Production
-
అందమైన ప్రేమ కథ
నాని హీరోగా ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నిర్మాతగా మారారు. సమ్మక్క సారక్క క్రియేషన్స్ ని స్థాపించిన ఆయన ‘ఏఐ అమీనా జరియా రుక్సానా–గులాబీ’ అనే మూవీని ప్రకటించారు. ఈ మూవీ ద్వారా చేతన్ బండి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలతో కలిసి శ్రీకాంత్ ఓదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రకటించి, పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘2009లో గోదావరిఖని ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందనున్న అందమైన ప్రేమకథ ‘ఏఐ అమీనా జరియా రుక్సానా–గులాబీ’.ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించే ఓ అమ్మాయి లోతైన భావోద్వేగాలను ఈ మూవీ చూపిస్తుంది. ఈ చిత్రం ప్రీప్రోడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
హ్యుందాయ్ తయారీ కేంద్రంగా భారత్
పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా తదితర వర్ధమాన మార్కెట్లకు ఎగుమతులు చేసేందుకు భారత్ను తయారీ హబ్గా మార్చుకోనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) మోటర్ ఇండియా ఎండీ అన్సూ కిమ్ తెలిపారు. దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు.ఆఫ్రికా, మెక్సికో, లాటిన్ అమెరికా మార్కెట్లన్నింటిలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. రిస్కులను తగ్గించుకునేందుకు ఇతర మార్కెట్లపై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక లాంటి పొరుగు దేశాలకు కూడా ఎగుమతులు పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ వాహన ఎగుమతులు 43,650 యూనిట్ల నుంచి 40,386 యూనిట్లకు తగ్గాయి. 2024 క్యాలెండర్ సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం 1,58,686 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతి పెద్ద ఎగుమతి మార్కెట్లుగా నిలిచాయి.పేద విద్యార్థులకు సాయంహ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలుస్తోంది. హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పేరిట స్కాలర్షిప్లను ఇస్తోంది. తాజాగా ఆ కంపెనీ మొత్తం రూ.3.38 కోట్ల స్కాలర్షిప్ను అందించింది. దేశంలని 23 రాష్ట్రాల నుండి దరఖాస్తులు వచ్చాయి. 783 మంది ప్రతిభావంత విద్యార్థులు ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. వీరిలో 440 మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష, క్టాట్కి సిద్ధమవుతున్నారు. 343 మంది విద్యార్థులు ఐఐటీల నుండి వచ్చారు. హ్యుందాయ్ ఈ కార్యక్రమాన్ని 2024 ఆగస్టులో ప్రారంభించింది. -
ప్రసంగాలు కాదు, యువతకు ప్రోత్సాహం కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ)పై కేవలం మాటలు చెబితే సరిపోదని, నిర్మాణాత్మక కార్యాచరణ కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మన పోటీదార్లు ఏఐలో నూతన సాంకేతిక విధానాలతో ముందుకు దూసుకెళ్తుంటే, మన ప్రధాని నరేంద్ర మోదీ టెలిప్రాంప్టర్తో ప్రసంగాలు ఇవ్వడానికే పరిమితం అవుతున్నారని ఆక్షేపించారు. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదని, కావాల్సిందల్లా ప్రోత్సాహమేనని సూచించారు. బలమైన ఉత్పత్తి వ్యవస్థను నిర్మించాలన్నారు. ఉత్త మాటలు పక్కనపెట్టి, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, తద్వారా మన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యుద్ధరీతుల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టేలా డ్రాగన్ దేశం చైనా అత్యాధునిక డ్రోన్ల ఉత్పత్తి ప్రారంభించిందని వెల్లడించారు. డ్రోన్ల తయారీ రంగంలో మనం బలమైన పోటీదారుగా ఎదిగేలా ఒక సమగ్ర వ్యూహాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ టెక్నాలజీపై 9 నిమిషాల నిడివి గల వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేయగల ప్రతిభ, ఇంజనీరింగ్ స్కిల్స్ ఇండియాకు ఉన్నాయని స్పష్టంచేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాను మాట్లాడిన వీడియోను సైతం రాహుల్ గాంధీ షేర్ చేశారు. యుద్ధ రంగంలో డ్రోన్ల ప్రాధాన్యతను ఆయన ఈ వీడియోలో ప్రస్తావించారు. -
ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్యాకేజీ
ఆహార ద్రవ్యోల్బణాన్ని(Food Inflation) తగ్గించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Union Budget 2025-26)లో సమగ్ర ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నిత్యావసర సరుకుల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.ప్యాకేజీలోని అంశాలు ఎలా ఉండబోతున్నాయంటే..కనీస మద్దతు ధర (MSP)భరోసాపప్పుధాన్యాలు, నూనెగింజలను రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్య వల్ల రైతులకు ఆర్థిక భరోసా అందించాలని భావిస్తోంది. దాంతో వారి ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుంది.ఆర్ అండ్ డీకు కేటాయింపులుఅధిక దిగుబడినిచ్చే విత్తన వంగడాలను అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో గణనీయమైన భాగాన్ని పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ)కు కేటాయించనున్నారు. ఇది ఉత్పాదకతను మెరుగుపరచడానికి, వ్యవసాయ ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది.పంట వైవిధ్యానికి ప్రోత్సాహకాలువివిధ ప్రోత్సాహకాల ద్వారా రైతులు తమ పంటలను వైవిధ్యపరచుకునేలా ప్రోత్సహించాలని చూస్తున్నారు. ఇది పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచడమే కాకుండా సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇస్తుంది.సంప్రదాయేతర ప్రాంతాలపై దృష్టిసంప్రదాయేతర ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించడమే ఈ ప్యాకేజీ లక్ష్యం. ప్రస్తుతం ఈ పంటలు కేవలం 55 జిల్లాల్లో మాత్రమే పండిస్తున్నారు. వాటి సాగును ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు వీలవుతుందని అభిప్రాయపడుతున్నారు.రైతులకు మద్దతురైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్), ధరల స్థిరీకరణ నిధి (పీఎస్ఎఫ్) వంటి పథకాల ద్వారా ప్రభుత్వం మద్దతును అందిస్తుంది.ఇదీ చదవండి: త్వరలో ప్రభుత్వ యాప్ స్టోర్..?స్వయం సమృద్ధి సాధించే దిశగా..ఈ ప్యాకేజీ వ్యవసాయ రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ప్రస్తుతం దేశ వార్షిక వినియోగంలో వరుసగా 58%, 15% ఉన్న పప్పుధాన్యాలు, నూనె గింజల దిగుమతిని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది స్వయం సమృద్ధిని సాధించడానికి సహాయపడటమే కాకుండా ధరలను స్థిరీకరించడానికి, ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. -
మిర్చికి నష్టాల ఘాటు
మిర్చి ధరలు పతనమవుతున్నాయి. గతేడాదితో పోల్చితే అన్ని రకాల మిర్చి ధరలు 40–50% మేర తగ్గాయి. విదేశాలకు ఎగుమతులు తగ్గడం, నిల్వలు పెరగడం, కొత్త మిర్చి మార్కెట్లోకి వస్తుండటంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతేడాది రాష్ట్రంలో మిరప పంట 5.93 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది తెగుళ్లు తదితర ప్రభావంతో కొంత మేర దిగుబడులు తగ్గాయి. ఈ ఏడాది 3.64 లక్షల ఎకరాల్లో మిరప పంట సాగైంది. వాతావరణ పరిస్థితులు, కొంత మేర వైరస్, నల్లదోమ ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది పంట దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉంటాయనే భావన మార్కెట్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తగ్గుతున్న ధరల దృష్ట్యా తాజాగా మిర్చి పంట సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చికి ఎకరాకు పెట్టుబడి రూ1.5 లక్షల వరకు అవుతుంది. క్వింటా మిర్చి కోసేందుకే తేజ వంటి రకాలకైతే రూ.4,000కు పైగా ఖర్చు అవుతుంది. మూడేళ్లుగా మిర్చి ధరలు స్థిరంగా ఉండటంతో మిర్చి పంటకు మంచి ధర వస్తుందని ఆశతో గతేడాది రైతులు కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ చేశారు. ధరలు పతనం కావడంతో వీరంతా భారీగా నష్టపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీల్లో 50–60 లక్షల మిర్చి బస్తాలు నిల్వలున్నట్లు సమాచారం. గుంటూరు పరిసర ప్రాంతాల్లో 30 లక్షల బస్తాల మిర్చి నిల్వలు ఉన్నాయి. – సాక్షి ప్రతినిధి, విజయవాడమందకొడిగా ఎగుమతులు..ప్రపంచవ్యాప్తంగా చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, బర్మా, థాయిలాండ్, మలేసియా, ఇండోనేíÙయా దేశాలకు మిర్చిని ఎగుమతి చేస్తారు. ఏపీ నుంచి కోటికిపైగా బస్తాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అసోం రాష్ట్రాలకు మిర్చి వెళుతుంది. భారత్లో మిరప పంట ప్రధానంగా ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పండుతోంది. అయితే ఈ ఏడాది ఈ సీజన్లో లోకల్గా చైనా, బంగ్లాదేశ్ మిరప ఉత్పత్తులు మార్కెట్లో రావడంతో ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. దీంతో మిర్చి ధరలు పతనమవుతున్నాయి. దేశవ్యాప్తంగా తగ్గిన ధరల ప్రభావంతో రూ.10 వేల కోట్లకు పైగా రైతులు, వ్యాపారులు నష్టపోతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. గుంటూరు మార్కెట్లోనే రూ.3,000 కోట్లకు పైగా నష్టపోయే అవకాశం ఉంది. సరాసరిన కోల్ట్ స్టోరేజిలో నిల్వ చేసిన రైతుకు ఖర్చు క్వింటాకు రూ.3,000–4,000 వస్తుంది. ఈ లెక్కన ఓ క్వింటాకే రూ.13,000–14,000 నష్టపోతున్నారు. జనవరి, ఫిబ్రవరిలో మార్కెట్లో మిర్చి భారీగా వస్తుంది. అప్పటికిగానీ ధరలపైన పూర్తి స్పష్టత రాదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.గత ప్రభుత్వం మంచి ధర ఇచ్చింది గతేడాది 8 ఎకరాల్లో మిర్చి పంట సాగుచేశా. కొంత మిర్చి అమ్మగా మంచి ధర వచ్చిoది. కానీ ఇంకా ఎక్కువ ధర వస్తుందని 50 క్వింటాళ్లు వరకు స్టోరేజ్లో నిల్వ ఉంచాను. అయినా «గిట్టుబాటు ధర లేకపోవటంతో రూ.8,500కు తక్కువ ధరకు విక్రయించా. కోల్డ్ స్టోరేజ్లో అద్దె ఎక్కువ చెల్లించాల్సి వచ్చిoది. దీంతో భారీగా నష్టపోయాను. గత ప్రభుత్వం మిర్చికి మంచి ధర ఇచ్చిoది. ఈ ఏడాది మిర్చి సాగుకు ఎక్కువ ఖర్చు అయింది. ఇప్పుడైనా ప్రభుత్వం మిర్చి పంటకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఆశపడుతున్నా. లేకపోతే అప్పుల్లో కూరుకుపోతాను. – మార్కపూడి అశోక్, రైతు, కంచికచర్ల మండలం గండేపల్లినిల్వ చేసి నష్టపోయా... గతేడాది 4 ఎకరాల్లో మిర్చిని సాగుచేశా. దళారులు వచ్చి కళ్లాల్లో క్వింటా మిర్చిని రూ.14,000కు కొనుగోలు చేశారు. అయితే కొంతమేరకు మిర్చిని శీతల గిడ్డంగిలో «ధర వస్తుందని నిల్వ చేశా. డబ్బులు అవసరమై మిర్చిని రూ.9,000కు అమ్మాను. చేసిన అప్పులు తీరలేదు. ఏం చేయాలో తోచటం లేదు. – బెల్లంకొండ వెంకట సుబ్బారావు, గండేపల్లి, కంచికచర్ల మండలం -
తొక్కలో ఇంధనం
తొక్కే కదా అని అలుసుగా చూడొద్దు! ఏమో రేపు అవే మన బైకులు.. కార్లు.. లారీలను నడిపే ఇం‘ధనం’గా మారొచ్చు! దేనిగురించి అనుకుంటున్నారా? అదేనండీ మనం కరకరలాడించే చిప్స్.. ఫ్రై.. కూరల్లో లొట్టలేసుకుంటూ లాగించే బంగాళాదుంపల సంగతిది. ఈ ఆలుగడ్డ తొక్కలు, వ్యర్థాల నుంచి బయో ఇంధనాన్ని ఉత్పత్తి(Biofuel Production) చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టారు మన శాస్త్రవేత్తలు. దీన్ని పరీక్షించేందుకు త్వరలో ప్రయోగాత్మక (పైలట్) ప్లాంటును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విజయవంతమైతే.. బంగాళా దుంపలతో బైక్ నడిపేయొచ్చన్నమాట!!సాక్షి, బిజినెస్ డెస్క్: బంగాళాదుంపల(potato) ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది భారత్. అయితే, సరైన నిల్వ సదుపాయాల్లేక పంట చేతికొచ్చాక పాడైపోయే ఆలుగడ్డలు మొత్తం ఉత్పత్తిలో 10–15 శాతం ఉంటాయని అంచనా. మరోపక్క పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్డ్ ఆహారోత్పత్తులను పెద్ద ఎత్తున తయారుచేసే స్నాక్స్ కంపెనీల నుంచి తొక్కలు ఇతరత్రా రూపంలో వేల టన్నుల వ్యర్థాలు వెలువడుతుంటాయి. వీటి నుంచి జీవ ఇంధనాన్ని (బయో ఫ్యూయల్–ఇథనాల్) ఉత్పత్తి చేసే టెక్నాలజీని సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఐ) రూపొందించింది. ల్యాబ్ పరీక్షలు కూడా పూర్తి కావడంతో, ఈ టెక్నాలజీని టెస్ట్ చేయడం కోసం పైలట్ ప్లాంటును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది.బంగాళాదుంప తొక్కలు, వ్యర్థాల నుంచి ఇథనాల్చెరకు, మొక్కజొన్నతో పాటు..దేశంలో ప్రస్తుతం చెరకు, మొక్కజొన్న నుంచి పెద్ద ఎత్తున ఇథనాల్ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటితోపాటు బంగాళాదుంపల వ్యర్థాలను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఫీడ్ స్టాక్గా ఉపయోగించేందుకు జాతీయ జీవ ఇంధన పాలసీలో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించింది. ‘ఆలుగడ్డల నుంచి గణనీయమైన వ్యర్థాలు ఉంటున్న నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తికి వీటిని విలువైన ప్రత్యామ్నాయాలుగా పరిగణించవచ్చు’అని సీపీఆర్ఐ శాస్త్రవేత్త ధర్మేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఏటా సగటున సుమారు 5.6 కోట్ల టన్నుల ఆలుగడ్డలు ఉత్పత్తి అవుతున్నాయి.ఇందులో 8–10 శాతం, అంటే 50 లక్షల టన్నులను పొటాటో చిప్స్, ఫ్రైస్, ఇంకా డీహైడ్రేటెడ్ ప్రాడక్టులుగా ప్రాసెస్ చేస్తున్నారు. ఆయా ప్లాంట్ల నుంచి భారీ మొత్తంలో తొక్కలు, ఇతరత్రా వ్యర్థాలు బయటికొస్తాయి. ఇక పంట చేతికొచ్చాక ఉత్పత్తి నష్టాలు 20–25 శాతం, అంటే సుమారు 1.1–1.4 కోట్ల టన్నుల మేరకు ఉంటాయని అంచనా. ప్రధానంగా సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడం, సరిగ్గా రవాణా చేయకపోవడం వంటివి దీనికి కారణం. ‘అత్యధికంగా బంగాళాదుంపలను ఉత్పత్తి చేస్తున్న ఉత్తరప్రదేశ్ లేదా పశ్చిమ బెంగాల్, అలాగే భారీగా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్న గుజరాత్ వంటి చోట్ల పొటాటో ద్వారా ఇథనాల్ తయారు చేసే పైలట్ ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం’అని కుమార్ తెలిపారు.20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్.. క్రూడ్ ఆయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో ఇథనాల్ను కలిపే బయో ఫ్యూయల్ పాలసీని పక్కాగా అమలు చేస్తోంది. 2013–14 ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్వై)లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ (ఫ్యూయల్ గ్రేడ్) దేశంలో ఉత్పత్తి కాగా, 2020–21 నాటికి ఇది 302.3 కోట్ల లీటర్లకు చేరింది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 1.53 శాతం నుంచి 8.17 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో దేశంలో పెట్రోల్ వినియోగం 64 శాతం ఎగబాకడం గమనార్హం. 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తొలుత లక్ష్యంగా నిర్దేశించింది.అయితే, 2022 జూన్ నాటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) 10 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంతో 2025–26 నాటికి 20 శాతం లక్ష్యాన్ని కుదించారు. 2023–24లో ఈ బ్లెండింగ్ 13 శాతంగా నమోదైంది. డీజిల్లో సైతం 5% ఇథనాల్ను కలిపే పాలసీని తీసుకొచ్చే ప్రణాళికల్లో ప్రభుత్వం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తికి మరిన్ని రకాల ఫీడ్ స్టాక్లనువినియోగించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.2025 కల్లా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు తప్పనిసరి..పెట్రోలు, డీజిల్తో నడిచే సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాల స్థానంలో రాబోయే రోజుల్లో ఫ్లెక్సి ఫ్యూయల్ వెహికల్స్ (ఎఫ్సీవీ)లు పరుగులు తీయనున్నాయి. బయో ఫ్యూయల్ పాలసీకి అనుగుణంగా 2025 చివరినాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఐసీఈ వాహన ఇంజిన్లను పెట్రోల్తోపాటు ఫ్లెక్స్ ఫ్యూయల్ (85 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్–ఈ 85)కు అనుగుణంగా మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. -
నవంబర్లో ‘మౌలికం’ నెమ్మది
న్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన మౌలిక రంగాల గ్రూప్ ఉత్పత్తి వృద్ధి రేటు నవంబర్లో 4.3 శాతంగా నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 7.9 శాతం వృద్ధితో పోలిస్తే ఈ రేటు తగ్గుదల నమోదుకావడం గమనార్హం. అయితే 2024 అక్టోబర్ 3.7 శాతం వృద్ధితో పోలిస్తే ఇది మెరుగైన ఫలితం. సిమెంట్ మినహా (13 శాతం వృద్ధి), బొగ్గు (7.5 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (2.9 శాతం), ఎరువులు (2.0 శాతం), ఉక్కు (4.8 శాతం), విద్యుత్ (3.8 శాతం) రంగాలు 2023 నవంబర్తో పోల్చితే వృద్ధి రేట్లు తగ్గాయి. చమురు, సహజవాయువు రంగాల్లో వృద్ధి లేకపోగా క్షీణరేట్లు నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య.. ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో (2024 ఏప్రిల్–నవంబర్) మౌలిక రంగం గ్రూప్ వృద్ది రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. 2023 ఇదే కాలంతో పోల్చితే (8.7 శాతం) వృద్ధి రేటు సగానికిపైగా పడిపోవడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా 40.27 శాతం కావడం గమనార్హం. -
గత ఆర్థిక ఏడాదిలో పండ్ల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: రైతుకు వెన్నుదన్నుగా నిలిస్తే పంటల దిగుబడి ఎంతగా పెరుగుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరూపించింది. ధాన్యం, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటలకూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచి్చ, అడుగడుగునా రైతుకు అండదండగా నిలిచింది. దీంతో రాష్ట్రంలో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. పండ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తలసరి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, దేశంలో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తిపై నివేదికను విడుదల చేసింది. గత ఆరి్థక ఏడాదిలో దేశంలో మొత్తం తలసరి పండ్ల ఉత్పత్తి 80 కిలోలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 333 కిలోలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే 2023–24లో ఆంధ్రప్రదేశ్ తలసరి కూరగాయల ఉత్పత్తి 119 కిలోలుందని తెలిపింది. గత దశాబ్ద కాలంలో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 7 కిలోలు, కూరగాయల ఉత్పత్తి 12 కిలోలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. 2013–14లో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 73 కిలోలుండగా 2023–24లో 80 కిలోలకు, కూరగాయల ఉత్పత్తి 135 కిలోల నుంచి 147 కిలోలకు పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తి గత దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని నివేదిక తెలిపింది. దేశంలో మొత్తం ఒక వ్యక్తి సంవత్సరానికి పండ్లు, కూరగాయలు 146 కిలోలు తీసుకోవాలని సాధారణ సిపార్సు ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఒక వ్యక్తికి సంవత్సరానికి పండ్లు, కూరయలు కలిపి 227 కిలోలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే పంట కోత అనంతరం, నిల్వ, గ్రేడింగ్, రవాణా, ప్యాకేజింగ్లో 30 నుంచి 35 శాతం తగ్గుతోందని, ఇది మొత్తం వినియోగంపై ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది. -
ఇది కదా అసలైన రికార్డ్!.. ఒక ఏడాదిలో 20 లక్షల కార్లు
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మొదటిసారి ఒక సంవత్సరంలో 2 మిలియన్స్ (20 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే గొప్ప రికార్డ్. ప్యాసింజర్ వెహికల్ ఉత్పత్తిలో ఈ మార్కును సాధించిన భారతదేశంలోని ఏకైక బ్రాండ్ మారుతి సుజుకి కావడం గమనార్హం.ఈ ఏడాది ఉత్పత్తి అయిన 20 లక్షల కారుగా ఎర్టిగా నిలిచింది. ఇది హర్యానాలోని మనేసర్ ప్లాంట్లో ఈ కారు తయారైనట్లు సమాచారం. కంపెనీ తాయారు చేసిన రెండు మిలియన్ యూనిట్లలో 60 శాతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ సౌకర్యాలలో తయారయ్యాయి. మిగిలినవి గుజరాత్లోని హన్సల్పూర్ ప్లాంట్లో తయారైనట్లు కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి మూడు ప్లాంట్లు 2.35 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాగా కంపెనీ హర్యానాలోని ఖర్ఖోడాలో మరో ప్లాంట్ ప్రారభించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమైతే.. కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.మారుతి సుజుకి తన కార్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. 100 ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇందులో సుమారు 17 మేడ్ ఇన్ ఇండియా కార్లు ఉన్నట్లు సమాచారం. మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, డిజైర్, స్విఫ్ట్ వంటి కార్లను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. -
వేసవి వస్తోంది.. బీర్ల ఉత్పత్తి పెంచండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు. రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్శాఖ ము(మ)ందస్తు జాగ్రత్త తీసుకుంటోంది. బీర్ల ఉత్పత్తిని పెంచాలని బెవరేజెస్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్శాఖ బెవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు.డిమాండ్కు సరిపడా ఉత్పత్తి.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బెవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేస్ల బీర్లు ఉత్పత్తి ఉంటుంది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేస్లకు పెంచింది. ఒక్కో కేస్లో 12 సీసాలు (650 ఎంఎల్) ఉంటాయి. మరో మల్టీనేషనల్ బెవరేజెస్ కంపెనీ నెలకు సుమారు 25 లక్షల కేస్ల బీరు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు 30 లక్షల కేస్ల వరకు పెంచినట్టు ఎక్సైజ్వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ మాదిరిగా కాకుండా, బీర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి. దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళితేనే వేసవి డిమాండ్కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచొచ్చని ఎక్సైజ్శాఖ భావిస్తోంది.డిమాండ్కు తగినట్టుగా ‘బీర్ల డిమాండ్ను ముందుగా అంచనా వేసి బెవరేజెస్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి. సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయి’అని ఎక్సైజ్శాఖ బ్రూవరీస్ విభాగం అధికారి తెలిపారు.సంగారెడ్డి నుంచే రాష్ట్రమంతటికీ సరఫరా.. సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందినవి రెండు, కల్స్బర్గ్, క్రౌన్, లీలాసన్స్, ఏబీ ఇన్బీవ్ అనయూసర్–బుష్, వంటి బ్రీవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్ల ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రమంతటికీ బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది. ఎక్సైజ్శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బెవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్లైన్లనే వేసుకున్నాయి. కొన్ని కంపెనీలు మంజీర నదీ జలాలనే వినియోగిస్తున్నాయి. -
కాళేశ్వరం లేకున్నా రికార్డు వరి పంట
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు అందించకపోయినా రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రులు మీడియాతో మాట్లాడారు. అధికార దాహంతో ఉన్న బీఆర్ఎస్ పారీ్ట.. రైతులకు మేలు చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రెండోస్థానం కోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. 40 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు రాష్ట్రంలో గతంలో 25 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు సాగు చేస్తే, ఈ ఏడాది సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో 40 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు సాగు చేశారని మంత్రులు తెలిపారు. వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ షాపులు, గురుకులాలు, హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ‘గత ఏడాది ఇదే సమయానికి 17 జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తే.. ఈ ఏడాది 25 జిల్లాల్లో కొనుగోళ్లు చేస్తున్నాం.గత ఏడాది ఈ కాలానికి 9.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగులో చేస్తే.. ఈ ఏడాది 9.58 లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. వాస్తవాలు ఇలా ఉంటే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. హింస ప్రేరిపిస్తోంది విపక్షాలే.. ప్రతిపక్షాలు రైతులను, ప్రజలను రెచ్చగొట్ట హింసను ప్రేరిపిస్తున్నాయని మంత్రులు విమర్శించారు. పరిశ్రమలకు భూములు సేకరించే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణను నేరుగా ముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు చేపట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడంగల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయంలో రైతులతో మాట్లాడేందుకు సీఎం, మంత్రులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.ధాన్యంలో తేమ 17 శాతానికి మించరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రులు తెలిపారు. ఈ నిబంధన సడలించేలా రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. తేమశాతాన్ని పక్కనపెట్టి ప్రైవేటు వ్యాపారులు అధిక ధరకు రైతుల నుంచి ధాన్యం కొంటున్నారని చెప్పారు. -
ట్రా లా లాలో రెండో సినిమా?
హీరోయిన్ సమంత ఇటీవల ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ‘సినిమా బండి’ చిత్రంతో ప్రేక్షకుల మనసు గెలిచి, ఇటీవల ‘పరదా’ (ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది) చిత్రాన్ని పూర్తి చేసిన దర్శకుడు ప్రవీణ్ కంద్రేగుల కథకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. తన సొంత నిర్మాణసంస్థ ‘ట్రా లా లా’పై ఈ సినిమాను సమంత నిర్మిస్తున్నారని, త్వరలోనే ప్రకటన రానుందని భోగట్టా. ‘ట్రా లా లా’ బ్యానర్పైనే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను గతంలో ప్రకటించారు సమంత. కానీ ఆ తర్వాత మరో అప్డేట్ రాలేదు. ఈలోపు ఈ బేనర్పై మరో సినిమా అంటూ... రెండో సినిమా గురించిన వార్త ప్రచారంలోకి వచ్చింది. -
ఒకేచోట కోటి కార్లు: మారుతి సుజుకి సరికొత్త రికార్డ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి తన మానేసర్ ప్లాంట్లో ఏకంగా కోటి కార్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. ఒకే ప్లాంట్లో ఇన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి 18 సంవత్సరాల సమయం పట్టింది.600 ఎకరాల్లో విస్తరించి ఉన్న మానేసర్ సదుపాయంలో కార్యకలాపాలు అక్టోబర్ 2006లో ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్లో మారుతి బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, సియాజ్, డిజైర్, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో కార్లను తయారు చేశారు. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్లో కీలక మార్పుజపాన్కు ఎగుమతి చేసిన మారుతి సుజుకి మొట్టమొదటి ప్యాసింజర్ కారు బాలెనో కూడా మనేసర్ ఫెసిలిటీలో తయారు చేశారు. మానేసర్, గురుగ్రామ్, గుజరాత్ ప్లాంట్లలో కార్ల మారుతి సుజుకి ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 23.50 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ సదుపాయాల్లో కార్ల తయారీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.11 కోట్ల వాహనాలు ఉత్పత్తి అయినట్లు సమాచారం. -
ఐఫోన్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత
తమిళనాడులోని హొసూరు వద్ద యాపిల్ ఐఫోన్ భాగాలను తయారు చేసే టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లో ఉత్పత్తి నిరవధికంగా నిలిచిపోయింది. రెండు రోజుల క్రితం ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది. దీని తర్వాత మరింత నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి ఇప్పుడప్పుడే కొనసాగే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది.ప్రమాదం సమయంలో పడిపోయిన షెడ్లను తొలగిస్తున్నప్పుడు మళ్లీ అగ్ని ప్రమాదం లేదా పొగ వచ్చే అవకాశాలు ఉన్నందున ప్లాంట్లో ఫైరింజన్లను అందుబాటులో ఉంచినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.వేలు రాయిటర్స్తో అన్నారు. అగ్నిప్రమాదానికి కారణాన్ని ఇంకా నిర్ధారించలేదని చెప్పారు.ప్లాంట్లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఉత్పత్తిని నిలిపివేశారు. యాపిల్ చైనాను దాటి భారత్ను కీలక వృద్ధి మార్కెట్గా చూస్తున్న నేపథ్యంలో ఐఫోన్ సరఫరా గొలుసును ప్రభావితం చేసే తాజా సంఘటన ఇది. ఈ సంఘటనపై యాపిల్ వ్యాఖ్యానించలేదు. మరోవైపు టాటా మాత్రం అగ్నిప్రమాదానికి కారణం ఏంటన్నదానిపై దర్యాప్తు జరుగుతోందని, ప్లాంట్లోని ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ..ఈ ప్లాంట్లో ఐఫోన్లకు క్లిష్టమైన బ్యాక్ ప్యానెల్లతోపాటు కొన్ని ఇతర భాగాలను తయారు చేస్తారు. ఇదే కాంప్లెక్స్లోని మరో భవనంలో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ఈ ఏడాది చివర్లో ప్రారంభించాల్సి ఉంది. అయితే అగ్ని ప్రమాద ప్రభావం దీనిపై ఎంత మేరకు పడిందో స్పష్టంగా తెలియలేదు. -
భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) పూణేలోని చకన్లోని తన తయారీ కేంద్రంలో 15 లక్షల మేడ్-ఇన్-ఇండియా వాహనాలను తయారు చేసి.. ఉత్పత్తిలో ఓ సరికొత్త మైలురాయిని దాటేసింది.స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ భారతదేశంలో స్థానికంగా తన కార్యకలాపాలను 2007లో ప్రారంభించి.. తమ మొదటి ఉత్పత్తిగా 'స్కోడా ఫాబియా' లాంచ్ చేశారు. ఆ తరువాత స్కోడా రాపిడ్, ఫోక్స్వ్యాగన్ పోలో, వెంటో, అమియో వంటి కార్లను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.ప్రస్తుతం సంస్థ కుషాక్, టైగన్, స్లావియా, వర్టస్ కార్లను మాత్రమే చకాన్ ఫెసిలిటీలో ఇండియా 2.0 ఉత్పత్తులుగా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఉత్పత్తిలో సుమారు 30 శాతానికి పైగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బ్రాండ్ ప్రకటించింది.స్కోడా, ఫోక్స్వ్యాగన్ స్థానికంగా కార్లను మాత్రమే కాకుండా.. ఇంజిన్లను కూడా తయారు చేస్తోంది. అప్పట్లో పోలో హ్యాచ్బ్యాక్ కారులో అందించే 1.5 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిన్ను కంపెనీ తయారు చేసిందే. ఆ తరువాత 2.0 లీటర్ టీడీఐ డీజిల్, 1.0 లీటర్, 1.2 ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్లను చేసింది. ఇప్పటికి స్కోడా, ఫోక్స్వ్యాగన్ ఏకంగా 3.80 లక్షల ఇంజిన్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. -
టాటా స్టీల్ సరికొత్త రికార్డ్లు
స్టీల్ ఉత్పత్తుల్లో టాటా స్టీల్ సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తోంది. టాటా స్టీల్కు రిటైల్, ఆటోమోటివ్, రైల్వే విభాగాల నుండి భారీ ఆర్డర్లు రావడంతో ఉత్పత్తుల్ని పెంచేస్తుంది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2024లో మొత్తం స్టీల్ డెలివరీలలో 6 శాతం వృద్ధిని 19.90 మిలియన్ టన్నులని నివేదించింది. మునుపటి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 18.85 మిలియన్ టన్నుల (ఎంటీ) ఉక్కును ఉత్పత్తి చేసినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. ఆటోమోటివ్, ప్రత్యేక ఉత్పత్తుల సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2.9 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2023 మునుపటి రికార్డును అధిగమించింది. బ్రాండెడ్ ఉత్పత్తులు, రిటైల్ సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో డెలివరీలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు & ప్రాజెక్టుల సెగ్మెంట్ డెలివరీలు 6 శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రగామి
ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండటంతో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ రూపాల్లో సాయం అందిస్తుండటంతో పండ్ల రైతులు ఈ ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11,20,77,190 టన్నుల పండ్లు ఉత్పత్తి కాగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 16.16 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలి ముందస్తు అంచనాలను సోమవారం వెల్లడించింది. - సాక్షి, అమరావతి 1.81 కోట్ల టన్నులతో మనమే టాప్ 2023–24 ఆర్థిక ఏడాదిలో 1,81,11,600 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత మహారాష్ట్ర 1,42,78,250 టన్నుల పండ్లు ఉత్పత్తితో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 1,27,02,060 టన్నుల పండ్ల ఉత్పత్తితో మూడో స్థానంలో నిలిచింది. అరటి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. బత్తాయి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి. నిమ్మ ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. బొప్పాయి ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ విస్తీర్ణమే ఉన్నా పండ్ల ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రఫ్రదేశ్లో పండ్లు సాగు విస్తీర్ణం 7,80,310 హెక్టార్లు ఉండగా.. మహారాష్ట్రలో 8,48,370 హెక్టార్లలో పండ్ల సాగు విస్తీర్ణం ఉంది. -
రంజాన్ నెలలో ఖర్జూరం ఎందుకు తింటారు? ఏ దేశంలో ఉత్పత్తి అధికం?
ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరాన్ని ఇష్టంగా తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. రంజాన్ మాసంలో ఖర్జూరానికి డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉపవాసం ఉండేవారికి తగిన బలాన్ని అందిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించడానికి ఇదే ప్రధాన కారణం. అయితే మన తినే ఖర్జూరాలు ఏ దేశం నుండి వచ్చాయనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అలాగే ఏ దేశం అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తుందనేది కూడా చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం దేశాలు అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేసే దేశం ఈజిప్ట్. ఈ దేశంలో ఏడాదికి దాదాపు 1,733,432 టన్నుల ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తారు. ఖర్జూరం ఉత్పత్తిలో సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 1,610,731 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఏడాదిలో 1,247,403 టన్నుల ఖర్జూరాలు పండే అల్జీరియా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. నాల్గవ స్థానంలో ఇరాన్ ఉండగా, ఇక్కడ ఒక సంవత్సరానికి 1,030,459 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 7,32,935 టన్నుల ఖర్జూరం పండుతుంది. ఈ దేశాల నుంచి విదేశాలకు ఖర్జూరాలు ఎగుమతి అవుతాయి. -
మాగాణుల్లో మిథేన్కు చిరు చేపలతో చెక్!
