనపడి ఔన్స్ 24.47 డాలర్ల వద్ద కదులుతోంది. బలపడ్డాయ్.. దేశీయంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ శుక్రవారం బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 268 లాభపడి రూ. 50,260 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,435 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,857 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 750 ఎగసి రూ. 62,200 సమీపంలో స్థిరపడింది. తొలుత రూ. 62,750 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,560 వరకూ వెనకడుగు వేసింది. లాభాలతో.. న్యూయార్క్ కామెక్స్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు సానుకూలంగా ముగిశాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.6 శాతం బలపడి 1,872 డాలర్ల ఎగునవ నిలిచింది. స్పాట్ మార్కెట్లోనూ 0.25 శాతం లాభంతో 1,871 డాలర్లకు చేరింది. వెండి 1.4 శాతం జంప్ చేసి ఔన్స్ 24.49 డాలర్ల వద్ద స్థిరపడింది. -
బంగారం, వెండి ధరల యూటర్న్
న్యూయార్క్/ ముంబై: సెకండ్ వేవ్ లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తుండటంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. ఓవైపు డాలరు ఇండెక్సుతోపాటు, 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ బలపడినప్పటికీ పసిడికి డిమాండ్ కనిపించింది. దీంతో గత నాలుగు రోజులుగా క్షీణ పథంలో పయనిస్తున్న బంగారం, వెండి ధరలు శుక్రవారం యూ టర్న్ తీసుకున్నాయి. స్వల్ప ఆటుపోట్లను చవిచూసినప్పటికీ దేశ, విదేశీ మార్కెట్లో చివరికి లాభాలతో ముగిశాయి. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పుడు కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుంటాయని, దీంతో ట్రేడర్లు తిరిగి బంగారం, వెండి ఫ్యూచర్స్ లో కొనుగోళ్లకు దిగారని విశ్లేషకులు పేర్కొన్నారు. నష్టాలకు చెక్.. దేశీయంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ శుక్రవారం బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 268 లాభపడి రూ. 50,260 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,435 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,857 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 750 ఎగసి రూ. 62,260 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 62,750 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,560 వరకూ వెనకడుగు వేసింది. లాభాలతో న్యూయార్క్ కామెక్స్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు సానుకూలంగా ముగిశాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.6 శాతం బలపడి 1,872 డాలర్ల ఎగునవ నిలిచింది. స్పాట్ మార్కెట్లోనూ 0.25 శాతం లాభంతో 1,871 డాలర్లకు చేరింది. వెండి 1.4 శాతం జంప్ చేసి ఔన్స్ 24.49 డాలర్ల వద్ద స్థిరపడింది. -
4 రోజుల నష్టాలకు చెక్- లాభాల్లో పసిడి
న్యూయార్క్/ ముంబై: గత నాలుగు రోజులుగా క్షీణ పథంలో పయనిస్తున్న బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. ఫలితంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్ పడింది. సహాయక ప్యాకేజీలకింద ఖర్చుచేయని నిధులను వెనక్కి ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్ తాజాగా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ను డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ సహాయక ప్యాకేజీలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 92.50కు బలపడింది. దీంతో పసిడి ఆటుపోట్ల మధ్య ప్రస్తుతం లాభాల బాటపట్టినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఎమర్జెన్సీ ప్రాతిపదికన తమ వ్యాక్సిన్లకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించగలదంటూ ఫైజర్, మోడర్నా అంచనా వేయడంతో వరుసగా నాలుగు రోజులపాటు పసిడి, వెండి ఫ్యూచర్స్లో ట్రేడర్లు అమ్మకాలకు దిగిన సంగతి తెలిసిందే. లాభాలతో ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 95 బలపడి రూ. 50,087 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,197 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆపై రూ. 49,857 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 428 ఎగసి రూ. 61,938 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,090 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,560 వరకూ వెనకడుగు వేసింది. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్) సానుకూలంగా న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు హుషారుగా కదులుతున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.2 శాతం పుంజుకుని1,866 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.1 శాతం లాభంతో 1,869 డాలర్లకు చేరింది. వెండి 0.8 శాతం లాభపడి ఔన్స్ 24.37 డాలర్ల వద్ద కదులుతోంది. నాలుగో రోజూ.. ఎంసీఎక్స్లో గురువారం 10 గ్రాముల బంగారం రూ. 335 క్షీణించి రూ. 49,990 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,200 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,720 వద్ద కనిష్టానికి చేరింది. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 1,018 నష్టంతో రూ. 61,525 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 62,182 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 60,710 వరకూ వెనకడుగు వేసింది. -
నాలుగో రోజూ పడిన పసిడి- వెండి
న్యూయార్క్/ ముంబై: గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్.. కోవిడ్-19కు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రాగలవన్న అంచనాలు డాలరు ఇండెక్సుకు బలాన్నిస్తుంటే.. బంగారం, వెండి ధరలను దెబ్బతీస్తున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.2 శాతం పుంజుకుంది. దీంతో వరుసగా నాలుగో రోజు దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు డీలా పడ్డాయి. ఎమర్జెన్సీ ప్రాతిపదికన తమ వ్యాక్సిన్లకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించగలదంటూ ఫైజర్, మోడర్నా అంచనా వేయడంతో పసిడి, వెండి ఫ్యూచర్స్లో ట్రేడర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. పసిడికి రూ. 50,100-49,900 వద్ద సపోర్ట్ లభించవచ్చని, ఇదేవిధంగా రూ. 50,500-50,700 స్థాయిలో రెసిస్టెన్స్ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్మార్ట్ కమోడిటీ, కరెన్సీ హెడ్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇక ఎంసీఎక్స్లో వెండికి రూ. 62,100-61,100 వద్ద సపోర్ట్స్ లభించే వీలున్నదని, రూ. 63,000-63,500 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. ఇతర వివరాలు చూద్దాం.. బలహీనంగా ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 139 తక్కువగా రూ. 50,186 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. రూ. 50,200 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి రూ. 50,149 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 431 క్షీణించి రూ. 62,112 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,160 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,001 వరకూ వెనకడుగు వేసింది. వెనకడుగులో.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వెనకడుగుతో కదులుతున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.4 శాతం నష్టంతో1,866 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం తక్కువగా 1,867 డాలర్లకు చేరింది. వెండి 0.8 శాతం క్షీణతతో ఔన్స్ 24.26 డాలర్ల వద్ద కదులుతోంది. నష్టాలతోనే.. ఎంసీఎక్స్లో బుధవారం 10 గ్రాముల బంగారం రూ. 438 క్షీణించి రూ. 50,328 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,646 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,053 వద్ద కనిష్టానికి చేరింది. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 718 నష్టంతో రూ. 62,530 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 63,280 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,023 వరకూ వెనకడుగు వేసింది. -
వ్యాక్సిన్ దెబ్బకు పసిడి- వెండి డీలా
న్యూయార్క్/ ముంబై: వరుసగా మూడో రోజు దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు డీలా పడ్డాయి. యూఎస్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్.. కోవిడ్-19కు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు త్వరలో అనుమతులు లభించగలవంటూ ఆశావహంగా స్పందించడంతో పసిడి, వెండి ఫ్యూచర్స్లో అమ్మకాలు తలెత్తుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. క్లినికల్ పరీక్షల విశ్లేషణ తదుపరి ఎమర్జెన్సీ ప్రాతిపదికన తమ వ్యాక్సిన్కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించగలదన్న అంచనాలను తాజాగా ఫైజర్ ఇంక్ ప్రకటించింది. ఈ వార్తల నేపథ్యంలో బులియన్ ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. చదవండి: (పసిడి- వెండి అక్కడక్కడే..) నేలచూపులతో.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 165 తక్కువగా రూ. 50,601 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,618 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,504 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 347 క్షీణించి రూ. 62,901 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,970 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,808 వరకూ వెనకడుగు వేసింది. నీరసంగా.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వెనకడుగుతో కదులుతున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.45 శాతం నష్టంతో1,877 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1,879 డాలర్లకు చేరింది. వెండి 0.65 శాతం క్షీణతతో ఔన్స్ 24.50 డాలర్ల వద్ద కదులుతోంది. -
పసిడి- వెండి అక్కడక్కడే..
