Akhil
-
లెనిన్ లవ్స్టోరీ
‘ఏజెంట్’ మూవీ తర్వాత అఖిల్ కొత్త చిత్రానికి సంబంధించిన సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ కిరణ్ మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘లెనిన్’ అనే చిత్రం రూపొందుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారట. ఇది చిత్తూరు నేపథ్యంలో సాగే గ్రామీణ యాక్షన్ లవ్స్టోరీ ఫిల్మ్ అని, ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని సమాచారం. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 14న హైదరాబాద్లో ప్రారంభం అవుతుందని, దాదాపు ఇరవై రోజులు పాటు షూటింగ్ కొనసాగుతుందని ఫిల్మ్నగర్ టాక్. అన్నపూర్ణ స్డూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్పై ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్బాబు. రాజమౌళి డైరెక్షన్లోని కొత్త సినిమా కోసమే మహేశ్బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్తో మరో గెటప్లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్చరణ్ క్లీన్ షేవ్ లుక్స్తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్చరణ్ హెయిర్ స్టైల్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్లో ఫుల్ వైట్ హెయిర్తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్తో, కరెక్ట్ ఫిజిక్తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్గా చాలా హార్డ్వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్లో.. మాసీ లుక్స్తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్లో నటించాలంటే స్పెషల్గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్తో, స్ట్రాంగ్ ఫిజిక్తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
చిత్తూరు నేపథ్యంలో అఖిల్ కొత్త సినిమా ప్రకటన
అఖిల్ హీరోగా ‘వినరోభాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ‘లెనిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగిందని, ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారని టాక్. అలాగే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ అని తెలిసింది. ఇది చిత్తూరు నేపథ్యంలో సాగే రూరల్ లవ్స్టోరీ మూవీ అని ఫిల్మ్నగర్ భోగట్టా. -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సినీ ప్రియులు ఇప్పుడంతా ఓటీటీల వైపే చూస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు అభిమానులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగానే ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను అందిస్తున్నాయి. అలా మరో యూత్ఫుల్ కామెడీ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో తెరకెక్కించిన ఈ కామెడీ వెబ్సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్.. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం అనేది ఉపశీర్షిక.బిగ్బాస్ రన్నరప్ అఖిల్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తెలుగు రియాలిటీ బిగ్బాస్లో రెండు సార్లు రన్నరప్గా నిలిచాడు. బిగ్బాస్ సీజన్ 4తో పాటు బిగ్బాస్ నాన్ స్టాప్లో అతడికి టైటిల్ చేజారింది. బిగ్బాస్తో ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ అఖిల్కు పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ అంటూ ఈ సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అఖిల్. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ వెబ్సిరీస్లో అఖిల్ సార్ధక్, మహేష్ విట్టాతో పాటు పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు 50కి పైగా ఎపిసోడ్స్తో ఈ వెబ్సిరీస్ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.తమిళ రీమేక్గా వేరే లెవెల్ ఆఫీస్..తమిళంలో విజయవంతమైన వేర మారి ఆఫీస్కు రీమేక్గా ఈ వెబ్సిరీస్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సీజన్- 2 ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్-1 యూత్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితం ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించినట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. View this post on Instagram A post shared by OTT Updates (@upcoming_ott_release) -
మిషన్ మేకోవర్
సినిమా కథకు తగ్గట్లుగా డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ చేయడమే కాదు... క్యారెక్టరైజేషన్కు సరిపోయేట్లు హీరోల ఆహార్యం కూడా ఉండాలి... గెటప్ కుదరాలి. అప్పుడే సిల్వర్ స్క్రీన్పై కథ ఆడియన్స్కు మరింత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇలా కనెక్ట్ కావడం కోసం కొందరు హీరోలు మేకోవర్ మిషన్ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ‘తండేల్’ కోసం నాగచైతన్య, ‘స్వయంభూ’కి నిఖిల్, ‘స్వాగ్’కి శ్రీవిష్ణు వంటి హీరోలు మేకోవర్ అయ్యారు. త్వరలో సెట్స్కి వెళ్లడానికి మిషన్ మేకోవర్ అంటూ రెడీ అవుతున్న హీరోల గురించి తెలుసుకుందాం.⇒ మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్పై మహేశ్బాబును సరికొత్తగా చూపించాలని రాజమౌళి ఫిక్స్ అయిపోయారు. ఇందుకు తగ్గట్లుగానే మహేశ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. మేకోవర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరిలో మహేశ్ విదేశాలకు వెళ్లొచ్చారు. ఈ సినిమాలో మహేశ్ లుక్, గెటప్ కంప్లీట్ డిఫరెంట్గా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఈ చిత్రకథను ఇప్పటికే పూర్తి చేశారు విజయేంద్రప్రసాద్. పాటల పని కూడా ఆరంభించారు సంగీతదర్శకుడు కీరవాణి. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఆగస్టు 9న మహేశ్బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణ గురించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ కొత్త సినిమా మేకోవర్ అంటే చాలు... ఎన్టీఆర్ రెడీ అనేస్తారు. ఈసారి దర్శకుడు ప్రశాంత్ నీల్కు ఎన్టీఆర్ ఓకే చెప్పారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తామని ఇటీవల మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ గ్యాప్లో ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. వీలైనంత త్వరగా ఈ సినిమా తొలి భాగం షూట్ను పూర్తి చేసి, ‘డ్రాగన్’ మేకోవర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా, విలన్గా బాబీ డియోల్ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్తో రామ్చరణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తన వంతు షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత రామ్చరణ్ ఆస్ట్రేలియా వెళ్తారు. హాలీడే కోసం కాదు.... బుచ్చిబాబు సన దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలోని క్యారెక్టర్ మేకోవర్ కోసం వెళ్లనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులోప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బుచ్చిబాబు. కాగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ మూవీలోని గెటప్స్ కోసం చరణ్ ప్రత్యేక్ష శిక్షణ తీసుకోనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ⇒ విజయ్ దేవరకొండను ఇప్పటివరకు అర్బన్, సెమీ అర్బన్ కుర్రాడిగానే ఎక్కువగా సిల్వర్ స్క్రీన్పై చూశాం. కానీ తొలిసారి పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ మాస్ డ్రామాగా ఓ మూవీ రానుంది. ఈ సినిమా కోసమే విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా మేకోవర్ కానున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తన కొత్త మేకోవర్ ఆరంభిస్తారట విజయ్. ⇒ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన గత చిత్రం ‘ఏజెంట్’. ఈ స్పై మూవీ కోసం అఖిల్ స్పెషల్గా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేశారు. ఈ సినిమా తర్వాత అఖిల్ నటించాల్సిన కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ అఖిల్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఫ్యాంటసీ అండ్ పీరియాడికల్ యాక్షన్ మూవీలో అఖిల్ హీరోగా నటిస్తారని, 11వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ ట్రైబల్ నాయకుడిగా అఖిల్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ్రపోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.ఈ సినిమాలోని తన గెటప్ కోసమే అఖిల్ మేకోవర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో కాస్త పోడవాటి జుట్టుతో, సరికొత్త ఫిజిక్తో అఖిల్ సరికొత్తగా కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ కోసమే అఖిల్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారట. దాదాపు రూ. వంద కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ హీరోలే కాదు... కథానుగుణంగా మేకోవర్ అవుతున్న హీరోలు మరికొందరు ఉన్నారు. -
Shooting World Cup: ఆరు పతకాలతో అగ్రస్థానంలో భారత్
కైరో: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ అఖిల్ షెరాన్ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అఖిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో అఖిల్ 451.8 పాయింట్లు స్కోరు చేశాడు. అఖిల్ ప్రదర్శనతో భారత్ ఈ టోర్నీని రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో అగ్రస్థానంతో ముగించింది. ఇవీ చదవండి... భారత్కు ఐదో స్థానం మస్కట్: ‘ఫైవ్–ఎ–సైడ్’ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు ఐదో స్థానం లభించింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 6–4 గోల్స్ తేడాతో ఈజిప్ట్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మణీందర్ (10వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... రాహీల్ (8వ ని.లో), పవన్ (9వ ని.లో), ఉత్తమ్ (13వ ని.లో), మందీప్ (11వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫైనల్లో నెదర్లాండ్స్ 5–2తో మలేసియాపై గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్లో రష్మిక జోడీ ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రషి్మక... డబుల్స్లో వైదేహి చౌధరీ (భారత్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ‘వైల్డ్ కార్డు’తో సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పోటీపడిన రష్మిక తొలి రౌండ్లో 6–7 (8/10), 6–7 (2/7)తో రీనా సాల్గో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఏడు ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–3తో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీపై విజయం సాధించింది. -
హైదరాబాద్ అబిడ్స్ లో వ్యభిచారం ముఠా అరెస్ట్
-
గ్లామర్ సీక్రెట్ ఏంటి?
-
వ్యభిచార కేసులో అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
-
అబిడ్స్ వ్యభిచారం కేసు.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్నగర్కు చెందిన అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్నగర్ అఖిల్ పహల్వాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాంనగర్ అఖిల్ వ్యభిచారం కేసు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్లను పోలీసులు బయటికి తీయగా.. అతడి మొబైల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్.. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు అఖిల్పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు. చదవండి: పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
Akkineni Nagarjuna-Akhil: విశాఖ ఏయూలో నాగార్జున, అఖిల్ సందడి (ఫొటోలు)
-
సందేశంతో హెచ్చరిక
అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, గిడ్డేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు. ‘‘సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో చిక్కు కుని అనాథలు నేరస్థులుగా మారే ప్రమాదం ఉందనే సందేశానికి కమర్షియల్ హంగులు మేళవించి ఈ సినిమా తీస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, రెండు ఫైట్స్ను చిత్రీకరించాం. డిసెంబరు కల్లా సినిమా షూటింగ్ను పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అంతుచిక్కని మహమ్మారి.. శోక సంద్రంలో తల్లిదండ్రులు
హైదరాబాద్: అంతుచిక్కని వ్యాధితో పోరాడిన సందెపల్లి శివచరణ్ ఓడిపోయి మృత్యువు ఒడికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం ఇంట్లోనే ప్రాణాలు విడిచాడు. మృతుడి అన్న అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం, ముల్కలపల్లి గ్రామానికి చెందిన సందెపల్లి ఉప్పలయ్య, పారిజాత దంపతులు చాలాకాలం క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి స్థానిక సోనియాగాందీనగర్లో నివాసం ఉంటున్నారు. వారికి సందెపల్లి అఖిల్, సందెపల్లి శివచరణ్ ఇద్దరు కుమారులు. అయితే వీరిద్దరూ చిన్ననాటి నుంచే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారు మస్క్యూలర్ డిస్ట్రోఫి అనే వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నడవలేకపోవడం, నడుస్తూ పడిపోవడం వంటి లక్షణాలతో ప్రారంభమైన వ్యాధి రానురాను కదల్లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. క్రమంగా చేతులు, కాళ్లు వంకరపోయి పూర్తిగా చచ్చుబడిపోవడంతో ఒకరు 12, మరొకరు 8వ ఏట నుంచి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల దుస్థితిని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. తీవ్ర జ్వరంతో శివచరణ్ మృతి ఈ క్రమంలో వారు 2017లో సాక్షిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల దుస్థితిపై ఆడి.. పాడే.. వయస్సులో అంతుచిక్కని వ్యాధి అంటూ 2017 మే నెలలో సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. సాక్షి కథనానికి స్పందించిన బీఎల్ఆర్ ట్రస్టు చైర్మన్, ప్రస్తుత బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వారిని కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంబైలో వ్యాధికి సంబంధించి వైద్యం లభిస్తుందని, అందుకు తమకు స్థోమత లేదని బీఎల్ఆర్తో తల్లిదండ్రులు వాపోయారు. తనకున్న పరిచయాలతో అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరి వైద్యం చేయించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని కొంత కాలం మందులు వాడాలన్న వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర జ్వరంతో శివచరణ్ ఆదివారం మృతిచెందాడు. పెద్ద కొడుకు అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఎల్ఆర్ వారికి ఆర్థికసాయం అందజేసి ధైర్యం చెప్పారు. -
అఖిల్ ఫ్యాన్స్కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!
అక్కినేని అఖిల్ ఇటీవలే నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే) అయితే ఈ విషయంలో ఈ మూవీకి మరో షాక్ తగిలింది. అయితే వైజాగ్కు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ సతీశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 29న ఏజెంట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే విధించింది. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన అఖిల్ ఫ్యాన్స్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఏజెంట్ మూవీ ఇప్పుడైన వస్తోందని ఆశించిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు) -
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ టార్గెట్ ఏంటి..?
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెల్లడి కాలేదు. అయితే అనిల్ అనే ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేయనున్నారని, ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో అఖిల్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. శ్రీకాంత్ ఓ కథను రెడీ చేసి, అఖిల్కు వినిపించారట. ఈ స్క్రిప్ట్ అఖిల్కి నచ్చిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అఖిల్ – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లోని సినిమా ఉంటుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘పెద కాపు 1’ ఈ నెలలోనే విడుదల కానుంది. ఒకవేళ అఖిల్తో సినిమా కన్ఫార్మ్ అయితే.. ‘పెద కాపు 1’ విడుదల తర్వాత ప్రకటన వస్తుందేమో? -
'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో సందడి చేశారు. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను కింగ్ నాగార్జున చేతులమీదుగా విడుదల చేశారు. ఈవెంట్లో పాల్గొన్న నాగార్జున తన కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో తన భార్య అమల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమల గర్భంతో ఉండగా తాను ఆరునెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో అమలతోనే ఉన్నానంటూ నాగ్ వెల్లడించారు. కాగా.. అమల, నాగార్జున జంటకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) నాగార్జున మాట్లాడుతూ..' 'మాతృత్వం అనేది నిజంగా ఓ అద్భుతమైన అనుభవం. అప్పుడు జరిగిన ప్రతి సంఘటన నాకు గుర్తే. అప్పడు హలో బ్రదర్ చిత్రంలో నటిస్తున్నా. అదే సమయంలో అమల గర్భం ధరించింది. దీంతో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. ఆరు నెలలపాటు అమలతో ఉన్నాను. ఏ సినిమా చేయలేదు. చివరికీ డెలివరీ టైంలో కూడా చేయి పట్టుకుని దగ్గరే ఉన్నా. డెలివరీ అంటే ఒక ప్రాణం పోయడం. అఖిల్ డెలివరీ టైమ్లో ఆరు నెలలు ఏ షూటింగ్స్ పెట్టుకోకుండా అమలతోనే ఉన్నా. ఆ టైమ్ నా లైఫ్లో బెస్ట్ మూమెంట్. మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు, అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ' అని అన్నారు. హీరో సోహైల్ మాట్లాడుతూ .. 'తెలుగు ప్రేక్షకుల్లో నాకు దక్కిన గుర్తింపునకు నాగార్జునే కారణం. ఆయన బిగ్ బాస్లో మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా గ్లింప్స్ ఆయనకు చూపించి, ట్రైలర్ రిలీజ్కు రావాలని కోరా. గుర్తు పెట్టుకుని మరీ వచ్చారు. తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి ఎంత కష్ట పడుతుందో మనం వింటుంటాం. కానీ ఆ కష్టాన్ని ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నా. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి అమ్మను హగ్ చేసుకుంటారు. ఫ్యామిలీతో కలిసి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూడండి.' అని అన్నారు. యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైక్ మూవీస్ బ్యానర్పై మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను నాగార్జున చేతుల మీదుగా హైదరాబాద్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 18న 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండండతో ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. (ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!) -
'ఏజెంట్' డిజాస్టర్.. సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనా!
టాలీవుడ్ దర్శకుల్లో వివి వినాయక్ది ప్రత్యేక శైలి. 2002లో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాకే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డ్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, లక్ష్మీ, సాంబ, బన్నీ, బద్రినాథ్, అదుర్స్, అఖిల్, ఖైదీ నంబర్150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన ఇంటలిజెంట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. తాజాగా హిందీ ఛత్రఫతి రీమేక్ డిజాస్టర్ కావడంతో వినాయక్ పనైపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్.. నెల సంపాదన ఎంతో తెలుసా?) అయితే సరిగ్గా అదే కోవలోకి మరో డైరెక్టర్ చేరిపోయాడు. అఖిల్ ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. అతనొక్కడే చిత్రం ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సురేందర్..కిక్, రేసుగుర్రం, ధృవ లాంటి హిట్ చిత్రాలు అందించారు. ఊసరవెల్లి, అతిథి, కిక్-2, సైరా లాంటి ఫ్లాప్లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీపై ఎవరితో అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మించిన సురేందర్ రెడ్డికి ఇప్పుడు యంగ్ హీరోలే మిగిలారు. తాజాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే సురేందర్ రెడ్డి సినిమాకు ఫైనాన్స్ చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి వచ్చిందని సినీవర్గాల టాక్. ఏదేమైనా టాలీవుడ్లో సురేందర్ రెడ్డి మరో వి.వి. వినాయక్ అవుతాడా అనే విషయంపై చర్చ నడుస్తోంది. (ఇది చదవండి: అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!) -
పడతారండి ప్రేమలో మళ్లీ..!
నిన్నమొన్నటివరకూ పాన్ ఇండియా ట్రెండ్లో యాక్షన్ సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ లవ్ట్రెండ్ మొదలైంది. యాక్షన్ సినిమాలు చేస్తున్న హీరోలు మళ్లీ వెండితెరపై ప్రేమలో పడటానికి ప్రేమకథలు వింటున్నారు. కొందరి ప్రేమకథలు ఆల్రెడీ ఆన్ సెట్స్లో ఉన్నాయి. ఈ వెండితెర ప్రేమికుల ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ప్రభాస్ అనగానే సినిమా లవర్స్ ఎక్కువగా ‘బాహుబలి’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘సాహో’ వంటి యాక్షన్ మూవీస్ గురించి మాట్లాడుకుంటారు. కాగా ప్రభాస్ కెరీర్లో మంచి హిట్స్ సాధించిన ‘వర్షం’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గడచిన పదేళ్లల్లో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ (2022) తప్ప అన్నీ యాక్షన్ చిత్రాలే చేశారు. ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలతో యాక్షన్ మోడ్లోనే ఉన్నారు. మళ్లీ ఓ ప్రేమక£ý చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ హను రాఘవపూడి రెడీ చేసిన ఓ ప్రేమ కథను ప్రభాస్ విన్నారని, ఇది పీరియాడికల్ లవ్స్టోరీ అనీ సమాచారం. ► ‘100 పర్సెంట్ లవ్’, ‘ఏ మాయ చేసావె’, ‘మనం’ , ‘ఒక లైలా కోసం’, ‘ప్రేమమ్’, ‘మజిలీ’, ‘లవ్స్టోరీ’.... ఇలా చెప్పుకుంటూ పోతే నాగచైతన్య కెరీర్లోని మేజర్ పార్ట్ అంతా ప్రేమతోనే నిండిపోయి ఉంటుంది. కాగా తన గత చిత్రం ‘కస్టడీ’లో నాగ చైతన్య ఎక్కువగా యాక్షన్ చేశారు. అయితే చైతూ తన ప్రేమతో మరోసారి ఆడియన్స్ను ప్రేమలో పడేయనున్నారని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సూరత్ బ్యాక్డ్రాప్తో సాగే ఓ లవ్స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని, ఇందులో నాగచైతన్య బోటు డ్రైవర్ పాత్ర చేయనునున్నారనీ టాక్. ► హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ప్రేమ, మాస్ కథలు సమానంగా కనిపిస్తాయి. కానీ విజయ్కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం మాస్ లవ్స్టోరీ ‘అర్జున్రెడ్డి’, క్లాస్ లవ్స్టోరీస్ ‘పెళ్ళి చూపులు’, ‘గీతగోవిందం’ వంటి సినిమాలే. దీంతో విజయ్ మరోసారి లవ్స్టోరీస్పై ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణతో విజయ్ ప్రస్తుతం ‘ఖుషి’ అనే లవ్స్టోరీ చేస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్. అలాగే ‘గీత గోవిందం’ తర్వాత దర్శకుడు పరశురామ్తో మరో సినిమా చేస్తున్నారు విజయ్. ఇది కూడా ప్రేమకథా చిత్రమేనన్నది ఫిల్మ్నగర్ టాక్. ► ‘డీజే టిల్లు’తో మరింత పాపులారిటీని సాధించిన సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాథ వినుమా’ వంటి ప్రేమకథా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సిద్ధు ‘డీజే టిల్లు స్క్వేర్’తో బిజీగా ఉన్నారు. అలాగే దర్శకురాలు నందినీ రెడ్డితో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఓ డిఫరెంట్ లవ్స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. ► ‘దొరసాని’ వంటి ప్రేమకథతో పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘హైవే’ వంటి క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ఆనంద్ నటించిన మరో లవ్స్టోరీ ‘బేబీ’. ప్రేమకథా చిత్రంగా సాయిరాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. మరికొందరు హీరోలు కూడా ఆడియన్స్ను ప్రేమలో పడేసేందుకు ప్రేమకథలు వింటున్నట్లు తెలుస్తోంది. ► ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’... ఇలా కొన్ని ప్రేమకథల్లో నటించారు అఖిల్. అయితే అఖిల్ గత చిత్రం ‘ఏజెంట్’ ఫుల్ యాక్షన్ ఫిల్మ్. దీంతో తన తర్వాతి చిత్రాన్ని లవ్ జానర్లోనే చేయాలనుకుంటున్నారట అఖిల్. ఈ క్రమంలోనే అనిల్కుమార్ అనే ఓ కొత్త దర్శకుడి కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, ఫ్యాంటసీ లవ్స్టోరీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుందని, ‘ధీర’ టైటిల్ను పరిశీలిస్తున్నారనీ టాక్. -
ధృవ-2లో ఏజెంట్ !
-
Agent Movie Review: 'ఏజెంట్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: ఏజెంట్ నటీనటులు: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మురళీ శర్మ, మమ్ముట్టి, సంపత్ రాజ్, డినో మోరియా, విక్రమ్ జీత్ తదితరులు నిర్మాణసంస్థలు: ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్ నిర్మాత: రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపారెడ్డి కథ: వక్కంతం వంశీ దర్శకత్వం: సురేందర్ రెడ్డి సంగీతం: హిప్హాప్ తమిజా ఆది సినిమాటోగ్రఫీ: రసూల్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2023 అసలు కథేంటంటే: అక్కినేని అఖిల్(రామకృష్ణ) అలియాస్ రిక్కీ.. రా ఏజెంట్ కావాలనేది అతని కల. ఆ కలను నిజం చేసుకునేందుకు మూడుసార్లు పరీక్ష రాసి పాసైనా ఇంటర్వ్యూలో మాత్రం రిజెక్ట్ అవుతూ ఉంటాడు. మమ్ముట్టి(మహదేవ్) రా(RAW) ఛీఫ్. ఇండియాను టార్గెట్ చేసిన డినో మోరియా(ది గాడ్)ను అంతం చేయాలన్నదే మహదేవ్ ఆశయం. అందుకోసం ఓ మిషన్ను ఏర్పాటు చేస్తాడు. అఖిల్ తన కల నేరవేర్చుకునేందుకు మహదేవ్ను కలుస్తాడు. కానీ అఖిల్ను చేర్చుకునేందుకు మమ్ముట్టి నిరాకరిస్తాడు. అదే క్రమంలో హీరోయిన్ సాక్షి వైద్య(విద్య)తో అఖిల్కు పరిచయం ఏర్పడుతుంది. పైలట్గా పనిచేస్తున్న సాక్షి వేధింపులకు గురవుతుంది. ఈ క్రమంలో అమెరికా వెళ్లాలనుకుంటున్న ఆమెకు అఖిల్ అండగా నిలుస్తాడు. అదే సమయంలో మహదేవ్ నుంచి అఖిల్కు ఓ ఆఫర్ వస్తుంది. కానీ ఊహించని పరిణామాలతో అఖిల్.. వైద్యను మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. అసలు ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? ఇంతకు మమ్ముట్టి(మహాదేవ్).. అఖిల్కు ఎలాంటి ఆఫర్ ఇచ్చాడు? ఆ తర్వాత ఏం జరిగింది? రా ఏజెంట్ కావాలనుకున్న అఖిల్ కల నేరవేరిందా? మమ్ముట్టి తన ఆశయం కోసం ఏం చేశాడు? అతని మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే అసలు కథ. కథ ఎలా సాగిందంటే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే అందరికీ గుర్తొచ్చేంది యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్స్. ఊహించని స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్. అయితే ఈ తరహా యాక్షన్ చిత్రాలు ఆడియన్స్కి కొత్త కాదు. గతంలో వచ్చిన స్పై యాక్షన్ ఫిల్మ్స్ మాదిరే ఇందులో కూడా గన్తో బుల్లెట్ల వర్షం కురిపించారు. అదిరిపోయే స్టంట్స్ ఉన్నాయి. కానీ కథకు తగినట్లుగా యాక్షన్ సీన్స్ తీర్చిదిద్దడంలో సురేందర్ రెడ్డి విఫలమైనట్లు తెలుస్తోంది. స్పై మూవీ అనగానే అందరూ ఊహించినట్లుగానే టెర్రరిస్టులను అడ్డుకునే రా ఇంటలిజెన్స్ ఆధారంగా తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్ బట్టి కథేంటో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. అఖిల్ను ఈ సినిమాలో కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. అది బాగానే వర్కవుట్ అయింది. కథ బాగానే ఉన్నా.. దానిని తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్లో మమ్ముట్టి - అఖిల్ మధ్య సన్నివేశాలు, హీరోయిన్తో అఖిల్కు పరిచయం.. ఆ తర్వాత ఆమెను వదిలేయడం.. కొన్ని ట్విస్టులతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ వచ్చేసరికి అఖిల్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో అఖిల్ యాక్షన్, బాడీ కాస్తా హైలెట్ అని చెప్పొచ్చు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అభిమానుల స్థాయిని అందుకోలేదనే చెప్పాలి. విలన్ (ది గాడ్)ను అంతం చేసేందుకు మహదేవ్ రూపొందించిన మిషన్ సమాచారం అతనికి ముందే తెలియడం కాస్త లాజిక్ లెస్గానే అనిపిస్తుంది. అతని కోసం ఎవరిని పంపినా ముందే తెలిసిపోవడం.. అదే క్రమంలో అఖిల్- విలన్ డైరెక్ట్గా తలపడే యాక్షన్స్ సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్. మధ్యలో కొన్ని సన్నివేశాలు సంబంధం లేకుండా బోరు కొట్టిస్తాయి కూడా! స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదు. ఫుల్ స్పై యాక్షన్ మూవీకి ప్రధాన బలం బీజీఎం. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్. సాంగ్స్ పర్వాలేదనిపించినా.. కొన్ని చోట్ల యాక్షన్స్ సీన్స్ ఓవర్గా అనిపిస్తాయి. కథ చివర్లో వచ్చే క్లైమాక్స్ సీన్ ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తిని పెంచింది. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ పర్వాలేదనిపించినా.. లాజిక్ లెస్ సీన్స్ వల్ల ఆడియన్స్కు అక్కడక్కడా బోరు కొట్టడం ఖాయం. ఎవరెలా చేశారంటే... స్పై యాక్షన్ థ్రిల్లర్కు తగినట్లుగానే అఖిల్ తన బాడీ, స్టైల్తో అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో అఖిల్ ఫుల్ ఎనర్జీటిక్గా చేశాడు. ఈ చిత్రంలో అఖిల్ డిఫెరెంట్ లుక్లో కనిపించాడు. గతంలో రొమాంటిక్ అఖిల్గా కనిపిస్తే ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ హీరోను తలపించాడు. సాక్షి వైద్య తెలుగులో తన డిఫరెంట్ యాసతో అదరగొట్టింది. పైలట్ పాత్రలో ఒదిగిపోయింది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ లేనప్పటికీ.. కెమిస్ట్రీ బాగానే కుదిరింది. మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రా చీఫ్గా తన పాత్రకు న్యాయం చేశారు. విలన్గా డినో మోరియా లుక్ అదిరిపోయింది. విలన్ పాత్రలో కరెక్ట్గా ఒదిగిపోయాడు. అఖిల్ ఫాదర్గా మురళీ శర్మ, పొలిటికల్ లీడర్గా సంపత్ రాజ్ తమ పాత్రల పరిధిమేర రాణించారు. సాంకేతికత విషయానికొస్తే రసూల్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. హిప్హాప్ సంగీతం అంతగా మెప్పించలేదు. నవీన్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
అదో పెద్ద స్కామ్ అనుకున్నా.. తీరా చూస్తే: ఏజెంట్ హీరోయిన్
అఖిల్ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ఈ చిత్రంలో హీరోయిన్గా సాక్షి వైద్య నటిస్తోంది. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28న విడుదలైంది. ఈ సందర్భంగా హీరోయిన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది తెలుగులో నా తొలి సినిమా అని.. మంచి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు సాక్షి వైద్య. సాక్షి వైద్య మాట్లాడుతూ .. 'వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్ని. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశాను. అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్’ ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒకరు ఫోన్ చేసి హీరోయిన్ ఛాన్స్ గురించి చెప్పారు. ఈ ఆఫర్ను నేను మొదట్లో స్కామ్ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బేనర్ అని, పెద్ద దర్శకుడు, పెద్ద స్టార్ అని చెప్పగానే హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. ‘ఏజెంట్’ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పైలెట్ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను' అని అన్నారు. -
వారి ప్రేమ, అభిమానం గొప్పవి
‘‘అక్కినేని ఫ్యాన్స్ ప్రేమ, ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పవి. అభిమానుల ఆదరణ లేకుంటే సినిమాలు హిట్ కావు. అఖిల్కి చిన్నప్పటి నుంచి కష్టపడే స్వభావం ఉంది. తనలో ఎంతో ఎనర్జీ ఉంది.. ‘ఏజెంట్’ సినిమాతో ఆ ఎనర్జీని సురేందర్ రెడ్డి బయటకు తీశాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అని హీరో నాగార్జున అన్నారు. అఖిల్, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం వరంగల్లో నిర్వహించిన ‘ఏజెంట్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘పోరాటాలకు అడ్డా... వీరత్వానికి ఇంటి పేరు వరంగల్. ఓ సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే ఏం కావాలో అవి సమకూర్చుకోవడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు పొందారు. ఈ సినిమాను ఇంత గ్రాండ్గా తెరకెక్కించడంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర రాజీ పడలేదు. ‘ఏజెంట్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సాక్షీ వైద్యకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మూవీలో నటించేందుకు నటుడు మమ్ముట్టి ఒప్పుకోవడం గొప్ప విషయం. మా చిత్రం హిట్ చేస్తే మంత్రి దయాకర్రావుగారు చెప్పినట్లు మా ప్రతి సినిమా వేడుకకు తప్పకుండా వరంగల్కు వస్తాం. తెలుగు ప్రేక్షకులు గొప్పవాళ్లు.. మంచి సినిమాలను తప్పకుండా హిట్ చేస్తారు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ– ‘‘షూటింగ్.. ఆడియో రిలీజ్.. ప్రీ రిలీజ్.. ఇలా ఏదో ఒక కార్యక్రమం వరంగల్లో నిర్వహించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటున్న ‘ఏజెంట్’ కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘నా మైండ్లో ఒకటే ఉంది. ‘ఏజెంట్’ ని ఇంత హైలో పనిచేసిన తర్వాత నెక్ట్స్ ఏం చేయాలనే ప్రశ్న నాలో కలుగుతోంది’’ అన్నారు. ఈ వేడుకలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, సాక్షీ వైద్య, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. -
ఆ విషయం తెలిశాక అమ్మ ఎమోషనల్ అయ్యింది : అఖిల్
‘‘30 ఏళ్లకు పైగా మా నాన్నగారు (నాగార్జున) ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకు మంచి గ్రిప్ ఉంది. నాకేమైనా సందేహాలు ఉంటే ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అయితే ఫలానా స్క్రిప్ట్ ఓకే చేయలా? వద్దా అని అడగను. అలా చేస్తే నా కెరీర్ తాలూకు ఒత్తిడిని నాన్నపై పెట్టినట్లు ఉంటుంది. ఆయన ప్రమేయం ఎక్కువగా ఉంటే ఓ వ్యక్తిగా నేను ఎదగలేకపోవచ్చు. అందుకే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఈ కారణంగానే ‘ఏజెంట్’ స్క్రిప్ట్ను నాన్నతో షేర్ చేయలేదు’’ అన్నారు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటింన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మింన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన విశేషాలు. ఆ ఒక్క సెంటిమెంట్ ఫాలో అవుతున్నా! ♦ నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. నా గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ టైమ్లో సూరిగారు (సురేందర్ రెడ్డి) ‘ఏజెంట్’ కథ చెప్పారు. నాకూ నచ్చింది. దాంతో వెంటనే అనౌన్స్ చేశాం. అయితే స్క్రిప్ట్ పూర్తి కావడానికి, నా లుక్ మార్చుకోవడం, లాక్డౌన్ వంటి వాటి వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ♦ ‘ఏజెంట్’లో నేను రామకృష్ణ (రిక్కీ) అనే పాత్ర చేశాను. రిక్కీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ‘ఏజెంట్’ ఒక మంచి స్పై డ్రామా. సురేందర్ రెడ్డిగారు ప్రతిదీ ఫైన్ ట్యూన్ చేస్తారు. నేను ఆయన్ను బ్లైండ్గా ఫాలో అయ్యాను. ఇక సెకండాఫ్లో వచ్చే టార్చర్ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. ♦సాధారణంగా నేను సెంటిమెంట్స్ను నమ్మను. అయితే ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ వంటి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు విడుదలయ్యాయి. ఇలాంటి హిట్ సినివలు విడుదలైన ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ సినిమా విడుదల అవుతోంది. ఈ సెంటి మెంట్ను మాత్రం ఫాలో అవుతున్నాను. ♦నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా కల. అది నాన్నగారి వందో సినిమా అయితే నాకు ఇంకా సంతోషం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. కానీ నాకు తెలిసి అలాంటి స్క్రిప్ట్ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ‘ఏజెంట్’ సినిమా ట్రైలర్ చూసి, నేను చాలా కష్టపడ్డానని తెలిసి మా అమ్మగారు (అక్కినేని అమల) ఎమోషన్ అయ్యారు. -
Agent trailer: ‘ఏజెంట్’ ట్రైలర్ రివ్యూ
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. సాక్షివైద్య హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేసింది చిత్రబృంది. ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది. ‘నువ్వెందుకు ఏజెంట్ అవ్వాలనుకుంటున్నావు’అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. సిండికేట్కి ఒక పవర్ హౌస్ ఉంది. దాని పేరు గాడ్. దాన్ని ట్రేస్ చేయగలిగితే మొత్తం నెట్వర్క్ని నాశనం చేయొచ్చు. ఈ మిషన్ కోసం మమ్ముట్టి టీమ్ అఖిల్ని రంగంలోకి దించుతుంది. ‘సింహం బోనులోకి వెళ్లి తిరిగొచ్చేది కోతి మాత్రమే’అని మమ్ముట్టి చెప్పే డైలాగ్తో అఖిల్ పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. (చదవండి: నా బెడ్రూమ్లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి: ఖుష్బూ) కోతిలాంటి బిహేవియర్ ఉన్న అఖిల్ ఏజెంట్గా మారతాడు. అయితే ఒకానొక దశలో అఖిల్నే చంపేయాలని మమ్ముట్టి తన టీమ్ సభ్యులను ఆదేశిస్తాడు. అసలు మమ్ముట్టి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ మిషన్ని పూర్తి చేసే క్రమంలో అఖిల్కు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఆ మిషన్ ఎలా సక్సెస్ అయింది? అనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ తరహా యాక్షన్ అఖిల్కి కొత్త కానీ ఆడియన్స్కి కాదు. గతంలో వచ్చిన స్పై యాక్షన్ ఫిల్మ్స్ మాదిరే ఇందులో కూడా గన్తో బుల్లెట్ల వర్షం కురిపించడం, అదిరిపోయే స్టంట్స్ ఉన్నాయి. ఇక కేజీయఫ్ తర్వాత పెద్ద గన్తో క్లైమాక్స్ని సెట్ చేయడం ఆనవాయితీగా మారింది. విక్రమ్ నుంచి మొన్నటి పఠాన్ వరకు ప్రతి యాక్షన్ సినిమాలో పెద్ద గన్తో బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏజెంట్ ట్రైలర్ చివర్లో కూడా ఇలాంటి సీన్ ఒకటి పెట్టారు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. హిప్ హాప్ తమిళ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాకు భారీ ఖర్చు చేసినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. మొత్తం మీద అఖిల్ పెద్ద సాహసమే చేశాడు. అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఏప్రిల్ 28న తెలుస్తుంది. -
అఖిల్ వైల్డ్ క్యారెక్టర్.. ఆ ఫీట్ ఏంట్రా బాబూ!
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఏజెంట్'. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రబృందం. ఈ సందర్భంగా విజయవాడలో ట్రైలర్ లాంఛ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అఖిల్ కళ్లు చెదిరిపోయే స్టంట్ ఏజెంట్ మూవీ ప్రమోషన్స్ను మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో ఈసారి చాలా కొత్తగా ట్రై చేశారు. విజయవాడలోని దాదాపు 172 అడుగుల భవనం పైనుంచి దుకుతూ ట్రైలర్ పోస్టర్ను ఆవిష్కరించాడు. ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు కాకినాడలోని ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్స్లో ‘ఏజెంట్’ ట్రైలర్ లాంఛ్ జరగనుందని పేర్కొన్నారు. ఈ వీడియోను మేకర్స్ తమ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే విడుదలైన అఖిల్ వైల్డ్ లుక్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. SAALA nahin! WILD SAALA 😎 That was a Crazy Event at Vijayawada as @AkhilAkkineni8 jumped off from 172 ft High to unveil the WILD POSTER 🔥 WILD MADNESS Loading in Theaters from APRIL 28TH💥#AGENTonApril28th @mammukka @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @Shreyasgroup pic.twitter.com/yJMKmQOTyc — AK Entertainments (@AKentsOfficial) April 16, 2023 -
అఖిల్ ‘ఏజెంట్’ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
ఏజెంట్ నన్ను పూర్తిగా మార్చేసింది: అఖిల్
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏజెంట్’. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ లుక్లో కనిపించనున్నారు. తాజాగా చిత్రబృందం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో అఖిల్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏజెంట్ మూవీ ట్రైలర్ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రెస్ మీట్లో అఖిల్ మాట్లాడుతూ.. 'ఇది రెండేళ్ల జర్నీలో ఏజెంట్ నన్ను పూర్తిగా మార్చేసింది. ఈ జర్నీలో సగటు మనిషిగా నేను అలసిపోయా. అయితే సినిమాకు ఏం కావాలో అది చేశానన్న ఆనందం ఉంది. ఈ సినిమాతో మానసికంగా దృఢంగా మారిపోయా. ఒక నటుడిగా సరికొత్త ఫేజ్లోకి వచ్చాను. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మమ్ముటి సర్తో నటించడం నా అదృష్టం. ఆయన విలువ చాలా గొప్పది. నాలో స్ఫూర్తి నింపారు. చాలా విషయాలు నేర్చుకున్నా. నాకు యాక్షన్ జోనర్ అంటే ఇష్టం. అందుకే కథ చెప్పగానే కమిట్ అయిపోయా' అని అన్నారు. కాగా.. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, పోస్టర్ సినిమాపై హైప్ను మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. Let's begin the #AGENT ACTION HEAT to beat the summer wave!!#AgentTrailer out on APRIL 18th Stay Excited for the Massive Launch..#AGENTonApril28th@AkhilAkkineni8 @mammukka #DinoMorea @sakshivaidya99 @AnilSunkara1 @AKentsOfficial @LahariMusic @shreyasgroup pic.twitter.com/wpsJirNUFK — SurenderReddy (@DirSurender) April 15, 2023 -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎల్కతుర్తి: ప్రాణస్నేహితులిద్దరూ చనిపోయారన్న బెంగతో ఒక డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో సోమ వారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తంగళ్లపెల్లి సంపత్, సుమలత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కార్తీక్(21) హనుమకొండలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, చిన్న కుమారుడు వినయ్ 8వ తరగతి చదువుతున్నారు. కార్తీక్ మేనమామ కుమారుడు అఖిల్ ఆరేళ్ల క్రితం క్యాన్సర్తో చనిపోయాడు. మరో స్నేహితుడు రాకేష్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కావడంతో.. వారు చనిపోయినప్పటి నుంచి కార్తీక్ దిగాలుగా ఉండేవాడు. తాను కూడా వారి వద్దకు వెళ్తానంటూ.. అప్పుడప్పుడు తల్లిదండ్రులకు చెప్పేవాడు. దీంతో వారు అధైర్యపడొద్దని కుమారుడికి సర్దిచెప్పేవారు. కాగా, కార్తీక్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు. ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేశారు. -
మనసును హైజాక్ చేసి...
‘మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే దట్స్ ఏ సైన్ అని మనసంటుందే.. నా లేటెస్ట్ మిషనువు నువ్వే.. సాధించాలనిపిస్తుందే...’ అంటూ సాగుతుంది ‘ఏజెంట్’ చిత్రంలోని పాట. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పైయాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. ఈ సినిమా నుంచి ‘మళ్లీ మళ్లీ నువ్వే... మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఆదిత్యా అయ్యంగార్ సాహిత్యం అందించిన ఈ పాటను ఈ చిత్ర సంగీతదర్శకుడు హిప్హప్ తమిళ పాడారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్రెడ్డి 2 సినిమాస్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, దీపారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. -
మహాశివరాత్రి: టాలీవుడ్ కొత్త అప్డేట్స్ ఇవే!
మహా శివరాత్రి సందర్భంగా టాలీవుడ్ జోరుగా హుషారుగా మహా అప్డేట్స్ ఇచ్చింది. ఆ విశేషాలు తెలుసుకుందాం... వెండితెర బోళా శంకరుడిగా దుష్టులపై శివతాండవం చేస్తున్నారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘బోళా శంకర్’. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా, ఆయనకు చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బోళా శంకర్’లోని చిరంజీవి కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతదర్శకుడు. ఏప్రిల్ 14న ‘బోళా శంకర్’ని విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు పండగ రోజున ‘నేను ప్యార్లోన పాగలే..’ అంటూ ‘రావణాసుర’ చిత్రం కోసం పాట పాడారు రవితేజ. పబ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, స్వయంగా రవితేజ పాడటం విశేషం. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా, హీరో సుశాంత్ కీ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక సంక్రాంతికి థియేటర్స్లోకి వస్తానన్న విషయాన్ని శివరాత్రి రోజున వెల్లడించారు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలి సిందే. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీ రోల్స్ చేస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. అలాగే శివరాత్రి రోజునే ‘రామబాణం’ ఫస్ట్ లుక్ను వదిలారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత మూడోసారి హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రామబాణం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, ఖుష్బూ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కానుంది. ఇక త్వరలోనే మ్యూజిక్ బ్లాస్ట్ ఉంటుందంటున్నారు ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఏజెంట్’. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రముఖ హీరో మమ్ముట్టి ఓ కీ రోల్ చేస్తున్నారు. కాగా ‘ఏజెంట్’ ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు మేకర్స్. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఇవే కాదు.. అల్లరి నరేశ్ ‘ఉగ్రం’, సాయిధరమ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’తో పాటు మరికొన్ని చిత్రబృందాలు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. -
కిరణ్లాంటి వ్యక్తులు తక్కువ.. రెండు సీన్లకే థ్రిల్లయ్యా: అఖిల్
‘‘గీతా ఆర్ట్స్ ఈవెంట్కు నేను ఓ కుటుంబసభ్యుడిలా వచ్చాను. కొత్తదనం కోసం అరవింద్గారు ఎప్పుడూ తాపత్రయపడుతుంటారు. కష్టం ఎప్పుడూ వృథా కాదు. కిరణ్ ఎంతో కష్టపడుతున్నాడు. తనకు ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు అక్కినేని అఖిల్. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్ (నందు) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్ మాట్లాడుతూ– ‘‘వినరో..’లోని రెండు సీన్లు చూసి, థ్రిల్ అయ్యాను. ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో ఈ సినిమా వస్తోంది ’’ అని అన్నారు. ‘‘జెన్యూన్గా ఉండే కిరణ్లాంటి వ్యక్తులు తక్కువ. బన్నీ వాసుతో పాటు కిరణ్ అబ్బవరంనూ ఓ నిర్మాతగా ఫీలవుతున్నాను. ఈ సినిమాకు అతను అలా వర్క్ చేశాడు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘అఖిల్గారి సినిమాలో నేను ఓ కీ రోల్ చేయాల్సింది. కుదర్లేదు. ఏయన్నార్గారు చేసిన ‘మనం’ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ ఎమోషన్. స్క్రీన్పై గీతా ఆర్ట్స్ అని చూసిన మాలాంటి వారు కూడా అదే బ్యానర్లో సినిమాలు చేయొచ్చు అంటూ చాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్గారికి ధన్యవాదాలు. నాలా సినిమాపై ప్యాషన్తో వచ్చేవారి తరపున అల్లు అరవింద్గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. ‘వినరో. ..’ సినిమా బాగా రావడానికి ఎంతో కారణమైన బన్నీ వాసుగారి దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీతో నందు అన్నకు మంచి పేరు వస్తుంది. యూట్యూబ్లో షార్ట్ఫిల్మ్ ‘గచ్చిబౌలి’ నుంచి నేను ఇక్కడి వచ్చేంతవరకు నన్ను ప్రోత్సహించిన, ఇంకా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘వినరో..’ పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘నేను దర్శకుడిని అయ్యానని మా నాన్నకు నేను హ్యాపీగా చెప్పుకునేలా చేసిన కిరణ్ అబ్బవరంకు, నిర్మాతలు అరవింద్, బన్నీ వాసుగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు మురళీ కిషోర్. ‘‘గీతా ఆర్ట్స్ తర్వాత నాగచైతన్య, అఖిల్ నాకు ఆప్తులు. నా మనసుకు కనెక్ట్ అయిన సినిమా ఇది. ఈ సినిమా చూశాక ఆడియన్స్ కొన్ని అంశాలను వెంట తీసుకెళ్తారు. కిరణ్, కిశోర్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు బన్నీ వాసు. -
ఫారిన్లో ఫైట్
ఫారిన్లో యాక్షన్ ప్లాన్ చేశారు ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. ఇందులో భాగంగా ఓ ఫారిన్ షెడ్యూల్ను ప్లాన్ చేశారట యూనిట్. ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం వచ్చే వారంలో చిత్ర బృందం విదేశాలకు వెళ్లనుందట. ఈ షెడ్యూల్తో ‘ఏజెంట్’ షూటింగ్ దాదాపు పూర్తవుతుందట. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ రిలీజ్ కానుంది. మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: హిప్ హాప్ తమిజా. -
18 నుంచి సీసీఎల్ సందడి
పాన్ ఇండియా ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (సీసీఎల్) సందడి మళ్లీ మొదలు కాబోతుంది. ఈ నెల 18 నుంచి సీసీఎల్ ప్రారంభం కానుంది. ఎనిమిది చలన చిత్ర పరిశ్రమలకు చెందిన బిగ్గెస్ట్ స్టార్స్ జట్లు పోటీపడనున్నాయి. రాయ్పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్పూర్, త్రివేండ్రం, జైపూర్ నగరాలు 19 గేమ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సీసీఎల్ జట్లు ఇవే.. సల్మా న్ ఖా న్ బ్రాండ్ అంబాసిడర్గా రితేష్ దేశ్ముఖ్ కెప్టె న్ గా ముంబై హీరోస్, ఆర్య కెప్టెన్గా చెన్నై రైనోస్, వెంకటేష్ కో ఓనర్– అఖిల్ కెప్టెన్గా తెలుగు వారియర్స్, మనోజ్ తివారీ కెప్టె న్ గా భోజ్పురి దబాంగ్స్, మోహన్ లాల్ కో ఓనర్గా కుంచాకో బోప న్ కెప్టె న్ గా కేరళ స్ట్రైకర్స్, బోనీ కపూర్ కో ఓనర్గా జిసుసేన్ గుప్త కెప్టన్గా బెంగాల్ టైగర్స్, సుదీప్ కెప్టె న్ గా కర్ణాటక బుల్డోజర్స్, సోనూసూద్ కెప్టెన్గా పంజాబ్ దే షేర్. -
మ..మ..మాస్ అంటున్న యంగ్ హీరోలు
చిత్రపరిశ్రమలో మాస్ అండ్ యాక్షన్ సినిమాలకు, ఆ హీరోలకు ఉండే క్రేజే వేరు. మాస్ హీరోల సినిమాలు విడుదలయితే థియేటర్స్లో దద్దరిల్లిపోవాల్సిందే. క్లాస్ మూవీస్ ఎన్ని చేసినా రాని ఇమేజ్ ఒక్క మాస్ మూవీతో వస్తుంది. ఆ హీరో మార్కెట్తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా డబుల్ అయిపోతుంది. అందుకే ఏ హీరో అయినా మాస్ హీరో అనిపించుకోవడానికే ట్రై చేస్తాడు. ఇప్పుడు మన టాటీవుడ్ యంగ్ హీరోలంతా మాస్ ఇమేజ్పై ఫోకస్ చేశారు. ఊరమాస్ కథలను ఎంచుకుంటూ క్లాస్ నుంచి మాస్కు షిఫ్ట్ అవుతున్నారు. వీరిలో నేచురల్ స్టార్ నాని ముందు వరుసలో ఉన్నాడు. అష్టాచమ్మా నుంచి అంటే సుందరానికి.. వరకు నాని చేసిన సినిమాలన్ని క్లాస్ కథలకు సంబంధించినవే. ఇప్పటి వరకు నాని ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ చేయలేదు. కృష్ణార్జున యుద్దంలో మాస్ గెటప్లో కనిపించినా.. అది వర్కౌట్ కాలేదు. ఈ సారి నాని తన రూటుని మార్చాడు. ప్రేక్షకులకు తనలోని ఊరమాస్ని పరిచయం చేసేందుకు ‘దసరా’తో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్లో నాని గెటప్ అదిరిపోయింది. తెలంగాణ భాషలో నాని చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్టయితే నాని మాస్ సినిమాల కౌంట్ పెంచే చాన్స్ ఎక్కువగా ఉంది. మరోవైపు కేరీర్ స్టార్టింగ్లో మాస్ హీరో అనిపించుకున్న రామ్ పోతినేని.. మధ్యలో క్లాస్కి షిఫ్ట్ అయ్యాడు. ఆయన హీరోగా తెరకెక్కిన క్లాస్ చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించలేకపోయాయి. దీంతో ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ మాస్కి షిఫ్ట్ అయ్యాడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత వరుసగా రెడ్, ది వారియర్ అనే మాస్ సినిమాలు చేశాడు. అవేవి వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సారి మాస్లో మాస్టర్స్ చేసిన బోయపాటితో రామ్ జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్తో ఓ మాస్ మూవీ తెరకెక్కుతుంది. ఇక హీరో నితిన్ కూడా మాస్ సినిమాలవైపే మొగ్గు చూపుతున్నాడు. మాచర్ల నియోజకవర్గం సినిమాతో మాస్ ఫ్లేవర్ చూపించిన నితిన్.. ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో కంప్లీట్ మాస్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా పిరియాడికల్ డ్రామా అని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించబోయే సినిమా కూడా పక్కా మాస్ మూవీ అనే మాట ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ కూడా మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్తో అఖిల్.. ‘కస్టడీ’తో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
లేట్ అయినా లేటెస్ట్గా వస్తామంటున్న స్టార్ హీరోలు
అభిమాన హీరో సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ చెప్పిన తేదీకి ఆ సినిమా రాకపోతే నిరుత్సాహపడతారు. 2022లో అలా అభిమానులను నిరాశపరచిన స్టార్స్ ఉన్నారు. ఈ ఏడాది సిల్కర్ స్క్రీన్పై కనిపించాల్సిన ఆ హీరోల సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. లేట్ అయినా కొన్ని మెరుగులు దిద్దుకుని లేటెస్ట్గా రావడానికి ఆ స్టార్స్ రెడీ అవుతున్నారు. ఇక వాయిదా పడిన కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్న ప్రభాస్ హీరోగా నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్ నటించారు. ‘ఆదిపురుష్’ నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాని 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించడంతో సినీ అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే కొన్ని కారణాల వల్ల ‘ఆదిపురుష్’ ఆగస్టులో వాయిదా పడి 2023 సంక్రాంతి బరిలో నిలిచింది. జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ‘ఆదిపురుష్’ ట్రైలర్పై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రాఫిక్స్, పాత్రల తీరు బాగా లేవంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యలు చేపట్టిందని టాక్. ఈ క్రమంలోనే జనవరి 12న రిలీజ్ వాయిదా వేసి, జూన్ 16న విడుదల చేయడానికి నిర్ణయించుకుని ఉంటారని ఊహించవచ్చు. కాగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. అయితే, అనారోగ్య సమస్యల వల్ల సమంత షూటింగ్కి దూరం కావడంతో చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. ఈ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2023 ఫిబ్రవరి లేదా వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉందట యూనిట్. ఇక సమంత టైటిల్ రోల్లో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ పీరియాడికల్ మూవీని నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆ డేట్కి వాయిదా పడింది. ఈ సినిమాను 3డీ ఫార్మాట్లో బెస్ట్ క్వాలిటీతో విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. ఈ పనుల కోసం మరింత సమయం పట్టనుండటంతో రిలీజ్ను వాయిదా వేసినట్లు యూనిట్ ప్రకటించింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడనే విషయంపై చిత్రబృందం త్వరలో క్లారిటీ ఇవ్వనుంది. అదేవిధంగా అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్’ కూడా వాయిదాల లిస్ట్లో ఉంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేసి, సిక్స్ ప్యాక్ బాడీని కూడా బిల్డ్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 12న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు వాయిదా పడింది. ఆ తర్వాత ఈ డిసెంబర్లో రిలీజ్ ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ‘ఏజెంట్’ని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది. అయితే సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’ చిత్రాలు విడుదలవుతున్నాయి. సీనియర్ హీరోల సినిమాల మధ్య యువ హీరో నటించిన ‘ఏజెంట్’ రిలీజ్ అవుతుందా? కాదా అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఈ సినిమా రిలీజ్పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అలాగే పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకి అక్టోబరులో విడుదల చేయాలనుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు చేస్తుండటంతో షూటింగ్ ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. కాగా తమిళ హీరో ధనుష్ నటించిన తొలి స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ డిసెంబర్ 2న (శుక్రవారం) విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ని వాయిదా వేస్తూ యూనిట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 17కి వాయిదా పడింది. ఇవే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా వివిధ కారణాల వల్ల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ఏడాదిలో రిలీజ్కి సరికొత్తగా ముస్తాబవుతున్నాయి. -
రాష్ట్రపతి పై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఫైర్
-
సిక్స్ప్యాక్ బాడీతో కనిపించిన అఖిల్ అక్కినేని.. ఫోటో వైరల్
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో ఏజెంట్గా కనిపించనున్న అఖిల్ ఇందుకోసం తెగ వర్కవుట్లు చేస్తున్నాడు. తాజగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన అఖిల్ దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
'పేసీఎం' పోస్టర్పై ఫోటో.. కాంగ్రెస్కు వార్నింగ్ ఇచ్చిన నటుడు
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ '40 శాతం కమీషన్ సర్కార్' పేరుతో పేసీఎం పోస్టర్లను కాంగ్రెస్ ప్రచురించిన విషయం తెలిసిందే. సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటో, క్యూఆర్ కోడ్తో ఉన్న ఈ ఫోటోలు గోడలపై కన్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఓ పోస్టర్లో కాంగ్రెస్ తన ఫోటోను వాడుకుందని కన్నడ నటుడు అఖిల్ అయ్యర్ ఆరోపించాడు. తన అనుమతి లేకుండా తనకు సంబంధం లేని వ్యవహారంలో తన చిత్రాన్ని వాడటంపై అభ్యంతరం తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ను షేర్ చేసి, దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్ను హెచ్చరించాడు అఖిల్. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక కాంగ్రెస్ను ట్యాగ్ చేశాడు. I am appalled to see that my face is being used illegally and without my consent for "40% Sarkara" - an @INCIndia campaign that i have nothing to do with. I will be taking legal action against this.@RahulGandhi @siddaramaiah @INCKarnataka request you to please look into this pic.twitter.com/y7LZ9wRXW9 — Akhil Iyer (@akhiliy) September 23, 2022 'అవినీతి ఆకలితో ఉన్న ఈ 40శాతం కమీషన్ సర్కార్ 54,000 మంది విద్యార్థుల కెరీర్ను దోచుకుంది. ఇంకా మీలో చలనం రాదా?' అని కాంగ్రెస్ ఓ పోస్టర్ను రూపొందించింది. ఇందులో నటుడు అఖిల్ ఫోటోను ఉపయోగించింది. దీనిపైనే ఆయన అభ్యంతరం తెలిపాడు. చదవండి: బీజేపీకి వెన్నుపోటు పొడిచాడు: అమిత్షా -
‘కార్తికేయ2’ టీమ్కి అరుదైన గౌరవం
యంగ్ హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ2’ చిత్రానికి తాజాగా అరుదైన ఆహ్వానం లభించింది. ఈ చిత్ర యూనిట్కి ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్కు రావాలని ఆహ్వానం అందింది. కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.. టీజర్, మోషన్ పోస్టర్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఇస్కాన్ మెయిన్ సంస్థానం నుంచి ఆహ్వానం అందడం పట్ల చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు ఇతిహాసాల నేపథ్యంలో, మైథలాజికల్ స్టోరీస్ నేపథ్యంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. భారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి. అయితే భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం కార్తికేయ 2 టీంను వరించడం గమనార్హం.పిపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. -
అఖిల్ 'ఏజెంట్' టీజర్పై మహేశ్ బాబు రివ్యూ..
