meetings
-
డమ్మీగా క్లస్టర్ కాంప్లెక్స్లు!
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో మార్పుల పేరిట కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు వ్యతిరేక ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల(government schools) విలీనంపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా.. తాజాగా క్లస్టర్ కాంప్లెక్స్ల నిర్వహణ తీరుపై ఉపాధ్యాయులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పాఠ్యాంశాలపై చర్చలు లేకుండా కేవలం ఆన్ౖలెన్ లింక్ ద్వారా టీచర్లు పాఠ్యాంశాలు వినేందుకే పరిమితం చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,809 కాంప్లెక్స్ క్లస్టర్లలో శనివారం మధ్యాహ్నం నుంచి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు.ఇవి గతానికి భిన్నంగా కొనసాగడంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా, సాయంత్రం 5 గంటల వరకే సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ 6 గంటల వరకు నిర్వహించారు. అటెండెన్స్ మాత్రం 5 గంటలకే క్లోజ్ చేశారని, ఆ తర్వాత ముఖ ఆధారిత హాజరు పనిచేయలేదని, ఇది టీచర్లను వేధించడమేనని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాల విద్యా శాఖలో కీలకమైన స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 4,034 కాంప్లెక్స్లను 2,809కి తగ్గించి క్లస్టర్ కాంప్లెక్స్లుగా మార్చారు. వీటిలోనే ఉపాధ్యాయ సమావేశాలకు అనుమతించారు. మరో 1,225 కాంప్లెక్స్లను డమ్మీలుగా మాత్రమే ఉంచారు.ప్రతి క్లస్టర్కి గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని 10 నుండి 15 పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కి.మీ పరిధిలోని 8 నుంచి 10 పాఠశాలలు అనుసంధానం చేశారు. ప్రతి క్లస్టర్లో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులతో కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు.ఇందులో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, పాఠశాలల మధ్య విద్య అనుసంధానం, విద్యా వనరుల సామగ్రి తయారీ, తనిఖీలు, విద్యా వ్యవస్థ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు ప్రత్యక్షంగా నిర్వహించాల్సి ఉంది. కానీ తొలి సమావేశం కేవలం ఉపాధ్యాయులు ఆన్లైన్లో పాఠాలు వినేందుకే పరిమితం చేశారు. గతంలో ఓ సబ్జెక్టుపై ఉపాధ్యాయుల మధ్య లోతైన చర్చ జరిగి, విద్యార్థులకు సరికొత్త బోధన విధానాలను అందించేవారు. నేడు అదే ఉపాధ్యాయ వర్గాన్ని కేవలం కొందరు చెబితే వినేందుకే పరిమితం చేశారు. ఉపాధ్యాయులపై ఒత్తిడిప్రతి నెలా మూడో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి ఉపాధ్యాయుడు హాజరుకావాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం మధ్యాహ్నం 2,809 కస్లర్లలో మధ్యాహ్నం ఒంటి పూట స్కూల్ కాంప్లెక్స్ విధానం అమలుల్లోకి వచ్చింది.ప్రాథమిక, సెకండరీ ఉపాధ్యాయులకు వేర్వేరు అజెండా విడుదల చేశారు. అయితే, శనివారమే 10వ తరగతి ప్రీఫైనల్ గణిత పరీక్ష ఉండటం, ఉదయంపూట మధ్యాహ్న భోజనం విధులు ఉండటంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగింది. ఉదయం 8.45 నుంచి 12 వరకు పాఠశాలల్లో పనిచేసిన టీచర్లు మధ్యాహ్నం 15 కిలోమీటర్ల దూరంలోని క్లస్టర్కు పరుగులు పెట్టాల్సి వచ్చింది.నీరుగారిన లక్ష్యంప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లకు కలిపి కొద్దిసేపు, వేర్వేరుగా మరికొద్దిసేపు సమావేశం నిర్వహించడంతో అసలు లక్ష్యం నీరుగారింది. ఒకటి, రెండు తరగతుల టీచర్లకు ప్రత్యేక సమావేశం పెట్టారు. 3, 4, 5 తరగతుల టీచర్లకు వేరొక గదిలో, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మరొక గదిలో సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్న సమయం ఊపిరి తీశారు. చర్చలకంటే లింకులతోనే సమావేశం మొత్తం పూర్తి చేశారు. గతంలో సబ్జెక్టు టీచర్లకు నియోజకవర్గం స్థాయిలో ఒక్కో సబ్జెక్టుకు ఒక స్కూల్లో సమావేశం జరిగేది. 40 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు వీటికి హాజరై సబ్జెక్టుపై లోతైన చర్చ చేసేవారు.ప్రస్తుత సమావేశాలకు సబ్జెక్టు టీచర్లు నలుగురికి మించకపోవడంతో చర్చలకు ఆస్కారమే లేకుండా పోయింది. పైగా నాలుగు గంటల సమావేశంలో ఉన్నతాధికారుల సందేశాలకు గంట ఇచ్చారు. ఉపాధ్యాయుల బోధనాంశాలపై 30 నుంచి 45 నిమిషాలే కేటాయించారు. బోధనాంశాలపై ఐఎఫ్పీలపై క్లిప్పింగ్లు చూపించారేగాని, విషయ పరిజ్ఞానంపై లోతైన చర్చకు అవకాశం ఇవ్వలేదు. కొన్ని చోట్ల నెట్ పనిచేయక ఫోన్లలో చూడాల్సిన పరిస్థితి. మోడల్ లెసన్ ప్లాన్స్, టీఎల్ఎం, కొత్త పద్ధతులపై చర్చలే లేవు. ఇలా స్కూల్ కాంప్లెక్స్లకు నిర్దేశించిన ఆరు సెషన్లు మొక్కుబడిగా ముగిసినట్టు సమాచారం.ఇంత నిర్బంధమా?స్కూల్ కాంప్లెక్స్లు అంటే ఉపాధ్యాయులు నిర్బంధ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పెళ్లిళ్లు, వివిధ కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉన్నా విద్యా శాఖ సెలవు ఇవ్వకపోవడం దుర్మార్గం. ఉపాధ్యాయులు అంటే ఇంత అలుసా? ఉత్తర్వుల ప్రకారం సాయంత్రం 5 గంటలకు ముగించాల్సిన సమావేశాలు 6 గంటల వరకు కూడా కొనసాగించారు.టీచర్లు హాజరు వేసుకునేందుకు మాత్రం 5 గంటల వరకే అవకాశం కల్పించారు, ఇదేం విధానం? మధ్యాహ్నం వరకు పాఠశాలలో ఉండి వెంటనే క్లస్టర్ స్కూల్స్ కాంప్లెక్స్కు వెళ్లాల్సిరావడంతో టీచర్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఇది ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడమే. – లెక్కల జమాల్రెడ్డి, ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇవేం కాంప్లెక్స్ సమావేశాలు?మధ్యాహ్నం వరకు పాఠశాలలో పనిచేసి, మధ్యాహ్న భోజనం తర్వాత సమావేశాలకు హాజరు కావడం ఇబ్బందిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగాల్సిన సమావేశాలను రోజులో సగమే నిర్వహించడం ఏమిటి? క్లస్టర్ పరిధిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల సబ్జెక్టు టీచర్లకు ఏవిధంగా ఉపయోగకరమో అధికారులు చెప్పాలి. ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేసే ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తున్నాం. – కె.శ్రీనివాసులు, టి.చందనరావు స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టొద్దు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల క్లోజింగ్ టైమ్ సాయంత్రం 5 గంటలకే అన్నా 6 గంటల వరకు నిర్వహించారు. అయినా అటెండెన్స్ పడకుండా టీచర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 6 వరకు దాదావు 10 గంటల పాటు విరామం లేకుండా షెడ్యూల్ ఇచ్చి, పాఠశాలలు, క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలనడం దారుణం. రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎంతో ఇబ్బంది తలెత్తింది. – మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు, టీఎన్యూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
మీటింగ్లకు వచ్చేదంతా వాళ్లే.. దీపాదాస్ వివాదాస్పద కామెంట్స్
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ మీటింగ్లపై ఏకంగా ఆ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఇన్చార్జి దీపదాస్ మున్షీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు పార్టీ మీటింగులు పెడితే దానికి కార్యకర్తలు రావాలి కానీ 200 రూపాయల కూలీలు రాకూడదని నేతలకు మున్షీ చురకంటించారు. సోమవారం(డిసెంబర్16) హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్లో మున్షీ చేసిన ఈ వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. తమను కూలీలతో పోలుస్తారా అని కార్యకర్తలు ఫైర్ అయ్యారు.మరోవైపు సీనియర్ నేత హనుమంతరావు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రసంగాలపై మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలు పొద్దంతా కాంగ్రెస్తో ఉండి సాయంత్రానికి ఎమ్ఐఎమ్కు ఓట్లు వేస్తారన్న హనుమంతరావు ,అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మైనారిటీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. -
చదువుల విప్లవానికి తూట్లు.. సర్కారు ప్రచార పాట్లు
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో చదువుల వెలుగులతో ప్రకాశించిన సర్కారీ బడులకు ఇప్పుడు చంద్ర గ్రహణం పట్టింది. నిర్లక్ష్యపు చీకట్లు కమ్ముకున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్ అందించాలనే ఉన్నత ఆశయంతో వైఎస్ జగన్ తెచ్చిన సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్(ఐబీ), పిల్లలకు ఏటా ట్యాబ్స్, డిజిటల్ తరగతులు, సబ్జెక్టు టీచర్లు వంటి వాటికి చంద్రబాబు సర్కారు మంగళం పాడుతోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి.. ప్రవేట్కు ధారాదత్తం చేయడం ద్వారా తన వాళ్లకు మేలు చేసేందుకు కుట్ర పన్నింది. పేద విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించాలన్న గత ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తూ అద్భుత పథకాలను ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లల బంగారు భవిత కోసం వైఎస్ జగన్ గొప్ప సంస్కరణలతో బాటలు వేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వాటికి గండి కొడుతోంది. నాణ్యమైన చదువుల విప్లవానికి తూట్లు పొడుస్తోంది. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం బాగు పరిస్తే.. ఇప్పుడు తామొచ్చాకే వాటిని ఉద్దరిస్తున్నట్లు కూటమి సర్కారు కలరింగ్ ఇస్తోంది. ఇందులో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పేరిట ఆర్బాటాలకు తెరలేపింది. మరోవైపు గత ప్రభుత్వంలో అమలైన ఒక్కో కార్యక్రమాన్ని తెరమరుగు చేస్తోంది. బడిఈడు ఉన్న ప్రతి ఒక్కరినీ బడికి పంపేలా ప్రోత్సహిస్తూ వైఎస్ జగన్ తీసుకొచ్చిన అమ్మ ఒడి స్థానంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేక పోయింది. ‘జగన్ రూ.15 వేలు ఇస్తున్నారు.. మేమొస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం’అని నమ్మించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఈ హామీని అమలు చేయకుండా మోసం చేసింది.సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్,ఐబీ శిక్షణకు మంగళం పాడింది. ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా తెర వెనుక మంత్రాంగం నడిపిస్తూ పైకి మాత్రం ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం పాటు పడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటోంది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించక పోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఓ వైపు ఇక్కట్లు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఆరు నెలలుగా విద్యా రంగం అభివృద్ధికి చేసిందేమీలేక పోగా.. గత ప్రభుత్వం తెచ్చిన చదువుల విప్లవాన్ని తన ఖాతాలో జమ చేసుకునేందుకు మాత్రం పావులు కదిపింది. సీబీఎస్ఈకి మంగళం » గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది.. తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు వెయ్యి ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దు చేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన చంద్రబాబు అన్నంత పని చేశారు. » 2023–24 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్, పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.‘టోఫెల్’ రద్దు » పదో తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరంలో జగన్ ప్రభుత్వం టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. » నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్)లు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,285 మందికిగాను 4,17,879 మంది (82 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా పోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఐబీ శిక్షణకూ అదే గతి » ‘టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’ అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లుగానే కూటమి ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది.» అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్ని తొలగించడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. కిట్లు పంపిణీలోను కూటమి కునికిపాట్లు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కూళ్లు తెరిచిన రోజునే పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు అందిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు సక్రమంగా అందలేదు. స్టూడెంట్ కిట్లను అరకొరగా కూటమి నేతలతో పంపిణీ చేయించారు. గతంలో విద్యా కానుక కిట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో వస్తువుల సరఫరాదారు నుంచి పాఠశాలకు చేరే దాకా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంతా తారుమారైంది.‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు » ప్రభుత్వ తీరు కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్కు వెళ్లిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియంను సైతం రద్దు చేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు.» మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ’రేషనలైజేషన్’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.స్పష్టతలేని తల్లికి వందనం» పేద పిల్లల చదువులను ప్రోత్సహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అద్భుతంగా అందించింది. పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో 2019 జూన్లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టడం ద్వారా డ్రాప్ అవుట్స్ను తగ్గించింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్లోనే రూ.15 వేలు చొప్పున అందించింది.» 2022–23కు సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం ద్వారా ఏకంగా రూ.26,067.28 కోట్ల సాయం చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా, కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. »ఇప్పటి వరకు తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించక పోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. తీరా గద్దె నెక్కాక ఈ పథకం అమలు గురించి మాట్లాడటమే మానేయడం గమనార్హం. ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చిన మేరకు ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.బాబు పాలనలోఅట్టడుగున జీఈఆర్చంద్రబాబు గత పాలనలో 2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగు పర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది.భోజన ఏజెన్సీల మార్పురాష్ట్రంలో దాదాపు 80 వేలకు పైగా మధ్యాహ్న భోజన ఏజెన్సీల్లో ఏకంగా 46 వేల మందికిపైగా మార్చేసిన కూటమి ప్రభుత్వం.. అతి సామాన్యుల పొట్ట కొట్టింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను ఇష్టానుసారం మార్చడంతో గందరగోళం ఏర్పడి, విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. కొన్ని చోట్ల కోడిగుడ్లను స్వాహా చేస్తున్నారు. భోజనానికి అందించే బియ్యంలో నాణ్యత లేదు. స్టాండర్డ్ మెనూ ఉండటం లేదు. కోడిగుడ్ల సైజు తగ్గింది. -
ఉపాధ్యాయుల్లో ‘పీటీఎం’ గుబులు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం తలపెట్టిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు (పీటీఎం) ఉపాధ్యాయుల్లో గుబులు రేపుతున్నాయి. ఎక్కడా ఏలోటూ రాకుండా నూరు శాతం తల్లిదండ్రుల హాజరు ఉండాలని ఒక పక్క.. స్థానిక రాజకీయ నాయకులను తప్పనిసరిగా ఆహా్వనించాలన్న ఆదేశాలు మరోపక్క టీచర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నో పేరెంట్స్–టీచర్స్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు ఇప్పుడు మెగా పీటీఎం అంటే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఒత్తిడి, అధికారుల రోజువారీ సమావేశాలు, ఆదేశాలతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మరోపక్క ఈ నెల 9 నుంచి విద్యార్థులకు అర్ధ వార్షిక పరీక్షలు (సమ్మేటివ్–1) ఉండగా.. పీటీఎం పనుల్లో నిమగ్నమైన ఉపాధ్యాయులు ఇప్పటివరకు సిలబస్ పూర్తి చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఫలితాలు తగ్గితే తమపై చర్యలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గతనెల 14న మెగా పీటీఎం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రంలోని 45,099 ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్స్– టీచర్స్ సమావేశాలు గొప్పగా నిర్వహించాలని, నిర్వహణకు టీచర్లు, తల్లిదండ్రులతో కమిటీలు వేయాలని సూచించింది. ఈ సమావేశాలపై ఉపాధ్యాయులకు ప్రతిరోజు జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఇతర ఉన్నతాధికారుల రివ్యూలతో క్షణం తీరికలేకపోవడంతో రెండు వారాలుగా బడుల్లో బోధన అటకెక్కింది. టార్గెట్లతో ఉక్కిరిబిక్కిరి ప్రతి స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు 100 శాతం హాజరయ్యేలా చూసే బాధ్యత ఉపాధ్యాయులపై పెట్టారు. అంతేగాక సమావేశాల నిర్వహణకు ప్రతి స్కూల్లో ఆహ్వా న కమిటీ నుంచి మీడియా కవరేజీ కమిటీ వరకు 13 కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇందులో ఉపాధ్యాయులతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఉండాలని సూచించారు. స్కూళ్లను సుందరంగా అలంకరించి తోరణాలు కట్టాలని, వచ్చే వారికి పూలతో ఆహ్వానం పలకాలనే నిబంధన విధించారు. పిల్లల తల్లులకు ముగ్గుల పోటీలు, తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ ఆడించి బహుమతులు కూడా ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు ఇప్పటివరకు జరిగిన రెండు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల ఫలితాలతో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రులకు ఇచ్చి, ఆయా సబ్జెక్టుల టీచర్లు వారికి విడిగా విద్యార్థుల ప్రగతిని వివరించాల్సి ఉంది. దీంతోపాటు మండలానికి 5 స్కూళ్లలో విద్యార్థుల హెల్త్ కార్డులను సైతం పంపిణీ చేయాలి. తర్వాత అందరు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, స్థానిక నాయకులతో బడిలో తీసుకోవాల్సిన మార్పులపై ప్రసంగాలు చేయాలి. అయితే, స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరినే ఆహ్వా నించాలని ఆదేశించడంతో ఎవరిని పిలవాలో తెలియక ఉపాధ్యాయులు మథనపడుతున్నారు. ఒకరిని పిలిచి మరొకరిని పిలవకపోతే తమపై ఎలాంటి ఫిర్యాదులు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ప్రస్తుత వ్యవసాయ పనుల సమయంలో సమావేశానికి పిలిచినా తల్లిదండ్రులు వచ్చే అవకాశం లేదని.. మరి నూరు శాతం హాజరు ఎలా చూపాలని వాపోతున్నారు. విందుపై వెనక్కి తగ్గిన సర్కారుమెగా పీటీఎం నిర్వహణ ఏర్పాట్లకు రాష్ట్ర సమగ్ర శిక్ష నుంచి రూ.9.06 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. బడిలో 10 మంది విద్యార్థులుంటే రూ.1,000, 25 మంది ఉంటే రూ.1,200, 2 వేల మంది ఉంటే రూ.13 వేలు, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.14 వేల చొప్పున బడ్జెట్ కేటాయించింది. ఈ మొత్తం నిధులతోనే షామియానా, మైక్సెట్లు, అలంకరణ, బొకేలు తదితర సామగ్రి సమకూర్చాలి. ఈ డబ్బుతోనే తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. దీంతోపాటు మధ్యాహ్నం పిల్లలతోపాటు తల్లిదండ్రులకు, అతిథులకు విందు భోజనం పెట్టాలని, నిధులను ఉపాధ్యాయులు స్థానికంగా దాతల నుంచి చందాలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఏ మూలకూ సరిపోని అరకొర బడ్జెట్తో సమావేశాలు నిర్వహించడం కష్టమని, భోజనం ఏర్పాట్లు తమవల్ల కాదని ఉపాధ్యాయులు తెగేసి చెప్పారు. దీంతో విందును మ«ద్యాహ్న భోజనం నుంచి ఏర్పాటు చేస్తామని అధికారులు తాజాగా హామీ ఇచ్చారు. బోధన పక్కనపెట్టి అపార్ నమోదులో నిమగ్నమైన ఉపాధ్యాయులు ఇప్పుడు మెగా పీటీఎం ఏర్పాట్లపై ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్సులతో బిజీగా మారారు. పీటీఎం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఏర్పాట్లపై జిల్లాస్థాయి అధికారులకు సమాచారం అందించాలి. కూటమి సర్కారు గొప్ప కోసం చేపట్టిన మెగా పీటీఎం ఇప్పుడు విద్యార్థుల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎన్నికల కోడ్ ఉన్నా ‘పీటీఎం’ హడావుడి ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కారణంతోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల వేడుకకు ఆ జిల్లాల టీచర్లను ఆహ్వానించకపోగా అవార్డులను సైతం ప్రదానం చేయలేదు. అలాంటిది రాజకీయ రంగు పులుముకున్న మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు ఈనెల 7న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎలా నిర్వహిస్తారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు సైతం పాల్గొంటారు. టీచర్లకు అవార్డులు ప్రదానం చేసేందుకు అడ్డొచి్చన కోడ్ ఈ సమావేశాలకు వర్తించదా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. -
షిర్డీలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు
సాక్షి, ముంబై: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు ఈసారి షిర్డీలో జరగనున్నాయి. షిర్డీలోని శాంతికమల్ హోటల్లో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో సర్వసభ్య సమావేశాలతోపాటు వివిధ సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాలు, మహారాష్ట్రతోపాటు ఇరత రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తెలుగు శిక్షణా కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యయాదవ్, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథులుగా, మండలి బుద్ద ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ నటుడు సాయికుమార్ గౌరవఅతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 350 మంది సభ్యులు, 100 మంది కళాకారులు, రచయితలతోపాటు మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమి సభ్యులు కూడా పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక తెలుగు సంఘాలతోపాటు షిర్డీ తెలుగు సంఘం అధ్యక్షుడు మాండవరాజా ఎంతగానో సహకరిస్తున్నారని వెల్లడించారు. ఊరేగింపుతో ప్రారంభం... రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యక్రమాలను రెండు కిలోమీటర్ల ఊరేగింపుతో ప్రారంభించనున్నారు. నవంబరు 30వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ సాయినివాస్ హోటల్ మెగా రెసిడెన్సీ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర తెలుగు ఫ్లకార్డులతో ఊరేగింపు జరగనుంది. వివిధ సాహిత్య, సామాజిక కార్యక్రమాల నిర్వహణ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 2015లో ఏర్పాటైంది. ఈ సమాఖ్య వివిధ రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 18 జాతీయ సదస్సులు, వివిధ నగరాలలో స్థానిక సంస్థల సహకారంతో ప్రతి ఏటా అనేక సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే ఆంగ్ల భాషా ప్రభావంతో మాతృభాషకు దూరమవుతున్న పిల్లలకు తెలుగు భాష నేర్పేందుకు కూడా కృషిచేస్తోంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ఆయా రాష్ట్రాలతోపాటు వారి స్వరాష్ట్రాలలో గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం, తెలుగు రాష్ట్రాల్లో అందించే పురస్కారాలు వీరికి కూడా అందించేందుకు కృషి చేయడం, రాష్ట్రేతర ప్రాంతాలలో మాతృభాష పరిరక్షణ, తెలుగేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు తెలుగువారికోసం స్థలాలు కేటాయించేలా కృషిచేయడం వంటి ఆశయాలతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో షిర్డీతోపాటు మహారాష్ట్రలోని తెలుగు సంఘాల ప్రతినిధులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆర్ సందుర్ రావు, ప్రధాన కార్యదర్శి పివిపిసి ప్రసాద్లు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఉద్యమ స్ఫూర్తి రగిలించేలా ‘దీక్షా దివస్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తిరిగి రగిలించడమే లక్ష్యంగా ‘దీక్షా దివస్’ నిర్వహిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్.. దానిని విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. తెలంగాణ సాధన కోసం 2009 నవంబర్ 29న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో ‘దీక్షా దివస్’నిర్వహించనుంది. కేడర్ను సమీకరించేందుకు ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు, కీలక నేతలను జిల్లాల వారీగా ఇన్చార్జ్లుగా ప్రకటించి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణభవన్లో శుక్రవారం జరిగే దీక్షాదివస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు తోపాటు ఇతర కీలక నేతలు పాల్గొంటారు.ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ విరామం తర్వాత దీక్షాదివస్లో పాల్గొనేందుకు తెలంగాణభవన్కు రానున్నారు. కేటీఆర్ కరీంనగర్ జిల్లా అలుగునూర్లో, హరీశ్రావు సిద్దిపేటలో, కవిత నిజామాబాద్లో ఉదయం జరిగే దీక్షాదివస్లో, మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు తమ తమ జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీక్షాదివస్ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్లోని బసవతారకం ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్కు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. కేసీఆర్ దీక్ష విరమించిన రోజును గుర్తు చేస్తూ డిసెంబర్ 9న మేడ్చల్లో కేటీఆర్ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.జాతీయ పార్టీలే లక్ష్యంగా...బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి కేడర్ ను సమీకరించి దీక్షాదివస్ నిర్వహించనుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా శుక్రవారం జరిగే సమావేశాల్లో విమర్శలు సంధించి పార్టీ కేడర్లో జోష్ నింపాలని భావిస్తోంది. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా దీక్షాదివస్ సమావేశాలు ఉంటాయని పార్టీవర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ వైఫల్యాలపై కేంద్ర ప్రభు త్వం మౌనంగా ఉంటున్న తీరును కేడర్కు విడమరిచి చెప్పాలని పార్టీ ఆదేశించింది.రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధాన్యం బోనస్, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం తదితరాలపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించిన బీఆర్ఎస్.. వాటిని మరింత బలంగా దీక్షాదివస్ వేదికగా ప్రశ్నించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్ను సన్నద్ధం చేయడంలో దీక్షాదివస్ తొలిఅంకమని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిస్తేజంగా మారిన పార్టీ కేడర్లో కదలిక తెచ్చేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు. -