న్యూయార్క్/ ముంబై: కోవిడ్-19కు వ్యాక్సిన్ ద్వారా చెక్ పెట్టగలమని తాజాగా మోడర్నా ఇంక్ పేర్కొనడంతో పసిడికి డిమాండ్ మందగించింది. దీంతో విదేశీ మార్కెట్లో పసిడి ధరలు సోమవారం 1.3 శాతం క్షీణించాయి. దేశీయంగానూ పసిడి, వెండి ధరలు స్వల్పంగా వెనకడుగు వేశాయి. సాధారణంగా సంక్షోభ పరిస్థితులలో పసిడికి డిమాండ్ పుట్టే సంగతి తెలిసిందే. యూరోపియన్ దేశాలతోపాటు.. యూఎస్లోనూ 40 రాష్ట్రాలలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరగడంతో ప్రపంచ కేంద్ర బ్యాంకులు మరోసారి ప్యాకేజీలకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇక మరోవైపు కోవిడ్-19కు ధీటుగా ప్యాకేజీని విడుదల చేసేందుకు కాంగ్రెస్ను సమాయత్తపరచనున్నట్లు యూఎస్ కొత్త ప్రెసిడెంట్గా ఎంపికైన జో బైడెన్ పేర్కొన్నారు. అంతేకాకుండా లాక్డవున్ల విధింపు చేపట్టబోమంటూ యూఎస్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పసిడి, వెండి ధరలు అక్కడక్కడే అన్నట్లుగా ట్రేడవుతున్నాయి. నామమాత్రంగా.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 35 తక్కువగా రూ. 50,795 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,888 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,738 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 117 క్షీణించి రూ. 63,574 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,715 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 63,483 వరకూ వెనకడుగు వేసింది. ఫ్లాట్గా.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఫ్లాట్గా కదులుతున్నాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.15 శాతం నష్టంతో1,885 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1,888 డాలర్లకు చేరింది. వెండి సైతం నామమాత్ర క్షీణతతో ఔన్స్ 24.80 డాలర్ల వద్ద కదులుతోంది. నేలచూపుతో ఎంసీఎక్స్లో సోమవారం 10 గ్రాముల బంగారం రూ. 141 క్షీణించి రూ. 50,845 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 51,015 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,150 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ. 191 తగ్గి రూ. 63,610 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 64,089 వరకూ ఎగసిన వెండి తదుపరి రూ. 62,160 వరకూ వెనకడుగు వేసింది. -
పసిడి- ధన్తెరాస్ వెలుగులు
న్యూయార్క్/ ముంబై : గత(2019) ధన్తెరాస్ నుంచి నేటి వరకూ చూస్తే.. పసిడి ధరలు దేశీయంగా 30 శాతం ర్యాలీ చేశాయి. ఫలితంగా 10 గ్రాముల ధర తొలిసారి రూ. 50,000 మార్క్ను అధిగమించింది. ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ట్రిలియన్ల కొద్దీ డాలర్లతో సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. కరోనా వైరస్ కట్టడికి అమలు చేసిన లాక్డవున్ తదితర సవాళ్లతో ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించింది. దీంతో సంక్షోభ పరిస్థితుల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడిలోకి చౌకగా లభిస్తున్న నిధులు ప్రవహించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్ సంస్థలు తదితర ఇన్వెస్టర్లు పసిడిలో పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో ధరలు భారీగా లాభపడినట్లు విశ్లేషించారు. నిజానికి 2018 నుంచీ బంగారం లాభాల బాటలో సాగుతున్నప్పటికీ 2020లో మరింత జోరందుకున్నట్లు తెలియజేశారు. కాగా.. నేటి ట్రేడింగ్లో బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. న్యూయార్క్ కామెక్స్లో 0.15 శాతం పుంజుకోగా.. దేశీయంగా ఎంసీఎక్స్లో నామమాత్ర లాభంతో ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్లో గురువారం పసిడి సుమారు రూ. 350, వెండి రూ. 150 స్థాయిలో బలపడ్డాయి. చదవండి: (మెరుస్తున్న పసిడి, వెండి ధరలు) అటూఇటుగా.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 50 లాభపడి రూ. 50,650 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,665 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,609 వద్ద కనిష్టానికి చేరింది. అయితే వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ. 96 క్షీణించి రూ. 62,643 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,696 వద్ద నీరసంగా ప్రారంభమైన వెండి తదుపరి రూ. 62,510 వరకూ వెనకడుగు వేసింది. స్వల్ప లాభాలతో న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) 0.15 శాతం లాభంతో1,876 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ నామమాత్ర లాభంతో 1,878 డాలర్లకు చేరింది. వెండి మాత్రం 0.2 శాతం నీరసించి ఔన్స్ 24.26 డాలర్ల వద్ద కదులుతోంది. చదవండి: (కొనసాగుతున్న రూపాయి పతనం) నేలచూపుతో అమెరికాలో గత 8 రోజులుగా రోజుకి లక్ష కేసులకుపైగా నమోదవుతున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు బలహీనపడ్డాయి. సెకండ్ వేవ్లో భాగంగా యూరోపియన్ దేశాలలోనూ కోవిడ్-19 వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడవచ్చన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు డెమొక్రాట్ల ప్రతిపాదిత ప్యాకేజీని రిపబ్లికన్లు తిరస్కరించడంతో ఆందోళనలు పెరిగినట్లు తెలియజేశారు. ప్రస్తుతం న్యూయార్క్లో నైమెక్స్ బ్యారల్ దాదాపు 2 శాతం పతనమై 40.35 డాలర్లకు చేరింది. మరోపక్క లండన్ మార్కెట్లోనూ బ్రెంట్ చమురు 1.55 శాతం క్షీణించి 42.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
పండగ డిమాండ్ : ఎగిసిన పసిడి
ముంబై : ధన్తేరస్, దివాళి వేడుకల నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరగడంతో గురువారం దేశీ మార్కెట్లో బంగారం ధరలు భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు పెరగడంతో ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 466 రూపాయలు పెరిగి 50,635 రూపాయలకు ఎగిసింది. ఇక కిలో వెండి 259 రూపాయలు భారమై 62,800 రూపాయలు పలికింది. ఇక కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్పై సానుకూల ప్రకటనలతో ఇటీవల పసిడి ధరలు దిగిరావడం ధన్తేరస్, దివాళీ సీజన్లో ఆభరణల కొనుగోళ్లు ఊపందుకోవచ్చని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ కేసులు ప్రబలడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలపై న్యాయపరమైన వివాదాలు, అనిశ్చితి వాతావరణంతో మరికొద్ది రోజులు బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పసిడి ధరలు తగ్గుముఖం పట్టిన సందర్భాల్లో కొనుగోళ్లకు దిగాలని సూచిస్తున్నారు. చదవండి : కరోనా సెగ : పసిడి డిమాండ్ ఢమాల్! -
మెరుస్తున్న పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై : నేటి ట్రేడింగ్లో బంగారం, వెండి ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. న్యూయార్క్ కామెక్స్లో 0.4 శాతం పుంజుకోగా.. దేశీయంగా ఎంసీఎక్స్లో అక్కడక్కడే అన్నట్లుగా ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్లో బుధవారం పసిడి సుమారు రూ. 300, వెండి రూ. 600 చొప్పున బలపడ్డాయి. కాగా.. పసిడికి రూ. 50,000- 49,800 స్థాయిలో సపోర్ట్ లభించగలదని బులియన్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విధంగా రూ. 51,380- 51,550 స్థాయిలో రెసిస్టెన్స్ కనిపించవచ్చని పేర్కొన్నారు. ఈ బాటలో వెండికి రూ. 61,800- 61,200 వద్ద మద్దతు లభించే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక రూ. 63,100- 63,800 స్థాయిలో వెండికి అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. ఫ్లాట్గా.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 96 లాభపడి రూ. 50,265 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,347 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,265 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ నామమాత్రంగా రూ. 59 పెరిగి రూ. 62,600 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,827 వరకూ బలపడిన వెండి తదుపరి రూ. 62,552 వరకూ నీరసించింది. లాభాలతో న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) 0.4 శాతం లాభంతో1,869 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.26 శాతం బలపడి 1,870 డాలర్లకు చేరింది. వెండి 0.35 శాతం పుంజుకుని ఔన్స్ 24.35 డాలర్ల వద్ద కదులుతోంది. -
ఊరట : స్వల్పంగా తగ్గిన బంగారం