Mahesh Babu Praises On Akhil Agent Teaser: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్గా తరెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మూవీ టీజర్, అఖిల్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా ఈ మూవీ టీజర్ను, అఖిల్ లుక్స్ను పలువురు కొనియాడారు. తాజాగా ఈ టీజర్పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. 'ఏజెంట్ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, సినిమా థీమ్ ఎంతో నచ్చింది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్.' అని ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు మహేశ్ బాబు. ఈ ట్వీట్పై అఖిల్ స్పందించాడు. 'థ్యాంక్యూ బ్రదర్. మీ సపోర్ట్, ప్రోత్సాహాం ఎంతో విలువైనది.' అని రీట్వీట్ చేశాడు. అలాగే శర్వానంద్ ట్వీట్పై కూడా స్పందించాడు అఖిల్. ప్రస్తుతం 'ఏజెంట్' టీజర్ యూట్యూబ్లో మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్కు కవలలు ? రణ్బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో #AgentTeaser looks absolutely stunning!! Love the visuals and the theme of the film! All the best @mammukka sir @AkhilAkkineni8 @AnilSunkara1 @DirSurender and the entire team! Looking forward! :)https://t.co/ecNasoflIr — Mahesh Babu (@urstrulyMahesh) July 16, 2022 Thank you so much brother 🙏🏻 we are thrilled to see your support and encouragement. Means a lot 🙏🏻 https://t.co/ps7kOMeAdT — Akhil Akkineni (@AkhilAkkineni8) July 16, 2022 -
అఖిల్ను 'వైల్డ్ సాలే' అన్న హీరోయిన్..
Akhil Agent Teaser Released: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్గా తరెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా టీజర్ను స్టార్ యాక్టర్స్ శివకార్తికేయన్, కిచ్చా సుదీప్ విడుదల చేశారు. ఈ టీజర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్కు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇచ్చే ఎలివేషన్ బాగుంది. అలాగే యాక్షన్ సీన్స్, 'వైల్డ్ సాలే' అని హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీజర్.. అఖిల్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉందని చెప్పవచ్చు. కాగా 'ఏజెంట్' చిత్రాన్ని హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్పై ఆగ్రహం ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. -
అఖిల్,అనన్యల లవ్స్టోరీ షురూ
అఖిల్ రాజ్, అనన్య నాగళ్ల జంటగా సూర్య అల్లంకొండ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై జి. ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. తొలి సన్నివేశానికి నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘పూర్తి ప్రేమకథా చిత్రమిది. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్లో పూర్తి చేస్తాం’’ అన్నారు సూర్య అల్లంకొండ. ‘‘మంచి లవ్ సబ్జెక్ట్తో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు జి. ప్రతాప్ రెడ్డి. ‘‘యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అఖిల్ రాజ్, అనన్య నాగళ్ల. సినిమాటోగ్రాఫర్ వీఆర్కే నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నవీన్ బి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్. -
నెట్టింట హాట్ టాపిక్గా అఖిల్ లుక్.. అక్కడి నుంచి కాపీ కొట్టారా ?
Akhil Agent Looks Have Copy Allegations: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు అఖిల్. మంచు పర్వతాల్లో మొహం నిండా గాయాలతో ఉన్న ఫొటోలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే భారీ యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ లుక్ కాపీ కొట్టారని చర్చ నడుస్తోంది. బ్యాక్గ్రౌండ్లో పర్వతాలు, గిరజాల జుట్టు, పోనీటైల్తో స్టైలిష్గా ఉన్న అఖిల్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్లోని హీరో జాన్ స్నో (కిట్ హరింగ్టన్)ను గుర్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ సిరీస్లో తరహాలోనే 'ఏజెంట్' మూవీలో అఖిల్ యాక్షన్ సీక్వెన్స్తో ఊల్ కోట్ ధరించి కనిపిస్తున్నాడు. చిన్నపాటి మార్పు తప్ప ఇద్దరి గెటప్పులో పెద్ద చేంజ్ లేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే 'ఏజెంట్' చిత్రం హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుంది. ఈ క్రమంలో మరో హాలీవుడ్ సిరీస్లోని హీరోను కాపీ కొట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీ ఇది కోఇన్స్డెంట్గా జరిగిందా, లేక కావాలని చేసిందా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కండలు పెంచిన అఖిల్కు కొంచెం కిట్ హరింగ్టన్ పోలికలు ఉన్నాయని ఇటీవల సోషల్ మీడియాలో టాక్ నడిచింది. చదవండి: ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
వైజాగ్లో ఏజెంట్
ప్రత్యర్థుల ప్లాన్ను తిప్పి కొట్టడానికి వ్యూహం పన్నారు ఏజెంట్. మరి.. ఈ వ్యూహంలో ప్రత్యర్థులు చిక్కుకుని ఎలా అల్లాడిపోయారు? అనేది థియేటర్స్లో చూడాల్సిందే. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఏజెంట్’. సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ కీలక పాత్రధారి. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం అఖిల్ వైజాగ్ వెళ్లారు. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశారని, ఈ బ్లాక్ ఇంట్రవెల్లో వస్తుందని టాక్. ‘ఏజెంట్’ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రక్తంతో లెటర్.. ఆరేళ్ల తర్వాత అలా చేసింది.. అఖిల్ బ్రేకప్ స్టోరీ
బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్లో శుక్రవారం సభ్యులంతా తమ తొలి ప్రేమ అనుభవాలను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రతి ఒక్కరు తమ బ్రేకప్ స్టోరీని మిగతావాళ్లతో పంచుకున్నారు. అఖిల్ కూడా బ్రేకప్ స్టోరిని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న చిన్నుతో ప్రేమలో పడ్డాడని, కానీ ఆమె వేరే వ్యక్తితో రిలేషనల్లో ఉండి తనకు బ్రేకప్ చెప్పిందని అఖిల్ చెప్పాడు. ‘తను నా స్కూల్ ఫ్రెండ్. మా కాలనీలోనే ఉండేది. నేను ముద్దుగా చిన్ను అని పిలిచేవాడిని. మేమిద్దరం తిట్టుకునేవాళ్లం..కొట్టుకునేవాళ్లం.ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మేము ఎప్పుడూ లవ్ లో పడతాం అని అనుకోలేదు. మా ఫ్యామిలీల మధ్య గొడవ జరిగి రెండేళ్ల వరకు మాట్లాడుకోలేదు. ఓ రోజు పక్కవీధిలోకి రమ్మని పిలిచి లెటర్ ఇచ్చింది. అది తన రక్తంతో రాసిన లెటర్. తన చేతికి ఉన్న గాయాలను చూసి.. నా కోసం ఇలా చెసిందా అనుకొని ప్రేమలో పడిపోయా. చాలా కాలం మేం ప్రేమలో ఉన్నాం. ఆమె ఇంజనీరింగ్లో జాయిన్ అయింది. ఈ నాలుగేళ్లు కూడా మనం ఇలానే ఉంటే.. మనది నిజమైన లవ్ అని చెప్పా. తను లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు.. నేను షూటింట్లతో బిజీ అయిపోయా. అయినా కూడా క్షణం తీరిక దొరికినా తనకు మెసేజ్ చేసేవాడిని. ఓ రోజు సాయంత్రం ఫోన్ చేస్తే.. బిజీ వచ్చింది. ఆ రోజంతా ఎన్నిసార్లు చేసినా బిజీ వస్తునే ఉంది. రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడిగాను. డాడితో మాట్లాడిన అని అబద్దం చెప్పింది. హాస్టల్కి మీ ఇంటికి దగ్గరే కదా.. ఇంటికెళ్లి మాట్లాడొచ్చుగా అని అడిగితే.. నాపై నమ్మకం లేదా అని సీరియస్ అయింది. ఇలా ఉంటే కష్టం అని అన్నందుకు అదే మాటని రిపీట్ చేస్తూ బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ వద్దని చెప్పినా వినలేదు. ‘మా ఇంట్లో ఒప్పుకోరు..మీ క్యాస్ట్, మా క్యాస్ట్ వేరు. ఇండస్ట్రీకి చెందిన అబ్బాయి అంటే మా ఇంట్లో ఒప్పుకోరు’అంటూ ఆరేళ్ల తర్వాత బ్రేకప్ చెప్పింది. అప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్లాను. బ్రేకప్కి ముందే ఆమె ఓ కెనడా అబ్బాయితో రిలేషన్లో ఉంది. ఈ విషయాన్ని ఆమె ఫ్రెండ్ నాతో చెప్పడంతో నేను బ్యాక్ స్టెప్ వేశా. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆమే మళ్లీ నాకు ఫోన్ చేసి ‘కర్మా ఈజ్ బ్యాక్ అన్నట్టుగా.. నేను నిన్ను వదిలేస్తే.. నన్ను ఆ కెనడా అబ్బాయి వదిలేశాడు’అని చెప్పింది. అక్కడ నుంచి లవ్ అంటే నేను భయపడతాను. కానీ ఫస్ట్ లవ్ మ్యాజిక్ అనేది మళ్లీ జరగదని అనిపిస్తుంది. ఇప్పటికీ తన మీద నాకు ఎలాంటి కోపం లేదు. నన్ను నేను స్ట్రాంగ్గా మార్చుకునేందుకు దోహదపడింది’అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. -
మనసు మార్చుకున్న జాన్వీ కపూర్.. ఇక టీటౌన్పైనే ఫోకస్!
దఢక్తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే ఫేమస్ అయింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఈ బ్యూటీని టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు మన డైరెక్టర్ట్స్ అండ్ ప్రొడ్యూస్స్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కానీ జాన్వీ మాత్రం బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టింది. ముందు బాలీవుడ్లో స్టార్డమ్ అందుకున్న తర్వాతే సౌత్ వైపు చూడాలనుకుంటోంది. అందుకే ఇంత కాలం టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె మనసు మారిందట. బాలీవుడ్ లీడింగ్ లేడీస్ దీపిక, ఆలియాల మాదిరే జాన్వీ కూడా టాలీవుడ్పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందుకే రెండు తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుందట. అయితే ఈ రెండూ కూడా ప్యాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఒకటి పూరి జగన్నాథ్ మేకింగ్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ జనగణమన, మరోకొటి కరణ్ జోహర్ అక్కినేని హీరో అఖిల్ తో ప్లాన్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అట. మరి టాలీవుడ్లో జాన్వీ లక్ ఎలా ఉంటుందో చూడాలి. -
అఫీషియల్: అఖిల్ 'ఏజెంట్' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఇప్పటివరకూ లవర్బాయ్గా కనిపించిన అఖిల్ ఏజెంట్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్గా కనిపించనుండగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యపాత్రలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఆగస్టు 12 ఏజెంట్ విడుదల చేస్తున్నామంటూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ వెల్లడించడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిపాటు కష్టపడి అఖిల్ మేకోవర్ అయ్యారు. ఇందులో యంగ్ హీరో సిక్స్ప్యాక్ లుక్లో కనిపిస్తాడు. ఈ సినిమాకు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. An Action Spectacle awaits you in theatres 😎 THE WILD ONE🤙🏻#AGENT⚡️ Reporting in theatres from AUGUST 12th 2022 💥💥💥#AGENTonAugust12 🔥@AkhilAkkineni8 @mammukka @DirSurender @AnilSunkara1 @hiphoptamizha @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl pic.twitter.com/lHKDvNwGjC — AK Entertainments (@AKentsOfficial) March 11, 2022 -
కాంబినేషన్ సెట్?
‘మనం’, ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రాల్లో తనయుడు నాగచైతన్యతో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్స్ చేశారు నాగార్జున. ఇప్పుడు తన మరో తనయుడు అఖిల్కు కూడా ఈ చాన్స్ను నాగార్జున కల్పించనున్నారనే టాక్ ఫిల్మ్నగర్లో జోరుగా వినిపిస్తోంది. నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్రాజా దర్శకత్వం వహించనున్నారని భోగట్టా. నాగార్జునకు ఇది వందో సినిమా అని, మలయాళంలో మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్లు కలిసి చేసిన ‘బ్రో డాడీ’ చిత్రానికి రీమేక్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
మరో మల్టీస్టారర్కి అక్కినేని హీరోలు రెడీ
మంచి కథ దొరికితే చాలు అక్కినేని హీరోలు మల్టీస్టారర్ కు జై కొడతారు.ఇప్పటికే మనం లాంటి క్లాసిక్ మూవీని టాలీవుడ్ కు అందించారు. ఈ సంక్రాంతికి బంగార్రాజుతో మరోసారి అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ అందించింది. ఇప్పుడు ఇదే స్పీడ్ లో ఇంకో మల్టీస్టారర్ కు అక్కినేని హీరోలు రెడీ అవుతున్నారట.మనం, బంగార్రాజు చిత్రాల్లో నాగ చైతన్యతో కలసి నటించిన నాగార్జున..ఇప్పుడు అఖిల్ తో కలసి మల్టీస్టారర్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ మూవీని చిరుతో గాడ్ ఫాదర్ తెరకెక్కిస్తున్న మోహన్ రాజా ప్లాన్ చేస్తున్నాడట.అయితే ఇప్పటికిప్పుడు ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకివెళ్లే అవకాశలు లేవు. అఖిల్ ఏజెంట్ మూవీ షూటింగ్ లోనూ,నాగార్జున ది ఘోస్ట్ మూవీలోనూ నటిస్తున్నాడు. మరోవైపు బంగార్రాజుకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ నాగచైతన్య, అఖిల్తో కలిసి నాగార్జున నటించనున్నాడు. మొత్తానికి అక్కినేని హీరోల మల్టీస్టారర్స్ లిస్ట్ పెరుగుతుందన్నమాట. -
మరోసారి రన్నర్గా అఖిల్ సార్థక్
బిగ్బాస్ నాల్గో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ తన పేరు వెనక ఓ చరిత్ర ఉంది. అఖిల్ నటించిన సిసింద్రి చిత్రం విడుదలైన మరుసటి రోజే తాను జన్మించడంతో కుటుంబ సభ్యులు తనకు అఖిల్ అని పేరు పెట్టాడని గతంలో చెప్పుకొచ్చాడీ మోడల్. హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో అఖిల్ మూడో స్థానం సంపాదించుకున్న అఖిల్ పలు సీరియల్స్లోనూ నటించాడు. బిగ్బాస్ హౌస్లో ఫైటర్గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఈసారి రన్నరప్గా కాకుండా కప్ గెలుచుకుని విన్నర్గా బయటకు వస్తానన్నాడు. దానికోసం హౌస్లో నిరంతరం కష్టపడ్డాడు. కానీ చివరాఖరకు బిందుమాధవితో పోటీపడలేక మరోసారి రెండో స్థానానికే పరిమితమయ్యాడు. -
సోహైల్కు అవమానం, సన్నీపై విరుచుకుపడ్డ అఖిల్!
తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ నటించిన తాజా చిత్రం సకలగుణాభిరామ. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిగ్బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీజే సన్నీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. గెలుస్తాడనుకుంటే నాల్గో సీజన్లో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేశావంటూ సోహైల్ గురించి చులకనగా మాట్లాడాడు. 'నాల్గో సీజన్లో సోహైల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేశిండు. నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు. అయినా సరే టెంప్ట్ కాలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా' అని గర్వంగా చెప్పుకొచ్చాడు సన్నీ. ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. గెలిచాక సన్నీకి గర్వం తలకెక్కిందని కామెంట్లు చేస్తున్నారు. స్టేజీమీద అందరి ముందు సోహైల్ను అవమానించడం సబబు కాదని మండిపడుతున్నారు. ఈ కామెంట్లపై అఖిల్ పరోక్షంగా స్పందించాడు. సన్నీ పేరు తీయకుండానే అతడిపై మండిపడ్డాడు. 'ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలే తప్ప అవమానించకూడదు. మనం హీరో అవడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజీ మీద చూడటం చాలా బాధనిపించింది. అప్పుడు నేనక్కడ ఉంటే బాగుండేది!' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. -
చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తున్న హీరోలు!
చోలీ కే పీచే క్యా హై అంటే... చోలీ మే దిల్ హై మేరా అన్నారు మాధురీ దీక్షిత్. ‘ఖల్ నాయక్’లోని ఈ పాట చాలామంది దిల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు... ‘చొక్కా కే పీచే క్యా హై’ అని మన హీరోలను అడిగితే... చొక్కా మే ప్యాక్ హై మేరా అంటారేమో. కథ డిమాండ్ చేస్తే ఆరు పలకలు.. ఎనిమిది పలకల దేహంతో ఫ్యాన్స్ దిల్ని ఖుషీ చేయడానికి రెడీ అయ్యారు హీరోలు. షర్ట్లెస్గా కనిపించనున్నారు.. రండి... సిక్స్ ప్యాక్ చూద్దాం. ఫైట్ సీన్స్ని ఇష్టపడే ప్రేక్షకుల శాతం ఎక్కువే ఉంటుంది. అందుకే హీరోలు కూడా డిఫరెంట్ యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. వీటికోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతారు. కొందరు హీరోలు అవసరమైతే సిక్స్ ప్యాక్ చేస్తారు. చొక్కా విప్పి, ఆ ప్యాక్ని చూపిస్తారు. ఒక సినిమాలో కనిపించి, మరో సినిమాలో కూడా షర్ట్లెస్గా కనిపించాలంటే ‘సై’ అంటారు. ‘టెంపర్’ చిత్రంలో షర్ట్లెస్గా సిక్స్ ప్యాక్తో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లో షర్ట్లెస్గా కనిపించిన దృశ్యాలు ఈ చిత్రం ట్రైలర్లో కనిపించాయి. ఇక ఇదే చిత్రంలో మరో హీరోగా చేసిన రామ్చరణ్ ‘ధృవ’లో షర్ట్లెస్గా కనిపించారు. ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లోనూ అలా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (జనవరి 7న) విడుదల కావాల్సింది. కరోనా ఎఫెక్ట్తో వాయిదా పడింది. ఇక ‘అర్జున్రెడ్డి’లో కొన్ని సీన్స్లో చొక్కా లేకుండా కనిపించారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ‘లైగర్’ కోసం బాక్సర్గా సిక్స్ప్యాక్తో రెడీ అయ్యారు. ఇటీవల విడుదలైన ‘లైగర్’ గ్లింప్స్ వీడియోలో విజయ్ షర్ట్లెస్గా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. అయితే కరోనా కారణంగా ‘లైగర్’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్లు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఇప్పటివరకు లవర్బాయ్లా కనిపించిన అఖిల్ ‘ఏజెంట్’ చిత్రం కోసం ఒక్కసారిగా మాస్ లుక్లోకి మారిపోయారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు ఏడాది కష్టపడి అఖిల్ మేకోవర్ అయ్యారు. ఇందులో అఖిల్ సిక్స్ప్యాక్ లుక్లో కనిపిస్తారు. ఇక హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్100’లోనే సిక్స్ప్యాక్ బాడీతో కనిపించారు కార్తికేయ. ఆ చిత్రం తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో షర్ట్లెస్గా కనిపించారు. తాజాగా అజిత్ హీరోగా చేసిన యాక్షన్ ఫిల్మ్ ‘వలిమై’లో కార్తికేయ విలన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కార్తికేయ ఓ ఫైట్లో సిక్స్ప్యాక్లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేస్తున్నట్లుగా కార్తికేయ సోషల్ మీడియాలో చొక్కా లేకుండా షేర్ చేసిన ఫొటో ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ హీరోలే కాదు.. మరికొందరు కూడా షర్ట్లెస్కి సై అంటున్నారు. మళ్లీ అలా కనిపిస్తారా డ్యూడ్... సిక్స్ ప్లస్ కటౌట్ ఉన్న ప్రభాస్ సిక్స్ ప్యాక్లో కనిపిస్తే.. ‘వావ్ డ్యూడ్’ అంటారు. ‘మిర్చి’ లో ప్రభాస్ కటౌట్ మీద ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే డైలాగ్ కూడా ఉందిగా. ‘బాహుబలి’లో తన కటౌట్ని చూపించారు ప్రభాస్. మరోసారి చొక్కా లేకుండా కనిపించే అవకాశం ఉంది. తాజా చిత్రం ‘ఆదిపురుష్’లో రాముడి పాత్ర చేస్తున్నారు ప్రభాస్. రాముడంటే చొక్కా లేకుండా కనబడతారు కదా.. సో.. మరోసారి ప్రభాస్ కటౌట్ని చూడొచ్చన్న మాట. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయాలనుకుంటున్నారు. -
షాకింగ్ : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అఖిల్..
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’. ఇటీవలె ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో సూపర్హిట్ కొట్టిన అఖిల్ మరో హిట్ ఖాతాలో వేసేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త మేకోవర్లో కనిపించనున్నాడు. షూటింగ్ ప్రారంభించే ముందే తన లుక్స్ కోసం నెలల తరబడి కష్టపడుతున్నాడు. తాజాగా షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో మారిన అఖిల్ న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. జిమ్లో కండలు తిరిగిన బాడీతో బీస్ట్ లుక్లో అఖిల్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
ఆడేసుకున్న మాజీ కంటెస్టెంట్లు, అంతా బిగ్బాస్ వరకే అన్న షణ్ను!
Bigg Boss Telugu 5, Episode 105: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ ఫైనలిస్టులతో మాజీ సీజన్ల కంటెస్టెంట్లు రచ్చరచ్చ చేశారు. మొదటగా ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ హౌస్మేట్స్తో ముచ్చటించారు. శ్రీరామ్తో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా వారు వెళ్లిపోతారని సెటైర్ వేయడంతో అతడు తల పట్టుకున్నాడు. తర్వాత ఒక పీపా పట్టుకుని ఊదితే ఆ పాటేంటో హౌస్మేట్స్ గెస్ చేయాలి. పాట సరిగ్గా గెస్ చేస్తే దానికి డ్యాన్స్ చేయాలి. ఈ క్రమంలో షణ్ను, సిరి కలిసి జంటగా స్టెప్పులేస్తుంటే మిగతా ముగ్గురు మాత్రం ఎవరికి వారే డ్యాన్స్ చేశారు. ఇది చూసిన హరితేజ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన ముగ్గురిపై జాలి చూపించింది. దీంతో రెచ్చిపోయిన శ్రీరామ్ సిరిని ఎలిమినేట్ చేసినట్లే చేసి మళ్లీ తీసుకొచ్చారంటూ జోక్ చేశాడు. ఇక హరితేజ బిగ్బాస్ షో గురించి, టాప్ 5 కంటెస్టెంట్ల గురించి హరికథ చెప్పి వీడ్కోలు తీసుకున్నారు. తర్వాత రెండో సీజన్ కంటెస్టెంట్లు గీతా మాధురి, రోల్ రైడా ఆటపాటలతో హౌస్మేట్స్ను అలరించారు. టాప్ 5లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ తెగ పొగిడాడు. అయితే వచ్చిన కంటెస్టెంట్లు అందరూ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్షిప్పై సెటైర్లు వేస్తూ వారిని ఓ ఆటాడుకుండటంతో సన్నీ, మానస్, శ్రీరామ్ పడీపడీ నవ్వారు. అసలే చిన్న మాట అంటేనే తట్టుకోలేని షణ్ను ఇలా అందరూ కలిసి తన మీద పడిపోవడంతో అట్టుడికిపోయాడు. మనిద్దరం హైలైట్ అయిపోతున్నామని ముగ్గురికీ మండిపోతున్నట్లుందని సిరితో వాపోయాడు. అయితే సిరి మాత్రం ఏ షిప్ అయినా బిగ్బాస్ హౌస్ వరకే అని షణ్ను అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడింది. దీంతో అతడు సిరిని ఓదార్చుతూ హగ్ చేసుకున్నాడు. ఇది చూసిన సన్నీ.. బయటకు వెళ్లాక షణ్ను హగ్ గురూ అయిపోతాడని కామెంట్ చేశాడు. అనంతరం నాలుగో సీజన్ కంటెస్టెంట్లు శివజ్యోతి, సావిత్రి హౌస్మేట్స్తో కబుర్లాడారు. బెలూన్లలోని హీలియం పీల్చుకుని పాట లేదా డైలాగులు చెప్పాలన్నారు. ఈ గేమ్లో హౌస్మేట్స్ గొంతులు మారిపోవడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఐదో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్లోని సాంగ్ ప్లే చేయడంతో అతడు సర్ప్రైజ్ అయ్యాడు. ఆ వెంటనే కంటెస్టెంట్లందరినీ కొన్ని సరదా ప్రశ్నలడిగారు. అందులో భాగంగా డేటింగ్ యాప్లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్ఫ్రెండ్ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు. వేరే కంటెస్టెంట్ టవల్ వాడారా? అన్న ప్రశ్నకు షణ్ను.. శ్రీరామ్ టవల్ వాడానని చెప్పగా మధ్యలో సిరి కలగజేసుకుంటూ తన టవల్ కూడా వాడాడని ఆరోపించింది. కొన్ని ఫొటోలు చూపించి అవి హౌస్లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్న గేమ్లో శ్రీరామ్ గెలిచాడు. సిరి తాను తీసుకోవాలనుకుని మర్చిపోయిన ఫొటోను అఖిల్, అరియానా చూపించడంతో ఆమె చాలా సర్ప్రైజ్ అయింది. అంతేకాదు షణ్ను, సిరి ఆ ఫొటోలో ఏ పాటకైతే డ్యాన్స్ చేశారో మరోసారి అదే సాంగ్కు స్టెప్పులేశారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ సరదా సరదాగా సాగింది. -
బిగ్బాస్ హౌస్లోకి నలుగురు మాజీ కంటెస్టెంట్లు
Bigg Boss Telugu 5: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో మాజీ కంటెస్టెంట్లు సందడి చేయబోతున్నారు. ప్రతి సీజన్లాగే ఈ సారి కూడా సీనియర్లు హౌస్లోని ఫైనలిస్టులతో ముచ్చటించనున్నారు. అందులో భాగంగా గీతా మాధురి, అఖిల్ సార్థక్, రోల్ రైడా, హరితేజలు హౌస్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాకపోతే కరోనాను దృష్టిలో పెట్టుకుని రూమ్లో నుంచే మాట్లాడనున్నారట. మరి వీళ్ల రాకతో బిగ్బాస్ ఎపిసోడ్ వెలిగిపోవడం ఖాయం! వీరు ఎవరెవరికి బూస్ట్ ఇస్తారో, ఎవర్ని ఆడేసుకుంటారో చూడాలి! ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో బిగ్బాస్ విన్నర్ ఎవరనేది తేలనుంది. సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. వీరిలో ఎవరు ట్రోఫీ ఎగరేసుకుపోతారనేది ఆసక్తికరంగా మారింది! -
2021 ఈ హీరోలకు చాలా స్పెషల్.. అద్భుతాలు జరిగాయి!
2021లో బాక్సాఫీస్ రన్ చాలా తక్కువ. కాని ఎక్కువగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న టాప్ యాక్టర్స్, యంగ్ హీరోస్ హిట్ ట్రాక్ అందుకోవడం ఈ ఇయర్ స్పెషాలిటీ. క్రాక్ టు అఖండ వరకు చూసుకుంటే 2021 కమ్ బ్యాక్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ‘క్రాక్’తొ కమ్ బ్యాక్ సంక్రాంతి సీజన్ లో రిలీజైన క్రాక్ మూవీతో మాస్ రాజా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 2017 లో విడుదలైన రాజా ది గ్రేట్ మూవీ తర్వాత రవితేజ వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఏడాది ప్రారంభంలో విడుదలైన క్రాక్ అనూహ్య రీతిలో విజయాన్ని అందుకున్నాడు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీలోనూ ,ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. మాస్ రాజా కు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. నరేశ్ విజయానికి ‘నాంది’ 2012లో వచ్చిన బ్లాక్ బస్టర్ సుడిగాడు తర్వాత మళ్లీ ఆ స్తాయిలో విజయాన్ని అందుకోవడానికి అల్లరి నరేష్ 2021 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో విడుదలైన ‘నాంది’ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పైగా అల్లరి నరేష్ తన అల్లరిని పక్కన పెట్టి పూర్తిగా సీరియల్ సబ్జెక్ట్ లో నటించి మెప్పించాడు. సీటీ కొట్టించిన ‘సీటిమార్’ 2014లో లౌక్యంతో సూపర్ హిట్ కొట్టాడు గోపీచంద్. మధ్యలో చాలా చిత్రాలు చేసాడు కాని కావాల్సిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. 2021లో సీటీమార్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడు. అఖిల్ ఖాతాలో భారీ విజయం 2015లో హీరోగా కెరీర్ ప్రారంభించాడు అఖిల్. హెలో, మిస్టర్ మజ్ను లాంటి మూవీస్ చేసినప్పటికీ ఫస్ట్ హిట్ మాత్రం దక్కలేదు. కాని ఈ ఇయర్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఈ అక్కినేని హీరోగా మెమొరబుల్ హిట్ గా నిలిచింది. ‘అఖండ’తో నటసింహం బాక్సాఫీస్ వేట రవితేజ, అల్లరి నరేష్, గోపీచంద్, అఖిల్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఈ ఏడాదే బాక్సాఫీస్ వేట మొదలు పెట్టాడు. అఖండతో సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ కు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందించాడు బాలయ్య. 2017లో విడుదలైన గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు బాలయ్య. దాదాపు నాలుగేళ్ల తర్వాత అఖండతో బంపర్ హిట్ కొట్టాడు. -
సాయం చేసిన కాసేపటికే శివశంకర్ మాస్టర్ కన్నుమూత
Shiva Shankar Master: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ను రక్షించుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతగానో ప్రయత్నించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయనను బతికించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, హీరో ధనుష్, సోనూసూద్ హాస్పిటల్ ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా ధనుష్ రూ.10 లక్షలు, చిరంజీవి రూ.3 లక్షల సాయం అందించారు. వీళ్లు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆయనను దక్కించుకోలేకపోయారు. ఆదివారం సాయంత్రం శివశంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. వందల సినిమాలకు కొరియోగ్రాఫర్గా సేవలందించిన ఆయన శాశ్వతంగా కన్నుమూశాడని తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇదిలా వుంటే బిగ్బాస్ నాల్గో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ వేసిన పెయింటింగ్ వేలం పాటలో 20 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ డబ్బునంతా అఖిల్ సర్వింగ్ హ్యాండ్స్ అనే ఛారిటబుల్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చారు. శివశంకర్ మాస్టర్ చికిత్సకు ఈ డబ్బు ఎంతోకొంత ఉపయోగపడుతుందని సదరు ఛారిటీ వాళ్లు దాన్ని నేడు(నవంబర్ 28)సాయంత్రం శివశంకర్ మాస్టర్ కొడుకు అజయ్కు విరాళమిచ్చారు. కానీ కాసేపటికే ఆయన కన్నుమూయడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. -
కరోనా బారినపడ్డ డైరెక్టర్ సురేందర్ రెడ్డి
Surendar Reddy Tested Positive for Corona virus: ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. షూటింగ్ కోసం హంగేరి వెళ్లి వచ్చిన ఆయన ఇటీవలె కరోనా బారిన పడ్డారు. సురేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్ పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు సమచారం. ప్రస్తుతం వారంతా క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా తెరకెక్కుతునున్న సంగతి తెలిసిందే. అఖిల్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవలె హంగేరిలో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సీన్స్ను చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై మాంచి హైప్ను క్రియేట్ చేసింది. సురేందర్ రెడ్డి కోలుకున్న అనంతరం తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. చదవండి: సీక్రెట్గా వీడియో రికార్డ్.. ఫోన్ లాక్కున్న స్టార్ హీరో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ -
తండ్రి బర్త్డేకు మర్చిపోలేని కానుకిచ్చిన అఖిల్ సార్థక్!
అఖిల్ సార్థక్.. బిగ్బాస్ షోతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడీ యంగ్ యాక్టర్. మోనాల్తో లవ్ ట్రాక్, సోహైల్తో ఫ్రెండ్షిప్, ఒంటరిగా గేమ్స్ రఫ్ఫాడించగల సత్తా.. ఇవన్నీ అఖిల్ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. బిగ్బాస్ తెలుగు నాల్గో సీజన్లో రన్నరప్గా నిలిచిన అఖిల్ ఆ మధ్య కారు కొనాలన్న కలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు మరో కల నెరవేర్చుకున్నాడు. తండ్రికి కారు కొనిచ్చే స్థాయికి ఎదిగాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు అఖిల్. "హ్యాపీ బర్త్డే డాడ్, ఒక రక్షకుడిలా ఎప్పుడూ నా వెంటే ఉన్నావు. మీరే నా సూపర్ హీరో, మీ వల్లే నేనీ స్థానంలో ఉన్నాను. మీరు నమ్ముతారో లేదో కానీ మీ కోసం ఓ కారు కొన్నాను. చిన్నప్పుడు మీరు నాకు సైకిల్ సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చారు, నాకోసం మరెన్నో చేశావు. ఇందుకు మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నా నుంచి మీకు చిన్న గిఫ్ట్ పప్పా.. మీరు చేసినవన్నీ నేను మీకు తిరిగి చేయలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా కృషి చేస్తాను. మీరు గర్వపడే పనులు చేస్తాను. మీకు కారు గిఫ్ట్ ఇవ్వాలన్నది నా కల. అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సర్ప్రైజ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా! మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని తిరిగేలా చేస్తానని మాటిస్తున్నాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు అఖిల్. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
పారదర్శకత కోసమే ఆన్లైన్ టిక్కెటింగ్
‘‘సినిమా టిక్కెట్ ధరల విషయంలో ప్రభుత్వం (ఆంధ్రప్రదేశ్) వారు మా బాధలు విన్నారు. వాటి పరిష్కార మర్గాల దిశగా ఆలోచిస్తున్నారు’’ అన్నారు నిర్మాత బన్నీ వాసు. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం రేపు రిలీజ్ కానున్న సందర్భంగా బన్నీ వాసు చెప్పిన సంగతలు. ► పెళ్లి చేసుకునేవారు, పెళ్లి చేసుకోవాలనుకునే వారు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా చూస్తే జీవితం పై ఓ క్లారిటీ వస్తుంది. పెళ్లికి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెబుతారు కానీ పెళ్లి జరిగాక భార్యతో భర్త ఎలా ఉండాలో అబ్బాయికి, భర్తతో భార్య ఎలా ఉండాలో అమ్మాయికి చెప్పే తల్లిదండ్రులు తక్కవ. పెళ్లి ముందే కాదు..పెళ్లి తర్వాత కూడా అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా నడుచుకోవాలో తల్లితండ్రులు నేర్పించాలన్నదే మా సినిమా కాన్సెప్ట్. ► ఆన్లైన్ టిక్కెటింగ్ దాదాపు ప్రతి థియేటర్లో రన్ అవుతోంది. ప్రేక్షకులు ఎన్ని టిక్కెట్స్ తీసుకున్నారన్న సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వంవారు అడుగుతున్నారు. మన ఎగ్జిబిటర్స్లో చాలామంది పన్నులు కట్టడం లేదు. దాదాపు 300 థియేటర్స్ జీఎస్టీ పరిధిలోనే లేవు. ఎంతసేపూ ఇండస్ట్రీ వైపు నుంచే కాకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎలా పెంచాలన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అప్పుడు ఇండస్ట్రీ వల్ల ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి మాకేమైనా చేసిపెట్టండని ప్రభుత్వాన్ని కోరే వీలుంటుంది. చాలామంది ఎగ్జిబిటర్స్ టాక్స్ పరిధిలోకి రావడం లేదు. ఉన్నవారు కూడా సరైన లెక్కలు చూపించడం లేదనేది ప్రభుత్వం వారి భావన. అందుకే ప్రభుత్వంవారు పారదర్శకత కోరుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే డబ్బులన్నీ ముందు ప్రభుత్వంవారు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కానీ అది కాదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్గారు ఓ రిపోర్ట్ తయారు చేయమ న్నారు. ఆ రిపోర్ట్ వచ్చాక నిర్ణయాలు ఇండస్ట్రీకి సానుకూలంగానే వస్తాయని నమ్ముతున్నాను. -
ఇలాంటి సమయంలో సెలబ్రేషన్ కావాలి!
‘‘అఖిల్ ఓ సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు.. తనలో అదే నాకు బాగా ఇష్టం. రానున్న ఐదారేళ్లల్లో ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్రలు చేయాలనే మాస్టర్ ప్లాన్ తన మైండ్లో ఉంటుంది. ‘సిసింద్రీ’ నుంచి ఇప్పటివరకు తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ప్రతి ఏడాది ఇంట్లో కొత్త అఖిల్ని చూస్తుంటాను.. తను ఓ సినిమాకి అంత అంకితం అవుతాడు’’ అన్నారు నాగచైతన్య. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అల్లు అరవింద్ సమర్పణలో దర్శకడు వాసూ వర్మతో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిపిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘జోష్’కి వాసూ వర్మ దర్శకత్వం వహించారు.. ఆ సినిమాతో చాలా నేర్చుకున్నాను. బన్నీ వాసుతో ‘100›పర్సెంట్ లవ్’ చిత్రం చేశాను. తన ప్రయాణం చూస్తే గర్వంగా ఉంది. అరవింద్గారు కథ ఓకే చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అంటారు.. అది అలాగే ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ మూవీ తీయాలంటే అంత కేర్ ఉండాలి.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ట్రైలర్ చూస్తుంటే ఓ సెలబ్రేషన్లా అనిపించింది.. ఇలాంటి సమయంలో థియేటర్స్లో మన ప్రేక్షకులకు సెలబ్రేషన్ కావాలి.. ఈ సినిమా ఆ సెలబ్రేషన్ని ఇస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అఖిల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పగలను. భాస్కర్ ఈ సినిమాను బాగా తీశాడు’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అంటే రామానాయుడుగారిని చూశాం.. ఇప్పుడు అరవింద్గారిని చూస్తున్నాం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ వంటి యూత్ఫుల్ సినిమాతో అఖిల్ హిట్ కొట్టబోతున్నాడు’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఓ మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పుకోగలిగిన సినిమా ఇది. చైతూగారి ‘100 పర్సెంట్ లవ్’ సినిమాతో నిర్మాతగా మారాను. ఇప్పుడు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ నా కెరీర్ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘ఈ టీమ్లో నన్ను భాగస్వామి చేసిన అరవింద్గారికి థ్యాంక్స్’’ అన్నారు వాసూ వర్మ. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘మీ వెనకాల (నాగచైతన్య, అఖిల్) అక్కినేని లాయల్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. అయితే అఖిల్ని తెలుగు ప్రేక్షకులందరి వద్దకూ చేర్చాలన్నదే నా ప్రయత్నం.. అది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రంతో కచ్చితంగా జరుగుతుంది’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ – ‘‘నాపై నమ్మకం ఉంచిన అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టే వరకు నేను నిద్రపోను.. నాకు నిద్ర రాదు. నేను నిద్రపోలేను. ఇది ఖాయం’’ అన్నారు. హీరోయిన్ పూజా హెగ్డే, నటి ఆమని, సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకులు హరీష్ శంకర్, మారుతి, నిర్మాత అల్లు బాబీ, పాటల రచయిత శ్రీమణి తదితరులు పాల్గొన్నారు. -
ఆమె ఒక ఫైటర్, తనకే ఫుల్ సపోర్ట్ అంటున్న అఖిల్ సార్థక్
Akhil Sarthak Supports Priya: బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో తన ప్రవర్తనతో ఎంతోమందిని బుట్టలో వేసుకున్నాడు అఖిల్ సార్థక్. అలాగే మోనాల్తో నడిపిన లవ్ ట్రాక్ కూడా అతడిని బాగానే ఫేమస్ చేసింది. అఖిల్-సోహైల్-మెహబూబ్ల ఫ్రెండ్షిప్కు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది బిగ్బాస్ షోలో రన్నరప్గా నిలిచిన అఖిల్.. దీని ద్వారా వచ్చిన క్రేజ్తో ఓ వెబ్ సిరీస్తో పాటు 'ఫస్ట్ టైమ్' అని ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇదిలా వుంటే అఖిల్.. బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్బాస్ ఐదో సీజన్ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సీజన్లో తను ఏ కంటెస్టెంట్కు సపోర్ట్ చేస్తున్నాడన్న విషయాన్ని కూడా వెల్లడించాడు. శైలజా ప్రియ... అదేనండీ నటి ప్రియకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆమెకు సపోర్ట్ చేస్తూ వీడియోలు పెట్టాడు. 'ఈ సీజన్ మొత్తానికి తను కెప్టెన్ కాలేకపోయినా టాస్కుల్లో మాత్రం తన బెస్ట్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. మీరు ఫైటర్ అన్న విషయం తెలుసనుకోండి.. అయినప్పటికీ మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నాను ప్రియగారూ..' అంటూ మద్దతు పలికాడు. నటి ప్రియకు ఓట్లేయమంటూ అభిమానులకు పిలుపునిస్తున్నాడు. -
Most Eligible Bachelor:‘లెహరాయీ’ సాంగ్.. అఖిల్-పూజా కెమిస్ట్రీ అదిరింది!
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి‘ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు. ప్రేమగీతంగా రూపుదిద్దుకున్న ఈ పాటలో అఖిల్-పూజాల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మోనాల్ని అఖిల్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?
బిగ్బాస్ సీజన్-4లో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న జంట మోనాల్-అఖిల్. తొలుత అభిజిత్తో సన్నిహితంగా ఉన్న మోనాల్ ఆ తర్వాత అఖిల్కు దగ్గరవడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం.. సీజన్ మొత్తానికే హైలెట్గా నిలిచాయి. దీంతో ఎపిసోడ్లో ఎక్కువభాగం వీరి గురించే ప్రసారం చేసేవారు. అలా ముగ్గురికి బాగానే పాపులారిటీ దక్కింది. సాధారణంగా ఈ క్లోజ్నెస్ అంతా కేవలం సీజన్ వరకే పరిమితమయ్యేది. ఆ తర్వాత ఎవరి బిజీలో వాళ్లు ఉండటం, షో నుంచి బయటికొచ్చాక ఆ సాన్నిహిత్యం ఉండేది కాదు. కానీ మోనాల్- అఖిల్ మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చకా కూడా తరుచూ అఖిల్ని కలవడం, ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరవడం, ఫోటోలకు ఫోజులివ్వడం చేసేవాళ్లు దీంతో నిజంగానే వాళ్లమధ్య ఏదో ఉందని బయట టాక్ నడుస్తుండేది. ఎప్పటికప్పుడు ప్రేమ, పెళ్లి పదాలు వాడుతూ అభిమానులను కన్ఫ్యూజన్లో పడేసేవారు ఈ క్యూట్ కపుల్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వీరు లేటెస్ట్గా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి స్ర్కీన్ షాట్లను అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ 'గుజ్జు' అంటూ మోనాల్ని ముద్దుగా సంబోధించాడు. దీనికి మోనాల్ కూడా 'అఖిలూ'.. అంటూ ప్రేమగా పిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్ర్కీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. త్వరలోనే వీరు ఆఫ్ స్ర్కీన్ జోడీగా కనిపించినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు అఖినాల్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్, మోనాల్ కలిసి ‘గుజరాతి అమ్మాయి..తెలుగు అబ్బాయి’అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : Bigg Boss 5 Telugu: నాగ్ ఔట్.. హోస్ట్గా యంగ్ హీరో! హైదరాబాదీని అయిపోయా.. మోనాల్ ఆసక్తికర పోస్ట్ -
సోషల్ హల్చల్ : అనన్య నవ్వులు, భూమిక జ్ఞాపకాలు
నవ్వులు చిందిస్తున్న ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది ‘వకీల్సాబ్’ ఫేమ్ అనన్య స్నేహితులను మిస్ అవుతున్నామంటూ.. గతంలో ఫ్రెండ్స్తో కాఫీ తాగిన ఫోటోని అభిమాలనుతో పంచుకుంది నిత్యామీనన్ 10లోపు ఇంటికెళ్లండి చెబుతున్న యాంకర్ శ్యామల నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే ఇతరును ప్రేమించగలుతావని అంటున్నాడు బిగ్బాస్ ఫేమ్ అఖిల్ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లింది హీరోయిన్ భూమిక. 2018లో దిగిన తన ఫొటోని అభిమానులతో పంచుకుంది View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) \ View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
అందుకోసం చాలా కష్టపడ్డాను, అయినప్పటికీ: పూజా హెగ్డే
‘‘స్టాండప్ కమెడియన్గా చేయడం అంత సులువేం కాదు’’ అంటున్నారు పూజా హెగ్డే. అఖిల్ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రంలో స్టాండప్ కమెడియన్ వైభ పాత్రలో నటించారు పూజా హెగ్డే. ఈ పాత్ర చేయడానికి ఎలాంటి కృషి చేశారో పూజా హెగ్డే చెబుతూ – ‘‘రోజుల తరబడి చేసిన సాధనను ఒక గంటలోనో, అరగంటలోనో వేదికపై స్టాండప్ కమెడియన్స్ ప్రదర్శించాల్సి ఉంటుంది. పంచ్ లైన్స్తో వీక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రం స్టాండప్ కామేడీ బేస్ మీద తీస్తున్నది కాదు. బ్యూటీఫుల్ లవ్స్టోరీ. ఈ సినిమాలో నా పాత్ర స్టాండప్ కమెడియన్. సన్నివేశాలకు అవసరమైనంతవరకు మాత్రమే నా స్టాండప్ కామెడీ స్కిల్స్ను చూపించాలి. ఇందుకోసం తీవ్రంగా శ్రమించాను. ముఖ్యంగా చాలామంది స్టాండప్ కమెడియన్స్ని కలిసి మాట్లాడాను. స్టేజ్పై వారు సందర్భానుసారంగా విసిరే పంచ్లు, వ్యూయర్స్కి తగ్గ రియాక్షన్స్ ఇవ్వడం వంటి వాటి గురించి వారితో చర్చించాను. అందుకే బాగా నటించగలిగాను. అయితే నటించడం మొదలుపెట్టాక స్టాండప్ కమెడియన్ రోల్ చేయడం నేననుకున్నంత సులువేం కాదని అర్థమయింది’’ అని పేర్కొన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో మరో ఇద్దరు లేడీ స్టాండప్ కమేడియన్స్ కోసం దాదాపు వందమందిని ఆడిషన్ చేశారట. ఈ చిత్రం జూన్ 19న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే.. -
మోనాల్పై అఖిల్కి ఎంత ప్రేమో.. ఈ పోస్ట్ చూస్తే తెలిసిపోతుంది
‘మోనాల్-అఖిల్ మధ్య ఏదో ఉంది.. అది కచ్చితంగా ప్రేమే. లేకపోతే అంత క్లోజ్గా ఎలా ఉంటారు? అఖిల్ కోసం మోనాలు ఎన్ని త్యాగాలు చేసింది. అఖిల్ కూడా మోనాల్ని ఎవరైనా ఏమైనా అంటే అస్సల్ సహించడు. దీన్ని ప్రేమ కాకపోతే ఇంకేం అంటారు? బయటకు వచ్చాక కచ్చితంగా వాళ్లు పెళ్లి చేసుకుంటారు’... బిగ్బాస్ నాల్గో సీజన్ మొదలయ్యాక రెండో వారం నుంచి బుల్లితెర ప్రేక్షకుల మదిలో మెదిలిన అనుమానాలు ఇవి. ఈ అనుమానాలు నిజం చేస్తూ బయట కూడా ఈ జంట ఎప్పుడూ కలుస్తూ నెట్టింట హల్ చేస్తుంది. పైకి మంచి స్నేహితులు అని చెబుతున్నా.. ఎప్పటికప్పుడు ప్రేమ, పెళ్లి పదాలు వాడుతూ అభిమానులను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం వీరి ప్రేమ విషయాన్ని పరోక్షంగా ఒప్పుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్ట్లతో వీరిమధ్య ప్రేమ ఉందనే సందేహాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఇక తాజాగా అఖిల్ మరో అడుగు ముందుకేసి తన రాణి మోనాలే అని చెప్పేశాడు. దీంతో వారి మధ్య కచ్చితంగా ప్రేమ ఉందని తెలిసిపోయింది. మోనాల్ పుట్టిన రోజు(మే 13)సందర్భంగా గురువారం అఖిల్ ఆమెకు బర్త్డే విషెష్ తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాణులకు సంబంధించి చాలా కథలు విన్నా.. రియల్ లైఫ్ రాణి మాత్రం నువ్వేనంటూ మోనాల్ పై ప్రేమను అఖిల్ చెప్పుకొచ్చారు. ఆమె గురించి వర్ణించడానికి తాను వాడిన పదాలు చిన్న పదాలు అని, అయితే ఆ పదాలను మించి వర్ణించడం తన వల్ల కావడం లేదని అఖిల్ చెప్పుకొచ్చాడు. మోనాల్ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ షోకు థ్యాంక్స్ అని అఖిల్ అన్నాడు. మోనాల్ భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని అఖిల్ పేర్కొన్నారు. ప్రేమతో జైకృష్ణ జై శ్రీరామ్ అంటూ అంటూ అఖిల్ తన పోస్ట్ ను ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అఖిల్ పోస్టును చూసిన నెటిజన్లు మోనాల్ పై అఖిల్ కు ఇంత ప్రేమ ఉందా..? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్, మోనాల్ కలిసి ‘గుజరాతి అమ్మాయి..తెలుగు అబ్బాయి’అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
Assam: కొడుకు బెయిల్ కోసం ఎన్నికల్లో గెలిపించిన తల్లి
అఖిల్ గొగొయి జైల్లో ఉన్నారు. ఆయన తరఫున 85 ఏళ్ల ఆయన తల్లి ప్రియాద ఎన్నికల ప్రచారం చేశారు. అస్సాంలోని శివసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిల్ సుమారు 12 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక 30 ఏళ్ల చందనా బారి ఒక పూరి గుడిసెలో ఉంటారు. భర్త రోజువారీ కూలీ. పశ్చిమ బెంగాల్లోని సల్తోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు వేల ఓట్లు మెజారిటీతో గెలిచారు. డబ్బు, రాజకీయ అనుభవం లేకున్నా చందన గెలిస్తే.. తన బిడ్డను ఎలాగైనా జైలు నుంచి విడిపించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రియాద అతడిని గెలిపించుకున్నారు. వీరివి అసాధారణ విజయాలు మాత్రమే కాదు.. వీరు అసాధారణ విజేతలు కూడా! ప్రియాద అఖిల్ సామాజిక కార్యకర్త. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో ప్రదర్శనలు నిర్వహించి 2019 డిసెంబరులో అరెస్ట్ అయ్యారు. ఎన్నికల్లో తన సొంత పార్టీ ‘రైజోర్ దళ్’ అభ్యర్థిగా శివసాగర్ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబడ్డారు. కానీ బయటికి వచ్చి ప్రచారం చేయడానికి లేదు. ఆ బాధ్యతను వృద్ధురాలైన అతడి తల్లి ప్రియాద తన భుజంపై వేసుకున్నారు. ఆమె ఆశ ఒక్కటే. తన కొడుకు గెలిస్తే, అప్పుడైనా అతడిని విడుదల చేస్తారని. అందుకే అతడిని గెలిపించడం కోసం ఆమె శివసాగర్లో ఇంటింటికి తిరిగారు. వేసవి గాలుల్ని, తన హృద్రోగాన్ని, సహకరించని కంటి చూపును కూడా ఆమె లక్ష్య పెట్టలేదు. ఆ మాతృమూర్తి పట్టుదలకు చలించిపోయిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు మేధా పాట్కర్, సందీప్ పాండే ఆమెకు తోడుగా ప్రచారానికి వచ్చారు. ఆ తల్లి శ్రమ ఫలించింది. అఖిల్ గెలిచాడు. ఇక అతడికి బెయిలు రావడమే మిగిలింది. చందన పశ్చిమ బెంగాల్లోని సల్తోరా నియోజకవర్గం నుంచి గెలిచిన చందనా బారి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి. ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఆశ్చర్యకరమైన రీతిలో గెలిచిన వారిలో చందన ఒకరు. నిరుపేద కుటుంబం. భర్త రోజువారీ కూలి. అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించగానే ట్విట్టర్లో చందన పేరు మార్మోగిపోయింది. ఆమె గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆమె ఓట్లు అడిగిన విధానం, ఏ బలమూ లేని నిదానం.. ఓటర్లను ఆకట్టుకుంది. ‘‘ఆమెను చూడండి. రాజకీయాలు తెలియవు. డబ్బు లేదు. ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చింది’’ అని ట్విట్టర్ యూజర్లు వందల సంఖ్యలో చందనకు నేటికింకా అభినందనలు తెలియజేస్తూనే ఉన్నారు. చదవండి: West Bengal: మూడోసారి సీఎంగా మమత ప్రమాణ స్వీకారం -
అందుకే మోనాల్ని హీరోయిన్గా తీసుకోలేదు : అఖిల్
బిగ్బాస్ ఫేం అఖిల్-మోనాల్ జోడీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ వేర్వేరు ఆఫర్లతో బిజీ బిజీగా మారారు. అయినప్పటికీ వీరిద్దరు బిగ్బాస్లో ఉన్న బాండ్నే కొనసాగిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పార్టీలు, ఫంక్షన్లలోనూ ఇద్దరూ జంటగానే వెళ్తూ ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. కాగా 'ఫస్ట్టైం' అనే మూవీతో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్కు జంటగా అనిక విక్రమన్ హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే అఖిల్కు జోడీగా మోనాల్ను తీసుకోకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కొత్త హీరోయిన్ను తీసుకునే బదులు మోనాల్ను ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో అఖిల్ క్లారిటీ ఇచ్చేశారు. మూవీకి ఎవరిని హీరోయిన్గా తీసుకోవాలనే ఛాయిస్ డైరెక్టర్దేనని,ఆయనే కొత్త హీరోయిన్ను ఎంపిక చేశారని బదులిచ్చారు. అంతేకాకుండా తామిద్దరం కలిసి తెలుగబ్బాయి-గుజరాతీ అమ్మాయి అనే వెబ్సిరీస్ చేయనున్నట్లు తెలిపాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. బిగ్బాస్ నుంచి వచ్చాక దాదాపు 27 స్టోరీలు విన్నానని, 'ఫస్ట్ టైం' స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. చదవండి: మోనాల్తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్ నాగబాబు వాట్సాప్ డీపీ చూస్తే షాక్ అవ్వాల్సిందే! -
‘ఫస్ట్ టైమ్’ అంటున్న అఖిల్.. నో టెన్షన్ అన్న అనిల్
ప్రతి ఉగాదికి నూతన చిత్రాల ప్రారంభోత్సవాలు, షూటింగ్ అప్డేట్స్తో తెలుగు పరిశ్రమ కళకళలాడుతుంటుంది. ఈ ఏడాది ఉగాది కూడా సంతోషాన్ని తీసుకువచ్చింది. కొత్త చిత్రాల ప్రారంభోత్సవాలు, నిర్మాణంలో ఉన్న చిత్రాల విశేషాలు, భవిష్యత్తులోపట్టాలెక్కే చిత్రాల కబుర్లతో పండగ జోష్ కనిపించింది. పండగ పూట.. కొత్త పాట హైదరాబాద్లో కొత్త పాట మొదలుపెట్టారు మహేశ్బాబు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా చేస్తున్న ‘సర్కారువారిపాట’ సినిమా సెకండ్ షెడ్యూల్ మంగళవారం హైదరాబాద్లో ఆరంభమైంది. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి సందర్భంగా ‘సర్కారువారి పాట’ విడుదల కానుంది. నో టెన్షన్.. ఓన్లీ ఫన్ ‘ఎఫ్ 3’ సినిమా సెట్లో మళ్ళీ ఫన్ మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఇది. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఈ సినిమా తాజా షెడ్యూల్ మంగళవారం మొదలైంది. ‘‘ఎఫ్ 3’ సెట్స్లో ఫన్ మళ్లీ మొదలైంది. ఈ ఏడాది అంతా సంతోషం, హంగామాలతో నిండిపోవాలి. ఆందోళనలకు, బాధలకు చోటు ఉండకూడదు’’ అని పేర్కొన్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల చేయాలనుకుంటున్నారు. రవితేజ హీరోగా రూపొందనున్న తాజా చిత్రం హైదారాబాద్లో ఆరంభమైంది. శరత్ మండవ ఈ చిత్రానికి తొలి సన్నివేశానికి నిర్మాత రవిశంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రవితేజ క్లాప్ ఇచ్చారు, ఈ చిత్రనిర్మాత సుధాకర్ చెరుకూరి స్క్రిప్ట్ను శరత్కు అందించారు. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ‘బిగ్బాస్’ ఫేమ్ అఖిల్ సార్ధక్ హీరోగా ఐ.హేమంత్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ టైమ్’. అనిక విక్రమన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఆరంభమైంది. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్.ఎల్.ఎ రఘునందన్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యానారయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ అడ్వంచర్ మూవీని ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. నూతన నటీనటులతో నిర్మాతలు ఐ. సతీష్కుమార్, కల్యాణ్ సుంకరలు ఓ సినిమాను ప్రారంభించారు. తొలి సన్నివేశానికి నటుడు అలీ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరోయిన్ పాయల్ రాజ్పుత్ క్లాప్ ఇచ్చారు. రాజ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభించి అదే నెలలో చిత్రీకరణ పూర్తి చేస్తామని, చిత్రబృందం తెలిపింది. ఆర్జీవీ దెయ్యం హారర్ బ్యాక్డ్రాప్లో రామ్గోపాల్వర్మ (ఆర్జీవీ) సినిమాలంటే ఆడియన్స్లో ఓ స్పెషల్ ఎటెన్షన్ ఉంటుంది. ఆర్జీవీ డైరెక్షన్ లో వస్తున్న హారర్ సినిమాల సిరీస్లో రూపొందిన మరో చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. రాజశేఖర్, స్వాతీ దీక్షిత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. జీవితా రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాతలు. ‘‘రాజశేఖర్, నేను ఎవరికి వాళ్లం బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఇందులో రాజశేఖర్ కూతురిగా దీక్ష నటించారు’’ అని విలేకరుల సమావేశంలో రామ్గోపాల్ వర్మ అన్నారు. -
అఖిల్ కొత్త బైకు: సోహైల్, మోనాల్కు నో ఛాన్స్!