వాతావరణాన్ని వేడెక్కిస్తున్న మిథేన్, కార్బన్ డయాక్సయిడ్ కన్నా 86 రెట్లు ఎక్కువ పర్యావరణానికి హాని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి విడుదలవుతున్న మిథేన్ వాయువులో 10శాతం మేరకు వరి పొలాల నుంచే వెలువడుతోందని అంచనా. అయితే, వరి పొలాల్లోని నీటిలో చిరు చేపల (గోల్డెన్ షైనర్ రకం)ను పెంచితే మూడింట రెండొంతుల మిథేన్ వాయువు తగ్గిందని కాలిఫోర్నియాకు చెందిన రిసోర్స్ రెన్యువల్ ఇన్స్టిట్యూట్(ఆర్ఆర్ఐ) అనే స్టార్టప్ కంపెనీ చెబుతోంది. ‘ఫిష్ ఇన్ ద ఫీల్డ్స్’ పేరిట పైలట్ ప్రాజెక్టు ద్వారా రెండేళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ఇటీవల ‘ద జెఎం కప్లన్ ఇన్నోవేషన్ ప్రైజ్’ను గెల్చుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘వరి రైతులకు చేపల ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. సముద్ర చేపలను దాణాల్లో వాడే బదులు ఈ పొలాల్లో పెరిగే చేపలను వాడటం ద్వారా భూతాపాన్ని తగ్గించడానికి, చేపల జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి మా పరిశోధనలు ఉపకరిస్తాయి. 1,75,000 డాలర్ల ప్రైజ్ మనీతో మేం చేపట్టిన ప్రయోగాత్మక సాగుకు ఊతం వచ్చింది..’ అన్నారు ఆర్.ఆర్.ఐ. వ్యవస్థాపకులు దెబోరా మోస్కోవిట్జ్, ఛాన్స్ కట్రానో. ఆసియా దేశాల్లో అనాదిగా సాగు చేస్తున్న వరి–చేపల మిశ్రమ సాగులో అదనపు ప్రయోజనాన్ని కొత్తగా వారు శోధిస్తున్నారు. సుస్థిర ఆక్వా సాగుతో పాటు రైతుల ఆదాయం పెరుగుదలకు, భూతాపం తగ్గడానికి ఉపకరిస్తుందంటున్నారు. మాగాణుల్లో వరితో పాటు చేపలు పెంచితే ‘కార్బన్ క్రెడిట్స్’ ద్వారా కూడా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. మరికొన్ని సంగతులు ప్రపంచంలోని గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో నాలుగింట ఒక వంతు ఆహారం , వ్యవసాయం నుంచి వస్తున్నవే. వీటిల్లో నైట్రస్ ఆక్సైడ్ , మీథేన్దే అగ్రభాగం. ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో 13 శాతం వ్యవసాయం, అటవీ భూ వినియోగంనుంచి వస్తుండగా, 21 శాతం ఇంధన కాలుష్యం. వరి పంట, పశువుల పెంపకం వంటి పద్ధతులు నేరుగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తాయనేది నిపుణుల వాదన. పంటకోత, నాటడం, రవాణా ద్వారా కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు, అలాగే యూరియాతో పండించిన గడ్డితినే పశువుల ద్వారా, పేడ నిర్వహణ ద్వారా ద్వారా మీథేన్ విడుదలవుతుంది. ఎరువుల వాడకం, నేల శ్వాసక్రియ వలన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ-స్మార్ట్ వ్యవసాయం ద్వారా ఉద్గారాల ప్రభావాలను తగ్గించాలనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా సమర్థవంతమైన పశువుల పెంపకం, శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, జంతు-ఆధారిత ఆహార పదార్థాల నిర్వహణ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. ఇవి సుస్థిర ఆహార వ్యవస్థకు దోహదపడతాయి కూడా. గ్రీన్హౌస్ వాయువులపై వ్యవసాయ ప్రభావాన్ని తగ్గించడం మన భూగ్రహ మనుగడకు చాలా అవసరం. -
కోరమాండల్ కాకినాడ ప్లాంట్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ కాకినాడ యూనిట్లో ఫాస్ఫరిక్, సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదం పొందింది. రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 750 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 1,800 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నూతన కేంద్రాలను జోడించనున్నారు. ఇందుకోసం రూ.1,029 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. 24 నెలల్లో ఈ విస్తరణ పూర్తి కానున్నట్టు వెల్లడించింది. కాకినాడ యూనిట్ సామర్థ్యం రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 1,550 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 4,200 టన్నులు ఉంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యాన్ని కంపెనీ వినియోగించుకుంటోంది. ఎరువుల తయారీలో ఈ యాసిడ్స్ను ఉపయోగిస్తారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, తయారీ సామర్థ్యం పెంపొందించుకునేందుకు విస్తరణ చేపడుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. పూర్తి స్థాయి ప్లాంటుగా.. పాస్ఫేటిక్ ఎరువుల తయారీ, విక్రయంలో భారత్లో కోరమాండల్ రెండవ స్థానంలో నిలిచింది. ముడిసరుకు, ఎరువుల తయారీలో పూర్తి స్థాయి ప్లాంటుగా కాకినాడ కేంద్రాన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. ప్రతిపాదిత విస్తరణతో కంపెనీ వ్యయ సామర్థ్యాలను, ముడిసరుకు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వివరించారు. డ్రోన్స్ తయారీలో ఉన్న తమ అనుబంధ కంపెనీ ధక్ష బలమైన ఆర్డర్ బుక్ నమోదు చేసిందని చెప్పారు. రక్షణ రంగం, వ్యవసాయంతోపాటు వివిధ కంపెనీల నుంచి ఆర్డర్లు పొందామన్నారు. గ్రోమోర్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కంపెనీ ప్రోత్సహిస్తోంది. -
కాస్టిక్ సోడా ఉత్పత్తుల హబ్గా కాకినాడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీల నుంచి పెట్టుబడుల ఆకర్షణకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందులో భాగంగా కాస్టిక్ సోడా, క్లోరిన్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ను ఏర్పాటు చేసింది. రూ.2,700 కోట్లతో ఏటా 1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడాను ఉత్పత్తి చేసే క్లోర్ ఆల్కాలి యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022, ఏప్రిల్ 21న ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం 1,300 మంది ఉపాధి పొందుతుండగా.. యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరో 1,100 మందికి ఉపాధి కలి్పంచవచ్చు. దేశంలోనే అతిపెద్ద యూనిట్ బలభద్రపురంలో ఏర్పాటు కావడంతో ఈ ప్రత్యేక రసాయనాలు ముడి సరుకుగా తయారుచేసే అనేక ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థలకు కాకినాడ ప్రధాన హబ్గా మారనుంది. ఫార్మాస్యూటికల్స్, ఆగ్రో కెమికల్స్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక యూనిట్లు రావడం ద్వారా కాకినాడ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. తూర్పు తీరంలో ఇదే తొలి యూనిట్ ఆదిత్య బిర్లా గ్రూపునకు దేశవ్యాప్తంగా ఏడు క్లోర్ ఆల్కాలి యూనిట్లు ఉండగా, తూర్పుతీర ప్రాంతంలో తొలి యూనిట్ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో లాక్డౌన్ సమయంలో కూడా పనులు వేగంగా జరిగాయి. కీలక అనుమతులు తీసుకురావడంలో అధికారులు వేగంగా స్పందించడంతో రికార్డు సమయంలోనే ఉత్పత్తిని ప్రారంభించారు. ఎలాంటి కాలుష్య కారకాలు లేకుండా జర్మన్ టెక్నాలజీ సాయంతో ఈ యూనిట్ను అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడంతో ఉత్పత్తి ప్రారంభించిన వెంటనే విస్తరణ పనులు ప్రారంభించారు. ఎగుమతుల దిశగా.. మనం తినే అహార పదార్థాల నుంచి శుభ్రం చేయడానికి వినియోగించే ప్రతి వస్తువులోనూ కాస్టిక్ సోడా చాలా కీలకం. కాగిత పరిశ్రమ, టెక్స్టైల్స్, అల్యూమినియం, ఫార్మా, ఫెస్టిసైడ్స్, మంచినీటిని శుభ్రం చేయడం, స్విమ్మింగ్ పూల్స్లో నీటిని పరిశుభ్రంగా ఉంచడంలో, ఆయిల్ రిఫైనరీలు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీ ఇలా అన్నింటా కాస్టిక్ సోడా ముఖ్యమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి కూడా కాస్టిక్ సోడానే వినియోగిస్తారు. కోవిడ్ సమయంలో ఆస్పత్రులు శుభ్రం చేసేందుకు, శానిటైజేషన్ వంటి వాటిల్లో ఈ యూనిట్లో తయారయ్యే సోడియం హైపో క్లోరైడ్ కీలకపాత్ర పోషించిందని ఆల్కలీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మన దేశంలోప్రస్తుతం కాస్టిక్ సోడా డిమాండ్ 35.6 లక్షల టన్నులుండగా 2035 నాటికి అది 55 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తాజా గణాంకాల మేరకు 2021 నాటికి దేశంలో వివిధ యూనిట్ల ద్వారా 47.63 లక్షల టన్నుల కాస్టిక్ సోడా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చాక ఈ కెమికల్స్ను పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ కీలకం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతిస్తూ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – ఏప్రిల్ 21, 2022న కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంబోత్సవంలో ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా -
సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రానున్నాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వ్రస్తానికి గిట్టుబాటు ధర లేక నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ‘ఆధునిక మగ్గాలు ఆగాయి’శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర జౌళి శాఖ అధికారులు స్పందించి సిరిసిల్ల టెక్స్టైల్పార్క్ వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు టెక్స్టైల్పార్క్లోని యూనిట్లకు ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్రావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. 1.30 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నామని వివరించారు. టెక్స్టైల్ పార్క్లోని ఆధునిక మగ్గాలపై షరి్టంగ్ వస్త్రం, సిరిసిల్లలోని పవర్లూమ్స్పై సూటింగ్, ఓనీ వ్రస్తాన్ని ఉత్పత్తి చేసే ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. ఆర్వీఎం ఆర్డర్ల విలువ రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. 50 శాతం కాటన్తో వ్రస్తాల ఉత్పత్తి గతానికి భిన్నంగా 50 శాతం కాటన్ నూలుతో కలిపి ఆర్వీఎం వ్రస్తాలను ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కోసం ఈ వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నారు. వ్రస్తోత్పత్తికి ముందే నూలును వార్పిన్ చేసి, సైజింగ్ చేసిన తరువాత మగ్గాలపై వ్రస్తాన్ని ఉత్పత్తి చేయనున్నారు. సిరిసిల్లలో తొలిసారి ఈ ప్రయోగం చేస్తున్నారు. గతంలో ప్లెయిన్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రింటింగ్ చేయించేవారు. కానీ ఈసారి వీవింగ్లోనే డిజైన్లు వచ్చేలా ఉత్పత్తి చేస్తున్నారు. -
ఇథనాల్ తయారీలో చెరకు రసం వినియోగంపై నిషేధం
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిలో చెరకు రసం, షుగర్ సిరప్ల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రారంభమైన 2023–24 సరఫరా సంవత్సరానికి (డిసెంబర్–నవంబర్ మధ్య కాలం) ఇది వర్తిస్తుంది. దేశీయంగా వినియోగానికి తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూసేందుకు, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇథనాల్ ఉత్పత్తి కోసం ’బి–మొలాసిస్’ను వినియోగించడానికి అనుమతించింది. చక్కెర పరిశ్రమ దీన్ని స్వాగతించింది. అయితే ప్రత్యేకంగా చెరకు రసం, షుగర్ సిరప్ల ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు పని చేయకపోతే అవి ఖాయిలా పడే అవకాశం ఉందని పేర్కొంది. 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అంచనాల ప్రకారం 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో స్థూలంగా చక్కెర ఉత్పత్తి 9 శాతం తగ్గి 337 లక్షల టన్నులకు పరిమితం కానుంది. 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో భారత్ 61 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నుల చక్కెర ఎగుమతైంది. ధరలను అదుపులో ఉంచే ఉద్దేశంతో ఈ మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతించలేదు. -
రైతుల మోముల్లో ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను మించి రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మిరప, మినుము, పసుపు, పెసలు, కందులు ఎమ్మెస్పీని మించి మంచి ధర పలుకుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల పాటు కనీస మద్దతు ధరలు దక్కని రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంది. దీని ద్వారా ఎమ్మెస్పీ దక్కని వ్యవసాయ, వాణిజ్య పంటలను మార్కెట్లో జోక్యం చేసుకొని మరీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. తద్వారా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలకు మద్దతు ధర దక్కింది. నాలుగున్నరేళ్లలో 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7,751.43 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసింది. ఇలా ధర తగ్గిన ప్రతీసారి ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో ప్రస్తుతం ఆయా ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే వేళ అపరాలు, చిరుధాన్యాలు, ఉద్యాన, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి రికార్డు స్థాయిలో పలుకుతుండడం శుభపరిణామన్నారు. మిరప, పసుపులకు రికార్డు స్థాయి ధర అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్తో మిరప రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎమ్మెస్పీ క్వింటా రూ.7 వేలు కాగా, కాస్త నాణ్యత ఉంటే చాలు రూ.20 వేలకు పైగా లభిస్తోంది. గరిష్టంగా రూ.27,525 పలుకుతోంది. ప్రతికూల వాతావరణంలో సాగు చేసిన మిరపపై ఈసారి నల్లతామర ప్రభావం పెద్దగా కనిపించకపోవడం, మార్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు ఉండడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించే పరిస్థితులు ఉన్నాయి. పసుపు ఎమ్మెస్పీ క్వింటా రూ.6,850 కాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్లో బుధవారం గరిష్టంగా క్వింటా రూ.10,650 పలికింది. ఈసారి రూ.15 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పత్తి పొడుగు పింజ రకం ఎమ్మెస్పీ క్వింటా రూ.7,020 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.7,453 పలుకుతోంది. మధ్యస్థ పింజ రకం ఎమ్మెస్పీ రూ.6,620 కాగా మార్కెట్లో రూ.7 వేలు లభిస్తోంది. మిగిలిన పంట ఉత్పత్తులకు సైతం మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. క్వింటా రూ.10 వేలు దాటిన అపరాలు అపరాలకు మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. మినుము ఎమ్మెస్పీ క్వింటా రూ.6,950 కాగా, మార్కెట్లో రూ.11,500 పలుకుతోంది. కందులు ఎమ్మెస్పీ రూ.7 వేలు కాగా రూ.10,500, పెసలు ఎమ్మెస్పీ రూ.8,558 ఉండగా మార్కెట్లో రూ.10,500 వరకు ధరలు పలుకుతున్నాయి. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలకు కూడా మంచి ధరలు లభిస్తున్నాయి. ఇక ఉల్లి ఎమ్మెస్పీ క్వింటా రూ.700 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.5,500 వరకు రైతుకు ధర లభిస్తోంది. వేరుశనగ కూడా ఎమ్మెస్పీ రూ.6,377 కాగా, గరిష్టంగా మార్కెట్లో రూ.7,596 పలుకుతోంది. అరటి ఎమ్మెస్పీ క్వింటా రూ.800 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.2,880 లభిస్తోంది. బత్తాయి ఎమ్మెస్పీ రూ.1,400 కాగా మార్కెట్లో గరిష్టంగా రూ.4,200 వరకు పలుకుతోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్కు వచ్చే వేళ ఇలా వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. -
మెమరీ చిప్ ఉత్పత్తిలో సహస్ర.. తొలి భారతీయ కంపెనీగా రికార్డ్
రాజస్థాన్కు చెందిన 'సహస్ర సెమీకండక్టర్స్' (Sahasra Semiconductors) మెమరీ చిప్లను ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో భివాడి జిల్లాలోని సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించి.. వివిధ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లకు ఇప్పటికే మొదటి షిప్మెంట్ చేసింది. 2023 చివరి నాటికి కంపెనీ భివాడి యూనిట్ 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని, 2024లో ఇది మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సహస్ర గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'అమృత్ మన్వానీ' వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా మైక్రో ఎస్డి కార్డ్లను విక్రయించే మొదటి కంపెనీగా మారినందుకు ఆనందంగా ఉందని, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో మంచి స్పందన లభిస్తోందని మన్వానీ ఈ సందర్భంగా చెప్పారు. సహస్ర సెమీకండక్టర్స్ రెండు ప్రముఖ ప్రభుత్వ కార్యక్రమాల (PLI, SPECS) నుంచి ఆమోదం పొందింది. అంతే కాకుండా కంపెనీ తన తయారీ సౌకర్యాన్ని విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! సెమీకండక్టర్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్లోబల్ చిప్మేకర్ మైక్రాన్, గుజరాత్లో కొత్త అసెంబ్లీ అండ్ టెస్ట్ సదుపాయాన్ని స్థాపించడానికి 825 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అనుకున్న విధంగా అన్నీ జరిగితే 2024 నాటికి ఉత్పత్తి అధికమవుతుందని, తద్వారా కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్లో మరో ఘనత
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్–2 (కృష్ణ) విభాగంలో ఉత్పత్తి 50 మిలియన్ టన్నులకు చేరింది. ఈ విభాగం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 50 మిలియన్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి సాధించి మరో మైలురాయికి చేరుకుంది. ఈ విభాగంలో ఉత్పత్తి 1992 మార్చి 21న ప్రారంభమైంది. 50 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్న సందర్భంగా విభాగంలో గురువారం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ అతుల్ భట్ మాట్లాడుతూ ప్లాంట్కు అత్యంత కీలక విభాగమైన బ్లాస్ట్ ఫర్నేస్ మరో మైలురాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె.బాగ్జి, సీజీఎం (వర్క్స్) ఎన్.వి.స్వామి, సీజీఎం (ఐరన్) ఆర్.మొహంతి, విభాగాధిపతి ఉదయ్నాగ్ పాల్గొన్నారు. -
భారత్లో తయారీ పెంచుతున్న టయోటా
టోక్యో: వాహన తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్.. భారత్లో పూర్తి సామర్థ్యంతో ప్లాంట్లు నడుస్తుండడంతో తయారీని పెంచే ప్రక్రియను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా టయోటా మోటార్ కంపెనీ, కిర్లోస్కర్ గ్రూప్ సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన టయోటా కిర్లోస్కర్ మోటార్కు బీదడి వద్ద రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఈ కేంద్రాల స్థాపిత సామర్థ్యం ఏటా 3.42 లక్షల యూనిట్లు. ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చూనర్, లెజెండర్, కామ్రీ హైబ్రిడ్, అర్బన్ క్రూజర్ హైరైడర్, హైలక్స్ మోడళ్లను తయారు చేస్తోంది. సుజుకీ కార్పొరేషన్తో ఉన్న భాగస్వామ్యంలో భాగంగా గ్లాంజా, రూమియన్ మోడళ్లను సైతం ఉత్పత్తి చేస్తోంది. పూర్తిగా తయారైన వెల్ఫైర్, ఎల్సీ 300 మోడళ్లను దిగుమతి చేసుకుంటోంది. కొన్ని మోడళ్లకు ఎక్కువ కాలం వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీంతో మెరుగైన డిమాండ్ కారణంగా భారత్లో మూడవ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. 2023 ప్రారంభంలో కొన్ని మోడళ్ల కోసం వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 30 శాతం పెంచడానికి బీదడిలో మూడవ షిఫ్ట్ని ప్రారంభించింది. 2023 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కంపెనీ 1,23,939 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ. డిమాండ్ బలంగా ఉంది.. భారత్లో పూర్తి ప్లాంట్ సామర్థ్యాన్ని వినియోగిస్తున్నట్టు టయోటా మోటార్ కార్పొరేషన్ బోర్డు సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యోయిచి మియాజాకి జపాన్ మొబిలిటీ షో సందర్భంగా తెలిపారు. దేశంలో సామర్థ్య పెంపుపై తాజా పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు మొదలయ్యాయని వెల్లడించారు. ‘కోవిడ్ తర్వాత భారత ఆటోమొబైల్స్ రంగంలో ముఖ్యంగా పెద్ద కార్లకు డిమాండ్ పెరిగింది. కోవిడ్ తర్వాత ఇతర దేశాలతో పోలిస్తే మార్కెట్ రికవరీ భారత్లో చాలా బలంగా ఉంది. కాబట్టి డిమాండ్ కూడా బలంగా ఉందని మేము నమ్ముతున్నాము. మార్కెట్లో పెద్ద కార్ల పట్ల ఆసక్తి క్రమంగా పెరగడం కంపెనీకి మంచి సంకేతం’ అని వివరించారు. భారతీయ కార్ల విపణి చిన్న కార్ల నుండి పెద్ద కార్ల విభాగాలకు మారడం వల్ల మార్కెట్ను టయోటా మరింత ఆకర్షణీయంగా మారుస్తుందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. టయోటాకు సమయం ఆసన్నమైందని అన్నారు. -
టెస్లాకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' (Tesla) గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ప్రవేశించడానికి సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇటీవలే కొన్ని ఆంక్షలతో సుముఖత చూపించింది. తాజాగా కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్కు ఓ స్పష్టమైన సందేశం అందించారు. భారతదేశం టెస్లాకు స్వాగతం పలుకుతుంది, కానీ కంపెనీ స్థానికంగా కార్లను తయారు చేస్తే ఇతర సంస్థలకు లభించే అన్ని రాయితీలు లభిస్తాయి. చైనాలో తయారు చేసి భారతదేశంలో విక్రయించాలనుకుంటే రాయితీలు లభించవని గడ్కరీ స్పష్టం చేశారు. గతంలో సీబీయూ మార్గం ద్వారా దిగుమతైన కార్లపై ప్రభుత్వం దిగుమతి సుంకాను తగ్గించింది. ప్రస్తుతం స్థానిక ఉత్పత్తులను పెంచడానికి, విదేశీ దిగుమతులను తగ్గించడానికి కేంద్రం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభించడానికి కట్టుబడి ఉన్న సంస్థలకు కొన్ని ప్రత్యేక రాయితీలను కల్పిస్తోంది. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారభించాలనుకుంటే మొదటి రెండు సంవత్సరాల్లో దాదాపు 20 శాతం భాగాలను స్థానికంగా సోర్సింగ్ చేయాలి, ఆ తరువాత ఇది 40 శాతానికి పెరిగే అవకాశం ఉంది. సంస్థలకు బ్యాంకు గ్యారెంటీలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న విధంగా అన్నీ జరిగితే టెస్లా, బిఎమ్డబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలకు గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతాయి. ఇదీ చదవండి: కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్' - ఫోటోలు చూశారా? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం భారతదేశంలో వాహన తయారీని పెంచడమే. ప్రస్తుతం టెస్లా కంపెనీ భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి తమ ప్రణాళికలకు సంబంధించి, ప్రభుత్వంతో సానుకూల చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే సంస్థ భారతదేశంలో సంవత్సరానికి 5,00,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక కర్మాగారాన్ని స్థాపించాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. టెస్లా ఫ్యాక్టరీ, ఉత్పత్తికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడవుతాయని భావిస్తున్నాము. -
బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు!
నిర్మాణ రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతమైన భవనాలు ఈ రోజుకీ పురుడుపోసుకుంటున్నాయి. ఇలాంటి భవనాలు లేదా నగరాల నిర్మాణానికి కావాల్సిన ప్రధానమైన ముడిపదార్ధాలు సిమెంట్, ఉక్కు (స్టీల్), ఇసుక. 2020లో ప్రపంచంలో ఈ ముడిపదార్ధాల ఉత్పత్తి ఎంత? ఏ దేశంలో ఎక్కువ ఉత్పత్తి ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిమెంట్ అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, 2020లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేసిన దేశాల జాబితాలో చైనా (2200 మిలియన్ టన్నులు) అగ్ర స్థానంలో, రెండవ స్థానంలో భారత్ (340 మిలియన్ టన్నులు) నిలిచాయి. చివరి స్థానంలో సౌత్ కొరియా మొదలైన దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సిమెంట్ ఉత్పత్తి 2020లో 4.1 బిలియన్ టన్నులు. ప్రపంచలోని అన్ని దేశాలు ఉత్పత్తి చేసిన సిమెంటుతో ఒక దిమ్మె నిర్మిస్తే.. అది 1,195 మీటర్ల పొడవు, 1.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉంటుంది. బరువు ఏకంగా 4.1 బిలియన్ టన్నులు ఉంటుంది. ఈ దిమ్మె పొడవు బుర్జ్ ఖలీఫా కంటే 365 మీటర్లు ఎక్కువ ఉంటుందన్నమాట. సిమెంట్ తయారు చేసేటప్పుడు టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలవుతుంది, అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. కాంక్రీట్ ఉత్పత్తిలో అధిక కార్బన్ ఉద్గారాలు, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు, స్వీడిష్ పవర్ కంపెనీ వాటెన్ఫాల్ ఓ ప్రత్యేకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా CO2 ఉద్గారాలు బాగా తగ్గుతాయి. ఉక్కు (స్టీల్) సిమెంట్ తరువాత నిర్మాణానికి కావాల్సిన ముఖ్యమైన లోహం ఉక్కు. 2020లో ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి మొత్తం 180 కోట్ల టన్నుల బరువైన ఉక్కుని ఉత్పత్తి చేశాయి. అంతకు ముందు 1900 నుంచి ఉక్కు పరిశ్రమ 2500 కోట్ల టన్నుల స్టీల్ స్క్రాప్ను రీసైకిల్ చేసింది. దీని వల్ల 3500 కోట్ల టన్నుల ఇనుము వినియోగం, 1800 కోట్ల టన్నుల బొగ్గు వినియోగం తగ్గింది. ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి అయిన ఉక్కుతో ఓ దిమ్మె నిర్మిస్తే.. అది 610 మీటర్ల ఎత్తు, 227.8 మిలియన్స్ ఘనపు మీటర్ల పరిమాణం, 180 కోట్ల టన్నుల బరువుతో నిర్మితమవుతుంది. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! రంగాల వారీగా రికవరీ రేట్లు ఇసుక నిర్మాణ రంగంలో మరో ముఖ్యమైన మెటీరియల్ ఇసుక, కంకర (చిన్న రాళ్లు). 2020లో ఉత్పత్తి అయిన ఇసుక 26.5 కోట్ల టన్నులు. ఇంత ఇసుకతో ఏకంగా 555 మీటర్ల ఎత్తు, 171 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంతో ఓ దిమ్మె నిర్మించవచ్చు. ప్రస్తుతం చాలా నగరాల్లో ఇసుక అవసరం లేకుండానే పెద్ద పెద్ద భవనాలను గాజు, ఇతర మెటీరియల్స్ ఉపయోగించి ఎంతో అందంగా నిర్మిస్తున్నారు. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నెలకొలి్పన సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖపట్నం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ఫెర్టిలైజర్ కాంప్లెక్స్లో రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని స్థాపించారు. ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1,650 మెట్రిక్ టన్నులని కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ బుధవారం వెల్లడించారు. నూతన కేంద్రం చేరికతో సంస్థ సల్ఫరిక్ యాసిడ్ తయారీ సామర్థ్యం ఏటా 6 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు చేరిందని పేర్కొన్నారు. -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
ఏపీలో గ్రీన్లామ్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లామినేట్ షీట్స్ తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్రీన్లామ్ ఇండస్ట్రీస్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పిన ప్లాంటులో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద ఉన్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రానికి ఏటా 35 లక్షల లామినేట్ షీట్స్, కాంపాక్ట్ బోర్డులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. నూతన ప్లాంటు కోసం కంపెనీ రూ.239 కోట్లు వెచ్చించింది. పూర్తి సామర్థ్యానికి చేరుకుంటే ఈ ఫెసిలిటీ ద్వారా రూ.600 కోట్ల వార్షికాదాయం సమకూరగలదని కంపెనీ ప్రకటించింది. 4 ప్లాంట్లలో కలిపి వార్షిక స్థాపిత సామర్థ్యం 2.45 కోట్ల లామినేట్ షీట్స్, కాంపాక్ట్ బోర్డులకు చేరిందని గ్రీన్లామ్ ఎండీ, సీఈవో సౌరభ్ మిత్తల్ వెల్లడించారు. -
రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వాహనాల మోడల్స్ను, ఉత్పత్తిని పెంచుకోనున్న నేపథ్యంలో 2030–31 నాటికి మూలధన వ్యయం రూ. 1.25 లక్షల కోట్ల మేర ఉంటుందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం 17 మోడల్స్ను తయారు చేస్తుండగా వీటిని 28కి విస్తరించాలని భావిస్తోంది. అలాగే 2030–31 నాటికి మొత్తం ఉత్పత్తి సామరŠాధ్యన్ని ఏటా 40 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. ‘గురుగ్రామ్, మానెసర్, గుజరాత్లోని ప్రస్తుత ప్లాంట్లలో పెట్టుబడి ప్రణాళికలు యథాప్రకారం కొనసాగుతాయి. 2022–23లో మూలధన వ్యయం రూ. 7,500 కోట్లుగా ఉంది. 2030–31 నాటికి ఈ మొత్తం రూ. 1.25 లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చు‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఎంఎస్ఐ తెలియజేసింది. ప్రస్తుత ఖర్చులు, ధరల స్వల్ప పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే 20 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించేందుకు రూ. 45,000 కోట్లు అవసరమవుతాయని కంపెనీ పేర్కొంది. అలాగే, పెద్ద ఎత్తున కార్లను ఎగుమతి చేసేందుకు మౌలిక సదుపాయాలను కూడా పటిష్టపర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. వివిధ ఇంధనాలపై పని చేసే 10–11 కొత్త మోడల్స్ను రూపొందించేందుకు మూలధన వ్యయాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అటు ఎలక్ట్రిక్ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ఉత్పత్తికి కూడా భారీగా నిధులు కావాలని ఎంఎస్ఐ తెలిపింది. అందుకే సుజుకీకి షేర్ల జారీ.. సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్ఎంజీ)లో సుజుకీ మోటర్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ)కి ఉన్న వాటాలను కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించే బదులు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడాన్ని ఎంఎస్ఐ సమరి్ధంచుకుంది. ఎస్ఎంసీ వాటాల కోసం రూ. 12,500 కోట్లు చెల్లించడం వల్ల లాభాలు, డివిడెండ్ల చెల్లింపులు మొదలైనవి తగ్గడంతో పాటు నగదు కొరత కూడా ఏర్పడేదని పేర్కొంది. అలా కాకుండా షేర్లను జారీ చేయడం వల్ల చేతిలో మిగిలే నిధులను సేల్స్, సరీ్వస్, స్పేర్ పార్టులపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు వెచి్చంచడం ద్వారా అమ్మకాలను పెంచుకునేందుకు వీలవుతుందని ఎంఎస్ఐ వివరించింది. సోమవారం బీఎస్ఈలో మారుతీ సుజుకీ షేరు స్వల్పంగా అర శాతం మేర క్షీణించి రూ. 10,238 వద్ద ముగిసింది. -
2024 ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో పసిడి ఉత్పత్తి
న్యూఢిల్లీ: జొన్నగిరి బంగారు గనుల్లో వచ్చే ఏడాది అక్టోబర్–డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కాగలదని డెక్కన్ గోల్డ్ మైన్స్ (డీజీఎంఎల్) ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 750 కిలోల బంగారం వెలికి తీయొచ్చని ప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు దీనిపై రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయగా పైలట్ ప్రాతిపదికన ప్రస్తుతం నెలకు ఒక కేజీ మేర బంగారాన్ని మైనింగ్ చేస్తున్నారు. 2013లో తమకు గనిని కేటాయించగా, ప్రాజెక్టు మదింపును పూర్తి చేసేందుకు 8–10 ఏళ్లు పట్టినట్లు ప్రసాద్ చెప్పారు. అటు కిర్గిజ్స్తాన్లో తమకు 60 శాతం వాటాలున్న మరో బంగారు గనిలో కూడా 2024 అక్టోబర్–నవంబర్లో ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్టు నుంచి ఏటా 400 కేజీల బంగారం వెలికితీయొచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి బంగారు గని ఉంది. బీఎస్ఈలో లిస్టయిన ఏకైక గోల్డ్ మైనింగ్ కంపెనీ డీజీఎంఎల్. జొన్నగిరి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న జియోమైసూర్ సరీ్వసెస్ ఇండియాలో డీజీఎంఎల్కు మెజారిటీ (40 శాతం) వాటాలు ఉన్నాయి. -
2035 నాటికి ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ రంగం 2035 నాటికి ఎగుమతి ఆధారిత ట్రిలియన్ డాలర్ పరిశ్రమగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థర్ డి లిటిల్ నివేదిక పేర్కొంది. తయారీ, ఆవిష్కరణలు, సాంకేతికత తోడుగా పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ‘భారత వాహన పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లకు డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తికి ఆకర్షణీయ ప్రపంచ కేంద్రంగా మారవచ్చు. దీనిని సాధించడానికి ఈ రంగంలోని కంపెనీలు ప్రపంచ తయారీకి అనుగుణంగా తమ సామర్థ్యాలను విశ్వసనీయ, పోటీతత్వంగా మెరుగుపర్చుకోవాలి. జోనల్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా పరిష్కారాలను అందించడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధిలో భారత శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. నిధులతో కూడిన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో భారతదేశం వాహన రంగంలో నాయకత్వ స్థానంలో ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని వివరించింది. నాయకత్వ స్థానంగా..: దేశీ వాహన రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణల వేగాన్ని, మారుతున్న సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే భారతదేశాన్ని ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో నాయకత్వ స్థానంగా మార్చవచ్చని నివేదిక తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ పరిశోధన, అభివృద్ధి, సాఫ్ట్వేర్ మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు వృద్ధి చెంది 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశం ప్రపంచ సాఫ్ట్వేర్ హబ్గా, ఆఫ్షోర్ గమ్యస్థానంగా తన స్థానాన్ని ఉపయోగించుకోవచ్చు. భారత వాహన పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని సది్వనియోగం చేసుకోవడానికి ప్రభుత్వంతో సహా ముడిపడి ఉన్న భాగస్వాముల మధ్య బలమైన చర్చలు, సమిష్టి చర్యలు అవసరం’ అని నివేదిక వివరించింది. -
10 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం
న్యూఢిల్లీ: 2027 నాటికల్లా 10 గిగావాట్ల స్థాయిలో సమీకృత సౌర విద్యుత్ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవాలని అదానీ గ్రూప్ నిర్దేశించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది 4 గిగావాట్లుగా ఉంది. గ్రూప్లో భాగమైన అదానీ సోలార్కు 3,000 మెగావాట్ల విలువ చేసే ఎగుమతి ఆర్డర్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇటీవలే 394 మిలియన్ డాలర్లు కూడా సమీకరించినట్లు వివరించాయి. దేశీయంగా 2014లో 2.63 గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుదుత్పత్తి 2023 నాటికి 71.10 గిగావాట్లకు పెరిగినప్పటికీ తయారీ వ్యవస్థ వేగంగా విస్తరించలేదు. ఈ నేపథ్యంలో దేశీ యంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం పీఎల్ఐ వంటి స్కీములను ప్రవేశపెట్టింది. అదానీ గ్రూప్ వంటి ప్రైవేట్ సంస్థలు సోలార్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. -
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్కు చెందిన డబ్బు మాయం
హైదరాబాద్: సొంత ఇంటికి యజమానులే కన్నం వేశారు. బ్యాంకు అధికారులతో కలసి ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ ఎఫ్డీ అకౌంట్స్లో ఉన్న కోట్లాది రూపాయలు గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు సభ్యులు ఆ ఇంటి దొంగల్ని ప్రశ్నించగా వారిపై ఎదురుదాడికి దిగారు. దీంతో పక్కా ఆధారాలతో యూనియన్లోని సభ్యులు రాందాస్ ధన్రాజ్, వెంకటేశ్వరరావులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు యూనియన్ అధ్యక్షుడు సత్యనారాయణ దొర, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్, ట్రెజరర్ రాజేష్లపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 420 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్లోని ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. దీనిలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్, ఉపాధ్యక్షులతో కలపి దాదాపు 700 మంది సభ్యులు ఉన్నారు. వీరికి జూబ్లీహిల్స్లో ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో ఖాతా ఉంది. దీనిలో ఎఫ్డీ, ఇతర లావాదేవీలు కలిపి మొత్తం రూ. 7 కోట్లు ఉన్నాయి. యూనియన్ బైలా ప్రకారం యూనియన్లో ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఎంతో కాలం నుంచి ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలో ప్రెసిడెంట్ సత్యనారాయణ దొర, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్, ట్రెజరర్ రాజేష్లు ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ చూశామంటూ రాంపూర్ వద్దకు సభ్యులు రాందాస్ ధన్రాజ్, వెంకటేశ్వరరావు తదితరులను తీసుకెళ్లారు. శ్రీనివాస్ అనే వ్యక్తిని పరిచయం చేసి ఓనర్ నుంచి ఇతను అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్పారు. అడ్వాన్స్ కూడా నాలుగు రోజుల ముందే ఇచ్చినట్లు చెప్పడంతో రాందాస్ ధనరాజ్, వెంకటేశ్వరరావులు అలా ఏకపక్షంగా ఎలా ఇస్తారని ప్రెసిడెంట్, జీఎస్, ట్రెజరర్లను నిలదీశారు. దీంతో వీరు పొంతన లేని సమాధానాలు చెప్పండతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే యూనియన్లో ఉన్న 60 మంది అనుకూలమైన వ్యక్తులకు ప్రెసిడెంట్, ట్రెజరర్, జీఎస్లు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్లలో యూనియన్కు చెందిన ఎఫ్డీలోని రూ.7 కోట్లలో ఒక్కోక్కరికీ రూ.9 లక్షల చొప్పున బదిలీ చేశారు. ఈ 60 మందికి వచ్చిన దాదాపు రూ.5 కోట్ల 40 లక్షలు క్యాష్ రూపంలో డ్రా చేయించి ముగ్గురూ తీసుకున్నారు. మరికొంత కూడా వివిధ కారణాలు చెప్పి డ్రా చేశారు. ఇలా పలు దఫాలుగా రూ. 6 కోట్ల 50 లక్షలు యూనియన్ అనుమతి లేకుండా అనధికారికంగా బ్యాంకు అధికారుల ప్రమేయంతో కాజేశారు. దీనిపై పక్కా ఆధారాలతో రాందాస్ ధనరాజ్, వెంకటేశ్వరరావు, మరికొందరు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ చింతపల్లి మల్లికార్జున చౌదరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గడ్కరీ చెప్పినా అప్పటివరకు తప్పదు.. టాటా ఎండీ శైలేశ్ చంద్ర
భారతదేశంలో నేడు ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్ల ఉత్పత్తి & వినియోగం ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు దాదాపు డీజిల్ కార్ల మ్యాన్యుఫ్యాక్షరింగ్ నిలిపివేస్తున్నాయి. కాగా ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే విషయం మీద ప్రస్తావించారు. కానీ దీనిపై టాటా మోటార్స్ ఎండీ శైలేశ్ చంద్ర స్పందించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాలుష్యాన్ని తగ్గించడానికి డీజిల్ వాహనాల ఉత్పత్తి నిలిపివేయాలని.. లేకుంటే డీజిల్ వెహికల్స్ మీద 10 శాతం జీఎస్స్టీ విధించడానికి తగిన సన్నాహాలు జరుగుతున్నాయని గడ్కరీ ఇటీవలే తెలిపారు. ఈ మాటలపై శైలేశ్ చంద్ర స్పందిస్తూ.. మార్కెట్లో టాటా డీజిల్ వాహనాలకు డిమాండ్ ఉన్నంత వరకు కొనసాగిస్తామని, 2024 నాటికి పూర్తి స్థాయిలో ఈ వాహనాల ఉత్పత్తి నిలిపివేసే లక్ష్యంగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికి కూడా చాలామంది వాహన కొనుగోలుదారులు డీజిల్ వెహికల్స్ కొనటానికి ఆసక్తి చూపుతున్నారని, దశల వారీగా వీటి ఉత్పత్తి తగ్గిస్తూ.. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని నియమాలకు లోబడి ఉంటామని.. 2024 నాటికి డీజిల్ వెహికల్స్ ఉత్పత్తిని జీరో చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని శైలేశ్ చంద్ర వెల్లడించారు. ఇదీ చదవండి: ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి! ప్రస్తుతం కొన్ని విభాగాలలో మాత్రమే డీజిల్ మోడల్స్ ఉన్నాయి, వీటిని కూడా వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ వెర్షన్లోకి మార్చడానికి సన్నద్ధమవుతామని తెలిపారు. కాగా జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా డీజిల్ ఇంజిన్ కార్లను తమ పోర్ట్ఫోలియోలో తొలగించడానికి ససేమిరా అంటోంది. -
విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ కొనసాగుతాయని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. రానున్న గడ్డు పరిస్ధితుల కోసం ఇప్పుడే అప్రమత్తం కావాలని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ నెలాఖరు నాటికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజాగా ఓ లేఖ పంపింది. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట డిమాండ్లో కొరత 23 శాతంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని కేంద్రం తెలిచ్చింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్ను తీర్చలేకపోయాయని చెప్పింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 తరువాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిషేధించామని, పరిస్థితులు చక్కబడకపోవడంతో నిషేధాన్ని పక్కనపెట్టి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని వివరించింది. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు సాధాౄరణం కంటే తక్కువగా ఉన్నందున సెప్టెంబర్లోనూ వర్షాలు ఆశించినంతగా లేనందున రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్షీణించాయని, దానివల్ల గత ఏడాది 45 గిగావాట్లుగా ఉన్న గరిష్ట హైడ్రో పవర్ ఉత్పత్తి ఈ ఏడాది 40 గిగావాట్ల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. పవన ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని, సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో రుతుపవనాల ఉపసంహరణతో జల, గాలి ఉత్పత్తి మరింత క్షీణిస్తుందని అంచనా వేసినట్టు కేంద్రం తెలిపింది. థర్మల్ ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో నడవకపోవడం వల్ల 12–14 గిగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో లేదన్నారు. వెంటనే వాటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అలాగే థర్మల్, సోలార్, విండ్ వంటి కొత్త యూనిట్లను త్వరితగతిన ప్రారంభించాలని కోరింది. విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు కుదుర్చుకోవాలని, స్వల్పకాలిక టెండర్ల ద్వారా విద్యుత్ను బహిరంగ మార్కెట్ ద్వారా సమకూర్చుకోవాలని సూచించింది. -
మధ్య తరగతి కుర్రాడి కథ
గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా పి. నవీన్కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్పై సెవెన్ హిల్స్ సతీష్కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పి. నవీన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఒక స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన మధ్య తరగతి కుర్రాడి కథతో ఈ సినిమా రూపొందుతోంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ని మా సినిమా అలరిస్తుంది’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అన్నారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్. పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, ఆనంద్ చక్రపాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్ధు, సంగీతం: జుడా శాండీ. ∙పోసాని కృష్ణ మురళి, గౌతం కృష్ణ, శ్వేత -
ఆర్ఎఫ్సీఎల్ షట్డౌన్
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కర్మాగారంలో మరమ్మతుల కార ణంగా గురువారం రాత్రి నుంచి యూరి యా ఉత్పత్తి నిలిచిపోయింది. హీటర్ సెక్ష న్ పైపులు మరమ్మతులు చేయడానికి వా రంరోజుల దాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్ర వారం మరమ్మతులు ప్రారంభించారు. వానాకాలం సీజన్ కావడంతో తెలు గురాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్ అధికంగా ఉంది. నిత్యం సాంకేతిక సమస్యలు: ఫ్యాక్టరీలో జూన్లో కూడా సాంకేతిక సమ స్యలతో 20 రోజులపాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ప్లాంట్ పునరుద్ధరించినా, రెండు రోజులకే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్ చివరివారంలో ఉత్పత్తి ప్రారంభించారు. సాంకేతిక సమ స్యలతో ఆగస్టులో ఉత్పత్తి కొంత తగ్గింది. మళ్లీ సమస్య తలెత్తడంతో కర్మా గారాన్ని తాత్కాలికంగా వారం పాటు షట్డౌన్ చేసి మరమ్మతుల అనంతరం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కర్మాగారంలో గడిచిన 4 నెలల్లో 5,01,597.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. 2023– 24లో 12.70 లక్షల మెట్రిక్టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. -
‘గ్రీన్’ ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్య రహిత, నాణ్యమైన విద్యుత్తు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న చర్యలతో రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా అవతరిస్తోంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఏపీ భాగం అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం గతేడాది కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికి అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023ని రాష్ట్రం రూపొందించింది. తాజాగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) తయారు చేసిన నివేదిక శ్వేత పత్రాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. అందులోని వివరాలను ‘ఎన్ఆర్ఈడీసీఏపీ’ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. సమగ్రంగా శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ వంటి స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. హైబ్రిడ్ వ్యవస్థగా చెబుతున్న పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఉంది. అనేక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సౌర, పవన, పంప్డ్ హైడ్రో సిస్టం ప్రాజెక్టులు 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కొత్త టెక్నాలజీల ఆవిర్భావం, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. తద్వారా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు అవకాశాలున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్ర అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ను ఎగుమతి చేయడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 400 కిలో టన్నుల దేశీయ హైడ్రోజన్ డిమాండ్ ఉంది. దేశ పారిశ్రామిక హైడ్రోజన్ డిమాండ్లో ఇది దాదాపు 8 శాతం. ప్రతి ఏటా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023 ప్రకారం 2030 నాటికి కనీసం 500 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.దీని సాయంతో శిలాజ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని(డీకార్బనైజ్) భావిస్తోంది. ఇందుకోసం యాక్సిలరేటింగ్ స్మార్ట్ పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా (ఆస్పైర్) ప్రోగ్రామ్ కింద ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ సాయంతో ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాల నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వ్యాపారాలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై ‘వైట్పేపర్’లో వివరించారు. ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర సంసిద్ధంగా ఉందని శ్వేతపత్రంలో పొందుపరిచారు. కేంద్రం ఎంచుకున్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వీటిని 25 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజించి, వివిధ రంగాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తున్న వీటిలో పన్నెండు రసాయనాలు, రిఫైనరీ, ఉక్కు పరిశ్రమలలోని పారిశ్రామిక డీ–కార్బనైజేషన్ ప్రాజెక్టులు కాగా మూడు భారీ రవాణా ప్రాజెక్టులు, మరో మూడు సిటీ గ్యాస్ డ్రిస్టిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్లో హైడ్రోజన్–బ్లెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మిగిలిన ఏడు ప్రాజెక్టులు మునిసిపాలిటీల్లో వ్యర్థాల నుండి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేవి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటి ద్వారా 2025 నాటికి 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి గ్రీన్ హైడ్రోజన్ పాలసీతో ఏపీ జీవం పోసింది. -
ఉత్పత్తి నిలిపివేసిన టయోటా.. షాక్లో కస్టమర్లు - కారణం ఇదే!
ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ఒక్కసారిగా షాక్ ఉత్పత్తి నిలిపివేసి కస్టమర్లకు షాకిచ్చింది. జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ అక్కడ మొత్తం 14 తయారీ కేంద్రాలలో ఈ రోజు (మంగళవారం) ఉత్పత్తి నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి సంస్థకు సంబంధించిన విడిభాగాల ఆర్డర్స్ పర్యవేక్షించే కంప్యూటర్ సిస్టంలో ఏర్పడిన లోపం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందా? లేదా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఎక్కువ మంది వాహన వినియోగదారులు ఇష్టపడి కొనుగోలు చేసే బ్రాండ్లలో టయోటా ఒకటి. అయితే కంపెనీ ఉత్పత్తి నిలిపివేసిందనే వార్త కష్టమరల్లో ఒకింద భయాన్ని కలిగించింది. కాగా మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అంతే కాకుండా ఏ మోడల్స్ ఉత్పత్తులు నిలిచిపోయాయి అనేదానికి సంబంధించిన విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇదే జరిగితే ఉద్యోగుల పంట పండినట్లే.. వర్క్ ఫ్లెక్సిబిలిటీ గురూ! కరోనా వైరస్ విజృంభించిన సమయంలో సెమీ కండక్టర్ల కొరత కారణంగా గతంలో కూడా కంపెనీ ఉత్పత్తి కొన్ని రోజులు నిలిపివేసింది. కాగా ప్రస్తుతం ఈ సమస్య తొలగిపోయింది, కొత్త సమస్య పుట్టుకొచ్చింది. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. -
శ్రీశైలంలో ఆగని విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆంధ్రలోని కుడిగట్టులో స్వల్పంగా.. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. శ్రీశైలం నీళ్లపై ఆధారపడి ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిపివేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశించినా ఖాతరు చేయకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. కాగా, శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 0.192 మిలియన్ యూనిట్ల విద్యుత్ను, ఎడమగట్టు కేంద్రంలో 7.975 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్కు 15,685 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయానికి గత 4 రోజులుగా వరద ప్రవాహం నిలిచిపోయింది. మరోవైపు దిగువ ప్రాంతాలకు నీరు విడుదల అవుతుండడంతో జలాశయంలో నీటిమట్టం తగ్గిపోతుంది. ప్రస్తుతం జలాశయంలో 119.7828 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 864.30 అడుగులకు చేరుకుంది. -
రాష్ట్రంలో స్వచ్ఛ ఇం‘ధనం’
సాక్షి, అమరావతి: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తికి అవసరమైన అన్ని వనరులు ఉండటం, ఇందుకోసం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పాలసీని తేవడంతో కీలకమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రాభివృద్ధికి మరింతగా చేయూతనిస్తాయి. ప్రకృతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా మన దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, పాలసీలు తెస్తున్నాయి. వాటి ద్వారా ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో 4.5 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర పభుత్వం టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ సహా 10 రాష్ట్రాలు అనుకూలమని తేలి్చంది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ‘సైట్’తో ప్రోత్సాహకాలు ఏటా 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనంతో పాటు 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటునందించడానికి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ (సైట్) పథకాన్ని గత నెలాఖరులో ప్రవేశపెట్టింది. ఉత్పత్తిదారులకు ఆ ర్థికంగా చేయూతనందించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించింది. 2029–30 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. తొలి ఏడాది రూ.4,440 కోట్లు, రెండో ఏడాది రూ.3,700 కోట్లు, మూడో ఏడాది రూ.2,960 కోట్లు, నాలుగో ఏడాది రూ.2,220 కోట్లు, ఐదో ఏడాది రూ.1,480 కోట్లు చొప్పున ఆరి్ధక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఏపీ సొంత పాలసీ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పాలసీని రూపొందించింది. ఈ ఏడాది కేంద్రం పాలసీని తేవడానికి ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ ఏడాదికి దాదాపు 0.34 మిలియన్ టన్నులు (ఎంటీ) ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 2 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక మిలియన్ టన్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగితే 12 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. ఈ పాలసీ ఐదేళ్లపాటు లేదా కొత్త పాలసీ జారీ అయ్యే వరకు అమలులో ఉంటుంది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ని ఉపయోగించడం ద్వారా నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలనుకునే డెవలపర్లు ఈ పాలసీ పరిధిలోకి వస్తారు. ఈ పాలసీ అమలుకు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి తప్పకుండా ప్రాజెక్టులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ♦ ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు గ్రీన్ హైడ్రోజన్ అమ్మకంపై డెవలపర్లకు స్టేట్ జీఎస్టీలో 100 శాతం తిరిగి చెల్లింపు ♦గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుకు వాణిజ్య ఆపరేషన్ తేదీ నుంచి ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకంపై 100 శాతం మినహాయింపు ♦ ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల్లో 25 శాతం రీయింబర్స్మెంట్ ♦ క్రాస్–సబ్సిడీ సర్చార్జి ఐదేళ్లు వెనక్కు ♦ ప్రాజెక్టుకు భూమిని ప్రభుత్వమే నోడల్ ఏజెన్సీ ద్వారా నామ మాత్రపు ధరకు లీజుగా కేటాయింపు ♦ భూ వినియోగ మార్పిడి ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు -
దుమ్ము రేపిన రెనో-నిస్సాన్ , సరికొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో-నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా 25 లక్షల యూనిట్ల తయారీ పూర్తి చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. 600 ఎకరాల్లోని చెన్నై ప్లాంటు నుంచి విదేశాలకూ కార్లు ఎగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా 108 ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు కార్లు విదేశీ గడ్డపై అడుగు పెట్టాయి. 13 ఏళ్లుగా ఈ కేంద్రం ద్వారా రెనో, నిస్సాన్ బ్రాండ్లలో సుమారు 20 మోడళ్లు భారత మార్కెట్లో ప్రవేశించాయి. -
తెలంగాణ ప్రాజెక్టు–1లో విద్యుత్ ఉత్పత్తి షురూ
జ్యోతినగర్: రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించేందుకు మొదలుపెట్టిన తెలంగాణ స్టేజీ–1లోని 800 మెగావాట్ల మొదటి యూనిట్ ఆదివారం రాత్రి 7.40 గంటలకు ఉత్పత్తి ప్రారంభించింది. 801.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. 800 మెగావాట్ల యూనిట్ కంట్రోల్ రూంలో సీజీఎం కేదార్ రంజన్పాండుతో పాటు ఉన్నతాధికారులు, అధికారులు స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు స్టేజ్–1లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం చేపట్టారు. మొదటి యూనిట్ (800 మెగావాట్ల) నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. స్టేజీ–1లో నిర్మితమైన 800 మెగావాట్ల మొదటి యూనిట్లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచి్చన క్రమంలో ఈనెల 28లోపు కమర్షియల్ డిక్లరేషన్ చేసి గ్రిడ్కు అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. ఆగస్టు నుంచి రెండో యూనిట్లో..? ఎన్టీపీసీ తెలంగాణ స్టేజీ–1లో నిర్మితమైన 800 మెగావాట్ల రెండో యూనిట్ స్టీమ్ బ్లోయింగ్ మే 20న పూర్తి చేసుకుంది. టర్భైన్ జనరేటర్తోపాటు వివిధ పనులు పూర్తి చేశారు. రెండో యూనిట్ సైతం ఆగస్టులో విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు యూనిట్లలో విడుదలయ్యే మొత్తం 1600 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో అందించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. -
అదరగొట్టిన కియా.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా దేశీయంగా 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ ప్లాంటులో 2019 ఆగస్ట్ నుంచి తయారీ ప్రారంభం అయింది. ఈ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 3 లక్షల యూనిట్లు. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) అనంత ప్లాంటు నుంచి తొలుత సెల్టోస్ మోడల్ కారు రోడ్డెక్కింది. ఇప్పటి వరకు 5.3 లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. కాగా, కియా ఇండియా కొత్త సెల్టోస్ను గురువారం ప్రవేశపెట్టింది. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం. -
రూ.8.7 లక్షల కోట్లు.. 2.7 కోట్ల యూనిట్ల వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో అన్ని విభాగాల్లో కలిపి తయారయ్యాయి. వీటి విలువ అక్షరాలా రూ.8.7 లక్షల కోట్లు. ఈ విలువలో 57 శాతం వాటా (రూ.5 లక్షల కోట్లు) ప్యాసింజర్ వాహనాలదేనని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక వెల్లడించింది. ప్యాసింజర్ కార్ల విభాగంలో మధ్య, పూర్తి స్థాయి ఎస్యూవీలు, ఉప విభాగాలు సగ భాగం కంటే అధికంగా కైవసం చేసుకున్నాయి. విలువలో కాంపాక్ట్ ఎస్యూవీల వాటా 25 శాతం ఉంది. లగ్జరీ కార్లు 13 శాతం వాటాతో రూ.63,000 కోట్లు నమోదు చేశాయి. వినియోగదార్లు చవక చిన్న కార్లు, సెడాన్లను ఇష్టపడటం లేదు. అందుకే ఇటువంటి కార్ల వాటా మొత్తం విలువలో తక్కువగా ఉంది. తక్కువ ధరలో లభించే వాహనాల నుంచి ఫీచర్ రిచ్ వైపు కస్టమర్లు మళ్లుతున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనం. పరిమాణం కంటే విలువ పెరుగుదల వేగంగా జరుగుతోందని నమ్ముతున్నాము’ అని నివేదిక వివరించింది. టూ–వీలర్లు 2 కోట్లు.. ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం.. భారత్లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి దాదాపు చైనా స్థాయిలో ఉంది. ఇక్కడి తయారీ ప్లాంట్ల నుంచి ఏటా 2 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు వెలువడుతున్నాయి. ఉత్పత్తి అయిన మొత్తం వాహనాల్లో పరిమాణం పరంగా 77 శాతం వాటా టూ–వీలర్లదే. మొత్తం వాహనాల్లో కమర్షియల్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్లు ఉంటాయి. వీటిలో 2 టన్నుల లోపు సామర్థ్యంగల నాలుగు చక్రాల చిన్న క్యారియర్లు, ట్రాక్టర్ ట్రైలర్స్, టిప్పర్స్ సైతం ఉన్నాయి. వీటి విలువ రూ.1.7 లక్షల కోట్లు. కమర్షియల్ వెహికిల్స్ వాటా మొత్తం పరిమాణంలో 4 శాతం, విలువలో 19 శాతం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఆటోమొబైల్ రంగం 1.9 కోట్ల మందికి ఉపాధి కల్పించింది’ అని వివరించింది. భారీ పెట్టుబడులు.. భారత్లో ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో ఈవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ‘భారతీయ ఈవీ పరిశ్రమ చైనా, యూఎస్, ఈయూ వంటి అగ్ర దేశాల కంటే వెనుకబడి ఉంది. దేశంలో భారీ పెట్టుబడులు జరిగాయి. రాబోయే కొద్ది సంవత్సరాలలో దేశం తన ఈవీ విభాగాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉందని ఇది గట్టిగా సూచిస్తుంది. భారత్లో ఆటోమొబైల్ పరిశ్రమలో అపూర్వమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక అంశాలు పరిశ్రమను పునర్నిర్మిస్తున్నాయి. ఈవీలు, ప్రత్యామ్నా య ఇంధనం, ఎలక్ట్రానిక్ విడిభాగాల వినియోగంలో పెరుగుదల, షేర్డ్ వెహికల్ రెంటల్స్/క్యాబ్ సర్వీస్ల వంటి అంశాలు భారతీయ ఆటోమొబైల్ రంగంలో పరివర్తనకు కారణమవుతున్నాయి’ అని నివేదిక పేర్కొంది. -
మెగా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్
-
భారత్ లో టెస్లా కార్ల తయారీ కేంద్రం....
-
కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన రామ్ చరణ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించారు. తన స్నేహితుడు విక్రమ్తో కలిసి వీ మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ను స్టార్ట్ చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థ విక్రమ్ (విక్కీ), రామ్ చరణ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్) అలాగే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. 2017లో స్థాపించిన ఈ సంస్థ ఖైదీ నం.150 వంటి హిట్ సినిమాలను అందించింది. తాజాగా ప్రారంభించిన వీ మెగా పిక్చర్స్ బ్యానర్పై తీయనున్న చిత్రాల్లో కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వనున్నారు. యంగ్ టాలెంటెడ్ నటీనటులకు పాన్ ఇండియా ప్రాజెక్ట్లను ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘మా వి మెగా పిక్చర్స్’ బ్యానర్ విలక్షణమైన ఆలోచనలను ఆవిష్కరిస్తూ సరికొత్త, వైవిధమ్యైన వాతావరణాన్ని పెంపొందించటానికి సిద్దంగా ఉన్నాం. సృజనాత్మకతతో సినిమా సరిహద్దులను చెరిపేస్తాం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఓ సరికొత్త ప్రభావాన్ని చూపించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం.' అన్నారు. యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ..'ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించటం అనేది మాలో తెలియని ఆనందాన్ని కలిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి "వి మెగా పిక్చర్స్" పని చేయనుంది. వెండితెరపై చూపించబోయే స్టోరీ టెల్లింగ్లో ఓ కొత్త ఒరవడిని తీసుకు రావాలనుకుంటున్నాం. దీని వల్ల సినీ ఇండస్ట్రీ హద్దులు చెరిపేయటమే మా లక్ష్యం.' అన్నారు. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా.. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన జీ20 సమ్మిట్లో ముఖ్య అతిథిగా చెర్రీ పాల్గొన్నారు. ఇండియా సినిమా గురించితన ఆలోచనలను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: భర్తకు విడాకులిచ్చిన బుల్లితెర నటి? ఫోటోతో క్లారిటీ!) -
భారత్లో ఐఫోన్ల తయారీ నిలిపివేత..వ్యాపారంలో లాభాలు లేక సతమతం?
భారత్లో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాల్ని గడించే విషయంలో విస్ట్రాన్ అసంతృప్తిగా ఉంది. కాబట్టే వచ్చే ఏడాది నాటికి దేశీయంగా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఐఫోన్ల తయారీని దశల వారీగా నిలిపి వేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అంశంపై విస్ట్రాన్ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. విస్ట్రాన్ భారత్లో అనుకున్నంత స్థాయిలో దీర్ఘకాలిక లాభాల్ని గడించడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేలా వియాత్నం, మెక్సికో వంటి దేశాల్లో లాభదాయకమైన టెక్నాలజీ తయారీ సంబంధిత ప్రొడక్ట్లపై దృష్టి సారించినట్లు సమాచారం. ఐఫోన్తో జరిపిన చర్చలు విఫలం ఇక, ఐఫోన్ల తయారీ నిలిపివేతపై విస్ట్రాన్ ఎగ్జిక్యూటీవ్లు కీలక వ్యాఖ్యలు చేశారంటూ రిపోర్ట్లు పేర్కొన్నాయి. భారత్లో యాపిల్ చేస్తున్న బిజినెస్లో ప్రాఫిట్స్ రావడం లేదని, ఎక్కువ లాభాలు వచ్చేలా యాపిల్ సంస్థతో జరిపిన చర్చలు విఫలమైనట్లు హైలెట్ చేశాయి. అయితే అంతర్జాతీయ తయారీ సంస్థలైన ఫాక్స్కాన్, పెగాట్రాన్స్ స్థాయిలో విస్ట్రాన్ ఆదాయాన్ని అర్జించడంలో ఇబ్బందులు పడుతుందని సమాచారం. చదవండి👉 ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా? విస్ట్రాన్ భారత్లో యాపిల్ కోసం ఐఫోన్ ఎస్ఈలను తయారు చేయడమే కాదు..ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంటే ఐఫోన్ల తయారీ, స్టోరేజ్ నిర్వహణ, అమ్మకాలు జరుపుతుంది. అయినప్పటికీ ఫ్రాఫిట్స్ పొందే విషయంలో ఇబ్బందులు పడుతుంది. వ్యాపారాన్ని మరింత విస్తరించలేకపోతుంది. వేధిస్తున్న అట్రిషన్ రేటు ఇంకా, కర్ణాటకలోని కోలార్ జిల్లా, అచ్చటనహళ్లి గ్రామ పారిశ్రామక వాడలో ఉన్న విస్ట్రాన్ తయారీ యూనిట్లో ఉద్యోగులు స్థిరంగా ఉండటం లేదు. అధిక వేతనం కోసం ఇతర సంస్థల్లో చేరుతున్న సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంది. నివేదిక ప్రకారం.. చైనా - భారత్ల మధ్య వర్క్ కల్చర్ విషయంలో కంపెనీ అనేక సవాళ్లు విస్ట్రాన్ ఐఫోన్ తయారీ నిలిపివేయడానికి దోహదపడ్డాయి. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకపోవడంతో అట్రిషన్ రేట్ పెరిగేందుకు దారి తీసింది. ఐఫోన్ 15 తయారు చేయనున్న టాటా! సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా, విస్ట్రాన్ తన ఐఫోన్ల తయారీని టాటా గ్రూప్కు విక్రయిస్తోంది. ట్రెండ్ ఫోర్స్ రిపోర్ట్ సైతం టాటా గ్రూప్ భారత్లో విడుదల కానున్న ఐఫోన్ 15 మోడళ్లను తయారు చేసేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. చివరిగా.. 2008లో పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సర్వర్లతో సహా ఇతర సేవల్ని అందించేలా విస్ట్రాన్ భారతీయ మార్కెట్లో అడుగు పెట్టింది. 2017లో, కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించి యాపిల్ కోసం ఐఫోన్లను తయారు చేయడం ప్రారంభించింది. చదవండి👉‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్కుక్ వైరల్ -
ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్.. కర్నాటకలోని బెంగుళూరు వద్ద ఉన్న బిదాడి ప్లాంట్–1 ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచేందుకు మూడవ షిఫ్ట్ను ప్రారంభించింది. ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వంటి ప్రసిద్ధ మోడళ్లలో వెయిటింగ్ పీరియడ్ను తగ్గించాలన్నది కంపెనీ భావన. ఈ యూనిట్లో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడానికి కంపెనీ రూ.90 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టింది. ఇదీ చదవండి: హ్యుందాయ్, షెల్ జోడీ.. ఎలక్ట్రిక్ వాహనదారులకు వెసులుబాటు ప్లాంట్లో 3వ షిఫ్ట్ కోసం దాదాపు 1,500 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. ‘ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, ఫార్చ్యూనర్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసే ప్లాంట్లో మూడవ షిఫ్ట్ని ప్రారంభించాం. ఈ ఉత్పత్తులు చాలా విజయవంతం అయ్యా యి. అలాగే వీటికి వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉంది. వేచి ఉండే కాలాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సుదీప్ ఎస్ దాల్వి తెలిపారు. -
మారుతి జిమ్నీ ఫస్ట్ కారు వచ్చేసింది - ఇక లాంచ్ అప్పుడే!
2023 ఆటో ఎక్స్పోలో 'మారుతి జిమ్నీ' 5 డోర్ వెర్షన్ కనిపించినప్పటినుంచి ఈ SUV కోసం ఎంతో మంది వాహన ప్రేమికులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కంపెనీ ఈ ఆఫ్ రోడర్ కోసం మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే తాజాగా మారుతి సుజుకి ఈ కారు గురించి ఒక అప్డేటెడ్ న్యూస్ అధికారికంగా వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం జిమ్నీ 5-డోర్స్ సిరీస్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక విక్రయాలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ధర కాకుండా ఈ కారు గురించి దాదాపు అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. బుకింగ్స్ కూడా దాదాపు 30వేలకు చేరువలో ఉన్నట్లు సమాచారం. మారుతి సుజుకి జిమ్నీ ధరలు జూన్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత వారంలో డెలివరీలు మొదలవుతాయని అంచనా. మార్కెట్లో ఈ కారు ఇంకా అధికారికంగా లాంచ్ కాకముందే వెయింటింగ్ పీరియడ్ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మాన్యువల్ గేర్బాక్స్ వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం దాదాపు ఆరు నెలల వరకు ఉంది. అదే సమయంలో ఆటోమేటిక్ వెయిటింగ్ పీరియడ్ ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంటుంది. నాలుగు వేరియంట్లలో విడుదలకానున్న జిమ్నీ టాప్ స్పెక్ వేరియంట్ 'ఆల్ఫా'కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది. జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే కలర్ ఆప్షన్లలో విడుదలవుతుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ కలిగిన జిమ్నీ 105 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. మారుతి సుజుకి తన గురుగ్రామ్ ప్లాంట్లో ప్రతి సంవత్సరం 1 లక్ష యూనిట్ల జిమ్నీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 66 శాతం దేశీయ విక్రయాలకు, మిగిలిన 34 శాతం ఎగుమతులకు కేటాయించే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ కేవలం భారతీయ మార్కెట్ కోసం ప్రతి నెల 7,000 యూనిట్లు కేటాయించాలని దానివైపు అడుగులు వేస్తోంది. (ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో) భారతీయ మార్కెట్లో విడుదలకానున్న మారుతి జిమ్నీ ఇప్పటికే విపరీతమైన అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'మహీంద్రా థార్'కి ప్రత్యేతిగా నిలబడుతుంది. కావున అమ్మకాల పరంగా కంపెనీ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మారుతి జిమ్నీ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
20 శాతం తగ్గిన మొబైల్స్ ఉత్పత్తి
కోల్కత: మొబైల్స్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. 2022తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–ఏప్రిల్లో ఉత్పత్తి 20 శాతం వరకు క్షీణించింది. గడిచిన ఆరు నెలలుగా స్మార్ట్ఫోన్ అమ్మకాలు తగ్గుతుండడం ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. పరిశోధన సంస్థ కౌంటర్పాయింట్ ప్రకారం.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 అక్టోబర్–డిసెంబర్లో 30 శాతం, 2023 జనవరి–మార్చిలో 18 శాతం స్మార్ట్ఫోన్స్ సరఫరా తగ్గింది. విక్రయాలు ఈ ఏడాది జనవరి–మార్చిలో పడిపోయాయని భారత్లో అతిపెద్ద మొబైల్స్ రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా క్షీణత.. కేవలం భారత్లో మాత్రమేగాక ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడంతో మొబైల్ ఫోన్ పరిశ్రమపై ప్రభావం చూపుతోందని కార్బన్తోపాటు ఇతర కంపెనీలకు హ్యాండ్సెట్స్ను తయారు చేస్తున్న జైనా గ్రూప్ ఎండీ ప్రదీప్ జైన్ తెలిపారు. ప్రస్తుత డిమాండ్కు తగ్గట్టుగా కంపెనీలు ఉత్పత్తిని సవరించాయని అన్నారు. ఈ ఒత్తిడి కొన్నాళ్లు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ప్రీమియం సెగ్మెంట్ ఇప్పటికీ స్థితిస్థాపకంగా ఉంది. ప్రారంభ, మధ్యస్థాయి స్మార్ట్ఫోన్స్ విభాగంలో మొబైల్స్ సంస్థలు తయారీని 15–20% కుదించాయని కౌంటర్పాయింట్ రిసర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వివరించారు. పది వారాల నిల్వలు.. ప్రస్తుతం చాలా బ్రాండ్స్ వద్ద 10 వారాలకు సరిపడ నిల్వలు ఉన్నాయని పాఠక్ వెల్లడించారు. ఉత్పత్తి విషయంలో కంపెనీలు జూన్ వరకు ఇదే స్థితిని కొనసాగిస్తాయని అన్నారు. రెండవ అర్ద భాగంగా చాలా కంపెనీలు స్వల్పంగా మెరుగైన పనితీరు కనబరుస్తాయని వివరించారు. ఉత్పత్తి తగ్గించడం ఈ ఏడాది ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్–జూలై, నవంబర్–డిసెంబర్లో సైతం కంపెనీలు తయారీని కుదించాయి. ఇది కేవలం 5–10 శాతం క్షీణతకే పరిమితం అయిందని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. మొబైల్స్ డిమాండ్ ఉత్సాహంగా లేదు. కానీ చెప్పుకోదగ్గ తగ్గుదల లేదని థర్డ్ పార్టీ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ ఎండీ అతుల్ బి లాల్ తెలిపారు. కొన్ని సంస్థలు హ్యాండ్సెట్స్ను ఎగుమతి చేస్తున్నాయని గుర్తుచేశారు. -
ఉత్పత్తిలో కనివిని ఎరుగని రికార్డ్ - 70 లక్షల యూనిట్గా ఆ బైక్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'సుజుకి మోటార్సైకిల్' (Suzuki Motorcycle) ఇటీవల ఉత్పత్తిలో గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇందులో భాగంగానే గురుగ్రామ్లోని ఖేర్కి ధౌలా ప్లాంట్ నుండి 7 మిలియన్ల యూనిట్ బైకుని అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ 7 మిలియన్ యూనిట్గా ఎల్లో కలర్ ఫినిషింగ్ పొందిన 'సుజుకి వి-స్ట్రామ్ ఎస్ఎక్స్' విడుదల చేసింది. ఇది నిజంగానే కంపెనీ సాధించిన అపూర్వమైన విజయం అనే చెప్పాలి. ఫిబ్రవరి 2006లో ఇండియన్ మార్కెట్లో కార్యకలాలను ప్రారంభించిన సుజుకి మోటార్సైకిల్ ఇండియా మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 9.38 లక్షల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) సుజుకి మోటార్సైకిల్ ఇండియా వి-స్ట్రామ్ ఎస్ఎక్స్, జిక్సర్ ఎస్ఎఫ్ 250, జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్, యాక్సెస్ 125, అవెనిస్, బర్గ్మాన్ స్ట్రీట్, బర్గ్మాన్ స్ట్రీట్ ఈఎక్స్ వంటి ద్విచక్ర వాహనాలను దేశీయ విఫణిలో తయారు చేస్తోంది. అంతే కాకుండా పెద్ద-బైక్ పోర్ట్ఫోలియోలో వి- స్ట్రామ్ 650XT, కటన, హయబుసా మోడల్స్ ఉత్పత్తి చేస్తోంది. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. -
ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్లో ఉత్పత్తి
ప్రీమియం ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 7 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. అంటే ఇది గతంలో కంటే మూడు రెట్లు అధికం. దీంతో స్మార్ట్ఫోన్ రంగంలో భారత్.. చైనా దాటి వేగంగా దూసుకెళ్తోంది. (New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!) ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ నుంచి పెగాట్రాన్ కార్ప్కి విస్తరించిన భాగస్వాముల ద్వారా యాపిల్ ఇప్పుడు దాదాపు 7 శాతం ఐఫోన్లను భారతదేశంలో తయారుచేస్తోంది. 2021లో 1 శాతం వాటాను కలిగి ఉన్న భారతదేశానికి ఇది గణనీయమైన పురోగతి. వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై ఆధారపడటాన్ని యాపిల్ తగ్గించి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. గత సంవత్సరం జెంగ్జౌలోని ఫాక్స్కాన్ ప్రధాన “ఐఫోన్ సిటీ” కాంప్లెక్స్లో గందరగోళం కారణంగా యాపిల్ ఉత్పత్తి అంచనాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. మరోవైపు భారత ప్రభుత్వం తయారీ రంగాన్ని పెంపొందించడానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో యాపిల్ చైనాను కాదని భారత్లో ఉత్పత్తిని పెంచింది. ఇదే దూకుడు కొనసాగితే 2025 నాటికి మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో నాలుగింట ఒక వంతు భారత్లోనే జరగనుంది. తన సప్లయి చైన్ను విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించిన యాపిల్ భారతదేశంలో ప్రోత్సాహకాల కోసం విజయవంతంగా లాబీయింగ్ చేసింది. ఫాక్స్కాన్, విస్ట్రాన్ కార్ప్, పెగాట్రాన్ సంస్థలతో జత కట్టింది. ఈ మూడు కలిసి భారత్లో దాదాపు 60,000 మందికి ఉపాధి కల్పించాయి. ఐఫోన్ 11 నుంచి తాజా ఐఫోన్ 14 వరకు మోడల్లను ఇక్కడ తయారు చేస్తున్నాయి. యాపిల్ తన మొదటి రెండు రిటైల్ స్టోర్లను వచ్చే వారం భారతదేశంలో ప్రారంభించనుంది. ఒకటి ఆర్థిక కేంద్రమైన ముంబైలో, మరొకటి దేశ రాజధాని న్యూఢిల్లీలో. యాపిల్ చీఫ్ టిమ్ కుక్ వీటిని ప్రారంభించేందుకు స్వయంగా వస్తారని తెలుస్తోంది. -
దుమ్మురేపిన నెక్సాన్.. ఉత్పత్తిలో రికార్డు బద్దలు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా కార్లలో ఒకటి నెక్సాన్. దేశీయ మార్కెట్లో ఈ SUV విడుదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు దీని కున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు. కంపెనీ ఇటీవల నెక్సాన్ ఉత్పత్తిలో ఐదు లక్షల మైలురాయిని చేరుకుంది. 2017 నుంచి సబ్-4-మీటర్ సెగ్మెంట్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే విజయకేతనం ఎగురవేసింది. నిజానికి 2014 ఆటో ఎక్స్పోలో కనిపించిన టాటా నెక్సాన్ 2017లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది మొదట్లో ఏడు వేరియంట్లు, రెండు ఇంజిన్ ఆప్షన్లతో మొదలైంది. 'నెక్సాన్'లో మొదటి ఇంజిన్ 3 సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ (109 హెచ్పి & 170 ఎన్ఎమ్ టార్క్) కాగా, రెండవది 1.5-లీటర్, ఫోర్-సిలిండర్, డీజిల్ రెవోటార్క్ (109 హెచ్పి & 260 ఎన్ఎమ్ టార్క్). ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలలో లభించాయి. 2020లో నెక్సాన్ మార్కెట్లో రీడిజైన్ మోడల్ విడుదలైంది. ఇందులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మార్పులు జరిగాయి. ఆ తరువాత నెక్సాన్ ఈవీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. 2020లోనే కంపెనీ రూ. 14.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో నెక్సాన్ ఈవీ లాంచ్ చేసింది. ఇది 30.2 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ కారు అతి తక్కువ కాలంలోనే అత్యంత ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా రికార్డ్ సృష్టించింది. ఇక టాటా మోటార్స్ 2022లో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ విడుదల చేసింది. ఇది దాని స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ అయింది.ఈ అప్డేట్ మోడల్ 40.5 kWh బ్యాటరీ ప్యాక్తో 453 కిమీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధ్రువీకరించారు. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంది. మొత్తానికి టాటా నెక్సాన్ తన ఆరు సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో గొప్ప విజయాలను కంపెనీకి తీసుకురావడంలో సహాయపడింది. ఈ మధ్య కాలంలోనే కంపెనీ కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని నెక్సాన్ డార్క్ ఎడిషన్, కజిరంగా ఎడిషన్, జెట్ ఎడిషన్ వంటి అనేక స్పెషల్ అవతార్లలో కూడా విడుదల చేసి ఉత్పత్తిలో 5 లక్షల మైలురాయిని చేరుకుంది. -
ముడి చమురు ఉత్పత్తిపై ఇక జీరో విండ్ఫాల్ ట్యాక్స్
భారత ప్రభుత్వం ముడి చమురు ఉత్పత్తిపై విండ్ఫాల్ పన్నును పూర్తిగా తొలగించింది. టన్నుకు రూ. 3,500 (42.56 డాలర్లు) ఉన్న పన్నును సున్నాకు తగ్గించింది. అంటే దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ఎలాంటి విండ్ఫాల్ పన్ను ఉండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. (వామ్మో రూ. 35 వేల కోట్లా.. బ్యాంకులు ఏం చేశాయో తెలుసా?) అలాగే డీజిల్పై గతంలో ఉన్న విండ్ఫాల్ పన్నును ప్రభుత్వం లీటరుకు రూపాయి నుంచి 50 పైసలకు తగ్గించింది. ఇక పెట్రోలియం, ఏటీఎఫ్పై ఎలాంటి విండ్ఫాల్ పన్ను లేదు. విండ్ఫాల్ టాక్స్ అనేది కొన్ని పరిశ్రమలు తమ సగటు ఆదాయం కంటే ఎక్కువ ఆర్జించినప్పుడు విధించే పన్ను. ఒక పరిశ్రమ ఊహించని విధంగా భారీ లాభాలను ఆర్జించినప్పుడు ప్రభుత్వానికి ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఇంధన ధరలు చమురు ఉత్పత్తిదారులకు అధిక లాభాలను తెచ్చిపెట్టడంతో గత ఏడాది జూలైలో ప్రభుత్వం ఈ పన్నును ప్రవేశపెట్టింది. (పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!) అప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా 2022 జూలైలో ముడి చమురుపై విండ్ఫాల్ పన్నులు టన్నుకు రూ. 23,250 నుంచి 2023 మార్చి 21 నాటికి టన్నుకు రూ. 3,500కి తగ్గాయి. ఇటీవల పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్) ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ చర్య కారణంగా ఏప్రిల్ 3న బ్రెంట్ ధర దాదాపు 6 శాతం పెరిగి బ్యారెల్కు 84.58 డాలర్లకు చేరుకుంది. -
టీవీఎస్ ఐక్యూబ్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా?
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఆదరణ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా వాహన తయారీ సంస్థలు దేశీయ విఫణిలో ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కంపెనీ టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలను పొందుతూ ఎట్టకేలకు ఉత్పత్తిలో లక్ష యూనిట్ల మైలురాయిని దాటేసింది. 2022 జనవరిలో కేవలం 1,529 యూనిట్ల అమ్మకాలతో మొదలైన ఐక్యూబ్ 2023 మార్చి నెలలో ఏకంగా 15,364 యూనిట్ల అమ్మకాలను చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఏవిధంగా సాగాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్, ఎస్, ఎస్టి అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఐక్యూబ్ స్టాండర్డ్ ధర రూ. 98,564 కాగా, ఎస్ వేరియంట్ ధర రూ. 1,08,690 (ఆన్-రోడ్ ఢిల్లీ). అయితే కంపెనీ టాప్ వేరియంట్ ధరలను వెల్లడించలేదు, అయితే ఇది ఒక ఛార్జ్తో 140 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) టీవీఎస్ ఐక్యూబ్ ఎల్ఈడీ లైట్స్, TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12 ఇంచెస్ వీల్స్ వంటివి పొందుతుంది. ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న ఈ స్కూటర్ నగర ప్రయాణాలను చాల అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం రిటైల్ నెట్వర్క్ కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే వంద నగరాల్లో 200 టచ్పాయింట్లను ప్రారభించింది. ఇటీవల ఈ స్కూటర్ 2023 గ్రీన్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. -
హిప్ హిప్ హుర్రే! దూసుకుపోతున్న థార్
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా పాపులర్ వెహికల్ మహీంద్రా థార్ దూసుకుపోతోంది. తన ఐకానిక్ ఆఫ్-రోడర్ 100,000 యూనిట్ల గణనీయమైన ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు మహీంద్రా తాజాగా ప్రకటించింది. సరికొత్త థార్ లాంచ్ చేసిన కేవలం రెండున్నర ఏళ్లలోనే ఈ మైలురాయిని సాధించిందని పేర్కొంది. దేశంలో థార్కు లభిస్తున్న ప్రజాదరణ, సక్సెస్కి ఇది నిదర్శనమని మహీంద్రా తెలిపింది. అసాధారణ పనితీరు, డిజైన్కు గాను ఇప్పటికే పలు అవార్డులు, ప్రశంసలు దక్కించుకుంది. థార్ ఉత్పత్తిలో 100,000 యూనిట్ల కీలక మైలురాయిని చేరుకోవడం చాలా గర్వంగా ఏందని వీజయ్ నక్రా, (ప్రెసిడెంట్ - ఆటోమోటివ్ డివిజన్, ఎం అండ్ లిమిటెడ్) సంతోషాన్ని ప్రకటించారు. (సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు) మహీంద్రా థార్ అద్భుతమైన డిజైన్, ఫీచర్లు, కెపాసిటీతో బాగా ఆకట్టుకుంటోంది. ఆల్-టెరైన్ సామర్థ్యాలతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా అందిస్తుంది. థార్ ఇప్పుడు 4x4, ఆర్డబ్ల్యూడీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పాత థార్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. వీటిలో 2.0-లీటర్, 4-సిలిండర్ mStallion పెట్రోల్ ఇంజీన్ 150 BHP , 320 గరిష్ట్ టార్క్ను, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజీన్ 130 బీహెచ్పీ పవర్ను, 320గరిష్ట టార్క్ను అందిస్తాయి. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అందుబాటులో ఉన్నాయి. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) ఇక బలమైన డ్రైవ్ట్రెయిన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ , మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, షిఫ్ట్-ఆన్-ది-ఫ్లై ట్రాన్స్ఫర్ కేస్ వంటి అధునాతన ఫీచర్లతో 4x4 వేరియంట్ ఆఫ్-రోడ్ ఔత్సాహికులకు సరిజోడి లాంటిది. అలాగే RWD వేరియంట్ థార్ నగరం ,హైవే వినియోగానికి వీలుగా విలక్షణమైన డిజైన్ , ఖరీదైన రైడ్ కోసం చూసే వినియోగదారులకు అనువైనది. -
అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు'
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి బెదిరింపులకు తెగబడ్డాడు. ఈ మేరకు కిమ్ మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలని, శక్తిమంతమైన ఆయుధాలను తయారు చేయాలని పిలుపునిచ్చాడు. గతంలో ఆయన మరిన్నీ ఆయుధాలు పెంచుతానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడూ దాన్నే నిజం చేస్తూ.. కిమ్ ఇలా అణ్వాయుధా సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తన అణ్వాయుధాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించడాని రెడీగా ఉండాలని చెప్పారు. మరింత ముందుచూపుతో అణు ఆయుధాలను తయారు చేసేలా అణు పదార్థాల ఉత్పత్తిని పెంచాలాని ఆదేశించారు. మనం ఆయుధాలను దోషరహితంగా ముందుచూపుతో సిద్ధం చేస్తే.. శత్రువు మనకు భయపడతాడని అన్నారు. తద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని, వ్యవస్థను, ప్రజలను రెచ్చగొట్టే సాహసం చేయలేడని చెప్పారు. గతేడాదే ఉత్తరకొరియా తిరుగులేని శక్తిగా ప్రకటించుకుంది. ప్రస్తుతం మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తికి పిలుపునిచ్చి తన మాటను నిజం చేసుకుంది. అమెరికా, దక్షిణ కొరియా మంగళవారమే ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా, ఇటీవలే ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను వైవిధ్యపరిచేలా సరికొత్తగా నీటి అడుగున అణుదాడి చేసే డ్రోన్ సంబంధిత పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇది సముద్రంలో సునామీ సృష్టించి తీర ప్రాంతాలను తుడిచిపెట్టేలా చేయడం లేదా నౌక స్థావరాలను ముంచేయడం వంటి విధ్వంసాలను సృష్టిస్తుంది. (చదవండి: ఇదొక జబ్బులా ఉంది! స్కూల్ ఘటనపై జోబైడెన్ ఫైర్) -
సమ్మర్ రష్: కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ జోరు
న్యూఢిల్లీ: దేశంలో కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ సంస్థలు వేసవి సీజన్ కోసం పూర్తి సన్నద్ధమయ్యాయి. ఏటా వేసవిలో సహజంగానే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు ఇతర ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. దీంతో రానున్న మూడు నెలల్లో డిమాండ్ను కంపెనీలు ముందే అంచనా వేస్తున్నాయి. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తిని గడిచిన 18 నెలల్లోనే గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఇప్పటికే అసాధారణంగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి ఉత్పత్తులకు డిమాండ్ అనూహ్యంగా ఉండొచ్చన్నది కంపెనీల అంచనా. ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! వైట్గూడ్స్ తయారీ సంస్థలు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, చెస్ట్ ఫ్రీజర్లను 90-100 శాతం సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో వీటి ఉత్పత్తి 60-70 శాతం పరిధిలోనే ఉండడం గమనించాలి. అంతేకాదు వేసవి డిమాండ్కు ఎఫ్ఎంసీజీ కంపెనీలు, బీర్ కంపెనీలు కూడా పూర్తి సామర్థ్యం మేరపనిచేస్తున్నాయి. ‘‘చాలాకాలం తర్వాత మా ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయి. అంతకుముందు మార్చి నెలతో పోలిస్తే ప్రస్తుతం విక్రయాలు ఇప్పటికే 20 శాతం అధికంగా నమోదవుతున్నాయి’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!) -
Okinawa: కొత్త రికార్డ్ బద్దలు కొట్టిన ఒకినావా
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందిన 'ఒకినావా' (Okinawa) ఉత్పత్తిలో ఇప్పుడు కొత్త మైలురాయిని చేరుకుంది. ఇటీవల కంపెనీ తన 2,50,000వ యూనిట్ ప్రైజ్ ప్రో ఆఫ్ ప్రొడక్షన్ రాజస్థాన్లోని తన ప్లాంట్ నుండి విడుదల చేసింది. 2015 భారతదేశంలో తన కార్య కలాపాలను ప్రారంభించిన ఒకినావా, ఉత్పత్తిలో ఒక కొత్త చరిత్రను సృష్టించింది. అంటే కంపెనీ 2,50,000 వాహనాలను ఉత్పత్తి చేయడానికి 8 సంవత్సరాల సమయం పట్టింది. 2015లో కార్యకలాపాలను ప్రారభినప్పటికీ 2017లో ఒకినావా రిడ్జ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరిచయం చేసింది. తరువాత 2019లో భారత ప్రభుత్వం నుంచి మొదట ఫేమ్ II సబ్సిడీని పొందిన ఘనత దక్కించుకుంది. క్రమంగా మార్కెట్లోకి ఐప్రైస్ ప్లస్, ప్రైస్ ప్రో, లైట్, ఆర్30 వంటి వాటిని విస్తరించింది. 2021లో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన ఒకినావా అదే సంవత్సరంలో గెలాక్సీ స్టోర్లను ప్రారంభించింది. కాగా 2022లో కంపెనీ OKHI-90 తీసుకురావడమే కాకుండా రాజస్థాన్లోని రెండవ ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ 2025 నాటికి 1000 కంటే ఎక్కువ డీలర్షిప్లను విస్తరించాలని దానికనుగుణంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ) ఒకినావా, టాసిటా (Tacita)తో ఏర్పరచుకున్న భాగస్వామ్యంతో మరో మూడేళ్లలో రూ. 218 కోట్లు పెట్టుబడి పెట్టడానికి యోచిస్తోంది. ఇది జరిగితే త్వరలోనే ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్సైకిల్ తీసుకురానున్నట్లు సమాచారం. అదే సమయంలో 2025 నాటికి ఉతప్పటిలో 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది. -
టాటా మోటార్స్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. ఇదే!