ముంబై : గ్లోబల్ మార్కెట్లలో ఒడిదుడుకులతో దేశీ మార్కెట్లో బంగారం ధరలు దిగివచ్చాయి.గత మూడు రోజుల్లో రెండోసారి పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో పండగ సీజన్లో ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉంది. బుధవారం ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 133 రూపాయలు తగ్గి 50,368 రూపాయలకు దిగివచ్చింది. ఇక వెండి కిలో 746 రూపాయలు తగ్గుముఖం పట్టి 62,298 రూపాయలకు పడిపోయింది. చదవండి : 3 రోజుల లాభాలకు బ్రేక్- పసిడి డీలా మరోవైపు ఆగస్ట్లో బంగారం ధరలు 56,200 రూపాయల ఆల్టైం హైకి చేరిన క్రమంలో ప్రస్తుతం పసిడి ధరలు రికార్డు ధరల నుంచి 6000 రూపాయల వరకూ తగ్గాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్పై సానుకూల ప్రకటనలతో బంగారం ధరలు మరికొంత తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్ భాగస్వామి బయోన్టెక్తో కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్ మూడవ దశ ఫలితాల్లో పురోగతి సాధించామన్న ప్రకటనతో పసిడి నేల చూపులు చూస్తోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. -
పసిడి, వెండి ధరల నేలచూపు
న్యూయార్క్/ ముంబై : ముందురోజు బౌన్స్బ్యాక్ అయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం మందగమన బాట పట్టాయి. అటు న్యూయార్క్ కామెక్స్లో అక్కడక్కడే అన్నట్లుగా కదులుతుంటే.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్లో వెనకడుగుతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతం విజయవంతమైనట్లు అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించడంతో సోమవారం విదేశీ మార్కెట్లో పసిడి ధరలు 5 శాతంపైగా కుప్పకూలిన విషయం విదితమే. కాగా.. ఎంసీఎక్స్లో మంగళవారం పసిడి రూ. 700 పుంజుకోగా.. వెండి సుమారు రూ. 2,000 జంప్ చేసింది. వివరాలు చూద్దాం.. వెనకడుగులో.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 75 తక్కువగా రూ. 50,426 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,463 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,350 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 244 క్షీణించి రూ. 62,800 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,044 వరకూ బలపడిన వెండి తదుపరి రూ. 62,998 వరకూ నీరసించింది. అక్కడక్కడే.. న్యూయార్క్ కామెక్స్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఫ్లాట్గా కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో1,878 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ స్వల్పంగా 0.16 శాతం బలపడి 1,880 డాలర్లకు చేరింది. వెండి దాదాపు యథాతథంగా ఔన్స్ 24.45 డాలర్ల వద్ద కదులుతోంది. -
మళ్లీ భగ్గుమన్న బంగారం!
ముంబై : కోవిడ్-19 వ్యాక్సిన్పై సానుకూల ప్రకటనతో సోమవారం భారీగా తగ్గిన బంగారం ధరలు మంగళవారం మళ్లీ భగ్గుమన్నాయి. అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజ్ను ప్రకటిస్తుందనే అంచనాలతో పసిడి ధరలు పరుగులు పెట్టాయి. మరోవైపు కరోనా వైరస్ కేసులు పెరగడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల చుట్టూ న్యాయ వివాదాలు ముసురుకోవడంతో బంగారంలో పెట్టుబడులకు మదుపరులు మొగ్గుచూపారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధరలు భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 640 రూపాయలు పెరిగి 50,388 రూపాయలు పలకగా, కిలో వెండి ఏకంగా 1273 రూపాయలు భారమై 62,127 రూపాయలకు ఎగిసింది. మరోవైపు ఆల్టైం హై నుంచి బంగారం ధరలు ఇటీవల కొద్దిగా దిగిరావడంతో దివాళి, ధంతేరస్ల సందర్భంగా డిమాండ్ పెరగవచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : పెట్టుబడులకు ‘బంగారం’! -
పసిడి, వెండి ధరలు.. తళ తళ
న్యూయార్క్/ ముంబై : ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతం విజయవంతమైనట్లు అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించడంతో సోమవారం పసిడి ధరలు 5 శాతంపైగా కుప్పకూలాయి. న్యూయార్క్ కామెక్స్ లో ఔన్స్ 1860 డాలర్ల దిగువకు చేరాయి. దీంతో దేశీయంగానూ ఎంసీఎక్స్లో ధరలు భారీగా పతనమయ్యాయి. పసిడి రూ. 2,500, వెండి 4,000కుపైగా పడిపోయాయి. అయితే ప్రస్తుతం తిరిగి జోరందుకున్నాయి. ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలు చేపట్టడం ప్రభావాన్ని చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఏం జరిగిందంటే? జర్మన్ కంపెనీ బయోఎన్ టెక్ భాగస్వామ్యంలో రూపొందించిన వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా ఫలితాలు సాధించినట్లు ఫైజర్ తాజాగా పేర్కొంది. ఈ నెలఖారుకల్లా ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అమెరికన్ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించగలదన్న ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేసింది. దీంతో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇటీవల ర్యాలీ చేస్తున్న పసిడి, వెండి ధరలు పతనమయ్యాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.65 శాతం పుంజుకోవడం, 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 1 శాతం జంప్ చేయడం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కోలుకున్నాయి. వివరాలు చూద్దాం.. లాభాలతో.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 638 పెరిగి రూ. 50,386 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,446 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,931 వద్ద ప్రారంభమైంది. ఇది ఇంట్రాడే కనిష్టంకావడం గమనార్హం. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,438 లాభపడి రూ. 62,292 వద్ద కదులుతోంది. తొలుత రూ. 61,900 వరకూ క్షీణించిన వెండి ధర తదుపరి జోరందుకుంది. రూ. 62,365 వరకూ జంప్ చేసింది. హుషారుగా.. సోమవారం కుప్పకూలిన బంగారం, వెండి ధరలు న్యూయార్క్ కామెక్స్లో తాజాగా బలపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1.5 శాతం ఎగసి 1,881 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1.1 శాతం లాభంతో 1,884 డాలర్లకు చేరింది. వెండి సైతం 2.6 శాతం జంప్ చేసి ఔన్స్ 24.32 డాలర్ల వద్ద కదులుతోంది. పడిపోయాయ్ ఎంసీఎక్స్లో సోమవారం 10 గ్రాముల బంగారం రూ. 2,502 పతనమై రూ. 49,665 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 52,520 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదేవిధంగా 49,500 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 4,160 పడిపోయి రూ. 60,725 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 66,478 వరకూ జంప్ చేసిన వెండి తదుపరి రూ. 60,560 వరకూ కుప్పకూలింది. (చదవండి: రెండో రోజూ సరికొత్త రికార్డ్స్ ) -
మూడో రోజూ భగ్గుమన్న బంగారం
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లో సోమవారం వరుసగా మూడో రోజూ పసిడి ధరలు భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 226 రూపాయలు పెరిగి 52,393 రూపాయలకు ఎగబాకింది. ఇక కిలో వెండి 755 రూపాయలు భారమై 66,090 రూపాయలకు ఎగిసింది. ఇక గత ఐదు రోజులగా పదిగ్రాముల బంగారం 1500 రూపాయలు పెరగ్గా, వారం రోజుల్లో వెండి కిలోకు 4000 రూపాయలు భారమైంది. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్ సారథ్యంలో భారీ ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించవచ్చనే సంకేతాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడంతో పసిడికి ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ నెలకొందని ఏంజెల్ బ్రోకింగ్ కమాడిటీస్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా పేర్కొన్నారు. మరోవైపు భారత్లో పండుగ సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బులియన్ నిపుణులు చెబుతున్నారు. చదవండి : పెట్టుబడులకు ‘బంగారం’! -
పసిడి, వెండి, చమురు- ‘జో’రు
