-
RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, రామ్చరణ్ పోటీపడి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కల్పిత కథతో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' 2022 మార్చి 25న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్గా తారక్ నటించి మెప్పించారు. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రూ. 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.తెలుగు, హిందీలో రీ-రిలీజ్ తారక్- చరణ్ ఫ్యాన్స్కు పండుగలాంటి సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా విడుదల సమయంలో థియేటర్లు అన్నీ నిండిపోయాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయినా కూడా ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. మే 10న మరోసారి ఆర్ఆర్ఆర్ విడుదల కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే, 2డీ, 3డీ ఫార్మాట్లతో పాటు 4K వర్షన్తో స్పెషల్గా వస్తుండటంతో అభిమానులు కాస్త ఆసక్తిగా ఉన్నారు. దీంతో ప్రేక్షకులు మరోసారి థియేటర్కు వచ్చి ఆ అనుభవాన్ని పంచుకోనున్నారు.ఆర్ఆర్ఆర్ ఖాతాలో లెక్కలేనన్ని ఆవార్డులు వచ్చి చేరాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. ఇందులోని 'నాటునాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కింది. ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ ఫీచర్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. RRR RE RELEASE on 10th May 🔥💥 @AlwaysRamCharan #RRRMoviepic.twitter.com/8eaIfLjw14— Navya (@HoneYNavya_) May 6, 2024 -
మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది: రాజమౌళి
దర్శకధీరుడు ప్రస్తుతం జపాన్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్లోనూ రిలీజ్ చేశారు. గతేడాది ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రాన్ని జపాన్లో 100 ఏళ్లనాటి పురాతన మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమాను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రంలాగే ఈ మ్యూజికల్ షోపై కూడా ప్రేమ చూపిన జపనీస్ ఆడియన్స్కు ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చూస్తే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ ఈవెంట్లో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా' అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ దర్శకధీరుడి అభినందిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను అందించారు. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ పెట్టాలనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా.. హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్వర్త్ కీలకపాత్ర పోషించనున్నారని కూడా టాక్ నడుస్తోంది. Its an honour that our RRR has been adapted as a musical by the 110 year old Takarazuka company. Thank you Japanese audience for embracing the Broadway play of RRR just like the film itself. Overwhelmed by your response... Can't appreciate all the girls enough for your energy,… pic.twitter.com/QbfLPmsJxC — rajamouli ss (@ssrajamouli) March 22, 2024 -
'రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ఆమె చనిపోవాల్సింది.. కానీ'!
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన పీరియాడిక్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. తాజాగా జపాన్లో ఈ మూవీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా బ్రిటిష్ యువతి జెన్నీ పాత్రలో ఓలివియా మోరిస్ నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో మరిన్నీ సీన్స్ ఉన్నాయని రాజమౌళి తెలిపారు. కానీ సినిమా నిడివి పెరగడంతో ఎడిటింగ్లో తీసేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ..'ఎన్టీఆర్(భీమ్)ను జైలులో పెట్టిన తర్వాత జెన్నీ (ఓలివియా మోరిస్) అతడిని కలుస్తుంది. జైలు నుంచి తప్పించడానికి భీమ్కు సాయం చేయాలనుకుంటుంది. ఆమె అంకుల్ గవర్నర్ స్కాట్ గదిలోకి రహస్యంగా వెళ్లి.. అక్కడ ఉన్న ప్లాన్స్ను దొంగిలించి భీమ్కు అందజేస్తుంది. అక్కడి నుంచి వస్తుండగానే.. స్కాట్ భార్య ఆమెను చూస్తుంది. జెన్నీ బూట్లకు మట్టి ఉండటంతో అనుమానం వచ్చి.. విషయాన్ని స్కాట్కు చెబుతుంది. ఆ తర్వాత భీమ్ తప్పించుకుంటాడు.' అని తెలిపారు. ఆ తర్వాత రామ్ను జైల్లో పెడతాడు స్కాట్. ఈ విషయం తెలుసుకున్న భీమ్ తిరిగి వచ్చి రామ్ను కాపాడి జైలు నుంచి బయటకు తెస్తాడు. వాళ్లిద్దరూ బ్రిటిష్ సైన్యాన్ని చంపుకుంటూ పోయే క్రమంలో జెన్నీని పావుగా వాడుకుని వాళ్లను పట్టుకోవాలని స్కాట్ ప్లాన్. లొంగిపోకపోతే.. జెన్నీని చంపేస్తానని వాళ్లను స్కాట్ బెదిరిస్తాడు. దీంతో వారు లొంగిపోయే క్రమంలోనే జెన్నీ మోసం చేసిందన్న కోపంతో ఆమెను స్కాట్ చంపేస్తాడు. ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వర్షన్లో జెన్నీ చనిపోతుంది. కానీ ఈ విషాదంతో కూడిన కథను తీయాలని నాకు అనిపించలేదు. దీంతో మొత్తం మార్చేశాం. జెన్నీ బతికిపోయింది. మీరు హ్యాపీగా సినిమా చూశారంటూ' పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం భీమ్, జెన్నీలకు అదనంగా ట్రాక్స్ రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా నిడివి మూడు గంటలు దాటిపోవడంతో ఆ సీన్స్ తొలగించారు. కాగా. రాజమౌళి తన నెక్ట్స్ మూవీ ప్రిన్స్ మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నారు. -
మహేశ్ బాబును ఇక్కడికి తీసుకొస్తాను: రాజమౌళి
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. తాజాగా ఇదే విషయాన్ని జక్కన్న తెలిపారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జపాన్లో ఉన్న రాజమౌళి SSMB29 సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డుతో RRR గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారికి ఎంతో గర్వకారణంగా ఈ చిత్రం నిలిచింది. తాజాగా జపాన్లో ఈ మూవీ స్క్రీనింగ్కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ మన జక్కన్న క్రేజ్ మామూలగా లేదు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని అక్కడి ప్రజలు చూపించారు. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు. 'మహేశ్ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. SSMB29 ప్రాజెక్ట్కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో హీరో మహేశ్ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుషా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్లో కూడా రిలీజ్ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను.' అని జపాన్లో జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఆయన మాటలను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు. SSR about #SSMB29 We've finished writing and are now in pre-production. Only the, protagonist SuperStar @urstrulyMahesh , is confirmed and he's incredibly handsome. Hoping to expedite the filming process and have him join us for promotion during the release #MBSSR pic.twitter.com/JZAx3oP6cu — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
ఆ దేశంలో రాజమౌళి క్రేజే వేరు.. ఏకంగా 83 ఏళ్ల వృద్ధురాలు!