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఒకప్పటి నుంచి, ఇప్పటి వరకు కూడా అధిక ప్రజాదరణ పొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది, ఇటీవల కంపెనీ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిలో ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ ఈ రోజు వెల్లడించింది. టాటా మోటార్స్ 1998 నుంచి ఇప్పటి వరకు ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిలో 5 మిలియన్లకు చేరుకుంది. గత 2.5 సంవత్సరాలలో 1 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసినట్లు, ఆ తరువాత 2004లో 1 మిలియన్, 2010లో రెండవ మిలియన్ను సాధించి, 2015లో 3 మిలియన్ల మార్కును చేరుకుంది. 2020 నాటికి కంపెనీ 4 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసింది. మొత్తం మీద ప్యాసింజర్ కార్ల ఉత్పత్తిలో ఎట్టకేలకు 5 మిలియన్ మార్కుని చేరుకుంది. టాటా మోటార్స్ చరిత్రలో ఈ రోజు మరచిపోలేని రోజు. కంపెనీ ఇలాంటి గొప్ప రికార్డ్స్ సాధించడంలో ఎప్పుడు ముందు ఉంటుందని, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. గత కొంత కాలంలో ప్రపంచం కరోనా మహమ్మారి కోరల్లో నలుగుతున్న సమయంలో, సెమికండక్టర్ చిప్ కొరత ఉన్నప్పటికీ కంపెనీ ఈ 5 మిలియన్ ప్రొడక్షన్ రికార్డ్ కైవసం చేసుకుంది. ఈ రికార్డ్ సృష్టించడానికి కారకులైన ఉద్యోగులకు, కష్టమరలకు కంపెనీ కృతఙ్ఞతలు తెలిపింది. ఐదు మిలియన్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న సందర్భంగా టాటా మోటార్స్ భారతదేశంలోని కస్టమర్లు మరియు ఉద్యోగుల కోసం ఒక వేడుక ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే కంపెనీ తమ తయారీ ప్రదేశాలు, ప్రాంతీయ కార్యాలయాల్లో నెల రోజుల పాటు వేడుకలను కొనసాగిస్తుంది. -
అంతరిక్షంలో బంగారం!
వాషింగ్టన్: మన పాలపుంతలో గ్రహాలతోపాటు కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. సమీపంలోని రెండు నక్షత్రాలు పరస్పరం ఢీకొని శక్తివంతమైన కొత్త నక్షత్రంగా ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిణామాన్ని కిలోనోవా అంటారు. మనం ఉంటున్న నక్షత్ర మండలంలో మరో అరుదైన కిలోనోవాకు అంకురార్పణ జరిగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగోళం నుంచి 11,000 కాంతి సంవత్సరాల దూరంలో రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నట్లు తేల్చారు. తొలుత నాసాకు చెందిన నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు గమనించారు. అనంతరం చిలీలో అమెరికన్ అబ్జర్వేటరీలో ఉన్న స్మార్ట్ 1.5 మీటర్ టెలిస్కోప్ సాయంతో కిలోనోవా పరిణామాన్ని నిర్ధారించారు. అధ్యయనం ఫలితాలను నేచర్ జర్నల్లో ప్రచురించారు. త్వరలో సంభవించబోయే కిలోనోవా కోసం శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు నక్షత్రాలు కలిసిపోయినప్పుడు భారీ పేలుడు సంభవిస్తుందని, ఇందులో బంగారం లాంటి లోహాలు ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా నక్షత్రాలు, గ్రహాల పుట్టుకతోపాటు అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు ఈ కిలోనోవా దోహదపడుతుందని భావిస్తున్నారు. విశ్వంలో ఇప్పటిదాకా 10 కిలోనోవాలో సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ఒక భారీ నక్షత్రం జీవితకాలం కనీసం 10 లక్షల సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత అందులో పేలుడు జరిగి, న్యూట్రాన్ స్టార్ ఉద్భవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు. -
ఏపీ నంబర్–1.. సూపర్ మత్స్యం
సాక్షి, అమరావతి: చెరువులు, కాలువలు వంటి నీటి వనరుల్లో (ఇన్ల్యాండ్) చేపలను ఉత్పత్తి చేయడంలో అగ్రపథాన నిలిచింది. ఇన్ల్యాండ్లో 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత 16.52 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్, 8.09 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్, 7.89 లక్షల టన్నులతో ఒడిశా, 7.62 లక్షల టన్నులతో బిహార్ వరుస స్థానాలు పొందాయి. కాగా, సముద్ర మత్స్య ఉత్పత్తుల్లో 7.02 లక్షల టన్నులతో గుజరాత్ మొదటి స్థానం, 6.01 లక్షల టన్నులతో కేరళ రెండోస్థానం, 5.95 లక్షల టన్నులతో తమిళనాడు మూడో స్థానంలో ఉండగా.. 5.94 లక్షల టన్నులతో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ టాప్ చేపల ఉత్పత్తిలో 2021–22 సంవత్సరానికి సంబంధించి జాతీయ సగటు వృద్ధి రేటుతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ దాదాపు రెట్టింపు వృద్ధి రేటు నమోదు చేసింది. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 6.61 శాతంగా నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 12.57 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. 20కి పైగా రాష్ట్రాల్లో ఏపీలో ఉత్పత్తి అవుతున్న చేపలకే డిమాండ్ అధికంగా ఉంది. స్థానికంగా ఉత్పత్తి అయ్యే చేపల్లో 20 లక్షల టన్నులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. 2021–22లో 48.13 లక్షల టన్నుల ఉత్పత్తితో రూ.59,188 కోట్ల జీవీఏ (జోడించబడిన స్థూల విలువ) సాధించింది. (చదవండి: ఆక్వాకు ఉజ్వల భవిత..స్టేక్ హోల్డర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు) -
నవంబర్లో మౌలిక పరిశ్రమ 5.4 శాతం అప్
న్యూఢిల్లీ: ఎనిమిది రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమల గ్రూప్ నవంబర్లో 5.4 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పురోగమించింది. బొగ్గు (12.3 శాతం), ఎరువులు (6.4 శాతం), స్టీల్ (10.8%), సిమెంట్ (28.6 శాతం), విద్యుత్ (12.1 శాతం) రంగాలు మంచి ఫలితాలను నమోదుచేసుకోవడం దీనికి నేపథ్యం. అధికారిక గణాంకాల ప్రకారం, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టుల నవంబర్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదుచేసుకుంది. అక్టోబర్లో ఈ గ్రూప్ వృద్ధిరేటు 0.9 శాతంకాగా, గత ఏడాది ఇదే నెల్లో 3.2 శాతం. ఇక 2022–23 మొదటి తొమ్మిది (ఏప్రిల్–నవంబర్) నెలల్లో గ్రూప్ వృద్ధిరేటు 8 శాతం కాగా, గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి రేటు 13.9 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమల వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ నవంబర్ గణాంకాలు 2023 జనవరి రెండవ వారంలో విడుదల కానున్నాయి. -
యాపిల్ ఐఫోన్ 14.. ఇక కష్టమే..
-
దేశంలో 5జీ జోరు, వందల కోట్ల పెట్టుబడి పెట్టనున్న శాంసంగ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ భారత్లో రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఆ ఇన్వెస్ట్మెంట్తో తమిళనాడు కేంద్రంగా 4జీ, 5జీ రేడియో ఎక్విప్మెంట్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పనుంది. ఇందుకోసం జియో, ఎయిర్టెల్తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్తో పాటు మిగిలిన అంతర్జాతీయ సంస్థలు ప్రొడక్ట్లను తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకంలో చేరారు. ఈ ఏడాది అక్టోబర్లో పీఎల్ఐ స్కీమ్లో భాగంగా తయారీ సంస్థలు నెలకొల్పేలా నోకియా, శామ్సంగ్, ఎరిక్సన్ భాగస్వామి జబిల్ దేశీయంగా 5జీ పరికరాల్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో 5జీ జోరు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను విడుదల చేయడంతో 5జీ పరికరాలకు డిమాండ్ పెరగనుంది. అయితే గతేడాది పరికరాలు సరఫరా చేసే అవకాశాలు లేకపోవడంతో పీఎల్ఐ స్కీమ్లో చేరేందుకు శాంసంగ్ ఇష్టపడేలేదు. కేవలం జియోకు 4జీ పరికరాల్ని అందించే సంస్థగా కొనసాగింది. కానీ తాజాగా భారత్లో 5జీ రాకతో లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అవసరం పెరిగింది. దీంతో శాంసంగ్ పీఎల్ఐ స్కీంలో చేరి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. -
ధోని ప్రొడక్షన్లో హీరోగా విజయ్? స్టార్ హీరోలతో వరుస సినిమాలు
తమిళ సినిమా: మహేంద్రసింగ్ ధోని ఎవరని పిల్లాడిని అడిగినా ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడని ఠక్కున చెప్పేస్తాడు. భారత క్రికెట్ క్రీడారంగంలో కెప్టెన్గా అంతటి విశేష గుర్తింపును ఆయన సంపాదించుకున్నారు. ఈయన క్రికెట్ క్రీడాకారుడిగా కొనసాగుతునే అనేక వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలా ధోని అంటే ఒక బ్రాండ్గా మారిపోయారు. ఈయన బయోగ్రఫీతో వచ్చిన ధోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అలాంటిది తాజాగా మహేంద్రసింగ్ ధోని కొత్త అవతారం ఎత్తడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక్కడ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించడానికి ధోని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను కెప్టెన్ హౌస్ అనే బ్యానర్ను ఏర్పాటు చేసి తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో చిత్రాలు నిర్మించడానికి సిద్ధమైనట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అదేవిధంగా నటుడు విజయ్ హీరోగా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారీసు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తదుపరి అట్లీ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఈయన 70వ చిత్రాన్ని ధోని నిర్మించబోతున్నట్లు టాక్. ధోనికి సెవెన్ లక్కీ నంబర్ అట. విజయ్ 70వ చిత్రాన్ని నిర్మించడానికి ఇది కూడా ఒక కారణం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేవిధంగా టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు, కన్నడ స్టార్ హీరో సుదీప్తో కూడా చిత్రాలు చేయడానికి ధోని సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీని గురించి ఇప్పటి వరకు అధికార ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. -
ఐఫోన్ 14 సిరీస్ : ‘బెడిసి కొట్టిన యాపిల్ మాస్టర్ ప్లాన్’!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ ప్రో తయారీని పెంచాలనే ప్రయత్నాల్ని విరమించుకుంటున్నట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది. సెప్టెంబర్ 16 న ‘యాపిల్ ఫార్ అవుట్’ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ను విడుదల చేసింది. అయితే ఈ సిరీస్లోని ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ పెరగడం.. ధర భారీగా ఉండడంతో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ను యూజర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. విడుదల ప్రారంభంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ సేల్స్ బాగున్నా.. క్రమ క్రమంగా వాటి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల అమ్మకాలపై యాపిల్ పెట్టుకున్న భారీ అంచనాలు తారుమారయ్యాయి. అంచనాలు తలకిందులు ఈ తరుణంలో యాపిల్ సంస్థ ధర ఎక్కువగా ఉన్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల తయారీని తగ్గించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి విడుదలకు ముందు ఐఫోన్ 14 సిరీస్పై అంచనాలు భారీగా పెరగడంతో ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో 6 మిలియన్ యూనిట్ల ఐఫోన్ 14 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు..ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లను తయారు చేయాలని భావించింది. ఆదరణ అంతంత మాత్రమేనా కానీ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా లేకపోవడం, వాటి ఆదరణ అంతంత మాత్రంగా ఉండడంతో తయారీని తగ్గించాలని యాపిల్ సంస్థ ఐఫోన్ తయారీ సంస్థల్ని ఆదేశించినట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. బదులుగా, అదే సమయానికి 90 మిలియన్ ఐఫోన్ 14 ఎంట్రీ లెవల్ ఫోన్లను తయారు చేయాలని భావిస్తోంది. ఎంట్రీ లెవల్ ఫోన్ల కంటే ఐఫోన్ 14 ప్రో మోడల్ ఫోన్ల డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని యాపిల్ తగ్గించనుందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. -
మాకూ పీఎల్ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని తమకూ వర్తింపచేయాలని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలని ఆట వస్తువుల పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగాల కల్పనకు, ఎగుమతులను పెంచేందుకు ఇవి దోహదపడగలవని పేర్కొన్నాయి. ఇటు దేశీయంగా తయారీకి, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీము ప్రస్తుతం ఫార్మా తదితర 14 రంగాలకు వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో టాయ్స్ పరిశ్రమ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. (Hero Motocorp: విడా ఈవీ: తొలి మోడల్ కమింగ్ సూన్) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు సహాయకరంగా ఉంటున్నప్పటికీ పీఎల్ఐ స్కీము, ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తే మరింత తోడ్పాటు లభించగలదని లిటిల్ జీనియస్ టాయ్స్ సీఈవో నరేశ్ కుమార్ గౌతమ్ చెప్పారు. అలాగే పరిశ్రమ భవిష్యత్ వృద్ధికి దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం జాతీయ టాయ్ పాలసీ రూపొందించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన కోరారు. మరోవైపు, ప్రస్తుతం టాయ్స్ పరిశ్రమను హస్తకళలు లేదా క్రీడా వస్తువుల కింద వర్గీకరిస్తున్నారని అలా కాకుండా దీని కోసం ప్రత్యేకంగా ఎగుమతి మండలిని ఏర్పాటు చేస్తే మరింత ప్రాధాన్యం దక్కేందుకు అవకాశం ఉంటుందని నట్ఖట్ టాయ్స్ ప్రమోటర్ తరుణ్ చేత్వాని అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు భారీ అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమ ప్రస్తతుం తయారీపై దృష్టి పెడుతుండటంతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఎగుమతులు 61 శాతం అప్.. గడిచిన మూడేళ్లలో ఆటవస్తువుల ఎగుమతులు 61 శాతం పెరిగాయని ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. ఇవి 2018–19లో 202 మిలియన్ డాలర్లుగా ఉండగా 2021–22లో 326 మిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. మరోవైపు గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గాయని, 371 మిలియన్ డాలర్ల నుంచి 110 మిలియన్ డాలర్లకు దిగి వచ్చాయని వాణిజ్య శాఖ గణాంకాలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. చాలా మటుకు దిగుమతిదారులు దిగుమతులను తగ్గించుకుని, స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలు సహాయపడుతున్నాయని చెప్పారు. -
పాల ఉత్పత్తి మూడింతలు అవుతుంది
న్యూఢిల్లీ: దేశంలో పాల ఉత్పత్తి వచ్చే 25 ఏళ్లలో మూడింతలు అవుతుందని అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధి అన్నారు. 628 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని, వార్షిక సగటు వృద్ధి 4.5 శాతంగా ఉండొచ్చన్నారు. 2021లో దేశంలో 210 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి సాధ్యమైంది. గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ‘అమూల్’బ్రాండ్పై పాలు, పాల ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే విషయం తెలిసిందే. అంతర్జాతీయ డైరీ సమాఖ్య ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ డైరీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సోధి మాట్లాడారు. ఈ సదస్సు ఈ నెల 15వరకు కొనసాగుతుంది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో పాల ఉత్పత్తి పరంగా భారత్ ప్రస్తుతం 23 శాతం వాటా కలిగి ఉంది. వచ్చే 25 ఏళ్లలో 45 శాతానికి చేరుకుంటుంది. జనాభా పెరుగుదలతో డిమాండ్ ఇతోధికం అవుతుంది. దేశంలో పాల డిమాండ్ వచ్చే 25 ఏళ్లలో 517 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చు. మరో 111 మిలియన్ టన్నుల మిగులు కూడా సాధిస్తాం. తసలరి పాల లభ్యత ప్రస్తుతం 428 గ్రాములుగా ఉంటే, 852 గ్రాములకు పెరుగుతుంది. ప్రపంచంలో భారత డైరీ రంగానికి ఎంతో సమర్థవంతమైన పంపిణీ నెట్వర్క్ ఉంది’’ అని సోధి పేర్కొన్నారు. -
అంతంతమాత్రం వేతన పెంపు తీవ్ర ఆందోళనకరం!
ముంబై: ఆర్థిక పునరుద్ధరణ ఊపందుకున్నప్పటికీ, వేతన పెంపు క్షీణించడం తీవ్ర ఆందోళనకరమైన అంశమని ఇండియా రేటింగ్స్ నివేదిక ఒకటి పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ తగ్గుదలకు ఇది దారితీస్తుందని, దీనివల్ల పరశ్రమలో సామర్థ్యం వినియోగం తగ్గుతుందని పేర్కొంది. వస్తు ఉత్పత్తి– వినియోగం అంతరాన్ని ఈ పరిస్థితి మరింత పెంచుతుందని విశ్లేషించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2012–16 ఆర్థిక సంవత్సరం మధ్య ఉద్యోగుల వేతన వృద్ధి సగటున 8.2 శాతంగా నమోదయితే, 2017–21 మధ్య ఇది 5.7 శాతానికి క్షీణించింది. ► వేతన పెంపు భారీగా లేకపోవడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (20 22–23 ఏప్రిల్–జూన్) అంచనాలకన్నా తక్కువగా 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ కొనుగోలు శక్తి బలహీనంగా నమోదవుతోంది. ► జూన్ 2022ను తీసుకుంటే సంవత్సరం ప్రాతిపదికన పట్టణాల్లో వేతన పెంపు సగటు 2.8 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 5.5 శాతంగా ఉంది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటుచేస్తే, వేతనంలో వృద్ధిలేకపోగా ఈ రేట్లు వరుసగా 3.7 శాతం, 1.6 శాతం మేర క్షీణించాయి. ► ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా నమోదయ్యే వీలుంది. తృణధాన్యాలు, సేవల రంగాల్లో ధరల తీవ్రత దీనికి కారణం. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 2022–23లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (మే నుంచి 1.4 శాతం మేర పెంపుతో ప్రస్తుతం 5.4 శాతం) 25 నుంచి 50 బేసిస్ పాయింట్లమేర పెంచే వీలుంది. -
భారత్లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: భారత్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2022 జూలైలో 3.8 శాతం తగ్గింది. 2021 జూలైలో 2.54 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగితే, తాజా సమీక్షా నెల జూలై ఈ పరిమాణం 2.45 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ అలాగే ప్రైవేట్ రంగ సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి దీనికి ప్రధాన కారణం. దేశ నెలవారీ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి లక్ష్యం 2.59 మిలియన్ టన్నులకన్నా తక్కువ ఉత్పత్తి నమెదయినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. పశ్చిమ సముద్ర తీరంలో ఓఎన్జీసీ ఉత్పత్తి వార్షికంగా చూస్తే 1.7 శాతం తగ్గి 1.63 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల్లో సైతం ఉత్పత్తి 12.34 శాతం క్షీణించింది. వార్షిక అంచనాలు ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాలుగు నెలల కాలాన్ని పరిశీలిస్తే (2021-22 ఇదే కాలంతో పోల్చి) క్రూడ్ ఉత్పత్తి 9.96 మిలియన్ టన్నుల నుంచి స్వల్పంగా 9.91 మిలియన్ టన్నులకు తగ్గింది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో 29.7 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పోల్చితే ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఉత్పత్తి వరుసగా 39.8 మిలియన్ టన్నులు, 34 మిలియన్ టన్నులుగా నమోద వుతుందని అంచనావేస్తున్నట్లు చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవలే పేర్కొన్నారు. దేశం తన మొత్తం క్రూడ్ అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపై ఆధారపడే సంగతి తెలిసిందే. మిగిలిన 15 శాతం క్రూడ్ను భారత్ ఉత్పత్తి చేస్తుంది. చమురు శుద్ధికి దేశంలో 22 ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. అక్కడక్కడే సహజ వాయువు ఉత్పత్తి కాగా, దేశీయ సహజ వాయువు ఉత్పత్తి జూలైలో దాదాపు అక్కడక్కడే 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా (బీసీఎం) ఉంది. అయితే నాలుగు నెలల కాలంలో మాత్రం ఉత్పత్తి 3.4 శాతం పెరిగి 11.43 బీసీఎంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ముంబై సముద్రతీరంలోని డామన్ క్షేత్రంలో తక్కువ గ్యాస్ ఉత్పత్తి కారణంగా ఓఎన్జీసీ గ్యాస్ ఉత్పత్తి జూలైలో దాదాపు 4 శాతం క్షీణించింది. -
అదే జరిగితే.. 500 కోట్లమంది బతుకులు ఖతం!
న్యూజెర్సీ: ప్రకృతికి బదులు.. సృష్టి వినాశనానికి ఇప్పుడు మనిషే కారణం అయ్యేలా కనిపిస్తున్నాడు. అందునా అణు యుద్ధం ప్రత్యక్షంగా కంటే.. పరోక్షంగానే వందల కోట్ల మందిని బలి తీసుకుటుందనే ఊహా.. భయాందోళనలను రేకెత్తిస్తోంది ఇప్పుడు. న్యూజెర్సీ రూట్గెర్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.. అణు యుద్ధాలతో తలెత్తబోయే సంక్షోభాల మీద ఒక సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం.. ఆధునిక అణుయుద్ధం వల్ల తాండవించే కరువు, ఆహారపంటల లేమి ద్వారానే ఎక్కువ మంది బలైపోతారని.. ఆ సంఖ్య సుమారు ఐదు బిలియన్లు(ఐదు వందల కోట్ల మందికిపైనే) ఉంటుందని పేర్కొన్నారు. అణ్వాయుధాల పేలుడుతో వాతావరణంలో సూర్యకాంతి నిరోధించే మసి ద్వారా ఆహార కొరత ఏర్పడుతుందని.. ప్రాణాంతకమైన పేలుళ్ల వల్ల కలిగే ప్రాణనష్టం కంటే ఇది చాలా ఎక్కువని ఆ బృందం అభిప్రాయపడింది. ఒకవేళ అమెరికా-రష్యా మధ్య గనుక అణు యుద్ధం జరిగితే.. సగం మానవ జనాభా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ మేరకు యుద్ధ ప్రభావంతో ఏయే దేశంలో ఎంతమేర ఆహార పంటలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్పిరిక్ రీసెర్చ్ ద్వారా సేకరించింది శాస్త్రవేత్తల బృందం. అంతెందుకు భారత్-పాక్ మధ్య గనుక చిన్నపాటి యుద్ధం జరిగినా.. ఆ పరిణామం ప్రపంచ ఆహారోత్పత్తి మీద పెను ప్రభావం చూపుతుందని ఆ బృందం వెల్లడించింది. ఐదేళ్లలో ఇరు దేశాల్లో ఏడు శాతం పంట దిగుబడి తగ్గిపోతుందని.. అదే అమెరికా-రష్యాల మధ్య జరిగే యుద్ధం జరిగితేగనుక.. మూడు నుంచి నాలుగేళ్లలో 90 శాతం ఉత్పత్తి పడిపోతుందని తెలిపింది. ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు తీసుకునే చర్యలు చేపట్టినా.. రాబోయే పెనుఉపద్రవం ముందు ఆ చర్యలు పెద్దగా ప్రభావం చూపెట్టకపోవచ్చనే అభిప్రాయపడింది న్యూజెర్సీ రూట్గెర్స్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలోనే.. ఈ బృందం ఈ తరహా అధ్యయనానికి చేపట్టింది. పైగా అణు యుద్ధం తలెత్తవచ్చంటూ గతంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన కామెంట్లను సైతం పరిశీలనలోకి తీసుకుంది. ఈ అధ్యయానికి సంబంధించిన విషయాలు నేచర్ ఫుడ్ జర్నల్లో తాజాగా ప్రచురితం అయ్యాయి. ఇదీ చదవండి: భారత్ హెచ్చరికలు బేఖాతరు చేసిన చైనా -
ఎకానమీకి పీఎల్ఐ దన్ను: ఎంకే నివేదిక
ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) భారత్ ఎకానమీకి వెన్నుదన్నుగా నిలవనుందని ఎంకే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ (బ్రోకరేజ్ ఎంకే గ్లోబల్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగం) నివేదిక విశ్లేషించింది. వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కీలకరంగాల్లో తయారీ పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకం, వార్షికంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 4 శాతం అదనపు విలువను జోడించవచ్చని నివేదిక అభిప్రాయపడింది. ఇప్పటివరకు ఈ పథకం ఎల్రక్టానిక్స్, ఆటో కాంపోనెంట్స్, ఫార్మా రంగాల నుండి గరిష్ట స్పందనను చూసిందని వివరించింది. నివేదికలో మరికొన్ని అంశాలన పరిశీలిస్తే.. ► పీఎల్ఐ పథకం విజయవంతం కావడానికి చైనా ప్లస్ 1 వ్యూహమే కారణం. మహమ్మారి ప్రారంభమైన నుండి చైనాలో పెట్టుబడులకు అనేక పాశ్చాత్య కంపెనీలు, ప్రభుత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. తాజా లాక్డౌన్లు ఆ దేశంలో సరఫరాల సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. దీనికితోడు ఆ దేశానికి చెందిన అనేక వస్తువులపై అభివృద్ధి చెందిన దేశాలు యాంటీ డంపింగ్ డ్యూటీలను విధించాయి. ► ఉత్పాదక కంపెనీలు బలమైన రాబడుల కారణంగా సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. కంపెనీలు విస్తరిస్తున్నాయి. నమోదైన కొత్త తయారీ కంపెనీల సంఖ్యను బట్టి ఇది స్పష్టమవుతుంది. ► తయారీ కంపెనీల నమోదు గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో తయారీ కంపెనీల వాటా గత దశాబ్దం నుండి దాదాపు అత్యధిక స్థాయిలో ఉండడం గమనార్హం. ► మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోరిన-మంజూరైన పర్యావరణ అనుమతుల సంఖ్య అత్యధికంగా ఉంది. 2018-21లో ఆవిష్కరించిన నిర్మాణాత్మక మార్పులు ఎకానమీపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. 2003-06లో నెలకొన్న సానుకూల పరిస్థితులను తాజా పరిణామాలు గుర్తుకు తెస్తున్నాయి. ► నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తొలిరోజుల్లో దేశీయ తయారీ రంగం దెబ్బతింది. తాజాగా మహమ్మారి వినియోగదారుల డిమాండ్పై ప్రభావం చూపింది. ఆయా పరిస్థితుల నుంచి ఎదురైన సవాళ్లు తయారీ పరిశ్రమపై కొనసాగుతున్నాయి. మూలధన సవాళ్లు, సమస్యలు ఇంకా తొలగిపోలేదు. ► 2021-22లో తలసరి ఆదాయం 2020-21కన్నా పెరిగింది. మార్చితో ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరం నుండి విచక్షణాపరమైన ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రూపాయి బలహీనత బలం... చైనీస్ యువాన్తో రూపాయి విలువ క్షీణించడం భారత్ తయారీ రంగానికి సానుకూలంగా మారింది. ఈ పరిణామాల వల్ల ఆటో, ఆటో విడి భాగాలు, వ్రస్తాలు, రసాయనాలు, భారీ పరిశ్రమలకు సంబంధించి క్యాపిటల్ గూడ్స్ ప్రయోజనం పొందుతున్నాయి. – వికాస్ ఎం సచ్దేవా, ఎంకే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సీఈఓ -
సంఘీభావమే పరాయీకరణకు మందు
మనిషి క్రమంగా మనిషితనానికి దూరమై మాయమవుతున్నాడు. ఆధునిక పెట్టుబడిదారీ ఉత్పాదక వ్యవస్థలో అతడు ఒక మహాయంత్రంలో చిన్న ‘మర’ లాంటి పాత్రను పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సృజనాత్మకతను కోల్పోయి వస్తూత్పత్తి యంత్రంగా మిగిలిపోతున్నాడు. తాను తయారుచేసే వస్తువు పట్ల సంతృప్తి పొందలేకపోతున్నాడు. ఇలా మొత్తంగా పరాయీకరణకు గురై... మనిషి సొంత గుర్తింపు రద్దు అవుతున్న స్థితిలో, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవసరం ఉన్నా లేకున్నా... వస్తువులను కొంటూ పోతున్నాడు. ఈ వస్తు వినిమయంలోనే ఆనందాన్ని వెదుక్కొంటున్నాడు. తద్వారా వస్తువులే మానవ సంబంధాలను నిర్ణయించే స్థితి ఏర్పడుతోంది. అందుకే సముదాయాల నడుమ అర్థవంతమైన సంఘీభావాన్ని నిర్మించడమే ఇప్పుడు కావలసింది. పెట్టుబడిదారీ విధానాన్ని సునిశిత విమర్శకు గురి చేసే కార్ల్మార్క్స్ నేటికీ తన ప్రాసంగికత కోల్పోలేదు. పెట్టుబడిదారీ విధానంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, అలాగే వేతన శ్రామికుని పరాయీ కరణ జరిగే విధానాన్నీ మార్క్స్ పేర్కొన్నాడు. తన తొలి రచనలలో– మనిషి తన పట్ల, తన చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల ఎరుక ఉన్న జీవిగా (స్పీసీస్–బీయింగ్) ఒక రకమైన పరాయీకరణకు గురవ్వడాన్ని ప్రస్తావించాడు. తరువాతి కాలపు రచనలలో ఆయన ఎక్కువగా ఈ పరాయీకరణకు కారణమైన వ్యవస్థీకృత సాంకేతిక అంశాల మీద చూపు నిలిపాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తి పద్ధతిలో శ్రామికులు సాధా రణంగా తాము చేసే వస్తు ఉత్పత్తితో ముడి పడి ఉండే సంతృప్తినీ, ఉత్పత్తి అయిన వస్తువుతో తమకు జోడై ఉండే గుర్తింపునూ ఎట్లా కోల్పోతారో వివరించే యత్నం చేశాడు. శ్రమ విభజన ప్రధానంగా ఉండే పెట్టుబడిదారీ ఉత్పత్తి పద్ధతిలో ఉత్పత్తి సామర్థ్యానికి ఇచ్చే ప్రాధాన్యం వల్ల శ్రామికులు వస్తూత్పత్తిలోని ఏదో ఒక అంశానికే పరిమితమై ఆ పనిని మాత్రమే గానుగెద్దులా చేసే యంత్రంలా మారి పోతారనీ, ఈ క్రమంలో తమ సాధారణ మానవ సున్నితత్వాలనూ, ఉత్పత్తితో ఉండే గుర్తింపునూ కోల్పోతారనీ మార్క్స్ వివరిస్తాడు. ఈ రకమైన పరాయీకరణ వలన శ్రామికులకు తాముచేస్తున్న పనులతో మమేకత్వం ఉండదు. ఈ అంశాన్నే సమకాలిక మానవ శాస్త్రవేత్త డేవిడ్ గ్రాబార్, పెట్టుబడిదారీ యుగంలో ‘పనికిమాలిన ఉద్యోగాలు’ (బుల్షిట్ జాబ్స్) ఉన్నాయని ప్రతిపాదించాడు. పనికి మాలిన నౌకరీ అంటే ఏమిటో వివరిస్తూ గ్రాబార్ – అవి వేతన శ్రామి కులకు ఏమాత్రం తృప్తిని ఇవ్వనివీ, అర్థరహితమైనవీ అంటాడు. ఇంకా చెప్పాలంటే శ్రామికులు చేస్తున్న పనులు వారి సొంత విలువను ఏ తీరులోనూ పెంచేవి కావనీ అంటాడు. అర్థరహితం, విలువలేని పనులు రాను రానూ అనేక రంగాలలోకి విస్తరిస్తున్నాయనిపిస్తుంది. పెచ్చుపెరిగిపోతున్న ఆటోమేషన్, కృత్రిమ మేధకు లభిస్తున్న ప్రాధాన్యం చూస్తే రాబోయే కాలంలో ఈ పరిస్థితి తీవ్రం అయ్యేటట్టు కనిపిస్తోంది. ఈ స్థితి తీవ్ర మానవ అసంతృప్తికి కారణం అవుతోంది. చేసిన పని నుండి మనం పొందే తృప్తి ఎందుకు మనకు అంద కుండా పోతుంది? మనం ఒక మహా ప్రక్రియ (యంత్రం)లో ప్రాధా న్యంలేని చిన్న పని చేసే ‘మర’ స్థాయికి కుదించబడటమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఉత్పత్తి ప్రక్రియలో ఒక సహజమైన ఉత్సాహ శక్తి ఉబికి రావడం మరుగున పడిపోయి... వాటి స్థానంలో ఆర్థిక, గణిత, అల్గారిథమ్స్లకు ప్రాధాన్యం వచ్చింది. చరిత్రకారుడు యువల్ నోవా హారారీ ఇరవై ఒకటవ శతాబ్దిలో అత్యంత ప్రధానమైన పదం కంప్యూటర్ ఆధార గణన లేక ‘అల్గారిథమ్స్’ అంటాడు. ఈ మారిన పని పరిస్థితులను జాగ్రత్తగా గమనించిన అభివృద్ధి అర్థ శాస్త్రవేత్త గై స్టాండింగ్... ‘ప్రికారియట్’(అసురక్షిత లేక అస్థిర కార్మి కులు) తప్పని పరిస్థితులు అన్న భావన తీసుకువచ్చారు. ఈ భావన ప్రకారం పర్మనెంటు నౌకరీలు తగ్గిపోతూ... కాసింత ఉద్యోగ భద్రత, పెన్షన్ సౌకర్యం, ఆరోగ్య రక్షణ వంటివి పూర్తిగా కనుమరుగైపోయి స్వల్పకాల కాంట్రాక్టులు, తాత్కాలిక ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఈ రకమైన నూతన శ్రామికులను ‘ప్రికారియట్’ అంటున్నాడాయన. సమకాలిక పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థలో కొత్త పని ప్రపంచాలు వీరితో నిండిపోతున్నాయని అంటున్నాడు. మన కాలంలో పని... అర్థరాహిత్యానికీ, అభద్రతకూ ఏకకాలంలో దారితీస్తోంది. గై స్టాండింగ్, మార్టిన్ గ్రాబర్ వంటి సామాజిక పరిశీలకులు ఈ రకమైన పనికిమాలిన పనులకు, దారుణమైన అభద్రత గల పని పరిస్థితులకు సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్) ఒక పరిష్కారంగా చూస్తున్నారు. అయితే పని లేదా శ్రమ లక్ష్యం కేవలం ఆదాయ సంపాదన మాత్రమే కాదు. అది పని చేస్తున్న వారికి ఆత్మతృప్తినీ, పరిపూర్తి అనుభూతినీ ఇవ్వడం కూడా ప్రధానం అన్న అమర్త్య సేన్ చెప్పిన ఒక విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇట్లా మనిషి సొంత గుర్తింపు రద్దు అవుతున్న స్థితిలో, మనిషి కొనుగోలుదారుగా మారి... కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తన కప్పిపుచ్చుకునే కొనుగోలుదారీతనంతో భర్తీ చేసుకునే కంపెన్సేటరీ కన్సూ్యమరిజమ్లోకి మారిపోతున్నాడు. అలా మారి ‘తాము బాగున్నాం’ అనేదానికి గుర్తుగా వస్తువులు కొను క్కోవాలి అనే ‘కొనుగోలుదారీ’ అవస్థలోకి జారుకుంటున్నాడని ప్రముఖ మార్క్సిస్ట్ భూగోళ విజ్ఞాని డేవిడ్ హార్వే విశ్లేషిస్తున్నారు. ఇటువంటి కొనుగోలుదారీతనానికి నెట్ఫ్లిక్స్ను ఉదాహరణగా చూపుతున్నాడు. ఈ రకమైన వస్తువులు మీటనొక్కడం ద్వారా అనేక మంది ఒకేసారి వాడుకునే లక్షణం కలిగి ఉన్నవి. కళ్ళు జిగేల్మనే మాల్స్లో షాపింగ్ అనుభూతి ఒక కొత్త లోకంలోకి పోయిన అనుభూతిని ఇస్తుంది. ఆ విధంగా మానవ జీవితాలను వస్తువులు ఆక్రమించేస్తున్నాయి. మనుషులు తమ ఇంగితాల మీద, సున్నితత్వాల మీద నియంత్రణ కోల్పోతారని మార్క్స్ చాలాకాలం కిందనే ఊహిం చాడు. దాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వస్తువులే మానవ సంబంధాలను నిర్ణయించే స్థితి ఏర్పడుతుంది. వస్తువులకు ఉండే మారకపు విలువనే వస్తువు ఉపయోగ విలువను నిర్ణయిస్తుంది. ఈ స్థితినే ఆయన ‘వస్తు వ్యామోహ సంస్కృతి’ అన్నాడు. ఈ పరిస్థితే దుస్సహమైన పని పరిస్థితులను, పనికిమాలిన ఉద్యోగాలను పుట్టించి మనుషులలో తీవ్రమైన పరాయీకరణకు దారితీస్తుందనీ అన్నాడు. ఆ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈ ఆధునిక పరాయీకరణ పరిస్థితులు కేవలం ఆర్థిక రంగానికి అంటే మార్కెట్కు మాత్రమే పరిమితమై ఉండవు. అవి సామాజిక, వ్యక్తిగత, రాజకీయ జీవితాలలోకి కూడా వ్యాపిస్తాయి. రాజ్య యంత్రమూ, దానికున్న సార్వభౌమాధికారమూ; అది నియంత్రించే ప్రాంతం మీదా, ప్రజల మీదా ఉండే అధికారం సందర్భంలోనూ ఈ పరాయీకరణ ప్రభావం కనిపిస్తుంది. ప్రజల నుండి పాలన పరాయీకరణకు గురి కావడం ఒక కీలక అంశం. పాలనాధికారం విపరీతంగా కేంద్రీకరించబడటం, పాలకులు తాము చాలా ప్రత్యేకం అనుకోవడం, సామాన్య ప్రజలను దూరం పెట్టడం ఈ పరాయీకరణ రూపాలే. ‘అరబ్ స్ప్రింగ్ ’ పోరాటాలూ, ‘ఆక్యుపై వాల్స్ట్రీట్’ పోరా టాలూ... పరాయీకరించబడిన సమూహాలు, జాతి రాజకీయ జీవ నంతో తిరిగి పెనవేసుకోవడానికి పడుతున్న ఆరాటానికి చిహ్నాలు! పాలనా యంత్రాంగం, ప్రతినిధులు... ప్రజారాశుల నుండి పూర్తిగా వేరుపడటం అనే పరాయీకరణ ప్రాతినిధ్య సంక్షోభానికి (క్రైసిస్ ఆఫ్ రిప్రెజెంటేషన్) దారి తీస్తున్నది. ప్రతినిధులను ప్రజలు నమ్మని స్థితి ఇది. ఒక రకంగా పైన పేర్కొన్న పోరాటాలు ఈ అవినీతికర స్థితికి వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శించే ఆగ్రహ వ్యక్తీకరణగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాతావరణంలో పరాయీకరణ వల్ల ప్రేరేపితం అయిన నిస్సార కొనుగోలుదారీతనానికీ, ప్రాతినిధ్య సంక్షోభం వల్ల పుట్టు కొస్తున్న, పరిమిత దృష్టి కలిగిన తమ వాటాకు మాత్రమే ప్రాధాన్య మిచ్చే ఉనికి రాజకీయ వాదులకూ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. తమ పరిధిని తీవ్రంగా పరిమితంగా ఉంచుకునే ఉనికి రాజకీయాలకూ, నిస్సార కొనుగోలుదారీ తత్వానికీ కారణం... మనిషి తన నుండీ, సముదాయం నుండీ పరాయీకరించ బడటమే. ఈ స్థితిలో ఊహాశక్తితో అనేక (పీడిత) సముదాయాల నడుమ నాణ్యమైన, అర్థవంతమైన సంఘీభావాన్ని నిర్మించే వైపు చేసే గట్టి ప్రయత్నాలు మాత్రమే... పెట్టుబడిదారీ వ్యవస్థ మీద పోరును పదు నెక్కించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలవు. ప్రొ. అజయ్ గుడవర్తి వ్యాసకర్త ప్రొఫెసర్,జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ -
హైదరాబాద్ కేంద్రంగా హెలికాప్టర్ గేర్స్ బాక్స్ల తయారీ..వందల కోట్ల పెట్టుబడులు!