ఇళ్లు కూల్చం.. చెరువులు పునరుద్ధరిస్తాం
సాక్షి, హైదరాబాద్/ అంబర్పేట: ‘పేదల ఇళ్లు కూల్చం.. చెరువులను పునరుద్ధరిస్తాం’’.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తాజాగా ఎత్తుకున్న నినాదమిది. ఇటీవలి వరకు చెరువుల పరిధిలో కూల్చివేతలతో కలకలం రేపిన హైడ్రా తన పంథా మార్చుకుంది. ఎక్కడైనా నీటి వనరుల పునరుద్ధరణ చర్యలకు ఉపక్రమించే ముందు స్థానికులతో భేటీ కావాలని.. తమ లక్ష్యం, దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలను వారికి వివరించాలని నిర్ణయించింది. దీనికోసం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. అంబర్పేటలోని బతుకమ్మకుంట నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఆ ప్రాంతానికి వచ్చిన రంగనాథ్.. పేదల ఇళ్లు కూల్చబోమని, ఆక్రమణలకు గురై ఖాళీగా ఉన్న స్థలాలను మాత్రమే శుభ్రం చేస్తామని వివరించారు. బతుకమ్మకుంట పునరుద్ధరణ జరిగితే.. ముంపు తప్పడంతోపాటు భూగర్భ జలాల లభ్యత పెరుగుతుందని స్థానికులకు అవగాహన కల్పించారు. ఆ ప్రాంతంలో ఓ ఆహ్లాదకరమైన పార్కును నిర్మిస్తామని తెలిపారు. దీంతో బతుకమ్మకుంటలో ఉన్న ఆక్రమణల తొలగింపునకు స్థానికులు ముందుకు వచ్చారని అధికారులు చెబుతున్నారు. పక్షం రోజుల పాటు కసరత్తు చేసి.. బతుకమ్మకుంటకు పునరుద్ధరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడానికి ముందు హైడ్రా దాదాపు పక్షం రోజుల పాటు కసరత్తు చేసింది. ఈ అంశాన్ని న్యాయ నిపుణులతో వివిధ కోణాల్లో చర్చించింది. న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసి ముందుకు వెళ్లింది. ప్రొక్లెయినర్లతో తొలగింపు ప్రక్రియ చేపట్టడానికి ముందే స్థానికులకు అవగాహన కల్పించింది. ఇది విజయవంతమైందని, ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. బతుకమ్మకుంటలో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీ వాసులతో మాట్లాడిన రంగనాథ్.. హైడ్రా పేరుతో ఎవరైనా భయపెట్టాలని, బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఉపేక్షించవద్దని సూచించారు. పదహారు ఎకరాల నుంచి ఐదెకరాలకు.. అంబర్పేటలోని బతుకమ్మకుంటను పునరుద్ధ రించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలను అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలని అధికారులు తేల్చా రు. తాజా సర్వే ప్రకారం బతుకమ్మకుంటలో మిగిలినది 5.15 ఎకరాలేనని గుర్తించారు. దీంతో అంత మేరకు కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా.. ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. దీనితో స్థానికులు హైడ్రాకు సహకరించేందుకు ముందుకొచ్చారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని.. రెవెన్యూ రికార్డులూ అదే చెప్తున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. అయితే ఇటీవలి పలు పరిణామాల నేపథ్యంలో బతుకమ్మకుంట వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ స్థలం ప్రైవేటుది అని వాదించిన బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. తార్నాకలోని ఎర్ర కుంటను పరిశీలించి.. బుధవారం తార్నాకలోని ఎర్రకుంటను రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూస్తూ, ఎర్రకుంటను పునరుద్ధరించాలని నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం వినతి పత్రం సమరి్పంచింది. ఈ మేరకు పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు. జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల జనావాసాల జోలికి వెళ్లదు. పెద్ద చెరువుగా ఉండాల్సిన బతుకమ్మకుంట క్రమేణా కుంచించుకుపోయింది. దానిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీని పక్కన ఉన్న బస్తీ వాసులకు గతంలో పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్లను హైడ్రా కూలుస్తుందనే దుష్ఫ్రచారం నేపథ్యంలో.. ఇక్కడికి వచ్చి స్థానికులకు వాస్తవాలు వివరించాం. వారి సహకారంతోనే బతుకమ్మకుంట పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో చట్టపరంగా అన్ని అంశాలను పరిశీలిస్తూ, అన్ని విభాగాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని తుది నిర్ణయం తీసుకున్నాం. కొందరు బతుకమ్మకుంట ప్రైవేటు స్థలమని వాదిస్తున్నప్పటికీ సరైన ఆధారాలు చూపలేదు. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ ఇళ్లు కూల్చబోమని హామీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ వచ్చి మాతో మాట్లాడారు. మా ఇళ్లను కూల్చబోమని హామీ ఇచ్చారు. దోమలు, దుర్వాసన లేకుండా బతుకమ్మకుంటను పునరుద్ధరిస్తామని చెప్పారు. కేవలం ఖాళీగా ఉన్న జాగానే చెరువుగా అభివృద్ధి చేస్తామన్నారు. అలా చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. – అరుణ, వీకర్ సెక్షన్ కాలనీ రంగనాథ్ సార్ వచ్చి ధైర్యం చెప్పారుబతుకమ్మకుంటలో సుమారు 50 ఏళ్లుగా నివసిస్తున్నాం. నగరంలో అక్కడక్కడా ఇళ్లు కూలుస్తుంటే భయం వేసింది. మా వద్దకు కూడా వచ్చి ఇళ్లు కూల్చేస్తారని కొందరు భయపెట్టారు. ఈ రోజు రంగనాథ్ సార్ వచ్చి ధైర్యం చెప్పారు. ఇళ్లు కూల్చబోమని, ఖాళీగా ఉన్న స్థలంలోనే కుంటను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. – సుంకమ్మ, వీకర్ సెక్షన్ కాలనీ -
తిరిగి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల అనంతరం ఎర్రవల్లి నివాసానికి పరిమితమైన బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు త్వరలో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టేలా కార్యాచరణకు పదును పెడుతున్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రాష్ట్రంలో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే కొందరు పార్టీ ముఖ్యనేతలతో చర్చించి ప్రజల్లోకి వెళ్లాల్సిన తీరుపై ప్రాథమికంగా ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదే అంశంపై మరోమారు పార్టీ నేతలతో మరింత లోతుగా చర్చించి ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేందుకు కేసీఆర్ ప్రత్యక్షంగా జనంలోకి వెళ్లాలని పార్టీ నేతలు సూచిస్తున్నట్లు తెలిసింది.రుణమాఫీ, రైతు బంధు వైఫల్యంపై..రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీరు, విద్యుత్ కష్టాలతోపాటు రుణమాఫీ జరగకపోవడం, రైతుబంధు ఇవ్వకపోవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతు సంక్షేమం కేంద్రంగా అమలు చేసిన కార్యక్రమాలను వివరించడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు.రుణమాఫీ, రైతు భరోసా అంటూ ఎన్నికల హామీలను ఉల్లంఘిస్తున్న వైనాన్ని కేసీఆర్ ఎండగట్టనున్నారు. దీని కోసం లోక్సభ ఎన్నికల ప్రచారం తరహాలో బస్సు యాత్ర పెట్టాలా లేక భారీ సభలు నిర్వహించాలా అనే కోణంలో పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్, రైతులతో సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ కసరత్తు జరుగుతోంది. అమెరికా పర్యటనకు కేటీఆర్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం రాత్రి అమెరికా పర్యటనకు వెళ్లారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి సోదరి కవితతోపాటు హైదరాబాద్కు చేరుకున్న కేటీఆర్ కొద్ది గంటల వ్యవధిలోనే అమెరికాకు వెళ్లారు. తన కుమారుడు హిమాన్షుకు సంబంధించిన విద్యాపరమైన విషయాల కోసం కేటీఆర్ అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. సెప్టెంబర్ రెండో వారంలో కేటీఆర్ తిరిగి హైదరాబాద్కు వస్తారని సమాచారం. ఇదిలాఉంటే ‘తండ్రి బాధ్యతల్లో అమెరికాకు వెళ్తున్నా’ అనే అర్థం వచ్చేలా కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్పెట్టారు. ఆడబిడ్డకు ఆత్మీయ స్వాగతం ఎర్రవల్లిలోని ఫామ్హస్కి చేరుకున్న కవిత ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్ మర్కూక్/గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఫామ్హúస్లో ఆత్మీయ స్వాగతం లభించింది. మూడు రోజుల క్రితం బెయిల్పై విడుదలై హైదరాబాద్కు చేరుకున్న కవిత గురువారం బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి భర్త అనిల్ కుమార్, కుమారుడితో కలిసి ఎర్రవల్లికి వెళ్లారు. ఎర్రవల్లిలోని నివాసానికి చేరుకున్న కవితను ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆప్యాయంగా హత్తుకున్నారు.కేసీఆర్ పాదాలకు నమస్కరించి తండ్రి చేతిని కవిత ఆప్యాయంగా ముద్దాడారు. కేసీఆర్ పాదాలకు కవిత నమస్కరిస్తున్న సమయంలో ఎర్రవల్లి నివాసంలో ఉది్వగ్న వాతావరణం కనిపించింది. పలువురు మహిళలు కవితకు దిష్టితీసి మంగళహారతులతో స్వాగతం పలికారు. అప్పటికే ఫామ్హౌస్లో ఉన్న ఎంపీ జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, మాజీ టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తదితరులు కూడా కవితకు స్వాగతం పలికారు. కవిత రెండు గంటలకుపైగా ఫామ్హౌస్లో గడిపి తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. -
హరీశ్రావు.. నాపై పోటీ చేయి: మైనంపల్లి సవాల్
సాక్షి,సిద్దిపేటజిల్లా: సిద్దిపేట పట్టణంలో మంగళవారం(ఆగస్టు20) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ర్యాలీలతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పట్టణంలో మంగళవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలకు పిలుపునివ్వడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటూ తరలి వెళుతున్నారు. దీంతో వీరిరువురి మధ్య ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది.‘మేం ధ్వజం ఎత్తాలనుకుంటోంది బీఆర్ఎస్పైన.. హరీష్ రావుపైనో ప్రజలపైనో కాదు. ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు. మేం ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నాం.వారు రేపు కూడా రైతు రుణమాఫీ ర్యాలీ చేసుకోవచ్చు. కానీ, మా ర్యాలీ అడ్డుకునేందుకే పోటాపోటీ ర్యాలీ పెట్టి ఉద్రిక్తతలు పుట్టిస్తున్నారు. వాళ్ల అంతు చూసేదాకా వదలబోం. రుణమాఫీ చేసినందున హరీశ్రావు మళ్లీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఇద్దరం మళ్లీ పోటీ చేద్దాం. హరీశ్ మళ్లీ గెలిస్తే నేను రాజకీయాల్లో నుంచి వెళ్లిపోతా’అని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు సవాల్ విసిరారు. అయితే రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ర్యాలీకి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. తాము కూడా ర్యాలీ చేసి తీరుతామని బీఆర్ఎస్ శ్రేణులు తెగేసి చెబుతున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. -
సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణా శిబిరం..
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో ఇమిడి ఉండే అన్ని అంశాలతో పాటు పిజిఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ విషయాలపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలనుకునే తెలుగు వారికి ఇదొక గొప్ప అవకాశం. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో అన్ని విషయాలతో పాటు పిజిఎస్ సర్టిఫికేషన్పై లోతైన అవగాహన కల్పించేందుకు 21 రోజుల పాటు తెలుగులో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్/నేచురల్ ఫార్మింగ్ (ఎన్సిఓఎన్ఎఫ్) తోడ్పాటుతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ), కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ (కెఎస్ఎ) సెప్టెంబర్ 5 నుంచి ఉమ్మడిగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సిఎస్ఎ, కెఎస్ఎల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుండటం విశేషం.విజయవాడకు 50 కిమీ దూరంలో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలో శ్రీపద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ నెలకొల్పిన కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. 38 ఎకరాలలో అత్యాధునిక సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తూ ఆచణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన కెఎస్ఎకు సుస్థిర వ్యవసాయ కేంద్రం నాలెడ్జ్ పార్టనర్గా వ్యవహరిస్తోంది. ఈ 21 రోజుల శిబిరంలో బోధన పూర్తిగా తెలుగులో ఉంటుంది. శిక్షణ, భోజన వసతులు ఉచితం. అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 30 మందికి అవకాశం.సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోను, సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారంలోను స్థానికంగా కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి, నిబద్ధత కలిగిన వారికి సంపూర్ణ అవగాహన కలిగించేందుకే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. రామాంజనేయులు వివరించారు. స్థానిక స్వయం సహాయక బృందాలు/ ఎఫ్పిఓలు / ఐసిఎస్/ ఆత్మ, పికెవివై, నామని గంగే లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ పథకాలలో నమోదైన వారికి ్రపాధాన్యం ఉంటుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి.. గూగుల్ ఫామ్లో వివరాలు పొందుపరచటం ద్వారా ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 85002 83300. జుట్చఃఓటజీటజిn్చ uఛీజ్చిఅఛ్చిఛ్ఛీఝy.ౌటజముచ్చింతల్లో ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ శిబిరం..రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో.. కర్షక సేవా కేంద్రం నిర్వహణలో హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్వలి, డా. సరళా ఖాదర్లచే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇతర వివరాలకు.. 97053 83666, 70939 73999. -
త్వరలో కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు
సాక్షి, విశాఖపట్నం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గురువారం ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, డిప్యూటీ రీజనల్ కో–ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి, నగర మేయర్ హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, సమన్వయకర్త కె.కె.రాజు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అమర్నాథ్, వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, ప్రతి వార్డులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను సమీక్షిస్తున్నామని, వచ్చే వారం నుంచి పార్టీ నాయకులు, శ్రేణుల మనోభావాలు తెలుసుకుంటారని చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా, నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తామన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల అయిందని, మరో 4 నెలలు పాలనా విధానాన్ని పరిశీలించి ఆ తర్వాత మాట్లాడతామని చెప్పారు. తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, తిరిగి వారి అభిమానాన్ని సంపాదిస్తామని అన్నారు. ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని, దానికి అనుగుణంగా పార్టీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తల ఆలోచనలు, సమస్యలను తెలుసుకొని, పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి మనోభావాలకు అనుగుణంగానే పని చేస్తామన్నారు. 2019కి ముందు జగన్మోహన్రెడ్డి చెప్పిన ప్రతి అంశాన్ని మళ్లీ అమలు చేస్తామని తెలిపారు. -
ఫించన్ ఎత్తేశారు!
రాకముందే అవ్వాతాతలకు అవస్థలు 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ పేదవాడికీ, ఏమీ చేయని చంద్రబాబు ఈనాడులో ఇచి్చన ప్రకటన చూశారా? సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? చంద్రబాబు రాకమునుపే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనకా వాననకా తిరగాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు, సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘ఈ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద సామాజికవర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, చేస్తున్న అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. అయ్యా చంద్ర బాబూ...! 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చి న పెన్షన్ ఎంత? కేవలం వెయ్యి రూపాయలు కాదా? ఆ పెన్షన్ను రూ.3 వేలు చేసింది ఎవరు? ఆ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు? చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు, సాయంత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. సాధ్యం కాని హామీలతో వల.. మరో 10 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావు. ఐదేళ్ల మీ భవిష్యత్తు, ఇంటింటికీ పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్లీ మోసపోవడమే! చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. సాధ్యం కాని హామీలతో వల వేస్తున్నాడు. వదల బొమ్మాళీ వదలా.. అంటూ పసుపు పతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి మీ ఇంటి తలుపుతట్టి లకలకా అంటూ ఐదేళ్లు రక్తం తాగేందుకు వస్తుంది. మరోసారి మోసగించేందుకే చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఆ పెద్దమనిషి పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకొస్తుందా? నాడు అవస్థలతో 39 లక్షలు.. నేడు ఠంఛన్గా 66 లక్షలు ఓ అవ్వాతాతా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా? ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ అరకొరగా తీసుకున్న దుస్థితి. మీ బిడ్డ జగన్ హయాంలో ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రూ.3వేలు చొప్పున పెన్షన్ నేరుగా మీ ఇంటికే అందిస్తున్నాడు. ఆ పాపిష్టి కళ్లు పడనంతవరకూ.. చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ సజావుగా అందేది. సూర్యోదయానికి ముందే, ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతల ఇంటికే మనవళ్లు, మనవరాళ్ల రూపంలో వలంటీర్లు వచ్చి చిరునవ్వుతో పింఛను అందించి మంచి చేసిన కాలం మనదే. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో.. తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదంటూ ఉత్తర్వులు ఇప్పించాడు. చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఏం చేశాడో తెలుసా? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేటట్టుగా వాళ్ల పెన్షన్ బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. దీంతో ఎన్నికల కమిషన్ అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చింది. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇంత ఎండలో క్యూలలో నిలబడలేక చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే ఆ దౌర్భాగ్యపు పని చేసిన చంద్రబాబు ఆ నెపాన్ని మీ బిడ్డపై వేస్తున్నాడు. చంద్రబాబు, దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లంతా కలిసి ఆ నెపాన్ని మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథనాలు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చూస్తే.. వీళ్లంతా మనుషులేనా? అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను 14ఏళ్లు మీరంతా చూశారు. మీ బిడ్డ 59 నెలల పాలన కూడా చూశారు. పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వచ్చిన పరిస్థితులు చూశారు. చంద్రబాబు ఏ ఒక్క రోజూ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. పెన్షన్ ఇంటికి పంపిన పరిస్థితి అంతకంటే లేదు. మీ కోసమే నా తొలి సంతకం.. నేను ఇవాళ ప్రతి అవ్వకూ, తాతకూ చెబుతున్నా. అవ్వాతాతా..! ఒక్క నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తేదీ దాకా ఓపిక పట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతా అని అవ్వాతాతలకు మాటిస్తున్నా. మీ మనవళ్లు, మనవరాళ్లుగా వలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి చిరునవ్వుతో పెన్షన్లు అందించే పరిస్థితులు మీ బిడ్డ మళ్లీ తెస్తాడు. విద్యా విప్లవం.. మహిళా సాధికారత గతంలో ఎప్పుడూ జరగని విధంగా గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకు స్కూళ్లు తెరిచే సమయానికే విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. నాడు–నేడుతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాం. ఇంగ్లిష్ మీడియంతో వేసిన అడుగులు నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపిస్తున్నాయి. తొలిసారిగా 6వ తరగతి నుంచే క్లాస్రూమ్ లలో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన పేద పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలు ఇబ్బంది పడకుండా బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ సమకూర్చాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెనతోపాటు వసతి దీవెన కూడా అందిస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను మన కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చాం.పిల్లలను బడికి పంపిస్తే చాలు చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ సున్నావడ్డీ, ఆసరా ఇస్తున్నాం. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు 22 లక్షల ఇళ్లు కూడా కడుతున్నాం. గ్రామాల్లోనే మహిళా పోలీసు, దిశ యాప్, రాజకీయ సాధికారత కోసం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. లంచాలు లేని సమాజం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రతి 60–70 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా ఇంటికే పెన్షన్, పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ జరుగుతోంది ఈ 59 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకముందు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయని ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశాడు. నాకు ఓటు వేయని వారినీ కోరుతున్నా.. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా మీ ఓటు ఎంత కీలకమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా ఒక్కటే కోరుతున్నా. మీ ఇంటికి వెళ్లి అవ్వాతాతలు, భార్యాపిల్లలతో కూర్చుని మాట్లాడండి. ఎవరి హయాంలో, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది. ఆ మోసాలు మీరంతా చూశారు.. మీ బిడ్డను నమ్మి మీరంతా అధికారం ఇచ్చినందువల్ల దేవుడి దయతో ఐదేళ్లలో ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99శాతం హామీలను అమలు చేశాం. 2014లో ఒకసారి చంద్రబాబును నమ్మారు! ఆ కూటమిని నమ్మి ఓటు వేశారు! చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో మీరంతా చూశారు. ఈ 59 నెలల్లో మీ జగన్ పాలన చూస్తున్నారు. మీ బిడ్డ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు. కొత్త మోసాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వారికి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నా. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్సింకులోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, ఆసుపత్రులు, వ్యవసాయం బాగుండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మన అభ్యర్థులను ఆశీర్వదించండివైఎస్సార్సీపీ నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ముదునూరి ప్రసాదరాజు, గుడాల గోపి, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్ కుమార్ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. గతంలో ఇవి ఉన్నాయా?» పిల్లలకు విద్యాకానుక, వారి చేతుల్లో ట్యాబ్లు గతంలో ఎప్పుడైనా చూశారా? » రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారంతో గోరుముద్ద చూశారా? » తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, ఇంటివద్దే అందించిన పౌర సేవలు, పథకాలను చూశారా? » ఇంటికే రూ.3 వేల పెన్షన్ కానుక, ఓ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, చేదోడు, లా నేస్తం, రూ.25 లక్షలదాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష గతంలో మీరు చూశారా? » వీటన్నింటితో పాటు మీ ఊరిలోనే గ్రామ సచివాలయం, నాడు–నేడుతో బాగుపడిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఓ ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్ గతంలో ఉన్నాయా? » మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇవన్నీ సజావుగా కొనసాగి పథకాలు అందుతాయి. 2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తానన్నాడు... జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామని ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? » ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? » సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మించాడా? నరసాపురం, పెదకూరపాడు, కనిగిరిలో ఎవరికైనా కనిపిస్తున్నాయా? » ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. »ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో మీ ముందుకొచ్చి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్ అంటూ మరోసారి వంచనకు సిద్ధమైన మోసగాళ్లతో రాజకీయ యుద్ధం చేస్తున్నాం. నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరిక సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలు, సంఘాల ముఖ్య నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. తూర్పు గోదావరి జల్లాకు చెందిన బీసీ పోరాట సమితి జిల్లా అ«ధ్యక్షుడు రేలంగి శేఖర్, మూల్ నివాసి సంఘ్ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు, జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి, మార్వాడి కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారీకి సీఎం జగన్ వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహా్వనించారు. -
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: 22 రోజుల్లో 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు.. 2,188 కి.మీలు.. 9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు.. జన ప్రభంజనం మధ్య జైత్ర యాత్రలా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగింది. మండుటెండైనా, అర్ధరాత్రయినా పిల్లలు, పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికారు. యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మరో జైత్రయాత్రకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు30న కొండెపి, మైదుకూరు, పీలేరుమే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు -
మన సభలకు జనం రారేంటి!
