shiva sena
-
పొత్తులేదు.. బీఎంసీ ఎన్నికల్లో మాది ఒంటరి పోరే
ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిగా జట్టుకట్టిన శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ల మధ్య లుకలుకలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే బృహణ్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో ఎంవీఏ మిత్రులతో పొత్తు పెట్టుకోవడం కష్టమేనని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు.శనివారం ముంబైలో మీడియాతో రౌత్ మాట్లాడారు. దేశ వాణిజ్యరాజధాని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను అవిభాజ్య శివసేన ఏకంగా పాతికేళ్లపాటు అప్రతిహతంగా ఏలింది. 1997 నుంచి 2022దాకా బీఎంసీపై శివసేన పట్టుకొనసాగిన విషయం విదితమే. ‘‘ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిగా కాకుండా ఒంటరిగానే బరిలో దిగుదామని మా శివసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు. అందుకే వారితో ఈ అంశాన్ని చర్చించేందుకు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సమావేశం అవుతున్నారు’’అని రౌత్ వెల్లడించారు. కూటమిలో విభేదాలున్నాయన్న వాదనను రౌత్ తోసిపుచ్చారు.‘‘శివసేన రెండుగా చీలకముందుకూడా మేం గతంలో బీజేపీతో కలిసి ఉన్న సందర్భాల్లోనూ ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీచేశాంకదా. పుణె, పింప్రి–చించ్వాడ్, నాసిక్ పురపాలికల్లో ఎంవీఏ కూటమి ఉమ్మడిగానే పోటీచేస్తుంది ’’అని రౌత్ అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మాదిరే అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ, బీజేపీలతో శివసేన ఉమ్మడిగా మహాయుతి కూటమిగా బీఎంసీ ఎన్నికల్లో బరిలో దిగుతామని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. -
‘మహా’ సీఎం పదవిపై వీడని ఉత్కంఠ .. షిండే కుమారుడు ట్వీట్ వైరల్
ముంబై : మహా సీఎం పదవిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ తరుణంలో తనకు డిప్యూటీ సీఎం పదవి అంటూ వస్తున్న వార్తల్ని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే కొట్టి పారేశారు.తన కుమారుడు శ్రీకాంత్ షిండేకి డిప్యూటీ సీఎం పదవి కావాలంటూ ఏక్నాథ్ షిండే మహాయుతి కూటమి పెద్దలతో మంతనాలు జరిపారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని శ్రీకాంత్ షిండే సోమవారం ఖండించారు. తన గురించి నిరాధారమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయని, తాను మహారాష్ట్రలో ఏ మంత్రి పదవికి రేసులో లేనని స్పష్టం చేశారు. ‘మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. కాబట్టే చర్చలు, పుకార్లకు దారి తీసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనారోగ్య సమస్యల కారణంగా రెండు రోజులు తన స్వగ్రామంలో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను ఉపముఖ్యమంత్రి అవుతాననే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ ఈ వార్తలు నిరాధారమైనవి’ అని శ్రీకాంత్ షిండే ట్వీట్లో పేర్కొన్నారుमहायुतीच्या सरकारचा शपथविधी थोडा लांबल्यामुळे सध्या चर्चा आणि अफवा यांचे पीक फोफावले आहे. काळजीवाहू मुख्यमंत्री मा. श्री एकनाथ शिंदे यांनी प्रकृती अस्वास्थ्यामुळे दोन दिवस गावी जाऊन विश्रांती घेतली. त्यामुळे अफवांना अधिकच बहर आला. मी उपमुख्यमंत्री होणार अशा बातम्या प्रश्नचिन्हे…— Dr Shrikant Lata Eknath Shinde (@DrSEShinde) December 2, 2024 -
షిండే హ్యాపీయేనా? శివసేన ఏమంటోంది?
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఢిల్లీ పెద్దల దౌత్యంతో.. ఏక్నాథ్ షిండే బెట్టు వీడారనే సంకేతాలు మాత్రం అందుతున్నాయి. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్కు లైన్ క్లియర్ అయ్యాయనే విశ్లేషణలు నడుస్తున్నాయి. మరి సీఎం పదవి వదులుకునే విషయంలో షిండే నిజంగానే హ్యాపీగా ఉన్నారా?. శివసేన అందుకు ఒప్పుకుంటోందా?.. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచి మూడు రోజులవుతుంది. కానీ ఇంతవరకు సీఎం ఎవరనేది బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎటూ తేల్చలేకపోతున్నాయి. ఈ తరుణంలో 14వ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగియగా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన పదవికి రాజీనామా గవర్నర్కు సమర్పించారు. ఆపద్ధర్మ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆయనే కొనసాగుతారు. ఇక.. ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలని బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతున్న తరుణంలో.. సీఎం సీటు ఎవరికి అనే దానిపై బలనిరూపణ చేయాలంటూ షిండే వర్గం కొత్త డిమాండ్ను తెర మీదకు తెచ్చింది. అయితే ఆ వాదన అసంబద్ధమని తన వర్గీయులను షిండే వారించినట్లు సమాచారం. ‘‘మహాయుతి కూటమి గొప్ప విజయం తర్వాత రాష్ట్రంలో మరోసారి మా ప్రభుత్వం ఏర్పడనుంది. మహాకూటమిగా కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం.నేటికీ కలిసి ఉన్నాం. నాపై ప్రేమతో.. అందరూ కలిసి ముంబైకి రావాలి’’ అని తాజాగా ఈ ఉదయం ట్వీట్లో ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. ఈలోపు..महायुतीच्या प्रचंड विजयानंतर राज्यात पुन्हा एकदा आपले सरकार स्थापन होणार आहे. महायुती म्हणून आपण एकत्रित निवडणूक लढवली आणि आजही एकत्रच आहोत. माझ्यावरील प्रेमापोटी काही मंडळींनी सर्वांना एकत्र जमण्याचे, मुंबईत येण्याचे आवाहन केले आहे. तुमच्या या प्रेमासाठी मी अत्यंत मनापासून ऋणी…— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) November 25, 2024మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కొనసాగుతున్న చర్చలు మంగళవారం రాత్రి లేదంటే బుధవారం ఉదయానికల్లా ఓ కొలిక్కి రావొచ్చని శివసేన నాయకుడు సంజయ్ శిర్సత్ తెలిపారు. సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టాలనే దానిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలతో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు చర్చిస్తున్నారని. ఇవాళో, రేపో కచ్చితంగా తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే.. ఇదే శిర్సత్.. షిండేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నిన్నటిదాకా మీడియా ముందు హడావిడి చేశారు.మహా ల్లో ప్రజాదరణ ఉన్న నేత ఏక్నాథ్ షిండే అని, ఆయన నాయకత్వంలో శివసేన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో అతిపెద్ద కూటమి పార్టీగా అవతరించిందని, కాబట్టి ఏక్నాథ్ షిండే సీఎం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు.. బీహార్ ఫార్ములా డిమాండ్ లేవనెత్తిన శివసేన నరేష్ కూడా.. ఇప్పుడు షిండే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం గమనార్హం. ఈ లిస్ట్లో ఇవాళ షిండే వర్గీయులు చాలామందే చేరారు. దీంతో.. శివసేనలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది. షిండే వెనక్కి తగ్గాలి : కేంద్రమంత్రిమహరాష్ట్ర సీఎం ఎవరు? అనే అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. ‘‘మహారాష్ట్ర వివాదం త్వరలో ముగియాలి. దేవేంద్ర ఫడ్నవిస్ను సీఎంను చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఆ నిర్ణయంపై ఏక్నాథ్ షిండే అసంతృప్తిలో ఉన్నారు. ఆ అసంతృప్తిని పోగొట్టాలి. అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది కాబట్టి బీజేపీ అందుకు ఒప్పుకోదు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్లాగా ఏకనాథ్ షిండే కూడా రెండు అడుగులు వెనక్కి వేయాలి. లేదంటే ఫడ్నవీస్ నాలుగు అడుగులు వెనక్కి వేసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పని చేయాలి. లేదా ప్రధాని మోదీ, అమిత్షాలు జోక్యం చేసుకోవాలి. ఏక్నాథ్ షిండేతో పాటు ఆయన 57 మంది ఎమ్మెల్యేలు..త్వరగా రాజీ కుదుర్చుకుని మంత్రివర్గాన్ని విస్తరించాలి’’ అని అన్నారు.ఒక పార్టీ మద్దతుంటే చాలుమహరాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 132 మంది ఎమ్మెల్యేలు, శివసేన 57, ఎన్సీపీ 41 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో 288 మంది సభ్యుల అసెంబ్లీలో 145 మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడానికి బీజేపీ మహాయతి కూటమిలోని రెండు మిత్రపక్షాలలో ఒక మిత్ర పక్షం మద్దతుంటే సరిపోతుంది. -
నేను పిలిస్తే.. ఆయన పారిపోయారు : ఆధిత్య ఠాక్రేపై దేవ్రా సెటైర్లు
ముంబై: నేను పిలిస్తే ఆయన ఎందుకు పారిపోతున్నారో నాకు అర్ధం కావడం లేదంటూ శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేపై ఎంపీ మిలింద్ దేవ్రా సెటైర్లు వేశారు.వచ్చే వారంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు వారి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా సవాళ్లు ,విమర్శలు, ప్రతి విమర్శలతో కాకరేపుతున్నారు.ఈ తరుణంలో శివసేన (యూబీటీ) వర్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య ఠాక్రేపై పోటీ చేస్తున్న సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్లీ అభ్యర్థి మిలింద్ దేవ్రా సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మిలింద్ దేవ్రా.. కొన్ని రోజుల క్రితం, వర్లీ భవిష్యత్తు, ముంబై భవిష్యత్తు, మహారాష్ట్ర భవిష్యత్తుపై చర్చకు రావాలని ఆదిత్య ఠాక్రేని ఆహ్వానించాను. లోక్సభ ఎన్నికల సమయంలో ఆధిత్య ఠాక్రే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతానని, దానిని బలోపేతం చేస్తున్నానని ప్రచారం చేశారు. ఇప్పుడే అదే విషయంపై చర్చకు రమ్మనమని పిలిచా. కానీ, తాను ప్రజాస్వామ్యానికి అనుకూలమని ఆదిత్య ఠాక్రే పారిపోతున్నారు. అలా ఎందుకు పారిపోతున్నారో? అని విమర్శలు గుప్పించారు. ఓట్లకు శివసేన (యూబీటీ) డబ్బు పంచుతోందని దేవ్రా ఆరోపించారు. నిన్న, అతని ఆదిత్య ఠాక్రే పార్టీ డబ్బు పంపిణీ చేస్తుందని, ఇందుకోసం పెద్ద మొత్తంలో సీసీటీవీ పుటేజీలను అమర్చిందన్నారు. ఇదే విషయం ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే నాయకుడు ఆధిత్య ఠాక్రే’ అని దేవరా విమర్శలు గుప్పించారు. -
మోదీ పర్యటనలు.. మహారాష్ట్రకు సురక్షితం కాదు: సంజయ్ రౌత్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘ఏక్ హై తో సేఫ్ హై’(మనం ఐక్యంగా ఉంటే సురక్షితం) నినాదంపై శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ఇప్పటికే చాలా సురక్షితమైన రాష్ట్రమని అన్నారు. కానీ, ప్రధాని మోదీ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా అస్థిరతకు గురువుతుందని మండిపడ్డారు. విభజనలు సృష్టించి అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలతోనే ప్రధాని మోదీ పర్యటనలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ ఎందుకు ఇలాంటి భాష వాడుతున్నారో అర్థం కావడం లేదు. మహారాష్ట్రలో ప్రజలు ఇప్పటికే సురక్షితంగా ఉన్నారు. కానీ మోదీ ఎప్పుడు పర్యటించినా.. విభజన, అశాంతిని రెచ్చగొట్టడం వల్ల రాష్ట్రం అభద్రతకు గురవుతోంది. రాష్ట్రానికి నిజంగా భద్రత కావాలంటే.. మేం బీజేపీని ఓడించాలి’’ అని అన్నారు.కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఒక కులానికి మరొక కులాన్ని వ్యతిరేకంగా ఉంచుతున్నాయని శుక్రవారం ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. ‘ఏక్ హై, తో సేఫ్ హై’(ఐక్యంగా ఉంటేనే సురక్షింతంగా ఉంటాం) అని ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా ఒక కులాన్ని మరో కులానికి వ్యతిరేకంగా ఉంచటం. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అభివృద్ధి చేందటం.వారికి తగిన గుర్తింపు రావడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి’’ అని ధూలేలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ మోదీ అన్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
అలా అయితే.. జైలుకు వెళ్లడానికైనా సిద్ధం: మహారాష్ట్ర సీఎం
ముంబై: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'లడ్కీ బహిన్ యోజన' పథకానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించడాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే తప్పుపట్టారు. ఈ పథకం నేరమైతే.. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘లడ్కీ బహిన్ (ప్రియమైన సోదరీమణులు) కోసం నేను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. లడ్కీ బహిన్ యోజనను నిలిపివేయాలని ఒత్తిడి చేస్తున్న మహా వికాస్ అఘాడీని ఓడించడానికి శివసేన, మహాయుతికి మహిళలంతా మద్దతు ఇవ్వాలి. ప్రియమైన సోదరీమణులు లడ్కీ బహిన్ యోజన కింద ప్రతి నెల రూ.1,500 పొందుతారు. లడ్కీ బహిన్ యోజనను మూసివేయాలని ప్రతిపక్షం ప్రయత్నాలు చేస్తోంది.ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్ల వద్దకు వస్తే.. లడ్కీ బహిన్ యోజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నిలదీయండి...ఆ పథకాన్ని ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్లారని అడగండి. ఇది సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి మీ వద్దకు ఎవరు వచ్చినా.. లడ్కీ బహిన్ యోజనను వ్యతిరేకించే వారికి మీరేంటో చూపించండి. అసెంబ్లీ ఎన్నికల్లో లడ్కీ బహిన్ యోజన, ఇతర సంక్షేమ పథకాలను ఆపేయాలనుకువారికి వారికి ఎదురుదెబ్బ తగులుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మహారాష్ట్ర నుంచి ముంబైని విడదీస్తారని శివసేన(యూబీటీ) అసత్య ప్రచారం చేస్తోంది’’ అని అన్నారు. -
ముగిసిన నామినేషన్ల గడువు.. 15 స్థానాలపై రాని స్పష్టత!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ(మంగళవారం) ముగిసింది. కానీ దాదాపు 15 సీట్లను అధికార, ప్రతిపక్ష కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించని పరిస్థితి నెలకొంది . బీజేపీ, శివసేన( ఏక్నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అధికార కూటమి ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. అదేవిధంగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్ వర్గం), ఎన్న్సీపీ( ఎస్పీ వర్గం), కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. బీజేపీ 152 మంది అభ్యర్థులు, ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) 52 మంది అభ్యర్థులు, శివసేన( ఏక్నాథ్ షిండే వర్గం) శివసేన 80 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో అధికార కూటమి చిన్న మిత్రపక్షాలకు ఇచ్చిన సీట్లు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ 103 మంది అభ్యర్థులు, శివసేన( ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ( ఎస్పీ) కలిపి 87 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది.మధ్యాహ్నం నాటికి ఎన్సీపీ( ఎస్పీ)కి సంబంధించినంత వరకు చివరి 87వ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. అయితే అది అప్పటికీ 11 సీట్లపై అనిశ్చిత్తి నెలకొంది. ఈ సీట్లు కొన్ని చిన్న మిత్రపక్షాలు, సమాజ్వాదీ పార్టీకి వస్తాయని అంచనా వేయగా.. ఎవరికి ఏది, ఎన్ని అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఎన్న్సీపీ (అజిత్ పవార్ వర్గం) నవాబ్ మాలిక్ మంఖుడ్ స్థానం నుంచి రెండు నామినేషన్లను దాఖలు చేశారు. ఒకటి ఇండిపెండెంట్గా, మరొకటి ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
సీట్ల పంపకం.. కాంగ్రెస్, శివసేన(యూబీటీ)లో విభేదాలు!