Skanda Aerospace: హైదరాబాద్ కేంద్రంగా హెలికాఫ్టర్ పార్ట్లను తయారు చేసే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రముఖ స్కందా ఏరో స్పేస్ సంస్థ వందల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రఘు వంశీ మెషిన్ టూల్స్, అమెరికాకు చెందిన రేవ్ గేర్ సంస్థలు సంయుక్తంగా రాజధానిలో స్కందా ఏరో స్పేస్ ప్రొడక్షన్ పేరుతో యూనిట్ను నెలకొల్పనున్నారు. ఈ ప్రొడక్షన్ యూనిట్లో హెలికాఫ్టర్ గేర్స్, గేర్ బాక్స్లను తయారు కానున్నాయి. ఇందుకోసం సుమారు రూ.250కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికా టెక్సాస్లో ఉన్న రేవ్ గేర్స్ తో పాటు రఘు వంశీ మెషిన్ టూల్స్ సంస్థ సైతం ఏవియేషన్ సంస్థలతో పాటు ఇతర ఆటో మోటీవ్ సంస్థలకు కావాల్సిన ఉత్పత్తుల్ని సరఫరా చేస్తుంది. -
ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు ఆగిపోతున్న వ్యాక్సిన్ల ఉత్పత్తి
కరోనా విషయంలో పరస్పర విరుద్ధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఓ వైపు కేసులు పెరుగుతుంటే మరో వైపు వ్యాక్సిన్లు అమ్ముడుపోక ఫార్మా కంపెనీలు లబోదిబోమంటున్నాయి. తమ దగ్గర నిల్వ ఉన్న స్టాకును ఉచితంగా అయినా ఇచ్చేందుకు సై అంటున్నాయి. కరోనా వ్యాక్సిన్లకు మార్కెట్లో డిమాండ్ లేనందున తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పూనేలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఇప్పటికే 20 కోట్ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం నిల్వ ఉన్న డోసులు 2021 డిసెంబరులో తయారు చేసినవిగా తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి నుంచి 9 నెలల పాటు వాడుకునే వీలుంది. డిసెంబరు స్టాకే ఇంకా క్లియర్ కాకపోవడంతో కొత్తగా తయారీ వృధా అనే అంచనాలతో సీరమ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఎవరైనా అడిగితే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని కూడా చెబుతోంది. గత డిసెంబరులో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తరుణంలో ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. విమాన సర్వీసులు రద్దు చేశాయి. కరోనా ఆంక్షలు విధించాయి. అయితే ఒమిక్రాన్తో ముప్పు తక్కుగా ఉండటంతో 2022 ఫిబ్రవరి నుంచి క్రమంగా ఆంక్షలు తొలగించాయి. దీంతో సాధారణ జీవితం మొదలైంది. అంతా సవ్యంగా సాగుతున్న దశలో ఏప్రిల్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మళ్లీ మాస్క్ తప్పనిసరంటూ ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. గతేడాది కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విలయ తాండవం చేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. ఆ వెంటనే ప్రభుత్వాలు అప్రమత్తమై వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేశాయి. వ్యాక్సిన్ మిత్ర పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున వ్యాక్సిన్లపై నిషేధం విధించింది. ఎన్ని వ్యాక్సిన్లు ఉంటే అన్నింటినీ ఇండియాలోనే ఉపయోగించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం 2021 డిసెంబరులో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడటంతో మరోసారి బూస్టర్ డోసును కూడా అందించారు. ఆ తర్వాత ప్రైవేటు సెక్టారులో కూడా వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఆంక్షలన్నీ తొలగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో కరోనా వ్యాక్లిన్లకు డిమాండ్ లేదు. దీంతో ఒక్కో కంపెనీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే యూఎస్కి ప్రముఖ హెల్త్కేర్ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ ఈ ప్రటకన చేయగా తాజాగా ఇండియన్ ఫార్మా కంపెనీ సీరమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైతం ఇదే తరహా నిర్ణయం వెలువరించింది. చదవండి👉🏾 జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం ! -
దేశీ చమురు ఉత్పత్తి డౌన్
న్యూఢిల్లీ: దేశంలో చమురు ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరంలో 2.67% వరకు తగ్గింది. 2021–22లో ముడి చమురు ఉత్పత్తి 29.69 మిలియన్ టన్నులుగా ఉంది. 33.61 మిలియన్ టన్నుల లక్ష్యానికంటే 12 శాతం తక్కువ. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 30.5 మిలియన్ టన్నుల మేర ఉండడం గమనార్హం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్లో చమురు ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. 2017–18లో 35.7 మిలియన్ టన్నులు ఉంటే, 2018–19లో 34.2 మిలియన్ టన్నులకు తగ్గింది. 2019–20లో 32.2 మిలియన్ టన్నులు, 2020–21లో 30.5 మిలియన్ టన్నులు, 2021–22లో 29.69 మిలియన్ టన్నులకు పరిమితమైంది. చమురు క్షేత్రాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉత్పత్తి చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఉత్పత్తి తగ్గుతోంది. టెక్నాలజీ సాయంతో ఉత్పత్తిని మరీ పడిపోకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి తీవ్రంగా పడిపోని పరిస్థితి ఉంది. చదవండి: నెలకు 40 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులు -
చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్..! ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న ఎంజీ మోటార్ భారత్లో రెండవ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏడాదికి 1.75 లక్షల యూనిట్ల కార్లను తయారు చేసేసామర్థ్యంతో ఇది రానుంది. ఇందుకోసం రూ.4,000 కోట్ల దాకా వ్యయం చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. గుజ రాత్లో ఇప్పటికే సంస్థకు తయారీ కేంద్రం ఉంది. ఈ ఫెసిలిటీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 70,000 యూనిట్లు. దీనిని వచ్చే ఏడాదికల్లా 1.25 లక్షల యూనిట్లకు చేర్చనున్నారు. నూతన ప్లాంటు కోసం గుజరాత్ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ ఛాబా తెలిపారు. ‘రెండేళ్లలో 3 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యం సొంతం చేసుకోవాలన్నది లక్ష్యం. ఇప్పటికే ఉన్న ప్లాంటును కొనుగోలు చేయాల్సిందిగా పలు సంస్థల నుంచి ఆఫర్ అందుకున్నాం. జూన్ చివరినాటికి నూతన ప్లాంటు విషయం కొలిక్కి వస్తుంది’ అని వివరించారు. ఏడాదిలో చిన్న ఈవీ.. రెండేళ్లలో కొత్త కేంద్రం సిద్ధం అవుతుందని రాజీవ్ వెల్లడించారు. ‘ఇందుకు కావాల్సిన మొత్తాన్ని పెట్టుబడి సంస్థలు, బాహ్య వాణిజ్య రుణాలు లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ద్వారా సమకూర్చుకుంటాం. ఎఫ్డీఐ దరఖాస్తు ఇప్పటికీ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది’ అని వివరించారు. గుజరాత్ ప్లాంట్ సామర్థ్యం పెంచేందుకు రూ.2,500 కోట్లు వెచ్చిస్తున్నట్టు గతేడాది కంపెనీ ప్రకటించింది. 2021లో దేశవ్యాప్తంగా సంస్థ 40,000 వాహనాలను విక్రయించింది. చిప్ కొరత ఉన్నప్పటికీ ఈ ఏడాది 70,000, వచ్చే ఏడాది 1.25 లక్షల యూనిట్ల కార్ల అమ్మకాలను నమోదు చేస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. ఎంజీ మోటార్ చిన్న ఎలక్ట్రిక్ వాహనం 2023 మార్చి–ఏప్రిల్లో భారత్లో రంగ ప్రవేశం చేయనుంది. ధర రూ.10–15 లక్షల మధ్య ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం దేశంలో హెక్టార్, గ్లోస్టర్, ఏస్టర్, జడ్ఎస్ ఈవీని విక్రయిస్తోంది. చదవండి: తగ్గేదేలే..! ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ దూకుడు..! -
గతి శక్తి, పీఎల్ఐ స్కీమ్తో ఎకానమీకి రక్ష
న్యూఢిల్లీ: గతిశక్తి, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు భారత్ ఎకానమీని అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తాయని ఆర్థికశాఖ పేర్కొంది. దీనితోపాటు సంబంధిత పథకాలు దేశంలో పెట్టుబడులను పెంచుతాయని విశ్లేషించింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన పునరుద్ధరణ, అధిక వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. కాగా భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, వాటి ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, ఎరువులు, ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతాయని నెలవారీ విశ్లేషణా నివేదిక పేర్కొంది. దీని పర్యవసాన ప్రభావం ప్రపంచవ్యాప్త వృద్ధి అవుట్లుక్పై పడుతుందని తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఇంధన ధరల తీవ్రత, ఆహార మార్కెట్లో సరఫరాల సమస్యలు ఆర్థిక సంవత్సరంలో ఎంతకాలం కొనసాగుతాయన్న అంశం భారత్ ఎకానమీకి కీలకం. అయితే తాత్కాలిక అవాంతరాలు దేశ వాస్తవిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టత దీనికి కారణం. ► భారత్ ఎకానమీకి సవాళ్లు ఎదరయినప్పటికీ, వీటి తీవ్రతను తగ్గించడానికి గతిశక్తి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లు దోహదపడతాయి. పెట్టుబడులు, వేగవంతమైన రికవరీ, పటిష్ట వృద్ధికి ఈ పథకాలు సహాయపడతాయి. దీనికితోడు గత కొన్నేళ్లుగా తీసుకున్న నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా సరఫరాల సవాళ్లు తగ్గుతాయని భావిస్తున్నాం. ► శ్రామిక శక్తి వినియోగం మెరుగుదల, నిరుద్యోగం రేటు తగ్గడం, ఆర్థికంగా పేదలకు నిరంతర మద్దతు అందించడానికి ప్రభుత్వ పటిష్ట చర్యలు (పీఎం గరీబ్ కళ్యాణ్ యోజనను సెప్టెంబర్ 2022 చివరి వరకు మరో ఆరు నెలల పాటు పొడిగించడం) ఎకానమీని విస్తృత స్థాయిలో సుస్థిర వృద్ధి బాటలో ముందుకు నడుపుతాయి. ► వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు మార్చి 2022లో రూ. 1.4 లక్షల కోట్లను దాటి రికార్డు సృష్టించాయి. రికవరీ అనంతర వృద్ధి ప్రారంభాన్ని ఇది సూచిస్తోంది. రాష్ట్రాలు క్రమంగా మహమ్మారి ప్రేరేపిత పరిమితులను సడలిస్తుండడం ఎకానమీకి లాభిస్తోంది. ముడి పదార్థాల ధరల పెరిగినా, సేవల రంగం పటిష్టంగా ఉంది. ఇన్పుట్స్ వ్యయం 11 సంవత్సరాల గరిష్ట స్థాయికి నమోదయినప్పటికీ ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరిలో 51.8 వద్ద ఉంటే, మార్చిలో 53.6కు ఎగసింది. వ్యాక్సినేషన్ విస్తృతితో కోవిడ్–19 కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇవన్నీ ఎకానమీ వేగవంతమైన పురోగతిని సూచిస్తున్నాయి. ► ప్రైవేట్ వినియోగంలో వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీఐ లావాదేవీల విలువలు, పరిమాణాలు 2021– 22లో రెండింతలు పెరిగాయి. మార్చి 2022లో యూపీఐ లావాదేవీల పరిమాణం మొదటిసారిగా ఒక నెలలో 5 బిలియన్లను దాటింది. ► ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మూలధన పెట్టుబడులు మహమ్మారి ప్రేరిత, అంతకుముందు ఆర్థిక సంవత్సరాల (2019–20, 2020–21) స్థాయిలను అధిగమించాయి. ప్రైవేటు పెట్టుబడులు కూడా మరింత ఊపందుకునే వీలుంది. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) భారత్ భారీగా ఆకర్షిస్తోంది. ఆర్థిక వ్యవస్థలోకి స్థూల ఎఫ్డీఐల ప్రవాహం 2021 ఏప్రిల్– 2022 జనవరి మధ్య 69.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ)ద్వారా పెట్టుబడుల్లో 2021 ఏప్రిల్– 2022 ఫిబ్రవరి మధ్య (అంతక్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి) 29.7 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనివల్ల భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 630 డాలర్లకుపైగా పెరిగాయి. ఇవి 12 నెలలకుపైగా దిగుమతులకు సరిపోతాయి. ► 2022 జనవరిలో నికర ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారుల సంఖ్య 15.3 లక్షలుగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 37.4 శాతం అధికం. ఇది విస్తృత ఆర్థిక పునరుద్ధరణ ఉపాధి అవకాశాల వృద్ధిని కూడా పెంచిందని సూచిస్తోంది. ఆర్థికరంగం బాగుంది భారత్ ఎకానమీ పరిస్థితి ప్రస్తుతం బాగుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునే స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని తట్టుకోగలిగిన స్థాయిలో దేశం ఆర్థిక రంగం ఉంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై అధిక దృష్టి అవసరం. – బిమల్ జలాన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ -
ఆడమ్స్ ఈ బైక్ స్టాకిస్టుగా కేఆర్ ఫుడ్స్
హైదరాబాద్: ఆడమ్స్ ఈ బైక్ సూపర్ స్టాకిస్టుగా కేఆర్ ఫుడ్స్ సంస్థ వ్యవహరించనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డీలర్ల సమావేశంలో కేఆర్ఫుడ్స్ సంస్థ ఎండీ రాజేందర్ కుమార్ కొత్తపల్లి మాట్లాడుతూ... ‘‘తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆడమ్స్ ఈ బైక్స్ సూపర్ స్టాకిస్టుగా బాధ్యతలు తీసుకున్నాము. మెదక్ జిల్లాలో తుప్రాన్ మండల కేంద్రంగా 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించాము. ఈ ప్లాంట్ నెలకు 4 వేల ఈ బైకులను ఉత్పత్తి చేయగలదు. రోబోటిక్, ఆర్టిఫిషియల్ సాంకేతికతను సమకూర్చుకుంటూ ప్రస్తుత తయారీ సామర్థ్యాన్ని పదివేల యూనిట్లకు పెంచుతాము. ఇదే ప్లాంట్లులో అధిక హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్ల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము’’ అని తెలిపారు. -
కియా డేరింగ్ స్టెప్.. ఇక నో వెయిటింగ్
హైదరాబాద్, బిజినెస్బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ ప్లాంటులో మూడవ షిఫ్ట్ ప్రారంభించింది. దీంతో 3 లక్షల యూనిట్ల పూర్తి వార్షిక సామర్థ్యానికి ఉత్పత్తిని పెంచింది. 2019 ఆగస్ట్లో ఈ ప్లాంటులో కార్ల తయారీ మొదలైంది. ఇప్పటి వరకు కంపెనీ దేశీయంగా నాలుగు లక్షల కార్లను విక్రయించింది. అలాగే మధ్యప్రాచ్య, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా పసిఫిక్ వంటి 91 దేశాలకు ఒక లక్ష కార్లను ఎగుమతి చేసింది. కియా కార్లపై వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడానికి, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ నేపథ్యంలో.. వనరులను సమకూర్చుకున్నామని, అదనపు సిబ్బందిని నియమించామని కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్ పార్క్ ఈ సందర్భంగా తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా కియాకు భారత్ వ్యూహాత్మక మార్కెట్. మా ఉత్పత్తులన్నింటికీ ఇక్కడ అద్భుతమైన స్పందన లభించింది’ అని అన్నారు. చదవండి: Kia India-AP: కియా అనంత ప్లాంట్ కొత్త రికార్డ్ -
పప్పులు.. కుప్పలు తెప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తి ఏడాదికేడాది పెరుగుతోంది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే 2020– 21లో 1.28 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి పెరిగింది. 2016 –17లో 5.36 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా 2020–21లో 6.64 లక్షలకు చేరుకుంది. మొత్తంగా 2020–21లో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో 9వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. ఇటీవలి కేంద్రం నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా రాజస్తాన్ రాష్ట్రంలో 48.21 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్లో 43.64 లక్షల టన్నులు, మహారాష్ట్రలో 42.24 లక్షల టన్నుల పప్పుధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 11.85 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో 2016–17లో 2.31 కోట్ల టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి కాగా 2020–21లో 2.55 కోట్లకు పెరిగాయి. ఉత్పత్తి పెంచే కార్యాచరణతో.. పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ప్రత్యేక కార్యా చరణను అమలు చేస్తోంది. విత్తనాల పంపిణీ, అధిక దిగుబడినిచ్చే రకాలు, వ్యవసాయ యంత్రాలు, నీటి ఆదా పరికరాలు, మొక్కల రక్షణ రసాయనాలు, పోషకాల నిర్వహణ, నేల మెరుగుదల, రైతులకు శిక్షణ చేపట్టింది. దేశంలో ఆయా రాష్ట్రాల వ్యవసాయ వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో 150 సీడ్ హబ్లు ఏర్పాటయ్యాయి. బీహార్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2018–19 నుంచి చెరకులో పప్పు ధాన్యాల అంతర పంట అనే కొత్త పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ప్రోత్సహిస్తుండటంతో మున్ముందు ఈ పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. కంది, శనగ కొనుగోలుకు ఏర్పాట్లు రాష్ట్రంలో ఈ వానాకాలంలో 4.67 లక్షల మెట్రిక్ టన్నులు కంది ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. మద్దతు ధరకు 80,142 మెట్రిక్ టన్నులు కొనేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు 103 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ నిర్ణయించిం ది. అందులో 50 కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటా మద్దతు ధర రూ. 6,300 కాగా బహిరంగ మార్కెట్లోనూ ఇంతే ధర ఉందని, దీంతో కేంద్రాలకు రైతులు రావట్లే దని మార్క్ఫెడ్వర్గాలు అంటున్నాయి. కేంద్రం 58,485 మెట్రిక్ టన్నుల శనగ కొనాలని నిర్ణయించడంతో వాటి కోసం కూడా మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేసింది. 38 కేంద్రాలు గుర్తించి ఇప్పటికే 18 తెరిచామని మార్క్ఫెడ్ పంటల సేకరణ విభాగం ఇన్చార్జి చంద్రశేఖర్ తెలిపారు. మద్దతు ధర క్వింటాకు రూ. 5,230 ఉంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో సంచలనం..! ఏకంగా లక్ష మోడల్స్..!
టూవీలర్ వాహనాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కు ఉండే క్రేజే వేరు. ధరతో పట్టింపు లేకుండా బుల్లెట్ బండిని సొంతం చేసుకోవడానికి బైక్ లవర్స్ ఎగబడతారు. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ కు చెందిన న్యూ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉత్పత్తిలో సరికొత్త రికార్డును సృష్టించింది. లక్ష యూనిట్ల ఉత్పత్తి..! రాయల్ ఎన్ఫీల్డ్ టూవీలర్స్ బైక్లలో బేసిక్ మోడల్గా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నిలుస్తోంది. దీనికి కొత్త హంగులను జోడించి భారత మార్కెట్లలోకి న్యూ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ను కంపెనీ లాంచ్ చేసింది. ఇక లాంచ్ చేసిన ఏడాది కంటే తక్కువ సమయంలోనే ఒక లక్ష యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటిన మోడల్గా న్యూ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నిలిచింది. భారత్లోనే కాకుండా న్యూ క్లాసిక్ 350 థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా క్లాసిక్ 350 డుగ్గు డుగ్గు మంటూ సౌండ్ చేస్తోంది. న్యూ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 యూకేలో ఇంకా లాంచ్ కాకపోవడం విశేషం. అత్యధికంగా అమ్ముడైన మోడల్..! రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో 350 సీసీ కేటాగిరిలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అత్యధికంగా అమ్ముడైన మోడల్గా నిలుస్తోంది. ఇది కంపెనీలో 70 నుంచి 80 శాతం వాటాను కలిగి ఉంది. న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ను సెప్టెంబర్ 2021లో భారత్లో ప్రారంభించారు. అప్డేటెడ్ ఫీచర్స్తో..! కొత్త ఇంజన్, కొత్త ఛాసిస్, అప్డేటెడ్ సస్పెన్షన్, కొత్త వీల్స్, బ్రేక్తో మరింత ఆకర్షణీయంగా తయారైంది. సరికొత్త క్లాసిక్ 350 అనేది మెటోర్ 350 మోడల్ బైక్ లాగే 350 cc సింగిల్-సిలిండర్ ఇంజన్తో వచ్చింది. 349 cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ 6,100 rpm వద్ద 20.2 bhp శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 4,000 rpm వద్ద 27 Nm టార్క్ను రిలీజ్ చేస్తోంది. చదవండి: భారత్లో అమ్మేది కేవలం 20 బైక్స్ మాత్రమే..! ఈ బైక్ ఎందుకంత స్పెషల్ అంటే..! -
ఇలా చేస్తే కుదరదబ్బా..! ఝలక్ ఇచ్చిన కస్టమర్లు..ఇరకాటంలో ఓలా!
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం ఓలా తీవ్రంగా విమర్శల్ని మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో వెహికల్స్ ప్రొడక్షన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాత్కాలికంగా ఓలా ఎస్1 వెహికల్స్ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రొడక్షన్ ఎందుకు ఆపేస్తున్నారో కొన్ని కారణాలు వివరిస్తూ ఎస్1 కస్టమర్లకు మెయిల్ పెట్టినట్లు కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. మళ్లీ ప్రొడక్షన్ ప్రారంభం అయ్యే వరకు కొనుగోలు దారులు ఎస్1 వెహికల్స్ కోసం ఎదురు చూడాల్సిందేనని నివేదికల్లో పేర్కొన్నాయి. కాగా అప్పటి వరకు ఓలా ఎస్1ప్రో అందుబాటులో ఉండనుంది. ఝలక్ ఇచ్చిన వాహన దారులు, ప్రొడక్షన్ నిలిపేసిన ఓలా ఎన్నోరోజుల నిరీక్షణ తర్వాత ఓలా గత డిసెంబర్ నెలలో కొనుగోలు దారులకు ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను డెలివరీ చేసింది. వెహికల్స్ను డెలివరీ అయితే చేసింది కానీ సాఫ్ట్వేర్ విషయంలో కొనుగోలు దారులు ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఎస్1 బైక్ డ్రైవింగ్ సమయంలో వాహనదారులు తీవ్ర అసహననానికి గురయ్యారు. క్రూయిస్ కంట్రోల్, హిల్ హోల్డ్, నేవిగేషన్ అసిస్ట్, హైపర్ మోడ్'లలో సాఫ్ట్వేర్ లోపాలు తలెత్తడంతో ఓలాపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఛార్జింగ్, మైలేజ్ విషయంలో ఓలా ప్రచారం చేసినట్లుగా లేదని వరుస ట్వీట్లు చేస్తూ ఆ సంస్థకు ఝలక్ ఇచ్చారు. దీంతో దిగొచ్చిన ఓలా యాజమాన్యం వాహనదారులకు క్షమాపణలు చెప్పింది. ఎస్1 వెహికల్స్ సాంకేతిక సమస్యల్ని పరిష్కరిస్తామని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఓలా ఎస్1 ప్రొడక్షన్ను నిలిపి వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చదవండి: కొనుగోలు దారులకు ఓలా ఎలక్ట్రిక్ భారీ షాక్.. -
తగ్గనున్న పెట్రోల్ ధరలు ? ఓపెక్ దేశాల కీలక నిర్ణయం
ఫ్రాంక్ఫర్ట్: ప్రపంచ ఎకానమీకి చమురు సరఫరాలను మరింత పెంచాలని ఒపెక్ దాని అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు నిర్ణయించాయి. కోవిడ్–19 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కోవిడ్–19 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తి ఉన్నప్పటికీ ప్రయాణ, రవాణా, ఇంధనం విభాగాల్లో డిమాండ్ కొనసాగుతున్నట్లు భావిస్తున్నట్లు 23 సభ్యదేశాల ఒపెక్, అనుబంధ దేశాలు పేర్కొన్నాయి. మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో జరిగిన ఉత్పత్తి కోతలను నెమ్మదిగా పునరుద్ధరించడానికి ఉద్దేశించిన రోడ్మ్యాప్లో భాగంగా ఫిబ్రవరిలో రోజుకు 400,000 బారెల్స్ ఉత్పత్తిని పెంచనున్నట్లు పేర్కొంది. ధరలు తగ్గేనా పెట్రోల్ను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాలైన అమెరికా, చైనా, భారత్, జపాన్లలో ధరల నియంత్రణ కోసం ముడి చమురు ఉత్పత్తి పెంచాలంటూ ఒపెక్ దేశాలకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం రాలేదు. దీంతో ఈ దేశాలు తమ అత్యవసర నిల్వల నుంచి పెట్రోలును రిలీజ్ చేశాయి. దీంతో చమురు ఉత్పత్తి దేశాలు, వినియోగదారులైన దేశాల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉత్పత్తి పెరిగితే చమురు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: ముడి చమురు మహా యుద్ధం! -
నిన్నటి వరకు ఆ పండు పనికిరాదు.. ఆ ఒక్క నిర్ణయంతో ఇప్పుడు కాసులు కురిపిస్తోంది
నిన్నా మొన్నటి వరకు ఆ పండు ఎందుకూ పనికిరానిది. గింజకున్న విలువ పండుకు లేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలతో దానికీ మంచిరోజులొచ్చాయి. ఇప్పుడా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇలా దశ తిరిగిన జీడిమామిడి రైతుల కథాకమామిషు ఏమిటంటే.. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 3.31 లక్షల ఎకరాల్లో జీడి మామిడి సాగవుతోంది. 90 శాతం పంట ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగవుతోంది. పైసా విలువ కూడా చేయదని పిక్క తీసేసిన జీడి పండు చెత్తకుప్పల పాలయ్యేది. ఇలా ఎకరాకు 4 టన్నుల చొప్పున జీడి పండు వృధా అయ్యేది. కానీ, మూణ్నెల్ల క్రితం తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలానికి చెందిన ‘వైఎస్సార్ చేయూత’, ‘ఆసరా’ మహిళా లబ్ధిదారులు వినూత్నంగా ఆలోచించారు. జీడి మామిడి పండును ప్రాసెసింగ్ చేయడం ద్వారా జ్యూస్, సోడా, జామ్, పచ్చళ్లు తయారుచేసే ఓ కుటీర పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. అదే ఇప్పుడు రాష్ట్రంలో కోట్ల రూపాయల కొత్త సంపద సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న టానేజర్ అనే స్వచ్ఛంద సంస్థ వీరికి సాంకేతిక సహకారం అందించింది. దీంతో వీరంతా కలిసి రూ.18 లక్షల ఖర్చుతో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. ముగ్గురు మహిళలు రైతుల నుంచి పండు సేకరించడంతో పాటు, ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఇలా దేశంలోనే మొట్టమొదటిసారి జీడి పండు నుంచి ఉప ఉత్పత్తులను తయారుచేసే ప్రక్రియకు ఇక్కడ బీజం పడింది. మొదటగా జ్యూస్, సోడాల తయారీ మొదలుపెట్టారు. వీటి అమ్మకాల ద్వారా ఈ మూడున్నర నెలల్లో రూ.3.68 లక్షల ఆదాయం పొందారు. వృధాగా పడేసే ఆ జీడి పండును గంగవరం మండలంలో 240 మంది జీడి మామిడి రైతుల నుంచి కిలో రూ.1.50–రూ.2 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దానిని ప్రాసెసింగ్ చేసి 15,400 యూనిట్ల జ్యూస్, సోడా బాటిళ్లను తయారుచేశారు. తద్వారా ఒక్కో జీడి మామిడి రైతుకు రూ.3 వేల చొప్పున అదనపు ఆదాయం రాగా.. మూడున్నర నెలల్లో నిర్వహణ ఖర్చులు పోను రూ.లక్ష నికర ఆదాయాన్ని మహిళలు పొందారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా శాశ్వత జీవనోపాధి కోసం 23లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరందరికీ విడతల వారీగా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ప్రభుత్వమే అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుంది. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వ్యాపార సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్లోనూ సహకరిస్తుంది. అవసరమైతే బ్యాంకుల ద్వారా అదనపు రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఆర్గానిక్ బట్టల తయారీ, చిరుధాన్యాల మార్కెటింగ్లో కొత్త అవకాశాలు కల్పించేందుకు ఆలోచిస్తున్నాం. ఇందుకోసం వాల్మార్ట్ వంటి సంస్థలతో ఒప్పందానికి సర్కారు పరిశీలిస్తోంది. – ఇంతియాజ్, సెర్ప్ సీఈవో 600 కేజీల పండు ద్వారా అదనపు ఆదాయం మా పొలంలోని జీడి మామిడి పండ్లు సుమారు 600 కేజీలను విక్రయించడంవల్ల ఈ ఏడాది రూ.1,200లు అదనపు ఆదాయం లభించింది. అలాగే, ఇందుకు సంబంధించిన కర్మాగారంలో హెల్పర్గా పనిచేయడంవల్ల అదనంగా నెలకు రూ.7,000 జీతంగా లభిస్తోంది. – వై. రాణి, పావని స్వయం సహాయ సంఘం సభ్యురాలు జీడిమామిడి రైతులకు ఎంతో మేలు జీడిమామిడి పండ్ల రసంతో ఆపిల్ సోడా, ఆపిల్ సిరప్ తయారుచేసే యూనిట్ నెలకొల్పేందుకు సెర్ప్, టానేజర్ సంస్థ ప్రతినిధులు ఎంతో కృషిచేశారు. ఏజెన్సీలో జీడిమామిడి సాగుచేసే గిరిజన రైతులకు ఆర్థికంగా మరింత ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఉత్పత్తిని మార్కెటింగ్ చేసేందుకు వారపు సంతల్లో అవగాహన కల్పిస్తున్నాం – కంగల అబ్బాయిదొర, ఎఫ్పీఓ, అధ్యక్షులు, గంగవరం మండలం వివిధ వ్యాపారాల్లో 7.17లక్షల మంది పెట్టుబడి ఇక రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల్లో 45–60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 24 లక్షల మంది లబ్ధిదారులకు రెండు విడతల్లో రూ.8,839 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం లబ్ధిచేకూర్చింది. ఇదే సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా కూడా రెండేళ్లలో దాదాపు రూ.12,800 కోట్ల మొత్తాన్ని పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు. మహిళలు ఈ ప్రయోజనాలను ఉపయోగించుకుని 2020–21లో 2.68 లక్షల మంది వివిధ వ్యాపార, జీవనోపాధులు ఏర్పర్చుకున్నారు. వీరిలో 78 వేల మంది కిరాణా దుకాణాలు పెట్టుకుని నెలకు రూ.5 వేల అదనపు ఆదాయం పొందగా.. 1.19 లక్షల మంది ఆవులు, గేదెలను కొనుగోలు చేస్తే, 70 వేల మంది గొర్రెలు మేకలను కొనుగోలు చేశారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా లబ్ధిదారులకు మరో రూ.1,510 కోట్లు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 4.49 లక్షల మందికి వ్యాపార, జీవనోపాధులు పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 1.06 లక్షల మందికి తోడ్పాటు అందించింది. వంద కోట్ల అదనపు ఆదాయం గంగవరం కుటీర పరిశ్రమ ద్వారా తయారైన ఉత్పత్తుల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుండడంతో ఈ ప్రాంతంలో ఈ తరహా చిన్న, పెద్ద పరిశ్రమల స్థాపనకు వీలు ఏర్పడినట్లయింది. రానున్న రోజుల్లో ఈ తరహా పరిశ్రమల సంఖ్య పెరిగి రైతులందరి నుంచి పండు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులకే ఏటా రూ.100 కోట్ల వరకు అదనపు ఆదాయం దక్కే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఈ తరహా పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాది మంది యువతకు, మహిళలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగవుతాయన్నారు. -
ఆక్వా రంగంలో విప్లవం.. ఏపీలోకి కొత్త రకం రొయ్య రంగ ప్రవేశం
సాక్షి, కాకినాడ: ఆక్వా రంగంలోకి సరికొత్త రకం రొయ్య(స్కాంపీ) రంగ ప్రవేశం చేయనుంది. దేశంలో తిరిగి మంచినీటి రొయ్యల సాగును ప్రోత్సహించాలని కేంద్రం మంచి నీటి రొయ్యల సాగుకు సంస్థ (సీఐఎఫ్ఏ) ఆదేశించింది. రైతులకు నాణ్యమైన సీడ్ అందించేందుకు సీఐఎఫ్ఏ తోడ్పాటు అందించనుంది. ఈ మేరకు పిల్ల ఉత్పత్తికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు హేచరీలకు అనుమతులు మంజూరు చేసింది. అందులో కాకినాడలో ఓ హెచరీ ఉంది. ఇప్పటికే హేచరీలో సీడ్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఏప్రిల్ నాటికి రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక లాభాలు వస్తాయన్న ఆశతో ఎనిమిదేళ్లుగా వనామీ సాగుకే పరిమితమైన రైతులు వైరస్లు తట్టుకునే, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ రకం సాగుదిశగా అడుగులు వేస్తున్నారు. అసలేంటీ స్కాంపీ.. స్కాంపీ మంచినీటిలో పెరిగే రొయ్య. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రకం రొయ్యల ఉత్పత్తిలో మన దేశం అగ్రస్థానంలో ఉండేది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా రెండు వేల ఎకరాల్లో ఈ రకం రొయ్యలు పండించేవారు. కొన్నాళ్లు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. రాను రాను ఆశించిన స్థాయిలో దిగుబడులు, లాభాలు రావడం లేదని భావించిన రైతులు సాగుకు దూరమయ్యారు. వాటి స్థానంలో టైగర్, వనామీ రొయ్యల వైపు వెళ్లారు. ప్రస్తుతం వనామీ పెంపకంలో అనేక అసమానతలు, నష్టాలు వస్తుండటంతో కేంద్రం నూతన పద్ధతుల ద్వారా తెగుళ్లు తక్కువగా ఉండే స్కాంపీ సాగును ప్రోత్సహించాలని భావించింది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసే సీఐఎఫ్ఏ శాస్త్రవేత్తలు స్కాంపీ బ్రూడ్ బ్యాంకును అభివృద్ధి చేస్తున్నారు. మేకిన్ ఇండియా రొయ్యల బ్రూడ్ బ్యాంకు నినాదంతో ముందుకు వెళుతున్నారు. నాలుగు హేచరీలకు అనుమతులు స్కాంపీ పిల్ల ఉత్పత్తికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు హేచరీలకు అనుమతులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన మహారాజా ఆక్వాటిక్స్, బీకేఎంఎస్ స్కాంపీ హెచరీ, ఏఎస్ఆర్ స్కాంపీ హేచరీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎంఎస్ఆర్ స్కాంపీ హేచరీతో ఒప్పందం చేసుకుంది. సీఐఎఫ్ఏ–జీఐ స్కాంపీ పిల్లలను సంస్థ హేచరీలకు అందజేసింది. హేచరీలు రొయ్య సీడ్ ఉత్పత్తి చేపట్టి రానున్న ఏప్రిల్ నెల నుంచి రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పలువురు రైతులకు ఇప్పటికే ఆక్వా నిపుణులను సంప్రదించి స్కాంపీ రొయ్యలు సాగు చేయడానికి చెరువులను సిద్ధం చేసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి: ► వనామీ రొయ్యల సాగుతో పోలిస్తే స్కాంపీ సాగుకు పెట్టుబడి తక్కువ. ► ఎకరాకు రూ.2 లక్షలు సరిపోతుంది. వైరస్లను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ► మందుల అతి వినియోగం ఉండదు. రొయ్య పిల్ల ధర రూపాయి. 50,000 పిల్లలు కొనుగోలు చేసి అర ఎకరా చెరువులో పోయాలి. ► 50 రోజుల అనంతరం ఐదు గ్రాముల బరువు ఉండే రొయ్యలు తీసి పది వేలు చొప్పున రెండు ఎకరాల చెరువుల్లో పోయాలి. ► ఈ సమయంలోనే ఆడ, మగ రొయ్య పిల్లలను వేరు చేయాల్సి ఉంటుంది. ► నాలుగు నెలల్లో రెండు టన్నుల మేత అవసరం అవుతుంది. మగ రొయ్య 140 గ్రాములు, ఆడ రొయ్య 80 గ్రాముల బరువు పెరుగుతుంది. ► రెండు టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ.4 లక్షల చొప్పున ఆదాయం లభిస్తుంది. ఖర్చులకు పోను రైతుకు రెండు లక్షల వరకు మిగులుతుందని ఆక్వా నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ► నీటిలో లవణీయత సున్నా నుంచి ఐదు వరకు ఉన్నా ఎలాంటి ఇబ్బంది రాదంటున్నారు. ► ఏడు నుంచి పదిహేను కౌంట్ రొయ్యలు వస్తాయని భావిస్తున్నారు. ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాం స్కాంపీ సీడ్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాం. ఇందుకు అవసరమైన అనుమతులు వచ్చాయి. సీఐఎఫ్ఏ సంస్థ 110 బ్రూడర్స్(తల్లి రొయ్య)ను సరఫరా చేసింది. వాటి ద్వారా పిల్లల ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ప్రక్రియ మార్చి మొదటి వారం వరకు ఉంటుంది. ఏప్రిల్ మాసంలో రైతులకు సీడ్ అందించేందుకు కృషి చేస్తున్నాం. రైతుల నుంచి మంచి డిమాండ్ ఉంది. కొత్త రకం తమకు కావాలని సంప్రదిస్తున్నారు. - ఎం.వెంకటరమణ, డైరెక్టర్ ఎంఎస్ఆర్ హేచరీస్ చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది -
దేశంలో తగ్గిన చమురు ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అంతకంతకూ తగ్గుతోంది. నవంబర్లో 2 శాతం క్షీణించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడాయిల్ ఉత్పత్తి గతేడాది నవంబర్లో 2.48 మిలియన్ టన్నులుగా ఉండగా, ఈ ఏడాది నవంబర్లో 2.43 టన్నులకు పరిమితమైంది. ఈ ఏడాది అక్టోబర్లో ఇది 2.5 మిలియన్ టన్నులుగా నమోదైంది. పరికరాలు, యంత్రాలను సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఉత్పత్తి 3 శాతం తగ్గి 1.6 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఆయిల్ ఇండియా ఉత్పత్తి 2,43,200 టన్నుల నుంచి 2,41,420 టన్నులకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్–నవంబర్ మధ్య) దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి 2.74 శాతం క్షీణించి 19.86 మిలియన్ టన్నులుగా నమోదైంది. దేశీయంగా ఇంధన అవసరాల కోసం భారత్ ఏటా 85 శాతం మేర క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు, కోవిడ్ దెబ్బతో కుదేలైన ఎకానమీ క్రమంగా పుంజుకుంటూ ఉండటంతో ఇంధన వినియోగం పెరిగి, రిఫైనరీల్లో ప్రాసెసింగ్ సైతం గణనీయంగా మెరుగుపడింది. రిఫైనరీలు .. నవంబర్లో 21.48 మిలియన్ టన్నుల క్రూడాయిల్ (గత నవంబర్తో పోలిస్తే 3.38 శాతం అధికం) ప్రాసెస్ చేశాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో ఇది 11.7% వృద్ధి చెంది 155.73 మిలియన్ టన్నులుగానమోదైంది. | గ్యాస్ 23 శాతం అప్.. నవంబర్లో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ఉత్పత్తి 23 శాతం పెరిగి 2.86 బిలియన్ ఘనపు మీటర్లుగా (బీసీఎం) నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ ఆధ్వర్యంలోని కేజీ–డీ6 బ్లాకులో కొత్త క్షేత్రాలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడింది. కేజీ–డీ6 నుంచి ఉత్పత్తి 1,251 శాతం ఎగిసి 581.36 బీసీఎంకి చేరగా, ఓఎన్జీసీ క్షేత్రాల్లో మాత్రం 5.28 శాతం క్షీణించి 1.72 బీసీఎంకి తగ్గింది. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో గ్యాస్ ఉత్పత్తి 21.78 శాతం పెరిగి 22.77 బీసీఎంకి చేరింది. చదవండి: Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు! -
మహీంద్రాకు కూడా తప్పని పాట్లు..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా నవంబర్-2021లో ఎస్యూవీ కార్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది అక్టోబర్తో పోలిస్తే నవంబర్ నెలలో 5.3 శాతం మేర ఎస్యూవీ కార్ల ఉత్పత్తి తగ్గినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 2020లో ఉత్పత్తి చేసిన ఎస్యూవీ 18119 వాహనాలతో పోలిస్తే ఈ ఏడాదిలో 0.7 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్ 2021లో ఉత్పత్తి చేసిన ఎస్యూవీల సంఖ్య 19,286 గా ఉండగా గత నెలలో 18,261 ఎస్యూవీలను మాత్రమే ఉత్పత్తి చేసింది. సెమీ కండక్టర్స్ కొరతతో.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్స్ కొరత మహీంద్రాను కూడా తాకింది. సెమీకండక్టర్స్ కొరత అధింకగా ఉండటంతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కంపెనీ పోర్ట్ఫోలియోలో 32,000 యూనిట్ల ఉత్పత్తి నష్టాన్ని చవిచూసినట్లు కంపెనీ ప్రకటించింది. త్రీవీలర్, లైట్ వేట్ వాణిజ్య వాహనాల విషయానికొస్తే...కంపెనీ గత నెలలో 420 యూనిట్లను తయారు చేసింది, 2020లో ఇదే నెలలో 4,046 యూనిట్లతో పోలిస్తే గణనీయంగా 89.6 శాతం రెండంకెల తగ్గుదల నమోదు చేసింది. అమ్మకాల విషయానికొస్తే...నవంబర్ 2021లో మహీంద్రా మొత్తం ఆటో అమ్మకాలు (ప్యాసింజర్ వాహనాలు+ వాణిజ్య వాహనాలు+ ఎగుమతులు) గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 42,731 వాహనాలతో పోలిస్తే 40,102 యూనిట్లుగా ఉన్నాయి, 2020తో పోల్చుకుంటే 6.15 శాతం క్షీణతను నమోదు చేసింది. చదవండి: వాహన విక్రయాలకు చిప్ సెగ -
ఐదుగురు నిర్మాతలతో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్: కటకం శ్రీకాంత్
Young Mantra Organization Entry Into Movie Production: డిజిటల్ సినిమా రంగంలో పదేళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ 'యంగ్ మంత్ర'. ఇప్పటి వరకు 500లకుపైగా చిత్రాలను ప్రమోట్ చేసిందీ సంస్థ. ప్రస్తుతం ఆ అనుభవమే పెట్టుబడిగా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థలకు మూడు చిత్రాలను నిర్మిస్తుండగా, వాటితోపాటు త్వరలోనే నూతన నటీనటులతో ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మంచి కంటెంట్, వారి డిజిటల్ ప్రమోషన్స్ అనుభవంతో నాణ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తామని 'యంగ్ మంత్ర' వ్యవస్థాపకుడు కటకం శ్రీకాంత్ తెలిపారు. డిజిటల్ ప్రమోషన్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. 'టాలీవుడ్లో మొదటగా డిజిటల్ ప్రమోషన్స్ ప్రారంభించిన సంస్థల్లో యంగ్ మంత్ర ఒకటి. ఇప్పటివరకు 500లకుపైగా చిత్రాలకు ప్రమోషన్స్తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలతో పనిచేశాం. ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా మరింత అప్డేట్ అవుతూ మరిన్ని ఎక్కువ సినిమాలను తక్కువ ఖర్చుతో ప్రమోట్ చేయడమే మా లక్ష్యం. త్వరలోనే మా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను టాలీవుడ్లో ఐదుగురు ప్రముఖ నిర్మాతలు విడుదల చేయనున్నారు.' అని కటకం శ్రీకాంత్ పేర్కొన్నారు. -
ఏరులైపారుతున్న తేనే! ఈ ఏడాది 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి
న్యూఢిల్లీ: భారత దేశంలో తేనే ఏరులై పారుతుంది. తేనే ఉత్పత్తి కోసం గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన విధానాల కారణంగా ఒక్కసారిగా తేనే ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్తోమర్ అన్నారు. ఢిల్లీలోని కిసాన్ భవన్లో జరిగిన బీకీపర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తేనే ఉత్పత్త పెంచేందుకు కేంద్రం రూ. 500 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించిందన్నారు. ఈ నిధులతో పది వేలకు పైగా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ వచ్చాయన్నారు. ముఖ్యంగా తేనే, ఫలాలు పండించేందుకు అనువుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పథకం చక్కని ఫలితాలు ఇచ్చిందని ఆయన అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న విధానాల కారణంగా తేనే ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో తేనే ఉత్పత్తి 76 వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఏడేళ్లు గడిచే సరికి ఏకంగా 1.25 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. అదే విధంగా విదేశాలకు ఉత్పత్తి చేస్తున్న తేనే 28 వేల మెట్రిక్ టన్నుల నుంచి 60 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. -
కడప స్టీల్ప్లాంట్కు పర్యావరణ అనుమతులు
వైఎస్సార్ కడప: కడప స్టీల్ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులను ఇచ్చింది. దీంతో 3,591 ఎకరాల్లో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. కడప స్టీల్ ప్లాంట్.. ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
కరెంట్ కోతల్లేకుండా చర్యలు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆయన చర్చించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా దానిని తెప్పించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఇందుకు ఎలాంటి నిధుల కొరతలేదని సీఎం స్పష్టంచేశారు. ఇప్పుడున్న థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారు. కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ల్లోని కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అలాగే.. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలని ఆయన సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాదంలో 112 థర్మల్ కేంద్రాలు ఇక బొగ్గు కొరతతో దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 112 కేంద్రాలు ప్రమాదంలో పడ్డాయి. ఇందులో 17 ప్లాంట్లు ఇప్పటికే ఉత్పత్తి నిలిపివేయగా, 27 ప్లాంట్లలో ఒకరోజు, 20 ప్లాంట్లలో రెండు రోజులు, 14 ప్లాంట్లలో మూడు, మరో 14 ప్లాంట్లలో నాలుగు, 12 ప్లాంట్లలో ఐదు, ఏడు ప్లాంట్లలో ఆరు, ఒక ప్లాంటులో ఏడు రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో థర్మల్ ప్లాంట్లను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు.. బొగ్గు కొరత కారణంగా కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) విద్యుత్ సంస్థలకు మినహా మిగిలిన అందరికీ బొగ్గు సరఫరాను పూర్తిగా నిలిపేసింది. అయితే, ఇది తాత్కాలికమేనని, నిల్వలు మామూలు స్థాయికి వచ్చేవరకూ ప్రాధాన్యాన్ని బట్టి సరఫరా చేయాలన్నది కంపెనీ నిర్ణయమని అధికార వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే.. విద్యుత్ ప్లాంట్లు మినహా మిగిలిన ఏ ఇతర సంస్థల్నీ బొగ్గు ఈ–ఆక్షన్లోకి కూడా అనుమతించవద్దని కోల్ ఇండియా తన అనుబంధ సంస్థలకు గురువారం ఆదేశాలిచ్చింది. మరోవైపు.. దసరా తర్వాత కార్మికులు సెలవుల నుండి తిరిగి రాగానే ఉత్పత్తిని పెంచాలని సీఐఎల్ భావిస్తోంది. ఏపీలో బొగ్గు నిల్వలు మెరుగు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ బుధవారం నాటి రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో 65,400 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇది ఐదు రోజుల వరకూ సరిపోతుంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 20,900 మెట్రిక్ టన్నులు ఉంది. ఇది ఒక రోజుకు వస్తుంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్కి 75,700 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండటంతో ఇది కూడా ఐదు రోజులు విద్యుత్ ఉత్పత్తికి సరిపోతుంది. సింహాద్రిలో ఉన్న 21,300 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక రోజుకు ఉపయోగపడుతుంది. అయితే, మంగళవారంతో పోలిస్తే బుధవారానికి రాష్ట్రంలో బొగ్గు నిల్వలు కొంతమేర పెరిగాయి. ఇక రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనిచేయాలంటే రోజుకి 42 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. బుధవారం 14 ర్యాకులలో 53,245 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా అయ్యిందని ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో జలవిద్యుత్ వినియోగం మరోవైపు.. జల విద్యుత్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. దీంతో జెన్కోకు జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి రోజూ 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు కాలువపై 770 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు యూనిట్ల ద్వారా 15 మిలియన్ యూనిట్లు, సీలేరు నుంచి 8 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు. మిగతా కేంద్రాల నుంచి మరో రెండు మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరుగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో ప్రస్తుతం 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. కేవలం 3.34 మిలియన్ యూనిట్ల మేర మాత్రమే లోటు ఏర్పడింది. -
ముసురుకుంటున్న చీకట్లు!