న్యూయార్క్/ ముంబై : డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు స్పష్టత రావడంతో బంగారం, వెండి ధరలతోపాటు.. ముడిచమురు సైతం ‘జో’రందుకుంది. జో బైడెన్ విజయంపై అంచనాల నేపథ్యంలో వారాంతాన బంగారం, చమురు ధరలు బలపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడంతో ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు వేడెక్కాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్ లో పసిడి ఔన్స్ 1964 డాలర్లను అధిగమించగా.. వెండి 26 డాలర్లను తాకింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 40 డాలర్లకు ఎగువన ట్రేడవుతోంది. దేశీయంగా వెండి కేజీ 66,000 మార్క్ ను దాటగా.. పసిడి 10 గ్రాములు రూ. 52,000 ఎగువన ట్రేడవుతోంది. నిధుల ఆశలు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల(స్టిములస్)కు బైడెన్ విజయం దోహద పడనుందన్న అంచనాలు పసిడి ధరలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సైతం సహాయక ప్యాకేజీలకు మద్దతు పలకడం కమోడిటీలకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చన్న అంచనాలు బలపడుతున్నట్లు వివరించారు. వివరాలు చూద్దాం.. లాభాలతో.. దేశీయంగా ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 223 పుంజుకుని రూ. 52,390 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 52,520 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదేవిధంగా 52,225 వద్ద కనిష్టాన్ని చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 880 లాభపడి రూ. 66,215 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 66,390 వరకూ జంప్ చేసిన వెండి తదుపరి రూ. 65,849 వరకూ వెనకడుగు వేసింది. కామెక్స్లో.. వారం చివర్లో జోరందుకున్న బంగారం ధరలు న్యూయార్క్ కామెక్స్లో మరోసారి బలపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.65 శాతం పుంజుకుని 1,964 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.55 శాతం లాభంతో 1,962 డాలర్లకు చేరింది. వెండి సైతం దాదాపు 1.4 శాతం ఎగసి ఔన్స్ 26.01 డాలర్ల వద్ద కదులుతోంది. చమురు వేడి ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు 2.8 శాతం జంప్ చేసి 38.18 డాలర్లను తాకగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 2.55 శాతం ఎగసి 40.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మెరిసిన పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై : అమెరికా అధ్యక్ష పదవి రేసులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయంవైపు సాగుతున్న నేపథ్యంలో వారాంతాన బంగారం, వెండి ధరలు హైజంప్ చేశాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్ లో పసిడి ఔన్స్ 1950 డాలర్లను అధిగమించింది. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల(స్టిములస్)కు బైడెన్ విజయం దోహదం చేయవచ్చన్న అంచనాలు పసిడి ధరలకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19తో మందగించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా సహాయక ప్యాకేజీలను అమలు చేయాలంటూ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సైతం తాజాగా అభిప్రాయపడటం జత కలసినట్లు తెలియజేశారు. బైడెన్ గెలుపొందితే కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చన్న అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. లాభాలతోనే.. ఎంసీఎక్స్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 113 పుంజుకుని రూ. 52,168 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 52,450 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదేవిధంగా 51,711 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,102 లాభపడి రూ. 65,355 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 66,244 వరకూ జంప్ చేసిన వెండి తదుపరి రూ. 64,024 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. న్యూయార్క్ కామెక్స్లో ఆటుపోట్ల మధ్య శుక్రవారం బంగారం ధరలు లాభపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.25 శాతం పుంజుకుని 1,952 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో నామమాత్ర లాభంతో 1,951 డాలర్లకు చేరింది. వెండి సైతం దాదాపు 2 శాతం ఎగసి ఔన్స్ 25.66 డాలర్ల వద్ద స్థిరపడింది. -
పసిడి, వెండి ధరల దూకుడు
న్యూయార్క్/ ముంబై: అమెరికా అధ్యక్ష పదవి రేసులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్న వార్తలతో గురువారం బంగారం, వెండి ధరలు హైజంప్ చేశాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్ లో పసిడి ఔన్స్ ఒక దశలో 3 శాతం ఎగసి 1950 డాలర్ల సమీపానికి చేరింది. కోవిడ్-19తో మందగించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా సహాయక ప్యాకేజీలను అమలు చేయాలంటూ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా అభిప్రాయపడటం కూడా బంగారం ధరలకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. బైడెన్ గెలుపొందితే కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చన్న అంచనాలు ఇందుకు సహకరించినట్లు తెలియజేశారు. గురువారం బంగారం ధరలు 1936 డాలర్లను దాటడం ద్వారా బలాన్ని సంతరించుకున్నట్లు బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో సమీప భవిష్యత్లో 2089- 1851 డాలర్ల మధ్య పసిడి ధరలు హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని విశ్లేషించారు. కాగా.. డాలరు 93 స్థాయికి బలపడటం, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లో పసిడి ధరలు డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. అటూఇటుగా.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 226 క్షీణించి రూ. 51,829 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 51,929 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 51,805 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 198 లాభపడి రూ. 64,451 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 64,594 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 64,313 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. న్యూయార్క్ కామెక్స్లో బంగారం ధరలు ప్రస్తుతం వెనకడుగుతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.36 శాతం క్షీణించి 1,940 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.54 శాతం నీరసించి 1,939 డాలర్లకు చేరింది. వెండి మాత్రం 0.5 శాతం పుంజుకుని ఔన్స్ 25.31 డాలర్ల వద్ద కదులుతోంది. జంప్ చేశాయ్ ఎంసీఎక్స్లో గురువారం 10 గ్రాముల బంగారం రూ. 1,257 జంప్చేసి రూ. 52,077 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 52,176 వద్ద గరిష్టాన్ని తాకగా.. 51,161 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 2,736 దూసుకెళ్లి రూ. 64,125 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 64,380 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,900 వరకూ వెనకడుగు వేసింది. -
పసిడి, వెండి.. జిగేల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న అంచనాలతో ఈ వారం మొదట్లో జోరు చూపిన పసిడి, వెండి ధరలు బుధవారం డీలా పడిన విషయం విదితమే. బుధవారం డాలరు ఇండెక్స్ బలపడగా.. 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో బులియన్ ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుత ట్రేడింగ్ వివరాలు ఇలా.. లాభాలతో.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 375 పుంజుకుని రూ. 51,195 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 51,247 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 51,161 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 554 లాభపడి రూ. 61,943 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 62,165 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,931 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. న్యూయార్క్ కామెక్స్లో ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.5 శాతం ఎగసి 1,906 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.2 శాతం పుంజుకుని 1,907 డాలర్లకు చేరింది. వెండి 1 శాతం బలపడి ఔన్స్ 24.12 డాలర్ల వద్ద కదులుతోంది. లాభపడ్డాయ్ పసిడి, వెండి ధరల మూడు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. ఎంసీఎక్స్లో బుధవారం 10 గ్రాముల బంగారం రూ. 788 క్షీణించి రూ. 50,810 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,465 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,773 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,365 పతనమై రూ. 61,320 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,335 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 60,800 వరకూ వెనకడుగు వేసింది. -
3 రోజుల లాభాలకు బ్రేక్- పసిడి డీలా
ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న అంచనాలతో మూడు రోజులుగా జోరు చూపిన పసిడి, వెండి ధరలు డీలా పడ్డాయి. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు, మరోపక్క ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష వంటి అంశాల నేపథ్యంలో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్లో లాభాల స్వీకరణకు దిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ పసిడి సాంకేతికంగా కీలకమైన 1900 డాలర్లను అధిగమించడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు బలపడటం కూడా దీనికి కారణమైనట్లు అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 దెబ్బకు యూరోపియన్ దేశాలలో లాక్డవున్లు విధించడం, అమెరికాలోనూ కరోనా వైరస్ సోకిన కేసులు పెరుగుతుండటం వంటి ప్రతికూలతలతో ఇటీవల పసిడి, వెండి ధరలు ర్యాలీ బాటలో సాగిన విషయం విదితమే. ప్రస్తుత ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. నష్టాలతో.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 225 క్షీణించి రూ. 51,373 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 51,465 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 51,260 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 977 కోల్పోయి రూ. 61,708 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 61,980 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,415 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. న్యూయార్క్ కామెక్స్లో వరుసగా మూడు రోజులపాటు లాభపడిన బంగారం ధరలు ప్రస్తుతం వెనకడుగుతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.4 శాతం క్షీణించి 1,903 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం నీరసించి 1,899 డాలర్లకు చేరింది. వెండి 1.5 శాతం డీలాపడి ఔన్స్ 23.97 డాలర్ల వద్ద కదులుతోంది. లాభపడ్డాయ్ వరుసగా మూడో రోజు ఎంసీఎక్స్లో మంగళవారం 10 గ్రాముల బంగారం రూ. 553 ఎగసి రూ. 51,620 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,630 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,789 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 648 పుంజుకుని రూ. 62,655 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,791 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,612 వరకూ వెనకడుగు వేసింది. -
పసిడి- వెండి కన్సాలిడేషన్లో..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో బంగారం, వెండి ధరలు కన్సాలిడేషన్ బాట పట్టాయి. రెండు రోజులపాటు ర్యాలీ చేసిన ధరలు ప్రస్తుతం అక్కడక్కడే అన్నట్లుగా కదులుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 94 సమీపంలో ట్రేడవుతోంది. సెకండ్వేవ్లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు ఉధృతంకావడంతో మళ్లీ లాక్డవున్ల విధింపుతోపాటు.. కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న విషయం విదితమే. దీంతో ఇన్వెస్టర్లలో ఇటీవల ప్రపంచ ఆర్థిక మందగమన భయాలు తలెత్తినట్లు నిపుణులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. నేలచూపులతో.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 145 తగ్గి రూ. 50,922 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 50,992 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 50,910 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 112 క్షీణించి రూ. 61,895 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 62,006 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,857 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. న్యూయార్క్ కామెక్స్లో వరుసగా రెండు రోజులపాటు లాభపడిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.12 శాతం బలపడి 1,895 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో యథాతథంగా 1,894 డాలర్లకు చేరింది. వెండి 0.3 శాతం పుంజుకుని ఔన్స్ 24.10 డాలర్ల వద్ద కదులుతోంది. -
బంగారం, వెండి ధరలు- రెండో రోజూ ప్లస్
సెకండ్వేవ్లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు ఉధృతం అవుతుండటంతో రెండు రోజులుగా డీలాపడ్డ పసిడి ధరలు వారాంతాన కోలుకున్నాయి. ఈ బాటలో తాజాగా మరోసారి లాభాల బాటలో సాగుతున్నాయి. అమెరికాలో రోజుకి దాదాపు లక్ష కేసులు నమోదవుతుంటే.. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్లలోనూ కరోనా వైరస్ మళ్లీ వేగంగా విస్తరిస్తోంది. దీంతో యూరోపియన్ దేశాలు లాక్డవున్ విధింపుతోపాటు.. కఠిన ఆంక్షలకు తెరతీస్తున్నాయి. ఫలితంగా తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన బాట పట్టనున్న ఆందోళనలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు అంటు కేంద్ర బ్యాంకులు, ఇటు ఇన్వెస్టర్లు పసిడిలో కొనుగోళ్లకు మొగ్గు చూపే సంగతి తెలిసిందే. రక్షణాత్మక పెట్టుబడిగా పసిడిని భావిస్తుండటమే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ వారంలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష, అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పసిడి ధరలు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. మరోసారి ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం స్వల్పంగా రూ. 45 పెరిగి రూ. 50,744 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 50,777 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 50,612 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 735 లాభపడి రూ. 61,600 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 61,857 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,362 వరకూ క్షీణించింది. ఇవి డిసెంబర్ ఫ్యూచర్స్ ధరలుకావడం గమనార్హం! కామెక్స్లో.. రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ న్యూయార్క్ కామెక్స్లో వారాంతన బలపడిన బంగారం ధరలు మరోసారి లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.25 శాతం పుంజుకుని 1,885 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.26 శాతం లాభంతో 1,884 డాలర్లకు చేరింది. వెండి 1.24 శాతం ఎగసి ఔన్స్ 23.94 డాలర్ల వద్ద కదులుతోంది. లాభపడ్డాయ్ ఎంసీఎక్స్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 418 ఎగసి రూ. 50,700 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 50,870 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,353 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 748 పుంజుకుని రూ. 60,920 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 61,326 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,918 వరకూ వెనకడుగు వేసింది. -
అటూఇటుగా పసిడి, వెండి ధరలు
సెకండ్వేవ్లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు ఉధృతంకావడంతో రెండు రోజులుగా డీలాపడ్డ పసిడి ధరలు నామమాత్రంగా కోలుకున్నాయి. అయితే వెండి ధరలు మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్యాకేజీని ఆమోదించడంలో యూఎస్ కాంగ్రెస్ విఫలంకావడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడటం వంటి అంశాలు పసిడిని దెబ్బతీస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వివరాలు చూద్దాం.. మిశ్రమ బాట ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 153 లాభపడి రూ. 50,435 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 50,525 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 50,353 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 104 క్షీణించి రూ. 60,068 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 60,665 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,918 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. న్యూయార్క్ కామెక్స్లో గత రెండు రోజుల్లో క్షీణ పథం పట్టిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్రంగా బలపడి 1,869 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో 0.2 శాతం పుంజుకుని 1,871 డాలర్లకు చేరింది. వెండి 0.4 శాతం క్షీణించి ఔన్స్ 23.28 డాలర్ల వద్ద కదులుతోంది. వెనకడుగు.. ఎంసీఎక్స్లో గురువారం 10 గ్రాముల బంగారం రూ. 221 క్షీణించి రూ. 50,274 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 50,617 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,070 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 3 తక్కువగా రూ. 60,135 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 60,735 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 58,381 వరకూ వెనకడుగు వేసింది. -
వరుసగా రెండోరోజు : దిగివచ్చిన బంగారం ధరలు
ముంబై : బంగారం ధరలు గురువారం వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధరల పతనంతో దేశీ మార్కెట్లోనూ పసిడి దిగివచ్చింది. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 165 రూపాయలు తగ్గి 50,330 రూపాయలకు పడిపోయాయి. కిలో వెండి 300 రూపాయలు పతనమై 59,899 రూపాయలు పలికాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు ఒడిదుడుకులతో సాగుతున్నాయి. ఔన్స్ బంగారం 1877 డాలర్లకు పతనమైంది. అమెరికన్ డాలర్ బలోపేతం కావడంతో పసిడికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ తగ్గుముఖం పట్టిందని బులియన్ నిపుణులు పేర్కొన్నారు. చదవండి : ట్రంప్ ఎఫెక్ట్- పసిడి, వెండి.. మెరుపులు -
