Pakistan Cricket Board
-
Champions Trophy 2025: పాక్లో ఎగరని భారత జెండా
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) ప్రారంభానికి ముందు భారత్, పాక్ల మధ్య కొత్త వివాదం తలెత్తింది. మెగా టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలన్నిటినీ కరాచీలోని నేషనల్ స్టేడియం పైకప్పుపై ఎగురవేసి.. ఒక్క భారత జెండాను మాత్రం మిస్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్కు రావడం లేదు కాబట్టే భారత జెండాను పెట్టలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావాలనే ఇలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా పాక్లో పర్యటించడంలేదన్న అక్కసుతో పీసీబీ ఈ పని చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.కాగా, భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాకిస్తాన్లో (ఛాంపియన్స్ ట్రోఫీ కోసం) పర్యటించేందుకు అంగీకరించని విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్కు షిఫ్ట్ చేశారు. భారత్.. పాక్ సహా మిగతా దేశాలతో ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, భారత్ సహా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలు పాల్గొంటున్నాయి.టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. భారత్ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, బంగ్లాదేశ్ మినహా మిగతా జట్లన్నీ పాకిస్తాన్కు చేరుకున్నాయి. 1996 వరల్డ్కప్ తర్వాత పాక్లో జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నీ కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ప్రాధాన్యత సంతరించుకుంది. -
Champions Trophy 2025: ఫేక్ అక్రెడిటేషన్తో కరాచీ స్టేడియానికి..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు కౌంట్డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం ఆయా జట్లు ఒక్కొక్కటిగా పాకిస్తాన్కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పాక్లో ఉండగా.. ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ జట్లు శుక్రవారం అక్కడ అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఆదివారం పాక్కు చేరుకునే అవకాశముంది.మరోవైపు భారత్ తమ మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ నెల15న దుబాయ్లో అడుగుపెట్టనుంది. అదేవిధంగా భారత్తో తొలి మ్యాచ్ ఆడనున్న బంగ్లాదేశ్ ఇప్పటికే దుబాయ్కు చేరుకుంది. ఫిబ్రవరి 20న బంగ్లా-భారత్ మధ్యఈ మ్యాచ్ జరగనుంది.భద్రత్ పై డౌట్?ఇక ఇది ఇలా ఉండగా.. పాకిస్తాన్ ఓ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యమివ్వనుండడం 29 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్బోర్డు భావిస్తోంది. అయితే తాజాగా కరాచీలో నకిలీ అక్రిడిటేషన్ కార్డుతో ఓ వ్యక్తి స్టేడియంలోకి చొరబడే యత్నం అక్కడి భద్రతపై సందేహాల్ని లేవనెత్తేలా చేసింది.ఓ మీడియా ప్రతినిధిగా గుర్తింపు కార్డు, ఐసీసీ అక్రిడిటేషన్ కార్డులతో కరాచీ జాతీయ స్టేడియానికి వచ్చిన ఓ అపరిచితుడు... స్టేడియం ప్రధాన ద్వారం గుండా మైదానం లోపలికి ప్రవేశించే ప్రయత్నం చివరి నిమిషంలో భద్రతాధికారుల సమయస్ఫూర్తితో విఫలమైంది.తదనంతర విచారణలో పాకిస్తాన్కు చెందిన ముజమ్మిల్ ఖురేషీగా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి తదుపరి దర్యాప్తు చేపట్టారు. అతని వద్ద ఉన్న కెమెరామెన్, ఐసీసీ అక్రిడిటేషన్ కార్డులన్నీ నకిలీవని తమ పరిశీలనలో తేలిందని కరాచీ పోలీసులు తెలిపారు. పాక్లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లు పాల్గొంటున్న ముక్కోణపు సిరీస్ సందర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది.చదవండి: రంజీ సెమీఫైనల్ పోరుకు యశస్వి జైస్వాల్ -
ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ల బుకింగ్ ఎప్పటినుంచంటే?.. ధర ఎంతంటే?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి 25 రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఇక ఈ మెగా ఈవెంట్కు సంబంధించిన టిక్కెట్ల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసీ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబీ) సోమవారం(జనవరి 27) వెల్లడించాయి.ఈ టోర్నీ గ్రూపు స్టేజి మ్యాచ్లు, పాకిస్తాన్లో జరిగే రెండవ సెమీఫైనల్ టిక్కెట్లు మంగళవారం(జనవరి 28) మధ్యాహ్నం 02:00 గంటల నుంచి అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. పాక్లోని మొత్తం మూడు వేదికలలోని 10 మ్యాచ్ల సాధారణ స్టాండ్ల టిక్కెట్ల ధర 1000 పాకిస్తాన్ రూపాయలు (భారత కరెన్సీ ప్రకారం రూ.310)గా నిర్ణయించారు. అదే విధంగా ప్రీమియర్ సీటింగ్ టిక్కెట్ల ధర 1,500 పాకిస్తాన్ రూపాయలు (భారత కరెన్సీ ప్రకారం రూ.310)గా ఉన్నాయి. అన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు తమ ఫిజికల్ టిక్కెట్లను ఫిబ్రవరి 3 నుండి పాకిస్తాన్లోని ఎంపిక చేసిన టీసీఎస్ ఎక్స్ప్రెస్ కేంద్రాలలో పొందాలి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ)లో భారత్ ఆడే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్ల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.కాగా ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. భారత్ తమ మ్యాచ్లను దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆడనుంది. మిగితా మ్యాచ్లన్నీ పాక్లో జరగనున్నాయి. ఈ టోర్నీలో ఫిబ్రవరి 19 న మొదలై మార్చి 9న ఫైనల్తో ముగియనుంది. టీమిండియా ఫైనల్కు ఆర్హత సాధిస్తే.. ఆ మ్యాచ్ కూడా దుబాయ్లోనే జరగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో 8 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూప్లుగా విభజించారు. అందులో గ్రూప్-ఏలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లండ్లు ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్కు ఆర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తెల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్ -
అదొక చెత్త క్రికెట్ బోర్డు.. అందుకే రాజీనామా: ఆసీస్ దిగ్గజం
పాకిస్తాన్ టెస్టు జట్టు హెడ్కోచ్ పదవి నుంచి ఆసీస్ దిగ్గజం జాసన్ గిల్లెస్పీ వైదొలిగిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు గిల్లెస్పీ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అయితే తాజాగా తన రాజీనామాపై గిల్లెస్పీ స్పందించాడు. అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్ను తన పదవి నుంచి పీసీబీ తప్పించడంతో తన కూడా వైదొలగాల్సి వచ్చిందని గిల్లెస్పీ చెప్పుకొచ్చాడు. అదే విధంగా ప్రపంచంలో పీసీబీ లాంటి క్రికెట్ బోర్డును తనకెక్కడా చూడలేదని గిల్లెస్పీ విమర్శలు గుప్పించాడు. కాగా హెడ్ కోచ్ గ్యారీ కిరెస్టన్ వైదొలిగిన అనంతరంహెడ్ కోచ్గా జాసన్ గిలెస్పీని పీసీబీ నియమించింది. అతడి నేతృత్వంలోనే పాకిస్తాన్ క్రికెట్ ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. "పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి క్రికెట్ బోర్డును నేను ఇప్పటివరకు చూడలేదు. ఏ హెడ్ కోచ్ అయినా తమ బోర్డుతో మంచి సంబంధాలు కలిగిండాలని భావిస్తాడు. కానీ పీసీబీ తీరు మాత్రం అందుకు భిన్నం. వారికి నాకు సమన్వయ లోపం ఏర్పడింది. తుది జట్టు ఎంపిక విషయంలో కూడా నాకు పూర్తి స్వేఛ్చ లేదు. అందులో కూడా పీసీబీ జోక్యం చేసుకుంటుంది. సెలక్టర్లతో కూడా నాకు సరైన కమ్యూనికేషన్ లేదు. సీనియర్ అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్ను నాకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తప్పించారు. ఇదొక్కటే కాదు గత కొన్ని నెలలగా వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయినప్పటికి వారితో కొనసాగాను. ఎప్పుడైతే నీల్స్ను నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా తొలిగించారో అప్పుడే నేను కూడా గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నాను" అని గిల్లెస్పీ పేర్కొన్నాడు. -
పాక్ క్రికెట్కు భారీ షాక్.. 24 గంటల్లోనే ఇద్దరి స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్
పాకిస్తాన్ క్రికెట్కు 24 గంటలు తిరగకముందే మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ శనివారం (డిసెంబర్ 14) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అమీర్ వెల్లండిచాడు."అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించిన తర్వాత ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. రాబోయో తరానికి అవకాశమిచ్చేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం.తన ప్రయాణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు"అని రిటైర్మెంట్ నోట్లో అమీర్ పేర్కొన్నాడు.కాగా అమీర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం ఇది రెండో సారి. బోర్డుతో విబేధాలు కారణంగా 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్.. మళ్లీ ఈ ఏడాది టీ20 వరల్డ్కప్లో ఆడేందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. పాక్ తరపున అమీర్ తన కెరీర్లో 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఓవరాల్గా 158 మ్యాచ్లు ఆడిన అమీర్.. 271 వికెట్ల పాటు 1,179 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపున అమీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2017లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అమీర్ కీలక పాత్ర పోషించాడు. కాగా మరో పాక్ ఆటగాడు ఇమాద్ వసీం రిటైర్మెంట్ ప్రకటించిన 24 గంటల తర్వాత అమీర్ తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. వీరిద్దరూ ఫ్రాంచైజీ క్రికెట్లో బిజీబిజీగా ఉన్నారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్గా -
పాకిస్తాన్ హెడ్కోచ్గా మాజీ ఫాస్ట్ బౌలర్..
పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి ముసలం నెలకొంది. పాక్ టెస్ట్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి జాసన్ గిలెస్పీ తప్పుకున్నాడు. బోర్డుతో విబేధాల కారణంగానే ఆసీస్ దిగ్గజం ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గిలెస్పీ స్ధానాన్ని 24 గంటల వ్యవధిలోనే పాక్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది.తమ రెడ్ బాల్ క్రికెట్ జట్టు తత్కాలిక హెడ్ కోచ్గా జావేద్ను పీసీబీ నియమించింది. "దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ నుంచి పాక్ రెడ్ బాల్ క్రికెట్ జట్టు హెడ్కోచ్గా జావెద్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటలో భాగంగా ఆతిథ్య జట్టుతో పాక్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్లో తలపడనుంది.అదే కారణమా?కాగా హెడ్ కోచ్ గ్యారీ గ్యారీ కిరస్టెన్ వైదొలిగిన అనంతరం హెడ్ కోచ్గా జాసన్ గిలెస్పీని పీసీబీ నియమించింది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో కోచింగ్ బృందం నుంచి అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్ను పీసీబీ తప్పించింది. అతడి కాంట్రాక్ట్ను పొడిగించేందుకు పీసీబీ సముఖత చూపలేదు.ఈ క్రమంలో పీసీబీ నిర్ణయంపై గిలెస్పీ అసహనం వ్యక్తం చేశాడని, అందుకే తన పదవికి రాజీనామా చేశాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా గిలెస్పీ-నీల్సన్ నేతృత్వంలోనే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను పాక్ సొంతం చేసుకుంది.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
పాకిస్తాన్లో ఆడేందుకు కోహ్లి ఉవ్విళ్ళూరుతున్నాడు: షోయబ్ అక్తర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగుతుందా? లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ మెగా ఈవెంట్లో పాల్గోనేందుకు పాకిస్తాన్కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరకారించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది. అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బోర్డు మాత్రం ససేమేర అంటుంది. అయితే ఇటీవలే జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్లో హైబ్రిడ్ మోడల్కు పీసీబీ అంగీకరించిందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కానీ భారత క్రికెట్ బోర్డు ముందు బీసీసీఐ కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పీసీబీ కోరినట్లు తెలుస్తోంది.అయితే పీసీబీ కాండీషన్స్ను భారత బోర్డు తిరష్కరించినట్లు సమాచారం. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. కాగా పాక్ మాజీ క్రికెటర్లు సైతం భారత జట్టు తమ దేశానికి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాక్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు."ఇండియన్ క్రికెట్ టీమ్ పాకిస్తాన్లో ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. వారికి మా దేశంలో ఆడటమంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆడటం మా జట్టు కంటే భారత జట్టుకే ఎక్కువ ఇష్టం. విరాట్ కోహ్లి సైతం పాక్లో ఆడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. భారత వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మా దేశంలో జరిగితే.. టీవీ రైట్స్, స్పాన్సర్షిప్లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి.కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పాక్కు పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని" ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి ఇప్పటివరకు భారత సీనియర్ జట్టు తరపున ఒక్కసారి కూడా పాక్ గడ్డపై ఆడలేదు. గతంలో భారత అండర్-19 జట్టు తరపున మాత్రం పాక్లో కోహ్లి ఆడాడు.చదవండి: ‘పింక్ బాల్’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్ బ్యాటర్ -
CT 2025: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు.. ముందే!
చాంపియన్స్ ట్రోఫీ -2025 నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య హక్కులను వేరే దేశంతో పంచుకునే క్రమంలో ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంలో తప్పులేదన్నాడు. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్కు రాకపోయినా... పాక్ జట్టు మాత్రం భవిష్యత్తులో భారత్కు వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నాడు.కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. రోహిత్ సేన ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించాలని ఐసీసీకి తెలిపింది.ఐసీసీ వార్నింగ్.. దిగి వచ్చిన పాక్అయితే, పీసీబీ మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబట్టింది. బీసీసీఐ సైతం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐసీసీ.. టీమిండియా మ్యాచ్లను పాక్ వెలుపల ఆడేందుకు వీలుగా హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. అంతేకాదు.. రెవెన్యూపరంగానూ నష్టం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.అయితే, పాక్ మాత్రం ఇందుకు కూడా అంగీకరించకుండా పంతానికి పోయింది. ఈ క్రమంలో ఐసీసీ హెచ్చరికలకు దిగకతప్పలేదు. ఒకవేళ పీసీబీ పట్టువీడకపోతే.. వేదిక మొత్తాన్ని తరలిస్తామని హెచ్చరించింది. దీంతో దిగి వచ్చిన పాక్.. ఎట్టకేలకు హైబ్రిడ్ మోడల్కు అంగీకరించినా.. మూడు షరతులు విధించినట్లు సమాచారం.టీమిండియా ఇక్కడికి రాకున్నా.. పాకిస్తాన్ భారత్కు వెళ్లాలిఅందులో ప్రధానంగా.. భవిష్యత్తులో భారత్లో ఐసీసీ ఈవెంట్లు నిర్వహిస్తే తాము కూడా అక్కడికి వెళ్లబోమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ స్పీడ్స్టర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ‘‘ఆతిథ్య హక్కులు పంచుకునేందుకు ఒప్పుకొంటే.. అధిక ఆదాయం అడగటం న్యాయమే. అయినా పీసీబీ కనీసం దీనికోసమైనా పట్టుబట్టడంలో తప్పులేదు.అయితే, భవిష్యత్తులో భారత్లో ఈవెంట్లు నిర్వహిస్తే ఆడబోము అనడం మాత్రం సరికాదు. మనం వారికి స్నేహ హస్తం అందించాలి. మన జట్టు ఇండియాకు తప్పకుండా అక్కడికి వెళ్లాలి. అంతేకాదు.. అక్కడ వారిని ఓడించాలి. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ విషయంలో హైబ్రిడ్ విధానం ముందుగానే ఫిక్సయినట్లు అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! -
ఎట్టకేలకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ..