కరెంట్ కోత, లైట్లు లేక కొవ్వత్తులతో కాలక్షేపం... ఒకప్పుడు నిత్యానుభవం. కొన్నేళ్ళుగా దూరమైన ఆ అనుభవం త్వరలోనే మళ్ళీ దేశమంతటా ఎదురుకాక తప్పేలా లేదు. వస్తున్న వార్తలను బట్టి చూస్తే, ఒకప్పటిలా మళ్ళీ విద్యుత్ కోతలు దేశమంతటా నిత్యకృత్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గాయి. సొంతంగా విద్యుదుత్పత్తి చేద్దామంటే బొగ్గు కొరత. థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతపడే పరిస్థితి. పోనీ... ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తే కొందామంటే, అనూహ్యమైన విద్యుత్ కొనుగోలు రేట్ల మోత. యూనిట్కు పాతిక రూపాయలు పెట్టినా, విద్యుత్ లభించని దుఃస్థితి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అందుకే, గృహావసర విద్యుత్ వినియోగం తగ్గించుకొని, విద్యుత్ ఆదా చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వాలూ ప్రజలను అభ్యర్థించాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజలకు విద్యుత్ కోతలు తప్పవన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యం ఇది. మన దేశంలో 135 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అవన్నీ మునుపెన్నడూ లేనంత బొగ్గు నిల్వల కొరతను ఎదుర్కొంటున్నాయనీ, విద్యుత్ కొరత తప్పదనీ సాక్షాత్తూ ‘భారతీయ కేంద్ర విద్యుత్ అథారిటీ’ డేటాయే స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా అవసరమైన విద్యుత్తులో 70 శాతాన్ని ఇవే ఉత్పత్తి చేస్తాయి. కానీ, బొగ్గు నిల్వల తీవ్ర కొరత కారణంగా ఈ 135 థర్మల్ ప్లాంట్లలో 106, అంటే దాదాపు 80 శాతం ప్లాంట్లు సంక్షోభ, లేదా అతి తీవ్ర సంక్షోభ స్థితిలో ఉన్నాయి. సాధారణంగా 14 రోజులకు సరిపడా నిల్వలుండాలని భారత ప్రభుత్వం మాట. కానీ, ఇప్పుడు రెండు రోజులకు మించి లేవు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లలోని బొగ్గు, లిగ్నైట్ గనులున్న ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్ల బొగ్గు రవాణాకు చిక్కులొచ్చాయి. వర్షాకాలానికి ముందే తగినంత బొగ్గు నిల్వలు చేసుకొనే దూరదృష్టి లేకుండా పోయింది. మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలు సైతం చతికిలబడ్డాయి. షిప్పింగ్ ఆలస్యాల కారణంగా అంతర్జాతీయ గొలుసుకట్టు సరఫరా దెబ్బతింది. అంతర్జాతీయ బొగ్గు రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 40 శాతం మేర బొగ్గు ధరలు పెరిగినట్టు లెక్క. కొన్నిచోట్ల ఒక టన్ను 60 డాలర్లుండేది ఇప్పుడు దాదాపు 120 డాలర్లు అయిందని కథనం. దాంతో, అవసరమైన అంతర్జాతీయ బొగ్గును కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆ రేట్లకు కొనలేక, తమ సామర్థ్యంలో సగం కన్నా తక్కువ విద్యుత్తునే ఆ కేంద్రాలు ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి. కేరళలో 4, మహారాష్ట్రలో 13 థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతబడ్డాయి. పంజాబ్లో దాదాపు సగం థర్మల్ విద్యుత్కేంద్రాలు ఆగిపోయాయి. ఇక, దక్షిణాదినా పలు విద్యుత్కేంద్రాలు మూతబడే పరిస్థితి. ఇప్పటికే రాజస్థాన్లో రోజుకో గంట, పంజాబ్లో 3 గంటలు, ఢిల్లీలో విడతల వారీగా విద్యుత్ కోత నడుస్తోంది. అలాగే, కేరళ, గుజరాత్, తమిళనాడు, అతి తీవ్రమైన బొగ్గు కొరత ఉన్న జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు సైతం పవర్ కట్ బాటలోకి వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ విద్యుత్ సంక్షోభంపై ఇప్పటికే కేంద్రానికి వివరంగా లేఖ రాశారు. కోవిడ్ తర్వాత విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందనీ, రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ కొనాలన్నా అందుబాటులో లేదనీ వాస్తవాల్ని వివరించారు. 20 ర్యాక్ల బొగ్గు కేటాయింపు సహా అనేక తక్షణ పరిష్కారాలూ సూచించారు. ఢిల్లీ సహా కొందరు ఇతర ముఖ్యమంత్రులూ తమ కష్టాలు కేంద్రానికి విన్నవించారు. కానీ, సంక్షోభ పరిష్కారానికి కేంద్రం మీనమేషాలు లెక్కించింది. చైనా లాంటి చోట్ల ఇప్పటికే విద్యుత్ సంక్షోభం కనిపిస్తున్నా, మన పాలకులు అంతా బాగుందన్నారు. సమాచార లోపం వల్లే అనవసర భయాలన్నారు. ఎట్టకేలకు సోమవారం కేంద్ర హోమ్మంత్రి సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరపాల్సి వచ్చింది. నిజానికి, విద్యుత్ లాంటి విషయాల్లో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేసే బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ పని సమర్థంగా చేస్తున్నట్టు కనిపించదు. రాష్ట్రాలు విద్యుత్ కోసం అధిక రేట్లకైనా సరే ప్రైవేట్ సంస్థల వద్దకు పరిగెత్తాల్సిన పరిస్థితి కల్పించే కుట్ర ఈ కొరతకు కారణమని కొందరి వాదన. 1957 నాటి చట్టంలో తేనున్న సవరణలతో అరణ్యాలు, గిరిజన భూముల్ని కేంద్రం సేకరించి, బొగ్గు గనుల తవ్వకాలకు ప్రైవేట్ వారికి కట్ట బెట్టడానికే ఇదంతా అని ఆరోపిస్తున్నవారూ లేకపోలేదు. వాటిలో నిజానిజాలు ఏమైనా, కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న వేళ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలపై అజాగ్రత్త స్వయంకృతమే. పాలకులు ‘ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో సరిపెట్టకుండా, బొగ్గు, చమురు, సహజవాయువుల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు తగిన పరిస్థితులు కల్పించాలి. ఇవాళ మంచినీటి లానే విద్యుత్ కూడా! విద్యుత్ లేకపోతే నాగరక జీవి మనుగడే కష్టం. అందుకే, విద్యుత్ రంగంలోనూ ఆచరణవాదంతో సంస్కరణలు తేవడమూ ముఖ్యం. మన దేశ విద్యుత్ అవసరాల్లో 90 శాతం శిలాజ ఇంధనాల నుంచి తీర్చుకుంటున్నాం. భవిష్యత్తుకు ఇది సరి కాదు. ఎక్కడైనా బొగ్గు నిల్వలు శాశ్వతంగా ఉండవు కాబట్టి, ఎప్పటికైనా పునర్వినియోగ విద్యుత్ వైపు మళ్ళాల్సిందే. దేశవ్యాప్తంగా సౌరశక్తి అనే ఉచిత, సహజ వనరును సమర్థంగా ఉపయోగించుకొని, సోలార్ పవర్ ఉత్పత్తి పెంచుకుంటే, సమస్యలుండవు. పవన విద్యుదుత్పత్తి పైనా గట్టిగా దృష్టి పెట్టక తప్పదు. ఆ మధ్య ఆక్సిజన్ కొరత... ఇప్పుడు బొగ్గు కొరత. కళ్ళ ముందున్నా సరే... సమస్యను గుర్తించడానికి నిరాకరిస్తే, కాలం గడిచేకొద్దీ కష్టమే! -
విద్యుత్ ఉత్పత్తికి .. బయోమాస్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గుతోపాటు 5 శాతం బయోమాస్ను ఇంధనంగా వినియోగించాలని కేంద్రం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత, ధరలు విపరీ తంగా పెరిగిన నేపథ్యంలో బయోమాస్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘బయోమాస్ వినియోగ పాలసీ’లో తాజాగా మార్పులను ప్రకటించింది. 2017 నవంబర్లో ప్రకటించిన బయోమాస్ వినియోగ పాలసీ ప్రకారం.. బాల్ మిల్, ట్యూబ్ మిల్ తరహావి మినహా మిగతా అన్ని థర్మల్ ప్లాంట్లు బొగ్గులో 5–10 శాతం బయో మాస్ను కలిపి వినియోగించాలి. బౌల్మిల్ తరహా థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా రెండేళ్లపాటు 5శాతం, తర్వాతి నుంచి 7 శాతం బయోమాస్ను వాడాల్సి ఉంటుంది. బాల్ అండ్ రేస్మిల్ తరహావి 5 శాతం బ్లెండ్ చేసిన బయోమాస్ పెల్లెట్లను.. బాల్ అంట్ ట్యూబ్ మిల్ తరహా ప్లాంట్లు 5శాతం టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లను తప్పనిసరిగా వినియో గించాలి. ఇప్పటినుంచి 25 ఏళ్లు, లేదా సదరు థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం పాటు ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. బయోమాస్ కొరత ఏర్పడకుండా.. సరఫరాదారులతో ఏడేళ్ల కాలవ్యవధితో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించింది. ఏవైనా థర్మల్ కేంద్రాలు బయోమాస్ వినియోగం నుంచి మినహాయింపు కోరితే.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. బయోమాస్ అంటే.. వృక్ష, జంతు వ్యర్థాలనే బయోమాస్గా పరిగణిస్తారు. జంతువుల అవశేషాలు, విసర్జితాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. వాటన్నింటిని పొడిచేసి.. యంత్రాల సాయంతో స్థూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వాటినే సాధారణ బయోమాస్ పెల్లెట్స్ అంటారు. రకరకాల వ్యర్థాలతో రూపొందిన బయోమాస్ పెల్లెట్లను వివిధ ఇంధనాలుగా వినియోగించవచ్చు. ► సాధారణ బయోమాస్లో తేమను పూర్తిగా తొలగించి, తీవ్ర ఉష్ణోగ్రతలో ఒత్తిడికి గురిచేసి గట్టిగా ఉండే పెల్లెట్లను తయారు చేస్తారు. బాగా మండేందుకు వీలుగా కొన్నిరకాల రసాయనాలు కలుపుతారు. వాటిని టోర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లు అంటారు. ఈ తరహా పెల్లెట్ల నుంచి ఎక్కువ మంట, ఉష్ణోగ్రత వెలువడతాయి. వీటిని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వినియోగిస్తారు. సాధారణ పెల్లెట్లు ► మన దేశంలో వార్షికంగా 750 మెట్రిక్ టన్నుల బయోమాస్ లభ్యత ఉందని, పంట వ్యర్థాలను కూడా కలిపితే మరో 230 మెట్రిక్ టన్నుల లభ్యత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. -
ఆగస్టులో తగ్గిన క్రూడ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో 2.3 శాతం క్షీణించింది. అదే సమయంలో రిలయన్స్–బీపీకి చెందిన కేజీ–డీ6 క్షేత్రాల ఊతంతో సహజ వాయువు ఉత్పత్తి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆగస్టులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గడంతో క్రూడాయిల్ ఉత్పత్తి 2.51 మిలియన్ టన్నులకు పరిమితమైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 20.23 శాతం పెరిగి 2.9 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది. ప్రైవేట్ ఆపరేటర్ల క్షేత్రాల్లో ఉత్పత్తి 186 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. ముడిచమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. భారత్ తన క్రూడాయిల్ అవసరాల్లో 85 శాతం భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. 14 శాతం అధికంగా ప్రాసెసింగ్.. ఇంధనాలకు డిమాండ్ పుంజుకుంటూ ఉండటంతో చమురు రిఫైనరీలు ఆగస్టులో 14.17 శాతం అధికంగా 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్ను ప్రాసెస్ చేశాయి. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 13.6 శాతం, ప్రైవేట్ రంగ రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.4 శాతం అధికంగా ముడిచమురును శుద్ధి చేశాయి. రిఫైనరీలు ఆగస్టులో 19.5 మిలియన్ టన్నుల మేర పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేశాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9 శాతం అధికం. ఇక ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో 12 శాతం అధికంగా 100.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఉత్పత్తి చేశాయి. రిఫైనరీలు గతేడాది ఆగస్టులో స్థాపిత సామర్థ్యంలో 76.1 శాతం స్థాయిలో పనిచేయగా.. ఈ ఏడాది 87 శాతం మేర పనిచేశాయి. చదవండి: కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! -
వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు పీఎల్ఐ స్కీమ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ, డ్రోన్ పరిశ్రమలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్ఐఎస్) వర్తింపజేసే ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా రానున్న ఐదేళ్లలో రూ. 26,058 కోట్ల మేర నిధులను కేటాయించనున్నారు. అధిక విలువతో కూడిన అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ వాహనాలు, ఉత్పత్తులకు ఈ పీఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సామర్థ్యం, గ్రీన్ ఆటోమోటివ్ వాహనాల తయారీకి ఈ చర్య ఊతమిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో వివరించారు. 2021–22 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మేరకు మొత్తం 13 రంగాలకు పీఎల్ఐ స్కీమ్ వర్తింపజేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా కేంద్రం ఆటోమోటివ్, డ్రోన్ రంగాలకు ఈ స్కీమ్ను వర్తింపజేసింది. అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో ఎదురవుతున్న పెట్టుబడి సమస్యలను ఈ పథకం పరిష్కరిస్తుంది. సంబంధిత దేశీయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేలా కొత్త పెట్టుబడులను పెట్టేందుకు ఈ ప్రోత్సాహక స్వరూపం దోహదపడుతుంది. ఐదేళ్ల కాలంలో ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ పరిశ్రమలో సుమారు రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఈ చర్య దోహదపడుతుందని కేంద్రం అంచనా వేసింది. సుమారుగా రూ. 2.3 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు పెరగడం వల్ల 7.5 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేసింది. అలాగే అంతర్జాతీయ ఆటోమోటివ్ వాణిజ్యంలో ఇండియా వాటా పెరుగుతుంది. రెండు విధాలుగా అమలు.. ఈ పీఎల్ఐ స్కీమ్ ప్రస్తుతం ఉనికిలో ఉన్న తయారీ సంస్థలకు, కొత్త పెట్టుబడిదారులకు కూడా వర్తిస్తుంది. ఇందులో రెండు కాంపొనెంట్లు ఉన్నాయి. చాంపియన్ ఓఈఎం ఇన్సెంటివ్ స్కీమ్ అమ్మకాల విలువతో అనుసంధానమైన స్కీమ్. ఇది బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్కు వర్తిస్తుంది. ఇక కాంపొనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ అమ్మకాల విలువతో అనుసంధానమై ఉన్న మరో పథకం. ఇది అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ కాంపొనెంట్స్, సీకేడీ, సెమీ సీకేడీ కిట్స్, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల విడిభాగాలకు వర్తిస్తుంది. రూ. 18 వేల కోట్లతో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్కు ఇప్పటికే పీఎల్ఐ స్కీమ్ వర్తింపజేసింది. అలాగే రూ. 10 వేల కోట్లతో ఫేమ్ స్కీమ్ అమలు చేస్తోంది. డ్రోన్స్కు రెక్కలు పీఎల్ఐ పథకంలో భాగంగా డ్రోన్స్, డ్రోన్స్కు అవసరమయ్యే విడిభాగాల పరిశ్రమకు దన్నునిచ్చేందుకు సైతం ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు మూడేళ్ల కాలానికిగాను రూ. 120 కోట్లు కేటాయించినట్లు పౌర విమానయాన శాఖ పేర్కొంది. డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాల తయారీలో వేల్యూ ఎడిషన్కు గరిష్టంగా 20 శాతంవరకూ ప్రోత్సాహకాలు లభించగలవని తెలియజేసింది. 2021 డ్రోన్ నిబంధనల ప్రకారం డ్రోన్ల నిర్వాహకులు నింపవలసిన దరఖాస్తులను 25 నుంచి 5కు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా విప్లవాత్మక ఆధునిక తర టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సాహించనుంది. మూడేళ్ల కాలంలో డ్రోన్ల పరిశ్రమలో రూ. 5,000 కోట్ల పెట్టుబడులకు దారి ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. రూ. 1,500 కోట్ల అర్హతగల అమ్మకాలు పెరగవచ్చని, ఇదే విధంగా 10,000 మందికి అదనంగా ఉపాధి లభించగలదని భావిస్తోంది. పథకంకింద డ్రోన్ల విడిభాగాలలో ఎయిర్ఫ్రేమ్, ప్రొపుల్షన్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, బ్యాటరీలు, ఫ్లైట్ కంట్రోల్ మాడ్యూల్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కెమెరాలు, సెన్సార్లు తదితరాలను చేర్చింది. కాగా.. డ్రోన్ల సంబంధిత ఐటీ ప్రొడక్టుల అభివృద్ధి సంస్థలకు సైతం పీఎల్ఐ పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో పీఎల్ఐ పథకానికి అనుమతించిన 13 రంగాలలో భాగంగానే డ్రోన్ల పరిశ్రమను చేర్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. -
సినిమాల వర్షం కురిపించడానికి సిద్దమైన అగ్రదర్శకులు
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన ఎన్నో సినిమాలను అందించిన దర్శకులు మణిరత్నం, శంకర్ ఇప్పుడు సినిమా వర్షం కురిపించడానికి రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ కొందరు అగ్రదర్శకులతో కలిసి ‘రెయిన్ ఆన్ ఫిల్మ్స్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఆరంభించారు. థియేటర్, ఓటీటీ.. ఇలా పలు ప్లాట్ఫామ్లకు సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మించాలన్నదీ, కొత్త మేకర్స్కి అవకాశం ఇవ్వాలన్నదే ఈ నిర్మాణ సంస్థ సంకల్పం. (చదవండి: డ్రగ్స్ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ సంజన) ఈ బేనర్లో మణిరత్నం, శంకర్తో పాటు భాగస్వాములైనవారిలో ఏఆర్ మురుగదాస్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, లింగుస్వామి, మిస్కిన్, శశి, వసంతబాలన్, లోకేశ్ కనగరాజ్, బాలాజీ శక్తివేల్ ఉన్నారు. తొలి ప్రాజెక్ట్కి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం కమల్హాసన్ హీరోగా ‘విక్రమ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు లోకేశ్. ఇది పూర్తయ్యాక ‘రెయిన్ ఆన్ ఫిల్మ్స్’ బేనర్లో చేసే సినిమాని ఆరంభిస్తారు. ఇంకా నటీనటులను ఖరారు చేయలేదు. ఇలా అగ్రదర్శకులు కలిసి ఓ నిర్మాణ సంస్థను ఆరంభించడం మంచి విషయమని కోలీవుడ్ అంటోంది. -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ -
ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. గత నెలలో 1,70,719 కార్లను తయారీ చేసింది. గతేడాది జులైలో 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసింది. వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తి సామర్థ్యంలో 58 శాతం వృద్ధి నమోదయిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే వాహన తయారీ గణాంకాలలో పెరుగుదల ఉన్నప్పటికీ ఈ పోలిక అర్ధవంతమైనది కాదని.. ఎందుకంటే గతేడాది జులైలో కరోనా అంతరాయం కారణంగా విక్రయాలు చాలా తక్కువ స్థాయిలో జరిగాయని తెలిపింది. 2018 జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలోని ఉత్పత్తి సామర్థ్యం తక్కువేనని పేర్కొంది. ఈ ఏడాది జులైలో 1,67,825 ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయగా.. గతేడాది జులైలో ఇవి 1,05,345 యూనిట్లుగా ఉన్నాయి. మోడళ్ల వారీగా చూస్తే.. ఈ ఏడాది జులైలో ఆల్టో, ఎస్ప్రెస్సో 24,899 కార్లు తయారయ్యాయి. గతేడాది ఇదే నెలలో వీటి సంఖ్య 20,638గా ఉన్నాయి. వ్యాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్లు 55,390 యూనిట్ల నుంచి 90,604 యూనిట్లకు పెరిగాయి. అదేవిధంగా జిప్సీ, ఎర్టిగా, ఎస్–క్రాస్, విటారా బ్రెజా, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలు 19,130 నుంచి 40,094 యూనిట్లకు వృద్ధి చెందాయి. లైట్ కమర్షియల్ వెహికిల్స్ ఉత్పత్తి గత నెలలో 2,894 యూనిట్లు కాగా.. క్రితం ఏడాది జులైలో ఇవి 2,342 యూనిట్లుగా ఉన్నాయి. చదవండి: మనదేశంలో ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా కొంటున్నారో మీకు తెలుసా? -
5 ఏరియాలు టాప్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021 – 2022)లో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. వెనుకబడిన ఆరు ఏరియాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. జూన్లో 102% ఉత్పత్తి సింగరేణిలో గడిచిన జూన్లో 20 ఓపెన్కాస్ట్ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్లోని మణుగూరు టాప్గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి. – ఎన్.శ్రీధర్, సింగరేణి సీఅండ్ఎండీ -
'డైరక్టర్ కన్నా నిర్మాతలకే కష్టాలు ఎక్కువ'
చెన్నై: చిత్రానికి దర్శకత్వం వహించడం చాలా సులభమని, అయితే దానిని నిర్మించడం చాలా కష్టతరం అని దర్శకుడిగా అవతారమెత్తిన నిర్మాత వి.రాజా పేర్కొన్నారు. ఇంతకుముందు అరువా సండై చిత్రాన్ని నిర్మించి కథానాయకుడిగా నటించిన ఈయన తాజాగా దర్శకుడుగా మెగాఫోన్ పట్టి నిర్మిస్తున్న చిత్రం భార్గవి. ముఖేష్, శ్రియ అనే నవ జంటను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దర్శక, నిర్మాత వి.రాజా పుట్టినరోజు సందర్భంగా గత ఒకటవ తేదీన ఈ చిత్ర టైటిల్ను నటుడు విజయ్సేతుపతి ఆవిష్కరించారు. చిత్ర నిర్మాణం గురించి వి.రాజా మాట్లాడుతూ చిత్రాలకి దర్శకత్వం వహించడం చాలా సులభమని అయితే దానిని నిర్మించడం చాలా కష్టతరం అని పేర్కొన్నారు. ఈ రంగంలో తనకున్న అనుభవంతో పాండి సెల్వ, రాజి, గోపి వంటి అనుభవం కలిగిన దర్శకులను సహదర్శకులుగా చేర్చుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. -
‘ఎలక్ట్రిక్’ తయారీలో మనకు సత్తా ఉంది
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలను దేశీయంగా తయారు చేయగలగడంతో పాటు ఇక్కడే ఉత్పత్తి చేపట్టేలా అంతర్జాతీయ సంస్థలను కూడా ఆకర్షించగలిగే సత్తా భారత్కి పుష్కలంగా ఉందని ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు. దిగుమతులకే పరిమితం కాకుండా తయారీ కూడా చేపట్టగలమని దేశ సామర్థ్యాలపై గట్టి నమ్మకం ఉండాలని ట్విటర్లో పేర్కొన్నారు. దిగుమతయ్యే ఎలక్ట్రిక్ కార్లపై సుంకాలను తగ్గించాలంటూ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా, కొరియన్ సంస్థ హ్యుందాయ్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో భవీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం 40,000 డాలర్ల పైగా సీఐఎఫ్ (ఖరీదు, బీమా, రవాణా వ్యయాలు) విలువ చేసే కార్ల దిగుమతిపై భారత్ 100% సుంకాలు విధిస్తోంది. అంతకన్నా తక్కువ విలువున్న వాటిపై దిగుమతి సుంకం 60% ఉంటోంది. ఓలా... తమిళనాడులో ఈ–స్కూటర్ల తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం రూ. 2,400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. విద్యుత్ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ కోరుతున్న హ్యుందాయ్.. మరో ఆటోమొబైల్ కంపెనీ కియాతో కలిసి ఓలాలో 300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
సిమెంట్ పరిశ్రమ పురోభివృద్ధిపై కేంద్రం దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: సిమెంట్ పరిశ్రమ పురోగతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. దాల్మియా భారత్ గ్రూప్ సీఎండీ పునీత్ దాల్మియా నేతృత్వంలో 25 మంది సభ్యులతో ప్రత్యేకంగా ఒక మండలిని (డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ–డీసీసీఐ) ఏర్పాటు చేసింది. ఈ మండలి కాలపరిమితి రెండేళ్లని అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి శాఖ (డీపీఐఐటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. దృష్టి సారించే అంశాలు.. పరిశ్రమలో వ్యర్థాల నివారణ, గరిష్ట ఉత్పత్తి సాధన, నాణ్యత పెంపు, వ్యయాల తగ్గింపు, ఉత్పిత్తి ప్రమాణాల మెరుగుదల వంటి కీలక అంశాలపై ఈ మండలి తగిన సిఫారసులు చేస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వ్యవస్థాపక సామర్థ్యం పూర్తి వినియోగం, పరిశ్రమ పనితీరు మెరుగుదల, అంతగా సామర్థ్యంలేని కర్మాగారాలకు సంబంధించి నిర్ణయాలు– సిఫారసులు, ఈ రంగంలో మానవ వనరులకు ప్రత్యేక శిక్షణ, అలాగే శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన, కార్మికులకు భద్రతా ప్రమాణాలు, కొత్త పరికరాలు, విధానాల అభివృద్ధి, అత్యుత్తమ పని పరిస్థితుల కల్పన వంటి అంశాలపై కూడా మండలి దృష్టి సారిస్తుంది. అకౌంటింగ్, కాస్టింగ్ అంశాల్లో ప్రమాణాల స్థిరీకరణకు కృషి చేస్తుంది. సభ్యుల్లో కొందరు... ప్రకటన ప్రకారం కమిటీ సభ్యుల్లో అల్ట్రాటెక్ సిమెంట్ ఎండీ కేసీ జన్వార్, శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం బంగూర్, ఇండియా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాకేశ్ సింగ్; బిర్లా కార్పొరేషన్ సీఈఓ ప్రచేతా మజుందార్; జేకే సిమెంట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మాధవకృష్ణ సింఘానియా, జెఎస్డబ్లు్య సిమెంట్ సీఈఓ నీలేష్ నార్వేకర్లు ఉన్నారు. -
ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం..
జయపురం: మండీలలో ధాన్యం కొనుగోలు చేయకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని జయపురం సమితిలోని గివురి గ్రామ రైతులు హెచ్చరించారు. మండీలకు తరలించిన ధాన్యాన్ని అక్కడి సిబ్బంది, ల్యాంప్ అధికారులు ఏదో కారణం చెప్పి, కొనడం లేదన్నారు. దీంతో కొన్ని నెలల పాటు ధాన్యం అలాగే ఉండిపోయి పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల కొనుగోళ్లకు సైతం డబ్బులు లేని పరిస్థితుల్లో కొంతమంది రైతులు దళారీలకు తక్కువ ధరకే ధాన్యం అమ్మి, నష్టపోతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ధాన్యం కొనుగోలుకు ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు. -
రియల్మీ నుంచి ల్యాప్టాప్..ఆపిల్ మాక్బుక్ను పోలి ఉన్న ఫినిషింగ్..!