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదర్భలోని సీట్ల విషయంలో కాంగ్రెస్, మిత్రపక్షం శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. విదర్భలో శివసేన (యూబీటీ) 17 సీట్లను కోరుతోంది. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపించటం లేదు. విదర్భలో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసోంది. ఇక.. ముంబై, నాసిక్లలో సీట్ల విషయంలో ఇప్పటికే ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.విదర్భలో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 288 మంది సభ్యుల అసెంబ్లీలో విదర్భ 22 శాతం స్థానాలకు ప్రాతినిధ్యం విశేషం. ఇక్కడ మెజారిటీని సాధించటం అన్ని పార్టీలకు చాలా కీలకం. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో విదర్భలోని 10 లోక్సభ స్థానాలకు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఏడింటిలో విజయం సాధించింది. కాంగ్రెస్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, ఐదు స్థానాలను గెలుచుకుంది. ఇక.. అధికా కూటమిలోని బీజేపీ సైతం రెండు స్థానాలు గెలుచుకుంది.అయితే.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) 62 సీట్లలో కనీసం 8 సీట్లను కోరుతోంది. విదర్భలో కాంగ్రెస్కు బలమైన పునాది ఉందనటంలో ఎటువంటి సందేహం లేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. అయితే తమకు కూడా 4-5 మంది ఎంపీలు కూడా ఉన్నారని గుర్తు చేశారు.మరోవైపు.. మహా వికాస్ అఘాడిలో కూటమి నుంచి సేన (యూబీటీ) చీలిక సృష్టిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. గత వారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే సీట్ల పంపకానికి సహకరించడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. అయితే ఇరు పార్టీల మధ్య విభేదాల వార్తలను కాంగ్రెస్ ఖండించింది. బీజేపీనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించింది.మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్కు చెందిన విజయ్ వాడెట్టివార్ మాట్లాడుతూ.. ‘‘ ఎంవీఏలో 17 సీట్లపై చర్చలు ఇంకా పెండింగ్లో ఉంది. కొన్ని సీట్లపై మాకు థాక్రే వర్గంతో వివాదం ఉంది. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. సీట్ల పంపకం విషయంలో కూడా మూడు పార్టీలు సమయం తీసుకుంటాయి’ అని అన్నారు. ఇక.. అక్టోబర్ 22న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందని తెలుస్తోంది. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.చదవండి: కుటుంబ నియంత్రణలో దక్షిణాది సక్సెస్ -
‘షిండే ముఖ్యమంత్రి కాదు.. కాంట్రాక్టర్ మంత్రి’
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ నకిలీ హిందుత్వను ప్రచారం చేస్తోందని శివసేన( యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాదు.. ఒక కాంట్రాక్టర్ మంత్రి అని అన్నారు. హిందుత్వ పట్ల తమ పార్టీ, బీజేపీ ఆదర్శలు, వైఖరికి స్పష్టమైన తేడాలు ఉన్నాయని తెలిపారు.‘‘ మేము పాటించే హిందుత్వం బీజేపీ హిందుత్వం ఒకటి కాదు. మా హిందుత్వ సంస్కరణలు.. ప్రజలు ఏం తినాలి, ధరించాలి అనే వాటిపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఉంటాయి. మతపరమైన విలువలను కాపాడుతాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మౌనంగా ఉంటూ.. మన దేశంలోని ముస్లింలపై బీజేపీపై దాడి చేయాలనుకుంటోంది.ఎన్నికల ప్రయోజనాల కోసం అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించింది. అదే సమయంలో మా పార్టీ రాజకీయాలు చేయకుండా అనేక ఆలయాలను సందర్శించింది. 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే.. పార్టీ ఫిరాయించి.. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?. కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడే నాయకుడిగా షిండేకు పేరుంది. ఈ ముఖ్యమంత్రి సామాన్యుడు కాదు. కాంట్రాక్టర్ మంత్రి. నేను ఓడిపోయినా మహారాష్ట్ర, ముంబై కోసం పోరాటం ఆపను’’ అని అన్నారు.ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. చదవండి: వయనాడ్ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ -
అమిత్షాపై ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు
ముంబై : శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర హోం మంత్రి అమిత్షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలను నిర్విర్యం చేసేలా అమిత్షా తన సొంత పార్టీ నేతల్ని ఉసిగొల్పారని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా బీజేపీ.. శివసేనతో పాటు ఎన్సీపీ (ఎస్పి) శరద్ పవార్ను ఎంపిక చేసుకున్నారని తెలిపారు. అయితే, తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని, అధికారంలో ఉన్న బీజేపీ కాదని సూచించారు. తనను (ఉద్ధవ్), శరద్ పవార్ను రాజకీయంగా నిలువరించేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.అమిత్ షా ఇటీవల నాగ్పూర్లో పర్యటించినప్పుడు బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అక్కడ ప్రతిపక్ష శ్రేణులను విభజించి.. నన్ను, శరద్ పవార్ను రాజకీయంగా నిలువరించాలని కోరారు. అమిత్ షా ఇలా ఎందుకు చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.‘రాబోయే ఎన్నికలు అధికారం కోసం కాదు. మహారాష్ట్ర దోపిడీకి గురికాకుండా నిరోధించడానికి అవి చాలా కీలకం’ అని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమికి భారీ విజయాన్ని అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
కూలిన శివాజీ విగ్రహం: నిరసనకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
ముంబై: గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహా ఆగస్టు 26 కుప్పకూలింది. ఈ విగ్రహం కూలిపోవటంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్ష మహా వికాస్ అఘాడి తప్పుపడుతూ సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. శివాజీ విగ్రహం కూలిపోవటంపై సెప్టెంబర్ 1న నిరసన ర్యాలీని చేపడతామని బుధవారం మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి హుతాత్మా చౌక్ నుంచి ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బుధవారం శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, నానా పటోల్, సంజయ్ రౌత్లు సమావేశమైన అనంతరం నిరసన ర్యాలీని ప్రకటించారు.మరోవైపు.. సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం శివాజీ విగ్రహ నిర్మాణం, ఏర్పాటు విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఉద్దవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు.ఈ ఘటనకు ప్రభుత్వం, నేవి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక.. విగ్రహం కూలడంపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. లాతూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘శివాజీ మహారాజ్ మనందరి ఆరాధ్య దైవం. ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’’ అని అన్నారు. -
మహిళా జర్నలిస్ట్పై అసభ్య వ్యాఖ్యలు.. చిక్కుల్లో శివసేన షిండే వర్గం నేత
ముంబై: బద్లాపూర్లో చిన్నారులపై జరిగిన హత్యాచారాన్ని కవర్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్పై శివసేన (షిండే) వర్గం నేత చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు వివాదాస్పదయ్యాయి. హత్యాచార ఘటనను కవర్ చేస్తున్న తనపై శివసేన (షిండే) వర్గం నేత వామన్ మాత్రే.. అసభ్య వ్యాఖ్యలు చేశారని స్థానిక టీవీలో పనిచేసే మహిళా జర్నలిస్టు తెలిపారు. ‘‘బాద్లాపూర్ మాజీ మేయర్ అయిన వామన్ మాత్రే నాపై చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన ఆమోద యోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు నాకు చాలా ఆగ్రహం కలిగించాయి. నేను నిజాల ఆధారంగానే హత్యాచార ఘటనను కవర్ చేశాను’’ అని మహిళా జర్నలిస్ట్ అన్నారు. అనంతరం వామన్ మాత్రే స్పందిసూ.. జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళా జర్నలిస్ట్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో కుమ్మక్కు అయ్యారని అన్నారు. ‘‘ఇది ఆ మహిళా జర్నలిస్ట్ చేస్తున్న ఒక స్టంట్. ఆమె నాకు చాలా రోజుల నుంచి తెలుసు. ఆమె శివసేన(యూబీటీ)కి అనుకూలంగా పనిచేస్తారు. మీరు ఈ సంఘటనను రెండుమూడు రోజులుగా కవర్ చేస్తున్నారు. బాలికలపై దాడి జరిగిందా? లేదా? అనే దాని గురించి సరైన సమాచారాన్ని నివేదించాలని అడిగాను. అంతేకాని, నేను ఆమెతో అసభ్యంగా మాట్లాడలేదు’’ అని అన్నారు.మరోవైపు.. వామన్ మాత్రే చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిచాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మాత్రే వ్యాఖ్యలను ముంబై ప్రెస్ క్లబ్ ఖండించింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కోరింది. ప్రజల సెంటిమెంట్ను, పత్రికా గౌరవాన్ని ఇలా నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం కాదని ఒక ప్రకటనలో పేర్కొంది. -
దాడుల కోసం.. అమిత్ షా సుపారీ తీసుకున్నారు: సంజయ్ రౌత్
ముంబై: ఇతర పార్టీ చీఫ్ల కాన్వాయ్లే లక్ష్యంగా బీజేపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీల కార్యకర్తలు దాడులు చేయటాన్ని ఇలాగే కొనసాగిస్తే.. తాము కూడా భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకుంటామని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. థానేలో శనివారం శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కాన్వాపై ఎంఎన్ఎస్ కార్యాకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఆదివారం సంజయ్ రౌత్ మాట్లాడారు. అహ్మద్ షా అబ్దాలీ (హోంశాఖ మంత్రి అమిత్ షాను పరోక్షంగా ఉద్దేశిస్తూ..)కు మహారాష్ట్రంలో దాడుల ద్వారా అరాచకం వ్యాప్తి చేయాలని ఢిల్లీలో ఉండే కేంద్ర పాలకులు సుపారీ ఇచ్చారని మండిపడ్డారు. ‘ఉద్దవ్ ఠాక్రే కాన్వాయ్పై శనివారం రాత్రి దాడి జరిగింది. ఇలాంటి చేయాలనే వాళ్లు ఉన్నారు. అమిత్ షా ఇలాంటి దాడులు చేయించడానికి ఢిల్లీ నుంచి సుపారీ అందుకున్నారు. ఎన్ఎన్ఎస్ కార్యకర్తలను ఇటువంటి పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ సదరు నేతలు మాత్రం ఢిల్లీ నుంచి సుపారీ తీసుకొని సైలెంట్గా ఉంటున్నారు. ఇలా దాడులకు తెగపడటం మహారాష్ట్రకు మంచిది కాదు. నేను ఏ పార్టీ పేరును ప్రస్తావించటం లేదు. కానీ, కొన్ని పార్టీలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇప్పటి నుంచే కుట్రలు పన్నుతున్నారు’ అని మండిపడ్డారు. -
‘మీరైనా ఉండాలి.. నేనైనా ఉండాలి’.. ఫడ్నవిస్కు ఉద్ధవ్ వార్నింగ్
ముంబై: ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్కు ఆయన ఛాలెంజ్ విసిరారు. మీరైనా ఉండాలి.. లేదా నేనైనా ఉండాలని అన్నారు. ముంబైలో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.‘‘లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాం. మన పార్టీ చీలిపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో పార్టీ నేతలు టార్గెట్ చేయబడ్డారు. మనపై అధికారం, డబ్బుతో అణగదొక్కాలని చూశారు. మనల్ని జైల్లో వేయాలని కూడా ప్రయత్నించారు. ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కొని.. గెలిచి చూపించాం. నన్ను, ఆదిత్య ఠాక్రేను జైలుకు పంపాలని కుట్ర చేశారు. మీరు(దేవేంద్ర ఫడ్నవిస్) సూటిగా వ్యవహరిస్తే మేము సూటిగా ఉంటాం. కాదని మరోలా ప్రవర్తిస్తే.. మేం కూడా దీటుగా సమాధానం చెబుతాం. అయితే మీరైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి... నేను మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నిక కాలేదు. నేను డైరెక్టుగా ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యాను.సాధ్యమైనంతవరకు పనులు చేశా. ఇవే మీకు చివరి అసెంబ్లీ ఎన్నికల అవుతాయి. బీజేపీ మన పార్టీని చీల్చారు. కానీ శివసేన(యూబీటీ) తుప్పపట్టిన కత్తికాదు. పదునైన ఆయుధం. మేము మహారాష్ట్ర, ముంబైని రక్షించడానికి పోరాడుతాం. బీజేపీ తగిన సమాధానం ఇస్తాం’’ అని అన్నారు. ఇక.. ఉద్ధవ్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. ఫడ్నవీస్ రాజకీయాలను ముగించే ముందు థాక్రే వంద జన్మలు ఎత్తాలని కౌంటర్ ఇచ్చింది. -
మిహిర్ షా : కటింగ్,షేవింగ్ చేసి.. రూటు మార్చి..పోలీసుల్ని ఏమార్చి!
ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా (24) పచ్చి తాగుబోతని (Habitual Drinker) పోలీసులు నిర్ధారించారు. హిట్ అండ్ రన్ కేసులో అరెస్టైన మిహిర్షాను విచారించగా ఈ విషయాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. జులై 7 ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల కావేరీ నఖ్వా మృతి చెందగా.. ఆమె భర్త ప్రదీప్ నక్వా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు.నిందితుడు తండ్రి మహరాష్ట్ర పాల్ఘర్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్గా ఉన్న రాజేష్ షా కావడంతో ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రంగంలోకి దిగారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అతడి ఆచూకీ కోసం 11 పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్ షాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నేను పెద్ద తప్పే చేశాతాజాగా, కేసు విచారణలో మిహిర్షా హిట్ అండ్ రన్లో మహిళ ప్రాణాలు తీసినందుకు పశ్చాతాపపడుతున్నట్లు సమాచారం. మహిళ ప్రాణం తీసి నేను పెద్ద తప్పే చేశా. నా కెరియర్ ఇక ముగిసిందని విచారణలో పోలీసుల ఎదుట విచారం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.కటింగ్, షేవింగ్ చేసిఇక కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు విశ్వప్రయత్నాలు చేశాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు మీసాలు, గడ్డాలు తొలిగించాడు. కటింగ్ కూడా చేయించుకున్నాడని బార్బర్ షాపు యజమాని ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. రాజేష్ షా అరెస్ట్.. బెయిల్పై విడుదలహిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా తండ్రి రాజేశ్ షాను పోలీసులు అరెస్ట్ చేసి ముంబై కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు రాజేష్ షా, డ్రైవర్ రాజరిషి బిదావత్లకు వరుసగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఒకరోజు పోలీసు కస్టడీ విధించింది. అయితే ఈ కేసులో రాజేష్ షాకు బెయిల్ లభించగా, బిదావత్ పోలీసు కస్టడీని జూలై 11 వరకు పొడిగించింది.కుమారుడు చేసిన ఘన కార్యం.. ముగిసిన తండ్రి పొలిటిక్ కెరియర్కుమారుడు మిహిర్ షా చేసిన ప్రమాదంతో రాజేష్ షా పొలిటికల్ కెరియర్ ఓ రకంగా ముగిసినట్లేనని శివసేన నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలగించినట్లుగా శివసేన వర్గాలు వెల్లడించాయి. పాల్ఘర్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్గా ఉన్న రాజేష్ షా హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. -
ముంబై హిట్ అండ్ రన్ కేసు: ఒళ్లు గగుర్పొడిచేలా.. వెలుగులోకి సంచలన విషయాలు
ముంబై : ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మిహిర్ షా బాధితురాలు కావేరీ నక్వాను కారు బానెట్పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.గత ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ముంబై వ్రోలి అనే ప్రాంతంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. స్థానిక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హిట్ అండ్ రన్ ఎలా జరిగిందో పోలీసులు కోర్టుకు వివరాలు అందించారుఈ కేసులో ప్రధాన నిందితుడైన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా.. పూటుగా మద్యం సేవించి ఉదయం చేపల మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తున్న కావేరీ నక్వా, పార్ధిక నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టాడు. బలంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్పై పడ్డారు. అలాగే కిలోమీటర్ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు. స్థానికుల సమాచారం, బాధితురాలి భర్త ఫిర్యాదు, సీసీటీవీ పుటేజీ వీడియోల ఆధారంగా ప్రమాదం తర్వాత మిహిర్ షా కారును వదిలేసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తప్పించుకునేందుకు అక్కడి నుంచి మరో ప్రాంతానికి పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. మిషిర్ షా ప్రియురాల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కాగా ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు మిహిర్ జుహూ ప్రాంతంలోని ఓ బారులో పీకల వరకు మద్యం సేవించినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఆ బార్లో నిందితుడు రూ.18వేల బిల్లు చేసినట్లు తేలింది.ప్రమాద సమయంలో కారులో మిహిర్తో పాటు అతడి డ్రైవర్ కూడా ఉన్నాడు. బార్ నుంచి ఇంటికి వెళ్తూ కారు తానే నడుపుతానని పట్టుబట్టి నిందితుడు డ్రైవర్ సీట్లోకి మారినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతుంది. కాగా,ఇదే కేసులో మిహిర్ మిషిర్ షా తండ్రి శివసేన నేత రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు సోమవారం సాయంత్రం రాజేష్ షాకు కోర్టు బెయిల్ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్ బెయిల్ను మంజూరు చేసింది. -
మద్యం మత్తులో బీభత్సం.. కేసు నుంచి అధికార పార్టీ నేత కుమారుణ్ని తప్పిస్తున్నారా?
ముంబై అధికార శివసేన పార్టీ నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా (24) హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం మిషిర్ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. అయితే ఈ కేసులో మిషిర్ షాను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మిహిర్ షా ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తున్న భార్య కావేరీ నక్వా,ఆమె భర్త పార్థిక్ నక్వా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితురాలు కావేరీ నక్వా మరణించగా.. భర్త పార్థిక్ నక్వా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుడున్నాడు.అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగే సమయంలో కారులో కారు డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్తో పాటు మిహిర్ షా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన మిహిర్ షా కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. డ్రైవర్ను బిజావత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికార పార్టీ నేత కుమారుడికి అనుకూలంగాహిట్ అండ్ రన్ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై వివాదం నెలకొంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద అంటే హత్యతో సమానం కాని నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. హిట్ అండ్ రన్ కేసులో సాధారణంగా నేరపూరిత నరహత్య, ర్యాష్ డ్రైవింగ్,సాక్ష్యాలను ధ్వంసం చేయడం మొదలైన వాటిపై కేసు నమోదు చేస్తారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మద్యం సేవించిన కారు డ్రైవర్ బిజావత్ నుంచి రక్త నమోనాలకు సేకరించారు.రిపోర్ట్స్ రావాల్సి ఉంది.వాళ్లు సమాజంలో పేరున్న పెద్దోళ్లు.. మనమేం చేయలేంరోడ్డు ప్రమాదంపై తన భార్య కావేరీ నక్వా మరణంపై ఆమె భర్త పార్థిక్ నక్వా కన్నీరు మున్నీరవుతున్నారు. ‘‘ఫిష్ మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న తమ వెహికల్ను బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. నా భార్య ఎగిరి 100 మీటర్ల అవతల పడింది. నాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో నా భార్యను కోల్పోయా. నాకు ఇద్దరు పిల్లలు. వారి సంరక్షణ ఎవరు చూసుకోవాలి. వాళ్లంటే సమాజంలో పేరున్న పెద్ద మనుషులు. వారిని ఎవరు ఏం చేయలేరు. చివరికి బాధపడాల్సి మనమే అంటూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన కారకుడైన మిహిర్ షా‘‘ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.పోలీసులు వెర్షన్ ఎలా ఉందంటే? బీఎండబ్ల్యూ కారు మిహిర్ షా పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మిహిర్ షా, డ్రైవర్ ఇద్దరు కారులో ఉన్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిహిర్ షా గత రాత్రి జుహులోని ఓ బార్లో మద్యం సేవించాడు. ఇంటికి వెళుతుండగా, డ్రైవర్ని లాంగ్ డ్రైవ్ చేయమని అడిగాడు. వర్లీ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న మిహిర్ షా.. కావేరీ నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సీఎం ఏక్ నాథ్ షిండ్ ఏమన్నారంటే?మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండ్ హిట్ అండ్ రన్ కేసుపై స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనని, ఆ విషయంలో ఎవరి పట్ల వివక్ష చూపబోమని, ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా.. నిందితులకు శిక్షపడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏక్ నాథ్ షిండ్ వెల్లడించారు. -
హిట్ అండ్ రన్ : మహిళ ప్రాణం తీసిన అధికార పార్టీ నేత కుమారుడు!