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. నాటునాటు అనే సాంగ్కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ఈ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాలకు ఆదరణ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్ అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాను ఏకంగా జపనీస్లోనూ రిలీజ్ చేశారు. అక్కడ రాజమౌళి సినిమాకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల జపాన్ వెళ్లిన రాజమౌళికి ఓ మహిళ అభిమాని అరుదైన కానుక అందజేశారు. దాదాపు 83 ఏళ్ల వద్ధురాలు దర్శకధీరుడు రాజమౌళికి బహుమతులను అందజేసింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ..'జపాన్లో ఓరిగామి క్రేన్లను తయారు చేస్తారు. వారికిష్టమైన వారి ఆరోగ్యం కోసం బహుమతిగా ఇస్తారు. ఈ 83 ఏళ్ల వృద్ధురాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి అలాంటివీ 1000 తయారు చేసింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆమెను సంతోషపెట్టింది. ఆమె ఇప్పుడే బహుమతి పంపింది. చలిలో బయట వేచి ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. అది గ్రేట్ అంతే.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేయనున్నారు. In Japan, they make origami cranes &gift them to their loved ones for good luck& health. This 83yr old woman made 1000 of them to bless us because RRR made her happy. She just sent the gift and was waiting outside in the cold.🥹 Some gestures can never be repaid. Just grateful🙏🏽 pic.twitter.com/UTGks2djDw — rajamouli ss (@ssrajamouli) March 18, 2024 -
రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్
హీరోయిన్ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు హిందీ మూవీస్ చేసిన ఈమె.. 'ఆర్ఆర్ఆర్'లోనూ ఓ పాత్ర చేసి ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే అలియా-రాజమౌళికి గొడవైందని ఏవేవో అన్నారు. అయితే వాటిలో నిజానిజాలు పక్కనబెడితే.. తనకు రాజమౌళి ఇచ్చిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నానని అలియా చెప్పుకొచ్చింది. అలా తన పద్ధతి పూర్తిగా మారిపోయిందని పేర్కొంది. (ఇదీ చదవండి: బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి) 'సినిమాలని ఎంచుకునే విషయంలో మొదటి నుంచి ఒత్తిడికి గురవుతూ ఉండేదాన్ని. అదే విషయం రాజమౌళికి చెప్పాను. 'ఏది చేసినా సరే ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు మీ యాక్టింగ్ని మెచ్చుకుంటారు. మీకు కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచంలోనే ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏదీ లేదు' అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి నేను అదే పాటిస్తున్నాను' 'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా దగ్గరకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేసేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు సహనం తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా పాత్రనైనా సరే ఓకే చెప్పాలని డిసైడ్ అయ్యాను' అని అలియా భట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె హిందీలో 'జిగ్రా' అనే సినిమా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 27న ఇది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: మహేశ్ -రాజమౌళి సినిమా కథేంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్) -
ఆస్కార్ వేదికపై అణు బాంబు మోత
అణు బాంబు సౌండ్ అదిరింది.. క్రిస్టోఫర్ కల నిజమైంది... ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు ఆకర్షణగా నిలిచింది. ఫేక్ చప్పట్లతో మెస్సీ (శునకం), ఆమిర్ ఖాన్ ‘పీకే’ తరహాలో జాన్ ప్రత్యక్షం కావడం చర్చలకు దారి తీసింది.ఇలా ఆనందాలు, వింతలు, విడ్డూరాలతో ఆస్కార్ అవార్డు వేడుక జరిగింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. విజేతల వివరాలు: • ఉత్తమ చిత్రం: (ఆపెన్ హైమర్) • దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఆపెన్ హైమర్) • నటుడు: సిలియన్ మర్ఫీ (ఆపెన్ హైమర్) • నటి: ఎమ్మాస్టోన్ (పూర్ థింగ్స్) • సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఆపెన్ హైమర్) • సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) • సినిమాటోగ్రఫీ: ఆపెన్ హైమర్ • డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్ • హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) • అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్పన్ (అమెరికన్ ఫిక్షన్ ) • ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) • యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్ • కాస్ట్యూమ్ డిజైన్ : హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) • ప్రోడక్షన్ డిజైన్ : జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) • ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఆపెన్ హైమర్) • విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ • డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది లాస్ట్ రిపేర్ షాప్ • ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్: ఆపెన్ హైమర్ • సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఒరిజినల్ సాంగ్: వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) • లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్. రాబర్ట్ జూనియర్, డేవైన్ జో రాండాల్ఫ్, ఎమ్మా స్టోన్, సిలియన్ మర్ఫీ ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్ ఆపెన్హైమర్ జీవితంతో రూపొందిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఆపెన్హైమర్’ మోత ఆస్కార్ వేదికపై బాగా వినిపించింది. దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్తో ఆస్కార్ అవార్డును ముద్దాడేలా చేసింది. మార్చి 10న లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆపెన్హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి విజయఢంకా మోగించింది. మొత్తం పదమూడు నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు దర్శకుడు, నటుడు, సహాయనటుడు, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డు దక్కింది. అలాగే పదకొండు నామినేషన్లు దక్కించుకున్న ‘పూర్ థింగ్స్’ సినిమాకు నాలుగు విభాగాల్లో, హిస్టారికల్ డ్రామా ‘జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకు రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ‘ఆపెన్హైమర్’కు పోటీగా నిలుస్తుందనుకున్న ‘బార్బీ’ సినిమాకు 8 నామినేషన్లు దక్కినా, ఒక్క అవార్డు (బెస్ట్ ఒరిజినల్ సాంగ్)తో సరిపెట్టుకుంది, పది నామినేషన్లు దక్కించుకున్న ‘కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాకి ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నిలిచిన సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటి రాండాల్ఫ్ తొలిసారి ఆస్కార్ని ముద్దాడారు. గతంలో ‘లా లా ల్యాండ్’కి ఉత్తమ నటిగా ఆస్కార్ అందు కున్న ఎమ్మా స్టోన్ ఇప్పుడు ఇదే విభాగానికి అవార్డుని అందుకున్నారు. భారత సంతతికి చెందిన నిషా తెరకెక్కించిన ‘టు కిల్ ఎ టైగర్’ డాక్యుమెంటరీ ఆస్కార్ సాధించలేకపోయింది. ఇక అవార్డు విజేతల జాబితా ఈ విధంగా... స్వీట్ సర్ప్రైజ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు 95వ ఆస్కార్ అవార్డ్స్లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. 96వ అవార్డ్స్లో ‘ఆర్ఆర్ఆర్’ విజువల్స్ కనిపించాయి. వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్ సీక్వెన్స్ అంటూ ఆస్కార్ వేదికపై ప్రదర్శించిన విజువల్స్లో ‘ఆర్ఆర్ఆర్’లోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లు రెండుసార్లు కనిపించాయి. ‘టైటానిక్’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘చార్లీ చాప్లిన్’, ‘బస్టర్ కీటన్’ వంటి హాలీవుడ్ క్లాసిక్ చిత్రాల యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ‘ఆర్ఆర్ఆర్’లోని యాక్షన్ విజువల్స్ ప్లే కావడం విశేషం. అలాగే ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?’ను విజేతగా ప్రకటించే ముందు ప్లే చేసిన కొన్ని సాంగ్స్ విజువల్స్లో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట కనిపించింది. ఈ సందర్భంగా.. ‘‘వరల్డ్ స్టంట్ సీక్వెన్స్లకు నివాళిగా ప్లే చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్లలో ‘ఆర్ఆర్ఆర్’ స్టంట్ సీక్వెన్స్లు ఉండటం స్వీట్ సర్ప్రైజ్లా ఉంది’’ అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మించారు. నా కళ్లు చెబుతున్నాయి... – అల్ పచినో మామూలుగా విజేతలను ప్రకటించే ముందు పోటీలో ఉన్నవారి పేర్లు చెప్పి, చివరిగా విజేత పేరు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రముఖ నటుడు 83 ఏళ్ల అల్ పచినో ఈ విధానాన్ని అనుసరించలేదు. ఈ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఫేమ్ ఉత్తమ చిత్రాన్ని ప్రకటించడానికి వేదికపైకి వచ్చారు. ఈ విభాగంలో పది చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ చిత్రాల పేర్లు చెప్పకుండా.. ‘ఇదిగో..’ అంటూ మెల్లిగా ఎన్వలప్ కవర్ని ఓపెన్ చేస్తూ.. నా కళ్లు చెబుతున్నాయి టైప్లో నా కళ్లకు ‘ఆపెన్హైమర్’ కనబడుతోంది అనగానే వీక్షకుల నుంచి కరతాళ ధ్వనులు వినిపించాయి. అయితే అల్ పచినో ఈ విధంగా ప్రకటించడంతో.. అవార్డు ఈ సినిమాకే వచ్చిందా? అనే సందేహంలో కొందరు ఉండిపోయారు. అంతలోనే ‘అవును.. అవును..’ అన్నారు. అయితే అల్ పచినో ఇలా ప్రకటించడం పట్ల పలువురు విమర్శించారు. ఆస్కార్ అవార్డుల జాబితాలో ప్రధానమైన విభాగంలో పోటీ పడిన చిత్రాల పేర్లు చెప్పకుండా, పైగా వేడుకలో చివరి అవార్డు కాబట్టి కాస్తయినా సస్పెన్స్ మెయిన్టైన్ చేయకుండా చెప్పడం బాగాలేదని అంటున్నారు. ఇలా సాదా సీదా ప్రకటనతో ఆస్కార్ అవార్డు వేడుక ముగిసింది. నోలన్ కల నెరవేరెగా... ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ చరిత్ర కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎందుకంటే నోలన్ తీసిన సినిమాలు ఆస్కార్ అవార్డుల కోసం 49 నామినేషన్లు దక్కించుకుని, 18 అవార్డులను సాధించాయి. కానీ క్రిస్టోఫర్ నోలన్కు మాత్రం 95వ ఆస్కార్ అవార్డుల వరకూ ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. తొలిసారి 2002లో ‘మెమెంటో’ సినిమాకు గాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో 74వ ఆస్కార్ అవార్డ్స్లో నామినేషన్ దక్కించుకున్నారు నోలన్... నిరాశే ఎదురైంది. ఆ తర్వాత 83వ ఆస్కార్ అవార్డ్స్లో ‘ఇన్సెప్షన్’ సినిమాకు బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో నామినేషన్లు దక్కినా అవార్డులు రాలేదు. 90వ ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ విభాగాల్లో నోలన్ ‘డంకిర్క్’ సినిమాకు నామినేషన్లు దక్కినా ఆస్కార్ అవార్డు దక్కలేదు. చివరికి నోలన్ కల ‘ఆపెన్హైమర్’తో నెరవేరింది. ఈ ప్రయాణంలో నేనూ భాగం అని... – క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ వేదికపై క్రిస్టోఫర్ నోలన్ మాట్లాడుతూ – ‘‘మా సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్లతో పాటు యూనిట్ అందరికీ ధన్యవాదాలు. ఇక మా కుటుంబాన్ని, ఈ సినిమాను నిర్మించిన మా నిర్మాత ఎమ్మా థామస్తో (భార్య ఎమ్మా పేరును ప్రస్తావించగానే ఒక్కసారిగా నవ్వులు) పాటు నా సోదరుడికి థ్యాంక్స్ చె΄్పాలి. మా సినిమాలో సత్తా ఉందని నమ్మి, డిస్ట్రిబ్యూట్ చేసిన యూనీవర్సల్ స్టూడియోస్కు ధన్యవాదాలు. సినిమా చరిత్ర వందేళ్లకు చేరువ అవుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ ఈ ప్రయాణం తాలూకు సినిమాల్లో నేను కూడా ఓ అర్థవంతమైన భాగం అని భావించి, నన్ను గుర్తించిన ఆస్కార్ కమిటీకి ధన్యవాదాలు’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... భార్యాభర్త నోలన్, ఎమ్మా దర్శక–నిర్మాతలుగా ఒకేసారి ఆస్కార్ అవార్డులు సాధించారు. అణుబాంబు విస్ఫోటనం నేపథ్యంలోని ‘ఆపెన్హైమర్’లో నటించి, అవార్డు దక్కించుకున్న మర్ఫీ తన అవార్డును ప్రపంచ శాంతి ఆకాంక్షించేవారికి అంకితమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జీవితంలో తనకు ఎంతో అండగా నిలిచిన తన భార్య సుసాన్ డౌన్కి అవార్డుని అంకితం ఇస్తున్నట్లుగా ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ తెలిపారు. ‘‘నేను నా జీవితంలో మరోలా (స్లిమ్గా) ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే... నేను నాలానే ఉండాలి’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రాండాల్ఫ్ నేనీ సినిమా చేసి ఉండాల్సింది కాదు – ఎమ్ చెర్నోవ్ ఉక్రెయిన్ వార్ బ్యాక్డ్రాప్తో రూపొందిన డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘20 డేస్ ఇన్ మరియోపోల్’ చిత్రం ఆస్కార్ అవార్డును సాధించింది. ఈ అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్లో చిత్రదర్శకుడు ఎమ్ చెర్నోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రలో ఇది తొలి ఆస్కార్ అవార్డు. ఇందుకు గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఈ సినిమాను నేను చేసి ఉండకూడదని అనుకుంటున్నాను. బహుశా ఈ వేదికపై ఇలా మాట్లాడుతున్న తొలి దర్శకుడిని నేనేమో. మా ఉక్రెయిన్పై దాడులు చేయకుండా, మా నగరాలను ఆక్రమించకుండా ఉండేందుకు బదులుగా రష్యావారికి ఈ అవార్డు ఇస్తాను. నేను చరిత్రను, గతాన్ని మార్చలేను. కానీ కొందరు ప్రతిభావంతులతో కలిసి ఓ కొత్త రికార్డును సృష్టించగలం. అప్పుడు నిజం గెలుస్తుంది. జీవితాలను త్యాగం చేసిన మరియోపోల్ ప్రజలు గుర్తుండిపోతారు. సినిమా జ్ఞాపకాలను ఏర్పరుస్తుంది. జ్ఞాపకాలు చరిత్రను నెలకొల్పుతాయి’’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు చెర్నోవ్. ఆమిర్ ‘పీకే’ని తలపించేలా జాన్ సెనా ఆస్కార్ అవార్డు వేడుకలో జరిగిన ఓ ఘటన ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాని గుర్తు చేసింది. ఈ చిత్రంలో ఆమిర్ ఓ సీన్లో తన శరీరానికి ముందు భాగంలో ఓ రేడియో అడ్డుపెట్టుకుని అర్ధనగ్నంగా నటించారు. ఆస్కార్ వేదికపై ఇలాంటి సీనే రిపీట్ అయింది. స్టార్ రెజ్లర్ (డబ్ల్యూడబ్ల్యూఈ) జాన్ సెనా అర్ధనగ్నంగా ప్రత్యక్షమై షాక్ ఇచ్చారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును ప్రకటించేందుకు జాన్ సెనా ఇలా అర్ధనగ్నంగా రావడం చర్చనీయాంశంగా మారింది. తన శరీరానికి ముందు భాగంలో విజేత వివరాలు ఉండే ఎన్వలప్ కవర్ను మాత్రమే అడ్డుపెట్టుకొని వేదికపైకి రావడంతో సభికులందరూ తెగ నవ్వుకున్నారు. అయితే తాను ఇలా రావడానికి కారణం ఉందన్నారు జాన్ సెనా. ‘పురుషుడి శరీరం కూడా జోక్ కాదని, అలానే కాస్ట్యూమ్స్ అనేవి ముఖ్యం అని తెలియజెప్పేందుకే ఇలా వచ్చా’ అన్నారు సెనా. అనంతరం ‘పూర్ థింగ్స్’ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో అవార్డును ప్రకటించారు. 1974 సీన్ రిపీట్ దాదాపు 50 ఏళ్ల క్రితం (1974) జరిగిన ఆస్కార్ వేడుకల్లో నటి ఎలిజబెత్ టేలర్ను పరిచయం చేస్తుండగా ఓ వ్యక్తి నగ్నంగా వేదికపైకి దూసుకు రావడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా జాన్ సెనా ప్రవర్తనతో నాటి ఘటనను కొందరు గుర్తుకు తెచ్చుకున్నారు. ఫేక్ క్లాప్తో శునకానందం ఆస్కార్ వేడుకలో ఈ ఏడాది ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షించింది. సభికులతో పాటు క్లాప్స్ కొట్టిన ఈ శునకం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఆస్కార్ కోసం పలు విభాగాల్లో పోటీ పడిన సినిమాల్లో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ ఒకటి. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే విభాగంలో ఈ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెస్సీ (శునకం)ని అవార్డు వేడుకకు తీసుకొచ్చింది యూనిట్. ‘ఆపెన్ హైమర్’కి రాబర్డ్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకుంటున్నప్పుడు అందరితో పాటు మెస్సీ చప్పట్లు కొట్టడం ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ శునకం కూర్చున్న కుర్చీ కింద ఓ వ్యక్తి ఉండి, ఫేక్ చేతులతో క్లాప్ కొట్టాడు. అవి శునకం కాలిని పోలి ఉండటంతో మెస్సీయే చప్పట్లు కొట్టిందని భావించారంతా. -
ఆస్కార్ వేదికపై మరోసారి ఆర్ఆర్ఆర్.. అట్లుంది మరి మనతోని!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది ఎన్నో రికార్డులను తిరగరాసింది. కలెక్షన్సే కాదు అంతకుమించి అన్నట్లు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. నాటు నాటు పాట అయితే ఏకంగా హాలీవుడ్ గడ్డపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ను వశం చేసుకుంది. తాజాగా జరిగిన 96వ ఆస్కార్ వేడుకల్లోనూ మరోసారి ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది. నాటు నాటు విజువల్స్.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో సోమవారం (మార్చి 11) నాడు అకాడమీ అవార్డులను ప్రకటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు ప్రకటించే సమయానికి నాటు నాటు పాట విజువల్స్ను బ్యాగ్రౌండ్లో ప్లే చేశారు. ఓపక్క ఆ పాట ప్లే అవుతుండగా అరియానా గ్రాండే, సింతియా ఎరివో స్టేజీపైకి వచ్చి విజేతలను ప్రకటించారు. బార్బీ సినిమాలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? అనే పాటకుగానూ బిల్లీ ఈలిష్, ఫిన్నియాస్ ఓకోనల్ పురస్కారం అందుకోవాలని పిలిచారు. యాక్షన్ సీన్ కూడా.. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేసింది. ఆస్కార్ గడ్డపై మరోసారి ఆర్ఆర్ఆర్ అంటూ క్యాప్షన్ జోడించింది. అక్కడ నాటు నాటు పాట మాత్రమే కాకుండా సదరు మూవీలోని ఓ యాక్షన్ సీన్ కూడా ప్లే చేశారు. జీవితాన్ని రిస్క్ చేసే స్టంట్స్ మాస్టర్లకు సలాం కొడుతూ గొప్ప స్టంట్స్ సన్నివేశాల వీడియోను ఆస్కార్ వేదికపై ప్రదర్శించారు. అందులో హాలీవుడ్ చిత్రాలతో పాటు నాటు నాటులోని క్లైమాక్స్ సీన్ కూడా చోటు దక్కించుకుంది. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ హవా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని, జక్కన్న సినిమా అంటే అట్లుంటదని కామెంట్లు చేస్తున్నారు. On the #Oscars stage again!! ❤️🔥❤️🔥❤️🔥 #RRRMovie pic.twitter.com/cbNgFzMt72 — RRR Movie (@RRRMovie) March 11, 2024 And again, a sweet surprise for us… 🔥🌊 Glad that @TheAcademy included #RRRMovie action sequences as part of their tribute to the world’s greatest stunt sequences in cinema. pic.twitter.com/TGkycNtF2I — RRR Movie (@RRRMovie) March 11, 2024 చదవండి: ఈసారి ఆ మూవీకే ఎక్కువ అవార్డ్స్.. పూర్తి లిస్ట్ ఇదే! -
ఆస్కార్ ఒరిజినల్ సాంగ్.. గతేడాది 'ఆర్ఆర్ఆర్'కి.. మరి ఇప్పుడు?
ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో జరుగుతున్న కార్యక్రమంపై భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నాడు. ఎందుకంటే అనితర సాధ్యమైన ఈ పురస్కారాన్ని గతేడాది 'ఆర్ఆర్ఆర్' గెలుచుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ అందుకుంది. ఈసారి ఈ విభాగంలో గెలిచిందెవరు? ఏంటంత స్పెషల్? (ఇదీ చదవండి: ఆస్కార్-2024 అవార్డుల వేడుక.. విజేతలు వీళ్లే) 'ఆర్ఆర్ఆర్' సినిమా గతేడాది ఆస్కార్ బరిలో నిలిచినప్పుడు చాలామంది మనకు ఓ ఆస్కార్ వస్తే బాగుంటుందని ఆశపడ్డారు. కోట్లాది మంది భారతీయల కల నెరవేరింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' పాటకు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. దీంతో కోట్లాదిమంది మురిసిపోయారు. అయితే ఈసారి భారతీయ సినిమాలేం ఆస్కార్ బరిలో లేవు. కానీ గతేడాది 'ఆర్ఆర్ఆర్' గెలుచుకున్న విభాగంలో ఈసారి ఎవరికి అవార్డు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. 'ఓపెన్ హైమర్' సినిమాతో పోటీపడి బాక్సాఫీస్ దగ్గర వేలకోట్ల వసూళ్లు కొల్లగొట్టిన 'బార్బీ' సినిమాలోని 'వాట్ వజ్ ఐ మేడ్ ఫర్' పాటకు ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ వచ్చింది. బిల్లీ ఏలిష్ పాడిన పాట.. 'నాటు నాటు'తో పోలిస్తే చాలా డిఫరెంట్. మెలోడీగా సాగే ఈ గీతాన్ని మీరు ఓసారి వినేయండి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్
జామ్నగర్లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్లోని జామ్నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్స్టోన్ సందడి చేశారు. బాలీవుడ్లో త్రీ ఖాన్స్గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఒకే ఫ్రేమ్లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
బాఫ్టాలో మెరిసిన దీపికా పదుకోన్
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఒప్పెన్ హైమర్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. లండన్లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల (బాఫ్టా) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. దేశం నుంచి దీపికా పదుకోన్ ఈ వేడుకల్లో పాల్గొని, ‘నాన్ ఇంగ్లిష్’ విభాగంలో ఉత్తమ చిత్రానికి (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) అవార్డు అందజేశారు. ఇక ‘భాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో పురస్కారాలు అందుకుని సత్తా చాటింది. అవార్డులతో ‘ఒప్పెన్ హైమర్’ టీమ్ ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, సహాయనటుడు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల్లో ‘ఒప్పెన్ హైమర్’కి అవార్డులు దక్కాయి. క్రిస్టోఫర్ నోలన్కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డు ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం తాజాగా బాఫ్టాలో ఏడు పురస్కారాలు దక్కించుకుని, వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో 13 విభాగాల్లో పోటీలో ఉంది. ఇక ‘బాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ తర్వాత ‘పూర్ థింగ్స్’ మూవీ అధికంగా ఐదు (కాస్ట్యూమ్, మేకప్, హెయిర్–స్టైలింగ్,ప్రోడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో) అవార్డులను పొందింది. ఆ తర్వాత ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి. భారతీయత ఉట్టిపడేలా... ‘భాఫ్టా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్గా వ్యవహరించిన దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయ నటి దీపికా కావడం విశేషం. ఈ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరలో మెరిశారు దీపికా పదుకోన్. ‘చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది’ అనే ప్రశంసలు ఈ బ్యూటీ సొంతమయ్యాయి. ఈ వేడుకలో బ్యాక్ స్టేజీలో దీపికా దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపికా పదుకోన్ పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో దీపిక ప్రజెంటర్గా వ్యవహరించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటను ఆమె ఆస్కార్ వేదికపై పరిచయం చేశారు. -
టాలీవుడ్లో తీవ్ర విషాదం
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య రుహీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృత్తిరీత్యా ఆమె యోగా శిక్షకురాలుగా పని చేస్తున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే సికింద్రాబాద్లోని ఓ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పని చేశారు. భరత్ ఠాకూర్ యోగా క్లాసుల హైదరాబాద్ విభాగానికి కూడా ఆమె సారథ్యం వహించారు. కాగా..సెంథిల్ కుమార్ జూన్ 2009లో రూహీని వివాహం చేసుకున్నారు. టాలీవుడ్లో సెంథిల్ కుమార్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకే ఎక్కువగా పనిచేశారు. టాలీవుడ్లో సై, ఛత్రపతి, యమదొంగ, అరుంధతి, మగధీర, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్క్లూజన్, ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. View this post on Instagram A post shared by Senthil Kumar (@dopkksenthilkumar) -
దర్శకధీరుడిపై మరోసారి ప్రశంసలు.. హాలీవుడ్ దిగ్గజం ఏమన్నారంటే?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతే కాదు.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ను గెలిచి మన గొప్పదనాన్ని మరింత పెంచారు. గతేడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డ్ దక్కింది. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ లభించింది. ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. అదే సమయంలో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. 2023లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో కామెరూన్ను రాజమౌళి కలిశాడు. ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మూవీ అద్భుతంగా ఉందని కొనియాడారు. (ఇది చదవండి: 'మా నాన్నకు అలాంటి అవసరం లేదు'.. సూపర్ స్టార్ కూతురు ఆసక్తికర కామెంట్స్!) తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ దిగ్గజం మరోసారి రాజమౌళిని పొగిడారు. ఈవెంట్లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు. కామెరూన్ మాట్లాడుతూ.. 'నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. అది చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమా ప్రపంచ వేదిక స్థాయికి చేరడం చాలా గొప్పగా విషయం' అని అన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ద్వారా పంచుకుంది. 'మీ అమూల్యమైన మాటలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని సరిహద్దులను బద్దలు కొట్టి మరింత ఎత్తుకు ఎదుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.' అంటూ ట్వీట్ చేసింది. కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. James Cameron.. 🤗 Your precious words always inspire us to strive better and be the best. We strongly believe Indian cinema is going to break all boundaries and grow to its fullest. ❤️ #RRRMovie pic.twitter.com/pzHjGQNZnC — RRR Movie (@RRRMovie) February 7, 2024 -