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిగివచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో ఎట్టకేలకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకొన్నప్పటికీ కొన్ని షరతులు విధించినట్లుగా సమాచారం.కాగా వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని పాక్ భావించింది. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లతో కలిసి టోర్నమెంట్ బరిలో దిగాలని ఉవ్విళ్లూరింది.పీసీబీకి ఐసీసీ అల్టిమేటంఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని బీసీసీఐతో పాటు భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లిన బీసీసీఐ.. హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ విషయం గురించి పీసీబీకి చెప్పగా.. ఇందుకు పాక్ బోర్డు ససేమిరా అంది.మరోవైపు.. భారత్ కూడా ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టలేమని ఐసీసీకి గట్టిగానే చెప్పింది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ పెద్దలు పాక్తో ఇతర దేశాల బోర్డులతో వర్చువల్గా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు మొండివైఖరి ప్రదర్శించగా.. ఐసీసీ కఠినంగా వ్యవహరించకతప్పలేదు.టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు వీలుగా హైబ్రిడ్ మోడల్కు అంగీకరించకుంటే.. టోర్నీ మొత్తాన్ని పాక్ను తరలిస్తామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో దిగివచ్చిన పాక్ బోర్డు.. ఐసీసీ ప్రపోజల్కు సరేనందని.. అయితే, మూడు షరతులు కూడా విధించిందని ఇండియా టుడే కథనం పేర్కొంది.ఆ మూడు కండిషన్లు ఏమిటంటే?..👉టీమిండియా గ్రూప్ దశలో, సెమీ ఫైనల్స్, ఫైనల్లో(ఒకవేళ అర్హత సాధిస్తే) ఆడేమ్యాచ్లను దుబాయ్లోనే నిర్వహించాలి.👉ఒకవేళ టీమిండియా గనుక గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే.. అప్పుడు సెమీస్తో పాటు ఫైనల్ మ్యాచ్లను లాహోర్లో నిర్వహించేందుకు పాకిస్తాన్కు అనుమతినివ్వాలి.👉ఇక భవిష్యత్తులో భారత్ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లు ఆడేందుకు పాకిస్తాన్ అక్కడికి వెళ్లకుండా.. తటస్థ వేదికలపై మ్యాచ్లు నిర్వహించాలి. చదవండి: IND Vs AUS PM XI Test: టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు! -
డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్.. ఐసీసీ నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. పాకిస్తాన్కు పంపే ప్రసక్తి లేదుఅయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.హైబ్రిడ్ విధానం కావాలిఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.ఐసీసీ నిర్ణయం ఏమిటో?!‘‘పాకిస్తాన్ క్రికెట్కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అదైతే ఎప్పటికీ జరుగదుఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.అదుపుతప్పిన శాంతి భద్రతలుపాకిస్తాన్కు వరల్డ్కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.చదవండి: డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక -
CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై తుది నిర్ణయం ఆ రోజే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్కు శుక్రవారం(నవంబర్ 29 ) తెరపడే అవకాశముంది. ఆ రోజున అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కీలక బోర్డు సమావేశం జరగనుంది.ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వర్చవల్గా జరగనున్న ఈ భేటిలో మొత్తం 12 సభ్య దేశాల క్రికెట్ బోర్డు ప్రతినిధులు పాల్గోనున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది.కాగా వాస్తవానికి ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది. ఆతిథ్య హోదాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్ను ఐసీసీకి పంపింది. కానీ పాక్కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరకారించడంతో షెడ్యూల్ ఖరారులో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ మెగా ఈవెంట్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది. పీసీబీ మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని మొండి పట్టుతో ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 29న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఏదో ఒక విషయం తెలిపోనుంది.కాగా హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించేందుకు పీసీబీని ఒప్పించేందుకు ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒప్పుకుంటే అదనంగా గ్రాంట్స్ మంజూరు చేసేందుకు ఐసీసీ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అప్పటికి హైబ్రిడ్ మోడల్కు పీసీబీ అంగీకరించకపోతే పాకిస్తాన్ నుంచి టోర్నీని వేరే చోటకు ఐసీసీ తరలించే అవకాశముంది. కాగా డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించే ముందు ఈ సమావేశం జరగనుండడం గమనార్హం.చదవండి: 'కోహ్లిలా నిన్ను నువ్వు నమ్ముకో'.. ఆసీస్ స్టార్ ప్లేయర్కు మెంటార్ సలహా -
అవన్నీ రూమర్సే.. మా హెడ్కోచ్ అతడే: పాక్ క్రికెట్ బోర్డు
పాకిస్తాన్ టెస్టు టీమ్ పదవినుంచి జాసన్ గిలెస్పీని తొలగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా ఖండించింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, పూర్తిగా అర్థరహితమని స్పష్టం చేసింది. ‘గిలెస్పీని తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలు అన్నీ అబద్ధం.గతంలోనే ప్రకటించిన విధంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టు సిరీస్ల వరకు కూడా గిలెస్పీని కోచ్గా కొనసాగుతాడు’ అని పీసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై వన్డే, టి20 సిరీస్లు ఆడిన పాక్ జట్టుకు గిలెస్పీ తాత్కాలిక కోచ్గా కూడా వ్యవహరించాడు. అయితే ఈ రెండు ఫార్మాట్లతో పాటు టెస్టుల్లో కూడా అతని స్థానంలో పాక్ మాజీ పేసర్, ప్రస్తుత సెలక్షన్ కమిటీ కనీ్వనర్ ఆకిబ్ జావేద్ను కోచ్గా ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గిలెస్పీ కోచ్గా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ చేతిలో 0–2తో ఓడిన పాక్...ఆ తర్వాత ఇంగ్లండ్పై 2–1తో విజయం సాధించింది. ఆసీస్ సిరీస్ తర్వాత పాక్ జట్టు నేరుగా జింబాబ్వేకు వెళుతుంది.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్గా కొనసాగించండి: హర్భజన్ -
Champions Trophy: పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన ఐసీసీ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ టూర్ మరింత వివాదాస్పదం కాకుండా చర్యలు చేపట్టినట్లు సమాచారం. అసలు విషయమేమిటంటే.. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.ఎనిమిది జట్లువన్డే వరల్డ్కప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆతిథ్య పాకిస్తాన్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి. అయితే, పాక్లో నిర్వహించే ఈ ఐసీసీ ఈవెంట్కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది.హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోము అంటున్న పాక్అదే విధంగా.. టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఐసీసీ ఇందుకు సానుకూలంగానే ఉన్నా.. పీసీబీ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. కావాలంటే ఆతిథ్యమైనా వదులుకుంటాంగానీ.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోమని చెబుతోంది.అత్యుత్సాహం ప్రదర్శించిన పీసీబీఅంతేకాదు.. తమ ప్రభుత్వానిది కూడా ఈ విషయంలో ఇదే వైఖరి అని ఐసీసీకి తేల్చిచెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో పీసీబీ భారత్ను కవ్వించేలా మరో చర్యకు దిగింది. చాంపియన్స్ ట్రోఫీ టూర్ను పాక్ ఆక్రమిత కశ్మీర్గా ఉన్న ప్రాంతంలో చేస్తామని శుక్రవారం ప్రకటించింది.ముకుతాడు వేసిన ఐసీసీస్కర్దు, హంజా, మజఫర్బాద్లలో ట్రోఫీ టూర్ చేస్తామని అధికారికంగా పీసీబీ వెల్లడించింది. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారగా.. ఐసీసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ట్రోఫీ టూర్ను రద్దు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా నవంబరు 16- 24 వరకు చాంపియన్స్ ట్రోఫీ-2025 టూర్ జరుగనుంది. ఇందులో భాగంగా ట్రోఫీని ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో అభిమానుల సందర్శనకు ఉంచుతారు. చదవండి: టచ్లోకి వచ్చిన విరాట్.. మరోసారి క్లీన్ బౌల్డ్ అయిన పంత్ -
పాకిస్తాన్ బోర్డు కవ్వింపు చర్యలు.. చాంపియన్స్ ట్రోఫీ టూర్ ప్రకటన
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఐసీసీ టోర్నీ ట్రోఫీ టూర్ను నిర్వహించే ప్రదేశాల పేర్లను పీసీబీ శుక్రవారం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.నవంబరు 16న ఇస్లామాబాద్లో‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025.. ట్రోఫీ టూర్ నవంబరు 16న ఇస్లామాబాద్లో మొదలవుతుంది. అదే విధంగా.. స్కర్దు, ముర్రే, హంజా, మజఫర్బాద్లోనూ జరుగుతుంది. సర్ఫరాజ్ అహ్మద్ 2017లో ది ఓవల్ మైదానంలో ట్రోఫీని పట్టుకున్న దృశ్యాలను చూడండి. ఈ ట్రోఫీ టూర్ నవంబరు 16- 24 వరకు జరుగుతుంది’’ అని పీసీబీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.ఇందులో ప్రస్తావించిన స్కర్దు, హంజా, మజఫర్బాద్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రాంతాలు అని.. పాక్ బోర్డు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదుఈ మెగా టోర్నీకి టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అర్హత సాధించాయి. అయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐసీసీకి తేల్చిచెప్పింది.టీమిండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానాన్ని సూచించింది. ఐసీసీ కూడా ఇందుకు సానుకూలంగానే ఉందనే వార్తలు వినిపించాయి. అయితే, పాకిస్తాన్ బోర్డు మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది.ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు తమ దేశానికి వచ్చాయని.. టీమిండియా కూడా రావాలని పట్టుబడుతోంది. తమ ప్రభుత్వం కూడా ప్రతీ మ్యాచ్ను దేశంలోనే నిర్వహించాలని సూచించిందని..పంతానికి పోతోంది.తటస్థ వేదికపై నిర్వహిస్తారా?ఈ మేరకు ఇలా ఇరు బోర్డుల మధ్య చాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయమై విభేదాలు తలెత్తిన వేళ.. పీసీబీ రెచ్చగొట్టే చర్యలకు దిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రోఫీ టూర్ను పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీసీ అంతిమంగా తీసుకునే నిర్ణయంపైనే టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహిస్తారా? లేదంటే.. బీసీసీఐ ఈ టోర్నీని బహిష్కరిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ టీమిండియా గనుక ఈ ఈవెంట్లో ఆడకపోతే పాకిస్తాన్ బోర్డుతో పాటు ఐసీసీకి కూడా భారీగా ఆర్థిక నష్టం తప్పదు.చదవండి: కోహ్లి మళ్లీ ఫెయిల్.. నితీశ్ రెడ్డి బౌలింగ్లో పంత్ క్లీన్బౌల్డ్! జైస్వాల్ కూడా..Get ready, Pakistan!The ICC Champions Trophy 2025 trophy tour kicks off in Islamabad on 16 November, also visiting scenic travel destinations like Skardu, Murree, Hunza and Muzaffarabad. Catch a glimpse of the trophy which Sarfaraz Ahmed lifted in 2017 at The Oval, from 16-24… pic.twitter.com/SmsV5uyzlL— Pakistan Cricket (@TheRealPCB) November 14, 2024 -
ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్లన్నీ ఇక్కడే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వేదిక విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వైఖరిని మార్చుకోవడం లేదు. ఆతిథ్యాన్ని అయినా వదులుకుంటాం కానీ హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహించబోమని పట్టుదలకు పోతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం కూడా పీసీబీకి మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక్క మ్యాచ్ కూడా దేశం వెలుపల నిర్వహించేందుకు అంగీకరించవద్దని బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పీసీబీ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ టోర్నీ అంశంలో మా ప్రభుత్వం మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మ్యాచ్ మా దేశంలోనే నిర్వహించాలని చెప్పింది.ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్లన్నీ ఇక్కడేఏ జట్టుకు సంబంధించి అయినా.. ఒక్క మ్యాచ్ కూడా తటస్థ వేదికపై నిర్వహించేందుకు వీలులేదని.. ఇదే తమ వైఖరి అని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి.. బీసీసీఐ పాకిస్తాన్కు తమ జట్టును పంపలేమన్న విషయాన్ని మాత్రమే ఐసీసీ మాకు తెలియజేసింది.చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను మేము దక్కించుకున్న మాట వాస్తవం. కాబట్టి పాకిస్తాన్ వెలుపల ఒక్క మ్యాచ్ నిర్వహించడానికి మేము ఒప్పుకోము’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఒప్పుకోవద్దని పాక్ ప్రభుత్వం పీసీబీకి చెప్పిందని తన యూట్యూబ్ చానెల్గా వెల్లడించాడు.ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యంకాగా వచ్చే ఏడాది పాక్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో.. హైబ్రిడ్ మోడల్ అయితేనే ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంటే.. టీమిండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహిస్తేనే ఆడతామని ఐసీసీకి స్పష్టమైన సమాచారమిచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని పీసీబీ పేర్కొన్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.మరోవైపు.. బీసీసీఐ సైతం ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టి పాక్లో టోర్నీ ఆడలేమని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఈ టోర్నీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఒకవేళ.. పాకిస్తాన్ గనుక ఆతిథ్య హక్కులు వదులుకుంటే ఈ మెగా టోర్నీ వేదికను... దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తోంది.పాకిస్తాన్లోనే అంధుల టీ20 ప్రపంచకప్ఇదిలా ఉంటే.. అంధుల టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కూడా ఈసారి పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ టోర్నీ ఆడేందుకు అనుమతించాలని డిఫెండింగ్ చాంపియన్ భారత అంధుల క్రికెట్ జట్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం కేంద్ర క్రీడా శాఖ, హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు దరఖాస్తు చేసుకుంది.లాహోర్, ముల్తాన్ వేదికలపై ఈ నెల 22 నుంచి వచ్చే నెల 3 వరకు అంధుల ప్రపంచకప్ టోర్నీ జరుగుతుంది. 17 సభ్యులు గల భారత జట్టుకు క్రీడాశాఖ తమ ఆమోదం తెలుపుతూ ఎన్ఓసీని జారీ చేసింది. అయితే హోం, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఆమోదం రాకపోవడంతో జట్టు నిరీక్షిస్తోంది. భారత ప్రభుత్వం అనుమతించి, అంతా అనుకున్నట్లు జరిగితే వాఘా సరిహద్దు గుండా భారత అంధుల క్రికెట్ జట్టు ఈ నెల 21న పాకిస్తాన్కు బయల్దేరనుంది. చదవండి: టీమిండియాతో సిరీస్.. 3-1తో సౌతాఫ్రికా గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్ -
పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!?
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధం వీడలేదు. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ- పీసీబీ మధ్య విభేదాల నేపథ్యంలో వేదిక మార్పు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. భారత జట్టును పాకిస్తాన్కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని అభ్యర్దించింది. అందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా అంగీకరించింది. ఈ క్రమంలో భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ మొడల్లో యూఏఈలో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఐసీసీ కోరింది.సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ..!స్పోర్ట్స్ టాక్ కథనం ప్రకారం.. ఐసీసీ డిమాండ్ను పీసీబీ అంగీకరించకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ తమకు ఉన్న విశిష్ట అధికారాలతో పాక్ హోస్టింగ్ రైట్స్ను లాక్ చేయనున్నట్లు సమాచారం.ఒక వేళ అదే జరిగితే టోర్నీ మొత్తాన్ని సౌతాఫ్రికాలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోందంట. మరోవైపు తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే ఏకంగా టోర్నీ నుంచే వైదొలగాలని పాక్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఇకపై భారత్లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్లకు తమ జట్టును పంపకూడదని పీసీబీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.చదవండి: అదొక పగటి కల.. భారత్కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్ -
అదొక పగటి కల.. భారత్కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇదే విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా తెలియజేసింది.భారత్ ఆడే మ్యాచ్లని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుండగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు సుముఖంగా లేదు. కచ్చితంగా భారత జట్టు తమ దేశానికి రావల్సేందేనని పీసీబీ మొండి పట్టుతో ఉంది. అయితే టీమిండియా పాక్కు రాదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా పీసీబీకి తేల్చి చేప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ మరో ఆఫర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ ఆడే మ్యాచ్లు కోల్పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా భర్తీ చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ ఈ ఆఫర్ను అంగీకరించేందుకు పీసీబీ సిద్దంగా లేదని, అందుకు నిరసనగా ఆతిథ్య హక్కులు వదులు కోవాలని భావిస్తున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.అదొక పగటి కల..ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్ మరోసారి భారత్పై విషం చిమ్మాడు. "ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్కు రావాలనుకోవడం ఒక పగటి కల. ఈ మెగా ఈవెంట్ను నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్దం ఉంది.భద్రత పరంగా ఎటువంటి సమస్య లేదు. వరల్డ్లోని అన్ని క్రికెట్ దేశాలకు పాకిస్తాన్ స్వదేశంలో ఆతిథ్యం ఇస్తోంది. కానీ ఒక్క భారత్కే మాత్రం ఇక్కడ ఆడటం భద్రత కాదు. ఇందుకు బదులుగా మా ప్రభుత్వం, పీసీబీ నుంచి స్ట్రాంగ్ రిప్లై వస్తుంది అని ఆశిస్తున్నా" హాఫీజ్ ఎక్స్లో రాసుకొచ్చాడు. It was a day dream that India wil come to Pakistan to play #ChampionsTrophy2025. Pakistan is safe & ready to host the event. Pakistan hosting all cricket nations at home but somehow not *secure* for India 😇😇😇. Waiting for strong & surprised response from government & PCB.— Mohammad Hafeez (@MHafeez22) November 11, 2024చదవండి: IND vs AUS: 'బుమ్రా వరల్డ్లోనే బెస్ట్ బౌలర్.. అతడితో అంత ఈజీ కాదు' -
‘టీమిండియా పాకిస్తాన్కు రాకపోతే.. మా వైఖరి వేరుగా ఉంటుంది.. ఇకపై’
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టును దాయాది దేశానికి పంపేందుకు సిద్ధంగా లేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి సంకేతాలు ఇచ్చింది.హైబ్రిడ్ విధానంలో ఈవెంట్ను నిర్వహించాలని..ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని.. హైబ్రిడ్ విధానంలో ఈవెంట్ను నిర్వహించాలని ఐసీసీని కోరినట్లు సమాచారం. అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ దేశంలో జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియా తప్పక పాల్గొనాలని.. భారత జట్టు మ్యాచ్ల కోసం లాహోర్ స్టేడియాన్ని సిద్ధం చేశామని చెబుతోంది.సరేనన్న ఐసీసీ?ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ సైతం అప్పట్లో ఈ విషయం గురించి మాట్లాడుతూ చాంపియన్స్ ట్రోఫీ వేదిక మార్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వం అనుమతిస్తే తప్ప రోహిత్ సేనను పాక్కు పంపమని పేర్కొంది. అందుకు స్పందనగా ఐసీసీ.. టీమిండియా మ్యాచ్లకు తటస్థ వేదికను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.మా వైఖరి వేరుగా ఉంటుందిఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘మేము ఇటీవలి కాలంలో ప్రతి విషయంలో సానుకూలంగా స్పందించాం. అయితే, ప్రతిసారి మేము అలాగే చేస్తామని భావించవద్దు’’ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సరైన కారణం చూపించాలి‘‘ఒకవేళ ఏదైనా జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలంటే సరైన కారణం చూపించాలి. టీమిండియా ఇక్కడికి రాకపోవడానికి భద్రతను కారణంగా చూపడం అనేది అసలు విషయమే కాదు. ఎందుకంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పాకిస్తాన్కు వస్తున్నాయి. ఆ జట్లు పాక్లో టోర్నీ ఆడాలనే తలంపుతో ఉన్నాయి.అదే జరిగితే.. అసలు ఈ టోర్నీని ఎవరూ చూడరునిజానికి ఐసీసీ మనుగడకు కారణమే పాకిస్తాన్, ఇండియా. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్లాగే మేము ఆడమని చెప్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అదే జరిగితే.. అసలు ఈ టోర్నీని ఎవరూ చూడరు. ఈసారి గనుక టీమిండియా ఇక్కడికి రాకపోతే.. పాకిస్తాన్ తీవ్ర నిర్ణయం తీసుకుంటుంది. ఈ టోర్నీని బహిష్కరిస్తుంది’’ అని రషీద్ లతీఫ్ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు.భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదుఇక అతడి వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. భారత ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ రాజీపడబోదని పేర్కొంటున్నారు. పాక్ ఆటగాళ్లు భారత్కు వచ్చి సురక్షితంగా వెళ్లగలిగారని.. కానీ టీమిండియా ఆటగాళ్లను పాక్కు పంపే పరిస్థితులు మీ దేశంలో లేవంటూ లతీఫ్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు గతేడాది భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్గా అతడే! -
పాకిస్తాన్కు వస్తారా? లేదా?.. ఏదో ఒకటి చెప్పండి! రాకపోతే మాత్రం..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై వచ్చే వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు దాయాది దేశానికి వెళ్లకుంటే.. ఏం చేయాలన్న విషయంపై కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ పర్యటన విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలంటూ ఐసీసీతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐ నుంచి రాతపూర్వక సమాధానం కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భద్రతా కారణాల దృష్ట్యాకాగా 2008 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోగా.. మెగా టోర్నీల్లో మాత్రం దాయాదులు ముఖాముఖి తలపడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు కలుగుతోంది.అప్పుడు శ్రీలంకలోఅయితే, ఆసియా వన్డే కప్-2023 హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. బీసీసీఐ మాత్రం రోహిత్ సేనను అక్కడికి పంపలేదు. తమ మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించాలని కోరగా.. ఆసియా క్రికెట్ మండలి అందుకు అంగీకరించింది. దీంతో టీమిండియా మ్యాచ్లు శ్రీలంకలో జరిగాయి.ఆ తర్వాత వన్డే వరల్డ్కప్-2023 భారత్లో జరుగగా.. పాక్ జట్టు ఇక్కడికి వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో ఘోర ఓటమితో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు తమవే గనుక.. టీమిండియా తమ దేశానికి రావాలని పీసీబీ కోరుతోంది. అయితే, బీసీసీఐ నేరుగా ఈ విషయాన్ని ఖండించలేదు. భారత ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా తాము అడుగులు వేస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే స్పష్టం చేశాడు.రాతపూర్వక సమాధానం ఇవ్వండిఅయితే, వచ్చే ఏడాది జరుగనున్న ఈ టోర్నీకి సిద్ధమవుతున్న పీసీబీ.. టీమిండియా తమ దేశానికి వస్తుందో? రాదో అన్న అంశంపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ఐసీసీ సైతం ఈ విషయం గురించి బీసీసీఐని అడిగిందని.. ఒకవేళ భారత బోర్డు నుంచి సమాధానం రాకపోతే వచ్చే వారం చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను విడుదల చేస్తామని చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఒకవేళ టీమిండియా పాకిస్తాన్కు రాకపోతే మాత్రంఇక టీమిండియా మ్యాచ్లను లాహోర్లో నిర్వహిస్తామని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఇప్పటికే చెప్పాడు. ఇదిలా ఉంటే.. బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్కు పంపేందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యామ్నాయ వేదిక కోసం ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ నుంచి కొంతమొత్తం పక్కన పెట్టినట్లు సమాచారం. ఇక ఐసీసీ చైర్మన్గా బీసీసీఐ కార్యదర్శి జై షా డిసెంబరు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
ఐదుగురిని సంప్రదించా.. త్వరలోనే కొత్త కోచ్ ఎంపిక: పీసీబీ చీఫ్
దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందించాడు. కిర్స్టెన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని.. ఈ క్రమంలోనే అతడితో తమ బంధం ముగిసిందని పేర్కొన్నాడు. త్వరలోనే పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు కొత్త కోచ్ను నియమిస్తామని తెలిపాడు.అందుకే రాజీనామా!కాగా పాకిస్తాన్ వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్గా ఉన్న గ్యారీ కిర్స్టెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు అతడు సోమవారం ప్రకటించాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ ఏడాది ఏప్రిల్లో కిర్స్టెన్ను ప్రధాన కోచ్గా పీసీబీ నియమించింది. కానీ.. కనీసం ఆరు నెలలు కూడా అతడు కోచ్గా పని చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ వెళ్లనున్న నేపథ్యంలో కిర్స్టెన్ తన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. అయితే, జట్టు ఎంపిక విషయంలో తనకు ఉన్న అధికారాలను తప్పించడం పట్ల కలత చెందిన కిర్స్టెన్ రాజీనామా చేసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్లను ఎంపిక చేసే విషయంలో తన సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోగా... తాను దేశంలోనే లేని సమయంలో జట్టును ప్రకటించడంపై పీసీబీ అధికారులతో కిర్స్టెన్ వాదనకు దిగినట్లు తెలిసింది.కాగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ తొలి టెస్టులో చిత్తయిన తర్వాత పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కిర్స్టెన్కు పీసీబీ సూచించడం గమనార్హం. ఇక కిర్స్టెన్తో టెస్టు టీమ్ హెడ్ కోచ్గా ఉన్న జాసన్ గిలెస్పీ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నా... ఇంగ్లండ్తో తర్వాతి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి పాక్ సిరీస్ గెలుచుకోవడంతో ఈ అంశం కాస్త వెనక్కి వెళ్లింది. ఒక్క వన్డే ఆడకుండా... ఇదిలా ఉంటే.. కిర్స్టెన్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్లో బరిలోకి దిగింది. గ్రూప్ దశలో భారత్, అమెరికా చేతుల్లో పరాజయంతో సూపర్–8 దశకు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాను వన్డే వరల్డ్ చాంపియన్గా నిలిపిన రికార్డు ఉన్న కిర్స్టెన్ను ఎంపిక చేసినప్పుడు ప్రధానంగా తమ వన్డే టీమ్ను తీర్చిదిద్దే విషయంపైనే బాధ్యతలు అప్పగించారు.అంతేకాదు.. 2025లో పాకిస్తాన్ వేదికగా జరిగే చాంపియన్స్ ట్రోఫీలో తమ టీమ్ను విజేతగా నిలపాలని...అందు కోసం ఆయన ఆలోచనల ప్రకారం జట్టును మలిచే అధికారాన్ని పీసీబీ ఇచ్చింది. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో పాక్ ఒక్క వన్డే కూడా ఆడకపోవడం విశేషం!గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్గా తాత్కాలిక బాధ్యతలుమరోవైపు ప్రస్తుతం టెస్టు కోచ్గా ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘కిర్స్టెన్ పీసీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాదు.. బోర్డు నిబంధనల్లో కొన్నిటిని ఉల్లంఘించాడు. మాతో కాంట్రాక్టును అతడే ముగించుకున్నాడు’’ అని తెలిపాడు.ఐదుగురిని సంప్రదించాఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా తమ వన్డే, టీ20 జట్లకు కొత్త కోచ్ వస్తాడని నక్వీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాక్ ఆడే మూడు వన్డేలు, మూడు టీ20 వరకు మాత్రమే తాను కోచ్గా పని చేస్తానని గిల్లెస్పీ చెప్పాడని పేర్కొన్నాడు. అతడికి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే ఉద్దేశం లేదని తెలిపిన నక్వీ.. కొత్త కోచ్ అన్వేషణలో భాగంగా ఇప్పటికే తాను ఐదుగురిని సంప్రదించానని పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. పది జట్ల రిటెన్షన్ లిస్టు ఇదే! -
బాబర్ ఆజంకు సపోర్ట్ .. కట్ చేస్తే! జట్టులో నో ఛాన్స్?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ అనంతరం పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా పాక్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లో ఆసీస్తో తలపడనుంది. ఈ వైట్బాల్ సిరీస్ల కోసం పాక్ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో తమ జట్టును ప్రకటించే అవకాశముంది. నవంబర్ 4న మెల్బోర్న్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో పాక్ పర్యటన ప్రారంభం కానుంది.ఫఖార్ జమాన్పై వేటు?ఇక ఇది ఇలా ఉండగా.. స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్పై పాక్ సెలక్షన్ కమిటీ వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను నుంచి పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను అర్ధంతరంగా తప్పించడాన్ని జమాన్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. సెలక్టర్ల తీరుపై ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించాడు.భారత్ను చూసి నేర్చుకోవాలంటూ అతడు హితువు పలికాడు. దీంతో అతడిపై పీసీబీ సీరియస్ అయింది. ఇప్పటికే అతడికి పాక్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అంతటితో ఆగకుండా ఆసీస్ టూర్కు జమాన్ను ఎంపిక చేయకూడని పాక్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా జమాన్ ఇటీవల నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో కూడా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. మోకాలి సమస్యలతో బాధపడుతున్న 34 ఏళ్ల జమాన్.. ఎనిమిది నిమిషాల్లో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడంలో విఫలమైనట్లు సమాచారం. ఆసీస్ టూర్కు జమాన్ వెళ్తాడా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. -
బాబర్ ఆజంకు భారీ షాక్.. జట్టు నుంచి ఔట్?