సాక్షి, అమరావతి: ఓ పక్క ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర అశేష ప్రజానీకంతో సాగుతోంది. అంతకు ముందు సీఎం జగన్ పాల్గొన్న సిద్ధం సభలూ ఘన విజయం సాధించాయి. మరి మన బాబు సభలేమిటి ఇంతగా తేలిపోతున్నాయి.. టీడీపీ నేతల్లో అంతర్మథనమిది. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు నిర్వహిస్తున్న ప్రజాగళం సభలకు కనీస స్థాయిలో జనం రావడంలేదు. బాబు సభలకు ప్రజల నుంచి స్పందన లేదని పవన్ కళ్యాణ్ని తీసుకువచ్చినా ఫలితం సున్నా. నాలుగు రోజులక్రితం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన కూటమి సభలో చంద్రబాబు, పురందేశ్వరితోపాటు పవన్ కూడా పాల్గొన్నారు. అయినా ఈ సభకు నాలుగైదు వేల మంది కూడా రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. అంతకు ముందు తణుకు సభకూ జనం ఆశించిన స్థాయిలో రాలేదు. మూడు పార్టీల నేతలు వస్తుండడంతో జన సమీకరణ భారీగా చేయాలని ఆ జిల్లా నాయకులపై ఒత్తిడి తెచ్చారు. జిల్లా నాయకులు ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. తమ పార్టీ సభలకి ప్రజల్ని తీసుకురావడం కష్టంగా మారిందని, ఎంత చెప్పినా, ప్రలోభపెట్టినా రావడంలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. బాబు ఒక్కడే విడిగా పెడుతున్న సభల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటోందని చెబుతున్నారు. రోజుకి రెండు, మూడు సభలు పెడుతున్నా, ఒక్క చోట కూడా అనుకున్న స్థాయిలో ప్రజలు రావడంలేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. పలుచగా ఉన్న సభల్ని చూసి మిగిలిన ప్రాంతాల్లోని కేడర్ నీరుగారిపోతుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది వచ్చినట్లుగా కనిపించేందుకు చిన్న సెంటర్లు, చిన్న రోడ్లను ఎంచుకుని సభలు పెడుతున్నారు. అక్కడికి అతి కష్టం మీద కొద్దిపాటి జనాన్ని తీసుకువచ్చి ఫొటోలు, వీడియోలతో వాటినే గొప్పగా ఉన్నట్లు చూపిస్తున్నారు. బాబు స్పీచ్ మొదలైతే.. జనమూ జంపే... మరోవైపు సభలకు వచ్చిన కొద్దిపాటి జనం కూడా బాబు ప్రసంగం మొదలవగానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. బాబు ప్రసంగం అంటేనే గంటా గంటన్నరపాటు ఊకదంపుడు స్పీచ్ ఉంటుంది. అందులోనూ విషయం లేకపోవడంతో వినేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు. వైఎస్ జగన్పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతుండడంతో ప్రజలు పట్టించుకోవడంలేదు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగిన నాలుగు సభలను చూస్తే బాబు మాట్లాడుతున్నప్పుడు వింటున్నవారి సంఖ్య చాలా స్వల్పం. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ను తిట్టడం, ఈర‡్ష్య, ద్వేషాలను బయటపెట్టుకోవడం తప్ప బాబు ప్రసంగాల్లో కొత్తదనం కనిపించడంలేదని చెబుతున్నారు. దానివల్లే జనం ఏమీ పట్టించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన కడుపు మంటనంతా వెళ్లగక్కి, కళ్లు మూసుకుని గంటల తరబడి అబద్ధాలను చెబుతూ వాటినే గొప్ప ప్రసంగాలుగా ఫీల్ అవుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసారి ఎలాగైనా జనాన్ని తీసుకురండి.. నేతలకు హెచ్చరికలు గత నెలలో చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీతో నిర్వహించిన సభను కూడా టీడీపీ విజయవంతం చేయలేకపోయింది. ఎన్నో ఆశలతో నిర్వహించిన ఆ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను మోదీ పెద్దగా పట్టించుకోకపోవడం, సభ కూడా అట్టర్ఫ్లాప్ అవడంతో బాబుకు షాక్ తగిలినట్లయింది. ఆ తర్వాత నుంచి ‘ప్రజా గళం’ పేరుతో నిర్వహించిన సభలేవీ జనాన్ని ఆకర్షించలేదు. అంతకుముందు ‘రా కదలిరా’ పేరుతో పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలూ తేలిపోయాయి. దీంతో ఏం చేయాలనే దానిపై కూటమి అగ్ర నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. శుక్రవారం చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో సభలు విఫలమవడంపైనా చర్చించారు. ఈసారి ఎలాగైనా కొన్ని సభలకు జనాన్ని భారీగా తరలించాలని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు చెప్పారు. రాబోయే వారం రోజుల్లో వరుసగా 13 సభలకు ప్రణాళిక రూపొందించి అక్కడి నేతలకు ముందుగానే హెచ్చరికలు చేశారు. జన సమీకరణ బాగా ఉండాలని, లేకపోతే బాబు గారు తిడతారని పరిశీలకులు అక్కడి ఇన్ఛార్జిలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల నేతలు మాత్రం జనం రాకపోతే తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. -
స్టార్టప్లతో ప్రతి నెలా సమావేశం నిర్వహించండి..
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఫిన్టెక్ సంస్థల ఆందోళనలను, సమస్యలను పరిష్కరించేందుకు వాటితో నెలవారీ సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. స్టార్టప్లు, ఫిన్టెక్ సంస్థలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు సూచనలు చేసినట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రేజర్పే, క్రెడ్, పీక్ఫిఫ్టీన్ తదితర 50 సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి, డీపీఐఐటీ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తదితరులు, ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా, ఎన్పీసీఐ అధికారులు హాజరయ్యారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించిన తరుణంలో ఫిన్టెక్, స్టార్టప్లతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పీపీబీఎల్ ఉదంతంపరమైన ఆందోళనలేమీ అంకుర సంస్థల వ్యవస్థాపకుల్లో కనిపించలేదని అధికారి తెలిపారు. ఈ భేటీలో స్టార్టప్లు సైబర్సెక్యూరిటీ సంబంధ అంశాలను ప్రస్తావించినట్లు వివరించారు. మహాకుంభ్లో వెయ్యి అంకుర సంస్థలు.. మార్చి 18 నుంచి న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో 1,000 పైచిలుకు అంకుర సంస్థలు, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు, ఇన్క్యుబేటర్లు పాల్గొననున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభా గం డీపీఐఐటీ నిర్వహించనుంది. పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చలు, మెంటార్ సెషన్లు, మాస్టర్క్లాస్లు, కీలకోపన్యాసాలు, యూనికార్న్ రౌండ్టేబుల్ సమావేశాలు మొదలైనవి ఉంటాయి. -
8 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రెండో సెషన్ సమావేశా లు ఈ నెల 8వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం నోటిఫికేష న్ జారీ చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ను 8వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొలిరోజు గవర్నర్ తమిళిసై ఉభయసభల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. -
టీడీపీ వెన్నులో వణుకు.. జగన్ జన బలం సుప్ర‘సిద్ధం’!
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావ సభలు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఈ సభలు జరుగుతున్న తీరు, వాటికి వస్తున్న జనాన్ని చూసి వారు గెలుపుపై ఆశలు వదిలేసుకుంటున్నారు. జగన్ జన బలం సుప్రసిద్ధమేనని, అయితే గత వారం భీమిలిలో జరిగిన సభతోపాటు శనివారం దెందులూరులో నిర్వహించిన సభ అంతకుమించి సూపర్ సక్సెస్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో టీడీపీ పూర్తిగా అంతర్మథనంలో పడిపోయింది. ఇప్పటివరకు రకరకాల ప్రచారాలతో తమ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందంటూ ఊదరగొడుతున్న టీడీపీ అధిష్టానమూ ఈ పరిణామాలతో ఉలిక్కిపడుతోంది. అదేపనిగా వైఎస్సార్కు, జగన్కు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేసినా, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి మరీ వ్యతిరేక ప్రచారాన్ని చేయించినా అవేమీ పనిచేయడం లేదని, జనంలో జగన్కు ఉన్న ఆదరణను తగ్గించలేకపోయాయని తేలడంతో టీడీపీ డీలాపడిపోయింది. తమ పార్టీ నిర్వహించే సభలకు జనం రాకుండా, వైఎస్ జగన్ సభలకు జనం పోటెత్తుండడం తమ నైతిక ఓటమికి సంకేతమని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ‘రా కదలి రా’ అట్టర్ ఫ్లాప్తో ఆవేదన చంద్రబాబు గత నెలలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలు అట్టర్ప్లాప్ కావడాన్ని గుర్తుచేసుకుని టీడీపీ నేతలు కుమిలిపోతున్నారు. ఈ సభలను 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించాలని, ఒక్కో సభకు కనీసం లక్ష మందిని, కుదరకపోతే 50 వేల మందినైనా సమీకరించాలని ప్రణాళిక రూపొందించారు. కానీ అతికష్టం మీద 16 సభలు నిర్వహించగలిగారు. ఏ ఒక్క సభకూ 20 వేల మందిని మించి తీసుకురాలేకపోయామని ఆ పార్టీ సీనియర్లే ఆవేదన చెందుతున్నారు. సభలకు జనం రాకపోతుండడంతో చంద్రబాబు మధ్యలోనే వాటికి విరామం ఇచ్చారు. ఏం చేయాలోనని మంతనాలు జరిపారు. తాము సభలు నిర్వహించలేమని, జనాన్ని సమీకరించలేమని చాలాచోట్ల నేతలు చేతులు ఎత్తేసినట్టు సమాచారం. దీంతో అర్థాంతరంగా సభలు ఆపితే సమాధానం చెప్పుకోలేమని, ఎలాగొలా ముగించడానికి అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది. బాబును జనం నమ్మడం లేదు మోసాలు, నయవంచనతో చంద్రబాబు ప్రజల నమ్మకం కోల్పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అబద్ధాలు, కట్టుకథలతో జనాన్ని మళ్లీ మోసం చేయాలని శత విధాలుగా యత్నిస్తున్నా.. జనం నుంచి స్పందన లేదని, బాబు ప్రసంగం కూడా పస లేకుండా ఉంటుందని, వైఎస్ జగన్పై విషం కక్కడాన్ని ప్రజలు జీరి్ణంచుకోలేకపోతున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. జగన్ను తిట్టడం తప్ప అధికారంలో ఉన్నప్పుడు తాను ఏం చేశానో చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదని అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఏం చేస్తారో కూడా బాబు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని, ఉన్న పథకాలనే పేర్లు మార్చి తానూ ఇస్తానని చెప్పడాన్ని ప్రజలు విశ్వసించడం లేదని పేర్కొంటున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ తమకు ఓటమి తప్పదని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు విశ్లేషించుకుంటున్నారు. ఇదీ చదవండి: అక్షౌహిణులు సిద్ధం! -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. వాడీవేడిగా చర్చలు సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగిత, అధిక ధరలు, ఆర్థిక అసమానతల కారణంగా రైతాంగం, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ అంశాలపై మోదీ సర్కార్ను విపక్షాలు నిలదీయనున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశం సైతం ప్రధానంగా విపక్షాలు ప్రస్తావించవచ్చు. ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్పై, భూమికి ఉద్యోగం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్పై ఈడీ, సీబీఐ కేసులనూ విపక్షాలు పార్లమెంట్లో లేవనెత్తనున్నాయి. జార్ఖండ్ సీఎంసోరెన్పై, తమిళనాడులో డీఎంకే నేతలపై ఈడీ, సీబీఐ వరుస దాడులను విపక్షాలు పార్లమెంట్లో ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. పశ్చిమబెంగాల్కు రావాల్సిన కేంద్ర నిధులను మోదీ సర్కార్ మంజూరుచేయకుండా ఆపేస్తోందని, ఈ అంశంలో కేంద్రాన్ని నిలదీస్తానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్ చెప్పారు. 14 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత గత పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన వారిలో 14 మంది విపక్ష సభ్యులు ఈసారి సెషన్లో పాల్గొననున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సమావేశాల్లోకి రాకుండా గతంలో వీరిపై విధించిన నిషేధ కేసును సభాహక్కుల కమిటీలకు పంపామని, మా అభ్యర్థనతో ఆ కమిటీల చైర్మన్లు వీరి సస్పెన్షన్ను ఎత్తేశారని మంత్రి వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తేసిన 14 మందిలో 11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్సభ సభ్యులున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం అంశాన్ని ఎత్తిచూపుతూ లోక్సభ, రాజ్యసభ లోపల ప్లకార్డులు పట్టుకుని నినదించినందుకు కేంద్రం ఫిర్యాదుతో 100 లోక్సభ, 46 రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్కు గురైన విషయం తెల్సిందే. ప్రతి ఒక్కరి సస్పెన్షన్ను ఎత్తివేయాలని సభాపతులను కోరామన్నారు. వీరిలో 14 మంది క్షమాపణలు చెప్పడంతో వారికి మాత్రమే ఈ సెషన్లో పాల్గొనే అవకాశం కల్పించారు. బుధవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ఇరు సభలకు తమ సభ్యులు ఎలాంటి ప్లకార్డులు తీసుకురారని విపక్ష పార్టీలు సమాచారం ఇచ్చాయని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. -
వచ్చే నెలలో బీజేపీ కీలక సమావేశాలు.. ఎంపీ ఎన్నికలపైనే ఫోకస్!
సాక్షి, ఢిల్లీ: త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు అవసరమైన వ్యూహాలపై జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ అగ్ర నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ సహా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర ముఖ్య నేతలు, జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరవనున్నారు. ఇదీచదవండి.. భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక -
రామంటున్న జనం.. టీడీపీలో కలవరం
టీడీపీ సభలకు జనం ‘కదలిరా’వడం లేదు. కార్యకర్తలు నానా తంటాలుపడి బలవంతంగా తరలించినా... చివరి వరకూ ఉండటం లేదు. పసలేని ప్రసంగాలు... అదేపనిగా రాగాలు తీస్తూ జగన్పై నిందారోపణలు... జనాన్ని ఆకర్షించని నిర్ణయాలు... సభలను నీరుగార్చేస్తున్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక్కోసభ నిర్వహించాలని యోచించినా... పట్టుమని పది సభలే నిర్వహించారు. అవి కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. దత్తపుత్రుడి సాయం తీసుకుందామను కుంటే... ఆయన నుంచి సానుకూల స్పందన రావడం లేదు. సీట్ల సర్దుబాటు తేలకుండా సభలకు వెళ్లేందుకు జనసేన నేతలు కూడా సుముఖత చూపడం లేదు. సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల ‘రా కదలిరా’ పేరిట ప్రారంభించిన సభలు అర్ధంతరంగా ఆపేస్తున్నారా... అంటే తమ్ముళ్లనుంచి ఔననే సమాధానం వస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనం ఏమాత్రం సానుకూలంగా లేకపోవడం... టీడీపీ నేతలు, క్యాడర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముక్కుతూ మూలుగుతూ ఇప్పటివరకు 10 సభలు నిర్వహించినా మిగిలిన జిల్లాల్లో వాటిని నిర్వహించడం కష్టమని చెబుతున్నారు. నెలాఖరులోగా ఎలాగోలా కొన్ని చోట్ల సభలు నిర్వహించి.. మరికొన్ని చోట్ల రద్దు చేసి.. మరో కార్యక్రమం తలపెట్టాలని భావిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఒంగోలుతో మొదలుపెట్టి 29వ తేదీ వరకూ షెడ్యూల్ ప్రకటించినా... జనం నుంచి స్పందన లేకపోవడంతో కొన్ని సభలు నిలిచిపోయాయి. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని జీడీ నెల్లూరు సభ, బుధవారం జరగాల్సిన రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఉరవకొండ సభలు వాయిదా పడ్డాయి. ఈ నెల 27న రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని గోపాలపురంలో సభ నిర్వహించాల్సి వున్నా అక్కడ రద్దు చేసి 29న రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. సభలన్నీ అట్టర్ ఫ్లాపే ఇప్పటివరకు నిర్వహించిన సభలన్నీ విఫలమవడంతో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. తిరువూరు, కనిగిరి, ఆచంట, ఆళ్లగడ్డ, గుడివాడ తదితర సభలు జనం లేక వెలవెలబోయాయి. సభలు విజయవంతమైనట్లు ఎల్లోమీడియా ఎంతగా బూస్టప్ ఇచ్చినా వాస్తవానికి అవన్నీ ఫ్లాపేనని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అరకులో పెట్టిన సభ తర్వాత ఇక నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రసంగంలో సీఎం జగన్పై ఈర్ష్య, ద్వేషంతో తిట్టిపోయడం తప్ప తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమిటి చేశారో చెప్పలేకపోవంతో జనం విసిగెత్తిపోతున్నారు. బాబు ప్రతి ఎన్నికల్లోనూ హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక దానిని బుట్టదాఖలు చేయడంతో ప్రజలు ఈసారి హామీలను ఏమాత్రం నమ్మడం లేదు. కార్యక్రమాలన్నీ విఫలమే... బాబు ఏ కార్యక్రమం చేపట్టినా విఫలమవుతూనే ఉన్నాయి. బాదుడే బాదుడు,, ఆయన కుమారుడు లోకేశ్ నిర్వహించిన పాదయాత్ర ఈ కోవలోకే వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయ్యాక ఆయన సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికీ సరైన ఆదరణ లభించలేదు. బాబుపై నమ్మకం పోయింది జనం తనను నమ్మడం లేదని చంద్రబాబు కూడా గుర్తించారు. అందుకే జనసేనతో కలిసి వారిని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నా అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రా కదలిరా సభలకు పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం దీనికి నిదర్శనం. సీట్లు ఖరారు కాకుండా సభలకు ఎందుకెళ్లాలని పవన్ వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే రా కదలిరా సభలకు ఇక ఫుల్స్టాప్ పెట్టనున్నారు. త్వరలో మరో కొత్త పేరుతో, కొత్త కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నా... అసలు జనాన్నిఆకర్షించలేకపోవడంతో ఏ పేరుతో కార్యక్రమం నిర్వహించినా ఉపయోగం ఏమిటనే అభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. -
ఈ నెల 25 నుంచి రీజనల్ క్యాడర్ సమావేశాలు
-
నేటి నుంచి బీఆర్ఎస్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బుధవారం నుంచి సన్నాహక సమావేశా లు నిర్వహించేందుకు భారత్ రాష్ట్ర సమితి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతలుగా రోజుకో లోక్సభ నియో జకవర్గం చొప్పున భేటీలు జరుగుతాయి. తొలి రోజు బుధవారం ఆదిలాబాద్ లోక్సభ నియోజక వర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశం ఏర్పా టు చేశారు. తెలంగాణ భవన్లో ఉదయం 10.30 కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్య క్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఆదిలా బాద్ మాజీ ఎంపీ గోడెం నగేశ్తో పాటు ఎమ్మెల్యే లు అనిల్ జాధవ్, కోవా లక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజక వర్గాల ఇన్చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సుమారు 500 మంది పాల్గొంటారు. సీనియర్ నేతలకు సమన్వయ బాధ్యతలు సన్నాహక సమావేశాలను కేటీఆర్తో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ స్పీకర్లు పోచా రం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్రావు, కడియం శ్రీహరి, జగదీశ్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు సమన్వ యం చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో లోక్సభ నియోజ కవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశా లు ఉన్నాయి. కాగా ఈ సన్నాహక సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచర ణపై దిశానిర్దేశం చేస్తారు. కేసీఆర్తో కేటీఆర్ భేటీ లోక్సభ సన్నాహక సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేటీఆర్ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేయాల్సిన అంశాలను కేసీఆర్ వివరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో తొలిసారిగా పార్టీ కీలక నేతలందరూ హాజరవుతుండటంతో ఈ సన్నాహక సమావేశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. -
సానుకూలంగానే మున్సిపల్ కార్మికులతో చర్చలు: మంత్రి ఆదిమూలపు
గుంటూరు, సాక్షి: పారిశుధ్య కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు ముగిశాయి. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ.. సానుకూలంగానే జరిగినట్లు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పలు డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని పేర్కొంటూ.. చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘కార్మికుల డిమాండ్ మేరకు హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు ఇచ్చాం. ఎక్స్గ్రేషియాపై సానుకూలంగా స్పందించాం. సమానపనికి సమాన వేతనంపై చర్చించాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చాం. దాని మేరకే చర్యలు తీసుకున్నాం. ఇవాళ్టి చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నాం. మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో ఇతర సమస్యలపైనా చర్చిస్తాం’’ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పారిశుద్ధ్య సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఝ చర్చలు జరిపింది. మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనటువంటి కేటగిరీల వారీగా బేసిక్ ఫే నిర్ణయం, పొరుగు సేవల విధానాన్ని కాంట్రాక్టు & శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఝ చర్చలు జరిగాయి. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పై పనిచేసే పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, అవసరానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం, కాంట్రాక్టు విదానంలో ఘన వ్యర్థాలను తరలించే వాహనాల పనితీరును మెరగుపర్చడం, పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల నిర్వహించే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం తదితర అంశాలపై కూడా సుదీర్ఝ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్ర శేఖర రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ, సిడిఎంఎ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్రకార్పొరేషన్ విసి & ఎండి గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండి వాసుదేవ రావు తదితర అధికారులతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఆనంద్ రావు (YSRTUC రాష్ట్ర ప్రెసిడెంట్), వై.వి.రమణ (YSRTUC ప్రధాన కార్యదర్శి), ఎ. రంగనాయకులు (AITUC రాష్ట్ర అధ్యక్షులు), పి. సుబ్బారాయుడు (AITUC ప్రధాన కార్యదర్శి), అబ్రహం లింకన్ (IFTU ప్రెసిడెంట్), జి. ప్రసాద్ (APCITU ప్రెసిడెంట్), కె. ఉమామహేశ్వరరావు (AP CITU ప్రధాన కార్యదర్శి), జి.రఘురామరాజు (TNTUC రాష్ట్ర ప్రెసిడెంట్), శ్యామ్ (TNTUC ప్రధాన కార్యదర్శి), మధుబాబు (AP MEWU రాష్ట్ర ప్రెసిడెంట్), అంజినీయులు (AP MEWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), GVRKH వరప్రసాద్ (AICTU రాష్ట్ర అధ్యక్షులు), కె. శ్రీనివాసరావు (AICTU జనరల్ సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడి అవకాశాలు గురించి తెలుసుకోవడానికి చక్కని అవకాశం
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఒమన్లోని సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ ప్రతినిధి బృందంతో వ్యాపార కార్యక్రమంలో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్, B2B సమావేశాలను ప్రకటించింది. ఈ కార్యక్రమం 2023 నవంబర్ 23, 24 తేదీల్లో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ప్రపంచ మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా సంస్థ 23 తేదీ సాయంత్రం ఇంటరాక్టివ్ సెషన్తో కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత B2B సమావేశాలు జరుగుతాయి. ఒమన్ అండ్ మిడిల్ ఈస్ట్లోని అనేక వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాలను గురించి నగరంలోని వ్యాపార వేత్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ అందించే ప్రయోజనాలు, వాటి ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటారు. ఇందులో పాల్గొనాలంటే తప్పకుండా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'రవి కుమార్ రెడ్డి కటారు' మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు మూలస్తంభంగా నిలుస్తుందని, ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు బలమైన కేంద్రమవుతుందని వ్యాఖ్యానించారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచడంలో ద్రుష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. యూరోప్, ఆఫ్రికాలలో మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య ప్రాంతంలోని వ్యాపారాల కోసం ఒమన్ దక్షిణ భారతదేశాన్ని ఇష్టపడుతోంది. ఇప్పటికే ఈ సంస్థలకు అమెరికా, సింగపూర్ దేశాల్లో కూడా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. అయితే త్వరలో జరిగే ఈ కార్యక్రమం ఒమన్లోకి ప్రవేశించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి భారతీయ వ్యాపారులకు అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. అసోచామ్ ఈ కార్యక్రమానికి పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానిస్తోంది. -
తుమ్మ ముండ్ల తుమ్మల కావాల్నా..పువ్వాడ కావాల్నా: ఖమ్మంలో కేసీఆర్
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో తుమ్మముండ్ల తుమ్మల కావాల్నా.. పువ్వుల్లో పెట్టి చూసుకునే పువ్వాడ కావాల్నా తేల్చుకోవాలని అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తుమ్మలకు నేను మంత్రి పదవి ఇస్తే నాకే ఆయన మంత్రి పదవి ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. ఇంత అరాచకంగా మాట్లాడతారా.. ఎవరు ఎవరికి మంత్రి పదవి ఇచ్చారో మీరే చూశారు. ఇక ఇంకొక అర్బకుడైతే ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనంటున్నాడు. అయనేమైనా ఖమ్మం ప్రజలను కొనేశాడా..ఖమ్మాన్ని గుత్తా పట్టాడా. ఖమ్మానికి పట్టిన ఆ ఇద్దరి పీడను వదిలించాం’ అని కేసీఆర్ అన్నారు. ‘ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఒకప్పుడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి కాలువలు, ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ కష్టాలు, యాక్సిడెంట్లు. ఇప్పుడు మంచి రోడ్లు, దగ దగలాడే సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు వచ్చాయి. ఒకనాటి లకారం చెరువు అంటే వికారం, ఇప్పుడు లకారం అంటే సుందరమైన చెరువు’అని కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ వల్లే సింగరేణిలో వాటా కేంద్రానికి పోయింది.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మొద్దని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లే సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి వెళ్లిందని విమర్శించారు. ప్రజల చేతిలో ఓటు వజ్రాయుధం అని చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థి వెనుక ఏ పార్టీ ఉన్నదో ఆ పార్టీ వైఖరి, చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలని ప్రజలను కేసీఆర్ కోరారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక సింగరేణి లాభాల బాట పట్టిందన్నారు. సింగరేణి తెలంగాణ ఆస్తి అని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగూడెం జిల్లాకు కరువనేదే రాదన్నారు. వనమా వెంకటేశ్వర్రావు ఎప్పుడు తన దగ్గరకు వచ్చినా వ్యక్తిగత పనులు అడగలేదని కేసీఆర్ చెప్పారు. కొత్తగూడెం అభివృద్ధి గురించి మాత్రమే అడిగారని తెలిపారు. వనమాను చూసి కాకుండా కేసీఆర్ను చూసి వనమాకు ఓటు వేయండని కోరారు. -
సభలకు బదులు రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభల నిర్వహణకు బదులు ప్రస్తుతానికి కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలకే పరిమితం కావాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలన్నింటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం మినహా ఇతర రాష్ట్రాల నేతలతో రోడ్షోల నిర్వహణ కోసం ప్లాన్ వేస్తోంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను సభకు తీసుకువచ్చే దాని కంటే ప్రజల్లోకి తామే వెళ్లడం మేలన్న ఆలోచనతో కార్యాచరణ రూపొందిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయాలని.. సాయంత్రం రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీని ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ కొత్త జోష్ వస్తుందని అంటున్నారు. నేటి బస్సు యాత్ర వాయిదా సోమవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్వహించతలపెట్టిన రెండో విడత బస్సు యాత్ర అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో తిరిగి యాత్ర ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అగ్రనేతలతో పెద్ద సభలు ఈ నెల 31న కొల్లాపూర్లో ప్రియాంకా గాంధీ బహిరంగ సభ జరగనుంది. దీనితోపాటు అగ్రనేతలతో మరో రెండు, మూడు పెద్ద సభ లు నిర్వహించాలని పీసీసీ నేతలు యోచిస్తు న్నారు. ఈ సభల్లో పార్టీ అతిరథ మహారథు లతో హామీలు ఇప్పించాలని భావిస్తున్నారు. అవి మినహా చాలా వరకు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, బస్సుయాత్రతో ఎన్నికల ప్రచారా న్ని కొనసాగించాలని నిర్ణయించారు. -
కేసీఆర్ సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్వల్పవిరామం తర్వాత తిరిగి గురువారం నుంచి బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభల్లో పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు పాల్గొంటారు. అయితే గతంలో ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తూ బహిరంగ సభల ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఈ నెల 26న నాగర్కర్నూలు, 27న స్టేషన్ ఘన్ పూర్లో నిర్వహించ తలపెట్టిన సభలను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ తాజాగా ప్రకటించింది. రద్దయిన సభల స్థానంలో 26న వనపర్తి, 27న మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. 26న వనపర్తితోపాటు అచ్చంపేట, మునుగోడులో, 27న మహబూబాబాద్, వర్ధన్న పేటతోపాటు పాలేరులో జరిగే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 28న విరామం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భా గంగా ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు 17 రోజుల్లో 41 అసెంబ్లీ నియోజ కవర్గాల్లో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ను గతంలో బీఆర్ఎస్ ప్రకటించింది. ఈనెల 15 మొదలుకుని 18 వరకు కేసీఆర్ హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్లో జరిగిన సభల్లో ప్రసంగించారు. సద్దుల బతుకమ్మ, దసరా నేప థ్యంలో ఈనెల 19 నుంచి 25 వరకు కేసీఆర్ పాల్గొనే సభలకు విరామం ప్రకటించారు. 26 నుంచి తిరిగి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభమై వచ్చే నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ నెల 28న ప్రచారానికి విరా మం ఇచ్చి 29న కోదాడ, తుంగతు ర్తి, ఆలేరు 30న జుక్కల్, బాన్సువాడ, నారాయ ణ్ఖేడ్లలో, 31న హుజూర్నగర్, మిర్యాలగూ డ, దేవరకొండ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. తిరిగి నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందు, 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి 3న భైంసా (ముధోల్), ఆర్మూర్, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల్, మఖ్తల్, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, 9న కామారెడ్డి సభల్లో ప్రసంగిస్తారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. -
ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లలో అధికారులకు క్షణం తీరిక దొరకడం లేదు..!
సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. కలెక్టరేట్లోని దాదాపు అన్ని శాఖల జిల్లా అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. రోజూ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు జరపడం, సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా మారారు. కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు కమిటీలు.. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కలెక్టర్ ఎస్. వెంకట్రావు 17 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా విధులు కేటాయించారు. ఇందులో మోడల్ కోడ్ అమలు, ఈవీఎం, వీవీ ప్యాట్ల పర్యవేక్షణ, ఉద్యోగులకు విధుల కేటాయింపు, అభ్యర్థి తరఫున ఏజెంట్లకు లైసెన్స్ ఇవ్వడానికి, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పన, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటరు నమోదుపై అవగాహన, ఎన్నికల వ్యయ నిర్ధారణ, మీడియా కమ్యూనికేషన్, పోస్టల్ బ్యాలెట్– ఈవీఎం బ్యాలెట్ కమిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, గెస్ట్ హౌస్ల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్, హెల్ప్లైన్ అండ్ కంట్రోల్ యూనిట్, ఎంసీఎంసీఏ, పోలీస్ కోఆర్డినేషన్, హెలిపాడ్ కోఆర్డినేషన్ వంటి వాటికి వివిధ శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇటు శాఖా పరమైన విధులు.. అటు ఎన్నికల పనులు కలెక్టరేట్లో ఎన్నికల విభాగం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారికి సహాయకులుగా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎన్నికల సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు కాగా మరో నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా నెల రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వీరే కాకుండా ఆయా శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులైతే ఇటు తమ శాఖకు సంబంధించిన పనులు చేస్తూ అటు ఎన్నికల ఏర్పాట్లపై తమకు కేటాయించిన మండలాలు, గ్రామాలకు వెళ్లి క్షేత్ర పర్యటన చేస్తున్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలు, ఇంకా కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే కేటాయించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గానికి జగదీశ్వర్రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గానికి సూర్యాపేట ఆర్డీఓ వీరబ్రహ్మచారి, కోదాడ నియోజకవర్గానికి కోదాడ ఆర్డీఓ సూర్యానారాయణలను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. అదే విధంగా నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దగ్గర నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు. అదే విధంగా అభ్యర్థుల వ్యయ నిర్ధారణ, ఫిర్యాదులు, చర్యలు వంటివి రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 12 వేల మంది పోలింగ్ నిర్వహణకు సిబ్బందిని కేటాయించే పనిలో జిల్లా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ఇతర శాఖల ఉద్యోగులను పోలింగ్ నిర్వహణకు వినియోగించుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడక పోతే ప్రైవేట్ ఉపాధ్యాయులను విధులకు వాడనున్నారు. జిల్లాలో 1,201 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఇద్దరు, లేదా ముగ్గురు పోలింగ్ సిబ్బందిని కేటాయించనున్నారు. దీని ప్రకారం 1,201 మంది పోలింగ్ అధికారులు, 1,201 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు , ఇద్దరు సిబ్బందిని వాడితే 2,402 మంది, లేదా ముగ్గురిని కేటాయిస్తే 3,603 మంది ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించనున్నారు. -
లక్ష మందితో బీజేపీ ‘జనగర్జన’..
ఆదిలాబాద్: షెడ్యూల్ విడుదలతో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది. ప్రచారంలో భా గంగా రాష్ట్రంలోనే తొలి బహిరంగ సభ ఆదిలాబాద్లో నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా మంగళవారం జిల్లా కేంద్రానికి విచ్చేయనున్నారు. ఈ బహిరంగసభకు జనగర్జనగా నామకరణం చేశా రు. డైట్ మైదానంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, నేతలు బండి సంజయ్, ఈటల ఇతరత్రా ము ఖ్యనేతలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూసే జాతీయనేతలు కూడా హాజరు కానున్నారు. ఈ స భ కోసం కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నా రు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ ద్వారా బీజేపీ ఎన్నికల సమరశంఖం పూరించనుంది. లక్ష జనసమీకరణ.. ఈ సభ కోసం బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. డైట్ మైదానంలో నిర్వహిస్తుండగా ప్రాంగణంలో జర్మన్ టెంట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి వాతావరణంలోనైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు లక్ష జనాన్ని సమీకరించేలా ప్రణాళిక చేశారు. ఆయా నియోజకవర్గాల బాధ్యులు జనసమీకరణపై దృష్టి సారించారు. కాషాయమయం.. బీజేపీ జనగర్జన సభ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం పూర్తిగా కాషాయమయంగా మారిపోయింది. పట్టణంలోని డివైడర్ పొడవునా, ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చౌక్లను పార్టీ జెండాలతో నింపేశారు. ఎన్నికల తొలి బహిరంగ సభ కావడం, కేంద్ర హోంమంత్రితో పాటు జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హోంమంత్రి హెలీక్యాప్టర్ అక్కడ దిగనుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనం ద్వారా డైట్ మైదానానికి చేరుకుంటారు. అడుగడునా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్ షా జెడ్ప్లస్ సెక్యూరిటీలో ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ డి.ఉదయ్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలీప్యాడ్ స్థలంతో పాటు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. -
92 శాతం కౌలురైతులకు సీసీఆర్సీలు
సాక్షి, అమరావతి: కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్సీ)ల జారీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ప్రభుత్వం 92 శాతం లక్ష్యాన్ని సాధించింది. కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వడంతోపాటు వారికి బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించడంపై ప్రత్యేకదృష్టి సారించింది. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య అవగాహన ఒప్పందాలను కుదిర్చి భూ యజమానులకు నష్టం లేకుండా కౌలురైతులకు మేలుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కౌలురైతులకు సీసీఆర్సీలు జారీచేసి వీలైనంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి ప్రతి వారం కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షిస్తున్నారు. కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడంపై సీఎస్ ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమంది కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 8.10 లక్షలమందికి (92 శాతం) కార్డులు జారీచేశారు. 13 జిల్లాల్లో లక్ష్యానికి మించి ఈ కార్డులు జారీచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా లక్ష్యాలను సాధించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డులున్న వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కోసం లోన్ చార్జ్ క్రియేష్ మాడ్యూల్ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఈ–క్రాప్తో కౌలురైతుల రుణ ఖాతాలను అనుసంధానించనున్నట్లు చెప్పారు. బ్యాంకులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.948.77 కోట్ల మేర కౌలురైతులకు రుణాలిచ్చాయని తెలిపారు. మరింతమంది కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాంకర్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, బ్రాంచీల స్థాయిలో మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ యజమానులకు ఎటువంటి హాని కలగకుండానే కౌలురైతులకు రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలురైతులకు సహకరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. -
ఐటీ హబ్గా విశాఖ
సాక్షి, అమరావతి: రానున్న కాలంలో విశాఖ నగరం ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారనుంది. ఈ రంగంలో కొత్తగా కెరీర్ ప్రారంభించే వారికి అది అవకాశాల గని కానుంది. ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో ఐటీ రంగంలో ఒక్క విశాఖపట్నంలోనే ఐదులక్షలకు పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని పల్సస్ గ్రూపు తన అధ్యయన నివేదికలో వెల్లడించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో పాటు ఇక్కడ ఉపాధి అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించడంతో ఐటీ హబ్గా విశాఖ వేగంగా ఎదుగుతోందని పల్సస్ గ్రూపు సీఈఓ శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్, రాండ్స్టాండ్, అమెజాన్, అదానీ డేటాసెంటర్ వంటివి రావడంతో పాటు ఆంధ్రయూనివర్సిటీలో ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్పై సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ, పారిశ్రామిక రంగంలో నాలుగో తరం టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలు ఇక్కడ ఏర్పాటుకావడంతో అంతులేని ఉపాధి అవకాశాల నిధిగా విశాఖ ఎదుగుతోందన్నారు. ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాలకు వేదికగా ఎంపిక కావడంతో ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఫార్మాస్యూటికల్, హెల్త్కేర్, ఐటీ, ఐటీ ఆధారిత సేవల్లో విశాఖపట్ననికి ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న మానవ వనరులను ప్రపంచ దేశాలకు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఏటా మూడు లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకుంటుంటే అందులో ఒక్క విశాఖ చుట్టుపక్కల నుంచే 1.5 లక్షల మంది వస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశాఖకు ఇది కలిసొచ్చే అతిపెద్ద అంశమని ఆ నివేదికలో పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో కొలువుల పండగ.. ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు రానుండగా అందులో ఒక్క విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు పల్సస్ గ్రూపు అంచనా వేసింది. ఇందులో ఒక్క ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్ రంగంలోనే విశాఖలో 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం విశాఖలోని ఐటీ రంగం 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే హెల్త్కేర్, ఫార్మా, మెరైన్ ఇండస్ట్రీస్, పర్యాటకం, రక్షణ, విద్య వంటి రంగాలు లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ సంఖ్య ఐదేళ్లలో ఐదు లక్షలకు చేరుతుందని శ్రీనుబాబు వివరించారు. -
ముకేశ్ అంబానీ బాటలోనే..
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్ అందుకోను న్నారు.ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు) నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్ను ఆర్ఐఎల్ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్ అందుకున్నట్లు ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్ ఆర్ఐఎల్ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్ఐఎల్ పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు) -
సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఆరు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 16, 17 తేదీల్లో హైదరా బాద్ వేదికగా జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నిర్వహణ కోసం టీపీసీసీ ఆరు కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు 39 మంది ముఖ్య నేతలతో రిసెప్షన్ కమిటీని నియమించింది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు దామోదర రాజనర్సింహ, వంశీచందర్రెడ్డిలతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ కమిటీలో చోటు కల్పించింది. మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్గా ఏడుగురితో సోషల్ మీడియా కమిటీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్గౌడ్ చైర్మన్గా ఏడుగురితో ట్రాన్స్పోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఖమ్మం మాజీ ఎంపీ, టీపీపీసీ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీని వాస్రెడ్డి చైర్మన్గా, గాలి అనిల్కుమార్ కోచైర్మన్గా పబ్లిసిటీ అండ్ బ్రాండింగ్ కమిటీ, అజారుద్దీన్ చైర్మన్గా జీహెచ్ఎంసీ పబ్లిసిటీ కమిటీ, టీపీసీసీ ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్ రావు చైర్మన్గా ప్రొటోకాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 29 మందిని సభ్యులుగా నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ చదవండి: గుడుంబా పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చింది: ఈటల -
ముగిసిన జీ20 సమావేశాలు
Udates.. ► నవంబర్లో మరోసారి జీ20 దేశాలు వర్చువల్ సెషన్లో భేటీ కానున్నాయి. అప్పటి వరకు అధికారికంగా భారత్ అధ్యక్ష దేశంగా ఉండనుంది. ► జీ20 సమ్మిట్ ముగిసిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్ ఫలవంతం అవుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. ► జీ 20 సమావేశాలు ముగిశాయి. తదుపరి జీ 20 బాధ్యతలను బ్రెజిల్కు అప్పగించింది భారత్. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు బాధ్యతలను అందించారు. #WATCH | G 20 in India | Prime Minister Narendra Modi hands over the gavel of G 20 presidency to the President of Brazil Luiz Inácio Lula da Silva. pic.twitter.com/ihEmXN9lty — ANI (@ANI) September 10, 2023 ►జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ దిగ్విజయంగా నిర్వహించిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు . గ్లోబల్ సౌత్కు మంచి ప్రాతనిధ్యం లభించిందని చెప్పారు. #WATCH | G 20 in India: "I think it (craft exhibition) is wonderful...I think the presidency has done a very good job of being a voice of the global south & the fact that they managed to get a consensus is a testament to the leadership of G 20...," says Stephane Dujarric,… pic.twitter.com/ooYqTqGfKy — ANI (@ANI) September 10, 2023 ►వసుధైక కుటుంబం విజయవంతమైందని త్రిపుర సీఎం మాణిక్ సాహా అన్నారు. జీ20 నిర్వహణలో భారత్ విజయం సాధించిందని చెప్పారు. #WATCH | G 20 in India | Delhi: Tripura CM Manik Saha says, "We have seen in the reports, that it (G20 Summit) has been extremely successful... We got to know what we can provide for other countries and what they can give us...Our idea of 'Vasudhaiva Kutumbakam' has… pic.twitter.com/EZN8k7Pz1v — ANI (@ANI) September 10, 2023 ► బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గ్రీన్ క్లైమేట్ ఫండ్గా 2 బిలియన్ల డాలర్లను ప్రకటించారు. G20: UK PM Rishi Sunak announces USD 2bn Green Climate Fund Read @ANI Story | https://t.co/rl0Xq1ZjZF#G20SummitDelhi #G20India2023 #G20SummitIndia #RishiSunak #GreenClimateFund pic.twitter.com/XrQNGSmZ2q — ANI Digital (@ani_digital) September 10, 2023 ► రెండోరోజు జీ20 సమావేశంలో వివిధ నేతల మధ్య దౌపాక్షిక సంబంధాలపై చర్చలతో పాటు కీలక అంశాల గురించి మాట్లాడుతారు. ఈ రోజు లంచ్ బ్రేక్ సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ► జీ20 సమావేశం ముగిసిన అనంతరం జో బైడెన్ భారత్ నుంచి వెనుదిరిగారు. ఢిల్లీ నుంచి వియత్నాం వెళ్లనున్నారు. ఈ మేరకు ఎయిర్పోర్టులో తన విమానం ఎక్కారు. G 20 in India | US President Joe Biden departs from Delhi to Vietnam, after concluding the G20 Summit. (Source: Reuters) pic.twitter.com/ng4zJvRDz0 — ANI (@ANI) September 10, 2023 ► రాజ్ఘాట్ వద్ద జీ20 నేతలు మహాత్మాాగాంధీకి నివాళులు అర్పించారు. G 20 in India | "At the iconic Rajghat, the G20 family paid homage to Mahatma Gandhi - the beacon of peace, service, compassion and non-violence. As diverse nations converge, Gandhi Ji’s timeless ideals guide our collective vision for a harmonious, inclusive and prosperous global… pic.twitter.com/turd4bexWV — ANI (@ANI) September 10, 2023 ► రాజ్ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, కెనడా ప్రధాని జస్టిన్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీకి చిత్రపటానికి నివాళులర్పించారు. #WATCH | G 20 in India: Prime Minister Narendra Modi, US President Joe Biden, UK PM Rishi Sunak, Australian PM Anthony Albanese, Canadian PM Justin Trudeau, Russian Foreign Minister Sergey Lavrov and other Heads of state and government and Heads of international organizations at… pic.twitter.com/HP6iGlNq3h — ANI (@ANI) September 10, 2023 ► ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్మగాంధీకి నివాళులు అర్పించే కార్యక్రమం వద్ద ఏర్పాటు దృశ్యాలు G 20 in India | Visuals from Rajghat where G 20 leaders & other Heads of international organizations will pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/GThS3YEKtJ — ANI (@ANI) September 10, 2023 ► సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఢిల్లీలోని రాజ్ఘాట్కు చేరుకున్నారు. ప్రధాని మోదీ వారికి స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. #WATCH | G 20 in India | Singapore Prime Minister Lee Hsien Loong arrives at Delhi's Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/RmPgDManH4 — ANI (@ANI) September 10, 2023 ► మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ ఢిల్లీలోని రాజ్ఘాట్కు చేరుకున్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. #WATCH | G 20 in India | Prime Minister of Mauritius Pravind Kumar Jugnauth arrives at Delhi's Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/3fbdIXXKQo — ANI (@ANI) September 10, 2023 ► బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా రాజ్ఘాట్కు చేరుకున్నారు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించనున్నారు. VIDEO | G20 Summit: PM Modi welcomes his Bangladeshi counterpart Sheikh Hasina at Rajghat, New Delhi.#G20India2023 #G20SummitDelhi pic.twitter.com/DIOjDXmKNY — Press Trust of India (@PTI_News) September 10, 2023 ► ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. VIDEO | G20 Summit: PM Modi welcomes Egypt President Abdel Fattah El-Sisi at Rajghat, New Delhi.#G20India2023 #G20SummitDelhi pic.twitter.com/rCfZ3LPDpP — Press Trust of India (@PTI_News) September 10, 2023 ► జీ20 ప్రతినిధులు రాజ్ఘాట్కు వచ్చారు. వారిని ప్రధాని నరేంద్ర మోదీ ఖాదీతో స్వాగతం పలికారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా, IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, ఇతర నాయకులు, ప్రతినిధులు ఢిల్లీలోని రాజ్ఘాట్కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారు. #WATCH | G 20 in India: President of Asian Development Bank Masatsugu Asakawa, Kristalina Georgieva, Managing Director of IMF and other leaders and delegates arrive at Delhi's Rajghat to pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/ufLtJIlNEf — ANI (@ANI) September 10, 2023 ► జీ20 ప్రతినిధులు రాజ్ఘాట్ను సందర్శించనున్న క్రమంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. VIDEO | G20 Summit: Security tightened near Mahatma Gandhi Road in Delhi ahead of world leaders' visit to Rajghat.#G20India2023 #G20SummitDelhi pic.twitter.com/n4m2Q7hos0 — Press Trust of India (@PTI_News) September 10, 2023 ► జీ20 రెండో రోజులో భాగంగా దేశ విదేశీ ప్రతినిధులు రాజ్ఘాట్ను సందర్శించనున్నారు. మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ► ఢిల్లీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. జీ20 రెండో రోజు కార్యక్రమాలకు వర్షం అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే.. -
పార్లమెంట్ కొత్త భవనంలోనే ప్రత్యేక సమావేశాలు
ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగ్విజయంగా నూతన పార్లమెంట్ను నిర్మించిన విషయం తెలిసిందే. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. అయితే.. నూతన పార్లమెంట్లో మొదటి సమావేశాలను వచ్చే ఏడాది ఎన్నిక కానున్న కొత్త ప్రభుత్వమే నిర్వహిస్తుందని అందరూ ఊహించారు. కానీ కేంద్రం ఈ నెల 18-22 వరకు ప్రత్యేక సమావేశాలను కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కొత్త పార్లమెంట్లో నిర్వహించనున్న మొదటి సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం తెరమీదకు వచ్చిన జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు వంటి బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నామని స్పష్టం చేసింది. ఈ సెషన్ అజెండాను మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఈ సమావేశాల అజెండా ఏంటో తెలపాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇదీ చదవండి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలెందుకు?.. ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ -
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బల ప్రదర్శన
జనగామ /కుషాయిగూడ (హైదరాబాద్): నియోజకవర్గంలో అసమ్మతి నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలో స్థానిక పార్టీ శ్రేణులతో ర్యాలీలు, సమావేశాలు జరపడంతోపాటు హైదరాబాద్లోనూ భేటీ అయ్యారు. స్థానిక నాయకత్వం తన వెంటే ఉందని చాటుకునే ప్రయత్నం చేశారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో అసమ్మతి వర్గం సమావేశం కావడం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్కడికి వెళ్లడంతో వాగ్వాదం జరగడం తెలిసిందే. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఈ అసమ్మతిని రాజేస్తున్నాడని ముత్తిరెడ్డి ఆరోపించారు కూడా. ఈ క్రమంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు తనతోనే ఉన్నాయనేలా గురువారం బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో భారీ ర్యాలీలు నిర్వహించడంతోపాటు ఏకకాలంలో మీడియా సమావేశాలు పెట్టి స్థానిక నేతలతో తనకు మద్దతు ప్రకటించేలా చేశారు. తర్వాత వారందరితో హైదరాబాద్లోని మల్లాపూర్లో ఉన్న నోమా ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సెలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నేతలు తమ మద్దతు ముత్తిరెడ్డికే ఉంటుందని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీలన్నీ ముత్తిరెడ్డికి మద్దతు ఇస్తున్నట్టుగా చేసిన తీర్మానాల పత్రాలను ముత్తిరెడ్డికి అందజేశారు. కావాలని అభాసుపాలు చేస్తున్నారు: ముత్తిరెడ్డి తనపై కుట్రలు కొత్తేమీ కాదని.. ఇంతకుముందు 2014లో, 2018లోనూ కుట్రలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. తానేమిటో తెలిసిన సీఎం కేసీఆర్ రెండుసార్లు తనకే టికెట్ ఇచ్చారని.. నియోజకవర్గ ప్రజలు గెలిపించారని చెప్పారు. మల్లాపూర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నాటి కుట్రల పాచికలు పారకపోవడంతో తాజాగా కుటుంబ కలహాల బూ చితో నన్ను అభాసుపాలు చేసేందుకు, వివాదా స్పదుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు అధినేత కేసీఆర్పై నమ్మకముంది. ఉద్యమ నాయ కుడిగా, పార్టీ సైనికుడిగా నాకు గుర్తింపునిస్తూనే వచ్చారు. భవిష్యత్తులో కూడా నాకు ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఈ సమావేశానికి సంబంధించిన అంతర్యాన్ని, నిర్ణయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా..’’ అని తెలిపారు. -
ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అనుబంధ విభాగాలైన వైఎస్సార్ డాక్టర్స్, క్రిస్టియన్, మైనారిటీ, ప్రచార, చేనేత విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులతో విజయసాయిరెడ్డి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై టీడీపీ, దాని అనుకూల మీడియా, సోషల్ మీడియాలో కృత్రిమంగా ప్రజావ్యతిరేకతను సృష్టించే కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని సాగుతున్న ప్రచారంలో ఇసుమంత కూడా వాస్తవం లేదన్నారు. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాలని, ఏపీలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికి రోల్ మోడల్గా నిలిచాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. వివిధ రాష్ట్రాల అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి వెళ్తున్నారని చెప్పారు. పార్టీ కమిటీలను త్వరగా భర్తీ చేసి.. 2024 అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు క్షేత్రస్థాయిలోనే తగు రీతిలో కౌంటర్ ఇవ్వాలన్నారు. అనుబంధ విభాగాలకు ముగ్గురేసి ఉపాధ్యక్షులు పార్టీ అనుబంధ విభాగాలకు ముగ్గురు చొప్పున ఉపాధ్యక్షులను నియమిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ పటిష్టతకు రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా, 8 జోన్లుగా విభజించినట్టు చెప్పారు. రాష్ట్ర పార్టీ విభాగానికి అధ్యక్షుడు ఉంటారని, అధ్యక్షుడుతో పాటుగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి ఒక ఉపాధ్యక్షుడు, కోస్తాంధ్ర జిల్లాల నుంచి ఒక ఉపాధ్యక్షుడు, రాయలసీమ జిల్లాల నుండి ఒక ఉపాధ్యక్షుడు చొప్పున నియమిస్తామని చెప్పారు. ఈ ముగ్గురు పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షుడి కింద పని చేస్తారన్నారు. ఈ సమావేశాల్లో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , డాక్టర్ల విభాగం అధ్యక్షుడు బత్తుల అశోక్కుమార్రెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ విభాగ అధ్యక్షుడు మేడిది జాన్సన్, ప్రచార విభాగ కమిటీ అధ్యక్షుడు ఆర్.ధనుంజయ రెడ్డి, చేనేత విభాగ అధ్యక్షుడు గంజి చిరంజీవి పాల్గొన్నారు. -
సీఎం జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శం...