బంగారం, వెండి ధరలకూ వైరస్ సెగ
సెకండ్వేవ్లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు ఉధృతంకావడంతో బుధవారం స్టాక్ మార్కెట్లతోపాటు.. పసిడి, వెండి తదితర విలువైన లోహాలు డీలాపడ్డాయి. అమెరికా, యూరోపియన్ స్టాక్ మార్కెట్లు 2.5- 4 శాతం మధ్య పతనంకాగా.. న్యూయార్క్ కామెక్స్లో పసిడి ఔన్స్ దాదాపు 2 శాతం క్షీణించి 1879 డాలర్ల వద్ద ముగిసింది. వెండి సైతం ఔన్స్ 23.36 డాలర్ల వద్ద నిలిచింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్యాకేజీని ఆమోదించడంలో యూఎస్ కాంగ్రెస్ విఫలంకావడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 93.50కు బలపడింది. కాగా.. పసిడి, వెండి ధరలు న్యూయార్క్ కామెక్స్లో ముందురోజు నష్టాల నుంచి కోలుకుని లాభాలతో కదులుతుంటే.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్లో అటూఇటుగా ట్రేడవుతున్నాయి. మిశ్రమ బాట ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 80 క్షీణించి రూ. 50,415 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 112 బలపడి రూ. 60,250 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో 50,488 వద్ద గరిష్టాన్నితాకిన పసిడి 50,375 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా తొలుత ఒక దశలో 60,319 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,930 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. న్యూయార్క్ కామెక్స్లో బుధవారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం లాభాలతో కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.2 శాతం బలపడి 1,883 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం వృద్ధితో 1,883 డాలర్లకు చేరింది. వెండి 0.6 శాతం పుంజుకుని ఔన్స్ 23.50 డాలర్ల వద్ద కదులుతోంది. వెనకడుగు.. ఎంసీఎక్స్లో బుధవారం 10 గ్రాముల బంగారం రూ. 452 క్షీణించి రూ. 50,509 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,065 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,230 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 2,082 పతనమై రూ. 60,199 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,500 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 59,100 వరకూ వెనకడుగు వేసింది. -
ఊరట : తగ్గిన బంగారం ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరమే ఉద్దీపన ప్యాకేజ్పై స్పష్టత వస్తుందనే సంకేతాలతో డాలర్ బలపడటంతో పసిడికి డిమాండ్ తగ్గింది. ఇక ఎంసీఎక్స్లో బుధవారం పదిగ్రాముల బంగారం 257 రూపాయలు పతనమై 50,704 రూపాయలకు దిగిరాగా, కిలో వెండి 781 రూపాయలు తగ్గి 61,500 రూపాయలు పలికింది. చదవండి : వ్యాపారుల కోసం భారత్పే డిజిటల్ గోల్డ్ అమెరికాలో ఉద్దీపన ప్యాకేజ్పై అస్పష్టతతో డాలర్, ఈక్విటీ మార్కెట్లకు దిశ కొరవడటంతో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని కొటాక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితులు కొనసాగే పరిస్ధితుల నేపథ్యంలో దీర్ఘకాలంలో బంగారం స్ధిరంగా పెరుగుతుందని, పసిడి ధరలు పడిపోయిన సందర్భాల్లో కొనుగోలు చేస్తే మెరుగైన రిటన్స్ సాదించవచ్చని పేర్కొంది. ఇక ఆల్టైమ్ హై నుంచి బంగారం ఇటీవల 5500 రూపాయలు దిగిరావడంతో కొనుగోలుదారులు పసిడి కొనుగోలుపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. -
బంగారం, వెండి ధరలు- అక్కడక్కడే
కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి అటూఇటుగా కదులుతున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్లోనూ, ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్లోనూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి బంగారం, వెండి ధరలపై ప్రభావాన్ని చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్వల్ప నష్టాలతో.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 36 తగ్గి రూ. 50,925 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 239 క్షీణించి రూ. 62,042 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో పసిడి 51,065 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,819 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక తొలుత ఒక దశలో 62,085 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,881 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి దాదాపు యథాతథంగా 1,911 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ నామమాత్ర వృద్ధితో 1,909 డాలర్ల సమీపానికి చేరింది. వెండి మాత్రం 0.4 శాతం క్షీణించి ఔన్స్ 24.49 డాలర్ల వద్ద కదులుతోంది. స్వల్ప లాభాలు ఎంసీఎక్స్లో మంగళవారం 10 గ్రాముల బంగారం నామమాత్రంగా రూ. 20 పెరిగి రూ. 50,950 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,114 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,704 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 344 పుంజుకుని రూ. 62,250 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,580 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,510 వరకూ వెనకడుగు వేసింది. -
తగ్గిన బంగారం ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ పెరగడం, డిమాండ్ తగ్గుదలతో దేశీ మార్కెట్లో మంగళవారం పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల బంగారం 137 రూపాయలు తగ్గి 51,108 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి 475 రూపాయలు పెరిగి 62,648 రూపాయలకు ఎగబాకిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 43 రూపాయలు తగ్గి 50,887 రూపాయలకు దిగిరాగా, కిలో వెండి 46 రూపాయలు పతనమై 61,860 రూపాయలు పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగి ఔన్స్కు 1903 డాలర్లకు చేరాయి. చదవండి : ట్రంప్ ఎఫెక్ట్- పసిడి, వెండి.. మెరుపులు -
లాభాల్లో బంగారం- వెండి ధరలు
కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న బంగారం, వెండి ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్లోనూ, ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్లోనూ సానుకూలంగా కదులుతున్నాయి. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి మరోసారి స్టాక్ మార్కెట్లను దెబ్బతీసినప్పటికీ.. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీలలో ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్-19 కేసులు బంగారం, వెండి తదితర విలువైన లోహాలకు డిమాండ్ను పెంచుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు రక్షణాత్మక పెట్టుబడిగా కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్ వంటి సంస్థలు పసిడిలో కొనుగోళ్లకు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. సానుకూలం ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 110 పుంజుకుని రూ. 51,040 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 544 బలపడి రూ. 62,450 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో పసిడి 51,114 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 51,002 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక తొలుత ఒక దశలో 62,548 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 62,312 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.25 శాతం బలపడి 1,910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం పుంజుకుని 1,908 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 0.7 శాతం ఎగసి ఔన్స్ 24.59 డాలర్ల వద్ద కదులుతోంది. అటూఇటుగా ఎంసీఎక్స్లో సోమవారం 10 గ్రాముల బంగారం స్వల్పంగా రూ. 86 పెరిగి రూ. 50,925 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,125 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,552 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 469 క్షీణించి రూ. 61,980 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,480 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,251 వరకూ వెనకడుగు వేసింది. -
వెనకడుగులో.. బంగారం, వెండి