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్లో జరగనున్న సెకెండ్ టెస్టులో గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని పాక్ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టుకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై వేటు వేయాలని పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ESPNCricinfo నివేదిక ప్రకారం.. అలీమ్ దార్, ఆకిబ్ జావేద్ ,అజహర్ అలీలతో కూడిన సెలక్షన్ కమిటీ ఆజం ప్రదర్శన పట్ల తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్లు సమచాం. ఈ క్రమంలోనే అతనిని జట్టు నుండి తప్పించి యువ ఆటగాడు కమ్రాన్ గులాంకు ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నరట.బాబర్ కథ ముగిసినట్లేనా?బాబర్ గత కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడు మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసి సుమారు ఏడాది దాటింది. బాబర్ చివరగా గతేడాది ఆగస్టులో నేపాల్తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ సెంచరీని మార్క్ను అందుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే బాబర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి కనీసం హాఫ్ సెంచరీ మార్క్ను దాటలేకపోతున్నాడు. గత 20 నెలలలో టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక స్కోర్ 41 పరుగులే కావడం గమనార్హం. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 17 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 355 పరుగులు మాత్రమే చేశాడు. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 35 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేయాలని పీసీబీ ఫిక్స్ అయినట్లు వినికిడి.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
బాబర్ రాజీనామాకు కారణం అతడే!
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా వెనుక హెడ్కోచ్ గ్యారీ కిర్స్టన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తన పట్ల కోచ్ వ్యవహరించిన తీరుకు నొచ్చుకున్న అతడు.. బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలకు తనొక్కడినే బాధ్యుడిని చేస్తూ.. తప్పంతా తన మీదకు వచ్చేలా కిర్స్టన్ నివేదిక రూపొందించడం పట్ల అతడు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.కాగా పాక్ క్రికెట్ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం వైదొలిగిన విషయం తెలిసిందే. తాను సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. బ్యాటింగ్పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి, టీమ్ మేనేజ్మెంట్కు గతంలోనే సమాచారం అందించినట్లు బాబర్ చెప్పాడు.ఈ రాజీనామా తర్వాత‘పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అయితే అసలు బాధ్యత బ్యాటింగ్పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నాయకత్వం కారణంగా నాపై అదనపు భారం పడుతోంది. నా ఆటను మరింతగా ఆస్వాదిస్తూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో పాటు కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం కూడా అవసరం.ఈ రాజీనామా తర్వాత నా శక్తియుక్తులన్నీ బ్యాటింగ్పైనే కేంద్రీకరించగలను. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. జట్టుకు ఒక ఆటగాడిగా అన్ని విధాలా ఉపయోగపడేందుకు నేను సిద్ధం’ అని బాబర్ ఆజమ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో పాక్ సెమీస్ కూడా చేరకపోవడంతో బాబర్ నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ టోర్నీ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ వదలుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అతడినే సారథిగా నియమించింది పీసీబీ. ఈసారి మరీఘోరమైన ప్రదర్శనతో బాబర్ బృందం విమర్శలు మూటగట్టుకుంది. పసికూన అమెరికా జట్టు చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా అర్హత సాధించలేకపోయింది.అందుకే ఈ నిర్ణయంఈ నేపథ్యంలో కోచ్ కిర్స్టన్ పీసీబీకి ఇచ్చిన నివేదికలో బాబర్ ఆజంనే కారకుడిగా పేర్కొన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అసిస్టెంట్ కోచ్ అజర్ మహ్మూద్ సైతం బాబర్కు వ్యతిరేకంగా మాట్లాడటంతో.. ఇక తాను కెప్టెన్గా ఉండకూడదని బాబర్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక బాబర్ ఆజం రాజీనామాను ఆమోదించిన పీసీబీ త్వరలోనే కొత్త కెప్టెన్ను నియమించనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది పేర్లు వన్డే, టీ20 కెప్టెన్సీ రేసులో వినిపించగా.. బోర్డు అనూహ్యంగా సౌద్ షకీల్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.రేసులోకి కొత్త పేరుఇక అక్టోబరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు 3 వన్డేలు, 3 టీ20ల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆలోగా కెప్టెన్ ఎంపిక పూర్తవుతుంది. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్లో పాకిస్తాన్ తలపడుతుంది. పాక్ టెస్టు జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. బాబర్ స్థానంలో పగ్గాలు చేపట్టిన అతడి సారథ్యంలో పాక్ ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చదవండి: కూతురితో షమీ వీడియో.. హసీన్ జహాన్ ఘాటు వ్యాఖ్యలు -
మూడు నెలలుగా జీతాల్లేవు!.. నిధులన్నీ వాటికే?
పాకిస్తాన్ క్రికెట్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలు, పసికూనల చేతిలో ఓటములు, టెస్టుల్లో వైట్వాష్లు, ఆటగాళ్ల ఫిట్నెస్లేమి, తరచూ సెలక్టర్లు, కెప్టెన్ల మార్పులు.. వెరసి తీవ్ర విమర్శలు. అసలు దీనంతటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖరే కారణమంటూ మాజీ క్రికెటర్ల నుంచి ఆరోపణలు.తాజాగా పీసీబీ గురించి మరో విషయం తెరమీదకు వచ్చింది. గత మూడు నెలలుగా పురుష, మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది. నెలవారీ పేమెంట్లతో పాటు స్పాన్సర్షిప్ షేర్లు ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆటగాళ్లంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పాక్ క్రికెట్ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ జాప్యంఅంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ బోర్డు జాప్యం చేయడం ఆటగాళ్లను మరింత చికాకు పెడుతోందని పేర్కొన్నాయి. ఇక వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం.. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు పీసీబీ ఉపయోగిస్తోందని తెలిపాయి.తీవ్ర అసంతృప్తిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికి ఈ మూడు మైదానాలను పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై పీసీబీ శ్రద్ధ చూపుతోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వరుస సిరీస్లు ఆడుతున్నా..ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో క్రికెటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. దాని ప్రభావం ఆటపై పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల్లోగా బకాయిలన్నీ తీర్చేందుకు పీసీబీ కసరత్తు చేస్తుందని సదరు వర్గాలు వెల్లడించాయి. కాగా గతేడాది వార్షిక కాంట్రాక్టుల విడుదలకు ముందు ఆటగాళ్లతో చర్చించిన పీసీబీ.. జీతాలను పెంచుతూ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘ఎ’ కేటగిరీలో ఉన్న బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది వంటి వాళ్లకు నెలవారీ 4.5 మిలియన్ల పాక్ రూపాయలతో(టాక్స్ చెల్లింపుల తర్వాత) పాటు.. అదనంగా లోగో స్పాన్సర్షిప్స్ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయంలో మూడు శాతం మేర ఇవ్వనున్నట్లు డీల్ కుదిరింది. జీతాల చెల్లింపునకే గతిలేకఅయితే, ఇప్పుడు ఇలా జీతాల చెల్లింపునకే గతిలేక బోర్డు జాప్యం చేయడం గమనార్హం. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడేందుకు వెళ్లిన పాక్ మహిళా క్రికెటర్లకు కూడా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని సమాచారం.చదవండి: ఇదేం బౌలింగ్?.. హార్దిక్ శైలిపై కోచ్ అసంతృప్తి!.. ఇకపై.. -
పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్.. సిరీస్ అక్కడే
పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణపై పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టతనిచ్చింది. తమ దేశంలోనే ఈ సిరీస్ జరుగుతుందని శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ముల్తాన్, రావల్పిండి ఇందుకు ఆతిథ్యం ఇస్తాయని పేర్కొంది. అక్టోబరు 7 నుంచి 28 వరకు ఇరుజట్ల మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు వెల్లడించింది.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు తమ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ స్వయంగా పేర్కొన్నాడు. అందుకే భారీ మొత్తంలో నిధులు కేటాయించి స్టేడియాల్లో మెరుగైన వసతులతో పాటు.. పలు పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపాడు.శ్రీలంక లేదంటే యూఏఈలో అంటూ వదంతులువచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నాటికి అంతా సిద్ధం చేస్తామని నక్వీ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. స్టేడియాల ప్రక్షాళన నేపథ్యంలో పీసీబీ ఇంగ్లండ్తో సిరీస్ వేదికను మార్చే యోచనలో ఉందని.. శ్రీలంక లేదంటే యూఏఈలో నిర్వహిస్తారనే వార్తలు వినిపించాయి.అయితే, అనుమానాలన్నింటి పటాపంచలు చేస్తూ పీసీబీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. తమ దేశంలోనే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబరు 7-11, 15-19 మధ్య జరుగనున్న తొలి రెండు మ్యాచ్లకు ముల్తాన్.. అక్టోబరు 24-28 వరకు జరుగనున్న ఆఖరి టెస్టుకు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. నిజానికి కరాచీలో జరగాల్సిన ఈ చివరి టెస్టును అక్కడి నుంచి తరలించడానికి కారణం.. పునరుద్ధరణ కార్యక్రమాలే అని పేర్కొంది. అక్టోబరు 2న ఇంగ్లండ్ జట్టు ముల్తాన్కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. కాగా పాకిస్తాన్ చివరగా బంగ్లాదేశ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడింది.ఘోర పరాభవం నుంచి కోలుకునేనా?ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగమైన ఈ రెండు మ్యాచ్ల సిరీస్లో పాక్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. టెస్టు చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో ఓడటమే గాకుండా.. 0-2తో వైట్వాష్కు గురైంది. ఫలితంగా మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్తో తదుపరి జరుగనున్న టెస్టు సిరీస్ షాన్ మసూద్ బృందానికి విషమ పరీక్షగా మారింది.చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. గావస్కర్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
పాక్ క్రికెట్ అంపశయ్య మీద ఉంది: మాజీ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం అంపశయ్య మీద ఉందని.. జట్టును గాడిలో పెట్టే వ్యక్తులు ప్రస్తుతం అత్యవసరమని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. బాబర్ ఆజం కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్పై దృష్టి పెట్టాలని సూచించాడు. బాబర్ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని.. అతడి పేలవ ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. కాగా గత ఏడాది కాలంగా పాక్ జట్టు తీవ్రంగా నిరాశపరుస్తోంది.వరుస పరాభవాలువన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైంది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ను కోల్పోయింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో పసికూన అమెరికా చేతిలో ఓడిపోవడమే గాకుండా.. సూపర్-8కు కూడా చేరకుండానే ఇంటిబాటపట్టింది.ఐసీయూలో ఉందిఇక ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్తో తొలిసారిగా టెస్టుల్లో ఓడిపోవమే గాక.. 0-2తో క్లీన్స్వీప్నకు గురైంది. ఫలితంగా పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. పరిస్థితిని చక్కదిద్దగల ప్రొఫెషనల్ డాక్టర్ కావాలి. ఆర్థికంగానూ బోర్డు బలపడాల్సిన ఆవశ్యకత ఉంది.సమస్యల సుడిగుండంలో పాక్ జట్టు సరైన కోచ్లు కూడా ముఖ్యమే. పాక్ జట్టు సమస్యల సుడిగండంలో కూరుకుపోయింది. మైదానం లోపల.. వెలుపలా పరిస్థితి ఒకేలా ఉంది’’ అని పేర్కొన్నాడు. వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోవడమే ఉత్తమమన్న రషీద్ లతీఫ్.. బ్యాటర్గా జట్టుకు అతడి అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా పాకిస్తాన్ తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్తో సిరీస్ ఆడనుంది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్కు బాబర్, టెస్టులకు షాన్ మసూద్ ప్రస్తుతం సారథులుగా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: శ్రేయస్ అయ్యర్కు మరో బిగ్షాక్!? -
‘నా కుమారుడికి అవకాశాలు ఇవ్వలేదు.. నాశనం చేశారు’
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కుమారుడు ఆజం ఖాన్ కెరీర్ను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని ఆరోపించాడు. రమీజ్ రాజా ఇష్టారీతిన వ్యవహరించి యువ ఆటగాళ్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాడని.. అతడి నిర్ణయాల వల్లే జట్టు పరిస్థితి ఇలా తయారైందని విమర్శించాడు.రాణించని ఆజం ఖాన్కాగా వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సందర్భంగా పాకిస్తాన్ తరఫున అరంగ్రేటం చేశాడు. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ క్రికెట్లో 13 మ్యాచ్లు ఆడి.. 135.38 స్ట్రైక్రేటుతో 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, గణాంకాలు అత్యంత సాధారణంగా ఉన్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఆజం ఖాన్కు చోటు దక్కింది.ఈ క్రమంలో మెగా టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆజం ఖాన్ డకౌట్గా వెనుదిరిగాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్లో అనూహ్యంగా అమెరికా చేతిలో ఓడిన పాక్ జట్టు.. కనీసం సూపర్-8కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఫలితంగా తీవ్ర విమర్శలపాలైంది.బాడీ షేమింగ్.. విమర్శలుఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్నెస్పై చర్చ జరుగగా.. ఆజం ఖాన్ను బాడీ షేమింగ్ చేశారు చాలా మంది. మొయిన్ ఖాన్ కొడుకు కాబట్టే బంధుప్రీతితో అతడి లాంటి వాళ్లకు కూడా జాతీయ జట్టులో చోటు దక్కుతోందని మండిపడ్డారు. అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించిన మొయిన్ ఖాన్ పీసీబీపైనే విమర్శలు చేయడం విశేషం.మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు?‘‘వరల్డ్కప్ 2024 మ్యాచ్లన్నీ నేను చూశాను. వికెట్ కీపర్ బ్యాటర్ కాబట్టి ఆజం ఖాన్కు అన్ని మ్యాచ్లలో అవకాశం ఇస్తారనుకున్నా. కానీ ఒక్క మ్యాచ్లో విఫలం కాగానే పక్కనపెట్టారు. ఇలాంటి యువ ఆటగాళ్ల ఉత్సాహాన్ని ఆదిలోనే నీరుగారిస్తే.. ఎప్పుటికప్పుడు ప్లేయర్లను మార్చివేస్తూ ఉంటే.. పటిష్ట జట్టు ఎలా రూపుదిద్దుకుంటుంది.కనీస సంఖ్యలోనైనా అవకాశాలు ఇవ్వాలి. లేనిపక్షంలో మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు? గతంలో ప్రపంచకప్-2022 సమయంలో రమీజ్ రాజా నా కుమారుడు ఆజం ఖాన్ను జట్టు నుంచి తప్పించాడు.సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినా కావాలనే పక్కనపెట్టాడు. ఇలాంటి వాళ్ల జట్టు ఇలా తయారైంది’’ అని 52 ఏళ్ల మొయిన్ ఖాన్ పీసీబీ ప్రస్తుత, మాజీ యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. తన కుమారుడికి ప్రతిభ ఉన్నా అవకాశాలు రావడం లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. చదవండి: విఫలమైన సంజూ శాంసన్.. సింగిల్ డిజిట్ స్కోర్ -
'మా దేశానికి టీమిండియా రావద్దు'.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ఛాంపియన్స్-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్కు టీమిండియా వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఎట్టిపరిస్ధితులలోనూ తమ జట్టును పాక్కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చేప్పగా..పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సందేనని మొండి పట్టుతో ఉంది.ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2023 ఆసియాకప్లో తలపడేందుకు కూడా భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లలేదు. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ విషయంపై ఐసీసీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ ఏడాది నవంబర్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.మా దేశానికి రావద్దు..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు పాకిస్తాన్కు రావద్దని కనేరియా సూచించాడు. ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధన్యం ఇవ్వాలని అతడు తెలిపాడు."పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితిని చూడండి. నేను అయితే టీమిండియా పాకిస్తాన్కు వెళ్లొద్దని చెబుతాను. ఈ విషయం గురుంచి పాకిస్తాన్ ఆలోచించాలి. దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప పీసీబీ ఎటువంటి డిమాండ్ చేయకూడాదు. నా వరకు అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశముంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరిగే ఛాన్స్ ఉంది. ఆటగాళ్ల భద్రతే మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే గౌరవం, ఇంకా ఏమైనా. బీసీసీఐ అద్భుతంగా పనిచేస్తోంది. వారి నిర్ణయం ఏదైనా సరే, ఇతర దేశాలు కూడా అందుకు అంగీకరించాలి. టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరిగితే బెటర్" అని స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు.కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్ను పీసీబీ ఇప్పటికే ఐసీసీకి పంపించింది. ఆ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 19 నుంచి మార్చి మార్చి 9 వరకు జరగనుంది. ఈ ఈవెంట్కు లాహోర్లోని గఢాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా స్టేడియాల్లో పునర్నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి ఇందుకు కోసం పీసీబీ రూ. 1,280 కోట్లు కేటాయించింది. -
‘బీసీసీఐని కాపీ కొట్టండి.. మనమూ గెలుస్తాం’
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెడ్బాల్ టోర్నీలపై దృష్టి పెట్టకుండా.. పరిమిత ఓవర్ల క్రికెట్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఆటను ఎలా అభివృద్ధి చేయాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి పీసీబీ నేర్చుకోవాలని సూచించాడు. పాక్ క్రికెట్ సరైన గాడిలో పడాలంటే మూలాల నుంచి ప్రక్షాళన అవసరమని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ చేతిలో తొలిసారిగా టెస్టు మ్యాచ్లో పాక్ ఓడిపోయింది. తొలిసారి బంగ్లా చేతిలో పాక్ ఓటమితొలి టెస్టులో ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ లేకుండా ఏకంగా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగి భారీ మూల్యం చెల్లించింది. మరోవైపు.. బంగ్లాదేశ్ ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతో రంగంలోకి దిగింది. ఇక పాక్ అత్యుత్సాహంతో 6 వికెట్లకే తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా... ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ ఏకంగా 117 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఆట చివరి రోజు బంగ్లాదేశ్ సీనియర్ స్పిన్నర్లు షకీబ్, మెహదీ హసన్ మిరాజ్ చెలరేగిపోవడంతో పాక్కు అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో షాన్ మసూద్ బృందం ఆట తీరు సహా పీసీబీ విధానాలపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు సిరీస్ తర్వాత చాంపియన్స్ కప్ అనే వన్డే టోర్నీని నిర్వహించబోతున్నారు. బీసీసీఐని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోండిపీసీబీ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు ఏం చేసినా కాపీ కొట్టేది. మరి పొరుగు దేశం భారత్ వైపు ఒకసారి చూడవచ్చు కదా! దయచేసి వాళ్ల వ్యవస్థను కూడా కాపీ కొట్టండి. మార్పులు కూడా అవసరం లేదు. ఎందుకంటే.. కాపీ కొట్టడంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటారని తెలుసు. అందుకే వాళ్లేం చేస్తే యథాతథంగా మీరూ చేసేయండి. ఇండియాలో తదుపరి దులిప్ ట్రోఫీ మొదలుకాబోతోంది. అదేమీ టీ20 లేదా వన్డే టోర్నమెంట్ కాదు. నాలుగు రోజుల ఆట ఉండే రెడ్బాల్ టోర్నీ. మూలాల నుంచి క్రికెట్ను పటిష్టం చేయడంపై వాళ్లు దృష్టిసారించారు.అందుకే ఆ జట్టు విజయవంతమైనదిగా నిలుస్తోంది’’ అంటూ పీసీబీ యాజమాన్యాన్ని తూర్పారపడుతూనే హితవు పలికాడు. పాక్ జట్టు వరుస వైఫల్యాలుఇప్పటికైనా రెడ్బాల్ క్రికెట్పై దృష్టి సారించకపోతే పాక్ జట్టు మరిన్ని పరాభవాలు చవిచూడక తప్పదని బసిత్ అలీ ఈ సందర్భంగా హెచ్చరించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ఇటీవలి కాలంలో ఘోరంగా విఫలమవుతోంది. వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో, న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో... ఆటగాళ్ల ఫిట్నెస్ లేమి, సెలక్షన్ విషయంలో బంధుప్రీతి కారణంగానే ఇలా పరాజయాలు అంటూ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఈ క్రమంలో పాక్ కొత్తగా మూడు దేశవాళీ టోర్నీలు ప్రవేశ్పెట్టి.. ప్రాథమిక దశ నుంచే క్రికెట్ను అభివృద్ధి చేస్తామని తెలిపింది. కొత్తగా మూడు టోర్నీలుదేశవాళీ క్రికెట్ 2024- 2025లో భాగంగా చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్క్లాస్ కప్ టోర్నీ నిర్వహిస్తామని పేర్కొంది. మరోవైపు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా ఫిట్గా ఉంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే నిబంధన విధించిన విషయం తెలిసిందే.చదవండి: ‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్?’ -