RRR తర్వాత డీవీవీ దానయ్య బిగ్ ప్లాన్.. ఆ హీరో కోసం భారీ ఆఫర్
విజయ్ ఈ పేరు ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాకుండా, రాజకీయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అతి కొద్ది మంది నటుల్లో ఈయన ఒకరు. విజయ్ నటించిన చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, నిర్మాతలకు నష్టాలు రానంతగా స్థాయికి ఆయన చేరుకున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఉదాహరణకు ఇటీవల తెరపైకి వచ్చిన 'లియో' చిత్రాన్నే తీసుకోవచ్చు. ఈ చిత్రం విమర్శకుల దాడిని ఎదుర్కొంది. టాక్ వ్యతిరేకంగా వచ్చినా, వసూళ్లు మాత్రం రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ తన 68వ చిత్రంలో నటిస్తున్నారు. ఈయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియనం చేస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ప్రభు దర్వకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో విజయ్ తర్వాత చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కారణం ఈయన రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతుండడమే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ 69వ చిత్రం ఓకే అయినట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్వకత్వంలో అత్యంత భారీ బడ్జెట్లో నిర్మించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఆస్కార్ బరిలో మూడు అవార్డులను గెలుచుకోవండంతో చిత్ర నిర్మాత 'డీవీవీ దానయ్య' పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ టాప్ హీరో విజయ్తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విజయ్కు సౌత్ ఇండియాలో బిగ్ మార్కెట్ ఉంది. దీంతో తెలుగు డైరెక్టర్తో పాన్ ఇండియా సినిమా నిర్మించేందుకు దానయ్య ఉన్నారని సమాచారం. ఇప్పటికే కథ కూడా విజయ్కు వినిపించారట. అది విజయ్కు కూడా నచ్చిందని, ఆయన ఇందులో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు టాక్. ఈ చిత్రానికి విజయ్ ఊహించని స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్త హల్చల్ చేస్తోంది. ఇక దీనికి దర్శకుడు ఎవరన్నది త్వరలోనే నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విజయ్ తన 70వ చిత్ర షూటింగ్కు సిద్ధం అవుతారని సమాచారం. విజయ్ గతంలో దిల్ రాజు నిర్మాతగా వారసుడు చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన త్వరలో రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు, అందుకు అన్ని విధాలుగా సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. త్వరలోనే పార్టీ పేరును వెల్లడించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. దీంతో కొన్ని ఏళ్లు విజయ్ సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఆ ఇద్దరు హీరోలు ఎవరో నాకు తెలియదు.. RRR నటుడు వైరల్ కామెంట్
ఎడ్వర్డ్ సోన్నెన్బ్లిక్.. దక్షిణ కాలిఫోర్నియాలో జన్మించి నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయనకు హీందీ కూడా వచ్చు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు రావడంతో ధనుష్ కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఆయనకు ఛాన్స్ దక్కింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'కెప్టెన్ మిల్లర్' సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా రేంజ్లో జనవరి 12న వడుదల కానుంది. కానీ తెలుగులో మాత్రం సంక్రాంతి తర్వాత విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సంబంధించిన నటులు సినిమా ప్రమోషన్స్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అమెరికన్ నటుడు 'ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్' కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్లో ఆయన బ్రిటిష్ అధికారిగా నటించాడు. గతంలో కూడా RRR చిత్రంలో ఎడ్వర్డ్ పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. రాజన్న, షిర్డీ సాయి, కేసరి, సామ్ బహదూర్, మణికర్ణిక వంటి పాపులర్ చిత్రాల్లో ఆయన నటించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న 'ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్' కోలీవుడ్ హీరోల గురించి పలు విషయాలు షేర్ చేశాడు. ధనుష్ కాకుండా ఈ హీరోలు తెలుసా.. ? అని ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. అజిత్, సూర్య, విజయ్ ఫోటోలను అతని ముందు ఉంచగా... విజయ్ను మాత్రమే సరిగ్గా ఆయన గుర్తించాడు. 2005లోనే విజయ్ నటించిన చిత్రాన్ని చూశానని ఎడ్వర్డ్ చెప్పాడు. అతనిలో మంచి టాలెంట్ ఉందని అప్పుడే అనుకున్నానని ఆయన పేర్కొన్నాడు. దీంతో కోలీవుడ్లో విజయ్ ఫ్యాన్స్ ఈ అంశాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. తమ హీరో రేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. I have seen #ThalapathyVijay film in 2005 and liked him. - RRR and Captain Miller fame Edward Sonnenblick#TheGreatestOfAllTime @actorvijaypic.twitter.com/Hy8TdBTSw9 — Actor Vijay FC (@ActorVijayFC) January 7, 2024 -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ఫైట్ మాస్టర్
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు చేస్తున్న నటులు పెరుగుతున్నారు. దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు.. ఇలా అందరూ హీరోలు అయిపోతున్నారు. తాజాగా ప్రముఖ ఫైట్మాస్టర్ పీటర్ హెయిన్ కూడా కథానాయకుడిగా ఎంట్రీకి రెడీ అయిపోయాడు. ఎం.వెట్రి దర్శకత్వం వహించనున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ కథాచిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ అధినేత జేఎం బషీర్, యంటీ సినిమాస్ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నెలో పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రాజెక్ట్ ప్రారంభమైంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) నిర్మాతల్లో ఒకరైన బషీర్ మాట్లాడుతూ.. నేను, నా మిత్రుడు చౌదరి కలిసి ఫైట్మాస్టర్ పీటర్ హెయిన్ని హీరోగా పరిచయం చేస్తూ ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీయాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. అది ఇప్పటికి నెరవేరింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో పీటర్ హెయిన్ భాగమే. ఇప్పుడు ఆయన హీరోగా పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నాం. ఇకపోతే పీటర్ హెయిన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం తాను ఏమేం చేయగలనో అది చేస్తానని, ఇందులో అటవీ వాసీగా యాక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. సరికొత్త యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని అన్నాడు. ఇందులో నటించడానికి తాను ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!) -
'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!