గత వారం చివర్లో కన్సాలిడేషన్ బాట పట్టిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలాపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్లోనూ, ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్లోనూ నష్టాలతో కదులుతున్నాయి. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి అటు స్టాక్ మార్కెట్లతోపాటు.. ఇటు బంగారం, వెండి తదితర విలువైన లోహాలపైనా ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ ప్యాకేజీని ప్రకటించాలన్న అంశంపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య విభేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్యాకేజీపై ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్తో యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ నిర్వహిస్తున్న చర్చలు ఫలవంతం కాకపోపవచ్చన్న సందేహాలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికలలోగా ఒప్పందం కుదిరే వీలున్నట్లు పెలోసీ పేర్కొనడం గమనార్హం. వారం మొదట్లో పసిడి ధరలు ర్యాలీ బాట పట్టడం ద్వారా 1,940 డాలర్లవైపు పయనించినట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఆ స్థాయి నుంచి వెనకడుగు వేయడంతో సాంకేతికంగా బలహీనపడ్డాయని తెలియజేశారు. దీంతో సమీప భవిష్యత్లో 1,850 డాలర్లవరకూ క్షీణించే వీలున్నట్లు అంచనా వేశారు. అయితే కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు చేపడుతున్న లిక్విడిటీ చర్యలు బంగారానికి జోష్నిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఏదశలోనైనా ట్రెండ్ రివర్స్కావచ్చని విశ్లేషించారు. క్షీణ పథంలో ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 239 తక్కువగా రూ. 50,600 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 750 క్షీణించి రూ. 61,699 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో పసిడి 50,719 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,600 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి తొలుత ఒక దశలో 61,892 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,566 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.35 శాతం క్షీణించి 1,899 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.25 శాతం తక్కువగా 1,897 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 1.1 శాతం నష్టంతో ఔన్స్ 24.41 డాలర్ల వద్ద కదులుతోంది. -
కన్సాలిడేషన్లో బంగారం, వెండి ధరలు
వారం మొదట్లో మూడు రోజులపాటు ర్యాలీ చేసిన పసిడి, వెండి ధరలు చివర్లో కన్సాలిడేషన్ బాట పట్టాయి. గురువారం లాభాలకు బ్రేక్ పడగా.. వాతాంతాన స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య అటూఇటుగా ముగిశాయి. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై నెలకొన్న అనిశ్చితి అటు స్టాక్ మార్కెట్లతోపాటు.. ఇటు బంగారం, వెండి తదితర విలువైన లోహాలపైనా ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ ప్యాకేజీని ప్రకటించాలన్న అంశంపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. ప్యాకేజీపై ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్తో చర్చలు నిర్వహిస్తున్న యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అధ్యక్ష ఎన్నికలలోగా ఒప్పందం కుదిరే వీలున్నట్లు ఆశావహంగా స్పందించడం గమనార్హం. వారం మొదట్లో పసిడి ధరలు ర్యాలీ బాట పట్టడం ద్వారా 1,940 డాలర్లవైపు పయనించినట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఆ స్థాయి నుంచి వెనకడుగు వేయడంతో సాంకేతికంగా బలహీనపడ్డాయని తెలియజేశారు. దీంతో సమీప భవిష్యత్లో 1,850 డాలర్లవరకూ క్షీణించే వీలున్నట్లు అంచనా వేశారు. అయితే కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు చేపడుతున్న లిక్విడిటీ చర్యలు బంగారానికి జోష్నిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఏదశలోనైనా ట్రెండ్ రివర్స్కావచ్చని విశ్లేషించారు. అటూఇటుగా ఎంసీఎక్స్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 100 పెరిగి రూ. 50,866 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 51,040 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,643 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 190 క్షీణించి రూ. 62,425 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 63,006 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 62,063 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. వారాంతాన న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,905 డాలర్ల వద్ద నిలిచింది. స్పాట్ మార్కెట్లో స్వల్పంగా క్షీణించి 1,902 డాలర్ల వద్ద ముగిసింది. వెండి 0.15 శాతం నీరసించి ఔన్స్ 24.68 డాలర్ల వద్ద స్థిరపడింది. -
పసిడి, వెండి.. అటూఇటుగా
దేశీ మార్కెట్లో వరుసగా మూడు రోజులు లాభపడిన బంగారం, వెండి ధరలు గురువారం వెనకడుగు వేశాయి. ఇదే విధంగా యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై నెలకొన్న అనిశ్చితి కారణంగా గురువారం న్యూయార్క్ కామెక్స్లోనూ నీరసించాయి. అయితే ఆర్థిక రివకరీకి సంకేతంగా గత వారానికల్లా యూఎస్లో నిరుద్యోగిత 8 లక్షల దిగువకు చేరడంతోపాటు, గృహ విక్రయాలు 14ఏళ్ల గరిష్టానికి చేరినట్లు గణాంకాలు తాజాగా వెల్లడించాయి. దీంతో 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 0.84 శాతానికి బలపడ్డాయి. ఫలితంగా ప్రస్తుతం విదేశీ మార్కెట్లో పసిడి, వెండి ధరలు అక్కడక్కడే అన్నట్లుగా కదులుతున్నాయి. ఇక ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం స్వల్పంగా రూ. 59 పెరిగి రూ. 50,825 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ నామమాత్రంగా రూ. 63 క్షీణించి రూ. 62,552 వద్ద కదులుతోంది. లాభాలకు బ్రేక్ వరుసగా మూడు రోజులపాటు ర్యాలీ చేసిన పసిడి, వెండి ధరలు గురువారం డీలా పడ్డాయి. ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి రూ. 569 క్షీణించి రూ. 50,764 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,199 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,535 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 931 పతనమై రూ. 62,698 వద్ద నిలిచింది. ఒక దశలో 63,250 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,856 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,907 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ దాదాపు యథాతథంగా 1,905 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి సైతం అక్కడక్కడే అన్నట్లుగా ఔన్స్ 24.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ముంబై : మూడు రోజల పాటు వరుసగా పెరిగిన బంగారం ధరలు గురువారం స్వల్పంగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్లో పదిగామ్రుల బంగారం 523 రూపాయలు తగ్గి 50,810 రూపాయలకు పడిపోయింది. ఇక వెండి ధర కిలోకు 987 రూపాయలు తగ్గి 62,642 రూపాయలకు దిగివచ్చింది. అమెరికాలో మరో విడత ఉద్దీపన ప్యాకేజ్పై మళ్లీ అస్పష్టత నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనమయ్యాయి.మరోవైపు పసిడి ధరలు మరికొద్ది రోజులు ఒడిదుడుకులతో సాగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
3 రోజుల లాభాలకు చెక్- పసిడి డీలా
దేశీ మార్కెట్లో వరుసగా మూడు రోజులు లాభపడిన బంగారం, వెండి ధరలు తిరిగి వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 242 తక్కువగా రూ. 51,091 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 732 క్షీణించి రూ. 62,897 వద్ద కదులుతోంది. ప్యాకేజీపై డౌట్స్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన భారీ ప్యాకేజీపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మళ్లీ విభేధాలు తలెత్తడంతో బంగారం, వెండి ధరలు డీలాపడ్డాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదిత స్టిములస్ను కొన్ని షరతులతో 2.2 ట్రిలియన్ డాలర్లకు పెంచమంటూ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ట్రంప్ సంసిద్ధతను వ్యక్తం చేసినప్పటికీ ఇతర రిపబ్లికన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మూడో రోజూ.. వరుసగా మూడో రోజు బుధవారం ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి రూ. 390 ఎగసి రూ. 51,333 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,454 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,915 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 441 లాభపడి రూ. 63,629 వద్ద నిలిచింది. ఒక దశలో 64,070 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 63,115 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.7 శాతం వెనకడుగుతో 1,916 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.55 శాతం క్షీణించి 1,914 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మరింత అధికంగా 1.5 శాతం నష్టపోయి ఔన్స్ 24.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బంగారం ధరలు మళ్లీ పైపైకి!