పాక్ స్టేడియాల్లో కనీస వసతులు లేవు.. ఒక్కటీ..: పీసీబీ చీఫ్
పాకిస్తాన్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేవని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అన్నారు. చాలా స్టేడియాల్లో కనీస వసతులు కూడా లేవని పెదవి విరిచారు. చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఈ దుస్థితిని మార్చే దిశగా ప్రక్షాళన చర్యలు చేపట్టామని తెలిపారు.వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియాలను పునరుద్దరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన పీసీబీ పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో లాహోర్లో గల ప్రసిద్ధ గడాఫీ స్టేడియాన్ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సందర్శించారు.మన స్టేడియాలు బాలేవుఈ సందర్భంగా నఖ్వీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన స్టేడియాలకు.. అంతర్జాతీయ స్టేడియాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మన స్టేడియాల్లో ఒక్కటీ అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేదు. ఆ పరిస్థితిని మార్చేందుకు మేము ప్రక్షాళన చర్యలు చేపట్టాం. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ రాత్రిపగలూ తేడా లేకుండా ఎంతో కష్టపడుతోంది.ప్రథమ ప్రాధా న్యం అదేప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియాలలో ఒకటిగా మన స్టేడియాలను తీర్చిదిద్దుతాం. అయితే, అంతకంటే ముందు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో క్రికెట్ స్టేడియాల పునరుద్ధరణలో భాగంగా పీసీబీ ఇప్పటికే 17 బిలియన్ల పాక్ రూపాయలను కేటాయించినట్లు సమాచారం.ఇక ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం ఐసీసీ పీసీబీకి 70 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టీమిండియా పాక్కు వెళ్లబోదని బీసీసీఐ పెద్దలు చెబుతుండగా.. హైబ్రిడ్ విధానానికి తాము ఒప్పుకోమని పీసీబీ అంటోంది. ఈ విషయంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి!!చదవండి: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక అదే: పీసీబీ చీఫ్ -
'అతడు పాక్ క్రికెట్ను నాశనం చేస్తాడు.. సెలెక్టర్లు సిగ్గుపడాలి'
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్కు పాకిస్తాన్ అన్ని విధాల సన్నద్దమవుతోంది. రావల్పిండి వేదికగా ఆగస్టు 21 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్, టాప్ ఆర్డర్ బ్యాటర్ కమ్రాన్ గులామ్లను జట్టు నుంచి పీసీబీ విడుదల చేసింది. వీరిద్దరూ బంగ్లాదేశ్ 'ఎ'తో ప్రారంభమయ్యే రెండవ నాలుగు రోజుల మ్యాచ్లో పాకిస్తాన్ షాహీన్స్ తరపున ఆడాలని పీసీబీ ఆదేశించింది. అయితే ప్రధాన జట్టుకు ఎంపికైనప్పటకి తొలి టెస్టుకు ముందు గులామ్, ఆహ్మద్ను విడుదల చేయడాన్ని ఆ దేశ మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ చేరాడు. పీసీబీ సలహాదారు వకార్ యూనిస్, పాక్ సెలక్షన్ కమిటీపై అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.పాకిస్తాన్ క్రికెట్లో ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారా? బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్టుకు ముందు జట్టు నుంచి అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్లను వకార్ యూనిస్ అండ్ సెలక్షన్ కమిటీ తప్పించింది. వకార్ యూనిస్ పాక్ క్రికెట్ను నాశనం చేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అబ్రార్, కమ్రాన్ గులామ్లను జట్టు నుండి తప్పించిన ఈ థర్డ్ క్లాస్ సెలక్షన్ కమిటీ సిగ్గుపడాలి. అబ్రార్, కమ్రాన్ గులామ్లను జట్టు నుండి తొలగించిన ఈ థర్డ్ క్లాస్ సెలక్షన్ కమిటీ నిజంగా సిగ్గుపడాలి. తనను తాను పెద్ద లెజెండ్గా చెప్పుకుంటున్న వకార్ యూనిస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ ఇద్దరు క్రికెటర్లను ఎందుకు జట్టు నుంచి రిలీజ్ చేశారని ఎక్స్లో వకార్ యూనిస్ మండిపడ్డాడు. -
ఇది నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది: కమ్రాన్ ఆక్మల్
స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు పాకిస్తాన్ సన్నద్దమవుతోంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్టు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.అయితే ఈ రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతించకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాళీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పీసీబీపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ విమర్శల వర్షం కురిపించాడు. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ పరువుపోతుందని ఆక్మల్ మండిపడ్డాడు."పాక్-బంగ్లాదేశ్ రెండు టెస్టు మ్యాచ్ కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. కరాచీలో స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయని మీకు ముందే తెలుసు కదా? అటువంటి అప్పుడు అక్కడ ఎందుకు షెడ్యూల్ చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు.పాకిస్తాన్లో టెస్టు మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరగడం మన దేశానికి అవమానకరం. మనకు కేవలం రెండు, మూడు స్టేడియంలు మాత్రమే లేవు. ఫైసలాబాద్ స్టేడియం కూడా ఉంది. అక్కడ కూడా మ్యాచ్ను నిర్వహించవచ్చు. అదొక టాప్ క్లాస్ స్టేడియం. ఇప్పటికే చాలా మ్యాచ్లు అక్కడ జరిగాయి. అదేవిధంగా ముల్తాన్లో కూడా స్టేడియం ఉంది.ముల్తాన్ స్టేడియం చాలా బాగుంటుంది. అక్కడ అన్నిరకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ రెండు వేదికలో ఏదో ఒక స్టేడియంలో సెకెండ్ టెస్టును నిర్వహించాల్సింది. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ను నిర్వహించాలన్నది సరైన నిర్ణయం కాదు. ఇది నిజంగా మనకు సిగ్గు చేటు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ క్రికెట్కు చెడ్డ పేరును తీసుకువస్తుందని" తన యూట్యాబ్ ఛానల్లో పీసీబీపై అక్మల్ ఫైరయ్యాడు. -
పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్కు గోల్డెన్ బాయ్ నదీమ్..!?
ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసి ఐదు రోజులు అవుతున్నప్పటకి స్వర్ణ పతక విజేత, పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్కు తొలి ఒలింపిక్ గోల్డ్మెడల్ అందించి ఓవర్నైట్ హీరోగా నదీమ్ మరిపోయాడు. అతడిని ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ సైతం ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా నదీమ్కు రెండో అత్యున్నత పురస్కారం.. హిలాల్ ఇంతియాజ్ అవార్డును ప్రదానం కూడా చేయనున్నారు.డ్రెస్సింగ్కు రూమ్ ఆహ్వానించిన గిల్లెస్పీ...ఈ క్రమంలో పాక్ టెస్టు జట్టు హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ గోల్డన్ బాయ్ నదీమ్ను తమ డ్రెస్సింగ్ రూమ్కు ఆహ్వానించాడు. ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి పాకిస్తానీ అథ్లెట్ కలవడం ద్వారా తమ క్రికెటర్లు స్ఫూర్తిని పొందుతారని గిల్లెస్పీ అభిప్రాయపడ్డాడు. కాగా పాక్ క్రికెట్ జట్టు తమ స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు సందర్భంగా పాక్ డ్రెస్సింగ్ రూమ్ను సందర్శించే అవకాశముంది."అర్షద్ నదీమ్ని మా డ్రెస్సింగ్ రూమ్కు ఆహ్వానించాం. ఒలింపిక్స్ సమయంలో మా క్రికెటర్ల అందరూ నదీమ్ని ఉత్సాహపరచడం నేను చూశాను. అతడు తన బంగారు పతకంతో మా డ్రెస్సింగ్ రూమ్ను సందర్శిస్తే ఆటగాళ్లలో మరింత పట్టుదల పెరుగుతుంది. మా క్రికెటర్లు అతడిని కచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటారు" అని పీసీబీ పోడ్కాస్ట్లో గిల్లెస్పీ పేర్కొన్నాడు -
పాక్లోక్రికెట్ మ్యాచ్.. ఎంట్రీ టిక్కెట్ రూ. 15 మాత్రమే
టీ20 వరల్డ్కప్-2024లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ తొలి సిరీస్ సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాక్ తలపడనుంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ను వీక్షించేందుకు అభిమానులు స్టేడియం వస్తారో లేదన్న భయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పట్టుకుంది. ఎందుకంటే ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఖాళీ స్టాండ్స్ మధ్య ఈ టీ20 లీగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ల ధరను భారీగా తగ్గించింది. రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టిక్కెట్ కనీస ధరగా పీకేఆర్ 200 (భారత కరెన్సీలో సుమారు రూ.60)గా నిర్ణయించిన పీసీసీ.. కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగే రెండు టెస్టు ఎంట్రీ టిక్కెట్ పీకేఆర్ 50(భారత కరెన్సీలో రూ.15)గా ఫిక్స్ చేశారు.కాగా దశాబ్ద కాలంలో కరాచీ నేషనల్ స్టేడియంలో ఇంత తక్కువ ధరకు టిక్కెట్లను విక్రయించడం ఇదే మొదటి సారి. ఈ సిరీస్కు సంబంధించిన టిక్కెట్లు ఆగస్టు 13 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక తొలి టెస్టుకు గరిష్ట టిక్కెట్ ధరగా 60,000 కాగా.. కరాచీ టెస్టు అత్యధిక టిక్కెట్ ధర 83,000గా ఉంది. ఈ టిక్కెట్లు కొనుగొలు చేసిన వారికి పీసీబీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది. -
దేశంలో అల్లర్లు.. 5 రోజుల ముందే పాక్కు వెళ్లనున్న బంగ్లా క్రికెట్ టీమ్!
బంగ్లాదేశ్లో హింసాత్మక పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినప్పటకి అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి.అయితే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ వర్గాల నుంచి అభిమానులకు గుడ్న్యూస్ అందింది. ఇరు జట్ల మధ్య సిరీస్ యాధావిథిగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17న పాకిస్తాన్కు బంగ్లా జట్టు బయలుదేరాల్సింది. కానీ ఇప్పుడు ఐదు రోజుల ముందగానే బంగ్లా టీమ్ పాక్కు వెళ్లనున్నట్లు సమాచారం. ఆగస్టు 12(మంగళవారం)న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పాకిస్తాన్కు పయనం కానున్నట్లు ప్రముఖ క్రికెట్ బెబ్సైట్ క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. బంగ్లా ఆటగాళ్లకు అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు ఆతిథ్యమివ్వడానికి పీసీబీ సిద్దంగా ఉన్నట్లు క్రిక్బజ్ తెలిపింది. పర్యాటక జట్టు ప్రాక్టీస్ సెషన్స్ కోసం రావల్పిండిలో పీసీబీ అన్నిరకాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు రావల్పిండి వేదికగానే జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ పాకిస్తాన్కు చాలా కీలకం. ఈ క్రమంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్పై పీసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ మాత్రం ఇంకా తమ జట్టును ఎంపిక చేయలేదు. -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన.. ఇకపై
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొత్తగా మూడు టోర్నమెంట్లు ప్రవేశపెట్టింది. దేశవాళీ క్రికెట్ 2024- 2025లో భాగంగా చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్క్లాస్ కప్ టోర్నీ నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుతం పురుషుల క్రికెట్లో మాత్రమే ఈ మూడు టోర్నమెంట్లు ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేసింది.కాగా పాకిస్తాన్లో ఇప్పటికే నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు ఉన్నాయి. వీటికి అదనంగా పై మూడు టోర్నమెంట్లను పీసీబీ ప్రవేశపెట్టింది.ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ‘‘దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్కు మధ్య చాంపియన్స్ టోర్నమెంట్లు వారధిగా నిలవడమే కాకుండా.. క్రికెటింగ్ ఎకోసిస్టమ్ను పునరుత్తేజితం చేసే విధంగా ఉంటాయి. ప్రతిభ ఆటగాళ్లను గుర్తించి.. వారి నైపుణ్యాలకు పదునుపెట్టి.. గ్లోబల్ వేదికపై రాణించేలా వారిని తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’’ అని తెలిపాడు. చాంపియన్స్ టోర్నీల్లో డాల్ఫిన్స్, లయన్స్, పాంథర్స్, స్టాలియాన్స్, వోల్వ్స్ పేర్లతో ఐదు జట్లు ఉంటాయని పేర్కొన్నాడు.గత మూడేళ్లుగా ఆకట్టుకుంటున్న 150 మంది టాప్ డొమెస్టిక్ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా ఇందులో పాల్గొంటారని మొహ్సిన్ నఖ్వీ వెల్లడించాడు. ప్రతి జట్టుకు పాకిస్తానీ మాజీ సూపర్స్టార్ మెంటార్గా ఉంటాడని వెల్లడించాడు. విశేష అనుభవం ఉన్న వారిని మాత్రమే కోచ్లుగా నియమించుకుంటామని స్పష్టం చేశాడు.కాగా గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేదు అనుభవాలు ఎదుర్కొంటోంది. ద్వైపాక్షిక సిరీస్లలో వైట్వాష్కు గురవడంతో పాటు.. వన్డే వరల్డ్ప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక పీసీబీ చైర్మన్ నియామకం, హెడ్కోచ్ల విషయంలోనూ హైడ్రామా జరిగింది. అదే విధంగా.. ఆటగాళ్ల ఫిట్నెస్లేమి, క్రమశిక్షణా రాహిత్యం మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీసీబీ దేశవాళీ క్రికెట్ స్థాయి నుంచి ప్రక్షాళన చర్యలు చేపట్టింది.ఈ నేపథ్యంలో పీసీబీ దేశవాళీ క్రికెట్ స్థాయి నుంచి ప్రక్షాళన చర్యలు చేపట్టింది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం ఇటీవల.. కఠిన నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.ప్రధాన ఆటగాళ్లు మినహా మిగతావాళ్లెవరైనా ఏదేని కారణం చేత జాతీయ జట్టుకు దూరమైతే.. దేశవాళీ క్రికెట్లో ఆడిన తర్వాతే టీమిండియాలో ఆడే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ధిక్కరించిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై వేటు వేస్తూ.. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. అయితే, శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకుని శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక పీసీబీ సైతం తాజా చర్యతో బీసీసీఐ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. -
పాకిస్తాన్ పర్యటనకు బంగ్లా క్రికెట్ జట్టు.. భద్రతపై బీసీబీ ఆందోళన
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 21 నుంచి రావాల్పండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు ఆగస్టు 17న పాక్కు బంగ్లా క్రికెట్ జట్టు పయనం కానుంది. అయితే పాక్ టూర్ వెళ్లేముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టూర్ కోసం ఓ భద్రతా సలహాదారుని నియమించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీసీబీ అభ్యర్ధించింది."పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే మా జట్టు భద్రతపై మేము కొద్దిపాటి ఆందోళన చెందుతున్నాము. అయితే భద్రతకు సంబంధించి పూర్తి స్థాయి భరోసా పీసీబీ నుంచి లభించడంతోనే మా జట్టు పాక్కు వెళ్లనుంది. ఏదమైనప్పటికి ఆటగాళ్లకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిదే. ఆసియా కప్ కోసం అక్కడకు వెళ్లిన మా జట్టుకు రాష్ట్ర స్థాయి భద్రత లభించింది. పాక్లో పర్యటించిన ఇతర జట్లకు చేసిన భద్రతా ఏర్పాట్లపై కూడా మేము సంతృప్తిగా ఉన్నాము. అయితే భద్రతా సమస్యలకు సంబంధించి వారితో ఎల్లప్పుడూ చర్చించేందుకు ఒక సెక్యూరిటీ కన్సల్టెంట్ను నియమించమని పాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థించామని" బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ పేర్కొన్నాడు. -
‘భద్రత కల్పిస్తాం.. ఒక్కసారి పాకిస్తాన్కు రండి’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ పేసర తన్వీర్ అహ్మద్ ఘాటుగా స్పందించాడు. భారత జట్టుకు ధైర్యం ఉంటే పాక్ పర్యటనకు రావాలని సవాల్ విసిరాడు. తాము ధైర్యవంతులం కాబట్టే భారత్లో మ్యాచ్లు ఆడామని.. భద్రత కల్పిస్తామని చెప్తున్నా టీమిండియా మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించాడు.నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్ కాగా వచ్చే జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా రోహిత్ సేనను పాకిస్తాన్కు పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఆసియా వన్డే కప్-2023 మాదిరే ఈ ఐసీసీ టోర్నీని కూడా హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించి ఇప్పటికే తమ డిమాండ్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి వద్ద కూడా బలంగానే వినిపించినట్లు తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం.. లాహోర్లో సురక్షిత వాతావరణంలో టీమిండియా మ్యాచ్ల నిర్వహణకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐసీసీకి కూడా చెప్పిందని.. బీసీసీఐని ఒప్పించాల్సిన బాధ్యత కూడా ఐసీసీకే అప్పగించినందని పాక్ మీడియా పేర్కొంది.పాకిస్తాన్కు వెళ్లడం అంత సేఫ్ కాదుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాకిస్తాన్కు వెళ్లడం అంత సేఫ్ కాదు. అక్కడ ప్రతిరోజూ ఏదో దుర్ఘటన జరుగుతూనే ఉంటుంది. టీమిండియా విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే. అన్నింటికంటే ఆటగాళ్ల భద్రతే ముఖ్యం’’ అని భజ్జీ పేర్కొన్నాడు.ఒక్కసారి ఇక్కడికి రండి చాలు!.ఈ క్రమంలో తన్వీర్ అహ్మద్ స్పందిస్తూ.. ‘‘మేము సింహాలం. మీ డెన్కు వచ్చి మ్యాచ్లు ఆడాము. మీకు ధైర్యం ఉంటే మీరు కూడా ఇక్కడికి రండి. మీకు కావాల్సిన భద్రత మేము కల్పిస్తాం. ఏం కావాలంటే అది చేసి పెడతాం. ఒక్కసారి ఇక్కడికి రండి చాలు!.. మా జట్టుకు ధైర్యం ఎక్కువ. అందుకే మేము భారత్లో టోర్నీలు ఆడుతున్నాం’’ అని పేర్కొన్నాడు. అయితే, తన్వీర్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. భారత్ సురక్షితం కాబట్టే పాక్ ప్లేయర్లు ఇక్కడకు వచ్చారని.. అందుకు తగ్గట్లుగానే వారిని బీసీసీఐ సేఫ్గా పాక్కు పంపిందని పేర్కొంటున్నారు.అయితే, ఈ విషయంలో భారత్కు పాకిస్తాన్కు చాలా తేడా ఉందని.. పాక్ వెలుపలే టీమిండియా మ్యాచ్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇటీవల వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పేలవమైన ఆట తీరుతో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఆతిథ్య భారత్ రన్నరప్గా నిలవగా.. ఆస్ట్రేలియా చాంపియన్గా అవతరించింది. కాగా టీమిండియా చివరిసారిగా 2006లో పాకిస్తాన్లో పర్యటించింది. అయితే, 2008లో ముంబై దాడుల తర్వాత భారత జట్టును అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది.చదవండి: Ind vs SL: గంభీర్ గైడెన్స్.. కోహ్లి- రోహిత్ ప్రాక్టీస్ -
ACC: ఏసీసీ బాస్గా పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ?
ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) తదుపరి అధ్యక్షుడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నియమితుడు కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. నఖ్వీ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ప్రస్తుతం ఏసీసీ ప్రెసిడెంట్గా ఉన్న విషయం తెలిసిందే.జై షా వైదొలిగిన వెంటనేరెండేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఈ ఏడాది జనవరిలో.. మరోసారి ఏసీసీ బాస్గా బాధ్యతలు చేపట్టాడు జై షా. ఏడాది పాటు అతడి పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకున్న క్రమంలో.. ఇప్పటికీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. అయితే, రొటేషన్ పాలసీ ప్రకారం ఈసారి ఈ పదవి పాక్ బోర్డు చైర్మన్ను వరించనున్నట్లు ఏసీసీ వర్గాలు తెలిపాయి.‘‘వచ్చే ఏడాది ఏసీసీ సమావేశంలో.. నఖ్వీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తారు. తదుపరి రెండేళ్లపాటు ఏసీసీ ప్రెసిడెంట్గా నఖ్వీ కొనసాగే అవకాశం ఉంది. జై షా వైదొలిగిన వెంటనే అతడి స్థానంలో నఖ్వీ బాధ్యతలు చేపడతాడు’’అని సదరు వర్గాలు జాతీయ మీడియాతో వెల్లడించాయి.వచ్చే ఏడాది భారత్లోకాగా వచ్చే ఏడాది భారత్లో ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీ పురుషుల ఆసియాకప్ టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్లో నిర్వహించనున్నారు. 2026లో స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్కు ముందుగా ఈ టోర్నీ నిర్వహిస్తారు.గతంలోనూ 2023 వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా పాకిస్తాన్లో ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో ‘హైబ్రిడ్ మోడల్’తో భారత్ ఆడిన మ్యాచ్ల్ని శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా నిలిచింది. అనంతరం 2027 ఆసియా కప్నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది.అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ జరుగనుంది. ఈ రెండు టోర్నీల్లోనూ భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లతో పాటు టెస్టు హోదా దక్కని ఒక ఆసియా జట్టు పాల్గొంటుందని ఆసియా క్రికెట్ మండలి తెలిపింది. -
‘పాకిస్తాన్కు టీమిండియా రావాల్సిందే.. మేమైతే’
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ను విజయంతంగా నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేస్తుంది.ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్ను సైతం పీసీబీ.. ఐసీసీకి పంపింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్కు పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని డిమాండ్ చేస్తోంది. కానీ పీసీబీ మాత్రం ఈ మెగా టోర్నీని తమ దేశంలో నిర్వహించాలని మొండి పట్టు పట్టింది.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ దేశానికి రావడానికి భారత్కు ఇష్టం లేదని, భద్రతను సాకుగా ఉపయోగించుకుంటుందని అఫ్రిది ఆరోపించాడు. ఇప్పటికే చాలా మంది పాక్ మాజీ క్రికెటర్లు భారత జట్టు తమ దేశానికి రావాలని వాదిస్తున్నారు."మేము క్లిష్లమైన పరిస్ధితుల్లో కూడా ఆడేందుకు భారత్కు చాలాసార్లు వెళ్లాం. మాకు బెదిరింపులు వచ్చిన సందర్భాల్లో కూడా మేము భారత్కు వెళ్లి క్రికెట్ ఆడాము. మమ్మల్ని భారత్కు పంపేందుకు మా దేశ ప్రభుత్వం గానీ, పీసీబీ గానీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.గతేడాది కూడా మా జట్టు వరల్డ్కప్లో తలపడేందుకు భారత్కు వెళ్లింది. మేము ఎప్పుడూ భారత్కు సపోర్ట్గా ఉంటాము. కాబట్టి వారు కూడా ఇక్కడకు వచ్చి ఆడాలని నేను కోరుకుంటున్నానని" అఫ్రిది ఓ పాక్ జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. -
పాక్ హెడ్కోచ్గా అంటే కత్తి మీద సాము లాంటిదే: డేవ్ వాట్మోర్
వన్డే వరల్డ్కప్-2023లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ కోచింగ్ స్టాప్ మొత్తాన్ని ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. పాక్ జట్టు పరిమిత ఓవర్ల హెడ్కోచ్గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్స్టెన్ బాధ్యతలు చేపట్టగా.. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆసీస్ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ జాసన్ గిల్లెస్పీ ఎంపికయ్యాడు.గ్యారీ కిర్స్టెన్ ఇప్పటికే తన ప్రయణాన్ని ప్రారంభించగా.. వచ్చే నెలలో స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్తో గిల్లెస్పీ ప్రస్ధానం మొదలు కానుంది. అయితే కోచ్లు మారినప్పటకి పాక్ తల రాత ఏమాత్రం మారలేదు. కిర్స్టెన్ నేతృత్వంలోని పాక్ జట్టు టీ20 వరల్డ్కప్-2024లో దారుణ ప్రదర్శన కనబరిచింది. గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాన కోచ్ డేవ్ వాట్మోర్ కొత్త హెడ్కోచ్లు గ్యారీ కిర్స్టెన్, జాసన్ గిల్లెస్పీలకు కీలక సూచనలు చేశాడు. పాక్ జట్టును విజయం పథంలో నడిపించడం అంత ఈజీ కాదని వాట్మోర్ అభిప్రాయపడ్డాడు."ఇప్పటికే పాక్ సెలక్షన్ కమిటీ చాలా మార్పుల చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు వల్ల పాక్ క్రికెట్కు ఎంత నష్టం జరుగుతుంతో వేచి చూడాలి. నావరకు నేను ఆదృష్టవంతుడిని. ఎందుకంటే పాక్ జట్టు హెడ్కోచ్గా నా పదవీకాలాన్ని మొత్తాన్ని పూర్తి చేసే అవకాశం దక్కింది. ఈ మధ్య కాలంలో పాక్కు కోచ్లు మారుతునే ఉన్నారు. కొత్త కోచ్లకు నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రశాంతంగా ఉండి తమ పని తాము చేసుకుపోవాలి. ఏదేమైనప్పటకి పాక్ జట్టు హెడ్ కోచ్గా పనిచేయడం అంత సులభం కాదు" అని ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్మోర్ పేర్కొన్నాడు. కాగా 2012లో పాక్ జట్టుహెడ్ కోచ్గా వాట్మోర్ పనిచేశాడు. -
ICC: టీమిండియా మ్యాచ్లన్నీ లాహోర్లోనే?!
చాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో వెనక్కి తగ్గేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సిద్ధంగా లేరని సమాచారం. మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే నిర్వహించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే విషయాన్ని నఖ్వీ అంతర్జాతీయ క్రికెట్ మండలికి కూడా చెప్పినట్లు సమాచారం. ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఐసీసీకి స్పష్టం చేసినట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.తగ్గేదేలే!కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వగా.. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, ఇరు దేశాల మధ్య పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ టీమిండియాను పాకిస్తాన్కు పంపేందుకు సిద్ధంగా లేదు.అందుకే ఆసియా వన్డే కప్-2023 మాదిరే ఈసారి కూడా హైబ్రిడ్ విధానంలో షెడ్యూల్ ఖరారు చేయాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఆసియా టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్లు మాత్రం శ్రీలంకలో నిర్వహించారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇలాగే జరగాలని బీసీసీఐ కోరుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ బాధ్యత మీదే టీమిండియాను పాకిస్తాన్కు తీసుకువచ్చే బాధ్యత ఐసీసీదేనని.. ఈ విషయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నఖ్వీ కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. అలా జరగని పక్షంలో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలగాలే తప్ప హైబ్రిడ్ మోడల్కు మాత్రం తాము ఒప్పుకొనేది లేదని అతడు అన్నట్లుగా పాక్ మీడియా వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఐసీసీ ఎటువైపు మొగ్గుచూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. టీమిండియా గనుక ఈ టోర్నీ ఆడకపోతే ఓవరాల్గా తమకు నష్టం. అదే పాక్ మాట కాదంటే తాము నష్టపోయినందుకు పరిహారం చెల్లించాలని కోరే అవకాశం ఉంది.టీమిండియా మ్యాచ్లన్నీ లాహోర్లోనే?!కొలంబోలో జరుగుతున్న ఐసీసీ సర్వసభ్య సమావేశం ముగిసేలోగా ఈ అంశంపై ఐసీసీ తుది నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ ప్రభుత్వం టీమిండియా మ్యాచ్లను లాహోర్లో నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా 2008లో చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా పాకిస్తాన్లో పర్యటించింది. చదవండి: NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్బై.. కొత్త హెడ్ అతడే! -
పాక్ ఆటగాళ్లకు షాకిచ్చిన పీసీబీ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని తగ్గించింది. ఈ విషయాన్ని పీసీబీ అధికారులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో దారుణ వైఫల్యాల నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్ల ప్రవర్తనపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్పై దృష్టి పెట్టకుండా ఇతర అంశాల్లో జోక్యం చేసుకుంటూ జట్టుకు నష్టం చేకూరుస్తున్నారని పీసీబీ భావిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం, పరస్పర సహాయ సహకారాలు అందించుకునే విషయంలో ఆటగాళ్ల మధ్య ఐక్యత లేదన్నది వాటి ప్రధాన సారాంశం. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.సంస్కరణలకు శ్రీకారంఅదే విధంగా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలోనూ సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. పాక్ టెస్టు హెడ్కోచ్ జేసన్ గిల్లెస్పి, వన్డే- టీ20ల ప్రధాన కోచ్ గ్యారీ కిర్స్టెన్తో లాహోర్లో సోమవారం చర్చించినట్లు తెలుస్తోంది.పాక్ బోర్డు అధికారులు ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించినట్లు తెలిపారు. ఇందుకు గల కారణాలు వెల్లడిస్తూ.. ‘‘సెంట్రల్ కాంట్రాక్ట్, ఆటగాళ్ల పారితోషికం విషయంలో చర్చ జరిగింది.ఆ రెండిటి ఆధారంగాక్రికెటర్ల ఫిట్నెస్, ప్రవర్తన ఆధారంగా ప్రతీ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ను రివైజ్ చేయాలని సెలక్టర్లు ప్రతిపాదించారు. అయితే, పారితోషికం విషయంలో మాత్రం ఎలాంటి కోత ఉండబోదు’’ అని పేర్కొన్నారు.అంతేకాదు.. ‘‘పూర్తిస్థాయి ఫిట్నెస్ కలిగి ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఇక నుంచి నిరంభ్యంతర పత్రాలు(NOCs- నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగి ఉన్న లీగ్లలో మాత్రమే ఆడేందుకు అనుమతినివ్వాలనే యోచనలో ఉన్నాం’’ అని తెలిపారు.కోచ్తో అతడి గొడవకాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజం, టీ20ల మాజీ సారథి షాహిన్ ఆఫ్రిది మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్తో షాహిన్ అనుచితంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి వచ్చింది.అయితే, వెంటనే అతడు కోచ్కు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా ఆటగాళ్లను సరైన దారిలో పెట్టేందుకు పీసీబీ కాస్త కఠినంగానే వ్యవహరించనుందని బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్పై ఇప్పటికే పీసీబీ వేటు వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కెప్టెన్గా బాబర్ భవితవ్యం కూడా తేలనుంది.చదవండి: ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీ, రైనాపై విమర్శలు -
పాకిస్తాన్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐ డిమాండ్ ఇదే!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) డ్రాప్ట్ షెడ్యూల్ను ఐసీసీ సమర్పించింది. అయితే ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్పై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ మెగా టోర్నీలో ఆడేందుకు భారత జట్టును పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతడేది ఆసియాకప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. పాక్ బదులుగా భారత్ ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా ఆసియాకప్-2023 కూడా హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. ఇతర దేశాలు పాకిస్తాన్కు వెళ్లి ఆడగా.. భారత్ మాత్రం తమ మ్యాచ్లు అన్నింటిని శ్రీలంకలో ఆడింది."ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్లే సూచనలు కన్పించడం లేదు. అయితే ఈ విషయంపై తుది నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకవేళ భారత్.. పాక్కు వెళ్లకపోతే హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరగనుంది. ఆసియా కప్ మాదిరిగానే భారత్ తమ మ్యాచ్లను యూఏఈ లేదా శ్రీలంకలో ఆడే అవకాశముంది. ఐసీసీ కూడా ప్రస్తుతం ఇదే విషయంపై దృష్టి పెట్టింది. అయితే, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి" అంటూ బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2008 అనంతరం పాకిస్థాన్ పర్యటనకు భారత్ ఇప్పటివరకు వెళ్లలేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా భారత జట్టును పాక్కు బీసీసీఐ పంపడం లేదు. ఇరు జట్ల మధ్య ద్వైఫాక్షిక సిరీస్లు కూడా జరగడం లేదు. -
వాళ్లిద్దరిపై వేటు వేసిన పీసీబీ.. అబ్దుల్ రజాక్కు డబుల్ షాక్!
టీ20 ప్రపంచకప్-2024లో జట్టు వైఫల్యం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్పై వేటు వేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. సెలక్టర్ పదవి నుంచి అబ్దుల్ రజాక్ను కూడా తప్పించినట్లు సమాచారం.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్లో జరిగిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో భాగమైన బాబర్ ఆజం బృందం లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.కనీసం సూపర్-8 కూడా చేరకుండానేపసికూన అమెరికా, పటిష్ట భారత్ చేతిలో ఓడి కనీసం సూపర్-8 కూడా చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్లో ఫైనల్కు చేరిన పాకిస్తాన్ ఈసారి ఘోరంగా ఇలా వెనుదిరగడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజంను సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ నిర్ణయానికే పీసీబీ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.అయితే, సెలక్షన్ కమిటీ విషయంలో మాత్రం ఈ మేరకు తామే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వహాబ్ రియాజ్, అబ్దుల్ రజాక్లను తప్పించాలని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదేశించినట్లు తెలుస్తోంది.వీరిద్దరిని మినహాయిస్తే సెలక్షన్ కమిటీలో ఇంకో ఐదుగురు మిగులుతారు. హెడ్ కోచ్, కెప్టెన్(సంబంధిత ఫార్మాట్), మహ్మద్ యూసఫ్, అసద్ షఫీక్, బిలాల్ అఫ్జల్, డేటా అనలిస్టు ఉంటారు. ఇక రియాజ్, రజాక్ స్థానాలను ఇప్పట్లో భర్తీ చేసేందుకు పీసీబీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. రజాక్కు డబుల్ షాక్అంతేకాదు రజాక్కు డబుల్ షాకిచ్చిన్నట్లు సమాచారం. మహిళా సెలక్షన్ కమిటీ విధుల నుంచి కూడా అతడిని తప్పించినట్లు తెలుస్తోంది. కాగా అనాలోచిత నిర్ణయాలు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, ఆజం ఖాన్(మాజీ కెప్టెన్ మొయిన్ కుమారుడు) వంటి ఆటగాళ్ల ఎంపిక నేపథ్యంలో వహాబ్ రియాజ్పై విమర్శలు వచ్చాయి.అతడి విషయంలో మాజీ క్రికెటర్లు పీసీబీ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు జట్టు వెళ్లిన సమయంలో రియాజ్ కేవలం సీనియర్ టీమ్ మేనేజర్గా మాత్రమే వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా అతడిని సెలక్షన్ కమిటీ నుంచి పూర్తిగా తప్పించినట్లు సమాచారం.ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది. కాగా పాక్ బోర్డులో గత కొన్నేళ్లుగా నిలకడ లేకుండా పోయింది. గడిచిన నాలుగేళ్లలో ఆరుగురు చీఫ్ సెలక్టర్లు మారారు. హరూన్ రషీద్, షాహిద్ ఆఫ్రిది, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ వసీం, మిస్బా ఉల్ హక్, వహాబ్ రియాజ్ ఈ హోదాలో పనిచేశారు. చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
బాబర్ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!