కోవిడ్-19 మహమ్మారి రాకతో ల్యాప్టాప్ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రజలు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమవ్వడంతో ల్యాప్టాప్ సేల్స్ భారీగా పెరిగాయి. ఆసుస్, డెల్, హెచ్పి, లెనోవో వంటి ల్యాప్టాప్ కంపెనీల కొనుగోళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీలు భారీగా లాభాలను ఆర్జించాయి. దీంతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ల్యాప్టాప్ల తయారీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్మీ కూడా ల్యాప్టాప్ ఉత్పత్తిపై దృష్టిసారించింది. కాగా త్వరలోనే రియల్మీ నుంచి ల్యాప్టాప్ రిలీజ్ అవుతుందని కంపెనీ సీఈఓ మాధవ్ శేత్ ట్విటర్లో పోస్ట్చేశాడు. 2008 లో స్టీవ్ జాబ్స్ మొదటి తరం మాక్బుక్ ఎయిర్ను ఎలా ఆవిష్కరించారనే విషయాన్ని గుర్తుచేస్తూ, పేపర్బ్యాగ్లో ఉన్న రియల్మీ ల్యాప్టాప్ ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ షావోమీకు చెందిన ల్యాప్టాప్లకు పోటీగా, రియల్మీ ల్యాప్టాప్ను రిలీజ్ చేయనుంది. రియల్మీ కంపెనీ భారత్, యూరప్ సీఈవో మాధవ్శేత్ తన ట్విటర్ ఖాతా నుంచి హల్లో వరల్డ్ అనే ఒక క్రిప్టిక్ మెసేజ్ను తెలుపుతూ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. కాగా చిత్రంలో రియల్మీ ల్యాప్టాప్ ఆపిల్ మాక్బుక్ మాదిరిగానే ఫినిషింగ్ కల్గి ఉన్నట్లుగా తెలుస్తోంది.ల్యాప్టాప్ బాడీ అల్యూమినియం లేదా ప్లాస్టిక్తో తయారుచేశారనే విషయంలో కాస్త అస్పష్టత నెలకొంది. 01001000B 01100101B 01101100B 01101100B 01101111B 00100000B 01010111B 01101111B 01110010B 01101100B 01100100B 00100001B 00000000B#realme new product category has a message for you! Can you decode it & guess the product name that will add up to your #TechLife? pic.twitter.com/PhPcvn0668 — Madhav Max 5G (@MadhavSheth1) June 9, 2021 చదవండి: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ వచ్చేశాయి.. మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..! -
DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి చికిత్సలో డా.రెడ్డీస్తో కలిసి అభివృద్ధి చేసిన 2-డీజీ ఉత్పత్తికి సంబంధించి డీఆర్డీవో కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ డ్రగ్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఇతర ఔషధ సంస్థలకు బదిలీ చేయనుంది. ఇందుకు కంపెనీలనుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ (ఈఓఐ)ను ఆహ్వానిస్తోంది. ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కోరింది. ఆయా కంపెనీలు దరఖాస్తులను సమర్పించడానికి జూన్ 17 చివరి తేదీగా వెల్లడించింది. పరిశ్రమలు సమర్పించిన ఈఓఐను తమ టెక్నికల్ అసెస్మెంట్ కమిటీ పరిశీలిస్తుందని వీటి ఆధారంగా 15 పరిశ్రమలకు మాత్రమే ఉత్పత్తికి అనుమతి ఉంటుందని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, సామర్ధ్యం, తమ సాంకేతిక హ్యాండ్హోల్డింగ్ సామర్ధ్యం ఆదారంగా కేటాయింపు ఉంటుందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా కరోనా నివారణలో తమ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) ఆసుపత్రులో చేరిన రోగులు వేగంగా కోలుకోవడానికి దోహదపడుతుందని, ఆక్సిజన్పై ఆదారపడటాన్ని కూడా తగ్గిస్తుందని డీఆర్డీవో గతంలోనే ప్రకటించినసంగతి తెలిసిందే. ఈ మందు తయారీకి బిడ్డర్లకు డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీలనుండి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్ (ఏపీఐ), డబ్ల్యూహెచ్ఓ జీఎమ్పి (మంచి తయారీ పద్ధతులు) ధృవీకరణ తయారీకి డ్రగ్ లైసెన్స్ ఉండాలి. కాగా వినూత్నమైన పనితీరు కారణంగానే కరోనావైరస్ను 2డీజీ సమర్థంగా నిరోధించ గలుగుతోందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్రెడ్డి చెప్పారు. ఈ మందు తయారీ, పంపిణీ సులువుగా ఉంటుందన్నారు. అలాగే కరోనా వైరస్ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం సమర్థంగా పనిచేస్తుందని డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ నారాయణ్ భట్ తెలిపారు. చదవండి : DRDO 2G Drug: వైరస్ రూపాంతరాలపైనా 2-డీజీ ప్రభావం! -
భారత్ తయారీకి ‘పీఎల్ఐ’ బూస్ట్
న్యూఢిల్లీ: దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్, జౌళి, ఫుడ్ ప్రాసెసింగ్సహా పదమూడు కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ప్రకటించిన ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తయారీ రంగం ఉత్పత్తి వచ్చే ఐదేళ్లలో 520 బిలియన్ డాలర్లకు (డాలర్ మారకంలో రూపాయి విలువ 73గా చూస్తే, దాదాపు 37,96,000 కోట్లు) చేరుతుందన్ని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తయారీ రంగం ఉత్పత్తి దాదాపు 380 బిలియన్ డాలర్లు. దిగుమతులపై ఆధాపడ్డాన్ని తగ్గించడం, ఎగుమతుల పెంపు లక్ష్యంగా మొత్తం 13 రంగాలకు రానున్న ఐదేళ్ల కాలంలో రూ.1.97 లక్షల కోట్ల ప్రయోజనాలు కల్పించడం పీఎల్ఐ పథకంలో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. పీఎల్ఐ స్కీమ్పై పారిశ్రామిక, అంతర్జాతీయ వాణిజ్య శాఖ (డీపీఐఐటీ), నీతి ఆయోగ్ నిర్వహించిన ఒక వెబినార్ను ఉద్దేశించి ప్రధాని శుక్రవారం చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► భారీ వృద్ధే ప్రధాన లక్ష్యంగా కేంద్రం తయారీ రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తోంది. వచ్చే ఐదేళ్లకు పీఎల్ఐకి ఈ ఏడాది బడ్జెట్లో రూ.2 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. ► ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారుకూడా పీఎల్ఐ స్కీమ్ వల్ల ప్రయోజనం పొందుతారు. అలాగే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ► మౌలిక వనరులకు సంబంధించి సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. వ్యాపార పరిస్థితులు మరింత మెరుగుపడ్డానికి తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. పరిశ్రమల రవాణా వ్యయాలు గణనీయంగా తగ్గడానికి కృషి జరుగుతోంది. ► వివిధ స్థాయిల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోత్సాహానికి కేంద్రం గడచిన ఆరు, ఏడు సంవత్సరాల్లో పలు విజయవంతమైన చర్యలను తీసుకుంది. ► పలు విభాగాల్లో నియంత్రణా పరమైన క్లిష్టతలను సైతం ప్రభుత్వం తగ్గిస్తోంది. ► అలాగే విభిన్న రంగాల్లో అత్యాధునిక సాంకేతికను ప్రవేశపెట్టడానికి తగిన చొరవలను, నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోంది. చిరుధాన్యాల సంవత్సరం... మనకు ఒక అవకాశం 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న భారత్ తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ ఆమోదముద్ర వేయడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది భారత్ రైతులకు ఒక మంచి అవకాశమని ఆయన అన్నారు. ఆరోగ్య సంరక్షణలో చిరుధాన్యాల విలువను తెలియజేడానికి ప్రపంచవ్యాప్త ప్రచారం ప్రారంభించాలని ఆయన పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ఈ తరహా ప్రచారం భారత్ రైతులకు ప్రయోజనం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కు ఆయన విజ్ఞప్తి చేశారు. వృద్ధే బడ్జెట్ లక్ష్యం: వివేక్ దేవ్రాయ్ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వృద్ధే లక్ష్యంగా రూపొందిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. అలాగే పన్ను రేట్లు స్థిరంగా కొనసాగుతాయని కూడా సంకేతాలు ఇచ్చిందని వివరించారు. వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయాల పెంపు లక్ష్యంగా సంస్కరణలపై 2021–22 బడ్జెట్ దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ బీఎఫ్ఎస్ఐ అండ్ ఫిన్టెక్ సదసు 2021ని ఉద్ధేశించి ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 శాతంగా నమోదవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణత 8 శాతంగా ఉంటుందని అంచనా. ఎగుమతుల పెంపు ప్రభుత్వం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. వాస్తవిక వృద్ధిని అందించే రంగాల్లో ఎగుమతులు ఒకటి. అయితే ఎగుమతుల పెరుగుదల ఇంకా అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఫైనాన్షియల్ రంగం ‘నెమ్మది’: చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యం ఇదే సమావేశంలో మాట్లాడుతూ, భారత్ ఫైనాన్షియల్ రంగం తన పూర్తి స్థామర్థ్యం మేరకు పురోగమించడం లేదని అన్నారు. ఒక రకంగా చాలా నెమ్మదిగా నడుస్తోందన్నారు. ఉదాహరణకు ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్లో బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రపంచంలో 55వ ర్యాంకులో ఉందన్నారు. డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అవినాశ్ గుప్తా మాట్లాడుతూ, భారత్ను వృద్ధి బాటలో సంఘటితంగా ముందుకు నడిపించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రత్యేకించి లాక్డౌన్ పరిస్థితుల్లో డిజిటల్ టెక్నాలజీ కీలకపాత్ర మరువలేనిదన్నారు. డిజిటల్ లావాదేవీల పరిమాణం 2020 ఏప్రిల్– 2021 మార్చి 1 మధ్య రూ.4,525 కోట్లకు చేరిందని అన్నారు. -
మరింత ‘స్మార్ట్’గా ఎంఐ తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ(మేకిన్ ఇండియా)కి ప్రాధాన్యతనిస్తూ చైనీస్ దిగ్గజం ఎంఐ తాజాగా కాంట్రాక్ట్ తయారీ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీల తయారీకి బీవైడీ, డీబీజీ, రేడియంట్లతో చేతులు కలిపింది. దీనిలో భాగంగా ఎంఐ తరఫున బీవైడీ, డీబీజీ స్మార్ట్ ఫోన్లను తయారు చేయనుండగా.. స్మార్ట్ టీవీలను రేడియంట్ రూపొందించనుంది. తద్వారా దేశీయంగా స్మార్ట్ టీవీల తయారీని భారీగా పెంచుకోనుంది. హర్యానా యూనిట్లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన డీబీజీ.. ఇకపై తమ బ్రాండ్ తయారీ సామర్థ్యాన్ని 20% పెంచనున్నట్లు షావోమీ ఇండియా ఎండీ మను జైన్ పేర్కొన్నారు. తమిళనాడులో ఏర్పాటైన బీవైడీ యూనిట్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభంకానున్నట్లు మను జైన్ తెలియజేశారు. 5 క్యాంపస్లు దేశవ్యాప్తంగా ప్రస్తుతం షావోమీ ఐదు క్యాంపస్లను కలిగి ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో ఫోన్లను అసెంబుల్ ఫాక్స్కాన్, ఫ్లెక్స్లతో జట్టు కట్టింది. స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న భారీ డిమాండ్ నేపథ్యంలో తయారీ సామర్థ్యాన్ని విస్తరించవలసి ఉన్నట్లు జైన్ వెల్లడించారు. ఇంటివద్ద నుంచే ఆఫీస్ వర్క్, చదువులు కొనసాగుతున్న కారణంగా అత్యధిక కంటెంట్ వినియోగమవుతున్నట్లు చెప్పారు. దీంతో డిమాండుకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్లలో వినియోగిస్తున్న విడిభాగాలు స్థానికంగా తయారు చేసినవి లేదా అసెంబుల్డ్ అయినవేనని పేర్కొన్నారు. ఫోన్ల విలువలో 75 శాతంవరకూ స్థానికంగా సమకూర్చుకున్న విభాగాలతోనే రూపొందుతున్నట్లు వివరించారు. పీసీబీఏ, సబ్–బోర్డులు, కెమెరా మాడ్యూల్స్, బ్యాక్ ప్యానల్స్, వైర్లు, చార్జర్లు దేశీయంగా తయారవుతున్నట్లు వెల్లడించారు. వీటిని సన్నీ ఇండియా, ఎన్వీటీ, శాల్కాంప్, ఎల్వై టెక్, సన్వోడా తదితరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అన్ని కార్యకలాపాల ఫలితంగా 30,000 మందికి ఉపాధి కల్పించినట్లు జైన్ తెలియజేశారు. స్మార్ట్ టీవీ విభాగంలోనూ 1,000 మంది పనిచేస్తున్నట్లు తెలియజేశారు. 2020లో జూమ్: కోవిడ్–19 నేపథ్యంలో 2020లో 15 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్ షిప్మెంట్స్ నమోదయ్యాయి. కౌంటర్పాయింట్ గణాంకాల ప్రకారం అక్టోబర్–డిసెంబర్ కాలంలో వార్షికంగా 19 శాతం వృద్ధిని సాధించగా.. పోకో బ్రాండుతో కలిపి షావోమీ 26 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. తద్వారా టాప్ ర్యాంకులో నిలవగా.. 21 శాతం వాటాతో శామ్సంగ్, 16 శాతంతో వివో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక రియల్మీ వాటా 13 శాతంకాగా.. ఒప్పో 10 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. 2021లో స్మార్ట్ ఫోన్ షిప్మెంట్స్ 16–16.5 కోట్ల యూనిట్లకు చేరవచ్చని జైన్ అంచనా వేస్తున్నారు. ఈ బాటలో ఓటీటీ కంటెంట్కు పెరుగుతున్న ఆదరణ కారణంగా స్థానికంగా తయారైన 30 లక్షల స్మార్ట్ టీవీలను విక్రయించినట్లు వెల్లడించారు. -
10 కోట్ల మందికి ‘హీరో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ గొప్ప రికార్డు సృష్టించింది. కంపెనీ ప్రారంభమైన 1984 నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 కోట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేసి మరో మైలురాయిని అధిగమించింది. భారత్ నుంచి ఈ రికార్డు సాధించిన తొలి వాహన కంపెనీగా పేరు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న సంస్థగా వరుసగా 20 ఏళ్లుగా తన అగ్రస్థానాన్ని హీరో మోటోకార్ప్ పదిలపరుచుకుంది. తొలి 10 లక్షల యూనిట్లు అమ్మడానికి సంస్థకు 10 ఏళ్ల సమయం పట్టింది. 2004 నాటికి 1 కోటి, 2013 నాటికి 5 కోట్ల యూనిట్ల మార్కును చేరుకుంది. ఇక గడిచిన ఏడేళ్లలోనే 5 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేయడం విశేషం. సంస్థ పట్టుదల, కలల ఫలానికి ఈ మైలురాయి చిహ్నం అని హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల ఆదరణ, నమ్మకం, కంపెనీ సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఏటా 10 మోడళ్లు..: వృద్ధి ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తామని పవన్ ముంజాల్ తెలిపారు. ‘నూతన మోడళ్ల పరిశోధన, అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు పెడతాం. మొబిలిటీ రంగంలో కొత్త, ప్రత్యామ్నాయ పరిష్కారాలపై దృష్టిసారిస్తాం. ప్రపంచ అవసరాల కోసం భారత్లో వాహనాలను తయారు చేస్తున్నాం. అంతర్జాతీయంగా మరిన్ని దేశాలకు విస్తరిస్తాం. రానున్న అయిదేళ్లపాటు కొత్త వేరియంట్లు, అప్గ్రేడ్స్తో కలిపి ఏటా 10 మోడళ్లను పరిచయం చేస్తాం’ అని తెలిపారు. సెలబ్రేషన్ ఎడిషన్ మోడల్స్.. కొత్త మైలురాయిని అందుకున్న శుభ సందర్భంగా హీరో మోటోకార్ప్ ఆరు సెలబ్రేషన్ ఎడిషన్ మోడల్స్ను ఆవిష్కరించింది. వీటిలో స్ప్లెండర్ ప్లస్, ఎక్స్ట్రీమ్ 160ఆర్, ప్యాషన్ ప్రో, గ్లామర్, డెస్టిని 125, మాయెస్ట్రో ఎడ్జ్ 110 ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఇవి షోరూముల్లో అందుబాటులో ఉంటాయి. -
కరోనా ఎఫెక్ట్: ఇక ఆ కార్లు ఉండవు
సాక్షి, ముంబై: అసలే సంక్షోభంలో చిక్కుకున్న ఆటో పరిశ్రమను కరోనా వైరస్ మరింత దెబ్బతీసింది. లాక్డౌన్ కాలంలో అమ్మకాలు అసలే లేకపోవడంతో ఆదాయాలు క్షీణించి కుదేలయ్యాయి. దీంతో హోండా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ రెండు ప్లాంట్లలో ఒకదానిలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ నోయిడా ప్లాంట్ వద్ద హోండా వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది. అంతేకాదు గ్రేటర్ నోయిడా ప్లాంట్లో తయారయ్యే హోండా పాపులర్ కార్లు హోండా సివిక్, సీఆర్-వీ కార్లు ఇకపై ఇండియాలో లభ్యంకావని వెల్లడించింది. భారీ పెట్టుబడి అవసరం కనుక ఈ రెండు కార్లను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. బహుల జనాదరణ పొందిన హోండా సివిక్ ,హోండా సీఆర్-వీరెండు గ్లోబల్ మోడల్స్ను నిలిపివేయడం తమకు చాలాకష్టమైన నిర్ణయమని హెచ్సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ,డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే రాబోయే 15 సంవత్సరాలకు ఈ రెండు కార్ల యజమానులకు అన్ని విధాల తమ సహాయ సహకారాల్ని అందిస్తామన్నారు. తాజా నిర్ణయంతో హోండా పోర్ట్ఫోలియోలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్, మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీ, సబ్-4 ఎమ్ ఎస్యువి డబ్ల్యుఆర్-వీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ జాజ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. నోయిడా ప్లాంట్ పెద్ద హోండా వాహనాలు ఉత్పత్తి అవుతుండగా, రాజస్థాన్లోని రెండవ తపుకర ప్లాంట్ చిన్న, హై-స్పీడ్ కార్లు తయారవుతున్నాయి. హోండా సిటీ ఉత్పత్తిని తపుకరలోని ప్లాంట్కు మార్చనుంది. -
పెరిగిన చక్కెర ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో అక్టోబర్–నవంబర్ మధ్య కాలంలో చక్కెర ఉత్పత్తి రెండు రెట్లు పెరిగి 42.9 లక్షల టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఉత్పత్తి 20.72 లక్షల టన్నులుగా ఉందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) తెలిపింది. ఈ సీజన్లో షుగర్కేన్ క్రషింగ్ త్వరగా ప్రారంభం కావటమే ఉత్పత్తి పెరగడానికి ప్రధాన కారణమని ఐఎస్ఎంఏ పేర్కొంది. 2018–19 సంవత్సరంలోనూ ప్రొడక్షన్స్ ఇదే తీరులో జరిగిందని.. ఆ సమయంలో 418 షుగర్ మిల్లుల నుంచి 40.69 లక్షల టన్నులు చక్కెర ఉత్పత్తి జరిగింది. ఈ సీజన్లో ఉత్తర ప్రదేశ్ అత్యధికంగా చక్కెర ఉత్పత్తి జరిగింది. గతేడాది 11.46 లక్షల టన్నులుండగా.. ప్రస్తుతమిది 12.65 లక్షల టన్నులకు పెరిగింది. మహారాష్ట్రలో ప్రస్తుతం 15.72 లక్షల టన్నులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 1.38 లక్షల టన్నులుగా ఉంది. కర్నాటకలో 5.62 లక్షల టన్నుల నుంచి 11.11 లక్షల టన్నులకు పెరిగింది. ప్రస్తుత సీజన్లో ప్రధాన రాష్ట్రాల్లో సగటు షుగర్ మిల్ చక్కెర ధరలు తగ్గినట్లు ఇస్మా గుర్తించింది. -
జవహర్నగర్ డంప్ యార్డు నుంచి కరెంట్
సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించాయి. ఎందుకూ పనికిరాదని పారేసిన చెత్త నుంచే వెలుగులిచ్చే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరం నుంచి వెలువడుతున్న చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పని ప్రారంభించింది. లాంఛనప్రాయ ప్రారంభోత్సవం ఇంకా జరగకపోయినా.. గతనెల నుంచే జవహర్నగర్లోని డంపింగ్ కేంద్రంలో ఉన్న ప్రత్యేక విద్యుత్ తయారీ ప్లాంట్ నుంచి రాంకీ సంస్థ వేస్టేజ్ నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి వరకు 51 లక్షల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. దీంతో దక్షిణ భారతదేశంలోనే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ నిలిచింది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చెత్తను వినియోగించి రోజుకు 19.8 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్లాంట్లోని రెండు బాయిలర్లకుగాను ఒకటి మాత్రమే ప్రస్తుతం వినియోగంలోకి వచ్చింది. దీంతో దాదాపు 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దాన్ని ప్రభుత్వ విద్యుత్పంపిణీ సంస్థకు నిర్ధారిత ధరకు సరఫరా చేస్తోంది. రెండో బాయిలర్కూడా వినియోగంలోకి వస్తే 19.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం దశాబ్దాలుగా ఆలోచనలున్నా.. ఇప్పటి వరకు ఫలితమివ్వలేదు. వివిధ సంస్థలు చేపట్టిన పనులు పలు కారణాలతో ముందుకు సాగలేదు. నగరంలో వెలువడే చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించేందుకు రాంకీ సంస్థ 2009లో జీహెచ్ఎంసీతో 25 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఐఎంఎస్డబ్లు్యఎం) ప్రాజెక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా తొలిదశలో 19.8 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్టన్నుల ఆర్డీఎఫ్ చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. రెండో దశలో మరో 28.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా చర్యలు చేపట్టారు. రెండు దశలు పూర్తయితే జవహర్నగర్కు తరలిస్తున్న చెత్తనుంచి 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. (చదవండి: కరోనా టీకా వీరికే ఫస్ట్..) పర్యావరణహిత టెక్నాలజీతో.. పర్యావరణహితమైన థర్మల్ కంబషన్ టెక్నాలజీతో విద్యుత్ను ఉత్పత్తిచేసే ప్లాంట్ను రాంకీ జవహర్నగర్లో ఏర్పాటు చేసింది. దాని ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ టెక్నాలజీతో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లు ఢిల్లీలో 3, జబల్పూర్లో ఒకటి ఉన్నాయి. ఢిల్లీ లోని 3 ప్లాంట్లనుకూడా రాంకీయే నిర్వహిస్తోంది. వాటి ద్వారా 59 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తికి ఉపకరించేలా శుద్ధిచేయగా మండే గుణమున్న చెత్తను రెఫ్యూజ్ డిరైవ్ ఫ్యూయెల్(ఆర్డీఎఫ్)గా వ్యవహరిస్తారు. జవహర్నగర్ డంపింగ్యార్డులో ఏళ్ల తరబడి గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా నిర్వహించే చర్యలతో ఇప్పటి వరకు 75,19,278 మెట్రిక్ టన్నుల చెత్తను ట్రీట్ చేశారు. దాదాపు 125 ఎకరాల్లోని చెత్తగుట్టలకు రూ.144 కోట్లతో చేపట్టిన క్యాపింగ్ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. (చదవండి: గ్రేటర్ ఎన్నికల్లో ప్లాన్ మార్చిన అభ్యర్థులు) లక్ష్యం 100 మెగావాట్లు.. రోజురోజుకూ పెరుగుతున్న గ్రేటర్ నగరం.. విస్తరిస్తున్న కాలనీలు.. వెలువడుతున్న వ్యర్థాలతో చెత్త సమస్యలు పెరగకుండా, మరోవైపు చెత్తను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా నాలుగైదేళ్లలో దాదాపు 100 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చునని అధికారులు అంచనా వేశారు. ఇవన్నీ వెరసి మొత్తం 73 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా, గ్రేటర్లో వెలువడే చెత్తనుంచి మరో 27 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశముందని అంచనా. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్(ఈపీటీఆర్ఐ) సూచన కనుగుణంగా రాంకీ సంస్థ దుండిగల్లో మరో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ రూపొందించింది. చెత్త సమస్య తగ్గుతుంది... విద్యుత్ ఉత్పత్తి వల్ల జవహర్నగర్ డంపింగ్యార్డులో చెత్త పరిమాణం తగ్గుతుంది. ఆర్థికంగా కూడా ప్రయోజనమే. జవహర్నగర్ డంపింగ్యార్డుకు ప్రస్తుతం దాదాపు 6 వేల మెట్రిక్టన్నుల చెత్తను తరలిస్తుండగా, దీన్ని 3 వేల మెట్రిక్ టన్నులకు తగ్గించాలనేది లక్ష్యం. అందుకుగాను నగర శివార్లలో మరికొన్ని చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటుచేస్తాం. అంతే కాకుండా ఎక్కడి చెత్తను అక్కడే కంపోస్టు ఎరువుగా మార్చేందుకు సర్కిళ్ల స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం. తద్వారా జవహర్నగర్కు తరలించే చెత్త పరిమాణం తగ్గుతుంది. – రాహుల్ రాజ్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ -
రష్యా వ్యాక్సిన్.. ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తి పూర్తి
మాస్కో: కరోనాకు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ని అభివృద్ధి చేశామని ప్రకటించిన రష్యా.. తాజాగా, ఆ టీకా మొదటి బ్యాచ్ ఉత్పత్తిని పూర్తి చేసినట్లు తెలిపింది. వ్యాక్సిన్ ప్రొడక్షన్ని ప్రారంభిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొన్ని గంటలకే.. మొదటి బ్యాచ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పూర్తి చేసినట్లు ఇంటర్ఫాక్స్ వార్త సంస్థ ప్రకటించడం గమనార్హం. అయితే ఈ వేగవంతమైన చర్యల పట్ల కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల కన్నా ముందు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలనే ఆత్రుతతో భద్రతను పట్టించుకోకపోతే అంతర్జాతీయ సమాజంలో దేశ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని వాపోతున్నారు. కరోనా వైరస్ భరతం పట్టే వ్యాక్సిన్ను ఈ నెలాఖారులోగా విడుదల చేయనున్నట్లు రష్యా ప్రకటించని సంగతి తెలిసిందే. అయితే ఒక వ్యాక్సిన్ ఆమోదం పొందాలంటే సాధారణంగా దాన్ని ఫేజ్-3లో వేలాది మంది మీద ప్రయోగిస్తారు. వ్యాక్సిన్ ఆమోదం పొందడంలో ఇది కీలక దశ. కానీ రష్యా ఇవేవి పూర్తి కాకుండానే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించడం గమనార్హం. (రష్యా టీకాపై మిశ్రమ స్పందన!) ‘స్పుత్నిక్-వి’గా నామకరణం చేసిన ఈ వ్యాక్సిన్ను అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఈ నెల 11న ప్రకటించారు. ఇది సురక్షితమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన కుమార్తెలలో ఒకరికి వ్యాక్సిన్ వేయించినట్లు తెలిపారు. ఆమెలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదన్నారు. వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన మాస్కో గమలేయ ఇన్స్టిట్యూట్.. రష్యా, ఇతర దేశాల భాగస్వామ్యంతో డిసెంబర్-జనవరి నాటికి నెలకు 5 మిలియన్ డోసులను ఉత్పత్తి చేస్తుందని ప్రకటించింది. -
చైనాలో కాదు చెన్నైలో
సాక్షి, చెన్నై: ఆపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్న్యూస్. గతం కంటే తక్కువ ధరకే ఐఫోన్లు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 11ను చెన్నైలోని ఫాక్స్కాన్ ప్లాంట్లో తయారు చేయడం ప్రారంభించింది. ఆపిల్ ఐఫోన్11ను తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేయనుంది. ఆపిల్ ఐఫోన్ల దేశీయంగా తయారు చేయడం ప్రయోజనకరంగా ఉండనుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ట్విటర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో మేకిన్ ఇండియాలో ఇదో కీలకమైన పురోగతి అని ఆయన పేర్కొన్నారు. ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 11 తయారీని ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటిసారిగా టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్ను తీసుకువస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్పోన్ అసెంబ్లింగ్ ప్రారంభించిన తొమ్మిది నెలల తర్వాత ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది. మేడ్ ఇన్ ఇండియా యూనిట్లతో పోలిస్తే దిగుమతి చేసుకున్న స్మార్ట్ఫోన్లపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెన్నైలో తయారయ్యే ఐఫోన్ల ధరలు త్వరలో దిగి రానున్నాయి. కాగా భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆపిల్ స్మార్ట్ఫోన్లలో ఐఫోన్11 కూడా ఒకటి. మరోవైపు ఐఫోన్ ఎస్ఈ 2020ని బెంగళూరు సమీపంలోని విస్ట్రాన్ ప్లాంట్లో తయారు చేయాలని ఆపిల్ యోచిస్తోంది. 2017లో, ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 2016 దేశీయ తయారీని బెంగళూరు ప్లాంట్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
బజాజ్ ఆటోను వణికిస్తున్న కరోనా
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కల్లోలంతో ఆటో దిగ్గజం బజాజ్ ఆటో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్లో కోవిడ్ కేసులు తాజాగా 400కు పెరిగాయి. దీంతో కార్మికులు ప్లాంట్కు వచ్చేందుకు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయాలనే డిమాండ్ ఊపందుకుంది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగినందున, వైరస్ సైకిల్ ను విచ్ఛిన్నం చేయడానికి ఎనిమిది నుంచి 10 రోజులు ప్లాంట్లో పని నిలిపివేయాలని కోరుతున్నామని బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగడే బాజీరావ్ తెలిపారు. దీనికి సంబంధించి మళ్ళీ మేనేజ్మెంట్తో చర్చిస్తామనీ, మధ్యవర్తిత్వం వహించడానికి ప్రభుత్వ అధికారులను కూడా సంప్రదించనున్నామని చెప్పారు. అవసరమైతే ఉత్పత్తి నష్టాన్ని భర్తీ చేసేందుకు అదనపు గంటలు కేటాయించమని కోరినట్లు వర్కర్స్ యూనియన్ తెలిపింది. అయితే దీనిపై బజాజ్ యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన) కాగా ప్రస్తుతం బజాజ్ ఆటోకు 3 ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. మహారాష్ట్రలోని వాలూజ్, చకన్ వద్ద రెండు ప్లాంట్లు ఉండగా, ఉత్తరాఖండ్లోని పంత్నగర్ వద్ద మరో ప్లాంట్ ఉంది. డిస్కవర్, ప్లాటినా, సిటీ 100, బాక్సర్ 150తో పాటు త్రిచక్ర వాహనాలను కంపెనీ వాలూజ్ ప్లాంట్లో తయారు చేస్తోంది. 8,100 మందికి పైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకు బజాజ్ ఆటో కార్మికులు ఏడుగురు చనిపోయారు. (కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్) -
మౌలికం ఉత్పత్తులు పూర్తిగా డౌన్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా మూడో నెలలో కూడా క్షీణత నమోదు చేసింది. మేలో 23.4 శాతం క్షీణించింది. 2019 మేలో ఎనిమిది రంగాల ఉత్పత్తి 3.8 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎరువుల పరిశ్రమ మినహా మిగతా ఏడు రంగాలన్నీ (బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్) మేలో ప్రతికూల వృద్ధే కనపర్చాయి. 2020–21 ఏప్రిల్–మే మధ్యకాలంలో మౌలిక రంగాల ఉత్పత్తి 30 శాతం క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 4.5 శాతం వృద్ధి సాధించింది. ‘ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్త లాక్డౌన్ విధించిన నేపథ్యంలో బొగ్గు, సిమెంటు, ఉక్కు, సహజ వాయువు, రిఫైనరీ, ముడిచమురు తదితర పరిశ్రమల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది‘ అని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. క్షీణత తగ్గుముఖం పడుతోంది.. మే గణాంకాల బట్టి చూస్తే ఉత్పత్తి క్షీణత గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ‘ ఏప్రిల్లో పారిశ్రామికోత్పత్తి 55.5 శాతం క్షీణించింది. ఈ ధోరణుల ప్రకారం చూస్తే మేలో ఇది 35–45 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది‘ అని పేర్కొన్నారు. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ ఎనిమిది రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది. వీటి ఉత్పత్తి ఏప్రిల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 37 శాతం క్షీణించింది. తాజాగా మేలో బొగ్గు (14 శాతం క్షీణత), సహజ వాయువు (16.8 శాతం), రిఫైనరీ ఉత్పత్తులు (21.3 శాతం), ఉక్కు (48.4 శాతం), సిమెంటు (22.2 శాతం), విద్యుదుత్పత్తి (15.6 శాతం) క్షీణించాయి. -
చైనాకు దెబ్బ : ఇండియాకే ప్రాధాన్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ భారత దేశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. తన ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు ఐదో వంతు చైనా నుండి భారతదేశానికి తరలించాలని యోచిస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. దేశంలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన భారత ప్రభుత్వ కొత్త ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలని ఆపిల్ భావిస్తోందట. ఈ మేరకు గత కొన్ని నెలలుగా ఆపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య పలు భేటీలు కూడా పూర్తయ్యాయని, రాబోయే ఐదేళ్ళలో సుమారు 40 బిలియన్ డాలర్లు విలువైన ఉత్తులను తీసుకురానుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే, ఐఫోన్ తయారీదారు భారతదేశపు అతిపెద్ద ఎగుమతిదారుగా మారవచ్చని నిపుణులు అంటున్నారు. గత ఏడాది చివర్లో భారత ప్రభుత్వం స్థానిక సోర్సింగ్ నిబంధనలపై ఇచ్చిన సడలింపులపై ఆపిల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. ప్రస్తుతం, ఆపిల్ తన స్మార్ట్ఫోన్లు ఇతర ఉత్పత్తుల ఉత్పత్తి కోసం తయారీదారులైన ఫాక్స్ కాన్, విస్ట్రాన్లను ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంట్రాక్టర్ల ద్వారానే భారతదేశంలో 40 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. ప్రధానంగా ఈ ఉత్పత్తులను ఎక్కువగా ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చాలా తక్కువ మార్కెట్ శాతం ఉన్న నేపథ్యంలో ఎగుమతి ప్రయోజనాల కోసం ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచనుందని అంచనా. దేశీయంగా ఆపిల్ ఐఫోన్ 7 ఐఫోన్ ఎక్స్ఆర్ను ఉత్పత్తి చేస్తుంది. ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6 ఎస్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని భావించినా, గ్లోబల్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో నుండి వీటిని తొలగించడంతో దీనికి బ్రేక్ పడింది. (భారీ పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ : రిలయన్స్ దూకుడు) ఆపిల్ ప్రస్తుతం భారతదేశంలో రీసెల్లర్స్ ద్వారా మాత్రమే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇటీవల దేశంలో రిటైల్ స్టోర్ల ఏర్పాటు ప్రయత్నాలను వేగవంతం చేస్తోందన్న అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. 2021 లో దేశంలో మొట్టమొదటి ఆపిల్ రిటైల్ స్టోర్ను ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఫిబ్రవరిలో పెట్టుబడిదారుల సమావేశంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రకటించడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. మరోవైపు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం, ఆపిల్ గత త్రైమాసికంలో భారతదేశ ప్రీమియం స్మార్ట్ఫోన్ మార్కెట్లో 62.7శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. కాగా ఈ నివేదికలను ఆపిల్ ఇంకా ధృవీకరించలేదు. (పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీ విచారణ షురూ!) -
తయారీ 50–60 శాతమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్డౌన్ కారణంగా దినసరి కార్మికులు వారివారి స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు. ఉన్నవారు కాస్తా వైరస్ భయంతో ప్లాంట్లకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తగ్గింది. వెరశి ప్లాంట్ల వినియోగం 50 నుంచి 70 శాతం మాత్రమే నమోదు అవుతోంది. ముందస్తు వేతన చెల్లింపులు, ఆహారం, రవాణా సదుపాయం కల్పించిన భారీ సంస్థల్లో ప్లాంట్ల వినియోగం 70 శాతం వరకు ఉంటే.. చిన్న, మధ్య తరహా కంపెనీల్లో 50–60 శాతం మాత్రమే ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల పనితీరుపై తీవ్ర ప్రభా వం ఉంటుందని అంటున్నాయి. మార్జిన్లు భారీగా తగ్గుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతుల్లో 60%, దేశీయ మార్కెట్లో 50 శాతం వాటాను భారీ కంపెనీలు దక్కించుకున్నాయి. లాభాలూ కుచించుకుపోతాయి... కరోనా ప్రభావం ఆరు నెలల వరకు ఫార్మా రంగంపై ఉంటుందని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) చెబుతోంది. కార్మికుల కొరత వాస్తవమేనని బీడీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఔషధాల కోసం డిమాండ్ బాగానే ఉంది. కంపెనీల వద్ద నిల్వలూ ఉన్నాయి. రెండు మూడు నెలల్లో వైరస్కు కట్టడి పడ్డా.. ఈ రంగం తిరిగి గాడిన పడేందుకు మరో రెండు మూడు నెలల సమయం పడుతుంది. కంపెనీల ఆదాయాలతోపాటు లాభాలూ కుచించుకుపోతాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి భారీ స్థాయి కంపెనీలు నెట్టుకొస్తాయి. చిన్న కంపెనీలకే సమస్య. వీటిల్లో కొన్ని కంపెనీల ప్లాంట్లు తాత్కాలికంగా మూతపడే అవకాశాలూ లేకపోలేదు’ అని ఆయన వివరించారు. పోర్టుల వద్దా కార్మికుల కొరత ఉందని, ఇది కూడా సమస్యేనని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ్ భాస్కర్ తెలిపారు. 2020–21లో ఫార్మా రంగం పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నట్టు చెప్పారు. చైనాలో సమస్య మొదలవగానే తయారీ విషయంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నట్టు లారస్ ల్యాబ్స్ వెల్లడించింది. కార్మికుల కొరత వంటి సమస్యలు తమకు లేవని వివరించింది. మార్జిన్స్ ఉండే వాటిపై.. భారత ఔషధ రంగానికి ఇది క్లిష్ట సమయమని ప్రముఖ లిస్టెడ్ కంపెనీ డైరెక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ‘త్వరలోనే సమస్య నుంచి గట్టెక్కుతాం. భారత్ నుంచి ఔషధాల ఎగుమతులకు ఎటువంటి సమస్య లేదు. ఇక్కడి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దేశీయంగానూ మార్కెట్ ఉత్తమంగా ఉంటుంది. ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నా అంతా సర్దుకుంటుంది. అంతర్జాతీయంగా ఔషధాల ధరలు మెరుగ్గా ఉన్నాయి. జూన్ నుంచి మార్కెట్ గాడిలో పడుతుంది. కంపెనీలు అధిక లాభాలను ఇచ్చే ఔషధాల తయారీపై దృష్టిసారిస్తాయి. ఇదే జరిగితే ఎగుమతుల్లో ఎంత కాదన్నా 10–15 శాతం వృద్ధి సాధిస్తాం. ప్రభుత్వం సైతం ఎగుమతుల వృద్ధికి తోడ్పాటు అందిస్తోంది’ అని అయన వివరించారు. -
పీఎల్ఐ పథకాలకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించడానికి రూ.3,420 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ.400 కోట్లతో మెడికల్ డివైజ్ పార్క్స్ స్కీమ్కు ఆమోదం తెలిపింది. పీఐఎల్ పథకం ద్వారా వచ్చే అయిదేళ్లలో రూ.68,437 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేయవచ్చునని కేంద్రం అంచనా వేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటి ఏర్పాటుకు రూ.3,399.35 కోట్లు అవుతాయని అంచనా. ఈ భేటీ వివరాలను మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్ కంపెనీలకు రూ.40,995 కోట్లు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలకు రూ.40,995 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ను ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిసింది. మేకిన్ ఇండియా హబ్ను రూపుదిద్దడం కోసం ఎలక్ట్రానిక్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి వచ్చే అయిదేళ్లలో రూ.41వేల కోట్లు కేటాయించనున్నారు. దీంతో ఆయా రంగాలకు ఆర్థికంగా ఊతం వచ్చి 2025 నాటికి రూ.10 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది. మరోవైపు పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి రూ. 1,061 కోట్లు కేటాయించింది. అత్యవసర మందులు, పరికరాలు అందుబాటులో కరోనా నేపథ్యంలో అత్యవసరమైన మందులు, వైద్య పరికరాలను దేశంలో తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.14వేల కోట్లను మంజూరు చేసిందని మోదీ తెలిపారు. ఫార్మా సంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడారు. అవసరానికి సరిపడిన ఆర్ఎన్ఏ డయాగ్నోస్టిక్ (కోవిడ్ను గుర్తించే) కిట్లను ఉత్పత్తి చేయాలని కోరారు. మందులు, పరికరాలను అవసరాల మేరకు తయారు చేయడంతోపాటు నూతన పరిష్కారాలను కనుగొనాలని కోరారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గాను రూ.14వేల కోట్ల విలువైన పథకాలను ఆమోదించామని మోదీ అన్నారు. -
ఇసుజు కార్ల ప్లాంట్ విస్తరణ
వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): శ్రీసిటీలోని జపనీస్ యుటిలిటీ వాహన తయారీదారు ఇసుజు మోటార్స్ ఇండియా పరిశ్రమలో అదనపు ఉత్పత్తుల యూనిట్ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యఖియామా, ఇసుజు మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టోరూ నకాటా, మిట్సుబిషి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ ఇవారో టోయిడి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రూ. 400కోట్ల పెట్టుబడులతో అదనపు ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రెస్షాప్ సదుపాయం, ఇంజన్ అసెంబ్లింగ్ యూనిట్లను ప్రారంభించారు. ఈ రెండవ దశ కార్యకలాపాల ప్రారంభం భారత్లోని ఇసుజు ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని జపాన్ కాన్సుల్ జనరల్ తెలిపారు. అంతర్జాతీయ తయారీ కేంద్రాలలో ఒకటిగా ఈ ప్లాంటును తీర్చిదిద్దడానికి ఇసుజు చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పంపిన అభినందన సందేశాన్ని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చదివి వినిపించారు. మంత్రి తన సందేశంలో ఇసుజుకు అన్నివిధాలా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు, భరోసా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆటో మొబైల్ తయారీకి ఇసుజు ఒక ప్రామాణికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కార్ల పరిశ్రమ ఇసుజు అంటూ శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. టోరూ నకాటా మాట్లాడుతూ.. పోటీ మార్కెట్లో అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులు, సేవలను అందించడానికి ఇసుజు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయతకు భరోసా అందిస్తామన్నారు. రెండవ దశ కార్యకలాపాలు తమ వృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ సామర్థ్యాన్ని విస్తరించనుందని పేర్కొన్నారు. -
రైల్ వీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్ప్లాంట్ చరిత్రలో మరో ముందడుగు పడింది. భారతీయ రైల్వేతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్లో శనివారం వీల్స్ ఉత్పత్తి ప్రారంభించారు. స్టీల్ప్లాంట్ సీఎండీ పి.కె.రథ్ తొలి వీల్ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ.1,680 కోట్లు వ్యయం అయిందన్నారు. ఈ ప్లాంట్ ఏడాదికి లక్ష రైల్ వీల్స్ తయారీ సామర్ధ్యం కలిగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్ప్లాంట్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) కె.కె. ఘోష్, డైరెక్టర్(కమర్షియల్) డి.కె. మొహంతి, డైరెక్టర్(ఆపరేషన్స్) ఎ.కె. సక్సేనా, రైల్వే బోర్డు ఈడి లక్ష్మీ రామన్, ఎస్.ఎం.ఎస్. జర్మనీ కంపెనీ సీనియర్ అధికారి కుల్జీ, ఎస్.ఎం.ఎస్ ఇండియా సీనియర్ అధికారి గ్రీనియర్తో పాటు స్టీల్ప్లాంట్, మెకాన్ సంస్థల ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. -
మారుతీ ఉత్పత్తి అప్
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. గతేడాది డిసెంబర్లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,15,949 యూనిట్లుగా నమోదైనట్లు పేర్కొం ది. 2018 డిసెంబర్ నెలలో 1,07,478 యూనిట్ల ఉత్పత్తితో పోల్చితే ఈసారి 7.88 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. గతేడాదిలో డిమాండ్ తగ్గిపోయిన కారణంగా వరుసగా తొమ్మిది నెలల పాటు ఉత్పత్తిలో కోత విధించిన ఎంఎస్ఐ.. నవంబర్లో 4.33 శాతం ఉత్పత్తి పెంపును ప్రకటించింది. -
ఐటీ కంపెనీలకు ‘బ్లో’యింగ్