ముంబై : బంగారం ధరలు మళ్లీ భారమవుతున్నాయి. అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజ్పై స్పష్టత రావడంతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్లో బుధవారం పదిగ్రాముల బంగారం 372 రూపాయలు పెరిగి 51,282 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి 606 రూపాయలు పెరిగి 63,730 రూపాయలకు ఎగబాకింది. మరోవైపు నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోగా ఉద్దీపన ప్యాకేజ్ వెలువడుతుందనే సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకున్నాయి. ప్యాకేజ్తో పాటు డాలర్ బలహీనపడటంతో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 1912 డాలర్లకు పెరిగింది. ఈ వారంలో ఉద్దీపన ప్యాకేజ్పై ఏకాభిప్రాయం సాధ్యమవుతుందని ఆశిస్తున్నామని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటన పసిడికి డిమాండ్ను పెంచింది. చదవండి : సామాన్యుడికి దూరమవుతున్న స్వర్ణం! -
ప్యాకేజీ ఆశలు- రూ. 51,000కు పసిడి
దేశీ మార్కెట్లో వరుసగా రెండు రోజులు లాభపడిన బంగారం, వెండి ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 102 పెరిగి రూ. 51,012 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 451 లాభపడి రూ. 63,575 వద్ద కదులుతోంది. ప్యాకేజీకి రెడీ.. కోవిడ్-19ను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతిపాదించిన 2.2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీపై ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్తో నిర్వహిస్తున్న చర్చలను బుధవారం సైతం కొనసాగించనున్నట్లు హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా వారాంతంలోగా ప్యాకేజీకి గ్రీన్సిగ్నల్ లభించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీనికితోడు సహచర రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. భారీ ప్యాకేజీకి సిద్ధమంటూ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో రెండు రోజులుగా పసిడి, వెండి ధరలకు జోష్వచ్చినట్లు బులియన్ నిపుణులు తెలియజేశారు. ప్యాకేజీ కారణంగా లభించే చౌక నిధులు రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి తదితర విలువైన లోహాల కొనుగోలుకి మళ్లవచ్చన్న అంచనాలు దీనికి కారణమని తెలియజేశారు. మంగళవారమిలా వరుసగా రెండో రోజు మంగళవారం ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి రూ. 226 బలపడి రూ. 50,913 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 50,940 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,491 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 970 ఎగసి రూ. 63,065 వద్ద నిలిచింది. ఒక దశలో 63,259 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,662 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.5 శాతం లాభపడి 1,924 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.6 శాతం ఎగసి 1,919 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి సైతం 1 శాతం పురోగమించి ఔన్స్ 25.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
నేలచూపులో.. బంగారం- వెండి
దేశీ మార్కెట్లో ముందురోజు లాభపడిన బంగారం, వెండి ధరలు మళ్లీ నీరసించాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 112 క్షీణించి రూ. 50,575 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 145 నష్టంతో రూ. 61,950 వద్ద కదులుతోంది. ప్యాకేజీపై డౌట్తో కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీపై కాంగ్రెస్లో సందిగ్ధత కొనసాగుతుండటంతో సోమవారం పసిడి, వెండి బలపడ్డాయి. అధ్యక్ష ఎన్నికల్లోపు ప్యాకేజీని అమలు చేయాలంటే మంగళవారంలోగా ప్యాకేజీపై ఒప్పందం కుదుర్చుకోవలసి ఉన్నట్లు పెలోసీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్తో చేపట్టిన చర్చలపై మంగళవారానికల్లా స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో సోమవారం పసిడికి డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. సంక్షోభ సమయాలలో రక్షణాత్మక పెట్టుబడిగా పసిడిని భావించే సంగతి తెలిసిందే. సోమవారమిలా ఎంసీఎక్స్లో సోమవారం 10 గ్రాముల పసిడి రూ. 123 పెరిగి రూ. 50,670 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 50,940 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,437 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 373 లాభపడి రూ. 62,049 వద్ద నిలిచింది. ఒక దశలో 63,280 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 61,177 వరకూ క్షీణించింది. కామెక్స్లో.. న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.4 శాతం క్షీణించి 1,904 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో స్వల్ప నష్టంతో 1,902 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి 0.6 శాతం కోల్పోయి ఔన్స్ 24.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మళ్లీ ఎగిసిన పసిడి
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ సోమవారం బంగారం ధరలు భారమయ్యాయి. కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో పాటు అమెరికాలో ఉద్దీపన ప్యాకేజ్పై అస్పష్టతతో పసిడికి డిమాండ్ పెరిగింది. ఇక ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 213 రూపాయలు పెరిగి 50,760 రూపాయలకు చేరగా, కిలో వెండి ఏకంగా 1075 రూపాయలు భారమై 62,751 రూపాయలు పలికింది. మరోవైపు దేశ రాజధానిలో పదిగ్రాముల పసిడి 182 రూపాయలు పెరిగి 51,740 రూపాయలకు చేరింది. కిలో వెండి 805 రూపాయలు భారమై 63,714 రూపాయలకు ఎగబాకిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ వెల్లడించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1909 డాలర్లకు పెరిగాయి. చదవండి : భారీగా కుంగిన బంగారం దిగుమతులు -
కన్సాలిడేషన్లో.. బంగారం- వెండి
వారాంతాన దేశ, విదేశీ మార్కెట్లో స్వల్ప నష్టాలతో ముగిసిన బంగారం, వెండి ధరలు మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. కన్సాలిడేషన్ బాటలో అటు న్యూయార్క్ కామెక్స్లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్లోనూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ. 78 క్షీణించి రూ. 50,469 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 346 నష్టంతో రూ. 61,330 వద్ద కదులుతోంది. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు పుంజుకోవడం, అమెరికా ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితులు వంటి అంశాలు పసిడి ధరలకు చెక్ పెడుతున్న విషయం విదితమే. సెప్టెంబర్లో యూఎస్ రిటైల్ సేల్స్ అంచనాలను మించుతూ 1.9 శాతం వృద్ధి చూపడంతో వారాంతాన పసిడి బలహీనపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వినియోగ వ్యయాలు పెరగడం ఆర్థిక రికవరీకి సంకేతమని విశ్లేషకులు తెలియజేశారు. శుక్రవారమిలా ఎంసీఎక్స్లో వారాంతాన 10 గ్రాముల పసిడి రూ. 160 నష్టంతో రూ. 50,552 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 50,813 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,452 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. అయితే వెండి కేజీ రూ. 118 బలపడి రూ. 61,653వద్ద నిలిచింది. ఒక దశలో 62,170 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 61,324 వరకూ క్షీణించింది. దేశీయంగా ఆగస్ట్ 7న పసిడి రూ. 56,200 వద్ద, వెండి రూ. 80,000 సమీపంలోనూ రికార్డ్ గరిష్టాలకు చేరిన విషయం విదితమే. కామెక్స్లో.. న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.1 శాతం నీరసించి 1,904 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో నామమాత్ర లాభంతో 1901 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి 0.5 శాతం నష్టంతో ఔన్స్ 24.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వారాంతాన వారాంతాన న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్ పసిడి 0.15 శాతం నీరసించి 1,906 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో 0.5 శాతం క్షీణించి 1,899 డాలర్లకు చేరింది. అయితే వెండి మాత్రం 0.75 శాతం ఎగసి ఔన్స్ 24.41 డాలర్ల వద్ద స్థిరపడింది. వెరసి పసిడి ధరలు గత వారం 1 శాతం నష్టాలతో నిలిచినట్లు నిపుణులు తెలియజేశారు. -
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ముంబై : గత మూడు రోజుల్లో బంగారం ధరలు గురువారం రెండోసారి తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఉద్దీపన ప్యాకేజ్ వెలువడే సంకేతాలు లేకపోవడంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్టలో పసిడి ధర పతనం కావడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 111 రూపాయలు దిగివచ్చి 50,431 రూపాయలు పలకగా, వెండి కిలో 543 రూపాయలు తగ్గి 61,061 రూపాయలుగా నమోదైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1893 డాలర్లకు దిగివచ్చింది. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ కొరవడటం, డాలర్ బలోపేతంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొన్నా కరోనా వైరస్ కేసులు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసుల కమాడిటీ రీసెఉర్చి హెడ్ హరీష్ పేర్కొన్నారు. చదవండి : గుడ్న్యూస్ : పసిడి ధరల పతనం -
బంగారం ధరలు భారం
ముంబై : క్రమంగా దిగివస్తున్న బంగారం ధరలు బుధవారం మళ్లీ భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. అమెరికాలో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్పై ఆశలు ఆవిరవడంతో గోల్డ్కు డిమాండ్ ఊపందుకుంది. ఇక ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 110 రూపాయలు పెరిగి 50,355 రూపాయలు పలకగా, వెండి కిలో 273 రూపాయలు భారమై 60,815 రూపాయలు పలికింది. చదవండి : మూడోరోజూ భగ్గుమన్న బంగారం మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ ఉద్దీపన ప్యాకేజ్కు అమెరికన్ సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ మోకాలడ్డారు. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవడంతో ప్రభుత్వం ప్రతిపాదించిన 1.8 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజ్ ఎంతమాత్రం సరిపోదని పెలోసి తిరస్కరించారు. మరో ఉద్దీపన ప్యాకేజ్పై ఆశలు సన్నగిల్లడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరిగింది. -
గుడ్న్యూస్ : పసిడి ధరల పతనం
సాక్షి, న్యూఢిల్లీ : గత మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు మంగళవారం దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 237 రూపాయలు పతనమై 50,870 రూపాయలకు దిగిరాగా వెండి కిలోకు 525 రూపాయలు పతనమై 62,573 రూపాయలు పలికింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్కు 1919 డాలర్లకు పడిపోయాయి. బంగారం ధరలు మరింత పతనమయ్యే దశలో కరోనా వైరస్ కేసులు ప్రబలడం, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ పరీక్షలు నిలిచిపోవడంతో గోల్డ్ ధరలు కొంతమేర పుంజుకున్నాయి. ఇక అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితులు, ఉద్దీపన ప్యాకేజ్లపై అస్పష్టతతో బంగారం ధరలు మరికొంత కాలం ఒడిదుడుకులతో సాగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : బంగారం మళ్లీ భారం!