అఖిల్ సార్థక్.. బిగ్బాస్కు ముందు వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బిగ్బాస్ తర్వాత ఇతడు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొన్న అఖిల్ తన యాటిట్యూడ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చిన ఇతడు పాతికేళ్లకే కారు కొన్నాలన్న కోరికను సైతం గత నెలలో సాకారం చేసుకున్నాడు. తాజాగా ఈ యంగ్ యాక్టర్ లేటెస్ట్ బైక్ను సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ఫొటోలతో పాటు బైక్ నడుపుతున్న వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా.. "నా కలను నిజం చేసిన ఆ దేవుడికి, నా తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ నా వెన్నంటే ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రానున్న రాజుల్లో మీ అందరూ గర్వపడేలా చేస్తాను" అని రాసుకొచ్చాడు. ఇక ఈ బైకుకు ఒకటే సీటు ఉండటంతో ఆశ్చర్యపోయిన సోహైల్ తానెక్కడ కూర్చోవాలని ప్రశ్నించాడు. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. నీకోసం నా గుండెలో స్పెషల్ సీటు ఉందని రిప్లై ఇచ్చాడు. అతడి ఫ్యాన్స్ మాత్రం అక్కడ ఆల్రెడీ మోనాల్ ఉందిగా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక గంగవ్వేమో జర నెమ్మదిగా నడుపు అని తన మనవడు అఖిల్కు సూచించింది. పలువురు సెలబ్రిటీలతో పాటు అతడి అభిమానులు సైతం అఖిల్ కొత్త బైకు కొన్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ బైకుకు ఒకటే సీటు ఉండటంతో అఖిల్.. సోహైల్, మోనాల్నే కాదు, ఎవరినీ ఎక్కించుకుని రైడ్కు తీసుకెళ్లలేడు. కాగా గతంలో పలు సీరియళ్లలో నటించిన అఖిల్ ప్రస్తుతం మోనాల్ గజ్జర్తో "తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి" అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. చదవండి: అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్ భయంతో అవ్వా అంటూ ఏడ్చినంత పని చేసిన గంగవ్వ! -
మోనాల్తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్
బిగ్బాస్ 4 సీజన్ కపుల్గా మోనాల్, అఖిల్కు సోషల్ మీడియాలో వీపరీతమైన క్రేజ్ ఉంది. బిగ్బాస్ హౌజ్లో ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ట్రయాంగిల్ లవ్స్టోరిగా గొడవలు, ప్రేమలు, స్నేహాలు, అపార్థాలతో ఈ షో అంతా మోనాల్, అఖిల్, అభిజిత్ల చూట్టే తిరిగింది. ఇక మోనాల్-అఖిల్ల మధ్య జరిగే రొమాంటిక్ మచ్చట్ల కోసమే చాలా మంది ఈ షోని వీక్షించారనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన మోనాల్ను బిగ్బాస్ చివరి వరకు పట్టుకొచ్చాడు. దీంతో మోనాల్ను నెటిజన్లు బిగ్బాస్ దత్త పుత్రికను చేసేశారు. అయినప్పటికి ఎప్పుడు వీరిద్దరి మంచి స్నేహితులమే అని చెబుతుంటారు. దీంతో వీరిద్దరి మధ్య ఏముందో ఇప్పటికి ఎవరికి అంతు చిక్కడం లేదు. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ కపుల్ తరచూ పార్టీలకు అటెండ్ అవ్వడం, పలు టీవీ షోలో జంటగా పాల్గొంటూ అదే బ్రాండ్ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమో అర్థంకాక ప్రేక్షకులు, అభిమానులు జుట్టు పిక్కుంటున్నారు. అయితే వీరిద్దరూ తరచూ వీడియో కాల్స్, చాట్స్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్, మోనాల్తో వీడియో కాల్ మాట్లాడిన స్క్రీన్ షాట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. బిగ్హౌజ్లో, బయటయ పలు టీవీ కార్యక్రమాల్లో మెనాల్పై ఉన్న ప్రేమను పాట రూపంలో వ్యక్త పరిచే అఖిల్.. ఈ సారి కవితాత్మకంగా చెప్పి కవిగా మారాడు. మోనాల్తో వీడియో కాల్ మాట్లాడిన అనంతరం అఖీల్.. మా సంతోషం ఇలా ఉందంటూ లవ్ ఎమోజీని జత చేశాడు. ఆ తరువాత ‘ప్రేమ క్యాన్సర్ వంటిది.. అది మరిచిపోయినట్టు చేస్తుంది.. చివరకు ప్రాణాలను తీసుకెళ్లిపోతోంది’ తన కవి హృదయాన్ని బయటపెట్టాడు. దీంతో అఖిల్ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కాగా వీరిద్దరూ జంటగా ప్రేమ కథా నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ రానున్న సంగతి తెలిసిందే. చదవండి: రామ్ చరణ్ బర్త్డే: మెగాస్టార్ ఎమోషనల్ వీడియో ఆచార్యతో కలిసి నడిచిన సిద్ధ -
'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్
బిగ్బాస్ నాల్గో సీజన్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గంగవ్వ. యూట్యూబ్ వీడియోలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె బిగ్బాస్లో ఎంట్రీ ఇచ్చి సంచలనమే క్రియేట్ చేసింది. అయితే వయసురీత్యా అనారోగ్యం వెంటాడుతుండటంతో షో మధ్యలోనే అర్ధాంతరంగా బయటకు రాక తప్పలేదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం అందరికంటే హుషారుగా ఉంటూ మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చింది. ఇక అఖిల్ సార్థక్ను ప్రేమగా అఖిలూ... అని పిలుస్తూ సొంత మనవడిలా చూసుకునేది. దత్తత తీసుకుని పెళ్లి కూడా చేస్తానంది. అతడు కూడా అవ్వతో ఆప్యాయంగా మెలిగేవాడు. తాజాగా అఖిల్ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేసింది గంగవ్వ. చాలా రోజులకు అఖిల్ను కళ్లారా చూడటంతో అవ్వ తెగ సంతోషపడిపోయింది. అఖిల్ను తీసుకుపోయేందుకు వచ్చానంటూ అతడి కుటుంబ సభ్యులతో చెప్పుకొచ్చింది. ఇక అఖిల్ వేసుకున్న జీన్స్ మీద కూడా సెటైర్లు వేసింది. ఇది చినిగిపోయింది. ఇలాంటివి నేను మసిగుడ్డలుగా వాడుతానంటూ అతడి పరువు తీసింది. కానీ అంతలోనే అఖిల్ ఒక్కడే కాదు, ఇప్పుడు అందరూ ఇలాంటివే తొడుగుతున్నారని వెనకేసుకొచ్చింది. ఇక సడన్గా అఖిల్ వాళ్ల అమ్మానాన్న కనిపించకపోవడంతో అవ్వ వారి కోసం తెగ వెతికింది. అయితే ఇక్కడ అఖిలే వారి పేరెంట్స్ను బయటకు పంపించి ఆమె కోసం పట్టీలు తీసుకురమ్మన్నాడు. దీంతో అవ్వ ఇష్టపడే డిజైన్లో పట్టీలు కొనుక్కొచ్చారు. వాటిని అవ్వ కాలికి పెట్టి సర్ప్రైజ్ చేశారు. మొత్తానికి ఊరి నుంచి వచ్చిన అవ్వను ఊరికే పంపించకుండా కానుక ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె వెళ్లిపోతుండటంతో 'నా అవ్వ బంగారం..' అంటూ అఖిల్ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. చదవండి: ఇన్స్టాగ్రామ్ రీల్స్..ఇప్పటికే..10 లక్షలకు పైగానే లైక్స్ గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ ఎమీ హాకిన్స్.. మరో గంగవ్వ -
అభిమాని చేసిన పనికి షాకైన అఖిల్
అఖిల్ సార్థక్.. బిగ్బాస్ నాల్గో సీజన్లో అతివల మనసు దోచిన అందగాడితడు. కేవలం ఫిట్నెస్తోనే కాకుండా యాటిట్యూడ్తో, తనదైన గేమ్ ప్లేతో ఫినాలే వరకు చేరుకున్నాడు. కానీ గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. అభిమానుల అండ మెండుగా ఉన్న ఇతడికి ఆ మధ్య ఓ ఫ్యాన్ ల్యాప్టాప్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి బిగ్బాస్ ఐ ఉన్న బ్రేస్లెట్ ఇచ్చి అతడి మెప్పు పొందాడు. కానీ తాజాగా ఓ వీరాభిమాని చేసిన పనికి అఖిల్కు షాక్ కొట్టినంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బిగ్బాస్ షో సమయం నుంచి అఖిల్కు వీరాభిమానిగా మారిపోయాడు అర్జున్ అనే వ్యక్తి. అతడు అందరిలా తన హీరోతో సెల్ఫీ దిగి సంతృప్తిపడాలనుకోలేదు. అతడెప్పటికీ తనతోనే ఉండిపోవాలనుకున్నాడు. దీంతో అఖిల్ పేరును ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఈ మధ్యే అతడు అఖిల్తో ఫొటో దిగాడు. ఈ నేపథ్యంలో అతడి ఎద మీద టాటూ చూసిన అఖిల్కు దిమ్మతిరిగినంత పనైంది. తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు నోట మాట రాకుండా పోయింది. ఈ క్రమంలో అతడు తన అభిమానితో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. "ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకిప్పుడు మాటలు కరువయ్యాయి. కానీ ఇలాంటి అభిమానులు దొరకడం నా అదృష్టం. నా పేరును పచ్చబొట్టు వేయించుకోవడం సాధారణ విషయం కాదు. నీ జీవితంలో నన్ను భాగస్వామ్యుడిని చేసినందుకు, నా మీద ఇంత ప్రేమ చూపిస్తునందుకు థ్యాంక్ యూ అర్జున్. తప్పకుండా మీ అందరూ గర్వపడే స్థాయికి ఎదుగుతాను. కానీ ఓ ముఖ్య విషయం: మీకు నేనంటే చాలా ఇష్టం, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ టాటూలు వేయించుకోవడానికి బదులు ఎప్పటికీ మీరు నాతోనే ఉంటానని మాటిస్తే అదే చాలు.." అని రాసుకొచ్చాడు. ఈ ఫొటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇక పాతికేళ్ల వయసులో కారు కొనుక్కోవాలన్న అభిలాషను అఖిల్ ఈ మధ్యే నేరవేర్చుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) చదవండి: హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు పాతికేళ్లకే సాధించిన అఖిల్ సార్థక్ -
అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్: అవాక్కైన బిగ్బాస్ కంటెస్టెంట్
తెలుగు బిగ్బాస్ నాల్గో సీజన్కు రన్నర్ను, కానీ ప్రేక్షకుల మనసులను దోచుకున్న విన్నర్ను అని చెప్పుకుంటాడు అఖిల్ సార్థక్. ప్రస్తుతం అతడు తెలుగు అబ్బాయి - గుజరాత్ అమ్మాయి అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ బిగ్బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ సోమశేఖర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా అతడి ఫొటో ఫ్రేమ్ను ప్రత్యేక కానుకగా పంపించాడు. ఈ విషయాన్ని అతడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అభిమానులతో పంచుకున్నాడు. "హలో రాక్స్టార్, హ్యాపీ బర్త్డే. మనిద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయి. అందుకే ఇలా కనెక్ట్ అయిపోయాం. మా అమ్మది తమిళ్. అలా నాకు ఆ భాష కాస్తోకూస్తో అర్థమవుతుంది, కానీ మాట్లాడలేను. నేను తమిళ బిగ్బాస్ షో చూశాను. ఇద్దరం బిగ్బాస్ 4 నుంచి వచ్చినవాళ్లమే. లవ్ యూ రాక్స్టార్" అంటూ వీడియో సందేశం పంపాడు. ఇక అతడు పంపిన గిఫ్ట్ చూసి సోమశేఖర్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. "ఓ మై గాడ్, చాలా బాగుంది బ్రదర్" అంటూ త్వరలోనే కలుద్దామని చెప్పుకొచ్చాడు. సోమశేఖర్ విషయానికొస్తే.. బాక్సింగ్ మ్యాచ్లో గోల్డ్ మెడల్, తమిళనాడు స్టేట్ లెవల్ మువైతాయ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. మోడల్గా తన కెరీర్ను ప్రారంభించిన ఆయన 'అజగియ తమిళ్ మ్యాగన్' టీవీ షోలో తళుక్కున మెరిశాడు. బైకులను అమితంగా ప్రేమించే ఇతడు ఈ మధ్యే కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తమిళ బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొని అందరి ఆదరాభిమానాలను అందుకున్నాడు. గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న ఇతడు నాలుగో రన్నరప్గా నిలిచాడు. చదవండి: అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్ ఫ్రాంక్తో తల్లిని హడలుగొట్టిన కుమారులు -
అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్
గెలుపు ఒక్కటే విజయం కాదు, డబ్బుతో వెలకట్టలేని అభిమానాన్ని సంపాదించడమూ ఓ రకంగా విజయమే. బిగ్బాస్ నాల్గో సీజన్ రన్నర్ అఖిల్ సార్థక్ ఈ మాటను బలంగా విశ్వసిస్తాడు. అందుకే హిందీ బిగ్బాస్ 14వ సీజన్ విన్నర్ రుబీనాకు కాకుండా రన్నర్గా నిలిచిన రాహుల్ వైద్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. రన్నర్లు కూడా విన్నర్లే అని చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే తాజాగా అఖిల్ సార్థక్ ఓ కొత్త కారు కొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "పాతికేళ్లలోపే కొత్త కారు కొనాలని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. తల్లిదండ్రుల సపోర్ట్, నా హార్డ్వర్క్, మీ ప్రేమాభిమానాల వల్లే ఇప్పుడా కల నెరవేరింది. నేను కష్టాన్ని నమ్ముతాను, పనిని దైవంగా భావిస్తాను. ఏదైనా సరే సాధించేవరకు పోరాడుతూనే ఉంటాను. అఖిల్ ఫ్యామిలీలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జై శ్రీరామ్.." అంటూ అఖిల్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. త్వరలోనే హోండా సిటీ కారులో రైడ్కు వెళ్దాం అని సోహైల్, నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ మోనాల్ సదరు పోస్ట్కు రిప్లై ఇచ్చారు. నోయల్ సహా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అఖిల్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన ఎర్రటి కారులో ఎరుపు రంగు డ్రెస్సులో అఖిల్ నేడు షికారుకు వెళ్లాడు. ఈ వీడియోను ఆర్జే చైతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తూ అఖిల్కు కంగ్రాట్స్ చెప్పుకొచ్చాడు. మరి ఈ కారులో సామ్(సోహెల్, అఖిల్, మోనాల్ గజ్జర్) ఎప్పుడు షికారుకు వెళ్తారోనని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇదిలా వుంటే అఖిల్ ప్రస్తుతం "తెలుగు అబ్బాయి- గుజరాత్ అమ్మాయి" అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు. ఇందులో బిగ్బాస్ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ అతడితో జోడీ కడుతోంది. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) చదవండి: జంటగా మారబోతున్న బిగ్బాస్ ఫేం మోనాల్-అఖిల్ -
అభిజీత్ను వెనక్కినెట్టిన అఖిల్..
గతేడాది ప్రసారమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 4 టైటిల్ని అభిజీత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు (ముగ్గురు వైల్డ్కార్డ్ సహా) ఈ సీజన్లో పాల్గొనగా.. అందరూ ఊహించినట్లుగానే అభిజీత్ టైటిల్ని గెలుచుకోగా అఖిల్ సార్థక్ రన్నరప్గా నిలిచాడు. బిగ్బాస్ షో ముగిసి రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఏదో ఒక విషయంలో రోజూ వార్తల్లో నానుతూనే ఉంది. ఓవైపు ప్రేక్షకులకు వినోదం పంచుతూనే మరోవైపు ఇందులో పాల్గొంటున్న వారికి మంచి ఆఫర్లు తెచ్చిపెడుతోంది. ఇంతకు ముందు సీజన్లలో కంటే బిగ్బాస్4లో పాల్గొన్న వారు మాత్రం ఈ షో ద్వారా లభించిన ఫేమ్ను బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా అవకాశాలతోపాటు పలు బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్ సొంతం చేసుకున్నారు. వీరిలో వ్యక్తిక్తంతో అందరికంటే ఎక్కువ పాపులారీటిని సొంతం చేసుకున్న సోహైల్ ఓ సినిమాను కమిట్ అయిన విషయం తెలిసిందే. సోహైల్ మెయిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక మోనాల్ గజ్జర్ ఇప్పటికే అల్లుడు అదుర్స్లో ప్రత్యేక పాటలో మెరిసింది. మరో చిత్రంతో కూడా చర్చలు జరుపుతోంది. ఇక దేత్తడి హారిక రెండు సినిమాలను ఓకే చేసింది. దివి సినిమాల్లో నటిస్తోంది. కమెడీయన్ అవినాష్ ఓ టీవీ ఛానల్లో కామెడీ షో చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ సార్థక్ హీరోగా లాంచ్ అవుతున్నాడు. బిగ్బాస్లో తన లవ్ పెయిర్ మోనాల్ గజ్జర్తో కలిసి వెబ్ సిరీస్లోనటిస్తున్నారు. చిత్రానికి భాస్కర్ బంతుపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇంత మంది బిగ్బాస్ కంటెస్టెంట్లు అనేక ఛాన్స్లు కొట్టేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుంటే బిగ్బాస్ విన్నర్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. విన్నర్గా అబిజీత్ పేరు ప్రకటించడంంతో వెంటనే ఆయన ఇంటికి వరుసపెట్టి చిత్రనిర్మాతలు క్యూ కట్టారు. దీంతో అభిజీత్ ఇక మీద సినిమాల్లో దూసుకుపోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ అభి మాత్రం ఇప్పటికీ ఇంకా ఏ సినిమానూ ఒప్పుకోలేదు. అయితే స్టోరీల పరంగా మంచి వాటి కోసం ఎదురు చూస్తున్నాని.. సింహం లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుందని అభిజీత్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చదవండి: జంటగా మారబోతున్న మోనాల్-అఖిల్ బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. పెద్ద సినిమాలో చాన్స్! ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా? -
మ్యూజిక్ ఓ హైలైట్: బొమ్మరిల్లు భాస్కర్
అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘గుచ్చే గులాబిలా..’ పాటను వేలంటైన్స్ డేకి రిలీజ్ చేశారు. గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటను అనంత్ శ్రీరామ్, శ్రీమణి రచించారు. అర్మాన్స్ మాలిక్ ఆలపించారు. ఈ పాటకు విశేష స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. భాస్కర్ మాట్లడుతూ – ‘‘పాట సందర్భాన్ని వివరిస్తున్నప్పుడే గోపీసుందర్ ట్యూన్స్ ఇచ్చేశారు. మా సినిమాకు మ్యూజిక్ ఓ హైలెట్’’ అన్నారు. ‘‘భాస్కర్గారు కథ చెప్పిన విధానం నచ్చింది. అప్పుడే మంచి ట్యూన్స్ కట్టేశాం. మిగతా పాటలను కూడా అందరికీ త్వరగా వినిపించాలనుంది’’ అన్నారు గోపీసుందర్. -
జంటగా మారబోతున్న మోనాల్-అఖిల్
బిగ్బాస్ నాల్గో సీజన్లో మోనాల్, అఖిల్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ మచ్చట్ల కోసమే షోని వీక్షించినవారు ఉన్నారు. ఇక మోనాల్, అఖిల్, అభిజిత్ మధ్య జరిగిన ట్రయాంగిల్ లవ్ షోని ఎంత రక్తి కట్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాల్గో సీజన్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చాక కూడా అదే ప్రేమానుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బిగ్బాస్ లవ్ కపుల్గా పేరొందిన మోనాల్ గజ్జర్-అఖిల్కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ ఏర్పడింది. వీరిద్దరు కూడా అదే బాండ్ను కొనసాగిస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. షో నుంచి బయటకు వచ్చాక పార్టీలు చేసుకొని ఆ ఫోటోలను ఫ్యాన్స్తో పంచుకున్నారు. ఇలా బుల్లితెరపై, సోషల్ మీడియాలో సందడి చేసిన ఈ లవ్ కపుల్..వాలెంటైన్స్డే సాక్షిగా జంటగా మారబోతున్నట్లు ప్రకటించారు. అయితే వీరు జంటగా మారబోతున్నది రియల్ లైఫ్లో కాదు.. రీల్ లైఫ్లో. వీరిద్దరు కలిసి ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సీరిస్లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఆదివారం ప్రకటిస్తూ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ వెబ్ సిరీస్కి భాస్కర్ బంతుపల్లి దర్శకత్వం వహిస్తుండగా, ఏ భాస్కరరావు నిర్మిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేస్తూ.. ‘బిగ్ డే.. మీ ఆశీర్వాదం కావాలి' అంటూ అభిమానులను కోరారు. -
కింగ్ నాగార్జునను కలిసిన బిగ్బాస్ రన్నరప్
బిగ్బాస్ షో ముగిసి చాలా రోజులైనా ఆ షోలో పాల్గొన్న వారంతా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘కథ వేరుంటది’ అని బిగ్బాస్ షో-4లో హల్చల్ చేసిన సోహేల్ అక్కినేని నాగార్జునను, చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ షో రన్నరప్గా నిలిచిన అఖిల్ సార్ధక్ కింగ్ నాగార్జునను కలిశాడు. తన తల్లితో కలిసి నాగ్ నివాసానికి అఖిల్ చేరుకున్నాడు. తన తల్లితో కలిసి నాగార్జునతో దిగిన ఫొటోలను అఖిల్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ‘నాగార్జునను మరోసారి కలవడం చాలా ఆనందంగా ఉంది.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను.. బిగ్బాస్ రోజుల్ని ఇంకా మరిచిపోలేకపోతున్నా.. లవ్ యూ సర్ మీ టైమ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్’ అంటూ పోస్ట్ చేశాడు. నాగ్, అఖిల్ గట్టిగా నవ్వుతూ కనిపించారు. హోస్ట్గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున షోలో అఖిల్ సార్థక్తో కొంత చనువుగా ఉన్నారు. అఖిల్పై జోక్స్ వేస్తూ.. అతడి వస్త్రధారణను మెచ్చుకుంటూ ఉన్నారు. ‘బిగ్బాస్’లోకి టిక్టాక్ స్టార్ దుర్గారావు! బిగ్బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ పేరు ఖరారు! View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
ఆమె విషయంలో చిరంజీవి చెప్పిందే నిజమవుతోంది!
వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం "ఉప్పెన". ఈ సినిమా రిలీజవకముందే కృతీకి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ చూసిన కుర్రకారంతా కృతీ నవ్వుల మాయలో పడి తూగుతున్నారు. ఎక్కడ చూసినా ఆమె పేరే జపిస్తున్నారు. అటు సినీ ఉద్ధండులు కూడా ఆమె అందాన్ని, ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలువురు సెలబ్రిటీలు ఆమె చాలా బాగా నటించిందని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా 'దర్శకనిర్మాతలు ఇప్పుడే ఈ అమ్మాయి డేట్లను బుక్ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో దొరక్కపోవచ్చు' అని వేదిక మీదే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరి మాటలను అక్షరాలా నిజం చేస్తూ కృతీ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే నాని, సుధీర్బాబు సినిమాల్లో నటించే ఛాన్స్ రాగా నాగశౌర్య చిత్రంలోనూ ఈమెనే హీరోయిన్గా తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ అక్కినేని హీరోతో జోడీ కట్టే బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఫిల్మీదునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ క్యూటీ అక్కినేని అఖిల్ సరసన కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే యాక్షన్ ఎంటర్టైనర్ కోసం బాడీ పెంచుతూ తెగ కష్టపడుతున్నాడు అఖిల్. కథ డిమాండ్ మేరకు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడట. ఇప్పటికే గుర్రపు స్వారీ వచ్చినప్పటికీ ఇంకా సాన పెట్టేందుకే ఈ తపన, కృషి. ఏదేమైనా యంగ్ హీరో అఖిల్ పక్కన, కొత్త హీరోయిన్ కృతీని ఊహించుకుంటూ గాల్లో తేలిపోతున్నారు అక్కినేని అభిమానులు. చదవండి: చేనేత చీరలంటే చాలా చాలా ఇష్టం: విద్యాబాలన్ Radhe Shyam: జూలై నెలాఖరున రిలీజ్! ఉప్పెన రూ.100 కోట్ల చిత్రం: సుకుమార్ -
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' రిలీజ్ డేట్ ఖరారు
థియేటర్లను పూర్తి సామర్థ్యంతో నడపవచ్చని కేంద్రం ఆదేశాలు ఇచ్చిన తరుణంలో సినీ పరిశ్రమకు ఊరట లభించినట్లైంది. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు వరుస పెట్టి సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తాజాగా అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్" చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించింది. జూన్ 19న థియేటర్లలో సందడి చేస్తున్నట్లు వెల్లడించింది. నిజానికి సంక్రాంతికే సినిమా విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. (చదవండి: నాకు కాబోయేవాడు నా షూతో సమానం) కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జూన్కు వాయిదా వేసుకోక తప్పలేదు. అదే నెలలో మెగా ఫ్యామిలీ నుంచి ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' చిత్రం జూన్ 4న రిలీజ్ అవుతోంది. దీనికి అక్కినేని అఖిల్ సినిమాకు మధ్య 15 రోజులు గ్యాప్ ఉండటంతో వసూళ్లపరంగా పెద్ద ఇబ్బందేమీ ఉండనట్లు కనిపిస్తోంది. అసలే వరుసగా మూడు పరాజయాలు వెంటాడుతున్న అఖిల్ ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందేనని గట్టిగా ఫిక్సయ్యాడు. మరి అతడి సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్లో బన్నీ వాసు, వాసూవర్మ నిర్మిస్తున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజైన టీజర్ అభిమానులను విశేషంగా ఆకర్షించిన విషయం తెలిసిందే.ఇదిలా వుంటే అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు. తర్వాత 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ దర్శకద్వయం రాజ్, డీకేలతో మరో సినిమా చేయనున్నాడు. దీన్ని అశ్విని దత్ నిర్మించనున్నాడు. (చదవండి: మరిది కోసం రంగంలోకి దిగిన సామ్) -
మోనాల్ గిఫ్ట్: హాట్గా ఉన్నానంటున్న అఖిల్!
ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది.. అని అఖిల్, సోహైల్ ఏనాడో అనుకున్నారు. అందుకే వీళ్లిద్దరిలో ఎవరు బిగ్బాస్ టైటిల్ సొంతం చేసుకున్నా మిగిలినవాడికి బైక్, ల్యాప్టాప్ కొనివ్వాల్సిందేనని డీల్ మాట్లాడుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే ప్రేక్షకులు మరొకటి తలిచారన్నట్లుగా వీళ్ల కల నెరవేరలేదు. విజయం వీళ్లను వరించలేదు. అలా అని వీరి కోరిక అసంపూర్తిగా మిగిలిపోలేదు. అఖిల్కు ఓ మహిళా అభిమాని ల్యాప్ట్యాప్ బహుమతిగా ఇచ్చింది. దీంతో అతడి సంతోషం కట్టలు తెంచుకుంది. తన మీద చూపిస్తున్న అభిమానానికి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. అయితే ఈసారి ఏకంగా అతడి మనసుకు మరింత దగ్గరైనవాళ్లు ఓ బహుమతినిచ్చారు. ఎవరి గురించి చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. అవును, మోనాల్ గజ్జర్. (చదవండి: ఇల్లు కొనబోతున్న మోనాల్?!) బిగ్బాస్ హౌస్లో అఖిల్ను అంటిపెట్టుకుని ఉన్న మోనాల్ షో తర్వాత కూడా అతడితో స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ నానా హంగామా చేస్తోంది. ఈ క్రమంలో అఖిల్కు పూల ప్రింట్ ఉన్న ఎరుపు రంగు షర్ట్ను బహుకరించింది. ఇంకేముందీ.. అఖిల్ మరోసారి గాల్లో తేలిపోయాడు. ఆమె ఇచ్చిన షర్ట్ ధరించి మోనాల్కు కృతజ్ఞతలు తెలిపాడు. నాకు తెలుసు, ఈ చొక్కాలో నేను చాలా హాట్గా కనిపిస్తున్నా కదూ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ వీడియో షేర్ చేశాడు. నిజంగానే అఖిల్కు పూలచొక్కా భలే సెట్టయ్యింది, ఎంతైనా మోనాల్ ఇచ్చింది కదా! అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా బిగ్బాస్ రన్నరప్ అఖిల్ ఈ మధ్యే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. అటు మోనాల్ డ్యాన్స్ ప్లస్ షో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్లో ఆమె ప్రత్యేక గీతంలో ఆడిపాడిన విషయం తెలిసిందే! (చదవండి: ఆ రెండింటి విషయంలో కంట్రోల్గా ఉండలేను) -
ఎయిర్ పోర్ట్లో మోనాల్కి షాక్.. తెగ బాధేసిందంటూ..
బిగ్బాస్ నాల్గో సీజన్లో హాట్ టాపిక్గా మారిన ఒకే ఒక్క పేరు మోనాల్ గజ్జర్. తొలుత అభిజిత్తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్తో క్లోజ్గా మూవ్ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్కి హైలెట్గా నిలిచాయి. బిగ్బాస్ నాల్గో సీజన్లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ముఖ్యంగా హౌజ్లో అఖిల్- మోనాల్ల మధ్య రిలేషన్ వీక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్బాస్లో పాల్గొనకముందు ఈ భామ పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. అప్పటి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్బాస్లో పాల్గొనడం ద్వారా వచ్చింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చకా.. ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పటికే ‘అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంతో పాటు ఓంకార్ నిర్వహించే డ్యాన్స్ షోకు జడ్జ్గా చేస్తోంది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఆహ్మదాబాద్కు వెళ్లి వచ్చిన ఈ బ్యూటీకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఊహించని షాక్ తగిలిందట. ఎయిర్పోర్టులో కొందరు తనను చూసి అఖిల్ ఎలా ఉన్నాడు అని గట్టిగా అరిచారట. వాళ్లు అలా అరవడం ఆమెకు కాస్త ఇబ్బందిగా అనిపించిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపారు. తాజాగా ఓ తెలుగు టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోనాల్ మాట్లాడుతూ..‘ బిగ్ బాస్కి ముందు నేను చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ వచ్చి ఐదేళ్లుపైనే అయ్యింది. చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ వల్ల మోనాల్ అంటే అందరికీ తెలిసింది. మొన్న అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ వస్తున్నాను ఎయిర్ పోర్ట్లో మోనాల్ అని గుర్తించారు. నా ఓన్ సిటీలో నన్ను గుర్తుపట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. అయితే వాళ్లు అఖిల్ ఎలా ఉన్నాడని అడుగున్నారు. అలా అఖిల్ పేరు అడగడం మాత్రం నన్ను బాధిస్తోంది. బిగ్ బాస్ చూసిన తరువాత చాలామంది అఖిల్-మోనాల్ టుగెదర్ అని అనుకుంటున్నారు అలా ఏం లేదు. అఖిల్ వాళ్ల ఇంటి దగ్గర ఉంటాడు. నాతో ఎందుకు వస్తాడు. కాబట్టి నన్ను ఇకపై అలా అగడొద్దని అందరినీ కోరుతున్నాను’ అంటూ మోనాల్ తన మనసులోని బాధను వివరించింది. -
బిగ్బాస్: అఖిల్కు ఊహించని బహుమతి
'నువ్వు గెలిస్తే నాకు ల్యాప్టాప్, బైక్ కొనివ్వాలి, నేను గెలిస్తే నీక్కూడా ఆ రెండు కొనిపెడతా' ఇది ఎక్కడో విన్నట్లుంది కదూ.. అవును ఈ మధ్యే విజయవంతంగా పూర్తైన బిగ్బాస్ నాల్గో సీజన్లో అఖిల్, సోహైల్ కుదుర్చుకున్న డీల్ ఇది. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా! వీరి విషయంలో కూడా అంతే... 25 లక్షల రూపాయలకు టెంప్ట్ అయి సోహైల్ ట్రోఫీ రేసు నుంచి తప్పుకుని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ఎలాగైనా టాప్ 2లో ఉండాలన్న కోరికతో అడుగుపెట్టి గ్రాండ్ ఫినాలే వరకు వచ్చిన అఖిల్ రన్నరప్గా నిలిచాడు. ఇద్దరినీ వెనక్కు నెట్టి అభిజిత్ విజేతగా అవతరించాడు. అలా వీరి డీల్ మధ్యలోనే ఆగిపోయింది. ల్యాప్ట్యాప్తో అభిమానం చాటుకుంది ఎవరికీ బైక్, ల్యాప్ట్యాప్ రాకుండా పోయింది అనుకుంటున్న తరుణంలో అఖిల్కు మాత్రం ఓ మంచి ల్యాప్ట్యాప్ వచ్చింది. జయలక్క్క్ష్మి అనే మహిళా అభిమాని విజయవాడ నుంచి వచ్చి మరీ అతడికి ల్యాప్ట్యాప్ను బహుమతిగా ఇచ్చింది. రెప్పకాలంపాటు ఇది నిజమా? కలా? అనుకున్న అఖిల్ కళ్లముందు అభిమాని ల్యాప్ట్యాప్ బ్యాగు పట్టుకుని కూర్చుండటం చూసి నమ్మక తప్పలేదు. తనకు అంత ఖరీదైన బహుమతినిచ్చినందుకు అఖిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఆమెకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీక మాటలు వెతుక్కున్నాడు. ఎలాగైతేనేం ల్యాప్ట్యాప్ కావాలన్న తన స్నేహితుడి కోరిక నెరవేరినందుకు అతడి జిగిరీ దోస్త్ సోహైల్ కంగ్రాట్స్ తెలిపాడు. పలువురు అభిమానులు కూడా అఖిలే నంబర్ 1 అంటూ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!) 'సిటీమార్'లో అఖిల్ కాగా ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ దాదాపు ఏదో ఒక పనిలో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా దివి, సోహైల్, మెహబూబ్, మోనాల్, అభిజిత్కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే అఖిల్కు కూడా ఏదో మంచి అవకాశం వచ్చిందట. కానీ దాన్ని సంక్రాంతికి చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే గోపీచంద్ సిటీమార్ సినిమాలో సెకండాఫ్ కోసం అఖిల్ను తీసుకున్నారన్న టాక్ అయితే నడుస్తోంది. మరి తనకు వచ్చిన అవకాశం అదేనా? ఇంకేదైనా ఉందా? అనే విషయాలను ఆయన అధికారికంగా చెప్పేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: కోటి రూపాయలు ఎగ్గొట్టిన వర్మ) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. పెద్ద సినిమాలో చాన్స్!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి వచ్చిన చాలా మంది.. ఇప్పుడు సెలెబ్రెటీలు అయిపోయారు. వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్బాస్లో పాల్గొన్న వారికి కాస్త ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా యూట్యూబర్లు, చిన్న నటీనటులు పాల్గొనప్పటికీ.. వారికి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ విన్నర్గా గెలిచిన అభిజీత్కి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. మూడో స్థానంలో నిలిచిన సోహైల్కు అయితే.. ఇప్పటికే హీరోగా ఒక సినిమా చాన్స్ కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో నటిస్తానని మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం ఇప్పటికే ప్రకటనలు కూడా ఇచ్చారు. మరోవైపు బిగ్బాస్ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్కు కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలతో పాటు స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఓ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇలా నాల్గో సీజన్లో పాల్గొన్న ఒక్కొక్కరికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సీజన్లో క్రేజీ జంటగా పేరొందిన అరియానా-అవినాష్ జోడీకి కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సీజన్లో పాల్గొని రన్నర్గా నిలిచిన అఖిల్ సార్ధక్ గురించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరో గోపిచంద్ మూవీలో అఖిల్కి అవకాశం వచ్చినట్లు తెలుస్తోందిసంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా ‘సిటీమార్’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో సెకండాఫ్లో ఓ కీలక పాత్ర కోసం అఖిల్ని తీసుకున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. నిజానికి అఖిల్ 2016లోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘బావ మరదలు’ అనే సినిమా ద్వారా తన కెరీర్ను ప్రారంభించారు. అయితే ఆ సినిమా ద్వారా అఖిల్కి ఎలాంటి గుర్తింపు రాలేదు. దీంతో అఖిల్ బుల్లితెర వైపు అడుగులు వేశాడు. పలు సీరియళ్లలో కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే బిగ్బాస్ నాల్గో సీజన్లోకి వెళ్లి రన్నర్గా నిలిచాడు. ఇప్పుడు అఖిల్కి పలు సినిమా ఆఫర్లు వస్తున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, తన సినిమా అవకాశాల గురించి అఖిల్ అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!
సాక్షి, హైదరాబాద్: అత్యంత ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ఫినాలేలో అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ సీజన్-4 టైటిల్ను అభిజీత్ ఎగరేసుకుపోయాడు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్ సందర్భంగా అభిజీత్ను మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా ప్రకటించారు. మొదటి నుండి నామినేషన్స్ లోకి వచ్చిన అభిజిత్ ప్రతీవారం సేఫ్ గేమ్ ఆడుతూ చివరికి టైటిల్ సాధించాడు. కానీ టైటిల్పై ఎన్నో ఆశలు పెట్టుకుని తుదికంటూ పోరాడిన అఖిల్ సార్థక్ మాత్రం రన్నరప్గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్తో సందడి చేస్తున్నారు. అంతేకాదు రన్నరప్ అఖిల్కు నగదు బహుమతి ఏమీ ఇవ్వకపోవచ్చని కూడా సోషల్ మీడియా కోడై కూస్తోంది. టాప్ 2 వరకు వెళ్లిన అఖల్ చివరికి భంగపాటు తప్పలేదంటూ సోషల్మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అభిజిత్తో గొడవ, మోనాల్తో లవ్ ట్రాక్ తనను గెలిపిస్తాయని ఆశపడిన అఖిల్ ట్రోఫీ దక్కించు కోలేకపోయాడు. అంతేకాదు గ్రాండ్ ఫినాలే వేదికగా టాప్-5 లో నిలిచిన సోహైల్, మెహబూబ్లపై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి మాటలకు అందరూ ఫిదా అయ్యారు. వారిద్దరి గురించి చిరు ఎక్కువగా హైలెట్ చేయడం, అఖిల్ గురించి చాలా తక్కువ మాట్లాడడం కూడా అఖిల్కు దెబ్బేనని పేర్కొంటున్నారు. వాళ్లనలా పొగుడుతూంటూ.. అఖిల్ మాత్రం బేలగా నిలబడిపోయాడని అలాగే దివి, హారికలతో చిరు రొమాంటిక్ సంభాషణ, మెహబూబ్కి 10 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం లాంటివి అంశాలు అఖిల్కి బాధాకర విషయాలని ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపై మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క రేసు నుంచి తప్పుకుని, తనకు వచ్చిన 25 లక్షల రూపాయల్లో అనాథాశ్రమానికి రూ. 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నానని ఆ గోల్డ్ బాక్స్ తీసుకొని బయటకు వచ్చేశాడు సొహేల్. ఇది నెటిజనుల ప్రశంసలను దక్కించుకుంది. దీనికి తోడు తనకొచ్చిన ప్రైజ్మనీలో 10 లక్షలు దానం చేస్తానని సోహైల్ ప్రకటించడం బిగ్బాస్ హోస్ట్ నాగార్జున మురిసిపోయి, ఆ పది లక్షలూ తానే ఇస్తాననడం మరింత హైలెట్గా నిలిచింది. అయితే హౌస్లో తన ఆట పాటలతో అలరించిన అఖిల్ మోనాల్ గజ్జర్తో ప్రేమాయణంద్వారా మొదట్లో బాగా చర్చల్లో నిలిచాడు. ఆ తరువాత ఆమెను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతూ అఖిల్ చివరికి బకరాగా మిగిలిపోయాడు. మోనాల్ చుట్టూనే తిరుగుతూ హగ్స్ ఇస్తూ.. ముద్దులు పెట్టుకుంటూ బిగ్ బాస్ గేమ్ను బాగానే రక్తికట్టించినా, విన్నర్ మాత్రం అభిజిత్ అయ్యాడు. అయితే ఎలాంటి ఫేమ్ లేని అఖిల్ బిగ్ బాస్ టాప్ 2 వరకు రావడం విశేషమే. మరి అఖిల్ కెరీర్కు ఇదిఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిందే. కాగా మొదట్లో అఖిల్-మోనాల్-అభిజిత్ మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ఆ తర్వాత మోనాల్ డబుల్ గేమ్ తెలిసి మోనాల్ ని అభిజిత్ దూరం పెట్టాడు. అయితే మోనాల్ ది డబుల్ గేమ్ తెలిసినా ఆమెతో కనెక్షన్, ఎమోషన్ పెంచుకోవడమే కాదు శృతి మించి ప్రవర్తించాడు. ఈ సందర్భంగా ఇది ఆయన అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో మోనాల్ విషయంలో అఖిల్ పెద్ద బకరాగా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే ఓ బకరాగా బయటికి రాకతప్పదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరికి వారి జోస్యం నిజం కావడంతో అయ్యో అఖిల్ అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. An entertaining finale to most talked about season. While #Abhijeet won well deserved title, #Sohel with street smart moves and character won all hearts, #Akhil continued making mess of his chances and abilities.. Disappointed to miss #Ariyana in final 2. #BiggBossTelugu4 pic.twitter.com/GHXHRefxlv — Sampath Murki (@anytime_sampath) December 21, 2020 -
ఈసారైనా దక్కుతుందా.. బిగ్బాస్ ఎవరు?
పోటీలో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. నాలుగో సీజన్ ఇది. మూడు సీజన్లనూ అబ్బాయిలే తన్నుకుపోయారు. ఈసారైనా అమ్మాయి విజేతగా నిలుస్తుందా? అరియానా, హారికలకు చాన్స్ ఉందా? 100 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన షో ఈరోజు ముగుస్తోంది. భావోద్వేగాల కేంద్రంగా సాగే ఈ షోలో అన్ని రకాల వొత్తిళ్లను అమ్మాయిలు దాటగలిగారు. టైటిల్ చేజిక్కించుకోగలరో లేదో చూద్దాం. ఒక అంచనా. సల్మాన్ ఖాన్ హోస్ట్గా నిర్వహించే హిందీ బిగ్బాస్లో ఇప్పుడు 14వ సీజన్ నడుస్తోంది. పూర్తయిన 13 సీజన్లలో ఐదు మంది మహిళా విజేతలు ఉన్నారు. పురుషులకే ఎక్కువగా ఓటింగ్ జరిగే క్రేజ్ ఉన్నచోట ఒకరకంగా పెద్ద నంబర్. హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో మహిళలే ఉత్తమ మానవ ప్రవర్తనను ప్రదర్శించారని దీనిని బట్టి రుజువైంది. ఎందుకంటే బిగ్బాస్ షో వ్యక్తుల బలాబలాలు, శక్తి సామర్థ్యాలను కాక మానవ ప్రవర్తనలను ప్రేక్షకుల ముందు పెట్టి ఎవర్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం అని చెబుతుంది. మానవ ప్రవర్తనను బయటకు తేవడానికి బిగ్బాస్ హౌస్లో రకరకాల సందర్భాలను సృష్టిస్తారు. ఎత్తుకు ఎదగడానికి, పతనం కావడానికి కూడా సమాన అవకాశం ఉంటుంది. అలాంటి షోలో ఐదు మంది స్త్రీలు గెలిచి తాము మెరుగైన మానవులం అని చెప్పారు. కాని తెలుగులో కూడా అంతటి ప్రతిభావంతంగా రాణించినా పురుషులకు దీటుగా నిలిచినా స్త్రీలకు గత మూడు సీజన్లలో టైటిల్ దక్కలేదు. ఈసారైనా దక్కుతుందా... తెలియదు. మిస్సయిన శ్రీముఖి, గీతా మాధురి తెలుగు బిగ్బాస్ 1,2,3 సీజన్లలో మహిళా కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇచ్చారు. సీజన్ 1లో నటి హరితేజ , నటి అర్చన చివరివరకూ నిలిచారు. సీజన్ 2లో గాయని గీతామాధురి రన్నర్ అప్గా నిలిచారు. నటుడు కౌశల్ ఆ సీజన్కు విన్నర్ అయినా గీతా మాధురి గెలుస్తుందని చాలామంది భావించారు. సీజన్ 3 లో శ్రీముఖి రన్నరప్గా నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నారు. విజేత ఓటింగ్ ద్వారా నిర్ణయం అవుతారని నిర్వాహకులు చెబుతారు. కాని ఓటింగ్ సరళి పురుషుల ఫేవర్లో వెళుతోంది. స్త్రీలను విజేతలకు నిలబెట్టడానికి బయట సరైన బృందాలు పని చేయడం లేదనే భావన కూడా ఉంది. ఈసారి అరియానా, హారిక బిగ్బాస్ 4 సీజన్ కరోనాకు వెరవక అట్టహాసంగా సెప్టెంబర్ 6న మొదలైంది. మొత్తం 105 రోజుల ఈ షోలో చివరి రోజు ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వారిలో 10 మంది స్త్రీలు ఉన్నారు. సీజన్కు అట్రాక్షన్గా నిలుస్తుంది అనుకున్న గంగవ్వ ఆరోగ్య కారణాల రీత్యా నిష్క్రమించాల్సి వచ్చింది. ఫైనల్ వరకూ వెళుతుందనుకున్న లాస్య 77వ రోజున నిష్క్రమిస్తే గట్టి పోటీ ఇస్తూ వచ్చిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ చివరి వారంలో ఎవిక్ట్ అయ్యింది. చివరి ఐదుమంది పోటీదారుల్లో టెలివిజన్ యాంకర్ అరియానా, యూ ట్యూబ్ స్టార్ హారికా మిగిలారు. అమ్మాయిలు గెలుస్తారా? ఓటింగ్ సరళిని, హౌస్లో అరియానా, హారికల గేమ్ తీరును, ప్రవర్తనను గమనించిన పరిశీలకులు చాలామంది ఈసారి బిగ్బాస్ టైటిల్ గెలిచేంత గట్టిగా వీరిరువురు లేరనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరియానా ప్రవర్తన నిక్కచ్చిగా ఉండటం ఆమెకు మైనస్ అయ్యింది. ఒక దశలో హౌస్మేట్స్ అందరూ ఆమెను ఎలిమినేట్ చేయాలనే వరకూ వెళ్లారు. ఇక హారికా పట్ల అభ్యంతరాలు లేకున్నా ఆమె గట్టిగా ఒక అభిప్రాయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక యాటిట్యూడ్ని చూపలేకపోయింది. మరోవైపు పురుష కంటెస్టెంట్లు అభిజిత్, సొహైల్, అఖిల్ తమ సొంత తీరుతో ఓట్లను నిలబెట్టుకున్నారు. 50 లక్షలు ప్రైజ్ బిగ్బాస్ 4 విజేతకు 50 లక్షల ప్రైజ్మనీ దక్కుతుంది. ఇప్పుడు పోటీలో నిలుచున్న ఐదుగురూ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అభ్యర్థులే. ఈ మొత్తం చాలా పెద్దది తమ దృష్టిలో అని వారే చెప్పుకున్నారు. అందరికీ సొంతింటి కలే లక్ష్యంగా ఉంది. ఈ 50 లక్షల కోసం బిగ్బాస్లో గత 100 రోజులుగా అభ్యర్థులు అనేక అగ్నిపరీక్షలకు లోనయ్యారు. హారికా, అరియానాలు కూడా ఎన్నోసార్లు గట్టి దెబ్బలు తిన్నా తట్టుకుని నిలుచున్నారు. హారికాకు సొహైల్కు మధ్య పెద్ద పెద్ద యుద్ధాలే గెలిచాయి. అరియానా సొహైల్కు మధ్య కూడా యుద్ధాలే జరిగాయి. హారికా అభిజిత్ ఒక జట్టు కడితే సొహైల్– అఖిల్ ఒక జట్టుగా మారి అరియానాను ఒంటరిని చేశారు. అయితే బయట ప్రేక్షకులలో అరియానా మద్దతుదారులు గట్టిగానే ఉన్నారు. ఎవిక్ట్ అయ్యి వెళ్లే ముందు మోనల్ గజ్జర్ విజేత అయ్యే ఏ లక్షణమూ అరియానాలో లేదు అని చెప్పి వెళ్లింది. కాని ప్రేక్షకుల తీర్పు ఈసారి అమ్మాయిల వైపు మొగ్గితే ఇద్దరిలో ఒకరు గెలిచి మహిళా విజేతల ఖాతా తెరుస్తారు. నేడే ఫైనల్స్ నేడు మా టీవీలో ప్రసారమయ్యే ఫైనల్స్లో విజేత ప్రకటన వెలువడుతుంది. చీఫ్గెస్ట్గా చిరంజీవి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్లో వెంకటేశ్ హాజరయ్యారు. అంతకు ముందు సీజన్ చిరంజీవి వచ్చారు. మళ్లీ ఆయనే రావచ్చు అంటున్నారు. ఏమైనా లాక్డౌన్ కాలంలో మొదలైన ఈ షో పెద్ద ఆటంకాలు లేకుండా చివరి అంకానికి చేరడం వెనుక టీమ్ కష్టం ఎంతో ఉంటుంది. వారికి మెచ్చుకోళ్లు చెప్పక తప్పదు. విజేత ప్రకటన కోసం ఎదురు చూద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
‘బిగ్బాస్’లో గంగవ్వ.. అఖిలూ, ఓ అఖిలూ అంటూ..
మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ నాల్గో సీజన్ ముగిసిపోతుంది. అందుకే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇది గుర్తుండి పోయేలా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. గత రెండు ఎపిసోడ్లలో కంటెస్టెంట్ల ప్రయాణాన్ని వారి కళ్లముందుంచిన బిగ్బాస్..నేడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకొచ్చి పాత జ్ఞాపకాలను గుర్తుచేశాడు. అందరితోనూ సరదాగా డాన్సులు చేయించాడు. చిలిపి ప్రశ్నలు అడిగించి ఇంటి కంటెస్టెంట్స్తో ఆడుకునేలా చేసాడు. మోనాల్, కరాటే కల్యాణి, లాస్య, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ ఇలా ఇలా చాలా మంది ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ మళ్లీ ఇంటికి వచ్చారు. ఇక హౌస్లో వారు చేసిన రచ్చ ఏంటో చదివేయండి బయట కథ వేరే ఉంటది : మోనాల్ ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా హౌస్లోకి ఎలిమినేట్ అయిన సభ్యులను తీసుకువచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటిస్తూ.. ఎంట్రీ ఇచ్చిన వారు కంటెస్టెంట్స్ని డైరెక్ట్గా కలవనీయకుండా వారిని ఒక అద్దాల గదిలో ఉంచారు. అద్దాల గదికి ఒక్క పక్క టాప్ 5 కంటెస్టెంట్స్.. మరో పక్క ఎలిమినేట్ అయిన సభ్యులు ఉన్నారు. మొదటగా లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన మోనాల్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా మ్యూజిక్ వినిపించగానే అఖిల్, సోహెల్ పరుగులు పెట్టి వచ్చారు. వారికి మోనాల్ కనిపించడంతో ఆనందంతో చిందులేశారు. అఖిల్ అయితే అడ్డుగా అద్దాలు ఉన్న సంగతి మర్చిపోయి మోనాల్కి హగ్లు, కిస్లు ఇచ్చాడు. ‘మూడు రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు అఖిల్.. ప్రతి రోజు 3-4 అవుతుంది’అని అఖిల్తో తన బాధను చెప్పుకోగా..‘ నువ్వు వెళ్లాక నాక్కూడా నిద్ర పట్టలేదు.. అసలు పడుకోలేదు’ అని మోనాల్తో చెప్పాడు. అభిజిత్ కూడా మోనాల్ని చూసి సూపర్ ఉన్నావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. బయట ఎలా ఉందని సోహైల్ అడగ్గా.. ఏ విషయం చెప్పకుండా అంతా సూపర్ అని సరిపెట్టేసింది. జనాలు నీ కోసం బయటకు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంటూ సోహైల్కు మోనాల్ చెప్పడంతో ఆనందంతో గంతులు వేశాడు. ఆ తర్వాత అఖిల్ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుతూ గాల్లోకి బెలూన్లను ఎగురవేసింది. బెలూన్లు గాల్లోకి ఎగరగానే అఖిలే నంబర్ వన్ అని మోనాల్ గట్టిగా అరిచింది. ఆ తర్వాత అభిజిత్ ప్యూచర్ బాగుండాలంటూ, అరియానాతో ఫ్రెండ్ షిప్ పెరగాలని, సోహైల్ బిగ్బాస్ విజేత కావాలంటూ బెలూన్లను పైకి ఎగురవేసింది. బయటకు వచ్చాక అందరం కలిసి పార్టీ చేసుకుందాం అని సోహైల్ అనగా.. బయట కథ వేరే ఉందని, కలిసేందుకు టైమ్ కూడా దొరక్కట్లేదని మోనాల్ చెప్పుకొచ్చింది. చివరగా అఖిల్కి హగ్ ఇచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. బిగ్బాస్లోకి ఇద్దరు వంటలక్కలు ఆ తర్వాత హరికథ చెబుతూ.. కల్యాణి ఎంట్రీ ఇచ్చింది. ఇంటి సభ్యులందరిని చూసి కంటతడి పెట్టింది. మీ అందరిని ఎంత మిస్ అయ్యానో.. మీరంతా బయటకు వచ్చగా చక్కటి వంటలు చేసి పెడతా అంటూ ఎమోషనల్ అయింది. మీరు ఇంటి నుంచి వెళ్లాక.. స్వీట్ చేయడమే లేదని అభిజిత్ అనగా.. బయటకు రాగానే అన్ని వంటలు చేసి పెడతా అని కల్యాణి చెప్పింది. కల్యాణి ఇలా మాట్లాడుతుండగానే లాస్య ఎంట్రీ ఇచ్చింది. లాస్యను చూసి ఇంటి సభ్యులంతా ఆనందంతో గట్టిగా అరిచేశారు. జున్ను ఎలా ఉన్నాడు? బయట ఏంటి పరిస్థితి?లాంటి ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. సోహైల్ అయితే ఇంట్లోకి ఇద్దరు వంటలక్కలు వచ్చారని పంచ్ వేశాడు. ఇక తనపై వంటలక్క 2.o అని మీమ్స్ వేస్తున్నారంటూ లాస్య తన బాధను పంచుకుంది. ఇక అభిజిత్ను చూస్తూ.. పాపం అభి.. తనతో టైమ్ స్పెండ్ చేయమని హారికను అడుక్కుంటున్నాడు అని అనగా.. లాస్యక్క నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావా అని హారిక అలిగింది. అభి ఏమో.. ఎంత రిక్వెస్ట్ చేసినా తనతో స్పెండ్ చేస్తలేదని లాస్యకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా లాస్య ఎక్కువ సమయం తన క్లోజ్ ఫ్రెండ్స్ హారిక, అభిజిత్లతోనే గడిపింది. అందరి కంటే అఖిల్కే ఎక్కువ హగ్స్! ఇక లాస్య, కల్యాణి కలిసి ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్ ఆడించారు. తాము ఒక్కొక్కరిని కొన్ని ప్రశ్నలు అడుతామని.. వరుసగా ముగ్గురు అవును(ఎస్) అని చెబితే.. ఆ కంటెస్టెంట్ ఐస్ వాటర్ ఒంటిపై పోసుకోవాలని కండీషన్ పెట్టారు. మొదటగా అఖిల్పై ప్రశ్నలు అడుగుతూ.. అఖిల్కు ఎక్కువ హగ్స్ లభించాయని భావిస్తున్నారా?, అఖిల్ అరియానాను కంటే హారికను ఎక్కువగా ఫ్లర్టింగ్ చేస్త్నున్నాడా?, అఖిల్ అభిజిత్ కంటే మంచి సింగర్ అవునా కాదా? అని అడగ్గా.. ఇంటి సభ్యులంతా ముక్తకంఠంతో అవునని సమాధానం ఇచ్చారు. అఖిల్కు 2021లో పెళ్లి అవుతుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మాత్రం అంతా నో అని చెప్పారు. అరియానాకి అవినాష్ కంటే చింటే ఎక్కువ ఇష్టం ఇక అరియానాపై ప్రశ్నలు అడుగుతూ.. అరియానా ఇంట్లో తాను తెలివైనది అని భావిస్తోంది?, అరియానాకి అవినాష్ కంటే చింటు ఎక్కువ ఇష్టం?, అరియానా గొతు జలజ గొంతు కంటే భయంకరంగా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు అంతా ఎస్ అని సమాధానం ఇచ్చారు. దీంతో అరియానా మూడుసార్లు ఐస్ నీళ్లు ఒంటిపై పోసుకుంది. ఇక సోహైల్ గురించి అడుతూ.. రాత్రి 9 గంటల తర్వాత సోహైల్ ఏ పని చేయడు. ఆయన మంచి బోల్డ్ డాన్సర్ అవుతాడు. సోహైల్ టూత్పేస్ట్ను ఫేస్ క్రీమ్గా వాడుతాడా లాంటి చిలిపి ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికి ఇంటి సభ్యులు అవుననే సమాధానం ఇచ్చారు.ఇక అభిజిత్ గురించి అడుతూ.. అభి వాళ్ల అమ్మ ఆయన కంటే ఫన్నీగా ఉంటారా? అభి ధరించే మోనాలి జాకెట్ ఆయన కంటే ఫేమస్ అని భావిస్తున్నారా? అని అడగ్గా.. అంతా ఎస్ అని సమాధానం ఇచ్చారు. ఈ గేమ్ అనంతరం లాస్య, కళ్యాణి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అఖిల్పై పగ తీర్చుకున్న కుమార్ సాయి ఆ తర్వాత కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ జంటగా ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో ఆడిపాడారు. ఇక కుమార్ సాయి అయితే తన పాత పగను అంతా తీర్చుకున్నాడు. అమ్మాయి అంటే హారికలా ఉండాలంటూనే ఆమెపై పంచ్లు వేశాడు. ‘అభిజిత్ను నామినేట్ చేస్తుంది మళ్లీ బాధపడుతోంది. నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా? టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేస్తుంది’అంటూ హారికను ఏడిపించాడు. ఆ తర్వాత అఖిల్ అంటే తనకు ఇష్టమని చెబుతూనే ‘నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర. ఇద్దరికి కరివేపాకు అంటే నచ్చదు’ అని మరోసారి కరిపేపాకు గొడవను గుర్తు చేశాడు. తర్వాత సొహైల్తో జరిగిన గొడవలో వేలు సెంటీ మీటర్ దిగింది.. సరిపోతుందా? అంటూ మళ్లీ పంచ్ వేశాడు. అనంతరం ఇంటి సభ్యులతో కలిసి డాన్స్ వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అఖిలు.. ఓ అఖిలు.. అంటూ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వ వాయిస్ విని ఇంటి సభ్యులంతా గార్డెన్ ఏరియాలోకి పరుగులు తీశారు. మరి బిగ్బాస్ హౌస్లో గంగవ్వ చేసిన సందడి ఏంటో రేపటి ఎపిసోడ్లో చదివేద్దాం. -
బిగ్బాస్ : అఖిల్పై పగ తీర్చుకున్న కుమార్ సాయి
బిగ్ బాస్ నాల్గో సీజన్లోకి మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కుమార్ సాయి అనూహ్యంగా ఆరోవారంలో ఎలిమినేట్ అయ్యాడు. మోనాల్ కోసమే కుమార్ సాయిని బలి చేశారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఒక ఎలిమినేట్ అయినప్పటికీ కుమార్ సాయికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాల్గో సీజన్ మొత్తంలో ‘మంచోడు’ అని పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కుమార్ అనే చెప్పాలి. బిగ్బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు ఒంటరిగానే ఆతను గేమ్ ఆడాడు. ఇంటి సభ్యులంతా అతన్ని వేరుగా చూసినా.. ఆయన మాత్రం ఎవరిపైనా కోపం కానీ ద్వేషం కానీ ప్రదర్శించలేదు. ఎలిమినేట్ అయిన రోజు కూడా ఈ ‘మంచోడు’ని హౌస్మేట్స్ సరిగా సాగపంపలేదు. ముఖ్యంగా ‘కరివేపాకు’ గొడవను ఇప్పటికీ మర్చిపోలేదు. లిమినేషన్ ఎపిసోడ్లో.. నాగార్జున వెజిటబుల్స్ ఇచ్చి ఇది ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని అడగడంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కర్నీ ఒక్కో విజిటబుల్తో చక్కని పోలిక ఇచ్చాడు. అందులో భాగంగా అఖిల్ని కరివేపాకుతో పోల్చుతూ.. పాజిటివ్గా మాట్లాడాడు. కానీ దీన్ని నెగిటివ్గా తీసుకున్న అఖిల్.. ‘మీరు గెలిచి కూడా బయట ఉన్నారు.. మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో’ అంటూ తన యాటిట్యూట్ చూపించాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి.. ఇంత దారుణంగా హేళన చేస్తారా? అని అప్పట్లో అఖిల్ని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే...అఖిల్పై ఉన్న పగను కుమార్ సాయి తీర్చుకున్నాడు. రీ యూనియన్లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి హౌస్కి వస్తుండగా.. కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చి నవ్వుతూనే అఖిల్, హారికపై ఉన్న పగను తీర్చుకున్నాడు. సిల్లీ రీజన్స్తో తనను నామినేట్ చేసిన హారికను..‘నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా? టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్పావ్’అని తన మనసులో ఉన్న పగను తీర్చుకున్నాడు. ఆ తర్వాత సొహైల్తో జరిగిన గొడవలో వేలు సింటీ మీటర్ దిగింది.. సరిపోతుందా? అంటూ మళ్లీ పంచ్ వేశాడు. ఇక అఖిల్ని‘నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర’ అంటూ పులిహోరా రాజాకి గట్టిగానే ఇచ్చేశాడు. అయితే ఇవన్ని ఇంటి సభ్యులు సరదాగానే తీసుకున్నట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇంకా కుమార్ సాయి ఎవరెవరిపై పంచ్లో వేశాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్బాస్: మోనాల్.. అఖిల్కి ముద్దులే ముద్దులు
బిగ్బాస్ తెలుగు నాల్గో సీజన్ మరో రెండు మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో ఉన్న రెండు రోజుల్ని మరింత ఎంటర్టైన్గా మార్చేందుకు సిద్దమయ్యారు బిగ్బాస్ నిర్వాహకులు. ఇందులో భాగంగా ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా హౌస్లోకి ఎలిమినేట్ అయిన సభ్యులను తీసుకువచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటిస్తూ.. ఎంట్రీ ఇచ్చిన వారు కంటెస్టెంట్స్ని డైరెక్ట్గా కలవనీయకుండా వారిని ఒక అద్దాల గదిలో ఉంచారు. అద్దాల గదికి ఒక్క పక్క టాప్ 5 కంటెస్టెంట్స్.. మరో పక్క ఎలిమినేట్ అయిన సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా మ్యూజిక్ వినిపించగానే అఖిల్, సోహెల్ పరుగులు పెట్టి వచ్చారు. వారికి మోనాల్ కనిపించడంతో ఆనందంతో చిందులేశారు. అఖిల్ అయితే అడ్డుగా అద్దాలు ఉన్న సంగతి మర్చిపోయి మోనాల్కి హగ్లు, కిస్లు ఇచ్చాడు. ఇక మోనాల్ అయితే అఖిల్ని డైరెక్ట్గా కలవలేకపోవడంతో కాస్త బాధపడింది. కలవాలని ఉన్నా..అద్దం ఓన్లీ ప్రాబ్లెంగా ఉంది అంటూ తెగ ఫీలలైపోయింది. చైర్ వేసుకొని అద్దాల గోడ దూకి రా అని సోహైల్ సలహా ఇవ్వగా.. నో..నో అంటూ మోనాల్ అక్కడే నిలబడింది. అయితే ఈ సారి ఈ నర్మద కంటతడి పెట్టకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని పసిగట్టిన సోహైల్..బిగ్బాస్ ఇంటిలో 9వ వండర్ ఏమిటో తెలుసా? నువ్వు ఏడవకపోవడమే అంటూ పంచ్ వేశాడు. ఆతర్వాత కరాటే కల్యాణి ఇంటిలోకి హుషారుగా ప్రవేశించింది. అనంతరం లాస్య ఇంట్లోకి మళ్లీ అడుగుపెట్టింది. దాంతో వంటలక్కలిద్దరూ వచ్చారు అంటూ సోహెల్ గట్టిగా అరిచాడు. జనాలు నీ కోసం బయటకు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంటూ సోహైల్కు మోనాల్ చెప్పడంతో ఆనందంతో గంతులు వేశాడు. ఇక లాస్య ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్ ఆడించింది. అఖిల్కు ఎక్కువ హగ్స్ లభించాయని భావిస్తున్నారా అని ఇంటి సభ్యులను అడగ్గా..ఎక్కువ మంది అవును అంటూ చెప్పడంతో అఖిల్ నో నో అంటూ ఎగిరి గంతులు వేశాడు. అరియానా గొంతు జలజ(దెయ్యం) కంటే భయంకరంగా ఉందా అంటే అందరు అవునని సమాధానమిచ్చారు. అలాగే అభిజిత్ ఇంటిలోనే డ్యాన్స్ నేర్చుకొన్నాడని భావిస్తున్నారా అని అడగ్గా.. అవును అందరూ అన్నారు. దాంతో అభిజిత్కు అంతకు ముందు డ్యాన్స్ రాదని మీ ఉద్దేశమా అని లాస్య ప్రశ్నించగా.. అందులో డౌటా? బాండ్ పేపర్ మీద రాసిస్తా అంటూ అఖిల్ అన్నాడు. గంగవ్వ, కుమార్ సాయి, నోయల్, జోర్దార్ సుజాత, దివి, మెహబూబ్, అవినాష్లు ఈ ప్రోమోలో కనిపించారు. -
తప్పకుండా విన్నర్ అవుతా: అఖిల్ కాన్ఫిడెన్స్
ప్రేమ పాఠాలు, గుణ పాఠాలు, కథలు, వ్యథలు, పోరాటాలు, ఆరాటాలు, బాధలు, బంధాలు, కలయికలు, విడిపోవడాలు, ఆటపాటలు, అడ్డంకులు.. ఇలా అన్నీ కలగలిపితేనే అది బిగ్బాస్ రియాలిటీ షో. తెలుగులో ప్రస్తుతం నడుస్తున్న నాల్గవ సీజన్కు నాలుగు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ సందర్భంగా బిగ్బాస్ టాప్ 5 కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పిలుస్తూ వారి వంద రోజుల ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. నేడు అఖిల్, అభిజిత్ వారి ప్రయాణాన్ని తరిచి చూసుకుని ఆనందంతో గాల్లో తేలుతున్నారు. మరి ఈ జర్నీ గురించి వాళ్లేమన్నారో తెలియాలంటే ఇది చదివేయండి.. ప్రేక్షకుల ప్రేమ చాలు.. బిగ్బాస్ హౌస్లో ఇప్పటివరకు ఆడించిన టాస్కులకు సంబంధించి అన్ని వస్తువులను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. ముందుగా అఖిల్ను పిలిచి అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. ఇందులో మోనాల్తో ఆటపాటలు, అభితో గొడవలు, సోహైల్ త్యాగాలు అన్నీ చూపించడంతో అఖిల్ కంటతడి పెట్టుకున్నాడు. తను ఎఫర్ట్స్ పెట్టి ఆడానని అఖిల్ మరోసారి స్పష్టం చేశాడు. గెలుపోటములు తన చేతిలో లేవని, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ మానుకోలేదని చెప్పాడు. తోడు కోసం పరితపించాను కానీ ప్రేక్షకుల ఓట్ల రూపంలో అంత ప్రేమ వచ్చినప్పుడు ఇంకా ప్రేమ కావాలనుకోవడం ఫూలిష్నెస్ అనిపిస్తోందన్నాడు. తనకీ ప్రేక్షకుల ప్రేమ చాలు అంటూ మోకాళ్లపై మోకరిల్లి ఓట్లేసిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. బిగ్బాస్ వల్ల తనేంటో తనకు తెలిసిందని, తప్పకుండా విన్నర్ అవుతానన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అనంతరం బాల్కనీలో ఉన్న తన ఫొటోను తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. (అభి ఫ్యాన్స్ఫై పోలీసులకు మోనాల్ ఫిర్యాదు) ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించావు అనంతరం అభిజిత్ గార్డెన్ ఏరియాలోకి వెళ్లి తనకు పేరు తెచ్చిన రోబో టాస్క్లోని వస్తువులను తనివితీరా చూసుకున్నాడు. బిగ్బాస్ అతడికి "మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్" బిరుదునిచ్చాడు. నీ కంటే ఎక్కువగా వేరేవాళ్లకోసం ఆలోచించావని అభిని మెచ్చుకున్నాడు. ఇలాంటి పరిపక్వత చెందిన తెలివైన కంటెస్టెంటు హౌస్లో ఉన్నందుకు గర్వపడుతున్నానని బిగ్బాస్ చెప్పాడు. దీంతో అభి చేతులెత్తి నమస్కరిస్తూ.. నేను బిగ్బాస్కు రావడం అనేది నా జీవితంలోనే సరైన నిర్ణయం అని భావిస్తున్నాను అని తెలిపాడు. అనంతరం అతడికి జర్నీ వీడియో చూపించగా దాన్ని చూసి అభి మైమరిచిపోయాడు. (ఓటింగ్లో అభిజిత్ను దాటేసిన అరియానా!) నేనంటే నీకిష్టం లేదా? ఆ వీడియోలో అభి మోనాల్తో పెట్టిన కబుర్లనే ఎక్కువగా చూపించారు. అందులో 'నీకు నేనంటే ఇష్టం లేదా?' అని అభి మోనాల్ను ప్రశ్నించాడు. అప్పుడు దానికి మోనాల్ సమాధానం చెప్పకపోయినా తర్వాత మాత్రం 'ఐ లైక్ యూ' అని చెప్పింది. కానీ తర్వాత మారిన పరిస్థితుల వల్ల ఆమెతో దూరం కావడం, అఖిల్తో గొడవలు, నామినేషన్లు అన్నింటినీ చూపించారు. హారిక అతడికి తోడుగా నిలిచిన సందర్భాలను సైతం గుర్తు చేశారు. ఇవన్నీ చూసి చలించిపోయిన అభి ఎంతో సంతోషించాడు. తర్వాత తన ఫొటోను తీసుకుని లోపలకు వెళ్లాడు. రేపటి ఎపిసోడ్లో మిగతా ముగ్గురి జర్నీలు చూపించనున్నారు. (ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) -
బిగ్బాస్ రూల్స్ బ్రేక్ చేయండి: శ్రీముఖి సలహా
తెలుగు బిగ్బాస్ హిందీ బిగ్బాస్ను ఫాలో అయినట్లు కనిపించింది. మాజీ కంటెస్టెంట్లను తీసుకువచ్చి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు. మొదటి సీజన్ ఫైనలిస్ట్ హరితేజ, రెండో సీజన్ రన్నరప్ గీతా మాధురి, మూడో సీజన్ రన్నరప్ శ్రీముఖితో పాటు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజాలకు రెట్టించిన ఉత్సాహంతో షోను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. కానీ కోవిడ్ వల్ల నేరుగా హౌస్లోకి వెళ్లకుండా ప్రత్యేక గదిలో నుంచే ఫైనలిస్టులతో సంభాషించారు. మరి 101వ ఎపిసోడ్లో ఈ మాజీ ఫైనలిస్టులు ఇప్పుడున్న కంటెస్టెంట్లను ఏమేం ప్రశ్నలడిగారు? వారిని ఎలా ఆడుకున్నారనేది తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా? గత సీజన్ల ఫైనలిస్టులు హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజా ఇంటిసభ్యులను సర్ప్రైజ్ చేశారు. అప్పట్లో తాము దంచుతూ కష్టాలు పడుతుంటే మీరేమో మిక్సీలు వాడుతున్నారా? అని ఈ సీజన్ కంటెస్టెంట్ల మీద అక్కసు వెళ్లగక్కారు. తమ టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా? అని అడుగుతున్నారని, బయట ఇలాంటి టాస్కులు ఉంటాయనుకోలేదని శ్రీముఖి వాపోయింది. తర్వాత ప్రేక్షకుల తరపున ప్రశ్నలు అడుగుతూ వారికి సరదాను పంచేందుకు సిద్ధమయ్యారు. ఇంకొన్ని రోజులైతే ఆరిపోయేట్టు ఉన్నావు, కాస్త తినమని శ్రీముఖి అరియానాకు సలహా ఇచ్చింది. (చదవండి: ఏడవకుండా నవ్వుతూ మోనాల్ వీడ్కోలు) మోనాల్ లేకపోవడంతో ఊపిరాడలేదు నీకు ఎలాంటి అమ్మాయి కావాలన్న ప్రశ్నకు సోహైల్ తన కోపాన్ని కూల్ చేయగలగాలి అని చెప్పాడు. ఇది జరగని పని అని హరితేజ కుండ బద్ధలు కొట్టింది. మోనాల్ వెళ్లాక సైలెంట్ అయ్యావేంటని అఖిల్ను కూపీ లాగేందుకు ప్రయత్నించగా సోహైల్ మధ్యలో లేచి అంత లేదంటూ, ఇక్కడ ఇద్దరికి సోపులేస్తున్నాడని పంచ్ వేశాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక కాసేపటివరకు ఊపిరి ఆడలేదని అఖిల్ చెప్పుకొచ్చాడు. తర్వాత సీనియర్లు అరియానాను లౌడ్ స్పీకర్గా అభివర్ణిస్తూ ఇమిటేట్ చేయడంతో ఇంటి సభ్యులు పడీపడీ నవ్వారు. అయితే కొన్నిసార్లు ఆమె లీడ్ తీసుకుని మాట్లాడటాన్ని శ్రీముఖి మెచ్చుకుంది. దీనిపై అరియానా స్పందిస్తూ.. గత సీజన్లో శ్రీముఖికే సపోర్ట్ చేశాను, ఆమె ఆడిన విధానం నచ్చిందంటూ చెప్పుకొచ్చింది. హౌస్ అంతా రివర్స్ అయినప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడటం గ్రేట్ అని హరితేజ సైతం మెచ్చుకుంది. (చదవండి: హౌస్లో శివగామి ఎవరో చెప్పిన అభిజిత్) అమ్మాయిల కోసం పాట పాడిన అభి కావాలని తప్పులు చేయండి, ఎందుకంటే వారంలో బిగ్బాస్ గొంతు మిస్సవుతారు అని సీనియర్లు ఉచిత సలహా ఇచ్చారు. తర్వాత అందరితో డ్యాన్స్ చేయించారు. గర్ల్ ఫ్యాన్స్ కోసం అభిజిత్తో పాట పాడించారు. అయితే లిరిక్స్ రాకపోయినా 'నీ ఎదలో నాకు చోటే వద్దు.. అంటూ బాగానే పాడాడు. తర్వాత అలీ రెజా మాట్లాడుతూ..నన్ను అర్జున్రెడ్డి అనేవారు, కానీ నువ్వు నన్ను మించిపోయావని, గొడవయ్యాక నువ్వే వెళ్లి కలిసిపోవడం బాగుందని సోహైల్ను మెచ్చుకున్నాడు. ఇలా కోప్పడే ఒకరు ట్రోఫీ తీసుకెళ్లారు తన కోపం కారణం లేకుండా రాదని, ఎంత కోప్పడినా మళ్లీ మనవాళ్లే అని దగ్గరకు తీసుకుంటా అని సోహైల్ చెప్పగా ఇలా కోప్పడే ఒకరు బిగ్బాస్ 1 ట్రోఫీని పట్టుకెళ్లారని హరితేజ శివబాలాజీని గుర్తు చేసింది. తర్వాత మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. టాస్కుల్లో మామూలు స్పీడు లేదని గీతా మాధురి మెచ్చుకుంది. నవ్వితే బాగుంటావు, కానీ ఎప్పుడూ సీరియస్గా ముఖం పెడతావేంటని శ్రీముఖి నిలదీయడంతో అలాంటిదేమీ లేదని అఖిల్ తెలిపాడు. పులిహోర మాత్రం మామూలుగా కలపడం లేదని గీతా, హరితేజ సెటైర్లు వేశారు. (చదవండి: ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) ఉన్న టైమ్ను ఎంజాయ్ చేయండి చివర్లో మాకు సలహాలు ఇవ్వండని జూనియర్లు సీనియర్లను కోరారు. మొదట హరితేజ మాట్లాడుతూ... ఇక్కడిదాకా వచ్చాక మార్చుకోవాల్సినవేమీ ఉండవని చెప్పింది. ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయమని సూచించింది. గీతా మాధురి కూడా ఎంజాయ్ చేయమని చెప్తూనే చివర్లో ఎవరినీ బాధపెట్టే డైలాగులు మాట్లాడకండని సలహా ఇచ్చింది. శ్రీముఖి మాట్లాడుతూ.. 'గత సీజన్లో నేను సెట్లో ప్రతి మూలమూలకు వెళ్లాను. ఎందుకంటే తర్వాత ఆ సెట్ తీసేస్తారు. కాబట్టి మీరు కూడా హౌస్లో చిల్ అవ్వండి. రూల్స్ బ్రేక్ చేసి బిగ్బాస్తో తిట్టించుకోండి. ఎందుకంటే మళ్లీ ఆ వాయిస్ వినలేరు' అని చెప్పింది. హౌస్లో ఎంత నెగెటివిటీ వస్తుందో అంత పాజిటివిటీ వస్తుందని అలీ ధైర్యం చెప్పాడు. మా అమ్మాయి బిగ్బాస్ చూస్తూనే అన్నం తింటుది, వారం తర్వాత పరిస్థితి ఏంటో అని గీతామాధురి తల పట్టుకోగా తాము ఇంటికొచ్చి తినిపిస్తాం అని ఫైనలిస్టులు ముందుకొచ్చారు. అనంతరం మాజీలు టాప్ 5 కంటెస్టెంట్లకు ఆల్ ద బెస్ట్ చెప్తూ వీడ్కోలు పలికారు. (చదవండి: బిగ్బాస్: టైటిల్ గెలిచే అర్హత హారిక, అరియానాకు లేదు!) -
ఇప్పుడు తన వంతు అంటోన్న మోనాల్
బిగ్బాస్ నాలుగో సీజన్ కథ కంచికి చేరుతోంది. ఈ తరుణంలో లోపల ఉన్న తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించేందుకు అభిమానులు నడుం కట్టారు. హాట్స్టార్ ఓటింగ్తో పాటు మిస్డ్ కాల్స్ ద్వారా నిన్నటి నుంచే ఓట్ల వరద పారిస్తున్నారు. మరోవైపు టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ల కోసం ఇప్పటికే ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్ సపోర్ట్ చేస్తున్నారు. ముక్కు అవినాష్, దేవి నాగవల్లి.. అరియానాకు, నోయల్.. హారికకు మద్దతిస్తుండగా మోనాల్ గజ్జర్ తన క్లోజ్ ఫ్రెండ్, ఫస్ట్ ఫైనలిస్ట్ అఖిల్ కోసం రంగంలోకి దిగింది. (చదవండి: అభిజిత్కు సపోర్ట్ చేస్తున్న రౌడీ హీరో) పద్నాలుగు వారాలు హౌస్లో తన ప్రయాణాన్ని కొనసాగించిన మోనాల్ నిన్నటితో బిగ్బాస్కు వీడ్కోలు పలికింది. ప్రతిదానికి ఏడుస్తూ నర్మదగా పేరు గడించిన ఆమె ఇంటి నుంచి నవ్వుతూ వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అఖిల్ తన బెస్ట్ఫ్రెండ్ అని ముందుగానే క్లారిటీ ఇచ్చింది. షో మొదటి రోజు నుంచి అతడు తనకు సపోర్ట్గా నిలబడ్డాడని చెప్తూ ఇప్పుడు అఖిల్ కోసం నిలబడాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. అఖిల్కు ఓటేయండని పిలుపునిచ్చింది. అలాగే సోహైల్, హారికకు కూడా సపోర్ట్ చేయండని అభిమానులను కోరింది. కాగా షో నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం మోనాల్ చిలుకూరి బాలాజీ దేవాలయాన్ని సందర్శించినట్లు సమాచారం. (చదవండి: బిగ్బాస్ ట్రోఫీ గెలిచేందుకు అనర్హులు ఎవరు?) -
బిగ్బాస్: నెరవేరని మోనాల్ కల!
ఊహించనట్లే నర్మద వెళ్లిపోయేందుకు బిగ్బాస్ గేట్లు ఎత్తారు. అయితే ఎప్పుడూ ఏడ్చే ఆమె వెళ్లిపోయేటప్పుడు మాత్రం పెద్దగా ఏడవకుండా నవ్వుతూనే అందరికీ వీడ్కోలు పలకడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. తనకు మొదట్లో పువ్విచ్చిన అఖిల్కు బరువెక్కిన హృదయంతో వీడ్కోలు చెప్తూ అతడి చేతికి పువ్వందించింది. ఇంకా ఎన్నెన్నో జరిగిన బిగ్బాస్ హౌస్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ కన్నేయండి.. రైతుల కోసం డబ్బు పక్కన పెడతా బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.50 లక్షలని నాగ్ పేర్కొన్నారు. ట్రోఫీ గెలిచి ఈ డబ్బు మీ సొంతమవుతే ఏం చేస్తారని నాగ్ ప్రశ్నించారు. నాకు ఒక్క రూపాయి వద్దు, అన్నీ అమ్మకే ఇస్తానని హారిక చెప్పుకొచ్చింది. ఈ డబ్బులతో ఒక ఇల్లు కట్టుకుంటాను. మా ఊరిలో పొలం కోసం రూ.50,000 అప్పు చేసిన ఐదారుగురి రుణాన్ని తీర్చేస్తానని అరియానా తన మంచి మనసును చాటుకుంది. తాను డబ్బు గెలిస్తే దాన్ని నాన్నకే ఇచ్చేస్తానని అభిజిత్ అన్నాడు. నా కోసం ఎన్నో కష్టాలు పడ్డ అమ్మ కోసం ఇన్వెస్ట్ చేస్తాను అని మోనాల్, ఓల్డేజ్ హోమ్ వాళ్లకు కొంత డబ్బు ఇస్తాను. వీలైతే ఓ ఇల్లు కొనుక్కుంటా అలాగే ఒక కెఫె పెడతాను అని అఖిల్ చెప్పాడు. తను కెఫె పెడితే తప్పకుండా రావాలని నాగార్జునను ఆహ్వానించాడు. అనంతరం సోహైల్ మాట్లాడుతూ... నా అకౌంట్లో ఎప్పుడూ లక్షకు మించి లేవు. అవసరంలో ఉన్నవారి కోసం రూ.10 లక్షలు పక్కన పెడతాను. ఓ ఫ్లాట్ కొంటాను అని తన ప్లానింగ్స్ వివరించాడు. [చదవండి: ఆ హౌజ్మెట్కే నా మద్దతు: విజయ్ దేవరకొండ ] అబ్బాయిలను చిత్తుచిత్తుగా ఓడించిన అమ్మాయిలు అనంతరం కంటెస్టెంట్లు విన్నింగ్ స్పీచ్ ఇచ్చారు. కాకపోతే వారి విజయం గురించి కాకుండా తోటి ఇంటి సభ్యుడు గెలిస్తే ఎలా స్పీచ్ ఇస్తారో చెప్పాలని నాగ్ మెలిక పెట్టారు. ఇందులో హారిక.. మోనాల్, అరియానా.. అభిజిత్, అభిజిత్.. అఖిల్, మోనాల్.. సోహైల్, అఖిల్.. అరియానా, సోహైల్.. హారికను ఇమిటేట్ చేస్తూ వారి విన్నింగ్ స్పీచ్ ఇచ్చి నవ్వించారు. అనంతరం అభి ఫినాలేకు చేరుకున్నట్లు నాగ్ వెల్లడించారు. తర్వాత ఇంటిసభ్యులతో సినిమా పేరు కనుక్కోమని పోస్టర్ గేమ్ ఆడించారు. రెండో లెవల్లో డంబ్ షేరాడ్స్ ఆడించారు. అయినా సరే అబ్బాయిలు చిత్తు చిత్తుగా ఓడిపోగా అమ్మాయిలు గెలుపు సాధించారు. తర్వాత హారిక ఫినాలేలో అడుగు పెట్టినట్లు నాగ్ ప్రకటించారు. ఆమె మోనాల్ సేఫ్ అవుతుందని అభిప్రాయపడింది. కానీ ఆమె అంచనా తప్పింది. అరియానా ఫైనలిస్టుగా ఎంపికై మోనాల్ ఎలిమినేట్ అయింది. టైటిల్ గెలవాలా? ఇది మార్చుకోండి మోనాల్ ఎలిమినేషన్తో అఖిల్కు షాక్ తగిలింది. అతడి గొంతు మూగబోయింది. అతడి మౌన వేదనను అర్థం చేసుకున్న మోనాల్.. కన్నీళ్లతో అతడికి పువ్విచ్చి వీడ్కోలు తీసుకుంది. స్టేజీ మీదకు వచ్చిన మోనాల్ టైటిల్ గెలవాలంటే ఏం మార్చుకోవాలో ఇంటిసభ్యులకు సలహాలిచ్చింది. అందరితో మాట్లాడమని, ముఖ్యంగా అఖిల్కు సమయం కేటాయించమని అభిజిత్కు సూచించింది. నేను హౌస్లో ఉంటే మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యేవారు అన్నావు కదా, ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ వచ్చిందని అభికి చెప్పచెప్పింది. దీంతో అభి స్పందిస్తూ.. తానలా అనలేదని, బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. బిగ్బాస్ అయ్యాక తప్పకుండా గుజరాత్కు వచ్చి కలుస్తానని మాటిచ్చాడు. అరియానాకు టాస్క్లో అంత అగ్రెసివ్ వద్దని సూచించింది. సోహైల్.. చిన్న చిన్న మాటలకు బాధపడొద్దని తెలిపింది. ఫైనల్లో హారిక.. అఖిల్ను దాటేయాలని కోరింది. ఆమె కోరిక విని అఖిల్ షాక్తో నోరు తెరిచాడు. (చదవండి: బిగ్బాస్ విన్నర్ అభిజితే: శ్రీకాంత్) భావాలను పాటలో వ్యక్తీకరించిన అఖిల్ ఈ మధ్య తనను పట్టించుకోవడం మానేసిన అఖిల్ మీద మోనాల్ గరమైంది. వచ్చే ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చిర్రుబిర్రులాడింది. ఒక పాట పాడమని చెప్పగా.. 'ఉండిపోరాదే, గుండె నీదేలే..' అంటూ గుండె లోతుల్లోని ప్రేమను వెలికితీస్తూ పాడటంతో ఆమె కళ్ల వెంట నీళ్లు జలజలా రాలాయి. నిన్ను బాధపెట్టినందుకు సారీ అంటూనే వారం తర్వాత వచ్చి మాట్లాడతానన్నాడు. అయితే గొడవపెట్టుకునేందుకు మాత్రం రావద్దని మోనాల్ హెచ్చరించగా అదేంటో కాస్త మాకు కూడా చెప్పండని నాగ్ సరదాగా జోక్ చేయడంతో అందరూ నవ్వేశారు. పార్టీ చేసుకున్న ఫైనలిస్టులు టైటిల్ గెలిస్తే వచ్చే ప్రైజ్మనీతో అమ్మ కోసం ఇన్వెస్ట్ చేయాలన్న మోనాల్ కల ప్రస్తుతానికైతే కలగానే మిగిలిపోయింది. అనంతరం టాప్ 5 కంటెస్టెంట్లు అఖిల్, సోహైల్, అభిజిత్, హారిక, అరియానా ఫైనల్లో అడుగుపెట్టినందుకు చిందేస్తూ పార్టీ చేసుకున్నారు. మరో ముఖ్య విషయమేంటంటే.. వీళ్లలో ఒకరిని విన్నర్ చేసే ఓటింగ్ ఈ రాత్రి నుంచే మొదలు కానుంది. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంటుకు ఓటేయడం అస్సలు మిస్సవకండి. (చదవండి: హారిక తమన్నా, మోనాల్ అనుష్క అంటోన్న అభి) -
బిగ్బాస్ : కుక్క అనుకున్నా పర్లేదు.. అఖిల్
మొదటి సారి తెలివైనోడు(అభిజిత్) టాస్క్ కండీషన్స్ మర్చిపోయి ఓడిపోయాడు. ప్రతి సారి టాస్క్ పేపర్ను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చదివే అభిజిత్.. నేడు మాత్రం ఒక్కసారి కూడా టాస్క్ పేపర్ చదవలేదు. దీంతో నిబంధనలు మర్చిపోయి మంచి చాన్స్ మిస్సయ్యాడు. ఇక తనకు కెప్టెన్సీ టాస్క్కు సహాయం చేసిన మోనాల్కు అరుదైన అవకాశం కల్పించి హారిక తన రుణం తీర్చుకుంది. అసలు మన తెలివైనోడు మర్చిపోయిన కండీషన్ ఏంటి? మోనాల్ రుణం హారిక ఎలా తీర్చుకుందో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. మరింత రెచ్చిపోయిన పులిహోర రాజా పులిహోర కలపడంతో అఖిల్ ఆరితేరిపోయాడు. చాన్స్ దొరికితే చాలు ఇంట్లోని అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నిన్న పులిహోర రాజా అన్న మోనాల్తో గొడవ పడిన అఖిల్.. ఈ రోజు ఏమో ఆమె ముందే హారికను ఫ్లర్ట్ చేశాడు. హారిక ఏదో పనిచేసుకుంటూ కిచెన్లో ఉండగా.. అఖిల్ మెల్లగా ఆమె దగ్గరకు చేరాడు. సొహైల్ చూసి.. ఏంటి ఆమె దగ్గరకు పోతున్నావ్ అని అనడంతో.. హారికను వెనకనుంచి వాటేసుకుని ఏం షాంపూ ఇది.. మా దగ్గర లేదే నీ దగ్గరకు ఎలా వచ్చింది? అంటూ ఆమెతో మాటలు కలపడం స్టార్ట్ చేశాడు. ఏంట్రా ఇది అంటూనే హారిక కూడా అఖిల్తో డబుల్ మీనింగ్ వచ్చే మాటలు మాట్లాడింది. ఇక హారిక మాటలకు అఖిల్ మరింత రెచ్చిపోయి ఆమెపై పాట పాడుతూ.. పక్కనే ఉన్న మోనాల్ను ఏడిపించే ప్రయత్నం చేశాడు. కానీ మోనాల్ మాత్రం ఏమి విననట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఎదురుగా ఉన్న సోహైల్.. పులిహోర కలపడంలో నువ్వే తోపువంటూ అఖిల్పై పంచ్ వేశాడు. ‘నన్ను కుక్క అనుకున్నా పర్లేదు.. కుక్కకు విశ్వాసం ఉంటుంది.. మా యాజమాని(హారిక) దగ్గరకి వస్తే కరిచేస్తా’ అంటూ ఘోరమైన పులిహోర కలిపాడు. స్టెప్పులేసి.. గొల్డెన్ మైక్ పట్టు ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేందుకు హౌస్మేట్స్కు బిగ్బాస్ మరో అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే మూడు రకాల టాస్క్లు ఇచ్చిన బిగ్బాస్.. నాల్లో టాస్క్గా వినోదాన్ని అందించే చాన్స్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా తక్కువ సైజు షూ ధరించి స్లేజ్పై డాన్స్ చేయాలి. ఆ సమయంలో ఎవరూ కూడా స్జేజీపై కూర్చోవడం కానీ, నిలబడటం కానీ చేయకూడదు. అలాగే మధ్య మధ్య మ్యూజిక్ ఆపేస్తానని.. అప్పుడు ఒకరు కిందకు దిగాలని కండీషన్ పెట్టాడు. అయితే ఎవర దిగిపోతారో ఇంటి సభ్యల ఇష్టమని చెప్పాడు. ఈ టాస్క్కు అఖిల్ని సంచాలకుడిగా నియమించాడు. కిందికి ఎవరి దించాలో అఖిల్ కూడా సూచించవచ్చని బిగ్బాస్ చెప్పాడు. చివరి వరకు స్టేజీపై ఎవరు ఉంటారో వారికి గోల్డెన్ మైక్ లభిస్తుందని చెప్పాడు. అయ్యో అభి.. చూసుకోవాలిగా దీంటో భాగంగా ఇంటి సభ్యులంతా తక్కువ సైజ్ గల షూ ధరించి డాన్స్ చేశారు. మొదటి సారి మ్యూజిక్ ఆపేయగా.. అఖిల్ పాటు మిగతా ఇంటి సభ్యులంతా అరియానాను దిగాల్సిందిగా కోరారు. ఆమెకు ఇదివరకే రెండు సార్లు ప్రేక్షకులతో మాట్లాడే చాన్స్ వచ్చిందని, ఈ సారి మిగతా వారికి అవకాశం ఇవ్వాలన్నారు. అయితే ఇక్కడ అరియానా కొంచెం అతి చేసింది. తాను దిగేందుకు సిద్దంగా ఉన్నానంటునే ఇప్పుడు మాత్రం దిగనని, రెండోసారి దిగుతానని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఎవరు దిగుతారని అభిజిత్ ప్రశ్నించగా.. సోహైల్ కూడా ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసే చాన్స్ వచ్చింది కదా.. ఆయన్ని దిగమని చెప్పింది. ఇప్పుడు నువ్వు ఎందుకు దిగవని చెబితే.. నాకు డాన్స్ చేయాలని ఉందని, ఏవోవో చెప్పుకొచ్చింది. ఇక అరియానా ఇప్పట్లో ఒప్పుకునేలా లేదనుకున్న అభిజిత్.. టాస్క్ కండీషన్ మర్చిపోయి కింద కూర్చున్నాడు. ఈ విషయాన్ని మోనాల్ గుర్తు చేసింది. దీంతో మొదటి సారి మన తెలివైనోడు.. తనకు ఈ విషయం తెలియదని, పొరపాటు జరిగిపోయిందంటూ స్టేజీ దిగేశాడు. ఇక అభి మొదటి సారి టాస్క్ కండీషన్స్ మర్చిపోవడంతో ఇంటి సభ్యులు అంతా అవాక్కయ్యారు. సోహైల్ అయితే.. ఏంటి అభి.. ప్రతిసారి టాస్క్ పేపర్ క్షుణ్ణంగా చదువుతావు.. ఈ సారి ఏమైంది చూసుకోవాలి కదా..అని నవ్వుతూ అభిపై సెటైర్లు వేశాడు. అందుకే దిగుతున్నా : అరియానా ఇక రెండో సారి మ్యూజిక్ ఆగినప్పుడు అరియానా దిగుతూ..తనకు ఇప్పటికే రెండు సార్లు ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసుకునే చాన్స్ వచ్చిందని, మిగతవారికి కూడా రావాలనే స్టేజీ దిగుతున్నానని చెప్పి దిగిపోయింది. అలా మూడో సారి సోహైల్ దిగిపోయాడు. తానకు డాన్స్ చేయాలని ఉందని, కేవలం హౌస్మేట్స్ కోసమే కిందికి దిగుతున్నానని చెప్పాడు. అనంతరం వాష్రూమ్ దగ్గరకు వెళ్లి అరియానాపై బిగ్బాస్కు కంప్లైంట్ ఇచ్చాడు. ఇదివరకు జరిగిన టాస్క్లో ఇంటి సభ్యుల కోసం త్యాగం చేయమంటే చేయని అరియానా ఇప్పుడు ఎందుకు ఇచ్చిందని తప్పుపట్టాడు. మోనాల్ రుణం తీర్చుకున్న హారిక ఇక స్టేజీపై చివరకు హారిక, మోనాల్ మాత్రమే మిగిలి ఉన్నారు.ఇద్దరిలో ఒకరు దిగాల్సిరావడంతో.. హారికను దిగాల్సిందిగా మోనాల్ రిక్వెస్ట్ చేసింది. ఒక టాస్క్లో లాస్ట్ వరకు ఉండటం ఇది రెండో సారి అని, ఈ చాన్స్ తనకు చాలా ముఖ్యమని హారికను రిక్వెస్ట్ చేసింది. ఒక్కనిమిషం ఆలోచించిన హారిక.. చివరకు గోల్డెన్ మైక్ను మోనాల్కు త్యాగం చేసింది. కెప్టెన్సీ టాస్క్లో తనను భుజాలపై ఎత్తుకొని గెలిపించావని, అందుకే ఇప్పుడు నేను ఈ చాన్స్ ఇస్తున్నా అని హారిక చెప్పి దిగిపోయింది. ఇక టాస్క్ గెలిచి గొల్డెన్ మైక్ సాధించిన మోనాల్.. కన్ఫెషన్ రూమ్కి వెళ్లి ఓట్లు వేయమని ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసింది. అనంతరం గార్డెన్ ఏరియాకు వచ్చి సంతోషంతో బిగ్బాస్కు హగ్లు, ఫ్లైకింగ్ కిస్లు ఇచ్చేసింది. -
అరియానా టార్చర్! గుక్క పెట్టి ఏడ్చిన మోనాల్
పంతొమ్మిది మంది కంటెస్టెంట్లు పాల్గొన్న బిగ్బాస్ హౌస్లో ఇప్పుడు అచ్చంగా ఆరుగురే మిగిలారు. ఎలాగైనా టైటిల్ కొట్టేయాలన్న కసితో వీళ్లందరూ రెట్టించిన ఉత్సాహంతో ఆడుతున్నారు. ఈ క్రమంలో ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని మీరు నిరూపించుకోమని బిగ్బాస్ ఇచ్చిన టాస్కులో అరియానా బెస్ట్ రూలర్గా నిలిచింది. ఇక తర్వాతి టాస్కులో మోనాల్, అరియానా మధ్య మళ్లీ గొడవలు రాజుకున్నాయి. తన బొమ్మను పైన పడేసినందుకు అరియానా మోనాల్ను నోటికొచ్చినట్లు తిట్టింది. దీంతో ఆమె గుక్కపెట్టి ఏడవగా ఓదార్చేందుకు ఎవరూ లేకపోవడం మరీ దారుణం. మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే దీన్ని చదివేయండి.. అలా వేరే అబ్బాయితో ఉంటే నచ్చదు మహారాణి కిరీటం ధరించిన అరియానా ఇంట్లోవాళ్లకు ఓ టాస్క్ ఇచ్చింది. మీకు నచ్చిన వస్తువు తీసుకొచ్చి, దానికి సంబంధించిన జ్ఞాపకాన్ని పంచుకుకోవాలని ఆదేశించింది. అలాగే దాన్ని ఇంట్లో నచ్చినవాళ్లకు ఇవ్వాలని చెప్పింది. దీంతో సోహైల్ తన గుర్తుగా అభిజిత్కు సస్పెండర్, హారికకు కత్తి, మోనాల్కు టీ షర్ట్, అరియానాకు పర్ఫ్యూమ్, అఖిల్కు జాకెట్ను ఇచ్చాడు. అనంతరం మహారాణిగా బాధ్యతలు చేపట్టిన మోనాల్ తనలో మంచీచెడు ఏంటో చెప్పమని మంత్రి అఖిల్ను అడిగింది. ఒక మనిషి నిన్ను ద్వేషించినా కూడా ఇష్టపడటం మంచి లక్షణమైతే, సంతోషంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం చెడు లక్షణమని చెప్పాడు. అలాగే నాతో ఉన్నట్లుగా వేరే అబ్బాయితో ఉంటే నాకు నచ్చదని మనసులోని మాటను చెప్పాడు. (చదవండి: అభితో ఉండట్లేదని హారికను తిడుతున్న నెటిజన్లు) హారిక కోసం అభిజిత్ కలవరింత అనంతరం మోనాల్ స్కిట్ చేయమని ఆదేశించింది. అందులో భాగంగా అభిజిత్ అమ్మాయిగా నటిస్తూ సోహైల్ను పార్టీకి ఒప్పించాల్సి ఉంటుంది. కానీ వీళ్ల మధ్యలో అరియానా, హారిక కూడా దూరడంతో స్కిట్టు ఆగమాగం అయింది. కాసేపు నవ్వించినప్పటికీ ఎటూ తేలకుండా లేకుండా మధ్యలోనే ఆగిపోయింది. మొత్తానికి ఈ అధికారం టాస్కులో అరియానా బెస్ట్ రూలర్గా ఎంపికైంది. దీంతో కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లిన ఆమె కన్నీటిపర్యంతమైంది. ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాకు మీ ప్రేమ కావాలి. ఈ ఒక్క మెట్టు నన్ను ఎక్కించండి. నాకు ఓటేసి సాయం చేయండి అని అభ్యర్థించింది. మరోవైపు నిన్న హారిక రాజ్యంలో జరిగిన గొడవతో అఖిల్, సోహైల్కు సరిగా మాటల్లేవు. ఈ అన్నదమ్ములను కలిపేందుకు మోనాల్ తన వంతు ప్రయత్నించగా చివరికి వాళ్లు కలిసిపోయారు. ఇక అభిజిత్ హారికను ఎంత మిస్సవుతున్నాడో చెప్పకనే చెప్పాడు. తనతో టైమ్ స్పెండ్ చేయమని చెప్తూ ఓ లేఖను రాత్రి ఒంటిగంటకు హారిక బెడ్పై పెట్టాడు. అది చూసి ఆమె చలించిపోయింది. కంటెస్టెంట్లకు ఓపికకు పరీక్ష.. కంటెస్టెంట్లు వారేంటో నిరూపించుకునేందుకు బిగ్బాస్ 'ఓపిక' అనే రెండో టాస్క్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంటు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా రోబోలా కూర్చోవాలి. మొదట అరియానాతో టాస్క్ మొదలవగా ఆమెను ఇరిటేట్ చేసేందుకు సోహైల్ విశ్వప్రయత్నాలు చేశాడు. ఆమె ఫేవరెట్ డ్రెస్ చింపుతానని బెదిరించాడు కానీ అంత ధైర్యం చేయలేకపోయాడు. తనకిష్టమైన ఆర్వీ కప్పును పగలగొట్టినంత పని చేశాడు. తర్వాత మోనాల్ ఆమెకిష్టమైన చింటూ బొమ్మను విసిరేసింది. (చదవండి: బిగ్బాస్లో పనికి రానోళ్లను తోసేయండి: రాహుల్) ఇన్ని రోజులు నటించావా..? తర్వాత మోనాల్ రోబోలా కూర్చోగా అరియానా తన మనసులో ఉన్నదంతా కక్కేసింది. అవినాష్ను నువ్వు తన్ని మరీ ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చావని చెప్పింది. నా మీద ఎంత పగుందో బయటపడిందని తెలిపింది. నా బొమ్మను హౌస్ అవతల పడేద్దామనుకున్నావు, నన్ను హర్ట్ చేయాలనుకున్నావు. మనసులో ఇంతున్నప్పుడు బయటకు నటించావా? అని కడిగి పారేసింది. ఒక్కో అంశాన్ని బాణాల్లా వదులుతూ ఆమె మనసును గాయపర్చింది. అనంతరం టాస్కు పూర్తవగానే మోనాల్ లోపలకు వెళ్లి ఒంటరిగా ఏడ్చేసింది. గేమ్ ఆడినా, ఆడకపోయినా ప్రాబ్లమే అని దుఃఖించింది. సోఫాలో ఒంటరిగా గుక్కపెట్టి మరీ ఏడ్చింది. దీంతో బిగ్బాస్ ఆమె కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. (చదవండి: అవినాష్ అవుట్: అభిజిత్పై బిగ్బాంబ్) ఒంటరిగా ఏడ్చిన మోనాల్ అక్కడ ఆమె తన గోడు చెప్పుకుంది. నేసలు ఇక్కడ ఉండటానికి అర్హురాలినే కాదన్నట్లుగా చూస్తున్న ప్రతిసారి ఎలిమినేషన్లా అనిపిస్తోంది అని తన గుండెల్లో రగులుతున్న బాధను బయటపెట్టింది. దీంతో బిగ్బాస్ ఆమెకు ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో సోహైల్ టాస్కులో ఉన్నందున అతడు ఆమెను ఓదార్చలేకపోయాడు. కానీ టాస్కు ముగిశాక సోహైల్ మోనాల్ బాధను చూసి తట్టుకోలేకపోయాడు. ఆమెను అంతలా ఏడిపించినందుకు అరియానా మీద విరుచుకుపడ్డాడు. ఇద్దరూ పెద్ద గొడవకు దిగగా అరియానా కిందపడీ మరీ ఏడ్చింది. మరి ఈ గొడవ ఎలా సద్దుమణిగింది? ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే! (చదవండి: మోనాల్ టాపికే బిస్కేటైంది.. అభిజిత్ కంటతడి) -
ఇద్దరమ్మాయిలతో అఖిల్ పులిహోర
బిగ్బాస్ నాల్గో సీజన్లో మొన్నటివరకు అవినాష్కు పులిహోర రాజా అనే బిరుదుండేది. కానీ అతడు వెళ్లిపోతూ ఆ బిరుదు తనకన్నా అఖిల్కు పర్ఫెక్ట్గా సెట్టవుతుందని చెప్పాడు. ఒక్కసారి కెమెరాలు ఆఫ్ చేస్తే అతడు పెద్ద బేసిన్ తీసుకుని మరీ కలుపుతాడని పేర్కొన్నాడు. దీంతో అఖిల్కు కూడా పులిహోర రాజా అనే బిరుదు వచ్చేసింది. అయితే అఖిల్.. మోనాల్ దగ్గర మాత్రమే అలాంటి వేషాలు వేస్తాడని అభిమానులు అతడిని వెనకేసుకువచ్చారు. కానీ నిన్నటి ఎపిసోడ్, నేటి అన్సీన్ వీడియోలో ఆ భ్రమలు పటాపంచలయ్యాయి. ఎవ్వరినీ వదలట్లేదుగా నిన్నటి 'అధికారం' టాస్కులో సోహైల్ హారికను ముద్దుపెట్టుకున్నాడని అఖిల్ హర్టయ్యాడు. నాకు కూడా ముద్దివ్వాల్సిందేనని హారికను బతిమిలాడాడు. ఆమె ఎంత చెప్పినా వినకపోవడంతో ఇస్తావా? ఇవ్వవా? అని బెదిరించాడు. దీంతో ఇదెక్కడి గొడవరా అనుకున్న హారిక టాస్క్ అయ్యాక ఇస్తానని చెప్పి ఆ క్షణానికి తప్పించుకుంది. ఇక్కడ అఖిల్ ప్రవర్తన ఆయన అభిమానులకు కూడా నచ్చలేదు. మరోవైపు అన్సీన్ వీడియోలో అరియానా, హారికతో పులిహోర కలుపుతూనే ఉన్నాడు. 'అవినాష్ లేడు కాబట్టి నీతో ఇంకా క్లోజ్ కావచ్చు. ఎలాంటి సాయం కావాలన్నా నన్ను అడుగు' అంటూ అరియానాతో ప్రేమగా మాట్లాడాడు. చిటికేస్తే నీ ముందుంటా అని ఆమె దగ్గర తల వంచగానే షాకైన అరియానా నీకు అంతా బాగానే ఉంది కదా! అని అడిగింది. నీకు పడిపోతున్నా.. దీంతో అఖిల్ మరో అడుగు ముందుకేసి నువ్వు అలా చూడకు, నేను ఇంకా పడిపోతున్నానని ఫ్లర్ట్ చేశాడు. మనం బ్రేక్ఫాస్ట్ డేట్కు వెళ్దాం అంటూ ఆమెను ప్రేయసిలా ఫీలయ్యాడు. ఇదంతా పద్నాలుగో వారం ఎఫెక్ట్ కదా అని అరియానా అడగ్గానే తన మీద ఎప్పటి నుంచో ఇష్టం ఉందన్న విషయాన్ని అఖిల్ బయటపెట్టాడు. మన మెంటాలిటీ కలవడం వల్ల ఇలాంటి పర్సన్ కావాలనిపిస్తుంది, కానీ నువ్వు బయట ఎవరో ఉన్నావని చెప్పావు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ముందుకెళ్లను అని క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ నీకు బయట ఎవరూ లేకపోతే హ్యాపీ, ఉంటే మాత్రం హర్ట్ అవుతాను అని పులిహోర ఓ రేంజ్లో కలిపాడు. (ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే అఖిలే విన్నర్!) అరియానాతో హగ్లో ఏదో తేడా ఉంది అటు కిచెన్లో పని చేస్తున్న హారికను అఖిల్ వెనక నుంచి హత్తుకున్నాడు. పని తప్పించుకోవడానికే ఇవన్నీ చేస్తున్నావు అని హారిక చెప్పింది. ఆ తర్వాత వచ్చిన అరియానాను కూడా హత్తుకున్నాడు. ఇదంతా చూస్తున్న మోనాల్ ఇదేం బాగోలేదని చెప్పింది. హారికను హగ్ చేసుకోవడం ఓకే కానీ అరియానాను హత్తుకోవడం నాకు వేరేలా అనిపిస్తోందని అభిప్రాయపడింది. ఒకవేళ మోనాల్ను ఉడికించేందుకే అఖిల్ ఇలా చేసినా చూసే జనాలకు మాత్రం అది నీచంగా కనిపిస్తోంది. (పొగిడాననుకున్నావా, అదంతా తూచ్) తన గోతి తనే తవ్వుకుంటున్న అఖిల్ ఏదేమైనా టికెట్ టు ఫినాలే తర్వాత అఖిల్ పూర్తిగా మారిపోయాడని జనాలు అంటున్నారు. మరీ ఇంత పులిహోర కలుపుతూ. ముద్దుల కోసం అడుక్కునే దిగజారుడు పనులు ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదని ఆయన అభిమానులు తలలు బాదుకుంటున్నారు. మోనాల్ను వదిలేసి మిగతా ఇద్దరమ్మాయిల వెంటపడటం అస్సలు బాగోలేదని చెప్తున్నారు. ఇది తనలోని మరో యాంగిల్ అని అఖిలే ఒప్పుకున్నాడు. కానీ ఇది అతనికే చేటు తెచ్చేలా కనిపిస్తోంది. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఈ పులిహోర వ్యవహారాలతో ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఈ విషయం అఖిల్ ఎప్పుడు తెలుసుకుంటాడో! -
బిగ్బాస్ : అభిజిత్కి జైలు శిక్ష.. నెంబర్ వన్ అతనే!
బిగ్బాస్ హౌస్లో గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా నెంబర్ గేమ్ టాస్క్ మొదలైంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లేకపోవడంతో బిగ్ బాస్ హౌస్లో నెంబర్ గేమ్ నిర్వహించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఆరుగురు సభ్యులు తాము ఏ స్థానానికి అర్హులమో చెప్పి.. ఆ నెంబర్ ముందు నిల్చోవాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా అఖిల్, సోహైల్ మొదటి స్థానంలో నిలబడినట్లు ప్రోమోలో చూపించినప్పటికీ టికెట్ టు ఫినాలే గెలిచినందుకు అఖిల్ను ఈ టాస్క్ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. దీంతో సోహైల్ ఒక్కడే మొదటి స్థానంలో నిలబడ్డాడని టాక్. ఇక రెండో స్థానంలో అరియానా నిలబడింది. (చదవండి : బిగ్బాస్ : ఫినాలేకు అతిథిగా స్టార్ హీరో!) ఇక, మూడు నాలుగు స్థానాల్లో హారిక, మోనాల్ నిలిచారు. ఐదో స్థానంలో అవినాష్ ఉండగా, చిట్ట చివరన అభిజీత్ ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ టాస్క్లో గొడవ కంటే ఎక్కువగా ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరం ఇక్కడ ఫిజికల్గా, ఎమోషనల్గా గ్రిల్ అయిపోయాం బిగ్బాస్ అని అరియానా అనగా.. ఇందాకే బిగ్బాస్ అందరం కలిసి హగ్ చేసుకున్నాం అని సోహైల్ కంటతడి పెట్టాడు. ఇదిలా ఉంటే బయట భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అభిజిత్.. ఆరోస్థానంలో నిలబడటం అందరిని అశ్చర్యపరిచింది. గత నాలుగు వారాల క్రితం బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లో ఇంటి సభ్యులంతా అభిజిత్కి నెంబర్ వన్ ర్యాంకు ఇచ్చారు. ఇప్పుడేమోఅందరి కంటే చివరి స్థానం ఇవ్వడం అభిజిత్కి అవమానమనే చెప్పాలి. ఇక నెంబర్ గేమ్లో అభికి చివరి ర్యాంకు రావడంతో అతనికి జైలు శిక్ష పడినట్లు లీకుల వీరులు చెబుతున్నారు. ఇదే గనుక జరిగితే అభిజిత్కి మరింత సానుభూతి కలిసిరావడం ఖాయం. అయితే అభి జైలుకెళ్లడం ఒట్టి పుకారేనా లేదా నిజమా తెలియాలంటే ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్బాస్: అందుకే అఖిల్ ఏడ్చాడా?