వరుస పరాభవాలతో డీలా పడ్డ పాకిస్తాన్ క్రికెట్కు పూర్వ వైభవం తీసుకురావాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టు హెడ్ కోచ్గా జాసెన్ గిల్లెస్పీకి బాధ్యతలు అప్పగించిన పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రక్షాళనపైనా దృష్టి సారించినట్లు సమాచారం.బాబర్ ఆజంపై వేటు?ఇందులో భాగంగా వన్డే, టీ20 జట్ల కెప్టెన్గా ఉన్న బాబర్ ఆజంపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. సారథిగా అతడిని తప్పించేందుకు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు పగ్గాలను షాన్ మసూద్కు అప్పగించిన పీసీబీ.. టీ20 సారథిగా షాహిన్ ఆఫ్రిదిని నియమించింది.ఈసారి కూడా చేదు అనుభవమేఅయితే, షాహిన్ కెప్టెన్గా ఆకట్టుకోకపోవడంతో టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందే బాబర్ ఆజంకు తిరిగి వన్డే, టీ20 నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. కానీ.. ఈసారి కూడా అతడికి చేదు అనుభవమే ఎదురైంది.గత టీ20 ప్రపంచకప్లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన బాబర్ ఆజం.. ఈసారి మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం గ్రూప్ దశ దాటకుండానే పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో బాబర్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.అదే విధంగా.. బంధుప్రీతికి తావు లేకుండా జట్టును ఎంపిక చేయాలంటూ ఆజం ఖాన్ వంటి వాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఆటగాళ్ల ఫిట్నెస్, క్రమశిక్షణ తదితర అంశాలకు సంబంధించి ప్రధాన కోచ్ గ్యారీ కిర్స్టెన్, ఛీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్లను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. కిర్స్టన్ నిర్ణయం మేరకేఅదే విధంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ విషయంలో కిర్స్టన్ నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని నఖ్వీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాబర్ ఆజంపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోందని పాక్ మీడియా ప్రచారం చేస్తోంది. మరోవైపు.. దేశవాళీ క్రికెట్ స్వరూపం గురించి మాజీ క్రికెటర్లతో చర్చించి రూట్మ్యాప్ తయారు చేయాలని పీసీబీ నిర్ణయించినట్లు సమాచారం. పీసీబీ చైర్మన్ను కలిసిఈ నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బాగు కోరే 30- 35 మంది అంతర్జాతీయ క్రికెటర్లు పీసీబీ చైర్మన్ను సోమవారం కలిసి తమ సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధమైనట్లు జియో న్యూస్ వెల్లడించింది. కాగా పాకిస్తాన్ తదుపరి తమ పరిమిత ఓవర్ల సిరీస్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే.చదవండి: BCCI: ద్రవిడ్కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే? -
కేవలం భార్యలనే కాదు.. పాక్ ఆటగాళ్లపై పీసీబీ ఫైర్!
తమ ఆటగాళ్ల తీరుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ ఖాన్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలకు కారణమైన కొందరు సీనియర్ క్రికెటర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు అతడు సిద్దమైనట్లు తెలుస్తోంది.పాక్ జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు అమలు చేయాలని మొహ్సిన్ ఖాన్ సన్నిహిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి.‘‘త్వరలోనే కొంద మంది సీనియరల్ లెవల్ అధికారులకు స్వస్తి పలికేందుకు పీసీబీ సిద్ధమవుతోంది. అదే విధంగా భవిష్యత్తులో కొన్ని కఠినమైన నిబంధనలు రూపొందించాలనే యోచనలో ఉంది.చాలా మంది క్రికెటర్లు తమ భార్యాపిల్లల్ని మాత్రమే కాదు.. తమ తల్లిదండ్రులు, సోదరులు.. ఇతర బంధువర్గాన్ని కూడా తమతో పాటు విదేశాలకు తీసుకువెళ్లడమే గాకుండా.. టీమ్ హోటల్లోనే ఉంచారు.ఈ విషయం పట్ల చైర్మన్ పూర్తి అసంతృప్తితో ఉన్నారు. దీనికంతటికి కారణమైన సీనియర్ ఆఫీసర్లపై వేటు వేయాలని ఆయన యోచిస్తున్నారు.కేవలం టీ20 ప్రపంచకప్-2024లో పరాజయాల పట్ల మాత్రమే కాదు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాల్లో కూడా వెనుకబడటం పట్ల చైర్మన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’’ అని సదరు వర్గాలు వెల్లడించాయి.కాగా ప్రపంచకప్-2024లో అమెరికా వేదికగా లీగ్ మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్.. అమెరికా, టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత కెనడా, ఐర్లాండ్లపై గెలిచినా సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది.దీంతో బాబర్ ఆజం బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఐసీసీ టోర్నీ అన్న శ్రద్ధ లేకుండా కుటుంబాలతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్లినట్లు ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్లు చీవాట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. పాక్ భాగమైన గ్రూప్-ఏ నుంచి టీమిండియా, అమెరికా సూపర్-8కు చేరాయి. -
‘జట్టును సర్వనాశనం చేశారు.. వాళ్లను విడదీశారు’
టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్తో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-0తో ఓటమిపాలైంది. రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కాగా.. మిగిలిన రెండింటిలో బట్లర్ బృందం చేతిలో ఓడి సిరీస్ను చేజార్చుకుంది.కాగా వన్డే ప్రపంచకప్-2023లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే పాకిస్తాన్ నిష్క్రమించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కెప్టెన్ బాబర్ ఆజం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు.ఫలితంగా అతడి స్థానంలో టీ20లకు పేసర్ షాహిన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్ను కెప్టెన్లుగా నియమించింది అప్పటి పాక్ క్రికెట్ బోర్డు. అయితే, వీరిద్దరి సారథ్యంలో పాక్ ఆస్ట్రేలియా(టెస్టు), న్యూజిలాండ్(టీ20) వైట్వాష్కు గురైంది.తిరిగి కెప్టెన్గామరోవైపు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వన్డే, టీ20లకు బాబర్ ఆజం తిరిగి కెప్టెన్గా నియమితుడయ్యాడు. ప్రపంచకప్-2024లోనూ జట్టును ముందుండి నడిపించనున్నాడు.అయితే, అంతకంటే మందు మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్ చేతిలో పాక్ ఇలా పరాభావానికి గురైంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా మేనేజ్మెంట్ తీరుపై మండిపడ్డాడు. ప్రయోగాలకు పోయి జట్టును సర్వనాశనం చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు.ఇప్పటికే జట్టును సర్వనాశనం చేసేశారు‘‘ఇప్పటికైనా ప్రయోగాలు ఆపండి. సరైన కూర్పుతో జట్టును బరిలోకి దించండి. స్ట్రైక్రేటు అనే ఫోబియా నుంచి బయటపడండి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అంతగా దంచికొట్టే ఆటగాళ్లు లేరు.ఇప్పటికే జట్టును సర్వనాశనం చేసేశారు. అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ(బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్)ను విడదీశారు. మిడిలార్డర్లో ఎవరిని ఆడించాలో మీకే స్పష్టత లేదు.ఇద్దరు వికెట్ కీపర్లు ఎందుకు?ఆల్రౌండర్లందరినీ తెచ్చి మిడిలార్డర్లో కుక్కేశారు. ఇద్దరు వికెట్ కీపర్లు తుదిజట్టులో ఆడుతున్నారు. ఫాస్ట్ బౌలర్లను తరచూ మారుస్తున్నారు. మీ స్పిన్నర్లు బంతిని ఏమాత్రం స్పిన్ చేయడం లేదు.వాళ్లలో అసలు ఆత్మవిశ్వాసం కనబడటం లేదు. తుదిజట్టు నుంచి ఇమాద్ వసీం(స్పిన్నర్)ను ఎందుకు తప్పించారు?.. మిగతా వాళ్ల స్థానాల విషయంలోనూ క్లారిటీ లేదు. ఏదేమైనా టీ20 ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్కు ముందు జట్టును మొత్తం భ్రష్టుపట్టించారు’’ అని మాజీ బ్యాటర్ రమీజ్ రాజా పాక్ బోర్డు తీరును తూర్పారబట్టాడు.కాగా కివీస్తో టీ20 సిరీస్ సందర్భంగా సయీమ్ ఆయుబ్ను ఓపెనర్గా ప్రమోట్ చేసిన పీసీబీ.. బాబర్ను వన్డౌన్లో ఆడించింది. 21 ఏళ్ల ఆయుబ్ న్యూజిలాండ్తో సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం 52 పరుగులు చేశాడు. కాగా టీ20లలో పాక్ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా బాబర్- రిజ్వాన్ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్-2022లో 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక ఈ ఏడాది వరల్డ్కప్లో పాకిస్తాన్ జూన్ 6న యూఎస్ఏతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి టీమిండియాను జూన్ 9న ఢీకొట్టనుంది.చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ -
టీ20 వరల్డ్కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన..
అమెరికా, వెస్టిండీస్ల వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కింది. అయితే ఇంగ్లండ్తో నాలుగు మ్యాచ్ల సిరీస్కు ముందు జట్టు నుంచి రిలీజ్ అయిన పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. అదే విధంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లో పాక్ జట్టులో భాగమైన ఆల్ రౌండర్ సల్మాన్ అలీ అఘా,ఫాస్ట్ బౌలర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్లను సైతం ఈ పొట్టి ప్రపంచకప్నకు ఎంపిక చేయలేదు. అంతేకాకుండా ఈ మెగా టోర్నీకి పాక్ సెలక్షన్ కమిటీ రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం గమనార్హం. ఇక ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.టీ20 వరల్డ్కప్కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, ఉస్మాన్ ఖాన్ -
పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐ కండిషన్ ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్.. మెగా టోర్నీని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే కరాచీ, లాహోర్, రావల్పిండిలను వేదికలుగా ఖరారు చేసింది.అవకాశమే లేదుఈ నేపథ్యంలో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? అన్న సందేహాలు తలెత్తాయి. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత జట్టు పాక్లో పర్యటించే అవకాశమే లేదని విశ్లేషకులు అంటున్నారు.గతంలో ఆసియా వన్డే కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దక్కించుకున్నప్పటికీ.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా ఆసియా కప్లో భారత జట్టు తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడిన విషయం తెలిసిందే.బీసీసీఐ స్పందన ఇదేఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత ప్రభుత్వం ఎలా చెబితే మేము అలా నడుచుకుంటాం.కేంద్రం అనుమతినిస్తేనే టీమిండియాను పాకిస్తాన్కు పంపిస్తాం. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టే మేము ముందుకు వెళ్తాం’’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో రోహిత్ సేన విజేతగా నిలవగా.. శ్రీలంక రన్నరప్తో సరిపెట్టుకుంది.ఇక ఆఖరిసారి 2017లో నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్గా నిలిచిన పాకిస్తాన్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై ఈవెంట్ జరుగనుండటం బాబర్ ఆజం బృందానికి సానుకూలాంశంగా పరిణమించింది.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్#WATCH | Delhi: On the Champion Trophy to be held in Pakistan next year, BCCI vice-president Rajeev Shukla said, "In the case of the Champion Trophy, we will do whatever the Government of India will tell us to do. We send our team only when the Government of India gives us… pic.twitter.com/TeA3dZ5Twn— ANI (@ANI) May 6, 2024 -
ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలు ఖారారు. పాక్కు టీమిండియా వెళ్తుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ మెగా ఈవెంట్ను ఘనంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీకి పీసీబీ వేదికలను ఖారారు చేసింది. కరాచీ, లాహోర్,రావల్పిండిలలో మ్యాచ్లను నిర్వహించినున్నట్లు పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే భారత జట్టు విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఆసియాకప్-2023లో పాల్గోనందుకు పాకిస్తాన్కు తమ జట్టును పంపించేందుకు నిరాకరించిన బీసీసీఐ.. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా టీమిండియా పాకిస్తాన్లో పర్యటించే అవకాశము లేనుందన.. ఈ మెగా టోర్నీ ఆసియా కప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్ లోనే జరిగే ఛాన్స్ ఉంది."ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ షెడ్యూల్ను ఖరారు చేశాం. షెడ్యూల్ను ఐసీసీకి పంపించాం. ఐసీసీ భద్రతా బృందంతో మేము సమావేశమయ్యాం. ఈ మీటింగ్ బాగా జరిగింది. పాక్లో టోర్నీ ఏర్పాట్లను వాళ్లు పరిశీలించారు. వారితో స్టేడియం అప్గ్రేడ్ ప్లాన్లను కూడా పంచుకున్నాం. ఈ టోర్నీని మేము విజయవంతంగా నిర్వహిస్తామని నమ్మకం మాకు ఉందని" పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు.కాగా ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనుంది. చివరిసారిగా 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. -
పాకిస్తాన్ బ్యాటర్కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!?
పాకిస్తాన్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ హరీస్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఊహించని షాకిచ్చింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో పాల్గోనేందుకు ఢాకాకు వెళ్లిన హరీస్కు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసి) ఇచ్చేందుకు పీసీబీ నిరాకరించింది. దీంతో అతడు ఢాకా విమానాశ్రయం నుంచే స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. లగేజీ ఫోటోలను షేర్ చేస్తూ బ్యాక్ టూ హోమ్ అని రాసుకొచ్చాడు. అయితే పీసీబీ రూల్స్ ప్రకారం.. ఆ దేశ క్రికెటర్లు రెండు విదేశీ లీగ్లు ఆడేందుకు మాత్రమే అర్హులు. కానీ హ్యారీస్ ఇప్పటికే రెండు ఫ్రాంచైజీ లీగ్లు ఆడాడు. ఈ క్రమంలోనే మూడో లీగ్లో ఆడేందుకు అతడికి పీసీబీ ఎన్ఓసి జారీ చేయలేదు. కాగా బీబీఎల్లో చట్టోగ్రమ్ ఛాలెంజర్స్ తరఫున ఆడాల్సి ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును తప్పుబడుతున్నారు. ఎన్ఓసి విషయం అతడికి ముందే చెప్పి ఉంటే ఢాకా వరకు వెళ్లే వాడు కాదు కదా అంటూ మండిపడుతున్నారు. కాగా పాక్ తరపున ఇప్పటివరకు 9 టీ20లు ఆడిన మహ్మద్ హరీస్.. 126 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! Mohammad Haris had asked the Pakistan Cricket Board for a NOC and was told to go to Bangladesh for the BPL. He arranged for a flight on 17th January and was told by PCB that they will give him the NOC on 18th January. After arriving in Bangladesh, the PCB refused to give him a… pic.twitter.com/YuT70wZv7J — Saj Sadiq (@SajSadiqCricket) January 21, 2024 -
ఆసీస్తో తొలి టెస్ట్.. పాక్ జట్టు ప్రకటన.. ఇద్దరు కొత్త ఆటగాళ్ల ఎంట్రీ
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ అరంగ్రేటం చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆల్రౌండర్ ఆమిర్ జమాల్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ తమ తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నారని పీసీబీ పేర్కొంది. జమాల్ గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పాక్కు తొలిసారి ప్రాతినిథ్యం వహించగా.. ఖుర్రమ్ షెహజాద్ ఏ ఫార్మాట్లో అయిన జాతీయ జట్టుకు ఆడటం ఇదే తొలిసారి. మరోవైపు ఆల్రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఏడాది తర్వాత తిరిగి పాక్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోగా.. పాక్ తమ ఫస్ట్ ఛాయిస్ వికెట్కీపర్గా మొహమ్మద్ రిజ్వాన్ను కాదని సర్ఫరాజ్ అహ్మద్వైపే మొగ్గు చూపింది. ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హాక్, అబ్దుల్లా షఫీక్లను కొనసాగించిన పాక్ మేనేజ్మెంట్.. వన్ డౌన్లో నయా కెప్టెన్ షాన్ మసూద్, ఆతర్వాతి స్థానంలో తాజా మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్ బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. 🚨 Playing XI for first Test 🚨 Aamir Jamal and Khurram Shahzad are set to make their Test debut 👏#AUSvPAK pic.twitter.com/4GqRRKZC6J — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2023 ఐదో స్థానంలో సౌద్ షకీల్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. పేస్ అటాక్ను షాహీన్ అఫ్రిది లీడ్ చేయనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ గాయపడటంతో సల్మాన్ అలీ అఘా ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్ రేపటి నుంచి పెర్త్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. వరల్డ్కప్ వైఫల్యాల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో షాన్ మసూద్ పాక్ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్గా మసూద్కు ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం. ఆసీస్తో తొలి టెస్ట్కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్ ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్వుడ్. -
పాకిస్తాన్ పొమ్మంది.. సల్మాన్ బట్కు అఫ్గానిస్తాన్ బంపరాఫర్!?
భారత పర్యటనకు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ను నియమించాలని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఆర్వై న్యూస్ రిపోర్టు ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) తమ సీనియర్ పురుషుల జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గా బాధ్యతలు చేపట్టాలని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏసీబీ ప్రతిపాదనను అతడు అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. భారత పర్యటనలో భాగంగా అఫ్గానిస్తాన్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 24 గంట్లలోనే వేటు.. కాగా ఇటీవల పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సల్మాన్ బట్ ఎంపికయ్యాడు. అయితే అతడిని సెలక్షన్ ప్యానల్ కన్సల్టెంట్ మెంబర్గా నియమించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ఆటగాడిని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా నియమిస్తారని ఆ దేశ మాజీ ఆటగాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పాకిస్తాన్ ఛీప్ సెలక్టర్ వహాబ్ రియాజ్.. 24 గంటలు తిరగకముందే సల్మాన్ను తన పదవి నుంచి తప్పించాడు. చదవండి: National T20 Cup: దురదృష్టం అంటే నీదే భయ్యా.. పాపం ఎవరికీ ఈ కష్టం రాకూడదు! -
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం.. సల్మాన్ భట్పై వేటు
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన సల్మాన్ బట్ను 24 గంటల తిరగక ముందే ఛీఫ్ సెలక్టర్ వాహబ్ రియాజ్ తొలిగించాడు. వహాబ్ రియాజ్ సెలక్షన్ ప్యానల్ కన్సల్టెంట్ మెంబర్గా సల్మాన్ భట్ను నియమించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఆ దేశమాజీ క్రికెటర్ల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ఆటగాడిని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే భట్ను కన్సల్టెంట్ పదవి నుంచి రియాజ్ తొలిగించాడు. "సల్మాన్ భట్ను కన్సల్టెంట్గా ఎంపిక చేసిన తర్వాత నాపై విమర్శల వర్షం కురిస్తోంది. సల్మాన్ గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే నా నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాను. నేను ఇప్పటికే సల్మాన్ బట్తో మాట్లాడాను. నా టీమ్ నుంచి అతడిని తొలిగించానని చెప్పాను. కొన్ని మీడియా సంస్థలు ఆసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. మేము పారదర్శకంగా జాకా అష్రఫ్ అధ్యక్షతన పని చేస్తున్నామని" విలేకురల సమావేశంలో రియాజ్ పేర్కొన్నాడు. కాగా 2010లో పాకిస్తాన్ క్రికెట్ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో సల్మాన్ భట్ కూడా ఉన్నాడు. అతడిపై ఐదేండ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. తిరిగి అతడు 2016లో క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. పాకిస్తాన్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 33 టీ20లు ఆడిన భట్.. తన కెరీర్లో 5,209 పరుగులు సాధించాడు. Salman Butt is sacked by Wahab Raiz. pic.twitter.com/qIbppFPKt6 — ZAINI💚 (@ZainAli_16) December 2, 2023 -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. చీఫ్ సెలక్టర్గా దిగ్గజ బౌలర్
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్గా మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలియజేసింది. ఇంజమామ్-ఉల్-హక్ స్ధానాన్ని రియాజ్ భర్తీ చేయనున్నాడు. వన్డే వరల్డ్కప్-2023కు ముందు పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఇంజమామ్.. వ్యక్తిగత కారణాలతో టోర్నీ మధ్యలోనే తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే రియాజ్కు పీసీబీ సెలక్షన్ కమిటీ చైర్మెన్ బాధ్యతలు అప్పగించింది. వచ్చె నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్తో పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్గా రియాజ్ ప్రయాణం ప్రారంభం కానుంది. అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్లకు జట్టును ఎంపిక చేయనుంది. కాగా వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం తర్వాత విదేశీ కోచ్లను పీసీబీ తొలిగించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ డైరక్టర్గా పనిచేసిన మిక్కీ అర్ధర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కిల్పై వేటు వేసింది. దీంతో తమ జట్టు క్రికెట్ డైరక్టర్ బాధ్యతలు మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్కు పీసీబీ అప్పగించింది. బౌలింగ్ కోచ్గా ఉమర్ గుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాతో ఫైనల్.. వక్ర బుద్ధి చూపించిన పాక్ క్రికెటర్ Wahab Riaz opens up about his appointment as chief selector and outlines his priorities in this role 🎙️🏏 More details ➡️ https://t.co/3uhDwHUhIB pic.twitter.com/qfuv0Y9Bdm — Pakistan Cricket (@TheRealPCB) November 17, 2023 -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. మహ్మద్ హఫీజ్కు ప్రమోషన్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్కు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పగించింది. పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు డైరెక్టర్గా హాఫీజ్ను పీసీబీ నియమించింది. ఇప్పటివరకు ఆ జట్టు డైరెక్టర్గా పనిచేసిన మిక్కీ ఆర్థర్ స్ధానాన్ని హాఫీజ్ భర్తీ చేయనున్నాడు. కాగా ప్రపంచకప్లో ఘోర వైఫల్యంతో విదేశీ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలిగించింది. ఇప్పటికే మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేయగా.. తాజాగా మిక్కీ ఆర్థర్పై పీసీబీ వేటు వేసింది. ఈ క్రమంలోనే టెక్నికల్ కమిటీలో సభ్యునిగా ఉన్న హాఫీజ్కు టీమ్ డైరెక్టర్గా పీసీబీ ప్రమోషన్ ఇచ్చింది. అదేవిధంగా కొత్త కోచింగ్ స్టాప్ను పీసీబీ త్వరలోనే ప్రకటించనుంది. మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. పాకిస్తాన్ కోచింగ్ స్టాఫ్ పోర్ట్ఫోలియోను పీసీబీ మార్చింది. ప్రస్తుతం ఉన్న కోచ్లు అందరూ కూడా నేషనల్ క్రికెట్ అకాడమీలో పనిచేస్తారు. వారిలో కొంతమందిని జట్టు కోసం ఎంపిక చేస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లకు త్వరలోనే మా కొత్త కోచింగ్ స్టాప్ను ప్రకటించనున్నామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ తరఫున హఫీజ్ 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్ల్లో కలిపి 12,780 పరుగులు చేయడంతోపాటు 253 వికెట్లు కూడా సాధించాడు. కాగా ఇప్పటికే పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. టీ20ల్లో పాకిస్తాన్ కొత్త కెప్టెన్గా షాహీన్ అఫ్రిది ఎంపిక కాగా.. టెస్టు సారథిగా షాన్ మసూద్ నియమితుడయ్యాడు. కాగా ఈ ఏడాది డిసెంబర్లో పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే హెడ్కోచ్ లేకుండానే ఆసీస్ పర్యటను పాక్ జట్టు వెళ్లనుంది. ఈ క్రమంలో జట్టు డైరక్టర్గా ఉన్న హఫీజ్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. చదవండి: World Cup 2023: ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్ -
వరల్డ్కప్లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్బై..!
వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ రేసు నుంచి పాకిస్తాన్ నిష్కమ్రిచించడం దాదాపు ఖాయమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో టాస్ ఓడిపోవడంతో పాక్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. న్యూజిలాండ్ను అధిగమించి పాక్ సెమీస్కు వెళ్లాలంటే ఈ మ్యాచ్లో 287 పరుగులతో గెలవడం లేదంటే.. ఇంగ్లండ్ విధించిన ఎంతటి లక్ష్యాన్నైనా 2.5 ఓవర్లలోపు ఛేదించాలి. ఒక వేళ పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసి ఉంటే సెమీస్కు చేరే చిన్నపాటి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేయడంతో పాక్ సెమీస్కు చేరే దారులు మూసుకుపోయాయి. కాగా ఈ వరల్డ్కప్ ముగిసిన పాకిస్తాన్ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. జియో న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం.. తన స్వదేశానికి వెళ్లాక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్తో తన రాజీనామా విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఈ టోర్నీలో బాబర్ బ్యాటర్గా కాస్త పర్వాలేదనపించినా.. సారధిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని సొంత దేశ మాజీ ఆటగాళ్ల నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో వరల్డ్కప్లో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకోవాలని బాబర్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: IPL 2024: 'వరల్డ్కప్లో అదరగొట్టాడు.. కచ్చితంగా ఐపీఎల్లో కూడా ఆడుతాడు' -
పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం.. బాబర్ ఆజం ప్రైవేట్ చాట్ లీక్
వన్డే ప్రపంచకప్-2023లో వరుస ఓటములతో సతమతవుతున్న పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం చెలరేగింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓవో) మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అయింది. ఏం జరిగిందంటే? కాగా ఆఫ్గానిస్తాన్ చేతిలో ఘోర ఓటమిపాలైనంతరం పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఈ క్రమంలో కెప్టెన్ బాబర్ ఆజంను తన పదవి నుంచి తప్పిస్తారని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి కూడా ఆటగాళ్లకు ఎటువంటి సపోర్ట్ లేదని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్తో మాట్లాడేందుకు బాబర్ ఆజం ప్రయత్నిస్తున్నప్పటికీ అతడు నుంచి ఎటువంటి స్పందన లేదన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టాయి. తాజాగా ఇదే విషయంపై ఓ పాకిస్తానీ ఛానల్ ఇంటర్వ్యూలో పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ స్పందించాడు. ఈ వార్తలను అష్రప్ తొచిపుచ్చాడు. "బాబర్ నన్ను ఎప్పుడూ నేరుగా సంప్రదించలేదు. అతడు సాధారణంగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లేదా అంతర్జాతీయ క్రికెట్ డైరెక్టర్తో మాట్లాడతాడు" అని అష్రఫ్ పేర్కొన్నాడు. అంతటితో అగని అష్రప్.. తన వ్యాఖ్యలను సమర్ధిస్తూ బాబర్ ఆజం, పీసీబీ సీఓవో మధ్య జరిగిన వాట్సాప్ చాట్ను చూపించాడు. చాట్లో ఏముందంటే? ఇదే విషయంపై బాబర్ ఆజంతో సల్మాన్ నసీర్ వాట్సాప్లో చాట్ చేశాడు. ‘బాబర్.. నువ్వు ఫోన్, మెసేజ్ చేస్తే ఛైర్మన్ రెస్పాండ్ కావడం లేదని టీవీలలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నువ్వేమైనా ఆయనకు ఫోన్ చేశావా..?’ అని నసీర్ అడిగాడు. అందుకు బదలుగా బాబర్.. ‘సలామ్ సల్మాన్ భాయ్, నేను సార్ కు ఫోన్ చేయలేదు..’అని రిప్లై ఇచ్చినట్లు ఆ చాట్లో ఉంది. కాగా ఒక చైర్మెన్ స్ధాయిలో ఉండి కెప్టెన్ ప్రైవేట్ చాట్ను లీక్ చేసిన అష్రప్పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మండి పడుతున్నారు. ఆ జట్టు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ స్పందిస్తూ.. . ‘అసలు ఏం చేద్దామని చూస్తున్నారు? ఇది చాలా దారుణం. మీరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండి ఉంటారు. బాబర్ ఆజమ్ని వదిలేయండి. అతను పాకిస్తాన్ క్రికెట్కి ఓ విలువైన ఆస్తి" అంటూ ట్విట్ చేశాడు. చదవండి: CWC 2023: పాకిస్తాన్ క్రికెట్కు భారీ షాక్ -
ఐదు నెలలుగా పాక్ ఆటగాళ్లకు జీతాలు లేవు.. ఎలా ఆడుతారు మరి?
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ వరుసగా నాలుగో మ్యాచ్లో ఓటమి చవిచూసింది. ధర్మశాల వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో పాక్ ఓటమి పాలైంది. దీంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యాయి. కాగా ఈ మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడింది. కానీ చివరకు విజయం మాత్రం ప్రోటీస్నే వరించింది. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచ్ల్లో గెలిచినా పాక్ సెమీస్ చేరే అవకాశం ఐదు శాతమే ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఐదు నెలలుగా ఆటగాళ్లకు జీతం చెల్లించడం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జీతాలు చెల్లించడం లేదని లతీఫ్ ఆరోపించాడు. అదే విధంగా పీసీబీ నుంచి ఆటగాళ్లకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా అంతకుముందు పాక్ డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు ఉన్నాయని పాకిస్తాన్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీటీవీతో లతీఫ్ మాట్లాడుతూ.. “పాకిస్తానీ మీడియాలో చాలా విషయాలు చక్కెర్లు కొడుతున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలే. మీకు అస్సలు నిజాలను నేను చెబుతాను. గత రెండు రోజులుగా పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్తో మాట్లాడేందుకు బాబర్ ఆజం ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడు స్పందించడం లేదు. బాబర్ పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్, డైరెక్టర్ ఉస్మాన్ వాల్హాలకు కూడా ఆజం మెసేజ్ చేశాడు. వారు కూడా అతడికి రిప్లే ఇవ్వలేదు. అస్సలు కెప్టెన్ కాల్ చేస్తే ఎందుకు స్పందించడం లేదు? అందుకు కారణం ఏమిటి? పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఏదో జరుగుతోంది" అంటూ పేర్కొన్నాడు. అదే విధంగా ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు గురించి లతీప్ మాట్లాడుతూ.. "వరల్డ్కప్కు ముందు ఆటగాళ్లు సంతకం చేసిన సెంట్రల్ కాంట్రాక్టులను పునఃపరిశీలిస్తామని పీసీబీ చెప్పింది. దీంతో సెంట్రల్ కాంట్రాక్ట్ల ఒప్పందం ఇంకా ఒక కొలిక్కి కాలేదు. ఈ క్రమంలో గత ఐదు నెలలుగా ఆటగాళ్లకు జీతాలు అందలేదు. అటువంటిప్పుడు వారు ఎలా ఆడుతారు? నేను ఈ విషయాన్ని మరి పెద్దది చేయాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్లో ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెట్బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్లను ఇచ్చింది. మెన్స్ టీమ్లోని క్రికెటర్లతో మూడేళ్ల ఒప్పందానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ద్వారా లభించే ఆదాయంలో మూడు శాతం మేర చెల్లించేందుకు అంగీకరించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని పునఃపరిశీలిస్తామని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: World Cup 2023: ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. వరల్డ్కప్ అరంగేట్రంలోనే! -
అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. పాకిస్తాన్ కెప్టెన్పై వేటు!
వన్డే ప్రపంచకప్-2023లో ఆఫ్గానిస్తాన్ చేతిలో పాకిస్తాన్కు ఘోర పరాభావం ఎదురైన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ చిత్తు చేసింది. అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గాన్ చేతిలో పాక్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ ఓటమిని పాకిస్తాన్ అభిమానులతో పాటు మాజీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. అంతకుముందు టీమిండియా చేతిలో కూడా పాక్ జట్టు ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు వేయాలని పీసీబీ ఆలోచిస్తున్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. వరల్డ్కప్ తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చాక పీసీబీ తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. బాబర్ స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్, ముహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిది పేర్లను పీసీబీ మేనెజ్మెంట్ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు ముందే పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాగా మెగా టోర్నీలో వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదనపిస్తున్న బాబర్.. కెప్టెన్సీ పరంగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడి వేటు వేయాలని పీసీబీ ఆలోచిస్తోంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
ఆసియాకప్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం.. మాజీ కెప్టెన్కు!
పీసీబీ చైర్పర్సన్గా జాకా అష్రాఫ్ నియమితులైన తర్వాత పాక్ క్రికెట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మిస్బా ఉల్ హక్, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ హఫీజ్లతో కూడిన క్రికెట్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసిన అష్రాష్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్కు మరోసారి పాకిస్తాన్ ఛీప్ సెలక్టర్ బాధ్యతలు అప్పజెప్పాలని అష్రాఫ్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో 2016 నుంచి 2019 వరకు పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ చైర్మెన్గా ఇంజామామ్ పనిచేశాడు. ఈ మెరకు త్వరలో జరగనున్న క్రికెట్ టెక్నికల్ కమిటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛీప్గా నజామ్ సేథీ ఉన్న సమయంలో ఆ జట్టు కోచ్లు మిక్కీ ఆర్థర్,బ్రాడ్బర్న్, డేటా ఎనలిస్ట్ హసన్ చీమాకు కూడా పాకిస్తాన్ సెలక్షన్ కమిటీలో భాగమయ్యారు. ఇప్పుడు వారిని సెలక్షన్ కమిటీలో కొనసాగించాలా లేదా అన్నది కూడా క్రికెట్ టెక్నికల్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెలక్షన్ ప్యానల్లో హెడ్ కోచ్ ఉండాలా లేదా అన్నది పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో కూడా ఈ టెక్నికల్ కమిటీ చర్చించనుంది. ఆసియాకప్కు జట్టు ఎంపిక ముందు కొత్త సెలక్షన్ ప్యానల్ను ఖారారు చేసే అవకాశం ఉంది. చదవండి: IND vs WI: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు బిగ్షాక్! కెప్టెన్ దూరం -
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై
పాకిస్తాన్ మహిళా స్టార్ క్రికెటర్ ఆయేషా నసీమ్ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్కు ఆయేషా నసీమ్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించింది. 18 ఏళ్లకే ఆమె క్రికెట్కు గుడ్బై చెప్పడం గమనార్హం. ఇస్లాం మతంకు అనుగుణంగా మరింత పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆమె తన నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేసింది. ఆయేషా నసీమ్ 2020లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. తన కెరీర్లో 33 టీ20లు, 3 వన్డేలు ఆడిన నసీమ్.. వరుసగా 369,33 పరుగులు సాధించింది. ఆయేషా నసీమ్ చివరగా పాకిస్తాన్ తరపున ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్పై ఆడింది. అదే విధంగా ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టుపై నసీమ్ 45 పరుగులు సాధించింది. ఆమె టీ20 కెరీర్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆయేషా నసీమ్ హిట్టింగ్ చేసే సత్తా కూడా ఉంది. అటువంటి ఆయేషా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. చదవండి: ఇదేమి ఔట్రా అయ్యా.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్ -
PCB: పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా జకా ఆష్రఫ్ నియామకం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా జకా ఆష్రఫ్ నియమితుడయ్యాడు. పది మంది సభ్యులతో కూడిన కమిటీకి అతడు నేతృత్వం వహించనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం నియామకాలు జరిపినట్లు పీసీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా జకా ఆష్రఫ్ సారథ్యంలోని ఈ కమిటీ నాలుగు నెలల పాటు అధికారంలో కొనసాగనుంది. ఇందులో నలుగురు రీజినల్ రిప్రెజెంటేటివ్స్, నలుగురు సర్వీస్ రిప్రెజెంటేటివ్స్, ప్రధాని చేత నామినేట్ చేయబడిన ఇద్దరు సభ్యులకు చోటు ఉంటుంది. ఈ నేపథ్యంలో జకా ఆష్రఫ్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇప్పుడు అధికారికంగా పీసీబీ చైర్మన్గా ఎన్నికయ్యాను. రానున్న కాలంలో పీసీబీలో సానుకూల మార్పులు తీసుకురాగలనని ఆ దేవుడి సాక్షిగా చెబుతున్నా’’ అంటూ తన నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫొటోను షేర్ చేశాడు. కాగా ఆసియాకప్, వన్డే వరల్డ్కప్ టోర్నీలు సమీపిస్తున్న తరుణంలో కొత్త కమిటీ గురువారమే లాహోర్లో సమావేశం కానుంది. I have Officially Joined PCB as Chairman. Alhamdulillah, You will have Positives Changes in the PCB Upcoming Days In Sha Allah✌️💯. #ZakaAshraf pic.twitter.com/h6rRGkjlKm — Chaudhry Zaka Ashraf (@IZakaAshraf) July 5, 2023 -
పాకిస్తాన్కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
పాకిస్తాన్ స్టార్ మహిళా క్రికెటర్ నహిదా ఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్కు నహిదా ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించింది. 2009లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నహిదా ఖాన్ 100కి పైగా మ్యాచ్లు ఆడింది. అదే విధంగా అంతర్జాతీయ వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డు నహిదా ఖాన్ పేరిటే ఉంది. 2018లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో నహిదా ఏకంగా నాలుగు క్యాచ్లు అందుకుంది. పాకిస్తాన్ తరపున 66 వన్డేలు, 54 టీ20లు ఆడిన నహిదా.. వరుసగా 1410, 604 పరుగులు చేసింది. 36 ఏళ్ల నహిదా మూడు వన్డే ప్రపంచకప్లు(2013, 2017, 2022), నాలుగు టీ20 ప్రపంచకప్లలో (2012, 2014, 2016 ,2018) పాకిస్తాన్ తరపున ఆడింది. ఇక 14 ఏళ్ల ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, పాక్ క్రికెట్ బోర్డుకు నహిదా ధన్యవాదాలు తెలిపింది. ఇక నహిదా ఖాన్ నిర్ణయంపై పాకిస్తాన్ ఉమెన్స్ క్రికెట్ హెడ్ తానియా మల్లిక్ స్పందించింది. పాకిస్తాన్ క్రికెట్కు నహిదా ఖాన్ అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనవి అని తానియా పేర్కొంది. ఎంతో మంది యువ క్రికెటర్లకు నహిదా ఆదర్శంగా నిలిచిందని ఆమె తెలిపింది. చదవండి: #DevonConway: 'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం' -
అలా సెలెక్టర్ అయ్యాడో లేదో రిటైర్మెంట్ ఇచ్చాడు
పాకిస్తాన్ వికెట్ కీపర్ క్రమాన్ అక్మల్ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్బై చెప్పాడు. ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ జాతీయ సెలెక్షన్ కమిటీకి ఎంపికైన కమ్రాన్ అక్మల్ తాజాగా రిటైర్మెంట్ ఇవ్వడం ఆసక్తిని సంతరించుకుంది. ఇక పీఎస్ఎల్లో తాను ప్రాతినిధ్యం వహించిన పెషావర్ జాల్మీ జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నాడు. ఇక కమ్రాన్ అక్మల్ 2002లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 15 ఏళ్ల పాటు పాక్ జట్టు తరపున ఆడిన కమ్రాన్ ఫ్రంట్లైన్ వికెట్ కీపర్గా పనిచేశాడు. ఓవరాల్గా పాకిస్తాన్ తరపున 157 వన్డేల్లో 3236 పరుగులు, 53 టెస్టుల్లో 2648 పరుగులు, 58 టి20ల్లో 987 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లో ఐదు సెంచరీలు, టెస్టుల్లో ఆరు సెంచరీలు బాదాడు. 2009లో టి20 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో కమ్రాన్ అక్మల్ సభ్యుడిగా ఉన్నాడు. 2010లో పాకిస్తాన్ టెస్టు జట్టుకు వైస్కెప్టెన్గా ఎంపికైనప్పటికి.. కొన్ని రోజుల్లోనే స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఆరోపణలు రావడంతో వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారు. అలా రెండేళ్ల పాటు ఆటకు దూరమైన కమ్రాన్ అక్మల్ తిరిగి 2012లో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు దూసుకురావడంతో కమ్రాన్కు క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. 2017లో వెస్టిండీస్తో జరిగిన టి20 మ్యాచ్ కమ్రాన్ అక్మల్కు చివరిది. ఇక ఐపీఎల్ తొలి ఎడిషన్లో కమ్రాన్ అక్మల్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్లో 2016 నుంచి 2022 వరకు పెషావర్ జాల్మీ తరపున ప్రాతినిధ్యం వహించిన కమ్రాన్ 2017 సీజన్లో లీగ్లో తొలి సెంచరీ అందుకున్నాడు. ఇక ఆ సీజన్లో కమ్రాన్ అక్మల్ నుంచి మంచి ప్రదర్శన రాగా.. జట్టు కూడా ఫైనల్ వరకు వెళ్లగలిగింది. చదవండి: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!' రెండు దేశాల తరపున సెంచరీ.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు -
మళ్లీ పాకిస్తాన్ తరపున ఆడాలనుకుంటున్నాను: మహ్మద్ అమీర్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్.. మళ్లీ జాతీయ జట్టు తరపున రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజాతో విభేదాల కారణంగా 2020లో అంతర్జాతీయ క్రికెట్కు అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు పీసీబీ కొత్త చైర్మన్గా రమీజ్ రాజా స్థానంలో నజం సేథీ బాధ్యతలు చేపట్టడంతో అమీర్ జట్టులోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు. కాగా సేథీ కూడా అమీర్ను మళ్లీ తమ జట్టులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో లాహోర్లోని నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందేందుకు అమీర్ పీసీబీ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమీర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మళ్లీ పాకిస్తాన్ జెర్సీ ధరించేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు అమీర్ తెలిపాడు. ఈ మేరకు.. "అల్లా దయ వుంటే మళ్లీ నేను పాకిస్తాన్ తరపున ఆడతాను. నేను పాకిస్తాన్ సూపర్ లీగ్లో అద్భుతంగా రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి రావడమే నా లక్ష్యం" అని అమీర్ పేర్కొన్నాడు. ఇక అమీర్ 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20ల్లో పాకిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: Shahid Afridi: పీసీబీ చీఫ్ సెలెక్టర్గా అఫ్రిది మంగమ్మ శపథం -
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన పాకిస్తాన్ స్టార్ ఆటగాడు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ అజహర్ అలీ అంతర్జాతీయ క్రికెట్లో అన్నిరకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న అజర్ ఆలీ తాజాగా టెస్టు క్రికెట్కు గుడ్బై చేప్పేశాడు. శుక్రవారం విలేకురుల సమావేశంలో అజర్ ఆలీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కరాచీ వేదికగా ఇంగ్లాండ్తో జరిగే మూడో టెస్టు అనంతరం టెస్టుల నుంచి ఆలీ తప్పుకోనున్నాడు. 2010లో టెస్టుల్లో అంతర్జాతీయ ఆలీ ఆరంగ్రేటం చేశాడు. 12 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు పాకిస్తాన్ క్రికెట్కు ప్రాతినిథ్యం వహించిన ఆలీ.. 95 టెస్టుల్లో 42.60 సగటుతో 7030 పరుగులు చేశాడు. 2016లో వెస్టిండీస్పై పింక్ బాల్ టెస్టులో ఆలీ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాదించాడు. అదే విధంగా పాకిస్తాన్ టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్ రన్ స్కోరర్ జాబితాలో అజహర్ ఆలీ ఐదో స్థానంలో ఉన్నాడు. "నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్తో నా 12 ఏళ్ల బంధానికి ముగింపు పలకాల్సి రావడం చాలా బాధగా ఉంది. నేను బాగా ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాడు. నీను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, నా కుటంబ సభ్యలకు, పాకిస్తాన్ క్రికెట్కు అభినందనలు తెలియజేయాలి అనుకుంటున్నాను" ఆలీ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు! -