డార్లింగ్ ప్రభాస్ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్గా ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు ఇతడి రేంజుని మ్యాచ్ చేయలేకపోయాయి. అయితేనేం ఇప్పుడు వచ్చిన 'సలార్' వాటన్నింటి గురించి మర్చిపోయేలా చేస్తోంది. తొలిరోజే ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ ఏడాది హయస్ట్ ఓపెనర్గా నిలిచింది. కానీ ఓ రికార్డ్ మాత్రం కొద్దిలో మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ 'సలార్' కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ వచ్చారు. హీరో ప్రభాస్, మాస్ కథ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. దీనికి కారణాలు అయ్యిండొచ్చు. విడుదలకు కొన్నిరోజుల ముందు సినిమాపై అందరూ డౌట్ పడ్డారు. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత ఇప్పట్లో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్-నార్త్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) అయితే నైజాంలో ఇప్పటికే పలు సినిమాలతో కింగ్ అనిపించుకున్న ప్రభాస్.. 'సలార్'తో మరోసారి దాన్ని నిరూపించుకున్నాడు. అయితే టాలీవుడ్ ట్రేడ్ సమాచారం ప్రకారం.. 'ఆర్ఆర్ఆర్' తొలిరోజు నైజాంలో రూ.23 కోట్ల 35 లక్షల కలెక్షన్ నమోదు చేయగా.. 'సలార్' రూ.22 కోట్ల 55 లక్షల దగ్గర వచ్చి ఆగిందట. అంటే కేవలం రూ.80 లక్షలు మాత్రమే తేడా. ఒకవేళ 'డంకీ', 'ఆక్వామెన్' లాంటి మూవీస్ ఏం లేకుండా 'సలార్' సోలోగా రిలీజై ఉంటే మాత్రం 'ఆర్ఆర్ఆర్'ని ప్రభాస్ ఈజీగా దాటేసేవాడు! ఇక 'సలార్'కి ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో శని-ఆదివారాలు కూడా చాలాచోట్ల షోలు హౌస్ఫుల్ అయిపోయాయి. అలానే పలుచోట్ల షోలు కూడా పెంచుతుండటం విశేషం. క్రిస్మస్ సెలవులు కూడా ఉండటం 'సలార్'కి చాలా ప్లస్ కానుంది. అదే టైంలో రూ.1000 కోట్ల మార్క్ కూడా కొన్నిరోజులు క్రాస్ చేసేయడం గ్యారంటీ. (ఇదీ చదవండి: సలార్ హిట్.. పవన్ కల్యాణ్ను ఆడుకుంటున్న నెటిజన్లు) The most violent man announced his arrival ⚠️#SalaarCeaseFire hits 𝟏𝟕𝟖.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) on the opening day! 𝐓𝐡𝐞 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐨𝐩𝐞𝐧𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐚𝐧𝐲 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐅𝐢𝐥𝐦 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑 💥#BlockbusterSalaar #RecordBreakingSalaar… pic.twitter.com/8FPzU8RB0I — Mythri Movie Makers (@MythriOfficial) December 23, 2023 -
సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ప్రభాస్ బంపర్ రికార్డ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా సలార్ సందడే కనిపిస్తుంది. చాలా ఎళ్ల తర్వాత ప్రభాస్ భారీ హిట్ కొట్టాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్తో సలార్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు కలెక్షన్స్ రూ. 178 కోట్లు రాబట్టినట్లు చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాతి స్థానంలో దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా RRR మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ రూ. 223 కోట్ల రికార్డ్ పదిలంగా ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్-2 రూ. 165 కోట్ల రికార్డ్ను సలార్ దాటేశాడు. దీంతో మొదటిరోజు బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో సలార్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ రెండు చిత్రాలు సౌత్ ఇండియా నుంచే ఉండటం విశేషం. కానీ ఈ ఏడాది రెండు వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన షారుక్ ఖాన్ మాత్రం డంకీ చిత్రంతో కలెక్షన్స్ పరంగా వెనుకపడ్డాడు. డంకీ చిత్రానికి మొదటిరోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. సలార్ దెబ్బతో డంకీ కలెక్షన్స్ రెండోరోజు మరింత క్షీణించాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. The most violent man announced his arrival ⚠️#SalaarCeaseFire hits 𝟏𝟕𝟖.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) on the opening day!𝐓𝐡𝐞 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐨𝐩𝐞𝐧𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐚𝐧𝐲 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐅𝐢𝐥𝐦 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑 💥#BlockbusterSalaar #RecordBreakingSalaar… pic.twitter.com/8FPzU8RB0I— Mythri Movie Makers (@MythriOfficial) December 23, 2023 -
సలార్ ముందు ఎన్నో భారీ రికార్డ్స్.. ఢీ కొట్టగలడా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. నేడు (డిసెంబర్ 22) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సలార్ అర్ధరాత్రి నుంచే థియేటర్లోకి వచ్చేశాడు. దీంతో అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్టుకోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సలార్కు వస్తున్న టాక్ చూస్తుంటే ప్రభాస్ భారీ హిట్ట్ కొట్టాడని తెలుస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో సలార్కు పాజిటివ్ టాక్ వస్తుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. సలార్ ఈ రికార్డ్స్ కొట్టగలడా..? ఈ ఏడాదిలో విజయ్,షారుక్ ఖాన్,రణబీర్ కపూర్ చిత్రాలు భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ స్టార్ హీరోల చిత్రాలు విడుదలైన మొదటిరోజే భారీ కలెక్షన్స్తో రికార్డు క్రియేట్ చేశారు. నేడు విడుదలైన సలార్ ఆ రికార్డ్స్ను దాటగలుగుతాడా అని చర్చ జరుగుతుంది. దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి. ఆ తర్వాత షారుఖ్ "జవాన్" మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 129.6 కోట్లు వసూలు చేసింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'యానిమల్' చిత్రం కూడా మొదటిరోజు రూ. 116 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు భారత్లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా RRR మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ రూ. 223 కోట్ల గ్రాస్గా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తాజాగా విడుదలైన సలార్ మొదటిరోజు కలెక్షన్స్ పరంగా ఏ రికార్డ్ కొట్టగలుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. కానీ సలార్ మొదటిరోజు కలెక్షన్స్ రూ. 150 కోట్లు దాటుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ. 600 కోట్లు సేఫ్ మార్క్ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సలార్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. 'బాహుబలి'ని మించి కొన్ని ఏరియాల్లో టికెట్ రేట్లు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్గా ఈ సినిమాకు రూ. 350 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. అంటే టార్గెట్ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ. 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సలార్కు రూ.150 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని టాక్ ఉంది. (ఇదీ చదవండి: Salaar X Review: ‘సలార్’మూవీ ట్విటర్ రివ్యూ) ఇదే నిజమైతే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు రూ.250 కోట్లు మేర గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. ఇక సౌత్ ఇండియాలో మిగిలిన రాష్ట్రాల్లో రూ.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. హిందీ వర్షన్ హక్కులు మాత్రం రూ.75 కోట్లకు అమ్ముడుపోయినట్లు టాక్. ఏదేమైనా సలార్ ఫుల్ రన్లో టార్గెట్ రూ. 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సలార్కు వస్తున్న టాక్ చూస్తుంటే చాలా రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం అని తెలుస్తోంది. -
మెగాహీరో రామ్ చరణ్కు మరో గ్లోబల్ అవార్డ్
మెగాహీరో రామ్ చరణ్ మరో ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ఆ తర్వాత కూడా పలు పురస్కారాలు దక్కించుకున్నాడు. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట చరణ్ ని అవార్డులు వరిస్తూనే ఉన్నాయి. తాజాగా అలా అమెరికాలో నిర్వహించే ఓ క్రేజీ అవార్డు ఇప్పుడీ మెగాహీరోకి దక్కింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!) అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్కి మరో గుర్తింపు దక్కింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డుల్లో భాగంగా ఈసారి రామ్ చరణ్.. గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్.. 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా వచ్చేలోపు చరణ్ని ఇంకెన్ని అవార్డులు వరిస్తాయనేది చూడాలి. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) #POPGOLDENAWARDS2023 GOLDEN BOLLYWOOD ACTOR OF THE YEAR AWARD WINNER REVEALED!! CONGRATULATIONS TO #RAMCHARAN For the well deserved honor!! pic.twitter.com/nzfZG1BxDS — POP GOLDEN AWARDS (@popgoldenawards) December 8, 2023 -
KGF 3, RRR 2 షాకింగ్ అప్ డేట్స్.. పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్
-
ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్లో...