'టికెట్ టు ఫినాలే' రేస్ మూడో లెవల్లో ఇద్దరు ప్రాణ స్నేహితులు అఖిల్, సోహైల్ వెళ్లడంతో ఆట రంజుగా మారింది. డైరెక్ట్గా టాప్ 5 లోకి ఎవరు వెళ్తారా అనే అసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక గెమ్లో భాగంగా ఉయ్యాల నుంచి కిందికి దిగకుండా ఇద్దరు మొండికేసి కూర్చున్నారు. వారిని దించేందుకు బిగ్బాస్ విఫల ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. పోటీదారులు మాత్రం ఇంచు కూడా కదలడం లేదు. చివరికి కూర్చున్నదగ్గరే పరదాలు చుట్టి వాష్రూమ్కు వెళ్లారు కానీ గేమ్ గివప్ ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. దీంతో బిగ్బాస్ ఒక అడుగు ముందుకేసి వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. హౌస్లో ఉన్నపళంగా తుపాకి పేలుడు శబ్దాలు చేశాడు. అయినప్పటికీ అఖిల్, సోహైల్ ఇసుమంతైనా భయపడలేదు. మిగతా సభ్యులు భయంతో పరుగులు తీశారు. ఇది కూడా వర్కౌట్ కాకపోవడంతో ముల్లంగి రసాన్ని ప్రయోగించాడు బిగ్బాస్. ముల్లంగి రసాన్ని చెంచాతో ఒకరికొరు తాగించుకుంటూ.. తాను ఉయ్యాల మీద ఉండటానికి ఎందుకు అర్హుడు? ఎదుటివాడు ఎందుకు అనర్హుడు? అన్న విషయాన్ని చెప్పాలని ఆదేశించాడు. ఇక్కడ గొడవ జరిగి ఎవరో ఒకరు దిగిపోతారని భావించాడు బిగ్బాస్. అయితే వీరిద్దరు మాత్రం చిన్న గొడవ పెట్టుకొని మళ్లీ కలిసిపోవడంతో బిగ్బాస్ వ్యూహం మరోసారి బెడిసికొట్టింది. (చదవండి : మోనాల్ గుట్టు రట్టు చేసిన అభిజిత్) ఈ సారి ఎలాగైనా ఒకరిని ఉయ్యాల నుంచి కిందికి దింపాలని కంకణం కట్టుకున్న బిగ్బాస్.. చివరిగా బెదిరింపు అస్త్రాన్ని ప్రయోగించినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ప్రోమోలో సోహైల్ భోరును ఏడుస్తున్నాడు. అఖిల్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. ఇద్దరిని అభిజిత్ ఓదార్చాడు. దీన్ని బట్టి చూస్తే బిగ్బాస్ ఏదో పెద్ద ప్లానే వేసినట్టు అర్థమవుతుంది. గంటలు గడిచిపోతున్నా.. ఇద్దరు ఉయ్యాల దిగకపోవడంతో.. బజర్ మోగే సమయానికి ఎవరో ఒకరు దిగాలని, లేదంటే టికెట్ టు ఫినాలే ఎవరికి దక్కదని బిగ్బాస్ హెచ్చరించారని, అందుకే సోహైల్ ఏడ్చాడని లీకుల వీరులు చెబుతున్నారు. సోహైల్ని దిగమని అఖిల్ కోరారని, అందుకే సోహైల్ కిందకి దిగి ఏడ్చాడని తెలుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో నేటి ఎపిసోడ్లో తేలిసిసోతుంది. కాగా, టికెట్ టు ఫినాలే విన్నర్ అఖిలేనని ఇప్పటికే లీకుల వీరులు చెప్పేశారు. అయితే సోహైల్ మాత్రం గేమ్ ఓడిపోయి కాకుండా త్యాగం చేసి అఖిల్ని గెలిపించినట్లు తెలుస్తోంది. -
మోనాల్ మనసులో నేనున్నా అంది: అభి
కెట్ టు ఫినాలే రేసు నేడు మూడో లెవల్లోకి అడుగుపెట్టింది. ఈసారి బిగ్బాస్ ఫిజికల్ టాస్కు లాంటివి కాకుండా సహనానికి, ఓపికకు పరీక్ష పెట్టాడు. ఉయ్యాలో ఊగమని చెప్పాడు. వినడానికి ఓస్ ఇంతేనా అనిపించినా, అది అంత ఈజీ కాదు. పూటకోసారి తీసుకొచ్చే జ్యూసులు తాగుతూ చలిలో కూర్చున్నచోటు నుంచి కదలకూడదు అంటే మాటలు కావు. పొట్ట ఉబ్బి అవస్థ పడుతూ పట్టపగలే చుక్కలు చూస్తారు. ఈ టాస్కులో ఇద్దరు స్నేహితులూ పట్టువిడవకుండా ఉయ్యాల మీదే ఉండిపోయారు. ఇక అభిజిత్ మోనాల్ గుట్టును బయటపెట్టాడు. ఆ వివరాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. అవినాష్- బ్రదర్ ఆఫ్ మోనాలి 'టికెట్ టు ఫినాలే' రేస్ మూడో లెవల్లో అఖిల్, సోహైల్ ఊయలపై కూర్చుని పాటలు పాడుకున్నారు, సరదాగా కొట్టుకున్నారు కూడా! ఈ టాస్క్కు సంచాలకుడిగా వ్యవహరించిన అభిజిత్ అఖిల్కు ఎండ కొడుతుంటే కాసేపు అతడికి నీడలా నిలబడ్డాడు. ఈ ఇద్దరినీ 48 గంటలు ఉయ్యాల మీద నుంచి దింపకండని అవినాష్ తన అక్కసు వెళ్లగక్కుతూ బిగ్బాస్ను అభ్యర్థించాడు. తర్వాత మోనాల్ను వెంటేసుకుని అవినాష్ బయటకు రావడాన్ని చూసిన అఖిల్.. అతడు మీ తమ్ముడా అని మోనాల్ను అడిగాడు. అందుకు హర్ట్ అయిన అవినాష్ నేను నీకు అన్నయ్యనా? అవినాష్నా? అని అడగ్గా మోనాల్ అవినాష్ అన్నయ్య అని టపీమని చెప్పేసింది. దీంతో తలెక్కడ పెట్టుకోవాలో తెలీక అవినాష్ కాసేపు అవమానంతో చచ్చిపోయాడు. వీరి రిలేషన్కు అఖిల్ "బ్రదర్ ఆఫ్ మోనాలి" అని టైటిల్ కూడా ఇచ్చేశాడు. (చదవండి: బిగ్బాస్: అవినాష్కు గడ్డు కాలం?) ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్బాస్ పోటీదారులను తిప్పలు పెట్టేందుకు బిగ్బాస్ పాలను పంపించాడు. అఖిల్కు పాలు తాగడం అలవాటు లేకపోయినా తప్పక తాగాడు. తర్వాత కూర్చున్నదగ్గరే పరదాలు చుట్టి వాష్రూమ్కు వెళ్లారు. రాత్రి బిగ్బాస్ తుపాకీ పేలుడు శబ్ధాలు చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. కానీ అఖిల్, సోహైల్ మాత్రం కూర్చున్నచోట నుంచి అంగుళం కూడా కదల్లేదు. వీరు భయపడటం లేదని తెలుసుకున్న బిగ్బాస్ ఈసారి కొట్టుకుని చావండంటూ ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాడు. ముల్లంగి రసాన్ని ఒకరికి ఒకరు చెంచాతో తాగించుకోమని చెప్పాడు. అయితే తాగించే సభ్యుడు తను ఉయ్యాల మీద ఉండటానికి ఎందుకు అర్హుడు? ఎదుటివాడు ఎందుకు అనర్హుడు? అన్న విషయాన్ని చెప్పాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ఇద్దరికీ చిన్నపాటి గొడవ జరిగింది. తర్వాత ఇదంతా కాదని చిన్నచిన్న కారణాలు చెప్తూ జ్యూస్ తాగించుకున్నారు. అక్కడే ఉన్న అరియానా మధ్యలో దూరి మీరు చెప్పే కారణాలు సరిగా లేవని విమర్శించింది. దీంతో ఇద్దరూ ఏకమై మాలో ఇద్దరం అర్హులమే, అందుకే చిన్నచిన్నవి అయినా లెక్కలోకి తీసుకుంటున్నామని క్లారిటీ ఇఇస్తూ ఆమె నోరు మూయించారు. (చదవండి: హారిక బెస్ట్ కెప్టెన్ కానే కాదు: నాగార్జున) హారిక మీద సీరియస్ అయిన అభి హారిక.. తనకు నాగ్ క్లాస్ పీకిన విషయాన్ని అభిజిత్ ముందు ఏకరువు పెట్టింది. ఒక కెప్టెన్గా మోనాల్తో డేట్కు వెళ్లాల్సిన టాస్క్ నీతో చేయించకపోవడం తప్పని నాగ్ సర్ చెప్పారని బాధపడింది. దీంతో అభిజిత్ కలగజేసుకుంటూ ఎన్నో రోజులుగా తన గుండెలో దాచుకున్న నిజాన్ని బయటకు వెల్లడించాడు. 'నేనంటే ఇష్టమని మోనాల్ స్వయంగా నాతో చెప్పింది. తర్వాత ప్రతిసారి ఆమె మనసులో ఒక A ఉందంటున్నారు కదా! ఆ A ఎవరు అని అడిగితే నేనే అంది. కానీ ఇది ఎప్పుడూ అందరి ముందు బయట పెట్టలేదు. అయినా సరే ఆమె నాకు స్టాండ్ తీసుకోలేదు, ఇంకా నామినేట్ చేసింది' అని తన బాధను బయటకు కక్కాడు. అయితే అతడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే.. హారిక తెలుగు తెలుగు అని పదే పదే గుర్తు చేసింది. దీంతో చిర్రెత్తిన అభి.. నువ్వు నాతో మాట్లాడాలంటే ఇంకో 5 సంవత్సరాలు ఎదగాలి అన్నాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు అని మండిపడ్డాడు. (బిగ్బాస్ : ఆ ఇద్దరికే నా సపోర్ట్.. నాగబాబు) అవినాష్ మీద అరియానా తిట్ల పురాణం ఇక టాస్క్ జరిగేటప్పుడు లైట్లు ఆర్పేయమని బిగ్బాస్ తేల్చి చెప్పడంతో కంటెస్టెంట్లు జాగరణ చేశారు. అఖిల్ అరియానాతో పులిహోర కలుపుతున్నాడని హారిక మోనాల్ చెవిలో ఊదింది. ఇదెప్పుడు జరిగిందని మోనాల్ అవాక్కైంది. అవినాష్ జోకులు పేల్చుతూ అరియానా మీద కూడా జోకేశాడు. దీంతో ఆమె వచ్చి అవినాష్కు నాలుగు తగిలించడమే కాక అతడి మీద కొత్త కొత్త బూతులను ప్రయోగించింది. ఇక తెల్లవారు కోడి కూసే వేళకు కూడా అఖిల్, సోహైల్ ఉయ్యాల మీదనే ఉన్నట్లు చూపించారు. సహనంతో కాలాన్ని నెట్టుకొచ్చిన ఈ ఇద్దరు రేపటి ఎపిసోడ్లో మాత్రం ఉయ్యాల మీద నుంచి కిందకు దిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం అఖిల్ గెలిచాడా? లేదా సోహైలా? అన్న విషయం రేపు తేలనుంది. (చదవండి: సిటీకి దూరంగా నోయల్) -
బిగ్బాస్, మామధ్య పెట్టింది చాలా?: అఖిల్
బిగ్బాస్ ఆడే ఆటలో కంటెస్టెంట్లు పావులు మాత్రమే. వీళ్లు బంధాలు, స్నేహాలు అంటూ ఒకరినొకరు ఎంత అల్లుకుపోయినా బిగ్బాస్ మాత్రం ఆ తీగ కత్తిరించి వారి మధ్య చిచ్చు పెట్టేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తాడు. ఒక్కోసారి అది బిగ్బాస్ ఆడే వింత నాటకం అని అర్థమైనా పరిస్థితికి బలవక తప్పదు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరిగింది. టికెట్ టు ఫినాలే రేసు ఆఖరి రౌండ్లో పోటీపడుతున్న అఖిల్, సోహైల్ మధ్య గొడవ జరుగుతోంది. ఎప్పటి విషయాలో తవ్వుతూ ఉన్న ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. నేను గట్స్ ఉన్న గేమ్ ఆడాను.. 'నువ్వు కెప్టెన్ అయినప్పుడు పెట్టిన టాస్క్లో నేను 100% ఇచ్చాను' అని అఖిల్ అనగానే అందరూ వంద శాతం కష్టపడ్డారని, కానీ చివరగా తాను కెప్టెన్ అయ్యానని సోహైల్ స్పష్టం చేశాడు. నేను ఆడిందే దమ్మున్న గేమ్ అంటూ ఇద్దరూ వాదులాడుకున్నారు. దీంతో గొడవ ఎక్కడికో పోతుందని అర్థమై అఖిల్ బిగ్బాస్కే కౌంటర్ వేశాడు. చాలా బిగ్బాస్, పెట్టింది చాలా? అని బిగ్బాస్ను దెప్పి పొడిచాడు. అక్కడేమో అభిజిత్ వీళ్ల పంచాయితీని చూస్తూ కూర్చుండిపోయాడు. అయితే ఎంత గొడవ పడ్డా కాసేపటివరకే అన్నది తెలిసిన విషయమే. ఇంతకంటే పెద్దగా ఫైటింగ్ జరిగినప్పుడు కూడా నిమిషాల్లో కలిసి పోయారు. కాబట్టి జనాలు ఈ గొడవను లైట్ తీసుకుంటున్నారు. ఈ వాగ్వాదం జరిగిన వెంటనే ఇద్దరూ ఓ హగ్గిచ్చుకుని కలిసిపోయుంటారు అని కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఇక నుంచి నామినేట్ చేయకండి: అభి) టికెట్ టు ఫినాలే విజేత అఖిల్! "టికెట్ టు ఫినాలే" రేసు విషయానికి వస్తే.. పాలు పితకడం అనే మొదటి రౌండులో కలిసి ఆడి అఖిల్-సోహైల్, అభిజిత్-హారిక జంటలు తర్వాతి లెవల్కు విజయం సాధించాయి. అవినాష్, మోనాల్, అరియానా ఓటమితో రేసు నుంచి తప్పుకున్నారు. రెండో లెవల్లో సొంతంగానే ఆడాలని బిగ్బాస్ స్పష్టం చేశాడు. ఈ పూలు పట్టుకునే ఈ రౌండ్లో అభి, హారిక పోటీ నుంచి నిష్క్రమించగా అఖిల్, సోహైల్ గెలిచారు. ఈ ఇద్దరూ ఇప్పుడు ఉయ్యాలలో కూర్చునే గేమ్ ఆడుతున్నారు. ఎవరు మొదట కాలు కిందపడితే వాళ్లు ఓడినట్లే లెక్క. ఇక లీకువీరులు చెప్తున్నదాని ప్రకారం అఖిల్ గెలిచి టాప్5లోకి మొదట చేరుకున్నాడు. (చదవండి: తన్నినందుకు సారీ చెప్పిన మోనాల్!) -
ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే అఖిలే విన్నర్!
బిగ్బాస్ నాల్గో సీజన్లో ఫిజికల్గా స్ట్రాంగ్ ఎవరు? అనగానే మొదట మెహబూబ్, అఖిల్ పేర్లే వినిపిస్తాయి. మెహబూబ్ ఎలాగో వెళ్లిపోయాడు కాబట్టి అఖిల్ గురించి చెప్పుకుందాం. అఖిల్.. టాస్క్ అనగానే తన శ్రమనంతా ధారపోసి ఎలాగైనా గెలవాలన్న కసితో ఆడతాడు. అలా చాలా టాస్కులను గెలిచాడు కూడా! కానీ ఇప్పుడు గెలవాల్సినవి టాస్కులు మాత్రమే కాదు, ప్రేక్షకులు మనసులు కూడా! చిన్నవాటికి ఎమోషనల్ అయ్యే అఖిల్ గోటితో పోయేవాటిని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నాడు. చిన్నచిన్న గొడవలను కూడా భూతద్దంలో చూస్తాడు. షో ముగింపుకు చేరుకుంటున్న ఈ సమయంలో ఇలాంటివన్నీ పక్కనపెడితేనే మంచిది. మనసు, మెదడును ప్రశాంతంగా ఉంచుకుంటూ గేమ్ ఆడగలిగితే అంతలా విజయానికి చేరువవుతాడు. ముఖ్యంగా అభిజిత్తో గొడవపడకపోతే మరీ మంచిది. లేదంటే అఖిల్ తీరని నష్టాన్ని చవిచూడక తప్పదు. సాధించాలన్న కసితో బిగ్బాస్కు.. ఈ సీజన్లో కొందరు బిగ్బాస్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చారు. మరికొందరు రెండుమూడు వారాలే ఉంటామంటూ ఏదో పిక్నిక్కు వచ్చినట్లు వచ్చి వెళ్లిపోయారు. అయితే అఖిల్ అలాంటి కోవకు చెందిన వ్యక్తి కాదు. తనేంటో నిరూపించుకుని, ఏదైనా సాధించాలన్న కసి, తపనతో బిగ్బాస్లో అడుగు పెట్టాడు. ఇకపోతే అతడు ఇతర భాషల్లోని బిగ్బాస్ సీజన్లను చూశాడని ఆమె తల్లే చెప్పింది. అందుకే కొన్నిసార్లు ఏది జరుగుతుంది? ఏది జరగదు అనేది ముందుగానే ఊహిస్తూ అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటాడు. అందుకు ఉదాహరణే సీక్రెట్ రూమ్. (చదవండి: సోహైల్, అరియానా టాప్ 2లో ఉండాలి: రాహుల్) లవ్ ట్రాక్ అటకెక్కించాడు ముందుగా అఖిల్ ప్రయాణం మొదటి నుంచి చూసినట్లైతే.. అతడు ప్రారంభంలో మోనాల్తో లవ్ట్రాక్ నడిపి లవర్బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ రానురానూ ఆమె వల్ల తన గేమ్ డిస్టర్బ్ అవుతోందని గ్రహించి మోనాల్ను పక్కనపెట్టాడు. పూర్తిగా గేమ్లో దిగాడు. ఎవరి సపోర్ట్ లేకుండానే గేమ్ ఆడాడు. అయితే ఎప్పుడైతే సీక్రెట్ రూమ్కు వెళ్లాడో అక్కడ అఖిల్ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైంది. హౌస్లో ఉన్న అందరూ వీక్, తనే స్ట్రాంగ్ అని ప్రగల్భాలు పగలడం చాలామందికి కోపం తెప్పించింది. పైగా హౌస్లోకి వెళ్లాక కూడా గొడవలు, వివాదాల్లో మునిగి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ టాస్కులు ఆడుతూ, ఎలాంటి గొడవలో దూరకుండా స్థిరంగా ఉంటున్నాడు. (చదవండి: నీ వల్ల చాలా హర్ట్ అవుతున్నా: అభి) ఫినాలేలో తొలుత అడుగు పెట్టిన రాహుల్ అయితే గత సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ కూడా సీక్రెట్ రూమ్లోకి వెళ్లాడు. తిరిగి హౌస్లోకి అడుగుపెట్టాక తన గేమ్ ప్లాన్నే మార్చి విజయానికి చేరువయ్యాడు. అంతే కాకుండా టికెట్ టు ఫినాలే సంపాదించి టాప్ 5లోకి మొదటగా అడుగు పెట్టాడు. ఆఖరికి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈ సీజన్లో అఖిల్ సీక్రెట్ రూమ్కి వెళ్లి వచ్చాడు. అలాగే టికెట్ టు ఫినాలే రేసులో అఖిలే గెలిచాడని సోషల్ మీడియా టముకేసి మరీ చెప్తోంది. అదే కనక నిజమైతే అఖిల్ కూడా రాహుల్ లాగే టాప్ 5కి చేరుకునే మొదటి కంటెస్టెంటుగా నిలిచిపోతాడు. సీక్రెట్ రూమ్, టికెట్ టు ఫినాలే సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఈసారి అఖిలే గెలుస్తాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి! (చదవండి: బిగ్బాస్: అఖిల్కు షాకిచ్చిన మోనాల్ తల్లి) -
బిగ్బాస్ ఫినాలే రేస్: అతడే విజేత!
నామినేషన్లు అనే అడ్డంకులే లేకుండా నేరుగా ఫినాలేలో అడుగుపెట్టాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే కంటెస్టెంట్లు బిగ్బాస్ ప్రవేశపెట్టిన టికెట్ టు ఫినాలే మెడల్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నారు. కానీ మెడల్ సాధించాలని అందరికీ ఉన్నా వశమయ్యేది మాత్రం ఒక్కరికే. ఈ క్రమంలో టికెట్ టు ఫినాలే మొదటి లెవల్లో అఖిల్, అభిజిత్, హారిక, సోహైల్ విజయం సాధించారు. వీరి మధ్య నేడు రెండో లెవల్ పోటీ జరగనుంది. నిన్న పాలు పితడకడం అనే టాస్క్ పెట్టిన బిగ్బాస్ నేడు పూలు విసరడం టాస్క్ పెట్టాడు. ఇందులో హారిక మగాళ్లతో ధీటుగా ఆడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. (చదవండి: బిగ్బాస్: అవినాష్ కొంప ముంచిన అతి తెలివి) కానీ సోహైల్ ఆమెకు పూలు అందకుండా లాగి పడేసినట్లు చూపించారు. దీంతో విసిగిపోయిన హారిక.. చేతుల్లోంచి లాక్కోవద్దంటారు, అక్కడ మట్టిలో పీకొద్దంటారు. ఇలాగైతే ఎట్లా గెలిచేది? బ్లడీ.. అంటూ ఏడ్చేసింది. దీంతో అవినాష్ వెళ్లి ఆమె కన్నీళ్లు తుడిచాడు. మరోవైపు అఖిల్-సోహైల్ నిన్న కలిసి ఆడినందుకు అవినాష్ అక్కసు వెళ్లగక్కాడు. వాళ్లు ఒంటరిగా ఆడి గెలవలేదన్నట్లు మాట్లాడాడు. దీంతో మండిపడ్డ సోహైల్ మేమేదో తప్పు చేసినట్లుగా మాట్లాడకు, మా తెలివితో ఆడాం అని వాదించినా ఆయన చెవికెక్కించుకోలేదు. ఇక సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్, సోహైల్ మూడో లెవల్కు అర్హత సాధించారు. అందులో అఖిల్ మెడల్ సొంతం చేసుకుని టాప్ 5లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నట్లు సమాచారం. (చదవండి: రికార్డు సృష్టిస్తోన్న మోనాల్, అంతా అభి వల్లే!) -
మోనాల్ నన్ను తన్నింది: అవినాష్ ఫైర్
బిగ్బాస్ ట్రోఫీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా తమ బుద్ధిబలానికి, శక్తిసామర్థ్యాలకు ఏకకాలంలో పని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో నామినేషన్స్ అనేవే లేకుండా నేరుగా ఫైనల్కు వెళ్లేందుకు బిగ్బాస్ ఫినాలే మెడల్ ప్రవేశపెట్టాడు. దీన్ని చేజిక్కించుకునేందుకు ఇంటి సభ్యులు ఒకరికొకరు ఏమాత్రం తక్కువ కాదనేలా ప్రాణం పెట్టి పోరాడారు. కానీ నలుగురు మాత్రమే లెవల్ 2కు అర్హత సాధించారు. మరి నేటి 87వ బిగ్బాస్ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. మోనాల్తో మనసు పెట్టి ఆడా: అఖిల్ నామినేషన్ షాక్ నుంచి తేరుకోలేని అఖిల్ ఫ్యామిలీ ఫొటో చూసుకుంటూ ఏడ్చేశాడు. తర్వాత మోనాల్ అతడికి సారీ చెప్పే ప్రయత్నం చేయగా నీతో మాట్లాడమే వద్దని దండం పెడుతూ తెగతెంపులు చేసుకున్నాడు. ఆమె మనసు పెట్టి ఆడుతుందట నేను మెదడుతో ఆడతానట. ఇంట్లో అందరితో బ్రెయిన్ గేమ్ ఆడాను కానీ ఆమె దగ్గర మాత్రం మనసు పెట్టి ఆడాను అని సోహైల్ దగ్గర వాపోయాడు. ఈమెతో మనసు పెట్టి ఆడినందుకు నేను హౌలాగాడినా అని సీరియస్ అయ్యాడు. తన స్నేహితులిద్దరూ గొడవపడతుండటం సోహైల్కు ఏమాత్రం నచ్చలేదు. మోనాల్ కోసం సపోర్ట్గా నిలబడ్డాడు. ఆమె వీక్ వీక్ అని పదేపదే చెప్పే అవినాష్, అరియానా దగ్గరకు వెళ్లి మోనాల్ ఆడుతోందని నచ్చ జెప్పాడు. తన్నింది నువ్వంటే నువ్వు... అనంతరం 'రేస్ టు ఫినాలే'లో మొదటి లెవల్ ప్రారంభమైంది. ఇందులో ఎవరైతే ఎక్కువ పాల బాటిళ్లు నింపుతారో వారు తర్వాతి లెవల్కు అర్హత సాధిస్తారు. ఈ లెవల్లో గెలిచేందుకు ఎలాంటి పనులు చేస్తారనేది ఇంటిసభ్యుల ఇష్టానికే వదిలేశాడు. మొదటగా ఆవు అంబా అనగానే కంటెస్టెంట్లు పరుగెత్తుకుంటూ వెళ్లి పాలు పట్టుకున్నారు. ఈ గేమ్లో ఏమైనా చేసుకోవచ్చని ఏకంగా బిగ్బాసే చెప్పాడు కాబట్టి సోహైల్, అఖిల్ కలిసి ఆడుతూ మిగతావాళ్లకు పాలు దక్కకుండా చేశారు. ఇందులోనూ అఖిలే ఎక్కువ కష్టపడ్డట్లు కనిపించింది. ఇంతలో మోనాల్ తన్నిందని అవినాష్ గొడవ పడ్డాడు. నువ్వు కూడా నన్ను తన్నావంటూ సోహైల్ కాలి దెబ్బను చూపించాడు. (చదవండి: నాకొద్దు, ఎలిమినేట్ చేయండి: అవినాష్) సాయం అడిగిన అరియానాపై చికాకు అందరూ కలిసి తనకు దక్కకుండా పాలు పట్టుకుంటున్నారని అవినాష్ అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగతంగా కాకుండా టీమ్గా ఏర్పడి ఆడుతున్నారని అసహనంతో ఊగిపోయాడు. ఇంతలో అరియానా అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు కదా, నాకు చెయ్యవా అని నోరు తెరిచి అడగ్గా అతడు శివాలెత్తిపోయాడు. నా గేమ్ ఆడటానికి వచ్చా, సపోర్ట్ చేయడానికి రాలేదు అని కుండ బద్ధలు కొట్టి చెప్పడంతో ఆమె ముఖం మాడిపోయింది. అంతలోనే మళ్లీ తాను ఆడనని, ఎలిమినేట్ చేసి పారదొబ్బండి అంటూ హౌస్ లోపలకు వెళ్లి ఏడ్చేశాడు. దిక్కులు చూస్తూ ఎవరూ తనను చూడటం లేదని నిర్దారించుకున్నాక కిచెన్లోని పాలు, నీళ్లన్నింటినీ క్యాన్లో నింపుకోవడం ప్రారంభించాడు. అవినాష్ చర్యతో అసలుకే ఎసరు కానీ అతడి అతితెలివి నీళ్లపాలైంది. ఇంట్లోని పాలు, నీళ్లు నింపుకున్న కారణంగా అవినాష్ రేసు నుంచి అవుట్ అయినట్లు బిగ్బాస్ వెల్లడించాడు. తను రేసు నుంచి నిష్క్రమించడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. రేస్ టు ఫినాలే ఇలా పెడతారా? అని బిగ్బాస్ మీద అసహనం వ్యక్తం చేశాడు. తర్వాతి రౌండ్లో హారిక మొదట తనదగ్గర 14 బాటిళ్లు ఉన్నాయని చెప్పిందని, కానీ బిగ్బాస్కు మాత్రం 11 అని చెప్పడంతో అఖిల్కు అనుమానం వచ్చింది. బహుశా మిగతావి అభికి ఇచ్చి ఉండటమో లేదా లెక్క తప్పుగా చెప్పడమో జరిగి ఉంటుంది. (చదవండి: బిగ్బాస్: అభికి షాకుల మీద షాకులు) ఫినాలేలో బెర్త్ కోసం ఏడ్చేసిన అరియానా ఈ రౌండ్లో అరియానా అవుట్ అవడంతో ఆమె గుక్కపెట్టి ఏడ్చింది. ఫినాలేలో ఉంటానో ఉండనో అని భయమేస్తుందంటూ అవినాష్ను హత్తుకుని బాధపడింది. మూడో రౌండ్లో తక్కువ బాటిళ్లు నింపిన కారణంగా మోనాల్ నిష్క్రమించింది. దీంతో అఖిల్, సోహైల్, అభిజిత్, హారిక రెండో లెవల్కు అర్హత సాధించారు. మరి వీరిలో ఎవరు ఫినాలే మెడల్ సొంతం చేసుకుంటారో చూడాలి. (చదవండి: ట్రయాంగిల్ స్టోరీపై లాస్య స్పందన) -
ఫినాలే రేస్: ఒంటరిగా ఆడటం చేతకాదా?
పంతొమ్మిది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్బాస్ ప్రయాణం ఇప్పుడు ఏడుగురి దగ్గర ఉంది. వీరిలో ఒకరికి నేరుగా ఫినాలేలో పాగా వేసేందుకు బిగ్బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఎవరి ఎక్కువ పాలు సేకరిస్తే వారికి టికెట్ ఇచ్చేస్తానని చెప్పాడు. ఆ టికెట్ దక్కించుకునేందుకు ఇంటిసభ్యులు నువ్వానేనా అన్న రీతిలో పోరాడుతున్నారు. ఇదేమీ లగ్జరీ బడ్జెట్ టాస్క్ కాదు, ఏదైనా యాడ్ ప్రమోషన్స్ కోసం ఇచ్చిన టాస్క్ అంతకన్నా కాదు. ఎవరికి వారు సొంతంగా ఆడాల్సిన అత్యంత కీలకమైన గేమ్. కానీ దీన్ని కూడా కొందరు కలిసి ఆడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో అభిజిత్ ఇదే సందేహాన్ని లేవనెత్తాడు. అఖిల్ సోహైల్ కలిసి ఆడుతున్నారా? అని ప్రశ్నించాడు. దానికి అఖిల్ తెలివిగా సమాధానమిస్తూ.. 'నీకు ఓ కప్పిచ్చాను.. ఫస్ట్ నువ్వు పట్టుకో, తర్వాత నేను పట్టుకుంటా అని చెప్పాను. అది కూడా కలిసి ఆడటమేనా? అని అడుగుతూనే ఇది కలిసి ఆడటం కాదు కదా, అలాగే సోహైల్కు ఏదో కావాలంటే ఇస్తున్నా' అని జవాబిచ్చాడు. అతని సమాధానం విని అభి షాకయ్యాడు. (చదవండి: దండం పెడతా, గేమ్ ఆడండి: నాగార్జున) ఇకపోతే అఖిల్, సోహైల్ మిగతావారికి పాలు దక్కించుకునేందుకు ఏమాత్రం సందివ్వట్లేదు. దీంతో అరియానా ఫైర్ అవుతూ మొత్తం మీరే పట్టేసుకుంటూ మిగతావారికి ఏం లాభం? అని సీరియస్ అయింది. అటు హారిక తనకు అదృష్టం కలిసొస్తుందేమోనని నోయల్ టీషర్ట్నే ధరించింది. చివరిసారి ఈ టీ షర్ట్ ధరించినప్పుడే ఆమె కెప్టెన్ అయింది. ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు ఫినాలే టికెట్ ఇచ్చేందుకు మరీ ఇలాంటి టాస్క్ ఇస్తారా? అని విమర్శిస్తున్నారు. అభిజిత్కు సపోర్ట్ చేసినందుకు హారికను ఫేవరెటిజమ్ చూపిస్తుందన్నారు. మరి అఖిల్, సోహైల్ చేస్తున్నదేంటని నిలదీస్తున్నారు. వీళ్లకు ఇక్కడ కూడా ఒంటరిగా ఆడటం చేతకాదని విమర్శిస్తున్నారు? రెండో సీజన్లో కౌశల్కు వ్యతిరేకంగా తనీష్, సామ్రాట్ కలిసి ఆడితే చివరికి ఏమైందో ఓసారి గుర్తు చేసుకొమ్మని మరికొందరు సెటైర్లు విసురుతున్నారు. మొత్తానికి ఈ రేసు నుంచి అవినాష్, మోనాల్, అరియానా అవుట్ అవగా మిగిలిన నలుగురు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. -
బిగ్బాస్: ఊహించని ట్విస్టులతో అభిజిత్ కంట నీరు
ఈసారి బిగ్బాస్ ఇంటిసభ్యులకు కావాల్సినన్ని గొడవలు పెట్టుకునేందుకు బంపరాఫర్ ఇచ్చాడు. ఇద్దరి కన్నా ఎక్కువ మందిని కూడా నామినేట్ చేసుకోవచ్చని తెలిపాడు. ఇద్దరిని నామినేట్ చేయడానికే కిందామీద పడుతున్న కంటెస్టెంట్లు ఈ ఆప్షన్ వాడదల్చుకోలేదు. కానీ మోనాల్, అరియానా మాత్రం ఈ అవకాశాన్ని చేజార్చుకోదల్చుకోలేదు. అయితే అరియానా వేరేవాళ్లతో మామూలుగా మాట్లాడి, మోనాల్తో మాత్రం గొంతు పెంచి డిమాండ్ చేసినట్లు మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వింది. మరోవైపు అవినాష్ గత ఎలిమినేషన్ నుంచి ఇప్పటికీ బయటకు రావడం లేదు. తనకన్నా వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు అని మోనాల్నుద్దేశిస్తూ పదేపదే దెప్పి పొడిచాడు. ఫలితంగా మరోసారి నామినేషన్లో వచ్చిపడ్డాడు. అటు హారిక, అభి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నా.. అర్థం చేసుకుని మళ్లీ కలిసిపోయారు. కానీ అఖిల్, మోనాల్ మాత్రం భగ్గుమంటూ ఎదురు పడటానికి కూడా ఇష్టపడలేదు. అభిని నామినేట్ చేసి ఏడ్చేసిన హారిక బిగ్బాస్ హౌస్లో 13 వారానికిగానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఏడుగురు కంటెస్టెంట్ల ముందు కంటైనర్స్ ఉంటాయి. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కంటెస్టెంట్ల కంటైనర్లలో కలర్ నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఎవరి గిన్నెలో ఎక్కువ రంగు నీళ్లు ఉంటే వాళ్లు నామినేట్ అయినట్లు లెక్క. మొదటగా హారిక నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టింది. నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి నేను కారణం అయినప్పటికీ, నాకు ప్రాధాన్యత ఇవ్వలేదనిపించిందని అవినాష్ను నామినేట్ చేసింది. నీకు విలువిచ్చాను. కాకపోతే నాకంటే వీక్ ఉన్నవాళ్లు నామినేషన్లో ఉన్నప్పుడు నేనెలా ఎలిమినేట్ అవుతాను అన్న సందేహమే నన్ను వేధిస్తోంది అని అవినాష్ స్పష్టం చేశాడు. అనంతరం టాస్కు ఆడటానికి నిరాకరించినందుకుగానూ అభిజిత్ను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించగానే అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. కన్ఫెషన్ రూమ్లో జరిగినదానికి అభిని నామినేట్ చేయలేదని అంతకుముందే ఇది అనుకున్నానని హారిక కెమెరాల ముందు చెప్పుకుంటూ ఏడ్చింది. నీకు ఓవర్ కాన్ఫిడెంట్.. తర్వాత అవినాష్.. మోనాల్ను వీక్ అంటూ నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా మోనాల్ మాట్లాడుతూ నేను వీక్ కాదని జనాలు నిరూపించారు, అది మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది. దీంతో అవినాష్ అందుకుంటూ.. ఆమె వీక్ కాదని నిరూపించారట. 'అంటే నేను వీక్ కదా! ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్లే సేవ్ అయ్యాను కదా. అందుకే ముఖం చూపించుకోలేకపోతున్నా..' అని అవినాష్ ఓవర్ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత తనను వరస్ట్ కెప్టెన్ అని చెప్పినందుకు అఖిల్ను నామినేట్ చేశాడు. అనంతరం అఖిల్.. నీకు ఓవర్ కాన్ఫిడెంట్ ఉందంటూ అవినాష్ను, గేమ్లో ఎఫర్ట్స్ తక్కువగా ఉన్నాయని మోనాల్ను నామినేట్ చేశాడు. (చదవండి: హారికను పెళ్లి చేసుకుంటా: అవినాష్) నాకోసం స్టాండ్ తీసుకోవాల్సింది: అభి అనంతరం అభిజిత్.. 'మొదటి రోజు నుంచీ నీవల్ల నేను ఎమోషనల్గా హర్ట్ అవుతున్నా. ఇది నీ తప్పు అనట్లేదు. కానీ నీకు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా కూడా నీ విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. నువ్వు కావాలని చేస్తున్నావో, దేనికి చేస్తున్నావో తెలీదు కానీ ఎక్కడో ఓసారి నాకోసం నువ్వు స్టాండ్ తీసుకుంటే బాగుండేదనిపించింద'ని మోనాల్ను నామినేట్ చేశాడు. 'టాస్కు చేయకపోవడం నాకు తప్పు. కానీ ఎందుకు చేయలేదనే విషయం నీకు బాగా తెలుసు. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎవరూ అర్థం చేసుకోలేరు' అంటూ హారిక కంటైనర్లో అతి తక్కువ రంగు నీళ్లు పోసి నామినేట్ చేశాడు. (చదవండి: రంగంలోకి ‘ఆర్జీవీ’, వణికిపోయిన హౌస్మేట్స్) ఆ ఇద్దరినీ తొలిసారి నామినేట్ చేసిన మోనాల్ తర్వాత వచ్చిన మోనాల్ తనను చులకనగా చూస్తున్న కంటెస్టెంట్లకు గట్టి కౌంటర్లు ఇచ్చింది. ముందుగా అవినాష్ను నామినేట్ చేస్తూ ఇక్కడున్న అందరూ స్ట్రాంగే అని నొక్కి చెప్పింది. నామినేషన్కు భయపడటమే మీ వీక్నెస్ అని చెప్పింది. తర్వాత టాస్క్ ఆడనందున అభిని నామినేట్ చేస్తూ.. మీరు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా మీకు దూరంగానే ఉంటున్నాను అని క్లారిటీ ఇచ్చింది. అలాగే తన క్లోజ్ ఫ్రెండ్ అఖిల్ను సైతం నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది, నువ్వు బ్రెయిన్తో గేమ్ ఆడితే, నేను మనసుతో ఆడతానని మోనాల్ తెలిపింది. నన్ను నామినేట్ చేయనని మాటిచ్చావు, కానీ చేస్తున్నావు అని అఖిల్ సీరియస్ అవగా నువ్వే కదా గేమ్ ఆడమన్నావు అంటూ ఆమె బదులిచ్చింది. అయినా సరే ఆమె మాటలను వినిపించుకోని అఖిల్.. నువ్వు ప్రతిరోజు నా కళ్లు తెరిపిస్తున్నావు అని మనసులోని బాధను కక్కేశాడు. ఇక హౌస్లోకి వెళ్లి మోనాల్ ఏడ్చేసింది. మొదటి మూడు వారాలు ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, పదే పదే నన్ను వీక్ అంటున్నారని హారికతో తన గోడు వెల్లబోసుకుంది. ముగ్గురిని నామినేట్ చేసిన అరియానా అరియానా.. తనను వరస్ట్ కెప్టెన్ అన్నందుకు హారిక, అవినాష్, సోహైల్ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో అరియానా.. మోనాల్ను డిమాండ్ చేస్తూ మాట్లాడింది. మధ్యలో అందుకుని అవినాష్ తెలుగులో మాట్లాడు అని చెప్పగా మధ్యలో మాట్లాడకు అని మోనాల్ హెచ్చరించింది. సోహైల్.. అవినాష్ను నామినేట్ చేస్తూ మోనాల్ కూడా స్ట్రాంగ్ అయిందని, ఆమెను వీక్ అనొద్దని అభ్యర్థించాడు. మోనాల్ కన్నీళ్లు తుడిచాడు. ఈవారం అభిజిత్, అవినాష్, మోనాల్, అఖిల్, హారిక నామినేట్ అయ్యారు. (చదవండి: బిగ్బాస్ : తొలిసారి అభిజిత్ భావోద్వేగం) -
బిగ్బాస్: అభిని నామినేట్ చేసిన హారిక
బిగ్బాస్ నాల్గో సీజన్ గ్రాండ్ ఫినాలేకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో కంటెస్టెంట్లు పోటీని తట్టుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా నామినేషన్ అనే సంద్రాన్ని ఈదాల్సి ఉంటుంది. ఈ రోజు ఆ సమయం రానే వచ్చింది. పదమూడో వారానికిగా గానూ నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో జంట పక్షులు విడిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటి నుంచి తన గేమ్ ఆడతానని చెప్పిన మోనాల్ అన్నంతపనే చేసింది. కానీ మొదటి నుంచి ఆమెకు నీడలా తోడున్న అఖిల్ను నామినేట్ చేసి అందరికీ షాకిచ్చింది. కలలో కూడా ఊహించని ఈ పరిణామానికి అఖిల్ ఆగ్రహానికి లోనయ్యాడు. నీకోసం ఎంతో కొట్లాడాను,.. చివరికి ప్రేక్షకుల దగ్గర నన్ను బ్యాడ్ చేయాలనుకుంటున్నావు, అంతే కదా! అని మండిపడ్డాడు. (చదవండి: బిగ్బాస్: నాగ్పై అభిజిత్ ఫ్యాన్స్ ఫైర్) ఓవర్ కాన్ఫిడెన్స్ నీకే ఎక్కువ అటు అవినాష్, అఖిల్ కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అవినాష్ నాకన్నా వీక్ ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. నేనెందుకు ఎలిమినేట్ అవ్వాలని ఫ్రస్టేట్ అయ్యాడు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అఖిల్ అభిప్రాయపడ్డాడు. మరి అఖిలే నెంబర్ 1 అని నువ్వు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా? అని అవినాష్ ఎదురు ప్రశ్నించాడు. అసలు మొదటి నుంచి అరియానాకు, మోనాల్కు పడదన్న విషయం ఈ నామినేషన్తో మరోసారి బయటపడింది. ఈ ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకుంటుండగా తెలుగులో మాట్లాడమని అవినాష్ సలహా ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన మోనాల్ మధ్యలోకి రావద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: బిగ్బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం ) నువ్వు కూడా అర్థం చేసుకోలేదా.. అన్నింటికీ మించి ప్రోమోలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన అంశం హారిక అభిజిత్ను నామినేట్ చేయడం! ఫేవరెటిజమ్ చూపించకుండా సొంతంగా గేమ్ ఆడంటూ నాగార్జున ఆమెకు క్లాస్ పీకిన విషయం తెలిసిందే కదా! దీంతో గతవారంలో టాస్క్ ఆడని తన క్లోజ్ ఫ్రెండ్ అభిని ఆమె నామినేట్ చేస్తున్నట్లుగా ప్రోమోలో చూపించారు. అయితే మనసు వద్దని చెప్తున్నా తప్పని పరిస్థితుల్లో ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని హారిక ముఖం చూస్తే అర్థమవుతుంది. కానీ దీనివల్ల అభి మనసు నొచ్చుకుంది. నువ్వు అర్థం చేసుకోకపోతే.. ఇక్కడ ఇంకెవరూ అర్థం చేసుకోలేరు అని బాధపడ్డాడు. ఏదేమైనా బిగ్బాస్ విజయవంతంగా రెండు జంటలను విడగొట్టినట్లు సులువుగా స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ వారం అభిజిత్, అఖిల్, మోనాల్, అవినాష్, హారిక నామినేషన్లో ఉన్నట్లు సమాచారం. టామ్ అండ్ జెర్రీ సోహైల్, అరియానా మాత్రం నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. -
నేను ఎలిమినేట్ అయ్యాను: అవినాష్ భావోద్వేగం
బిగ్బాస్ నాల్గో సీజన్ పన్నెండో వారాంతంలో స్పెషల్ గెస్ట్గా వచ్చిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తన మాటల గారడీతో ఆకట్టుకున్నారు. నవ్విస్తూ, పంచ్లు వేస్తూ, కలిసిపోతూ కాసేపటివరకు హోస్ట్గా అందరినీ మైమరిపించారు. మరోవైపు నిన్న నాగ్ చేతులెత్తి వేడుకోవడాన్ని చూసి బాధపడ్డ కంటెస్టెంట్లు ఆయన్ను సంతోషరిచేందుకు డ్యాన్స్లతో హోరెత్తించారు. నాగ్తో తిట్టించుకున్న అభి తన స్టెప్పులతో మెప్పు పొందాడు. ఇక ప్రేక్షకులు తక్కువ ఓట్లతో అవినాష్ను ఫెయిల్ చేసినా బిగ్బాస్ ఇచ్చిన పాస్తో అవినాష్ ఎలిమినేషన్ నుంచి గట్టెక్కాడు. మరి వినోదాల మేళవింపుగా మారిన నేటి బిగ్బాస్ ఎపిసోడ్ ఎలా కొనసాగిందో చదివేయండి.. గుండె ఆగిపోతుందని ఏడ్చేసిన అరియానా నాగార్జున కోపాన్ని చల్లార్చేందుకు ఇంటి సభ్యులు నాగ్ సాంగ్స్కు చిందేస్తూ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో అవినాష్ -అరియానా, అభిజిత్ -మోనాల్, సోహైల్ -హారిక జంటలుగా కలిసి డ్యాన్స్ చేశారు. వీరి మాస్ డ్యాన్స్ చూసి నాగ్ సైతం సంతోషించారు. తర్వాత నాగ్ 'చీకటిలో ధైర్యం స్థైర్యం' టాస్క్తో మరోసారి కంటెస్టెంట్లను భయపెట్టించే ప్రయత్నం చేశారు. మొదటగా అరియానా దెయ్యం గదిలోకి వెళ్లడానికి వెళ్లడానికి నిరాకరించింది. నన్ను ఒదిలేయండి, నా గుండె ఆగిపోతుంది అని ఏడ్చేయడంతో ఆమెను పక్కన పెట్టేశారు. తర్వాత సోహైల్.. లోపలకు వెళ్లగా భయపడుతూనే ఒక్కో అడుగు ముందుకు వేశాడు. గజ్జెల శబ్ధం వినపడేసరికి గజగజ వణికిపోయాడు. అఖిల్ భయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. (చదవండి: బిగ్బాస్ : తొలిసారి అభిజిత్ భావోద్వేగం) లోపల భయపడ్డాను: అభిజిత్ అభిజిత్ అయితే ఈలలు వేసుకుంటూ మరీ వెళ్లాడు కానీ లోపల కొంచెం భయంగా ఉండేనని అసలు విషయం చెప్పాడు. ఇక అవినాష్ దెయ్యం అరుపులకు దడుసుకుంటూనే రూమ్ అంతా కలియతిరిగాడు. లోనికి వెళ్లిన హారిక, మోనాల్ ఏమాత్రం అదరలేదు, బెదరలేదు. మొన్నటి దెయ్యం టాస్కులో సోహైల్, అఖిల్ భయమంటే ఏంటో తెలీదంటూ బయటకు ఫోజులు కొట్టినప్పటికీ చీకటి గదిలోకి వెళ్లాక చిన్నపిల్లల్లా దడుసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అంతటినీ నాగ్ కంటెస్టెంట్లకు చూపించి వారి పరువు తీశారు. తర్వాత అరియానా ధైర్యం తెచ్చుకుని ఒంటరిగా చీకటి గదిలోకి వెళ్లి రాగా, భయాన్ని జయించానని సంబరపడిపోయింది. (చదవండి: నీతో రిలేషనే వద్దు: తేల్చేసిన అఖిల్) కంటెస్టెంట్ల ఆట కట్టించిన కిచ్చా సుదీప్ తర్వాత కన్నడ బిగ్బాస్ ఏడు సీజన్లను వరుసగా హోస్ట్ చేస్తున్న కిచ్చా సుదీప్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. వస్తూనే ఈ కంటెస్టెంట్ల వల్ల చాలా అలిసిపోయాను అని నాగ్ సర్ వెళ్లిపోయారు అని చెప్పారు. కానీ వాళ్లు నమ్మకపోవడంతో, నాగ్ ఎందుకు వెనక్కు రావాలో సరైన కారణాలు చెప్తే లోనికి రానిస్తానన్నారు. దీంతో ఒక్కొక్కరు నాగ్ గురించి చెప్పడం మొదలు పెడుతూ ఉండగా వారందరికీ సుదీప్ కౌంటర్లు ఇస్తూ వచ్చారు. నాగ్ సర్ మా మీద కేరింగ్తో స్వెటర్లు, డ్రైఫూట్లు, డ్రెస్సులు తీసుకువచ్చారు అని అరియానా చెప్పగా ఒకవేళ నేను స్వెటర్ ఇస్తే నేనూ ఇక్కడే ఉండొచ్చా అని పంచ్ వేశారు. కంటెస్టెంట్లపై కౌంటర్ల పర్వం ముగిసిన తర్వాత నాగ్ స్టేజీ మీదకు విచ్చేశారు. (చదవండి: ట్రోలింగ్: అప్పుడు నాని, ఇప్పుడు నాగార్జున) గెలుపు కన్నా విధేయతే ముఖ్యం: హారిక ఇక సుదీప్.. అవినాష్ను ఇరకాటంలో పడేసే చిలిపి ప్రశ్న అడిగారు. ఎవరితో డేట్ చేస్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు? అని ప్రశ్నించారు. మోనాల్తో డేట్, హారికతో పెళ్లి, కానీ అరియానాను మాత్రం చంపుతానని చెప్పారు. హారికను నీకు విధేయతా ముఖ్యమా? గెలుపు ముఖ్యమా? అన్న ప్రశ్నకు ఆమె విధేయతే ముఖ్యమని సమాధానమిచ్చింది. అభిజిత్కు హారిక షార్ట్ హెయిర్తో ఉంటే ఇష్టమా? పొడువు జుట్టుతో ఉంటే ఇష్టమా? అన్న ప్రశ్నకు చిన్న జుట్టు ఉంటేనే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. అరియానాను ఒక్కరోజు నువ్వు అవినాష్లా నిద్రలేస్తే చేసే మొదటి పని ఏంటి? అని అడగ్గా తానసలు నిద్రలో నుంచే లేచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సోహైల్కు మటన్ లేదా చికెన్లో ఏది ఎక్కువ ఇష్టమంటే మటన్ అని జవాబిచ్చాడు. (చదవండి: అభిజిత్కే ఓటేస్తా: జబర్దస్త్ కమెడియన్) అఖిల్ను సేఫ్ చేసిన సుదీప్ తర్వాత సుదీప్ మోనాల్ను పిలవబోయి అఖిల్ను పిలిచారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరిని అడిగినా ఒకటేలే అని నాగ్ ఇద్దరికీ ముడి పెట్టేశారు. తర్వాత.. నీకు ఇంట్లో ఒక హౌస్మేట్ను మాయం చేయగల శక్తి ఉంటే ఎవరిని చేస్తావన్న ప్రశ్నకు అఖిల్.. మోనాల్ పేరు చెప్పాడు. ఒకవేళ నీగురించి నువ్వు ఏదైనా పుకారు మొదలుపెట్టాలనుకుంటే అది ఏంటి? అన్న ప్రశ విసిరగా దానికి మోనాల్.. నేను ఏడవను అని చాటింపు చేస్తానని చెప్పింది. గుజరాతీ అయినా తెలుగు బాగా మాట్లాడుతున్నందుకు సుదీప్ ఆమెను మెచ్చుకున్నారు. పనిలో పనిగా నాగ్ను చూస్తూ ఒక డైలాగ్ చెప్పమన్నారు. దీంతో ఆమె నువ్వు నాకు చాలా ఇష్టం అని నాగ్తో చెప్పి సిగ్గుల మొగ్గయింది. కానీ అది ఇద్దరికీ చెప్పినట్లు అనిపించింది. తర్వాత సుదీప్.. అఖిల్ సేఫ్ అయినట్లు వెల్లడించారు. అనంతరం తెలుగు బిగ్బాస్ షోకు వీడ్కోలు తీసుకుంటూ తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా గీతాంజలి అని చెప్పారు. ప్రేక్షకులు నన్ను ఎలిమినేట్ చేశారు చివరగా అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడటంతో అతడు ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు. అయితే ప్రేక్షకుల దృష్టిలో మాత్రం తాను ఎలిమినేట్ అయ్యానని అవినాష్ బాధపడ్డాడు. ఇప్పుడు నేను ముందుకెళ్లాలా? ఆగిపోవాలా? అనేది అర్థం కావట్లేదన్నారు. దీంతో నాగార్జున అతడికి ధైర్యం చెప్పారు. బిగ్బాస్కు రాకముందు ఉన్న అవినాష్ వేరు, హౌస్లోకి వచ్చాక అవినాష్ వేరని అతడిని ఆకాశానికెత్తారు. నీ దగ్గర పాస్ ఉందనే ఓట్లు వేయలేదు అనుకోవచ్చు కదా అని పాజిటివిటీని నూరి పోశారు. కానీ కొత్తగా ఇలాంటి మాటలతో సింపథీ మాత్రం మొదలు పెట్టొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. అందరూ ఎవరి ఆట వారే ఆడండని మరోసారి స్పష్టం చేశారు. (చదవండి: కెప్టెన్గా విఫలమైన హారిక!) -
బిగ్బాస్: ఆ ఇద్దరి పరువు తీసిన నాగ్
బిగ్బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్ వాడివేడిగా జరిగింది. నాగార్జున పెట్టిన చీవాట్లతో హారిక, అభిజిత్ ముఖం మాడిపోయింది. ఎప్పుడూ సరదాగా ఉండే హోస్ట్ ఇలా తప్పులను ఎత్తి చూపుతూ విరుచుకుపడుతుండటంతో మిగతా కంటెస్టెంట్లు కూడా బెదిరిపోయారు. అందుకే మీరు చేసిన తప్పులు చెప్పండి అంటే సోహైల్ తను చేసిన తప్పుతో పాటు ఓ అబద్ధం కూడా చెప్పానని చెప్పాడు. దెయ్యం టాస్కులో గదిలోకి వెళ్లిన తాను, అఖిల్ గజగజ వణికిపోయామని గుట్టు విప్పాడు. మొత్తానికి ఈ సీజన్లో దెయ్యం టాస్కు జనాలను నవ్వించడమే కాక కంటెస్టెంట్ల కోపతాపాలు కూడా కాసేపు మర్చిపోయేలా చేసింది. అయితే ఈ టాస్కులో దెయ్యానికే ముచ్చెమటలు పట్టిస్తామని బీరాలు పలికిన అఖిల్, సోహైల్ హారర్ ఎఫెక్ట్స్కు చిన్నపిల్లల్లా భయపడి అరిచి ఏడిచిన వీడియోను అందరికీ చూపించి పరువు తీశారు. (చదవండి: బిగ్బాస్: నాగ్పై అభిజిత్ ఫ్యాన్స్ ఫైర్) అలాగే నేటి బిగ్బాస్ ఎపిసోడ్లో మరోసారి దెయ్యం సెట్టింగు రెడీ చేశారు నాగ్. ఈసారి జంటలుగా కాకుండా కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా లోనికి పంపించారు. ఈ క్రమంలో కొందరు భయపడుతూనే లోనికి అడుగు పెట్టగా మరికొందరు భయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి జలజ దెయ్యం ఇంటి సభ్యులందరినీ మరోసారి ఆడేసుకుంది. ఇక ప్రోమో చివర్లో అరియానా, అవినాష్ ఇద్దరే ఎలిమినేషన్లో మిగిలినట్లు చూపించారు. అంటే అఖిల్, మోనాల్ సేఫ్ అయ్యారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాగో అవినాష్ ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకుని ఈ వారం ఎలిమినేషన్ నుంచి గట్టెక్కాడని వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఈ వారం ఎలిమినేషన్ లేనట్లే కనిపిస్తోంది. (చదవండి: కాళ్లు పట్టుకుంటే బాగోదు, ప్లీజ్..: అవినాష్) -
బిగ్బాస్ ఫిట్టింగ్.. అఖిల్, అభి మధ్య మళ్లీ లొల్లి
బిగ్బాస్ నాల్గో సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఈ బిగ్ రియాల్టీ షోకి శుభం కార్డు పడటానికి మరో 23 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్ మరింత రసవత్తంగా మార్చేందకు బిగ్బాస్ నిర్వాహకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొత్త కొత్త టాస్క్లు, ఊహించని ట్విస్ట్లు ఇస్తూ ప్రతి ఎపిసోడ్ని ఆసక్తికరంగా మార్చుతున్నారు. ఇక ఇంటి సభ్యులు కూడా గేమ్లో లీనమైపోయారు. విన్నర్ అవ్వాలని ప్రతి ఒక్కరు వందశాతం ఫర్మార్మెన్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్బాస్ హౌస్లో‘ రేస్ టు ఫినాలే’ బెల్స్ మోగాయి. దీంతో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాట యుద్ధం మొదలైంది. ముఖ్యంగా అభిజిత్, అఖిల్ల మధ్య లొల్లి మరోసారి తారాస్థాయికి వెళ్లినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. తాజా ప్రోమో ప్రకారం రేస్ టు ఫినాలే మొదలైందని చెప్పిన బిగ్బాస్... హౌస్లో ఉన్న మాజీ కెప్టెన్స్లో ఒక బెస్ట్ కెప్టెన్ ఒక వరస్ట్ కెప్టెన్ ఎన్నుకోవాలని ఆదేశించారు. ఇకేముంది బిగ్బాస్ పెట్టిన ఫిట్టింగ్కి ఇంట్లో మాటల యుద్దమే మొదలైంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న సభ్యుల్లో మోనాల్ తప్ప మిగిలిన ఆరుగురు కెప్టెన్ అయినవాళ్లే. అయితే వీళ్లలో నేను బెస్ట్ అంటే నేను బెస్ట్ అంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సొహైల్ ఒక అడుగు ముందుకేసి.. నాకైతే అరియానా వరస్ట్ కెప్టెన్ అనిపిస్తుందని ముఖం మీదనే చెప్పేశాడు. దానికి కారణం చెబుతూ.. ఆమె కెప్టెన్సీలో చాలా టార్చర్ అనుభవించానని చెప్పుకొచ్చాడు. అయితే తన కెప్టెన్సీ దగ్గరనుంచి హౌస్లో మార్పు అనేది వచ్చిందని.. ఎవరి స్పేస్ వాళ్లకి ఇచ్చానని అరియానా తన కెప్టెన్సీని సమర్థించుకుంది. (చదవండి : బిగ్బాస్ : ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్!) సొహైల్ గాడు సొంతంగా ఆడి కెప్టెన్ అయ్యాడు.. పనిష్మెంట్ స్టార్ట్ చేసింది సొహైల్ మాత్రమే అంటూ తన గురించి తానే గప్పాలు కొట్టుకున్నాడు. అయితే అఖిల్.. అందరూ ఒంటిరిగానే ఆడుతున్నారని కౌంటర్ ఇచ్చాడు. ఇక అందరూ కష్టపడి కెప్టెన్ అయితే అఖిల్ మాత్రం లక్తో సీక్రెట్ రూంకి వెళ్లి కెప్టెన్ అయ్యాడని అభిజిత్ అనడంతో మళ్లీ లొల్లి మొదలైంది. అఖిల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. (చదవండి : బిగ్బాస్ : అఖిల్పై రాహుల్ షాకింగ్ కామెంట్స్) అంతకు ముందు నేను చాలా కష్టపడ్డానని, ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అనేది బిగ్గెస్ట్ రిస్క్ అని అఖిల్ అనగా... ‘అది నీ దృష్టిలో రిస్క్.. మాకు అలా అనిపించలేదు.. నీకు తెలుసు అది రెడ్ జోన్ తిరిగి వస్తానని తెలిసే కావాలనే వెళ్లావు’ అని అభిజిత్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇద్దరి మధ్య రచ్చ రేగుతుండగా.. సొహైల్ వచ్చి మళ్లీ ఎటో పోతుంది ఇది.. ఆపండి అని అనడంతో.. ఎటు పోతుంద్రా ఆగరా నువ్ అంటూ సొహైల్పై అఖిల్ సీరియస్ అయ్యాడు. అసలు అభి, అఖిల్ల గొడవ ఏ స్థాయికి వెళ్లింది. అసలు బెస్ట్ కెప్టెన్, వరస్ట్ కెప్టెన్గా ఎవరెవరు ఎన్నికయ్యారో తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే నేటి ఎపిసోడ్ను చూడాల్సిందే. -
బిగ్బాస్ : అఖిల్పై రాహుల్ షాకింగ్ కామెంట్స్