అతడు మసాజ్ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తన ఆత్మకథ సుల్తాన్-ఎ-మొమొయర్ ద్వారా మరో బాంబ్ను పేల్చాడు. తన కెరీర్ ప్రారంభంలో సహచర ఆటగాడు సలీమ్ మాలిక్ తన పట్ల అమానవీయంగా ప్రవర్తించాడని అక్రమ్ ఆరోపించాడు. మాలిక్ తనను ఒక బానిసలా చూసేవాడని అక్రమ్ వెల్లడించాడు. కాగా సలీమ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన ఇచ్చిన రెండేళ్ల తర్వాత 1984లో వసీమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా మాలిక్ సారథ్యంలో 1992-1995 కాలంలో అక్రమ్ 12 టెస్టులు, 34 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో జీవితకాలం నిషేధం విధించబడింది. "సలీమ్ మాలిక్ చాలా స్వార్ధపరుడు. అతడు తన సీనియారిటీ నాపై ఉపయోగించేవాడు. నన్ను అతడి సేవకుడిలా చేసుకున్నాడు. నేను అతడికి మసాజ్ చేయాలని డిమాండ్ చేసేవాడు. అదే విధంగా తన బట్టలు, బూట్లు శుభ్రం చేయమని నన్ను ఆదేశించేవాడు. నా సహచర ఆటగాళ్లు రమీజ్, తాహిర్, మొహ్సిన్, షోయబ్ మొహమ్మద్ నన్ను నైట్క్లబ్లకు పిలిచే వారు. ఆ సమయంలో వాళ్లపై చాలా కోపం వచ్చేది" అని తన ఆత్మకథలో అక్రమ్ రాసుకున్నాడు. కాగా గతంలో సలీమ్ మాలిక్ కూడా చాలా సార్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్పై తీవ్రమైన వాఖ్యలు చేశాడు. నన్ను అసలు కెప్టెన్గా కొంచెం కూడా గౌరవించకపోయే వారని చాలా సందర్భాల్లో మాలిక్ తెలిపాడు. చదవండి: Wasim Akram Rehab Experience: 'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే' -
T20 World Cup 2022: భారత్తో తొలి మ్యాచ్.. పాకిస్తాన్కు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2022కు పాకిస్తాన్కు గుడ్ న్యూస్ అందింది. గాయంతో బాధపడుతన్న ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ పూర్తిగా కోలుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు జమన్ మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో అతడిని టీ20 ప్రపంచకప్కు రిజర్వ్ ఆటగాడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. అయితే ఇప్పడు జమాన్ పూర్తిగా గాయం నుంచి కోలుకుకోవడంతో.. 15 మంది ఆటగాళ్లతో కూడిన పాక్ టీ20 ప్రపంచకప్ జట్టులో చేరాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్కు ఎంపికైన స్పిన్నర్ ఉస్మాన్ ఖాదిర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనందున అతడిని రిజర్వ్ జాబితాలో పీసీబీ చేర్చింది. సెప్టెంబర్ 25న ఇంగ్లండ్తో టీ20 మ్యాచ్లో ఉస్మాన్ ఖాదిర్ బోటనవేలుకు గాయమైంది. ఇక లండన్లో చికిత్స పొందిన ఫఖర్ జమాన్.. స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదితో కలిసి శనివారం ఆస్ట్రేలియాకు చేరుకోనున్నాడు. కాగా ఆఫ్రిది కూడా తన మోకాలి గాయానికి లండన్లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్, ఆఫ్గానిస్తాన్తో జరిగే రెండు ప్రాక్టీస్ మ్యాచ్లకు వీరిద్దరూ జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉంటారు. ఇక ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లో టీమిండియాతో ఆక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా తలపడనుంది. చదవండి: T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు -
పాకిస్తాన్ పర్యటనకు రానున్న కివీస్.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది డిసెంబర్లో న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ద్వైపాక్షిక సిరీస్లో తలపడేందుకు కివీస్ జట్టు.. రెండు సార్లు పాకిస్తాన్కు రానుంది. తొలి దశ పర్యటనలో భాగంగా పాక్తో విలియమ్సన్ సేన రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్లలో తలపడనుంది. డిసెంబర్ 27న కరాచీ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో న్యూజిలాండ్ పర్యటన ప్రారంభం కానుంది. అదే విధంగా వచ్చే ఏడాది జనవరిలో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్లో మరోసారి కీవిస్ జట్టు పాక్ టూర్కు రానుంది. రెండో దశ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేల సిరీస్లో పాక్తో కివీస్ ఆడనుంది. కాగా గతేడాది పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. భద్రతా కారణాల దృష్ట్యా అఖరి నిమిషంలో వన్డే సిరీస్ను రద్దు చేసుకుంది. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో ట్రై సిరీస్లో పాకిస్తాన్ తలపడుతోంది. చదవండి: IND vs WA-XI: నిరాశ పరిచిన రోహిత్.. మరోసారి చెలరేగిన సూర్య కుమార్ -
'నేను మూడేళ్ల క్రితమే చెప్పాను.. పాకిస్తాన్కు ఈ పరిస్థితి వస్తుందని'
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆ దేశ క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదని బట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఆదివారం (సెప్టెంబర్ 11) దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బట్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "పాక్ సరైన యువ ఆటగాళ్లను తాయారు చేయాల్సిన అవసరముందని నేను మూడేళ్ల క్రితమే చెప్పాను. ప్రస్తుతం జట్టు కూర్పు అస్సలు బాగోలేదు. పాక్ మిడాలర్డర్లో సరైన ఆటగాళ్లు లేరు. జట్టు మేనేజ్మెంట్ సీనియర్ ఆటగాళ్లకు ఇచ్చిన అవకాశాలు యువ క్రికెటర్లకు ఇవ్వడం లేదు. అసలు పాకిస్తాన్ ప్రణాళికలు ఎంటో నాకు ఆర్ధం కావడం లేదు. అదే విధంగా ఆసియాకప్లో ఓటమి అనంతరం రిపోర్టర్లు హెడ్కోచ్ను ఎందుకు సరైన ప్రశ్నలు అడగలేదో నాకు తెలియదు. భారత్తో జరిగిన మ్యాచ్లో నవాజ్ అద్భుమైన బ్యాటింగ్ చేశాడు. ఆతర్వాతి మ్యాచ్లో అతడిని ఎందుకు ఆ స్థానంలో బ్యాటింగ్కు ఎందుకు రాలేదు? నసీమ్ షా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అటువంటి అప్పడు అతడితో ముందు తన నాలుగు ఓవర్ల కోటాను ఎందుకు పూర్తి చేయంచరు..? ఇటువంటి ఎన్నో తప్పులు ఆసియాకప్లో పాక్ చేసింది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Shahid Afridi: 'కోహ్లి రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం'.. మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
ఉత్కంఠ పోరులో భారత్పై విజయం.. సంబరాల్లో మునిగి తేలిన పాక్ ఆటగాళ్లు!
ఆసియాకప్-2022లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా భారత్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. మరో బంతి మిగిలూండగానే చేధించింది. కాగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో విజయం సాధించగానే పాక్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో పాక్ ఆటగాళ్లు అఖరి ఓవర్ జరుగుతున్న క్రమంలో చాలా టెన్షన్ పడుతూ కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజం అయితే డ్రెస్సింగ్ రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా భారత్ తమ తదుపరి మ్యాచ్లో సెప్టెంబర్ 6న శ్రీలంకతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ఫైనల్కు చేరాలంటే శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ జట్లపై ఖచ్చితంగా విజయం సాధించాలి. The raw emotions, the reactions and the celebrations 🤗 🎥 Relive the last over of Pakistan's thrilling five-wicket win over India from the team dressing room 👏🎊#AsiaCup2022 | #INDvPAK pic.twitter.com/xHAePLrDwd — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2022 చదవండి: Asia Cup 2022 - Ind Vs Pak: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! -
ఆసియాకప్కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం!
ఆసియాకప్-2022కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం తమ జట్టు అసిస్టెంట్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఉమర్ రషీద్ను యూఏఈకు పీసీబీ పంపించింది. రషీద్ ప్రస్తుతం.. లాహోర్లోని నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో బౌలింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు. మొహమ్మద్ హస్నైన్ వంటి అత్య్తుత్తమ బౌలర్లను తయారు చేయడంలో రషీద్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ షాన్ టైట్తో కలిసి పనిచేయనున్నాడు. ఇక ఉమర్ రషీద్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో మిడిల్సెక్స్, సస్సెక్స్ జట్టుల తరపున ఆడాడు. కాగా ఆసియకప్కు ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా దూరమయ్యాడు . అతడి స్థానంలో పేసర్ మొహమ్మద్ హస్నైన్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఇక ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లో ఆగస్టు 28న భారత్తో తలపడనుంది. ఇక ఇప్పటికే యూఏఈకు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టాయి. ఆసియాకప్కు పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజం(కెప్టెన్), షాబాద్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్. చదవండి: Asia Cup 2022 Ind Vs Pak: బాబర్ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్! రషీద్తోనూ ముచ్చట! -
17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. షెడ్యూల్ విడుదల చేసిన పాకిస్తాన్!
17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో అడుగు పెట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా 7 టీ20లు, మూడు టెస్టుల సిరీస్లో అతిథ్య జట్టుతో ఇంగ్లండ్ తలపడనుంది. కాగా ఇప్పటికే టీ20 సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. తాజాగా టెస్టు సిరీస్ షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఇక ఇరు జట్లు మధ్య చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది. తొలి టెస్టుకు రావల్పిండి, రెండో టెస్టుకు మూల్తాన్ అతిథ్యం ఇవ్వనుండగా.. అఖరి టెస్టు కరాచీ వేదికగా జరగనుంది. అదే విధంగా పాకిస్తాన్ ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్2 వరకు జరగనుంది. ఈ సిరీస్లోని తొలి నాలుగు మ్యాచ్లు కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అఖరి మూడు టీ20లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అఖరి నిమిషంలో పాక్ పర్యటను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. అయితే టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు దుబాయ్లో సమావేశమయ్యారు. 2022 ఏడాదిలో ఇంగండ్ జట్టు పాక్లో పర్యటించి ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు ఇరు బోర్డులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంగ్లండ్ జట్టు పాక్ గడ్డపై అడుగు పెట్టనుంది. చదవండి: IND vs ZIM: మూడేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చేలరేగిన శుబ్మన్ గిల్ -
ఆసియా కప్కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. స్పీడ్ స్టార్ ఎంట్రీ!
ఆసియా కప్, నెదర్లాండ్స్తో వన్డే సిరీస్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్లను బుధవారం ప్రకటించింది. నెదర్లాండ్స్ సిరీస్తో పాటు ఆసియాకప్లో కూడా పాక్ జట్టుకు రెగ్యూలర్ కెప్టెన్ బాబర్ ఆజాం సారథ్యం వహించనున్నాడు. నెదర్లాండ్స్, ఆసియా కప్లకు రెండు వేర్వేరు జట్లను పాక్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక ఆ జట్టు యువ పేసర్ నసీమ్ షా పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ రెండు జట్లలో అతడికి చోటు దక్కింది. ఇప్పటి వరకు కేవలం టెస్టుల్లో మాత్రమే పాక్కు ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల నసీమ్ షా.. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. తన అరంగేట్ర టెస్టులోనే ఆస్ట్రేలియా బ్యాటర్లకు నసీమ్ చుక్కలు చూపించాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. కాగా నెదర్లాండ్ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ తలపడనుంది. రోటర్డ్యామ్ వేదికగా ఆగస్టు 16న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక నెదర్లాండ్తో వన్డే సిరీస్ అనంతరం ఆసియా కప్లో పాకిస్తాన్ పాల్గొనుంది. ఆసియా కప్లో భాగంగా పాక్ తమ తొలి మ్యాచ్లో ఆగస్టు 28 టీమిండియాతో తలపనుంది. ఇక ఆసియా కప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. The wait is finally over as the battle for Asian supremacy commences on 27th August with the all-important final on 11th September. The 15th edition of the Asia Cup will serve as ideal preparation ahead of the ICC T20 World Cup. pic.twitter.com/QfTskWX6RD — Jay Shah (@JayShah) August 2, 2022 నెదర్లాండ్స్తో వన్డేలకు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మెహమూద్ ఆసియా కప్కు పాక్ జట్టు బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ ,ఉస్మాన్ ఖదీర్ చదవండి: Asia Cup 2022 Schedule: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? 🇵🇰✈️ 🚨 Pakistan's squads for Netherlands ODIs and ACC T20 Asia Cup 🚨 Read more: https://t.co/CsUoxtXc1H#NEDvPAK | #AsiaCup2022 pic.twitter.com/4be4emR8Sy — Pakistan Cricket (@TheRealPCB) August 3, 2022 -
17 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు ఇంగ్లండ్.. షెడ్యూల్ విడుదల..!
17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా పాక్తో ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇరు జట్లు మధ్య టీ20 సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్2 వరకు జరగనుంది. ఈ సిరీస్లోని తొలి నాలుగు మ్యాచ్లు కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అఖరి మూడు టీ20లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఈ మ్యాచ్లు అన్నీ పాకిస్తాన్ కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అఖరి నిమిషంలో పాక్ పర్యటను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. ఇక టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు దుబాయ్లో సమావేశమయ్యారు. 2022 ఏడాది మధ్యలో ఇంగండ్ జట్టు పాక్లో పర్యటించి ఏడు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇరు బోర్డులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంగ్లండ్ జట్టు పాక్ గడ్డపై అడుగు పెట్టనుంది. చదవండి: Asia Cup 2022 Schedule: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? 🗓️ 𝐒𝐚𝐯𝐞 𝐭𝐡𝐞 𝐝𝐚𝐭𝐞𝐬 📢 Great news for fans as Pakistan are set to host England after 17 years! 📢 Read more: https://t.co/iyz8N2ZEMu#PAKvENG pic.twitter.com/WX0RkoOwWx — Pakistan Cricket (@TheRealPCB) August 2, 2022 -
పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్గా లెజెండరీ క్రికెటర్..!
పాకిస్తాన్ పూర్తి స్థాయి బ్యాటింగ్ కోచ్గా ఆ దేశ లెజెండరీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ను నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైంది. యూసుఫ్ ఎంపిక సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పీసీబీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా యూసుఫ్ ప్రస్తుతం నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు. పీసీబీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో తన బాధ్యతల నుంచి యూసుఫ్ వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో దశాబ్దానికి పైగా పాక్కు సేవలందించిన యూసఫ్.. ఇప్పడు జట్టులో కోచ్ పాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యాడు. వన్డే, టెస్టుల్లో పాక్ తరపున విజయవంతమైన ఆటగాళ్లలలో యూసఫ్ ఒకడు. 350 అంతర్జాతీయ మ్యాచ్ల్లో పాక్కు ప్రాతినిద్యం వహించిన యూసఫ్ 17000 పైగా పరుగులు సాధించాడు. అదే విధంగా టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 2006లో పాక్ తరపున అత్యధికంగా 1788 పరుగులు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 ముందు పాకిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా నియమితుడైన ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్తో కలిసి యూసఫ్ పనిచేయనున్నాడు. ఇక పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. తొలి టెస్టులో విజయం సాధించిన పాకిస్తాన్.. ఆదివారం జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది. చదవండి: Ind Vs WI 1st ODI: రుతురాజ్కు నో ఛాన్స్! ధావన్తో ఓపెనర్గా అతడే! ఇక ఫినిషర్గా ఎవరంటే.. -
వెస్టిండీస్తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. స్టార్ ఆటగాడు వచ్చేశాడు
స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును సోమవారం ప్రకటించింది. ఈ జట్టకు బాబర్ ఆజాం సారథ్యం వహించనున్నాడు. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్కు 21 మంది సభ్యులను ఎంపిక చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు .. ఈ సారి ఆ సంఖ్యను 16కు తగ్గించారు. దీంతో జట్టుకు ఆసిఫ్ అఫ్రిది, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఉస్మాన్ ఖాదిర్ వంటి ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక ఇరు జట్లు మధ్య తొలి వన్డే రావల్పిండి వేదికగా జూన్ 8న జరగనుంది. పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజాం(కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మహమూద్ చదవండి: IPL 2022: ప్లే ఆఫ్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయితే..? -
ఐసీసీ జనరల్ మేనేజర్గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్
ఐసీసీ క్రికెట్ జనరల్ మేనేజర్గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం ఖాన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం వెల్లడించింది. ఇక ఎనిమిదేళ్లపాటు జనరల్ మేనేజర్గా పనిచేసిన జియోఫ్ అల్లార్డిస్ ఇటీవల ఐసీసీ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్గా పదోన్నతి పొందాడు. అతడి స్ధానంలోనే వసీం ఖాన్ బాధ్యతలు చేపట్టాడు. వసీం ఖాన్ గతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, లీసెస్టర్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. ఇక జనరల్ మేనేజర్గా నియమితుడైన వసీం ఖాన్ మాట్లాడుతూ.. "ఐసీసీలో చేరినందుకు గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ను మరింత అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అదే విధంగా మహిళల క్రికెట్పై ప్రత్యేక శ్రద్ద వహిస్తాను" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్!