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలకు బోయింగ్ సంస్థ నుంచి వచ్చే వ్యాపారానికి గండిపడనుంది! ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి బిలియన్ డాలర్ల వ్యాపారం ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. బోయింగ్ తన ప్రతిష్టాత్మక 737 మ్యాక్స్ సిరీస్ విమానాల తయారీని జనవరి నుంచి నిలిపివేయనుంది. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, సైయంట్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రస్తుతం బోయింగ్ సంస్థతో వ్యాపార అనుబంధం కలిగి ఉన్నాయి. ‘‘చాలా భారత ఐటీ కంపెనీలకు బోయింగ్ ప్రముఖ క్లయింట్గా ఉంది. కనుక స్వల్పకాలంలో ఈ కంపెనీలపై తప్పక ప్రభావం ఉంటుంది. బోయింగ్ ఎదుర్కొంటున్న సమస్యల వల్ల ఏరోస్పేస్ విభాగంలో వ్యయాలు కూడా తగ్గిపోతాయి’’ అని ఐటీ అవుట్సోర్సింగ్ అడ్వైజర్, పారీక్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు పారీక్ జైన్ తెలిపారు. మ్యాక్స్ 737 విమాన తయారీని ఈ నెలారంభంలోనే బోయింగ్ తాత్కాలికంగా నిలిపివేయగా, జనవరి నుంచి తన సరఫరాదారులు సరఫరాను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థ తన సీఈవో డెన్నిస్ ములెన్బర్గ్కు ఈ వారమే ఉద్వాసన కూడా పలకడం గమనార్హం. ఇండోనేసియా, ఇథియోపియాల్లో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలిపోయిన ఘటనల నేపథ్యంలో నియంత్రణ సంస్థల విశ్వాసాన్ని బోయింగ్ కోల్పోయింది. ఇదే సీఈవోను సాగనంపేందుకు దారితీసింది. సగం వాటా మన ఐటీ కంపెనీలదే.. విమానయాన ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ మార్కెట్ పరిమాణం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. బోయింగ్, ఎయిర్బస్ సమానంగా వాటా కలిగి ఉన్నాయి. బోయింగ్ సంస్థ 2 బిలియన్ డాలర్ల విలువైన సేవలను అవుట్సోర్సింగ్ ఇస్తుండగా, ఇందులో సగానికి సగం మన దేశ ఐటీ కంపెనీలే సొంతం చేసుకుంటున్నాయి. వీటితోపాటు అస్సెంచుర్, క్యాప్జెమినీ సంస్థలు కూడా ఈ విభాగంలో ముందున్నాయి. బోయింగ్కు ఇంజన్లను ప్రట్ అండ్ విట్నే, రోల్స్రాయిస్, జనరల్ ఎలక్ట్రిక్, శాఫ్రాన్.. విమాన విడిభాగాలను స్పిరిట్ ఏరోసిస్టమ్స్, శాఫ్రాన్ సమకూరుస్తున్నాయి. రాక్వెల్, హానీవెల్ సంస్థలు ఏవియోనిక్స్ను సమకూరుస్తున్నాయి. ‘‘చాలా వరకు భారత ఐటీ సంస్థలు నేరుగా బోయింగ్ సంస్థతో, సరఫరా వ్యవస్థతో అనుబంధం కలిగి ఉన్నాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, సైయింట్ నేరుగా బోయింగ్తో వ్యాపారం కలిగి ఉంటే, విడిభాగాల సరఫరాదారు స్పిరిట్ ఏరోసిస్టమ్ ఇన్ఫోసిస్ క్లయింట్గా ఉంది’’ అని అవుట్సోర్సింగ్ మార్కెట్ ప్రముఖుడొకరు తెలిపారు. ఒప్పందాల్లో రక్షణ ఉంటుంది.. ‘‘సాధారణంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టుల్లో రక్షణకు సంబంధించి నిబంధనలు ఉంటాయి. రద్దు కారణంగా తలెత్తే నష్టాల నుంచి ఐటీ కంపెనీలకు రక్షణ ఉంటుంది. అయితే, స్వల్ప కాలానికి లాభదాయకతపై కచ్చితంగా ప్రభావం పడుతుంది’’ అని గ్రేహౌండ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, సీఈవో సంచిత్విర్ గోగియా వివరించారు. ‘‘ఇంజనీరింగ్ సేవల సంస్థలు మాత్రం ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నాయి. ఎందుకంటే బోయింగ్ 737 మ్యాక్స్ను నిలిపివేస్తే, అప్పుడు 797 మోడల్పై అధిక వ్యయాలు చేస్తుందన్న అంచనాతో ఉన్నాయి. భారత ఇంజనీరింగ్ సేవల సంస్థలకు ఇది సానుకూలమే’’ అని మరొక నిపుణుడు పేర్కొన్నారు. బోయింగ్ 797 కొత్త తరహా విమానం. ఇది 225–275 సీట్ల సైజుతో ఉంటుంది. బోయింగ్ సరఫరా వ్యవస్థ ఇంజిన్ తయారీదారులు: ప్రట్ అండ్ విట్నే, రోల్స్రాయిస్, జనరల్ ఎలక్ట్రిక్, శాఫ్రాన్ విడిభాగాల సరఫరాదారులు: స్పిరిట్ ఏరోసిస్టమ్స్, శాఫ్రాన్ ఏవియోనిక్స్ (ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్): రాక్వెల్, హనీవెల్ భారత కంపెనీలు: భారత ఐటీ కంపెనీలు అప్లికేషన్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంజనీరింగ్, ఏవియోనిక్స్, బీపీఓ సేవలను బోయింగ్ 737 మ్యాక్స్ విమాన తయారీ కార్యక్రమానికి అందిస్తున్నాయి. -
ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల
న్యూఢిల్లీ: దేశీయంగా ముడి ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల నమోదైంది. తాజాగా వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. గతనెల్లో మొత్తం ఉత్పత్తి 8.934 మిలియన్ టన్నులు (ఎంటీ)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని 9.192 ఎంటీలతో పోల్చితే 2.8 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్లో 3.4 శాతం తగ్గిన సంగతి తెలిసిందే కాగా, వరుసగా రెండు నెలల పాటు ఉత్పత్తిలో క్షీణత నమోదైంది. ఇక అంతర్జాతీయంగా కూడా గత నెల్లో ఉక్కు ఉత్పత్తి ఒక శాతం తగ్గింది. అయితే, ఈ పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా మాత్రం నవంబర్లో 4 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. ఆ దేశం గత నెల్లో 80.287 ఎంటీ ఉత్పత్తిని నమోదుచేసింది. అమెరికా ఉత్పత్తి 2.2 శాతం తగ్గి 7.233 ఎంటీగా ఉంది. -
నవంబర్లో పెరిగిన మారుతీ సుజుకీ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. నవంబర్లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది నవంబర్లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి గతనెల్లో 1,39,084 యూనిట్లు కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలోని 1,34,149 యూనిట్లతో పోల్చితే 3.67 శాతం వృద్ధి ఉందని కంపెనీ వివరించింది. అక్టోబర్ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించి 1,19,337 యూనిట్లకే పరిమితం చేసిన సంస్థ.. గతనెల్లో పెంపును ప్రకటించింది. -
స్కోడా చకన్ ప్లాంట్లో ఉత్పత్తికి బ్రేక్
న్యూఢిల్లీ: కొత్త ఉత్పత్తుల తయారీకి అనుకూలంగా అప్గ్రేడ్ చేసే దిశగా పుణెలోని చకన్ ప్లాంటులో నెల రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా వెల్లడించింది. డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య దాకా కార్యకలాపాలు ఆపివేయనున్నట్లు వివరించింది. ఇటీవలే అక్టోబర్–నవంబర్ మధ్యలో కూడా స్కోడా నెల రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేసింది. ఫోక్స్వ్యాగన్ గ్రూప్ ఇండియా ఈ ఏడాదే తమ మూడు ప్యాసింజర్ కార్ల తయారీ అనుబంధ సంస్థలన్నింటినీ ఒకే సంస్థగా స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా కింద మార్చింది. ఇందులో ఫోక్స్వ్యాగన్ ఇండియా, ఫోక్స్వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా ఉన్నాయి. -
వరుసగా ఎనిమిదో నెలలోనూ మారుతికి షాక్
సాక్షి, ముంబై : డిమాండ్ క్షీణత దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకిని పట్టి పీడిస్తోంది. తాజాగా దేశీయంగా పాసింజర్ వాహనాలకు డిమాండ్ లేకపోవడం వల్ల మారుతి తన ఉత్పత్తిని వరుసగా 8 వ నెలలో తగ్గించుకోవలసి వచ్చింది. ఇటీవల వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ఆటో కంపెనీలన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి, అశోక్ లేలాండ్ లాంటి కంపెనీలు ఉత్పత్తిలో కోత పెడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే తాజాగా వరుసగా ఎనిమిదవ నెలలో కూడా మారుతి ఉత్పత్తి కోతను ప్రకటించింది. గత నెలలో కంపెనీ మొత్తం వాహనాల ఉత్పత్తి 1,19,337 యూనిట్లు కాగా, గత ఏడాది అక్టోబర్లో 1,50,497 గా ఉంది. గత ఏడాది అక్టోబర్లో ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి 148,318 నుండి 117,383 యూనిట్లు తగ్గాయని రెగ్యులేటరీ ఫైలింగ్లో శుక్రవారం తెలిపింది. వాన్ల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే సగానికి పడిపోయింది. 2018 అక్టోబర్లో 13,817 య నిట్లను ఉత్పత్తి చేయగా, గత నెలలో 7,661గా ఉంది. మినీ-సెగ్మెంట్లో ఆల్టో, ఎస్-ప్రెస్సో, ఓల్డ్ వాగన్ఆర్ లాంటి వాహనాల తయారీ గత ఏడాది ఇదే నెలలో 34,295 నుండి 20,985 కి పడిపోయింది. కాంపాక్ట్ విభాగంలో న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల ఉత్పత్తి చేసిన యూనిట్ల సంఖ్య గత ఏడాది ఇదే నెలలో 74,167 తో పోలిస్తే అక్టోబర్లో 64,079 గా ఉంది. అయితే జిప్సీ, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్ -6, ఎస్-క్రాస్ వంటి యుటిలిటీ వాహనాలు మాత్రమే అక్టోబర్లో 22,526 నుండి 22,736 వద్ద స్వల్ప వృద్ధిని సాధించాయి. ఏదేమైనా, అమ్మకాల పరంగా పండుగ సీజన్ డిమాండ్ కారణంగా స్వల్ప రికవరీ సంకేతాలను చూపించింది. దేశీయ మార్కెట్లో 2019 అక్టోబర్లో మొత్తం 1,44,277 యూనిట్లు విక్రయించింది. ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి మినీ కార్ల అమ్మకాలు క్షీణించగా, న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్లతో సహా కాంపాక్ట్ విభాగం సంవత్సరానికి 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. -
కొత్త తరహా కథ
నందమూరి కల్యాణ్రామ్ హీరోగా నటించిన ‘118’ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కనున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘‘కల్యాణ్రామ్గారు మా బ్యానర్లో మరో సినిమా చేయబోతున్నారు. కొత్త తరహా కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు మహేశ్ కోనేరు. విజయ్ హీరోగా నటించిన ‘విజిల్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు మహేశ్ కోనేరు. అలాగే కీర్తీ సురేష్ నటిస్తున్న ‘మిస్ ఇండియా’ చిత్రానికి కూడా ఈయనే నిర్మాత. -
రాష్ట్రానికి ధాన్య కళ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని రీతిలో కాస్త ఆలస్యంగా అయినా వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం సహా మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీనికి తోడు 12వేల చెరువులు వందకు వంద శాతం నిండాయి. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఖరీఫ్లో 40.41 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా, ఈ ఏడాది అంతకు మించి మరో 15లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. మొత్తంగా 55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు వీలుగా 2,544 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ధాన్యం సేకరణ విధానంపై జిల్లాల వారీగా వ్యవసాయ శాఖతో సమన్వయం చేస్తూ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగానే కొన్ని జిల్లాల్లో అంచనాకు మించి ధాన్యం దిగుబడులు రావచ్చనే అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సాగునీటి లభ్యత పుష్కలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో గత ఏడాది 1.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, ప్రస్తుతం అక్కడ సాగైన వరి విస్తీర్ణాన్నిబట్టి 2.50 లక్షల మెట్రిక్ టన్నులు రావొచ్చని అంచనా వేశారు. ఇదే రీతిన జగిత్యాలలో గత ఏడాది 3.3 లక్షలు కొనుగోళ్లు చేయగా, ఈ ఏడాది 6.80 లక్షల టన్నులు, నల్లగొండలో గత ఏడాది 2.20 లక్షలు కొనుగోళ్లు జరగ్గా ఈ ఏడాది 4.6 లక్షలు, సిద్దిపేటలో 70వేల టన్నులు చేయగా, ఈ ఏడాది 1.80 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేయాల్సి ఉంటుందని లెక్కించారు. వీటితో పాటే సూర్యాపేట, మంచిర్యాల, వనపర్తి జిల్లాల్లోనూ అంచనాకు మించి ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని తేల్చారు. మొత్తంగా తొలి అంచనాకన్నా 10లక్షల మెట్రిక్ టన్నుల మేర అధికంగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను 2,544 నుంచి 3,297 కేంద్రాలకు పెంచాలని నిర్ణయించారు. మొత్తంగా ఈ ధాన్యం కొనుగోళ్లకు రూ.18వేల కోట్ల మేర వెచ్చించనున్నారు. ఇక ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు తెరిచినప్పటికీ వర్షాల కారణంగా ధాన్యం ఇంకా కేంద్రాలకు రావడం లేదు. దీపావళి తర్వాత నుంచి పెద్దఎత్తున ధాన్యం రానున్న దృష్ట్యా, కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. దీపావళి తర్వాత ముమ్మరంగా ధాన్యం సేకరణ ఆరంభం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అంచనాలకు మించి ధాన్యం మార్కెట్లను ముంచెత్తనుంది. విస్తారంగా కురిసిన వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల కింద పెరిగిన సాగు, చెరువుల కింద పూర్తి స్థాయిలో సాగైన పంటల కారణంగా తొలుత అంచనా వేసిన యాభై అయిదు లక్షల మెట్రిక్ టన్నులకు మించి మరో పది లక్షల మేర ధాన్యం అదనంగా సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ తాజాగా అంచనా వేసింది. దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఏడెనిమిది జిల్లాల నుంచి గత ఏడాది కన్నా రెట్టింపు ధాన్యం రావచ్చన్న అంచనాలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. స్టోరేజీపైనా ముందస్తు జాగ్రత్తలు.. పెరుగుతున్న ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను సిద్ధంచేసే అంశంపై పౌర సరఫరాల శాఖ కసరత్తులు ముమ్మరం చేసింది. ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చిన అనంతరం వాటి నిల్వలకు ఇబ్బంది లేకుండా ఎఫ్సీఐతో చర్చించింది. గత ఏడాది రబీకి సంబంధించిన 11 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి తీసుకునేందుకు ఎఫ్సీఐ సుముఖత తెలిపింది. ముఖ్యంగా స్టోరేజీ సమస్య అధికంగా ఉన్న కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, కొత్తగూడెంలలో స్టోరేజీ సమస్యను అధిగమించే చర్యలు చేపట్టింది. -
జియో ఫైబర్ సంచలనం : వారానికో కొత్త సినిమా
సాక్షి,ముంబై: బడా పారిశ్రామిక వేత్త, బిలియనీర్ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చలనచిత్ర, వినోద రంగానికి భారీ షాక్ ఇవ్వనున్నారు. తన రిలయన్స్ జియో ఫైబర్ నెట్వర్క్ సేవల్లో భాగమైన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఆఫర్లో 'వారానికి ఒక సినిమా' విడుదల చేయాలనే భారీ ప్రణాళికలో ఉన్నారు. జియో స్టూడియోస్ ఆధ్వర్యంలో సంవత్సరానికి 52 సినిమాలను నిర్మించి విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాన్ను రెండు, మూడేళ్లలో అమలు చేయాలని యోచిస్తోంది. ఒక్కో సినిమాకు సుమారు రూ .15-20 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఏడాది కనీసం 52 సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాం. ఇందుకు సొంత స్క్రిప్ట్ను అభివృద్ధి చేసి, సినిమాను నిర్మించటం, ఇతర ప్రొడక్షన్ హౌస్లతో ఒప్పందాలు, మూడవ పార్టీల ద్వారా సినిమాలను కొనాలనుకుంటున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ కార్యాలయం ప్రెసిడెంట్ జ్యోతి దేశ్పాండే మీడియాకు తెలిపారు. ఎరోస్ ఇంటర్నేషనల్ మాజీ సీఈవోగా ఉన్న ఈమె గత ఏడాదే రిలయన్స్లో చేరారు. 6 నుంచి 11 భాషల్లో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాని ఆమె చెప్పారు. అంతేకాదు జియో స్టూడియోస్ ద్వారా మొత్తం 11 భాషలలో వెబ్ సిరీస్, మ్యూజిక్ లాంటి చిన్నపెద్దా కంటెంట్ ఉత్పత్తి చేస్తామన్నారు. దేశంలో మూవీ స్క్రీన్ల కొరత చాలా ఉందనీ జ్యోతి దేశ్పాండ్ వ్యాఖ్యానించారు. చైనాలో 35వేల స్క్రీన్లుంటే, ఇండియాలో కేవలం 2వేల మల్టీప్లెక్స్ లున్నాయని ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఆదాయం ఎలా పెరుగుతుందని ఆమె ప్రశ్నించారు. అందుకే తమ మొబైల్, బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ద్వారా అత్యంత ఎక్కువమంది వినియోగదారులకు చేరువ కావాలని యోచిస్తున్నామని ఆమె చెప్పారు. తమ ప్రత్యేక వ్యూహాంతో నిర్మించిన చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. కాగా జియో స్టూడియోస్ నిర్మించిన స్త్రీ, లుకా చుప్పి చిత్రాలు విజయవంతమయ్యాయి. వీటిపై 15 కోట్ల రూపాయల పెట్టుబడికిగాను, 150 కోట్ల రూపాయలను వసూలు చేశాయి. చదవండి : జియో ఫైబర్ : జుట్టు పీక్కుంటున్న దిగ్గజాలు చదవండి : జియో ఫైబర్ : సంచలన ఆఫర్లు -
మారుతి సుజుకి వరుసగా ఏడోసారి ఉత్పత్తి కోత
సాక్షి, ముంబై : డిమాండ్ క్షీణించి , అమ్మకాలు లేక విలవిల్లాడుతున్న దేశీయ అతిపెద్ద కార్ల తయారీ మారుతి సుజుకి ఇండియాకు వరుస షాక్లు తప్పడం లేదు. తీవ్ర మందగమనంలో ఉన్న మారుతి సుజుకి వరుసగా 7వ నెలలో కూడా ఉత్పత్తిని నిలిపివేసినట్టు ప్రకటించింది. ఆగస్టులో మాసంలో ఉత్పత్తిని 33.99 శాతం తగ్గించగా, గత నెలలో మొత్తం అమ్మకాలు 33 శాతం క్షీణించాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2018 ఆగస్టులోని 1,58,189 యూనిట్లతో పోలిస్తే 1,06,413 యూనిట్ల విక్రయాలు మాత్రమే నమోదయ్యాయని తెలిపింది. ఆగస్టులో కంపెనీ మొత్తం 1,11,370 యూనిట్లను ఉత్పత్తి చేయగా, అంతకుముందు నెలలో 1,68,725 యూనిట్లు ఉత్పత్తి చేశామని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) సెప్టెంబర్ 2 న బీఎస్సీ ఫైలింగ్లో తెలిపింది. గత నెలలో ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి 1,10,214 యూనిట్లు కాగా, 2018 ఆగస్టులో 1,66,161 యూనిట్లగా ఉంది. అంటే 33.67 శాతం క్షీణత. ఆల్టో, న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్లతో సహా మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్ కార్ల ఉత్పత్తి 80,909 యూనిట్లు కాగా, గత ఏడాది ఆగస్టులో 1,22,824 యూనిట్లు మాత్రమే. 34.1 శాతం తగ్గింది. విటారా బ్రెజ్జా, ఎర్టిగా, లాంటి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 34.85 శాతం క్షీణించి 15,099 యూనిట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది 23,176 యూనిట్లు. మిడ్సైజ్ సెడాన్ సియాజ్ ఉత్పత్తి ఆగస్టులో 2,285 యూనిట్లకు తగ్గింది, గత ఏడాది ఇదే నెలలో 6,149 యూనిట్లు. -
ఇక ‘స్మార్ట్’ మహీంద్రా!
న్యూఢిల్లీ: వాహనాల వ్యాపార విభాగంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇకపై కనెక్టెడ్ వాహనాలు, పెట్రోల్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) మరింతగా దృష్టి పెట్టాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈవీ విధానం కింద తమ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టుపై రూ.500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్యూవీలైన కేయూవీ 100, ఎక్స్యూవీ300 వాహనాల్లో ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా రూపొందిస్తున్నట్లు 2018–19 వార్షిక నివేదికలో ఎంఅండ్ఎం వివరించింది. గతంలో మాదిరి సరైన ధరతో సరైన ఉత్పత్తిని ప్రవేశపెడితే సరిపోదని.. మార్కెట్లో నెగ్గుకురావాలంటే మరింతగా కృషి చేయాల్సి ఉంటుందని తెలిపింది. ‘పర్యావరణ కాలుష్యం, రహదారులపై భద్రత వంటి అంశాలపై జాగ్రత్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధనాల వినియోగం, వాహనాల కొనుగోలు తీరు తెన్నులు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆటోమోటివ్ పరిశ్రమపై ఇవి చాలా పెద్ద ప్రభావమే చూపిస్తాయి‘ అని ఎంఅండ్ఎం పేర్కొంది. అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్తో కలిసి కనెక్టెడ్ వాహనాలను రూపొందించనున్నట్లు వివరించింది. ఇంటర్నెట్, బ్లూటూత్ తదితర టెక్నాలజీల ద్వారా నియంత్రించగలిగే వాహనాలు ఈ కోవకు చెందుతాయి. నిలకడగా వృద్ధి సాధించే లక్ష్యంతో ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను పటిష్టపర్చుకోవడం, ప్రస్తుత ఉత్పత్తుల్లో కొత్త వేరియంట్లు ప్రవేశపెట్టడం, పరిశోధన.. అభివృద్ధి సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించింది. 2018–19లో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ (ఎంఈఎంఎల్) మొత్తం 10,276 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం 4,026 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనల ఆహ్వానం న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రధాన ఆధారమైన చార్జింగ్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫేమ్–2 పథకం కింద దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రూ.లక్ష జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న పట్టణాలు, ప్రభుత్వం నోటిఫై చేసిన స్మార్ట్సిటీలు, మెట్రో నగరాలకు అనుసంధానమైన శాటిలైట్ పట్టణాలకు ఈ ప్రతిపాదనలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆహ్వానం పలికింది. తొలి విడత కింద 1,000 ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేయాలని కోరింది. ఆ తర్వాత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వీటిని మంజూరు చేయనున్నట్టు తెలిపింది. -
2025 నాటికి కోటి టన్నుల ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ సాగర్ సిమెంట్స్ భారీగా విస్తరిస్తోంది. 2025 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 10 మిలియన్ టన్నులకు (కోటి టన్నులకు) చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రతి 10 ఏళ్లకు సామర్థ్యాన్ని రెండింతలు చేయాలన్నది సంస్థ ధ్యేయం. ప్రస్తుతం ఉన్న మూడు ప్లాంట్లతో కలిపి సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 5.75 మిలియన్ టన్నులు. తాజా విస్తరణలో భాగంగా మధ్యప్రదేశ్, ఒడిశాలో ఏర్పాటు చేయనున్న రెండు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను దక్కించుకుంది. ఈ నెలలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వాల కాలుష్య నియంత్రణ మండలి నుంచి క్లియరెన్సులు రానున్నట్లు సాగర్ సిమెంట్స్ జేఎండీ సమ్మిడి శ్రీకాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇవి పూర్తి అయితే తయారీ సామర్థ్యం 8.25 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, విస్తరణకు కావాల్సిన నిధుల కోసం ఒక్కొక్కటి రూ.725 ధరలో 31,00,000 కన్వర్టబుల్ వారంట్లను జారీ చేస్తామని తెలిపారు. 2021 మార్చికల్లా పూర్తి.. కంపెనీ ఒక మిలియన్ టన్ను సామర్థ్యం గల ప్లాంటును మధ్యప్రదేశ్లోని ఇండోర్ వద్ద ఏర్పాటు చేస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే 5.5 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును సైతం నిర్మిస్తోంది. వీటి కోసం రూ.425 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో ఈక్విటీ రూ.150 కోట్లు ఉంటుంది. ఇక ఒడిశాలోని జాజ్పూర్ వద్ద ఉన్న జాజ్పూర్ సిమెంట్స్ను(జేసీపీఎల్) ఇటీవలే రూ.108 కోట్లు వెచ్చించి సాగర్ సిమెంట్స్ దక్కించుకుంది. 100 శాతం అనుబంధ సంస్థగా ఉండే జాజ్పూర్ సిమెంట్స్ ద్వారా రూ.308 కోట్లతో 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నా రు. ప్రతిపాదిత కొత్త ప్రాజెక్టుల కోసం యంత్రాలకై ఆర్డర్లు ఇచ్చామని, డెన్మార్క్, జర్మనీకి చెందిన దిగ్గజ కంపెనీలు వీటిని సరఫరా చేస్తాయని చెప్పారాయన. 2021 మార్చికల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. కొత్త మార్కెట్లకు.. సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం దక్షిణాది మార్కెట్లతోపాటు మహారాష్ట్ర, ఒడిశాలో విస్తరించింది. ఇండోర్ ప్లాంటు పూర్తయితే పశ్చిమ మధ్యప్రదేశ్, ఆగ్నేయ రాజస్తాన్, తూర్పు గుజరాత్, ఉత్తర మహారాష్ట్రలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఇండోర్, వడోదర, బోపాల్, అహ్మదాబాద్ నగరాలు 110 నుంచి 330 కిలోమీటర్ల పరిధిలో ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే ఒడిశా ప్లాంటు రాకతో ఉత్తర, మధ్య ఒడిషా, తూర్పు ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్, దక్షిణ పశ్చిమ బెంగాల్లో సిమెంటు మార్కెట్ చేసేందుకు వీలవుతుంది. భువనేశ్వర్, కటక్, బాలాసోర్, కోల్కతా, రాంచి, జంషెడ్పూర్ పట్టణాలను కవర్ చేయవచ్చునని కంపెనీ భావిస్తోంది. రెండేళ్లుగా ధర పెంచలేదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు కావాల్సిన సిమెంటును రెండేళ్లుగా కంపెనీలు తక్కువ ధరలో సరఫరా చేస్తున్నాయి. డీజిల్ ధర ఈ రెండేళ్లలో 25 శాతం పెరిగిందని, వ్యయ భారం ఉన్నా హామీ ఇచ్చిన ధరలోనే కంపెనీలు సిమెంటును సప్లయ్ చేశాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల్లో గతేడాది సిమెంటు అమ్మకాల్లో 40 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది వృద్ధి స్థిరంగా ఉండొచ్చని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఆహారధాన్యాల ఉత్పత్తి 28 కోట్ల టన్నులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి రెండో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 28.13 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే 3.88 కోట్ల టన్నులు అధికంగా ఉత్పత్తి కావడం గమనార్హం. అందులో కీలకమైన వరి 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లలో 11.10 కోట్ల టన్నులు కాగా, 2018–19లో ఏకంగా 11.56 కోట్ల టన్నులకు చేరింది. ఏకంగా 45.9 లక్షల టన్నులు పెరగడం గమనార్హం. ఇక కీలకమైన పత్తి దిగుబడి మాత్రం పడిపోయింది. 2017–18లో 3.39 కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తి కాగా, 2018–19లో 3 కోట్ల బేళ్లకు పడిపోయింది. ఏకంగా 39 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఇక పప్పు ధాన్యాల ఉత్పత్తి మాత్రం స్వల్పంగా పెరిగింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 2.40 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. నూనె గింజల ఉత్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.98 కోట్ల టన్నులు కాగా, 2018–19లో 3.15 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో దిగుబడి ఢమాల్.. తెలంగాణలో పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయిందని తెలిపింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. గతం కంటే ఈసారి సాగు తగ్గడం, 10 జిల్లాల్లో గులాబీ పురుగు కారణంగా దిగుబడి పడిపోయింది. ఇదిలా ఉండగా పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. 2017–18 సంవత్సరంలో 5.15 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది 3.85 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అయింది. ఖరీఫ్లో పప్పు ధాన్యాల ఉత్పత్తి 2.58 లక్షల మెట్రిక్ టన్నులు రాగా రబీలో 3.85 లక్షల టన్నులు ఉత్పత్తి కానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఇక 2018–19 ఖరీఫ్లో వరి ఉత్పత్తి 20 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. వరి ధాన్యం ఉత్పత్తి ఖరీఫ్లో ఏకంగా 61 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు అంచనా వేశారు. ఇరవై ఏళ్లలో ఇంతటి స్థాయి ఉత్పత్తి ఎన్నడూ రాలేదని అధికారులు కేంద్రానికి నివేదించారు. ఇక ఈ రబీలో 34.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. -
రూట్ మారింది
నటిగా తానేంటో నిరూపించుకున్నారు అందాల సుందరి ఐశ్వర్యారాయ్. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రొడక్షన్, డైరెక్షన్ విభాగాల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట ఐశ్వర్య. ‘‘ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా రకాల పాత్రలు చేశాను. ఇప్పుడు ప్రొడక్షన్ వైపు ఆలోచన మొదలైంది. ఈ విషయంపై సీరియస్గా వర్క్ చేస్తున్నాం. అలాగే డైరెక్టర్ కావాలని ఉంది. భవిష్యత్తులో తప్పకుండా డైరెక్టర్ అవుతాను. నా సన్నిహితులు, స్నేహితులు ‘నువ్వు ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ అవొచ్చు కదా’ అని అప్పుడప్పుడు సరదాగా ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు వారి మాటలను నిజం చేయాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు ఐశ్వర్యారాయ్. -
మారుతీ కార్ల ఉత్పత్తిలో కోత
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఉత్పత్తిని తగ్గించింది. ఫిబ్రవరిలో వాహనాల తయారీలో 8 శాతం పైగా కోత విధించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం మారుతీ సుజుకీ గత నెల 1,48,959 యూనిట్లు తయారు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి చేసిన 1,62,524 యూనిట్లతో పోలిస్తే ఇది 8.3 శాతం తక్కువ కావడం గమనార్హం. ఆల్టో, స్విఫ్ట్, విటారా బ్రెజా తదితర ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 8.4 శాతం తగ్గింది. గత ఫిబ్రవరిలో 1,61,116 యూనిట్లతో పోలిస్తే 1,47,550 యూనిట్లకు క్షీణించింది. అయితే ఈకో, ఆమ్ని వంటి వ్యాన్స్ విభాగం ఉత్పత్తి 13,827 యూనిట్ల నుంచి 22.1 శాతం వృద్ధితో 16,898 యూనిట్లకు పెరిగింది. సూపర్ క్యారీ ఎల్సీవీ తయారీ ఒక్క యూనిట్ మేర పెరిగింది. అటు ఉత్పత్తిలో కోతకు కారణాలపై స్పందించేందుకు మారుతీ సుజుకీ నిరాకరించింది. మారుతీ సుజుకీ ఉత్పత్తి జనవరిలో 1,58,396 యూనిట్ల నుంచి 15.6 శాతం వృద్ధితో 1,83,064 యూనిట్లకు చేరింది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 1,56,168 యూనిట్ల నుంచి 14.3 శాతం వృద్ధి చెంది 1,78,459 యూనిట్లకు పెరిగింది. అమ్మకాల విషయానికొస్తే.. జనవరిలో మారుతీ సుజుకీ విక్రయాలు 1.1 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో నమోదైన 1,40,600 యూనిట్ల నుంచి 1,42,150 యూనిట్లకు చేరాయి. అయితే ఫిబ్రవరిలో మాత్రం దేశీ విక్రయాలు 0.9 శాతం క్షీణించి 1,39,100 యూనిట్ల నుంచి 1,37,900 యూనిట్లకు తగ్గాయి. కంపెనీకి గురుగ్రామ్, మానెసర్లో 15.5 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో రెండు ప్లాంట్లు ఉన్నాయి. దీంతో పాటు మాతృసంస్థ సుజుకీకి గుజరాత్లోని హన్సల్పూర్ ప్లాంటులో 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఒక లైన్ ఉంది. -
ఖరీఫ్లో సిరులు కురిపించిన వరి!
సాక్షి, హైదరాబాద్ : ఖరీఫ్లో వరి సిరులు కురిపించింది. 20 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 2018–19 ఖరీఫ్ పంటల దిగుబడి, ఉత్పాదకతపై అర్థగణాంక శాఖ అధికారులతో వ్యవసాయ శాఖ కీలక సమావేశం నిర్వహించింది. అందులో పంటల దిగుబడిపై చర్చ జరిగింది. ఖరీఫ్లో ఏకంగా 61 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. 20 ఏళ్లలో ఇంతటి వరి ధాన్యం దిగుబడి ఎప్పుడూ రాలేదని అధికారులు తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వం అధికారికంగా త్వరలో విడుదల చేయనుంది. 2017–18 ఖరీఫ్ దిగుబడి కంటే ఏకంగా రెట్టింపు స్థాయిలో ఈ సారి వరి దిగుబడి వచ్చింది. 2017–18 ఖరీఫ్లో వరి దిగుబడి 30.42 లక్షల టన్నులే ఉంది. పెరిగిన ఉత్పాదకత.. 2018–19 ఖరీఫ్లో వరి అంచనాలకు మించి సాగైంది. వరి విస్తీర్ణం ఏకంగా 107 శాతానికి చేరుకుంది. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 25.44 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. ఎకరాకు 20 క్వింటాళ్లపైనే దిగుబడి వచ్చినట్లు నిర్ధారించారు. ఉత్పాదకత, దిగుబడికి అనేక కారణాలున్నాయి. గతంలో వరి పొలంలో నిత్యం పూర్తిస్థాయిలో నీరు ఉండేది. కానీ వ్యవసాయ శాఖ సూచించినట్లు రైతులు ఈసారి వరి పొలంలో ఎప్పుడూ నీరు ఉంచకుండా అప్పుడప్పుడు తెరిపినిచ్చారు. దీనివల్ల వరికి పూర్తిస్థాయిలో ఆక్సిజన్ అందింది. ఫలితంగా అది గట్టిపడిందని ఓ ఉన్నతాధికారి విశ్లేషించారు. స్వల్పకాలిక వరి విత్తనాలను ప్రత్యేకంగా రైతులకు అందజేశారు. ఇవి ఉత్పాదకతను పెంచాయి. ప్రధానంగా కునారం సన్నాలు, తెలంగాణ సోన విత్తనాలను జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అందజేశారు. ఏకంగా లక్ష క్వింటాళ్ల విత్తనాలను అందజేశారు. ఇవి దిగుబడిని గణనీయంగా పెంచాయి. సకాలంలో నాట్లు వేయడంతో ఉత్పాదకత పెరిగింది. వేప పూత యూరియా సరఫరా చేయడం వల్ల కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపింది. ఈ సారి పెద్దగా కీటకాల బారిన పడలేదు. విత్తనాలు, ఎరువులు తదితర వాటిని ప్రభుత్వం నుంచి సకాలంలో అందించడం కూడా ఉత్పాదకత, దిగుబడికి ప్రధాన కారణమని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి విశ్లేషించారు. కాగా, మిగిలిన పంటల దిగుబడిపై రెండో అంచనా నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్కు సంబంధించి మొదటి అంచనా నివేదిక ప్రకారం గత ఖరీఫ్లో పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 4.03 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 3.74 లక్షల టన్నులు మాత్రం దిగుబడి వచ్చే అవకాశముంది. గులాబీ పురుగు తదితర కారణాల వల్ల పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయే పరిస్థితి ఉంది. ఆ వివరాలపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సమష్టి కృషితో లక్ష్యాన్ని అధిగమించాలి
మణుగూరుటౌన్(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): సింగరేణి అధికారులు, కార్మికులు సమష్టి కృషితో ఏరియా 2018–19 ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు అన్నారు. శనివారం జీఎం కార్యాలయంలో అన్ని గనుల, డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడాలని సూచించారు. రక్షణ విషంలో అన్ని గనుల కంటే మణుగూరు ఏరియాను ముందుంచాలన్నారు. ఏరియా ఉత్పత్తి లక్ష్యాలకు సంబంధించిన నాణ్యతా, పనిగంటలు, ఉత్పత్తి వ్యయం, గనులు, ఏరియా లాభ నష్టాలు, సాధించాల్సిన ఉత్పత్తికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. అధేవిధంగా భూగర్భ గనుల్లో యంత్రాల వినియోగంపై తగు సలహాలు, సూచనలు చేశారు. బొగ్గు రవాణా, నాణ్యత, కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉత్పత్తి ఖర్చు, లక్ష్య సాధనకు కార్యాచరణ వంటి తదితర అంశాలను విరించారు. ఏరియాకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు, మ్యాన్ పవర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం రమేష్రావు, ఏరియా ఇంజనీర్ డీవీఎస్ఎన్ రాజు, డీజీఎం ఐఈడీ రవి, ప్రాజెక్టు అధికారులు లక్ష్మీపతిగౌడ్, లలిత్కుమార్, శ్రీహరి, డీజీఎం వర్క్షాప్ నర్సిరెడ్డి, ఫైనాన్స్ వెంకరమణ, పర్సనల్ మేనేజర్ రేవు సీతారాంతో పాటు సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు, అన్ని గనుల అధికారులు పాల్గొన్నారు. -
8 నెలల్లో 90 శాతం..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ వార్షిక ఉత్పత్తి లక్ష్యంలో భాగంగా.. గడిచిన 8 నెలల్లో 90 శాతం ఉత్పత్తి సాధించింది. సింగరేణి వ్యాప్తంగా 4 ఏరియాల్లో వందశాతం ఉత్పత్తి జరిగింది. ఇక ఓపెన్కాస్టు గనుల్లో 94 శాతం, భూగర్భ గనుల్లో 76 శాతం ఉత్పత్తి నమోదు చేసుకుంది. గత ఏప్రిల్ నుంచి నవంబర్ మాసం వరకు 8 నెలల కాలంలో సింగరేణి వ్యాప్తంగా భూగర్భ, ఓపెన్కాస్టు గనుల్లో 43.71 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని నిర్దేశించుకోగా నవంబర్ 30వ తేదీ వరకు 39.53 మిలియన్ టన్నుల ఉత్పత్తితో 90 శాతం సాధించారు. ఇక ఓపెన్కాస్టు గనుల్లో 35.80 మిలియన్ టన్నులకు గాను 33.52 మిలియన్ టన్నులతో 94 శాతం, భూగర్భ గనుల్లో 7.91 మిలియన్ టన్నులకు గాను 6.0 మిలియన్ టన్నులతో 76 శాతం మాత్రమే ఉత్పత్తి సాధించడం గమనార్హం. వార్షిక లక్ష్య సాధనకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉండటంతో సింగరేణి వ్యాప్తంగా నెలవారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నెలవారీ ఉత్పత్తి లక్ష్యాలను సాధించినట్లైతేనే వార్షిక ఉత్పత్తి సాధించగలమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొంత ఉత్పత్తి లోటు కనిపిస్తుండటంతో నెలవారీ లక్ష్యాలను మించి ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. నాలుగు ఏరియాల్లో నూరుశాతం దాటిన ఉత్పత్తి సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా గడిచిన 8 నెలల ఉత్పత్తి లక్ష్య సాధనలో నాలుగు ఏరియాలు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలిగాయి. కొత్తగూడెం, ఇల్లెందు, రామగుండం–1తో పాటు శ్రీరాంపూర్ ఏరియాల్లో నూరు శాతం మించి ఉత్పత్తి జరిగింది. కొత్తగూడెం ఏరియాలో అత్యధికంగా 112 శాతం, రామగుండం–1లో 104 శాతం, ఇల్లెందులో 103 శాతం కాగా శ్రీరాంపూర్ ఏరియాలో 100 శాతం ఉత్పత్తి నమోదైంది. -
ఇక ఎక్కడైనా ఔషధ తయారీ!
లండన్: అత్యవసర సమయాల్లో రోగికి అవసరమైన ఔషధం దొరకకపోతే ఎదురయ్యే పరిస్థితి వర్ణనాతీతం. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఔషధాలు వెంటనే దొరికే అవకాశం ఉన్నా.. కుగ్రామాలు, కొండ ప్రాంతాల్లో అత్యవసరంగా కావాల్సిన ఔషధాలు దొరికే పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితులు త్వరలో తొలగిపోయే అవకాశాలున్నాయి. ఎక్కడి నుంచైనా ఔషధాలను కంప్యూటర్ సాయంతో తయారుచేసే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘కెంప్యూటర్’గా పిలిచే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సాయంతో ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సులభంగా, అత్యంత నమ్మదగిన సహజ సిద్ధమైన ఔషధాలను తయారు చేసుకోవచ్చని బ్రిటన్లోని గ్లాస్గౌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఈ పద్ధతి అందుబాటులోకి వస్తే ఫార్మా రంగంపై కొన్ని కంపెనీల ఆధిపత్యం తగ్గిపోనుందని వారు పేర్కొన్నారు. ఈ కెంప్యూటర్ద్వారా రసాయన సమ్మేళనాల కోడ్ను అభివృద్ధి చేసి ఇతరులకు షేర్ చేయవచ్చు. ఈ రసాయన సమ్మేళన కోడ్ను అమలు చేసే విధానాన్ని కెంపేలర్ అంటారు. ఈ కెంపేలరే ఔషధాలను రూపొందించే విధానాన్ని వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు సైతం వారు అభివృద్ధి చేసిన రసాయన సమ్మేళనాలనూ డిజిటల్ రూపంలోకి మార్చుకోవచ్చు. -
అతిథి పాత్రలో మహేష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25వ సినిమాగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు సూపర్ స్టార్. ఈ సినిమాలతో పాటు ఓ చిన్న సినిమాలో గెస్ట్ రోల్లో నటించేందుకు కూడా మహేష్ ఆసక్తికనబరుస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మహేష్, త్వరలో ఇతర హీరోలతో లో బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రొడక్షన్ వ్యవహారాలను మహేష్ సతీమణి నమ్రత చూసుకుంటున్నారు. అయితే తొలి ప్రయత్నంగా ఓ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో 30 నిమిషాల పాటు కనిపించే ఓ కీలక పాత్రను మహేష్ బాబుతో చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట నమ్రత. తమ బ్యానర్లో తెరకెక్కుతున్న తొలి సినిమా కావటంతో మహేష్ కూడా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేందుకు ఓకె చెప్పే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ ఒప్పుకుంటాడా లేదా తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఒక రోజు.. 3 సినిమాలు
జనరల్గా ఒక సినిమా షూటింగ్లోనే కథానాయికల డే అంతా ముగిసిపోతుంది. కానీ శనివారం పూజా హెగ్డే ఏకంగా మూడు డిఫరెంట్ సినిమాల వర్క్లో భాగమై మంచి వర్కింగ్ డేను ఎంజాయ్ చేశారామె. ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ఆ నెక్ట్స్ మహేశ్బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ సినిమా సెట్లో జాయిన్ అయ్యారు. ఫైనల్గా ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్లో భాగమయ్యారు. ఇలా ఒకే రోజు మూడు సినిమాలకు సంబంధించిన పనుల్లో భాగమయ్యారు. ఈ విషయాలన్నింటినీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. -
రూపాయితో... పండుగ చేసుకునేదెలా?
‘‘ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకుని పండుగ చేస్కో...!’’ జగన్నాథ్ దర్జాగా చెప్పాడు కృష్ణతో. కానీ, కృష్ణ ముఖం వెలిగి పోలేదు. బక్కచిక్కిన రూపాయి ఒక్కసారిగా తన కళ్లలో మెదలడంతో అతడి ముఖంపై ఆందోళన కనిపించింది. దీంతో ‘‘ఏమైంది కృష్ణా...?’’ అంటూ జగన్నాథ్ ప్రశ్నించాడు. ‘‘రూ.వెయ్యితో పండుగ చేసుకోవడం కాదు... అది నాకు దండగే. దీంతో 15 డాలర్లు కూడా రావు. ఓ జత డ్రెస్ కూడా కొనలేను..’’ అంటూ ఓ మంత్ర దండకం వినిపించటంతో అది విని జగన్నాథ్ ముఖంలోనూ మార్పు కనిపించింది. నిజానికి ఈ బక్క రూపాయి ఇప్పుడు సామాన్యుడి కొనుగోళ్లపై పెద్ద భారాన్నే మోపబోతోంది. పండుగల సీజన్కు ముందు రూపాయి దెబ్బను తలచుకుని అటు కంపెనీలు, ఇటు సగటు వినియోగదారులు కూడా నిట్టూర్చే పరిస్థితి. ఎందుకంటే రూపాయి కారణంగా పడే ప్రభావాన్ని ఉత్పత్తుల ధరలను పెంచుతూ కస్టమర్లకు బదిలీ చేసేందుకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, కార్ల కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇంత వరకూ పండగ సమయంలో కొందామని వేచి చూసిన వారిని తాజా పరిణామాలు పునరాలోచనలో పడేస్తున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 72కు సమీపంలోకి వచ్చేసింది. ఇది అటు కంపెనీలు, ఇటు వినియోగదారులకూ రుచించనిదే. రూపాయి ఈ ఏడాది పండుగ అమ్మకాలకు గండికొట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన అయితే ఉంది. రూపాయి క్షీణతతో పెరిగిన ముడి సరుకుల (లోహాలు, ప్లాస్టిక్) ధరలతో కంపెనీలకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ విడిభాగాల ధరలకు ప్రామాణికం డాలరే. ఈ నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి ధరల భారాన్ని దింపుకునేందుకు కంపెనీలు ఉత్పత్తుల ధరల్ని పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎల్జీ, హాయర్, గోద్రేజ్ అప్లయన్సెస్ 3–5 శాతం స్థాయిలో ఈ నెల్లోనే ధరల్ని పెంచేశాయి. ప్యానాసోనిక్ ఇండియా కూడా 2–3 శాతం వరకు ధరల్ని అతి త్వరలోనే పెంచనుందని అంచనా. కార్ల కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ, పలు రకాల మోడళ్ల ధరలను రూ.6,100 వరకు పెంచింది. రూపాయి క్షీణత భారాన్ని ఇలా దింపుకుంది. అలాగే, టయోటా కిర్లోస్కర్ కూడా ధరల్ని ఈ నెల్లోనే 2–3 శాతం వరకు పెంచేసింది. డిమాండ్కు దెబ్బ అయితే, ఈ ధరల పెంపు డిమాండ్ను దెబ్బతీస్తుందన్న ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా కంపెనీలు ఎక్కువగా అమ్మకాలను నమోదు చేసుకునే పండుగల సీజన్ డిమాండ్పై ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. విక్రయాలు 5–10 శాతం వరకు తగ్గొచ్చని కన్జూమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల విక్రేతల అంచనా. రూపాయి విలువ ఇంకా పడితే, కంపెనీలు మరింత ధరల్ని పెంచితే ఈ డిమాండ్ ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా జరగాల్సింది కాదు... ‘‘రూపాయి క్షీణత అన్నది అనువుగాని సమయంలో జరుగుతోంది. జూలైలో జీఎస్టీ రేట్లు 10 శాతం తగ్గించడంతో పండుగల విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాం. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేశాం. కానీ, ప్రస్తుత ధరల పెంపుతో పండుగల డిమాండ్పై గణనీయ ప్రభావమే పడనుంది’’ అని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. వినియోగదారుల వెనకడుగు ‘‘పరిశ్రమ కొంత కాలం పాటు సింగిల్ డిజిట్ వృద్ధినే చూసింది. జీఎస్టీ రేట్ల కోతతో పరిస్థితి మారుతుందని ఆశించాం. కానీ, వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంది’’ అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. ఓ స్థాయికి మించి పెంచలేం ‘‘దీర్ఘకాలంలో రూపాయి స్థిరపడుతుందని భావించడం లేదు. రూపాయి డాలర్తో ఏటా 6 శాతం మేర క్షీణిస్తుందన్న దానికి సిద్ధపడ్డాం. 2–3 శాతం ధరల పెంపు పడుతున్న రూపాయి ప్రభావాన్ని కొంతవరకే అడ్డుకోగలదు. కానీ, ఓ స్థాయికి మించి ధరలను పెంచలేం. ఎందుకంటే ఇది అమ్మకాలపై ఒత్తిడికి దారితీస్తుంది’’ అని టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ తెలిపారు. టీవీల ధరలకూ రెక్కలు ఇక టీవీలు కూడా రూపాయి కారణంగా ఖరీదవుతున్నాయి. కొన్ని టీవీల కంపెనీలు ఈ నెల మధ్య నుంచే ధరల్ని పెంచనున్నాయి. థామ్సన్, కొడాక్ టీవీల తయారీ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ఇప్పటికే ధరల్ని పెంచేసింది. ఆగస్ట్లో ఒకసారి, సెప్టెంబర్లో మరోసారి ధరల్ని పెంచడం జరిగిందని, 12 శాతం మేర ధరలు పెరిగినట్టు సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్సింగ్ మార్వా తెలిపారు.