ఓ అధికార పార్టీకి చెందిన నేత కుమారుడి నిర్వాకంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు తన లగ్జరీ బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారుతో మహిళ, ఆమె భర్త ప్రయాణిస్తున్న స్కూటీని అతివేగంతో ఢీకొట్టాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితురాలు గాల్లోంచి ఎగిరి దూసుకెళ్లింది. 100 మీటర్ల అవతల పడిపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇంతకీ ఆ రాజకీయ నేత ఎవరు?ముంబై వర్లిలోని అట్రియా మాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30గంటల సమీపంలో బీఎండబ్ల్యూ కారు దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య కావేరీ నక్వా దుర్మరణం చెందగా.. భర్త పార్థిక్ నక్వా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఆ బీఎండబ్ల్యూ కారు ముంబై అధికార ఏక్ నాథ్ షిండ్ నేతృత్వంలోని శివసేన పార్టీ నేత రాజేష్ షాకి చెందినదిగా పోలీసులు గుర్తించారు.Hit and run case in Mumbai.A BMW car hit a scooty in the Worli area. One female dead.#Mumbai pic.twitter.com/rFdfir4pjF— Vivek Gupta (@imvivekgupta) July 7, 2024ప్రమాద సమయంలో మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా శివసేన నేత రాజేష్ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారును ఆయన కుమారుడు మిహిర్ షా డ్రైవ్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఆదివారం ఉదయం 5.30గంటల సమయంలో మిహిర్ షా తన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారుతో వ్రోలి ప్రాంతానికి వెళుతున్నాడు. అదే సమయంలో సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తున్న దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టారు.ఈ కారు ప్రమాదంతో బాధితురాలు గాల్లోకి దూసుకెళ్లింది. సుమారు 100 మీటర్ల అవతల పడిపోవడంతో తీవ్రగాయాల పాలైంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం నాయర్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న భార్య మరణించగా.. భర్తకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కారు ఎవరిదో.. నిర్ధారించే పనిలో పోలీసులు మరోవైపు రోడ్డు ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును వ్రోలీ పోలీసులు సీజ్ చేశారు. ఈ కారు ఎవరిది? శివసేన పార్టీ నేత రాజేష్ షాకి చెందినదేనా? ప్రమాదానికి కారకులు ఎవరనేది త్వరలో నిర్ధారిస్తామన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీఎం షిండే ఆగ్రహం.. పోలీస్ శాఖకు ఆదేశాలుతన పార్టీకి చెందిన నేత కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో ఓ మహిళ ప్రాణాలు పోయిందంటూ అటు జాతీయ మీడియా, ఇటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో ముంబై సీఎం ఏక్నాథ్ షిండ్ స్పందించారు. ప్రమాదానికి కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వ్రోలీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
Sanjay Raut: టీడీపీ స్పీకర్ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది
ముంబై: లోక్సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్తో ఎన్నికల్లో విజయం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలోన్ మస్క్ చర్చకు తెర లేపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు, లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికి వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్లో పేర్కొన్నారు. భారత్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them. Serious concerns are being raised about transparency in our electoral process.Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024 దేశంలోని ఈవీఎంలను‘బ్లాక్ బాక్స్’అని అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్నిఉదహరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘భారత్లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు.మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసానికి గురవుతుందన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాల్ని ట్వీట్ చేశారు.ఫోన్తో ఈవీఎంను అన్ల్యాక్ చేసిన ఎన్డీఏ అభ్యర్థి!ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ లోక్సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. అందుకు జూన్ 4న రెస్కో పోలింగ్ కౌంటింగ్ సెంటర్ బయట ఎంపీ రవీంద్ర వైకర్ బావ మంగేష్ పన్హాల్కర్ ఫోన్ వినియోగించారు. ఆ ఫోన్ వినియోగించడం వల్లే రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్కు మంగేష్ పన్హాల్కర్కు ఫోన్కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్లో ఓటీపీ సాయంతో కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్ ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగేష్ ఫన్హాల్కర్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజానిజాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈవీఎంలను నిషేధించాలంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాటిని ఎవరు కనెక్ట్ చేయలేరు. కనెక్టివిటీ లేదు, బ్లూటూత్, వైఫై,ఇంటర్నెట్ను వినియోగించలేరని అన్నారు.We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh— Elon Musk (@elonmusk) June 15, 2024 -
Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
మహారాష్ట్రలో ‘మహా’ కూటముల కొట్లాట కాక రేపుతోంది. యూపీ తర్వాత అత్యధికంగా ఇక్కడ 48 లోక్సభ స్థానాలుండగా తొలి మూడు దశల్లో 24 సీట్లలో పారీ్టల భవితవ్యం ఈవీఎంలలోకి చేరిపోయింది. నాలుగో అంకంలో 13న రాష్ట్రంలో మరో 11 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ (మహాయుతి), ఇండియా (మహా వికాస్ అగాడీ) కూటములు హోరాహోరీగా తలపడుతున్న కీలక నియోజకవర్గాలపై ఫోకస్... ఔరంగాబాద్... మజ్లిస్ మేజిక్! కాంగ్రెస్, శివసేనలకు కంచుకోటగా నిలిచిన ఈ స్థానంలో గత లోక్సభ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. శివసేన నుంచి వరుసగా నాలుగుసార్లు విక్టరీ కొట్టిన చంద్రకాంత్ ఖైరే మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ ఇంతియాజ్ జలీల్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూశారు. 97 ఏళ్ల మజ్లిస్ చరిత్రలో తెలంగాణ వెలుపల ఇదే తొలి ఎంపీ స్థానం! 1980 తర్వాత ఔరంగాబాద్లో మైనారిటీ గెలుపొందడం అదే ప్రథమం. స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ జాధవ్కు ఏకంగా 2.8 లక్షల ఓట్లు పోలవడం ఖైరే ఓటమికి ప్రధాన కారణం. మజ్లిస్ మళ్లీ జలీల్నే బరిలోకి దించింది. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున శివసేన (ఉద్దవ్) అభ్యరి్థగా ఖైరే కూడా పోయిన చోటే వెతుక్కుంటున్నారు. ఇక అధికార మహాయుతి కూటమి తరఫున శివసేన (షిండే) అభ్యర్థి సందీపన్రావ్ భూమ్రే బరిలో ఉన్నారు. ఆయన బలమైన మరాఠ్వాడా నేత. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ చేశారు. మరాఠా రిజర్వేషన్ల పోరుతో మరాఠ్వాడా ప్రాంతంలో ఎంతో పేరు సంపాదించిన హర్షవర్ధన్ ఈసారి కూడా ఇండిపెండెంట్గా ప్రధాన పార్టీలకు సవాలు విసురుతున్నారు. ప్రకాశ్ అంబేద్కర్ వంచిత బహుజన్ అగాడీ నుంచి అఫ్సర్ ఖాన్ పోటీలో ఉన్నారు. 32 శాతం ముస్లిం జనాభా ఉన్న ఔరంగాబాద్లో ఈసారి చతుర్ముఖ పోరులో ఎలాంటి సంచలనం నమోదవుతుందోనన్న ఆసక్తి నెలకొంది.జాల్నా... రావ్సాహెబ్ డబుల్ హ్యాట్రిక్ గురి ఇది బీజేపీకి మరో కంచుకోట. 1999 నుంచి వరుసగా ఐదుసార్లు విజయ ఢంకా మోగించిన రావ్సాహెబ్ దన్వే పాటిల్ డబుల్ హ్యాట్రిక్ లక్ష్యంగా మరోసారి బరిలో నిలిచారు. మోదీ రెండు విడతల్లోనూ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న దన్వే గత ఎన్నికల్లో 3.3 లక్షల పైగా మెజారిటీతో గెలిచారు. గత రెండు పర్యాయాలూ బీజేపీని ఢీకొన్న విలాస్ ఔతాడేను కాంగ్రెస్ ఈసారి పక్కనపెట్టింది. 2009లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చి కేవలం 8,482 ఓట్ల తేడాతో ఓడిన కల్యాణ్ విజినాథ్ కాలేను రంగంలోకి దించింది.పుణె.. మాజీ మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే ఇక్కడ గత రెండుసార్లూ బీజేపీదే విజయం. అయితే సిట్టింగ్ ఎంపీ గిరీశ్ బాపట్ గతేడాది మరణించడంతో పుణె మాజీ మేయర్ మురళీధర్ కిశాన్ మాహోల్కు ఈసారి బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ను బరిలో నిలిపింది. పుణె లోక్సభ స్థానం పరిధిలోని కస్బాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గతేడాది జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యరి్థని ధంగేకర్ మట్టికరిపించడం విశేషం. 28 ఏళ్లుగా కాషాయ జెండా ఎగురుతున్న ఈ సీటు చేజారడం కమలనాథులకు భారీ షాకే. ఇదే జోరుతో పుణె లోక్సభ స్థానాన్నీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది.షిర్డీ... శివసేన కుస్తీ 2009లో ఉనికిలోకి వచి్చనప్పటి నుంచీ ఇది శివసేన ఖాతాలోనే పడుతోంది. గత రెండు ఎన్నికల్లో నెగ్గిన సదాశివ లోఖండే ఇప్పుడు శివసేన (షిండే) వర్గం నుంచి మహాయుతి అభ్యరి్థగా హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. షిర్డీ తొలి ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత భావుసాహెబ్ రాజారామ్ వాక్చౌరే ఎంవీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. రెండు శివసేన వర్గాలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఈ స్థానం కోసం పట్టుబట్టినా సీఎం షిండే మోకాలడ్డారు. అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వీబీఏ అభ్యర్థి ఉత్కర్‡్ష రూపవతి ఎవరి ఓట్లకు గండి పెడతారన్నది ఆసక్తికరం! బీడ్.. పంకజకు రిజర్వేషన్ సెగ ఈ స్థానం బీజేపీ దుర్గం. దివంగత గోపీనాథ్ ముండే కుటుంబానికి గట్టి పట్టున్న స్థానం. ఈసారి అదే కుటుంబం నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే బదులు అక్క, మాజీ మంత్రి పంకజా ముండేను బీజేపీ బరిలోకి దించింది. అయితే మారాఠా రిజర్వేషన్లపై అట్టుడుకుతున్న ఈ నియోజకవర్గంలో మహాయుతి కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో పంకజ ఎదురీదాల్సిన పరిస్థితి! అయితే 2019లో పర్లీ అసెంబ్లీ స్థానంలో పంకజను ఓడించిన సోదరుడు ఎన్సీపీ (అజిత్) నేత ధనంజయ్ ముండే దన్నుగా నిలవడం ఆమెకు కలిసొచ్చే అంశం. 2019లో 5 లక్షల పై చిలుకు ఓట్లతో ప్రీతం మెజారిటీకి భారీగా గండికొట్టిన భజరంగ్ మనోహర్ సోన్వానే ఎంవీఏ కూటమి నుంచి ఎన్సీపీ (శరద్) టికెట్పై బీజేపీకి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న దంగర్ సామాజిక వర్గం ఎప్పటి నుంచో ఎస్టీ రిజర్వేషన్లు డిమాండ్ చేస్తోంది. మరాఠా కోటా, ఈ ఎస్టీ హోదా డిమాండ్లు ఎవరిని ముంచుతాయన్నది ఆసక్తికరం. జల్గావ్... టఫ్ ఫైట్ రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ పాతుకుపోయిన కమలనాథులకు ఈసారి మహా వికాస్ అగాడీ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ నేత ఉన్మేశ్ పాటిల్ 4 లక్షల పైగా బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టారు. అయినా ఈసారి ఆయన్ను కాదని స్మితా వాఘ్కు బీజేపీ టికెటిచ్చింది. ఎంవీఏ నుంచి శివసేన (ఉద్దవ్) నేత కరన్ బాలాసాహెబ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. గతంలో గట్టి పోటీ ఇచి్చన ఎన్సీపీ (శరద్) దన్నుండటం కరన్కు కలిసొచ్చే అంశం. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లూ మహాయుతి కూటమి చేతిలోనే ఉన్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జూన్ 4 తర్వాత జరిగేది ఇదే.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్4 లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం డూబ్లికేట్ ఎన్సీపీ, డూబ్లికేట్ శివసేన తమ పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు.నార్త్ మహరాష్ట్ర నందూర్బర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై సెటైర్లు వేశారు.ఓ పెద్దాయన 40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఓ పెద్దాయన జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం.. రాజకీయ ఉనికి కోసం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని చూస్తున్నారని అన్నారు.నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులోనకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో తమ పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయాలనే ఉందనే కదా దీనర్ధం. కాంగ్రెస్లో విలీనం చేసిన రాజకీయ నిరుద్యోగులుగా మిగిలే బదులు.. వచ్చి అజిత్ పవర్, ఎక్నాథ్ షిండ్తో చేతులు కలిపితే బాగుంటుందని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కుఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో శరద్ పవార్ విలీనంపై మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు దగ్గర కానున్నాయి. అంతేకాదు తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్లోనే విలీనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ విలీనం వ్యాఖ్యలపై మోదీ స్పందించినట్లు తెలుస్తోంది. -
బీజేపీ కూటమి.. ఆ ఆరు స్థానాల్లో ఎవరు?
లోక్సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ మరో నాలుగు రోజులున్నా.. ఇంకా మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మరో ఆరు సీట్ల అభ్యర్థుల కేటాయింపు పెండింగ్లో ఉంది. ఆ ఆరు కీలక స్థానాల్లో మహాయుతి కూటమి పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోతోందని పార్టీల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఇవే ఆ ఆరు స్థానాలు.. దక్షిణ ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరి-సింధుదుర్గ్ సీటు, నాసిక్ ఔరంగాబాద్. నాసిక్ సీటులో ఎన్సీపీ( అజిత్ పవార్) పార్టీ తరఫున మాజీ మంత్రి ఛగన్ భుజబల్ను ప్రతిపాధించగా.. సీఎం ఏక్నాథ్ షిండే(శివసేన) ఆ స్థానాన్ని వదులకోవడానికి సిద్ధం లేనట్టు తెలుస్తోంది. నాసిక్ స్థానం శిశసేన సిట్టంగ్ స్థానం. అక్కడ ఎంపీగా హేమంత్ గాడ్సే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడుగుపెడతారని ఇటీవల కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం పార్టీ కార్యకర్తల మీటింగ్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్ నుంచి శివసేన అభ్యర్థి బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించటం గమనార్హం. థానే, రత్నగిరి-సింద్దుర్గ్ రెండు స్థానాల్లో బీజేపీనే పోటీ చేయాలని భావించినప్పటికీ.. తర్వాత తన ఆలోచనను విరమించుకొని థానే సీటును శివసేన( షిండే)కు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉమ్మడి శివసేన అభ్యర్థిగా 2019లో రాజన్ విచారే గెలుపొందారు. శివసేన పార్టీ చీలిన తర్వాత ఆయన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నారు. అయితే శివసేనకు కంచుకోట అయిన థానే స్థానాన్ని షిండే వదలుకుకోవడాని సిద్ధంగా లేరని సమాచారం. అయితే థానేకు బదులు రత్నగిరి-సింద్దుర్గ్ను శివసేన బీజేపీకి ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నారాయణ రాణేను బరిలోకి దించాలని యోచిస్తోంది. పాల్ఘర్ స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. 2019లో శివసేన గెలిచే వరకు పాల్ఘర్ బీజేపీ పట్టున్న స్థానం. ఇప్పటికే పలు స్థానాలను వదులుకున్న శవసేన.. సౌత్ ముంబై స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. సీఎం షిండే శివసేన మొదట్లో ముంబైలో మొత్తం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అందులో ఇద్దరిని మార్పు చేశారు. నాలుగురికి టికెట్ తిరస్కరించింది. సీట్ల విషయంలో శివసేన ఒత్తిడిలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేనకు బలం ఉన్న ముంబై, ఇతర సీట్లను వదులుకోవడాని సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈసారి సౌత్ ముంబై, థానే, రత్నగిరి సింద్దుర్గ్, నాసిక్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన ఈ సీట్లను వదులుపోవడానికి సిద్ధంగా లేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ సిట్లలో ఎవరికి దక్కుతాయో కొలిక్కి రానుంది. ఇక.. అజిత్ పవార్ ఎన్సీపీ ఆశిస్తున్న నాసిక్ సీటు సైతం షిండే(శివసేన) దక్కించుకోనున్నట్లు సమాచారం.థానే సీటును ఏక్నాథ్ షిండే దక్కించుకునే అవకాశం ఉందని.. రత్నగిరి-సింధుదుర్గ్ సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘శివసేన, ఎన్సీపీ పార్టీల చీలికకు కారణం వారిపై ప్రేమ’
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీల చీలికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు తమ సొంత పార్టీల నుంచి చీలిపోవడానికి కోడుకు, కూతురి మీద చూపించిన ప్రేమే కారణమని అన్నారు. ఆదివారం భండారా జిల్లాలోని సకోలి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకంలో విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ పార్టీలను విభజిస్తుందన్న ఆరోపణలపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ‘శివసేన, ఎన్సీపీల్లో చీలికలు రావడానికి కారణం ఉద్ధవ్కు కొడుకు మీద, శరద్ పవార్కు కూతురు మీద ప్రేమే కారణం. కూటమిలోని మూడు పార్టీ మహారాష్ట్రకుఘ ఏం మంచి చేశారు’ అని అమిత్ షా ధ్వజమెత్తారు. మరోవైపు.. ఇటీవల ప్రధాని నరేంద్ర ఎన్నికల ప్రచారం పాల్గొని శివసేన(ఉద్ధవ్) పార్టీపై నకిలీ శివసేన అంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవల అమిత్ షా.. మహా వికాస్ ఆఘాడీను సరిపోలని విడి భాగాలతో కూడిన ఆటో రిక్షాతో పోల్చుతూ విమర్శలు చేశారు. ఇక.. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సాంగ్లీ, భీవండి, ముంబై సౌత్ సెంట్రల్ స్థానాలను కాంగ్రెస్ వదులుకున్న విషయం తెలిసిందే. సీట్ల పంపకంలో భాగంగా శివసేన(ఉద్ధవ్) 21 స్థానాలు,ఎన్సీపీ 10 స్థానాలు, కాంగ్రెస్ పది స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
శివసేన మోదీ డిగ్రీలా నకిలీ కాదు: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన నకిలీ శివసేన ఆరోపణలపై శివసేన( ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. మరాఠా భూమి పుత్రుల హక్కుల కోసం పోరాడటానికి బాలా సాహేబ్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారని అన్నారు. ‘మరాఠా భూమి పుత్రుల హక్కుల పోరాటం కోసం దివంగత నేత బాల్ ఠాక్రే శివసేనను స్థాపించారు. శివసేన పార్టీనే నకిలీ అంటే.. నరేంద్ర మోదీకి ఉన్న డిగ్రీ కూడా నకిలీనే’ అని ఉద్ధవ్ మండిపడ్డారు. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి 300 సీట్లను గెలుచుకుందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మహారాష్ట్రలోని ఓ ర్యాలీలో పాల్గొని ఉద్ధవ్ (శివసేన)పై విమర్శలు చేశారు. ఉద్ధవ్ శివసేన.. నకిలీ శివసేన పార్టీ అని అన్నారు. ‘ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పార్టీ డీఎంకే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చింది. కాంగ్రెస్, నకిలీ శివసేన(ఉద్ధవ్) కూడా మహారాష్ట్రలో ర్యాలీల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు’ అని ప్రధాని మండిపడ్డారు. ఇక..2022లో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసింది. ఏక్నాథ్ షిండే పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. అతనోపాటు వచ్చిన కొందరికి మంత్రి పదవులు కూడా కేటాయించారు. అసలైన శివసేన పార్టీ ఎవరిదని ఉద్ధవ్, షిండే వర్గాలు పిటిషన్లు వేశాయి. దీంతో కోర్టు అనుమతిలో ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. -
రాజ్ఠాక్రేపై ఏ ఫైల్ ఓపెన్ చేశారు: సంజయ్ రౌత్
ముంబై: లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ఠాక్రేపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్ ఠాక్రేపై ఏదో ఫైల్ ఓపన్ చేశాని.. అందుకే ఒక్కసారిగా బీజేపీకి తన మద్దతు ప్రకటించారని సంజయ్ రౌత్ అన్నారు. ‘ఒక్కసారిగా ఏదో విచిత్రం జరిగింది. మేము ఈ విషయాన్ని రాజ్ఠాక్రేను అడగదలుచుకున్నాం. ఒక్కసారిగా మారిపోయి మహారాష్ట్ర శత్రువుల(ప్రత్యర్థుల)వైపు చేరి పూర్తి మద్దతు ఇస్తున్నారు. మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? ఇలా చేయటం వెనక ఉన్న బలమైన కారణం ఏంటీ? మీ మీద ఏ ఫైల్ ఓపెన్ చేశారు?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సోదరుడైన రాజ్ ఠాక్రే... తన పార్టీ బీజేపీ, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ (ఎన్సీపీ) కూటమికి సంపూర్ణ మద్దత ఇస్తుందని ప్రకటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ ఠాక్రే.. తన పార్టీ కేవలం ప్రధాని నర్రేందమోదీ, ఎన్డీయే కూటమికే మాత్రమే మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు 1990 నుంచి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మొదటి నుంచి నరేంద్ర మోదీ.. ప్రధాని అవుతారన్న వారిలో తాను ఒకరినని చెప్పారు. ఇక.. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మహావికాస్ ఆఘాడీ కూటమి మధ్య సీట్లు పంపిణీ ఖరారైన విషయం తెలిసిందే. శివసేన (యూబీటీ)కి -21,కాంగ్రెస్- 17, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)-10 సీట్లుతో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. -
మహారాష్ట్రలో కూటమి సీట్ల పంపిణీ ఖరారు.. ఏ పార్టీకి ఎన్ని?