-
ఘనంగా ‘ఆసరా’ సంబరాలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమాలతో పొదుపు సంఘాల మహిళలు రాష్ట్రమంతటా సంబరాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్రమంతటా 83 మండలాల్లో పొదుపు సంఘాల మహిళల లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా ప్రాంత పొదపు సంఘ మహిళలకు ప్రభుత్వం మూడో విడతలో అందజేస్తున్న ఆర్థిక మొత్తం చెక్కులను అందజేసి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని వారికి వినిపించారు. మహిళలు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతలు తెలియజేయగా, కొన్ని చోట్ల ‘థాక్యూ సీఎం సార్’ «‘థాంక్యూ జగనన్నా..’ అని రాసిన మట్టి కుండలను ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తంచేశారు. మార్చి 25న సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో ‘వైఎస్సార్ ఆసరా’ మూడో విడత పంపిణీని లాంఛనంగా ప్రారంభించగా, ఏప్రిల్ 5వ తేదీ వరకు మహిళలతో ముఖాముకి నిర్వహిస్తూ, వారికి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 346 మండలాల్లో పొదుపు సంఘాల మహిళలతో ముఖాముఖి సమావేశాలు జరిగినట్లు సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
Telangana BJP: బీజేపీ స్ట్రీట్కార్నర్ మీటింగ్లు
నేటి నుంచి రాష్ట్రంలో 11 వేల శక్తి కేంద్రాల్లో ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ పేరిట స్ట్రీట్ కార్నర్ మీటింగ్లకు బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 25 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాల పరిధిలోని పోలింగ్బూత్లలో నిర్వహించనుంది. సాక్షి, హైదరాబాద్: శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోని 11 వేల శక్తి కేంద్రాల్లో (3,4 పోలింగ్ బూత్లు కలిపి ఓ కేంద్రం) ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ పేరిట వీధి చివరి సమావేశాలకు (స్టీట్ కార్నర్) బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 25 వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్బూత్లలో వీటిని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్బోయిన్పల్లి చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాంఛనంగా ప్రారంభిస్తారు. సికింద్రాబాద్లో కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, మహబూబ్నగర్లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సనత్నగర్లో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, శేరిలింగంపల్లిలో మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్రావు, వరంగల్ పశ్చిమలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఉప్పల్లో ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు పాల్గొంటారు. సాయంత్రం సనత్నగర్ నియోజకవర్గంలోని బల్కంపేట అమ్మవారి ఆలయం వెనకవైపు నిర్వహించే కార్నర్ మీటింగ్కు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. కేసీఆర్ను గద్దె దింపాల్సిన సమయం వచ్చేసింది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఫక్తు రాజకీయాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ప్రజాగోస స్ట్రీట్కార్నర్ మీటింగ్స్ కోఆర్డినేటర్ డా.కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో విమర్శించారు. అన్ని రంగాల్లో విఫలమై ప్రజాసమస్యలను పరిష్కరించని కేసీఆర్ సర్కార్ను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైనందున, బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు శుక్రవారం నుంచి వీధిచివర సమావేశాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. -
ప్రైవేటు బ్యాంకర్లతో కేంద్ర పథకాలపై సమీక్ష
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకుని రావడానికి సంబంధించిన పథకాలు, సామాజిక భద్రతకు ఉద్దేశించిన కార్యక్రమాల్లో ప్రైవేటు బ్యాంకింగ్ సాధించిన పురోగతిని ఆర్థికశాఖ మంగళవారం సమీక్షించింది. ఈ మేరకు ప్రైవేటు బ్యాంకర్లతో సీనియర్ ఆర్థికశాఖ అధికారులు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థికశాఖ సేవల కార్యదర్శి (డీఎఫ్ఎస్) డాక్టర్ వివేక్ జోషి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రైవేటు రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాన్మంత్రి జన్ధన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం సేవానిధి వంటి పథకాల పురోగతి సమీక్షలో ప్రధాన అంశంగా ఉందని డీఎఫ్ఎస్ ఒక ట్వీట్లో పేర్కొంది. ఇదే అంశంపై గత వారం జోషి ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
Telangana Congress: ఠాక్రే మంతనాలతో కాంగ్రెస్ మూడ్ ఛేంజ్!
సాక్షి, హైదరాబాద్: కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న స్ఫూర్తితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ఇన్చార్జిగా నియామకమైన తర్వాత రెండు సార్లు రాష్ట్రానికి వచ్చిన ఆయన.. నేతలను కూర్చోబెట్టి మంతనాలు జరపడానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలందరితో విడివిడిగా, సామూహికంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలు, అంతర్గత విభేదాలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయనకు పూర్తి అవగాహనకు వచ్చినట్టేనని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఆయన చర్యల ఫలితంగానే రాష్ట్ర కాంగ్రెస్లో మూడ్ మారిందని, నేతల్లో విభేదాలు దూరం అవుతున్నాయని చెప్తున్నాయి. రెండో దశ పర్యటనలో భాగంగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు పర్యటించిన ఠాక్రే ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలపై దృష్టి కేంద్రీకరించినా.. వచ్చే ఎన్నికల కోసం పార్టీ నేతలను సన్నద్ధం చేసే పనికి కూడా శ్రీకారం చుట్టారని అంటున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల్లో మూడో దఫా పర్యటనకు రానున్నారని చెప్తున్నాయి. మీ వంతుగా ఏం చేశారు.. ఏం చేస్తారు? తొలి పర్యటనలో పార్టీ సీనియర్లతో విడివిడిగా భేటీ అయిన ఠాక్రే.. తాజా పర్యటనలో పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలతో సమావేశమయ్యారు. కీలకమైన టీపీసీసీ ప్రచార కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలతో భేటీ అయి చర్చించారు. ఈ సందర్భంగా ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై గాంధీభవన్లో చర్చ జరుగుతోంది. పార్టీ బలంగా ఉందని, అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, పార్టీలో ప్రాధాన్యత కావాలని కొందరు నేతలు చెప్పడాన్ని సున్నితంగా తిరస్కరించిన ఆయన.. ఈ విషయాలన్నీ తాను చూసుకుంటానని, మీ వంతుగా ఏం చేశారు, ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించినట్టు సమాచారం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో మీ టీంలు ఏం పనులు చేస్తున్నాయో చెప్పాలని నేతలను అడిగినట్టు తెలిసింది. తొలుత ఎన్నికలకు సిద్ధమయ్యే దిశలో తమ కమిటీలు, బృందాలను సిద్ధం చేసుకోవాలని.. క్షేత్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సమాయత్తం చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా ఠాక్రే తన రెండో పర్యటనలోనే బహిరంగ సభకు, ఇతర కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారా తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం ప్రారంభించారనే చర్చ జరుగుతోంది. చదవండి: రజాకార్లను తరిమినోళ్లం.. కేసీఆర్ను ఓడించలేమా? -
రోడ్లపై సభలు, రోడ్షోల నియంత్రణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రోడ్లపై సభలు, రోడ్షోలను నియంత్రించడం, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటం మధ్య ప్రభుత్వం సమతుల్యతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్షోలో తొక్కిసలాట కారణంగా పలువురు మరణించిన నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, రోడ్షోలకు అనుమతివ్వకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోడ్లు, రోడ్ మార్జిన్లలో సభలు, రోడ్షోలను నియంత్రిస్తూ జారీ చేసిన జీవో 1 విషయంలో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిలక్ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. కందుకూరులో మానవ తప్పిదం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సన్నని వీధుల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. చదవండి: (Fact Check: రామోజీ వలంటీర్లంటే వణుకేల?.. వాస్తవాలివిగో..) ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, రోడ్లపై జరిగే ప్రతి కార్యక్రమాన్ని నిషేధించాలని కోరలేరని తెలిపింది. సభలు, రోడ్షోలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1పై ఓ వ్యాజ్యం పెండింగ్లో ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగానే జీవో 1 జారీ చేసిందన్నారు. జీవో 1 అమలును నిలిపివేస్తూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుందని వివరించారు. -
రోడ్లపై నో " షో "
-
రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం.. మాకు కూడా ఇవే రూల్స్ : సజ్జల
-
జాతీయ భేటీలతో మైలేజీ పెంచుకోవాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ రాజకీయ ఎదుగుదలకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకు అవసరమైన కార్యాచరణపై దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్నామ్యాయం బీజేపీనే అనే ప్రచారాన్ని వివిధ రూపాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటి సారిగా హైదరాబాద్లో ఈ సమావేశాలు జరగ నుండడం, ఉమ్మడి ఏపీలో 2003లో నిర్వహిం చాక 20 ఏళ్ల తర్వాత ఇక్కడ నిర్వహిస్తుండ టాన్ని పెద్దయెత్తున ప్రచారం చేయనుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలనే ధ్యేయంతోనే ఈ భేటీకి తెలంగాణ ను జాతీయ నాయకత్వం ఎంపిక చేసిందనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లో నూ ఈ సమావేశాలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది. ఆ 3 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు! వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన రోడ్మ్యాప్ను జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నాయకత్వం నిర్దేశించనుందనే ప్రచారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లను న్నారు. సమావేశాలు ముగిసేదాకా రాష్ట్రవ్యా ప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర బీజేపీ యోచిస్తోంది. జూలై 1,2,3 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రా ల్లో పార్టీపరంగా ఏదైనా కార్యక్రమాన్ని నిర్వ హించి, జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రత్యే కతను, ఎందుకు రాష్ట్రంలో వాటిని నిర్వహిస్తు న్నారనే విషయాలను తెలియజేయాలని నిర్ణయించారు. తెలంగాణకు, రాష్ట్ర పార్టీకి.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా ఇస్తున్న ప్రాధాన్యతను గురించి వివరించనున్నారు. 3 రోజులపాటు పలువురు కేంద్రమంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు హైద రాబాద్లోనే బస చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాతీలు, మహారాష్ట్రి యన్లు, పంజాబీలు, తమిళులు, కన్నడ ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్రపార్టీకి మద్దతు కూడగట్టనున్నారు. సెల్ఫీలు దిగితే సెల్ఫోన్లు లాక్కుంటాం... ఈ సమావేశాల్లో ప్రధానిసహా ముఖ్యనేత లతోనూ సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయొ ద్దని జాతీయ నేతలు హెచ్చరించారు. సెల్ఫీ లు దిగి ట్విట్టర్, ఫేస్బుక్లలో పెట్టే ప్రయ త్నాలు చేయొద్దని సూచించారు. ఈ సూచనలు ఉల్లంఘిస్తే ఫోన్లు లాగేసుకుంటామని స్పష్టం చేశారు. -
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తు షురూ
-
28న అసెంబ్లీ కమిటీల సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న శాసనసభ భవనంలోని కమిటీ హాల్లో ఉదయం 11 గంటలకు ‘పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ’, ఉదయం 11.30 గంటలకు ‘షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ’సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు తెలిపారు. -
ఎన్నికల వ్యూహంపై చర్చిస్తాం
సాక్షి, హైదరాబాద్: మూడు రోజులపాటు కొనసాగే సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ఆ పార్టీ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, బృందాకారత్తోపాటు మిగతా పొలిట్బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఏచూరి మాట్లాడుతూ తమ పార్టీ అఖిల భారత మహాసభలను ఏప్రిల్లో కేరళలోని కన్నూర్లో నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాపై చర్చిస్తామని, అనంతరం ప్రజలకు విడుదల చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన సూచనలు, సవరణలు, అభిప్రాయాలను తమ పార్టీ సభ్యులందరూ కేంద్ర కమిటీకి తెలపొచ్చని అన్నారు. ఇందుకోసం నెలరోజుల గడువు ఇస్తామని, ఇది సీపీఎం అంతర్గత ప్రజాస్వామ్యమని వివరించారు. సవరణల అనంతరం అఖిల భారత మహాసభలో రాజకీయ నివేదికను ప్రవేశపెడతామని తెలిపారు. త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహంపై కూడా కేంద్ర కమిటీలో చర్చిస్తామని ఏచూరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ మలయాళీ అసోసియేషన్ శనివారం హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన సభ కోవిడ్ నిబంధనల దృష్ట్యా రద్దయిందని, అయితే ఇక్కడి కేరళవాసులు విజ్ఞప్తి మేరకు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు కేరళ సీఎం పినరయి విజయన్ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారని తెలిపారు. -
వాటాదారుల ఆమోదం కోరనున్న ఫ్యూచర్ గ్రూపు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్తో చేసుకున్న ఒప్పందానికి వాటాదారుల ఆమోదాన్ని ఫ్యూచర్ గ్రూపు సంస్థలు కోరనున్నాయి. ఈ మేరకు నవంబర్ 10, 11 తేదీల్లో వాటాదారులు, రుణదాతల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఫ్యూచర్ గ్రూపు కంపెనీలు తమ వాటాదారులకు సమాచారం ఇచ్చాయి. వీడియో కాన్ఫరెన్స్/ఆడియో, వీడియో విధానంలో ఈ సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలిపాయి. అదే విధంగా ఉన్నచోట నుంచే ఈఓటు వేసే ఏర్పాటు కూడా చేసినట్టు పేర్కొన్నాయి. ఫ్యూచర్ గ్రూపు కంపెనీలన్నింటినీ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో విలీనం చేసి.. తదుపరి ఫ్యూచర్ రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్ ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్కు గుంపగుత్తగా విక్రయించాలన్నది ఫ్యూచర్ గ్రూపు ప్రణాళిక. ఇందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.24,713 కోట్లు చెల్లించనుంది. ఈ మొత్తం ఫ్యూచర్ గ్రూపు రుణదాతలకు దక్కనుంది. -
కరోనా ఉధృతి: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కోవిడ్-19 కేసులు కొత్తగా పెరుగుతున్న దృష్ట్యా, అటు థర్డ్వేవ్ ప్రమాదంపై నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు భారీ ఊరేగింపులు నిర్వహించకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, మతపరమైన సమావేశాల్లో భారీగా గుమిగూడటం, ఊరేగింపులను కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఆగస్టు- అక్టోబర్ వరకు పండుగ సీజన్ ప్రారంభంకాన్ను నేపథ్యంలో వరమహాలక్ష్మి వ్రతం, ముహర్రం, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, దుర్గా పూజ తదితర పండుగ రోజుల్లో స్థానికంగా ఆంక్షలను అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆగష్టు 12 నుండి ఆగస్టు 20 వరకు అన్ని రకాల ఊరేగింపులపై నిషేధం విధిస్తూ కొత్త మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. మొహర్రం, గణేశ్, దసరా ఉత్సవాల వేడుకలపై విస్తృతమైన ఆంక్షలను ప్రకటించింది. రెండు పండుగలకు సంబంధించిన అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది. ఆలం, పంజా, తాజియాత్లను దూరం నుండి వీక్షించాలి. ప్రార్థన మందిరాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి. కోవిడ్ సంబంధిత నిబంధనలు పాటిస్తూ మసీదుల వద్ద ప్రార్థనలు జరపాలని పేర్కొంది. అలాగే కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ గ్రౌండ్, షాదీ మహల్ మొదలైన వాటిలో సామూహిక ప్రార్థనలకు అనుమతిలేదు. గణేష్ చతుర్థికి కూడా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. గణేష్ పందిళ్ల ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. వినాచయక చవితిని సాధారణ పద్ధతిలో జరుపుకోవాలి. వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు, నిమజ్జన సంయంలో మాత్రమే ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలి. గణేశ్, దేవీ విగ్రహాలను నిర్దేశించిన ప్రదేశాలలోనే నిమజ్జనం చేయాలి. దేవాలయాలను ప్రతిరోజూ విధిగా శానిటైజ్ చేయాలి. శానిటైజర్ ఉపయోగించిన తర్వాత మాత్రమే భక్తులను అనుమతించాలి. థర్మల్ చెకింగ్ సదుపాయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. బెంగళూరులో బ్లాక్ ఫంగస్ మాదిరిగా ఎనిమిది మందిలో రెడ్ ఫంగస్ బయటపడింది. ఇప్పటివరకు కరోనా సోకినవారిలో, కోలుకున్నవారిలో కొందరు బ్లాక్ఫంగస్, వైట్, యెల్లో ఫంగస్లకు గురికావడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రెడ్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. ఐటీ నగరంలో గత ఐదురోజుల్లో 192 మంది కరోనా రోగుల నుంచి నమూనాలను తీసుకుని పరీక్షలు చేయగా వారిలో 148 మందిలో డెల్టా వైరస్ బయటపడింది. మరో 8 మందిలో రెడ్ ఫంగస్ కనిపించినట్లు బెంగళూరు కార్పొరేషన్ ఆరోగ్య విభాగం ప్రత్యేక కమిషనర్ రణదీప్ తెలిపారు. అయితే రెడ్ ఫంగస్తో అంత ప్రమాదం లేదన్నారు. డెల్టా రకం వేగంగా సోకుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెంగళూరులో జూలైలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 12 శాతం పిల్లల కేసులు కాగా ఆగస్టు మొదటివారంలో ఇది 13 శాతానికి చేరింది. 12-18 ఏళ్లు మధ్య వయస్సు పిల్లలు ఎక్కువగా బయట తిరుగుతుండటం వల్ల కరోనా సోకుతోందని రణదీప్ తెలిపారు. -
‘త్వరలో వెబినార్ కోమా వ్యాధి’
ముంబై: కరోనా వైరస్ నేపథ్యంలో పలు కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే తమ వృత్తిని నిర్వర్తిస్తున్నారు. అయితే ఆఫీసు సమావేశాలు, కీలక చర్చలు వెబినార్(ఆన్లైన్)లోనే నిర్వహించడానికి కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. వ్యాపార దిగ్గజం మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా మాత్రం వెబినార్ సమావేశాలను ఇష్టపడనని ఇది వరకే ట్విటర్లో పేర్కొన్నారు. వెబినార్ పట్ల తన అసహనాన్ని ఓ ఉదాహరణతో చూపించాడు. మొఘల్ ఏ ఆజం అనే సినిమాలోని ఫోటోను చూపెడుతు.. ఆ ఫోటోలో.. సలీమ్ అనార్కలీని నిద్రలేపే సన్నివేశాన్ని సూచిస్తూ.. ‘ఉటో అనార్కలీ వెబినార్ కథమ్ హువా’(అనార్కలీ వెబినార్ అయిపోయింది.. ఇక నిద్రలేవు) అంటూ తన హాస్య చతురతతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాడు. మహీంద్రా తాజా ట్వీట్కు 600 రీట్వీట్లు, 6250మంది నెటిజన్లు లైక్లు చేశారు. ఆనంద్ మహీంద్రా హాస్య చతురత అద్భుతమని ఓ నెటిజన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. వెబినార్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల వెబినార్ కోమా అనే కొత్త వ్యాధి రాబోంతుందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.చదవండి: వినూత్న ఆలోచన.. ఆటోలో 5 అరలు! Numerous friends shared this meme with me after reading about my frustration with ‘webinars.’ Seems like a new medical condition called a Webinarcoma. 😊 pic.twitter.com/0p1SIUXHZl — anand mahindra (@anandmahindra) June 5, 2020 -
రెండు రోజులు నిర్వహించాలి..!