బిగ్బాస్ నాల్గో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ బిగ్ రియాల్టీ షోకు శుభం కార్డు పడటానికి మరో నాలుగు వారాలే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో టాప్ 5 లో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. హౌస్లో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు రానున్న రెండు వారాల్లో ఎలిమినేట్ అయి ఐదుగురు మాత్రమే ఫైనల్కి వెళ్తారు. ఇక ఫైనల్కు వెళ్లే టాప్ 5లో అభిజిత్, సోహైల్, మోనాల్, అవినాష్, అఖిల్ ఉంటారని కొంతమంది అంచనా వేయగా.. మరికొంత మంది హారిక, అరియానా కూడా టాప్ 5లో ఉంటారని చెబుతున్నారు. (చదవండి : బిగ్బాస్ : ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్!) ఇలాంటి తరుణంలో అఖిల్పై బిగ్బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఆయన ఓ న్యూస్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ బిగ్బాస్ నాల్గో సీజన్కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేత ఎవరు? అఖిల్ ఎందుకు టాప్ 5 లో ఉండడు అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ సీజన్లో అభిజిత్, సొహైల్లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విజేత కావొచ్చు. అరియానాకి కూడా ఛాన్స్ ఉంది. అఖిల్ సీక్రెట్ రూంకి వెళ్లిన తరువాత ఒక డైలాగ్ (స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఇక్కడ పెట్టుకొని వీక్ కంటెస్టెంట్స్తో ఏం చేస్తారు)అన్నాడు. ఆ డైలాగ్ బిగ్బాస్కే కాదు నాగ్ సర్కి కూడా కోపం వచ్చింది. అందుకే బయటకు పొమ్మని.. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని అన్నారు. అలాగే అభిజిత్తో కూడా మేక ప్రోటీన్స్ తిని పులిలా బయటకి వచ్చింది.. బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అయ్యింది అని చెప్పడం కూడా కొంచెం మైనస్ అయింది’ అని చెప్పుకొచ్చారు. అయితే అఖిల్ కూడా నీలాగే చివరి వారాల్లో పుంజుకొని టైటిల్ విన్నర్ అయ్యే చాన్స్ ఉంది కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి... ఆ సమయం దాటిపోయింది అంటూ తన మన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై అఖిల్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. -
బిగ్బాస్ : ఆ వీడియోలు వేసి ఇజ్జత్ తీయకండి
బిగ్బాస్ నాల్గో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. షో ముగింపునకు మరో 24 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్ని మరింత రసవత్తంగా తిర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు బిగ్బాస్ నిర్వాహకులు. ఆసక్తికరమైన టాస్క్లతో ప్రేక్షకులని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం ఎపిసోడ్లో ఇంట్లోకి దెయ్యాన్ని పంపించి హౌస్మేట్స్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అంతగా సఫలం కాలేదు. దీంతో ఈ రోజు మరింత డోస్ పెంచి ఇంటి సభ్యులకు వణికించే ప్లాన్ చేసినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇప్పటి గార్డెన్ ఏరియాను శ్మశానంలా మార్చిన బిగ్బాస్.. కన్ఫెషన్ రూమ్ని కూడా దెయ్యాల కొంపగా మార్చేశాడు. (చదవండి : బిగ్బాస్ : ఆ ఇద్దరికే నా సపోర్ట్.. నాగబాబు) ఇంటి సభ్యులకు హార్రస్ సినిమాలు చూపించాడు. ఇక దెయ్యం అంటేనే గజ గజ వణుకుతున్న అరియానాను బిగ్బాస్ టార్గెట్ చేశాడు. దెయ్యం జలజ అరియానాను పిలిచి కన్ఫెషన్ రూమ్కి పంపింది. అవినాష్తో కలిసి అరియానా కన్ఫెషన్ రూమ్కి వెళ్లి.. భయంతో పరుగులు పెట్టింది. ఇక అరియానా భయాన్ని హేళన చేస్తూ సోహైల్, హారిక స్టెప్పులేశారు. ఇక తర్వాత అఖిల్, సోహైల్ని కన్ఫెషన్ రూమ్కి పిలిపించి వాళ్లతో ఓ ఆట ఆడుకుంది దెయ్యం జలజ. రియల్ దెయ్యాలతోనే ఆటలు ఆడుకున్నామని మోనాల్ ముందు గప్పాలు కొట్టి లోపలికి వెళ్లి సోహైల్, అఖిల్.. అక్కడి సౌండ్కి భయంతో గజగజ వణికిపోయారు. ఈ ఇద్దరి అరుపులు విని మిగతా ఇంటి సభ్యులు కడుపుబ్బా నవ్వారు. ఇక బయటకు వచ్చిన అఖి, సోహైల్ బిగ్బాస్ కెమెరా ముందుకు వెళ్లి ఈ వీడియోను ప్లే చేయకండని వేడుకున్నారు. ‘గజ్జుమనిపించిడ్రు. బై మిస్టేక్ కూడా ఈ వీడియోలు ఎక్కడా వేయకండి. మా ఇజ్జత్ పోతది. చూడడానికి కండలు తిరిగి ఉన్నాం. కానీ భయంతో వణికిపోయాం’ అంటూ కెమెరా ముందకు వచ్చి బిగ్బాస్కు రిక్వెస్ట్ చేశారు. -
బిగ్బాస్: మోనాల్తో డేట్.. అభి కంటతడి
బిగ్బాస్ నాల్గో సీజన్ మొత్తం మోనాల్ చుట్టే నడుస్తోంది. కాదు.. మోనాల్ చుట్టూ నడిచేలా చేస్తున్నాడు బిగ్బాస్. బిగ్బాస్ హౌస్లో ఇన్ని రోజులు ఏంమేం జరిగాయోనని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే.. మెనాల్, అభి, అఖిల్ల ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, మోనాల్ అఖిల్ల రొమాన్స్.. గొడవలు, ఏడుపులు.. రోమాంటిక్ ముచ్చట్లు ఇవే కనిపిస్తాయి. మోనాల్తో విడిపోదామనుకున్న ప్రతి సారి అభి, అఖిల్లను మోనాల్తో కలిసేలా చేయడమే బిగ్బాస్ పనిగా పెట్టుకున్నాడు.ఇక నేటి ఎపిసోడ్లో కూడా తన దత్త పుత్రిక మోనాల్ని హైలెట్ చేసే ప్రయత్నం చేశాడు బిగ్బాస్. మోనాల్ని అభిజిత్, అఖిల్ బాగా ఏడ్పించారని, అందుకే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో డేట్కు వెళ్లాలని ఫిటింగ్ పెట్టాడు బిగ్బాస్. (చదవండి : వారిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే : నాగబాబు) మోనాత్తో డేట్ అనగానే అభిజిత్ తెగ ఫీల్ అవుతున్నాడు. మోనాల్ విషయంలో నేను ఇన్వాల్వ్ కావొద్దనుకుంటున్నా. ఆమె పాయింట్ వచ్చిన ప్రతిసారి ఏదోఒక రాడ్ పడుతోంది. నా జర్నీ మొత్తంలో ఈ మోనాల్ టాపికే బిస్కెట్ అవుతుంది’ అంటూ అభి ఎమోషనల్ కాగా, హరిక, సోహైల్ వెళ్లి ఓదార్చారు. మరోవైపు అఖిల్ మాత్రం.. ‘ఇక్కడ ఫిటింగ్ ఏం లేదు.. చేయాలనిపిస్తే చేయి లేదంటే లేదు’ అంటున్నాడు. ఇక బిగ్బాస్ దత్తపుత్రిక మాత్రం డేట్ అనగానే చిరునవ్వులు చిందిస్తూ.. అందంగా ముస్తాబవుతోంది. మరి అభి అంతాలా ఎమోషనల్ కావడానికి కారణమేంటి? మోనాల్ ఎవరితో డేట్కి వెళ్లింది అని తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. -
కాళ్లు పట్టుకుంటే బాగోదు, ప్లీజ్..: అవినాష్
బిగ్బాస్ పెట్టిన నామినేషన్ మంట కంటెస్టెంట్ల గుండెల్లో జ్వాలగా రగులుతోంది. ఆ అగ్ని కొందరిని దహిస్తోంటే మరికొందరిలో కొత్త ఆలోచనలకు నాందిగా మారుతోంది. వెరసి తన గేమ్ తను ఆడదామనుకున్న మోనాల్ మనసు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. ఇలాంటి సమయంలో అభిజిత్ ఆమెకు తోడుగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఒకరి కోసం ఒకరు త్యాగానికి సిద్ధపడటం లేదని తెలుసుకున్న బిగ్బాస్ నామినేట్ అయినవారికి నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు మరో అవకాశం ఇచ్చాడు. అయితే ఇందులో అవినాష్ గెలిచాడన్నది సోషల్ మీడియాలో ఎప్పుడో తేల్చేసింది. కాకపోతే ఓ చిన్న ట్విస్టుంది. అదేమిటో తెలియాలంటే నేటి బిగ్బాస్ స్టోరీ మీద ఓ కన్నేయండి.. మనసు విప్పి మాట్లాడుకున్న అభి, మోనాల్ నామినేషన్స్లో లక్ కలిసి రాలేదని అరియానా ఏడ్చేసింది. తర్వాత మోనాల్ ఒంటరిగా ఏడుస్తుంటే ఆమెను నామినేట్ చేసి హారిక వెళ్లి ఓదార్చింది. కరెక్ట్ పర్సన్తో స్వాప్ చేయమని చెప్పింది అఖిల్ గురించి అని మోనాల్ అసలు విషయం చెప్పడంతో హారిక తన తప్పును తెలుసుకుని సారీ చెప్పింది. నామినేషన్లో తనపై ఇష్టమొచ్చినట్లుగా అరిచిన అరియానాకు బుద్ధి లేదని కోప్పడింది. మరోవైపు ఒకరిని తొక్కి ముందుకు వెళ్లడం ఇష్టం లేదన్న అభి.. మోనాల్తో స్వాప్కు ఎలా ఒప్పుకున్నాడని అఖిల్ సందేహం వ్యక్తం చేశాడు. తర్వాత అభి, మోనాల్ రాత్రిపూట మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఒకరికి ఒకరు సారీ చెప్పుకున్నారు. జనాలను కరెక్ట్గా అంచనా వేసే మా నాన్నకు నచ్చావని చెప్పుకొచ్చాడు. మీ అమ్మ నన్ను చూస్తుంది.. కానీ నువ్వు చూడట్లేదు అని తన మనసులో మాట బయట పెట్టాడు. (చదవండి: బిగ్బాస్: అఖిల్కి హ్యాండిచ్చిన మోనాల్) హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం తర్వాత బిగ్బాస్ "ఎవిక్షన్ ఫ్రీ పాస్" ప్రవేశపెడుతూ నామినేట్ అయినవారు దాన్ని పొందేందుకు టాస్కు ఇచ్చాడు. మొదటి లెవల్లో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ పోటీపడగా అవినాష్, అఖిల్ ఎక్కువ జెండాలు సేకరించి రెండో లెవల్కు వెళ్లారు. ఇందులో 'బీబీ- కష్టానికే గెలుపు 'అన్న పార్టీ పేరుతో అఖిల్, 'గమ్యం చేరే వరకు' పార్టీ పేరుతో అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కన్నీటితో అవినాష్ ప్రచారం ఇప్పుడు నాకు ఓటేస్తే నా జీవితంలో మర్చిపోలేను అంటూ అవినాష్ హారిక దగ్గర ఏడ్చేశాడు. దీంతో అరియానా అతడికి ధైర్యం నూరిపోసింది. తర్వాత ప్రచార సభలు మొదలు పెట్టారు. ఇందులో అవినాష్ మాట్లాడుతూ.. మీ ఇంటి మనిషే అనుకుని ఓటేయండి, ఫ్రెండ్స్ కాళ్లు పట్టుకుంటే బాగోదు కదా ప్లీజ్ ఓటేయండి అని మరోసారి ఎమోషనల్ అయ్యాడు. (చదవండి: సోహైల్ అర్ధరాత్రి అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తాడు) హారికను అమ్మ అని పిలుస్తా... తర్వాత అఖిల్.. నా గుర్తింపే బీబీ. ఇప్పుడు మీరు వేసే ఓటు నాకు చాలా అవసరం. ఒక్క ఓటు నా జీవితాన్ని మార్చేస్తుంది అని అభ్యర్థించాడు. కానీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి మోనాల్, సోహైల్.. అఖిల్కు పూలమాల వేసి ఓటేయగా అరియానా, అభి.. అవినాష్కు ఓటేశారు. హారిక వేసే చివరి ఓటే కీలకం కాగా ఆమె అవినాష్కే సపోర్ట్ చేసింది. దీంతో అవినాష్ ఇప్పటి నుంచి హారికను జీవితంలో మర్చిపోలేనని ఆమెను అమ్మ అని పిలుస్తానంటూ ఓవర్ ఎమోషనల్ అయ్యాడు. అనంతరం అతడికి రెండు వారాల వాలిడిటీ ఉండే ఇమ్యూనిటీ దక్కింది. దీన్ని ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చని బిగ్బాస్ స్పష్టం చేశాడు. దీంతో అతడికి రెండు వారాలపాటు ఇమ్యూనిటీ అన్న విషయంలో ఏమాత్రం నిజం లేదని తేలింది. (చదవండి: అభిజిత్కు క్లాస్ పీకిన మోనాల్ సోదరి) -
బిగ్బాస్: ఈ షోకు నువ్వు అనర్హురాలివి
పోయినసారి నామినేషన్ అఖిల్, అభిజిత్ మధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్టయ్యేవరకు వచ్చిందీ పరిస్థితీ. అఖిల్ కోసం కూడా త్యాగానికి సిద్ధపడని మోనాల్ చివరికి కెప్టెన్ వల్ల అభిజిత్ కోసం నామినేషన్లోకి వచ్చింది. మరోవైపు ఎప్పటిలాగే అవినాష్ నామినేషన్ను తట్టుకోలేకపోయాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాల్సిందేనా అంటూ చిందులు తొక్కాడు. మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. కిచెన్లో అభిజిత్ కష్టాలు వంట రాదంటూ ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన అభిజిత్ లాస్య వేసిన బిగ్బాంబ్ వల్ల కిచెన్లో దూరాడు. 20 దోశెలైనా ఆవురావురుమంటూ తినే సోహైల్తో కలిసి దోశెలు వేశాడు. అది చూసిన సోహైల్ దోశె వేయమంటే అభిజిత్ పరోటా చేస్తున్నాడని ఆటపట్టించాడు. ఇజ్జత్ కా సవాల్.. ఇప్పుడు చేస్తా చూడంటూ మరోసారి దోశె వేసేందుకు ప్రయత్నించిన అభి ఈసారి ఏకంగా ఊతప్పం చేశాడు. మరోవైపు కొద్ది రోజులుగా డల్ అయిన అఖిల్.. 'నా జీవితంలో ముందు నుంచీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే నీతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతా. నీ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నా, నీతో అటాచ్మెంటే వద్దు' అంటూ రిలేషన్కు కటీఫ్ చెప్పడంతో మోనాల్ కంటతడి పెట్టుకుంది. (చదవండి: సోహైల్ అర్ధరాత్రి అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తాడు) ఫస్ట్ రౌండ్లో సోహైల్, మోనాల్ సేవ్ తర్వాత అవినాష్ను అరియానా అంకుల్ అని పిలవగా సోహైల్, అఖిల్ మధ్యలో దూరి అవినాష్ను ఏడిపించారు. అవినాష్కు ఈపాటికే పెళ్లి అయితే నలుగురు పిల్లలుండేవారంటూ ఆట పట్టించారు. అనంతరం పన్నెండోవారానికి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. బజర్ మోగగానే ఇంటి సభ్యులు పరుగెత్తుకెళ్లి తలపై టోపీ పెట్టుకున్నారు. గ్రీన్ టోపీలు ధరించిన సోహైల్, మోనాల్ సేవ్ అవగా ఎర్ర టోపీలు ధరించిన అరియానా, అఖిల్, అభిజిత్, అవినాష్ నామినేట్ అయ్యారు. ఈ నలుగురు శవ పేటికలో నిలబడటంతో రెండో లెవల్ ప్రారంభమైంది. ఇందులో నామినేట్ అయినవారు సేఫ్ అయినవారితో స్వాప్ చేసుకునే అవకాశాన్ని బిగ్బాస్ కల్పించాడు. నువ్వు బిగ్బాస్ షోకు అనర్హురాలివి మొదటగా అవినాష్ మాట్లాడుతూ.. నిన్న వీకెండ్లో నాకర్థమైంది నువ్వు ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంటో అంటూ సోహైల్ను స్వాప్ చేయమని అభ్యర్థించగా అతడు అందుకు ఒప్పుకోలేదు. తర్వాత మోనాల్తో మాట్లాడుతూ.. నీ కన్నా నేను స్ట్రాంగ్, ఎప్పుడూ వరస్ట్ పర్ఫామెన్స్ అనిపించుకోలేదు. బల్లగుద్ది మరీ చెప్తున్నా నీ కన్నా 200 % బాగా ఆడుతున్నాను.. నువ్వు కేవలం మూడు వారాల నుంచి పర్ఫామెన్స్ చేసి కప్పు గెలుస్తా అంటే కుదరదు. ఈ షోకు నువ్వు అనర్హురాలివి అని గరమయ్యాడు. నేను అర్హురాలినో కాదో చెప్పడానికి నువ్వు బిగ్బాస్ కాదు అని ఆమె కౌంటరిచ్చింది. నువ్వు స్ట్రాంగ్ అనుకున్నప్పుడు ఇంకా భయమెందుకు? నామినేషన్లో ఉండు అని తేల్చి చెప్పింది. (చదవండి: ఆ అలవాటు మాత్రం పోలేదు: హారిక తల్లి) అఖిల్- మోనాల్ మధ్య రాజుకున్న గొడవ తర్వాత అఖిల్ మోనాల్ను తనకోసం నామినేషన్లోకి రమ్మని కోరగా ఆమె అందుకు ఒప్పుకోలేదు. 'నన్ను ఎలిమినేట్ చేయాలన్నప్పుడు టపీమని నా పేరు చెప్పావు. కానీ కెప్టెన్సీలో మాత్రం నాకు సపోర్ట్ చేయలేదు. నేను నీ కోసం బట్టలు, వస్తువులు అన్నీ త్యాగం చేశాను. సపోర్ట్ చేస్తావనుకున్నా. కానీ చేయలేదు. ఇప్పటికీ చేయట్లేదు!' అని చెప్పుకొచ్చాడు. నేను స్ట్రాంగ్ అని నిరూపించుకునేందుకే కెప్టెన్సీ టాస్క్లో హారికకు సపోర్ట్ చేసి ఆడాను అని మోనాల్ సమాధానమిచ్చింది. అలా ఇద్దరి మధ్య గొడవ రాజుకోవడంతో అటు మోనాల్, ఇటు అఖిల్ బాధపడ్డారు. వీళ్లిద్దరినీ చూసి సోహైల్కు మరింత బాధేసింది. దీంతో నీకోసం నామినేషన్లోకి వెళ్తానని అఖిల్తో చెప్పినప్పటికీ అతడు దానికి అంగీకరించలేదు. మనసులోని మాట చెప్పిన అభిజిత్ అరియానా వంతు రాగా.. ఈ సారి నీ సాయం కావాలంటూ సోహైల్ను కోరగా అతడు ససేమీరా నిరాకరించాడు. నీకన్నా నేను బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నాను అని మోనాల్తో చెప్పుకు రాగా ఆమె మాత్రం స్వాప్ అవనని తేల్చి చెప్పింది. ఇక్కడ అరియానాకు మోనాల్కు మధ్య వాడివేడిగా చర్చ జరుగుతుంటే అవినాష్ మధ్యలో దూరి ఈ చర్చను గొడవగా మార్చాడు. తర్వాత అభిజిత్ మాట్లాడుతూ.. మీ అమ్మ వచ్చి నన్ను ఫేవరెట్ అని చెప్పిన మాట నా మనసును తాకింది. కాబట్టి నాకోసం నిన్ను త్యాగం చేయమని అడగను అని మోనాల్కు మనసులోని మాట చెప్పాడు. ఎవరూ స్వాప్కు ఒప్పుకోకపోవడంతో అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. ఇప్పుడు బాగా ఆడే కంటెస్టెంటు ఎలిమినేట్ అయి ఇంట్లో వెళ్లి కూర్చోవాలా అని ఆవేశపడ్డాడు. దీంతో అభి స్పందిస్తూ ఈ నలుగురిలో నువ్వు బాగా ఆడకపోతే ఎలిమినేట్ అవుతావు తప్ప అదృష్టం లేక కాదు అని క్లారిటీ ఇచ్చాడు. హారిక మీద భారం వేసిన బిగ్బాస్ వీళ్ల గొడవకు చెక్ పెడుతూ బిగ్బాస్ పెద్ద ట్విస్టు ఇచ్చాడు. కెప్టెన్ హారిక తన పవర్ ఉపయోగించి ఒక స్వాప్ చేయాలని బాధ్యత అప్పజెప్పాడు. దీంతో హారిక నీకోసం నేనున్నా అంటూ అభిజిత్ను సేవ్ చేస్తూ తనకు కెప్టెన్సీ ఫలాన్ని అందించిన మోనాల్ను నామినేషన్లోకి పంపించింది. దీంతో తనకు సేవ్ అయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని మోనాల్ ఏడ్చేసింది. అటు హారిక కూడా తనకు స్వాప్ చేయక తప్పలేదని ఎమోషనల్ అయింది. మొత్తానికి ఈ వారం అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ నామినేట్ అయ్యారు. (చదవండి: ఈ ఇద్దరిలో ఒకరే బిగ్బాస్ విజేత: కౌశల్) -
అఖిల్కు శఠగోపం, అభి కోసం మోనాల్ త్యాగం!
బిగ్బాస్ నాల్గో సీజన్ పన్నెండో వారంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం హౌస్లోఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. రోజులు తగ్గేకొద్దీ వారి మధ్య పోటీ మరింత పెరుగుతోంది. మొదట్లో పెద్దగా కష్టపడినట్లు కనిపించని మోనాల్.. ఏడుసార్లు కెప్టెన్సీ కోసం పోరాడి ఓడిన హారికను ఇంటి కెప్టెన్గా గెలిపించిచి అందరి మనసులను దోచుకుంది. దీంతో తను కూడా స్ట్రాంగేనని ఇంటిసభ్యులకు చెప్పకనే చెప్పింది. ఇక ప్రతివారం నామినేట్ అయ్యే మోనాల్ ఈ ఈసారి కూడా నామినేషన్ లిస్టులో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇందులో ఓ ట్విస్టు ఉంది.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఓట్ల ఆధారంగా కాకుండా ప్రత్యేక టాస్క్ ద్వారా నామినేషన్ నిర్వహించారు. అందులో భాగంగా బజర్ మోగగానే కెప్టెన్ హారిక మినహా మిగతా ఇంటి సభ్యులు బయట ఉన్న టోపీలను ధరించారు. అందులో ఎరుపు రంగు టోపీ ధరించిన అవినాష్, అభిజిత్, అఖిల్, అరియానా నేరుగా నామినేట్ అయినట్లు బిగ్బాస్ తెలిపాడు. అవినాష్కు కౌంటరిచ్చిన మోనాల్ కానీ వారు సేవ్ అయ్యేందుకు ఓ అవకాశం కల్పించాడు. బయట ఉన్న సభ్యుల్లో ఒకరితో స్వాప్(ఒకరి స్థానంలోకి మరొకరు రావడం) చేసుకోవచ్చని సూచించాడు. దీంతో ఎక్కువ మంది మోనాల్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. 'బల్లగుద్ది చెప్తున్నా.. నీకన్నా 100 కాదు 200% ఈ షోకు నేను అర్హుడిని' అని అవినాష్ చెప్పగా.. అలాంటప్పుడు భయమెందుకు, నామినేషన్లో ఉండు అని మోనాల్ కౌంటరిచ్చింది. మంచి గేమ్ ఆడుతున్నాను అనుకున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అంటూ అవినాష్ నోరు మూయించింది. అరియానా కూడా స్వాప్ కోసం మోనాల్ను అభ్యర్థించగా కుదరదని ఆమె కరాఖండిగా తేల్చి చెప్పింది. (చదవండి: అభిజిత్ లవ్ స్టోరీ చెప్పండి: నాగ్) అఖిల్- మోనాల్ మధ్య పెరుగుతున్న దూరం ఇక అఖిల్.. 'నాకు చాలా సపోర్ట్ చేస్తున్నావు అని అంతా అనుకుంటున్నారు. ఎప్పుడు చేశావు?' అని ప్రశ్నించాడు. దీంతో మోనాల్.. 'అది చేశాను, ఇది చేశాను అని నేను చెప్పను. నువ్వు నా కోసం చాలా మంచి చేశావు' అంటూ దండం పెట్టేసి స్వాప్ చేసుకునే ఆలోచనే లేదన్నట్టుగా నిలబడిపోయింది. చివర్లో మాత్రం మోనాల్ అందరికీ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఆమె అభిజిత్తో స్వాప్ చేసుకుంటూ అతన్ని సేవ్ చేస్తూ నామినేషన్లోకి వెళ్లినట్లు చూపించారు. ఇక్కడ అఖిల్ ఎక్స్ప్రెషన్స్ మరింత హైలెట్గా మారాయి. తనను కాదని మోనాల్.. అభి కోసం త్యాగానికి సిద్ధమవడం అతడు జీర్ణించుకోలేనట్లు కనిపిస్తున్నాడు. అయితే మోనాల్ అభి కోసం నామినేషన్లోకి వెళ్లిందా? లేదా హారిక కెప్టెన్సీ పవర్తో అభిని సేవ్ చేసి మోనాల్ను నామినేషన్లోకి పంపించిందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ ప్రోమో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. (చదవండి: మోనాల్ మాత్రం కోడలిగా రాదు: అఖిల్ తల్లి) -
మరో మల్టీస్టారర్?
‘మనం’ సినిమాలో అక్కినేని కుటుంబం మొత్తం కలసి నటించింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్.. ఇలా అక్కినేని హీరోలందరూ ఒకే ఫ్రేమ్లో కనిపించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని కథానాయకులకు, వాళ్ల అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. అయితే అక్కినేని హీరోలందరూ మరోసారి ఓ సినిమా చేయబోతున్నారన్నది ఫిల్మ్న గర్ టాక్. కుమారులు చైతన్య, అఖిల్తో కలసి ఓ సినిమా చేసే ప్లాన్లో ఉన్నారట నాగార్జున. ఈ మల్టీస్టారర్ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారట. గతంలో రాహుల్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రాన్ని చేశారు నాగార్జున. ఈ మల్టీస్టారర్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
బిగ్బాస్: అఖిల్కు షాకిచ్చిన మోనాల్ తల్లి
బిగ్బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు ఓ రకంగా అదృష్టవంతులు. కరోనా దూరని కుటీరంలా బిగ్బాస్ హౌస్ వారికి రక్షణ కల్పిస్తోంది. అయితే ఆ మాయదారి రోగం వల్ల కంటెస్టెంట్లకు వారి కుటుంబాలకు మధ్య గాజు తెర అడ్డుగా నిలిచింది. కానీ అది వారి ప్రేమను అడ్డుకోలేదు. కన్నవారిని కళ్లారా చూసుకుని ఇంటి సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. మంచీచెడ్డలు అడిగి తెలుసుకున్నారు. 70 రోజులకు పైగా ఇంట్లో ఉంటున్న కంటెస్టెంట్లకు రక్తసంబంధీకులతో ఎంత మాట్లాడినా తనివి తీరలేదు. అందుకని నాగార్జున ఇంటిసభ్యుల కోసం నేడు మరోసారి వారి కుటుంబాలను తీసుకువచ్చారు. అఖిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బుడ్డోడు తనకు అఖిల్ బాబాయ్తో పాటు మోనాల్ కూడా ఇష్టమని చెప్పుకొచ్చాడు. (చదవండి: బిగ్బాస్: అఖిల్కి హ్యాండిచ్చిన మోనాల్) ఇక మోనాల్ అమ్మ తన కూతురు తర్వాత అభిజిత్ ఇష్టమని చెప్పడంతో అఖిల్ ముఖం మాడిపోయింది. ఆవేశాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేమని అరియానా సోదరి పంచ్ వేసింది. రాత్రి తొమ్మిది తర్వాత సోహైల్ కథ వేరే ఉంటదని అతడి ఫ్యామిలీ మెంబర్ ఏదో రహస్యాన్ని చెప్పబోతుంటే వద్దని సోహైల్ వేడుకున్నాడు. ఇక అభిజిత్ లవ్ స్టోరీ గురించి చెప్పమని నాగ్ అతడి బంధువును అడగ్గా.. నాన్న ముందు చెప్తే బాగోదని అభి దాటవేసే ప్రయత్నం చేశాడు. తర్వాత అవినాష్ నాగ్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకపోవడంతో అతడి ఫ్యామిలీ మెంబర్ను కలుసుకునే అవకాశం కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు అఖిల్కు పంచ్ పడిందని కామెంట్లు చేస్తున్నారు. మోనాల్ సోదరి అభికి కౌంటరిస్తే వాళ్ల అమ్మ మాత్రం అతడికే సపోర్ట్ చేయడం విశేషమని చెప్తున్నారు. (చదవండి: ఐ హేట్ యూ అన్నావు, అసలు నన్నో ఫ్రెండ్గా ఎప్పుడు ఇష్టపడ్డావు) -
లక్ వల్లే అఖిల్ రీఎంట్రీ ఇచ్చాడు: అభిజిత్
కంటెస్టెంట్లు కలిసి ఉండాలన్నా, గొడవలు పెట్టుకోవాలన్నా అదంతా బిగ్బాస్ చేతిలో ఉంటుంది. అఖిల్-అభిజిత్ విషయంలో ఇది తేటతెల్లమవుతోంది. బిగ్బాస్ నాల్గో సీజన్ ప్రారంభమైన తొలినాళ్లలో ఏ సమస్యా లేకపోయినా అఖిల్, అభిజిత్ గొడవలు పడేవారు. కేవలం మోనాల్ కోసం కొట్టుకు చచ్చేవారు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరూ ఆమెను వదిలేసి స్నేహం గీతం పాడుకుంటూ కలిసిపోయారు. ఇంతలో నామినేషన్ పెంట పెట్టి బిగ్బాస్ అఖిల్, అభి మధ్య నిప్పు రాజేసే ప్రయత్నం చేశాడు. తర్వాత సీక్రెట్ రూమ్ ట్విస్టుతో ఆ నిప్పు అగ్ని పర్వతంలా మారగా.. రీఎంట్రీతో అఖిల్ దాన్ని బద్ధలు చేస్తూ ఫైర్ అయ్యాడు. నామినేషన్లోనూ.. మటన్ షాపు ఓనర్ మేకకు గడ్డి చూపించాడు. మేక లోపలికి వెళ్లిపోయింది.. తర్వాత ఏమైంది అంటూ అభి తన గురించి వెనకాల మాట్లాడిన మాటలను ప్రస్తావిచాడు. ఆ మేక ఇప్పుడు పులై వచ్చిందని చెప్తూ అతడిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వెళ్లారు. (చదవండి: ఆఫ్ట్రాల్ ఓ బచ్చాగానివి, పక్కకు పో: అభి ఫైర్) కానీ మొన్న అఖిల్ అమ్మ హౌస్లోకి వెళ్లి అభిజిత్, నీ బ్రదర్ను బాగా చూసుకో అని అఖిల్ గురించి చెప్పుకొచ్చింది. అటు అభి అమ్మ కూడా ఏం పర్లేదు కొట్టుకోండి అని సలహా ఇచ్చింది. ఈ ఒక్క ఎపిసోడ్తో బద్ధ శత్రువుల్లా మారిన అఖిల్, అభిజిత్ సొంత అన్నదమ్ముల్లా కలిసిపోయారు. కానీ ఇది బిగ్బాస్కు బొత్తిగా నచ్చనట్లు కనిపిస్తోంది. దీంతో నాగార్జున నేడు మరోసారి మేక గొడవను లేవనెత్తారు. దీనిపై అభి స్పందిస్తూ.. తను అన్నదాంట్లో తప్పేముందని అడిగాడు. అఖిల్ ముందు చెప్పమన్నా చెప్తానని స్పష్టం చేశాడు. దీంతో అఖిల్ అప్పుడు మాట్లాడిన టోన్ ఏంటి? ఇప్పుడు మాట్లాడిన టోన్ ఏంటని మండిపడ్డాడు. అయినా లక్తో పాటు బిగ్బాస్ తల్చుకోవడం వల్లే అఖిల్ హౌస్లోకి మళ్లీ వచ్చాడని అభిజిత్ చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి ఈ ఇద్దరి మధ్య గొడవ రాజుకున్నట్లు తేటతెల్లమవుతోంది. (చదవండి: తిండి కోసం అతడి ఇంటికి వెళ్లాను: అరియానా) -
బిగ్బాస్: అఖిల్కి హ్యాండిచ్చిన మోనాల్
ఎట్టకేలకు హారిక కెప్టెన్ అయింది. గతంలో ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారుగా ఎన్నికై చివర్లో ఓడిపోయిన హారిక.. మోనాల్ సాయంతో ఈ సారి తన కోరికను నెరవేర్చుకుంది. అఖిల్కి సోహైల్ చేసిన సాయం బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక కావాల్సిన సమయంలో మోనాల్ తనకు సహాయం చేయలేదని అఖిల్ ఫ్రస్టేషన్తో ఊగిపోయాడు. తనను నమ్మిన వారికి నేను సాయం చేశానని, గేమ్ను గేమ్గానే ఆడానని మోనాల్ తన పనిని సమర్థించుకుంది. ఇంకా నేటి ఎపిసోడ్లో బిగ్బాస్ హౌస్లో ఏమేం జరిగాయో చదివేయండి కొడుకుని చూసి భోరుమన్న లాస్య కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్లో భాగంగా బిగ్బాస్ హౌస్లోకి లాస్య భర్త మంజునాథ్, కొడుకు జున్ను వచ్చారు. కుమారుడిని చూడగానే లాస్య భోరున ఏడ్చింది. ‘బుజ్జీ... అంటూ గార్డెన్ ఏరియా నుంచి పరుగెత్తుకొచ్చింది. ఏడ్చుకుంటూనే భర్తతో మాట్లాడింది. ‘నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు. నువ్వెంత స్ట్రాంగ్గా ఉన్నావో నీ కన్నా ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నాడు జున్ను. అస్సలు ఏడ్వడం లేదు. నువ్వు బాగా ఆడు. చాలా బాగా ఆడుతున్నావు. ఇంకా బాగా స్ట్రాంగ్గా ఆడాలి. కిచెన్లో ఎక్కువగా ఉండిపోతున్నావు. అక్కడి నుంచి బయటికి వచ్చి గేమ్ బాగా ఆడాలి. 10 వారాల పాటు ఉన్నావంటే నువ్వు ఎంత స్ట్రాంగో అర్థం చేసుకో’ అంటూ లాస్యకు మంజునాథ్ ధైర్యం చెప్పాడు. ఇక జున్నును ఇంటి సభ్యులంతా ఆడించారు. అవినాష్ అయితే జోకర్ వేసి జున్నును నవ్వించాడు. ఇంటి సభ్యులందరూ లాస్య భర్తతో మాట్లాడుతూ ఆమెపై జోకులు వేశారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులంతా ‘పప్పు’ ఇష్యూని ప్రస్తావిస్తూ ఘొల్లున నవ్వారు. అలాగే ఆంటీ అంటూ లాస్యను ఆట పట్టించారు. లాస్య ఆంటీ కాదని, ఆమె నవ్వు జన్యూన్ అని, గేమ్ చాలా బాగా ఆడుతుందని ఆమె భర్త చెప్పు కొచ్చాడు. అందం గురించి మాట్లాడొద్దు అరియానా.. అరియానా, హారికలు అందంగా ముస్తాబై ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతుండగా... అవినాష్ వచ్చి వారిని ఆటపట్టించాడు. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారని ఆట పట్టించాడు. తమ అందాన్ని చూసి అవినాష్ కళ్లు తిప్పుకోలేకపోతున్నాడని అరియానా అనగా.. అందం గురించి మనం మాట్లాడుకోవద్దని అవినాష్ పంచ్ వేశాడు. అయినప్పుటికీ అరియానా తన అందం గురించి తానే పొగుడుతుండగా.. పిచ్చి పిచ్చిగా చేయ్యొద్దు అరియానా అంటూ తనదైన శైలీలో పంచ్లు వేసి నవ్వించాడు. బిగ్బాస్ క్విజ్ పోటీ ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులకు క్విజ్ పోటీ పెట్టాడు బిగ్బాస్. గార్డెన్ ఏరియాలో రిఫ్రిజిరేటర్ను పెట్టి.. వారికి కావాల్సిన లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ను దానిలోపల ఉంచారు. క్విజ్ గేమ్ ఆడి అవి పొందాలని కండీషన్ పెట్టాడు. క్విజ్ మాస్టర్గా అవినాష్ను ఎంపిక చేసిన బిగ్బాస్.. పోటీ దారులుగా సోహైల్, లాస్య, మోనాల్, అభిజిత్ను పెట్టాడు. సరైన సమాధానం చెప్పిన ఇంటి సభ్యుడు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసి ఒక లగ్జరీ బడ్జెట్ ఐటమ్ తీసుకోవచ్చు. ప్రశ్నలు కూడా సింపుల్గా, నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా బిగ్బాస్ హౌస్లో లాస్య ఎక్కువగా ఎక్కడ గడుపుతోంది? అనే ప్రశ్నంగా ఇంటి సభ్యులంతా ముక్తకంఠంతో కిచెన్లో అని సమాధానం చెప్పుతూ ఘొల్లున నవ్వారు. మొత్తంగా అందరూ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పి లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ని పొందారు. ఇక అభిజిత్ అయితే అన్ని ప్రశ్నలకు చకచక సమాధానం చెప్పాడు. కెప్టెన్గా దేత్తడి కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్ స్టార్స్ సాధించిన అఖిల్, అభిజిత్, హారికలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు మిగతా ఇంటి సభ్యులను ఒప్పించి వారి భుజాల మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేపు కిందికి దిగకుండా భుజాల మీద ఉంటారో వాళ్లు ఇంటి కెప్టెన్ అవుతారు. అలాగే ఎత్తుకున్న వ్యక్తి బాక్స్ దాటినా ఓడిపోయినట్లే లెక్క. ఎట్టకేలకు కెప్టెన్ పోస్ట్ కొట్టేయాలని కసితో ఉన్న అఖిల్ తెలివిగా సోహైల్ని ఎంచుకున్నాడు. అభిజిత్ అవినాష్ను, మారిక మోనాల్ని ఎంచుకుంది. మొదటగా అభిజిత్ బరువును మోయలేక అవినాష్ చేతులేత్తేశాడు. ఆ తర్వాత ఎంతసేపైనా ఉంటానని గొప్పలు చెప్పిన సోహైల్ .. అఖిల్ని మోయలేక కిందపడిపోయాడు. దీంతో మోనాల్ భుజాలపై ఉన్న హారిక కెప్టెన్గా ఎన్నికైంది. ఎనిమిది సార్లు పోటీ పడినా.. గెలవలేదని, ఈ సారి మోనాల్ సాయంతో గెలిచానని హారిక ఆనందంతో చిందులేసింది. మోనాల్ని గట్టిగా హగ్చేసుకొని ముద్దులు పెట్టింది. నోయల్ టీషర్ వేసుకొని ఈ టాస్క్ ఆడాడని, తన అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్ అయ్యానని సంతోషంతో ఉబ్బితబ్బిపోయింది. హ్యాండిచ్చిన మోనాల్.. అలిగిన అఖిల్ ఇక కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయిన బాధలో ఉన్న అఖిల్ని సోహైల్ ఓదార్చాడు. తాను శాయశక్తులా కృషి చేశానని, తన టాస్క్లాగే ఆడానని, అయినా గెలవలేకపోయామని అఖిల్తో చెబుతూ బాధపడ్డాడు. మోనాల్ కూడా వచ్చి అఖిల్ని ఓదార్చపోగా.. తనకు కొంచెం టైం కావాలని ఆమెను పంపించేశాడు. ఆమె వెళ్లిపోగానే.. అఖిల్ కోపంతో చేతిని నేలకేసి కొట్టాడు. సోహైల్ వెళ్లి దగ్గరకు తీసుకొని మరోసారి ఓదార్చాడు. అయితే మోనాల్ తనుకు హెల్ఫ్ చేస్తుందని భావించానని, కానీ తనను కాదని హారికకు సాయం చేసిందని చెబుతూ బాధపడ్డాడు. కాగా, తనను అఖిల్ నమ్మలేదని, హారిక నన్ను నమ్మి టాస్క్లో సాయం చేయమని కోరిందని అందుకే ఆమెకు సపోర్ట్ చేశానని మోనాల్ చెప్పుకొచ్చింది. ఫోన్ లేకపోతే మనిషి విలువ తెలిసింది : సోహైల్ బిగ్బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకున్న విషయాలు ఏంటి? మీలో వచ్చిన మార్పులు ఏంటో హౌస్మేట్స్తో పంచుకోండని బిగ్బాస్ ఆదేశించాడు. దీంతో సోహైల్ తాను నేర్చుకున్న విషయాలు ఇంటి సభ్యులతో పంచుకున్నాడు. ‘ బిగ్బాస్లోకి రాక ముందు పుడ్ విలువ తెలిసేది కాదు. ఇక్కడి వచ్చాకే ఫుడ్ వాల్యూ తెలిసింది. కోపం కూడా తగ్గింది. గతంలో ఎక్కుమ సమయం ఫోన్తోనే గడిపేవాడిని. ఎవరు పిలిచినా అంతగా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇక్కడ మనుషులతోనే ఎక్కువ సమయం గడుపుతున్నా. ఫోన్ లేకపోతే మనిషి విలువ తెలుస్తోంది’ అని సోహైల్ చెప్పాడు. ఇక అరియానా మాట్లాడుతూ.. బిగ్బాస్లోకి వచ్చాక తనకు సమయం విలువ బాగా తెలిసిందని, చిన్న చిన్న విషయాలకు కృతష్నులై ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. పనిష్మేంట్గా స్టెప్పులేని ఇంటి సభ్యులు ఇక కెప్టెన్ అయిన హారికపై అభిజిత్ జోకులు వేశాడు. మోనాల్ ఎంత పని చేశావ్ అంటూ.. ఆమెను ఎందుకు కెప్టెన్ చేశావు ఆని హారికను ఆటపట్టించాడు. అయితే హారిక మాత్రం అభిజిత్కు గట్టిగానే ఇచ్చిపడేసింది. ‘ నా మీద జోకులు వేస్తే నేను ఊరుకోవాలి. నీ మీద వేస్తనేమో సీరియస్ అవుతావు. నేను జోకులు వేసినప్పుటు సీరియస్ కావాలి కానీ.. నీ పని చెప్తా చూడు’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇక కెప్టెన్ అయిన ఆనందంలో మైక్ ధరించకుండానే ఇళ్లంతా తిరుగున్ను హారికను బిగ్బాస్ నుంచి ‘మైక్ ధరించు హారిక’ అనే అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో కెప్టెన్ హారికనే ఇంటి నియమాలు పాటిస్తలేదంటూ ఇంటి సభ్యులంతా హారికను ఆటపట్టించారు. పనిష్మెంట్గా హారికతో పాటు మిగతవారంతా స్టెప్పులేస్తూ బిగ్బాస్కు క్షమాపణ చెప్పారు. -
హారికతో డేట్కు వెళ్తా: మెహబూబ్
బిగ్బాస్ నాల్గో సీజన్ ప్రారంభమైన తొలినాళ్లలో మెహబూబ్కు అంతగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. తర్వాత తర్వాత నెమ్మదిగా పుంజుకున్న అతడు టాస్కుల్లో తన సత్తా చూపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆవేశంలో నోరు జారడం, రోబో టాస్కులో అతిగా ఆవేశపడటం, కోపంలో నోరు జారడం, కేవలం ఫిజికల్ టాస్కుల మీద మాత్రమే దృష్టి పెట్టడమే అతన్ని ఎలిమినేషన్ దిశగా నడిపించాయి. దీంతో పదోవారంలో ఇంటి సభ్యులను ఏడిపిస్తూ హౌస్ నుంచి భారంగా వీడ్కోలు తీసుకున్నాడు. బయటకు వచ్చాక అతడు అభిజిత్, సోహైల్కు తన పూర్తి మద్దతు తెలుపుతున్నాడు. దీంతో కొందరు నెటిజన్లు అఖిల్ నీ ఫ్రెండే కదా అతడికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మెహబూబ్ స్పందిస్తూ అతడు నామినేషన్లో లేడని, నామినేషన్లోకి వచ్చినప్పుడు అతడికి కూడా సపోర్ట్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తన బిగ్బాస్ జర్నీ గురించి ప్రత్యేక వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. పది వారాలు ట్రోల్ చేశారు మెహబూబ్ తనపై జరిగిన ట్రోలింగ్పై స్పందిస్తూ.. 'బయట అప్పటికే నాకో ఫేమ్ ఉంది. అయితే అది టిక్టాక్ వల్లే వచ్చింది. అందుకే బిగ్బాస్ ఛాన్స్ వచ్చింది అని చాలామంది అనుకున్నారు. అందుకే ట్రోల్ చేశారు. ఒక్కవారం కూడా ఉండనని అన్నవాళ్లు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్లకు నేను ఎలా ఉంటానో తెలీదు. కాబట్టి అక్కడికి వెళ్లాక నన్ను చూసి వీళ్ల అభిప్రాయం మారుతుంది అనుకున్నా. అయినా సరే పది వారాల దాకా నామీద ట్రోలింగ్ ఆగలేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయలేదు. నన్ను సపోర్ట్ చేస్తే వాళ్లను ఎక్కడ ట్రోల్ చేస్తారో అని! కేవలం నా కుటుంబం, ప్రేక్షకుల వల్లే ఇన్నివారాలు లోపల ఉన్నా. చివరికి నేను ఎలిమినేట్ అవుతుంటే, నేను లోపల ఉండాల్సిన వ్యక్తిని అని అంతా అంటున్నారు, అది సంతోషంగా ఉంది. మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా ట్రోల్ జరుగుతుంది' అని తేలికగా తీసిపారేశారు. (చదవండి: మెహబూబ్ గుడ్బై: అవినాష్పై బిగ్బాంబ్) ముందు నా గురువును కలుస్తా ఫిమేల్ కంటెస్టెంట్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరిని చంపుతారు? అన్న ప్రశ్నకు దివితో పెళ్లి, హారికతో డేటింగ్, అరియానాను చంపేస్తానని మొహమాటం లేకుండా చెప్పాడు. ముందుగా ఈ సీజన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో మొట్ట మొదటగా తన గురువు అమ్మ రాజశేఖర్ను కలుస్తానని చెప్పుకొచ్చాడు. ఇచ్చిన టాస్కుల్లో తనకు విలన్ పాత్ర బాగా ఇష్టమని చెప్పాడు. హౌస్లో అఖిల్-మోనాల్, అభిజిత్-హారిక, సోహైల్-మెహబూబ్, అవినాష్-అరియానా జంటలు బాగుంటాయని తెలిపాడు. (చదవండి: హారికను ఓ చోటకు తీసుకెళ్తా: అభిజిత్) అరియానా బోల్డ్, కానీ ఇన్నోసెంట్ అమ్మాయి కంటెస్టెంట్ల గురించి చెప్తూ.. "అభిజిత్ నాకు పెద్దన్నలా ఉండేవాడు. భుజం సమస్య ఉంది కాబట్టి సరిగా ఫిజికల్ టాస్కులు ఆడలేకపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం టాస్కుల్లో అల్లాడిస్తున్నాడు. కచ్చితంగా టాప్ 3లో ఉంటాడు. అఖిల్ కొన్ని విషయాల్లో ఎమోషనల్ అయిపోతున్నాడు. కాస్త కోపం ఎక్కువ. కానీ బాగా ఆడతాడు. మోనాల్ గేమ్ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతోంది. అవినాష్ అందర్నీ ఎంటర్టైన్ చేస్తాడు. బంధాలకు విలువిస్తాడు. అరియానాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆమెను బాగా చూసుకున్నాడు. అరియానా.. నిజంగా బోల్డ్. లోపల మాత్రం ఇన్నోసెంట్ గర్ల్. లాస్య అక్క చాలా మంచిది. టాస్కుల్లో మాత్రం కొంచెం తగ్గుతోంది. అమ్మ రాజశేఖర్.. షో కోసం మనమేం చేయగలం అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. మాస్టర్ చాలా మంచి వ్యక్తి. గంగవ్వ.. ఫైటర్. దివి నా బెస్ట్ ఫ్రెండ్, చాలా అందంగా ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. సోహైల్.. దిల్దార్ ఉంటాడు. వాడు టాప్ 3లో ఉండాలి. హారిక.. ఫైటర్. టాస్కుల్లో అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది" అని పేర్కొన్నాడు. -
బిగ్బాస్: తల్లి ప్రేమ, అందరినీ కలిపేసింది
బిగ్బాస్ జర్నీలో కంటెస్టెంట్లు వారి కుటుంబాలను కలసుకునే ఎపిసోడ్ ఎంతో ప్రత్యేకమైనది. ఇంటిసభ్యుల తప్పొప్పులను సరిచేస్తూ ఆటతీరు మెరుగుపర్చుకునేందుకు వారిచ్చే సలహాలు ఎంతో విలువైనవి. కానీ ఈసారి అలాంటి అవకాశమేమీ లభించలేదు. పర్సనల్గా మాట్లాడుకునే స్పేస్ దొరక్కపోయినా కావాల్సినంత ప్రేమను పంచారు. అదేంటో కానీ కంటెస్టెంట్ల ఒక్కో పేరెంట్ లోనికి అడుగు పెట్టేకొద్దీ లోపల ఉన్న కంటెస్టెంట్ల మనసులు శుద్ధిగా మారిపోయాయి. నామినేషన్ గొడవలను గాలికొదిలేసి అంతా ఒకే కుటుంబం అన్నట్లుగా కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఇన్ని వింతలు చోటు చేసుకున్న నేటి 74వ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా చదివేసేయండి.. అవినాష్ను ఆడుకున్న సోహైల్ ఓ వైపు మటన్ పాడు చేసినందుకు కంటెస్టెంట్లతో చీవాట్లు, మరోవైపు నాన్వెజ్ తినకూడదన్న బిగ్బాంబ్ అవినాష్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇలాంటి సమయంలో సోహైల్, అవినాష్ పక్కన చేరి మటన్ ఆవురావురుమని లాగిస్తూ అతడికి ఊరిళ్లు తెప్పించాడు. దీంతో అవినాష్ తన జిహ్వ చాపల్యాన్ని కంట్రోల్ చేసుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. సోహైల్ మాత్రం నేల మీద పాకుతూ మరీ ప్లేటు ఖాళీ చేశాడు. తర్వాత హౌస్లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ను ఒక్కొక్కరిగా పంపించాడు. ముందుగా అఖిల్ అమ్మ దుర్గ రాగానే అతడు చంటిపిల్లాడిలా ఏడ్చాడు. (చదవండి: బిగ్బాస్: హారికకు ఇచ్చి పడేసిన సోహైల్) మోనాల్ ఇచ్చిన చాక్లెట్ను అమ్మకు.. మోనాల్ ఇచ్చిన చాక్లెట్ను అఖిల్ తన అమ్మకు ఇచ్చాడు. ఆమె హారికను పట్టుకుని నీలాంటి ఆడపిల్ల కావాలి అనడంతో హారిక ఆనందంతో గాల్లో తేలియాడింది. అందరి గురించి అన్నీ చెప్తున్న ఆమె మోనాల్ గురించి ఏమీ మాట్లాడకపోవడంతో తన గురించి కూడా చెప్పమని అఖిల్ నోరు తెరిచి అడిగాడు. దీంతో ఆమె మోనాల్ నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అద్దం తెర చాటు నుంచే కొడుక్కు ముద్దు పెట్టింది. అలాగే అఖిల్కు అభిజిత్ అన్న, లాస్య అక్క అని చెప్పింది. ఆమె వీడ్కోలు తీసుకోగానే ఏదో మంత్రం వేసినట్టుగా అభిజిత్, అఖిల్, సోహైల్ కలిసిపోయారు. (చదవండి: ఇక చాలు ఆపండి, అభిజిత్ విన్నరేంటి?) హారికతో చక్కర్లు కొట్టేందుకు అభి ప్లానింగ్ ప్లాంక్ వాక్(నేలమీద పాకడం) పెట్టకండని అరియానా బిగ్బాస్ను వేడుకుంది. ఆ వెంటనే అందరూ పాకాలని బిగ్బాస్ బజర్ మోగించాడు. దీంతో చచ్చినట్లు నేలమీద పడి పాకడం మొదలుపెట్టారు. వారిని పవర్ సేవ్ మోడ్లో ఉంచిన బిగ్బాస్ హారిక తల్లి జ్యోతిని లోనికి పంపించారు. హారికను చూసుకుంటున్నందుకు ఆమె అభిజిత్కు ధన్యవాదాలు తెలిపింది. కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచానని హారిక గుడ్న్యూస్ చెప్పగా ఈసారైనా గెలుస్తావా? అని ఏడిపించింది. ఇంతలో అభిజిత్ అందుకుంటూ మీరు అనుమతిస్తే హారికను ఓసారి ఓ చోటుకు తీసుకెళ్తాను అని అడగ్గా ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేస్ట్గాడు అన్నందుకు సారీ: హారిక తర్వాత లోనికి వచ్చిన అభిజిత్ అమ్మ లక్ష్మి కొడుకును చూడగానే సంతోషంతో ఏడ్చేసింది. దీంతో ఎమోషనల్ అవొద్దు అంటూ అభి తల్లిని ఓదార్చాడు. ఆమె కొడుకు కన్నా ఎక్కువగా అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా తనకు కూడా హౌస్లో ఓ రోజు ఉండాలనుందని మనసులోని మాట చెప్పింది. ఈ అవకాశం మళ్లీ దొరకదని బాగా ఎంజాయ్ చేయండి, కొట్టుకోండి అని సలహా ఇచ్చింది. సంతోషం పట్టలేని కంటెస్టెంట్లు డ్యాన్సు చేస్తూ కుప్పిగంతులు వేశారు. బయటకు వెళ్లాక మనం కొట్టుకున్నది చూసి నవ్వుకుంటామని అభిజిత్ చెప్పుకొచ్చాడు. దానికంతటికీ కారణమైనందుకు అఖిల్, సోహైల్కు థ్యాంక్స్ చెప్పిన అభి హారికకు ధన్యవాదాలు చెప్పకుండా హారికకు హగ్గిచ్చాడు. తర్వాత హారిక వేస్ట్గాడు అన్నందుకు సోహైల్కు సారీ చెప్పింది. (చదవండి: నేను గేమ్ ఆడటానికి రాలేదు: అభిజిత్) ప్రతిసారి పెళ్లి అనకు, వచ్చాక చేస్తా తర్వాత అవినాష్ అమ్మ మల్లవ్వ లోపలకు వచ్చింది. కొడుకు మీద ముద్దుల వర్షం కురిపించింది. కంటెస్టెంట్లు అందరూ బాగుండాలని రోజూ దేవుళ్లకు పూజలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఊరికే పెళ్లి అంటూ కలవరించొద్దని, బయటకు వచ్చాక చేస్తానని హామీ ఇచ్చింది. చాలా మంది ఇంటికొచ్చి తనను సెల్ఫీ అడుగుతున్నారని తెలిపింది. వెళ్లిపోయే ముందు హౌస్మేట్స్తో కలిసి హుషారుగా స్టెప్పులేసింది. ఆమె వెళ్లిపోగానే అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన రెండు మోకాళ్లు అరిగిపోయి ఆపరేషన్ అయిందని, తాను వచ్చేముందు నడవలేని స్థితిలో ఉండేదని అరియానాతో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు నడవగలుగుతోందని ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కొంత భారంగా మరికొంత వినోదాత్మకంగా సాగింది. వచ్చిన వాళ్లందరూ అఖిల్కు బర్త్డే విషెస్ చెప్తూ అవినాష్కు పిల్లను చూస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఈ ఎపిసోడ్ అందరినీ మార్చేసింది. వారి మధ్య ఉన్న గొడవలను తుంచి, మనస్పర్థలను చెరిపేసింది. అందరి మనసుల్లో ప్రేమను మాత్రమే వ్యాపింపజేసింది. -
హారిక లాంటి కూతురు కావాలి: అఖిల్ తల్లి
బిగ్బాస్ నాల్గో సీజన్ ప్రారంభమై 70 రోజులు దాటిపోయింది. ఈ సీజన్లో 16 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరికి తోడుగా మరో ముగ్గురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు లోనికి వెళ్లడంతో పార్టిసిపెంట్ల సంఖ్య 19కి చేరింది. కానీ పదకొండో వారానికి వచ్చేసరికి మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. అయితే కంటెస్టెంట్లు లోనికి వెళ్లే ముందు 14 రోజులు క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే కదా! కరోనా కాలం కాబట్టి ఆ ముందు జాగ్రత్త చర్యలు తప్పలేవు. ఇదిలా వుంటే షో ముగింపుకు వస్తున్న తరుణంలో ఇంటిసభ్యులు వారి కుటుంబీకులను కలుసుకునేందుకు బిగ్బాస్ ప్లాన్ చేశాడు. కానీ కోవిడ్ కారణంగా ఒకరినొకరు టచ్ చేయడానికి కూడా వీలు లేకుండా అడ్డుగోడ కట్టారు. కుటంబ సభ్యులు వారి పిల్లలతో కలిసి తిరగకుండా ఓ గాజు తెరలో నుంచే మాట్లాడే సదుపాయం కల్పించారు. (చదవండి: నేను స్ట్రాంగ్ కాదు, పంపించేయండి: అరియానా) దీంతో నేడు హౌస్లోకి అఖిల్, అభిజిత్, అవినాష్, హారిక, అరియానా తల్లులు వచ్చారు. వాళ్లను చూసి సర్ప్రైజ్ అయిన ఇంటిసభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి కన్నీళ్లు తుడిచే అవకాశం లేకపోయినా మాటలతో ఓదార్చుతూ అద్దంలో నుంచే తమ పిల్లలకు మమకారపు ముద్దులు కురిపిస్తూ ఓదార్చారు. కాగా ఎన్ని గొడవలు జరిగినా కేవలం గేమ్ వరకే అని అవినాష్ చెప్తుంటే అభిజిత్ అమ్మ మాత్రం కొట్టుకోండి, మజా వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. అఖిల్ తల్లి మాట్లాడుతూ హారిక లాంటి కూతురు కావాలని దేత్తడి మీద ప్రేమ కురిపించింది. అవినాష్ లాగే అతడి తల్లి కూడా డ్యాన్సు చేస్తూ ఎంటర్టైన్ చేసింది. ఇక హారిక అమ్మ మాట్లాడుతూ.. ఈసారైనా కెప్టెన్ అవుతావా? అని కూతురిని ఏడిపించింది. కుటుంబ సభ్యులను కలుసుకున్న కంటెస్టెంట్లు ఆనందంతో గాల్లో తేలియాడుతున్నారు. కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. మరి ఈ ఎమోషనల్ ఎపిసోడ్ వీక్షించాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే! (చదవండి: అవమానాలను గెలుపుగా మార్చుకున్న దేత్తడి) -
అఖిల్ బర్త్డే: ముద్దులు కురిపించిన మోనాల్
క్రమశిక్షణ లేకుండా పోయిన హౌస్ను బిగ్బాస్ కమాండో ఇన్స్టిట్యూట్గా మార్చాడు. ఇది టాస్క్ కాదు శిక్ష అనేట్టుగా వారితో సకల ఆటలు ఆడించాడు. పడుతూ లేస్తూ, నవ్వుతూ తుళ్లుతూ, ఆయాసపడుతూ ఆటాడుతూ చచ్చినట్లు బిగ్బాస్ చెప్పినట్లు నడుచుకుంటున్నారు. మరోవైపు నామినేషన్ ప్రక్రియ రోజు నిప్పులు తొక్కిన కంటెస్టెంట్ల ఆవేశం నేడు చల్లారినట్లు కనిపిస్తోంది. గొడవలు పక్కనపెట్టి తిరిగి ఎప్పటిలాగే మాట్లాడుకున్నారు. మరి నేటి బిగ్బాస్ షోలోని 73వ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. కమాండోలుగా మారిన కంటెస్టెంట్లు బిగ్బాస్ ఇల్లు కమాండో ఇన్స్టిట్యూట్గా మారింది. ఈ టాస్క్లో యూనిఫామ్ ధరించిన ఇంటిసభ్యులు కొన్ని డ్రిల్స్ చేయాలి. అఖిల్ కేడట్స్కు కెప్టెన్గా వ్యవహరించారు. ట్రంపెట్ సౌండ్ వస్తే మార్చి ఫాస్ట్, ఎక్సర్సైజ్, గన్షాట్స్ వస్తే దాక్కోవడం, పవర్ సేవ్ అనగానే ఫ్రీజ్ అవడం, స్లో మోషన్ అన్నప్పుడు స్లో మోషన్లో, ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో, డ్రమ్ రోల్స్ వస్తే నేలపై పాకడం వంటివి అన్నీ చేయాలి. బజర్ మోగినప్పుడు దాన్ని ముందుగా కొట్టే వ్యక్తి ఒక ఛాలెంజ్ చేసే అవకాశం పొందుతారు. ఇలా నాలుగు సార్లు బజర్ మోగుతుంది. ఒకసారి ఛాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తికి మరోసారి బజర్ కొట్టే అవకాశం లేదు. (చదవండి: కెప్టెన్ అఖిల్: ఆ ముగ్గురికీ దుమ్ము దులిపాడు) పోరాడి ఓడిన సోహైల్ టాస్క్ మొదలవగానే బిగ్బాస్ చెప్పినట్టుగా ఆడుతూ ఎంజాయ్ చేశారు. కానీ పదేపదే స్టంట్లు చేసేందుకు మాత్రం తెగ ఆయాసపడ్డారు. మొదటి బజర్ మోగగానే సోహైల్ అన్నింటికన్నా కఠినమైన ఛాలెంజ్ స్వీకరించాడు. ఇందులో సోహైల్ స్విమ్మింగ్ పూల్లో ఒకవైపున ఉన్న బరువైన వస్తువులను మరోవైపుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెహబూబ్ కోసం ఈ ఆటాడుతున్నానని చెప్పిన సోహైల్ చివరికి ఓడిపోవడంతో ఎమోషనల్ అయ్యాడు. తర్వాత బజర్ కొట్టిన అఖిల్.. పోల్ను వాటేసుకుని కిందకు దిగకూడదన్న సవాలు స్వీకరించి విజయం సాధించాడు. (చదవండి: బిగ్ సర్ప్రైజ్: హౌస్లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీస్!) ఇక నుంచి నామినేట్ చేయకండి: అభి తర్వాతది నువ్వే కొట్టాలని హారిక అభిజిత్కు చెప్పింది. అనుకున్నట్లుగానే అభి బజర్ కొట్టి మంకీ బార్ ఛాలెంజ్ స్వీకరించి గెలుపొందాడు. 100 శాతం ఇస్తున్నా కదా, ఈ సారి నన్ను నామినేట్ చేయకండి అని అభి అభ్యర్థించాడు. మరోవైపు అవినాష్ సరిగా దాక్కోలేదని అభిజిత్ ఫిర్యాదు చేయగా అవునని అరియానా సమర్థించింది. దీంతో అవినాష్, అరియానా కొట్టుకు చచ్చారు. నాకెవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అరియానా స్పష్టం చేసింది. తర్వాత బజర్ కొట్టిన హారిక టైర్ను గార్డెన్ ఏరియాలో పది రౌండ్లు ఫ్లిప్ చేసే సవాలును స్వీకరించి పూర్తి చేసింది. (చదవండి: నాతో మర్యాదగా మాట్లాడు: అభిజిత్) అఖిల్కు మోనాల్ రొమాంటిక్ గిఫ్ట్ అనంతరం రాత్రి పూట హౌస్లో అఖిల్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. అఖిలే నం.1 అని కేక్ మీద రాసి బర్త్డే బాయ్తో కేక్ కట్ చేయించారు. మొదట ఎవరికి తినిపిస్తాడు అన్న సస్పెన్స్కు తూట్లు పొడుస్తూ కేకు ముక్క తనే తిన్నాడు. తర్వాత మోనాల్ అఖిల్ను హత్తుకుని తొలిసారిగా ముద్దులు కురిపించింది. దీంతో గాల్లో తేలిపోయిన అఖిల్ రోజు నా బర్త్డే ఉంటే బాగుండని మనసులోని మాట బయటపెట్టాడు. ఇక ఈ సెలబ్రేషన్స్లో సోహైల్ ఎక్కడా కనిపించలేదు. (చదవండి: ఎలిమినేషన్: సోహైల్కు షాకుల మీద షాకులు) -
బిగ్బాస్: నెట్టింట ట్రెండ్ అవుతున్న అఖిల్
బిగ్బాస్ నాల్గో సీజన్లో అడుగు పెట్టిన అందగాడు అఖిల్ సార్థక్. తన నవ్వుకు, తెలివికి, గాత్ర మాధుర్యానికి అమ్మాయిలు దాసోహమయ్యారు. అతడికే మా ఓటు అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మోనాల్తో సాన్నిహిత్యం, అభిజిత్తో వైరం, టాస్కుల్లో వీరత్వం వెరసి అఖిల్ బిగ్బాస్ వీక్షకుల నోట్లో నాలుకగా మారిపోయాడు. ఈ రోజు(నవంబర్ 17) అఖిల్ సార్థక్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, అఖిల్కు బర్త్డే విషెస్ చెప్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో అఖిల్ ట్రెండింగ్ అవుతున్నాడు. ఇతడికి బిగ్బాస్ స్టార్ గంగవ్వ, సుజాత, యాంకర్ శివ వీడియో సందేశం ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: కాపురాలు కూలిపోతాయ్ అని హెడ్డింగ్ పెట్టారు: హిమజ) కాగా నాగార్జున కొడుకు అఖిల్ పిల్లాడిగా నటించిన 'సిసింద్రీ' సినిమా విడుదలైన సమయంలో అఖిల్ పుట్టాడు. అందుకనే అతడికి ఆ పేరు పెట్టారు. బుల్లితెరతో కెరీర్ ప్రారంభించిన అఖిల్ 'ముత్యాల ముగ్గు', 'ఎవరే నువ్వు', 'కళ్యాణి', 'మోహిని' వంటి సీరియల్స్లో కూడా నటించాడు. మధ్యలో 'బావా మరదలు' అనే చిత్రంతో వెండితెర మీద తళుక్కుమని మెరిశాడు. ఇక బిగ్బాస్ షోలో అడుగు పెట్టిన అఖిల్ మోనాల్ గజ్జర్ను బెస్ట్ఫ్రెండ్గా, సోహైల్ను తమ్ముడిగా ఫీలవుతాడు. మిగతా అందరితోనే బాగానే ఉంటున్నప్పటికీ ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, యాటిట్యూడ్తో వైరాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఇక ఈ మధ్యే సీక్రెట్ రూమ్లోకి వెళ్లిన అఖిల్ మరింత స్ట్రాంగ్గా హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. పదకొండో వారానికి కెప్టెన్గా కొనసాగుతున్న ఇతడు టాప్ 3లో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. (చదవండి: బిగ్బాస్: మోనాల్ని ముద్దు అడిగిన అఖిల్!) Thank you #anchorshiva, #gangavva Garu and #jordarsujatha for your wishes...#HBDAkhilSarthak #HBDakhilsarthak#akhilsarthak pic.twitter.com/RNyishjlL5 — Akhil Sarthak Official (@akhilsarthak17) November 17, 2020 -
ఆఫ్ట్రాల్ ఓ బచ్చాగానివి, పక్కకు పో: అభి ఫైర్
ఓరకంగా బిగ్బాస్ హౌస్ మాంత్రికుడి మాయాజాలం వంటిదే. కంటెస్టెంట్లు ఎప్పుడు కలిసిపోతారో, ఎప్పుడు విడిపోతారో ఎవ్వరూ ఊహించలేరు. సీజన్ మొదటి నుంచే మోనాల్ కోసం కొట్టుకు చస్తూ బద్ధ శత్రువుల్లా మారిన అఖిల్, అభిజిత్ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మోనాల్ను పక్కన పెట్టేశారు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. నేటి నామినేషన్లో అది తారాస్థాయికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో అఖిల్ అభిజిత్ను నామినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ తను సీక్రెట్ రూమ్లో విన్న డైలాగులను ఏకరువు పెట్టాడు. ఇంత జరిగినా బుద్ధి రాలేదు.. "మటన్ షాపు ఓనర్ మేకకు గడ్డి చూపించాడు. మేక లోపలికి వెళ్లిపోయింది.." అని అభి తన గురించి అన్న మాటనే తిరిగి వల్లించాడు. కానీ లోపలికి వెళ్లిన మేక పులిలా వచ్చిందని చెప్పగా మేక ఎప్పుడూ పులి కాదని, బలవుతుందని అభిజిత్ కౌంటరిచ్చాడు. అక్కడితో ఆగకుండా మళ్లీ లోపలికి వస్తానన్న నమ్మకంతోనే వెళ్లిపోయావు అని అసలు పాయింట్ లాగాడు. "ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అయినా నా గురించి చెప్పడానికి నువ్వెవరు? ఆఫ్ట్రాల్.." అంటూ గరమయ్యాడు. నీకు నువ్వు తురుమ్ఖాన్ అనుకుంటున్నావా? నువ్వో బచ్చాగానివి, ఏం తెల్వదు పో.. అనడంతో అఖిల్ ఫేస్ మాడిపోయింది. (చదవండి: నువ్వు ఫేక్, ఇది నీ ఎథిక్స్: అఖిల్ ఫైర్) అఖిల్ మీద నెటిజన్ల జోకులు దీంతో మంట మీదున్న అఖిల్ 'నువ్వు బిగ్బాస్కు రావడానికి 32 ఏళ్లు పట్టిందేమో, నాకు 25 ఏళ్లే పట్టింది' అని అఖిల్ రివర్స్ కౌంటరిచ్చాడు. అగ్నిగుండంలా రగిలిపోతున్న ఈ ఇద్దరి గొడవ నామినేషన్ తర్వాత చల్లారిపోతుందేమో కానీ వాళ్ల అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో కొట్టుకు చస్తున్నారు. సీక్రెట్ రూమ్లో పిల్లిలా ఏడ్చిన అఖిల్ పులి ఏంటని విమర్శిస్తున్నారు. బిగ్బాస్ హౌస్కు బయట ఉండే మేకలు మేమేమే అని అరిస్తే లోపల ఉన్న మేక మమ్మీ అంటుందని సెటైర్లు వేస్తున్నారు. ఇక అఖిల్ అభిమానులు మాత్రం అతడు సింహం అని, అతడి మీద కుళ్లు జోకులు వేస్తే ఎందుకు సహిస్తాడని వెనకేసుకొస్తున్నారు. మిగతా నెటిజన్లు.. అనవసరంగా అఖిల్ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతూ తన ఇమేజ్ తానే డ్యామేజ్ చేసుకుంటున్నాడని అంటున్నారు. మొత్తానికి సీక్రెట్ రూమ్ వల్ల ఇద్దరి మధ్య అగ్నిపర్వతం బద్ధలైందని చెప్తున్నారు. (చదవండి: గే బార్కు వెళ్లాను: అభిజిత్ షాకింగ్ సీక్రెట్) -
కెప్టెన్ అఖిల్: ఆ ముగ్గురికీ దుమ్ము దులిపాడు
ఒకప్పుడు నాగార్జున ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని అభిజిత్ను హెచ్చరించేవారు. కానీ ఇప్పుడు సీను మారింది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దంటూ అఖిల్కు చీవాట్లు పెట్టారు. అఖిల్ను వెళ్లగొట్టినంత పని చేసి తిరిగి లోనికి పంపించారు. ఇక కంటెస్టెంట్ల కోసం నాగార్జున భార్య అమల డ్రైఫ్రూట్స్ పంపించగా, నాగ్ మటన్ పంపిస్తానని మాటిచ్చారు. మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. బిగ్బాస్ సంధించిన ప్రశ్నలు అర్థం చేసుకోరా? కంటెస్టెంట్లు అందరూ జంటలుగా విడిపోయి నాగార్జున సాంగ్స్కు డ్యాన్స్ చేసి ఆయన్ను సర్ప్రైజ్ చేశారు. అందరితోపాటు అభిజిత్ కూడా డ్యాన్స్ బాగా చేశాడని నాగ్ మెచ్చుకున్నారు. అనంతరం తన భార్య అమల ఇచ్చిన బహుమతులను పంపించాడు. అందులో సంచుల కొద్దీ డ్రైఫ్రూట్స్ ఉండటంతో ఇంటిసభ్యులు సంతోషంతో ఎగిరి గంతేశారు. తర్వాత అఖిల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడారు. బిగ్బాస్ మిమ్మల్ని ఒంటిగంటకు నిద్ర లేపి ఏకగ్రీవంగా ఒక పేరు చెప్పమన్నాడు. ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఎవరు మీ గేమ్కు అడ్డుపడతారు? ఫైనల్స్కు మీకు అడ్డొచ్చేది ఎవరు? అని మూడు కండీషన్లు పెట్టారు. కానీ మీరందరూ మొదటి కండీషన్ను మాత్రమే పట్టుకుని వేలాడారు. అభిజిత్, లాస్య, హారిక ఎవరి పేరు వాళ్లే చెప్పుకోవడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ చర్చతో హౌస్లో వాతావరణం వేడెక్కగా దాన్ని చల్లబరిచేందుకు గేమ్ ఆడించారు. సెల్ఫ్డబ్బా కొట్టుకున్న హారిక త్వరగా ఆరిపోయే చిచ్చుబుడ్డి, అందర్నీ షేక్ చేసే ఆటంబాంబు ఎవరు అని ఆటాడించారు. మెహబూబ్.. అరియానా చిచ్చుబుడ్డి, అభిజిత్ ఆటంబాంబు అని చెప్పాడు ఇక అరియానా.. చాలా ఎఫెక్టివ్గా కనిపించాలనుకుంటాడు, కానీ ఏమీ ఉండదని మెహబూబ్ను చిచ్చుబుడ్డి, దొంగ మొహపోడు అవినాష్ ఆటంబాంబు అని చెప్పుకొచ్చింది. సోహైల్.. అరియానా చిచ్చుబుడ్డి, అభి ఆటంబాంబ్ అని అభిప్రాయపడ్డాడు. మోనాల్.. సోహైల్ చిచ్చుబుడ్డి, అభి ఆటంబాంబ్ అని తెలిపింది. అభి.. సోహైల్ చిచ్చుబుడ్డి, మెహబూబ్ ఆటంబాంబు అని తెలిపాడు. హారిక.. సోహైల్ వేస్ట్గాడు, ఎవ్వరూ పట్టించుకోరు అంటూ అతడికి చిచ్చుబుడ్డి ఇచ్చింది. తానే ఆటంబాంబు అని సెల్ఫ్డబ్బా కొట్టుకుంది. సరే కానీ ఎవరికి ఇస్తావు అని నాగ్ కూడా విసుగు చెందుతూ ఆమెలా గెంతుతూ నాగ్ ఇమిటేట్ చేయడంతో కంటెస్టెంట్లు పడీ పడీ నవ్వారు. అవినాష్, నువ్వు పెళ్లికి పనికి రావేమో దీంతో బుంగమూతి పెట్టిన హారిక.. మెహబూబ్కు ఆటంబాంబు ఇచ్చింది. లాస్య.. సోహైల్కు చిచ్చుబుడ్డి, అభికి ఆటంబాంబు ఇచ్చింది. అవును కానీ లాస్యను ఆంటీ అని ఏడిపించారేంటి అంటూ నాగ్ ఆమెను పదే పదే ఆంటీ అని గుచ్చి గుచ్చి పిలిచారు. తర్వాత అవినాష్.. మోనాల్ చిచ్చుబుడ్డి, అరియానా ఆటంబాంబు అని చెప్పాడు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ నువ్వు ఆటంబాంబు ఇచ్చినా ఆమె పడదు అని తేల్చి చెప్పారు. దీంతో అవినాష్ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశాడు. అయినా సరే నాగ్ మాత్రం నువ్వు పెళ్లికి పనికిరావేమో అని అవినాష్ మీద జోకేశారు. (చదవండి: అబ్బాయితో రిలేషన్లో ఉన్నా, కానీ బ్రేకప్ అయింది: హారిక) చంటిపిల్లాడిలా ఏడ్చేసిన అఖిల్ సీక్రెట్ రూమ్లో ఉన్న అఖిల్తో నాగ్ మాట్లాడుతూ.. "నువ్వు ఫైటర్, మరి అంత ఈజీగా ఎందుకు వచ్చేశావు?" అని నాగ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి అఖిల్ సమాధానమిస్తూ.. "ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంటును ఎందుకు పంపిస్తారు. వీక్ కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడిస్తారా? నన్ను పంపించరు అని నమ్మకముండే" అని చెప్పుకొచ్చాడు. దీనికి నాగ్ స్పందిస్తూ 'నీ అంచనా తప్పు. చాలా సీజన్లలో ఇలాగే కంటెస్టెంట్లను సీక్రెట్ రూమ్ నుంచే ఇంటికి పంపించేసిన సందర్భాలున్నాయి. నువ్వు బ్యాగు సర్దుకొని బయటకు వచ్చేయ్' అని ఆదేశించారు. దీంతో ఖంగు తిన్న అఖిల్ తనను పంపించొద్దని ప్రాధేయపడ్డాడు. దయచేసి పంపకండని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినా సరే అంగీకరించని నాగ్ కంటెస్టెంట్లతో ఫొటో దిగి వచ్చేయ్ అని చెప్పాడు. (చదవండి: మాస్టర్ మీద కావాలని కాఫీ పోసిన హారిక) అభిజిత్ ఆలోచన దిగజారిపోయింది.. ఈ విషయం తెలిసిన మోనాల్ అఖిల్కు బదులు తాను వెళ్లిపోతానంటూ ముందుకొచ్చింది. కానీ అది కుదరదని నాగ్ తేల్చి చెప్పారు. అనంతరం అఖిల్తో టాస్క్ ఆడించారు. ఇద్దరు ఫ్రెండ్స్, నలుగురు శత్రువుల పేర్లు చెప్పమన్నారు. దీంతో అఖిల్.. సోహైల్కు, మోనాల్కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాడు. అభి ఆమెను ఛీ కొట్టినా అతడు టాప్ 5లో ఉంటాడని మోనాల్ పాజిటివ్గా మాట్లాడేదని చెప్పాడు. ఇక అభిజిత్, లాస్య, హారిక, మెహబూబ్ను శత్రువుల జాబితాలో చేర్చాడు. మొదట అభిజిత్ గురించి మాట్లాడుతూ నీ ఆలోచన దిగజారిపోయింది అని విమర్శించాడు. "పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంత పచ్చగ కనిపిస్తదట. నువ్వు ఫేక్ అయితేనే నీకు వేరేవారు ఫేక్ అనిపిస్తారు" అని చెంపపెట్టుగా సమాధానమిచ్చాడు. (చదవండి: ఒక్కమాటతో మనసు దోచుకున్న మోనాల్) నా మీద అలాంటి జోకులా, ఇది నీ ఎథిక్స్ "సింపథీ కార్డు ఎప్పుడు పని చేయదు అన్నావు. నువ్వెన్నిసార్లు వాడావు. నేను వెళ్లిపోయేటప్పుడు ఐ హేట్ యూ అని చెప్పావు. అసలు నన్నో ఫ్రెండ్గా ఎప్పుడు ఇష్టపడ్డావు" అని హారికను నిలదీశాడు. నేను లేనప్పుడు నా మీద జోక్స్ వేశావు. అది నీ మెచ్యూరిటీ, ఎథిక్స్ అని లాస్యను విమర్శించాడు. ఎప్పుడూ నీకే అన్నీ చేయాలి అంటే ఎవరూ ఏం చేయరు అని మెహబూబ్కు బోధించాడు. తర్వాత లాస్య తన జోక్కు హర్ట్ అయినందుకు సారీ చెప్పగా హారిక మొదటి సారి ఐ లవ్యూ అని అఖిల్తో చెప్పింది. అనంతరం అఖిల్ హౌస్లోనే ఉంటున్నాడని నాగ్ స్పష్టం చేయడంతో సోహైల్, మోనాల్ తెగ సంతోషపడ్డారు. తర్వాత అఖిల్కు బంపరాఫర్ ఇచ్చారు. రెండు కుండలు పెట్టి అందులో ఒకదాంట్లో నామినేషన్, మరొకదాంట్లో కెప్టెన్సీ ఉంటుందని చెప్పాడు. అఖిల్ చేయి పెట్టిన కుండలోకెప్టెన్ ట్యాగ్ ఉండటంతో తర్వాతి వారం ఇమ్యూనిటీ పొందాడు. తర్వాత అభిజిత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. చివర్లో రెండు కిలోల మటన్ పంపించండని అవినాష్ నాగ్ను అభ్యర్థించాడు. దీంతో అతడి విన్నపాన్ని ఆలకించిన నాగ్ తప్పకుండా పంపుతానని హామీ ఇచ్చారు. -
అఖిల్ బ్యాగు సర్దుకో: నాగ్ సీరియస్
ఫినాలే వరకు సాగే మీ ప్రయాణంలో ఎవరు మీకు అడ్డుపడతారని భావిస్తారో, ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ పేరు చెప్పమని బిగ్బాస్ ఆదేశించగానే మెజారిటీ ఇంటిసభ్యులు అఖిల్ పేరు చెప్పారు. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని బిగ్బాస్ వెల్లడించాడు. కానీ ఇంటిసభ్యుల ముఖాలు చూస్తే ఎవరూ దీన్ని అంతగా నమ్మినట్లు కనిపించలేదు. దీని వెనక ఏదో కుట్ర ఉందని అనుమానపడ్డారు. ముఖ్యంగా అభిజిత్ అస్సలు అంగీకరించలేకపోయాడు. కెప్టెన్సీ కోసమే అంతలా కొట్లాడిన వ్యక్తి వెళ్లిపోమనగానే మారు మాట్లాడకుండా ఎలా వెళ్తాడని వాదించాడు. ఇదంతా స్క్రిప్టెడ్ అని పసిగట్టాడు. హిందీ సీజన్ చూసిన అఖిల్కు కూడా సీక్రెట్ రూమ్ ఉంటుందన్న విషయం ముందే తెలిసినట్లుంది. అందుకే తనను పంపించేస్తున్నారనగానే ఏమీ వాదించకుండా బ్యాగు పట్టుకుని వెళ్లిపోయాడు. (అఖిల్ ఎలిమినేట్; వెక్కివెక్కి ఏడ్చిన సోహైల్, మోనాల్) ఇది బిగ్బాస్ టీమ్కు నచ్చనట్లుంది. పెద్దగా డ్రామా పండలేదని నిరుత్సాహపడినట్లు తెలుస్తోంది. దీంతో నేడు నాగార్జున అఖిల్కు క్లాస్ పీకుతున్నారు. నీకు విన్నర్ అవడం ఎంత అవసరమో నాకు తెలుసు, అలాంటిది వెళ్లిపోమనగానే ఎలా ఒప్పుకున్నావు అని ప్రశ్నించాడు. దీంతో అఖిల్ తనది ఫేక్ ఎలిమినేషన్ అన్న విషయం ముందే పసిగట్టినట్లు ఒప్పుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంటును బయటకు పంపిస్తే వీక్ కంటెస్టెంట్లతో గేమ్ ఆడుతారా? అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో అఖిల్ ఓవర్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టేందుకు సిద్ధమైన నాగ్ నీ అంచనా తప్పు.. బ్యాగు సర్దుకుని బయటకు వచ్చేయ్ అని సీరియస్ అయ్యారు. ఊహించని షాక్తో విస్తుపోయిన అఖిల్ ప్లీజ్ సార్, మిమ్మల్ని అర్థిస్తున్నా.. ఎలిమినేట్ చేయకండి అంటూ చేతులెత్తి వేడుకుంటున్నాడు. అయినా సరే లెక్క చేయని నాగ్.. ముందు బ్యాగు సర్దుకుని వచ్చేయ్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో అఖిల్ మమ్మీ అంటూ చంటిపిల్లాడిలా ఏడుపు లంకించుకున్నాడు. ఏం చేసినా అఖిల్ మాత్రం ఎలిమినేట్ కాడనే విషయం ప్రేక్షకులకు బాగా తెలుసు. (నాలుగన్నరేళ్లు ఓ అబ్బాయితో రిలేషన్లో ఉన్నాను: దేత్తడి) -
బిగ్బాస్: ఎలిమినేషన్? రీ ఎంట్రీ?
బిగ్బాస్ సీజన్ ప్రారంభమైందంటే వినోదానికి ఢోకా లేనట్టే. కానీ ఈ నాల్గో సీజన్ మాత్రం ప్రారంభంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో కాస్త తడబడినట్లు కనిపించినా.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుని జనాలను తిరిగి తనవైపుకు తిప్పుకుంటోంది. అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం ఇంకా గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఐయామ్ బోల్డ్, స్ట్రాంగ్ అంటూ వీరవనితలా మాట్లాడిన అరియానా ఇంటిసభ్యులందరూ తనపై నామినేషన్ అనే అస్త్రాన్ని వదలగానే మన్ను తిన్న పాములా మారిపోయింది. తన అల్లరితో ఇల్లు పీకి పందిరి వేసే ఆమె ఇప్పుడు హౌస్లో ఉందా? లేదా? అన్నట్లుగా ఉంది. అటు అవినాష్ కూడా నోయల్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడు. ఫిజికల్ టాస్కు అంటే మెహబూబ్ ఉండాల్సిందే ఇక కెప్టెన్సీ కోసం కొట్టుకు చచ్చిన అఖిల్ హౌస్ నుంచి బయటకు వెళ్లినట్టే వెళ్లి సీక్రెట్ రూమ్లో పాగా వేశాడు. ఇప్పుడిప్పుడే తన మీద ఉన్న మచ్చలను తుడిపేసుకుంటూ మోనాల్ సరైన ట్రాక్ ఎక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఇక సోహైల్ చెప్పినట్టుగానే అభిజిత్ ఐడియాలు ఇస్తాడు కానీ ఏమీ చేయడని అతడే స్వయంగా రుజువు చేసుకుంటున్నాడు. జున్నును గుర్తు చేసుకుంటూ పదేపదే బాధపడుతున్న లాస్య హౌస్లో వంటింటి కుందేలుగా మారిపోయింది. హారిక అయితే అభి, లాస్యతో లేదంటే కెమెరాలతో మాట్లాడుతూ పొద్దు గడుపుతోంది. ఫ్రెండ్షిప్పే తన బలం అనుకుంటున్న సోహైల్కు అదే బలహీనంగా మారుతోంది. మిగిలింది మెహబూబ్.. మొదట్లో కాస్త అతిగా ప్రవర్తించి చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. కానీ తర్వాత మామూలుగానే ఉన్నాడు. అయినా సరే అతడిపై వ్యతిరేకత మాత్రం పోలేదు. అయితే ఫిజికల్ టాస్కులో చావోరేవో అన్నట్లుగా పోరాడుతాడు. ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తాడు. (చదవండి: హారిక హగ్గిచ్చి ఎన్నిరోజులైతుందో: అభిజిత్) రీఎంట్రీ, ఎలిమినేషన్.. ఏదో ఒకటేనా? వీరిలో ఒకరు బిగ్బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం వచ్చింది! పదోవారానికిగానూ అభిజిత్, సోహైల్, మెహబూబ్, అరియానా, మోనాల్, హారిక ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. వీరిలో మెహబూబ్, ఆ తర్వాత మోనాల్ డేంజర్ జోన్లో ఉన్నారు. దీపావళి సందర్భంగా ఎలిమినేషన్ రద్దు చేస్తే మెహబూబ్ మరోసారి అదృష్టవంతుడని నిరూపించుకున్నట్లే. ఎందుకంటే హౌస్ను వీడనుంది మెహబూబ్ అని సోషల్ మీడియా పోల్స్ ఘంటాపథంగా చెప్తున్నాయి. మరోవైపు సీక్రెట్ రూమ్లో ఉన్న అఖిల్ నేడు హౌస్లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. రీ ఎంట్రీ ఉండటంతో పాటు పండగ స్పెషల్ అంటూ ఎలిమినేషన్ ఉంచుతారా? ఎత్తేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్బాస్కు తలనొప్పిగా మారుతోన్న మెహబూబ్!) -
బిగ్బాస్: లాఠీ దెబ్బలు తిన్నాం, కోర్టు మెట్లు ఎక్కాం
బిగ్బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు వారి రహస్యాల గుట్టును బయటపెట్టగా లేఖలు అందుకుని ఎమోషనల్ అయ్యారు. అయితే ఇద్దరికి మాత్రం అఖిల్ లేఖలు పంపలేదు. వాళ్లకు లెటర్స్ ఎందుకు పంపలేదు? కంటెస్టెంట్లు ఏయే సీక్రెట్లను వెల్లడించారో చదివేయండి..బిగ్బాస్ లైఫ్ చూపిస్తుంది అని అఖిల్కు బోధపడింది. మరోవైపు అఖిల్ గురించి అభిజిత్ అతడి స్నేహితులతో మాట్లాడాడు. మళ్లీ లోపలికి పంపిస్తారన్న నమ్మకంతోనే కదా.. అందరూ అతడి పేరు చెప్పగానే ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు అని చెప్పుకొచ్చాడు. సీక్రెట్ రూమ్లో ఉన్న అఖిల్ ఈ మాటలను పూర్తిగా వ్యతిరేకించాడు. అయితే ఇదంతా ఏదో స్క్రిప్టెడ్ అని అభికి లోపల బలమైన అనుమానమే ఉంది. ఇక మటన్ చెడిపోవడంతో రేషన్ మేనేజర్ అవినాష్ మీద అందరూ గరమయ్యారు. దీంతో ఒక్క కిలో మటన్ పంపమని అతడు కెమెరాల ముందు వేడుకున్నాడు. అయినా సరే శాంతించని సోహైల్, మెహబూబ్, అరియానా.. అవినాష్ను చితకబాదారు. అతడిని స్విమ్మింగ్ పూల్లో నిమజ్జనం చేశారు. లాఠీలతో కొట్టి స్టేషన్లో వేశారు: మెహబూబ్ అనంతరం ఇంటిసభ్యుల కోసం వారి ఆప్తులు లేఖలు పంపించారు. వాటిని హౌస్మేట్స్కు ఇవ్వాలా? వద్దా? అనేది అఖిల్ నిర్ణయానికి వదిలేశారు. మరోవైపు హౌస్లో ఉన్న ఇంటిసభ్యులు ఇప్పటికీ ఎవరితోనూ పంచుకోని అతిపెద్ద రహస్యాన్ని చెప్పాలని బిగ్బాస్ ఆదేశించాడు. అప్పుడే వారికి లేఖలు అందుతాయని స్పష్టం చేశాడు. మొదట కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లిన మెహబూబ్ మాట్లాడుతూ.. "నా బెస్ట్ ఫ్రెండ్ను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాను. ఆమె కోసం టికెట్ తీసుకోడానికి లోపలకు వెళ్లాను. అయితే హడావుడిలో రాంగ్ ప్లేస్లో బండి పార్క్ చేశాను. దీంతో అక్కడ పోలీసులు ఆమ్మాయిని అనుమానిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేను వెళ్లేసరికి ఆమె ఏడుస్తుండటంతో పోలీసుల మీదకు తిరగబడ్డాను. అప్పుడు వాళ్లు నా కాలర్ పట్టుకుని లాఠీలతో కొట్టారు. నన్ను, అమ్మాయిని స్టేషన్కు తీసుకెళ్లారు. అమ్మాయిని వెంటనే వదిలేశారు. కానీ నన్ను మాత్రం రెండు రోజుల వరకు పోలీస్ స్టేషన్ నుంచి పంపించలేదు" అని చెప్పుకొచ్చాడు. దీంతో అఖిల్ అతడికి లేఖ పంపించాడు. అవమానాలను గెలుపుగా మార్చుకున్న దేత్తడి హారిక మాట్లాడుతూ.. "అమ్మ దగ్గర దాచిన ఏకైక రహస్యం ఇది. ఆరేళ్లుగా చెప్పాలనుకుంటున్నా, ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు చెప్తున్నా. హారికను చూసి నేర్చుకోండి. లవ్వుల జోలికే వెళ్లదు అని నన్ను ఆదర్శంగా తీసుకోమని అందరికీ చెప్పేదానివి. సారీ అమ్మా.. నాలుగన్నరేళ్లు ఓ అబ్బాయితో రిలేషన్లో ఉన్నాను. ఇది రెండేళ్ల క్రితం ముచ్చట. ఎక్కువ కేరింగ్ చూపించేసరికి అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు బ్రేకప్ అయింది" అని చెప్పుకొచ్చింది. దీంతో హారికకు కూడా లేఖ అందింది. అవమానాలను గెలుపుగా మార్చుకున్నావు తల్లీ అంటూ ఆమె అన్నయ్య రాసిన ఒక్కో వాక్యం చదువుతూ కన్నీటి పర్యంతం అయ్యింది. (ఇప్పటికిప్పుడు హగ్గిస్తే కుర్చీలో నుంచి కింద పడిపోతావు) సినిమా ఛాన్స్ అనగానే రూ.80 వేలు ఇచ్చాను అవినాష్ మాట్లాడుతూ.. "సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే కిరాణ షాపులో, తర్వాత ఓ కంపెనీలో ఆఫీసు బాయ్గా పని చేశాను. ఓసారి ఆడిషన్ కోసం మణికొండ వెళ్లాను. రూ.80 వేలు ఇస్తే లీడ్ క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు. సినిమా పిచ్చితో నేను మా నాన్నను అడిగితే ఆయన అప్పు చేసి మరీ తెచ్చారు. దాన్ని తీసుకెళ్లి నిర్మాత చేతిలో పెట్టాను. నువ్విక్కడే ఉండు, రెండు రోజుల్లో ఖమ్మం షూటింగ్ వెళ్తున్నాం అని చెప్పి జంప్ అయ్యారు. మొదటిసారి అలా మోసపోయాను. ఇప్పటికీ ఇది మా తల్లిదండ్రులకు తెలీదు" అని చెప్పాడు. అయితే ఈ విషయం తనతో చెప్పాడని అఖిల్ అతడి లేఖను చించేశాడు. కానీ అవినాష్ మాత్రం చించిన లేఖ ముక్కలను ఒకచోట చేర్చి చదివే ప్రయత్నం చేశాడు. (జబర్దస్త్లోకి మళ్లీ తీసుకుంటారు: అవినాష్ తమ్ముళ్లు) నా భర్త నాకంటే ఓ ఏడాది చిన్న: లాస్య లాస్య మాట్లాడుతూ.. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లయింది. నేను పెళ్లాడిన వ్యక్తి పేదవాడు, నాకన్నా ఒక ఏడాది చిన్న. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఈ షోకు వచ్చాక అమ్మకు షాకుల మీద షాకులిస్తున్నా. వయసు చిన్నదే అయినా మనసు గొప్పది" అని లాస్య కన్నీళ్లతో చెప్పుకొచ్చింది. ఆమెకు లేఖ అందగా దాన్ని చదువుకుంటూ మరోసారి కంటతడి పెట్టుకుంది. అభిజిత్ మాట్లాడుతూ.. "మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్లో ఓ రెస్టారెంటుకు వెళ్లాను. ఆర్డర్ ఇచ్చాను. అక్కడున్న ఓ వ్యక్తి నీకోసం నేను డ్రింక్ తీసుకోవచ్చా అని అడిగాడు. ఇదేదో బాగుందని సరే అన్నాను. ఇద్దరం ఒకరి గురించి ఒకరం మాట్లాడుకున్నాం. నెంబర్ అడిగాడు. అనుమానపడుతూనే ఇచ్చాను. ఆ తర్వాత అతడు మీదమీదకొస్తుంటే ఏం చేస్తున్నావు అని అడిగితే ఇది గే బార్ అని చెప్పాడు. అప్పుడు నేను బయటకు వెళ్లి బోర్డు చదివాను" అని సీక్రెట్ను వెల్లడించాడు. అఖికి అందిన లేఖ చదవడం పూర్తవగానే హారిక వెళ్లి అతడికి హగ్గిచ్చింది. అర్ధరాత్రి కారు యాక్సిడెంట్.. అరియానా మాట్లాడుతూ.. "ఈ జూలై 13కు నాతో పాటు నలుగురు చనిపోయి ఒక సంవత్సరం అయ్యేది. మా ఊరుకు వెళ్దాం అని అర్ధరాత్రి కారులో బయలుదేరాం.. ఒక మనిషి బైకు మీద అడ్డు వచ్చాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక కిలోమీటర్ వరకు కారు దూసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్ను గుద్దింది. కారు నుజ్జయ్యింది. బయటకు వస్తే వైరులు తగిలి షాక్ కొట్టేది. ఆ ప్రమాదం నుంచి బయట పడకుండే ఈ రోజు నేనిక్కడ ఉండేదాన్నే కాదు" అని ఎమోషనల్ అయింది. ఇది సీక్రెట్ కాదని అఖిల్ ఆమె లెటర్ చించేశాడు. (మొదటి బిడ్డను చంపుకున్నా: లాస్య కన్నీళ్లు) కుటుంబం కోసం చదువు త్యాగం చేశా: మోనాల్ మోనాల్ మాట్లాడుతూ.. "పన్నెండో తరగతి పూర్తయ్యాక నాకు బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ చదవాలనుకున్నాను. కానీ కాలేజీ టైమింగ్, జాబ్ టైమింగ్ సెట్ కాలేదు. దీంతో ఫైనలియర్ డ్రాప్ అవుట్ అయ్యాను. ఎందుకంటే నా ఫ్యామిలీ కోసం చదువు త్యాగం చేశాను. ఇది ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు" అని ఏడ్చేసింది. దీంతో అఖిల్ ఆమెకు లేఖ పంపించాడు. అది చదువుతున్న మోనాల్ కన్నీటిని సోహైల్ తుడుస్తూ దగ్గరకు తీసుకున్నాడు. (బిగ్బాస్: సోహైల్కు గట్టి షాక్ ఇచ్చిన మెహబూబ్) డ్రంక్ అండ్ డ్రైవ్లో 102 రీడింగ్ వచ్చింది: సోహైల్ సోహైల్ మాట్లాడుతూ.. "ఇప్పుడు మందు మానేశాను. కానీ కొన్నేళ్ల క్రితం ఓసారి పబ్బు నుంచి తాగొస్తున్నా. అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 102 రీడింగ్ వచ్చింది. కారు తీసుకుపోయారు. తర్వాతి రోజు స్టేషన్కు వెళ్లి చలానా కట్టిన. అప్పుడు కోర్టు స్లాట్ తీసుకోమన్నారు. తల్లిదండ్రులను తీసుకురమ్మన్నారు. డూప్లికేట్ పేరెంట్స్ను మాట్లాడిన. కానీ మా ఫ్రెండ్ అట్లా నడవదని చెప్పిండు. కోర్టుకు వెళ్లాక ప్రతి ఒక్కడూ పదో తరగతి రిజల్ట్ వచ్చినట్టు నీ రీడింగ్ ఎంత అని అడుగుతూనే ఉన్నారు. ఆఖరికి మా తమ్ముడిని పిలిపించిన. ఇది అమ్మావాళ్లకు తెల్వదు" అని సీక్రెట్ బయటపెట్టాడు. బిగ్బాస్ను అర్థిస్తున్న అఖిల్ మా తమ్ముడు ఈ రహస్యం నాకు కూడా చెప్పలేదని అఖిల్ అతడికి లేఖను అందించాడు. అందులో మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, అఖిల్, మెహబూబ్ నిన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పినప్పుడు సంతోషంగా అనిపించింది అని అతని తండ్రి రాసుకొచ్చాడు. లేఖను చదివి సోహైల్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. అఖిల్ గుర్తొచ్చి బాధపడ్డాడు. మరోవైపు అఖిల్ తనకు లెటర్ కావాలని బిగ్బాస్ను ప్రాధేయపడుతున్నాడు. మరి అతనికి లేఖ అందిందా? లేదా? అనేది రేపు తేలనుంది. -
ఈ విషయంలో మాత్రం సక్సెస్ అవుతున్న బిగ్బాస్
ఇప్పుడు కానీ బిగ్బాస్ కళ్లు చల్లారవు.. ఈ మాట అంటోంది మేము కాదు, నెటిజన్లు.. ఎందుకో ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది.,.. ఈ సీజన్లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆక్రమించింది మోనాల్, అఖిల్, అభిజిత్. బిగ్బాస్ ఫస్టాఫ్ అంతా ఆమె కోసం ఈ ఇద్దరూ కొట్టుకోవడంతోనే సరిపోయింది. వాళ్లిద్దరి మధ్య ప్రత్యేకించి గొడవలు లేకపోయినా మోనాల్ వల్ల శత్రువులుగా మారిపోయారు. ఆ తర్వాత అభి.. మోనాల్కు దూరమవడం, ఆమె అఖిల్కు మరింత దగ్గరవడం జరిగింది. అయితే అనూహ్యంగా అఖిల్ కూడా మోనాల్ను పక్కన పెట్టేసి అభిజిత్కు దగ్గరయ్యాడు. అతడితో స్నేహ గీతం పాడాడు. దీంతో గొడవలు జరిగేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ అందరికీ షాకిస్తూ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటూ అఖిల్ అభిజిత్ను నామినేట్ చేశాడు. తర్వాత చాక్లెట్ ఇచ్చి కూల్ చేశాడు. అయిపోయింది. ఇక్కడ కూడా ఎలాంటి గొడవా లేదు, గందరగోళం లేదు. ఇది బిగ్బాస్కు బొత్తిగా నచ్చనట్లుంది. అందుకే మరో ప్లాన్ వేశాడు. అఖిల్ను సీక్రెట్ రూమ్లోకి పంపించి అతడికి అభికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చిచ్చు పెట్టనున్నాడు. అభి అభిప్రాయాలన్నింటినీ అఖిల్ చెవిన వేస్తున్నాడు. అసలే ఎవరి మాటతోనూ ఏకీభవించని అఖిల్ అభి వ్యాఖ్యలకు సీక్రెట్ రూమ్నుంచే కౌంటరిస్తున్నాడు. ఈ మేరకు స్టార్ మా తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో అభి ఈ వారం రద్దైన కెప్టెన్సీ టాస్క్ మీద మరోసారి చర్చ లేవనెత్తాడు. ఒక వారం ఇమ్యూనిటీ కోసం ఇంత కొట్లాడిన వాడు సడన్గా పంపించేస్తే ఎందుకు ఊరుకున్నాడని సందేహిస్తున్నాడు. అంటే ఇదంతా ఫేకే కదా! ఎలాగో మళ్లీ హౌస్లోకి పంపిస్తారులే అన్న నమ్మకమే కదా! అని వాదించాడు. దీనికి అఖిల్.. నీ అంత కాన్ఫిడెన్స్ మాకు లేదయ్యా అని సీక్రెట్ రూమ్లో నుంచి ఉన్నమాట చెప్పాడు. (చదవండి: నేను ఆడటానికి రాలేదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం..) ఒకవేళ నిజంగా పంపించలేకపోతే ఎంత భయంగా ఉంటుంది? అని అభి అనగా నీకు కావాల్సింది కూడా అదేగా అని అఖిల్ కౌంటరిచ్చాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మీరిద్దరూ మనసులో ఏదో పెట్టుకుని బయటకు మాత్రం కలిసి ఉంటూ ఫేక్ ఎమోషన్స్ ప్రదర్శించకండని హితవు పలుకుతున్నారు. అభిజిత్.. అఖిల్కోసం పాజిటివ్గానే మాట్లాడుతున్నారని అతని అభిమానులు అభిని సమర్థించుకుంటున్నారు. అఖిల్ స్నేహితుల దగ్గరే అతడి గురించి తప్పులు తీస్తూ మాట్లాడటం ఏంటని అఖిల్ అభిమానులు మండిపడుతున్నారు. ఏదేమైనా కలిశారు అనుకున్న అఖిల్, అభిజిత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిని బిగ్బాస్ కావాలని క్రియేట్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎపిసోడ్తో అభి, అఖిల్ మధ్య పుల్లలు పెట్టే మిషన్ను బిగ్బాస్ విజయవంతంగా పూర్తి చేయనున్నాడని చెప్తున్నారు. (చదవండి: బిగ్బాస్: అభిజిత్ రూటులో అఖిల్?) -
బిగ్బాస్: 'కరివేపాకు'కు అభిజిత్ ఫ్యాన్స్ వార్నింగ్
బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్లు చేసే రచ్చ కన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ మరీ దారుణంగా ఉంటుంది. అభిమాన కంటెస్టెంటును వెనకేసుకు రావడం కన్నా, ఇతరుల మీద పడి ట్రోలింగ్ చేయడమే వీళ్లు ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారు. రెండో సీజన్లో కౌశల్ ఆర్మీ నెట్టింట ఎంత హడావుడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీజన్లో మాత్రం అందరికన్నా ఎక్కువగా అభిజిత్ పేరుతో ఏర్పాటైన ఆర్మీలు ఏకంగా సోషల్ మీడియాను ఆక్రమించుకున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే అభి తప్పు చేసినా, ఒప్పు చేసినా, పని చేసినా, చేయకపోయినా.. ఇలా ప్రతిదాన్ని గుడ్డిగా వెనకేసుకొస్తున్నాయి. హౌస్లో అభి మీద ఈగ వాలినా బయట వీళ్లు చేసే హడావుడి మామూలుగా ఉండటం లేదు. అఖిల్కు ఆక్సిజన్లా మారిన సీక్రెట్ రూమ్ ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ సీజన్లో ప్రస్తుతం పదోవారం కొనసాగుతోంది. ఇంకా ఐదువారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ఒకరైన అఖిల్ ఫేక్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే నిజంగానే తన ప్రయాణం ముగిసిందేమోనని ఒక్క క్షణం గుండె ఆగిన అఖిల్కు బిగ్బాస్.. సీక్రెట్ రూమ్ అనే ఆక్సిజన్ అందించాడు. దీంతో హమ్మయ్యా.. నా బెర్త్ ఎక్కడికి పోలేదని గుండెలమీద చెయ్యేసుకున్నాడు. అయితే ఈ రహస్య గదిలో కేవలం ఇంటిసభ్యులు ఏం మాట్లాడుకుంటారో ఆ క్లిప్పింగులు చూస్తూ గడిపేయడమేననుకున్నాడు. కానీ సోహైల్ మాటలో చెప్పాలంటే కథ వేరే ఉంది. (చదవండి: బిగ్బాస్: హోస్ట్, గెస్ట్గా తండ్రీకొడుకులు) అభికి లెటర్ వచ్చిందా? లేదా? కంటెస్టెంట్లకు వచ్చిన లెటర్లను పంపించి వారిని సంతోషర్చడం లేదా, వాటిని తునాతునకలు చేసి బాధపర్చడం అంతా అఖిల్ చేతిలోనే ఉందని బిగ్బాస్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో తన స్నేహితులకు లెటర్స్ పంపి వారి ముఖంలో నవ్వులు చూసి అఖిల్ సంతోషపడుతున్నట్లు ప్రోమోలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే అభిజిత్ కోసం వచ్చిన లెటర్ను హౌస్లోకి చేరవేశాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అభిజిత్ మాత్రం తన ఎదుట కాగితపు ముక్కలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీన్ని బట్టి అభికి లెటర్ రాలేదని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. దీంతో అఖిల్ను కరివేపాకుతో పోల్చుతూ అతడి మీద మండిపడుతున్నారు. (చదవండి: బిగ్బాస్: అఖిల్కు ఏమైంది?) నిజమేంటో తెలీకుండానే ట్రోలింగ్ ఒకవేళ అభి చేతికి లెటర్ అందకపోతే అఖిల్ను ఆ దేవుడు కూడా కాపాడలేరని వార్నింగ్ ఇస్తున్నారు. 'ఇప్పటికే నామినేట్ చేసి తప్పు చేశావు, ఇప్పుడు లెటర్ ఇవ్వకుండా మరో తప్పు చేస్తావా? అయినా మీరు ఎన్ని వేషాలు అభి ఇంకా స్ట్రాంగ్ అవుతాడు" అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరికీ లేఖలు పంపిచడానికి వీల్లేదని బిగ్బాస్ షరతు పెట్టి ఉండొచ్చేమోనని అఖిల్ అభిమానులు అతడిని వెనకేసుకొస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రోమోను చూసి తప్పులో కాలేయకండని, అభికి కూడా లెటర్ వస్తుందని ఆశించండి అని సానుకూలంగా ఆలోచించమని హితవు పలుకుతున్నారు. ఎపిసోడ్ చూడకుండా ఒకర్ని ట్రోల్ చేయడమేంటని తిట్టిపోస్తున్నారు. ఏదేమైనా అతడికి లెటర్ అందలేదేమోనన్న ఆలోచనకే సోషల్ మీడియా షేక్ అయిపోతుంటే ఇక ఎపిసోడ్లో అదే నిజమైతే, అఖిల్ను ఏ రేంజ్లో ఆడుకుంటారో! అఖిల్ కూడా తన చర్యను ఎలా సమర్థంచుకుంటాడో చూడాలి! -
రెండేళ్ల క్రితం రిలేషన్లో ఉన్నా: హారిక
అఖిల్ వెళ్లిపోయాడని మోనాల్, సోహైల్ తెగ బాధపడ్డారు. కానీ మిగతావాళ్లు మాత్రం అతడు లేడన్న విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇక అభిజిత్ అయితే హౌస్లో పెద్ద తేడా ఏమీ కనిపించట్లేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా లక్కీ ఛాన్స్ కొట్టేసిన అఖిల్.. ఇప్పుడు అందరి ఆటను దగ్గరుండి చూస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు వారి పాలిట మరో బిగ్బాస్ అయి కూర్చున్నాడు. కంటెస్టెంట్ల కోసం వారి ఇంటి నుంచి లేఖలు వచ్చాయి. వాటిని అందరికీ ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయం అఖిల్ చేతిలో ఉంది. ఎలాగో మోనాల్, సోహైల్ లేఖలను వారికి అందించకుండా ఉండే ప్రసక్తే లేదు. వారితో పాటు హారిక, లాస్య, మెహబూబ్కు కూడా లెటర్స్ వచ్చినట్లు తాజా ప్రోమోను చూస్తుంటే తెలుస్తోంది. కానీ కొందరి లేఖలు ముక్కలు ముక్కలు చేసి పంపించడంతో వారు షాక్ తిన్నారు. ఎప్పుడూ తన ఎమోషన్ను బ్యాలెన్స్ చేసుకునే అభిజిత్కు అఖిల్ లేఖ పంపించకోవచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఆరిపోయే దీపం, నామినేషన్స్.. ఈ రెండూ అరియానా ధైర్యాన్ని దెబ్బతీశాయి. ఈ సమయంలో ఆమెకు ఇంటి నుంచి లెటర్ వస్తే ఆమె తిరిగి మామూలయ్యేందుకు అవకాశముంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: బిగ్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్లోకి అఖిల్!) మరోవైపు ఇంటి సభ్యులు ఇంతవరకు ఎవరికీ చెప్పని రహస్యాలను బయటపెట్టాలని బిగ్బాస్ ఆదేశించాడు. తుంటరి పనులు చేసే సోహైల్ తన జీవితంలో ఓ సారి నకిలీ తల్లిదండ్రులను మాట్లాడుకున్నానని చెప్పాడు. రెండేళ్ల క్రితం ఓ అబ్బాయితో రిలేషన్లో ఉన్నానని హారిక తన ప్రేమ విషయాన్ని భయపడుతూనే చెప్పేసింది. మొదటిసారి ఇండస్ట్రీలో డబ్బులు మోసపోయానని అవినాష్ తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్లను చెప్పాడు. గతాన్ని తవ్వుతున్న అరియానా.. ఈపాటికి అలా జరిగుంటే నాతోపాటు నలుగురు చనిపోయేవాళ్లు అని చెప్పుకొచ్చింది. లాస్య.. ఈరోజు మా అమ్మకు ఇంకో షాక్ ఇవ్వబోతున్నానంటూ మరో రహస్యాన్ని బట్టబయలు చేయనుంది. ఇలా వారి గతంలో చోటు చేసుకున్న రహస్యాలను తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: అవినాష్ను వెంటాడుతున్న ఆత్మహత్య ఆలోచనలు?) -
పోలీస్ కస్టడీకి వరలక్ష్మి హత్య కేసు నిందితుడు అఖిల్
-
వరలక్ష్మి హత్య కేసు: పోలీస్ కస్టడీకి అఖిల్
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో సంచలనం రేకెత్తించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో నిందితుడు అఖిల్ సాయిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అందులో భాగంగా బుధవారం నుంచి విచారణ కొనసాగించారు. ముఖ్యంగా ఒక మైనర్ బాలికను హత్య చేయడం వెనుక అఖిల్ అనుసరించిన అంశాలను పోలీసులు సేకరించారు. నిందితుడు ప్రేమ పేరిట బాలికను నిర్మానుష్య ప్రాంతానికి రప్పించడమే కాక హత్య నేరాన్ని మరొకరిపై నెట్టే ప్రయత్నం జరిగింది. వీటిపై ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితునిపై త్వరితగతిన శిక్ష పడే రీతిలో పోలీసులు సాంకేతికపరమైన ఆధారాలు ఈ కేసులో సేకరిస్తున్నట్లు తెలిసింది. విశాఖ దీక్ష ఏసీపీ ప్రేమ్ కాజల్ స్వయంగా నిందితుడిని విచారించినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు ముగియడంతో అగనంపూడి ప్రాథమిక వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. చదవండి: వరలక్ష్మి హత్య కేసులో మరో ట్విస్ట్ -
నేను గేమ్ ఆడటానికి రాలేదు: అభిజిత్
ఇంట్లో ఒక్కరూ నాకు సపోర్ట్ చేయలేదు అని అఖిల్ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. మొదటిసారి అభి మినహా అందరూ ఏకాభిప్రాయంతో అఖిల్ పేరు చెప్పారు.. కానీ అతడిని హౌస్ నుంచి బయటకు పంపించడానికి. అయితే ఓ రకంగా ఇది అతనికి మంచే చేసింది. ఎవరేంటని తెలుసుకునేందుకు మంచి అవకాశం లభించింది. అయితే అఖిల్ ఎలిమినేట్ కావడంలో మోనాల్, సోహైల్ కీలక పాత్ర వహించడం అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. గేమ్ కోసం ఫ్రెండ్ పేరు చెప్పిన సోహైల్, మోనాల్ అర్ధరాత్రి ఇంటిసభ్యులను నిద్ర లేపిన బిగ్బాస్ అందరినీ బ్యాగు సర్దుకోమని ఆదేశించాడు. అనంతరం ఫినాలే వరకు సాగే మీ ప్రయాణంలో ఎవరు మీకు అడ్డుపడతారని భావిస్తారో ఆ వ్యక్తి పేరును ఏకాభిప్రాయంతో తెలియజేయాలని, అతడు తక్షణమే హౌస్ను వీడి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక కంటెస్టెంట్లు తలలు పట్టుకున్నారు. అభిజిత్ మాత్రం తనకు అడ్డు పడేంత స్ట్రాంగ్ ఎవరూ అనిపించట్లేదు అంటూనే ఇక్కడికి కచ్చితంగా గెలవడానికి రాలేదు, ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే వచ్చానని తనలో తనే మాట్లాడుకున్నాడు. అనంతరం సోహైల్, మోనాల్, అరియానా.. అఖిల్; మెహబూబ్, అవినాష్.. అరియానా; అఖిల్, లాస్య, అభిజిత్ వాళ్ల పేరును వాళ్లే చెప్పుకున్నారు. అందరూ ఏ పేరు చెప్తే దానితో తాను ఏకీభవిస్తానని హారిక తెలిపింది. (చదవండి: నాకొక గర్ల్ఫ్రెండ్ కావాలి: అఖిల్) ఎలిమినేషన్తో మూగబోయిన అఖిల్ అఖిల్కు ఎక్కువ మెజారిటీ ఓట్లు పడటంతో అతడు హౌస్ నుంచి నిష్క్రమించాడు. ఇది ఊహించని అతడు కన్నీళ్లు ఆపుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. మొదటి సారి ఏకాభిప్రాయంతో నన్ను సెలక్ట్ చేసుకున్నారు అంటూ తన బాధను చెప్పుకునేందుకు మాటలు వెతుక్కున్నాడు. సోహైల్, మోనాల్ కన్నీళ్ల పర్యంతం అవగా అభిజిత్ మాత్రం కనీసం దగ్గరకు కూడా వెళ్లలేదు. అఖిల్ లాగే సోహైల్, మోనాల్ గేమ్ ఈజ్ గేమ్ అని ఆలోచించారు. కానీ స్ట్రాంగ్ అని చెప్తూనే తన ఫ్రెండును బయటకు పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని లాస్య, అభి, హారిక.. మోనాల్ తీరు మీద చర్చలు పెట్టారు. తామైతే అలా చేయలేమని అభిప్రాయపడ్డారు. (చదవండి: మోనాల్తో తెగతెంపులు చేసుకున్న అభిజిత్!) అబద్ధం చెప్పిన అభి, దండం పెట్టిన అఖిల్ మరోవైపు అఖిల్ ఫేక్ ఎలిమినేషన్తో నేరుగా సీక్రెట్ రూమ్లోకి వెళ్లాడు. ఈ అవకాశం లభించినందుకు ఆనందించిన అఖిల్ ఇప్పుడు తనకు క్లారిటీ దొరుకుతుందని భావించాడు. కానీ అక్కడ హౌస్లో మాత్రం మోనాల్, సోహైల్ చంటిపిల్లల్లా ఏడ్చారు. ఇక తర్వాతి రోజు నుంచి ఇంట్లో ఏం జరుగుతుందనేది అఖిల్ టీవీలో చూశాడు. ఈ సందర్భంగా మోనాల్ అతడిని తలుచుకుని కన్నీళ్లు కార్చడం చూసి ఫీలయ్యాడు. ఇక కెప్టెన్సీ టాస్కులో సోహైల్ బయటకు వచ్చేయడం ఏంటని అభి హారికతో అన్నాడు. వాళ్లు గొడవపడి పది రోజులు మాట్లాడుకోలేదు అనడంతో ఇది పెద్ద అబద్ధమంటూ అఖిల్ లోపల నుంచే దండం పెట్టాడు. ఇక అభి కూడా ఇది కనక నువ్వు చూస్తుంటే వచ్చాక దీని గురించి మాట్లాడతాను అని అఖిల్ను ఉద్దేశించి చెప్పాడు. అఖిల్ వెళ్లిపోయాక ఇల్లు చాలా సైలెంట్గా అయిపోయిందని మోనాల్ వెలితిగా ఫీలవుతుంటే తనకు మాత్రం ఎప్పటిలాగే ఉందని అభి కౌంటరిచ్చాడు. -
అఖిల్ అవుట్: ఆలస్యంగా తెలుసుకున్న బిగ్బాస్!