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ ఎట్టకేలకు మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఇండియా కూటమి సీట్ల పంపిణీ ఒప్పందం కుందిరింది. ఈ మేరకు మంగళవారం మహావికాస్ఆఘాడీ నేతలు సంయుక్తంగా ప్రకటించారు. శివసేన(యూబీటీ) 21 సీట్లు, కాంగ్రెస్పార్టీ 17 సీట్లు, ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) 10 సీట్లతో లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. మొదటి నుంచి ఆశించిన సంగాలి లోక్సభ నియోజకవర్గాన్ని శివసేన(యూబీటీ) దక్కించుకోగా.. భీవండి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మరోవైపు శివసేన(యూబీటీ)కి పట్టు ఉన్న ముంబై నార్త్ స్థానాన్ని సీట్ల పంపిణీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవటం గమనార్హం. సీట్ల పంపిణీ అనంతం శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘ప్రతిఒక్కరు అన్ని సీట్లలో గెలవడానికి తీవ్రంతా పోరాడాలి. పోరాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా అన్ని సీట్లలో గెవడానే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి’ అని ఉద్ధవ్ అన్నారు. మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే కొన్ని కీలకమైన సీట్ల విషయంలో మహా వికాస్ ఆఘాడీ కూటమి సీట్ల పంపకం కొంత జాప్యమైన విషయం తెలిసిందే. -
‘కళ్యాణ్’ స్థానంలో మళ్లీ సీఎం కుమారుడే పోటీ
ముంబై: లోక్సభ ఎన్నికల్లో కళ్యాణ్ నియోజకవర్గంలో ఎట్టకేలకు సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే మరోసారి బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ప్రకటించారు. కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించారు. అయితే ఇవాళ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా కళ్యాణ్ స్థానంలో శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారని ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల్లో శ్రీకాంత్ షిండే గెలుపు కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. నాగ్పూల్లో బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సం సందర్భంగా ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ‘కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మళ్లీ శ్రీకాంత్ షిండే బరిలో దిగుతున్నారు. ఆయన్ను ఓడించేందుకు తమకూటమకి ప్రతిపక్షమే లేదు. కళ్యాణ్ స్థానంలో శవసేన (ఏక్నాథ్ షిండే) పార్టీ బరిలోకి దిగుతుంది. అభ్యర్థిగా ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారు’ అని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. శ్రీకాంత్ షిండే.. ఇప్పటికే కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో రెండుసార్లు (2014, 2019) పోటిచేసి విజయం సాధించారు. ఇక.. ఇప్పటికే ‘జ్వలించే టార్చ్’ గుర్తును సొంతం చేసుకున్న శివసేన (యూబీటీ) ఇప్పటికే 21 స్థానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే వింధంగా షిండే వర్గం 9 స్థానాలు, బీజేపీ 24 స్థానాలు, ఎన్సీపీ( అజిత్ పవార్)- 4, రాష్ట్రీయా సమాజ్ పక్షా-1 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కూటమి మరో 10 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 20 పోలింగ్ జరిగి.. జూన్ 4ను ఫలితాలు విడుదల కాన్నాయి. -
Sanjay Nirupam: కొంప ముంచిన విమర్శలు.. ఆరేళ్లపాటు బహిష్కరణ
ముంబై: లోభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న మాజీ ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నేత సంజయ్ నిరూపమ్పై వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ‘సంజయ్ నిరూపమ్ క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్సెక్రటరీ కేసీ వేణు గోపాల్ వెల్లడించారు. అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి కూడా పేరును కాంగ్రెస్ పార్టీ తొలగించింది. మాజీ లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ పనిచేసిన సంజయ్ నిరూపమ్.. ఇటీవల సీట్ల పంపిణీ విషయంలో ‘మహావికాశ్ ఆఘాడీ కూటమి’లోని శివసేన(యూబీటీ) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: అభ్యర్థుల ప్రకటన.. ఉద్ధవ్ వర్గంపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బహిష్కరించిన తర్వాత ఎక్స్ వేదికగా సంజయ్ నిరూపమ్ స్పందించారు. ‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ తనను తాను రక్షించుకోవడానికి మరింత శక్తిని కూడదీసుకోవాలి. నేను పార్టీకి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. తదుపరి నా కార్యాచరణను తెలియజేస్తాను’ అని ట్వీట్ చేశారు. మహావికాశ్ ఆఘాడీ కూటమిలో భాగంగా ముంబైలోని ఆరు స్థానాల్లో నాలుగు సీట్లను శివసేన (యూబీటీ)కి కేటాయించటంపై కాంగ్రస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తాను పోటీ చేద్దామని భావిస్తున్న ముంబై నార్త్ వెస్ట్ స్థానం శివసేన (యూబీటీ) దక్కటంపై సొంతపార్టీపైనే విమర్శల దాడికి దిగారు. అయితే 2014 లోక్సభ ఎన్నికలో పోటీ చేసిన సంజయ్ నిరూపమ్ సమీప బీజేపీ అభ్యర్థి గోపాల్శెట్టి చేతిలో ఓటమిపాలయ్యారు. -
శివసేన(యూబీటీ) తొలి జాబితా విడుదల.. 17 మందికి చోటు
ముంబై:లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ శివసేన (యూబీటీ) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే.. 17 మంది అభ్యర్థులను శివసేన(యూబీటీ) బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీనేత సంజయ్ రౌత్ జాబితాను ఎక్స్లో పోస్ట్ చేశారు. కీలకమైన ముంబై సౌత్ సెంట్రల్ పార్లమెంట్ స్థానాన్ని శివసేన (యూబీటీ) అనిల్ దేశాయ్కి కేటాయించింది. ఐదు సిట్టింగ్ అభ్యర్థులకు శివసేన(యూబీటీ) మళ్లీ అవకాశం కల్పించింది. ముంబై సౌత్- అరవింద్ సావంత్, ముంబై నార్తీస్ట్- సంజయ్ పాటిల్, ముంబై నార్ట్ వెస్- అమోల్ కిర్తికార్, థానే- రాజన్ విచారే, వినాయక్ రౌత్- రత్నగిరి సింధ్దుర్గ్, పర్బానీ-సంజయ్ జాదవ్, ఉస్మానాబాద్- ఓంరాజే నింబాల్కర్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా శివసేన (యూబీటీ) ఔరంగాబాద్లో మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరేను బరిలోకి దింపుతోంది. మాజీ కేంద్ర మంత్రులు అనంత్ గీతే( రాయ్గఢ్), అరవింద్ సావంత్(దక్షిణ ముంబై) నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.మహావికాస్ ఆఘాడీ భాగస్వామి కాంగ్రెస్ పట్టుబట్టిన సాంగ్లీ స్థానం నుంచి ఇటీవల పార్టీలో చేరిన రెజ్లర్ చంద్రహర్ పాటిల్ను పోటీకి దింపింది శివసేన(యూబీటీ). ముత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమై.. ఐదు విడతల్లో పోలింగ్ జరగనుంది. हिंदूहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या आशीर्वादाने आणि शिवसेना पक्ष प्रमुख श्री.उद्धवजी ठाकरे यांच्या आदेशाने शिवसेनेच्या 17 लोकसभा उमेदवारांची यादी जाहीर करण्यास येत आहे.. *मुंबई दक्षिण मध्य:श्री अनिल देसाई यांच्या उमेदवारीची घोषणा करण्यात येत आहे. इतर 16 उमेदवार… pic.twitter.com/nPg2RHimSF — Sanjay Raut (@rautsanjay61) March 27, 2024 -
‘అవును.. ఆ రెండు పార్టీలను చీల్చే మేం అధికారంలోకి వచ్చాం’
సాక్షి,ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచార స్లోగన్ ‘ఐ విల్ బి బ్యాక్’ గురించి ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న దేవేంద్ర ఫడ్నవీస్ రచయిత ప్రియమ్ గాంధీ-మోదీతో 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. తాను ఐ విల్ బి బ్యాక్ అంటూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిచ్చాను. రెండోసారి అధికారంలోకి వస్తామని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ కూటమిని చీల్చి అధికారంలోకి వచ్చాం. ఇదంతా చేయడానికి రెండున్నరేళ్లు పట్టిందని అన్నారు. అదే ఎన్నికల్లో ‘బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంది.శివసేన (2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే మాకు ద్రోహం చేశారు. ఫలితంగా మేం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాజకీయ పరిణామాలతో ఆ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఎంపికయ్యారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ కూటమి కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ, శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గం, ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గాలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఆ కూటమిలో మహరాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు కొనసాగుతున్నారు. -
ఎలక్టోరల్ బాండ్లపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఈడీ, సీబీఐ దాడులు జరిపిన సంస్థలే ఈ ఎలక్టోరియల్ బాండ్లను కొనుగోలు చేయడంపై ఆయా పార్టీలకు చెందిన నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఎలక్టోరల్ బాండ్పై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల ప్రధాన లబ్ధిదారుగా బీజేపీ ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ ద్వారా గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడం, నిధులను నేరుగా ఆయా పార్టీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా..గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కార్పొరేషన్ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అవి అధికార పార్టీ బీజేపీ అకౌంట్లలో జమవుతాయి. ఇలాంటివి గతంలో చాలానే జరిగాయి. ఎలక్టోరల్ బాండ్లలో డబ్బును కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు బదిలీ చేసిన కంపెనీలకు ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కంపెనీలపై ఇటీవల జరిగిన ఈడీ దాడులకు, ఆ తర్వాత బాండ్ల కొనుగోలుకు మధ్య సంబంధాన్ని సూచించారు. ప్రజలు ఇలాంటి వాటిని నిత్యం గమనిస్తూనే ఉన్నారు. ఈడీ దాడులు చేస్తుంది. కొన్ని గంటల తర్వాత, ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తారని మండిపడ్డారు. -
ఉద్ధవ్ ఠాక్రేకు రాహుల్ గాంధీ ఫోన్.. సీట్ల పంపకంపై చర్చ!
ముంబై: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకం కసరత్తు విషయంలో వేగం పెంచుతోంది. ఈ క్రమంలో శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసిన సుమారు గంటసేపు మాట్లడినట్లు తెలుస్తోంది. భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ మాట్లాడటంపై ఇరు పార్టీల్లో సీట్ల పంపంకంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ముంబైలోని ఆరు లోక్సభ స్థానాల్లో.. ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్త్ సగ్మెంట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ సెంట్రల్ సీట్లను కలుపుకొని మొత్తం 18 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ సీట్ల సర్దుబాటు ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) మధ్య సీట్ల పంపకంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సీట్ల పంపకంపై మాట్లాడినట్లు సమాచారం. మహారాష్ట్రలోని 48 సీట్లలో 8 సీట్ల విషయంలో ఉన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఉద్ధవ్కు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి శివసేన గత 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో 48 సీట్లకు గాను 22 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. శివసేనలో చీలిక వచ్చి కొంత మంది ముఖ్యనేతలు ఏక్నాథ్షిండే వర్గంలో ఉండి బీజేపీలో చేరారు. అదే విధంగా మహాఘట్బంధన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఎన్సీపీలో సైతం చీలికలు వచ్చి అజిత్ పవార్ వర్గం బీజేపీలో చేరింది. మరోవైపు ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అశోక్ చవాన్, మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శివసేనతో సీట్ల పంపకం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్తో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఠాక్రేకు రాహుల్ కాల్ చేయటం చర్చనీయాంశంగా మారింది. -
విధేయతే లేదు.. కేవలం రాజకీయమే: సంజయ్ రౌత్
ముంబయి: కాంగ్రెస్ పార్టీని వీడిన మిలింద్ దేవరాపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. ప్రస్తుత రోజుల్లో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీకి విధేయత అనేది ఉనికిలో లేదని చెప్పారు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరా గురించి కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం ఏం చేయాలో తెలిసిన గొప్ప నాయకుడని కొనియాడారు. " విధేయత, భావజాలం వంటి అంశాలు ఇప్పుడు లేవు. రాజకీయాలు ఇప్పుడు కేవలం అధికారం గురించి మాత్రమే నడుస్తున్నాయి. నాకు మిలింద్ దేవరా తెలుసు.. ఆయన పెద్ద నాయకుడు. కాంగ్రెస్తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు." అని కాంగ్రెస్కు మిలింద్ దేవర రాజీనామా చేయడంపై రౌత్ మాట్లాడారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా నెలరోజుల ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడు మిలింద్ దేవరా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, శివసేన (యుబిటి)ల మధ్య సీట్ల పంపకాల చర్చలపై ఆయన కలత చెందినట్లు సమాచారం. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మిలింద్ దేవరా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
ఆ సమయంలో ఏది సరైందో అదే చేశా! మహారాష్ట్ర మాజీ గవర్నర్
మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు నాటి మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటి గవర్నర్ 80 ఏళ్ల భగత్ సింగ్ కోష్యారీని మీడియా ప్రశ్నించగా..నన్ను శిక్షించిందని అనుకోవడం లేదని తెలివిగా సమాధానమిచ్చారు. కారణం తాను రాజీనామా చేశానని, మాజీ గవర్నర్కు శిక్ష విధిస్తారని తాను అనుకోవడం లేదంటూ కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. ఒక వేళ శిక్ష విధిస్తే తాను అప్పీల్ చేసి ఉండేవాడినంటూ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు కోష్యారీ. ఐతే తాను ఆ సమయంలో ఏది సరైనదో అదే చేశానని అన్నారు. అయినా సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించడం జర్నలిస్టులు, లాయర్ల పని అని సెటైరికల్ సమాధానమిచ్చారు. పైగా సుప్పీంకోర్టు ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టిన విషయానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా తప్పించుకునే థోరణితో సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, నాటి ఘటనలో ఉద్ధవ్ థాక్రే మెజారిటీ కోల్పోయారని గవర్నర్ నిర్ధారణకు వచ్చేయడం కూడా సరికాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. పైగా గవర్నర్ అలా నిర్ణయించడం రాజ్యంగ విరుద్ధమని, పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం కూడా రాజ్యాంగ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. మాజీ సీఎం థాక్రే బలపరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారని అందువల్లే ప్రభుత్వాన్ని పునురుద్ధరించలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కాగా, నాటి గవర్నర్ కోష్యారీ మాత్రం తన నిర్ణయం గురించి ఎటువంటి విచారం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. (చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం: సుప్రీం కోర్టు) -
మేఘాలయలో బీజేపీ బిగ్ ప్లాన్.. ఉద్దవ్ థాక్రే సంచలన కామెంట్స్!
ముంబై: ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి బీజేపీతో సహ ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక, అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో, మేఘాలయలో రాజకీయాలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఉద్దవ్ థాక్రే ఆదివారం.. మహారాష్ట్రలోని ఖేడ్ పట్టణంలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో నేను ముఖ్యమంత్రిని కావడం కోసం నేను ఎన్సీపీ, కాంగ్రెస్ బూట్లు నాకానని పుణెలో అమిత్ షా అన్నారు. ఇప్పుడు వాళ్లు మేఘాలయాలో ఏం చేస్తున్నారు? అంటూ విమర్శలు చేశారు. గో మూత్రం చల్లడం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా?. స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పిస్తే మనకు స్వాతంత్య్రం వచ్చిందని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పటేల్.. ఆర్ఎస్ఎస్ను నిషేధించారని అన్నారు. కానీ, ఆయన పేరును కూడా బీజేపీ వాడుకుంటోంది. అదే విధంగా సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా వాళ్లు దొంగిలించారు. వాళ్లు శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పేరుతో ఓట్లు అడగాలని నేను సవాల్ చేస్తున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు. శివసేన బాణం-విల్లు గుర్తుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తప్పు. మా నుంచి పార్టీ పేరు, గుర్తును లాగేసుకున్నారు. కానీ, శివసేనను నా నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
ఏక్నాధ్ షిండేకే విల్లు-బాణం
-
కూటమికి బీటలు..
-
మహారాష్ట్రకు కొత్త సీఎం.. ఫోటోలు వైరల్!