రామ్ చరణ్కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించిన ‘మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్’ జాబితాలో రామ్చరణ్కి సభ్యత్వం దక్కింది. ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకుగాను చరణ్కి ఈ స్థానం లభించింది. కాగా ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఆ మధ్య విడుదల చేసిన యాక్టర్స్ బ్రాంచ్లో తెలుగు నుంచి ఎన్టీఆర్కి చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా రామ్చరణ్తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీనటులకు ఈ కమిటీలో చోటు దక్కింది. ‘‘ఈ నటులు వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. వారి కళతో సాధారణ సినిమాతో ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. అలాంటి వారిని ‘యాక్టర్స్ బ్రాంచ్’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా ఆస్కార్ అకాడమీ ప్రతినిధులు షేర్ చేశారు. కాగా 96వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. -
రామ్ చరణ్కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో రామ్ చరణ్కు చోటు దక్కింది. 'వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. అంకితభావంతో బాగా హావభావాలను ప్రదర్శించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణంపోశారు. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. అలాంటి వారిని ‘యాక్టర్స్ బ్రాంచ్’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ పెళ్లి.. మెగా ఫోటో షేర్ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే) ఇక 96వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ లిస్ట్లో రామ్ చరణ్తో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే జూ. ఎన్టీఆర్కు అందులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు రామ్చరణ్కు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ సినిమాతో హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో వారి అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో 'గేమ్ ఛేంజర్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీని షూటింగ్ హైదరాబాద్ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రంలోని తొలిపాటను విడుదల చేయనున్నన్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో హీరోయిన్గా కియారా అడ్వాణీ నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2024లో విడుదల కానుంది. -
వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం విహార యాత్రలో ఉన్నాడు. భార్య, కూతురితో కలిసి ఇటలీ వెళ్లాడు. అలాంటిది ఇప్పుడు వీడియో కాల్లో కొందరికీ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. అసలేం జరిగింది? చరణ్ ఎందుకు సారీ చెప్పాడనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు) ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీనితో పాటు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఎప్పటికప్పుడు ఏదో కార్యక్రమానికి హాజరవుతూనే ఉంది. తాజాగా మన దేశంలో జర్మనీ యూనిటీ డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి. 'ఆర్ఆర్ఆర్' టీమ్ తరఫున కీరవాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. నాటు నాటు పాటని జర్మనీలో పాడారు. దీనికి వేడుకలో ఉన్న జర్మనీ ఎంబసీ అధికారులందరూ డ్యాన్స్ కూడా చేశారు. అయితే తాను వ్యక్తిగత పనుల మీద ఇటలీ వెళ్లానని, తను రాలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నానని వీడియో కాల్లో రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఇది విడుదల కానుంది. (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) View this post on Instagram A post shared by German Embassy New Delhi (@germanyinindia) -
రాజమౌళి బర్త్డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?
ఎస్ఎస్ రాజమౌళి.. ఇది పేరు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు. వేలకోట్ల వసూళ్లని రుచి చూపించాడు. ఫ్లాప్ అనే పదాన్ని తన డిక్షనరీలో లేకుండా చేశాడు. టాలీవుడ్ స్టార్స్ కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డుని తన మూవీతో సాధించాడు. అలాంటి రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబరు 10). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు ఆస్తులు ఎంత సంపాదించాడనేది చూద్దాం. సీరియల్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి.. 'స్టూడెంట్ నం.1'తో సినిమా డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ, తెలుగు సినిమాకి సరికొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చాడు. ఇక 'బాహుబలి'తో పాన్ ఇండియా లెవల్లో విధ్వంసం సృష్టించి, 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ రేంజుకి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు 12 సినిమాలు తీసిన రాజమౌళి.. దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే!) సినిమా ప్రమోషన్స్ తప్ప బయట పెద్దగా కనిపించని రాజమౌళికి హైదరాబాద్ మణికొండలోని ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. అలానే సిటీ చివర్లో ఫామ్ హౌస్ తో పాటు స్థలాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అలానే పలు నగరాల్లో ఫ్లాట్స్ కూడా ఉన్నట్లు సమాచారం. అలానే సినిమా ప్రొడక్షన్ కూడా చేస్తున్నారట. ఇవన్నీ పక్కనబెడితే రాజమౌళి దగ్గర బీఎండబ్ల్యూ 7 సిరీస్, రేంజ్ రోవర్, వోల్వ్ తదితర ఖరీదైన కార్లు ఉన్నాయట. అలా ఓవరాల్ గా రూ.158 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అందనంత రేంజ్కి వెళ్లిపోయిన రాజమౌళి షారితోషికం మిగతా డైరెక్టర్స్తో పోలిస్తే చాలా ఎక్కువ. ఇదిలా ఉండగా సూపర్స్టార్ మహేశ్బాబుతో రాజమౌళి.. తర్వాతి సినిమా చేయబోతున్నాడు. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. వచ్చే ఏడాది ఏప్రిల్లో సెట్స్పైకి వెళ్తుందని అంటున్నారు. ఇదో జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ అని టాక్. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: సడన్గా హౌస్లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్!)
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మనం చేయలేదా?: రేవంత్
విరాట్ కోహ్లి సింగిల్ హ్యాండ్ సిక్స్.. వీడియో వైరల్
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement