school bus
-
పెద్ద అంబర్పేట్లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పెద్ద అంబర్పేట్లో విషాదం జరిగింది. హయత్నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిని స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. బాలిక రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా వ్యాన్ను డ్రైవర్ రివర్స్ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. శంకర్పల్లి మండల పరిధిలోని ఎన్సీడీ రాయల్ పెవిలియన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ మండల కేంద్రానికి చెందిన శ్రీహర్ష(19)కు దొంతన్పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. దీంతో అతని తల్లి మోకిలతండాలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటూ కొడుకును చదివిస్తోంది. శ్రీహర్ష నిత్యం బైక్పై కాలేజీకి వెళ్లివస్తుంటాడు.ఇదిలా ఉండగా బుధవారం కళాశాల ముగిసిన తర్వాత ఉప్పల్కు చెందిన క్లాస్మేట్ హర్షనందన్(19)ను తీసుకుని ఫ్రెషప్ అయ్యేందుకు మోకిలతండాకు వచ్చారు. సుమారు గంటపాటు రూంలో గడిపిన అనంతరం హర్షనందన్ను కాలేజీ వద్ద వదిలిపెట్టేందుకు బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. ఎన్సీడీ రాయల్ పెవిలియన్ సమీపంలో కొండకల్ వైపు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఏపీ మోడల్ పాఠశాల బస్సు వీరిని బలంగా ఢీ కొట్టింది. బైక్ నడుపుపుతున్న శ్రీహర్షకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. హర్షనందన్ పాక్షిక గాయాలతో బయటపడ్డాడు. అతన్ని శంకర్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు శ్రీహర్ష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వాట్సాప్లో మునిగిపోవడం వల్లే ఘోరం!
తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.అప్పటికే ఆలస్యమైంది..శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
తప్పిన పెను ప్రమాదం
కీసర: ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొడుతూ వెళ్లి ముందున్న చెట్టు కు ఢీకొని నిలిచిపోయింది. విప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులున్నారు. వీరిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం కీసర మండలం కుందన్పల్లి చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. చీర్యాల చౌరస్తాలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు రోజు మాదిరిగానే కీసర, కీసరదాయర, రాంపల్లి దాయర, గోధుమకుంట, కుందన్పల్లిల నుంచిద్యార్థులను తీసుకుని వస్తోంది. ఈక్రమంలో కుందన్పల్లి చౌరస్తా సమీపంలో ఎదురుగా వచి్చన కారును తప్పించడానికి డ్రైవర్ బస్సును పక్కకు తిప్పాడు. వేగంతో బస్సు అదుపు తప్పి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని కొట్టింది. స్తంభం విరిగి కింద పడిపోయింది. ఆ ధాటికి మరో రెండు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. కరెంటు తీగలు బస్సుపై పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సు అదే వేగంతో చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. కాగా.. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బస్సు ఢీకొని ఉంటే పెను ప్రమాదమే సంభవించేది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ రాజు బస్సును అక్కడే వదిలేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. స్థానికంగా ఉన్న ప్రజలు, అటుగా వెళ్తున్న వాహనదారులు విద్యార్థులను బస్సులోంచి బయటకు దింపారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను వాహనాల్లో ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
స్కూల్ బస్సుకు మంటలు..
బ్యాంకాక్: విహార యాత్రకు పాఠశాల విద్యార్థులు, టీచర్లతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ విషాద ఘటనలో 20 మంది విద్యార్థులు సహా 23 మంది సజీవ దహనమయ్యారు. థాయ్ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారులో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సెంట్రల్ ఉథ్థాయ్ థని ప్రావిన్స్కు చెందిన స్కూల్ విద్యార్థులు, టీచర్లు కలిపి మొత్తం 44 మందితో అయుథ్థయ, నొంతబురి ప్రావిన్స్ల్లో విహారయాత్రకు బస్సులో బయలుదేరారు.నొంతబురి వైపు వెళ్తుండగా బస్సు ముందు టైరు పగిలి, అదుపుతప్పి రోడ్డుపక్క రెయిలింగ్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని 20 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ఆహుతయ్యారు. గాయపడిన ముగ్గురు విద్యార్థులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఘటనపై దర్యాప్తు ముగిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. -
స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థుల మృతి
బ్యాంకాక్: థాయ్లాండ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం బ్యాంకాక్లో విద్యార్థుల బస్సులో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదలో బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు స్వల్పంగా గాయాలు అయినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మృతదేహాలను కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.Thailand School bus Fire Update-Initially...there were 10 fatalities.! and many injured. #Bangkok #โหนกระแส #ไฟไหม้ #ไฟไหม้รถบัส #Thailand #Schoolbus #Fire #ประเทศไทย #รถดับเพลิง pic.twitter.com/lVgc9LZdLy— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024 ట్రల్ ఉథాయ్ థాని ప్రావిన్స్ నుంచి స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్తున్న సమయంలో బ్యాంకాక్ ఉత్తర శివారు ప్రాంతమైన పాతుమ్ థాని ప్రావిన్స్ వద్ద మధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయని రవాణా మంత్రి సూర్యా జుంగ్రుంగ్రూంగ్కిట్ తెలిపారు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించటం పూర్తి చేయనందున మరణాల సంఖ్యను ఇంకా ధృవీకరించలేకపోయారని మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ మీడియాకు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారి సంఖ్య ఆధారంగా ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు.School bus after fire. #ไฟไหม้รถบัสที่วิภาวดี #ไฟไหม้รถบัส #ไฟไหม้ #รถบัสไฟไหม้ #รถบัส #โหนกระแส #Thailand #Schoolbus #ประเทศไทย https://t.co/UdnhJSiPCb— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024ఈ ఘటనపై ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా ఎక్స్లో స్పందించారు. ‘ఈ ప్రమాదంలో గాయపడినవారికి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తాం’’ అని అన్నారు. విద్యార్థుల వయస్సు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. బస్సు టైర్లలో ఒకటి పేలడంతో అదుపుతప్పి.. మంటలు చెలరేగాయని సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు పోలీసులకు తెలిపారు.చదవండి: హిజ్బుల్లా నస్రల్లా హత్య ప్లాన్.. బంకర్లోకి విషవాయువులు! -
శంషాబాద్-బెంగళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం
-
శంషాబాద్లో స్కూల్ బస్సు బీభత్సం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ బెంగుళూరు హైవే పై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది.గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సుతో పాటు డ్రైవర్ ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: బస్సు డ్రైవర్కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని కాపాడి
తమిళనాడు పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యాన్ డ్రైవర్ తను మరణిస్తూ.. 20 మంది పిల్లల ప్రాణాలను కాపాడాడు. డ్రైవర్ సాహాసాలను మెచ్చిన సీఎం స్టాలిన్ అతడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తిరూప్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది..వివరాలు.. వెల్లకోయిల్లో బుధవారం సెమలయ్యప్పన్ అనే 49 ఏళ్ల బస్సు డ్రైవర్ ఓ ప్రైవేటు పాఠశాలకు నుంచి విద్యార్ధులను వాళ్ల ఇంటి వద్ద దింపడానికి బయల్దేరాడు. దారి మధ్యలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రాడంతో బస్సు డ్రైవర్ అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. అతని భార్య కూడా అదే స్కూల్లో హెల్పర్గా పనిచేస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా అందులోనే ఉంది.బస్సు రోడ్డు పక్కన ఆగిన కాసేపటికే అతడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే డ్రైవర్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అతడు మరణించే ముందు సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ వీరోచిత చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.మృత్యువు అంచున ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, అతను పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు మేము ఆయనకు నమస్కరిస్తున్నాము’. అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మృతుడు సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే మంత్రి ఎంపీ సామినాథన్ మృతుల కుటుంబాలకు చెక్కును అందజేశారు. -
భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు
-
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
నెల్లూరు జిల్లా: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి దగ్గర జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా? అతివేగమా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తాబస్సు క్లీనర్ మృతి పలువురు విద్యార్థులకు గాయాలు.హుటాహుటిన గాయపడిన విద్యార్థులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ప్రమాదానికిగల కారణాలు పూర్తి… pic.twitter.com/x5CKlHCjen— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024 -
తెలంగాణలో మోగిన బడి గంట.. ఆర్టీఏ అలర్ట్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో బడి గంట మోగింది. వేసవి సెలవుల అనంతరం గవర్నమెంట్, ప్రైవేట్ బడులన్నీ తెరుచుకున్నాయి. మరోవైపు విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఉదయం నుంచి అన్ని స్కూల్స్, కాలేజీల బస్సుల ఫిట్నెస్లను పరిశీలిస్తున్నారు. ఫిట్గా లేని బస్సులు, వ్యాన్లను సీజ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇవాళ్టి నుంచి బడులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. నిన్ననే స్పెషల్ డ్రైవ్ పేరిట చెకప్ లిస్ట్ పంపించారు అధికారులు. అయినా కొన్ని విద్యా సంస్థలు బస్సులు, వ్యాన్లను ఆర్టీఏ కార్యాలయాలకు ఫిట్నెస్ టెస్టులకు పంపలేదు. దీంతో అధికారులే రంగంలోకి దిగి దాడులు నిర్వహిస్తున్నారు. ఇక.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. -
స్కూలు బస్సు బోల్తా... ఎనిమిదిమంది చిన్నారులు దుర్మరణం!
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిదిమంది చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈరోజు(గురువారం) ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. కనీనా పట్టణం సమీపంలోని కనీనా- దాద్రి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బస్సు అతి వేగంతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కనీనాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్కు చెందినది. విద్యార్థులతో వెళుతున్న ఈ బస్సు ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది విద్యార్థులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను రోహ్తక్ పీజీఐకి తరలించారు. ఈద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పలు ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. ఇదే కోవలో జీఎల్ పబ్లిక్ స్కూల్కు కూడా సెలవు ఇవ్వలేదు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం మహేంద్రగఢ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం నుంచి ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన రాలేదు. -
బడి బస్సులే యమపాశాలై!
హైదరాబాద్: చిన్నారుల పాలిట స్కూల్ బస్సులు యమదూతల్లా మారాయి. అభం శుభం తెలియని బాలలను బలిగొంటున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు మృత్యవాతపడుతున్నారు. డ్రైవింగ్లో అనుభవం, నైపుణ్యం లేకుండానే స్కూల్ బస్సులను నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డుపై పాదచారులను, చిన్నారులను గమనించకుండానే వాహనాలను నడపడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. హబ్సిగూడలో గురువారం నాటి ఘటనే ఇందుకు ఉదాహరణ. బస్సు ఆగినప్పుడు, తిరిగి బయలుదేరే సమయంలో విధిగా ముందూ వెనకా గమనించాలి. బస్సులో ఉండే సహాయకులు కిందకు దిగి అన్నివైపులా చూసి డ్రైవర్కు సంకేతం ఇవ్వాలి. కానీ.. ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలను కూడా పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు పిల్లలను బస్సెక్కించేటప్పుడు, దిగిన తర్వాత తిరిగి ఇళ్లకు తీసుకెళ్లే సమయంలో తమ వెంట ఉండే చిన్నారులను గమనించకపోవడంతోనూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తనిఖీలు తూతూమంత్రం రహదారి భద్రతలో భాగంగా బడి బస్సుల నిర్వహణపై రవాణాశాఖ ప్రత్యేక శ్రద్ధ వహించడంలేదు. కొంతకాలంగా అధికారుల ఉదాసీనత, డ్రైవర్లపై కొరవడిన నియంత్రణ ప్రమాదాలకు దారితీస్తోంది. ఏటా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకొనే సమయానికి అన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాలకు చెందిన తనిఖీ అధికారులు విధిగా బస్సులను తనిఖీలు చేసి వాటి సామర్థ్యాన్ని నిర్ధారించాలి. డ్రైవర్ల అనుభవంపైనా అధికారులకు కచ్చితమైన అవగాహన ఉండాలి. విద్యాసంస్థల యజమానులు డ్రైవర్లను నియమించుకొనే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలి. కానీ.. రవాణా అధికారులు ఏడాదికి ఒకసారి మొక్కుబడి తనిఖీలకు మాత్రమే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్కూల్ బస్సుల నిర్వహణలో విద్యాసంస్థల వైఫల్యం కూడా ఉంది. రూ.లక్షల్లో ఫీజులు తీసుకొనే కార్పొరేట్ స్కూళ్లు బస్సుల నిర్వహణలో దారుణంగా వ్యవహరిస్తున్నాయి. డ్రైవర్ల నియామకం, సహాయకుల ఏర్పాటుపై అశ్రద్ధ చూపుతున్నాయి. లారీలు, గూడ్స్ వాహనా లను నడిపేవారికి పిల్లల బస్సులను అప్పగించడంతో ర్యాష్ డ్రైవింగ్, ఓవర్స్పీడ్కు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం బాధ్యులే.. పెద్ద పిల్లలను స్కూల్ బస్సెక్కించే సమయంలో వారితో పాటు చిన్నారులను బయటకు తీసుకురావడం ఒక నిర్లక్ష్యపు అలవాటుగా మారింది. బయటకు వచ్చిన తర్వాత తమ వెంట మరో పాప, లేదా బాబు ఉన్నారనే విషయాన్ని మరిచి.. పెద్ద పిల్లలను బస్సెక్కించడంలోనే నిమగ్నమవుతున్నారు. చాలాసార్లు ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటిసమయాల్లో చిన్నవారిని ఇంటి నుంచి బయటకు రానివ్వకపోవడమే మంచిది. ఒకవేళ బయటకు తీసుకొచ్చినా ఒక చేత్తో పట్టుకొని ఉండడం మరిచిపోవద్దు. మరోవైపు స్కూల్ బస్సు నడిపే డ్రైవర్కు రవాణా అధికారులు ఆమోదించిన లైసెన్స్, అనుభవం వంటి అంశాలను కూడా పరిశీలించాలి. పేరెంట్స్ కమిటీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. డ్రైవర్లకు రిఫ్రెషర్ శిక్షణ అవసరం.. ► బస్సులను నడిపే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై పాఠశాల యాజమాన్యం డ్రైవర్లు, అటెండర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ► రవాణా అధికారుల పర్యవేక్షణలో డ్రైవర్లకు తప్పనిసరిగా రిఫ్రెషర్ శిక్షణ కోర్సులను నిర్వహించాలి. ► సాధారణంగా రోజూ నడిపే డ్రైవర్ లేని సమయంలో కొత్త వారికి బస్సులను అప్పగిస్తారు. ఇలా ప్రత్యామ్నాయ డ్రైవర్ను ఎంపిక చేసేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం. ► నిలిపి ఉంచిన స్కూల్ బస్సుల వద్దకు పిల్లలు వెళ్లకుండా జాగత్తలు పాటించాలి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ప్రమాదాలిలా.. ► గత జూలైలో ఆదిభట్లలో ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ► ఆగస్ట్లో బాచుపల్లిలో ఓ స్కూల్ బస్సు బైక్ను ఢీకొన్న ఘటనలో రెండో తరగతి చిన్నారి అక్కడికక్కడే కన్నుమూసింది. ఇదే నెల 28న సునీత అనే పారిశుద్ధ్య కార్మికురాలిని ఒక మెడికల్ కాలేజీ బస్సు ఢీకొట్టడంతో ఆమె కన్నుమూశారు. ► సెప్టెంబర్లో ఇబ్రహీంపట్నం వద్ద ఓ స్కూ ల్ బస్సు ఇద్దరు చిన్నారులను ఢీకొంది. ► నవంబర్ 2న సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న స్కూల్ బస్సు డ్రైవర్ తండ్రితో కలిసి రోడ్డు దాటుతున్న మూడేళ్ల చిన్నారిని ఢీకొట్టాడు. ► నవంబర్ 19న ఆనంద్నగర్లో రెండున్నరేళ్ల చిన్నారి స్కూల్ బస్సు.. ముందు చక్రాల కింద నలిగిపోయింది. ► డిసెంబర్ 15న బీఎన్రెడ్డినగర్లో నాలుగేళ్ల చిన్నారిని స్కూల్ బస్సు ఢీకొట్టింది. ► జనవరి 4వ తేదీన హబ్సిగూడలో ఏడాదిన్నర చిన్నారి స్కూల్ బస్సు చక్రాల కిందపడి అసువులు బాసింది. -
స్కూల్ బస్ కిందపడి రెండేళ్ల పాప మృతి
హైదరాబాద్: హబ్సిగూడలో దారుణం జరిగింది. హబ్సిగూడ రవీంద్రనగర్ లో జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి చెందింది. విరరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. తండ్రి దగ్గరకు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో కదులుతున్న బస్ కింద పడింది. దీంతో పాప అక్కడిక్కడే మృతి చెందింది . సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. -
స్కూలు బస్ డ్రైవర్ ఘాతుకం
యశవంతపుర: అభం శుభం తెలియని 8వ తరగతి బాలికను లోబర్చుకున్న సదరు పాఠశాల బస్సు డ్రైవర్.. చివరకు జనం ఏమంటారోనని భయపడి బాలికతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కమగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జిల్లా అజ్జంపుర తాలూకా గిరియాపుర గ్రామంలోని జ్ణానదీప ప్రైవేట్ స్కూల్ ఉంది. అందులో బాలిక (14) 8వ తరగతి చదువుతోంది. ఆమె రోజూ స్కూలు బస్సులో ఇంటికి వచ్చి వెళ్లేది. ఆమెపై తండ్రి వయసున్న బస్సు డ్రైవర్ సంతోష్ (38) కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రేమ దోమ అంటూ షికార్లకు తీసుకెళ్లాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు దండిస్తారని భయపడిన సంతోష్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తనతో పాటు బాలికను కూడా బలిగొనాలని కుట్ర పన్నాడు. సోమవారం విద్యారి్థని సమీపంలోని రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లి అక్కడ ఇద్దరూ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్కూలు యాజమాన్యంపై కేసు ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నందున వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. తమ కూతురు కనిపించడం లేదని స్థానిక అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వారు స్పందించి ఉంటే ప్రాణాలతో దక్కి ఉండేదని తల్లిదండ్రులు విలపించారు. -
రెండు స్కూల్ బస్సులు ఢీ
జడ్చర్ల టౌన్ (తిమ్మాజిపేట): నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్ సమీపంలో సోమవారం రాత్రి రెండు స్కూల్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. జడ్చర్ల మండలం నాగసాల సమీపంలో ఉన్న ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులను రెండు బస్సులలో సోమవారం బిజినేపల్లి మండలం వట్టెం దేవాలయానికి వెళ్లి అక్కడ పూజలు ముగిశాక పాఠశాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. స్కూల్ బస్సులు రెండు ఒకదాని వెంట మరోటి ప్రయాణిస్తున్నాయి. ఈ సమయంలో మరికల్ సమీపంలో ఎదురుగా ఉన్న కారును తప్పించేందుకు ముందు వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయటంతో వెనకాలే వస్తున్న మరో బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులకు ఏం జరిగిందో తెలియక కేకలు పెట్టారు. రెండు రెండు బస్సుల్లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ముందు సీట్లకు గుద్దుకున్నారు. కొందరు విద్యార్థులకు మూగదెబ్బలు తగలగా నిఖిల్, భాను, చైతన్య, జానకిరాం, విద్వాన్, సాయితేజలకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ప్రైవేట్ వాహనాల్లో జడ్చర్ల పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో బస్సుల వెనకాల మరో వాహనం లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. భారీ వాహనం వచ్చిఉంటే ప్రమాద తీవ్రత అధికంగా ఉండేది. ఘటనా స్థలానికి స్కూల్ ప్రతినిధులు చేరుకుని విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు తీసుకువెళ్లారు. -
సీఎం జగన్ బర్త్డే.. ఉదారత చాటుకున్న దాదాశ్రీ ఫౌండేషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ('దాదా' అని ప్రేమగా పిలుస్తారు) పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్రలోని ఆయన అభిమానుల సంఘం ఎన్జీవో ‘దాదాశ్రీ ఫౌండేషన్ తమ ఉదారతను చాటుకుంది. ఏపీ ప్రజల సంక్షేమం పట్ల సీఎం నిబద్దత, నాయకత్వాన్ని మెచ్చుకుంటూ కాక కాకడే, ధోకేశ్వర్లోని మాతోశ్రీ గ్లోబల్ స్కూల్ & జూనియర్ కాలేజీకి 54 సీట్ల పాఠశాల బస్సును విరాళంగా అందజేసింది. విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రూ. 33 లక్షల విలువైన ఏసీ బస్సును విరాళంగా అందించి ఓదార్యం చాటుకుంది. బస్సు అందించడంపై పాఠశాల యాజమాన్యం స్పందించింది. ఫౌండేషన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ బస్సు గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు చేరవేసేందుకు గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపింది. పాఠశాల విద్యార్ధులు సైతం సీఎం జగన్ ఫోటోతో కృతజ్ఞత తెలిపారు. -
బస్సు చక్రాల కింద నలిగి బాలుడి మృతి
హైదరాబాద్: అప్పటిదాకా అక్క, అన్నయ్యతో సరదాగా ఆడుకుంటూ గడిపిన మూడున్నరేళ్ల బాలుడిని స్కూల్ బస్సు చిదిమేసిన హృదయ విదారక ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. చిరునవ్వులతో తమ వెంట ఉన్న చిన్నారి కళ్లెదుటే క్షణాల్లో అసువులు బాయడంతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి. శుక్రవారం చర్లపల్లి పోలీస్స్టేషన్ పరి«ధిలోని బీఎన్రెడ్డినగర్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి వివరాల ప్రకారం.. బీఎన్రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న నీల మౌనికకు ఇద్దరు కుమారులు హేమంత్ (9), మూడున్నరేళ్ల ప్రణయ్తో పాటు కూతురు స్నేహ ఉన్నారు. భర్తతో విభేదాలు రావడంతో మౌనిక రెండేళ్లుగా బీఎన్రెడ్డి నగర్లోని పుట్టింట్లో నివాసం ఉంటోంది. ఇళ్లల్లో పని చేసుకుంటూ పిల్లలను చదివిస్తోంది. శుక్రవారం హేమంత్, స్నేహ స్కూల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు ప్రణయ్ను అమ్మమ్మ కనకమ్మ ఇంటి అరుగుపై కూర్చొబెట్టిన తల్లి మౌనిక.. హేమంత్, స్నేహలను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది. అదే సమయంలో ప్రణయ్ అరుగు దిగి రోడ్డుపైకి వచ్చాడు. దీనిని గమనించకుండా డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ప్రణయ్ ముందు చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగును తలపించింది. మృతుడి తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడి మేనమామ వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
హైదరాబాద్: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: జవహర్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో ఘటన జరిగింది.. సోదరుడికి తోడుగా స్కూల్ బస్సు వద్దకు వచ్చిన చిన్నారి భవిష్య.. ప్రమాదవశాత్తు రచన గ్రామర్ హైస్కూల్ బస్సు ముందు చక్రాల కింద పడింది. బస్సు డ్రైవర్ ప్రవీణ్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది చిన్నారులు..
సాక్షి, వికారాబాద్: స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 40 మంది పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పడంతో పేరెంట్స్, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వికారాబాద్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. 40 మంది స్కూల్ పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్కు చెందిన మినీ బస్సు ప్రమాదానికి గురైంది. సుల్తాన్పూర్ వద్ద ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో నీటిలో ఉన్న బస్సులోకి నుంచి స్థానికులు.. విద్యార్థులను కాపాడారు. ఇక, సదరు బస్సును న్యూ బ్రిలియంట్ స్కూల్కు చెందిన వాహనంగా గుర్తించారు. కాగా, బస్సు స్టీరింగ్ పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రమాదం నేపథ్యంలో పాఠశాల యాజమాన్యంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నివేదిక వచ్చేవరకు జీవో 111కు కట్టుబడి ఉంటాం -
స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. ఎమ్మెల్యే భార్య, విద్యార్థులకు గాయాలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. నర్సంపేటలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కమలాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు, నర్సంపేట ఎమ్మెల్యే సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ధ్వంసం కాగా.. ఆమె కూడా గాయపడ్డారు. అయితే కారులో ఉండే బెలున్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో వెంటనే స్వప్నను వరంగల్ ఆసుపత్రికి తరలించగా.. విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో విద్యార్థులు గాయపడటంతో స్థానికులతో పాటు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భార్యను పోలీసులు సేవ్ చేసే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యుల కోసమే ఉన్నారా అని పోలీసులను పేరెంట్స్ నిలదీశారు. ఎమ్మెల్యే వాహనం అతివేగంతో వెళ్ళిన విజువల్స్ అక్కడున్న సీపీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇది కూడా చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా -
మహబూబాబాద్ జిల్లా బొడ్లాడ శివారులో స్కూల్ బస్ బోల్తా
-
చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి అనంత లోకాలకు చేరు కుంది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబళించుకుపోయింది. అమ్మా అంటూ ఆ బాలిక చివరి ఆర్తనాదాలు పెట్టింది. ఈ హృదయవిదారక సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలం కుర్మల్గూడలోని రాజీవ్గృహకల్పలో నివ సించే మిర్యాల విజయలక్ష్మి, వేణుగోపాల్ దంపతులు. వారికి ముగ్గురు సంతానం. వారిలో పెద్దపాప హితిషా, చిన్నపాప భావన (6), కుమారుడు భానుప్రసాద్ ఉన్నారు. మల్లాపూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు. భావన యూకేజీ చదువుతోంది. సోమవారం ఉదయం బడికి వెళ్లిన పిల్లలు సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు. భావన ఆడుకోవడానికని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇంటి ముందు ఆడుకుంటుండగా బాలా పూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు (టీఎస్ 07యుజీ 3293) డ్రైవర్ చూసుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో భావనను ఢీకొట్టాడు. చిన్నారి తలమీద నుంచి బస్సు వెళ్లడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అప్పటి వరకు ఆనందంగా ఆడుకుంటున్న బిడ్డ అంతలోనే అనంతలోకాలకు చేరడంతో వారి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ప్రమాదానికి కారణమైన బస్సు ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళన చేస్తున్నవారికి సర్దిచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం.. స్కూల్ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి
సాక్షి, తూర్పుగోదావరి: బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఈశ్వర్(6) తన తండ్రితో కలిసి బైక్పై స్కూల్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆల్కాట్ తోట సమీపంలోని ఐఓసి వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు బస్సు కిందపడి అక్కడికక్కడే మరణించాడు. బైక్ నుంచి పక్కకు పడిన బాలుడి తండ్రికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన మృతుని బంధువులు రాళ్లతో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ కడప: జిల్లాలోని జమ్మలమడుగులో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంట్లో నుంచి చిన్నారి సఫినా స్కూల్ బస్సులో పాఠశాలకు బయల్దేరింది. అయితే పాఠశాలకు చేరుకున్నాక బస్సు దిగుతుండగా కాలు జారి కిందపడిపోయింది. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్ బస్సును ముందుకు వెళ్లనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చదవండి: మాజీ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీ వెనుక భారీ కుట్ర -
ఫిట్'లెస్' బడి బస్సులు... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ అయిన స్కూల్ బస్సులు 224 ఉన్నాయి. ఒక్కో బస్ ఫిట్నెస్ పరీక్షకు సంవత్సరానికి ఒకసారి రూ.5వేలు ఖర్చవుతుంది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తాయి. ఈ లెక్కన ఒక బస్ సీటింగ్ కెపాసిటీ ఆధారంగా 40 మందికి నెలకు రూ.40 వేలు వసూలు చేస్తారు. కానీ జిల్లా వ్యాప్తంగా 85 బస్సులు ఇప్పటివరకు ఫిట్నెస్ చేయించుకోకుండా వారి స్వలాభం కోసం అలాగే నడుపుతున్నారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే స్కూలు యాజమాన్యాలు కేవలం ఫిట్నెస్ కోసం రూ.5 వేలు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నాయి. నిర్మల్చైన్గేట్: విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను తరలించే వాహనాలకు యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ పాఠశాలలు ప్రారంభమై పది రోజులు కావస్తున్నా యాజమాన్యాలు ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ నెల 12 వరకు అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. అయినా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన బస్సులు 224 ఉండగా ఈ నెల 22 వరకు 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 85 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం జిల్లాలోని 208 ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 35 వేలకు పైబడి విద్యార్థులు చదువుతున్నారు. పిల్లల ను పాఠశాలల నుంచి తీసువెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వేలకు వేలు ఫీజులు గుంజుతున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల ప్రా ణాలతో చెలగాటమాడుతున్నాయి. జిల్లాలో 224 బ స్సులు ఉండగా 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పొందినట్లు సంబంధిత అధికారులు తెలి పారు. పలు ప్రాంతాల్లో కళ్లముందే ప్రమాదాలు కని పిస్తున్నప్పటికీ అటు అధికారులు, ఇటు యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఫిట్నెస్పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొనసాగుతున్న దళారుల దందా... అమ్మానాన్నలకు బైబై చెప్పి బడికి బయలుదేరుతు న్న చిన్నారులను భద్రంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలది. ఈ బస్సులకు ‘ఫిట్నెస్’ జారీ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) కార్యాలయాల్లో దళా రుల దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వాహనానికి వేలల్లో మామూళ్లు ఇస్తేనే సర్టిఫికెట్ జారీ అవుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తాము అధికారులకు కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోందని దళారులు బాహాటంగానే చెబుతున్నారు. చేతులు తడిపిన యా జమాన్యాల వాహనాలకు సర్టిఫికెట్లు జారీచేస్తుండగా కరోనా కష్టాల నుంచి ఇంకా కోలుకోని కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఏజెంట్లు అడిగినంత ఇవ్వలేక అవస్థలు పడుతున్నాయి. ఫలితంగా బడులు ప్రారంభమైనా ఇప్పటివరకు 85 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ కాకపోవడం గమనార్హం. తనిఖీల జాడేది? విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 11 రోజులు గడుస్తున్నా ఆర్టీఏ అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించడం లేదు. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులను ఎటువంటి ఫిట్నెస్ లేకుండానే యథేచ్ఛగా తిప్పుతున్నాయి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష చేయించాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు, డిజిగ్నీషన్, సెల్ నంబర్, బస్సు మోడల్, డ్రైవర్ వివరాలు, అటెండెంట్, ఫొటోలు, బస్సు నడిచే మార్గం, సీట్ల పరిమితి, తదితర విషయాలను నమోదు చేయాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా వాహనంలో మెడికల్ కిట్లు, గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, సీట్ల మధ్య రాడ్లు అమర్చి ఉండాలి. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు, దిగేందుకు అనుకులంగా 325 మి.మీ ఎత్తు ఉండేలా బస్సు మెట్లు ఉండాలి. ● ఆపద సమయంలో బయటకు దిగేందుకు అత్యవసర ద్వారం తప్పకుండా ఏర్పాటు చేసి ఉండాలి. ● విద్యార్థులు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు డ్రైవర్కు కనబడేలా రెండు వైపులా సైడ్ అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలి అమర్చి ఉండాలి. ● వాహనం టైర్లు, బ్రేక్లు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. బస్సుపై ఏ పాఠశాలకు చెందిందో తెలిపేలా పూర్తి వివరాలు రాసి ఉంచాలి. ● పాఠశాల వాహనాలు నడిపే డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. ● రాత్రి వేళల్లో బస్సులను గుర్తుపట్టేలా నాలుగు వైపులా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి. ఫిట్నెస్ లేకుంటే చర్యలు అనుమతులు లేకుండా పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూల్ యాజమాన్యాలు వారి వాహనాలకు ఫిట్నెస్ చేయించుకోవాలి. అనుభవం ఉన్న వారిని డ్రైవర్గా నియమించుకోవాలి. నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం. – అజయ్కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి -
రోడ్డుపైనే ఊడిపోయాయి
బొమ్మనహళ్లి: బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న ఓ ప్రముఖ ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా బస్సు చక్రాలు ఊడిపోయాయి. అదృష్టవశాత్తు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. శుక్రవారం సాయంత్రం కేఎ–53–డి–3397 నంబర్తో ఉన్న అశోక్ లేల్యాండ్ పాఠశాల బస్సులో సుమారు 20 మందికి పైగా విద్యార్థులను ఎక్కింకుని ఇళ్ల వద్ద డ్రాప్ చేయడానికి బయల్దేరింది. కొంతసేపటికి బస్సు ఎడమవైపు వెనుక భాగంలోని రెండు టైర్లు బయటకు ఊడిపడ్డాయి. బస్సు పెద్ద శబ్ధంతో కుదుపులో లోను కావడంతో డ్రైవర్ నిలిపివేశాడు. ఏం జరిగిందోనని బాలలు ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రుల ఆగ్రహం 10 నుంచి 15 మంది మాత్రమే కూర్చోగలిగే బస్సులో సుమారు 20 మందికి పైగా చిన్నారులను తీసుకొని వెళ్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లలకు ఏమైనా జరిగి ఉంటే ఎవరిది బాధ్యత అని మండిపడ్డారు. బస్సులు ఫిట్నెస్తో ఉన్నాయా లేదా అని తనిఖీలు కూడా చేయకుండా రోడ్ల మీదకు వదలడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహించారు. పాఠశాలల యాజమాన్యం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. గంట తరువాత మరో బస్ను పిలిపించి విద్యార్థులను ఇళ్లకు చేర్చారు. ప్రైవేటు స్కూళ్లంటే.. ఒకటో క్లాసు రెండో క్లాసులకు కూడా లక్షల కొద్దీ ఫీజులు కట్టాలి. ఫీజులు ఒక్కరోజు ఆలస్యమైనా సహించరు. పెన్నులు, పుస్తకాలు, షూ అన్నీ అదే స్కూల్లో రెట్టింపు రేట్లకు కొనాలి. నోరెత్తితే నో అడ్మిషన్ అంటారు. కానీ విద్యార్థుల భద్రత, వసతులు, బోధన వంటివి ఎంత నాసిరకంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అటువంటిదే ఈ సంఘటన. -
బడి బస్సులు భద్రమేనా?
తాండూరు టౌన్: పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండానే రయ్రయ్ మంటూ వెళ్తున్నాయి. చిన్నారుల జీవితాలతో ప్రైవేటు స్కూల్ బస్సుల యజమానులు చెలగాటుమాడుతున్నారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. డొక్కు బస్సులతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పాఠశాలలు పునః ప్రారంభం అయినప్పటికీ బస్సుల ఫిట్నెస్, పర్మిట్లను రవాణా శాఖాధికారులు తనిఖీలు చేయలేదు. దీంతో పలు బస్సులకు ఫిట్నెస్, పర్మిట్ లేకున్నా రోడ్డెక్కి దర్జాగా స్కూల్ పిల్లలను తరలిస్తున్నాయి. బస్సు పూర్తి స్థాయి కండీషన్లో ఉంటేనే రోడ్లపై తిరగడానికి అర్హత ఉంటుంది. కండీషన్ లేని బస్సులు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫిట్నెస్ లేని బస్సుల్లో పిల్లలను తరలించినపుడు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం లేని బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 20 శాతం బస్సులకే ఫిట్నెస్ జిల్లా పరిధిలో పలు ప్రైవేటు స్కూళ్లలో కలిపి మొత్తంగా 191 స్కూల్ బస్సులు ఉన్నాయి. గతేడాది అక్కడక్కడా పలు స్కూల్ బస్సులు విద్యార్థులను తరలిస్తూ ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే. 191 బస్సుల్లో ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్న బస్సులు కేవలం 38 మాత్రమే ఉండటం విశేషం. మిగిలిన 153 బస్సులు అంటే 80శాతం బస్సులు ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండానే విద్యార్థులను తరలిస్తున్నారు. యాజమాన్యాలతో కుమ్మకై ్క అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ లేని బస్సుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినపుడు హంగామా చేయకుండా ముందు జాగ్రత్తగా బస్సులను తనిఖీలు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కానరాని సేఫ్టీ పరికరాలు ● ఫిట్నెస్, పర్మిట్లు మాత్రమే కాకుండా ప్రతి స్కూల్ బస్సులో ఆర్టీఏ నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉండాలి. ● చిన్నారులు కిటికీల నుంచి బయటకు తొంగి చూడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. ● ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రాథమిక చికిత్స చేయడానికి అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండాలి. ● బస్సులో అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి. స్కూల్ బ్యాగులు పెట్టుకునేందుకు ప్రత్యేక ర్యాక్స్ ఉండాలి. ● బస్సు బయట రేడియం స్టిక్కర్లు అంటించాలి. ప్రమాదం జరిగినపుడు అద్దాలను పగుల గొట్టేందుకు సుత్తె వంటి పనిముట్లు ఉండాలి. ● అగ్ని ప్రమాదం సంభవించినపుడు మంటలను ఆర్పేందుకు అవసరమైన అగ్ని నిరోధక రసాయన సిలిండర్లు ఉండాలి. అలాగే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు స్కూల్ బస్సులు నడపరాదు. ● ఇలాంటి నిబంధనలతో కూడిన బస్సుల్లో మాత్రమే విద్యార్థులను తరలించేందుకు అనుమతులు ఇస్తారు. నిబంధనల ప్రకారం లేని బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేయాల్సి ఉంటుంది. తనిఖీలు ముమ్మరం చేశాం పాఠశాలలు ప్రారంభం కాకముందే యాజమాన్యం బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. జిల్లాలో కేవలం 38 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. తనిఖీలు ముమ్మరం చేశాం. ఇప్పటికీ రెండు బస్సులను సీజ్ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడిపితే చర్యలు తప్పవు. – వెంకట్ రెడ్డి, ఆర్టీఓ -
నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం.. తల్లిదండ్రుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల బస్సులు పూర్తిగా దారి తప్పాయి. విద్యార్థులను భద్రంగా ఇళ్లకు చేర్చేందుకు ఉద్దేశించిన నిబంధనల విషయంలో పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. సోమవారం నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికల్లా ఫిట్నెస్ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నా, ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం వాహనాలు మాత్రమే దాన్ని పూర్తిచేసుకున్నాయి. అధికారులు బస్సుల ఫిట్నెస్ పరిశీలించి అవి రోడ్డుపై నడిచేందుకు యోగ్యంగా ఉన్నదీ లేనిదీ తేలుస్తారు. ఆ మేరకు ఫిట్నెస్ రెన్యూవల్ చేస్తారు. ఇప్పుడు ఫిట్నెస్ రెన్యూవల్ లేకుండానే 80 శాతం బస్సులు రోడ్డెక్కితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 29 వేల పైచిలుకు విద్యాసంస్థల బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ఇప్పటివరకు 6 వేల బస్సులు మాత్రమే ఫిట్నెస్ రెన్యూవల్ చేయించుకున్నాయని సమాచారం. విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న వేళ పరిస్థితిని ముందే గుర్తించి హెచ్చరించాల్సిన రవాణాశాఖ పెద్దగా స్పందించలేదు. సోమవారంలోపు రెన్యూవల్ చేయించుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలైనా జారీ చేయలేదు. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభం అవుతూనే రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఫిట్నెస్ రెన్యూవల్ లేని బస్సులను గుర్తించి వాటి గుర్తింపు రద్దు చేయటం లాంటివి చేస్తారు. విద్యాసంస్థలకు పెనాల్టీలు విధిస్తుంటారు. కానీ, ముందుగానే హెచ్చరికలు జారీ చేయటం ద్వారా విద్యాసంస్థల్లో భయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ప్రారంభమయ్యాక పట్టుబడితే పెనాల్టీలు విధించటం వరకు సరే, అసలు ఫిట్నెస్ లేక బస్సు ప్రమాదానికి గురైతే విద్యార్థుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శిక్షణ ఏది..? విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేలోపు విద్యాసంస్థల బస్సులు నడిపే డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలన్న నిబంధన ఉంది. సఫర్ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాలుంటాయి. డ్రైవింగ్ నైపుణ్యం, బస్సు నిబంధనలు, విద్యార్థుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే తీరు.. ఇలా అన్ని అంశాలు అందులో ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఆ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేదు. విద్యార్థులు ఆ బస్సుల్లో ఎక్కడం ప్రారంభమయ్యేలోపే ఈ శిక్షణ పూర్తి చేస్తే ఉపయోగం ఉంటుంది. తర్వాత ఎప్పటికో శిక్షణ ఇస్తే, ఈలోపు అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే ఏంటన్నది తల్లిదండ్రు ఆందోళన. -
స్కూల్ బస్సుకింద పడి బాలుడి మృతి
కళ్యాణదుర్గం: స్కూల్ బస్సు దూసుకెళ్లడతో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. మండలంలోని చాపిరి గ్రామానికి చెందిన మధు, వాణీ దంపతులకు ఒక్కగానొక్క సంతానం అయిన విçహాన్ (5) కళ్యాణదుర్గం జ్ఞానభారతి పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం విహాన్ పాఠశాల నుంచి బస్సులో చాపిరి గ్రామానికి వచ్చాడు. బస్సుదిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ బస్సు వెనుక చక్రాల కింద పడ్డాడు. స్కూల్ బస్సు డ్రైవర్ గమనించకుండా ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విహాన్ బస్సు టైరు కింద పడి మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు స్కూల్ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లితండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరు గా విలపించారు. చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
వేగంగా వెళ్తున్న బస్సులో కుదుపులు.. డోర్ నుంచి కిందపడటంతో..
సాక్షి, భువనగిరి: మమ్మీ బైబై.. అంటూ స్కూల్కు వెళ్లిన చిన్నారి కానిరాని లోకాలకు వెళ్లిపోయాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి మృతికి కారణమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలోని హైదర్పూర్ గ్రామానికి చెందిన వడ్డేమోని శ్రీనివాస్, రాణి దంపతులకు మల్లికార్జున్, అభిలాష్(8) ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె వర్షిత ఉన్నారు. వీరంతా మండల కేంద్రంలోని లిటిల్ఫ్లవర్ స్కూల్లో చదువుతున్నారు. మల్లికార్జున్ 5వ తరగతి, అభిలాష్ ఒకట తరగతి, వర్షిత ఎల్కేజీ చదువుతుంది. ఉదయం అందరూ రెడీ అయి స్కూల్కు వెళ్లారు. ఒంటిపూట బడులు కావడంతో స్కూల్ వదిలిన తరువాత తిరిగి స్కూల్ బస్సు ఎక్కి ఇంటికి బయలుదేరారు. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి జారి.. స్కూల్ నుంచి బయలుదేరిన బస్సు.. ఆయా గ్రామాలలో పిల్లలను దింపుతూ చివరగా హైదర్పూర్కు వెళ్తుంది. బస్సులో 10 మంది వరకు విద్యార్థులున్నారు. ఈ క్రమంలో భీమనపల్లి గ్రామం దాటిన తరువాత బస్సు డ్రైవర్ జింకల రాము అతివేగంగా బస్సును నడిపాడు. గ్రామశివారులోని చెరువు దాటిన తరువాత మూలమలుపు వద్ద కుదుపునకు బస్సులో ఉన్న అభిలాష్ కదులుతున్న బస్సులోంచి జారి కింద పడగా, బస్సు వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లింది. విద్యార్థి బస్సులోంచి పడిపోయిన విషయాన్ని డ్రైవర్ కనీసం చూడకుండానే వేగంగా అలానే ముందుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో భీమనపల్లి గ్రామానికి చెందిన ముంత కృష్ణ అనే వ్యక్తి బైక్పై వస్తూ విద్యార్థి కిందపడిపోవడాన్ని గమనించి కొద్దిదూరం వెళ్లిన బస్సును ఆపాడు. అందరూ కలిసి అక్కడికి వెళ్లి చూడగా అభిలాష్ రక్తపుమడుగులో విగతజీవిగా మారాడు. బస్సు డోర్కు లాక్ ఉండి ఉంటే... స్కూల్ బస్సు డోర్కు లాక్ సరిగా లేని కారణంగా బస్సులో ఉన్న వృద్ధురాలైన ఆయా పోశమ్మ డోర్ లాక్ వేయలేదు. మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును వేగంగా నడపడం వల్ల నిండుప్రాణం బలైపోయింది. విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూసి గుండెవిసేలా రోదించారు. సమాచారం అందుకొన్న ఎస్ఐ సైదిరెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ రామును అదుపులోకి తీసుకొన్నారు. అలాగే బస్సును పోలీస్స్టేషన్కు తరలించారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు చెందిన బస్సు నుంచి అభిలాష్(6) అనే విద్యార్థి కిందిపడి మృతిచెందిన విషయంపై ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యల కోసం షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు భువనగిరి డీఈవో కె నారాయణరెడ్డి తెలిపారు. -
పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేటలోని విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న మండలంలోని అల్మాస్పూర్, రాజన్నపేట గ్రామాలకు చెందిన 22 మంది విద్యార్థులు స్కూల్బస్సులో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్నారు. ఎల్లారెడ్డిపేట శివారులోని రెండోబైపాస్ మూలమలుపు వద్ద కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సు వెనుకభాగం ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనలో స్కూల్ బస్సులోని వెనుకసీట్లో కూర్చున్న విద్యార్థులు విహాన్, ఆదిత్య, దినేశ్, వినయ్, శివ, శివారెడ్డి, శ్రీనివాస్, తనుశ్రీ, మల్లికార్జున్, కావ్య, ధరణి, వర్షిణి, మణిసూదన్, మణిదీప్, సిద్దేశ్తోపాటు బస్సు క్లీనర్ అజయ్లు గాయపడ్డారు. రక్తం కారుతుండడంతో పిల్లలు భయాందోళనకు గురై రోదించారు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిరావడంతో అక్కడ పరిస్థితి రోదనలతో మిన్నంటింది. ఫోన్లో ఆరా తీసిన మంత్రి కేటీఆర్ ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలతో ఫోన్లో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే హైదరాబాద్కు తరలించాలని సూచించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ అనురాగ్ జయంతి వెంటనే డీఈవో రాధాకిషన్ను అప్రమత్తం చేశారు. ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి చేరుకున్న డీఈవో రాధాకిషన్ ప్రమాద సంఘటనపై వివరాలు సేకరించి, విద్యార్థులను పరామర్శించారు. -
Viral Video: బస్సులో భారీ కొండచిలువ
-
షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి..
భోపాల్: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికీ వస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ భిండ్లో 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో(కార్డియాక్ అరెస్ట్) ప్రాణాలు కోల్పోయాడు. ఇంత చిన్న వయసులో ఈ కారణంగా చనిపోయిన ఘటన రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు వెల్లడించారు. ఓ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈ బాలుడి పేరు మనీష్ జాతవ్. గురువారం మధ్యాహ్నం సోదరుడితో కలిసి పాఠశాలలోనే భోజనం చేశాడు. అనంతరం 2:00 గంటలకు స్కూల్ బస్ ఎక్కాడు. క్షణాల్లోనే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. విద్యార్థిని గమనించిన బస్ డ్రైవర్ స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అప్రమత్తం చేశాడు.స్పృహకోల్పోయిన అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. బాలుడు అప్పటికే చనిపోయాడని వాళ్లు ప్రకటించారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా అరుదు అని వైద్యులు తెలిపారు. కానీ కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని చెప్పారు. తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్.. -
స్కూల్ బస్సులో దూరిన భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో
ఈ మధ్యకాలంలో పాములు ఒక్కడి పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇళ్లు, షూలు, బైక్లు.. ఇలా కనిపించిన ప్రతిచోటా దూరిపోతున్నాయి. అనుకొని ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే ఉత్తర ప్రదేశ్లో వెలుగు చూసింది. రాయ్బరేలిలోని ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. పాఠశాలకు సెలవు కావడంతో బస్సును డ్రైవర్ తన గ్రామానికి తీసుకెళ్లి ఇంటి దగ్గర పార్క్ చేశాడు. ఆ బస్సు పక్క నుంచి మేకల మంద వెళ్తుంటే బస్సులో నుంచి వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు గమనించారు. బస్సులో ఏదో ఉందనే అనుమానంతో పరిశీలించి చూడగా.. భారీ కొండచిలువ బస్సులో తిష్ట వేసింది. ఇంజిన్ భాగం వద్ద ఓ సీట్ కింద పెద్ద కొండచిలువ దాక్కుంది. చదవండి: వైరల్: 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడొద్దు.. టీనేజర్కు జో బైడెన్ సలహా సమాచారం అందుకున్న సిటీ సీఓ వందనా సింగ్, సిటీ మెజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గంటపాటు శ్రమించి కొండచిలువను పట్టుకున్నారు. పట్టుకున్న కొండచిలువ బరువు 80 కేజీలు, పదకొండున్నర అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. Uttar Pradesh: रायबरेली में स्कूल की बस के इंजन में विशालकाय अजगर फंसा था। कड़ी मशक़्क़त के बाद वन विभाग की टीम ने निकाला बाहर। अजगर को रस्सी के सहारे बाहर निकाला गया। इस अजगर का वजन करीब 80 किलो और उसकी लंबाई साढ़े 11 फीट है। अजगर को सुरक्षित जंगल में छोड़ दिया गया है। #Python pic.twitter.com/TAoq9aq8CP — Tanseem Haider तनसीम हैदर Aajtak (@TanseemHaider) October 16, 2022 అటవీ అధికారులు బస్సులో నుంచి కొండచిలువను తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో ఒక అధికారి స్కూలు బస్సు దిగువ నుంచి కొండచిలువను లాగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఆదివారం కావడంతో పాఠశాల మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
మీ పిల్లలు బడికి వెళ్తున్నారా.. పేరెంట్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి!
కొన్నిసార్లు మనుషులు చేసే తప్పిదాలు.. తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. క్షణికావేశం, క్షణకాల నిర్లక్ష్యం కారణంగా ఎదుటివారి ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోనే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన జెఫ్ఫర్సన్ పబ్లిక్ స్కూల్ బస్సు నుండి ఓ చిన్నారి(6) కిందకు దిగుతోంది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్.. డోర్ ఓపెన్ చేసింది. కాగా, చిన్నారి పూర్తిగా స్టెప్స్ దిగకముందే.. డోర్ క్లోజ్ కావడంతో ఆమె బ్యాగ్.. డోర్ మధ్యలో చిక్కుకుపోతుంది. దీంతో, బాలిక.. కిందకు దిగకుండా అలాగే నిల్చుడిపోతుంది. అది గమనించని డ్రైవర్.. బస్సును స్టార్ట్ చేసి వెళ్లిపోతుంటాడు. HOLY SHIT. The little girl is miraculously fine, the bus driver has been fired. pic.twitter.com/uuijsrNn2U — Dean Blundell🇨🇦 (@ItsDeanBlundell) September 23, 2022 దీంతో, చిన్నారి బస్సు డోర్కు వేలాడుతూనే వస్తుంది. ఇలా దాదాపు 1000 అడుగుల దూరం వచ్చాక.. బస్సులో ఉన్న వారు చిన్నారిని చూసి కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేస్తుంది. ఈ ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడుతుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తారు. ఇక, ఈ ఘటన అనంతరం డ్రైవర్ను విధుల నుంచి తొలిగిస్తారు. అలాగే, పాఠశాల యాజమాన్యం చిన్నారి పేరెంట్స్కు దాదాపు 5 మిలియన్ల డాలర్లను నష్టపరిహారంగా ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ప్రమాదం 2015లో జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పిల్లల విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. -
వాగు అవతల రైతులు.. వాగు మధ్యలో విద్యార్థులు
తాడ్వాయి/ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): సాగు పనులకు వెళ్లిన 170 మంది కూలీలు వాగు అవతల చిక్కుకుపోగా..మరోచోట వరద నీటిలో విద్యార్థులతో కూడిన స్కూలు బస్సు చిక్కుకుపోయింది. ఈ రెండు ఘటనలు బుధవారం కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో చోటుచేసు కున్నాయి. కామారెడ్డి జిల్లా సంతాయిపేటకి చెందిన 170 మంది రైతులు, కూలీలు బుధవారం ఉదయం వ్యవసాయ పనులకు భీమేశ్వర వాగు అవతల ఉన్న పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం మండలంలోని దేమికలాన్, కరడ్పల్లి, నందివాడ, ఎండ్రియాల్ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల నుంచి చిన్నచిన్న వాగులు పొంగి ప్రవహిస్తూ భీమేశ్వరవాగు లో చేరడంతో ఈ వాగు ఉధృతమైపోయింది. దీంతో కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలు సుకున్న గ్రామస్తులు...వారిని వాగు దాటించేందుకు చేసిన యత్నం విఫలమైంది. దీంతో పోలీసులు, కామా రెడ్డి ఫైర్సిబ్బంది వాగు వద్దకు చేరుకుని జేసీబీ సాయంతో కూలీలను ఇవతలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో వారూ చిక్కుకుపోయారు. చివరకు రాత్రి 11–12 గంటల మధ్య సమయంలో కష్టమ్మీద 50 మందిని వాగు దాటించి తీసుకువచ్చారు. మిగతా వారిని వాగు ఇవతలికి చేర్చే యత్నాలు కొనసాగుతున్నాయి. వాగులో చిక్కుకున్న స్కూల్ బస్సు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నశీంపేట వద్ద చివ్వెంల–ముకుందాపురం రహదారిపై లోలెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరదలో బుధవారం స్కూల్ బస్ చిక్కుకుపోయింది. ఉదయం ఆయా గ్రామాల నుంచి పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో నశీంపేట వద్ద లోలెవల్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్రైవర్ ఇదేమీ పట్టించుకోకుండా దాదాపు 24మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును వరదలోకి తీసుకెళ్లాడు. మధ్యలోకి రాగానే బస్సు ఇంజన్ విఫలమై బస్సు కదలకుండా ఆగిపోయింది. ఎంతకూ బస్సు స్టార్ట్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి వెంటనే కార్యకర్తలను పురమాయించి స్థానికులతో కలసి బస్సును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పాఠశాలల యాజమాన్యాలు, పోలీసులతో ఫోన్లో మాట్లాడారు. తదనంతరం పోలీసులు ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో వరదల్లో బస్సు.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!
దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో, సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. గ్రామాలు, నగరాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో వాహన ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అయితే, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, షాజాపూర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శనివారం 24 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. రోడ్డు మీద వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా బస్సు డ్రైవర్ ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకుపోవడంతో విద్యార్థులు భయంతో కేకలు వేశారు. A school bus got stuck in a drain of water near Bikalkhedi village of Shajapur district, more than 24 school children were in the bus, the villagers present on the spot showed agility and pulled the bus out of the water by tying a rope with the help of a tractor.#madhyapradesh pic.twitter.com/ZvfnKVrBLG — Siraj Noorani (@sirajnoorani) July 23, 2022 ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఓ ట్రాక్టర్ సాయంతో బస్సును వరదలో నుంచి బయటకు తీశారు. 24 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. పిల్లలందరూ క్షేమంగా బయటపడటంతో వారి పేరెంట్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు.. మధ్యప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. #MadhyaPradesh | School Bus With Over 2 Dozen Children Stuck In Drain Amid Heavy Rain, Pulled Out https://t.co/PTKiaw2fSF pic.twitter.com/56dWF8bFPq — NDTV (@ndtv) July 23, 2022 ఇది కూడా చదవండి: చేపకు వేలంలో రూ. 3 లక్షలు.. స్పెషల్ తెలిస్తే షాక్ అవుతారు -
మహబూబాబాద్ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్యభట్ట పాఠశాల బస్సు
-
వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు
-
మహబూబ్నగర్.. వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు..
సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి మహబూబ్నగర్ మండలం కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో శుక్రవారం ఉదయం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళుతున్న భాష్యం టెక్నో స్కూల్కు చెందిన బస్సు నీటిలో చిక్కుకుంది. రాంచంద్రపూర్, మాచన్పల్లి, సూగురుగడ్డ తాండా నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న బస్సు వరద నీటిలోకి రాగానే ఆగిపోయింది. చూస్తుండగానే బస్సులోకి నీరు చేరడంతో దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విద్యార్దులంతా క్షేమంగా బయటపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు లాగారు. అయితే బస్సు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే పూర్తిగా నీటిలో మునిగిపోయేదని, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదవండి: భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి -
విషాదం: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 16 మంది మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విద్యార్థులు, ప్రయాణికులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు, కొందరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కులు జిల్లా డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ చెప్పారు. సయింజ్ వైపునకు వెళ్తున్న బస్సు ఉదయం 8.30 ప్రాంతంలో జంగ్లా గ్రామం వద్ద ప్రమాదానికి గురైందని తెలిపారు. జిల్లా అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్టు గార్గ్ వెల్లడించారు. పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్.. తీరా ఓపెన్ చేసి చూస్తే.. -
ప్రభుత్వం సీరియస్.. ఇకపై బడి బస్సుల్లో అవి తప్పనిసరి
సాక్షి, చెన్నై: ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు, ప్రైవేటు ఆపరేటర్ల వాహనాల్లో సీసీ కెమెరాలను ప్రభుత్వం తప్పని సరి చేసింది. అలాగే, నలువైపులా సెన్సార్ పరికరాల్ని అమర్చాలన్న ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. గతంలో ఓ ప్రైవేటు విద్యా సంస్థ బస్సులో ఉన్న రంధ్రం నుంచి కింద పడి ఓ విద్యార్థిని మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో జనంలో ఆగ్రహావేశాల్ని రగల్చడంతో కోర్టు జోక్యం చేసుకుంది. దీంతో విద్యాసంస్థల బస్సులు, విద్యార్థులను తరలించే ప్రైవేటు ఆపరేటర్ల వాహనాలకు సంబంధించిన నిబంధనలు కఠినం చేశారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేసి, సర్టిఫికెట్లను మంజూరు చేస్తూ వస్తున్నారు. అయినా, ఏదో ఒక చోట విద్యా సంస్థల బస్సులు, ఇతర ప్రైవేటు ఆపరేటర్ల వాహనాల కారణంగా విద్యార్థులకు ప్రమాదాలు తప్పడం లేదు. దీంతో మోటారు వెహికల్ చట్టంలో సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్వుల జారీ.. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఫనీంద్రరెడ్డి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు లగ్జరీ కార్లు వంటి వాహనాల్లో ఉండే విధంగా విద్యాసంస్థల బస్సులు, వాహనాల్లో ముందు, వెనుక భాగాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేశారు. అలాగే, వాహనాలకు నలువైపులా సెన్సార్ పరికరం అమర్చేందుకు ఆదేశాలు ఇచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా బస్సు ముందు, వెనుక భాగంలో ఎవరైనా ఉన్నారా..? అని డ్రైవర్ తెలుసుకునేందుకు వీలుందని వివరించారు. అలాగే, సెన్సార్ పరికరం నుంచి వచ్చే సంకేతాల మేరకు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలుందని పేర్కొన్నారు. తక్షణం ఆయా బస్సులు, వాహనాల్లో వీటిని అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని, తనిఖీలు చేయాలని ఆర్టీఓ అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. -
విరగ‘బడి’ వసూళ్లు! పీపీకి రూ.22 వేలు? అడిగే దిక్కేది!
నిజామాబాద్అర్బన్: కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ల్యాబ్, లైబ్రరీ స్పోర్ట్స్, ఇతర ఫీజుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రస్తుతం 456 ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా తర్వాత రెండేళ్లకు తెరుచుకున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ మొదలైంది. ఆర్మూర్ నిజామాబాద్, బోధన్, భీమ్గల్, డిచ్పల్లి వంటి పట్టణాల్లో ఫీజుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. పీపీ–1 క్లాస్ పిల్లవాడికి నిజామాబాద్ నగరంలో అన్ని ఫీజులు కలుపుకొని రూ. 50వేల వరకు ఒక కార్పొరేట్ పాఠవాల వసూలు చేస్తోంది. ఆర్మూర్ గ్రామీణ ప్రాంతంలో ఓ కార్పొరేట్ పాఠశాల, బోధన్ రాకాసిపేట్లోని ఓ ప్రైవేట్ పాఠశాల పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. సర్కార్ బడి వైపు పిల్లల్ని చేర్పించాలని ప్రచారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ మాత్రం చేపట్టడం లేదు. చదవండి👉🏻అసలే కానిస్టేబుల్.. ఆపై తులం బంగారమిస్తే డబుల్ ఇచ్చారు.. అక్కాచెళ్లెళ్ల మాదిరి! ఉత్తర్వులు అమలెక్కడ....? విద్యాశాఖలో కొన్నేళ్ల ఫీజుల నియంత్రిణ కోసం జీవో.నం. 1ను మొదట విడుదల చేశారు. 2017 ఫిబ్రవరి ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసిన ప్రభుత్వం జీవో.నం. 1ను అమలు చేస్తూనే ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవచ్చని జీవో నం. 46ను విడుదల చేసింది. కాని పది శాతాన్ని పక్కకు పెట్టు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా విద్యాశాఖాధికారి మొదలుకొని ఎంఈవో వరకు ఎవరూ కూడా ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భాలు లేవు. ఫిర్యాదులు వస్తేనే చూస్తామనే ధోరణిలో వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలతో మిలాకత్ అయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎటువంటి అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. జిల్లాలో సగటున ప్రతి ప్రైవేట్ విద్యార్థి నుంచి రూ. 1,000 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. హాస్టల్ వసతి పేరుతో రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చదవండి👉🏻పార్కింగ్ బాధ్యత యజమానులదే: హైకోర్టు ప్రైవేట్లో ఫీజుల వివరాలు.. చదువు కంటే బస్సు ఫీజులే ఎక్కువ నగరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బస్సుల ఫీజులు పాఠశాల ఫీజుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆర్మూర్ రోడ్డులో ఉన్న మూడు ప్రైవేట్ పాఠశాలల్లో ఏడాదికి రూ. 32 వేలు బస్సు ఫీజులు వసూలు చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ. 20 వేల వరకు ఉన్నాయి. ఇలా విద్యార్థుల ఫీజుల కంటే బస్సు చార్జీలే ఎక్కువయ్యాయి. భారం మోయలేకపోతున్నాం.. పెరిగిన ఫీజుల భారం మోయలేకపోతున్నాం. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఫీజులు పెంచడం సబబు కాదు. తక్షణమే విద్యాశాఖాధికారులు స్పందించాలి. మధ్యతరగతి, పేదవారికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. అసలే కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ ఫీజులను భరించలేకపోతున్నాము. – మనోజ్, విద్యార్థి తండ్రి గాయత్రి నగర్ నిబంధనల ప్రకారం వసూలు చేయాలి ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల ప్రకారమే ఫీజులు వసులు చేయాలి. విద్యాశాఖ నిబంధనలు అమలు చేయాలి. లేదంటే పాఠశాలలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటాం. – దుర్గాప్రసాద్, డీఈవో -
గ్యాస్ బండి.. బాగుందండి..
ఆరిలోవ(విశాఖ తూర్పు): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎన్జీ బస్సులు నడుపుతూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది విశాఖ వ్యాలీ స్కూల్. ఇటీవల పాఠశాల యాజమాన్యం కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ)తో నడిచే ఆరు బస్సులను కొనుగోలు చేసింది. పాఠశాల విద్యార్థుల కోసం ఈ బస్సులను నడుపుతోంది. కొన్నేళ్లుగా నడుస్తున్న బస్సులు మరమ్మతులకు గురి కావడంతో.. వాటి స్థానంలో డీజిల్తో నడిచేవి కాకుండా సీఎన్జీ బస్సులు కొనుగోలు చేసింది. డీజిల్తో నడిచే బస్సుల కారణంగా అధిక శాతం నల్లని పొగ బయటకు వస్తుంది. దీని వల్ల పర్యావరణానికి చాలా నష్టం. అదే సీఎన్జీ బస్సులతో నగరానికి కాలుష్య ముప్పు తక్కువ. అందులో భాగంగానే విశాఖ వ్యాలీ పాఠశాల యాజమాన్యం సీఎన్జీ బస్సులను కొనుగోలు చేసి.. ప్రైవేట్ పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా డీజిల్తో నడిచే బస్సుల కంటే ఈ బస్సులు ఎక్కువ మైలేజీ ఇస్తాయని డ్రైవర్లు చెబుతున్నారు. డీజిల్ బస్సులు లీటర్కు 5 నుంచి 6 కిలోమీటర్లు నడుస్తాయి. అదే సీఎన్జీ బస్సులు ఓ కిలో గ్రాము గ్యాస్తో 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం నడుస్తాయని చెబుతున్నారు. వీటి వల్ల కార్బన్ డయాక్సైడ్ చాలా తక్కువగా వెలువడుతుంది. వాతావరణం కాలుష్యం కాకుండా తమ వంతు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామని ఇక్కడ యాజమాన్యం చెబుతోంది. ఇటీవల కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఈ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులను పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పరిశీలిస్తున్నాయి. ఎక్కువ మైలేజీతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఉపయుక్తంగా ఉండటంతో.. వీటిని నడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బస్సులో సౌకర్యాలు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఈ బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇద్దరు విద్యార్థులకు ఒక సీటు చొప్పున కేటాయించారు. ప్రతి బస్లో 40 మంది విద్యార్థులు ప్రయాణించవచ్చు. ఇందులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ సిద్ధం చేశారు. బస్ వెనుక భాగం కిందన సీఎన్జీ సిలిండర్ల క్యాబిన్ ఉంటుంది. అన్ని బస్లు సీఎన్జీవే నడుపుతాం భవిష్యత్లో అన్నీ సీఎన్జీ బస్సులు నడపాలనే ఆలోచనలో ఉన్నాం. ఇక్క డ విద్యార్థుల అవసరానికి తగినట్లు 13 బస్సులున్నాయి. వాటిలో ఆరు మరమ్మతులకు గురయ్యాయి. వాటి స్థానంలో సీఎన్జీ బస్సులు కొనుగోలు చేశాం. వీటి వల్ల కాలుష్యం ఉండదు. అతి తక్కువగా కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. పర్యావరణం పరిరక్షణ కోసం మా వంతు కృషి చేస్తున్నాం. – ఈశ్వరి ప్రభాకర్, ప్రిన్సిపాల్, విశాఖ వ్యాలీ స్కూల్ -
రెండేళ్లుగా రోడ్డెక్కలేదు.. మరి బడి బస్సు భద్రమేనా?
సాక్షి,ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు కొంతకాలంగా ఉన్నచోటు నుంచి కదలకుండా ఉండడంతో మూలనపడ్డాయి. గత విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో బడులు ప్రారంభమైనప్పటికీ పెద్ద స్కూల్లకు సంబంధించిన బడి బస్సులు రోడ్డెక్కాయి. మిగితా పాఠశాలల బస్సులు ఇంకా కదలకుండానే ఉన్నాయి. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న చాలా మంది విద్యార్థులు స్కూల్ బస్సుల్లోనే పాఠశాలకు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో బడి బస్సు భద్రమెంత అనే అనుమానం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఫిట్నెస్ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. రవాణ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ పరిధిలో 192 స్కూ ల్ బస్సులు, ఆసిఫాబాద్ జిల్లాలో 102 బస్సులు ఉండగా ఒక్కదానికి కూడా ఫిట్నెస్ లేదు. మంచిర్యాల జిల్లాలో 400 బస్సులకు గానూ నాలుగింటికి, నిర్మల్ జిల్లాలో 270 స్కూల్ బస్సులకు గానూ 20 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ఉందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,430 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 987 ప్రాథమిక, 186 ప్రాథమికోన్నత, 257 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 1,32,031 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని 146 ప్రైవేట్ పాఠశాలల్లో 26,039 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సగానికిపైగా విద్యార్థులు స్కూల్ బస్సుల్లోనే ఇంటికి రాకపోకలకు కొనసాగిస్తుంటారు. 146 ప్రైవేట్ పాఠశాలలకు 192 స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిన్నింటికీ ప్రస్తుతం ఫిట్నెస్ గడువు ముగిసింది. దాదాపు అన్ని బస్సులకు ఇన్సూరెన్స్ కూడా ముగిసింది. రోజుకు రూ.50 జరిమానా.. స్కూల్ బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించనున్నట్లు రవాణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇన్సూరెన్స్, పొల్యూషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు జరిమానా పేరిట ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఫిట్నెస్ సామర్థ్య పరీక్షలకు ఏడాదిన్నర పాటు వెసులుబాటు కల్పించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి వాహనాల సామర్థ్య పరీక్షలు చేయించుకోని వాటికి రోజుకు రూ.50 చొప్పున జరిమానా కట్టించాలన్న నిబంధన విధించింది. బస్సు భద్రమెంత.? కరోనా నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ఆర్థికంగా చతికిలపడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్లైన్లోనే తరగతులు కొనసాగాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో నేరుగా విద్యాబోధన జరుగుతోంది. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో తప్పనిసరి బస్సు భద్రత అవసరమేనని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో సీట్లు, అద్దాలు, టైర్లు, తదితర బస్సు సామగ్రి అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా? అనేది చూసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. స్కూల్ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవర్ వయసు 60 ఏళ్లకు మించొద్దు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాల పట్టిక నమోదు చేసి ఉంచాలి. గతంలో చిన్నచిన్న ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ బస్సు యాజమాన్యాలపై ఉంది. ఈ నిబంధనలు తప్పనిసరి.. ► స్కూల్æబస్సుకు పాఠశాల పేరు, సెల్ఫోన్ నంబర్, పూర్తి చిరునామా బస్సు ఎడమ వైపు పూర్తిగా కనిపించేలా ఉండాలి ► డ్రైవర్ వయస్సు 60 సంవత్సరాలకు మించరాదు. తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి. ► డ్రైవర్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. ► ప్రతీ బస్సుకు ఒక అటెండర్ ఉండాలి. ► బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల వివరాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ► బస్సులో అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలి. ► బస్సులకు తలుపులు అమర్చబడి ఉండాలి. ► కిటికీలకు మధ్య రెండు లోహపు కడ్డీలు అమర్చబడి ఉండాలి. ► విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అటెండెన్స్ తీసుకోవాలి. భద్రత విషయంలో రాజీపడం పాఠశాల బస్సుల భద్రత విషయంలో రాజీపడేది లేదు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం. డ్రైవర్లు లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలి. బస్సు కండీషన్ ఉంటేనే నడపాలి. నిబంధనలు అతిక్రమించి బస్సు నడిపితే సీజ్ చేయడంతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆదిలా బాద్, కుమురంభీం జిల్లాల పరిధిలో ఒక్క ప్రైవేట్ స్కూల్ బస్సుకు కూడా ఫిట్నెస్ లేదు. గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తాం. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్ -
అక్కడ బడికి పోతే బస్సెక్కినట్లే.. ఎందుకంటే!
రాయచూరు రూరల్(బెంగళూరు): మస్కి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గదికి చిత్రకారులు బస్సు రూపం తెచ్చారు. బస్సును పోలినవిధంగా వేసిన పెయింటింగ్ విద్యార్థులను ఆకట్టుకుంటోంది. జిల్లా విద్యాశాఖా అదనపు అధికారి సుఖదేవ్ శనివారం పాఠశాలను సందర్శించి పెయింటింగ్ను ఆసక్తిగా తిలకించారు. అనంతరం విద్యార్థులతో పలు విషయాలపై చర్చించారు. విద్యార్థుల్లో సృజనను పెంపొందించేందుకు కలికా చేతనను పకడ్బందీగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయుష్మాన్ భారత్తో ప్రజల ఆరోగ్య సంరక్షణ బళ్లారిఅర్బన్: ఆయుష్మాన్ భారత్తో ఆరోగ్య కర్ణాటక సాధ్యమని మాజీ ఎంపీ శాంత పేర్కొన్నారు. బళ్లారి తాలూకా రూపనగుడి గ్రామంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో మంగళూరు శ్రీనివాస్ ఆస్పత్రి శనివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రూపనగుడి గ్రామంలో మంత్రి శ్రీరాములు ఈ ఆస్పత్రి నిర్మించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు పాటు పడ్డారన్నారు. మంగళూరు శ్రీనివాస్ ఆస్పత్రి వైద్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం బీపీఎల్, ఆధార్ కార్డు ఉన్న వారందరికి జనరల్ చెకప్, గుండె జబ్బులు, శ్వాసకోస, స్త్రీ రోగ, చెవి, గొంతు, ఎముకలు, థైరాయిడ్, గర్భకోశ తదితర వ్యాధులకు 8 మంది వైద్యులు చికిత్సలు చేశారు. స్థానికులతోపాటు అనంతపురం జిల్లానుంచి కూడా రోగులు వచ్చి వైద్యం చేయించుకున్నారు. గ్రామ పంచాయతీ అధ్యక్షులు నాగరాజ్, బీజేపీ ప్రముఖులు ఓబులేష్, గోవిందప్ప, ప్రకాష్, డాక్టర్.వీరేంద్రకుమార్, వైద్యులు ఆదర్శ, నివేదిత, రుచిక్, అభిజిత్, భార్గవి, యశ్వంత్, ప్రియాంక, విఘ్నేశ్ శెట్టి, వినిత్, వినోద్కుమార్ పాల్గొన్నారు. చదవండి: ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్.. డెలివరీ బాయ్ అంటే అంత చులకనా.. వీడియో వైరల్ -
ఏయ్ ఆపు.. నోర్ముయ్: ప్రభుత్వాధికారిణి జులుం!
బిడ్డ పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ తల్లిని ఓదార్చాల్సింది పోయి.. ఆ ప్రభుత్వాధికారిణి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాటి ఆడదానిగా ఆ తల్లి శోకాన్ని అర్థం చేసుకోలేకపోయిందని, అధికారం ఉందని ఎలా పడితే అలా వ్యవహరిస్తుందా? అని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ మోదీనగర్లో పదేళ్ల అనురాగ్ భరద్వాజ్ అనే కుర్రాడి మరణం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బుధవారం ఎప్పటిలాగే తన స్కూల్ బస్సులో వెళ్తుండగా.. డ్రైవర్ నిర్లక్ష్యంగా బండి నడపడం, హఠాత్తుగా మలుపులు తిప్పడంతో.. అనురాగ్ తన తల బయట పెట్టి వాంతులు చేసుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ మరోసారి మలుపులు తిప్పడంతో.. ఓ స్తంభానికి తల తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో డ్రైవర్, బస్సులో ఉన్న మరో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఫిట్నెస్ లేని బస్సును నడిపించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా.. అనురాగ్ తల్లిదండ్రులతో పాటు మరికొందరు పేరెంట్స్ ధర్నాకు దిగారు. అంతేకాదు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం మీద ఏప్రిల్ 1వ తేదీనే స్కూల్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశామని, అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే తన కొడుకు బతికేవాడని రోదిస్తూ నినాదాలు చేసింది అనురాగ్ తల్లి నేహా. ఈ క్రమంలో.. మోదీనగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ శుభాంగి శుక్లా అక్కడికి వచ్చారు. ‘‘ఎందుకు అర్థం చేసుకోవట్లదమ్మా? చెప్తున్నాగా నోరు మూస్కో’’ అని నేహాను గద్దించింది శుభాంగి. ‘చనిపోయింది నీ కొడుకా? నా కొడుకు?’’ అంటూ ఏడుస్తూ బదులిచ్చింది నేహా భరద్వాజ్. దీంతో కోపోద్రిక్తురాలైన శుభాంగి.. ఎన్నిసార్లు చెప్పాలి. అర్థం చేసుకోవా? నేను అర్థం చేసుకున్నా.. నీ కొడుకు చచ్చాడు’’ అంటూ నోరు పారేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. స్కూల్యాజమాన్యంపై చర్యలతో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను తక్షణమే స్కూల్ బస్సుల ఫిట్నెస్ను పరిశీలించాలని ఆదేశించాడు. అయితే అధికారిణిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ తరుణంలో.. ఆమెపై వేటు వేయాలని పలువురు పేరెంట్స్ కోరుతున్నారు. అయితే ప్రమాదంలో కుర్రాడి తప్పే ఉందని, వాంతులు వస్తున్న విషయం బస్సులో ఉన్న టీచర్కు చెప్పకుండా తల బయటకు పెట్టాడని ఎస్డీఎం శుభాంగి శుక్లా అంటున్నారు. చదవండి: యువకుడ్ని లాగిపెట్టి కొట్టిన ఎమ్మెల్యే -
మొదటిరోజే.. చివరి రోజైంది..
మానవపాడు: పలకా, బలపంతో పాఠశాలకు వెళ్లిన బాలుడికి మొదటి రోజే స్కూల్ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. మూడేళ్ల ప్రాయంలోనే నూరేళ్లు నిండిపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో సోమవారం ఈ హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. చంద్రశేఖర్నగర్ గ్రామం శ్రీనగర్ కాలనీకి చెందిన మహేశ్, సూర్యబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. మహేశ్ ఏపీలోని కర్నూలులో కార్పెంటర్గా పనిచేస్తున్నారు. తమ ఇద్దరు కొడుకులు అభి, అజయ్కుమార్ (3)లను పాఠశాలలో చేర్పించేందుకు రెండు రోజుల క్రితం వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో రూ.4 వేలు ఫీజు కట్టి వచ్చారు. సోమవారం ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపారు. తరగతులు పూర్తయ్యాక బస్సులో అజయ్ ఇంటి వద్దకు వచ్చాడు. బస్సు దిగి రోడ్డుకు ఆవలివైపు ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు వస్తుండగా తల్లి గమనించి ‘బస్సు ముందు బాబు ఉన్నాడు’ ఆపమని కేకలు వేస్తున్నా.. గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో అజయ్ బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కాగా.. న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని తరలించకుండా రాత్రి 8 గంటల వరకు సంఘటనాస్థలంలోనే ఉంచారు. పోలీసులు శాంతింపజేయడంతో మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు 75 శాతం
సాక్షి, అమరావతి: స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్సీ) రెన్యువల్ చేయించుకునే విషయంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాసక్తంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో 75 శాతం స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. కరోనా పరిస్థితులతో దాదాపు ఏడాదిన్నర తరువాత పాఠశాలలను ఇటీవల పునఃప్రారంభించారు. గత ఏడాది కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకునే విషయంపై కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాగా, రెన్యువల్ గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగియనుంది. కానీ ఇప్పటికీ చాలా యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యువల్పై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కరోనా మూడో వేవ్ వస్తుందా, రాదా అనేదానిపై స్పష్టత వచ్చేవరకు ఈ విషయంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. 6,444 బస్సులకు ఎఫ్సీలు రాష్ట్రంలో మొత్తం 25,236 స్కూల్ బస్సులు ఉన్నాయి. కాగా వాటిలో సెప్టెంబర్ 30 నాటికి కేవలం 6,444 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించారు. 18,792 బస్సులకు ఇంతవరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయలేదు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన స్కూల్ బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. -
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు: బడి బండి భద్రమేనా?
సాక్షి, హైదరాబాద్: మరో రెండ్రోజుల్లో స్కూళ్లు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. కోవిడ్ దృష్ట్యా మూడునెలలు ఆలస్యంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలను నిర్వహించేందుకు యాజమాన్యాలు సన్నద్ధమవుతున్నాయి. గ్రేటర్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు సుదీర్ఘ విరామానంతరం పాఠశాలలకు వెళ్లనున్నారు. కానీ.. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన స్కూల్ బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్ దృష్ట్యా సుమారు రెండేళ్లుగా బడి బస్సులు, ఆటోలు, వ్యాన్లు తదితర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రభుత్వమే స్వయంగా మినహాయింపునిచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఫిట్నెస్ లేని వాహనాలే పిల్లలను తరలించే విషయంలో ఆందోళన కలిగిస్తోంది. బాగుంటేనే అనుమతి... ►సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్లో విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. రవాణా శాఖ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ►మోటారు వాహన తనిఖీ అధికారులు తమ పరిధిలోని అన్ని స్కూల్ బస్సులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందిన అనంతరమే పిల్లలను తీసుకెళ్లేందుకు అనుమతినిస్తారు. ►గ్రేటర్ పరిధిలో సుమారు 10,500 స్కూల్ బస్సులకు ఏడాది ఒకసారి మే నెలలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆటోలు, వ్యాన్లకు సైతం క్రమం తప్పకుండా ఫిట్నెస్ పరీక్షలు జరుగుతాయి. ►పిల్లల భద్రత కోసం స్కూల్ యాజమాన్యాలు, వాహనాలు నడిపే డ్రైవర్లు, పిల్లల తల్లిదండ్రులకు ఆర్టీఏ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు. ►కరోనా కారణంగా ఇంచుమించు రెండేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఫిట్నెస్ పరీక్షల నుంచి ప్రభుత్వమే మినహాయింపునివ్వడంతో చాలా బస్సులు ఫిట్నెస్కు దూరంగానే ఉన్నాయి. కొందరు యజమానులు మాత్రం స్వచ్ఛందంగా ఫిట్నెస్ సరి్టఫికెట్లు పొందారు. నిర్వహణలో నిర్లక్ష్యం.. ►స్కూల్ వాహనాల నిర్వహణలో సహజంగానే నిర్లక్ష్యం ఉందనే ఆరోపణ చాలా కాలంగా ఉంది. ప్రతి సంవత్సరం మే నెలలో జరగాల్సిన ఫిట్నెస్ పరీక్షలు జూలై , ఆగస్టు వరకు కొనసాగుతూనే ఉంటాయి, ►మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు బస్సులను స్వయంగా పరిశీలించి, తనిఖీ చేయాల్సి ఉండగా, కిందిస్థాయి సిబ్బంది మొక్కుబడిగా ఆ పని చేస్తున్నారు. స్కూల్ ఆటోలు, వ్యాన్ల నిర్వహణలోనూ అదే నిర్లక్ష్యం నెలకొని ఉంది. ►గ్రేటర్లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఉన్నాయి. వాటిలో కనీసం 50 వేల ఆటోలు స్కూల్ పిల్లల తరలింపునకు వినియోగిస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా ఈ ఆటోలన్నీ ప్రస్తుతం ప్రయాణికుల రాకపోకలకు పరిమితమయ్యాయి. ►మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు మారుతీ ఓమ్ని, మెటడోర్ వంటి వాహనాలను స్కూల్ పిల్లలకు వినియోగించడం నేరం. కానీ.. సుమారు 20 వేలకు పైగా వ్యాన్లు పిల్లల తరలింపు కోసం నడుస్తున్నాయి. ప్రస్తుతం వీటి ఫిట్నెస్ పరీక్షలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యం.. ►వాహనాల ఫిట్నెస్ గడువును కేంద్రం సెపె్టంబర్ వరకు పొడిగించింది. కానీ స్కూళ్లు మాత్రం తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఫిట్నెస్ పరీక్షలు అసాధ్యం. ►ఇప్పుడున్న స్థితిలోనే వాహనాలను వినియోగించడం లేదా, తల్లిదండ్రులు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోవడం ఒక్కటే పరిష్కారం. ఉన్నపళంగా విద్యాసంస్థలు తెరుచుకోనున్న దృష్ట్యా పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లే అంశంపై చాలా మంది తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. -
స్కూల్ బస్ల ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి
-
కృష్ణ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
-
టాటా చెప్పేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం. తన అక్కకు టాటా చెప్పేందుకు వెళ్లిన చిన్నారిని మృత్యువు బస్సు రూపంలో కబళించగా.. అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన తమ కూతురు ఇక లేదనే చేదు నిజాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుళ్లూ.. గోపురాలు తిరిగితే దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే తీసుకెళ్లాడంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, సంగెం: అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాధ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకా రం.. అక్క స్కూల్కు వెళ్తుంటే టాటా చెప్పేం దుకు వెళ్లి చెల్లెలు తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాధ సంఘటన ఇది. స్థానికులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కాట్రపల్లికి చెందిన కర్ర జ్యోత్స్న, అమరేందర్రెడ్డిలకు సమ్మిత, మనస్విత(రెండున్నర సంవత్సరాలు) సంతానం ఉన్నారు. పెద్దకూతురు వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్ క్యాంపులోని పాత్ఫైండర్ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతుంది. బుధవారం బస్సు హారన్ విని తల్లి పెద్ద కూతురు సమ్మితను స్కూల్ బస్సు ఎక్కించడానికి చిన్న కూతురును తీసుకుని ఇంటి సమీపంలోని రోడ్డు వరకు వెళ్లింది. రోడ్ అటు వైపు దాటి ఆగిఉన్న బస్సులో పెద్ద కూతురును ఎక్కించింది. చిన్న కూతురును తీసుకుని బస్సు ముందు నుంచి ఇంటికి వస్తుండగా బస్సు డ్రైవర్ కాగితాల లింగమూర్తి ఆజాగ్రత్తగా ముందుకు వెళ్లడంతో బస్సు ముందు టైర్ కిందపడిన చిన్నారి మనస్విత తల పైనుంచి వెళ్లడంతో రోడ్పై ఉన్న కర్ర రాజిరెడ్డి, మిలుకూరి రామచంద్రారెడ్డి, మందాటి రాజేశ్వర్రెడ్డి చూసి కేకలు వేయడంతో బస్సును నిలిపివేశాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చిన్నారి మృతిచెందింది. చిన్నారి మనస్విత తండ్రి అమరేందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కాగా, చిన్నారి మృతిచెందడంతో కుటుంబసభ్యులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. -
బెంగాల్ ‘టీ కప్పులో తుఫాను’
సాక్షి, న్యూఢిల్లీ : ‘టీ కప్పులో తుఫాను’ అంటే ఇదేనేమో! అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్ఫాయిగురి పర్వత ప్రాంతం. గత జూలై ఒకటవ తేదీన చుపార తేయాకు తోటలో వాతావరణం చల్లాగా ఉంది. అప్పుడప్పుడు వర్షం జల్లులు కురుస్తున్నాయి. కార్మికుల కాలనీ ఇళ్ల నుంచి ఒక్కొక్కరుగా వందల మంది విద్యార్థినీ విద్యార్థులు బయటకు వచ్చి తేయాకు తోటంతా నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. తాము స్కూల్కు వెళ్లి రావడానికి రెండు బస్సులనైనా నడపాలి లేదా రెండు ట్రిప్పులనైనా నడపాలంటూ వారు నినదించారు. ఆ మరుసటి రోజు 400 మంది విద్యార్థినీ విద్యార్థులు తేయాకు తోటకొచ్చే దారులన్నింటిని దిగ్బంధనం చేశారు. తేయాక తోట యాజమాన్యం బెదిరింపులకు, కార్మిక నాయకుల బుజ్జగింపులకు వారు ఏమాత్రం లొంగలేదు. అలాగే వారం పాటు స్కూల్కు పోకుండా, తేయాకు తోటలో పనులు జరగకుండా అడ్డుకున్నారు. 1980లో పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వానికి, తేయాకు తోటల యాజమానుల సంఘం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పనిచేసే చోటే కార్మికులకు వసతి కల్పించడంతోపాటు వారి పిల్లలు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు స్కూల్ బస్సులను తేయాకు తోటల యాజమాన్యమే సమకూర్చాలి. అయితే చుపార తేయాకు తోటలో 150 మంది విద్యార్థిని విద్యార్థులు ఉండగా, తోట యాజమాన్యం ఒక స్కూల్ బస్సును ఒకే ట్రిప్ నడుపుతోంది. అంత మందికి అందులో ఊపిరాడకుండా ఉండడంతో విద్యార్థినీ విద్యార్థులు విడతల వారీగా స్కూల్ ఎగ్గొడుతూ వచ్చారు. తమ బాధ గురించి వారు తల్లిదండ్రులకు చెప్పుకున్నా ప్రయోజనం లేకపోవడంతో వారే ప్రత్యక్షంగా ఆందోళనకు దిగారు. ఎప్పటిలాగానే తేయాకు తోట యాజమాన్యం తేయాకు తోటను మూసివేస్తానని, బస్సులను బంద్ చేస్తామని బెదిరించింది. అయినా విద్యార్థులు ఆందోళన విరమించక పోవడంతో యాజమాన్యమే దిగివచ్చి రెండు ట్రిప్పులు బస్సు నడిపేందుకు అంగీకరించింది. 2002, 2007లో మొత్తం 17 తేయాకు తోటలు మూత పడడం వల్ల 1200 మంది కార్మికులు ఆకలితో మరణించారు. కొన్ని వేల మంది కార్మికులు సిక్కిం, భూటాన్, ఢిల్లీ, కేరళ, బెంగళూరు ప్రాంతాలకు వలసపోయారు. ఒప్పందం మేరకు చుపార యాజమాన్యం వారం రోజులకు మించి బస్సును రెండు ట్రిప్పులు నడపలేదు. శాశ్వత కార్మికుల పిల్లల కోసం బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తూ తాత్కాలిక కార్మికుల పిల్లలకు బస్సు సౌకర్యాన్ని ఎత్తివేసింది. దుమ్కా, హజారీబాగ్, రాంచీ, చైబాస ప్రాంతాల్లోని తేయాకు తోటల యాజమాన్యాలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ఆ తేయాకు తోటల్లో నాలుగున్నర లక్షల మంది కార్మికులు పనిచేస్తుండగా, వారిలో 2.62 లక్షల మంది కార్మికులు మాత్రమే శాశ్వత ఉద్యోగులు. తునికాకు ఏరే కార్మికులకు రోజుకు రూ.297 చెల్లిస్తుండగా, తేయాకు తోట కార్మికులకు రోజుకు రూ.176 మాత్రమే చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు 20, 30 కిలోమటర్ల దూరంలో ఉండే పాఠశాలలకు కార్మికులు తమ పిల్లలను ఎలా పంపిస్తారు? స్త్రీ, పురుషులకు సమాన వేతనం చెల్లించాలంటూ భారత పార్లమెంట్ 1976లో చట్టం తీసుకరావడానికి ముందే, అంటే 1974లో బెంగాల్లోని ‘సొనాలి గార్డెన్’ తేయాకు తోట యాజమాన్యం స్త్రీ, పురుషులకు సమాన వేతనం చెల్లించడంతోపాటు 1977లో అధిక లాభాలు రావడంతో కార్మికుల వేతనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. అలాంటి సంస్థ కూడా ఇతర తోటల యాజమానుల ఒత్తిడులకు తలొగ్గి వారి బాటనే నడుస్తోంది. ఇప్పుడు ‘టీ కప్పులో తుఫాను’ లాగానే చుపార తేయాకు విద్యార్థుల ఆందోళన పూర్తిగా చల్లబడింది. తోటి విద్యార్థిని విద్యార్థుల్లో సగం మంది బడి మానేసినా వారిలో చలనం లేదు. కార్మిక నాయకులు ఎప్పటిలాగే మౌనం పాటిస్తున్నారు. విద్యార్థులకు తేయాకు తోటల యాజమాన్యం బస్సు సౌకర్యం కల్పించనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమైనా కల్పించాలి. ఎన్నికల నిధుల కోసం తేయాకు తోటల యాజమాన్యాల మీద ఆధారపడే ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచిస్తాయి! -
డివైడర్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు
-
మల్లేపల్లి : స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి
సాక్షి, దేవరకొండ : కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవరోని తండాలో ఇస్లావత్ అఖిల్(5) అనే యూకేజీ విద్యార్థి బస్సు కింద పడి మృతిచెందాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాలు..తండాలో నివసిస్తున్న ఇస్లావత్ కూమార్, శాంతి దంపతుల కుమారుడు అఖిల్ను కొండమల్లేపల్లిలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ చదివిస్తున్నారు. రోజూ స్కూల్ బస్సులో వెళ్లి వస్తుండే అఖిల్,రోజులాగే మంగళవారం కూడా బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా, డ్రైవరు చూసుకోకుండా బస్సు కదిలించడంతో వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డ్రైవరు పరారయ్యాడు. ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోలేని తండావాసులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. -
చెరుకు తోటలోకి దూసుకుపోయిన స్కూల్ బస్సు
-
నారాయణ స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సాక్షి, విజయనగం : జిల్లాలోని కొమరాడ మండలం అర్థం గ్రామ శివారులో బుధవారం నారాయణ స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవైపు వర్షం పడుతున్నా 32 మంది పిల్లలతో బయల్దేరిన బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి నేరుగా పక్కనే ఉన్న చెరుకు తోటలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలోలో పిల్లలు సురక్షితంగా బయటపడ్డా, డ్రైవర్కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బస్సులో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ స్కూల్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మత్తులో డ్రైవర్.. స్కూల్ బస్సు బోల్తా
సాక్షి, నెల్లూరు(డక్కిలి) : మండలంలో జరిగిన శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ మద్యం మత్తే కారణమని పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకటగిరి శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్కు చెందిన బస్సు ఉదయం 7.30 గంటలకు డక్కిలి మండలంలోని కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయిపాళెం గ్రామాలకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని డక్కిలి వైపు వస్తోంది. ఎనిమిది గంటల సమయంలో కుప్పాయిపాళెం దాటిన తర్వాత బస్సు అదుపుతప్పినట్లుగా విద్యార్థులు గుర్తించి కేకలు వేశారు. డ్రైవర్ నవకోటి మద్యం మత్తులో ఉండటం, నిద్రలోకి జారుకోవడంతో బస్సు చెరువు వద్ద గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటనలో నర్రావుల వెంకటేష్ (6వ తరగతి), పోకూరు రోహిత్ (6వ తరగతి), వేముల నాని (6వ తరగతి), తంబిశెట్టి యామిని (5వ తరగతి), పెదనేని చంద్రిక (5వ తరగతి), కొక్కనేటి శ్రీనివాస్కుమార్ (9వ తరగతి), వేముల శరణ్య (4వ తరగతి), ఏలేశ్వరం మహేష్ (5వ తరగతి), పత్తిపాటి భానుప్రకాష్ (6వ తరగతి), ఎ.మోహన్ (9వ తరగతి), కుంచెం నిఖిలేస్ (3వ తరగతి), డ్రైవర్ నవకోటిలకు గాయలయ్యాయి. వీరిలో నిఖిలేష్, యామిని, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో డక్కిలి పోలీసుల స్పందన స్కూల్ బస్సు బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న డక్కిలి ఎస్సై కామినేని గోపి వెంటనే స్పందించి తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. భయాందోళనతో కేకలు వేస్తున్న విద్యార్థులను ఎస్సై, పోలీసు సిబ్బంది స్థానికులు సాయంతో బస్సులో నుంచి బయటకు తీశారు. పోలీసు వ్యాన్లో డక్కిలి పీహెచ్సీకి తరలించారు. అక్కడ విద్యార్థులకు డాక్టర్ సుధీర్కుమార్ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వెంకటగిరిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. గూడూరు ఆర్డీఓ బాపిరెడ్డి, డక్కిలి తహసీల్దార్ మునిలక్ష్మి లు విద్యార్థులను పరామర్శించారు. వైద్యసేవల గురించి ఆరాతీశారు. తహసీల్దార్ కుప్పాయిపాళెం, డీ వడ్డిపల్లి గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ వెంకటగిరి సీఐ అన్వర్బాషా ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి వివరాలు ఆరాతీశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా తెలిపారు. ఈ విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో వెల్లడైందన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 49 శాతం ఆల్కాహాల్ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్ను కూడా నియమించలేదని వాపోయారు. రాత్రంతా నిద్రపోలేదు స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 49 శాతం ఆల్కాహాల్ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్ను కూడా నియమించలేదని వాపోయారు. డ్రైవర్ నిద్రలో ఉన్నాడు : విద్యార్థి కుప్పాయిపాళెం గ్రామం దాటగానే చెరువు వద్ద బస్సు పక్కకు వెళ్లి పోతుండటాన్ని గుర్తించి కేకలు వేశాం. అప్పటికే డ్రైవర్ నిద్రలో ఉన్నాడు. బస్సు అదుపుతప్పి గుంతలో పడిపోగానే మేము గాయపడ్డాం. కేకలు వేయగా చుట్టుపక్కల వారు, పోలీసులు వచ్చి కాపాడారు. -
చిన్నారులను చిదిమేశారు !
సాక్షి, వేములవాడ : తమలాగే తమ పిల్లల బతుకులు మారొద్దనుకున్నారు. ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే అయినా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కలగన్నారు. కానీ విధి వారి జీవితాలతో ఆటాడుకుంది. పిల్లల గురించి ఎన్నోకలలుగన్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిల్చింది. ప్రైవేటు పాఠశాల యజమాన్య నిర్లక్ష్య వైఖరి.. ఫిట్నెస్లేని స్కూలు వ్యాన్.. డ్రైవర్ ఉన్మాదంతో అతివేగంగా వాహనం నడపడం వెరసి.. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముగ్గురు చిన్నారులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్ శివారులో బుధవారం స్కూల్వ్యాన్ బోల్తాపడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ పట్టణంలోని వాగేశ్వరి (శ్రీచైతన్య) హైస్కూల్కు పాఠశాల, హాస్టల్ వేర్వేరు చోట్ల ఉన్నాయి. విద్యార్థులు పట్టణ పరిధిలోని తిప్పాపూర్ శివారులో ఉన్న స్కూల్ హాస్టల్లో ఉంటారు. రోజూ పాఠశాల నుంచి స్కూల్ వ్యానులో హాస్టల్కు వచ్చి మధ్యాహ్న భోజనం తర్వాత మళ్లీ స్కూల్కు వెళ్తుంటారు. ఎప్పటిలాగే.. బుధవారం కూడా మధ్యాహ్నం భోజనం కోసం 27 మంది విద్యార్థులు వ్యాన్ (ఏపీ 15 టీబీ 7800)లో హాస్టల్కు బయల్దేరారు. వేములవాడ ఆర్టీసీ డిపో ప్రాంతానికి రాగానే.. ఈ స్కూలు వ్యాన్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. వాహనం వేగంగా ఉండడంతో అందులోని విద్యార్థులు కొందరు కిటికీల్లోంచి ఎగిరి బయట పడ్డారు. వీరిపైనే వ్యాన్ కూడా పడింది. దీంతో పదో తరగతి విద్యార్థిని కాసరవేణి మణిచందనారాణి (15), రెండో తరగతి విద్యార్థిని గుగులోతు దీక్షిత (6) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. మూడో తరగతి విద్యార్థి రిషి (7) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఠాకూర్ రాకేశ్(15), గుమ్మడి సాయి నిఖిల్ (15), వేర్పుల అజయ్కుమార్ (15) మారుపాక రోహిత్ (9), గుండెకర్ల రేవంత్ (7) సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్పందించిన యువత ప్రమాదం సమయంలో అటుగా వెళ్తున్న తిప్పాపూర్ గ్రామానికి చెందిన గణేశ్ మంటప నిర్వాహకులు బోల్తాపడిన స్కూలు వ్యాన్ను పైకి లేపారు. తద్వారా కొందరి ప్రాణాలు కాపాడిన వారయ్యారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం కావడంతో ఆగ్రహానికి లోనై.. వ్యాన్ డ్రైవర్ రఫీక్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి మంత్రి, ఎంపీ విద్యార్థుల మృతి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వేర్వేరుగా సంఘటన స్థలాన్ని సందర్శించారు. మంత్రి బస్ డిపో ప్రాంతానికి చేరుకుని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఎంపీ బండి సంజయ్ కూడా.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎంపీపీ మల్లేశంతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ, జేసీ యాస్మిన్ బాషా, జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే, డీఆర్వో ఖీమ్యానాయక్, డీఈవో రాధాకిషన్, ఆర్డీవో శ్రీనివాస్రావు, డీఎస్పీ వెంకటరమణ, సీఐ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, రంగు వెంకటేశ్గౌడ్ బాసటగా నిలిచారు. కాగా, ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్లో ఆరా తీశారు. కాగా, బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తక్షణ సాయంగా రూ.2లక్షల చెక్కులను అందజేసింది. వ్యాన్కు ఫిట్నెస్ లేదు ! వేములవాడలో నిర్వహిస్తున్న వాగేశ్వరి (శ్రీచైతన్య) స్కూల్ వ్యాన్ (ఏపీ 15 టీబీ 7800)కు ఎలాంటి ఫిట్నెస్ లేదని పోలీసులు వెల్లడించారు. 15 సీట్ల సామర్థ్యం కలిగిన వ్యాన్లో సామర్థ్యానికి 27 మంది తీసుకెళ్తున్నారు. ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. స్కూల్ హాస్టల్కు కూడా ఎలాంటి అనుమతుల్లేకుండానే నిర్వహిస్తున్నారని డీఈవో రాధాకిషన్ పేర్కొన్నారు. రోజూ చింతల్ఠాణా నుంచి వేములవాడకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విద్యార్థులను తరలిస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రమాదం ముగ్గురి మృతికి కారణమైంది. కాగా, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన చిన్నారులు ఇంకా షాక్నుంచి కోలుకోలేదు. కళ్లముందే జరిగిన ప్రమాదాన్ని తలచుకుని వారు వణికిపోతున్నారు. బస్డిపోలో బాధిత కుటుంబాలతో చర్చలు ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఈటల రాజేందర్ బస్డిపో ఆవరణలో జిల్లా అధికారులు, బాధిత కుటుంబాలతో సమాలోచనలు చేశా>రు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున అందజేయాలని సూచించినట్లు తెలిసింది. కాగా, వాగేశ్వరి (శ్రీచైతన్య) స్కూల్ అనుమతులను రద్దు చేస్తామని డీఈవో రాధాకిషన్ ప్రకటించారు. హాస్టల్ నిర్వహణకు ఎలాంటి అనుమతులూ లేనప్పటికీ.. యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘించినందుకు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. భద్రతపై పోలీసులను అప్రమత్తం చేస్తాం వేములవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటనపై ఎస్పీ రాహుల్ హెగ్డే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో బాధితుల కుటుంబీకులు, అక్కడ గుమిగూడిన యువకులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఎస్పీ చొరవతీసుకుని వారిని శాంతింపజేశారు. ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖను సైతం అప్రమత్తం చేసి విద్యార్థుల భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. - ఎస్పీ రాహుల్ హెగ్డే -
బలవంతంగా స్కూల్కి.. బస్సులోంచి దూకేశాడు
సాక్షి, కణేకల్లు: తల్లి బలవంతంతో స్కూలుకు పయనమైన విద్యార్థి బస్సు కదిలి కొంత దూరం వెళ్లాక కిందకు దూకేశాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. కణేకల్లు మండలం ఎన్.హనుమాపురం గ్రామానికి చెందిన కురుబ సరోజమ్మ, రాజన్న దంపతుల కుమారుడు కురుబ లాలుమోహన్ ఉరవకొండలోని మహేశ్వరీ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ యాజమాన్యం విద్యార్థుల రాకపోకల కోసం బస్సును ఏర్పాటు చేసింది. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఎన్.హనుమాపురానికి బస్సు వచ్చి విద్యార్థులను ఎక్కించుకొని స్కూల్కు వెళ్తోంది. అయితే శుక్రవారం కురుబ లాలుమోహన్ స్కూల్కెళ్లనని మొండికేశాడు. తల్లి బతిమాలి.. బస్టాప్ వరకెళ్లి కొడుకును బస్సు ఎక్కించింది. బస్సు ఊరు దాటి వేగంగా వెళ్తున్న సమయంలో లాలుమోహన్ బస్సు డోర్ తీసేసి ఒక్కసారిగా కిందకు దూకాడు. ఇది గమనించని డ్రైవర్ ముందుకెళ్లాడు. తోటి విద్యార్థులు గమనించి డ్రైవర్కు విషయం తెలపడంతో వెంటనే బస్సును వెనక్కు తీసుకెళ్లాడు. బస్సులోంచి విద్యార్థి కిందకు దూకిన విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారమందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. లాలుమోహన్ చెవిలోంచి రక్తం కారుతండటంతో పాటు తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి పంపించారు. స్కూల్ యాజమాన్యంపై మండిపాటు బస్సులో నుంచి విద్యార్థి కిందకు దూకి ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో సదరు స్కూల్ యాజమాన్యంపై ప్రజలు మండిపడుతున్నారు. బస్సులో క్లీనర్ లేదా అటెండర్ ఎవరైనా ఉండి ఉంటే విద్యార్థి డోర్ తీసుకుని దూకేవాడు కాదని అన్నారు. అయితే ఒక క్లీనర్ / అటెండర్ను పెట్టడంలో స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేసే యాజమాన్యం పిల్లలకు సరైన భద్రత కల్పించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి జరిగిన ఘటనపై విచారణ నిర్వహించి బాధ్యులైన మహేశ్వరీ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వైద్య ఖర్చులు స్కూలు యాజమాన్యమే భరించాలి స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ కుమారుని వైద్యానికయ్యే ఖర్చును వారే భరించాలని విద్యార్థి తల్లిదండ్రులు కురుబ సరోజమ్మ, రాజన్నతోపాటు వైఎస్సార్సీపీ నాయకు లు, ఎన్.హనుమాపురం మాజీ సర్పంచు పైనేటి తిమ్మప్పచౌదరి డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా బాధిత విద్యార్థి బంధువులు శుక్రవారం మహేశ్వరీ స్కూల్ వద్దకెళ్లి జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుకు డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని సహాయకునిగా ఎందుకు పెట్టలేదని వారిని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్లే విద్యార్థి ప్రాణం మీదకు వచ్చిందని మండిపడ్డారు. -
80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
అంతులేని నిర్లక్ష్యం... అతి వేగం కారణంగా 80 మంది విద్యార్థుల ప్రాణాలతో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ చెలగాటమాడాడు. జాతీయ రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తూ రెండు ప్రమాదాలకు కారకుడయ్యాడు. మృత్యు కౌగిలిని అతి చేరువగా చూసి ప్రాణాలతో బయటపడ్డ చిన్నారులు భయంతో కన్నీటిపర్యంతమయ్యారు. 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఈ ఘటన సంచనలమైంది. వివరాల్లోకి వెళితే.. – కనగానపల్లి సాక్షి, అనంతపురం: కనగానపల్లి మండలం ముక్తాపురం వద్ద 44వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ఘటనలో బస్సులో ఉన్న 65 మంది చిన్నారులు స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి... ధర్మవరం పట్టణంలోని ప్రియదర్శిని విద్యామందిర్లో కనగానపల్లి మండలంలోని ముక్తాపురంలో 20 మంది, రాంపురంలో 45 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం విద్యామందిర్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ బస్సు నడుపుతున్నారు. అయితే బస్సుల నిర్వహణలో పాఠశాల యాజమాన్యం నిబంధనలకు తిలోదకాలిచ్చేసిందన్న ఆరోపణలున్నాయి. అత్యధిక విద్యార్థులు ఉన్న రాంపురం గ్రామానికి ధర్మవరం నుంచి నేరుగా మామిళ్లపల్లి, కనగానపల్లి మీదుగా బస్సు నడపాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా ముక్తాపురం, ధర్మవరం మండలంలోని కామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులను కూడా కలిపారు. మొత్తం 80 మంది విద్యార్థులను ఒకే బస్సులో రోజూ బడికి, తిరిగి ఆయా గ్రామాలకు చేరవేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్కూల్ యాజమాన్యం ఈ విషయంలో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. నిర్లక్ష్యంతోనే ప్రమాదం? గురువారం సాయంత్రం బడి ముగియగానే 80 మంది విద్యార్థులతో ధర్మవరం నుంచి బస్సు బయలుదేరింది. తొలుత కామిరెడ్డిపల్లికి చేరుకుని 15 మంది విద్యార్థులను అక్కడ డ్రైవర్ దింపేశాడు. అక్కడి నుంచి పల్లెల మీదుగా ముక్తాపురానికి బయలుదేరాడు. సాధారణంగా రోడ్డు దాటుకునే సమయంలో డ్రైవర్లు అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తుంటారు. జాతీయ రహదారిపై మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విషయంలో స్కూల్ బస్సు డ్రైవర్ అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరిచాడు. జాతీయ రహదారిపై ముక్తాపురం క్రాస్ వద్ద వెనుకా ముందు ఆలోచించకుండా బస్సును ఇటువైపు నుంచి అటువైపు రోడ్డులోకి వేగంగా తీసుకెళ్లాడు. అదే సమయంలో బెంగుళూరు నుంచి అనంతపురం దిశగా జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారును గమనించి బస్సును రోడ్డు దాటించే ప్రయత్నింలో మరింత వేగాన్ని పెంచాడు. అప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన కారు డ్రైవర్ బలంగా బ్రేక్లు వేసినా ఫలితం లేకపోయింది. రోడ్డును రాసుకుంటూ వచ్చిన కారు.. బస్సు వెనుక భాగాన్ని తాకింది. అదే సమయంలో బస్సును డ్రైవర్ రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూకించాడు. మిన్నంటిన హాహాకారాలు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారిగా రేకుల షెడ్డులోకి బస్సు దూసుకెళ్లడంతో అదుటుకు విద్యార్థులు కిందామీదపడ్డారు. ఏదో జరిగిపోయిందన్న భయంతో ఒక్కసారిగా ఆర్తనాదాలు చేశారు. ఆ పక్కనే ఉన్న కాలనీ వాసులందరూ మూకుమ్మడిగా అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న చిన్నారులందరినీ కిందకు దింపి ఊరడించారు. అప్పటికీ చిన్నారులు స్థిమిత పడలేకపోయారు. వారి శరీరాల్లో వణుకు తగ్గలేదు. కళ్లు నిరంతరంగా వర్షించాయి. తమకు చేరువగా ఉన్న పెద్దలను కౌగిలించుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ముక్తాపురం విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. భయంతో విలవిల్లాడుతున్న చిన్నారులను ఓదార్చడం వారికి సాధ్యపడలేదు. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు బస్సు వెనుక ప్రాంతాన్ని తాకిన కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారు డ్రైవర్ హరినాథరెడ్డికి కాలు విరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న కనగానపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భయంతో బిక్కచచ్చిన విద్యార్థులను మరో బస్సులో సురక్షితంగా ఇళ్లకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ కారు డ్రైవర్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
-
భాష్యం స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సాక్షి,చందర్లపాడు : విద్యార్థులతో వెళుతున్న ఓ ప్రయివేట్ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు వద్ద భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో బస్సులో ఉన్న 32మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం విద్యార్థులను అక్కడ నుంచి తరలించారు. ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్క్ష్యంగా మితిమీరిన వేగంతో బస్సును నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మూల మలుపు వద్ద నెమ్మదిగా వెళ్లాలని పలుమార్లు హెచ్చరించినా డ్రైవర్ పెడచెవిన పెట్టేవాడని, స్కూల్ యాజమాన్యం డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తమ పిల్లలు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : అందరూ నాలుగేళ్ల నుంచి పదేళ్ల లోపు చిన్నారులే.. అప్పటివరకు సరదాగా గడిపిన వారంతా... ఒక్కసారిగా హాహాకారాలతో భయభ్రాంతులకు గురయ్యారు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు వారంతా షాక్లోకి వెళ్లిపోయారు.. తణుకు మండలం తేతలి గ్రామ పరి«ధిలోని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలు బస్సు ప్రమాదానికి గురైన సంఘటనలో 34 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం ఉదయం విద్యార్థులను తరలిస్తున్న ఏపీ 37 టీడీ 8878 నెంబరు కలిగిన బస్సు స్కూలు సమీపంలోని పంట కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న చిన్నారులను స్థానికంగా పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు హుటా హుటిన చేరుకుని వారందరినీ బయటకు తీశారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పుంత రోడ్డులోనే రాకపోకలు తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలుకు చెందిన బస్సు పెరవలి, కాపవరం, కొత్తపల్లి, తూర్పువిప్పర్రు గ్రా మాల నుంచి 34 మంది విద్యార్థులను ఎక్కించుకుని బయల్దేరింది. వీరంతా ఎల్కేజీ నుంచి ఆరో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం. ఏఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ ఆనుకుని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలు నడుస్తోంది. అయితే స్కూలు బస్సులు రాకపోకలకు అత్తిలి కాల్వ ఆనుకుని పుంతరోడ్డునే యాజమాన్యం వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో అత్తిలి కాల్వకు రోడ్డుకు మధ్యలో పంట కాల్వ ప్రవహిస్తోంది. అయితే పుంత రోడ్డు ఇరుకుగా ఉండటంతోపాటు ఇటీవల కురుస్తున్న వర్షాలకు గట్టు తెగిపోయింది. దీనిని గమనించని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బస్సు పంట కాల్వలోకి దూసుకెళ్లిపోయింది. ఈ సమయంలో విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో రైతులు, కూలీలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే మధ్యలో పంట కాల్వ లేకపోతే నేరుగా పెద్ద కాల్వలోకే బస్సు వెళ్లిపోయేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే కారుమూరి ఆరా.. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంఘటనపై ఆరా తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా వెంకటేష్, సరెళ్ల వీరతాతయ్యను తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి స్కూలు యాజమాన్యంతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాయకులు వెంకటేష్, వీరతాతయ్యలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. సంఘటనా స్థలానికి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సంపత్కుమార్ చేసుకుని వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్, యాజమాన్యంపై రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భయం వేసింది స్కూలులో తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాను. కాపవరంలో ఉదయం బస్సు ఎక్కాను. అయితే రోజు కంటే ఆలస్యంగా బస్సు వచ్చింది. స్కూలు టైం అయిపోతోందనే ఆందోళనలో ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే స్కూలుకు చేరుకుంటున్నాం అనగా పంట కాల్వలోకి బస్సు దూసుకెళ్లింది. దీంతో అందరికీ భయం వేసింది. –కట్టికూటి సుబ్రహ్మణ్యం, విద్యార్థి, కాపవరం డ్రైవర్ను మార్చారు నా ఇద్దరు పిల్లలు స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలులోనే చదువుకుంటున్నారు. పెరవలి మండలం కాపవరం నుంచి బస్సులో స్కూలుకు వస్తున్నారు. అయితే ఇటీవల స్కూలు బస్సు డ్రైవర్ను మార్చారు. దీంతోపాటు రెండేసి ట్రిప్పులు వేస్తుండటంతో వేగంగా విద్యార్థులను తరలిస్తున్నారు. –కాకరపర్తి శ్రీలక్ష్మి, విద్యార్థుల తల్లి, కాపవరం -
పుట్పాత్ పైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
-
బాధ్యత ఎవరిది..?
సాక్షి, సిటీబ్యూరో: మరో విద్యా సంవత్సరం మొదలైంది... పాఠశాలలు పునఃప్రారంభమ య్యాయి... నగరంలో స్కూలు బస్సులకు అనేక రెట్లు ఆటోల్లో విద్యార్థుల రవాణా జరుగుతోంది... వీటిలోనూ ఆరుగురి కంటే ఎక్కువ తరలించరాదంటూ మరి కొన్ని నిబంధనలు విధించిన సర్కారు చేతులు దులుపుకుంది... ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ కూడా చేస్తున్నారు... ఇక్కడి వరకు బాగానే ఉన్నా... కొన్ని కీలకమైన అంశాలను అన్ని విభాగాలు విస్మరిస్తుండటం సమస్యలకు తావిస్తోంది. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 3 వేల స్కూళ్లు..వెయ్యి స్కూల్ బస్సులు నగరంలోని కొన్ని ‘ఖరీదైన’ స్కూళ్లు మినహా మిగిలిన వాటికి సొంత రవాణా వ్యవస్థ లేదు. ప్రముఖ పాఠశాలలు సైతం ఈ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలో సొంతంగా రవాణా సౌకర్యాన్ని కల్పించిన కొన్ని స్కూళ్లు ఇప్పుడు దానిని విస్మరించాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం నగరంలో 3 వేలకు పైగా స్కూళ్లు ఉండగా... ఆర్టీఏ లెక్కల ప్రకారం కేవలం వెయ్యి స్కూల్ బస్సులు మాత్రమే ఉన్నాయి. అంటే... స్కూలుకు ఒక బస్సు లెక్కన వేసుకున్నా రెండు వేల స్కూళ్లకు లేవన్నమాట. ఫలితంగా విద్యార్థులను ఆటోలు తదితర వాహనాల్లో స్కూళ్లకు పంపించాల్సి వస్తోంది. ప్రతి స్కూలు తమ విద్యార్థులకు ట్రాన్స్ఫోర్స్ ఫెసిలిటీ కల్పించాలన్నది కచ్చితం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. తల్లిదండ్రులు తదితరులు సొంతంగా తీసుకువచ్చి దింపే విద్యార్థులు మినహా మిగిలిన వారు స్కూలు బస్సుల్లోనే ప్రయాణించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని ఆరోపిస్తున్నారు. ఆటోల వీర బాదుడు... దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల చేతిలో మోసపోకూడదని భావిస్తున్న ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రీ పెయిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడో ఒకసారి నగరానికి వచ్చే వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న వారు అనునిత్యం ఆటోవాలాల చేత దోపిడీకి గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్కూలు పిల్లలను తరలించే ఆటోల డ్రైవర్లు దూరంతో నిమిత్తం లేకుండా భారీగా దండుకుంటున్నారు. సెలవులతో తమకు సంబంధం లేదని, మొత్తం 11 నెలలకూ చెల్లించాల్సిందేనంటూ వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూలు ఆటోలకు ఫేర్స్ (చార్జీలు) నిర్ణయించాల్సిన అవసరం కనిపిస్తోందని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆటో సేఫ్టీ గాలిలోనే... స్కూలు బస్సుల ఫిట్నెస్, డ్రైవర్లకు అర్హతలు అంటూ గొంతు చించుకుంటున్న ఆర్టీఏ, ఆటోల్లో ఆరుగురే అంటూ విరుచుకుపడుతున్న ట్రాఫిక్ అధికారులు ఆటోల ఫిట్నెస్ ను విస్మరిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తూ పసి వాళ్లకు తరలించే ఆటోలకు సైడ్ డోర్స్, సేఫ్టీ మెష్లు మచ్చుకైనా కనిపించవు. వీటిలో అనేక ఆటోలు ఫిట్నెస్కు ఆమడ దూరంలో ఉంటున్నాయి. వీటి డ్రైవర్లూ ఆర్టీఏ నిర్ధేశించిన ప్రకారం ఉండట్లేదు. మరోపక్క తమ స్కూలుకు విద్యార్థులను తరలిస్తున్న ఆటోల వివరాలు, వాటి డ్రైవర్ల వ్యవహారం యాజమాన్యాలకు అసలే పట్టదు. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సుల మాదిరి స్కూలు ఆటోలకూ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆటోలకు నిబంధలు అవసరం లేదా? స్కూలు బస్సుల విషయంలో నిబంధనలు వల్లెవేసే ఆర్టీఏ అధికారులు స్కూలు ఆటోల విషయంలో మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. సదరు ఆటోలు విద్యార్థులను తరలిస్తున్న సమయంలోనైనా దాన్ని సూచిస్తూ ముందు వెనుక చిన్న బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాల్సి ఉంది. మాఫియాపై ఎవరిని ఆశ్రయించాలి? ఎవరైనా ప్రయాణికుడు ఓ ఆటోను ఫలానా చోటుకు రమ్మని పిలిస్తే కచ్చితంగా వెళ్లాల్సిందే. అలా కాని పక్షంలో సదరు ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆటో రిఫ్యూజల్ కింద జరిమానా విధిస్తారు. అయితే స్కూలు ఆటోల డ్రైవర్లు సాగిస్తున్న ‘మాఫియా’ వ్యవహారాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై స్పష్టత లేదు. ఓ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్లు మాఫియాగా మారుతున్నారు. అక్కడున్న విద్యార్థిని ముందు ఓ ఆటోలో పంపించి... భద్రత నేపథ్యంలోనో, మరో కారణంగానో వేరే ఆటోకు మార్చాలని భావిస్తే అది గగనమే. దీనికి పాత ఆటో డ్రైవర్ అంగీకరించడు. కొత్తగా వస్తున్న వ్యక్తిని బెదిరించి మరీ తన కస్టమర్ను ‘కాపాడుకుంటాడు’. ఇది నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎదురవుతున్న పరిస్థితే అయినా... ఆర్టీఏ, ట్రాఫిక్ విభాగాల్లో ఎవరూ పట్టించుకోక... ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థకాక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. కేవలం రిఫ్యూజల్ పైనే కాకుండా ట్రాఫిక్ పోలీసులు దీనిపైనా దృష్టిసారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అదుపుతప్పి పాఠశాల బస్సు బోల్తా
సాక్షి, నల్గొండ : ప్రైవేటు పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం, డ్రైవర్ మద్యం మత్తు కారణంగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరు విద్యార్థులతో పాటు స్కూలు ఆయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలోని పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు సోమవారం సాయంత్రం 4 గంటలకు ముదిగొండ గ్రామం నుంచి చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి సుమారు 30 మంది విద్యార్థులతో బయల్దేరింది. మార్గమధ్యలో మల్లారెడ్డి గ్రామ సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న 1వ తరగతి చదువుతున్న జబ్బు సాయి, 3వ తరగతి చదువుతున్న చింతకుంట్ల విఘ్నేశ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ తరలించారు. బస్సులో ఉన్న మరో పది మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. బస్సు ఆయాకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం మత్తే ప్రమాదానికి కారణం మండలంలోని మల్లారెడ్డిపల్లి సమీపంలో పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టిన సంఘటనకు బస్సు డ్రైవర్ మద్యం మత్తే ప్రధాన కారణమని తెలుస్తోంది. తాగిన మైకంలో బస్సు డ్రైవర్ పాఠశాల బస్సును ఇష్టానుసారంగా నడపడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. 30 మంది విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడంతోపాటు పాఠశాల యాజమాన్యం నిబంధనలు పట్టించుకోకుండా గ్రామంలో ఆటో నడిపే ఓ యువకుడిని బస్సు డ్రైవర్గా నియమించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాగిన మైకంలో వాహనం నడుపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తప్పిన పెను ప్రమాదం పాఠశాల బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మిగతా విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాద సంఘటన తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైందోనని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్టీఏలో..అలజడి!
జిల్లా ఆర్టీఏలో రోజురోజుకు ముసలం ముదురుతోంది. ఎంవీఐలు మొదలు ఇతర ఉద్యోగులు సైతం ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమవుతుండగా.. అందుబాటులో ఉన్నవారిలో పలువురు అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. దీంతో మిగతా అధికారులు, ఉద్యోగులు సైతం ఒక్కొక్కరుగా జిల్లా దాటివెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఆర్టీఏ సేవలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. లైసెన్సులు, ఆర్సీబుక్లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, ట్యాక్సుల వసూలు తదితర రెగ్యులర్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికే స్కూల్ బస్సులన్నింటికీ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. స్కూళ్లు మొదలై వారం కావస్తున్నా ఈ విషయంపై ఇప్పటికీ దృష్టిసారించడం లేదు. ఒక్కోసారి పరిగిలో నిర్వహించాల్సిన ఫిట్నెస్ టెస్టులు, ఇతర సేవలకు సైతం వికారాబాద్ రప్పించుకుంటున్నారు. జిల్లాలో కేవలం పరిగిలో మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉండగా.. వికారాబాద్లో ఎలాంటి చోదక పరీక్షలు నిర్వహించకుండానే లైసెన్స్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిగి: జిల్లా పరిధిలో పని చేసేందుకు ఆర్టీ ఏ శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరులో ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మూడింటికీ కలిపి ఒకే ఎంవీఐ పోస్టు ఉంది. పరిగి ఆర్టీఏ యూనిట్ కార్యాలయంలో ఎంవీఐ పోస్టు ఉండగా.. వికారాబాద్, తాండూరుకు సైతం ఇన్చార్జ్ ఎంవీఐగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవలి వరకు మూడు ఆర్టీఏ కార్యాలయాల్లో ఎంవీఐగా విధులు నిర్వహించిన ప్రవీణ్కుమార్రెడ్డి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవటంతో చెకింగ్ ఎంవీఐ కిషోర్ బాబుకు మూడు కార్యాలయాల ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడులతో జంకిన ఈయన లాంగ్లీవ్పై వెళ్లిపోయారు. జిల్లాకు చెందిన మరికొందరు ఉద్యోగులు సైతం ఇక్కడ ఇమడలేక జిల్లా దాటి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వారం రోజులుగా ఆర్టీఏ సేవలు స్తంభించాయి. ఈ విషయంలో వికారాబాద్ ఆర్టీఓ వాణిని వివరణ కోరగా ఇటీవల రెండు మూడు రోజులు సేవలు స్తంభించిన మాట వాస్తవమేనని, సాధ్యమైనంత వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పక్క జిల్లాకు చెందిన జూనియర్ ఎంవీఐలకు జిల్లాలో ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అధికారులకు అవినీతి మరకలు... జిల్లాలో ఆర్టీఏ ఉద్యోగుల అవినీతి హద్దులు దాటుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.500 చేయాల్సిన పనికి రూ.2 వేలు, రూ.వెయ్యికి పూర్తయ్యే పని కోసం రూ.5 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. రూ.2 వేలలోపు ఖర్చయ్యే హెవీ లైసెన్స్కు ఏకంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు దండుకుంటున్నారు. ఇటీవల ఓ ఆర్టీఏ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. దీంతో ఆర్టీఏ అధికారుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గతేడాది జిల్లాలో విధులు నిర్వహించే ఓ అధికారి అవినీతి నిర్వాకం రాష్ట్ర సరిహద్దులు దాటిన విషయం తెలిసిందే. ఏకంగా విజయవాడలో లారీలకు బాడీ ఫిట్టింగ్ జరుగుతుండగానే అక్కడికే వెళ్లి ఫిట్నెస్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ ఘటనతో సదరు అధికారిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా అవినీతి మరకలంటించుకున్న అధికారికి మళ్లీ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చి.. కొన్ని నెలల పాటు జిల్లాకు చెందిన మూడు కార్యాలయాల బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిచ్చింది. -
లైసెన్స్ లేకున్నా ‘బడి బండి డ్రైవర్’.!
సాక్షి, సిటీబ్యూరో: చిన్నారులను పాఠశాలలకు తరలించే బడి వాహనాల భద్రత అంతంత మాత్రంగా మారింది. వీటి ఫిట్నెస్ మాట అటుంచితే కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లూ వీటిని నడిపేస్తున్నారు. శుక్రవారం తనిఖీలు చేపట్టిన అధికారులు 12 మంది లైసెన్స్ లేని డ్రైవర్లను గుర్తించారు. యాజమాన్యాల కక్కుర్తి, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి స్కూల్ వాహనాల డ్రైవర్లు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఆర్టీఏ సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త బృందాల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టారు. ఒక్క రోజులోనే 521 కేసులు నమోదు చేశామని, భవిష్యత్లోనూ తనిఖీలు కొనసాగుతా యని ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ పేర్కొన్నారు. యథేచ్చగా ఉల్లంఘన... బుధవారం నుంచి నగరంలో స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. దీంతో మళ్లీ రోడ్లపై పాఠశాలలకు విద్యార్థులను తరలించే బస్సులు, ఆటోలు, వ్యాన్ల హడావుడి ఎక్కువైంది. అనివార్య కారణాల నేపథ్యంలో అత్యధికంగా విద్యార్థులు స్కూళ్లకు ఆటోల్లోనే వెళుతుంటారు. నిబంధనల ప్రకారం వీటిలో ఆరుగురు విద్యార్థులను మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉన్నా... అనేక మంది ఆటోడ్రైవర్లు ఎనిమిది నుంచి పది మందిని తరలిస్తున్నారు. దీనిని సీరియస్గా పరిగణించిన ట్రాఫిక్ పోలీసులు స్కూల్ వాహనాలపై స్పెషల్డ్రైవ్స్ చేపట్టాలని నిర్ణయించారు. ఆర్టీఏ అధికారుల సాయంతో... ఇందుకుగాను ఆర్టీఏ అధికారులతో సంయుక్త బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ట్రాఫిక్ పోలీసులు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ను సంప్రదించగా, ఆయన ఆరుగురు మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లను (ఎంవీఐ) కేటాయించారు. వీరితో పాటు స్థానిక ట్రాఫిక్ ఏసీపీల నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్లో ఏఎంవీఐ, ట్రాఫిక్ ఎస్సై, ఆర్టీఏ కానిస్టేబుల్లతో పాటు ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉంటున్నారు. ప్రధానంగా ఈ బృందాలు స్కూళ్లు తెరిచే, ముగిసే సమయాల్లోనే డ్రైవ్స్ చేపడుతున్నాయి. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వర కు ఆయా స్కూళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆరింటిపైనే దృష్టి... ప్రత్యేకంగా ఏర్పాటైన ఆరు ప్రత్యేక బృందాలు ప్రధానంగా ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తదితర పత్రాలతో పాటు డ్రైవర్కు బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేయడం, ఓవర్ లోడింగ్, మైనర్ డ్రైవింగ్ అంశాలను పరీక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక బృందాలు త్వరలో స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థులను తరలించే వాహనాల డ్రైవర్లు, తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నిబంధనలు, భద్రత అంశాలపై అవగాహన కల్పించనున్నారు. కొందరు తల్లిదండ్రులు బైక్లపై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు తీసుకువస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పరిమితికి మించి చిన్నారుల్ని తీసుకువచ్చే తల్లిదండ్రులకూ అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్ కొనసాగిస్తాం. బడి పిల్లల భద్రతలో తల్లిండ్రులతో సహా అంతా భాగస్వాములు కావాలి. ఓవర్లోడింగ్ వాహనాల్లో తమ పిల్లలను పంపకూడదు. యాజమాన్యాలతో పాటు వీరు కూడా డ్రైవర్లు, వాహనం స్థితిగతులు, పత్రాలు తనిఖీ చేసుకోవాలి. ఈ తరహా వాహనాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే 9010203626తో పాటు ‘ట్రాఫిక్ లైవ్’ యాప్ను వినియోగించుకోవచ్చు. పాఠశాల యాజమాన్యాలు సైతం 2011 మార్చ్ 16న రవాణా శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లోని (జీఓ ఎంఎస్ నెం.35) అంశాలను కచ్చితంగా పాటించాలి.– అనిల్కుమార్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
ప్రమాదాల వెం‘బడి’
సాక్షి, పార్వతీపురం (విజయనగరం): విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి కేవలం రెండ్రోజుల వ్యవధి ఉంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు చేస్తూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విద్య పేరు చెప్పి రూ.లక్షలు దండుకోవాలన్న ధ్యాస తప్పా విద్యార్థులకు తగిన భద్రత కల్పించాలన్న ఆలోచన విద్యా సంస్థల యాజమాన్యాలకు లేదన్న విమర్శలున్నాయి. పాఠశాల బస్సుల నిర్వహణలో నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థుల జీవితాలు గాల్లో దీపాలవుతున్నాయి. జిల్లాలో స్కూలు బస్సుల పరిస్థితిని చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు హడలిపోతున్నారు. సీట్లు చిరిగిపోయి, దుమ్ము, ధూళి పేరుకుపోయి, ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో మందులున్నా లేకపోయినా.. ఉన్న మందులు కాస్తా గడువు తేదీ దాటిపోయినా పట్టించుకోకుండా లాభార్జన చూసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో ఇదే పరిస్థితి. డబ్బులు వసూళ్లు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రమాణాలు పాటించడంలో చూపించడం లేదు. వీరికి ఇటు విద్యాశాఖాధికారులు, అటు రవాణా శాఖాధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ లేని కారణంగా ఎన్నోచోట్ల విద్యార్థులు ప్రమాదాలకు గురౌతున్నారు. నిబంధనలివి ► బస్సు సర్వీసు వయసు 15 ఏళ్లకు మించి ఉండరాదు. కచ్చితంగా బస్సుకు బీమా ఉండాలి ► బస్సు ముందు, వెనుక స్కూల్బస్సు అని రాసి ఉండాలి. దాని పక్కనే పాఠశాల పిల్లల బొమ్మలు ఉండాలి. ► పిల్లలు ఎక్కడానికి వీలుగా ఫుట్ బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు ఉండాలి ► బస్సు వెనుకవైపు అత్యవసర ద్వారం ఏర్పాటు చేసి చీకట్లో కూడా దాన్ని గుర్తించే విధంగా రేడియం స్టిక్కర్ను అంటించాలి. అత్యవసర ద్వారం అని తప్పకుండా రాసి ఉండాలి ► అగ్నిమాపక నిదోధక పరికరాలు, ప్రథమ చికిత్స పరికరాల కిట్ ఏర్పాటు చేసి చికిత్సకు అవసరమైన మందులు అందులో ఉంచాలి. ► బస్సు ముందు తెలుపు, వెనుక ఎరుపు, పక్కన పసుపు రంగుతో కూడిన రేడియం స్టిక్కర్లు అంటించాలి. ► తప్పనిసరిగా వాహనాలకు పరావరణశాఖ అనుమతి ఉండాలి. పాఠశాల బస్సులు 40 కిలోమీటర్ల వేగాన్ని మించి నడుపరాదు. కొత్త వాహనానికి ఇరువైపులా పసుపు రంగు టేపు అతికించాలి. ► బస్సు తలుపు తెరుచుకుని విద్యార్థులు దిగేటప్పుడు వెనుకనుంచి వచ్చే వాహనదారులు గమనించే విధంగా స్టాప్ బోర్డును తలుపుమీద ఏర్పాటు చేయాలి. ► స్టీరింగ్, బ్రేక్, హారన్ కండిషన్లో ఉండాలి. విద్యార్థి కూర్చోవడానికి వీలుగా కుషన్ సీట్లు ఏర్పాటు చేయాలి ► బస్సుకు నలుమూలలా యాంచర్ కలర్ లైట్లు ఏర్పాటు చేయాలి. బస్సులో అత్యవసర ద్వారాలు ఏర్పాటుచేయాలి. డ్రైవర్ నిబంధనలు ► 25 నుంచి 60 ఏళ్ల లోపు ఆరోగ్యవంతుడై ఉండాలి. హెవీ వెహికల్ లైసెన్సుతో పాటుగా కనీసం 5 ఏళ్ల అనుభం ఉండాలి ► కంటిచూపు స్పష్టంగా ఉంటూ కనీసం 6/2 కంటిచూపు కచ్చితంగా ఉండాలి. డ్రైవర్, క్లీనర్లు యూనిఫాం ధరించాలి. విధుల్లో మద్యం తాగరాదు. ► ఏటా ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకుని బస్సును నడపడానికి అర్హుడేనని డాక్టర్ ధ్రువపత్రం పొందాలి. పాఠశాల ఆవరణలో బస్సు పార్కింగ్ ఏర్పాటు చేయాలి యాజమాన్యాల బాధ్యతలివీ.. ► బస్సు డ్రైవర్, సహాయకుడి ఫొటో, లైసెన్స్ వివరాలను అందరికీ తెలిసేలా బస్సు లోపల బోర్డులో పెట్టించాలి. నిత్యం ప్రయాణించే విద్యార్థుల జాబితాను బస్సులో ఏర్పాటు చేయాలి ► విద్యార్థులను ఎక్కించి, దింపేందుకు ప్రతి బస్సుకు ఒక సహాయకుడిని ఏర్పాటు చేయాలి. రోజూ బస్సు వెళ్లే మార్గాన్ని (రూట్ మ్యాప్) బస్సులో అతికించాలి. తప్పనిసరిగా బస్సులను పాఠశాల ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. ► పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులతో కలసి కమిటీని ఏర్పాటు చేసి ప్రతి నెల బస్సు పరిస్థితిని సమీక్షించాలి. రోజూ ప్రయాణించే మార్గాన్ని ప్రధానోపాధ్యాయుడు అప్పుడప్పుడు పరిశీలించాలి పాఠశాల ఆటోలు పాటించాల్సినవి.. ► ఆటో మందు, వెనుక భాగంలో పాఠశాల ఆటో అని రాయించాలి. ఆరుగురు విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలి. ఆటో నడిపే డ్రైవర్కు ఏఆర్ (ఆటో రిక్షా) రవాణా వాహనం లైసెన్స్ ఉండాలి. ► ఆటోకు రెండువైపులా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. పది కిలోమీటర్ల లోపున్న పాఠశాలల పిల్లల్ని మాత్రమే తీసుకెళ్లాలి. అధికారుల బాధ్యతలివి ► వేసవి సెలవులు ప్రారంభం కాగానే బస్సుల తనిఖీపై పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు పంపాలి. పాత బస్సులైతే ఏటా ఒకసారి, కొత్త బస్సులైతే రెండేళ్లకోసారి తనిఖీలు నిర్వహించాలి ► బస్సు కండిషన్ను రవాణా శాఖాధికారులు, సిబ్బంది స్వయంగా పరిశీలించాలి. కండిషన్ సరిగా లేకుంటే సమస్యను పరిష్కరించి తీసుకురావాలని సూచించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సు నిర్వహణ ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. అతిక్రమిస్తే కఠిన చర్య ఈ ఏడాది ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల బస్సులను అణువణువూ పరిశీలించాం. డివిజన్ వ్యాప్తంగా 100 బస్సులుండగా వాటిలో 80 బస్సులు ఫిట్నెస్ కోసం వచ్చాయి. కొన్నింటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చాం. కొన్ని బస్సులను మరమ్మతుల నిమిత్తం పంపించాం. బస్సుల ఫిట్మెంట్ విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని బస్సులను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని అనుమతించడం లేదు. ఎవరు నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎంవీఐ,పార్వతీపురం -
బడి బండి.. భద్రత కరువండి!
సాక్షి, సిటీబ్యూరో: మరో 24 గంటల్లో బడి గంట మోగనుంది. బుధవారం స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో సర్వత్రా సందడి మొదలైంది. వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు తిరిగి స్కూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పిల్లలను సురక్షితంగా స్కూళ్లకు తీసుకెళ్లి తిరిగి తీసుకురావాల్సిన బడి బస్సులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. సామర్థ్యం లేని బస్సులు వేల సంఖ్యలో ఉన్నాయి. కాలం చెల్లినవి వందల్లో ఉన్నాయి. స్కూల్ యాజమాన్యాలు, నిర్వాహకుల బాధ్యతారాహిత్యం, ఆర్టీఏ నిర్లక్ష్యం ఫలితంగా పిల్లల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెల 15వ తేదీనే స్కూల్ బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసింది. తిరిగి పునరుద్ధరించుకునేందుకు కనీసం 20 రోజలకు పైగా గడువు ఉంది. కానీ చాలా స్కూళ్లు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించాయి. అదే సమయంలో కొన్ని ఆర్టీఏ కేంద్రాల పరిధిలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2,321 స్కూల్ బస్సులు నమోదై ఉండగా... ఇప్పటి వరకు ఆర్టీఏ అధికారులు కేవలం 948 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించారు. 1,373 బస్సులు సామర్థ్యం లేనివే. ఈ ఒక్క జిల్లాలోనే 15 ఏళ్ల కాలపరిమితి ముగిసినవి 727 బస్సులు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఫిట్నెస్ లేనివి, కాలం చెల్లిన బస్సులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. మొత్తంగా గ్రేటర్లో 13,082 స్కూల్, కాలేజీ బస్సులుంటే వాటిలో ఇప్పటి వరకు 8,574 బస్సులకు ఫిట్నెస్ నిర్వహించారు. ఇంకా 4508 బస్సులు ఫిట్నెస్ లేకుండా ఉన్నాయి. కాలం చెల్లిన బస్సులు 1424 వరకు ఉన్నాయి. ఇలాంటి కాలం చెల్లిన బస్సుల్లోనే కొన్ని స్కూళ్లు పిల్లలను తరలిస్తున్నాయి. స్కూల్ బస్సుల ఫిట్నెస్ కేవలం ప్రహసనంగా మారిందనేందుకు ఇదే నిదర్శనం. కదలిక లేని స్కూళ్లు... నిజానికి ఫిట్నెస్ గడువు ముగిసిన వెంటనే ఆర్టీఏ అధికారులను సంప్రదించడం స్కూళ్ల బాధ్యత. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు పిల్లల భద్రతకు సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగా బస్సులను నిర్వహించాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సు, అగ్నిమాపక యంత్రం వంటి రక్షణ చర్యలతో పాటు బస్సుల నాణ్యత, సరైన సూచికలు, హెచ్చరిక బోర్డులు, స్కూల్ వివరాలు వంటివి అన్ని స్పష్టంగా ఏర్పాటు చేయాలి. బడి బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించే సమయంలో మోటారు వాహన తనిఖీ ఇన్స్పెక్టర్ స్థాయికి ఏమాత్రం తగ్గని ఆర్టీఏ అధికారి ప్రతి బస్సును విధిగా పరీక్షించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించాలి. బస్సు కొద్ది దూరం నడిపించి సంతృప్తి చెందిన తరువాతనే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ అందుకు విరద్ధంగా ఎలాంటి పరీక్షలు లేకుండానే ఫిట్నెస్ ధ్రువీకరిస్తున్నారు. కొన్ని చోట్ల కేవలం కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించడం గమనార్హం. మరోవైపు కొన్ని స్కూళ్ల నిర్వాహకులు కాలం చెల్లిన బస్సులనే పిల్లల తరలింపునకు వినియోగిస్తున్నారు. ఇలాంటి వాటిని తనిఖీ చేసి జప్తు చేయాల్సి ఉంది. కానీ ఆర్టీఏ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం వల్లనే నగరంలో ఈ బస్సులపై నియంత్రణ లేకుండా పోతోందనే విమర్శలున్నాయి. హడావుడిగా స్పీడ్ గవర్నెర్స్.. ఒకవైపు స్కూళ్లు తెరుచుకొనే గడువు ముంచుకొస్తుండగా మరోవైపు రవాణాశాఖ హడావుడిగా ఒక జీవోను వెలువరించింది. బడి బస్సుల భద్రతకు సంబంధించిన ఈ జీవో ప్రకారం ప్రతి బస్సు కు తప్పనిసరిగా వేగ నియంత్రణ పరికరాలైన స్పీడ్ గవర్నర్స్ను బిగించాలి. గంటకు 60 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్లకుండా ఇవి నియంత్రిస్తాయి. కానీ ఇప్పటికే 8 వేలకు పైగా బస్సులకు తనిఖీలు చేసి సర్టిఫికెట్లను ఇచ్చేశారు. తిరిగి ఆ బస్సులకు మరోసారి పరీక్షలు నిర్వహించడం, స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం ఆచరణ సాధ్యం కాని విషయం. ఇది అధికారులకు సైతం తెలిసిన సంగతే. 12 నుంచి స్పెషల్ డ్రైవ్... ఫిట్నెస్ లేని బస్సులపై ఈ నెల 12 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. గడువు ముగిసినా ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోకుండా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. నగరంలో మొత్తం స్కూల్ బస్సులు: 13,082 ఫిట్నెస్ పూర్తయినవి: 8,574 ఇంకా చేయాల్సినవి: 4,508 కాలం చెల్లిన బస్సులు: 1,424 -
మిగిలింది ఆరు రోజులే..
సాక్షి,సిటీబ్యూరో: బడి బస్సుల భద్రతపై ఆర్టీఏ దృష్టి సారించింది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డెక్కే బస్సులను సీజ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. జూన్ 1 నుంచి స్కూళ్లు ప్రారంభమవుతాయనే ఉద్దేశంతో తొలుత హడావిడి చేసినా 12వ తేదీకి వాయిదా పడడంతో పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వాస్తవంగా మే 15 నాటికి అన్ని స్కూల్ బస్సులకు ఫిట్నెస్ గడువు ముగుస్తుంది. ఆ రోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోగా బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయించాలి. అయితే గ్రేటర్ హైదరాబాద్లోని మూడు జిల్లాల పరిధిలోని 12 వేలకు పైగా స్కూల్ బస్సుల్లో ఇప్పటి వరకు సుమారు 3700 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. మరో 8 వేలకు పైగా బస్సులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఇందుకు ఆరు రోజులు మాత్రమే గడువు మిగిలింది ఉంది. ఈ కొద్దిపాటి వ్యవధిలోనే గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో పరీక్షలు నిర్వహించి బడి బస్సుల భద్రతా ప్రమాణాలను నిర్ధారించాల్సి ఉంది. ఆ దిశగా తాము ఇప్పటికే కార్యాచరణ చేపట్టినట్లు రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు లేఖలు రాయడంతో పాటు స్కూల్ బస్సు డ్రైవర్లు, అటెండర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి స్కూల్ యాజమాన్యం బస్సుల ఫిట్నెస్పై అప్రమత్తంగా ఉండాలని, డ్రైవర్లు, అటెండర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. 12న స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నందున ఆ లోగా ఫిట్నెస్ ధృవీకరణ పొందాల్సి ఉంటుందన్నారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే వాటిని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఈ సారి ఆర్టీఏ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. బస్సులు..భద్రతా ప్రమాణాలు.. ♦ బస్సు పసుపు రంగులో ఉండాలి. రంగు పాలిపోయినట్లుగా కాకుండా స్పష్టంగా కనిపించాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్కు స్పష్టంగా కనిపించే విధంగా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. బస్సులోపలి భాగంలో ఒక పెద్ద పారదర్శకమైన అద్దం ఏర్పాటు చేయాలి.దీనివల్ల లోపల ఉన్న పిల్లలు కూడా డ్రైవర్కు కనిపిస్తారు. ♦ బస్సు ఇంజన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టింగ్విషర్), పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలి. ♦ సదరు పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నంబర్, మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి. సీట్ల కిందిభాగంలో బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. పిల్లలు పట్టుకొనేందుకు వీలుగా అక్కడక్కడా లోహపు స్తంభాలను అమర్చాలి. ♦ వాహనానికి నాలుగువైపులా పై భాగం మూలాల్లో (రూఫ్పై కాదు) బయటివైపు యాంబ ర్ (గాఢ పసుపు పచ్చని) రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి.పిల్లలు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. ♦ సదరు వాహనం స్కూల్ బస్సు అని తెలిసేలా ముందు భాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్ధులు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) నల్లరంగులో చిత్రించాలి. ఆ చిత్రం కింద ‘‘స్కూల్ బస్సు’’ లేదా ‘‘ కళాశాల బస్సు’’ అని నల్ల రంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి. ♦ బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్ తో ఉండాలి. సైడ్ విండోలకు అడ్డంగా 3 లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి. సీటింగ్సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు. ♦ ఫుట్బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి. ♦ లోపలికి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకొనేందుకు వీలుగా ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్ ఉండాలి. ♦ బస్సులో ప్రయాణించే విద్యార్థుల పేర్లు, తరగతులు,ఇళ్ల చిరునామాలు, ఎక్కవలసిన, దిగవలసిన వివరాలు బస్సులో ఉండాలి. డ్రైవర్ల అర్హతలు ... ♦ డ్రైవర్ వయస్సు 60ఏళ్లకు మించకుండా ఉండాలి. పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్యపట్టికను విధిగా నిర్వహించాలి. ♦ యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకుప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి. ♦ డ్రైవర్ను నియమించేందుకు ముందు అతని అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్, తదితర అంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. ♦ డ్రైవర్కు బస్సు డ్రైవింగ్లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ♦ డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి. పేరెంట్స్ కమిటీ పనితీరు... ♦ బస్సుకు సంబంధించిన బాహ్య పరికరాలు విండ్స్క్రీన్, వైపర్స్, లైటింగ్స్ వంటి వాటి మెకానికల్ కండీషన్స్, పనితీరు తెలుసుకొనేందుకు ప్రిన్సిపాల్తో కలిసి పేరెంట్స్ కమిటీ ప్రతి నెలా తనిఖీలు చేయాలి. ♦ ఫస్ట్ ఎయిడ్ బాక్సులో మందులు, ఇతరపరికరాలు కూడా తనిఖీ చేయాలి. -
జపాన్లో స్కూల్ బస్సుపై దుండగుడి దాడి
-
బడి బస్సులో భద్రత ఎంత?
కంటికి రెప్పలా కాపాడుకుంటూ అరచేతుల్లో పెట్టుకుని పెంచుకునే పిల్లలకు చిన్నపాటి గాయమైనా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. తమ పిల్లల భవిష్యత్ బంగారుమయం కావాలన్న తాపత్రయంతో దూరంగా ఉన్నా మంచి పాఠశాలలను ఎంచుకుని ఆ పాఠశాల బస్సుల్లో ప్రతి రోజూ పంపిస్తారు. వారు తిరిగి ఇంటికి చేరే వరకూ అటువైపే దృష్టి ఉంటుంది. అయితే చాలా పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్సుల విషయంలో తగిన ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. అనకాపల్లి: అధిక శాతం మంది తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, బోధన, ఇతర అభ్యసన ప్రక్రియలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు కోరుకునే పాఠశాలకు వారి పిల్లలను పంపాలంటే ఆయా పాఠశాలలకు చెందిన బస్సులే కీలకం. అయితే డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయమైన కొన్ని విద్యాసంస్థలు బస్సుల నిర్వహణ, సిబ్బంది విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రోడ్డు రవాణాశాఖ అధికారులు పాఠశాల బస్సుల నిర్వహణలో పలు మార్గదర్శకాలు రూపొందించినా.. వాటిని కేవలం ఏడాదికొకసారే పరిశీలన జరిపి వదిలేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు బడులకు వెళ్లేటప్పుడు ఆయా విద్యాసంస్థల బస్సులు ఢీకొని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది నెలలు క్రితం అనకాపల్లి మండలంలోని కూండ్రంలో ఆడుతున్న చిన్నారులపైకి ఒక బస్సు వెళ్లి బలితీసుకుంది. అనకాపల్లి పరిసరాల్లో ఉన్న కొన్ని పాఠశాలలకు చెందిన బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. గత విద్యాసంవత్సరంలో మూసివేసిన ఓ పాఠశాలకు చెందిన బస్సు బైపాస్రోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు బస్సు ముందు ఉన్న అద్దం బద్దలైంది తప్ప చిన్నారులకు గాయాలు కాలేదు. రైల్వేస్టేషన్కు సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల వినోదయాత్ర నిమిత్తం యారాడ బీచ్కు విద్యార్థులను తీసుకెళ్లింది. తిరిగి వస్తుండగా బస్సులు ప్రమాదానికిగురి కావడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. పిల్లలకు తీవ్ర గాయాలైనప్పటికీ ఎవరూ చనిపోకపోవడంతో అటు అధికారులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యాసంస్థలను నిర్వహించే యాజమాన్యాల ఆర్థిక పరిస్థితి బట్టి బస్సుల కొనుగోలు ఉంటుందనేది అందరికీ తెలిసిందే. చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలకు సెకెండ్హ్యాండ్ బస్సులను కొనుగోలు చేస్తుంటారు. ఇటువంటి బస్సుల్లో రోడ్డు రవాణా శాఖ అధికారులు విధించిన ప్రమాణాలు ఉండవనేది అందరికీ తెలిసిందే. అయితే ఎటువంటి ఉపద్రవం ఎదురుకానంత వరకు ఎవరూ పట్టించుకోరు. 15తో ముగియనున్న బస్సుల ఫిట్నెస్ గడువు అనకాపల్లి ఆర్టీఏ కార్యాలయ పరిధిలో సుమారు 1,400 ప్రైవేటు పాఠశాలల బస్సులు ఉన్నాయి. ఆయా పాఠశాల బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఈ బస్సులను ఉపయోగించాలంటే తక్షణమే ఆర్టీఏ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ను పొందాలి. ఆయా బస్సుల్లో మెడికల్ కిట్, డ్రైవర్, క్లీనర్, ఫైర్సేఫ్టీ కిట్, బస్సు తిరిగే రూట్మ్యాప్ ఉండాలి. బస్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే మిగతా ప్రక్రియ ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆయా పాఠశాల బస్సుల్లో చివరి విద్యార్థి దిగే వరకూ ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. డ్రైవర్కు లైసెన్స్తోపాటు హెల్త్కార్డు, మూడు నెలలకొకసారి సబ్మిట్ చేస్తుండాలి. మద్యం తాగే వ్యక్తిని, కంటిచూపు మందగించిన వారిని స్కూల్ బస్ డ్రైవర్లుగా ఉపయోగించరాదు. వీటన్నింటిని పర్యవేక్షించిన అనంతరం ఆర్టీఏ అధికారులు బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ నిబంధనలు పాటిస్తేనే సర్టిఫికెట్ ♦ బస్సు ఎడమ వైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు పొందుపరచాలి ♦ బస్సు బయలుదేరు సమయం, ఆగు స్థలాలు, రూల్ప్లాన్ బస్సులో ఉంచాలి ♦ విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు బస్సులో ఏర్పాటు చేయాలి, సీట్ల సామర్థ్యానికి తగ్గట్టుగా విద్యార్థులతోప్రయాణించాలి. ♦ డ్రైవర్కు కనీసం ఐదేళ్ల అనుభవం, ఆరోగ్యంగా ఉన్నట్టు ధ్రువీకరించు హెల్త్కార్డు ఉండాలి. ♦ ప్రతి నెలా బస్సు కండీషన్ను యాజమాన్యం, పేరెంట్స్ కమిటీ తనిఖీ చేయాలి. ♦ ఫిర్యాదుల పుస్తకం బస్సులో ఉంచాలి. పుస్తకాన్ని ప్రతీనెలా యాజమాన్యం తనిఖీ చేసి, ఫిర్యాదులు పరిశీలించాలి. ♦ బస్సుకు కన్వెన్స్క్రాస్ అద్దాలు అమర్చాలి. లోపలి భాగంలో పెద్ద పారదర్శక అద్దం ఉండాలి. ♦ అత్యవసర ద్వారం, ప్రథమ చికిత్స మందులు వాహనంలో ఉంచాలి ♦ బస్సులను ఆయా విద్యా సంస్థలకు చెందిన పార్కింగ్ స్థలాల్లో ఉంచాలి. ♦ ప్రతీ బస్సుకు అటెండర్ ఉండాలి. డ్రైవర్, అటెండర్ యూనీఫారం ధరించాలి. ♦ బస్సు డ్రైవర్ రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించే శిక్షణతరగతులకు హాజరుకావాలి ♦ విడతల వారీగా బస్సులో టీచర్లు ప్రయాణించేలా చూసి, విద్యార్థుల సంరక్షణను పర్యవేక్షించాలి. క్షుణ్ణంగా పరిశీలించాకే... ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తాం. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు కచ్చితంగా పాటింటిచాలి. వాహనం కండిషన్లో లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా సర్టిఫికెట్ నిరాకరిస్తాం. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఈనెల 15వతేదీలోగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. నిబంధనల మేరకు బస్సులో సదుపాయాలు కల్పించాలి. – రవీంద్రనాథ్, ఆర్టీవో -
స్కూల్ బస్సు హైజాక్.. ఆపై నిప్పు
రోమ్: ఇటలీలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ 51 మంది పిల్లలున్న బస్సును హైజాక్ చేసి బస్సుతోపాటు వాళ్లందరినీ తగులబెట్టాలని చూశాడు. అదృష్టవశాత్తూ పోలీసులకు సమాచారం అంది వారు వచ్చి మంటల్లో చిక్కుకున్న పిల్లలందర్నీ రక్షించగలిగారు. డ్రైవర్ను అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీలోకి వలస వస్తున్న వారిపై ఇటలీ ఉప ప్రధానుల వైఖరికి నిరసనగా ఈ పని చేసినట్లు ఆ డ్రైవర్ చెప్పాడు. ‘మధ్యధరా సముద్రంలో ఎంతో మంది చనిపోతున్నారనీ, ఈ రోజు మీరు∙చావబోతున్నారు’ అని అతను విద్యార్థులతో అన్నాడు. 51 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది ఓ క్రీడా వేదికకు వెళ్లొస్తుండగా డ్రైవర్ ఈ హైజాక్కు పాల్పడ్డాడు. 30 నిమిషాలపాటు వారిని తన బందీలుగా ఉంచుకున్నాడు. వెంట తెచ్చిన పెట్రోల్ను బస్పై పోసి నిప్పంటించాడు. ఓ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి హైజాక్ విషయం చెప్పడం, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్వరమే పోలీసులు అక్కడకు చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి అందరినీ రక్షించారు. -
విద్యార్థిని బలిగొన్న స్కూల్ బస్సు
మొయినాబాద్ (చేవెళ్ల): ఉదయం ఇంట్లోంచి పాఠశాలకు వెళ్లేటప్పుడు అమ్మా టాటా అంటూ నవ్వుతూ చెప్పి వెళ్లిన బాలుడు మధ్యాహ్నానికి ఇంటి ముందే విగతజీవిగా మారాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి బలయ్యాడు. బస్సు కింద పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే గారాబంగా గోరుముద్దలు తినిపించాలనుకున్న ఆ తల్లికి తీరని శోకం మిగిల్చాడు. ఈ హృదయవిదారకమైన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ ప్రాంతానికి చెందిన బసవాని సునీల్, భాగ్యలక్ష్మి దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువుకోసం మొయినాబాద్ మండలం ఎనికేపల్లి గ్రామానికి వలస వచ్చారు. తమ ముగ్గురు కొడుకులతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. సునీల్ గ్రామ సమీపంలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. సునీల్ పెద్ద కుమారుడు వరుణ్ (9) చిలుకూరులోని ఓ పాఠశాలలో స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. రోజూలాగానే శనివారం ఉదయం స్కూల్ బస్సులో వెళ్లాడు. శనివారం హాఫ్డే కావడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్కూల్ బస్సులో ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు బస్సు ఆగడంతో బస్సులోంచి దిగి రోడ్డు దాటేందుకు బస్సు ముందుకు వెళ్లాడు. బాలుడిని గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో బాలుడు సిమెంటు రోడ్డుపై పడిపోయాడు. బస్సు ముందు చక్రం అతని తలపై నుంచి పోవడంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పెద్దగా అరవడంతో బస్సును అక్కడే నిలిపేశాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. ఉదయం కొడుకు చెప్పిన మాటలను తలుచుకుంటూ తల్లి రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పాఠశాల యాజమాన్యం బాలుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు బాలుడి మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సును మొయినాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు. -
విజయవాడలో స్కూల్ బస్సు బీభత్సం
-
టైర్ పేలి స్కూల్ బస్సును ఢీకొన్న కారు
కర్నూలు ,మంత్రాలయం రూరల్: టైర్ పేలడంతో అదుపు తప్పిన కారు..స్కూల్ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులకు సురక్షితంగా బయపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మంత్రాలయం మండల పరిధిలోని చెట్నేహళ్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. మాధవరం వైపు నుంచి మంత్రాలయం వైపు వస్తున్న శ్రీవైష్ణవి పాఠశాలకు చెందిన స్కూల్ బస్సును మంత్రాలయం వైపు నుంచి మాధవరం వైపు వెళ్తున్న కారు టైరు పగిలి ఢీకొట్టింది. స్కూల్ బస్సు చివరన కారు తాకడంతో పాక్షికంగా దెబ్బతింది. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జున, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు సత్యరాజు, నాయకులు అశోక్కుమార్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను క్షేమంగా మరొక బస్సులో స్కూల్కు పంపారు. -
అదుపు తప్పిన స్కూల్ బస్సు
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రైవేటు స్కూలు బస్సు అదుపు తప్పడంతో ఇద్దరు గాయపడిన సంఘటన బుధవారం పలాసలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం సమీపంలో కౌసల్యనగర్ చెందిన దండాసి లచ్చయ్య రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం తన ఇంటి నుంచి కాశీబుగ్గ బస్టాండ్కు రిక్షా తీసుకుని వెళ్తుండగా పలాస విద్యుత్ సబ్స్టేషన్ వద్ద భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో లచ్చయ్య రిక్షాతో సహా రోడ్డుపై బోల్తాపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఇడ్లీలు అమ్ముకుంటూ నడిచి వెళ్తున్న బరాటం శ్రీనివాసరావును కూడా బస్సు ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులిద్దరినీ పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందించారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భాష్యం కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులకు సపర్యలు చేస్తున్నారు. -
చితికిన చిన్నారి జీవితం
ఆ దంపతులకు ఇద్దరూ ఆడపిల్లలే. వృత్తిరీత్యా వ్యవసాయ కూలీలుగా పనిచేసే ఆ దంపతులు తమ పిల్లలకు ఏ కష్టం రాకూడదని మంచి చదువులు చదివించాలని భావించారు. దీంతో ఉన్న ఊరిలో కాదని పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. పాఠశాల స్కూల్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త ఆ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లుచల్లింది. పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన హృదయ విదారక ఘటన మండల పరిధిలోని నారాయణరాజుపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వైఎస్ఆర్ జిల్లా, అట్లూరు : మండల పరిధిలోని నారాయణరాజుపేటకు చెందిన చింతంరెడ్డినాగేశ్వర్రెడ్డి, వసుధదేవిలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో రెండవ కుమార్తె అయిన చింతంరెడ్డినాగలక్ష్మి (5) బద్వేలు పట్టణంలోని మహేశ్వర్రెడ్డి హైస్కూల్లో యూకేజీ చదువుతోంది. ప్రతిరోజు గ్రామానికి వచ్చే ఏపీ04ఎక్స్3336 నంబరు గల స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తుండేది. రోజూ మాదిరే సోమవారం పాఠశాలకు వెళ్లిన నాగలక్ష్మి సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకుని బస్సు దిగింది. ఈ సమయంలో చిన్నారి బస్సు పక్కనే ఉండగా బస్సుడ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్తగా ముందుకు వెళ్లడంతో చిన్నారి బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ బస్సు కింద పడి మృతిచెందిందన్న విషయం తెలుసుకున్న నాగలక్ష్మి తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి పరుగులు తీసి కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం ఇంట్లో సందడిగా గడిపిన తమ చిన్నారి ఇక రాదని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు ‘‘దేవుడా, మాకెందుకు ఇంత అన్యాయం చేశావంటూ’’రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. ఎస్ఐ మహమ్మద్రఫీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, బస్సును స్టేషన్కు తరలించారు. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కోసం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా బస్సుడ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో మిగతా గ్రామాలకు వెళ్లాల్సిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని తమ పిల్లలను ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లారు. -
ప్రమాదంలో పసిమొగ్గలు
సాక్షి, గుంటూరు: ‘జిల్లాలో అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు దాదాపుగా ముగిశాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. తేడా అనిపిస్తే యాజమాన్యానికి నోటీసులిస్తాం. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తాం. అప్పటికి దారికి రాకపోతే స్కూల్ అనుమతి రద్దుకు సిఫార్సు చేస్తాం’... ఇవి నిత్యం రవాణాశాఖ అధికారుల నోట వినిపించే మాటలు కానీ అచరణలో మాత్రం ఫలితాలు కన్పించడం లేదు. జిల్లాలో నిత్యం పాఠశాల బస్సులకు జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే వీరి మాటలన్నీ నీటి మూటలేనని స్పష్టమవుతోంది. ♦ మాచర్ల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు మండలంలోని మాచర్ల–మండాది మధ్యలోని శ్రీశైలం రహదారిలో కానవాగు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 32 మంది గాయపడగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు, మండాదిలో విద్యార్థులను ఎక్కించుకుని కానవాగు వద్ద బస్సు స్టీరింగ్ రాడ్ ఊడిపోవటంతో బస్సు వంతెన పైనుంచి వాగులోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనతో పిల్లలను ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఆటోల్లో పంపించే తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తున్న వైనం జిల్లాలో రెండు వేలకుపైగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులు, ఆటోల్లో పిల్లలను తరలిస్తున్నాయి. వీటిలో చాలా వరకూ వాహనాలు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు పిల్లల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. ఇదంతా తెలిసినా ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం బస్సులో 57 మంది విద్యార్థులను ఎక్కించాలి. కానీ మందాడి వద్ద ప్రమాదం జరిగిన బస్సుల్లో 80 మంది విద్యార్థులను తరలిస్తున్నారు. అంతులేని నిర్లక్ష్యం నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల తన బస్సు, ఆటోల వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్టును, డ్రైవర్ హెల్త్ కండీషన్ను తల్లిదండ్రుల సమావేశంలో ఉంచాలి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పేరెంట్ మీటింగ్ జరుగుతున్న దాఖలాలు లేవు. అడపాదడపా తనిఖీలు జరిగినా జరిమానాలతో సరి పెడుతున్నాయి. దీంతో చాలా ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, రేడియం స్టిక్కర్లు లేవు.రవాణా అధికారులు కాసుల కక్కుర్తితో ఏజెంట్ల ద్వారా వచ్చే బస్సులకు ఎటువంటి తనిఖీలు లేకుండా సర్టిఫికెట్ ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. సత్తెనపల్లి, మాచర్ల, బాపట్ల, తెనాలి, పిడుగురాళ్ల, పొన్నూరు, మంగళగిరి సహా జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలు క్లీనర్లచే బస్సులు నడుపుతున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్నాం.. నిబంధనల విరుద్ధంగా విద్యార్థులను తరలిస్తున్న వాహనాలపై కేసులు రాస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో మొదటిసారి సీటు బెల్టు విధానాన్ని ప్రవేశ పెట్టాం. వచ్చే విద్యా సంవ్సరంలో అన్ని పాఠశాల బస్సులకు ఈ విధానాన్ని అమలు చేసేలా చూస్తున్నాం. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.– రాజారత్నం, డీటీసీ గుంటూరు తల్లిదండ్రులారా.. ఆరా తీయండి 18 సీట్లలోపు స్కూల్ బస్ నడిపే డ్రైవర్కు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్తోపాటు బ్యాడ్జి నంబర్ ఉండాలి. అంతకు మించిన సామర్థ్యం ఉన్న పెద్ద బస్సుల డ్రైవర్లకు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్తోపాటు బ్యాడ్జి నెంబర్ ఉండాలి. బస్సు కెపాసిటీని బట్టి డ్రైవర్ను ఎంపిక చేసుకోవాలి. డ్రైవర్లు మారుతున్నప్పుడు వారి లైసెన్సు వివరాలను తెలుసుకోవాలి. రవాణా శాఖ వెబ్సైట్ను పరిశీలిస్తే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం 1989, రూల్ 185 సవరణ తుది నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల బస్సుల భధ్రతకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేషన్తోపాటు తీసుకోవాల్సిన 32 ఆంశాలపై జీవోలో పొందు పరిచారు. వీటిలో ఏ ఒక్కటి పాటిచకపోయినా నిలదీయొచ్చు. జిల్లాలో స్కూల్ బస్సు, ఆటో ప్రమాదాలు ఇలా.. ♦ 2015 ఫిబ్రవరిలో మంగళగిరి మండలం నూతక్కి దగ్గర ఓ ప్రైవేటు బస్సు కాల్వలో బోల్తా పడి రెండో తరగతి విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ♦ 2016 ఏప్రిల్లో పొన్నూరు మండలం జూపూడి వద్ద స్కూల్ బస్ నుంచి రెండో తరగతి విద్యార్థి జారి పడి మృత్యువాత పడింది. ఇదే సంవత్సరం మార్చిలో చెరుకుపల్లి మండలం కామినేనిపాలెం వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు బ్రేక్ ఫెయిలై బోల్తా పడింది. ♦ 2018 అక్టోబర్ 31న దాచేపల్లి మండలం అలుగుపల్లిపాడు వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడి ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. ♦ 2018 ఆగస్టులో యడ్లపాడు, సొలస గ్రామాల్లో స్వల్ప రోజుల వ్యవధిలోనే రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రమాదానికి గురై విద్యార్థులు గాయాలపాలయ్యారు. విద్యార్థులకు డీఈవో పరామర్శ నరసరావుపేట రూరల్: బస్సు ప్రమాదంలో గాయపడి పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ జీహైమావతిలు సోమవారం రాత్రి పరామర్శించారు. గాయపడిన ముగ్గురు విద్యార్థులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. వారి వెంట ఎంఈవో జ్యోతికిరణ్, బాలుర హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధి పీ పద్మలత తదితరులు ఉన్నారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ను మూసేయాలి గుంటూరు ఎడ్యుకేషన్: కండీషన్లో లేని బస్సులో విద్యార్థులను తరలిస్తూ ప్రమాదానికి కారణమైన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ను మూసేయాలని గిరిజన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు కేతావత్ పాండునాయక్ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వలనే ప్రమాదం చోటు చేసుకుందని మండిపడ్డారు. తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్న యాజమాన్యాలు కాలం చెల్లిన బస్సులతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని పేర్కొన్నారు. -
ఠారెత్తిస్తున్న స్కూల్ బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో స్కూల్ బస్సులు బెంబేలెత్తిస్తున్నాయి. తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతున్న ప్రమాదాలు పిల్లల భద్రత పాలిట ప్రశ్నార్ధకంగా మారాయి. నిర్లక్ష్యంగా బస్సులు నడిపే డ్రైవర్లు, కండీషన్లో లేని బస్సులు చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. దీంతో తరచూ స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. మరోవైపు రవాణాశాఖ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ బస్సుల భద్రతా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు ప్రహసనంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 10 వేలకు పైగా స్కూల్ బస్సులు ఉండగా ఇంకా వందలాది బస్సులు ఎలాంటి ఫిట్నెస్ లేకుండానే తిరుగుతున్నాయి. సోమవారం మేడ్చల్లో ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సుకు ఫిట్నెస్ లేకపోవడంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు.అత్వెల్లి నుంచి మేడ్చల్ వైపు వస్తున్న స్కూల్ బస్సు వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 60 మంది పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కానీ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటే పెద్ద నష్టమే చోటుచేసుకొనేది. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం ఒక కారణమైతే బస్సుకు ఫిట్నెస్ కూడా లేకపోవడం మరో కారణమని ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వెంటనే బస్సును జప్తు చేసి కేసు నమోదు చేశారు. మరోవైపు ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 400 కు పైగా ఫిట్నెస్ లేని బస్సులు ఉన్నట్లు గుర్తించారు. నగరమంతటా ఆ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంది. మొక్కు‘బడి’ తనిఖీలేనా... ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో స్కూల్ బస్సులకు తనిఖీలు నిర్వహిస్తారు. ఫిట్నెస్ లేని బస్సులను గుర్తించి కేసులు నమోదు చేస్తారు. పాఠశాలలు, కళాశాలలకు నోటీసులు జారీ చేస్తారు. పిల్లలను తరలించే బస్సులు పూర్తిగా కండీషన్లో ఉండడంతో పాటు, అన్ని రకాల భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలి. ప్రతి బస్సుకు ఆరోగ్యకరమైన, అనుభవజ్ఞుడైన డ్రైవర్తో పాటు, ఒక అటెండర్ను కూడా ఏర్పాటు చేయాలి. బస్సుల కండీషన్ను మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి స్వయంగా పరిశీలించి బ్రేకులు, బస్సు కండీషన్, లైట్లు, సీట్లు, రెయిలింగ్, బస్సు కలర్, తదితర ప్రమాణాలన్నీ ఉన్నట్లు నిర్ధారించుకొన్న తరువాతనే ఫిట్నెస్ సర్టిఫికెట్ను అందజేయాలి. అయితే కొన్నిచోట్ల ఇలాంటి తనిఖీలు మొక్కుబడిగా మారుతున్నాయి. మరోవైపు ప్రతి స్కూల్కు వెళ్లి విధిగా బస్సులను తనిఖీ చేయాలనే నిబంధనను కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే సమయంలో స్కూల్ యాజమాన్యాలు కూడా బస్సుల నిర్వహణను పట్టించుకోవడం లేదు. డ్రైవర్లకు అప్పగించి వదిలేస్తున్నారు. దీంతో పిల్లల భద్రత అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. క్రిమినల్ కేసులు తప్పవు ఇప్పటి వరకు 400 స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా ఉన్నట్లు తాజా ఘటన నేపథ్యంలో గుర్తించాం. వారంలోగా పాఠశాల యాజమాన్యాలు ఈ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకొని కండీషన్ను ధృవీకరించుకోవాలి. సకాలంలో ఫిట్నెస్ పరీక్షలకు హాజరు కాని బస్సులను సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. –డాక్టర్ పుప్పాల శ్రీనివాస్,జిల్లా రవాణా అధికారి, మేడ్చల్. అదుపుతప్పిన స్కూల్ బస్సు మేడ్చల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులను తీసుకెళుతున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన మేడ్చల్ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఏసీఎం స్కూల్ కు చెందిన బస్సు డ్రైవర్ సాయిబాబా కాళ్లకల్ మండలం లింగాపూర్, డబీల్పూర్ గ్రామాల నుంచి 28 మంది పిల్లలను ఎక్కించుకుని మేడ్చల్కు వస్తున్నాడు. అదేసమయంలో కాళ్ళకల్ నుంచి మేడ్చల్కు ప్రయాణీకులను తీసుకువస్తున్న ఆర్టీసీ బస్సు వస్తూ మార్గమధ్యంలో సెయింట్ క్లారెట్ స్కూల్ వద్ద విద్యార్థులను దింపేందుకు జాతీయరహదారి పక్కన ఆగింది. పిల్లలు దిగుతుండగా వెనుక వచ్చిన ఏసీఎం స్కూల్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో స్కూల్ బస్సులో ఉన్న పిల్లలు ఒక్కసారి సీట్లలో నుండి ఎగిరిపడ్డారు. అయితే చిన్నారులెవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని స్వల్పంగా గాయపడిన చిన్నారులను ఆసుపత్రులకు తరలించారు. తల్లిదండ్రుల ఆందోళన... ఏసీఎం స్కూల్ యాజమాన్యం, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు అందోళనకు దిగారు. మొదట స్కూల్ వద్దకు వెళ్లి స్కూల్ ఎదుట అందోళన చేపట్టగా పోలీసులు వారిని సముదాయించడంతో పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు శారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో చిన్నారులు సాయిప్రణవ్(12)రమ్మ(7),అక్షయ(5) మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ సాయిబాబా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
స్కూలు బస్సుకు తప్పిన పెను ప్రమాదం
వెల్దుర్తి (మాచర్ల): గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తూ మాచర్ల మండలం మండాది వద్ద సోమవారం ఉదయం 8 గంటలకు కానవాగులో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలితో పాటు ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలవ్వగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 26 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మండలంలోని ఉప్పలపాడు, మండాది గ్రామాల నుంచి ప్రతిరోజూ విద్యార్థులను స్కూల్ బస్సులో తీసుకొచ్చి తిరిగి సాయంత్రం వదిలి వస్తుంటారు. సోమవారం యధావిధిగా విద్యార్థుల్ని ఎక్కించుకుని వస్తుండగా, కానవాగు వద్ద బస్సు స్టీరింగ్ రాడ్ ఊడిపోవడంతో అదుపు తప్పి వాగులోకి బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న బోర్వెల్ వాహనం వారు వాగులోకి వెళ్లి బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. వీరు వెంటనే స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈలోపు మండాది గ్రామస్తులు సైతం అక్కడకు చేరుకుని బస్సులో ఇరుక్కున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తెచ్చారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉప్పలపాడు గ్రామానికి చెందిన విద్యార్థులు దాసి రాజు, బలిగొడుగుల అజయ్, మారెబోయిన నవీన్, ఒంటేరు వాసు, తన్విజ్ రెడ్డి, భార్గవి, ఉపాధ్యాయురాలు కామిరెడ్డి మల్లీశ్వరిలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు, నరసరావుపేట వైద్యశాలలకు తరలించారు. స్వల్పంగా గాయపడిన 26 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, మాచర్ల ఎంవీఐ ఎ.మాధవరావు, ఇన్చార్జి తహసీల్దారు బుడేసాహెబ్, మాచర్ల రూరల్ సీఐ ఎ.వెంకటేశ్వర్లు, తదితరులు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాగులో నీరు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని, లేకపోతే తమ పిల్లల పరిస్థితి ఏమిటంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ బస్సు రాడ్ ఊడిపోయే పరిస్థితి వచ్చే వరకు చూసుకోకుండా పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వహించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆందోళన ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, గ్రామస్తులు గాయపడిన విద్యార్థులను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడం, సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు అక్కడే ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వైద్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని హెచ్చరించారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ కూడా లేకపోవడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులను తన సొంత వాహనంలో మాచర్లలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. పిల్లలకు ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వం, వైద్య అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. బస్సులో పరిమితికి మించి విద్యార్థులు పరిమితికి మించి విద్యార్థులను తరలించడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఉప్పలపాడు, మండాది గ్రామాల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు వచ్చే విద్యార్థులు 90 మంది ఉండగా, ఒకే ట్రిప్పులో వీరిని చేరవేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 57 మంది పట్టే బస్సులో 70 నుంచి 90 మందిని తిప్పుతున్నా రవాణా శాఖ, పోలీసు, విద్యా శాఖ అధికారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సోమవారం వర్షం కారణంగా 20 మంది వరకు విద్యార్థులు పాఠశాలకు రాకపోవడంతో ప్రమాద సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులే ఉన్నారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మేడ్చల్లో స్కూల్ బస్సు ఆర్టీసీ బస్సు ఢీ
-
బ్రేకింగ్: స్కూల్ బస్సు బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, గుంటూరు: ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. 85 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన బస్సు వంతెన పైనుంచి కాల్వలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పదిమంది విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన చిన్నారులను స్థానిక ఆసపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాదిగోడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తమ పిల్లలు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గాయపడిన పిల్లలను తరలించిన ఆస్పత్రికి చేరుకొని.. ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. అంతకుముందు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడ్డవారికి తనవంతు సాయం అందించారు. ఆస్పత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. బస్సు కండీషన్, డ్రైవర్ తీరుపై స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. -
ఇదేమి గోలయ్యా ‘బాబు’
సాక్షి, గుంటూరు: సాధారణంగా జిల్లాలో సీఎం పర్యటనంటే ఏవైణౠ కొత్త పథకాలు ప్రవేశపెట్టి వరాల జల్లు కురిపిస్తారని ప్రజలు ఆశ పడతారు. కానీ ప్రస్తుతం జిల్లాలో సీఎం పర్యటనంటే ప్రజలు అసహనానికి లోనవుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలైతే సీఎం, మంత్రి నారా లోకేశ్ జిల్లా పర్యటనæ అంటే హడలిపోతున్నారు. సీఎం, చినబాబు పాల్గొనే సభలకు భారీగా జనాలను సమీకరించడం కోసం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు పంపాలంటూ అ«ధికారులే హకుం జారీ చేస్తున్నారు. మొన్నటికి మొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ పల్నాడు పర్యటన సందర్భంగా పల్నాడులోని పలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా బస్సులను జన సమీకరణకు తీసుకెళ్లారు. చినబాబు పర్యటన ముగిసి కొద్ది రోజులు కూడా కాక ముందే జిల్లాలో సీఎం పర్యటన ఉండటంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో బుగులు మొదలైంది. సోమవారం సీఎం చంద్రబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కార్యక్రమానికి భారీగా జనాలను తరలించేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలపై పడ్డారు. గతంలో సైతం సీఎం, మంత్రుల సభలు, పార్టీ కార్యక్రమాలకు పాఠశాలలకు సెలవులు ప్రకటించి బస్సులు తీసుకెళ్లారు. చీటికి మాటికి పాఠశాలలకు అనవసరంగా సెలవులు ప్రకటించడం వల్ల పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు. గతంలో నారా హమారా.. టీడీపీ హమారా.. మహానాడు, వనం మనం, స్వచ్ఛ భారత్కు సంబంధించిన కార్యక్రమాలకు పాఠశాల బస్సులను ఉపయోగించారు. అయితే సీఎం సభలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బస్సులను పంపిస్తుండగా, మరికొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలను రవాణా శాఖ అధికారులు బెదిరించి బస్సులు తీసుకెళుతున్నారు. ఆర్టీసీకి బకాయి ఉన్నందునే... ప్రతి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులను విచ్చలవిడిగా వినియోగించుకుంటున్న టీడీపీ నేతలు సంస్థకు బకాయి పడ్డారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆర్టీసీ బస్సులను వినియోగిస్తే సమస్యలు ఎదురవుతాయని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను బెదిరిస్తున్నట్లు సమాచారం. నిబంధనలు తుంగలోకి.. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు విద్యా సంస్థ వాహనాలను వినియోగించరాదన్న నిబంధనలను తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. పాఠశాలలకు సెలవు ప్రకటించి స్కూల్ బస్సులను తీసుకెళ్లడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండి పడుతున్నాయి. సాధారణంగా స్కూల్ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించే సమయంలో రవాణా కార్యాలయం ద్వారా పర్మిట్ను పొందాలి. జిల్లాలో అధికార పార్టీ నాయకులు ఈ నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా బెదిరించి జనాలను తరలిస్తే అటు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఇటు ప్రజల ఆగ్రహానికి గురవుతామని తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కడుపుకోత
బాబూ నా బిడ్డ రోడ్డుపై పడిపోయాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. కాస్త ఆపండయ్యా అంటూ అప్పటికే చనిపోయిన కొడుకు కోసం వచ్చేపోయే వాహనాలను ఆపుతున్న ఆ తల్లిని చూసిన ప్రతి హృదయం శోక సంద్రమైంది. వడివడిగా బుడిబుడి అడుగులు వేస్తూ అమ్మా టాటా అంటూ ఉదయాన్నే బయలుదేరిన బిడ్డ.. సాయంత్రం శవమై ఇంటికి చేరడంతో అ తల్లిదండ్రుల కడుపుకోత కన్నీటి చెలమలయ్యింది. తాడేపల్లి మండలం చిర్రావూరులో మంగళవారం స్కూల్ బస్ చక్రాల కింద పడి ఆరేళ్ల చిన్నారి ప్రాణం చితికిపోయింది. రోజూ తానెక్కే బస్సే మృత్యువై మింగేసింది. ఒక్కగానొక్క కొడుకు దూరమైన ఆ తల్లిదండ్రులకు తీరని గుండెకోత మిగిల్చింది. గుంటూరు, తాడేపల్లిరూరల్: సాయంత్రం స్కూల్ నుంచి తమ ఏకైక గారాల పట్టీ వస్తాడని ఆ తల్లి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. కుమారుడి రాక కోసం రోడ్డుపైనే నిలబడిపోయింది. ఇంతలోనే కనుచూపు మేరలో ఓ విషాదం. స్కూల్ బస్సు కింద బాలుడి పడ్డాడ్డన్న చేదు వార్త. అది తన బిడ్డ కాకూడదని ఆతల్లి మనసులో అనుకుంటూ బస్సువైపు పరుగు తీసింది. అది తన బిడ్డనే అని తెలియగానే ఆ తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన బిడ్డను కాపాడాలంటూ అడ్డువచ్చిన ప్రతి ఆటోను ఆపి మరీ వేడుకుంది. కానీ అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. విషయం చుట్టుపక్కల వారు తెలిపినా ఆ తల్లి మాత్రం ఆ మాటలను పట్టించుకోవడం లేదు. తన బిడ్డను బ్రతికించాలని గుండెలవిసేలా ఆ భగవంతుడికి మొర పెట్టుకుంది. ఈ హృదయ విదారక ఘటన చిర్రావూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... చిర్రావూరు గ్రామంలో నివసించే నారంశెట్టి భిక్షాలు అలియాస్ ముసలయ్య, సుజాతకు ఏకైక కుమారుడైన హర్ష (6) నూతక్కిలోని ఆదిత్య పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు పాఠశాలకు బస్సులో వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా బస్సు విద్యార్థులను దించేందుకు ఆగింది. హర్ష అందరికంటే మొదట బస్సు దిగి తోటి విద్యార్థులు దిగిన తరువాత మళ్లీ బస్సులోకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో హర్ష అదుపుతప్పి బస్సు వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుమారుడి కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్న తల్లికి స్థానికులు విషయం తెలపడంతో ఆమె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్సు బోల్తా 30 మంది చిన్నారులకు గాయాలు
మోపాల్(నిజామాబాద్రూరల్): జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్లో గల చైతన్య హైస్కూల్కు చెందిన బస్సు మంగళవారం రూరల్ మండలంలోని ధర్మారం గ్రామశివారులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 30మంది చిన్నారులకు గాయాలయ్యాయి. బస్సులో పరిమితి మించి విద్యార్థులను తరలించడం, అతివేగంతో పాటు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడటమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సులో 70 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అయితే యాజమాన్యం మాత్రం 39 మందే ఉన్నట్లు చెప్పుకొస్తోంది. రోడ్డు పక్కనే ఉన్న పాడుబడిని ఓపెన్ బావి సమీపంలోనే స్కూల్ బస్సు బోల్తా పడింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారమందుకున్న 108 చేరుకుని చిన్నారులను స్థానిక, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం.. చైతన్య హైస్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్సు వేగం, సామర్థ్యానికి మించి విద్యార్థులు ఉండడం, డ్రైవర్ బి.శివకుమార్ సెల్ఫోన్లో మాట్లాడుతుండటంతో మూలమలుపు వద్ద ఆటోను తప్పించబోయి బోల్తాపడింది. ప్రమాదంలో 30మంది చిన్నారులకు స్వల్పగాయాలు కాగా, మరో విద్యార్థి సుశాంత్, క్లీనర్ అజయ్కు తీవ్ర గాయాలయ్యాయి. అజయ్కు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు తెలిసింది. బస్సు నాగారం, గొల్లగుట్ట, చక్రధర్నగర్ తండా, మల్లారం, ధర్మారం, ధర్మారం తండా విద్యార్థులను ఎక్కించుకుని సిర్పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గతంలో ఇదే డ్రైవర్ను హెచ్చరించినా పట్టించుకోలేదు. నెమ్మదిగా వెళ్లాలని సూచించిన వారిపై అసభ్యపదజాలంతో దూషించేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మరో బస్సును అదనంగా కేటాయించాలని వారు కోరుతున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఏసీపీ ప్రమాద విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్ కుమార్, రూరల్ సీఐ రఘునాథ్, ఎస్హెచ్ఓ ప్రభాకర్, ఎస్ఐ గురువప్ప సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సులోని విద్యార్థుల సంఖ్యను ప్రత్యక్ష సాక్షులు, పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. 38 సీట్ల సామర్థ్యం గల బస్సులో 70మందిని ఎలా తరలిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ శివకుమార్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నెమ్మదిగా వెళ్లాలని చెప్పినం.. డ్రైవర్ శివకుమార్ బస్సును సెల్ఫోన్లో మాట్లాడుతూ అతివేగంగా నడుపుతుంటాడు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు తాము కూడా పలుమార్లు హెచ్చరించాం. అయినా విన్పించుకోలేదు. గతంలో ఓ సారి గ్రామస్తులందరూ కలిసి దాడి చేశారు. మళ్లీ అలాగే ఉంది. యాజమాన్యం డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. లేకుంటే ఇటువంటి ప్రమాదాలే జరుగుతాయి. –రవీందర్రెడ్డి, ధర్మారం నా మనుమడికి దెబ్బలు తాకినయి స్కూల్కు మా ఊరి నుంచి 30మంది పోతరు. నా మనువడు సుశాంత్ కూడా ఉన్నాడు. ఇప్పుడు సుశాంత్కు పెద్ద దెబ్బలు తాకినయి. ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నం. మరికొందరికి రెండు, మూడు కుట్లు కూడా పడ్డాయి. అంతేగాకుండా ఎక్కువ మందిని తీసుకెళ్తున్నారు. అలా కాకుండా మరో బస్సును కేటాయించి తిప్పాలి. –గంగాధర్, ధర్మారం.. చాలా భయమేసింది.. ధర్మారం తండాలో బస్సు ఎక్కిన. అక్కడి నుంచి సిర్పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నడు. బస్సు బోల్తా పడటంతో అందులో ఉన్న అందరం ఏడ్చేశాం. చుట్టుపక్కల వారు వచ్చి మమ్మల్ని లేపారు. నన్ను అందరూ తొక్కుకుంటూ వెళ్లారు. చాతిలో నొప్పిగా ఉంది. –హరిణి, 4వ తరగతి -
బస్సు చక్రాల కింద నలిగి బాలుడు మృతి
హయత్నగర్: స్కూలుకు వెళ్లి ఓ బాలుడు అదే స్కూలు బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన శుక్రవారం సాయంత్రం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొహెడా గ్రామానికి చెందిన బండారి బీరప్ప, బార్గవిల పెద్దకొడుకు రిషితేజ్(4). బీరప్ప లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రిషితేజ్ను నెల క్రితమే స్థానికంగా ఉన్న సంకీర్త్ గ్రామర్ స్కూల్లో నర్సరీలో చేర్పించాడు. ఉదయం పాఠశాలకు వెళ్లిన రిషితేజ్ సాయంత్రం ఇంటికి స్కూలు బస్సులో బయలుదేరాడు. కొహెడాలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న ఇంటి సమీపంలో బస్సు దిగాడు. గల్లీలో ఉన్న ఇంటికి చేరేందుకు బస్సు వెనుక నుంచి నడుచుకుంటూ వెళుతూ.. ఇంటి ర్యాంపు (జారుడు బండ) పైకి ఎక్కాడు. బస్సు ముందుకు కదులుతుండగా ర్యాంపు నుంచి జారిపడి పాఠశాల బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. బస్సు చక్రాలు బాలుడి తల పైనుంచి పోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇరుకు సందులో దారిని ఆక్రమించి ఎత్తుగా నిర్మించిన ర్యాంపు బాలుడి మృతికి కారణమైందని స్థానికులు అంటున్నారు. ర్యాంపు పక్కన నుంచే బస్సు వెళ్లడంతో ర్యాంపుపైకి ఎక్కిన బాలుడు జారి బస్సు కింది పడినట్టు చెబుతున్నారు. పాఠశాల ముందు ఆందోళన బాలుడి మృతికి పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడి మృతదేహాంతో సంకీర్త్ పాఠశాల వద్దకు ఆందోళనకు దిగారు. డ్రైవర్ నర్సింహ బస్సు దిగిన పిల్లలను పట్టించుకోకుండా బస్సు నడపడం వల్లనే దుర్ఘటన జరిగిందని దీనికి పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించి తగిన న్యాయం చేయాలని బాలల హక్కుల సంఘం నాయుడు అచ్చుతరావు డిమాండ్ చేశారు. -
రెండు స్కూల్ బస్సులు దగ్ధం
విశాఖపట్నం, గాజువాక: విద్యార్థులను స్కూల్లో దించేసిన అనంతరం ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన రెండు బస్సులు మంటలకు దగ్ధమయ్యాయి. వాటి పక్కనే ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ పాక్షికంగా కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు పలు వాహనాలను అగ్ని ప్రమాదం నుంచి రక్షించారు. బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలపై ప్రత్యక్ష సాక్షులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక రవీంద్ర భారతి స్కూల్కు చెందిన బస్సులను విద్యార్థులను దించేసిన అనంతరం సమీపంలోని డ్రైవర్స్ కాలనీ వద్ద గల ఖాళీ స్థలంలో నిలిపి ఉంచుతారు. వాటి వెనుకనే పెద్ద పెద్ద చెత్తకుప్పలు పేరుకుపోయి ఉంటాయి. వివిధ రకాల వ్యర్థాలు, మెకానిక్ షాప్లలో వాడిన గుడ్డలను అందులో పడేస్తారు. దాని వెనుకనే మద్యం సేవించేవారు, సిగరెట్లు కాల్చేవారు సంచరిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో.. ఎప్పటిలాగే బుధవారం ఉదయం రెండు బస్సుల్లో విద్యార్థులను దించేసిన తరువాత వాటిని యధావిధిగా ఖాళీ స్థలంలో నిలిపి ఉంచారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో డ్రైవర్లు భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి బస్సులను మూడు గంటలకు అక్కడి నుంచి తీయాల్సి ఉంది. ఈ లోగా బస్సుల్లో మంటలు చెలరేగాయి. తొలుత ఒక బస్సులో చెలరేగిన మంటలు వెంటనే పక్క బస్సుకు, ఆ పక్కనే ఉన్న ఆయిల్ ట్యాంకర్కు ఎగబాకాయి. దీన్ని గమనించిన స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించడంతోపాటు పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. పక్కనే మరో కారు కూడా పార్కు చేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు దాని అద్దాలు పగులగొట్టి దూరంగా తరలించారు. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. మంటలను అదుపు చేసే సమయానికి రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ను మంటల నుంచి రక్షించారు. వాటితోపాటు ఆ పక్కనే ఉన్న నాలుగు లారీలు, ఒక మినీ బస్సు, మినీ వ్యాన్లను మంటలకు గురి కాకండా రక్షించగలిగారు. ప్రమాదంలో రూ.15లక్షల ఆస్తి నష్టం చోటు చేసుకుందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మరో అరగంటలో పిల్లలు బయలుదేరుతారనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న గాజువాక ట్రాఫిక్, శాంతి భద్రతల పోలీసు అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక సమాచారం సేకరించారు. కాల్చిన సిగరెట్ను చెత్తలో పడేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
స్కూల్ బస్సును ఢీకొన్న ట్యాంకర్
వర్ధన్నపేట (వరంగల్): విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును అతివేగంగా వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సులోని 17మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ సంఘటన వర్ధన్నపేట–ఖమ్మం జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. ట్యాంకర్ లారీ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై ఉపేందర్రావు కథనం ప్రకారం... వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని శ్రీ అరబిందో ఉన్నత పాఠశాలకు చెందిన బస్సు సమీపంలోని డీసీతండా, బావనికుంట, నీలగిరి, గుబ్బెటితండాలో విద్యార్థులను 30 మంది విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయ సమీపంలో వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై పెద్ద గుంతలు ఉండగా స్కూల్ బస్సు డ్రైవర్ బ్రేక్ వేసి వేగాన్ని తగ్గించాడు. ఈ క్రమంలో వెనుక వేగంగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ లారీ డ్రైవర్ బ్రేక్ వేయకపోవడంతో స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న విద్యార్థుల తలలకు, కాళ్లకు గాయాలయ్యాయి. బస్సు అద్దాలు పగిలి విద్యార్థులకు గుచ్చుకున్నాయి. ట్యాంకర్ అదే వేగంతో కుడి వైపు రోడ్డు దిగి కిందికి 100 మీటర్ల దూరం వెళ్లింది. ఆ ప్రదేశంలో ఒక్కసారిగా విద్యార్థుల హాహాకారాలతో కొద్దిసేపు ఏం జరిగిందో తెలియ ని పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న సీఐ కరుణాసాగర్రెడ్డి, ఎస్సై ఉపేందర్రావు ప్ర మాదస్థలికి వచ్చి గాయాలపాలైన విద్యార్థులను వెంటనే ఆటోల్లో ఎక్కించి హుటాహుటిన వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ వద్దకు వెళ్లగా డ్రైవర్ రేకుల శ్రీనివాస్రెడ్డి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా 419గా రికార్డయ్యింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వెంట నే ఆస్పత్రికి తరలించారు. కాగా గాయాలపాలైన విద్యార్థినీ విద్యార్థులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆ స్పత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత వరంగల్ ఎం జీఎం ఆస్పత్రికి అంబులెన్సుల్లో తరలించారు. ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సపావట్ కృష్ణ (ఎనిమిదో తరగతి) కాళ్లు రెండు చోట్ల విరగడంతోపాటు తలకు గాయం కాగా వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతున్నాడు. ఎ.ఝాన్సీ (ఎల్కేజీ) తలకు గాయాలు కాగా వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వి.మహేష్కు కాలు విరగ్గా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. స్వల్ప గాయాలతో బయటపడిన విద్యార్థులు వీరే.. బి.విజయ్ (ఐదో తరగతి), ఎస్.దివ్య (తొమ్మిదో తరగతి), ఎస్.చంద్రశేఖర్ (యూకేజీ), కె.కల్యాణి (తొమ్మిదో తరగతి), చరణ్ (ఒకటో తరగతి), రాహుల్ (యూకేజీ), బి.శ్రీరాం (ఒకటో తరగతి), భరత్ (మూడో తరగతి), బి.అరుణ్ (మూడో తరగతి), నిషాంత్ (ఎల్కేజీ), సంజన్ (ఒకటోతరగతి), బి.అశోక్ (మూడో తరగతి), బి.సాయివిద్య (నాలుగో తరగతి), సిరివల్లి (ఆరోతరగతి) ఉన్నారు. ఉలిక్కిపడ్డ తండాలు.. స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైందనే విషయం ఆయా తండావాసులకు తెలియడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వ్యవసాయ పనుల్లో ఉన్న వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని తమ పిల్లలు ఎక్కడ ఉన్నారని బోరున రోదిస్తూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తండాల్లో నుంచి వందలాది మంది తమ పిల్లలకు ఏమైందని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని ఆరా తీశారు. స్వల్ప గాయాలైనట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అధ్వానంగా జాతీయ రహదారి వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి ఎన్హెచ్–563 పరిధిలోకి వచ్చిన తర్వాత అధ్వానంగా తయారైంది. రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతలను సైతం పూడ్చకపోవడంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కక్కిరాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద నుంచి డీసీతండా శివారు వరకు జాతీయ రహదారిపై ఉన్న పెద్ద పెద్ద గుంతల వల్లే ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయినా సంబంధిత అధికారుల్లో చలనంలేదని ప్రజలు మండిపడుతున్నారు. చిన్నారులందరూ క్షేమంస్వల్పగాయాలపాలైన 11 మందికిఎంజీఎం ఆస్పత్రిలో వైద్యం ఎంజీఎం: వర్ధన్నపేటలో మంగళవారం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రికి వచ్చిన విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిందని తెలిసి వర్ధన్నపేటలో ప్రమాద స్థలానికి పరుగులు పెట్టాం.. మా బిడ్డలను అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని తెలిసి ఏం జరిగిందోనని ఆందోళన చెందాం.. కానీ చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడడం చూసీ అంతా.. దేవుడి దయ అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన 11 మంది.. వర్ధన్నపేట స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో గాయాలైన విద్యార్థులు అంబోతు కళ్యాణి, భూక్య విజయ్, అంబోతు ఝాన్సీ, సపావతు చంద్రశేఖర్, సపావత్ భరత్, సభావత్ దివ్య, సపావత్ మహేష్, భూక్య శ్రీరామ, భూక్య చరణ్, భూక్య అరుణ్, రాహుల్ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు. విద్యార్థులు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాగా చికిత్సపొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, కొండేటి శ్రీధర్ పరామర్శించారు. బస్సులో 40 మందిప్రయాణిస్తున్నం.. మా తండా నుంచి బస్సులో రోజూ 40 మంది వర్ధన్నపేట స్కూల్ వెళ్తం.. ఒక్కసారిగా వెనుక నుంచి ట్యాంకర్ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనతో అందరం భయభ్రాంతులకు గురయ్యాం. నా తలకు గాయమైంది.– కళ్యాణి, విద్యార్థిని దేవుడి దయ వల్ల మా బిడ్డకు ఏం కాలేదు బస్సును లారీ గుద్దిందని తెలియగానే తండా నుంచి పరుగులు పెట్టాం. అందరూ చచ్చిపోయారని చెప్పారు. ఆస్పత్రికి వచ్చి చూస్తే నా కొడుక్కు దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. – స్వరూప, బాలుడి తల్లి -
స్కూల్ బస్సును ఢీకొన్న లారీ..!
సాక్షి, వరంగల్ : ప్రైవేటు స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టిన ఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమింది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40మంది విద్యార్థులు ఉన్నారు. లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. గాయాలపాలైన విద్యార్థులను వరంగల్లోని ఎంజీఎంకు తరలిస్తున్నారు. బస్సు డీసీ తండా నుంచి వర్ధన్నపేటలోని స్కూల్కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు బోల్తా.. ప్రకాశం : విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళ్తున్న ప్రైవేలు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలం కాటురిపాలెం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు. -
మద్యం తాగి స్కూల్ బస్సు డ్రైవింగ్
పశ్చిమగోదావరి, తణుకు/పెరవలి : మద్యానికి బానిసైన ఒక స్కూల్ బస్ డ్రైవర్ నలభై మంది చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడాడు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గుర్తించి అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎప్పుడూ మద్యం తాగి బస్సు నడుపుతుంటాడని తెలిసినా పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడంపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తణుకు పట్టణంలోని గౌతం మోడల్ స్కూల్కు చెందిన బస్సులో పెరవలి మండలం ఖండవల్లికి చెందిన భూసరపు శ్రీను డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడు సోమవారం ఉదయం పెనుగొండ మండలం వడలి నుంచి పిల్లలను బస్సులో ఎక్కుంచుకుని తణుకు బయలుదేరాడు. పెరవలి మండలం నల్లాకుల వారిపాలెం వచ్చేసరికి అటుగా రావులపాలెం వైపు వెళుతున్న ఎంవీఐ శ్రీనువాస్ బస్సు హైవేపై అడ్డదిడ్డంగా వెళుతున్న నడుస్తున్న తీరును గమనించి అనుమానం రావడంతో బస్సును అడ్డుకుని రికార్డులు తనిఖీ చేశారు. అయితే డ్రైవర్ శ్రీను ఫూటుగా మద్యం సేవించి ఉండటం గుర్తించి బస్సును పెరవలి పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించి డ్రైవర్ మద్యం తాగి ఉండటాన్ని నిర్ధారించి కేసు నమోదు చేశారు. స్కూల్ బస్సును సీజ్ చేశారు. ఎంవీఐ అప్రమత్తతతోనే.. తణుకు ఎంవీఐ ఎన్యూఎన్ఎస్ శ్రీనివాస్ చాకచక్యంగా అప్రమత్తంగా వ్యవహరించడంతోనే పెను ముప్పు తప్పింది. ఈ సమయంలో బస్సులో 42 మంది చిన్నారులు ప్రయాణిస్తున్నారు. ఎంవీఐ శ్రీనివాస్కు తణుకు వైపు వెళుతున్న స్కూలు బస్సు అడ్డదిడ్డంగా వెళుతుండటం కంట పడటంతో అప్రమత్తమయ్యారు. విద్యార్థులను సురక్షితంగా స్కూలులో దించిన రవాణాశాఖ అధికారులు బస్సును సీజ్ చేశారు. అయితే తరచూ డ్రైవర్ శ్రీను మద్యం తాగి స్కూలు బస్సు నడుపుతున్నాడని తోటి డ్రైవర్లు చెబుతున్నారు. ఈ విషయం స్కూలు యాజమాన్యం దృష్టిలో ఉన్నా పట్టించుకోలేదని తెలుస్తోంది. తమ పిల్లలను స్కూలుకు పంపిస్తుంటే ఇలా తాగుబోతు డ్రైవర్లను ఎలా నియమించుకుంటారని వారు యాజమాన్యాన్ని నిలదీశారు. ఎంవీఐ సరిౖయెన సమయంలో స్పందించంటం వలన పెనుప్రమాదం తప్పిందని లేకపోతే తమ పిల్లలు ఏమయ్యేవారోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బస్ డ్రైవర్ బి.శ్రీనివాస్ను అరెస్టు చేసి తణుకు కోర్టులో హాజరుపరిచామని ఎస్సై వి.జగదీశ్వరరావు తెలిపారు. విచారించిన అదనపు సివిల్ జడ్జి కె.శివశంకర్ డ్రైవర్ శ్రీనుకు ఏడ్రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
స్కూలు బస్సు బోల్తా
పిఠాపురం: స్కూలు బస్సు కాలువలో బోల్తా పడిన సంఘటనలో పది మంది విద్యార్థులు గాయపడగా 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ఆదర్శ పబ్లిక్ స్కూలు బస్సు ఉదయం కొత్తపల్లి మండలం శ్రీరాంపురం నుంచి రావివారిపోడు, రామరాఘవపురం, రమణక్కపేట, నాగులాపల్లి మీదుగా విద్యార్థులను ఎక్కించుకుని పిఠాపురం వెళుతుండగా ఇసుకపల్లి సమీపంలోని నాగంపాలెం వద్ద బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి తిరగబడింది. దాంతో బస్సులో ఉన్న 25 మంది పిల్లలు భయాందోళనలతో కేకలు వేస్తుండగా ఆదారిన పోతున్న వారు బస్సులో ఇరుక్కున్న విద్యార్థులను రక్షించారు. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. అన్వేష్ అనే ఒక విద్యార్థి చెయ్యి విరిగింది, బస్సు క్లీనర్ తలకు గాయం అయ్యింది. వీరందరినీ పిఠాపురంలో ఒక ప్రైయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ వారికి చికిత్స అందజేశారు. చెయ్యి విరిగిన విద్యార్థి కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాలం చెల్లిన బస్సు కావడంవల్లే.. ఈ స్కూల్ బస్సుకు రెండేళ్ల క్రితమే కాలం చెల్లినట్టు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆ స్కూలుకు చెందిన 8 బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటు సీజ్ చేయగా అపరాధ రుసుం చెల్లించి విడిపించుకుని తిప్పుతున్నట్టు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా అనుమతి లేని బస్సుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ రవాణాశాఖాధికారులు నిర్లక్ష్యంగా బస్సును వదిలివేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘స్కూలు బస్సులకు అనుమతిస్తే కేసులేస్తాం’
సాక్షి, హైదరాబాద్: ‘మా పార్టీ కార్యక్రమం కోసం అడిగితే నిబంధనల ప్రకారం స్కూలు బస్సులు ఇవ్వడం కుదరదన్నారు. అందుకే ఇపుడు లోతుగా పరిశీలించి చూస్తాం. టీఆర్ఎస్ సభ కోసం స్కూలు బస్సులకు అనుమతి ఇస్తే ఊరుకునేది లేదు. ఏ అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడినా కోర్టులో కేసులేస్తాం’అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. వచ్చే నెల 2న టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు నిబంధనల మేరకే అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి కుమారుడు, పీసీసీ కార్యదర్శి ఆదిత్యరెడ్డి.. పారి శ్రామికవేత్త బాలలింగం ఆదివారం టీజేఎస్లో చేరారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో పార్టీ అధ్యక్షుడు కోదండరాం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభలు, సమావేశాలు నిర్వహించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అధికార దుర్వినియోగం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవ ర్నర్దేనన్నారు. ఉచితంగా ఆర్టీసీ బస్సులు పంపుతాం.. డయాస్ వేస్తాం.. ఫుడ్ సప్లై చేస్తాం అనేవి ఉండొద్దని, అలాంటివి జరిగితే ఊరుకోమన్నారు. గతంలో తమ సభకు ఆటంకాలు సృష్టించారని, టీఆర్ఎస్ సభకు అలాంటి ఇబ్బందు లు సృష్టించొద్దన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువ కుల అవసరం ఉందని.. సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు
-
స్కూల్ బస్సు దగ్ధం
సాక్షి, హైదరాబాద్ : కూటల్పల్లిలోని వివేకానంద నగర్లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. మరో రెండు బస్సులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. వివేకనంద నగర్కి చెందిన భాష్యం స్కూల్కి చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలార్పారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాట్ సర్క్యుట్తోనే ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. -
తప్ప తాగి బస్సు నడుపుతూ..
బంజారాహిల్స్: మద్యం మత్తులో స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్ను ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్లోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో బస్సు డ్రైవర్గా పని చేస్తున్న సుబ్బారావు(54) మంగళవారం సాయంత్రం మాసబ్ట్యాంక్లో ఓ విద్యార్థినిని వదిలిపెట్టి మరో విద్యార్థినిని పంజగుట్టలో వదిలేందుకు వెళ్తున్నాడు. మాసబ్ట్యాంక్ చౌరస్తాలో సిగ్నల్ జంప్ చేయడంతో అనుమానం వచ్చిన ఆసిఫ్నగర్ ట్రాఫిక్ పోలీసులు అతడిని వెంబడించారు. బస్సును ఆపి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా అతను మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. 235 బీఏసీ నమోదు కావడం గమనార్హం. గతంలోనూ అతను ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో బస్సు నడుపుతూ పట్టుబడగా అప్పుడు 188 బీఏసీ స్థాయిగా నమోదైంది. 2017 ఆగస్టు 17న డ్రంక్ అండ్ డ్రైవ్లో రెండు రోజుల శిక్ష అనుభవించినట్లు తేలింది. తాజా ఘటనలో ఆసిఫ్నగర్ ట్రాఫిక్ సీఐ సైదులు కేసు నమోదు చేశారు. -
పసిమొగ్గలపై నిర్లక్ష్య‘చక్రం’
షాద్నగర్ రంగారెడ్డి : చిన్నారుల పాలిట స్కూల్ బస్సులు శా పంగా మారాయి. ఆభం శుభం తెలియని చిన్నారు ల జీవితాలను నిర్లక్ష్యపు చక్రం మొగ్గదశలోనే తుం చేస్తోంది. అనుభవం లేని డ్రైవర్లు, బస్సుల్లో సరైన హెల్పర్లు లేకపోవడంతో చిన్నారులు మృత్యు ఒడి లోకి చేరుతున్నారు. షాద్నగర్ నియోజకవర్గ పరిధి లో సంవత్సరన్నర కాలంలో స్కూల్ బస్సుల కార ణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరొ కరు తీవ్రంగా గాయపడ్డారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 80 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిలో 130కి పైగా స్కూల్ బస్సులు నడుస్తున్నాయి. మృత్యు వాహనాలు.. చిన్నారుల పాలిట స్కూల్ బస్సులు మృత్యువాహనాలుగా తయారయ్యాయి. పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యం, హెల్పర్ డ్రైవర్కు సరైన సూచన చేయకపోవడం, బస్సు నడిపే డ్రైవర్కు సరైన అనుభవం లేకపోవడం వీటి ఫలితంగా చిన్నారులు స్కూల్ బస్సు టైర్ల కింద నలిగిపోతున్నారు. గతేడాది షాద్నగర్ పట్టణ శివారులోని నాగులపల్లి రోడ్డులో విద్యార్థులను పాఠశాలకు చేరవేసేందుకు ఆగి ఉన్న స్కూల్ బస్సులో వద్దకు నందిని (03) అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లింది. హెల్పర్ చెప్పకపోవడంతో డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో చిన్నారి బస్సు వెనుక టైరు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. 2017 జూన్ 4న నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ నుంచి సల్వేంద్రగూడకు బయల్దేరిన స్కూల్ బస్సు కిందపడి అక్షిత్ అనే చిన్నారి తీవ్ర గాయాలపాయ్యాడు. అదే విధంగా కేశంపేట మండల పరిధిలోని వేములనర్వ గ్రామంలో ఓ చిన్నారి స్కూల్ బస్సు దిగింది. టిఫిన్ బాక్సు బస్సు కిందకు వెళ్లిందని బాక్స్ కోసం ఆ చిన్నారి బస్సు కిందకు వెళ్లింది. డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు చక్రాలు చిన్నారి మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పట్టించుకోని అధికారులు స్కూల్ బస్సులను ప్రతి సంవత్సరం ఫిట్నెస్ పరీక్షలు, మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై ఉంటుంది. బస్సు న డిపే డ్రైవర్కు కనీసం ఐదు సంవత్సరాల అనుభ వం ఉండాలి. ఒక హెల్పర్ బస్సులో ఖచ్చితంగా ఉండి తీరాలి. కొన్ని పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సులో హెల్పర్ లేకుండా టీచర్ను, లేక పాఠశాల అటెండర్ను ఉంచుతున్నారు. నియోజకవర్గం లో దాదాపు 10కి పైగా బస్సులు ఫిట్నెస్ లేకుండానే తిరుగుతున్నాయని సమాచారం. విష యం తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సుతో పాటు డ్రైవర్ కండీషన్ ముఖ్యం స్కూల్ బస్సులో డ్రైవర్తో పాటు తప్పకుండా హెల్పర్ ఉండి తీరాలి. ఏ చిన్న పొరబాటు జరి గినా విద్యార్థుల ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. అదే విధంగా పాఠశాల యాజమన్యా లు వారి బస్సులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డ్రైవర్ కండీషన్ను కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు ప్రమాదాలు జరుగవు. – పినపాక ప్రభాకర్, షాద్నగర్ -
చిన్నారిని బలిగొన్న స్కూల్ బస్సు
మాడ్గుల రంగారెడ్డి : మాడ్గుల మండలం ఆర్కపల్లి పంచాయతీ పరిధిలోని పల్గుతండాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శుక్రవారం సాయంత్రం స్కూల్ బస్సు కిందపడి మృత్యువాతపడింది. తండావాసులు, పోలీసుల కథనం ప్రకారం.. పల్గుతండాకు చెందిన రామావత్ ప్రసాద్, పార్వతీలకు ఇద్దరు కూమార్తెలు. పెద్ద కూతురు వైష్ణవి(4) మాడ్గుల సెయింట్మేరీ స్కూల్లో నర్సరీ చదువుతోంది. పల్గుతండా నుంచి ప్రతిరోజు స్కూల్ బస్సులో తండాకు చెందిన విద్యార్థులతో కలిసి పాఠశాలకు వెళ్లివస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి స్కూల్ బస్సులో తండాకు వచ్చిన వైష్ణవి తండాలో బస్సు దిగింది. ఆ సమయంలో వైష్ణవి చేతిలో ఉన్న టిఫిన్బాక్స్ ఉన్న బుట్ట ప్రమాదశాత్తు కిందపడిపోయింది. కిందపడిన బుట్టను తీసుకునేందుకు వంగింది. గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. బస్సు వెనుక చక్రం ఆ చిన్నారి తలపై నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విద్యార్థులు అరవడంతో బస్సును నిలిపివేసిన డ్రైవర్ మృతదేహాన్ని చూసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న వైష్ణవి తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చూసి చలించిపోయారు. ఈ ఏడాదే స్కూల్కు పంపించాం బిడ్డా.. అప్పుడే శవమైతివా.. అని రోదించిన తీరు తండావాసులను కన్నీరు పెట్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సైదులు పంచనామా నిర్వహించి.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
మా మంచి మాస్టారు
టీచర్ రాజారామ్.. రోజూ ఉదయాన్నే 8 గంటలకు మినీ బస్సును స్టార్ట్ చేస్తారు. చుట్టుపక్కల గ్రామాలకు తిరుగుతూ విద్యార్థులను ఎక్కించుకుని 9:30 కల్లా పాఠశాలకు చేరుకుంటారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు పాఠాలు చెప్పడంలో నిమగ్నం. మళ్లీ 5 గంటలకు మినీ బస్సు స్టార్ట్ చేయడం, విద్యార్థులను వారి వారి గ్రామాల్లో వదిలేయడం. ఇదీ ఆయన నిత్యకృత్యం. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు డ్రైవర్గా ఎందుకు మారాడు? అన్నదే ఆసక్తికరం. బొమ్మనహళ్లి: కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తుండడంతో సర్కారీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది దిగజారుతూ వందల సంఖ్యలో పాఠశాలలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలోని బ్రహ్మవర పట్టణం బరాలి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాజారామ్ (47).. డ్రాపౌట్స్తో పాటు మూతబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న తమ పాఠశాలను కాపాడడానికి నడుం బిగించారు. చుట్టుపక్కనున్న పలు పల్లెల విద్యార్థుల ప్రాథమికోన్నత చదువులకు బరాలి ప్రాథమికోన్నత పాఠశాల ఒక్కటే దిక్కు. దీంతో విద్యార్థులు ప్రతిరోజు ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు చేరుకోవాల్సిందే. వాగులు, చెరువులు దాటుకుంటూ వెళ్లాల్సిన ఉన్నందున పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెంది స్కూలు మాన్పించసాగారు. క్రమంగా పాఠశాల విద్యార్థులు సంఖ్య గణనీయంగా తగ్గిపోయి చివరికి పాఠశాల మూతబడే పరిస్థితులు తలెత్తాయి. ఆదుకున్న రాజారామ్ దీంతో మూతబడే ప్రమాదం నుంచి తమ పాఠశాలను కాపాడుకోవడానికి పాఠశాల ఉపాధ్యాయుడు రాజారామ్ సంకల్పించారు. పాఠశాలకు వాహనం కొనుగోలు చేయడానికి బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న పాఠశాల పూర్వ విద్యార్థులకు పరిస్థితిని వివరించి సహాయం అర్థించారు. పూర్వ విద్యార్థులు తలోచెయ్యి వేసి పాఠశాలకు ఓ మినీబస్సును అందించారు. కానీ డ్రైవర్ను ఎక్కడి నుంచి తీసుకురావడం? పాఠశాల నిర్వహణకు వచ్చే నిధులు అంతంతమాత్రంగానే ఉండడంతో వాహనాన్ని తనే డ్రైవర్పాత్రనూ పోషించాలని టీచర్ రాజారామ్ సిద్ధమయ్యారు. ఎంతో సాధన తరువాత బడి బస్ను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ను సంపాదించారు. 30 కిలోమీటర్లు, నాలుగు ట్రిప్పులు ♦ బరాలి గ్రామ చుట్టుపక్కనున్న శిరియార కల్లుబెట్టు, హొరళిజెడ్డు, అల్తారి కార్తిబెట్టు, కాజ్రళ్లి, మునిపురి తదితర గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి, తిరిగి ఇళ్లకు చేర్చడానికి రాజారామ్ ప్రతి రోజూ 30 కిలోమీటర్లు మేర నాలుగు ట్రిప్పులు తిప్పుతున్నారు. ♦ ఉదయం ఎనిమిది గంటలకు వాహనంతో గ్రామాలకు బయలుదేరి రెండు ట్రిప్పుల్లో విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తారు. సాయం త్రం ఐదు గంటలకు మరోసారి రెండు ట్రిప్పులు తిప్పి విద్యార్థులను ఇళ్లకు చేర్చుతారు. ♦ రాజారామ్ కృషికి ముగ్ధులైన గ్రామాల ప్రజలు తమ పిల్లలను తిరిగి ప్రభుత్వ పాఠశాలకు పంపించసాగారు. దీంతో పదిలోపు ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 90 కి చేరుకుంది. ♦ గణిత, సైన్స్ బోధిస్తున్న రాజారామ్తో అందుబాటులో లేనిరోజుల్లో వాహనానికి డ్రైవర్ను ఏర్పాటు చేయడానికి గ్రామస్థులు సమాలోచనలు చేస్తున్నారు. పాఠశాలలో హెచ్ఎం, మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నా రాజారామ్ మాత్రమే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. సేవకు ప్రశంసల జల్లు పాఠశాల, విద్యార్థుల కోసం తపిస్తున్న రాజారామ్కు నలువైపులా నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళుతున్న రాజారామ్ ఫోటో నెట్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన ప్రయత్నాన్ని మాజీ దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోను షేర్ చేసిన కొనియాడారు. -
భద్రత ఎంత ?
పిల్లలను స్కూళ్లకు తీసుకెళుతున్న ఆటోలు, బస్సులు భద్రత ఎంత అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాణాలు పాటించని వాహనాలలో చిన్నారులను ఎక్కించి వారిని ప్రమాదపుటంచులకు చేరవేస్తున్నారనే ఆందో ళన వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2500 ఆటోలు పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లెడానికి వినియోగిస్తున్నారు. చిన్న ఆటోల్లో కేవలం నలుగురు పిల్లలు, అదే పెద్ద ఆటో అయితే ఆరుగురు పిల్లలు మాత్రమే ప్రయాణించ వచ్చు. కానీ చిన్న ఆటోలో తొమ్మిది మంది, పెద్ద ఆటోలో దాదాపు పదిహేనుమంది పిల్లలు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ పక్కన, ఇరువైపులా ఉన్న ఇనుప చువ్వలపైనా ఎక్కడపడితే అక్కడ బస్తాల్లా కుక్కి తీసుకుళెతున్నారు. పైగా పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోలలో డ్రైవర్లకు కనీసం లైసెన్స్ కూడా లేనివి ఎన్నో ఉన్నాయి. ఇరువైపులా రక్షణగా ఏర్పాటు చేయవలసిన గ్రిల్స్ కనిపించవు, బ్యాగులు చుట్టూ వేలాడుతూ దర్శనమిస్తాయి. పాఠశాలలు ప్రారంభించి రెండు నెలలైనా కనీసం బస్సులకు కూడా ఫిట్నెస్ పరీక్షలు పూర్తిస్థాయిలో చేయలేదంటే అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి అనుమతులు, జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్న ఆటోల్లో పిల్లలు ప్రయాణించడం ఎంతవరకు సమంజసమనే విషయం గురించి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి, అమరావతి బ్యూరో: పిల్లలను అల్లారు ముద్దుగా పెంచాతాం...వారికి ఏ చిన్న అపాయమైనా తల్లడిల్లిపోతాం. తల్లిదండ్రుల ప్రేమంటే కేవలం వారికి బాధకలిగిన తర్వాత ఏడ్వడమా..? లేక ఏ ఆపదా రాకుండా జాగ్రత్తపడటమా..! రక్షణ లేని బస్సులు, బోట్లు, ఆటోల్లో ప్రయాణాలు చేయించడం జరగకూడనిదేదైనా జరిగాక గుండెలు బాదుకోవడం. అలోచించండి కనీస ప్రమాణాలు పాటించని వాహనాలలో పిల్లలను పంపి వారిని ప్రమాదపుటంచులకు చేరవేస్తున్నాం. తల్లిదండ్రులుగా పిల్లలను మంచి పాఠశాలలకు పంపుతున్నామా అని ఆలోచిస్తున్నారు. అలాగే ఎలాంటి వాహనాలలో పంపుతున్నామని కూడా ఒకసారి గమనించండి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,500 ఆటోలు పిల్లలను పాఠశాలలకు తీసుకువెళ్లడానికి వినియోగిస్తున్నారు. వీటిలో ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారన్న విషయాన్ని రవాణాశాఖ అధికారులు వద్ద కూడా సరైన సమాచారం లేదు. ఎటువంటి అనుమతులు, జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్న ఆటోల్లో పిల్లలు ప్రయాణించడం ‘రైటే’నా అన్న ప్రశ్నను తల్లిదండ్రులు ఒక్కసారి వేసుకోవడం మంచిది. అంతులేని నిర్లక్ష్యం స్కూల్ పిల్లలను తరలించే ఆటోడ్రైవర్లు చాలా నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి. కానీ ఎక్కడా అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ఎక్కడ చూసిన అంతులేని నిర్లక్ష్యంతో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చిన్న ఆటోల్లో కేవలం నలుగురు పిల్లలు, అదే పెద్ద ఆటో అయితే ఆరుగురు పిల్లలు మాత్రమే ప్రయాణించవచ్చు. కానీ చిన్న ఆటోలో తొమ్మిది మంది, పెద్ద ఆటోలో దాదాపు పదిహేనుమంది పిల్లలను కుక్కుతున్నారు. డ్రైవర్ పక్కన, ఇరువైపులా ఉన్న ఇనుప చువ్వలపైనా ఎక్కడపడితే అక్కడ బస్తాల్లా కుక్కి తీసుకుళెతున్నారు. పిల్లలు ప్రయాణించే ఆటో డ్రైవర్లకు కనీసం లైసెన్స్ కూడా లేనివి ఎన్నో ఉన్నాయి. ఇరువైపులా రక్షణగా ఏర్పాటు చేయవలసిన గ్రిల్స్ కనిపించవు. బ్యాగులు చుట్టూ వేలాడుతూ దర్శనమిస్తాయి. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోని బస్సులు దాదాపు వంద వరకు ఉన్నాయని సమాచారం. ఇక ఆటోలకైతే లెక్కేలేదు. రవాణా శాఖాధికారులు అక్కడక్కడా ఆటోలపై దాడులు చేసి జరిమానాలు వేస్తున్నప్పటికి జాగ్రత్తపడాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. తక్కువ డబ్బుకే వస్తాయనో, ఇంటి ముందే వచ్చి ఆగుతాయనో కారణాలతో ఆటోలను ఆశ్రయించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. నిబంధనలివే ⇔ చిన్న ఆటోలో డ్రైవర్ మినహా నలుగురు విద్యార్థులు ఉండాలి. ⇔ పెద్ద ఆటోలో అయితే ఆరుగురు మాత్రమే ప్రయాణించాలి. ⇔ ఆటో నడుపుతూ డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడకూడదు. ⇔ డ్రైవర్ ఎటువంటి మత్తుపదార్థాలు తీసుకోని వాహనం నడపరాదు. ⇔ ప్రతి ఏడాది ఆటోను రవాణాశాఖ కార్యాలయంలో ఫిట్నెస్ టెస్ట్లు చేయించి, పత్రాలను పొందాలి. ⇔ క్రమం తప్పకుండా ఇన్సూరెన్సును పునరుద్ధరించుకోవాలి. ఆటో నడుపుతున్న వ్యక్తికి ఇరువైపులాపిల్లలను కూర్చోబెట్టుకోకూడదు. ⇔ ఆటోలో ఎటువంటి లౌడ్స్పీకర్లు వినియోగించరాదు. ⇔ జాతీయ రహదారుల్లో స్కూల్పిల్లలతో ఉన్న ఆటోలు నడపకూడదు. ⇔ ప్రయాణికులకు కూర్చొవడానికి ఉన్న సీటు తప్ప ఇతర ప్రత్యేకమైన ఏర్పాటుచేసి విద్యార్థులను కూర్చొబెట్టరాదు. ⇔ ఆటోకు ఒక వైపు పూర్తిగా మూసివేసేలా గ్రిల్స్, మరోవైపు తాత్కాలికంగా రక్షణ కల్పించేలా గ్రిల్స్ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. ⇔ స్కూల్ బ్యాగ్లు, లంచ్ బాక్స్లు, క్రీడా సామగ్రిని బయటకు వేలాడదీయకూడదు. ⇔ పాఠశాల విద్యార్థులను తరలించే ఆటోల్లో తప్పనిసరిగా ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు నిబంధనలు అతిక్రమించి ఆటోల్లో స్కూలు పిల్లలను ఎక్కించిన డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవు. ఇటీవల విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించాం. ఓవర్లోడ్తో ఆటోలు నడపడం చట్టరిత్యా నేరం. ఓవర్లోడ్లపై మళ్లీ తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం. స్కూల్ పిల్లలను ఓవర్లోడ్ చేసే ఆటోలు పట్టుపడితే సీజ్ చేస్తాం. తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ఇ.మీరాప్రసాద్ ,డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విజయవాడ -
టైమింగ్ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. ఈ సమయాల్లో రహదారులపై దూసుకుపోయే వాహనాల్లో విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఆటోలు, వ్యానులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా... కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల తొందరపాటుతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని తప్పించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు విద్యాసంస్థల పని వేళల్లో మార్పు (స్టాగరింగ్) చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదన ఏడేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. 2010 లో ప్రయోగాత్మకంగా ప్రారంభమై, ఆ తర్వాతి ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలవుతుందని ఆశించినప్పటికీ అది అటకెక్కింది. నగర ట్రాఫిక్ చీఫ్గా పనిచేసిన సీవీ ఆనంద్ బదిలీతో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్కుమార్ నేతృత్వంలో బుధవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తొలి దశలో పాఠశాలలు, రెండో దశలో కళాశాలల సమయాల్లో మార్పులు చేయాలని తాజాగా ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు. విద్యాశాఖ ముందుకొస్తేనే... విద్యాసంస్థల సమయాల్లో మార్పునకు సంబంధించి నిర్ణయం తీసుకొనే పూర్తిస్థాయి అధికారం ట్రాఫిక్ విభాగానికి లేదు. దీని కోసం తొలుత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారీగా కొత్తగా ఏర్పడిన, ఏళ్లుగా ఉన్న స్కూల్ జోన్లను గుర్తించాలి. వీటి ఆధారంగా డీఈఓ సహకారంతో డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ట్రాఫిక్ ఏసీపీ, స్థానిక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలి. వీరంతా ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, తలెత్తుతున్న సమస్యలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఆపై ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూసేందుకు యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి స్టాగరింగ్కు సంబంధించిన ప్రతిపాదిత విధానాన్ని రూపొందిస్తారు. వీటిని ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ వింగ్ ప్రయత్నాలు 2012లోనే చేసినా విద్యాశాఖ నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఫలితంగా విద్యాసంస్థల ప్రారంభ–ముగింపు వేళల్లో మార్పులు రాలేదు. దాదాపు అన్నీ ఒకే సమయానికి ప్రారంభమవడం, ముగియడం జరుగుతోంది. దీంతో విద్యార్థులను తరలించే, వ్యక్తిగత వాహనాల కారణంగా తీవ్రమైన రద్దీ ఉంటోంది. మరోవైపు సమయం మించిపోకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందరలో విద్యాకుసుమాలు ప్రమాదాలబారిన పడుతున్నాయి. కేటగిరీల విభజన కీలకం... స్టాగరింగ్ అమలు చేయడానికి ముందుగా స్కూల్ జోన్స్ను గుర్తించడంతో పాటు వాటిని కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది. 2010లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు, ఆ తర్వాత ఏడాది నగరవ్యాప్తంగా అధ్యయనం చేశారు. ఈ నివేదికల్ని అధ్యయనం చేసిన ట్రాఫిక్ వింగ్ ఉన్నతాధికారులు విద్యాసంస్థలున్న ప్రాంతాలను వివిధ కేటగిరీలుగా విభజించారు. ఏదేని ప్రాంతంలో 500–750 మీటర్ల విస్తీర్ణంలో 8కంటే ఎక్కువ స్కూల్స్ ఉంటే ‘ఎ’ కేటగిరీగా, ఇంతే విస్తీర్ణంలో 5–7 వరకు స్కూళ్లుంటే ‘బి’, 3–4 ఉంటే ‘సి’ అని గ్రేడింగ్ ఇస్తూ కేటగిరీలుగా విభజించారు. ఈ సంఖ్య ఆధారంగా ఆయా సంస్థల పనివేళల్లో కనీసం 15 నిమిషాల వ్యత్యాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని అనుకున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని విద్యాసంస్థలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేస్తున్నాయి. స్టాగరింగ్ అమలు చేస్తే ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల మధ్యలో వివిధ సమయాల్లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవచ్చన్నది ట్రాఫిక్ పోలీసుల అభిప్రాయం. ఇవీ పరిగణించాలి... విద్యాసంస్థలకు సంబంధించి ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల పని వేళలు మార్పు చేసే ముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. నగరంలో అనేక చిన్న కుటుంబాలున్నాయి. అందులోనూ భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారే అధికం. ప్రస్తుతమున్న వేళలకు అనుగుణంగా వీరు తమ విధులకు సంబంధించి సర్దుబాట్లు చేసుకొని ఉంటారు. ఈ నేపథ్యంలో స్టాగరింగ్తో చిన్నారుల తల్లిదండ్రుల విధులపై ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాల్సిందే. స్టాగరింగ్ విధానాన్ని సినిమా హాళ్లు, ప్రైవేట్ కార్యాలయాలకు సైతం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పీక్ అవర్స్ వేళల్లో మార్పులొచ్చి ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 3,522.. శివార్లలో 2,623 సూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 15లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరి రవాణా కోసం సిటీలోనే 9వేల బస్సులు, మరో 30వేల ఆటోలు తిరుగతున్నాయి. వ్యక్తిగత వాహనాలపై పిల్లల్ని తరలించే వారు దీనికి అదనం. -
ప్రాణాలు పోతుంటే.. సెల్ఫీల గోల
బర్మర్: సెల్ఫీల పిచ్చి మనుషుల్ని ఎంతలా దిగజార్చిందో తెలిపే ఘటన రాజస్తాన్లో జరిగింది. బర్మర్ జిల్లాలోని ఛోహ్టన్లో సోమవారం బైక్పై వెళుతున్న ముగ్గురు యువకుల్ని ఓ స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై రక్తపు మడుగులో పడున్న యువకులు నొప్పితో సాయం కోసం అర్థిస్తుంటే.. చుట్టుపక్కల వాళ్లు మాత్రం ఘటనాస్థలంలో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేపనిలో పడ్డారు. ఏ ఒక్కరూ సాయంచేయలేదు. ఓ అరగంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్షతగాత్రుల్లో ఒకరు ప్రమాదంజరిగిన చోటే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. -
అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వచ్చి..
పెద్దఅంబర్పేట : తన సోదరుడిని పాఠశాలకు పంపించేందుకు తల్లితో వెళ్లిన ఓ చిన్నారి బాలుడిని రెప్పపాటులో మృత్యువు కబలించింది. ప్రతి రోజూ స్కూల్ బస్సు వరకు వచ్చి అన్నకు టాటా చెప్పే ఆ చిన్నారిని అదే స్కూల్ బస్సు మృత్యువు ఒడిలోకి తీసుకువెళ్లిన దుర్ఘటనను ఆ చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్లు మూసి తెరిచేలోపే బుడిబుడి అడుగులు వేస్తూ చిట్టిపొట్టి మాటలతో ఆడుకునే తన ముద్దుల కొడుకు కళ్ల ముందే మృత్యువాత పడడంతో ఆ తల్లి రోదన స్థానికులను కన్నీరుపెట్టించింది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం తారమతిపేట గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, బుర్ర స్వాతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జశ్వంత్ హయత్నగర్లోని శాంతినికేతన్ స్కూల్లో చదువుతుండగా, రెండోవాడు తన్వీష్ (3) ఇంటి దగ్గరే ఉంటున్నాడు. బస్సు చక్రం కిందపడి.. తన కుమారుడిని స్కూల్కు పంపించేందుకు రోజు మాదిరిగానే స్కూల్ బస్సు ఎక్కించేందుకు స్వాతి మంగళవారం ఉదయం 7:40గంటల సమయంలో తన ఇద్దరు కొడుకులతో కలిసి బస్సు దగ్గరికి వెళ్లింది. జశ్వంత్ను బస్సులో ఎక్కించే క్రమంలో తల్లి పక్కనే ఉన్న తన్వీష్ బస్సు ముందు నుంచి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా స్కూల్ బస్సు ఒక్కసారిగా ముందుగా కదిలింది. దీంతో బస్సు కింద పడిని తన్వీష్పై నుం చి ముందు చక్రం వెళ్లడంతో తలకు తీవ్రగాయా లై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఎక్కడ ఉ న్నాడని చూసేలోపే స్వాతికి తన కుమారుడు విగతజీవిగా పడి కనిపించాడు. దీంతో ఒక్కసారిగా స్వాతి కుప్పకూలిపోయింది. తన చిన్న కొడుకు మృతి చెందాడన్న చేదు నిజాన్ని భరించలేక రోదిస్తున్న తీరు స్థానికుల కంట నీరు పెట్టించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
పెద్దఅంబర్పేట: తన సోదరుడిని పాఠశాలకు పంపించేందుకు తల్లితో వెళ్లిన ఓ చిన్నారి బాలుడిని రెప్పపాటులో మృత్యువు కబలించింది. ప్రతి రోజూ స్కూల్ బస్సు వరకు వచ్చి అన్నకు టాటా చెప్పే ఆ చిన్నారిని అదే స్కూల్ బస్సు మృత్యువు ఒడిలోకి తీసుకువెళ్లిన దుర్ఘటనను ఆ చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్లు మూసి తెరిచేలోపే బుడిబుడి అడుగులు వేస్తూ చిట్టిపొట్టి మాటలతో ఆడుకునే తన ముద్దుల కొడుకు కళ్ల ముందే మృత్యువాత పడడంతో ఆ తల్లి రోదన స్థానికులను కన్నీరుపెట్టించింది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలం తారమతిపేట గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, బుర్ర స్వాతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జశ్వంత్ హయత్నగర్లోని శాంతినికేతన్ స్కూల్లో చదువుతుండగా, రెండోవాడు తన్వీష్ (3) ఇంటి దగ్గరే ఉంటున్నాడు. బస్సు చక్రం కిందపడి.. తన కుమారుడిని స్కూల్కు పంపించేందుకు రోజు మాదిరిగానే స్కూల్ బస్సు (ఏపీ29టీబీ8114)) ఎక్కించేందుకు స్వాతి మంగళవారం ఉదయం 7:40గంటల సమయంలో తన ఇద్దరు కొడుకులతో కలిసి బస్సు దగ్గరికి వెళ్లింది. జశ్వంత్ను బస్సులో ఎక్కించే క్రమంలో తల్లి పక్కనే ఉన్న తన్వీష్ బస్సు ముందు నుంచి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా స్కూల్ బస్సు ఒక్కసారిగా ముందుగా కదిలింది. దీంతో బస్సు కింద పడిని తన్వీష్పై నుంచి ముందు చక్రం వెళ్లడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఎక్కడ ఉన్నాడని చూసేలోపే స్వాతికి తన కుమారుడు విగతజీవిగా పడి కనిపించాడు. దీంతో ఒక్కసారిగా స్వాతి కుప్పకూలిపోయింది. తన చిన్న కొడుకు మృతి చెందాడన్న చేదు నిజాన్ని భరించలేక రోదిస్తున్న తీరు స్థానికుల కంట నీరు పెట్టించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మాయి పక్కన సీటు కోసం రక్తమొచ్చేలా...
కోల్కతా : సినిమాల్లో చూపించే మాదిరిగా ఓ ఇద్దరు విద్యార్థులు స్కూల్ బస్సులో అమ్మాయి పక్కన సీటు కోసం రక్తమొచ్చేలా కొట్టుకున్నారు. ఇక సీనియర్ విద్యార్థి అయితే ఏకంగా జూనియర్ విద్యార్థిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో చోటు చేసుకుంది. సీనియర్ విద్యార్థి దాడిలో తీవ్ర గాయాలు పాలైన జూనియర్ వెనువెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అసలేం జరిగింది.. సాయంత్రం 4.45కు స్కూల్ అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ తమ ఇళ్లకు వెళ్లడానికి స్కూల్ బస్సు ఎక్కారు. క్లాస్ 11 విద్యార్థి అమ్మాయి పక్కన సీటులో కూర్చోవాలనుకున్నాడు. కానీ ఆమె పక్కన ఉన్న సీటులో క్లాస్ 10 విద్యార్థి కూర్చున్నాడు. అయితే ఆ అమ్మాయి తన గర్ల్ఫ్రెండ్ అని వెంటనే ఆ సీటులోంచి లేచి వేరే సీటులో కూర్చోవాలని జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థి బెదిరించాడు. కానీ సీనియర్ బెదిరింపులకు ఏ మాత్రం తలొగ్గని జూనియర్, సీటును ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ చిలికి చిలికి తీవ్ర స్థాయిగా మారింది. వారిద్దరి మధ్య తగాదాను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. ఆ సమయంలోనే స్కూల్ గేట్ నుంచి బస్సు కూడా ప్రారంభమైంది. పలుమార్లు డ్రైవర్ చెప్పినప్పటికీ, ఆ ఇద్దరు మాత్రం తమ వాగ్వాదాన్ని పెంచుకుంటూ పోయారు తప్ప తగ్గించలేదు. ఈ క్రమంలో బస్సును మధ్యలో ఆపిన సీనియర్, రోడ్డు పక్కనే ఉన్న స్టాల్లో కత్తిని తీసుకుని జూనియర్పై దాడికి పాల్పడ్డాడు. మెడ, భుజంపై పలు గాడ్లు పెట్టాడు. బస్సు డ్రైవర్, హెల్పర్, ఇతర విద్యార్థులు సీనియర్ విద్యార్థిని అడ్డుకుని, జూనియర్ను కాపాడారు. వెంటనే గాయపడిన జూనియర్ను కోల్కతాలోని దమ్ దమ్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన సీనియర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
షాబాద్(చేవెళ్ల): ఓ చిన్నారిని స్కూల్ బస్సు చిది మేసింది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలో సోమవారం జరి గింది. షాబాద్ మండ లం గోపిగడ్డకు చెందిన మోముల చంద్రశేఖర్రెడ్డి, లావణ్య దంపతులకు కుమారుడు సాత్విక్రెడ్డి, కూతురు ఆద్య (22 నెలలు) ఉన్నారు. బాలుడు షాబాద్లోని మాంటిస్సోరి స్కూల్లో చదువుతున్నాడు. సోమవారం ఉదయం గ్రామంలోకి వచ్చిన స్కూల్ బస్సులోకి కుమారుడిని ఎక్కించేందుకు చంద్రశేఖర్రెడ్డి ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చాడు. అదే సమయంలో కూతురు ఆద్య ఇంట్లో నుంచి రోడ్డుపైకి వస్తుండగా డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు తీసుకెళ్లాడు. ఆద్య చక్రాల కింద పడిపోయి తల ఛిద్రమై మృతి చెందింది. -
స్కూల్ బస్సు ఢికొని రెండేళ్ల చిన్నారి మృతి
-
ఫిట్.. లెస్..
తణుకు: పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో పిల్లలను చేర్పించుకునేందుకు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించిన పాఠశాలల యాజమాన్యాలు సకాలంలో అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకున్నాయి. అయితే పిల్లలను ప్రతిరోజు ఇంటి నుంచి స్కూల్కు, స్కూల్ నుంచి ఇంటికి తరలించే బస్సులను నిబంధనల ప్రకారం సిద్ధం చేయడంలో మాత్రం ఆసక్తి చూపడంలేదు. చిన్నారులను కొందరు తల్లిదండ్రులు తమ సొంత వాహనాలపై తీసుకెళుతున్నారు. మరికొందరు పాఠశాల బస్సుల్లో పంపుతున్నారు. ఇదిలా ఉంటే ఎక్కువ శాతం విద్యాసంస్థలు వారి బస్సుల ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. వి ద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లు తెరిచే నాటికి అన్ని స్కూళ్లు, కాలేజీల బస్సులకు ఫిట్నెస్లు పొందాలని ఇప్పటికే రవాణాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గత నెల 15 నుంచి ఆయా రవాణాశాఖ కార్యాలయాల్లో ప్రత్యేకంగా స్కూల్, కాలేజీ బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు వాటినే ఆశ్రయిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా వాటికి ఉన్న క్రేజ్తో రూ.వేలకు రూ.వేలు వెచ్చించి తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఫీజులు, పుస్తకాల ధరలమోత ఆకాశాన్నంటుతుంటే మరోవైపు ట్రాన్స్పోర్ట్ ఫీజు అంటూ కనీసం రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఆ బస్సులు ఏ కండిషన్లో ఉన్నాయనే విషయాన్ని పట్టించుకోవటం లేదు. జిల్లాలో మొత్తం 2,485 స్కూలు బస్సులు ఉండగా వీటిలో శుక్రవారం నాటికి 1,869 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. మరో 616 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఉదయం పిల్లలతో స్కూలుకు బయల్దేరిన సరైన కండిషన్ లేని బస్సులు మధ్యలో మొరాయిస్తుంటే రోడ్డు పక్కన గంటల తరబడి నిలిపి వాహనం మరమ్మతులు పూర్తయిన తర్వాత బయల్దేరిన సంఘటనలు కూడా లేకపోలేదు. స్కూల్ బస్సులు చిన్నపాటి ప్రమాదాలతో గండం గట్టెక్కిన సందర్భాలు గతేడాదిలో పదికి పైగానే ఉన్నాయి. తణుకు ప్రాంతంలోనే మూడు పర్యాయాలు బస్సులు మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ సంఘటనల్లో íపిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే పాఠశాలలు తెరిచినా ఇంకా జిల్లాలో 616 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించకపోవటం ఆయా విద్యాసంస్థల యాజమాన్యాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పాటించాల్సిన నిబంధనలు ఇవే.. ♦ ప్రైవేటు విద్యాసంస్థలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు వాహనంలో కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించాలి. అయితే తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇష్టమొచ్చినట్లు పాతవాహనాలను, అనుభవంలేని డ్రైవర్లను నియమించి విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను తిప్పుతున్నారు. ♦ మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం పాఠశాల బస్సులో తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ♦ సామర్థ్యాన్ని బట్టి పిల్లలను ఎక్కించుకోవాలి. సామర్థ్యానికి మించి రెండు, మూడు రెట్లు పిల్లలను ఎక్కించుకుని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ♦ స్కూల్, కాలేజీ బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు ఎక్ట్సింగ్విషర్ తప్పకుండా అమర్చాలి. అయితే బస్సుల్లో అది కనిపించదు. ♦ బస్సులు అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు విద్యార్థులు బయట పడేందుకు వీలుగా అత్యవసర ద్వారం ఉండాలి. అయితే బస్సులకు గ్రిల్ వేసి అత్యవసర ద్వారం లేకుండా చేస్తున్నారు. ♦ పాఠశాల బస్సులను నడిపే డ్రైవర్కు అయిదేళ్ల అనుభవంతోపాటు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి. తక్కువ జీతానికి వృద్ధులను డ్రైవర్లుగా తీసుకుని విద్యార్థులను ప్రమాదాలకు గురి చేస్తున్నారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులతో అప్పుడప్పుడు పరీక్షలు చేయించి సంబంధిత ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉన్నప్పటికీ అవేమీ లేకుండానే కొనసాగిస్తున్నారు. ♦ ప్రయాణంలో పిల్లలను ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం చేయడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కూడా అందుబాటులో లేకుండా బస్సులు నడుపుతున్నారు. ♦ చిన్నపిల్లలు బస్సు ఎక్కడానికి వీలుగా మెట్లు ఏర్పాటు చేయాలి. అయితే ప్రైవేటు స్కూలు బస్సులు ఎత్తుగా ఉండటంతో ఎక్కలేక విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. -
బడి బస్సులపై రవాణాశాఖ తనిఖీలు
ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం రవాణాశాఖ ఉప కమిషనర్ సీహెచ్వీకే సుబ్బారావు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరిగాయి. ఉదయం 7 గంటలు 9.30 వరకు అన్ని ప్రధాన రహదారులపైన 11 మంది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు వారి బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు పరిధిలో చర్చిసెంటర్, కర్నూల్రోడ్డు ఫ్లై ఓవర్, కొత్తపట్నం బస్టాండు సెంటర్, దక్షిణ బైపాస్, వెంగముక్కలపాలెం రోడ్డు, టంగుటూరు టోల్ప్లాజాల వద్ద తనిఖీలు జరిగాయి. అదే వి«ధంగా చీరాల, కందుకూరు, దర్శి, మార్కాపురం ప్రాంతాలలో కూడా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందకుండా నడుపుతున్న పది విద్యాసంస్థల బస్సులను సీజ్ చేసినట్లు రవాణాశాఖ ఉప కమిషనర్ సీహెచ్వీకే సుబ్బారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 1630 పాఠశాల బస్సులు ఉన్నాయని, వాటిలో 1180 బస్సులకు 2018–19 విద్యా సంవత్సరానికి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చామన్నారు. సర్టిఫికేట్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన బస్సులను ఒంగోలులో–7, చీరాల–2, దర్శి–1 సీజ్ చేశామన్నారు. మరో 450 బస్సులు ఇంకా రోడ్డుపైకి రాలేదని, వాటికిపై కూడా ప్రత్యేక దృష్టిసారించామన్నారు. వాటిలో కొన్ని బస్సులు 15 ఏళ్ల కాలపరిమితి దాటాయని గుర్తించామన్నారు. అటువంటి బస్సులు ఫిట్నెస్ ఉన్నా వాటికి రాయితీతో కూడిన పన్ను చెల్లింపు కుదరదని, వారు తప్పనిసరిగా సీటుకు రూ.397 చొప్పున చెల్లించి నడుపుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
స్కూల్ వ్యాన్ బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి
కొచ్చి : పాఠశాల నుంచి పిల్లలను ఇంటికి తీసుకువెళ్తున్న స్కూల్ వ్యాన్ నీటి గుంటలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటు, పాఠశాలలో కేర్ టేకర్గా పని చేస్తున్న మహిళ కూడా మృతి చెందింది. కొచ్చిలోని మార్దాలో సోమవారం సాయత్రం 4.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్కు, ఇతర విద్యార్థులకు తీవ్ర గాయలైయ్యాయి. ఘనట స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో వ్యాన్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మరణించిన విద్యార్థులను విద్య లక్ష్మి, ఆదిత్యాన్, కేర్ టేకర్ లతా ఉన్నిగా గుర్తించారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. -
చిన్నారుల తల్లిదండ్రులారా! ఈ లేఖ మీకే
సాక్షి, సిటీబ్యూరో : పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. స్కూలు ఆటోలు, బస్సులు రోడ్డెక్కుతున్నాయి. విద్యార్థులను తరలించే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా నగర ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు గురువారం కొన్ని కీలక సూచనలు జారీ చేశారు. దీనిని సోషల్మీడియా ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ సందేశమిదీ... ప్రియమైన చిన్నారుల తల్లిదండ్రులారా... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల శుభాభినందనలు. మీ చిన్నారుల భద్రత మాకు అత్యంత కీలక బాధ్యత. వారి భద్రతకు సంబందించిన విషయంలో మీరూ ఏ మాత్రం రాజీపడకండి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ఆయా వాహనాల్లో పరిమితికి మించి ఎక్కించుకోవడం నిబంధనలకు విరుద్ధం. అది మీ చిన్నారులకు ప్రాణాపాయం తెచ్చిపెట్టే ప్రమాదం కూడా ఉంది. పాఠశాలలకు మీ చిన్నారులు ప్రయాణించే వాహన డ్రైవర్ పూర్తి వివరాలు సరిచూసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్సీ, ఇన్సూరెన్స్, ఫిట్నెస్లను సరిచూసుకోండి. డ్రైవర్ ప్రవర్తనను కూడా నిశితంగా పరిశీలించండి. మోటారు వాహనాలకు సంబంధించిన నిబంధనలు పాటించని డ్రైవర్ల వాహనాల్లో మీ చిన్నారులను పంపకండి. మాకు సహకరిస్తున్నందుకు మీకు, మీ పిల్లలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల శుభాకాంక్షలు. ఇట్లు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, మీకోసం.. మీతోనే.. ఎల్లప్పుడూ... -
రెండు స్కూల్ బస్సులు సీజ్
వెల్గటూరు(ధర్మపురి) కరీంనగర్ : పాఠశాలల ప్రారంభంలోనే రవాణా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో పాఠశాల బస్సులను రవాణాశాఖాధికారి కిషన్రావు తనిఖీ చేశారు. వెల్గటూరు బ్రిలియంట్ మోడల్ స్కూల్, రాజారాంపల్లి అక్షర హైస్కూల్ బస్సులను సీజ్ చేశారు. బస్సులకు సంబంధించి ధ్రుపత్రాలు సరిగా లేనందును సీజ్ చేసినట్లు తెలిపారు. -
ఫిట్‘లెస్’ బస్సులతో ప్రమాదం
తూప్రాన్ మెదక్ : జిల్లాలో రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్న ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఆదాయానికి గండికోడుతూ ధనర్జానే ధ్యేయంగా పనిచేస్తూ, చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా తమ వద్ద అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని గొప్పలు చేబుతూ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. స్కూల్ బస్సులకు ఫిట్ నేస్ పరీక్షలు నిర్వహించడంలో రవాణా శాఖ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థలు కాలం చెల్లిన బస్సులు నడుపుతున్నా , రవాణాశాఖాధికారులు వాటిని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే ప్రమాద ఘటనే ఉదహరణ. జిల్లాలో 343 బస్సుల్లో కేవలం 109 బస్సులకు మాత్రమే ఫీట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఆదేశాలు బేఖాతరు.. పాఠశాలలకు వేసవి సేలవులు ప్రకటించిన తర్వాత ఏప్రిల్ చివరి వారం నుంచి మే నెల 15 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, ఇంతవరకూ వాటి ఊసుమరిచారు. 15 ఏళ్లు నిండిన విద్యా సంస్థల బస్సులను సీజ్ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కానీ జిల్లాలో మాత్రం ఒక్క బస్సును కూడా ఇప్పటి వరకు సీజ్ చేయకపోవడం గమనార్హం. అధికారుల ఉదాసీనత.. గతేడాది జిల్లాలో విద్యాసంస్థల బస్సులు ప్రమాదానికి గురైన సంఘటనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు కాలం చెల్లిన బస్సులపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు చెందిన కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు కొనుగోలు చేసి, ప్రస్తుతం వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ వాహనాల్లో కొన్ని కాలం చెల్లినవి ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ను చెల్లించకుండా స్కూల్ బస్సులను స్కూల్ పేరుమీదనే రవాణా శాఖకు పన్నులు కడుతున్నారు. బస్సు ఫిట్నెస్ పరీక్షలకు ఆన్లైన్లో వాహన యాజమాని పేరు, విద్యార్థుల సంఖ్య, రక్తనమూనా, డ్రైవర్ వివరాలు నమోదు చేయాలి. అలా నమోదు చేసి రవాణాశాఖ నుంచి ఫిట్నెస్ పత్రాలు తీసుకోవాల్సిన ఉంటుంది. కాని ఎవరు నిబంధనలు పాటించడంలేదన్న విషయం తెలిసింది.కొత్తగా జారీ అయిన మార్గదర్శకాలు..విద్యాసంస్థల వాహనాలపై తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా రవాణా శాఖ మోటారు వాహన చట్టం 1989 ప్రకారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలను ప్రతి విద్యాసంస్థ తప్పకుండా పాటించాల్సి ఉన్నప్పటికీ కాని ఏ సంస్థ పాటించడం లేదాని తేలుస్తోంది. నూతన నిబంధనలు æ విద్యాసంస్థకు చెందిన బస్సుపై పాఠశాల పేరు, టెలిఫోన్ నంబర్, సెల్ నెంబరుతో సహా పూర్తి చిరునామాను బస్సుకు ఎడమవైపున ముందు భాగంలో స్పష్టంగా రాయాలి. æ బస్సును ప్రిన్సిపాల్, విద్యార్థుల కమిటీ నెలకొకసారి పరీక్షలు చేయాలి. వాహనం కండీషన్, పనితీరు గురించి తెలుసుకోవాలి. æ ఏ విద్యాసంస్థ బస్సు కూడా పరిమితి సీట్ల కన్నా ఎక్కువ మందిని తీసుకెళ్లరాదు. æ ప్రతి బస్సులో అటేండర్( సహయకుడు) తప్పనిసరిగా ఉంచాలి æ విద్యా సంస్థల బస్సులకు నియామకమయ్యే డ్రైవర్కు 60 ఏళ్లు నిండి ఉండరాదు. ప్రతి డ్రైవర్ ఆరోగ్య పట్టికను బస్సులో పెట్టాలి. అతనికి ప్రతి మూడు నెలలకు ఒకసారి బీపీ, షుగర్, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను యాజమాన్యం నిర్వహించాలి. æ డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వ్యక్తినే బస్సు డ్రైవర్గా నియమించాలి. అతనికి అయిదేళ్ల బస్సు నడిపిన అనుభవం ఉండాలి. చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా 343 ప్రైవేట్ స్కూల్స్ బస్సులు ఉన్నాయి. ఇందులో 109 బస్సులకు ఫీట్నెస్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరో 234 బస్సులకు ఫీట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. నేటి(శుక్రవారం) నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశాం. అనుమతులు లేని బస్సులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. –గణేష్, జిల్లా ఆర్టీఏ అధికారి -
స్కూల్ బస్సులు @ ఆన్లైన్
సాక్షి, సిటీబ్యూరో: మీ పిల్లలు పయనించే స్కూల్ బస్సు సామర్థ్యాన్ని, ఆ బస్సు నడిపే డ్రైవర్ల అర్హత, అనుభవం వంటి వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా...స్కూల్ బస్సుల కండీషన్పై సందేహాలు ఉన్నాయా...డోంట్వరీ. ఇప్పుడు ప్రతి బడి బస్సు జాతకం మీకు ఆన్లైన్లో లభించనుంది. మీ పిల్లలు వెళ్లే స్కూల్ మాత్రమే కాదు. ఏ విద్యాసంస్థకు చెందిన వాహనాల వివరాలైనా ఆన్లైన్లో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాదు. ‘స్కూల్ బస్సు’ మొబైల్ యాప్ ద్వారా కూడా బడి బస్సుల వివరాలను పొందవచ్చు. గ్రేటర్ హైదరాబాద్లోని సుమారు 10,050 స్కూల్ బస్సుల వివరాలను ఆన్లైన్లో ఉంచేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు పిల్లల భద్రత దృష్ట్యా ప్రతి స్కూల్ యాజమాన్యం విధిగా తమ స్కూల్ బస్సులకు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని రవాణాశాఖ సూచించింది. బస్సుల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి, అలసత్వానికి తావు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ ‘సాక్షి’తో చెప్పారు. నిర్ణీత గడువులోగా ఫిట్నెస్ పరీక్షలకు హాజరుకాని వాటిని జఫ్తు చేయనున్నట్లు హెచ్చరించారు. సిబ్బంది వివరాలు ఉండాల్సిందే... ప్రతి సంవత్సరం మే రెండో వారం నుంచి జూన్ మొదటి వారం వరకు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. బస్సుల సామరŠాధ్యన్ని పరీక్షించడంతో పాటు వాటిని నడిపే డ్రైవర్లు, అటెండర్ల వివరాలను, అర్హతలను కూడా రవాణాశాఖ పరిగణనలోకి తీసుకుంటుంది.ఈ సారి ఫిట్నెస్ కోసం స్లాట్ బుక్ చేసుకొనే సమయంలో బస్సుల వివరాలతో పాటు వాటిని నడిపే ఇద్దరు డ్రైవర్లు, అటెండర్ల అర్హత, డ్రైవింగ్ లైసెన్సు, అనుభవం, ఫొటోలు కూడా అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. ప్రతి బస్సుకు ఒక ప్రధాన డ్రైవర్, మరో ప్రత్యామ్నాయ డ్రైవర్ తప్పనిసరి.ఇలా స్లాట్ బుకింగ్ సమయంలోనే వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల ఏ బస్సును ఏ డ్రైవర్లు నడుపుతున్నారో, బస్సు నడిపే సమయంలో విధినిర్వహణలో ఉన్న అటెండర్ గురించి తెలుసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఆర్టీఏ అధికారులే కాకుండా తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సుల పర్యవేక్షకులుగా వ్యవహరించేందుకు అవకాశం లభిస్తుందని జేటీసీ తెలిపారు. ఈ వివరాలన్నింటినీ ‘స్కూల్ బస్’ మొబైల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. గత రెండేళ్లుగా బస్సుల వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పటికీ దీనిని మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు, సిబ్బంది వివరాలను కూడా ఈ సారి తప్పనిసరి చేశారు. ముందస్తుగా ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని దుర్ఘటనలు ఎదురైనప్పుడు చేపట్టివలసిన చర్యలకు కూడా ఆన్లైన్ సమాచారం దొహదం చేస్తుందని రవాణాశాఖ భావిస్తోంది. బస్సుల్లోసీసీ కెమెరాలు... మరోవైపు స్కూల్ బస్సుల భద్రతను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటును కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. బస్సు లోపలివైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా డ్రైవర్ నైపుణ్యాన్ని అంచనా వేయడంతో పాటు పిల్లల పట్ల సిబ్బంది ప్రవర్తన, పిల్లలను జాగ్రత్తగా బస్సు ఎక్కించేందుకు, తిరిగి ఇళ్ల వద్ద దించేందుకు సిబ్బంది చూపే శ్రద్ధ వంటి వివరాలను తెలుసుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ నిబంధనలు తప్పనిసరి.... ♦ ప్రతి స్కూల్ బస్సు కచ్చితమైన నిబంధనలు పాటించాలి. అన్నివిధాలుగా సమర్ధవంతంగా ఉంటేనే అధికారులు ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలను అందజేస్తారు. ♦ బస్సు పసుపు రంగులో ఉండాలి.రంగు పాలిపోయినట్లుగా కాకుండా స్పష్టంగా కనిపించాలి.విద్యార్ధులు బస్సులోకి ఎక్కడం,దిగడం డ్రైవర్కు స్పష్టంగా కనిపించే విధంగా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి.బస్సులోపలి భాగంలో ఒక పెద్ద పారదర్శకమైన అద్దం ఏర్పాటు చేయాలి.దీనివల్ల లోపల ఉన్న పిల్లలు కూడా డ్రైవర్కు కనిపిస్తారు. ♦ బస్సు ఇంజన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టింగ్విషర్),పొడి అందుబాటులో ఉండాలి.అత్యవసర ద్వారాం ఉండాలి.ఫస్ట్ ఎయిడ్బాక్స్ ఏర్పాటు చేయాలి. ♦ సదరు పాఠశాల/కళాశాల పేరు,టెలిఫోన్ నెంబర్,మొబైల్ నెంబర్,పూర్తి చిరునామ బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి. ♦ వాహనానికి నాలుగువైపులా పై భాగం మూలాల్లో (రూఫ్పై కాదు) బయటివైపు యాంబర్ (గాఢ పసుపు పచ్చని) రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి.పిల్లలు దిగేటప్పుడు,ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. ♦ సదరు వాహనం స్కూల్ బస్సు అని తెలిసేవిధంగా ముందుభాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్ధులు (ఒక అమ్మాయి,ఒక అబ్బాయి) నల్లరంగులో చిత్రించి ఉండాలి. ఆ చిత్రం కింద ‘‘స్కూల్ బస్సు’’ లేదా ‘‘ కళాశాల బస్సు’’ అని నల్ల రంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి.అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి. ♦ బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్తో ఉండాలి.సైడ్ విండోలకు అడ్డంగా 3 లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి.సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ మంది ఉండొద్దు. ♦ ఫుట్బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి.అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి. ♦ బస్సులో ప్రయాణించే విద్యార్ధుల పేర్లు,తరగతులు,ఇళ్ల చిరునామాలు,ఎక్కవలసిన, దిగవలసిన వివరాలు బస్సులో ఉండాలి. డ్రైవర్ల అర్హతలు ... ♦ డ్రైవర్ వయస్సు 60ఏళ్లకు మించకుండా ఉండాలి.పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్యపట్టికను విధిగా నిర్వహించాలి. ♦ యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తపోటు,షుగరు,కంటి చూపు వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ♦ డ్రైవర్కు బస్సు డ్రైవింగ్లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ♦ డ్రైవర్,అటెండర్కు యూనిఫాం తప్పనిసరి. ♦ ఈ అంశాలపై పేరెంట్స్ కమిటీ అప్రమత్తంగా ఉండాలి. వీటిపై ప్రిన్సిపాల్తో చర్చించాలి. ♦ ఫస్ట్యిడ్ బాక్సులో మందులు, ఇతర పరికరాలు కూడా తనిఖీ చేయాలి. -
బడి బస్సు భద్రమేనా?
మహబూబ్నగర్ క్రైం : పిల్లలు బడికి వెళ్లడం ఎంత ముఖ్యమో.. తిరిగి ఇంటికి రావడం అంతే ముఖ్యం. ఇందుకు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల బంగారు భవిష్యత్ దృష్ట్యా రూ.లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు చదివిస్తుండగా.. బాధ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు రవాణా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కాలం చెల్లిన, సామర్థ్యం లేని బస్సులు, వాహనాల్లో పిల్లలను పాఠశాలలకు చేరవేస్తున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక పిల్లలు ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు ఆందోళనగా గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏటా మాదిరిగానే ఈసారి కూడా వాహనాల ఫిట్నెస్ పరీక్షలు చేయాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దరఖాస్తు గడువు మంగళవారం ముగియనుండగా, బుధవారం నుంచి తనిఖీలు జరగనున్నాయి. తక్కువ సమయం గతంలో జూన్ 12న పాఠశాలల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేది. దీంతో దీంతో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడానికి నెల రోజుల సమయం ఉండేది. కానీ ఈసారి జూన్ 1నే పాఠశాలల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 16వ తేదీ నుంచి బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభిస్తే పదిహేను రోజుల సమయం కూడా ఉండదు. అయితే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బస్సులు 932 ఉన్న నేపథ్యంలో రోజుకు 58 వరకు బస్సుల ఫిట్నెస్ను పరీక్షించాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇది సాధ్యం కాదని.. తద్వారా ‘మామూలు’గానే తనిఖీలు నిర్వహిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 932 బస్సులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి 1,025 బస్సులు ఉన్నాయి. ఇందులో 93 బస్సులు పదిహేనేళ్ల కాలపరిమితి దాటేశాయి. దీంతో ఈ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ పరీక్ష కోసం దరఖాస్తు వచ్చినా చేయొద్దని అధికారులు నిర్ణయించారు. ఇక మిగిలిన అన్ని బస్సులకు సంబంధించి యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్ష చేయించాలి. ఇందుకోసం తొలుత రిప్రజెంటేటివ్ బై, డిజిగ్నేషన్, సెల్ నంబర్, విద్యాసంస్థ ఈ మెయిల్ ఐడీ, వెబ్సైట్ అడ్రస్ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అందే యూజర్నేమ్, పాస్వర్డ్ నమోదు చేస్తే రవాణా శాఖ కార్యాలయం నుంచి ఏ రోజు ఫిట్నెస్ పరీక్షకు హాజరుకావాలో సమాచారం అందుతుంది. ఇంకా బస్సు వివరాలు, అటెండెంట్, డ్రైవర్ వివరాలు, వారి ఫొటోలతో పాటు ఏ రూట్లో బస్సు తిరుగుతుంది, ఎందరు విద్యార్థులను చేరవేస్తారనే వివరాలను కూడా పొందుపర్చాలి. ఇక ఆర్టీఏ అధికారులు వాహనం ఫిట్నెస్ను పరీక్షించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా బస్సుల్లో కిటికీలు, సీట్లు, మెడికల్ కిట్లు ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా, లేదా అనేది పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇక జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు తనిఖీలు చేపట్టి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను సీజ్ చేస్తారు. నిబంధనల మేరకు రాష్రంలో ఏదో ఓ చోట ప్రైవేట్ పాఠశాలల బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ చేయించకుండానే బస్సుల రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా యజామాన్యాల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు. ఈ మేరకు చిన్నారుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉమ్మడి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల డీటీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంవీఐలకు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చి కాలం గడుపుతున్నారు. మహబూబ్నగర్ డీటీఓగా ఉన్న మమతా ప్రసాద్కు జేటీసీగా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో ఆమె హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. ఉమ్మడి జిల్లాలో ఆర్టీఏలో వివిధ రకాల పోస్టులు 53ఉండగా వాటిలో 32మంది పని చేస్తుంటే మరో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 32మంది ఉద్యోగుల్లో నలుగురు డిప్యూటేషన్పై ఇతర జిల్లాలకు వెళ్లారు. అంటే మొత్తంగా నాలుగు జిల్లాలకు 28 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా ఎంవీఐ, ఏఓ, ఏఎంవీఐ, సీనియర్ అసిస్టెంట్లు, కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం శాఖలో పని చేస్తున్న 28 మంది ఉద్యోగుల్లో మహబూబ్నగర్లో 13మంది, నాగర్కర్నూల్లో ఆరుగురు, వనపర్తిలో ముగ్గురితో పాటు జోగుళాంబ గద్వాలలో ఆరుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా ప్రస్తుతం మహబూబ్నగర్లో పరిపాలనాధికారి పోస్టు ఖాళీగా ఉంది. మహబూబ్నగర్లో ఒకరు ఎంవీఐ, నలుగురు ఏఎంవీఐలు, వనపర్తిలో ఒక రు ఎంవీఐ, గద్వాల ఒకరు ఎంవీఐ, నాగర్కర్నూల్ లో ఒక ఎంవీఐ, ఒక ఏఎంవీఐలు పని చేస్తు న్నారు. ఉమ్మడి జిల్లాలోనే పని చేయడానికి అశించిన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఇప్పటికే ఇబ్బందులు దురవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సుల తనిఖీలు చేయడం సమస్యగా మారుతుందోనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనలు విస్మరిస్తే కఠిన చర్యలు ఇద్దరు ఎంవీఐలతో పాటు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి స్కూల్ బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేస్తాం. జూన్ 1 నుంచి బస్సుల తనిఖీలు చేపట్టి ఫిట్నెస్ లేకుండా రోడ్లపైకి వచ్చినట్లు తేలితే సీజ్ చేస్తాం. అనుమతులు లేకుండా పాఠశాల బస్సులు నడిపినా, నిబంధనలు విస్మరించినా కఠిన చర్యలు తప్పవు. పాఠశాల బస్సులకు సంబంధించి నిబంధనల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. విద్యార్థుల సంరక్షణకు ప్రభుత్వ సూచనలన్నీంటినీ పాఠశాలల యాజమాన్యాలు ఖచ్చితంగా పాటించాలి. – మమతాప్రసాద్, డీటీసీ, మహబూబ్నగర్ -
చిన్నారుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయక...
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో అల్లరి మూకలు మానవత్వాన్ని మరిచి ఎంతగా రెచ్చిపోతున్నాయో బుధవారం చిన్నారుల స్కూలు వ్యాన్ మీద జరిపిన రాళ్లదాడి చూస్తేనే అర్థం అవుతుంది. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే అల్లరిమూకలు దాడి చేసిన సమయంలో ఎటువంటి ప్రాణహాని జరగకూడదనే ఉద్దేశంతో బస్సు డ్రైవరు తన ప్రాణాలొడ్డి తీవ్రంగా శ్రమించాడు. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి బస్సు డ్రైవరు. ఈ సంఘటన గురించి అతడు చెబుతూ.. ‘అల్లరిమూక బస్సుపై రాళ్ల దాడి ప్రారంభించగానే నేను బస్సు వేగాన్ని పెంచాను. ఒక్క చిన్నారికి కూడా హాని కలగకూడదని నా శాయశక్తుల శ్రమించాను. కానీ ఒక దురదృష్టవశాత్తు ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి’ అని తెలిపాడు. బుధవారం షోపియాన్ జిల్లా, కానిపొర గ్రామంలో రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ బస్సుపై అల్లరి మూకలు దాడి చేసిన సంగతి విధితమే. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయలయ్యాయి. గాయపడిన ఇద్దరిలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, మరో విద్యార్థికి పెద్దగా ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటన గురించి ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ స్పందించారు. ‘పసిపిల్లలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని’ హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పిరికిపంద చర్యగా వర్ణించారు. -
జమ్మూకశ్మీర్ లో స్కూల్ బస్సుపై రాళ్ల దాడి..
శ్రీనగర్: జమ్మూ-కశ్మీరులో అల్లరి మూకలు రోజురోజూకి రెచ్చిపోతున్నారు. ఏదో ఒక నెపంతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మానవత్వం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని స్కూలు చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సుపై బుధవారం ఉదయం అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. షోపియాన్ జిల్లా, కానిపొర గ్రామంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయలయ్యాయి. కాగా ఒక్కసారిగా రాళ్లదాడి జరగడంతో విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో పరుగులు పెట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరిలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, మరో విద్యార్థికి పెద్దగా ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ..రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ బస్సుపై దాడి జరిగిన సమయంలో 50 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. వీరంతా దాదాపు నాలుగేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసువారేనని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిపై జరిగిన దాడి మానవత్వానికే వ్యతిరేకమని అన్నారు. ఎవరి బిడ్డకైనా ఇలా జరగవచ్చునన్నారు. మరోవైపు ఈ ఘటనను ముఖ్యమంత్రి మహబూబ ముఫ్తీ, ప్రతిపక్షనేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండిస్తూ, పిరికిపంద చర్యగా వర్ణించారు. పసిపిల్లలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి మహబూబ ముఫ్తీ హామీ ఇచ్చారు. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి -
బాధ్యత ఎవరిది ?
ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో కాపలా లేని రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన ఘోర ప్రమాదం పసిపిల్లల ప్రాణాలు బలిగొనడంతో ఈ పాపం ఎవ్వరిదన్న చర్చ మరోసారి జరుగుతోంది. 2018 మార్చి 31 నాటికి దేశంలో 3,479 కాపలా లేని రైల్వే క్రాసింగ్లు ఉన్నాయి. ఈ క్రాసింగ్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉంటే యూపీ రెండో స్థానంలోఉంది. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 1357 కాపలా లేని క్రాసింగ్లు ఉన్నాయి. దేశంలో ఇలాంటి క్రాసింగ్లను 2020 సంవత్సరంలోగా పూర్తిగా తొలగించాలని రైల్వే శాఖ డెడ్లైన్ విధించుకుంది. వచ్చే రెండేళ్లలో వీటి దగ్గర గేట్లు ఏర్పాటు చేసి కాపలాదారుల్ని నియమించడం, లేదంటే రోడ్ ఓవర్ బ్రిడ్జి , రోడ్ అండర్ వంతెనలు నిర్మించడానికి రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ లోగా రైల్వే క్రాసింగ్ల దగ్గర ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల నివారణకు గేట్ మిత్ర 2014–15 సంవత్సరంలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ల దగ్గర ఏకంగా 50 ప్రమాదాలు జరిగి 130 మంది నిండు ప్రాణాలు బలయ్యాయి. అప్పట్నుంచి రైల్వే శాఖ ఈ క్రాసింగ్ల దగ్గర ప్రమాదాలను నివారించడానికి గేట్ మిత్ర అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వాలంటీర్లను నియమించింది. రైలు వచ్చినప్పుడల్లా ట్రాక్లను దాటే వాహనదారుల్ని, పాదచారుల్ని అప్రమత్తం చేయడమే వీరి పని. అయితే ఈ వాలంటీర్లకు తగిన సదుపాయాలు కల్పించడంలో రైల్వే శాఖ విఫలమవడంతో వారి పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. అయితే కాపలా లేని క్రాసింగ్లు తొలగించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంది. కాపలా లేని క్రాసింగ్ల దగ్గర వచ్చి పోయే వాహనాల సంఖ్య ఆధారంగా వాటిని అయిదు రకాలుగా విభజించింది. ప్రతీ గంటలో ఆ ట్రాక్ మీదుగా ఎన్ని రైళ్లు వెళతాయి, అదే సమయంలో ఎన్ని వాహనాలు వెళతాయి అన్న లెక్కలతో ట్రైన్ వెహికల్స్ యూనిట్స్ని (టీయూవీ) అంచనా వేసింది. టీయూవీలు 10 వేలు దాటితే కేటగిరీ ఒకటి కిందకి వస్తాయి. అంటే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాటిని ముందుగా తొలగించే కార్యక్రమాలు చేపట్టింది. అలా గత ఏడాది రైల్వే శాఖ 1464 కాపలా లేని రైల్వే క్రాసింగ్లను తొలగించింది. ఈ చర్యల వల్ల 2016–17 ప్రమాదాల సంఖ్య బాగా తగ్గింది. ఆ ఏడాది జరిగిన ప్రమాదాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన కుషీనగర్ టీయూవీ లెక్కల్లో చూస్తే 2 వేల కంటే తక్కువే.. అంటే కేటగిరీ అయిదు కిందకే వస్తుంది. అయినా ప్రమాదం జరిగిందంటే డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రైల్వే శాఖ ఆరోపిస్తోంది. చట్టం ఏం చెబుతోంది ? వాస్తవానికి కాపలా లేని చోట రైల్వే పట్టాలు దాటినప్పుడు వాహనదారులు, పాదచారులే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని, రైలు వస్తోందా లేదా అని ఒకటికి రెండు సార్లు గమనించుకొని అప్పుడే దాటాలని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని అంటున్నారు. రైల్వే క్రాసింగ్ల దగ్గర వాహనదారుల్ని జవాబుదారీలుగా చేస్తూనే మన చట్టాలు కూడా రూపొందాయి. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 131 ప్రకారం, భారత రైల్వే చట్టం సెక్షన్ 161 ప్రకారం కాపలా లేని క్రాసింగ్లను దాటేటప్పుడు జరిగే కష్టనష్టాల బాధ్యత వాహనదారులే భరించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ ప్రయత్నాలు ఎలా ఉన్నా రైల్వే క్రాసింగ్ల దగ్గర వాహనదారులే జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉత్తర ప్రదేశ్లో ఘోర ప్రమాదం
లక్నో : ఉత్తర ప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వేకువ ఝామున స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఓ వ్యాన్ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులతోపాటు డ్రైవర్ కూడా దుర్మరణం పాలయ్యారు. కుశినగర్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డివైన్ పబ్లిక్ స్కూల్కు చెందిన వ్యాన్ పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద దాటుతుండగా.. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఈ నెలలో ఇది రెండో ఘటన. ఏప్రిల్ 10వ తేదీన హిమాచల్ ప్రదేశ్ కంగారాలో ఓ స్కూల్ బస్సు లోయలో పడి 27 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
హిమాచల్లో ఘోరం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూలు బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లడంతో 27 మంది విద్యార్థులు సహా 30 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది ప్రాథమిక తరగతుల విద్యార్థులే (పదేళ్ల లోపువారే) ఉన్నారు. కంగ్రా జిల్లా గురుచల్లోని రాంసింగ్ పఠానియా మెమోరియల్ స్కూల్కు చెందిన బస్సు 45 మంది విద్యార్థులు, టీచర్లు, సహాయక సిబ్బందితో సమీప గ్రామాల్లో విద్యార్థులను దించేందుకు బయలుదేరింది. గురుచల్ పట్టణం దాటగానే బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న 100 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. దీన్ని గమనించిన పక్కనున్న గ్రామస్తులు హుటాహుటిన సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. కాసేపటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. గాయపడిన విద్యార్థులను వెంటనే పఠాన్కోట్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 26 మంది విద్యార్థులు, డ్రైవర్ మదన్ లాల్ (67), ఇద్దరు మహిళా టీచర్లు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి కన్నుమూశాడని హిమాచల్ రవాణా మంత్రి గోవింద్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది. బస్సు శకలాలు, లోయలో రాళ్లు రప్పల మధ్య చిన్నారుల శవాలతో ఘటనాస్థలం దయనీయంగా మారింది. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రి వద్ద వాతావరణం ఉద్విగ్నంగా మారింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ పఠానియా, రాష్ట్ర మంత్రులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.బస్సు ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రమాదం దురదృష్టకరం. చిన్నారుల మృతి నన్ను కలచివేసింది. చిన్నారుల తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని మోదీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్.. మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
లోయలో పడ్డ స్కూల్ బస్సు.. ఘోర ప్రమాదం
ధర్మశాల : హిమాచల్ ప్రదేశ్లో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. కంగ్రా జిల్లా నూర్పూర్ ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 27 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఘటనలో మరికొందరు విద్యార్థులకు గాయాలు కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మృతులంతా 10ఏళ్ల లోపు చిన్నారులే. వజీర్ రామ్ సింగ్ పథానియా స్కూల్కు చెందిన బస్సు విద్యార్థులను ఇంటి వద్ద దింపేందుకు వెళ్తోంది. హఠాత్తుగా అదుపుతప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. లోయ 100 మీటర్ల లోతు ఉండటంతో సహయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగగా.. వారికి స్థానికులు కూడా సాయం చేస్తున్నారు. కాగా, ఘటన సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఇప్పటిదాకా 27 మృతదేహాలను వెలికి తీసినట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ భరద్వాజ్ ప్రకటించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెబుతున్నారు. -
స్కూల్ బస్సు బోల్తా : విద్యార్థులకు గాయాలు
మహబూబ్నగర్ క్రైం: డ్రైవర్ అతివేగం.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అభంశుభం తెలియని పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాకేంద్రం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. రూరల్ ఏఎస్ఐ బాలబ్రహ్మం కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని ఆకృతి పాఠశాలకు చెందిన బస్సు గురువారం మహబూబ్నగర్ నుంచి 30 మంది విద్యార్థులను ఎక్కించుకుని కొయిలకోండ మండలం అవంగపట్నం గ్రామానికి వెళ్తుంది. ఈ క్రమంలో మార్గమధ్యలో భవాని సాగర్ సమీపంలో ము ందు వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టెక్ చేయబోయి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న 30 మంది విద్యార్థు ల్లో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వా రిని స్కూల్ యాజమాన్యం వారి వారి ఇళ్లకు పంపించారు. ఉపాధ్యాయుడికి గాయాలు మల్దకల్ (గద్వాల): విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మేకలసోంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుగా పనిచేస్తున్న ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గురువారం పాఠశాల నుంచి విధులు ముగించుకుని గద్వాలకు వెళ్తుండగా మార్గమధ్యలో ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేయి విరిగింది. వెంటనే తోటి ఉపాధ్యాయులు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ సమీపంలోని ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కారు బోల్తా : మహిళకు తీవ్రగాయాలు పెబ్బేరు (కొత్తకోట): కారు బోల్తా పడటంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన పెబ్బేరులోని బాలాజీ దాబా వద్ద జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. డాక్టర్ గిరిజ అనే మహిళ హైదరాబాద్ నుంచి కారులో కర్నూలు వెళ్తుండగా పెబ్బేరు సమీపంలో బాలాజీ దాబా దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆమె కుడిచేయి విరగగా స్థానిక పీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
స్కూల్ బస్సు, ట్యాంకర్ ఢీ
భూత్పూర్ (దేవరకద్ర): బడి ముగించుకుని ఆడుతూ పాడుతూ సాయంత్రం ఇంటికి వెళ్తున్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.. ఏం జరి గిందో తెలియదు.. పెద్ద శబ్ధం.. అద్దాలు పగిలిపోయి గాజుపెంకులు కళ్లకు తగులుకుంటూ వెళ్లాయి. భయాందోళనలతో ఒకటే అరుపులు కేకలు.. కానీ ఎవరికీ ఏం కాలేదు.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.. ఇంతకు ఏం జరిగిందంటే భూత్పూర్ మండలం అమి స్తాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. రెండు వాహనాల వేగం బాగానే ఉండటంతో స్కూల్ బస్సు డ్రైవర్ సుల్తాన్కు తీవ్రగాయాలయ్యాయి. పిల్లలంతా వెనకసీటుల్లో కూర్చోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి కారణాలు.. మిషన్ భగీరథ పైప్లైన్ పనుల్లో భాగంగా రోడ్డును సగం తొలగించి పైప్లైన్ పనులు చేపట్టారు. పనులు ఇంకా పూర్తికాక నిర్వాహకులు రోడ్డును డైవర్షన్ చేశారు. దీంతో వాహనాలు ఒకే దారిలో వెళ్లాల్సి వస్తోంది. అయితే మంగళవారం సాయంత్రం మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ వైపుకు వస్తున్న హిరా మోడల్ స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ సుల్తాన్ సీటు లో ఇరుక్కుపోయాడు. దారిగుండా వెళ్తు న్న వాహనదారులు, గ్రామస్తులు వెంట నే డ్రైవర్ను బయటకు లాగి అంబు లెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పంకజ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్కు రక్తగాయాలు కావడంతో అంకుల్.. అంటూ కేకలు పెట్టారు. గమనించిన అమిస్తాపూర్ వాసులు విద్యార్థులను బస్సులోంచి దించి సముదాయించారు. ప్రమాదం వార్త తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు సైతం వెంటనే అక్కడికి వచ్చి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. ఎవరికీ ఎలాంటా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆందోళనకు గురైన విద్యార్థులు నోటీసులు జారీ చేశాం పనులు త్వరితగతిన పూర్తికాకపోవడంతో గతంలో పలుమార్లు ‘సాక్షి’లో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తుచేస్తూ అధికారులు, కాంట్రాక్టర్ పనితీరును తప్పుపట్టారు. ఇదిలాఉండగా ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాస్ స్పందించారు. గతంలో రోడ్డు డ్రైవర్షన్ను త్వరగా తొలగించాలని ఆర్అండ్బీ, మిషన్ భగీరథ అధికారులకు చెప్పామని, వారు పట్టించుకోకపోవడంతో పలుమార్లు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఇకనైనా పనులు వేగంగా చేసి డైవర్షన్ తొలగించాలని కోరారు. -
బస్సులకు జీపీఎస్..!
రాయవరం (మండపేట): ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల బస్సులకు స్పీడ్ గవర్నర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్న రవాణా శాఖ, ఇప్పుడు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల, కళాశాల బస్సులకు జీపీఎస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే రవాణాశాఖకు ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. జీపీఎస్ అమలు చేయడంపై మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు(ఎంవీఐ), పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో చర్చించి ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ విధానం అమలుపై బస్సుల యాజమాన్యాలతో అవగాహన, చైతన్య సదస్సులు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ఇటు యాజమాన్యానికి, ఇటు తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. యాజమాన్యాలకు అవగాహన జీపీఎస్ వ్యవస్థను అమలు చేసుకోవడం వల్ల కలిగే లాభాలు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై రవాణా శాఖ అధికారులు త్వరలో సంబంధిత యాజమాన్యాలతో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అలాగే తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి చైతన్యం చేస్తారు. నాణ్యత ప్రమాణాల ఆధారంగా ధర రూ.4వేల నుంచి రూ.6వేల వరకు ఉంటుంది. జీపీఎస్ పరికరం బస్సులకు అమర్చడంలో సంబంధిత యాజమాన్యాలు అయిష్టత ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే జీపీఎస్ అమర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను సవిరంగా తెలియజేసి వారు అమర్చుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించనున్నారు. జీపీఎస్ వల్ల బస్సు డ్రైవర్ల పనితీరు క్షుణ్ణంగా తెలిసే వీలుంటుంది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాల బస్సులు సుమారు 3500 ఉన్నాయి. అనుకోని సంఘటన జరిగితే ఎక్కడ, ఎలా ప్రమాదం జరిగిందో జీపీఎస్ వల్ల తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాఠశాల/కళాశాల బస్సులు ఎలా వెళ్తున్నాయి అనే విషయాన్ని సెల్ఫోన్లోనే యాప్ను క్లిక్ చేసి చూసే వీలుంటుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఏ ప్రాంతంలో జరిగిందో స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. ప్రత్యేక యాప్.. పాఠశాల, కళాశాల బస్సులకు జీపీఎస్ వ్యవస్థను అమర్చిన తర్వాత సంబంధిత వివరాలు తల్లిదండ్రులు, బస్సు యాజమాన్యాలు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక యాప్ తయారు చేస్తున్నట్లు సమాచారం. యాప్ను జీపీఎస్కు అనుసంధానం చేసిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల సెల్ఫోన్లో ఈ ప్రత్యేక యాప్ను డౌన్లోడ్ చేయించి దాన్ని ఎక్కడి నుంచైనా పరిశీలించేలా చర్యలు చేపట్టనున్నారు. బస్సు బయలు దేరిన దగ్గర నుంచి పాఠశాల/కళాశాలకు చేరేంత వరకు ఎన్ని సార్లు ఆగింది, ఏ ఏ కూడళ్లలో అగింది, తదితర వివరాలు యాప్లో స్పష్టంగా తెలుస్తాయి. ఈ విధానం అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మరింత భద్రత కల్పించినట్లవుతుంది. విద్యార్థుల భద్రత కోసమే.. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకునే పాఠశాల/కళాశాల బస్సులకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచించింది. జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు మంచి ఆలోచన. ఇది యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుంది. జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం రూపొందించే నియమ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – జి.సంజీవ్కుమార్, ఎంవీఐ, మండపేట -
'ఆ క్షణంలో బస్సు ఆపినట్లయితే ఏం జరిగేదో..'
సాక్షి, న్యూఢిల్లీ : 'పద్మావత్' సినిమా వివాదం వారి జీవితాల్లో మర్చిపోలేని సంఘటనగా మిగిలింది. 30మంది చిన్నారులకు, ఓ టీచర్కు, బస్సు డ్రైవర్కు, కండక్టర్కు పెద్ద భయానక అనుభవంగా గుర్తుండిపోనుంది. ఆ సమయంలో డ్రైవర్ బస్సు ఆపి ఉన్నట్లయితే, బహుశా! చెప్పవీలుకానీ దుర్ఘటన చోటుచేసుకుని చరిత్రలో ఓ చెరిగిపోని మరకగా మిగిలి ఉండేదేమో. పద్మావత్ చిత్రం విడుదలను ఆపేయాలంటూ గుర్గావ్లో ఆందోళన చేస్తున్న కర్ణిసేనకు చెందినవారు కొంతమంది ఓ పాఠశాల బస్సుపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఎలాజరిగిందనే విషయాన్ని కండక్టర్ను అడిగి తెలుసుకోగా ఒళ్లు గగుర్పొడిచే అనుభవాన్ని చెప్పాడు. 'సరిగ్గా మేం స్కూల్ నుంచి బయలుదేరి 7కిలో మీటర్ల వరకు వచ్చాం. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఓ బస్సు తగలబడిపోతుండటాన్ని మేం చూశాం. పోలీసులు ఆందోళన కారులను చెదరగొడుతున్నారు.. వారు మాత్రం తిరిగి దాడి చేస్తున్నారు. చెట్ల పొదల్లో నుంచి అనూహ్యంగా మా బస్సు వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో స్కూల్లో 30మంది నర్సరీ చదువుతున్న చిన్నారులు ఉన్నారు. దాదాపు 60మంది ఆందోళన కారులు రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దాంతో చిన్నారులు ఏడ్వడం మొదలుపెట్టారు. అందులోని టీచర్ వారిని ఓదార్చడం మొదలుపెట్టింది. అన్ని వైపుల నుంచి రాళ్లు రావడం మొదలయ్యాయి. దాంతో చిన్నారులను సీట్ల కింద దాచి ఉంచే ప్రయత్నం చేశాం. ఒక పెద్ద బండరాయి వచ్చి ముందు అద్దాన్ని బద్ధలు కొట్టింది. దాంతో ఇక ఎంత నష్టం జరిగినా పర్వాలేదని డ్రైవర్, నేను నిర్ణయించుకున్నాం. బస్సును ముందుకు పోనిచ్చాం. పిల్లల ప్రాణాలు ముఖ్యం అని భావించి బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లాం. అప్పటికీ కొంతమంది వెదురు బొంగులతో వెంబడించారు. వెళ్లే క్రమంలోనే గాయపడిన చిన్నారులకు ప్రథమ చికిత్స చేశాం. ఆ సమయంలో బస్సును ఆపినట్లయితే ఏం జరిగి ఉండేదో కూడా ఊహించలేకపోయేవాళ్లం' అని వెల్లడించాడు. ఈ సంఘటన మొత్తం దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో కలకలం: బస్సుపై కాల్పులు, విద్యార్థి కిడ్నాప్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. నిన్న గుర్గావ్లో స్కూలు బస్సుపై దాడి ఉదంతం రేపిన ఆందోళన ఇంకా చల్లారకముందే ఢిల్లీలో మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. తూర్పుఢిల్లీలో ఒక స్కూలు బస్సుపై అగంతకులు దాడిచేశారు. డ్రైవర్పై కాల్పులు జరిపి ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని నగరంలో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతను రాజేసింది. బైక్పై వచ్చిన ఇద్దరు అంగతకులు బస్సును అటకాయించి, డ్రైవర్ పై కాల్పులు జరిపారు. అనంతరం ఒక నర్సరీ విద్యార్థిని బలవంతంగా ఎత్తుకొని పారిపోయారు. బాధిత బాలుడిని వివేకానంద పాఠశాలలో చదువుతున్న నర్సరీ విద్యార్థిగా గుర్తించారు. ఈ షాకింగ్ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు బుధవారం సాయంత్రం గుర్గావ్లో స్కూలు బస్సుపై దాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు చాలా స్కూళ్లను మూసివేశారు. -
‘పద్మావత్’ నిరసనలు హింసాత్మకం
జైపూర్/ముంబై/అహ్మదాబాద్: ‘పద్మావత్’ చిత్రం విడుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హరియాణాలోని గుర్గావ్లో ఆందోళనకారులు ఓ స్కూలు బస్సుపై రాళ్లురువ్విన ఘటనలో అందులో ఉన్న విద్యార్థులు, టీచర్లు, డ్రైవర్కు గాయాలయ్యాయి. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలోని ఈ చిత్రం గురువారం దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో కర్ణిసేన, పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. మాల్స్, సినిమా హాళ్లలో విధ్వంసం సృష్టించారు. చాలాచోట్ల హైవేలను దిగ్బంధించారు. గుర్గావ్, రాజస్తాన్ సహా ముంబై, నాసిక్, లక్నో, ఇండోర్ తదితర ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కాగా, ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాల్లేవని చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది. రాజ్పుత్ గౌరవాన్ని పెంచే దృశ్యాలే ఉంటాయని పునరుద్ఘాటించింది. కాగా, ఆందోళనల నేపథ్యంలో గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోవటం లేదని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆస్తుల విధ్వంసం పద్మావత్ చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ.. రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీల్లో ఆందోళనలు మిన్నంటాయి. జైపూర్లో నిరసనకారులు రెండు బస్సులను ధ్వంసం చేశారు. రోడ్రోకోలతో రోడ్లపై నిరసన చేపట్టారు. ముంబై, నాసిక్లలోనూ నిరసనలు జరిగాయి. చిత్రం ప్రదర్శించేందుకు సిద్ధమైన మూడు మల్టీప్లెక్స్ల ముందు నిలిపి ఉంచిన 30 బైకులు, స్కూటర్లకు నిరసనకారులు నిప్పంటించారు. ఆందోళన నేపథ్యంలో శ్రీ రాజ్పుత్ కర్ణి సేన తీవ్రంగా మండిపడింది. మహారాష్ట్రలో చిత్ర ప్రదర్శనను అడ్డుకునేందుకు శివసేన మద్దతు తెలిపిందని కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కాల్వీ వెల్లడించారు. చిత్రంలో రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖల్జీ మధ్య శృంగార భరిత దృశ్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. చిన్నారులని చూడకుండా..! గుర్గావ్.. మధ్యాహ్నం 3 గంటలవుతోంది. స్కూలు ముగించుకున్న విద్యార్థులను తీసుకుని జీడీ గోయెంకా స్కూలు బస్సు బయలుదేరింది. రోడ్డుపై ‘పద్మా వత్’ నిరసనకారులు రాస్తారోకో చేయటంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. దాని ముందు న్న గోయెంకా స్కూలు బస్సుపై రాళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకున్న విద్యార్థులు, కొందరు టీచర్లు కూడా బస్సులో ఉన్నారు. రాళ్లదాడితో విద్యార్థులు భయంతో వణికిపోయారు. తప్పించుకునేందుకు అవకాశం లేకపోవటంతో ఏడు స్తూ సీట్లకింద నక్కారు. రోడ్డు పక్కనున్న వారు తీసిన వీడియోలో ఈ హృదయవిదారక దృశ్యాలు ఆవేదన కలిగించాయి. -
స్కూల్ బస్సులోంచి కింద పడి చిన్నారి మృతి
హైదరాబాద్: స్కూల్కని వెళ్లిన ఓ చిన్నారిని మృత్యువు కానరాని లోకాలకు తీసుకెళ్లింది. స్కూల్ బస్సు రూపంలో వచ్చి చిదిమేసింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలించింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ద్వారంలోంచి కింద పడి విద్యార్థిని మృతి చెందింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని వెంకటేశ్వర కాలనీ నుంచి సాహెబ్నగర్ మీదుగా బయలుదేరింది. మార్గమధ్యంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో ద్వారం పక్కనే ఉన్న అంజలి(6) అనే ఒకటో తరగతి విద్యార్థిని రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అంజలి తల్లిదండ్రులు పావని, నాగయ్య సాహెబ్నగర్లోని గాయత్రినగర్లో కూలీనాలీ చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా అంజలి చిన్న కుమార్తె. ఉదయం బస్సు ఎక్కించి టాటా చెప్పిన తమకు అదే చివరిచూపు అవుతుందని అనుకోలేదని కూతురు మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సులో క్లీనర్ ఉండి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదికాదని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందారని బీజేపీతోపాటు పలు ప్రజాసంఘాలు ఆందోళన చేశాయి. -
స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి
-
వనస్థలిపురంలో దారుణ ఘటన
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో సాహెబ్నగర్లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. బస్సులోంచి కిందపడ్డ రబ్బరును అందుకునేందుకు ప్రయత్నించిన ఒకటో తరగతి విద్యార్థిని తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. ఆరేళ్ల అంజలి వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్లో చదువుతోంది. ఈ రోజు ఉదయం పాఠశాలకు చెందిన బస్సు సాహెబ్నగర్ నుంచి విద్యార్థులను తీసుకుని వనస్థలిపురం వస్తోంది. ఈ నేపథ్యంలో బస్సులో కూర్చున్న అంజలి రబ్బరు కింద పడింది. రబ్బరును అందుకునే ప్రయత్నంలో బస్సు నుంచి జారి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అంజలి మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కాగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పాటుగా, బస్సు డోర్ వద్ద క్లీనర్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
విజ్ఞాన యాత్రలో అపశృతి
సాక్షి, సిరిసిల్ల: విజ్ఞాన యాత్రకు వెళ్తున్న పాఠశాల బస్సు, హైవేపై యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలవ్వగా, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్రలో భాగంగా హైదరాబాద్కు బయలుదేరారు. తుర్కపల్లిలోని చౌరస్తా వద్ద వెనకవైపు నుంచి వస్తున్న వ్యానును గమనించకుండానే లారీ డ్రైవర్ యూటర్న్ తీసుకున్నాడు. దీంతో విద్యార్థులున్న వ్యాను, లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పాడైంది. ముందు భాగంలోని అద్దం పగిలి, గ్లాస్ పెంకులు విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది విద్యార్థులకు, డ్రైవర్కు గాయాలయ్యాయి. వీరిని మేడ్చల్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. -
తప్పిన పెనుప్రమాదం
రాజాపూర్(జడ్చర్ల): అతివేగం ఓ ప్రమాదానికి కారణమైంది. అదృష్టవశాత్తు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డ ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్లలోని లోటస్ స్కూల్కు చెందిన స్కూల్ బస్సులో బుధవారం బ్లాక్డే కావడంతో ముందుగానే వదిలారు. దీంతో 20 మంది విద్యార్థులతో బయలుదేరిన స్కూల్ బస్సు కొందరిని రాజాపూర్లో దించాక, ముదిరెడ్డిపల్లి, ఈర్లపల్లి, కోడ్గల్ గ్రామాలకు బయలుదేరింది. ఈ క్రమంలో రాజాపూర్ శివారులోని కోల్డ్స్టోరేజ్ వద్ద జాతీయ రహదారిపై స్కూల్ బస్సును హైదరాబాద్ నుండి రాయచూర్ వైపు వెళ్తున్న కర్నాటక ఆర్టీసీ బస్సు వెనక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు రోడ్డు పక్కన గుంతలో పడగా.. 8 మంది విద్యార్థులు, ఆరుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. స్కూల్ బస్సు పక్కనే ఉన్న గుంతలో పడగా.. బోల్తా కొట్టకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో విద్యార్థులు శివకుమార్, లక్కి, గణేష్ గాయపడగా.. మరొకరికి కాలు విరిగింది. పక్కనే ట్రాన్స్ఫార్మర్... ఆర్టీసీ బస్సు ఢీకొనగానే స్కూల్ బస్సు ఏసీ గోదాం కాంపౌండ్ వద్దకు వెళ్లి ఆగిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి అక్కడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తాకితే పెద్ద ప్రమాదం చోటుచేసుకునేది. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ పిల్లల క్షేమసమాచారాలపై ఆరా తీశారు. కాగా, సకాలంలో అంబులెన్స్లు ఆలస్యంగా రాగా.. కొందరిని మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ ఆస్పత్రికి, ఇంకొందరిని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరామర్శించి మంత్రి లక్ష్మారెడ్డి.. బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్న ఆయన.. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు. మంత్రి వెంటజెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి ఉన్నారు. తల్లడిల్లిన తల్లిదండ్రులు మహబూబ్నగర్ రూరల్: రాజాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన లోటస్ స్కూల్ విద్యార్థులు ఎనిమిది మందిని మహబూబ్నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రుల రోధనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. అయితే, తమ పిల్లలకు ప్రాణాపాయం లేదని చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్వీఎస్లో విద్యార్థులు శ్రీరాం, శివకుమార్, గణేష్, వి.శివకుమార్, అర్చనతో పాటు మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. -
60 మంది చిన్నారులకు తప్పిన ముప్పు
సాక్షి, మోత్కూర్: కండిషన్లో లేని స్కూలు బస్సులు చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నడస్తున్న స్కూలు బస్సు టైర్ బోల్డులు ఊడిపోవటంతో స్థానికులు అప్రమత్తం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోత్కూర్ మండల కేంద్రంలోని లిటిల్ ప్లవర్ స్కూల్ బస్సు మంగళవారం ఉదయం 60 మంది పిల్లలను తీసుకుని స్కూలుకు వెళ్తోంది. మోత్కూర్ సమీపంలో చక్రం బోల్టులు ఉడిపోయిన విషయం స్థానికులు గమనించి కేకలు వేయటంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. పెద్ద ప్రమాదం తప్పటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
అన్న కోసం ఎదురెళ్లి..
కామవరపుకోట : అన్న వస్తున్నాడనే సంతోషంతో ఎదురెళ్లిన ఆ చిన్నారి అనూహ్యంగా కానరాని లోకాలకు చేరుకుంది. తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురి చేసిన ఈ ఘటన మండలంలోని ఆడమిల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆడమిల్లికి చెందిన వేముల వెంకటేశ్వరరావు కుమారుడు గణేశ్ కామవరపుకోటలోని ఒక ప్రైవేట్ విద్యాసంస్ధలో ఎల్కేజీ చదువుతున్నాడు. అతడు రోజూ పాఠశాలకు చెందిన బస్సులో వెళ్లి వస్తాడు. రోజూ సాయంత్రం బస్సు వచ్చే సమయానికి అన్న కోసం లోహిత (3) బస్సు వద్దకు వెళుతుంది. శుక్రవారం కూడా అన్న వచ్చాడన్న సంతోషంతో లోహిత బస్సు వద్దకు వెళ్లింది. బస్సు దిగిన గణేష్ ఇంటికి వెళుతుండగా అతడి వెనుకే లోహిత వెళుతోంది. ఈలోగా అదే స్కూల్ బస్ వెనుక నుంచి లోహితను ఢీకొట్టింది. దీంతో చిన్నారి బస్సు చక్రం కింద పడి మరణించింది. ఈ ఘటనతో స్థానికులంతా అవాక్కయ్యారు. అప్పటివరకు తమ మధ్య ఆడుతూపాడుతూ తిరిగిన చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన బస్సును డైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో గ్రామస్తులు కామవరపుకోట స్కూల్ వద్దకు వచ్చి ఆ బస్సును డ్రైవర్తో పాటు ఆడమిల్లి తీసుకెళ్లారు. తడికలపూడి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దీక్షితులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్ ఢీకొనిఉపాధ్యాయుడి మృతి
నగరంలోని ఓ ప్రయివేటు పాఠశాల. శుక్రవారం సాయంత్రం. పిల్లలు, ఉపాధ్యాయులు బయటకు వచ్చారు. స్కూల్ బస్సుల్లో ఎక్కుతున్నారు. అంతలోనే ప్రమాదం.. ఉపాధ్యాయుడికి త్రీవ గాయాలు.. ఆస్పత్రిలో మృతి. అసలేం జరిగింది..? ఖమ్మంఅర్బన్: నగరంలోని ప్రయివేట్ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాలు... ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన అతని పేరు గైని యల్లాగౌడ్(24). నగరంలోగల పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని, 5.00 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకని బస్టాండ్ వైపు వెళ్లే స్కూల్ బస్సు ఎక్కేందుకు మైదానంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. మైదానంలో రెండు బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఉన్నాయి. వాటి మధ్య నుంచి యల్లాగౌడ్ వెళుతున్నారు. అంతలోనే, ఒక బస్సు రివర్స్లో వెనక్కు వస్తోంది. అది యల్లాగౌడ్ను ఢీకొనడం, అలానే వెనక్కు నెట్టుకెళ్లడం, అక్కడే ఉన్న మరో బస్సును తగలడం.. క్షణాల్లోనే జరిగింది. ఆ రెండు బస్సుల మధ్యన యల్లాగౌడ్ నలిగిపోయారు. రొమ్ము, పొట్ట భాగంలో బలమైన గాయాలయ్యాయి. ఇంతలో మరో ఉపాధ్యాయుడు వచ్చి, యల్లాగౌడ్ను ఆటోలో సమీపంలోగల మమత ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడే శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. హైదరాబాద్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడి మృతికి సంతాపంగా పాఠశాలకు శుక్రవారం యాజమాన్యం సెలవు ప్రకటించింది. ‘బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం’ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో యల్లాగౌడ్ మృతిచెందాడంటూ అర్బన్ పోలీస్ స్టేషన్లో అతడి బాబాయి కృష్ణయ్య శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసును సీఐ నాగేంద్రాచారి దర్యాప్తు జరుపుతున్నారు. -
పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్
పశ్చిమగోదావరి, దవేగి రూరల్ : ఫిట్నెస్ లేకపోవడంతో స్కూల్ బస్ పంట బోదెలోకి దూసుకెళ్లిన సంఘటనలో 30 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దెందులూరు మండలం పోతునూరు గ్రామ సమీపంలో విశ్వకవి స్కూల్ బస్సు స్టీరింగ్ ఊడి పోవడంతో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సుకు ఫిట్ నెస్ లేకపోయినా దానినే పాఠశాల యాజమాన్యం తిప్పుతోందని అంటున్నారు. గతంలోను ఇదే పాఠశాలకు చెందిన బస్సు ఈ తరహా రోడ్డు ప్రమాదానికి గురైనా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
స్టీరింగ్ ఊడిన స్కూలు బస్సు
దెందులూరు(పశ్చిమగోదావరి): దెందులూరు మండలం పోతునూరు గ్రామం సమీపంలో విశ్వకవి స్కూల్ బస్సు బోల్తా పడి 30మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు స్టీరింగ్ ఊడి పోవడంతో అదుపు తప్పి పంట కాలువలోకి బస్సు దూసుకెళ్లింది. దీంతో బస్ ఫిట్ నెస్ పై విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిపేర్కు వచ్చిన బస్సును స్కూల్ యాజమాన్యం వాడుతోందని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ బస్సు ప్రమాదానికి గురైందని, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
సాక్షి, మేడ్చల్: ఓ స్కూల్ బస్సుకు మంగళవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీలో మంగళవారం ఉదయం విద్యార్థులను తీసుకుని వెళుతున్న బస్సు రోడ్డు పక్కనున్న మురికి కాలువలోకి దూసుకెళ్లింది. అనంతరం కిందపడకుండా పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో బస్సులో 11 మంది విద్యార్థులున్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీశారు. ఎవరికి ఏమికాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
వ్యాన్-స్కూల్ బస్ ఢీ, విద్యార్థి మృతి
-
వ్యాన్ను ఢీకొన్న స్కూల్ బస్, విద్యార్థి మృతి
సాక్షి, మైదుకూరు : వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం మీర్జాఖాన్పల్లె వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రయివేట్ పాఠశాల బస్సు, కొరియర్ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో నవీన్కుమార్(5) అనే విద్యార్థి మృతి చెందాడు. మరో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కొరియర్ వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నవీన్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే స్కూల్ బస్సు ప్రమాదానికి గురైందని, అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా డ్రైవర్ రాంగ్ రూట్లో వాహనాన్ని నడటం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గుజరాత్ : స్కూల్ బస్ను ఢీ కొట్టిన ట్రక్
20 మందికి తీవ్ర గాయాలు సగం మంది పరిస్థితి విషమం గాంధీనగర్ : సుమారు 30 మంది విద్యార్థులను తీసుకుని వెళ్తున్న ఒక స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఒక ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో సగంమంది పరిస్థితి తీవ్రంగా ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉదయం 7.30 నిమిషాలకు గుజరాత్లోని సర్కంజ్ గ్రామం నుంచి 30 విద్యార్థులను తీసుకుని మేమ్నగర్లో ఉన్న దివ్యపథ్ పాఠశాలకు బస్సు బయలు దేరింది. గ్రామం నుంచి కొద్దదూరం ప్రయాణించాక.. నవాపుర సర్కిల్ వద్ద (సర్కంజ్కు 7 కి.మీ దూరంలో) బస్సును ఒక ట్రక్ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో పదిమంది పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగిందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్నిరకాలుగా సహకరిస్తామని యాజమాన్యం తెలింది. -
కాలేజీ బస్సును ఢీకొట్టిన ట్యాంకర్
► రేపూడిలో సినీ ఫక్కీలో ప్రమాదం ►ఐదుగురు విద్యార్థులకు గాయాలు ►ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం ► జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఫిరంగిపురం: సినీ ఫక్కీలో రహదారిపై మెలికలు తిరుగుతూ ఓ పెట్రోల్ ట్యాంకర్ వేగంగా కళాశాల బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండలంలోని రేపూడి శివారులో కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శనివారం జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. నరసరావుపేట శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు చెందిన బస్సు ఫిరంగిపురం, వేములూరిపాడు, రేపూడి గ్రామాల నుంచి 15 మంది విద్యార్థినులతో శనివారం నరసరావుపేటకు బయల్దేరింది.. రేపూడి శివారుకు చేరుకునే సమయానికి ఎదురుగా నరసరావుపేట నుంచి తాడేపల్లి వెళుతున్న పెట్రోలు ట్యాంకర్ సినీ ఫక్కీలో చక్కర్లు కొడుతూ ఎదురుగా వస్తోంది. బస్సు డ్రైవర్ వాసు, విద్యార్థినులు గుర్తించి పెద్దగా కేకలు వేస్తూనే ఉన్నారు. ఇంతలోనే ట్యాంకర్ బస్సును ఎదురుగా బలంగా ఢీకొట్టింది. ట్యాంకర్ అమాంతం వచ్చి బస్సు పక్కన ఆగింది. బస్సు ముందు అద్దాలు పగిలి పలువురిపై పడ్డాయి. మరికొందరు కిందపడి గాయాలపాలయ్యారు. ట్యాంకర్ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అటుగా వస్తున్న వాహనదారులు ఘటన స్థలంలో ఆగి క్షతగాత్రులను బస్సు నుంచి దించారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే.. బస్సు బయలుదేరిన ఐదు నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం జరగడం విశేషం. కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరగడం, విద్యార్థినులు గాయపడటం అన్నీ జరిగిపోయాయి. వాహనదారులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులను చూసిన విద్యార్థినులు కన్నీటి పర్వంతమయ్యారు. క్షతగాత్రులను పరామర్శించడానికి వచ్చిన తల్లిదండ్రులు, బంధువులతో ఆసుపత్రి ప్రాంగణం ఉద్విగ్నంగా మారింది. కేవలం ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంకర్ అదుపుతప్పి వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిందని చెప్పారు. కేసు నమోదు... తొలుత ఘటనపై ఎస్సై ఎం.ఆనందరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బస్సు, ట్యాంకర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. నిలిచిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. గాయాలపాలైన విద్యార్థుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
అక్కను స్కూలుకు పంపేందుకు వచ్చి..
- స్కూలు బస్సు కింద పడి మరణించిన రెండేళ్ల చిన్నారి - మీర్పేట్లో విషాదం హైదరాబాద్: అమ్మతో కలసి అక్కను స్కూలు బస్సు ఎక్కించేందుకు బయటకు వచ్చిన రెండేళ్ల చిన్నారి... అదే బస్సు చక్రాల కింద పడి నలిగిపోయాడు. అప్పటివరకూ ఆడుతూ... ముద్దు లొలికించిన బుడతడు అంతా చూస్తుండగానే... క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే జరిగిన ఈ ఘోరం చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. హైదరాబాద్ మీర్పేట్లో మంగళవారం జరిగిన ఈ విషాదం అక్కడున్నవారిని కలచివేసింది. సూర్యాపేట జిల్లా ఎలకారం గ్రామానికి చెందిన రమేశ్ యాదవ్ చంపాపేట్లోని నారాయణ కళాశాలలో వైస్ప్రిన్స్పాల్గా పనిచేస్తున్నారు. భార్య లలిత, కూతురు మోక్ష(4), కుమారుడు మనీశ్(2)తో కలసి మీర్పేట్ ఠాణా పరిధిలోని శివాహిల్స్లో నివాసం ఉంటున్నారు. మోక్ష సమీపంలోని భారతీయ మహావిద్యాలయలో ఎల్కేజీ చదువుతోంది. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా లలిత తన కుమార్తె మోక్షను పాఠశాలకు పంపే క్రమంలో ఇంటి ముందుకు వచ్చిన బస్సు ఎక్కించేందుకు బయటకు వచ్చింది. ఎప్పటిలానే తల్లి, అక్కను అనుసరిస్తూ మనీశ్ బయటకు వచ్చాడు. అయితే ఊహించని విధంగా బస్సు ముందు టైర్ కిందకు వెళ్లాడు. ఇది గమనించని డ్రైవర్ బస్సును కదిలించడంతో మనీశ్ తల మీద నుంచి ముందు టైర్ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. దీనిపై కేసు నమోదు చేశామని, బస్సు డ్రైవర్ను అదుపు లోకి తీసుకున్నామని సీఐ రంగస్వామి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎంపీపీ విక్రంరెడ్డి తదితరులు ఘటనా స్థలికి వచ్చి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. -
స్కూలు బస్సు కింద పడి బాలుడు మృతి..
హైదరాబాద్: నగరంలోని మీర్పేటలో విషాదం నెలకొంది. మనీష్ అనే రెండేళ్ల బాలుడు స్కూలు బస్సు కింద పడి మృతిచెందాడు. మీర్పేట శివ హిల్స్లో రమేష్ అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ నివాసముంటున్నారు. ఎప్పటి మాదిరి మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో కుమార్తెను భారతి విద్యాలయ స్కూల్ బస్సు ఎక్కిస్తున్నారు. అక్కకు టాటా చెప్పేందుకు బస్సు వద్దకు వచ్చిన మనీష్ ప్రమాదవశాత్తు అదే బస్సు కింద పడి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బడి బస్సులు
– 71 విద్యార్థి బస్సులను నడిపేందుకు చర్యలు – రూట్ల వారిగా సర్వీసులు ఖరారు చేసిన ఆర్టీసీ – అసవరమైతే మరిన్ని నడుపుతాం: డీసీటీఎం శ్రీనివాసులు కర్నూలు (రాజ్విహార్): బడి పిల్లలపై రోడ్డు రవాణ సంస్థ కరుణ చూపింది. ఉన్న ఊరు నుంచి విద్యా సంస్థలు ఉన్న పట్టణాలకు రాకపోకలు సాగించేందుకు విద్యార్థి బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12డిపోల నుంచి 71 విద్యార్థి బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రూట్ల వారిగా సర్వీసులు ఖరారు చేసి ఆచరణకు సిద్ధం చేశారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని, అవసరాలను బట్టి మరిన్ని నడుపుతామని అధికారులు పేర్కొంటున్నారు. – డిపోల వారిగా విద్యార్థి బస్సులు తిరిగే రూట్లు – ఆదోని డిపో: ఆదోని డిపో నుంచి ఐదు విద్యార్థి బస్సులు నడుపుతుండగా ఆదోని నుంచి తొగలగల్లు– డి.కోటకొండ, బనవనూరు– కల్లుకుంట, హొళగుంద– చిన్నకుంట, సుంకేశ్వరి– హానవాలు, ఆలూరు–ఎల్లార్తి, హొళగుందకు నడుపుతున్నారు. – డోన్ డిపో: డోన్ డిపో నుంచి నాలుగు బస్సులు నడుపుతుండగా కంబాలపాడు– మల్లెంపల్లె, డోన్– సి.కొతూరు, డోన్–జలదుర్గం, డోన్ జక్కసాని గుంటకు తిప్పుతున్నారు. – కర్నూలు–2 డిపో: కర్నూలు–2 డిపో నుంచి నాలుగు బస్సులు నడుపుతుండగా కర్నూలు– రేమట, కర్నూలు– అనుగొండ, కర్నూలు–ముడుమాల, కర్నూలు– సీ.బెళగల్కు నడుతుతున్నారు. – నందికొట్కూరు డిపో: నందికొట్కూరు డిపో నుంచి ఎమినిది బస్సులు నడుపుతుండగా నందికొట్కూరు తర్తూరు, మండ్లెం, జూపాడుబంగ్లా, కె.ప్రాతకోట, బిజినెవేముల, కొనిదేల, వడ్డెమాను, వాడాల, చెరుకుచెర్ల, పైపాళెం, పగిడ్యాల, వీపనగండ్ల, వనుముల పాడు, లక్ష్మాపురం, కడుమూరు, పైపాళెం, నెహ్రు నగర్, నాగటూరు, నెహ్రు నగర్, పారుమంచాల, కడుమూరు, పైపాళెం, వాడాల, చౌట్కూరుకు తిప్పుతున్నారు. – ఎమ్మిగనూరు డిపో: ఎమ్మిగనూరు డిపో నుంచి 12బస్సుల్లో ఎమ్మిగనూరు నుంచి కోడుమూరు, ఆదోనికి మూడు, మసీదుపురం, కంపాడు, మల్కాపురం, పెద్దకొత్తిలి, వి.తిమ్మాపురం, నాగలదిన్నె, కనకవీడు మధ్య నడుపుతున్నారు. – ఆళ్లగడ్డ డిపో: ఆళ్లగడ్డ డిపో నుంచి తొమ్మిది బస్సులు నడుపుతుండగా ఆళ్లగడ్డ నుంచి సుద్దమల్ల, చాగలమర్రి, శ్రీరంగాపురం, ఆర్.జంబులదిన్నె, బీసీపీఎల్–తండా, చందలూరు, చిన్న వాగలి, రామచంద్రాపురం మధ్య తిప్పుతున్నారు. – ఆత్మకూరు డిపో: ఆత్మకూరు డిపో నుంచి 11 బస్సులు నడుపుతుండగా ఆత్మకూరు–ఇస్కాల, బైర్లూటి, కొత్తలచెర్రు, గుమ్మడపురం, వానాల, పి.అనంతపురం, ఏటీకే–మద్దూరు, జడ్డువారి పల్లె, వేంపెంట, మద్దూరు, వెలుగోడు, రేగడ గూడూరు గ్రామాలకు తిప్పుతున్నారు. – బనగానపల్లె డిపో: బనగానపల్లె డిపో నుంచి ఎమినిది బస్సులు తిప్పుతుండగా బనగానపల్లె– గార్లదిన్నే, బేతంచెర్ల, కందికాయపల్లె, రామతీర్థం, చెర్లో కొత్తూరు, కొండనాయుని పల్లె, టంగుటూరు, ఆర్జీఎం కాలేజీ నెర్రవాడ గ్రామాల మధ్య నడుపుతున్నారు. – కోవెలకుంట్ల డిపో: కోవెలకుంట్ల డిపో నుంచి నాలుగు బస్సులు నడుపుతుండగా కోవెలకుంట్ల– కాకరవాడ, కొండ సుంకేసుల, పెద్ద వెంచర్ల, కాశీపురం– అవుకు మధ్య తిరుగుతున్నాయి. – నంద్యాల డిపో: నంద్యాల డిపో నుంచి ఐదు బస్సులు నడుపుతుండగా నంద్యాల–గుండంపాడు, పులిమద్ది, బోయిల్కుంట్ల, మహానంది, గుంటనాల, ఏవీఆర్ ఎస్వీఆర్ కళాశాల, తిమ్మాపురం, గడివేముల మోడల్ స్కూల్, గోరుకల్లు, ఆర్జీఎం కళాశాలకు సర్వీసుల తిప్పేందుకు చర్యలు చేపట్టారు. అవసరమైతే మరిన్ని బస్సులు: శ్రీనివాసులు, డీసీటీఎం, ఆర్టీసీ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం 71 విద్యార్థి బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాం. వీరి రాకపోకల్లో సమయాలు మర్చాలని విద్యార్థులు, కళాశాల, పాఠశాల యాజమాన్యాలు విన్నవిస్తే సరి చేస్తాం. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ప్రైవేటు ఆటోలకు బదులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే సంస్థకు మేలు కలుగుతుంది. దీంతో అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు నడిపేందుకు వీలుంటుంది. -
స్కూల్ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఉరవకొండ : ప్రైవేట్ స్కూల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉరవకొండ గవిమఠం ప్రాంగణంలోని ‘ది ఎడిసన్’ ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు గురువారం ఉదయం 40 మంది విద్యార్థులను తీసుకుని పట్టణంలోని పోలీస్స్టేషన్ వైపు నుంచి వెళ్తుండగా వెనుక టైరు రోడ్డు పక్కనున్న చిన్న గోతిలోకి దిగింది. వెంటనే స్థానికులు పిల్లలందరినీ బస్సులోంచి దించేశారు. బస్సును క్రేన్ సాయంతో యథాస్థితికి తెచ్చారు. గతంలోనూ ఎడిసన్ స్కూల్కు చెందిన ఓ బస్సుకు లైసెన్స్ లేకపోవడంతో ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. -
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
ఏలూరు అర్బన్ : స్కూల్ బస్లు పూర్తి కండిషన్లో లేకుంటే సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఎస్ మూర్తి హెచ్చరించారు. రవాణా శాఖ అధికారులు 6 బృందాలుగా ఏర్పడి మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్కూల్ బస్లను తనిఖీ చేశారని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 11 బస్లను గుర్తించి సీజ్ చేశారన్నారు. సంబంధిత విద్యాసంస్థల నుంచి రూ.లక్ష వరకు అపరాధ రుసుం వసూలు చేశామని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో గడువు ముగి సిన అన్ని విద్యాసంస్థల బస్లకు విధిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బస్లు తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని స్పష్టం చేశారు. ఏలూరు నగరంలో ఆర్టీఓ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఏఎంవీఐలు ఎం.పౌల్రాజు, సిద్ధిఖ్, చైతన్యసుమ, ప్రసాద్ తనిఖీలు చేశారు.