సాక్షి,ఆదిలాబాద్: ఎజెండా అంశాలు 42.. సమావేశం ప్రారంభమైంది ఉదయం 11గంటలకు.. మొదటి ఎజెండా అంశం విద్య. రెండోది వ్యవసాయంపై చర్చసాగే సరికి మధ్యాహ్నం 2గంటలైంది. దీంతో భోజన విరామం నుంచి మళ్లీ 2.30 గంటల నుంచి తిరిగి సమావేశమయ్యారు. ఇక వడివడిగా ఎజెండా అంశాలను ముగించాలని చూశారు. రెండో సెషన్ మధ్యాహ్నం జరిగిన సమావేశంలో వైద్యం మీద కొంత చర్చ జరిగినా. మిగితా ఎజెండా అంశాల పరంగా ఇలా చదివి.. అలా నెట్టేశారు. మొత్తం మీద సాయంత్రం 5.30 గంటల్లోపు 20అంశాల వరకు పూర్తి కానిచ్చారు. మిగితా అంశాల జోలికే వెళ్లలేదు. గతనెల 27న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీరిది. మరోమారు డిమాండ్.. జెడ్పీ సర్వసభ్య సమావేశం మూడు నెలలకోసారి నిర్వహించేది. మొన్నటి సమావేశం ఆగస్టు చివరి వారంలో నిర్వహించగా, మళ్లీ నవంబర్లో జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహించాలనేది ఇప్పటి డిమాండ్ కాదు. గతం నుంచే ఉన్నది. ఉమ్మడి జిల్లాలో జెడ్పీ పరంగా 52మంది జెడ్పీటీసీలు, 52మంది ఎంపీపీలు, పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొనేవారు. సభ్యులు, ఎమ్మెల్యేలలో కొందరు 200కిలో మీటర్ల దూరం నుంచి వచ్చేవారు. అయితే అప్పుడు సమావేశాల్లో ఎజెండా అంశాలపై పూర్తిస్థాయిలో చర్చ జరగడం లేదని పలువురు సభ్యులు వాపోయేవారు. దీంతో గత పాలకవర్గంలో ఒకట్రెండు సార్లు, అంతకుముందు పాలకవర్గంలో ఒకసారి రెండు రోజుల పాటు సమావేశాలను నిర్వహించారు. అధిక మంది సభ్యులు ఉండడంతో వారికి వసతులు, భోజనాలు సౌకర్యాలు కల్పించడం ఇబ్బందిగా పరిణమించింది. అప్పట్లో జెడ్పీకి నిధుల కొరత కారణంగా జెడ్పీ సమావేశాల నిర్వహణను ఒకరోజుతోనే కానిచ్చారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడటం, ఆదిలాబాద్ జెడ్పీ 17మంది జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీపీలు, నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారు. సభ్యులు ఒక గంటలోపే జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. దూరభారం లేదు. 17మండలాల సభ్యులు తమ మండలాలకు వెళ్లి మరుసటి రోజుకూడా వచ్చేందుకు అవకాశం ఉంది. గతనెల నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్రెడ్డి రెండు రోజుల పాటు ఈ సమాశాలు నిర్వహించాలనే డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. సమావేశం అనంతరం అధికార పార్టీ సభ్యులతో పాటు మిగితా వారు కూడా సమస్యలను చర్చించాలి, సమస్యలందరు మాట్లాడాలంటే రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించడంతోనే ఇది సాధ్యమవుతుందనే రీతిలో చర్చించుకోవడం జరిగింది. దీనిపై మరోసారి చర్చ సాగుతోంది. ప్రధానంగా కోరం సభ్యులు కోరిన పక్షంలో రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. సభ్యులు కోరితే ప్రజల సమస్యలపై చర్చించేందుకు రెండు రోజులు నిర్వహించేందుకు సిద్ధమన్న రీతిలో పాలకవర్గం పేర్కొంటుంది. మళ్లీ నిర్వహించే సమావేశాల్లోనే ఇది అమలైతే ఆమోదయోగ్యంగా ఉంటుందన్న అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతోంది. గతంలో సభ్యులకు గౌరవ వేతనంతో పాటు టీఏ, డీఏలు ఉండేవి. ప్రస్తుతం సభ్యులకు గౌరవ వేతనం ఉన్నప్పటికీ టీఏ, డీఏలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. తద్వారా సభ్యులు రెండు రోజుల పాటు సమావేశాల్లో పాల్గొన్నా జెడ్పీపై పడే అదనపు భారం కేవలం నిర్వహణ ఖర్చులు. సభ్యులు సబ్జెక్టుతో వస్తే.. యాభై నుంచి అరవై శాఖలకు సంబంధించి 42 ఎజెండా అంశాలను జెడ్పీ సమావేశంలో రూపొందించడం జరుగుతోంది. ఇందులో కొన్ని శాఖలకు అనుబంధంగా జోడించడంతో ఎజెండా అంశాలు శాఖల పరంగా పోల్చితే కొన్ని తక్కువగా ఉంటాయి. ప్రధానంగా జెడ్పీ సమావేశంలో సభ్యులు పూర్తి అవగాహనతో వస్తే మాత్రం ఎజెండా అంశాలు చర్చించడానికి ఒక్కరోజు అసలుకే సరిపోదు. గత సర్వసభ్య సమావేశంలో విద్య శాఖతో ఎజెండా అంశం ప్రారంభమైంది. ఉదయం 11గంటలకు ప్రారంభం కాగా ముగ్గురు నలుగురు సభ్యులు దీనిపై మాట్లాడారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖపై చర్చ సాగింది. ఈ రెండు అంశాలకే మూడుగంటల సమయం తీసుకుంది. విద్య శాఖ చర్చ సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యుడు గోక జీవన్రెడ్డి మాట్లాడుతూ తాను పదవీ చేపట్టిన తర్వాత తన మండలం తలమడుగులోని 75శాతం పాఠశాలల్లో పర్యటించినట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని వాపోయారు. పాలకవర్గం సభ్యుని మాటలు కుదించితే మిగితా సభ్యులు మాట్లాడేందుకు అవకాశం దక్కుతుందని పేర్కొన్నప్పుడే తాను ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదని గణేష్రెడ్డి పేర్కొనడం, సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తే సుదీర్ఘ చర్చ జరుగుతుందన్న వాదనను తెరపైకి తేవడం జరిగింది. సమావేశాల్లో ప్రధాన అంశాలపైనే చర్చ సాగించి మిగితావి మమ అనిపిస్తున్నారు. అంశాల వారీగా చర్చ సాగుతున్నప్పుడు సభ్యులు వాటి ప్రకారమే సమస్యలను లేవనెత్తినప్పుడే పరిష్కారానికి దోహద పడుతుంది. అలాంటప్పుడే జిల్లాలోని సమస్యలపై తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి పంపినప్పుడు దానికి పరిష్కార మార్గం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 42అంశాల్లో ఒక్కో అంశంపై సుమారు 15నిమిషాల పాటు చర్చించినా అన్ని అంశాలపై చర్చ సాగాలంటే సుమారు 11గంటల సమయం పడుతుంది. మొన్నటి సమావేశం కేవలం ఆరు గంటలు మాత్రమే నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి మొదటి రోజు సగం, రెండో రోజు సగం ఎజెండా అంశాలను చర్చిస్తే పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతుంది. సమయం సరిపోకపోతే పరిశీలిస్తాం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలపై సమయం సరిపోకపోతే మరుసటి రోజు కొనసాగించే విషయాన్ని పరిశీలిస్తాం. ప్రజల సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేసేది లేదు. సభ్యుల కోరిక మేరకు ముందుకు వెళ్తాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – రాథోడ్ జనార్దన్, జెడ్పీ చైర్మన్, ఆదిలాబాద్ డిమాండ్ను పరిశీలిస్తాం రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై పరిశీలన చేస్తాం. దీనికి 1/3వ వంతు సభ్యులు కోరితే రెండు రోజులు చేపట్టేందుకు అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ప్రత్యేకంగా దృష్టికి మాత్రం తీసుకురాలేదు. – కిషన్, జెడ్పీ సీఈఓ, ఆదిలాబాద్ -
నేడు కీలక శాఖలపై వైఎస్ జగన్ సమీక్షలు
-
ప్రజలకు అండగా నిలవండి
వేంపల్లె: చిన్న, పెద్దా తేడా లేదు..వీళ్లు వాళ్లు అన్న బేధాలు వద్దు..ఐక్యంగా ప్రజలతో మమేకం కండి..వారి కష్టనష్టాల్లో అండగా నిలవండి..చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రజలను ఏవిధంగా మభ్యపెడుతున్నారో ప్రతి ఇంటా వివరించండి.. ప్రజాకర్షక పథకాలతో టీడీపీ జనాలను ఎలా మోసం చేస్తున్నది తెలియజేయండని కడప మాజీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బూత్ కమిటీ కన్వీనర్లు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం వేంపల్లెలోని ఎంఎంఆర్ ఫంక్షన్ ప్యాలెస్లో మండలస్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బలోపేతానికి బూత్ కన్వీనర్లు కీలకపాత్ర పోషించాలని తెలిపారు. అందరూ కలిసికట్టుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. మండలంలో 2014 నాటి ఎన్నికల కన్నా భారీ మెజార్టీని తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకరావాలని తెలిపారు. వ్యక్తిగత ద్వేషాలతో పార్టీకి నష్టం కలిగేలా ఏ ఒక్కరు వ్యవహరించ రాదన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్లను చేర్పించాలని..దొంగ ఓట్లను గుర్తించి వాటిని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు మాట్లాడుతూ బూత్ లెవెల్ కమిటీని ముందుగా బలోపేతం చేసుకుని ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ తదితర అనే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలన్నారు. చంద్రబాబు వంచన తప్ప ఎటువంటి హామీని నెరవేర్చలేదని తెలిపారు. పులివెందులకు కృష్ణా జలాలు తెచ్చిన ఘనత వైఎస్ఆర్దేనన్నారు. ఆయన హయాంలో 95శాతం ప్రాజెక్టుల పనులు పూర్తి చేశారని.. ఆయన మరణానంతరం ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. చంద్రబాబు 5శాతం పనులు పూర్తి చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు మోసాలను వివరించండి 40ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటూ ఈ నాలుగేళ్ల వ్యవధిలో చంద్రబాబు చేసిన మోసాలను, ఆయన చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సూచించారు.రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ అన్ని వర్గాల వారిని ఎలా మోసం చేసింది వివరించాలన్నారు. ప్రత్యేక హోదా అన్నందుకు మనమందరిపైన చంద్రబాబు కేసులు పెట్టించి ప్యాకేజీ చాలని కేంద్ర మంత్రులకు సన్మానం చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ఎలా డ్రామాలాడుతోంది వివరించాలన్నారు. ఇక్కడి నాయకులు ఇళ్లు కట్టిస్తాం.. కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తామంటూ మభ్యపెట్టి హామిలతో గ్రామాల్లోకి వస్తున్నారని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నవరత్నాల గురించి ప్రజలకు తెలపండి.. రాష్ట్రంలో రైతులను ఆదుకున్న మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. భావి తరాలకు దిశ దశ చూపించాలని వైఎస్ జగన్ ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీ మేనేజర్ మధుసూదన్రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ రవికుమార్రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్వల్లి, నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ డాక్టర్ ఎస్ఎఫ్ బాషా, బూత్ కమిటీ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
ధర్మపోరాటం.. చాలా ఖరీదు గురూ
సాక్షి, అమరావతి: రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది అంటూ నిత్యం బీద అరుపులు అరుస్తూ, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్న సీఎం చంద్రబాబు మరోవైపు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. కేంద్రంపై ధర్మపోరాటం పేరిట రూ.కోట్ల వ్యయంతో జిల్లాల్లో భారీఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల వల్ల ఖజానాకు నష్టమే తప్ప ప్రజలకు పైసా కూడా ఉపయోగం లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులే పెదవి విరుస్తున్నారు. కలెక్టర్లదే బాధ్యత: బాబుగారి ధర్మపోరాటం చాలా ఖరీదు గురూ అంటూ సచివాలయంలో పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. సభలకు చేస్తున్న వ్యయాన్ని చూసి ఉన్నతాధికారులు నివ్వెరపోతున్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్మపోరాట సభకు ఏకంగా రూ.4 కోట్లు ఖర్చవుతోందని, ప్రజాధనంతో ముఖ్యమంత్రి వ్యక్తిగత, రాజకీయ ప్రచారం చేసుకోవడం ఎక్కడా చూడలేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ధర్మపోరాట సభల నిర్వహణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్లు చేస్తున్నారు. సభ వేదిక, సభలో కుర్చీలు, జనాన్ని బస్సుల్లో తీసుకురావడం, వారికి భోజనాలు, వీఐపీలకు బస, తదితర బాధ్యతలను కలెక్టర్లు చేపడుతున్నారు. వీటి కోసం నిధులివ్వాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖకు లేఖలు రాస్తున్నారు. బూడిదలో పోసిన పన్నీరే..: విజయవాడలో నిర్వహించిన ధర్మపోరాట సభకు రూ.4 కోట్లు ఖర్చు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ వినతి మేరకు ప్రణాళికా శాఖ తొలుత రూ.2 కోట్లు ఇచ్చింది. మరో రూ.2 కోట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాశారు. ధర్మపోరాట సభలకు తాము నిధులు ఇవ్వలేమని సాధారణ పరిపాలన శాఖ తేల్చిచెప్పింది. కలెక్టర్ రాసిన లేఖను ప్రణాళికా శాఖకు పంపించింది. తమ దగ్గర నిధుల్లేవని, జిల్లా నిధుల నుంచే బిల్లులు చెల్లించుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్కు ప్రణాళికా శాఖ సూచించింది. ధర్మపోరాట సభలతో ముఖ్యమంత్రికి తప్ప ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని అధికారులు అంటున్నారు. -
రేపు జగ్గంపేటలో వైఎస్సార్ సీపీ కీలక సమావేశం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఈ నెల 29న పార్టీ నేతలతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశాలు ఆదివారం ప్రజా సంకల్పయాత్ర శిబిరం వద్ద జరుగుతాయని శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆదివారం ఉదయం 11 గంటల నుండి 11:30 గంటల వరకు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ల సమావేశం, ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం జరుగుతుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా రావాలని పార్టీ అధ్యక్షులు ఆదేశించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇవే విషయాలను శుక్రవారం జగ్గంపేటలో కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మీడియాకు తెలిపారు. సభాస్థలికి వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేసినట్టు చెప్పారు. 29వ తేదీ ఉదయం పాదయాత్ర ముగిశాక సమన్వయకర్తల సమావేశం జరుగుతుందని తెలిపారు. సమావేశం ఏర్పాట్లను కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, తలశిల రఘురాం, సమన్వయకర్తలు రౌతు సూర్య ప్రకాశరావు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్ తదితర నేతలు పరిశీలించారు. పాదయాత్రలో 100వ నియోజకవర్గంగా నిలిచిన జగ్గంపేటలో కీలక సమావేశం జరగడం విశేషం. -
అసంతృప్తి సెగలు
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ పాలకవర్గంపై అసంతృప్తి సెగలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పాలకవర్గం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా గ్రామాల్లో అభివృద్ధి పనులు, సభ్యుల సమస్యలను పరిష్కరించకపోవడంతో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు స్థాయి సంఘ సమావేశాలకు హాజరుకావడం లేదు. జిల్లాపరిషత్ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఇన్చార్జి సీఈఓ రవికుమార్నాయుడి అధ్యక్షతన 1 నుంచి 7 స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో 3 (వ్యవసాయం కమిటీ), 5 (స్త్రీ, శిశు సంక్షేమ శాఖ) కమిటీలకు కోరం లేకపోవడంతో వాయిదాపడ్డాయి. మొదట ప్రారంభమైన 1, 7 కమిటీల సమావేశంలో జీఎస్టీ సమస్య ఎక్కువగా ఉందని అనేక సార్లు సమావేశాల్లో చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పాలసముద్రం జెడ్పీటీసీ చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జెడ్పీ కార్యాలయంలో గణాంకశాఖాధికారి వెంకటరత్నాన్ని నిధుల వివరాలను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారన్నారు. అధికారుల తీరు మార్చుకోవాలన్నారు. నాణ్యత లేని రోడ్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని అధికార పార్టీ కలకడ జెడ్పీటీసీ తిరుమలనాయుడు సమావేశంలో తేల్చి చెప్పారు. పెండింగ్లో ఉన్న నీరు–చెట్టు నిధులు రూ.13 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్అండ్బీ పరిధిలోని మట్టిరోడ్లను బీటీ రోడ్లగా మార్చాలని ఆదేశాలు వచ్చాయని అధికారులు చెప్పారు. అందుకోసం జిల్లాలో నాబార్డు నుంచి ఫేజ్ –1 లో 13 రోడ్లకు రూ.34.55 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. 6వ కమిటీ చైర్పర్సన్ తిరుపతి రూరల్ జెడ్పీటీసీ సుహాసినీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులకు రుణాల కింద అందించే పాడి ఆవులు కేవలం కమిటీల ఆదేశాల మేరకే అందించడం జరుగుతోందన్నారు. కమిటీ, వెటర్నరి డాక్టర్లు కుమ్ముకై రైతులను మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ ఒక సీనియర్ ఆఫీసర్ను నియమించి పర్యవేక్షించాలని తీర్మానం చేశారు. కలికిరి జెడ్పీటీసీ మాలతి మాట్లాడుతూ ప్రజలకు బ్యాంకర్లు రుణాల సబ్సిడీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చంద్రన్న పెళ్లికానుక పథకంలో మార్పులు చేసి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటక, తమిళనాడుల నుంచి పెళ్లిళ్లు చేసుకునే వారికి ఆ పథకం వర్తించేలా చూడాలని సభ్యులు కోరారు. ఎర్రావారిపాళ్యం జెడ్పీటీసీ కుమారస్వామి, తిరుపతి రూరల్ జెడ్పీటీసీ సుహాసిని మాట్లాడుతూ తమ మండలంలో ఎస్సీ కమ్యూనిటీ హాలును మంజూరు చేయాలని కోరారు. పనిముట్లు చోరీకి గురైనాపట్టించుకోవడం లేదు.. గంగాధరనెల్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో రైతుల కోసం మంజూరు చేసిన పనిముట్లు సోమవారం రాత్రి చోరీకి గురయ్యాయని వైఎస్సార్సీపీ జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు. ఆ పనిముట్లను స్థానికంగా ఉన్న అధికారపార్టీ నేతలు కొందరు తీసుకెళ్తున్నట్లు స్థానికులు చూసి తన దృష్టికి సమస్యను తీసుకొచ్చారన్నారు. ఆ విషయంపై అక్కడి పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెళ్తే వారు ఏమాత్రం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. పై నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని, తాము ఏమీ చేయలేమని పోలీసులే సమాధానమిస్తే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. ఈ విషయంపై డ్వామా పీడీ కుర్మానాథ్, సీఈఓ రవికుమార్ విచారణ చేసి న్యాయం జరిగేలా చూడాలన్నారు. పేదలు బాగుపడాలంటే ఆఫీసర్లు బాగుండాలని.. నిజాయితీగా విచారణ చేసి న్యాయం జరిగేలా చూడాలని ఆయన జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణిని కోరారు. జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వారు తీసుకెళ్లే ట్రాక్టర్ల బాడుగకు కూడా డబ్బులు రావడం లేదని చెప్పారు. తోతాపురి రకం మామిడికి ప్రాసెసింగ్ యూనిట్లకు ఇచ్చిన విధంగానే ప్రైవేటు మార్కెట్లలో కూడా కిలోకు రూ.7.50 ధరను నిర్ణయించాలన్నారు. -
వేడుకలకు సిద్ధమవుతున్న నాటా
-
హోటల్కే పరిమితమైన పవన్
బొబ్బిలి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం అంతా హోటల్కే పరిమితమయ్యారు. పట్ట ణంలోని సూర్యరెసిడెన్సీలో బస చేసిన ఆయన్ను చూసేందుకు ఎంతగానో అభిమానులు వేచి చూ డగా ఉదయం ఎనిమిది గంటల సమయంలో హోటల్ నుంచి బయటకు వచ్చి అభివాదం చేసి రూమ్లోకి వెళ్లిపోయారు. ఆయన పర్యటనపై ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో జనసేన మీడియా వింగ్ పేరిట ఓ షెడ్యూల్ను ప్రకటించారు. పవన్కళ్యాణ్ బస్సు యాత్రలో భాగంగా గురువారం నుంచి బహిరంగ సభలు చేపట్టనున్నట్టు అందులో వివరించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కురుపాం సంత జంక్షన్లో, నాలుగున్నరకు పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద, సాయంత్రం ఆరు గంటలకు బొబ్బిలి రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద బహిరంగ సభలు ఉంటాయని తెలిపింది. కాగా హోట ల్ గదిలో వామపక్ష నాయకులతో చర్చించి బొబ్బి లి, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లోని సమస్యలపై వివరాలు సేకరించినట్టు తెల్సింది. -
ఆశావహం సోచి శిఖరాగ్రం
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య సోమవారం రష్యాలోని సోచిలో జరిగిన అనధికార శిఖరాగ్ర సమావేశం... గతంతో పోలిస్తే అంతంత మాత్రంగానే ఉన్న భారత్–రష్యా సంబంధాల్లో కీలక పరిణామం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మోదీ మొన్న ఏప్రిల్ నెలాఖరున ఇలాంటి సమావేశమే జరిపారు. దేశాధినేతల మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశాలకు పకడ్బందీ ఎజెండాలుంటాయి. అనేకానేక పత్రాలను పరస్పరం మార్చుకోవడం ఉంటుంది. ఖరారు చేసుకోవాల్సిన ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు, విదేశాంగ మంత్రులు చాలా ముందుగా భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. సంయుక్త ప్రకటనలు సరేసరి. కానీ అనధి కార శిఖరాగ్ర సమావేశాలకు ఇవేమీ ఉండవు. అధినేతలిద్దరూ ఏ అంశంపైన అయినా స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు. విభేదిస్తున్న అంశాల్లో ఎవరి వైఖరేమిటి... అది ఎంతవరకూ సహేతుకమన్న విషయాలు చర్చించుకుంటారు. పర్యవసానంగా పరస్పర అవగాహన పెరిగి, విభేదాలు తగ్గే అవ కాశం ఏర్పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అధినేతల మధ్య స్నేహసంబంధాలు నెలకొనడానికి ఇలాంటి అనధికార శిఖరాగ్ర సమావేశాలు తోడ్పడతాయి. అయితే చైనాతో శిఖరాగ్ర సమావేశం రెండు రోజులు కొనసాగితే మోదీ–పుతిన్ల సమావేశం ఒక్కరోజుతో ముగిసింది. ఇరు దేశాలూ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మన దేశం అమెరికాతో సన్నిహితమవుతున్నదని రష్యా అనుమానిస్తోంది. అందువల్లే తనతో అంత క్రితం కుదుర్చుకున్న యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుందని భావిం చింది. దీనికి ప్రతీకారంగా అది పాకిస్తాన్కు తొలిసారి ఎంఐ–35ఏ రకం సైనిక హెలికాప్టర్లను విక్ర యించింది. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. కశ్మీర్ విషయంలోనూ కొత్త రాగం అందు కుంది. అలాగే చైనాతో బంధాన్ని పెంచుకుంది. ఈ విషయంలో ఏర్పడ్డ అపోహలను నివృత్తి చేసి మళ్లీ గతం మాదిరి రష్యాతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని మన దేశం భావిస్తోంది. అయితే అంతర్జాతీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాతో అనుబంధం పెంచుకోవడం కత్తి మీద సామే. ఎందుకంటే తమ గడ్డపై ఒక పౌరుడిపైనా, ఆయన కుమార్తెపైనా విష రసాయనం ప్రయోగించి హతమార్చడానికి జరిగిన ప్రయత్నం వెనక నేరుగా పుతిన్ హస్తమున్నదని బ్రిటన్ ఆరోపించింది. ఆ ఘటన తర్వాత రష్యాకు చెందిన దౌత్య అధికారులు పలువురిని బహిష్కరిం చింది. దానికి ప్రతీకారంగా రష్యా కూడా అదే పని చేసింది. యూరప్ దేశాలతో అప్పటికే అంతం తమాత్రంగా ఉన్న రష్యా సంబంధాలు ఆ తర్వాత మరింత క్షీణించాయి. నిరుడు రష్యాపై పలు ఆంక్షలు తీసుకొస్తూ అమెరికా చట్టం చేసింది. దాని ప్రకారం రష్యాతో రక్షణ, నిఘా రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. మనకు రక్షణ సామగ్రి అమ్మే దేశాల్లో రష్యా ప్రధానమైనది. మన రక్షణ కొనుగోళ్లలో దాని వాటా 62 శాతం. అమెరికా ఆంక్షలు విధించడానికి ముందే మన దేశం ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. 4,500 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందం పర్యవసానంగా బాలిస్టిక్ క్షిపణుల దాడిని, రహస్య విమానాల దాడులను ముందే పసిగట్టి ఎదుర్కొనే శక్తి మన దళాలకు సమకూరుతుంది. దీంతోపాటు కెఏ–226టి రకం మిలిటరీ హెలికాప్టర్లను ఇక్కడే తయారు చేసేందుకు ఒప్పందానికి సిద్ధమని రష్యా ప్రకటించింది. అలాగే ప్రాజెక్ట్ 751 జలంతర్గా ములు అమ్మడానికి ముందుకొచ్చింది. అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇవి ఎంతవరకూ సాకారమవుతాయన్న అనుమానాలున్నాయి. అయితే దేశ రక్షణ విషయంలో రాజీపడబోమని మన దేశం చెబుతోంది. అమెరికా చట్టం ప్రకారం ఇరాన్తో లావాదేవీలు నెరపినా ఈ మాదిరి ఆంక్షలే వర్తిస్తాయి. అయితే మన దేశంపై చర్య తీసుకుంటే అధికంగా నష్టపోయేది అమెరికాయే. ఎందు కంటే ఆ దేశంతో మనకు రక్షణతోసహా పలు ఒప్పందాలున్నాయి. సోచి సమావేశం తర్వాత రెండు దేశాలూ విడివిడిగా విడుదల చేసిన ప్రకటనలు గమనిస్తే ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఇరు దేశాలూ సుముఖంగా ఉన్నాయని అర్ధమవుతుంది. ‘ఇండో–పసిఫిక్ ప్రాంతం’లో భారత్ పాత్ర కీలకమైనదని భావిస్తున్నట్టు పుతిన్ ప్రకటించారు. ఆసియా–పసిఫిక్ పదబంధం స్థానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త మాటపై చైనాకు అసంతృప్తి ఉన్న సంగతి తెలిసినా ఆయన దీన్ని ఉప యోగించారు. అమెరికా ఆంక్షల మాటెలా ఉన్నా తాము రష్యానుంచి ఆయుధాలు, ఇంధనం కొనడానికి సిద్ధమని ఈ చర్చల సందర్భంగా మన దేశం చెప్పడం కూడా రష్యాకు సంతృప్తి కలిగించింది. ట్రంప్ వచ్చాక నిలకడలేని అమెరికా విధానాల పర్యవసానంగా అంతర్జాతీయ రంగంలో ఒక అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏ దేశానికి ఆ దేశం స్వీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించుకుంటోంది. మన దేశం కూడా అందుకు మిన హాయింపు కాదు. అందువల్లే లోగడ ఉహాన్లో చైనాతోనూ, ఇప్పుడు సోచిలో రష్యాతోనూ నరేంద్ర మోదీ శిఖరాగ్ర సమావేశాలు జరిపారు. భద్రతామండలిలో శాశ్వతసభ్యత్వం, అణు సరఫరాదార్ల బృందంలో సభ్యత్వం వంటి అంశాల్లో రష్యా మనకు మద్దతునిస్తోంది. మొత్తానికి సోచి శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలూ తిరిగి సన్నిహితం కావడానికి ఒక ప్రాతిపదికను ఏర్పరుస్తుందని ఆశించవచ్చు. -
సమీక్షలతో సరి!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్, జూపాడుబంగ్లాలోని అల్ట్రా మెగా ఫుడ్ ప్రాజెక్టులకు నీటి వసతి కల్పిస్తామన్న ప్రభుత్వం సమీక్షలతోనే సరిపెడుతోంది. దీంతో జిల్లాను పరిశ్రమల హబ్గా మారుస్తామన్న సీఎం చంద్రబాబు హామీ మాటలకే పరిమితమవుతోంది. ఓర్వకల్, మిడుతూరు, గడివేముల, జూపాడుబంగ్లా మండలాల్లో పరిశ్రమల పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నా ఉపయోగం లేకుండా పోతోంది. ఓర్వకల్లోని మెగా ఇండస్ట్రియల్ హబ్, జూపాడుబంగ్లాలోని అల్ట్రా మెగా ఫుడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు చేయాలని నిర్ణయించినా మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారు. దీంతో ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. వీడియో కాన్ఫరెన్స్లు,సమీక్షలతో మమ.. మెగా ఇండస్ట్రియల్ హబ్, అల్ట్రా మెగా ఫుడ్ పార్కులకు స్థానికంగా నీటి వసతి లేకపోవడంతో సమీపంలోని ముచ్చుమర్రి నుంచి నీళ్లను తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల క్రితం రూ.452 కోట్లతో 1.45 టీఎంసీ నీటిని తీసుకురావాలని అంచనా వేశారు. ఈ మేరకు ముచ్చుమర్రి నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టి ఓర్వకల్, జూపాడుబంగ్లా మండలాల్లో మినీ ప్రాజెక్టులు చేపట్టి నీటిని నింపాలని భావించారు. అయితే ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన, వీడియో కాన్ఫరెన్స్, సమీక్షల్లో మాత్రం ఇండస్ట్రియల్ హబ్కు నీటి వసతిపై మాట్లాడుతున్నా ఇంతవరకు కనీసం డీపీఆర్ రూపొందించలేదు. ముందుకు రాని పారిశ్రమిక వేత్తలు.. పరిశ్రమల స్థాపనకు అతిముఖ్యమైనది నీటి వసతి. అయితే ఇక్కడ నీటి సమస్య ఉండడంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో పరిశ్రమ స్థాపనకు జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే వచ్చింది. అలాగే ఫుడ్ పార్కులో గుజరాత్ అంబుజా, జైన్ ఇరిగేషన్ ఫుడ్ పార్కులకు భూములు కేటాయించారు. ఇందులో మౌలిక వసతులు లేవని గుజరాత్ అంబుజా తన యూనిట్ను నెలకొల్పేందుకు ఆసక్తిని చూపడడంతో దానికి కేటాయించిన భూములను ఇటీవల ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం ద్వారా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1.45 టీఎంసీల నీటి కోసం అంచనా ముచ్చుమర్రి నుంచి ఇండస్ట్రియల్ హబ్, ఫుడ్పార్కులకు 1.45 టీఎంసీ నీటిని తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.452 కోట్లతో అంచనా వేశాం. డీపీఆర్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే అన్ని సమస్యలు సమసిపోయే అవకాశం ఉంది. – రఘునాథరెడ్డి, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ -
ఉభయకొరియాల శిఖరాగ్రానికి తేదీ ఖరారు
సియోల్: ఉభయకొరియాల శిఖరాగ్ర సమావేశానికి తేదీ ఖరారైంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనా రహస్య పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే పాన్మున్జోన్లో జరిగిన ఇరు దేశాల ఉన్నతాధికారుల భేటీలో ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. సరిహద్దుల్లో ఉన్న పాన్మున్జోన్లో ఏప్రిల్ 27వ తేదీన ‘2018 దక్షిణ–ఉత్తర సమావేశం’ జరిపేందుకు తమ నేతలు అంగీకరించారని రెండు దేశాల అధికారులు గురువారం ఉమ్మడి ప్రకటన వెలువరించారు. ఈ సమావేశంతో కొరియా యుద్ధం తర్వాత ఉత్తరకొరియా నేత ఒకరు దక్షిణ కొరియాలో అడుగుపెట్టనుండటం ఇదే ప్రథమం కానుంది. దీని తర్వాత మేలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చారిత్రక సమావేశం జరగనుంది. -
'మన నగరం' కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ది దిశగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 'మన నగరం' కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. నగరంలోని కుత్భుల్లాపూర్లో ప్రారంభించిన 'మన నగరం / ఆప్నా షెహర్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లను 50 కి పెంచుతున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఇకపై ప్రజల వద్దకే అధికారులు వస్తారని.. స్థానికంగా ఉన్న సమస్యలను వారికి చెప్పాలని సూచించారు. సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు జరుగుతాయని.. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలతో నేరుగా అధికారులు చర్చిస్తారన్నారు. మనం మారుదాం - నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహర్ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. కాగా, మెట్రో రైలును అపరిశుభ్రంగా మారుస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని సూచించారు. -
కాంగ్రెస్తో కలవాలా? వద్దా?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగే సీపీఎం పొలిట్బ్యూరో సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్ శక్తులను ఓడించేందుకు భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేయాలనే రాజకీయ తీర్మానంపైనే చర్చ జరిగింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో మతతత్వ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్తో పనిచేయాలా వద్దా? అనే అంశంపై చర్చించారు. కేరళ యూనిట్, కారత్ వర్గం దీనిపై అభ్యంతరం తెలపగా పశ్చిమబెంగాల్, త్రిపుర యూనిట్లు సానుకూలంగా స్పందించాయి. -
'మన నగరం' పేరుతో టౌన్హాలు సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇకపై నేరుగా ప్రజలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీవోలతో సమావేశాలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందు కోసం మన నగరం/ అప్నా చహర్ పేరుతో టౌన్హాలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే వారం నుంచి నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు జరిపి.. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలతో నేరుగా చర్చించనున్నట్టు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. 'మన నగరం' పేరుతో పాటు అందులో చార్మినార్ ఉన్న లోగోలను మంత్రి ఈ సందర్భంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
బిహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు
-
పార్లమెంట్ సెంట్రల్ హాల్ అర్థరాత్రి సమావేశాలు ఎన్నిసార్లు?
న్యూఢిల్లీ: జూన్ 30 అర్థరాత్రిన కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న జీఎస్టీ సంబరాలకు ప్రతి పక్షాలు డుమ్మాకొట్టనున్న సంగతి విదితమే. కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే జీఎస్టీ లాంచింగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు గురువారం ఢిల్లీలో గురువారం ప్రెస్మీట్ నిర్వహించాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ అజాద్ మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న జీఎస్టీ తీరు తెన్నులపై ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జీఎస్టీ లాంచింగ్ కార్యక్రమ్రాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అర్థరాత్రి నిర్వహించడంపై అభ్యంతరంపై వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో మూడే మూడుసార్లు పార్లమెంట్ సెంట్రల్ హాల్ అర్థరాత్రి సమావేశాలు జరిగాయని గులాం నబీ అజాద్ చెప్పారు. ముందుగా దేశానికి స్వాతంత్ర్యం లభించిన సందర్బంగా 1947 ఆగస్టులో 15 అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సమావేశమైనట్టు చెప్పారు. అలాగే సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 1972 సం.రంలోనూ, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 1997లో మాత్రమే జరిగాయన్నారు. పేదలు, మహిళలు, అల్ప సంఖ్యాక వర్గాలు, దళితుల సంక్షేమాన్ని బీజేపీ పక్కన పెట్టిందని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం గురించి పట్టించుకోవడంలేదన్నారు. క్షీణిస్తున్న జీడీపీపై ధ్యాస లేదని మండిపడ్డారు. ఈసందర్భంగా జీఎస్టీకి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని మెజారీటీ ప్రజానీకం ఆకాంక్షల్ని పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తాము జీఎస్టీ లాంచింగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ ని జూలై 1 నుంచి అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 30న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రత్యేక సమావేశం ద్వారా జీఎస్టీని అధికారికంగా లాంచ్ చేయనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీనికి ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్ సహా ప్రతిపక్ష సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారుని తెలిపారు. వీరితోపాటు మాజీ ప్రధానులను కూడా ఆహ్వానించినట్టు జైట్లీ కటించిన సంగతి తెలిసిందే. మరోవైపు జీఎస్టీ లాంచింగ్ వేడుకలకు సర్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ ఆదియా ప్రకటించారు. జీఎస్టీ అమలుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. శనివారం దీనికి సంబంధించిన నోటిషికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. -
చమురు సంస్థల అన్యాయంపై సమరం చేయాలి
-ముమ్మిడివరం వైఎస్సార్ సీపీ ప్లీనరీలో ఎమ్మెల్సీ బోస్ -టీడీపీ పాలనపై కన్నబాబు, పినిపే ధ్వజం ముమ్మిడివరం : చమురు సంస్థల నిధుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ముమ్మిడివరం శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణమండపంలో బుధవారం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రత్యేకమైన ప్రాంతమైన కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలు విరివిగా జరగటంతో సీఎస్ఆర్ నిధులతో మంచి అభివృద్ధి జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశించారన్నారు. ఈ ప్రాంతంలో ఆ నిధులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కళాశాలల వంటివి నిర్మించక పోవడం దురదృష్ణకరమన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు సరైన అవగాహన లేకపోవడంతో ఆ నిధులను అతిథి గృహాలకు, కల్యాణ మండపాలకు, కేటాయించడం శోచనీయమన్నారు. ఈ అంశాలపై ప్లీనరీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్లీనరీలో ప్రవేశపెట్టాలని సూచించారు. మరో ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని విమర్శించారు. అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మిస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలకగా ప్రభుత్వ అవినీతిలో అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. సబ్ ప్లాన్ నిధులను షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతాలలో ఖర్చుచేయకుండా అమరావతిలో నిర్మించే 120 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి మళ్లించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ౖఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం కావాలన్న లక్ష్యంతో కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా అప్పటి ఉమ్మడి రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకొని వెళ్లిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్కే దక్కిందన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్ల్రంలో14లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తే తన హయాంలో 73లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన ఘనత వైఎస్కే దక్కిందన్నారు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ ప్రవేశపెడితే చంద్రబాబు అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశార విమర్శించారు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నా భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సమావేశంలో గ్రేటర్ రాజమండ్రి కోఆర్డినేటర్ కందుల దుర్గేష్, పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాష్ట్ర పార్టీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరావు, రాజమండ్రి నగర పాలక సంస్థఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు భూపతిరాజు సుదర్శనబాబు, పెయ్యల చిట్టిబాబు, పాలెపు «ధర్మారావు, ఏడిద చక్రపాణిరావు, మిండగుదిటి మోహన్, అత్తిలి సీతారామస్వామి, కొల్లి నిర్మలాకుమారి, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. -
ప్లీనరీలకు పోటెత్తిన శ్రేణులు
చంద్రబాబు రాక్షస పాలనను ఎండగట్టిన నేతలు పార్టీ ఫిరాయింపుదారులకు చురకలు కేడర్లో ఉత్సాహం నింపిన నాయకులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో మంగళవారం జరిగిన మూడు ప్లీనరీలకు అభిమానులు పోటెత్తారు. ప్లీనరీలు జరిగిన వేదికలు తరలివచ్చిన శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. కాకినాడ రూరల్, రాజోలు, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బొంతు రాజేశ్వరరావు, రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగాయి. కాకినాడ రూరల్ ప్లీనరీ జరిగిన స్పందన ఫంక్షన్ హాలు కేడర్తో నిండిపోవడంతో బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాజోలు, రాజమహేంద్రవరం సిటీ ప్లీనరీలకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రభుత్వం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తోన్న వైనాన్ని జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఎత్తిచూపారు. ప్రజావ్యతిరేక విధానాలను, మోసపూరిత విధానాలను ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేత వైఎస్, మాట తప్పేవాడే బాబు అని ఇద్దరి మధ్య ఉన్న అంతరాన్ని ముఖ్య అతిథి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్ విశ్లేషించారు.మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్రంలో తండ్రీ కొడుకులు దొంగపాలన చేస్తూ ప్రజలను దోచుకు తింటున్నారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లోకేష్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఫిరాయించిన జిల్లా నేతలను తన సహజ శైలిలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరోక్ష హెచ్చరికలతో చురకలంటించిన తీరు కేడర్లో ఉత్తేజాన్ని నింపింది. శివకోడులో రాజోలు ప్లీనరీ కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో సుఖశాంతులతో ఉన్న ప్రజలు చంద్రబాబు గద్దెనెక్కాక రాక్షస పాలన కొనసాగిస్తున్న వైనాన్ని రాజోలు ప్లీనరీలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎండగట్టారు. దళిత ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచి పోతారని రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున చంద్రబాబు అన్నారు. నిరంకుశ పాలనపై దండెత్తాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకునే వారిని జగన్మోహన్ రెడ్డి గుర్తించి పగ్గాలు అప్పగిస్తారని చెబుతూ కేడర్ అంతా కలిసి కట్టుగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ పరిశీలకుడు వలవల బాబ్జీ, డీసీసీబీ డైరెక్టర్ పాముల విజయరంగారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి టీడీపీ రాక్షస పాలనను ఎండగట్టారు. రాజమహేంద్రవరం సిటీ ప్లీనరీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి చంద్రబాబు మోసాలను శాస్త్రీయంగా విశ్లేషించిన తీరు కేడర్ను ఆకర్షించింది. బాబు హస్తం భస్మాసురమని రాజమహేంద్రవరం గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్ సూత్రీకరించారు. ఆయా ప్లీనరీలలో మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, పాముల రాజేశ్వరి, రౌతు సూర్యప్రకాశరావు టీడీపీ మోసాలను ఎండగట్టారు. కో–ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, ముత్యాల శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్ పార్టీ కేడర్కు దిశానిర్థేసం చేశారు. ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్లీడర్ గుత్తుల మురళీధర్, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు టీడీపీ మోసాలను ఎండగట్టారు. రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, సంగిశెట్టి అశోక్, రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉందని కేడర్లో మనోధైర్యాన్ని నింపారు. వైద్య, ఎస్సీ విభాగాల అధ్యక్షులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పెట్టా శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి తదితరులు పాల్గొన్నారు. -
విజయవంతంగా ప్లీనరీలు
కేడర్లో ఉత్సాహం నింపిన నాయకులు అమలాపురం, ప్రత్తిపాడులో ప్లీనరీల నిర్వహణ తరలివచ్చిన పార్టీ శ్రేణులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికార పార్టీ ఆగడాలు, వైఫల్యాలను ఎండగట్టి వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్న ప్లీనరీలు జిల్లాలో విజవంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం అమలాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్లీనరీలు పార్టీ కో ఆర్డినేటర్లు పినిపే విశ్వరూప్, పర్వత ప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. అమలాపురంలో... అమలాపురం ప్లీనరీకి నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్షత్రియ కల్యాణ మండపం కిటకిటలాడింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలైన ఫీజు రీయింబర్స్మెంట్, 108, గృహ నిర్మాణం..వంటి వాటిని చంద్రబాబు సర్కార్ కోత పెడుతున్న తీరును లెక్కలతో సహా ముఖ్య అతిథి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్ కార్యకర్తల ముందుంచారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.35 వేలు ఇస్తుంటే కార్పొరేట్ కళాశాలలు రూ.75 వేలు పెంచేయడంతో పేదలు పడుతున్న ఇబ్బందులు వివరించారు. తన తండ్రి జక్కంపూడి ద్వారా సంక్రమించిన రాజకీయ వారసత్వాన్నే కాకుండా ఆపద వస్తే ఎదురొడ్డేలా అప్పగించిన పోరాట పటిమను కార్యకర్తల కోసం వినియోగిస్తామని పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బాబు అమలాపురంలో కాపు ఓట్ల కోసం డిప్యూటీ సీఎం పదవి ఎరగా వేసి ఆ వర్గంపై పెట్టిన అక్రమ కేసులు పెరిగేలా చేశారని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీని చేయడమే కాకుండా, జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్లకు పసుపు రంగు వేసి టీడీపీ భవనాలుగా మార్చేస్తున్న వైనాన్ని పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఎండగట్టినప్పుడు కేడర్ ఈలలతో హోరెత్తించారు. ఇందుకు అల్లవరం పోలీస్స్టేషన్కు పసుపు రంగు వేసిన ఉదాహరణను ఆయన ఆధారాలతో వివరించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబు సర్కార్ను అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, రాష్ట్ర కార్యదర్శి కొల్లి నిర్మలాకుమారి ఎత్తి చూపారు. చంద్రబాబు వైఫల్యాలను కో–ఆర్డినేటర్లు ముదునూరి ప్రసాదరాజు, వేగుళ్ల లీలాకృష్ణ, కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, పితాని బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్లు ఎండగట్టారు. పార్లమెంటు పరిశీలకుడు వలవల బాబ్జీ, ప్లీనరీ పరిశీలకులు మేడపాటి షర్మిలారెడ్డి, కర్రి పాపారాయుడు, రాష్ట్ర కార్యదర్శులు బొమ్మి ఇజ్రాయిల్, దంగేటి రాంబాబు, చెల్లుబోయిన శ్రీనువాసు, మిండుగుదిటి మోహనరావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు జక్కంపూడి కిరణ్, జున్నూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శంఖవరంలో... శంఖవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మండపంలో ప్రత్తిపాడు, కొంకాపల్లి క్షత్రియ కల్యాణ మండపంలో అమలాపురం నియోజకవర్గ ప్లీనరీలు జరిగాయి. ప్రత్తిపాడు ప్లీనరీకి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. పార్టీ, కార్యకర్తల మధ్య అనుబంధాన్ని మరింత పెంచే దిశగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేసిన ప్రయత్నమే ఈ ప్లీనరీలని ముఖ్య అతిథిగా హాజరైన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఎన్నికలు ఒక ఏడాది ముందే వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న పరిస్థితులను వివరిస్తూ అందుకు పార్టీ శ్రేణులను ఈ వేదిక నుంచి సమాయత్తం చేశారు. ఎంతో నమ్మకం ఉంచి జగన్మోహన్రెడ్డి పార్టీని జగ్గంపేట నియోజకవర్గంలో ప్రకటిస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేసి తోడల్లుళ్లు పార్టీకి ద్రోహం చేసి టీడీపీలోకి ఫిరాయించేశారంటూ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పదునైన పదాలతో ఫిరాయింపుదారులను కడిగి పారేశారు. ప్లీనరీలో చర్చకు వచ్చే స్థానిక సమస్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి జూలైలో విజయవాడలో జరిగే రాష్ట్ర ప్లీనరీకి తీసుకు వెళతామని చెప్పడం ద్వారా కాకినాడ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం ఇస్తుందనే విషయాన్ని నూరిపోశారు. ఈ దిశగా కార్యకర్తలను కార్యోన్ముకులను చేసేందుకు సునీల్ ప్రాధాన్యం ఇచ్చారు. ప్లీనరీ పరిశీలకుడు, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్ సమక్షంలో జరిగిన ఈ ప్లీనరీలో మాజీ మంత్రి కొప్పన మోహనరావు, కోఆర్డినేటర్లు ముత్యాల శ్రీనివాస్, తోట సుబ్బారావునాయుడు, ముత్తా శశిధర్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహం పంచి.. ఉత్తేజం నింపి..
- వైఎస్సార్ సీపీ ప్లీనరీలకు పోటెత్తిన జనం - తరలివచ్చిన రాష్ట్ర నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రజాధనాన్ని దుబారా చేస్తూ.. అధికారులపై ఒత్తిడి తెస్తూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షలు పేలవంగా సాగుతుంటే.. వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న నియోజకవర్గ ప్లీనరీలకు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. గత మూడు రోజులుగా జిల్లాలో ప్లీనరీలు జరుగుతుండగా.. ఆదివారం ఒకే రోజే ఐదు నియోజకవర్గాల్లో ప్లీనరీలు నిర్వహించారు. వీటికి పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. తుని, రాజానగరం, జగ్గంపేట, అనపర్తి, కొత్తపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీలకు రాష్ట్ర నేతలు తరలిరావడం పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలపై రాష్ట్ర, ప్రజాప్రతినిధులు, నేతలు ప్లీనరీల్లో ఎండగడుతున్న తీరుకు పార్టీ కేడర్తో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజు వంటి అగ్రనేతలు ఒకేసారి ఆదివారం తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగిన ప్లీనరీకి అనూహ్య రీతిలో జనం తరలివచ్చి స్థానికంగా యనమల సోదరులపై వ్యతిరేకతను చాటారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిన వైనాన్ని పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు వివరించారు. మంత్రి యనమల సోదరుల అరాచకాలను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఎండగట్టినప్పుడు నియోజకవర్గం నలుమూలల నుంచీ తరలివచ్చిన జనం నుంచి ఈలలు, కేకలతో పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. తునిలో నడుస్తున్న దోపిడీ రాజ్యాన్ని ఎదుర్కొనేందుకు వెన్నంటి ఉంటానన్నప్పుడు ‘జై రాజా’ అనే నినాదాలు మిన్నంటాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తీరుతో ప్రభుత్వం దిగివచ్చిందని అన్నారు. యనమల ఆగడాలు సాగుతున్నా జనం భయపడకుండా ఎమ్మెల్యే రాజాకు అండదండలు అందిస్తుండటం అభినందనీయమని కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ అన్నారు. రెండేళ్లలో రానున్న కురుక్షేత్రంలాంటి ఎన్నికల్లో పాండవుల్లా అధికారాన్ని చేపట్టేందుకు సైనికుల్లా పని చేయాలని పరిశీలకుడు కందుల దుర్గేష్ కేడర్కు దిశానిర్దేశం చేశారు. జగ్గంపేటలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గ పాలనను దుయ్యబట్టారు. అవినీతిని, దోపిడీని రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేశారని, చట్టాలను మార్చి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఓడిపోలేదని, మొదట ఒక సీటు, తరువాత 17 సీట్లు, గత ఎన్నికల్లో 67 సీట్ల స్థాయికి చేరుకుందని చెబుతూ కేడర్లో ఉత్తేజాన్ని నింపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఏదో ఒక రోజు జిల్లా ప్లీనరీ ఉంటుందని వివరించారు. టీడీపీ మహానాడు ఫుడ్ ఫెస్టివల్గా మారిందని, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు, కాకినాడ పీతలు తప్ప ప్రజల సమస్యలు పట్టలేదని విమర్శించారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పాగా వేయడమే లక్ష్యంగా పని చేయాలని, జగ్గంపేటను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని అన్నారు. దివాన్చెరువులోని ఎంఎఫ్ కన్వెన్షన్ హాలులో జరిగిన వైఎస్సార్ సీపీ రాజానగరం నియోజకవర్గ ప్లీనరీకి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహానేత వైఎస్, మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావుల విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతికి కొద్దిసేపు మౌనం పాటించారు. ఇసుక, మట్టితో దొరికిన కాడికి దోచుకోవడమే చంద్రబాబు సర్కార్ విధానంగా పెట్టుకుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆక్షేపించారు. నియోజకవర్గం అవినీతికి పరాకాష్టగా మారిందని, కోడిగుడ్డు, పాడైన పాలప్యాకెట్లను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ, విజయలక్ష్మి సాక్ష్యాధారాలతో సహా ప్లీనరీ ముందుంచారు. అవినీతికి అంతు లేకుండా ఉందని, వివిధ రకాల పథకాల పేరుతో దోపిడీయే ధ్యేయంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆక్షేపించారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అడుగుజాడల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరాన్ని పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ సూచించారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, రాజమహేంద్రవరం కార్పొరేషన్లో పార్టీ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి నొక్కి చెప్పారు. రావులపాలెంలో జరిగిన కొత్తపేట నియోజకవర్గ ప్లీనరీకి అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు, నేతలతో ప్లీనరీ జరిగిన బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానం కిక్కిరిసిపోయింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రకృతి వనరులను నిలువునా దోచుకుంటున్న చంద్రబాబు ప్రజాకంటక పాలనపై ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిప్పులు చెరిగినప్పుడు జనం చప్పట్లతో స్వాగతించారు. జన్మభూమి పేరుతో గ్రామాల్లో అక్రమాలకు పాల్పడుతూ అర్హులకు అన్యాయం చేస్తున్న వైనాన్ని ఎండగట్టారాయన. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ప్లీనరీలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని జగ్గిరెడ్డితోపాటు జెడ్పీ ప్రతిపక్ష నేత సాకే ప్రసన్నకుమార్ తదితరులు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆ ప్లీనరీలో 13 తీర్మానాలను ఆమోదించారు. అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదిక ప్రాంగణంలో ప్లీనరీ జరిగింది. ఎమ్మెల్సీ, పార్టీ నేత పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పి, చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అనంతరం జనాన్ని నిలువునా ముంచేశారని, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను నీరుగార్చారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడే కుటుంబం వైఎస్సార్దని అన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ, నీరు - చెట్టు, ఉచిత ఇసుక, మద్యం షాపులను అక్రమ ఆదాయ మార్గాలుగా చేసుకుని చంద్రబాబు అండ్ కో 420గా మారిందని తనదైన శైలిలో వాక్బాణాలు సంధించడంతో జనం ఈలలతో కేరింతలు కొట్టారు. అక్రమాలతో సంపాదించిన కోట్ల కరెన్సీ కట్టలతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న బాబుకు జనం ఓట్ల కట్టలతో బుద్ధి చెప్పేలా కార్యకర్తలు ముందుండి నడిపించాలంటూ కేడర్కు దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న జనం సర్కార్పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతున్నారని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా విశ్లేషించారు. ఈ ప్లీనరీల్లో పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, పరిశీలకులు వలవల బాబ్జీ, కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, పెండెం దొరబాబు, ముత్తా శశిధర్, పర్వత ప్రసాద్, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పరిశీలకులు మిండగుదిటి మోహనరావు, శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర, జిల్లా నేతలు కొల్లి నిర్మలకుమారి, కర్రి నాగిరెడ్డి, మార్గాని గంగాధర్, గొల్లపల్లి డేవిడ్రాజు, మోతుకూరి వెంకటేష్, కర్రి పాపారాయుడు, సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు. -
‘కోత’ల బాబును సాగనంపండి
- నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్లీనరీల్లో నేతల దిశా నిర్థేశం - సైనికుల్లా పని చేయండి ... విజయం మనదే సాక్షి ప్రతినిధి, కాకినాడ : హామీలు అమలు చేయకుండా సంక్షేమ పథకాలకు కోతలు పెడుతున్న చంద్రబాబు సర్కార్ దాష్టీకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వైఎస్సార్సీపీ ప్లీనరీలు పార్టీ శ్రేణులకు దిశా నిర్థేశనం చేస్తున్నాయి. మూడో రోజు శనివారం పి.గన్నవరం, రాజమహేంద్రవరం రూరల్, మండపేట నియోజక వర్గాల్లో పార్టీ ప్లీనరీలు జరిగాయి. ఈ ప్లీనరీల్లో గణాంకాలతో కూడిన నివేదికలు, చైతన్య పరిచే నేతల ప్రసంగాలు క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేయడం, ఫీజు రీ ఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ తదితర సంక్షేమ పథకాల్లో చంద్రబాబు కోతలు పెట్టిన విషయంపై కార్యకర్తలకు వివరించారు. ప్లీనరీలు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కాగా రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించారు. నేతల ప్రసంగాలు, క్షేత్రస్థాయి నాయకులు తీర్మానాలను చదివే తీరు, కార్యకర్తలు చర్చల్లో పాల్గొన్న తీరు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ప్రజా సంక్షేమంలో దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ఔన్నత్యాన్ని, చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని, దళితులను దగా చేస్తున్న వైనాన్ని వివరిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. అంబాజీపేటలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, కొంతమూరులో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మండపేటలో పరిశీలకుడు చెల్లుబోయిన వేణు అధ్యక్షతన జరిగిన ప్లీనరీల్లో నేతలు చంద్రబాబు అవినీతి పాలనను ఎండగట్టారు. మండపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, అంబాజీపేటలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, రాజమహేంద్రవరం రూరల్లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరై చంద్రబాబు మాట తప్పిన వైనాన్ని కార్యకర్తలకు వివరించి ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత తీసుకునేలా వారిలో స్ఫూర్తిని రగిలించారు. కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రియల్ స్టేట్గా కాకుండా రియల్ ఎస్టేట్గా చంద్రబాబు, అతని తనయుడు లోకేష్ తయారు చేశారని ధ్వజమెత్తారు. కార్యకర్తలపై ఈగవాలితే ఉపేక్షించేది లేదని అంతా వారి వెంటే ఉంటామని కన్నబాబు భరోసా ఇచ్చారు. రైతుల రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఏ రీతిలో భ్రష్టుపట్టించారో లెక్కలతో సహా ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్ వివరించారు. సంక్షేమ పథకాల్లో కోత పెడుతూ అవినీతిలో అభివృద్ధి సాధించిన చంద్రబాబు సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు రాజమహేంద్రవరం రూరల్లో గెలుపొందడం ద్వారా తుని తప్ప జిల్లా అంతటా అప్పట్లో గెలుపు సాధించామని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతిని గ్రామగ్రామాన ఎండగట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు గద్దె దిగే వరకు సమిష్టిగా నేతలు, కార్యకర్తలు పోరాటాలు చేయాలని పీఏసీ, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. ప్లీనరీ పరిశీలకుడు వట్టికూటి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, పార్లమెంటరీ పరిశీలకుడు వలవల బాబ్జి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర కార్యదర్శి కొల్లి నిర్మలాకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, రావూరి వెంకటేశ్వరరావు పార్టీకార్యకర్తలు సమన్వయంతో చంద్రబాబు అరాచక పాలనపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయకుంటే చంద్రబాబు అరాచక పాలనకు అడ్డు అదుపు లేకుండా పోతోందని యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు అనంతబాబు, గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం ఫ్లోర్లీడర్ షర్మిలా రెడ్డి తదితరులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కో ఆర్డినేటర్లు గిరజాల బాబు, వేగుళ్ల పట్టాభిరామయ్య, వేగుళ్ల లీలాకృష్ణ, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాస్, మిండగుదిటి మోహనరావు, కర్రి పాపారాయుడు, నక్కా రాజబాబు, కర్రి నాగిరెడ్డి, రెడ్డి రాజబాబు, కొవ్వూరి త్రినాధరెడ్డి, పి కె రావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెట్టా శ్రీనివాసరావు, మార్గని గంగాధర్, జున్నూరి వెంకటేశ్వరరావు, సిరిపురపు శ్రీనివాసరావు, కాశి బాలమునికుమారి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలే అజెండాగా ప్లీనరీలు
- సన్నాహక సమావేశంలో వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు - నేడు పరిశీలకుల నియామకం - ఐదో తేదీ తరువాత మరోసారి భేటీ - జయప్రదానికి పార్టీ శ్రేణులు కసరత్తు ఇప్పటికే గడప గడపకూ వైఎస్సార్ పేరుతో ప్రతి ఇంటి తలుపు తట్టి పలుకరించిన వైఎస్పార్ సీపీ పార్టీ ... గ్రామ, మండల, జిల్లా స్థాయి సమస్యలే అంజెండాగా ప్లీనరీ సమావేశాలను నియోజకవర్గ స్థాయిల్లో వినూత్నంగా చేపట్టడానికి శ్రీకారం చుడు తోంది. గ్రామ స్థాయి సమస్యలను నియోజకవర్గ స్థాయి సమవేశంలో చర్చించి ... అందులో ప్రధానమైనవాటిని జిల్లా ప్లీనరీలో చచ్చకు పెట్టి వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తుంది. మరీ కీలకమైన సమస్యలను రాష్ట్రస్థాయి సమావేశంలో తీర్మానాలుగా ప్రవేశ పెడతారు. ఆ దిశగా బలంగా అడుగులు వేయడానికి జిల్లా పార్టీ సమాయత్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలకు సిద్ధమవుతోంది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అన్ని నియోజక వర్గాల్లో ప్లీనరీ సమావేశాలు చేపట్టనున్నారు. నియోజక వర్గాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పార్టీ అభిమానులు, ప్రజల సమక్షంలో చర్చించి తీర్మానాన్ని ఆమోదించి జిల్లా ప్లీనరీలో ప్రతిపాదించడం, ఆ తరువాత రాష్ట్ర ప్లీనరీలో ఆమోదించాలనేది పార్టీ ఆదేశం. ఈ ప్లీనరీలలో ఎటువంటి సమస్యలు చర్చించాలి, ఎలా నిర్వహించాలి, ఎవరు పర్యవేక్షించాలి, నిర్వహణ తదితర అంశాలపై గురువారం కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. తొలిసారి నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ప్లీనరీల్లో పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిపై సమగ్రంగా చర్చించాల్సి ఉంటుంది. చర్చ అనంతరం ఆ సమస్య పరిష్కారానికి పార్టీ తరఫున తీసుకోవాల్సిన ఆందోళనకు కార్యచరణను రూపొందించి జిల్లా ప్లీనరీకి నివేదించనున్నారు. వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో ఏదో ఒక రోజు నిర్వహించే జిల్లా ప్లీనరీలో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి జిల్లా స్థాయిలో ఒక ప్రతిపాదన ముసాయిదాను రూపొందించి రాష్ట్ర ప్లీనరీ ముందుంచాలనేది పార్టీ నిర్ణయం. ఇందుకు నియోజకవర్గ స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన కార్యచరణపై పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్చంద్ర బోస్, దాడిశెట్టి రాజా, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గానికి ఒక్కో పరిశీలకుడి పర్యవేక్షణలో... ఇందుకోసం ప్రతి నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని నియమించే విషయమై కసరత్తు చేశారు. ఏ నియోజక వర్గానికి ఎవరిని నియమించాలనే జాబితా శుక్రవారం నాటికి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. ఏ నియోజకవర్గంలో ఏ తేదీన నిర్వహిస్తారనేది నియోజకవర్గ నేతలు తమకున్న వెసలుబాటును చూసుకుని చర్చించి శుక్రవారం మధ్యాహ్నానికి పార్టీ జిల్లా కార్యాలయానికి నివేదించాలని తీర్మానించారు. జిల్లా స్థాయిలో ప్లీనరీ ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనేది వచ్చే నెల 5 తరువాత మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునేందుకు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్లీనరీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజా సమస్యలను ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్ర బోస్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గట్టిగా చెప్పారు. పార్టీ యువజన విభాగం నుంచి ప్రతి ఒక్కరు విధిగా ఎవరి పరిధిలో వారు నియోజకవర్గ ప్లీనరీకి హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆ విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయభాస్కర్ పేర్కొన్నారు. పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పార్టీ కేడర్ ద్వారా దిశా నిర్థేసనం చేసేందుకు ఉపయోగపడే నియోజకవర్గ ప్లీనరీలు సద్వినియోగంచేసుకునేందుకు వేదికగా చేసుకోవాలని రాజమహేంద్రవరం గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ప్లీనరీ ద్వారా టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై హడలెత్తిపోయేలా కార్యక్రమాలుండాలని సీజీసీ సభ్యులు కుడుపూడి, విజయలక్ష్మి సూచించారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటానికి దోహదపడే వీటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పాముల రాజేశ్వరీదేవి, పెండెం దొరబాబు, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకే ప్రసన్నకుమార్ సూచించారు. పార్టీని నిర్మాణాత్మకంగా క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు ప్లీనరీలు దోహదపడేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అమలాపురం పార్లమెంటు పరిశీలకుడు వలవల బాబ్జీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహనరావు, కర్రి పాపారాయుడు తదితరులు పేర్కొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించడం, మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేయడం ద్వారా ప్లీనరీ ప్రారంభమయ్యేలా చూడాలని ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్లు సూచించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కోఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, పర్వత ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, కొండేటి చిట్టిబాబు, వేగుళ్ల పట్టాభి, వేగుళ్ల లీలాకృష్ణ, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గుత్తుల సాయి, రావూరి వెంకటేశ్వరరావు, పాలెపు ధర్మారావు, వట్టికూటి రాజశేఖర్, ఎస్ వెంకటరెడ్డి, కాకినాడ పార్టీ నగర అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మొబైల్స్ ఎందుకు బ్యాన్ చేస్తానంటే..?: మోదీ
న్యూఢిల్లీ: తన సమావేశాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించడానికి గల కారణాలను ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అలా తానెందుకు చేస్తానో అనే విషయాన్ని పంచుకున్నారు. ‘ఈ మధ్యకాలంలో నేను చాలా సమావేశాలు చూస్తున్నాను. జిల్లా అధికారులంతా తమ ఫోన్లల్లో బిజీ బిజీ బిజీగా ఉంటున్నారు.. అందుకే నేను సమావేశాల్లో మొబైల్ఫోన్లను బ్యాన్ చేశాను. ప్రజలు ఈ గవర్నెన్స్ నుంచి మొబైల్ గవర్నెన్స్ మారారు. అది ఈరోజు వాస్తవంలో కనిపిస్తుంది’ అని మోదీ చమత్కరించారు. సివిల్ సర్వీస్ డే సందర్భంగా మాట్లాడిన మోదీ ప్రభుత్వ ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధుల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలనే విషయాన్ని మోదీ మరోసారి చెప్పారు. పనిచేసే పద్ధతిలో మార్పు కనిపించాలని, కొత్త నిర్వచనం చెప్పాలని మోదీ అన్నారు. సంస్కరణలు తీసుకురావాలనే రాజకీయ అభిలాష నాకుంది. కానీ, ఆ పథకాలను, విధానాలను సక్రమంగా అమలుచేసే ఉద్యోగులు మీరు’ అని మోదీ సూచించారు. -
జైలు నిబంధనలకు విరుద్ధంగా శశికళ..
► నెలరోజుల్లో 28 మంది సందర్శకులు ► తెలుగుదేశం ఎమ్మెల్సీ మాగుంట మంతనాలు ► నిబంధనల అతిక్రమణతో దండన తప్పదంటున్న విశ్లేషకులు సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న శశికళ బెంగళూరు జైలులోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. జైలు నిబంధనలను తోసిరాజని నెలరోజుల్లో 31 మందితో చిన్నమ్మ మంతనాలు సాగించడం వివాదాస్పదమైంది. ఆస్తుల కేసులో దోషిగా నాలుగేళ్లపాటు ఆమె బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవించాల్సి ఉంది. శశికళతోపాటు ఇళవరసి, సుధాకరన్ సైతం అదే కేసులో అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడ ఆమెకు బైట నుంచి క్యారియర్ భోజనం, ఏసీ పడక, టీవీ, వార్తా పత్రికలు తదితర సౌకర్యాలు కల్పించినట్లు సమాచారం. ఆమెకు వీవీఐపీ వసతులు ఏవీ కల్పించలేదని, సాధారణ ఖైదీల నిబంధనలకు లోబడే వసతి కల్పించినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. అయితే, జైలు నిబంధనలను శశికళ ధిక్కరించినట్లుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వ జైళ్లశాఖ నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన న్యాయవాది, బంధువులు, స్నేహితులతో 15 రోజులకు ఒకసారి, కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చు. అయితే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ 31 రోజుల్లో 28 మందిని శశికళ కలుసుకుని సంభాషించినట్లు జైలు రికార్డులు చెబుతున్నాయి. ఒక్కో సందర్శకునితో 15 నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సి ఉండగా 40 నిమిషాలపాటు ఆమె సంభాషించారు. అంతేగాక మిలాఖత్ కోసం జైలు ఆవరణలోని ప్రత్యేక గదిని ఆమె వినియోగించుకున్నారు. నేడో రేపో ముఖ్యమంత్రి అయిపోతానని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆమె జైలు పాలయ్యారు. తమిళనాడులో అన్నాడీఎంకేలోని ఆమె వర్గమే అధికారంలో ఉన్నా ఆ సుఖ సంతోషాలు, భోగభాగ్యాలకు చిన్నమ్మ దూరమయ్యారు. అయినా జైలు నుంచే తమ వారికి ఆదేశాలు పంపిస్తూ పార్టీ, ప్రభుత్వంపై పెత్తనం సాగిస్తున్నారు. పార్టీ, రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ వద్ద పన్నీర్ వర్గం సవాలు చేయడం, ఆర్కేనగర్లో ఉప ఎన్నికలు ముంచుకురావడం, దినకరన్ గెలిచి తీరాలనే పరిస్థితులు నెలకొనడం తదితర కారణాలు జైల చిన్నమ్మకు కునుకుపట్టకుండా చేస్తున్నాయి. అందుకే తరచూ తన వారిని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. చిన్నమ్మతో మాగుంట మంతనాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తగా వెలుగొందుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గత నెల 1వ తేదీన చిన్నమ్మను జైల్లో కలుసుకుని 20 నిమిషాలపాటూ మంతనాలు జరపడం గమనార్హం. అలాగే, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఫిబ్రవరి 20 నుండి మార్చి 8వ తేదీ మధ్యన రెండుసార్లు కలుసుకున్నారు. ఈ రెండుసార్లు సుమారు 45 నిమిషాలపాటూ ఆమెతో మాట్లాడారు. పార్లమెంటు ఉప సభాపతి తంబిదురై, బంధువులు వివేక్, కార్తికేయన్, న్యాయవాదులు శశికలను కలుసుకున్న వారిలో ఉన్నారు. శశికళతోపాటూ అదే సెల్లో ఉన్న ఇళవరసి కేవలం నాలుగుసార్లు మాత్రమే బంధువులను కలుసుకున్నారు. ఇదే కేసులో మరో ఖైదీ సుధాకరన్ ఒకే ఒకసారి బెంగళూరుకు చెందిన తన న్యాయవాదితో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ విదేశీ మారకద్రవ్యం కేసును ఎదుర్కొంటున్న శశికళపై గత కొంతకాలంగా చెన్నైలోని ఎగ్మూరు కోర్టు విచారణ సాగుతోంది. ఇందులో బాగంగా ఈనెల 10వ తేదీన విచారణ ఉంది. బెంగళూరు కోర్టు నుండి విడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాల్సిందిగా శశికళ తరపు న్యాయవాది కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేయగా మేజిస్ట్రేటు అంగీకరించారు. ఈ మేరకు 10వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శశికళ విచారణను ఎదుర్కొంటున్నారు. దండన తప్పదా జైలు నిబంధనలకు విరుద్ధంగా 31 రోజుల్లో 28 మందితో ములాఖత్ అయినందుకు శశికళకు ప్రత్యేక దండన తప్పదేమోనని అనుకుంటున్నారు. ఉన్నతాధికారుల కళ్లుగప్పి ఈ తప్పిదానికి పాల్పడ్డారా లేక లోపాయికారితనంగా అనుమతి పొందారా అని అనుమానిస్తున్నారు. నిబంధనలను ఆమె అతిక్రమంచినట్లు రుజువైతే తగిన చర్య తప్పదని భావిస్తున్నారు. అయితే శశికళ అంశంపై వివరణ ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాకరిస్తున్నారు. -
అదే తీరు.. నిరసనల జోరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జన్మభూమి గ్రామ సభల్లో నిరసనలు, నిలదీతలు కొనసాగుతున్నాయి. ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకున్న చోట ముందస్తుగా అరెస్ట్లు చేయించి గొడవలు జరగకుండా చూస్తున్నారు. నిడమర్రు మండలం అడవికొలనులో ఆక్వా మాఫియా దెబ్బకు పంట పొలాలు దెబ్బతిన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ సమస్యపై రైతులు ఆందోళనలు చేశారు. గురువారం ఆ గ్రామంలో జన్మభూమి సభ సందర్భంగా రైతులు నిలదీస్తారన్నభయంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. మిగిలిన వారిని బెది రించారు. రద్దు చేసిన వృద్ధాప్య పిం ఛన్లు పునరుద్ధరించాలని కోరుతూ ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో వృద్ధులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. గ్రామంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన సాలా దానయ్య, అంపా ముత్యాలు, తాడిపర్తి రామారావు, కంతే వెంకటస్వామి, తాడిపర్తి సుబ్బారావు, జంపా కొండయ్య తదితరులు జన్మభూమి గ్రామ సభ ఎదుట ప్ల కార్డులు చేతబూని తమ పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమకు 2014 వరకూ రూ.200 చొప్పున పింఛను ఇచ్చారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పేరుతో రద్దు చేశారని వారు వాపోయారు. చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెం జన్మభూమి గ్రామ సభను గిరిజనులు అడ్డుకున్నారు. నాయకపోడు గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు అధికారులను సభలోకి వెళ్లనీయలేదు. గిరిజనుల సమస్యలు పరిష్కరించని కారణంగా సర్పంచ్ మేడి రాములు, ఎంపీటీసీ సత్యవతి జన్మభూమి గ్రామ సభనుంచి వాకౌట్ చేశారు. వెంకటాపురం గ్రామ సభలో చింతలపూడి–నామవరం రహదారి నిర్మాణంౖ కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో జెడ్పీ స్కూల్లో మధ్యా హ్న భోజనం సరిగా ఉండటం లేదని విద్యార్థులు ఆరోపించారు. దేవరపల్లి మండలం పల్లంట్లలో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లస్థలాల కోసం అధికారులను నిలదీశారు. అర్హులకు పథకాలు మంజూరు చేయకుండా అనర్హులకు మంజూరు చేస్తున్నారని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు పంచాయతీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. వీరవాసరం మండలం రాయకుదురులో అర్హత ఉన్నా తమకు పింఛన్లు ఎందుకివ్వడం లేదని పలువురు వృద్ధులు అధికారులను నిలదీశారు. -
దాడులు..దౌర్జన్యాలు
– జన్మభూమిలో అధికార పార్టీ శ్రేణుల ఆగడాలు - సమస్యలపై నిలదీస్తే భౌతికదాడులు – వంతపాడుతున్న అధికారులు, పోలీసులు –రెండోరోజూ నిరసనల హోరు అనంతపురం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం అధికార పార్టీ శ్రేణుల ఆగడాలకు వేదికగా మారింది. ప్రజలు సమస్యలను ప్రస్తావిస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలు భౌతికదాడులకు దిగుతున్నారు. అధికారులు, పోలీసుల ముందే రెచ్చిపోతున్నారు. దీంతో సమస్యలపై అర్జీలివ్వడానికి సైతం ప్రజలు జంకుతున్నారు.మంగళవారం జన్మభూమి రెండోరోజు కార్యక్రమం జిల్లావ్యాప్తంగా నిరననలు, నిలదీతలు, అరెస్టుల మధ్య సాగింది. పెనుకొండ మండలం దుద్దేబండలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. పేదల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరికాదని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, దుద్దేబండ సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్రెడ్డి, ఇతర నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి సిద్ధపడ్డారు. ఇంతలో ప్రజలు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారు. సభలో ప్రసంగిస్తున్న ఎంపీటీసీ రామ్మోహన్రెడ్డి చేతిలోని మైకుని లాక్కుని బయటకు పంపించాలంటూ గొల్లపల్లికి చెందిన టీడీపీ నాయకుడు రాజు దురుసుగా మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామానికి సంబంధం లేదని వ్యక్తులను సమావేశం నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపి నాయకుడు రాజుతో పాటు ఎంపీపీ భర్త కేశవయ్య తదితరులు వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా ఎస్ఐ లింగన్నపై ఒత్తిడి చేసి సర్పంచ్ శ్రీకాంతరెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీకి చెందిన వీరనారాయణరెడ్డి అనే నాయకుణ్ని బలవంతంగా స్టేషన్కు తరలించారు. స్టేషన్వద్ద వారిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పరామర్శించారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఖండించారు. అలాగే ఉరవకొండలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సభలో అధికారులను వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. నాల్గవ విడత జన్మభూమి నిర్వహిస్తున్నా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వరా అంటూ జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, పట్టణ కన్వీనర్ తిమ్మప్ప, జిల్లా కమిటీ సభ్యుడు నిరంజన్గౌడ్, ఎంపీటీసీ చందా చంద్రమ్మ ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పలేక పోలీసులను ఉసిగొలిపి బలవంతంగా అరెస్టు చేయించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ జన్మభూమి సభల్లో నిరసనలు, నిలదీతలు వెల్లువెత్తాయి. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, రెయిన్గన్ల పంపిణీలో వివక్షతపై శెట్టూరులో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని టీడీపీ కార్యకర్తలు, సర్పంచు, ప్రజలు నిలదీశారు. అర్హులకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ కణేకల్లు మండలం జక్కలవడికి జన్మభూమి సభలో అధికారులను స్థానికులు ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, మరుగుదొడ్లు మంజూరు చేయాలని డి.హీరేహాళ్ మండలం మల్లికేతి గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. పలుమార్లు అర్జీలిచ్చినా రుణమాఫీ కాలేదని బొమ్మనహాళ్ మండలం సిద్దారాంపురం గ్రామంలో అధికారులను రైతులు నిలదీశారు. శింగనమల మండలం పెరవలి గ్రామంలో రేషన్ కార్డులు తొలగించారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంబదూరు మండలం రాళ్లఅనంతపురంలో ఇంటి బిల్లులు, పింఛన్లు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు నిలదీయడంతో గందరగోళం ఏర్పడింది. -
వినూత్నంగా..ప్రభావ వంతంగా..!
పాఠశాల కాంప్లెక్స్ల నిర్వహణపై పీవో శేషగిరి సూచన. భానుగుడి (కాకినాడ) : స్కూల్ కాంప్లెక్స్ల సమావేశాలు వినూత్నంగా..ప్రభావ వంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ సొసైటీ నుంచి విషయాలను సేకరించి క్షేత్ర స్థాయిలో అమలు పరచాలని పీవో మేకాశేషగిరి తెలిపారు. పీవో కార్యాలయంలో దీనికి సంబంధించి బుధవారం ఏర్పాటు చేసిన మేధావుల కమిటీని సమావేశ పరిచి సూచనలు చేశారు. జిల్లాలో 322 స్కూల్ కాంప్లెక్స్ల్లో నెలకు రెండు రోజుల చొప్పున ఉపాధ్యాయులకు పాఠశాలల నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఉపా«ధ్యాయులు తరగతి గదిని ప్రభావవంతంగా నడిపించేందుకు కావాల్సిన నైపుణ్యాలను శిక్షణ ద్వారా అందివ్వాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఎంఓ చామంతి నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో క్షేత్ర స్థాయిలో సమస్యాత్మక విషయాల నివారణ, ఉపాధ్యాయులు మారుతున్న సమాజానికి అనుగుణంగా అప్డేట్ అవ్వడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీతో చర్చించారు. ఉపాధ్యాయులు అప్డేట్ కావడానికి స్కూల్ కాంప్లెక్స్లు ఒక సాధనంగా మలచాలన్నారు. ప్రతి కాంప్లెక్స్కి డిజిటల్ క్లాస్రూమ్ ఉండడం ద్వారా తరగతి బోధన మరింత నాణ్యమైదనదిగా తీర్చేందుకు ఉన్న అవకాశాలను స్కూల్కాంప్లెక్స్ సమావేశాల్లో చర్చించేలా చూడాలన్నారు. ఎస్ఎస్ఎ సెక్టోరల్ అధికారులు, అసిస్టెంట్ ఏఎంఓ ఆకేళ్ళ శ్రీనివాస్, సీఎంఓ ఐ.వెంకట్రావ్, కమిటీ కన్వీనర్ సలాది సుధాకర్, కమిటీ సభ్యులు మాచిరాజు, కేవీవీ నాయుడు, ఎస్ఎస్వీ చలపతి, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్పీకర్తో కేటీఆర్, జగదీశ్రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారితో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో మంత్రులు ఆయనతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. టీఆర్ఎస్ సంస్థాగత వ్యవహారాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అయితే పార్టీ కమిటీల నియామకంలో భాగంగా కూడా సమావేశం జరిగి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి జిల్లాకు టీఆర్ఎస్ అధ్యక్షుని ఎంపిక జటిలంగా మారింది. తన తనయుడు ప్రశాంత్కు అవకాశమివ్వాలని స్పీకర్ కోరుతుండగా.. ప్రశాంత్ నియామకాన్ని ఒక వర్గం వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ వర్గాలు సమాచారం. మంత్రి చందూలాల్ తనయుడికి ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కడంతో తన తన యునికి పార్టీ పదవి కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ హైకమాండ్పై స్పీకర్ ఒత్తిడి పెంచారంటున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్కు నచ్చజెప్పేందుకు కేసీఆర్ సూచన మేరకు మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఎంపీ వినోద్లు స్పీకర్తో భేటీ అయినట్లు భావిస్తున్నారు.