ముంబై: ఏక్నాథ్ శిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వర్గంతో మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో కొన్ని ఫోటోలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో.. ఏక్నాథ్ షిండే కుమారుడు, లోక్సభ ఎంపీ శ్రీకాంత్ షిండే కూర్చోవటం వివాదానికి దారి తీసింది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సూపర్ సీఎం: ఎన్సీపీ శివసేన వ్యవస్థాపకులు బాలా సాహేబ్ థాక్రే ఫోటో ముందు ఉన్న కుర్చీలో శ్రీకాంత్ షిండే కూర్చున్న చిత్రాలను ట్వీట్ చేశారు ఎన్సీపీ అధికార ప్రతినిధి రవికాంత్ వార్పే. ఆ కుర్చి వెనకాలే ఉన్న బోర్డుపై ‘మహారాష్ట్ర ప్రభుత్వం- ముఖ్యమంత్రి’ అని రాసి ఉంది. ఈ క్రమంలో సూపర్ సీఎం అంటూ పేర్కొన్నారు రవికాంత్. ఇది ఎలాంటి రాజధర్మమని ప్రశ్నించారు. మరోవైపు.. సీఎం కుర్చీపై జోకులు వేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు తన సానుభూతి తెలుపుతున్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు శివసేన నాయకురాలు ప్రియాంక ఛతుర్వేది. ఆధిత్య థాక్రే ఒక మంత్రిగా ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటే వారికి సమస్య అనిపించిందని, కానీ, శ్రీకాంత్ షిండే కనీసం ఎమ్మెల్యే కాకపోయినా ఎలాంటి సమస్య లేదని ఎద్దేవా చేశారు. खा.श्रीकांत शिंदे यांना सुपर सीएम झाल्याबद्दल हार्दिक शुभेच्छा. मुख्यमंत्र्यांच्या गैरहजेरीत त्यांचे चिरंजीव मुख्यमंत्री पदाचा कारभार सांभाळतात.लोकशाहीचा गळा घोटण्याचे काम सुरूय.हा कोणता राजधर्म आहे?असा कसा हा धर्मवीर?@mieknathshinde @DrSEShinde pic.twitter.com/rpOZimHnxL — Ravikant Varpe - रविकांत वरपे (@ravikantvarpe) September 23, 2022 తిప్పికొట్టిన షిండే.. ఈ క్రమంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు శ్రీకాంత్ షిండే. ఆ ఫోటో తన నివాసంలో తీసుకున్నదని, తన తండ్రి కోసం అధికారికంగా కేటాయించిన కుర్చీలో కూర్చోలేదని స్పష్టం చేశారు. అలాగే.. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం సైతం కాదని, థానేలోని ప్రైవటు నివాసం, ఆఫీసుగా వెల్లడించారు. వెనకాల ఉన్న బోర్డును తరుచూ తరలిస్తుంటారని, తన నివాసం నుంచే వర్చువల్గా సమావేశాలు నిర్వహిస్తున్నందున అక్కడ ఉందని వివరణ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఆఫీసును సీఎం, తానూ ఉపయోగిస్తానని వెల్లడించారు. ఇదీ చదవండి: సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్ -
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్
శివసేన ఎవరిది..? మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది. తిరుగుబాటుతో సీఎం పగ్గాలు దక్కించుకున్న షిండే పార్టీని చేజిక్కించుకునేందుకు ఏం చేస్తున్నారు? మహారాష్ట్ర సంక్షోభం కొలిక్కి వచ్చినా ఆధిపత్యపోరు తగ్గడం లేదు. తమనే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం ఈసీని ఆశ్రయించడం, తర్వాత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం.. మరాఠా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మెజార్టీ పార్టీ ఎవరి వైపు ఉంటే వారిదే అసలైన పార్టీగా ఈసీ గుర్తిస్తుంది. కానీ మహారాష్ట్రలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు షిండేతో వెళ్లినా పార్టీ సంస్థాగత నిర్మాణం మాత్రం ఇంకా ఉద్దవ్పై విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో రెండు వర్గాలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో శివసేన తరపున మొత్తం 55 మంది శాసనసభ్యులుగా గెలవగా, అందులో ఏకంగా 39 మంది ఎమ్మెల్యేలు షిండే వైపు వెళ్లిపోయారు. ఈ ఎమ్మెల్యేలు తమతో పాటు పార్టీలో కింది వర్గాన్ని కూడా థాకరేకు దూరంగా పెట్టారు. ఈ సమీకరణాలు పైకి చూడ్డానికి షిండే వైపు మొగ్గు చూపినా.. పార్టీ హర్డ్కోర్ సానుభూతి పరుల్లో మాత్రం వీరంతా థాకరేకు అన్యాయం చేశారన్న ప్రచారం ఉంది. ఏక్నాథ్ షిండే వెన్నుపోటు వల్లే థాకరే రోడ్డు మీద పడ్డారన్న సింపథీ కూడా కొంత నెలకొంది. ఇటీవల అన్నాడీంకేలో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడ్డాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని పన్నీర్ సెల్వం వర్గం వ్యతిరేకించడంతో... పళని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఒక దశలో మెజార్టీ పార్టీ శ్రేణులు పళనికి మద్దతు తెలపడంతో.. పన్నీర్ సెల్వం బలహీనపడిపోయారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అలాంటి పరిస్థితే పునరావృతమయ్యే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ గుర్తు విల్లు కూడా షిండే వర్గానికే వెళ్లే అవకాశముందనే టాక్ వినిస్తుండడం మహా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కోర్టులో పార్టీ ఫిరాయింపులపై నమోదయిన పిటిషన్లు ప్రస్తుతానికి షిండేకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత వేటును షిండే వర్గం తప్పించుకున్నట్టే కనిపిస్తోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు షిండే వైపు వచ్చినా.. వచ్చే ఎన్నికల్లో ప్రజా కోర్టులో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది. -
సంజయ్ రౌత్కు లభించని ఊరట.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ముంబై: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఇప్పట్లో ఉపశమనం లభించేలా కనిపించటం లేదు. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీనీ మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం. ముంబైలోని పాత్రాచాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై ఆగస్టు 1న సంజయ్ రౌత్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం కేసుని విచారించిన న్యాయస్థానం ఆగస్టు 8న 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ గడువు సోమవారంతో ముగియనుండటంతో సంజయ్ రౌత్ను ముంబై ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరించింది ఈడీ. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే.. సెప్టెంబర్ 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? -
‘వాళ్ల కాళ్లు విరగొట్టండి.. నేను బెయిల్ ఇస్తా’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘వాళ్ల చేతులు విరగొట్టలేకపోతే, కాళ్లు విరగొట్టండి. ఆ తర్వాతి రోజునే నేను మీకు బెయిల్ ఇస్తా’ అని తన అనుచరులకు సూచించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో షిండే వర్గం ఎమ్మెల్యే ప్రకాష్ సర్వేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఉద్ధవ్ థాక్రే వర్గం. ఆగస్టు 14వ తేదీన ముంబైలోని కొకాని పడా బుద్ధ విహార్ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే. ‘ఎవరైనా మీతో ఏదైనా అంటే వారికి సమాధానం ఇవ్వండి. ఎవరి దాదాగిరిని ఉపేక్షించేది లేదు. వారిని తరిమికొట్టండి. నేను ప్రకాష్ సర్వే, మీకోసమే ఇక్కడ ఉన్నాను. మీరు వాళ్ల చేతులు విరగొట్టలేకపోతే, కనీసం వారి కాళ్లు విరగొట్టండి. ఆ తర్వాతి రోజునే మీకు నేను బెయిల్ ఇస్తాను. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మేము ఎవరితో గొడవ పెట్టుకోము. కానీ, మాతో ఎవరైనా గొడవకు దిగితే ఊరుకోము.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే. ఎమ్మెల్యే ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది ఉద్ధవ్ థాక్రే వర్గం. దహిసర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిన క్రమంలో విపక్షాలు దీనిపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విలేకరులతో మాట్లాడనున్నారు. ఇదీ చదవండి: కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదీ.. జైలు కాదు దర్జాగా భార్యాకొడుకులతో ఇంట్లో!! ఫొటో దుమారం -
జ్యుడీషియల్ కస్టడీకి సంజయ్ రౌత్.. ఆ వినతికి కోర్టు నో!
ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబైలోని ప్రత్యేక కోర్టు. ముంబైలోని పత్రచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రౌత్. ఈడీ కస్టడీ ముగియడంతో సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది న్యాయస్థానం. దీంతో ఆయన జైలులో గడపనున్నారు. తనకు ఇంటి నుంచే ఆహారం, ఔషధాలు తీసుకురావాలని సంజయ్ రౌత్ కోరగా.. అందుకు అంగీకరించింది కోర్టు. కానీ, ప్రత్యేక పడక ఏర్పాటును తిరస్కరించింది. పత్రచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో ఆగస్టు 1వ తేదీన సంజయ్ రౌత్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియటంతో ప్రత్యేక పీఎంఎల్ఏ జడ్జీ ఎంజీ దేశ్పాండే ముందు హాజరుపరిచింది. అయితే.. తమ కస్టడీని పొడిగించాలని ఈడీ కొరలేదు. దీంతో జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది కోర్టు. ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్ -
Maharashtra Governor: ‘గుజరాతీలతోనే ముంబైకి ఆర్థిక రాజధాని పేరు’
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే రాష్ట్రంలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. ముంబైలోని అంధేరీలో ఓ చౌక్కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు గవర్నర్. రాజీనామాకు శివసేన డిమాండ్.. గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కోరారు. ‘బీజేపీ ప్రతిపాదిత ముఖ్యమంత్రి అధికారం చేపట్టగానే మరాఠీలకు అవమానం ఎదురైంది. గవర్నర్ వ్యాఖ్యలను కనీసం సీఎం ఖండించాలి. ఇది కష్టపడి పనిచేసే మరాఠీ ప్రజలకు అవమానం. సీఎం షిండే మీరు వింటున్నారా? నీపై నీకు ఆత్మగౌరవం ఉంటే.. గవర్నర్ రాజీనామా చేయాలని కోరాలి.’ అంటూ ట్వీట్ చేశారు రౌత్. మరోవైపు.. కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించటం చాలా బాధాకరం. ఆయన పదవీ కాలంలో గవర్నర్ అధికారాలు, మహారాష్ట్ర రాజకీయ సంప్రదాయాలు దెబ్బతినటమే కాదు.. రాష్ట్రాన్ని తరుచుగా అగౌరవపరుస్తున్నారు.’ అని పేర్కొన్నారు సచిన్ సావంత్. గవర్నర్ వెంటనే మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది. లేదంటే ఆయనను తొలగించాలని కేంద్రాన్ని కోరతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు ఇది సరైనదేనా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? హో.. వారి కెబినెట్ మంత్రులకు ఆమోదం లభించనందుకేమో.. అంటూ ఎద్దేవ చేశారు ప్రియాంక. ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్.. మరో 6 నెలలు..! -
లోక్సభలో ‘సేన’ నేతగా రాహుల్ షెవాలే: షిండే
న్యూఢిల్లీ: లోక్సభలో శివసేన పార్టీ నాయకుడిగా రాహుల్ షెవాలేను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లోక్సభలో ప్రస్తుతం శివసేనకు 19 మంది సభ్యులుండగా షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే సహా 12 మంది మంగళవారం స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. లోక్సభలో తమ పార్టీ నేతగా వినాయక్ రౌత్ స్థానంలో రాహుల్ షెవాలేను గుర్తించాలని కోరారు. ఇందుకు స్పీకర్ సమ్మతించారని హేమంత్ గాడ్సే అనే ఎంపీ తెలిపారు. ఇలా ఉండగా, వినాయక్ రౌత్ సోమవారం రాత్రి స్పీకర్ ఓం బిర్లాను కలిసి శివసేన పార్లమెంటరీ పార్టీ నేతగా తనను, పార్టీ చీఫ్ విప్గా రాజన్ విచారేను గుర్తించాలని వినతి పత్రం అందజేయడం గమనార్హం. షిండే వర్గంలోకి ఆ 12 మంది ఎంపీలు.. లోక్సభలో శివసేనకు 19 మంది ఎంపీలు ఉండగా.. మహారాష్ట్రలోనే 18 మంది ఉన్నారు. ఏక్నాథ్ షిండేతో సోమవారం వర్చువల్ సమావేశానికి సుమారు 12 మంది ఎంపీలు హాజరైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏక్నాథ్ షిండేకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో 12 మంది ఎంపీలకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలుస్తోంది. తమని ప్రత్యేక బృందంగా స్పీకర్ గుర్తించిన తర్వాత.. శివసేన గుర్తును తమకే కేటాయించాలని కోరనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు.. ‘వై’ కేటగిరి భద్రత ఏర్పాటు! -
ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన కొద్ది సేపటికే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. బలపరీక్షపై స్టే విధించలేమని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు: బీజేపీ
జల్నా: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల అధికార సంకీర్ణ కూటమి మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)కి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని కేంద్ర మంత్రి రావు సాహెబ్ దన్వే శుక్రవారం తెలిపారు. ప్రధాని మోదీ పేరుతో ప్రచారం చేసుకుని సీట్లు గెలుచుకున్న శివసేన ఎన్నికల తర్వాత బీజేపీని వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. -
కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ‘వచ్చే మార్చి నాటికి బీజేపీ చేతికి అధికారం’
Narayan Rane BJP Government In Maharashtra By March: బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో మహారాష్ట్రలో త్వరలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని.. వచ్చే ఏడాది నాటికి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఓ కేంద్ర మంత్రి బాంబు పేల్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శుక్రవారం రాజస్తాన్ జైపూర్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘మహారాష్ట్రలో 2022, మార్చి నాటికి బీజేపీ అధికారంలోకి వస్తుంది. త్వరలోనే మీరు భారీ మార్పులు చూడబోతున్నారు. అధికారంలోకి రావడం.. ప్రభుత్వాన్ని కూల్చడం ఇవ్వన్ని రహస్యంగా జరిగే పనులు’’ అన్నారు నారాయణ్ రాణె. (చదవండి: ‘ముందు జైల్లో పెట్టేది తిను.. నీ వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం’) #WATCH | "Change will be seen in Maharashtra very soon. The change will be seen by March. To form a government, to break a govt, some things have to be kept secret," Union Minister Narayan Rane in Jaipur (25.11) pic.twitter.com/GAlDtDr1xO — ANI (@ANI) November 26, 2021 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. 2019కి ముందు మిత్రపక్షం శివసేనతో కలిసి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. కానీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణాలు మారాయి. శివసేన, కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) పేరుతో కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. (చదవండి: పెట్రో ధరల తగ్గింపు: శరద్పవార్ స్పందన) పదవిలోకి వచ్చిన ప్రారంభంలో.. సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదని.. చీలికలు చోటు చేసుకుని.. బీజేపీ చేతికి తిరిగి అధికారం దక్కుతుందని విశ్లేషకులు భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఎంవీఏ రెండేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. చదవండి: మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ.. -
ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి అరెస్ట్కు రంగం సిద్ధం
ముంబై: కేంద్ర మంత్రి నారాయణ రాణే చేసిన వ్యాఖ్యలతో మరోసారి శివసేన, బీజేపీల మధ్య యుద్ధం మొదలయ్యింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి.. నారాయణ రాణే కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది. నారాయణ రాణే వ్యాఖ్యలపై శివసేన నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నాసిక్ పోలీసులు నారాయణ రాణేను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో నారాయణ రాణే ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శివసేన యూత్ వింగ్ కార్యకర్తలు ముంబైలోని నారాయణ రాణే నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ, శివసేక కార్యకర్తల మధ్య వివాదం రాజుకుంది. ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రోడ్డు మీద బైటాయించి ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. (చదవండి: ‘మేం తిరిగి కొడితే...లేవడం కష్టం: బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్) #WATCH | Maharashtra: A clash breaks out amid Shiv Sena workers, BJP workers and Police in Mumbai as Shiv Sena workers marched towards Union Minister Narayan Rane's residence. Union Minister Narayan Rane had given a statement against CM Uddhav Thackeray yesterday. pic.twitter.com/TezjDGGqAb — ANI (@ANI) August 24, 2021 వివాదం ఏంటంటే.. రాయ్గఢ్ జిల్లాలో సోమవారం నారాయణ్ రాణే జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దేశానికి ఎప్పుడు స్వాతంత్య్రం వచ్చిందో కూడా తెలియని ఉద్ధవ్ ఠాక్రేను కొట్టాలన్నంత కోపం వచ్చిందన్నారు నారాయణ రాణే. ‘‘ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో తెలియకపోవడం సిగ్గు చేటు. ప్రసంగం సందర్భంగా ఠాక్రే ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో కనుక్కొని మరీ చెప్పారు. ఒకవేళ నేను అక్కడే ఉండి ఉంటే.. ఠాక్రేను కొట్టేవాడిని’’ అంటూ నారాయణ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పే: ఫడ్నవీస్ ) ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా మండిపడింది. సోమవారం రాత్రే నారాయణ రాణేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆయన కొంకణ్ ప్రాంతంలోని చిప్లున్లో ఉండటంతో రాణేను అరెస్ట్ చేయడానికి నాసిక్ పోలీసులు అక్కడి వెళ్లారు. ఈ వివాదంపై నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే స్పందించారు. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. ఇప్పటికే కేంద్ర మంత్రిపై తగిన చర్యలు తీసుకోవడానికి ఓ బృందం వెళ్లింది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కోర్టులో హాజరు పరుస్తాం. కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాం’’ అని తెలిపారు. -
‘మహా’ సంకీర్ణం సాఫీగా సాగుతోంది
పుణే: శివసేన నేతృత్వంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా సాగుతోందని, ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు ఉమ్మడి ప్రణాళికతో ముందుకుసాగాలని నిర్ణయించామన్నారు. పవార్ తన స్వస్థలం బారామతిలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నపుడు కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి పరిష్కారాలను కనుగొనేందకు ఒక వ్యవస్థ ఉండాలని నిర్ణయించాం. కాంగ్రెస్ నుంచి అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్లను ఎంపిక చేసి ఈ బృందానికి సమస్యల పరిష్కార బాధ్యతను అప్పగించాం. విధానపరమైన నిర్ణయాలైనా, ఇబ్బందులు వచ్చినా పై ఆరుగురు నాయకులు సమావేశమై ఒక నిర్ణయానికి వస్తారు’ అని పవార్ పేర్కొన్నారు. అందరి అభిలాష అదే... ‘మహా వికాస్ అఘాడి ప్రభుత్వం సాఫీగా నడుస్తోంది. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకొని ముందుకుసాగాలనేదే అందరి అభిలాష. కాబట్టి ఈ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుంటుందనడంలో నాకెలాంటి సందేహం లేదు’ అని 2019లో ఎంవీఏ ఏర్పాటు కీలకపాత్ర పోషించిన సీనియర్ నేత శరద్పవార్ వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ... శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు పార్టీలుగా ప్రజల్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని దేనికదే ప్రయత్నిస్తాయని... అందులో తప్పులేదని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల పేర్కొని వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంకీర్ణానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని పవార్ తాజాగా వివరణ ఇచ్చారు. -
దేశంలో, పార్టీలో మోదీనే టాప్: సంజయ్ రౌత్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే టాప్ లీడర్ అని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. బీజేపీలో కూడా మోదీనే టాప్ లీడర్ అని కొనియాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మరాఠా కోటా గురించి చర్చించేందుకు ప్రధాని మోదీతో భేటీ అయిన రెండు రోజుల్లోనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2019 ఎన్నికల వేళ బీజేపీ, శివసేనల మధ్య విబేధాలు తలెత్తడం.. మిత్రులిద్దరు విడిపోవడం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఠాక్రే-మోదీల భేటీపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో శివసేన తాము వ్యక్తిగత సంబంధాలకు అత్యంత విలువ ఇస్తామని, రాజకీయంగా చూడమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడానికి ముందుండే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆయనను ఆకాశానికెత్తేశారు. మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ దేశంలోనే కాక.. బీజేపీలో కూడా టాప్ లీడర్ అని సంజయ్ రౌత్ ప్రశంసించారు. పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర నేతలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు, మోదీ ఛరిష్మా తగ్గినట్లేనా.. అన్న మీడియా ప్రశ్నకు సంజయ్ రౌత్ ఈ సమాధానమిచ్చారు. ‘‘మీడియాలో వస్తున్న వార్తలను నేను చూడలేదు. అధికారికంగా కూడా ఎక్కడా ఇలాంటి నిర్ణయం వెలువడలేదు. మోదీ దేశంలోనే టాప్ లీడర్. బీజేపీలో కూడా’’ అని వ్యాఖ్యానించారు. గత 7 సంవత్సరాల్లో బీజేపీ సాధించిన ఘన విజయాల వెనుక మోదీ కృషి ఉందని, బీజేపీలోనూ మోదీ టాప్ అని రౌత్ కొనియాడారు. అయితే ప్రధాని అన్న హోదా మొత్తం దేశానికి సంబంధించినదని, ఒక పార్టీకి చెందినది కాదన్నారు సంజయ్ రౌత్. అందువల్ల మోదీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదని ఆయన సూచించారు. ప్రధాని మోదీ తలుచుకుంటే శివసేనతో కలిసి పోటీ చేస్తారన్న బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలపై రౌత్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘పులితో (శివసేన గుర్తు) ఎవరూ స్నేహం చేయలేరు. తనతో స్నేహం చేయాలో పులే నిర్ణయించుకుంటుంది’’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. చదవండి: ‘మూడు రోజుల ప్రభుత్వానికి మొదటి వర్ధంతి’ -
వారి ముందు చూపు వల్లే ఈ రోజు దేశం మనుగడ: శివసేన
ముంబై: మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. నెహ్రూ-గాంధీ కుటుంబం వల్లనే ప్రస్తుతం కరోనా సంక్షోభంలో భారత్ మనుగడ సాగించ గలుగుతున్నదని శివసేన పేర్కొంది. కాగా, కోవిడ్ కట్టడిలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నదేశాలు సాయం చేయడం మన నేటి దుస్థితికి అద్దం పడుతుందని విమర్శించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం మాత్రం వేలాది కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును ఆపేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదని తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా సంక్షోభ సమయంలో పేద దేశాలు భారత్కు సహాయం చేస్తుండగా, ఢిల్లీలో 20,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిలుపుదల చేసేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేరని శివసేన మండిపడింది. ఒక వైపు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ వంటి చిన్న దేశాల నుంచి వైద్య సహాయం పొందుతూ మరోవైపు పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం, ప్రధానమంత్రి కొత్త నివాసం నిర్మాణం కొనసాగించడంపై ఎవరూ విచారం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని శివసేన ఎద్దేవా చేసింది. "కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న భారతదేశం నుంచి ప్రపంచానికి ముప్పు ఉందని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాపై పోరాటంలో ఎక్కువ దేశాలు భారత్కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ 10,000 రెమ్డెసివిర్ వైల్స్ పంపగా, భూటాన్ మెడికల్ ఆక్సిజన్ పంపింది. నేపాల్, మయన్మార్, శ్రీలంక కూడా ‘ఆత్మనిర్భర్’ భారతదేశానికి సహాయం అందించాయి" అంటూ రాసుకొచ్చింది. "స్పష్టంగా చెప్పాలంటే.. నెహ్రూ-గాంధీలు సృష్టించిన వ్యవస్థల వల్లనే భారత్ మనగులుగుతున్నది. చాలా పేద దేశాలు భారత్కు సహాయం అందిస్తున్నాయి. గతంలో పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు.. వేరే దేశాల నుంచి సహాయం పొందేవి. దేశంలో ప్రస్తుత పాలకుల వల్ల భారత్ అలాంటి స్థితికి దిగజారుతున్నది" అని శివసేన విమర్శించింది. "కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారని, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నదానికి ఇదే నిదర్శనమని శివసేన విమర్శించింది. “పండిట్ నెహ్రూ, (లాల్ బహదూర్) శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలోని మునుపటి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వల్లనే ప్రస్తుతం దేశం మనుగడ సాధిస్తున్నది. వారు ఇచ్చిన విశ్వాసానికి దేశం ప్రస్తుతం కృతజ్ఞతలు తెలుపుతోంది" అని సామ్నా పేర్కొంది. -
కరోనా విజృంభణ: ముఖ్యమంత్రి తనయుడికి పాజిటివ్
ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో భయాందోళన పరిస్థితి ఏర్పడింది. ప్రజలతో పాటు ఈ ప్రముఖులు కూడా ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజా శివసేన పార్టీ యువ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తనయుడు మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ‘కొన్ని లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. నన్ను ఎవరైనా కలిసిన వారు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి’ అని ఆదిత్య ఠాక్రే ట్విటర్లో పోస్టు చేశాడు. కాగా మహారాష్ట్రలో కొన్ని రోజులుగా దాదాపు రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇప్పటికే పలు జిల్లాల్లో సంపూర్ణ, పాక్షిక లాక్డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే. On having mild symptoms of COVID, I had myself tested and I am COVID positive. I request everyone who came in contact with me to get themselves tested. I urge everyone to realise that it is extremely important to not let your guard down. Please follow COVID protocols & stay safe — Aaditya Thackeray (@AUThackeray) March 20, 2021 -
బెంగాల్లో సివంగిదే గెలుపు.. మేము పోటీ చెయ్యం
ముంబై: పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దేశవాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, టీఎంసీ మళ్లీ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల్లో పోటీచేసే విషయంపై శివసేవ పార్టీ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశ వ్యాప్తంగా బెంగాల్లో శివసేన పోటీచేస్తుందా?లేదా? ఆసక్తి నెలకొంది. ఈ రోజు పార్టీ అధ్యక్షుడు, సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు జరిపాం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ‘దీదీ వర్సెస్ అన్ని పార్టీలు’ అన్న రీతీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తాము మమతాబెనర్జీకి మద్దతుగా నిలబడటం కోసం బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆమె నిజమైన బెంగాల్ సివంగి అని సంజయ్ రౌత్ ట్విటర్లో పేర్కొన్నారు. బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. pic.twitter.com/enjd4sfiwx — Sanjay Raut (@rautsanjay61) March 4, 2021 చదవండి: ‘భారత్ మాతాకి జై’ అనే హక్కు మీకు లేదు -
‘బీజేపీ ప్లాన్ ప్రకారమే దారి మళ్లించింది’
ముంబై: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమం గణతంత్ర దినోత్సవం నాడు ఉద్రిక్తంగా మారింది. హింస చోటు చేసుకుంది. ఆ తర్వాత రైతు సంఘాల మధ్య చీలికలు ఏర్పడి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఓ పథకం ప్రకారమే రైతుల ఉద్యమం హింసాయుతంగా మారేలా చేశాయని శివసేన ఆరోపించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నాలో కేంద్రం తీరును ఎండగడుతూ పలు విమర్శలు చేసింది. ‘‘కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. దాదాపు 60 రోజుల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమంలో ఎలాంటి చీలికలు రాలేదు.. వారు సహనం కోల్పోలేదు. రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభించడం.. విదేశాల్లో సైతం మోదీ ప్రభుత్వం పట్ల విమర్శలు రావడంతో కేంద్రం ఈ ఉద్యమాన్ని నీరు కార్చాలని చూసింది. దాంతో ఉద్యమంలో హింస చేలరేగేలా చేసి దారి మళ్లేలా చూసింది’’ అంటూ శివసేన ఆరోపించింది. ‘‘కర్రలతో ఉన్న రైతులను మోదీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుంది.. మరి ‘‘గోలీ మారో’’, ‘‘ఖతం కరో’’ అని నినాదాలు చేసిన వ్యక్తులు మాత్రం ఇంకా మోదీ క్యాబినేట్లోనే ఉన్నారు.. వారి సంగతి ఏంటి’’ అని ప్రశ్నించింది. (చదవండి: నేతాజీ జయంతి.. వేడెక్కిన రాజకీయం) ఇక ‘‘గణతంత్ర దినోత్సవం నాడు చెలరేగిన హింసలో బీజేపీ పాత్ర ఉంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీ రైతులు ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి.. దారి మళ్లించింది. ఉగ్రవాదులు ఆందోళన చేపట్టారు. ఇక ఎర్రకోట వద్ద హింస చేలరేగడానికి ప్రధాన కారకుడు దీప్ సిధు. అతడికి బీజేపీతో సంబంధం ఉంది. పంజాబ్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్కి, దీప్ సిధుకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. సిధు గత రెండు నెలలుగా రైతులను రెచ్చగొడుతున్నాడని.. కానీ వారు సమన్వయం కోల్పోలేదని రైతుల సంఘాల నాయకులు పలువురు వెల్లడించారు’’ అంటూ శివసేన సామ్నాలో రాసుకొచ్చింది. ఇక ఎర్రకోట వద్ద చేలరేగిన హింసకు కేవలం రైతుల్ని మాత్రమే బాధ్యుల్ని చేయడం సరైంది కాదని శివసేన అభిప్రాయ పడింది. ప్రభుత్వం తాను ఏం చేయాలనుకుందో అదే చేసి చూపింది. ఫలితంగా రైతులు, పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా హింసను ప్రోత్సాహించలేము అని తెలిపింది. -
మహా కూటమిలో మాటల యుద్ధం
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని ఔరంగబాద్ నగర పేరు మార్పు అంశం అధికార మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో చిచ్చు రాజేస్తోంది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన శివసేన, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఔరంగాబాద్ను ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ పేరిట శంభాజీనగర్గా మార్చాలని శివసేన పట్టుబడుతోంది. ఇందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. క్రూరుడు, మతోన్మాది అయిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును అభిమానించడం లౌకికవాదం అనిపించుకోదని స్పష్టం చేస్తూ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఓ వ్యాసం రాశారు. ఔరంగాబాద్ పేరు మార్చడం కాంగ్రెస్కు ఇష్టం లేదని, అలా చేస్తే మైనార్టీ ఓటు బ్యాంకు దూరమవుతుందని ఆ పార్టీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఔరంగజేబు సెక్యులర్ పాలకుడు కాదని తేల్చిచెప్పారు. (సీఎం అభ్యర్థిపై ప్రకటన.. బీజేపీలో కలకలం) ఛత్రపతి శంభాజీని చంపిన ఔరంగజేబు పేరు మహారాష్ట్రలో ఓ నగరానికి ఉండడానికి వీల్లేదన్నారు. పేరు మార్చాలనడం మతపరమైన అంశం కాదని, శివభక్తి అనిపించుకుంటుందని పేర్కొన్నారు. శివసేన వాదనలపై మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, రెవెన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్ థోరట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతకుముందు మహారాష్ట్రలో బీజేపీ–శివసేన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పేరు మార్పు గురించి ఎందుకు ఆలోచించలేదని నిలదీశారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్థిరమైన ఎంవీఏ ప్రభుత్వం ఉందన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ) ఆధారంగానే పని చేస్తోందని తెలిపారు. నగరాల పేర్లు మార్చాలంటూ అనైతిక రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో సెంటిమెంట్ రాజకీయాలకు స్థానం లేదని వెల్లడించారు. పేరు మార్పు అంశం వల్ల మహా వికాస్ అఘాడీలో చీలికలు వస్తాయని ఎవరూ సంబర పడొద్దని పరోక్షంగా బీజేపీకి చురక అంటించారు. -
‘ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు’
ముంబై: మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం ధృడమైనదని, తన సహచరుల ఫోన్లను ట్యాపింగ్ చేయవలసిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎంవీఏ ప్రభుత్వం నవంబర్ 28న ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఠాక్రే మాట్లాడుతూ..“నేను నా మంత్రులందరినీ విశ్వసిస్తున్నాను, నా సహోద్యోగుల ఫోన్లపై నిఘా పెట్టాల్సిన అవసరం లేదు. అందరూ మంచిగా పని చేస్తున్నారు. మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది. మేము మంచిగా పని చేస్తున్నందున వారు మమ్మల్ని గెలిపించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ ప్రజల శ్రేయస్సు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు”అని ఠాక్రే అన్నారు. కేంద్ర ప్రభుత్వం విఫలమైంది: శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ రైతుల నిరసనకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ‘‘రైతు బిల్లుల ఆమోదంతో మన రైతులు ఎదుర్కొనే పరిణామాలను కెనడాకు చెందిన ప్రముఖ నాయకులు అర్థం చేసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి అర్థం కాలేదు. బీజేపీ కేంద్రంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో సమస్యలను పెంచారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.’’ అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దుయ్యబట్టారు. (చదవండి: స్టీరింగ్ నా చేతిలోనే ఉంది..) రెండు, మూడు నెలల్లో అధికారంలోకి : బీజేపీ వచ్చే రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి రౌసాహెబ్ డాన్వే ఇటీవల విశ్వాసం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రావడానికి వెంపర్లాడటం లేదని, కానీ అసహజంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు.’’ అని అన్నారు. గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గరిష్టంగా 105 స్థానాలను గెలుచుకోగా, శివసేన 56, ఎన్సిపి 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు అజిత్ పవార్ సహకారంతో 2019 మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ 80 గంటలపాటు అధికారంలో ఉంది. 2019 నవంబర్ 23 తెల్లవారుజామున ముంబైలోని రాజ్ భవన్లో బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, శివసేన నేతృత్వంలోని ఎంవీఏ నవంబర్ 28 న పదవీ బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమం చేసిన పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ ప్రభుత్వం కేవలం 80 గంటలు మాత్రమే అధికారంలో కొనసాగిన సంగతి తెలిసిందే. -
ప్రభుత్వాన్ని నడుపుతున్నదెవరు..?
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని విచ్ఛినం చేసేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహాలు రచిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజ్భవన్ను వేదికగా చేసుకుని రాజకీయాల చేస్తోందని మండిపడుతున్నారు. విద్యుత్ బిల్లుల వివాదం నేపథ్యంలో నవనిర్మాణ సేనపార్టీ (ఎమ్ఎన్ఎస్పీ) చీఫ్ రాజ్ రాక్రేను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బదులుగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను కలవమని సలహా ఇవ్వడంపై శివసేన నేతలు భగ్గుమంటున్నారు. గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ మధ్య విబేధాలు సృష్టించేందుకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. పవర్ ఎవరి చేతిలో.. ఈ క్రమంలోనే విద్యుత్ బిల్లుల విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కాకుండా శరద్ పవార్తో మాట్లాడమని గవర్నర్ కోశ్యారీ రాజ్ ఠాక్రేకి చెప్పడంతోనే రాష్ట్రంలో పవర్ ఎవరి చేతిలో ఉందో అర్థం అవుతోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఎద్దేవా చేశారు. శరద్ పవార్ రాష్ట్రాన్ని నడుపుతున్నారని, సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలవడం వల్ల ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నాయకులు సైతం స్వరం అందుకున్నారు. ముఖ్యమంత్రి ఠాక్రే అయినప్పటికీ అధికారమంతా పవార్ చేతిలోనే ఉందంటున్నారు. (ఊర్మిళ ఆశలు అడియాశలేనా..?) బీజేపీ నేతల విమర్శలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గట్టిగా స్పందించారు. ఆఘాడీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరో నెలరోజుల గడిస్తే తమ ప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది పూర్తి అవుతుందని, ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో 15 రోజుల్లోనే కుప్పకూలుతుందని బెట్టింగులు వేశారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు ఇప్పటికే అదే పనిలో ఉన్నారని మండిపడ్డారు. రాజ్ ఠాక్రేను ముఖ్యమంత్రికి బదులుగా శరద్ పవార్ని కలవాలని గవర్నర్ సూచించి సీఎంను అవమానపరిచారని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీ ప్రభుత్వం భాగం మాత్రమేనని, సీఎం మాత్రం ఠాక్రేనే అని స్పష్టం చేశారు. బాల్ఠాక్రే నమ్మకాన్ని బేఖాతరు చేశారు దివంగత బాల్ ఠాక్రే నమ్మకం, సిద్ధాంతాలను బేఖాతరు చేసిన పార్టీ తమకు పాఠాలు నేర్పక్కర్లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ సీనియర్ నేత సందీప్ దేశ్పాండే శివసేనకు చురకలంటించారు. కరోనా కాలంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ ఇటీవల గవర్నర్భగత్సింగ్ కొశ్యారీతో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సరైందని కాదని, ప్రజాప్రతినిధులు, సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి ఉండగా నేరుగా గవర్నర్తో భేటీ కావడమంటే రాష్ట్రాన్ని అవమానపర్చినట్లేనని శనివారం శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రావుత్ రాజ్ ఠాక్రేను విమర్శించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలకు ఎమ్మెన్నెస్ సమాధానమిచ్చింది. పరువు, ప్రతిష్ట, అవమానం అంటే ఏంటో రౌత్ నుంచి నేర్చుకోవల్సిన అవసరం తమకు లేదని దేశ్పాండే స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉత్తర భారతీయులంటే గిట్టని శివసేన ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల దినోత్సవం నిర్వహించింది. వారికిష్టమైన నానబెట్టిన శెనిగెల కార్యక్రమం నిర్వహించారు. ‘‘కొద్దిరోజుల కిందట రావుత్ కొశ్యారీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రౌత్ కొశ్యారీకి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఫోటోను చూపించారు. మరి మీరెందుకు భేటీ అయినట్లు, నృత్యం చేయడానికా...?’’ అని దేశ్పాండే ఎద్దేవా చేశారు. ముందు ఈ ఫోటో గురించి మాట్లాడాలని, ఆ తరువాత ఇతరుల గురించి వ్యాఖ్యలు చేయాలని విమర్శించారు. శివసేన నాయకులు తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారు. రాజ్ ఠాక్రేను పీడిం చారు. అప్పట్లో ఎమ్మెన్నెస్కు చెందిన ఆరుగురు కార్పొరేటర్లను ప్రలోభపెట్టి శివసేనలోకిలాక్కున్న సంఘటనలను ఎలా మర్చిపోతామని ఈ సందర్భంగా దేశ్పాండే గుర్తుచేశారు. -
వరుస ఎదురు దెబ్బలు: ఎన్డీయే విచ్ఛిన్నం..!
సాక్షి, ముంబై : బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) కూటమి నుంచి ఒక్కో పార్టీ జారుకుంటోంది. మొదటి నుంచి బీజేపీతో జట్టు కట్టిన తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందే వైదొలగగా.. ఆ పార్టీ దారిలోనే మరికొన్ని పార్టీలు సైతం నడుస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో అత్యంత పెద్దపార్టీగా ఉన్న శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో గుడ్బై చెప్పింది. ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య ఏర్పడిన మనస్పర్ధాలు కూటమి నుంచి వైదొలిగి వేరు కుంపటి పెట్టుకునే వరకు సాగాయి. అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన జట్టుకట్టడంతో పార్లమెంట్లో ఎన్డీయేకు కొంతలోటు ఏర్పడింది. ఇది జరిగిన కొద్ది నెలల్లోనే బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 40 ఏళ్ల పాటు బీజేపీతో స్నేహంగా మెలిగిన శిరోమణీ అకాలీదళ్ తాజాగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. (ఎన్డీయేకు గుడ్బై చెప్పిన మిత్రపక్షం) కేంద్ర ప్రభుత్వం గతవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా తొలుత కేంద్రమంత్రికి పదవికి రాజీనామా చేసిన ఆపార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్.. పార్లమెంట్లో బిల్లులకు వ్యతిరేకంగా నిరసన స్వరం వినిపించారు. అనంతరం ఎన్డీయే కూటమి నుంచి శాస్వతంగా తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించి.. చిరకాల స్నేహానికి ముగింపు పలికారు. ఎన్డీయే కూటమిలో కీలకమైన అకాలీదళ్ తప్పుకోవడం బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బగానే భావించవచ్చు. (భార్య రాజీనామా వెనుక భర్త వ్యూహం..!) మరోవైపు కీలకమైన పంజాబ్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం కాషాయ దళానికి ఊహించని షాకే. ఇలాంటి తాజా పరిస్థితులపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. శివసేనతో పాటు, శిరోమణీ అకాలీదళ్ వైదొలగడంతో ఎన్డీయే విచ్ఛిన్నమైందని, తాము ఇరువురం లేని కూటమి ఎన్డీయే కానేకాదని స్పష్టం చేశారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ ఎన్డీయే నుంచి తప్పుకుంటున్నాయని గుర్తుచేశారు. అయితే తమ స్థానంలో వచ్చే కొత్త స్నేహితులు కూడా ఎంతకాలం ఉంటారో చెప్పలేమని రౌత్ వ్యాఖ్యానించారు. (ప్రశాంత్ కిషోర్తో మరో సీఎం ఒప్పందం..!) -
ముంబై నుంచి పార్శిల్ చేస్తాం: రౌత్
ముంబై: బిహార్లో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీలలో మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్లో తగినన్ని సమస్యలు లేకపోతే.. ముంబై నుంచి కొన్నింటిని పార్శిల్ చేసి పంపిస్తామని ఎద్దేవా చేశారు. బిహార్కు చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాన్ని ఎన్నికల సమయంలో ఉపయోగించుకుంటూ లబ్ధి పొందాలని భావిస్తున్నారంటూ ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ఎన్నికల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాలపై పోరాడాలి. అయితే ఈ సమస్యలు అయిపోయినట్లు మీరు భావిస్తే చెప్పండి.. ముంబై నుంచి కొన్ని సమస్యల్ని పార్శిల్గా పంపుతాము’ అన్నారు. అంతేకాక బిహార్ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందన్నారు సంజయ్. దీని గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించి.. రెండు-మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతేకాక బిహార్ ఎన్నికలు కూలం, ఇతర విషయాల మీద జరుగుతాయి. కార్మిక చట్టాలు, రైతులకు సంబంధించిన సమస్యలను వీరు పట్టించుకోరు అంటూ సంజయ్ రౌత్ గ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు!) దేశంలో కరోనా విజృంభణ అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల ప్రక్రియను ఆన్లైన్లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు అరోరా తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. -
కంగనా డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు
ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్– మహారాష్ట్ర సర్కారు వివాదం ముదురుతోంది. ముంబై మరో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)గా మారిందన్న కంగనా ఆరోపణలపై.. శివసేన సర్కారు కంగనా ఆఫీసులోని కొన్ని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధమంటూ కూలగొట్టిన విషయం తెలిసిందే. దీంతో, కంగనా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా డ్రగ్స్ వాడేవారన్న ఆరోపణలపై శుక్రవారం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్కు అప్పగించింది. మీకేమీ బాధ అనిపించడం లేదా? సోనియాగాంధీకి కంగనా ప్రశ్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం ఠాక్రేను తీవ్రంగా విమర్శించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈసారి తన గురిని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ వైపు తిప్పారు. మహారాష్ట్రలోని శివసేన–కాంగ్రెస్ ప్రభుత్వం తనను వేధిస్తుంటే సాటి మహిళగా బాధ అనిపించడం లేదా అని ఆమెను ప్రశ్నించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సోనియాను కోరారు. కంగనకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావలె మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కోరారు. ఉద్ధవ్ సర్కార్పై ఫడ్నవిస్ మండిపాటు కరోనాపై పోరు ముగిసి, కంగనాపై పోరు ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సర్కారు యంత్రాంగం యావత్తూ కంగనాపైనే పోరాడుతోందన్నారు. ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు కానీ, కోవిడ్–19పై పోరాటంపై శ్రద్ధ చూపాలని సూచించారు. చదవండి: కంగనను నడిపిస్తున్నది ఎవరు? -
ఎన్ని నోళ్లు మూయించగలరు?
ముంబై: ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి గురువారం బాలీవుడ్ నటి కంగన రనౌత్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు. ‘ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించారో, ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారు. శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారు. నేను లేని సమయంలో బీఎంసీ గూండాలు నా ఇంటిని కూల్చేశారు’ అని ట్వీట్ చేశారు. బీఎంసీ అధికారులు బుధవారం కంగనా ఆఫీస్లో కొంత భాగాన్ని కూల్చివేసిన తరువాత, బొంబాయి హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. యజమాని లేని సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై వివరణ ఇవ్వాలని బీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కంగనపై ఫిర్యాదు నమోదు ఉద్ధవ్పై అనుచిత భాష ఉపయోగించినందుకు గానూ కంగనపై విఖ్రోలి పోలీస్ స్టేషన్లో బుధవారం నితిన్ మానె అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం, కోర్టుకు వెళ్లాల్సిందిగా ఫిర్యాదుదారుడికి సూచించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు. అది అక్రమ నిర్మాణమే కంగన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలనుకున్నది దురుద్దేశంతో కాదని బీఎంసీ బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఆ నిర్మాణంలోని కొన్ని భాగాలు అక్రమంగా నిర్మించినవేనని స్పష్టం చేసింది. గవర్నర్ అసంతృప్తి కంగన రనౌత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని మహారాష్ట్ర గవర్నర్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. హడావుడిగా కంగన కార్యాలయ భవనాన్ని కూల్చేయడాన్ని ఆయన తప్పుబట్టారని గవర్నర్ సన్నిహితులు తెలిపారు. కంగనతో కేంద్రమంత్రి అథావలె భేటీ కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలె గురువారం ముంబైలో కంగనతో సమావేశమయ్యారు. బీజేపీ మిత్రపక్షమైన అథావలె పార్టీ ఆర్పీఐ(ఏ) కంగనకు మద్దతుగా నిల్చిన విషయం తెలిసిందే. అయితే, ముంబైను పీఓకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలను తన పార్టీ ఖండిస్తుందని గతంలో అథావలె ప్రకటించారు. శివసేన వ్యవహరించిన తీరుపై మిత్రపక్షం ఎన్సీపీ అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. -
కంగనాను భగత్ సింగ్తో పోల్చిన హీరో
సాక్షి, చెన్నై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో మొదలైన వివాదం తర్వాత అనేక మలుపులు తిరిగింది. డ్రగ్స్ వినియోగం వెలుగులోకి రావడం.. అనంతరం కంగనా బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించడం.. ఆ తర్వాత ముంబైని పీఓకేతో పోల్చడంతో వివాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో కేంద్రం కంగనాకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్లో జరుగుతున్న ఈ పరిణామాలపై దక్షిణాది హీరో విశాల్ స్పందించారు. కంగనాపై ప్రశంసలు కురిపించడమే కాక ఆమెను ఏకంగా భగత్ సింగ్తో పోల్చారు. ఈ మేరకు విశాల్ ట్వీట్ చేశారు. ‘మీ ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్.. ఓ విషయం గురించి మాట్లాడటానికి మీరు రెండు సార్లు ఆలోచించలేదు. ఏది తప్పు.. ఏది ఒప్పు అని బేరీజు వేయలేదు. ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు. అయినా ప్రభుత్వ ఆగ్రహాన్ని ఎదుర్కొంటూనే.. మీరు బలంగా నిలబడ్డారు. ఇది చాలా పెద్ద ఉదాహరణ. మీరు చేసిన ఈ పని.. గతంలో అంటే 1920లో భగత్సింగ్ చేసినదానికి సమానమైనది’ అంటూ ప్రశంసించారు విశాల్. (చదవండి: కంగనాను బెదిరించలేదు: సంజయ్ రౌత్) Dear @KanganaTeam pic.twitter.com/73BY631Kkx — Vishal (@VishalKOfficial) September 10, 2020 అంతేకాక ‘తప్పు జరగినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే సెలబ్రిటీనే కావాల్సిన అవసరం లేదు.. ఓ కామన్ మ్యాన్ కూడా చేయవచ్చు అని నిరూపించారు. నేను మీకు నమస్కరిస్తున్నాను’ అంటూ విశాల్ ట్వీట్ చేశారు. పలు సామాజిక అంశాల పట్ల తన గళాన్ని విప్పే విశాల్.. ఇలా కంగనాకు మద్దతుగా నిలవడంపై ఇండస్ట్రీలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
‘క్వీన్’ ఆఫీస్లో కూల్చివేతలు
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు చెందిన బాంద్రా బంగ్లాలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ బీఎంసీ(ముంబై మున్సిపాలిటీ) అధికారులు బుధవారం కూల్చివేతకు దిగారు. ఈ ఘటనపై కంగన తీవ్రంగా మండిపడ్డారు. నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్నుద్దేశించి సంభోదిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఉద్ధవ్ఠాక్రే, నువ్వేమనుకుంటున్నావు? మూవీ మాఫియాతో జతకట్టి నా ఇల్లు కూల్చడం ద్వారా కక్ష తీర్చుకున్నటు భావిస్తున్నావు! కానీ గుర్తుంచుకో, కాలచక్రం ఎవరికోసం ఆగదు, ఈ రోజు నా ఇల్లు కూల్చారు, రేపు నీ అహంకారం కుప్పకూలుతుంది!’ అని వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. 2017లో కంగన ఈ బిల్డింగ్ను రూ.20కోట్లకు కొనుగోలు చేశారు. కంగన బిల్డింగ్లో నిర్మాణాలను బీఎంసీ కూల్చివేయడాన్ని నిలిపివేస్తూ ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది. బీఎంసీ దురుద్దేశంతో చేసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యజమాని లేనప్పుడు కూల్చివేతలు ఎలా ఆరంభించారని, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24గంటలే ఎందుకు సమయం ఇచ్చారని బీఎంసీని కోర్టు ప్రశ్నించింది. తన బిల్డింగ్లో చేపట్టిన కూల్చివేతలను నిలిపివేయాలన్న కంగన పిటీషన్ను విచారించిన కోర్టు తదుపరి వాదనలను గురువారానికి వాయిదా వేసింది. కంగన, శివసేన వివాదం క్రమంగా బీజేపీ వర్సెస్ శివసేన వివాదంగా రూపుదిద్దుకుంటోంది. కంగన కార్యాలయంలో కొన్ని నిర్మాణాల కూల్చివేతపై బీజేపీ స్పందిస్తూ శివసేన కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని విమర్శించింది. ముంబైకి కంగన హిమాచల్ ప్రదేశ్ నుంచి కంగన బుధవారం ముంబైకి వచ్చారు. ఆమెరాకను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎయిర్పోర్టు నుంచి బందోబస్తు నడుమ ఆమె ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆర్పీఐ(ఏ) కార్యకర్తలు, కర్ణిసేన కార్యకర్తలు కంగనకు మద్దతుగా గుమిగూడారు. ఇటీవలే కంగనకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించింది. కంగన బిల్డింగ్లో కూల్చివేతలను హిమాచల్ ముఖ్యమంత్రి ఖండించారు.కంగన వ్యాఖ్యలను ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదని ఎన్సీపీ లీడర్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అలా మొదలైంది! బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేస్తున్న కంగనకు శివసేన ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని గతంలో బీజేపీ నేత రామ్ కదమ్ కోరారు. దీనిపై కంగన స్పందిస్తూ మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని ట్వీట్ చేశారు. ముంబై పోలీసులకు బదులుగా హిమాచల్ ప్రదేశ్ లేదా కేంద్ర బలగాలు తనకు రక్షణ కల్పించాలన్నారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందిస్తూ ఆమెను ముంబైకి రావద్దని, ముంబై పోలీసులను ఆమె అవమానించారని మండిపడ్డారు. దీనికి బదులుగా ముంబై ఏమైనా పీఓకేనా? అని కంగన ప్రశ్నించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని రౌత్ ముంబై ప్రభుత్వాన్ని కోరారు. పీఓకేలో పరిస్థితులు చూసివచ్చి మాట్లాడాలని కంగనకు సలహా ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ తాను 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని కంగన సవాల్ విసిరారు. తనపై చేసిన వ్యాఖ్యలకు సంజయ్ క్షమాపణ చెప్పాలన్నారు. బుధవారం సంజయ్ స్పందిస్తూ తానెప్పుడూ కంగనను బెదిరించలేదని, ముంబైని పీఓకేతో పోల్చడంపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. కంగన బిల్డింగ్లో నిర్మాణాల కూల్చివేతకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చండీగఢ్లో ఎయిర్పోర్టులో వై–ప్లస్ కేటగిరీ భద్రత మధ్య కంగనా -
సోషల్ మీడియా వేదికగా మతవిద్వేషం
ముంబై: సోషల్ మీడియా వేదికగా బీజేపీ దేశంలో మత విద్వేషాన్ని వ్యాపింపచేస్తోందని శివసేన ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్స్ట్రీట్ జర్నల్ కథనం రాజకీయ వేడిని రగిలించిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన స్పందించింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని బీజేపీ గత ఎన్నికల్లో ఎంతో లాభపడటమే కాక.. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేశాన్ని వ్యాప్తి చేసి రాజకీయంగా బలపడిందని ఆరోపించింది. బీజేపీపై ఫేస్బుక్ చర్యలు తీసుకోకపోవడం పట్ల శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఫేస్బుక్ వేదికగా ఎవరైనా సరే దేశాన్ని విభజించడానికి ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తే.. వారు ఏ పార్టీకి చెందినవారు అనే దానితో సంబంధం లేకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ అయినంత మాత్రాన కళ్లుమూసుకుని కూర్చోకూడదు’ అంటూ శివసేన తీవ్రంగా విమర్శించింది. (విద్వేషంపై ఉదాసీనత) అంతేకాక ‘బీజేపీ నాయకులు ఈ సోషల్ మీడియా వేదికలను సమాజాన్ని అనుసంధానించడానికి బదులు ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ వేదికలు రాజకీయ పార్టీల కనుసన్నల్లో మెలుగుతాయి. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ సోషల్ మీడియా సైన్యం బీజేపీకి ఎంతో సహకరించింది. అందువల్లే మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయం సాధించింది’ అని తెలిపింది. అంతేకాక ‘గత ఏడు సంవత్సరాలలో సత్యాన్ని వక్రీకరించి.. అబద్దాన్ని వాస్తవాలుగా చూపిస్తూ.. బహిరంగంగా ప్రచారం చేశారు. రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు, పుకార్లు ప్రచారం చేశారని’ శివసేన ఆరోపించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద సోషల్ మీడియాలో చాలా కాలం వరకు మీమ్స్, జోకులు ప్రచారంలో ఉన్నాయని సామ్నా ఎత్తి చూపింది. అయితే ఇప్పుడు అదే వేదిక మీద మోదీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్పై ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. శివసేన వ్యాఖ్యలు హాస్యాస్పాదంగా ఉన్నాయన్నది. (బీజేపీకి వత్తాసు : ఫేస్బుక్ క్లారిటీ) -
షాపును ధ్వంసం చేసిన సేన సైనికులు
-
విధ్వంసం సృష్టించిన సేన సైనికులు, కారణం?
ముంబాయి: శివసేన కార్యకర్తలు బుధవారం మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలోని ఒక ఎలక్ట్రిక్ షాపులో విధ్వంసం సృష్టించారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రేను, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ శరద్ పవార్ను, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని విమర్శించినందుకు శివసేన కార్యకర్తలు షాపును నాశనం చేశారు. సోమవారం సోషల్మీడియాలో శివసేనకు వ్యతిరేకంగా పోస్ట్లు పెట్టడంతో శివసేన సైనికులు షాపు యజమానిపై ఫిర్యాదు చేశారు. ఇక్కడితో ఆగకుండా బుధవారం అతని షాపును నాశనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కొంత మంది పోలీసులు సమక్షంలోనే షాపులోకి ప్రవేశించి అక్కడ ఉన్న వస్తువులను నాశనం చేశారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ నారాయణ్ రాణే సోమవారం గవర్నర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కరోనాని కట్టడి చేసే సామర్థ్యం లేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ను కోరారు. ఇక మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాహుల్ గాంధీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పడంతో ప్రభుత్వ వైఫల్యల నుంచి కాంగ్రెస్ తప్పించుకొని నింద మొత్తం శివసేన మీద వేయడానికి చూస్తోందని ఆరోపించారు. ఇలా పరస్పర ఆరోపణల క్రమంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కెయ్యాయి. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ యుద్దం ముదిరి అభిమానులు మహావికాస్అఘాడిపై ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేశారు. దీంతో శివసేన సైనికులు సదరు వ్యక్తి షాపును ధ్వంసం చేశారు. (లాక్డౌన్ 5.0 : ఆ నగరాలపై ఫోకస్) -
‘ప్రధాని వీడియోకాన్ఫరెన్స్ టైం వేస్ట్ వ్యవహారం’
ముంబై: కరోనా వైరస్కు మహారాష్ట్ర హట్స్పాట్గా మారిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో శివసేన ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ప్రతిపక్షం కావాలనే ఈ విషయంలో రాద్ధాంతం చేస్తుందని శివసేన మండిపడుతుంది. ఈ క్రమంలో పార్టీ అధకార పత్రిక సామ్నాలో బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్పై విమర్శల వర్షం కురిపించింది. రెండు రోజుల క్రితం పాటల్ కరోనా మహమ్మారి కట్టడి కోసం శివసేన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విమర్శించారు. కేరళ మోడల్ను అనుసరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాటిల్ వ్యాఖ్యలపై సామ్నా మండిపడింది.(పాపం పసివాళ్లు!) ‘పాటిల్ కేరళ మోడల్ను సరిగా అర్థం చేసుకోలేదనుకుంటాను. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా కట్టడి కోసం కేంద్రం సూచించే విధానాలను అమలు చేయరు. అంతేకాక ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం వల్ల కాలం వృధా తప్ప పెద్దగా ఫలితం ఉండదని ఆయన భావిస్తారు’ అని తెలిపింది. కరోనా కట్టడి కోసం కేరళ సొంత మార్గదర్శకాలను రూపొందించుకుందని.. అందువల్లే అక్కడ కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. కరోనా కట్టడి కోసం ప్రతిపక్షాలు ఏవైనా సూచనలు చేయాలనుకుంటే.. ముఖ్యమంత్రితో చర్చిస్తే బాగుంటుందని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారని ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించింది.(చిన్ని తండ్రీ నిన్ను చూడక...) -
ఎన్సీపీకే పెద్ద పీట
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు శాఖల్ని కేటాయించారు. ముఖ్యమైన శాఖలెన్నో సంకీర్ణ భాగస్వామ్య పక్షం ఎన్సీపీకే దక్కాయి. శాఖల కేటాయింపులో మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగిన మూడు రోజులకి కానీ అధికారికంగా ప్రకటన వెలువడలేదు. మహారాష్ట ఉప ముఖ్యమంత్రి, సీనియర్ ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్కు ఆర్థిక, ప్రణాళిక శాఖ, ఆయన పార్టీ సహచరుడు అనిల్ దేశ్ముఖ్కు హోంశాఖని కేటాయించినట్టు ఆదివారం ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన తరఫున తొలిసారిగా ఎన్నికైన ఆదిత్య ఠాక్రేకి పర్యావరణం, పర్యాటకం, ప్రొటోకాల్ వ్యవహారాల శాఖ దక్కింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరాత్కు రెవెన్యూ, అశోక్ చవాన్కు ప్రజాపనుల శాఖలు దక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ధనుంజయ్ ముండే, జితేంద్ర అవ్హాద్లకు వరసగా సామాజిక న్యాయశాఖ, గృహనిర్మాణ శాఖలు కేటాయించారు. దీంతో ఎన్సీపీకే కీలక శాఖలు దక్కినట్టయింది. ఇక ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సాధారణ పరిపాలన, ఐటీ, న్యాయశాఖల్ని తన వద్ద ఉంచుకున్నారు. శివసేనకు చెందిన ఏక్నాథ్ షిందేకు పట్టణాభివృద్ధి శాఖ కట్టబెట్టారు. ప్రభుత్వం పంపిన ఈ శాఖలకి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. కాంగ్రెస్లో అసంతృప్తి శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందని కాంగ్రెస్లో అసంతృప్తి మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరాత్ కారణమని కొందరు నేతలు నిందిస్తున్నారు. ఎన్సీపీతో పోలిస్తే అప్రాధాన్య శాఖలు కేటాయించారని అంటున్నారు. మరికొందరు సంకీర్ణ భాగస్వామ్య పక్షంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ అధ్యక్షుడు పవార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, గృహనిర్మాణం, రవాణా శాఖల్లో కనీసం రెండయినా కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టినా శివసేన, ఎన్సీపీ తిరస్కరించడంతో పార్టీలో అంతర్గతంగా అసమ్మతి రాజుకుంటోంది. కాగా, శివసేన పార్టీని వీడడం లేదని మంత్రి అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం సీఎంతో సమావేశమైన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తాను శివసేనతోనే కొనసాగుతానన్నారు. -
మహా సంకీర్ణంలో కేబినెట్ చిచ్చు
-
ఠాక్రే నామ సంవత్సరం!
సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాల్లో 2019వ సంవత్సరంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో పెను మార్పులు సంభవించాయి. కాషాయ కూటమిగా పోటీచేసిన శివసేన, బీజేపీలు ఫలితాల అనంతరం విడిపోయాయి. అప్పటివరకూ ప్రత్యర్థులుగా ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మహావికాస్ ఆఘాడిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఠాక్రే కుటుంబంలో మొట్టమొదటిసారిగా శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్ ఠాక్రే కుమారుడు, ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కావడం, బాల్ ఠాక్రే మనవడు, ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీలో అడుగుపెట్టడంతోపాటు కేబినేట్ మంత్రి కావడంలాంటి ఊహించని సంఘటనలతో ఈ సంవత్సరం ఠాక్రే నామ సంవత్సరంగా గుర్తుండిపోయింది. కలసి.. విడిపోయి ఈ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక మాదిరిగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ చిత్రం పూర్తిగా మారింది. ఊహించని ట్విస్ట్లతో ప్రజలతోపాటు రాజకీయ పార్టీల కార్యకర్తలను ఆయోమయంలో పడేశాయి. 2019లో లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే విడిపోయిన శివసేన, బీజేపీలు లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఒక్కటయ్యాయి. దీంతో లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీలు, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా పోటీ చేశాయి. ఫలితాలు శివసేన, బీజేపీల కూటమికి అనుకూలంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 శివసేనకు 56 ఇలా పూర్తి మెజార్టీ లభించింది. అయితే ఫిఫ్టీ–íఫ్టీ మార్పుల ఒప్పందం మేరకు రెండున్నరేళ్లపాటు శివసేనకు ముఖ్యమంత్రి ఇవ్వాలని శివసేన డిమాండు చేసింది. కాని అలాంటి ఒప్పందమేమి జరగలేదని బీజేపీ పేర్కొనడంతో వీరిమద్య విబేదాలు ఏర్పడ్డాయి. ఇలా ఈ అంశంపై దూరంపెరిగిన చివరికి ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినప్పటికీ శివసేన, బీజేపీలు విడిపోయాయి. దీంతో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో మహారాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పాలనను కూడా విధించారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. అన్ని ఒప్పందాలు కుదిరాయి. కానీ, ఊహించని విధంగా ఒప్పందం కుదిరిన మరుసటి రోజున ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతు పలికారు. ఊహించని విదంగా నవంబర్ 23వ తేదీ ఉదయం 8 గంటలకే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఊహించని ట్విస్ట్తో ఒక్కసారిగా అందరు షాక్కు గురయ్యారు. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర చర్చల్లోకెక్కింది. నవంబర్ 28న పట్టం.. రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు పొందిన ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ అజిత్ పవార్ను రాజీనామా చేయించడంతోపాటు ఆయనతో వెళ్లిన వారందరిని తిరిగి పార్టీలోకి వచ్చేలా ఒత్తిడి తీసుకువచ్చారు. అంతే మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారుతూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహాకూటమి ఆఘాడి ప్రభుత్వం నవంబర్ 28న కొలువదీరింది. శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే కుమారుడు శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇలా ఆరుగురు మంత్రులతో కొలువుదీరిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం ఎట్టకేలకు నెలరోజుల తర్వాత మళ్లీ పూర్తిస్థాయి మంత్రులతో కొలువుదీరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి కావడంతోపాటు ఆదిత్య ఠాక్రే కేబినేట్ మంత్రిగా మారారు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా తండ్రి ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా కుమారుడు ఆదిత్య ఠాక్రే కేబినేట్ మంత్రిగా మారారు. మరోవైపు బీజేపీ ఈ ఊహించని షాక్లతో ఖంగుతింది. -
సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థికం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. కీలక హోం మంత్రిత్వ శాఖను శివసేన తన వద్ద అంటిపెట్టుకుంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండేకు హోంతో పాటు పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖలు, మరో శివసేన మంత్రి సుభాష్ దేశాయ్కి పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, యువజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. ఎన్సీపీ మంత్రి జయంత్ పాటిల్కు ఆర్థిక శాఖను, గృహనిర్మాణం, మరికొన్ని శాఖల బాధ్యతలు అప్పగించారు. మరో ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్భల్కు నీటి పారుదల, గ్రామీణాభివృద్ది శాఖలు కేటాయించారు. కాంగ్రెస్ మంత్రి బాలాసాహెబ్ తోరట్కు రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖలు ఇచ్చారు. మరో కాంగ్రెస్ మంత్రి నితిన్ రౌత్కు పీడబ్ల్యూడీ, గిరిజనాభివృద్ధి శాఖలు అప్పగించారు. కాగా. గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 79వ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆయన నివాసంలో పూలగుచ్ఛం అందజేశారు. -
అష్ట దిగ్గజాల సరసన ఉద్ధవ్ !
సాక్షి, ముంబై : విధాన్ సభ, విధాన పరిషత్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర ఎలాంటి సభ్యత్వ పదవులు చేపట్టకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఎనిమిదో వ్యక్తి. ఇదివరకు నేరుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వారిలో బారిస్టర్ ఏ.ఆర్.అంతులే, వసంత్దాదా పాటిల్, శివాజీరావ్ పాటిల్–నిలంగేకర్, శంకర్రావ్ చవాన్, శరద్ పవార్, సుశీల్కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. ఆరు నెలల్లో.. నియమాల ప్రకారం సభాగృహంలో ఎలాంటి సభ్యత్వ పదవులు లేని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల కాలవ్యవధిలో విధానసభ లేదా విధాన పరిషత్లో సభ్యుడు కావల్సి ఉంటుంది. లేదంటే ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ, అదృష్టవశాత్తు ఇంతవరకు ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు. 1980లో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పటి ఎంపీ వసంత్దాదా పాటిల్, ఎమ్మెల్యే ప్రతిభా పాటిల్ పేరు చర్చల్లో ఉన్నాయి. ఎంపీ పదవికి రాజీనామా చేసిన వసంత్దాదా పాటిల్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావించారు. కానీ, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఎమ్మెల్యే పదవి లేని కాంగ్రెస్ నేత బారిస్టర్ ఎ.ఆర్.అంతులేకు కట్టబెట్టారు. ఉభయ సభలో ఎలాంటి పదవులు చేపట్టకపోయినా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా అంతులేకు ఘనత దక్కింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసి సభాగృహం సభ్యుడయ్యారు. 1982 జనవరి 12వ తేదీ వరకు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 1982 జనవరి 21వ తేదీన బాబాసాహెబ్ బోస్లే ముఖ్యమంత్రి అయ్యారు. ముంబైలోని కుర్లా నియోజక వర్గం నుంచి గెలిచారు. ఆ తరువాత 1983 ఫిబ్రవరి రెండో తేదీన ఎంపీ వసంత్ దాదా పాటిల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి విధాన్ పరిషత్ ద్వారా మంత్రివర్గంలోకి వచ్చారు. 1993లో పవార్.. 1985 జూన్ మూడో తేదీన శివాజీరావ్ పాటిల్– నిలంగేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఆయన విధాన పరిషత్కు ఎన్నికయ్యారు. అనంతరం నిలంగా అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికలో విజయఢంకా మోగించారు. కేంద్ర మంత్రిగా ఉన్న శంకర్రావ్ చవాన్ 1986 మార్చి 12వ తేదీన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. విధాన్ పరిషత్ ఎన్నికలో గెలిచి సభాగృహం సభ్యుడయ్యారు. 1993లో శరద్ పవార్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ముంబైలో అల్లర్లు జరిగిన తరువాత సుధాకర్రావ్ నాయిక్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 1993 మార్చి ఆరో తేదీన శరద్ పవార్ ముఖ్యమంత్రి అయ్యారు. సభాగృహం సభ్యుడయ్యేందుకు విధాన్ పరిషత్ మార్గాన్ని ఎంచుకున్నారు. 2003 జనవరి 18వ తేదీన రాష్ట్ర పగ్గాలు సుశీల్కుమార్ షిండే చేతిలోకి వెళ్లాయి. అదికూడా ఢిల్లీ వదిలి వచ్చిన తరువాత షోలాపూర్లో జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీలోకి వెళ్లారు. అలాగే ఆదర్శ్ సొసైటీలో జరిగిన కుంభకోణం కారణంగా అశోక్ చవాన్ రాజీనామా చేయడంతో పృథ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత ఆయన విధాన్ పరిషత్కు ఎన్నికయ్యారు. తాజాగా 2019 నవంబర్ 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే ఉభయ సభల్లో ఎలాంటి పదవుల్లో లేరు. -
ఎక్కడ తగ్గాలో తెలుసు..!
-
‘మహా’ రాజకీయం: వ్యంగ్య కార్టూన్!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన పార్టీలు పట్టు వీడటం లేదు. ఎన్నికలకు ముందే కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ- శివసేనల మధ్య ఫలితాల అనంతరం విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య నెలకొన్న ఈ సందిగ్దతపై ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడో క్రాస్టో సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఓ కార్టూన్ వేసి ట్విటర్లో షేర్ చేశారు. శివసేన పార్టీ అధికార గుర్తు అయిన బాణం...బీజేపీ చిహ్నం కమలానికి గురి ఎక్కుపెట్టినట్లుగా కార్టూన్ను చిత్రీకరించారు. కాగా గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా.. శివసేన 56 సీట్లలో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కింగ్ మేకర్గా అవతరించిన శివసేన.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ సంకేతాలు జారీ చేస్తూ బీజేపీని హెచ్చరిస్తోంది.(చదవండి : బీజేపీ మదిలో గత కాలపు జ్ఞాపకాలు) మరోవైపు మహారాష్ట్రకు మరో ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రినని దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...‘ముఖ్యమంత్రి పీఠంపై మేమెప్పుడూ 50:50ఫార్ములా పాటిస్తామని వారికి చెప్పలేదు. మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సైతం శివసేనకు సిఎం పదవి ఇవ్వడంపై ఏనాడు హామీ ఇవ్వలేదు. వచ్చే ఐదేళ్ల పాటు కూటమితో కలిసి స్థిరమైన, సమర్థవంతమైన ప్రభుత్వానికి బీజేపీ నాయకత్వం మహించనుంది. మాకు పది మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అలాగే మరో ఐదుగురు కూడా మాకు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు’ అని తెలిపారు. -
శివసేనతో ‘చేయి’ కలపం: ఎన్సీపీ
ముంబై: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు శివసేనతో చేతులు కలపబోమని శుక్రవారం కాంగ్రెస్, ఎన్సీపీ స్పష్టం చేశాయి. తమను విపక్షంలో కూర్చోమన్న ప్రజా తీర్పును శిరసావహిస్తామని మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్ పేర్కొన్నారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న ఆలోచన కానీ ప్రతిపాదన కానీ లేదని చెప్పారు. ఒకవేళ మద్దతు కోరుతూ శివసేన తమ వద్దకు వస్తే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. శివసేనతో పొత్తు వార్తను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో.. అధికార పంపిణీ విషయంలో మిత్రపక్షం శివసేన 50:50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న డిమాండ్ను శివసేన ముందుకు తెచ్చింది. బీజేపీకి తగ్గిన ఓట్ల శాతం.. గురువారం వెలువడిన ఎన్నికల పలితాల్లో బీజేపీ సత్తా చాటినప్పటికీ గతంతో పోలిస్తే ఓటుశాతం తగ్గింది. తమ మిత్రపార్టీతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనా.. ఓటు షేర్ మాత్రం కోల్పోయింది. 2014లో బీజేపీ పోటీ చేసిన 260 సీట్లలో 122 స్థానాల్లో విజయం సాధించగా, పస్తుతం ఆ సంఖ్య 105కు పడిపోయింది. గతంలో 27.8 శాతంగా ఉన్న బీజేపీ ఓటు షేరు రెండు శాతం కోల్పోయి 25.7తో ఆగిపోయింది. శివసేన ప్రస్తుతం 56 సీట్లు సాధించింది. అయితే ఓటు షేరు మాత్రం 2.9 శాతం కోల్పోయింది. ఎన్సీపీ ఓటు షేరు గతంలో 17.2 శాతం ఉండగా ప్రస్తుతం 16.7శాతానికి తగ్గింది. గతంలో 41 సీట్లు గెలుచుకోగా ఇప్పుడు 54 సీట్లు సాధించింది. కాంగ్రెస్ గతంలో 18 శాతం ఓట్లను కలిగి ఉండగా ఇప్పుడది 15.9కి పడిపోయింది. అయితే సీట్ల సంఖ్యను మాత్రం 42 నుంచి 44కు పెంచుకుంది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన 2.3 శాతం ఓటు షేరును సాధించింది. తొలి ప్రయత్నంలోనే... నాగ్పూర్: ఈఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అభ్యర్థులు కూడా సత్తా చూపారు. మొత్తం 12 స్థానాల్లో మొదటిసారి బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. అందులో కొందరు సీనియర్ నేతలపై విజయం సాధించారు. -
శివసేనలోకి సల్మాన్ ‘బాడీగార్డ్’
-
శివసేనలోకి సల్మాన్ ‘బాడీగార్డ్’
ముంబై: మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి తుదిగడువు. దీంతో అన్ని ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ప్రచారానికి కొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో అస్త్రశస్త్రాలను ఉపయోగించేందుకు సిద్దపడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కు సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న బాడీగార్డ్, ముఖ్య అనుచరుడు గుర్మీత్ సింగ్ అలియాస్ షేరా శుక్రవారం శివసేనలో చేరారు. గుర్మీత్ సింగ్కు శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఎన్నికల పోలింగ్కు కొద్ది గంటల ముందు సల్మాన్ ఖాన్ అనుచరుడు శివసేనలో చేరడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఏ ఉద్దేశంతో పార్టీలో చేరాడనే దానిపై చర్చించుకుంటున్నారు. గుర్మీత్ సింగ్ పార్టీలో చేరే కార్యక్రమంలో ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలు ఇద్దరూ పాల్గొనడంతో వారి అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఇక సోమవారం(అక్టోబర్ 21) మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడనున్నాయి. -
వర్లిలో కుమార సంభవమే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణ ముంబైలో అందరి దృష్టి వర్లి నియోజకవర్గంపై పడింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారిగా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో యువ సేనాని ఆదిత్య ఠాక్రే దిగడంతో ఈ సీటుపై చర్చ సాగుతోంది. ఆయన గెలుపుపై కాకుండా మెజార్టీ ఎంత వస్తుందన్న దానిపై చర్చ సాగుతోంది. వర్లి ఎప్పట్నుంచో శివసేనకు కంచుకోట. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. బీజేపీ–సేన కూటమి గెలిస్తే ఆదిత్య ఉప ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కొనసాగుతోంది. ఇక ఆదిత్యపై పోటీకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ మానె దళిత నాయకుడు. ఆయన స్థానిక నేత. పక్కా లోకల్ అన్న ప్రచారంతోనే ఆదిత్యకు పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వర్లి ఒక మినీ మహారాష్ట్ర ఈ నియోజకవర్గం మినీ మహారాష్ట్రను తలపిస్తుంది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరైన వర్లి గత కొద్ది ఏళ్లలో రూపురేఖలు మారాయి. ఆకాశహర్మ్యాలు, అధునాతన వాణిజ్య భవనాలు వచ్చాయి. వాటి పక్కనే మురికివాడల్లో ప్రజలూ ఉన్నారు. చాల్స్ (ఇరుకు గదులుండే నాలుగైదు అంతస్తుల భవంతులు)లో ఉద్యోగులు ఉన్నారు. భిన్న కులాలు, మతాలు, విభిన్న భాషలు ఇలా ఈ ఒక్క నియోజకవర్గం మహారాష్ట్రకు నమూనాలా ఉంటుంది. మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తెలుగు వారితోపాటు ఉర్దూ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఇలా భిన్న తరహా ఓటర్లను ఆకర్షించడం సులభమేమీ కాదు. దానికి తగ్గట్టుగానే ఆదిత్య ప్రచారంలో ముందున్నారు. ‘సలాం వర్లి’ అంటూ వివిధ ప్రాంతీయ భాషల్లో భారీ కటౌట్లు ఉంచి మరాఠీయేతరుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరే కాలనీలో వందల భారీ వృక్షాల నరికివేత, ముంబై నైట్ లైఫ్ అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు, ఆద్యితకు బాలీవుడ్ హీరో సంజయ్దత్ మద్దతుపలికారు. ఆదిత్యకు కలిసొచ్చేవి ► బాల్ ఠాక్రే వారసత్వం ► సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ యువ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం ► ముంబై లైఫ్ వంటి అంశాల ప్రస్తావన ► అభివృద్ధి మంత్రం సురేశ్ మానెకు అనుకూలమివీ.. ► దళిత కార్డు ► లోకల్ ఇమేజ్ ► ఇంటింటికీ తిరగుతూ ప్రజలతో అనుసంధానం ► వివిధ భాషల వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు గతంలో ఫలితాలు ఇలా.. ► 1990 నుంచి ఎన్నికల ఫలితాలను చూస్తే సేన ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైంది. ► 1990 నుంచి 2004 ఎన్నికల వరకు శివసేన నుంచి దత్తాజీ తనవాందే ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ► 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సచిన్ ఆహిర్ గెలుపొందారు. రాజ్ ఠాక్రేకు చెందిన ఎంఎన్ఎస్ ఓట్లు భారీగా చీల్చడంతో ఎన్సీపీ అభ్యర్థికి లాభం చేకూరింది. ► 2014లో శివసేన అభ్యర్థి సునీల్ షిండే గెలుపొందారు. -
‘మహా’ భవిష్యత్ నిర్ణేత కొంకణ్!
ముంబై: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొంకణ్ ప్రాంతం కీలకంగా మారనుంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో నాలుగో వంతు అంటే 75 సీట్లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్న ననార్ రిఫైనరీ, ఆరే వద్ద మెట్రో కార్షెడ్ సమస్య, పీఎంసీ బ్యాంకు స్కాంలు ఈ నెల 21న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాంశాలుగా తెరపైకి వచ్చాయి. కొంకణ్లో ప్రధాన పోటీ బీజేపీ– శివసేన, కాంగ్రెస్– ఎన్సీపీల మధ్యే ఉంది. మరికొన్ని చిన్నాచితకా పార్టీలు సైతం ఉనికి కోసం ఈ ప్రాంతంలో పోరాడుతున్నాయి. కొంకణ్లోని మొత్తం 75 అసెంబ్లీ స్థానాల్లో ముంబైలో 29 సీట్లతోపాటు కాంగ్రెస్ మొత్తం 44 చోట్ల అభ్యర్థులను బరిలో నిలిపింది. ఎన్సీపీ 18 సీట్లలో పోటీకి దిగుతోంది. పొత్తులో భాగంగా శివసేన 44 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 19 నియోజకవర్గాలు ముంబైలోనివే. అధికార బీజేపీ మాత్రం ఇక్కడ 29 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఇందులో 17 స్థానాలు ముంబై పరిధిలోనివే. కొంకణ్ పరిధిలోకి వచ్చే ముంబైలో కూడా 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. కీలక అంశాలపై విభేదాలు రత్నగిరి జిల్లాలోని ననార్లో తలపెట్టిన రిఫైనరీ ప్రాజెక్టు గతంలో శివసేన, బీజేపీల మ«ధ్య వివాదానికి కారణమయింది. ఈ ప్రాజెక్టు కొంకణ్ ప్రాంతంలోని పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని శివసేన ఆరోపించడం చర్చనీయాంశమైంది. ననార్ రిఫైనరీని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న శివసేనను బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. రిఫైనరీ ప్రాజెక్టు స్థాపనను అంగీకరించేదిలేదనీ, అది ముగిసిన అంశమని శివసేన అంటోంది. ఆరే కాలనీ వద్ద నిర్మించ తలపెట్టిన కార్ షెడ్ వల్ల స్థానికంగా 2,000 చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు దాకా వెళ్లడం వివాదాస్పదమైంది. వేలాది మంది ప్రజలను నష్టాల్లో ముంచిన పీఎంసీ బ్యాంక్ కుంభకోణం కూడా రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. కొంకణ్ ప్రాంతంలోని పాల్ఘర్, థానే, రత్నగిరి, సింధు దుర్గ్ లలో శివసేన బలంగా ఉండగా, ముంబైలో బీజేపీ కీలకంగా ఉంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్తోపాటు శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్పార్టీ (ఎన్సీపీ) పట్టు కోల్పోవడం బీజేపీ, శివసేనలకు వరంగా మారింది.