సీక్రెట్ రూమ్.. బిగ్బాస్ ప్రేమికులకు మజా వచ్చే టాస్క్ ఇది. లోపలున్న కంటెస్టెంట్లకు షాకిచ్చే చర్య. ఎందుకంటే వారికి ఎలిమినేషన్ అనే చెప్తారు. కాబట్టి తమలోంచి ఒకరు హౌస్ను వీడిపోతున్నారని కన్నీళ్లు పెట్టుకుంటారు. స్ట్రాంగ్ కంటెస్టెంటు వెళ్లిపోవడం వల్ల టాప్ 5లో బెర్తు కన్ఫార్మ్ అయినట్లేనని మరికొందరు లోలోపలే మురిసిపోతుంటారు. ఇక హౌస్ గేటు దాటి బయటకు వచ్చిన వ్యక్తికి మీ ప్రయాణం ముగిసిపోలేదని ట్విస్ట్ ఇచ్చి అతడిని ఓ రహస్య గదిలోకి పంపి అందరి ఆటను కనిపెడుతూ, వారి మాటలను వినే సువర్ణావకాశాన్ని కల్పిస్తారు. ఇంతటి కీలకమైన సీక్రెట్ రూమ్ స్టంట్ ఈ సీజన్లో చతికిలబడినట్లు కనిపిస్తోంది. ఈ విషయం బయటకు లీకవకుండా గోప్యంగా దాయడంలో బిగ్బాస్ టీమ్ దారుణంగా ఫెయిలైంది. (చదవండి: బిగ్బాస్: సీక్రెట్ రూమ్లోకి అఖిల్!) ఒక రోజు ముందు నుంచే అఖిల్ సీక్రెట్ రూమ్కు వెళ్తున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజా ప్రోమోలో అదే నిజమైంది. ఇంటిసభ్యులందరూ కలిసి బయటకు పంపించాలనుకున్న కంటెస్టెంటు పేరు చెప్పమని బిగ్బాస్ ఆదేశించాడు. దీంతో దాదాపు అందరూ అఖిల్ పేరు చెప్తున్నట్లు కనిపించగా సోహైల్ మాత్రం అతడి పేరు చెప్పడానికి నిరాకరించాడు. ఒక్కరి అభిప్రాయం వేరే ఉన్నా మీరు చెప్పేది చెల్లదని అఖిల్ కోసం గొడకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. కానీ చివర్లో మాత్రం అందరూ అఖిల్ను దగ్గరుండి సాగనంపారు. ఒక్క అభిజిత్ తప్ప! అంటే.. ఇది ఫేక్ ఎలిమినేషన్ అని అభి ముందే పసిగట్టునట్లు కనిపిస్తోంది. మిగతా కంటెస్టెంట్ల వాలకం చూస్తుంటే వారు కూడా ఈ ఎలిమినేషన్ వెనక ఏదో కుట్ర జరుగుతోందని అనుమానిస్తున్నట్లున్నారు. కానీ ఇకపై ఇంట్లో అఖిల్ ఉండడు అని అర్థమైన మోనాల్ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏదేమైనా రసవత్తరంగా సాగే సీక్రెట్ టాస్క్ ఈసారి పస లేకుండా పోయింది. ఇక ఈ ఫేక్ ఎలిమినేషన్ అందరికీ తెలుసని, బిగ్బాస్కే ఆలస్యంగా తెలిసిందని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు (చదవండి: తనకు హగ్గులివ్వడం లేదని హర్టైన అభిజిత్) -
బిగ్బాస్: నేడే ఎలిమినేట్ కానున్న అతడు!
పదో వారానికిగానూ హౌస్కు కెప్టెన్ అవ్వండి అని బిగ్బాస్ బంతి టాస్క్ ఇచ్చాడు. ఇందులో అఖిల్, మెహబూబ్ ఫైనల్ వరకు వెళ్లారు. కానీ ఇద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. నేనే కెప్టెన్ అవుతానంటే నేను అని కీచులాడుకున్నారు. బిగ్బాస్ బజర్ మోగించినా ఇంకా ఓ అండర్స్టాండింగ్కు రాకుండా వాదులాడుకుంటూనే ఉన్నారు. ఎవరి ముఖం ఉన్న బంతి వారు పట్టుకునేందుకు వీల్లేదని చెప్పినా సరే అదే పని చేసి మూర్ఖంగా ప్రవర్తించారు. ఫలితంగా బాస్కు కోపమొచ్చింది. టాస్క్ రద్దయింది, కెప్టెన్సీ ఎవరికీ అందకుండా పోయింది. అప్పటి వరకు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. దీనికి కారణమైన అఖిల్, మెహబూబ్కు బిగ్బాస్ బాగానే చీవాట్లు పెట్టాడు. తన ఆదేశాలను బేఖాతరు చేశారని మండిపడ్డారు. ఇదే ఆవేశంలో బిగ్బాస్.. ఇంటిసభ్యులకు అర్ధరాత్రి పరీక్ష పెడుతున్నాడు. హాయిగా నిద్రపోతున్న ఇంటిసభ్యులను లేపి ముల్లెమూట సర్దుకోమన్నాడు. అనంతరం గార్డెన్ ఏరియాకు రమ్మని పిలిచాడు. ప్రతిసారి మిమ్మల్ని బయటకు పంపే నిర్ణయం ప్రేక్షకుల చేతిల్లో ఉంటుందని, కానీ ఈసారి మీ చేతులోనే ఉందని హౌస్మేట్స్కు చెప్పాడు. (అఖిల్ నన్ను కాదని నిన్నే సేవ్ చేస్తాడు: మోనాల్) మీరు ఫైనల్కు వెళ్లకుండా అడ్డుపడే స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనే ప్రశ్నను సంధించినట్లు కనిపిస్తోంది. దీనికి సమాధానం చెప్పేందుకు ఇంటిసభ్యులు తర్జనభర్జన పడ్డారు. మొత్తానికి ప్రోమోలో మాత్రం అవినాష్.. అరియానా స్ట్రాంగ్ అని, సోహైల్.. మెహబూబ్, అరియానా.. అఖిల్ పేర్లు చెప్పారు. అఖిల్ వంతు వచ్చేసరికి తనకు అడ్డు పడేవారు ఎవరూ లేరని, తన గేమ్ తాను ఆడగలుగుతానని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అభిజిత్ మాత్రం.. బిగ్బాస్ ఒక పేరు చెప్పమన్నారు అని ముందే ఓ క్లారిటీ ఇస్తూ తన పేరునే చెప్పుకున్నాడు. దీన్ని కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అని విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం ఒక్క మాటతో అందరికీ పంచ్ వేశాడు. ఇక అందరూ వారివారి అభిప్రాయాలు చెప్పాక అఖిల్ను ఎలిమినేట్ అయినట్లు నమ్మించి సీక్రెట్ రూమ్లోకి పంపే అవకాశముందంటున్నారు. అదే కనక జరిగితే చాలామంది లోలోపల సంతోషపడతారు. కానీ మోనాల్ మాత్రం తనలోని నర్మదకు పని చెప్తుంది. మరి నిజంగా అఖిల్ను సీక్రెట్ రూమ్లోకి పంపుతారా? ఏదైనా ట్విస్టు ఉండబోతుందా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
హారిక హగ్గిచ్చి ఎన్నిరోజులైతుందో: అభిజిత్
కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదని నిరూపించుకున్నారు అఖిల్, మెహబూబ్. కెప్టెన్సీ నాకు తప్ప నా ఫ్రెండుకు కూడా దక్కకూడదన్న మూర్ఖత్వంతో ప్రవర్తించి టాస్కు రద్దయ్యేందుకు కారణమయ్యారు. ఫలితంగా హౌస్లో ఉండేందుకు అవసరమైన ప్రాణవాయువులాంటి ఇమ్యూనిటీ ఎవరికీ అందకుండా పోయింది. వీళ్ల గొడవను చూసి అగ్లీ అన్న అభిజిత్.. హారికతో అంతకన్నా అగ్లీ గొడవకు దిగాడు. తనను పక్కనపెట్టి అఖిల్కే హగ్గులిస్తుందని నొచ్చుకున్నాడు. వెళ్లి వాళ్లకే నీ హగ్గులు ఇచ్చుకో అని పదే పదే అంటూ జనాలకు విసుగు తెప్పించాడు. మరి నేటి బిగ్బాస్ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే దీన్ని చదివేయండి.. గేమ్లో ఒంటరైన మోనాల్ బిగ్బాస్ ఈ వారం బాస్కెట్ బాల్స్ను గోల్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవరి బంతిని వాళ్లే కాకుండా మిగతావాళ్లు గోల్ చేయాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఆలస్యంగా గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లు అవుట్ అవుతారు. ఆఖరి రౌండ్లో గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లే గెలిచినట్లు. ఈ గేమ్లో అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడు. అతడు, హారిక కలిసి తనకు గిట్టని వ్యక్తి ముఖం ఉన్న బంతిని తీసుకుని కావాలని ఆలస్యంగా వేశారు. మోనాల్ బంతిని ఎవరూ తీసుకోలేదు. ఈ గేమ్లో చివరికి మెహబూబ్, అఖిల్ ఇద్దరే మిగిలారు. (అభిజిత్కు హౌస్లో ఉండే అర్హత లేదు: అమ్మ రాజశేఖర్ ) తొక్కలో రిలేషన్స్, అంతా నటిస్తారు: అఖిల్ ఈసారి నాకు సపోర్ట్ కావాలంటే నాకు సపోర్ట్ కావాలని ఇద్దరూ వాదులాడుకున్నారు. బజర్ మోగిన విషయం మర్చిపోయి బాల్ వేయకుండా కీచులాడుతూనే ఉన్నారు. చివరికి నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎవరి బంతి వారు గోల్ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్బాస్ ఇద్దరి బాధ్యతారాహిత్యం కారణంగా టాస్క్ మొత్తాన్ని రద్దు చేస్తునట్లు వెల్లడించారు. ఈ వారానికి హౌస్లో కెప్టెనే ఉండరని ప్రకటించాడు. దీంతో స్నేహితుల కోసం గేమ్ నుంచి తప్పుకున్న సోహైల్ చిందులు తొక్కాడు. అనవసరంగా ఇమ్యూనిటీ రాకుండా చేసుకున్నారని బాధపడ్డాడు. ఇంట్లో నాకు ఒక్కడు సపోర్ట్ చేయలేదు. ఈ ఒక్కసారి చేయుమన్నా.. అని అఖిల్ ఫ్రస్టేట్ అయ్యాడు. అందుకే ఈ తొక్కలో రిలేషన్స్ వద్దంటా, అంతా నటిస్తారు అని అలిగాడు. పనిలో పనిగా మోనాల్ మీద విసుగు ప్రదర్శించాడు. ప్రతిసారి నీ కోసం ఆడతా అని ఎందుకనుకుంటున్నావు అని మోనాల్ ముఖం పట్టుకుని అడగ్గా నాకోసం ఆడమని నీకు చెప్పలేదని ఆమె స్పష్టం చేసింది. మరోవైపు తన నెత్తి మీద దరిద్రం డ్యాన్స్ చేస్తోందని మెహబూబ్ కన్నీళ్లు పెట్టుకోగా మోనాల్, సోహైల్ ఓదార్చారు. నేను హగ్గిస్తే కుర్చీలో నుంచి పడిపోతావు.. కెప్టెన్సీ చేజారిన బాధలో నుంచి బయటకు రాని అఖిల్.. మెహబూబ్, సోహైల్తో మాట్లాడుతూ మీరిద్దరే ఫ్రెండ్స్, నేనే అప్పుడప్పుడు మధ్యలోకి వస్తా. ఈ రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ బక్వాస్. అందుకే దివాళీ గిఫ్ట్కు మీ ఇద్దరితో పాటు మోనాల్ పేరు కూడా రాయలేదు అని అసలు విషయం చెప్పాడు. వీళ్ల పంచాయితీ మీద అభిజిత్ సెటైర్లు వేశాడు. ఎందుకింత అగ్లీగా ప్రవర్తిస్తున్నారు, మంచిగా ఆడొచ్చు కదా అని తన టీమ్తో చర్చించాడు. కానీ మరుక్షణమే అతడు అగ్లీ టాపిక్కు తెర తీశాడు. పోయి(అఖిల్కు) హగ్గులిచ్చుకో పో అని హారిక మీద కోప్పడ్డాడు. నాకు హగ్గిచ్చి ఎన్ని రోజులైతుందో తెలుసా? అని అభి అలగడంతో ఈరోజు పొద్దున్నే కదా ఇచ్చానని హారిక జవాబిచ్చింది. అయినా ఇప్పటికిప్పుడు నేను హగ్గిస్తే కుర్చీలో నుంచి కింద పడిపోతావు అని హెచ్చరించింది. ఎప్పుడూ ఏదో అని, దాన్ని కవర్ చేసేందుకు హగ్గిచ్చావే కానీ సొంతంగా హగ్గిచ్చావా అని నిలదీశాడు. అలా కాసేపటి వరకు ఈ హగ్గుల గురించి హద్దులు దాటి మాట్లాడుకున్నారు. (మనసు గెలిచేసిన మోనాల్) సూట్కేసులు సర్దుకున్న కంటెస్టెంట్లు మరోవైపు అలక బూనిన ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సోహైల్ నలిగిపోయాడు. రేపు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను, అఖిల్ ఉంటే.. నువ్వు కచ్చితంగా అఖిల్నే సేఫ్ చేస్తావు అని మోనాల్తో అన్నాడు. దానికి ఆమె స్పందిస్తూ కానీ నేను, నువ్వు ఉంటే మాత్రం అఖిల్ నిన్నే సేఫ్ చేస్తాడని క్లారిటీ ఇచ్చింది. ఎటొచ్చీ ఈరోజు మోనాల్ మళ్లీ ఒంటరిగా మారగా అప్పటివరకూ గొడవపడ్డ సోహైల్, అఖిల్, మెహబూబ్ మళ్లీ ఒక్కటైపోయారు. ఇక అరియానా దగ్గర మోనాల్ సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పిన అవినాష్.. తర్వాత మాత్రం ఆమె దగ్గరకు వెళ్లి టాప్ 5లో ఉంటావంటూ క్రీమ్ బిస్కెట్లు వేశాడు. అనంతరం అర్ధరాత్రి ఇంటిసభ్యులను నిద్ర లేపిన బిగ్బాస్ వారి సూట్కేసులను సర్దుకోమన్నాడు. ఫినాలేకు వెళ్లడానికి ఎవరు అడ్డుపడుతారనుకుంటున్నారో వారి పేర్లను చెప్పమన్నాడు. ఎవరు ఎవరి పేర్లను చెప్పనున్నారో రేపటి ఎపిసోడ్లో తేలనుంది. (అభికి జీరో టాలెంట్, అఖిల్కు అహంకారం) -
బిగ్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్లోకి అఖిల్!
సీక్రెట్ రూమ్.. ఇందులోకి వెళ్లే కంటెస్టెంటుకు లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. అప్పటిదాకా తమతో క్లోజ్గా ఉన్నవాళ్లు తమ గురించి ఏమనుకుంటున్నారు? తాము తిరిగి రావాలని కోరుకుంటున్నారా? లేదా? ఒకవేళ తాము తిరిగి రావడానికి బిగ్బాస్ ఏదైనా త్యాగం చేయమంటే అందుకు ఒప్పుకుంటారా? వంటి అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. తనకోసం నిలబడేవారు హౌస్లో ఎంతమంది ఉన్నారని తెలుసుకోవచ్చు. గత సీజన్లో అలీ, పునర్నవిని సీక్రెట్ రూమ్లోకి పంపిచారు. వాళ్లు ఈ సీక్రెట్ రూమ్ టాస్క్ను బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఆ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేసి తర్వాతి వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ అయ్యాడని అందర్నీ నమ్మించి సీక్రెట్ రూమ్లోకి పంపించారు. అక్కడ తన గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారో తెలిసి రాహుల్ నివ్వెరపోయాడు. (చదవండి: అఖిల్ మాటిచ్చాడు, ఎవర్నీ లవ్ చేయడు) దీంతో హౌస్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాక వితిక, వరుణ్లతో దూరంగా ఉంటూ అలీ, శివజ్యోతికి క్లోజ్ అయ్యాడు. తాజాగా ఈ సీజన్లో కూడా సీక్రెట్ రూమ్ సిద్ధం చేశారట. ఇందులోకి అఖిల్ను పంపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనక నిజమైతే అఖిల్కు అందరి నిజస్వరూపాలు తెలుసుకునేందుకు మంచి ఛాన్స్ లభించినట్లే. ఎవరు అసలు ఫ్రెండ్? ఎవరు ఫేక్ అనేది అతడికి క్లారిటీ వస్తుంది. దీంతో అతడు తన గేమ్ ప్లాన్ మార్చుకునే అవకాశముంది. అయితే అఖిల్ను రాత్రికి రాత్రే సీక్రెట్ రూమ్లోకి ఎందుకు పంపారబ్బా అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. నేటి కెప్టెన్సీ పోటీలో ఏదో తేడా కొట్టిందని, అందుకే అతడిని సీక్రెట్ రూమ్లోకి పంపించి ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. మరి అఖిల్ నిజంగానే రహస్య గదిలో అడుగు పెట్టాడా? అది బిగ్బాస్ వేసిన శిక్షా? లేక సీక్రెట్ టాస్కా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: జబర్దస్త్లోకి మళ్లీ తీసుకుంటారు: అవినాష్ తమ్ముళ్లు) -
సపోర్ట్ లేదు, ఫ్రెండ్షిప్ పెట్టుకుని వేస్ట్: అఖిల్
బిగ్బాస్ నాల్గో సీజన్లో పదో వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు గ్రూపులుగా ఉన్నా టాప్ 5లోకి వెళ్లాలంటే ఒంటరిగా పోరాడాల్సిన సమయం ఇది. కానీ హౌస్లో మాత్రం ఇందుకు భిన్నంగా గ్రూపులు గ్రూపులుగా ఆడుతున్నారు. ఇక అఖిల్ తనతో క్లోజ్గా ఉండే వాళ్లను నామినేట్ చేసి షాకిచ్చాడు. ఒంటరువుతున్నానని బాధపడుతున్న అరియానాను అవినాష్ తప్ప మిగతా అందరూ నామినేట్ చేసి ఆమె ఒంటరే అని నిరూపించారు. ఇక లాస్య, అభిజిత్, హారిక ఎలాగో ఒకరినొకరు నామినేట్ చేసుకోరు. ఈ ప్రక్రియను పక్కన పెడితే నేడు కెప్టెన్సీ పోటీ జరగనుంది. దీనికంటే ముందు కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక జరగాలి కదా! అది మీలో మీరే తేల్చుకోమని బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ కోసం ఎవరు త్యాగం చేస్తారు? అని స్టార్ మా తాజాగా ప్రోమోను వదిలింది. (చదవండి: అఖిల్ ప్రవర్తనపై మోనాల్ ఫ్యాన్స్ ఫైర్) "ఒక్కసారి కూడా ఏ ఒక్కరూ తనకు సపోర్ట్ చేయలేదు అని అఖిల్ ఫ్రస్టేట్ అవుతున్నాడు. ఈ స్నేహాలు గట్రా పెట్టుకునే బదులు దూరంగా ఉండటమే మంచిద"ని చెప్పుకొచ్చాడు. మరోవైపు మెహబూబ్ తన దరిద్రాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రతిసారి దేవుడు తనకు అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకుంటున్నాడని దుఃఖిస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య నలిగిపోతున్న సోహైల్ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే కదా దిల్ అనేది తెలుస్తుంది అని మెహబూబ్ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అటు మోనాల్ కూడా మెహబూబ్ను ఓదార్చే పనిలో పడింది. అయితే టాస్కు సరిగా పూర్తి చేయనందుకో, దేనికో కానీ అసలు కెప్టెన్గా ఎవరూ ఎన్నిక అవలేదని సమాచారం.. (చదవండి: నీ కాళ్లు పట్టుకుంటా, ఏం చేసుకోకు: అరియానా) -
బిగ్బాస్: అఖిల్కు ఏమైంది?
బిగ్బాస్ హౌస్లో మోనాల్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారవుతోంది. తనకు చెరో భుజంలా ఉండే అభిజిత్, అఖిల్ ఇద్దరూ దూరమయ్యారు. పైకి ఏదో నామమాత్రంగా మాట్లాడుతున్నారే తప్ప మొదట్లో ఉన్నంత క్లోజ్గా ఉండటం లేదు. అయితే బిగ్బాస్ హౌస్లో జరిగిన గొడవల మూలాన ఇకపై మనం కలిసి సాగలేమని అభి ఆమెకు ఇదివరకే ఓ క్లారిటీ ఇచ్చాడు. కానీ అఖిల్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతూ ఆమెను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. తాను ఆమెతో ఉంటే గేమ్ ఆడటం లేదు. స్ట్రాంగ్ అవ్వాలనే నామినేట్ చేశానంటాడు. కానీ మునుపటిలా మాట్లాడకుండా దూరంగా ఉంటున్నాడు. అందరికీ గిఫ్టులు.. మాస్టర్, మోనాల్కు తప్ప ఇక టీస్టాండు టాస్కులో ఆమె మీద చల్లని నీళ్లు గుమ్మరిస్తూ హింసిస్తుంటే మాత్రం తట్టుకోలేకపోయాడు. అసలు మోనాల్తో నీ రిలేషన్ ఏంటని నాగార్జున అడగ్గానే ఠపీమని సమాధానమివ్వకుండా కొన్ని క్షణాలపాటు ఆలోచించి ఫ్రెండ్ చెప్పాడు. ఆమె నెక్స్ట్ వీక్ సేఫ్ అవుతుందని చెప్తే మరేమీ ఆలోచించకుండా తన బట్టలు, ఇతర వస్తువులను త్యాగం చేశాడు. ఆమె కోసం ఒంటరిగా పోరాడాడు. ఇది చూసి మోనాల్కు ఎవరూ అండగా నిలబడకపోయినా అఖిల్ ఉన్నాడని అందరూ సంతోషించారు. కానీ అంతలోనే మళ్లీ ప్లేటు ఫిరాయించాడు. నిన్న ఇంటిసభ్యులు ఒకరికి మరొకరు దీపావళి గిఫ్టులు ఇచ్చి పుచ్చుకున్నారు కదా! మోనాల్, అమ్మ రాజశేఖర్కు మాత్రం ఎవరూ ఎలాంటి గిఫ్టులు ఇవ్వలేదు. (బిగ్బాస్ : ఆమెను నామినేట్ చేసి షాకిచ్చిన అఖిల్) మోనాల్కు అఖిల్ వెన్నుపోటు! అఖిల్ మాత్రం తనకు మోనాల్ గిఫ్టుగా ఇచ్చిన చాక్లెట్లను తీసుకుని మురిసిపోయాడే తప్ప ఆమెకు ఏ బహుమానాన్ని అందించలేదు. దీంతో మోనాల్ మరోసారి బాధపడింది. తనలోని నర్మదను బయటకు తీసుకు వస్తుండగా నాగ్ మీకునేను గిఫ్టులిస్తానంటూ మోనాల్కు స్వీట్లు పంపించాడు. ఈ విషయంలో నెటిజన్లు అఖిల్ తీరును ఎండగడుతూ మోనాల్పై సానుభూతి కురిపిస్తున్నారు. లాస్యకు ఆమె కొడుకు ఫొటోను గిఫ్టిచ్చిన అఖిల్.. అదే చేత్తో మోనాల్కు ఓ స్వీటు ఇవ్వడానికి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు నామినేట్ చేస్తూనే ఆమెకు ఇమ్యూనిటీ వచ్చేందుకు పోరాడటం ఒక చేత్తో పొడిచి మరో చేత్తో బ్యాండేజ్ వేస్తున్నట్లు ఉందని సెటైర్లు వేస్తున్నారు. ప్రతివారం నామినేట్ అయిన మోనాల్ ఇప్పటికీ హౌస్లో ఉందంటే ఆమె స్ట్రాంగ్ కాదా? అని ఆమె అభిమానులు అఖిల్ను నిలదీస్తున్నారు. తనను ఎవరూ నామినేట్ చేయకూడదనే మిగతావాళ్లతో కలిసిపోతూ మోనాల్ను పక్కన పెట్టేశాడని విమర్శిస్తున్నారు. -
అప్పులున్నాయి, ప్లీజ్ సపోర్ట్: అవినాష్ సింపథీ గేమ్?
బిగ్బాస్ హౌస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్ మీదే ఆధారపడి ఉందని నాగార్జున మరోసారి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చెప్పేది నమ్మకండని సూచిస్తూ షో ప్రారంభించారు. కెప్టెన్ అమ్మ రాజశేఖర్ ఇంట్లో అందరినీ శివాలెత్తిస్తారని చెప్పుకొచ్చారు. హౌస్లో ఎవరి మీదైనా ఫిర్యాదులున్నాయా అని ఇంటిసభ్యులను ఆరా తీశారు. అభిజిత్ మాస్టర్ తాము చెప్పేది వినిపించుకోవడం లేదని చెప్పాడు. కానీ నాగార్జున మాత్రం మాస్టర్ కెప్టెన్ అంటూ అతడినే వెనకేసుకురావడం గమనార్హం. అలాగే టీ స్టాండు టాస్క్లో దగ్గర ఆత్మగౌరవం అంటూ ఆట మధ్యలో నుంచి నిష్క్రమించడాన్ని తప్పు పట్టారు. ఎవరు వెలిగే దీపం, ఎవరు ఆరిపోయే దీపం? కంటెస్టెంటు వెలిగే దీపం ఆరిపోయే దీపం అభిజిత్ మోనాల్ అమ్మ రాజశేఖర్ అరియానా అవినాష్ అభిజిత్ మోనాల్ అఖిల్ అరియానా సోహైల్ మెహబూబ్ అరియానా అవినాష్ అరియానా మోనాల్ హారిక లాస్య అవినాష్ లాస్య హారిక అరియానా మెహబూబ్ సోహైల్ అరియానా అమ్మ రాజశేఖర్ అరియానా అఖిల్ అఖిల్ మోనాల్ అమ్మ రాజశేఖర్ మోనాల్ను దగ్గరకు తీసుకున్న అఖిల్ మోనాల్ ఒంటరిగా ఫీలవడాన్ని చూసి ఏమైందని నాగ్ ప్రశ్నించారు. అఖిల్ నామినేట్ చేయడం తట్టుకోలేకపోయానని, తనతో మాట్లాడేందుకు ప్రయత్నించా కానీ పట్టించుకోలేదని వాపోయింది.. ఈ హౌస్లో అతడు నా ఫ్యామిలీ మెంబర్ అనుకున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీని గురించి అఖిల్ స్పందిస్తూ ఆమె స్ట్రాంగ్ అవ్వాలనే అలా చేశానని సమాధానమిచ్చాడు. దీంతో నాగ్ ఆమె నీకు ఫ్రెండా? అంత కన్నా ఎక్కువా? అని సూటి ప్రశ్న విసిరాడు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డ అఖిల్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇదే ప్రశ్నను మోనాల్ను అడగ్గా ఆమె కూడా జస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. (చదవండి: నోయల్ అవుట్, మోకరిల్లి దండం పెట్టిన అవినాష్) తన ముఖంలో చిరునవ్వులు వెలిగించే దీపం అఖిల్.. అయితే అఖిల్ను వెలిగే దీపమని మోనాల్ చెప్పడంతో అతడు సంతోషం పట్టలేక ఆమెను హత్తుకుంటూ ఇన్నాళ్ల ఎడబాటుకు చెక్ పెట్టాడు. ఇక అరియానా డిక్టేటర్ కెప్టెన్ అని చాలామంది ఇంటిసభ్యులు అభిప్రాయపడ్డారు. కానీ ఆమె మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఆమె కెప్టెన్ అయినప్పుడు అందరికీ సమానంగా పనులు అప్పగించలేదని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎందుకని ప్రశ్నిస్తే నాకు కొందరి కంఫర్ట్ కావాలని సమాధానమిచ్చిందని అరియానాలోని మరో కోణాన్ని వెల్లడించాడు. ఇక మోనాల్ను నామినేట్ చేసినందుకు అఖిల్ను ఆరిపోయే దీపమని చెప్పాడు. అఖిల్ ఆమెకు ట్రూ ఫ్రెండ్ కాదన్నాడు. (చదవండి: ఏయ్ హారిక, నోర్మూయ్: చెలరేగిన మాస్టర్) హారికను సేఫ్ చేసిన కమల్ హాసన్ నిజంగానే నాగ్ చెప్పినట్టు తొలిసారి బిగ్బాస్ షోలో అద్భుతం జరిగింది. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా వర్చువల్ తెరమీద కనిపించారు. మన కంటెస్టెంట్లను వారికి, అక్కడి వాళ్లను మనవారికి పరిచయం చేశారు. మీ హౌస్ ఫుల్లుగా ఉందేంటి అనగా అది నాకు నచ్చని మాట అని కమల్ కౌంటరేశారు. అలా కాసేపు సరదాగా సంభాషించి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు. అనంతరం కమల్ తెలుగు బిగ్బాస్కు వీడ్కోలు తీసుకునే ముందు హారికను సేఫ్ చేశారు. తర్వాత నాగ్ మరో ట్విస్టు ఇచ్చారు. టీ స్టాండు టాస్కులో చివరి వరకు ఆడిన మోనాల్, అవినాష్లు తర్వాతి వారం ఇమ్యూనిటీ పొందేందుకు మరో అవకాశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా ఇద్దరికీ చెరో బుట్ట ఇచ్చి అందులో ఇంటిసభ్యులను ఒప్పించి వారి వస్తువులను త్యాగం చేయాలని కోరాలి. ఎవరి బుట్ట బరువెక్కితే వారు ఇమ్యూనిటీ పొందుతారు. (చదవండి: హిమాలయాలకు వీడ్కోలు) షో వదులుకున్నా, అప్పులున్నాయి, సపోర్ట్ చేయండి.. దీంతో అవినాష్ మిగతా మిగతా కంటెస్టెంట్ల దగ్గర బేరసారాలాడాడు. "నేను షోను వదులుకుని వచ్చాను. మళ్లీ తీసుకోమన్నారు. ఇల్లు అప్పులు క్లియర్ చేసుకోవాలి. మా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి" అని తన బాధను ఏకరువు పెట్టాడు. మరోవైపు మోనాల్ తనకు ఇమ్యూనిటీ అవసరమంటూ సపోర్ట్ చేయమని కోరింది. ఇప్పుడు చేయలేనని లాస్య నిర్మొహమాటంగా చెప్పింది. మిగతావాళ్లు సపోర్ట్ చేయలేమని నేరుగా చెప్పకుండా చేతల్లో నిరూపించారు. మోనాల్కు సపోర్ట్ చేద్దామనుకున్న సోహైల్ను మెహబూబ్ వద్దని వారించాడంతో అవినాష్ కోసం తన వస్తువుల త్యాగానికి సిద్ధపడ్డాడు. ఇమ్యూనిటీ పొందిన అవినాష్ హారికకు మోనాల్కు సపోర్ట్ చేయాలని ఉన్నప్పటికీ అవినాష్ తనకే చేయాలని పట్టుపట్టాడు. కానీ అతడు పక్కు వెళ్లగానే మోనాల్ బుట్టలో తన వస్తువులను వేయడానికి సిద్ధపడగా అప్పటికే బజర్ మోగింది. దీంతో అఖిల్ ఒక్కడే మోనాల్కు సపోర్ట్ చేయగా లాస్య, సోహైల్, మెహబూబ్, అరియానా.. అవినాష్కు మద్దతు తెలిపారు. దీంతో మోనాల్ బుట్ట 13 కిలోలు, అవినాష్ బుట్ట 23 కిలోల బరువు తూగగా తర్వాతి వారానికి గానూ అవినాష్కు ఇమ్యూనిటీ లభించిందని నాగ్ ప్రకటించారు. ఇక కెప్టెన్గా అందరి మీదా అజమాయిషీ చేస్తోన్న అమ్మ రాజశేఖర్ రేపటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయినట్లు సమాచారం. (చదవండి: బిగ్బాస్: కెప్టెన్గా మాస్టర్, మరి ఎలిమినేషన్?) -
మోనాల్ నీకు ఫ్రెండా? అంతకు మించా?: నాగ్
ఈ వారం ఇంటిసభ్యులు చేసిన తప్పొప్పులను ఎత్తి చూపేందుకు టాలీవుడ్ కింగ్ నాగార్జున సిద్ధమయ్యారు. నాగ్ అక్షింతలు వేస్తున్నాడంటే ఆ లిస్టులో తప్పకుండా అభిజిత్ మొదటి స్థానంలో ఉంటాడు. ఈ రోజు కూడా నాగ్ అభిజిత్ను నిలబెట్టి క్లాస్ పీకారు. నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు బిగ్బాస్ ఇచ్చిన టీ స్టాండ్ టాస్క్లో అభిజిత్ స్వచ్ఛందంగా పక్కకు తప్పుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆత్మ గౌరవం అంటూ వెళ్లిపోయావు? అంటే మిగతవాళ్లకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అని సూటిగా ప్రశ్నించారు. దీంతో అభి నీళ్లు నములుతూ అందరి గురించి అన్నాను అని సమాధానిమిచ్చాడు. ఆత్మ గౌరవం పేరిట టాస్కులో నుంచి వైదొలగడాన్ని ఎంతమంది సమర్థిస్తారు అని నాగ్ ప్రశ్నించగా అందరూ నేలచూపులు చూశారు. నీకు మోనాల్ ఏమవుతుంది?: నాగ్ ఇక అమ్మాయిలు బాధపడితే తట్టుకోలేని నాగ్ ఇంట్లో ఏకాకిగా మారిన మోనాల్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. తన గోడు వెల్లబోసుకునే సమయం రావడంతో మోనాల్ తన బాధను కక్కేసింది. అఖిల్ నామినేట్ చేస్తాడని ఊహించలేదు అని తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేసింది. అఖిల్ నా ఫ్యామిలీ అనుకున్నాను అని చెప్పింది. ఆమె మాటలు విన్నాక నాగార్జున మోనాల్ నీకు స్నేహితురాలా? అంతకన్నా ఎక్కువా? అని ప్రశ్నించారు. ఊహించని ప్రశ్నతో అఖిల్ బిక్కమొహం వేశాడు. ఇక టీ స్టాండ్ టాస్కులో ఐస్ వాటర్ను ముఖానికి కొట్టిన అరియానా తీరును నాగ్ ముందే సోహైల్, మోనాల్ తప్పు పట్టారు. అయితే వాటిని అరియానా కొట్టిపారేసింది. నాకు బిగ్బాస్ టాస్క్ ఇచ్చాడు, చేశాను అని సింపుల్గా సమాధానమిచ్చింది. మరి వీరిలో నాగ్ ఎవరిని సపోర్ట్ చేస్తారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు చూడాల్సిందే. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు కొందరు అరియానాను సపోర్ట్ చేస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.(చదవండి: ఒంటరినయ్యాను: అరియానా కన్నీళ్లు) టీస్టాండ్ టాస్కులో ఏం జరిగిందంటే.. కాగా టీ స్టాండ్ టాస్కులో అఖిల్.. అమ్మ రాజశేఖర్ ముక్కులో గడ్డిపరకతో గిలిగింతలు పెట్టాడు. ఇది చూసిన అరియానా.. మాస్టర్ దగ్గరకు వెళ్లి రక్తం కారుతుందేమో, జాగ్రత్త అని అఖిల్ చేస్తున్న దాన్ని పెద్ద తప్పుగా చూపే ప్రయత్నం చేసింది. కానీ ఆమె మాత్రం మోనాల్ కాంటాక్స్ లెన్స్ పెట్టుకుందని తెలిసినా ముఖానికి నీళ్లు విసురుకొడుతూనే ఉంది. ఆమె బాధతో అరుస్తున్నా టాస్కు అంటూ నానారకాలుగా టార్చర్ పెట్టింది. హారికను కూడా ముఖం మీద నీళ్లు గుమ్మరిస్తూ అక్కడున్న వస్తువులతో హింసించింది. అవినాష్, అమ్మ రాజశేఖర్కు సపోర్ట్ చేస్తున్నానంటూ వాళ్ల జోలికి కూడా పోలేదు. అయితే అరియానా అరాచకాన్ని చూసి సోహైల్కు బీపీ లేచింది. మిగతావాటితో డిస్టర్బ్ చెయ్ కానీ నీళ్లు ముఖాన కొడుతూ హింసించకు అని నీళ్ల బకెట్ను కింద పారేశాడు. ఈ టాస్కులో ఎవరూ ఇమ్యూనిటీ దక్కించుకోలేదు. -
ఏకాకిగా మోనాల్, నాగ్ దారి చూపిస్తారా?
మోనాల్ గజ్జర్.. ఈ గుజరాతీ బ్యూటీ బిగ్బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంటు కూడా! కష్టపడి తెలుగు నేర్చుకుంటోంది, ముద్దుముద్దుగా మాట్లాడుతోంది. కానీ ఎమోషన్స్ ఆపుకోలేనప్పుడు మాత్రం హిందీలోనో, ఇంగ్లీషులోనో బోరుమనేస్తుంది. దీంతో నాగార్జున ఆమెకు నర్మద అని పేరు కూడా పెట్టారు. అయితే షో సగం పూర్తి కావచ్చినా ఇప్పటికీ ఆమె కన్నీళ్లు ఇంకిపోవడంలేదు. పాతాళ గంగలా ఉబికి వస్తూనే ఉన్నాయి. కారణం.. అఖిల్, అభిజిత్..! ఇద్దరూ వదిలేశారు.. బిగ్బాస్ హౌస్లోకి వెళ్లినప్పటి నుంచే మోనాల్.. అభి, అఖిల్ ఇద్దరితో చనువుగా ఉండేది. ఆమెతో మాట్లాడే సమయం కోసం ఆ ఇద్దరు కూడా పోటీ పడినట్లు కనిపించేవారు. ఆమె కోసం ఏదైనా చేసేవారు. కానీ కాలం మారింది. పరిస్థితులు కూడా మారిపోయాయి. బంధాలు వేరైపోయాయి. శత్రవులు మిత్రువులయ్యారు. మిత్రువులు శత్రువులయ్యారు. అయితే ఇదంతా ఎలా జరిగిందంటే.. అభి, అఖి ఇద్దరి మధ్య నలిగిపోయిన మోనాల్ ఒక్కోసారి ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. (చదవండి: మోనాల్-అభి మధ్య దూరాన్ని అఖిల్ తగ్గిస్తాడా?) క్షమించమన్నా వినిపించుకోని అభిజిత్ పొరపాటునే అన్నదో, కావాలనే అన్నదో తెలీదు కానీ అభిజిత్ను మానిప్యులేటర్ అని పెద్ద తప్పు చేసింది. అక్కడ రాజుకున్న వివాదంతో అభికి దూరమైంది. అలా అనడం తప్పేనని మోనాల్ క్షమాపణలు కోరినా అభి వినిపించుకోలేదు. దూరంగా ఉంటే ఇద్దరికీ మంచిదని కరాఖండిగా చెప్పాడు. ఈ గొడవ తర్వాత అఖిల్- మోనాల్ కలిసున్నారు. కానీ అఖిల్ గురించి సోహైల్ వెనకాల ఏదో మాట్లాడుతున్నాడని మోనాల్ అఖిల్తో చెప్పడంతో మరో గొడవలో ఇరుక్కుంది. అక్కడ నుంచి అఖిల్కు మోనాల్ మీద నమ్మకం సన్నగిల్లింది. ఆమెపై ఉన్న ఇష్టం ఆవిరయ్యింది. కానీ ఇదే కారణాన్ని ప్రస్తావించకుండా టాస్క్ బాగా ఆడలేదంటూ ఏవేవో కారణాలు చెప్తూ మోనాల్ను నామినేట్ చేశాడు. ఆమె కన్నీళ్లు కారుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇప్పటికీ ఆమెతో మాట్లాడటమే మానేశాడు. ఏ గ్రూపులోనూ చేరలేక ఒంటరవుతున్న మోనాల్ అఖిల్ కూడా దూరమవుతాడని ఊహించని మోనాల్ ఒంటరినయ్యానంటూ మాస్టర్ దగ్గర భోరున ఏడ్చేసింది. దీంతో నేను నీకు సపోర్ట్ చేస్తా అని మాస్టర్ ఆమెకు మాటిచ్చాడు. కానీ మాస్టర్ గ్రూపులో ఆమె కలవలేకపోతోంది. మరోవైపు అఖిల్.. అభిజిత్, హారిక, లాస్య గ్రూపులో ఒకడిగా చేరిపోయాడు. ఎలాగో ఈ గ్రూపులో కలవడానికి ఆమె ధైర్యం చేయదు. కానీ మోనాల్ పరిస్థితిని అర్థం చేసుకున్న అభిజిత్ అప్పుడో ఇప్పుడో ఆమెతో మాట్లాడి సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి ఏకాకిగా మారిన మోనాల్ బాధను నాగార్జున తొలగించే ప్రయత్నం చేస్తారా? తిరిగి ఆమెను అఖిల్తో కలుపుతారా? అందుకు అఖిల్ ఒప్పుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. (చదవండి: అఖిల్ ఇంకేదో ఆశించాడు, అందుకే..: మోనాల్) -
మోనాల్ మాత్రం కోడలిగా రాదు: అఖిల్ తల్లి
బిగ్బాస్ నాల్గవ సీజన్లో ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నా కెమెరాలు మాత్రం అఖిల్, మోనాల్నే ప్రధానంగా ఫోకస్ చేసేవి. దీంతో వారిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని ప్రేక్షకులు బలంగా ఫిక్సయ్యారు. ఆమె క్షణం కనిపించకపోయినా తల్లడిల్లిపోయేవాడు. ఆమె లేకపోతే అఖిల్ లేడు అనేంతగా వారి రిలేషన్ జనాలకు కనెక్ట్ అయింది. అయితే ఇది ప్రేమ కాదని, కేవలం స్నేహమేనని అఖిల్ తల్లి స్పష్టం చేశారు. బిగ్బాస్లో ప్రేమ వంటివాటిలో దూరనని తనకు మాటిచ్చాడని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బిగ్బాస్ అయిపోగానే మీ ఇంటికి కోడలు వస్తుందా? అన్న ప్రశ్నకు అంత సీన్ లేదని ఆమె కొట్టిపారేశారు. ఎలాంటి వాటిలో దూరకుండా గేమ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాలని షోలోకి వెళ్లేముందే అఖిల్కు మరీ మరీ చెప్పానని తెలిపారు. విలన్గా చేసీ చేసీ అలానే కనిపిస్తున్నాడు 50 రోజుల నుంచి హౌస్లోనే ఉంటున్నాడు. కాబట్టి మనసుకు దగ్గరయ్యేవాళ్లతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడని, ప్రేమ వంటివాటిలో దూరడని నమ్మకముందన్నారు. మోనాల్ను నామినేట్ చేయడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బయటకు వచ్చాక మోనాల్ మంచి ఫ్రెండ్ అవుతుందేమో కానీ కోడలిగా మాత్రం రాదని తేల్చి చెప్పారు. అఖిల్ గేమ్ ఆడుతున్నాడు. అందులో భాగంగానే మోనాల్పై గుడ్డు కొట్టాడు కానీ తర్వాత మళ్లీ ఫ్రెండ్స్ అవుతారని అభిప్రాయపడ్డారు. ఇక సీరియల్స్లో విలన్గా చేసి చేసి కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ అందరికీ విలన్లాగే కనిపిస్తున్నాడని తెలిపారు. (చదవండి: 'అమ్మో' రాజశేఖర్: దేని కోసం ఇంత డ్రామా?) అఖిల్ మనసులో ఏముందో తెలుసుకోవాలి కానీ మావాడు మాత్రం హీరో అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా టాప్ 5లో ఉంటాడని ధీమా వ్యక్తం చేశారు. బిగ్బాస్ నుంచి వచ్చాక అఖిల్ మనసులో ఏముందో తెలుసుకుని పెళ్లి చేస్తామన్నారు. ఒకవేళ ఎవరినైనా ఇష్టపడితే మాత్రం వివాహం జరిపించేస్తామన్నారు. కానీ మోనాల్తో మాత్రం కుదరదని నొక్కి చెప్పారు. ఎందుకంటే మోనాల్కు 30, అఖిల్కు 25, వయసు వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్లిద్దరికీ పెళ్లి చేయలేమని స్పష్టం చేశారు. కేవలం వాళ్లు ఎంటర్టైన్ చేస్తున్నారు అని తెలిపారు. (చదవండి: అఖిల్ ఇంకేదో ఆశించాడు, అందుకే..: మోనాల్) అందుకోసమే గడ్డం తీయడు హౌస్లో 'జంబలకిడి పంబ' టాస్క్ ఇచ్చినప్పుడు మేల్ కంటెస్టెంట్లు అందరూ గడ్డం గీసుకున్నారు. కానీ అఖిల్ మాత్రం తప్పించుకు తిరిగాడు. పైగా అమ్మాయిగా డ్యాన్స్ చేసినప్పుడు కూడా తలకు స్కార్ఫ్ కట్టుకుని గడ్డాన్ని కవర్ చేసుకున్నాడు. దీనిపై అఖిల్ తల్లి స్పందిస్తూ వాడు ఎప్పుడూ గడ్డం తీయడని చెప్పుకొచ్చారు. అందం కోసమే గడ్డం తీయడు తప్ప ప్రేమలో విఫలమైన దేవదాసులా గడ్డం పెంచుకోవట్లేదని పేర్కొన్నారు. -
బిగ్బాస్: అభిజిత్ రూటులో అఖిల్?
బిగ్బాస్ నాల్గో సీజన్లో అందరూ చర్చించుకున్న టాపిక్ ఏదైనా ఉందా అంటే అది అఖిల్-మోనాల్-అభిజిత్ ట్రయాంగిల్ స్టోరీనే. మొదట్లో అఖిల్, అభి ఇద్దరూ మోనాల్ను మెప్పించేందుకు పోటాపోటీగా ముందుకు వచ్చేవారు. మోనాల్ తనతో కాకుండా వేరే ఎవరితో ఉన్నా అఖిల్ తట్టుకోలేకపోయేవాడు. ఎప్పుడూ తన చెంతనే ఉండాలని ఆరాటపడేవాడు. అభి కూడా మోనాల్ గురించి తెలుసుకోవాలని తెగ తాపత్రయపడేవాడు. ఆమె వ్యక్తిగత విషయాల గురించి గుచ్చిగుచ్చి అడిగేవాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎన్నో మలుపులు తిరిగింది. మోనాల్ ఒక మాట మీద ఉండదు అని తెలిసిన క్షణం నుంచి అభి ఆమెకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. మోనాల్ మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా విడిగా ఉంటేనే ఏ గొడవ ఉండదని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పాడు. ఇక ఉన్న ఒక్క దిక్కు అఖిల్. కానీ మోనాల్ వల్లే తనకు సోహైల్కు బేధాభిప్రాయాలు వచ్చాయని తెలుసుకున్న అఖిల్ ఆమెతో మాట్లాడటమే మానేశాడు. (చదవండి: అఖిల్, నన్ను బే అనకు: సోహైల్ వార్నింగ్) అక్కడితో ఆగకుండా నీకు క్లారిటీ అనేది లేదంటూ ఏకంగా నామినేట్ చేసి ఊహించని షాకిచ్చాడు. మోనాల్ గురించి నిజాలు తెలియడంతోనే అభి లాగే అఖిల్ కూడా ఆమెను దూరం పెట్టి గేమ్పై ఫోకస్ పెడుతున్నాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ మోనాల్ అభిమానులు మాత్రం అఖిల్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతగానో నమ్మిన మోనాల్ను నామినేట్ చేసి వెన్నుపోటు పొడిచాడని విమర్శిస్తున్నారు. దీనివల్ల ఏకాకిగా మారిన మోనాల్ సెల్ఫిష్ మాస్టర్ ఉచ్చులో పడే అవకాశముందని భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం స్నేహానికి లొంగిపోకుండా అఖిల్ కరెక్ట్ గేమ్ ఆడుతున్నాడని మెచ్చుకుంటున్నారు. జరిగిందేదో జరిగిపోయింది, ఈ ఇద్దరూ వీలైనంత త్వరగా కలిసిపోవాలని మరికొందరు కోరుకుంటున్నారు. (చదవండి: సోనూ సూద్, ప్లీజ్ మోనాల్ను కాపాడండి) -
జబర్దస్త్లోకి మళ్లీ రానిచ్చేది లేదన్నారు: అవినాష్
సోమవారం గరంగరంగా ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ నేడు పీక్స్కు వెళ్లింది. మిస్టర్ కూల్ అభిజిత్ ఎదుటివాళ్ల మాట వినిపించుకోని మాస్టర్పై తన ప్రతాపాన్ని చూపించాడు. అఖిల్ తను ఎంతో ఇష్టపడే మోనాల్ను నామినేట్ చేశాడన్న మాటే కానీ ఆమె బాధపడుతుంటే చూడలేకపోయాడు. సోహైల్, మెహబూబ్తో గొడవ పెట్టుకున్నాడు. దగ్గరకు వెళ్లి ముఖానికి పట్టిన దుమ్మును తొలగించాడు. కానీ ఆమె మనుసులో రగులుతున్న ఘోషను అర్థం చేసుకోలేకపోయాడు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. నా లైఫ్ను అవమానపరుస్తున్నారు: మాస్టర్ నిన్న అవినాష్ను నామినేట్ చేసిన అభిజిత్ నేడు అమ్మ రాజశేఖర్పై కోడిగుడ్డు పగలగొట్టాడు. దీంతో అసహనంతో ఊగిపోయిన మాస్టర్ అభికి మాట్లాడే చాన్సివ్వకుండా అర్థం పర్థం లేని మాటలన్నీ అనేశాడు. నన్ను మాట్లాడనివ్వకపోతే ఊరుకోను అని అభి హెచ్చరించడంతో నన్ను కొడతావా? అని మాస్టర్ మరింత రెచ్చగొట్టాడు. అందరూ నా జీవితాన్ని అవమానపరుస్తున్నారని ఆవేశంతో ఊగిపోయాడు. ఈ ఇద్దరి మధ్యలో దూరేందుకు అవినాష్ ప్రయత్నించగా హారిక మధ్యలో జోక్యం చేసుకోవద్దని హితవు పలికింది. అప్పటికే నిప్పు కణంలా ఎగిరెగిరి పడుతున్న మాస్టర్ ఆవేశంలో హారికను నోరు మూర్మోయ్ అంటూ నోరు జారాడు. అటు అభిని కూడా కుర్చీలో కూర్చోవడం కాదు, దమ్ముంటే టాస్కు ఆడు అని సవాలు విసిరాడు. అందరి మీద అరిచి చివరలో మాత్రం నేను ఎవరినీ నామినేట్ చేయనంటూ విసురుగా వెళ్లిపోయి ఏడ్చేయడం గమనార్హం. మోనాల్ను తనవైపు తిప్పుకుంటున్న మాస్టర్! తర్వాత హారిక అవినాష్, అమ్మ రాజశేఖర్ను, లాస్య అవినాష్, మోనాల్ను, మోనాల్.. సోహైల్, లాస్యను, అమ్మ రాజశేఖర్.. అభిజిత్, అఖిల్ను, మెహబూబ్.. హారిక, అవినాష్ను నామినేట్ చేశారు. మీరు పోతా పోతా అన్నప్పుడు పంపించడానికి రెడీ అని అఖిల్ మాస్టర్ మీద గుడ్డు పగలగొట్టాడు. లాస్ట్ టాస్క్లో పర్ఫామ్ చేయలేదు, నీకు క్లారిటీ లేదు అనిపించింది అని మోనాల్ను నామినేట్ చేశాడు. ఊహించని పరిణామానికి షాక్ అయిన మోనాల్ శిలా విగ్రహంలా నిల్చుండిపోయింది. దొరికిందే ఛాన్స్ అనుకున్న మాస్టర్ ఈ గొడవను తగ్గించడానికి బదులు పెంచే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. నీ గేమ్ నువ్వు ఆడు అని మొదటి నుంచే చెప్తున్నా, ఇక నుంచి నీకు నేను సపోర్ట్గా ఉంటా అని మోనాల్కు హామీ ఇచ్చాడు. (చదవండి: బిగ్బాస్ : నోయల్కు వచ్చిన వ్యాధి ఇదే) నామినేషన్లో ఉన్నవారికి బిగ్బాస్ ఆఫర్ అయితే అఖిల్ ఇచ్చిన ట్విస్టు నుంచి తేరుకోని మోనాల్ ఆవేదనలో ఏదేదో మాట్లాడేసింది. అబ్బాయి- అమ్మాయి ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ కారు. కొంచెం మోర్ కావాలి. అదే ప్రాబ్లమ్ అని పేర్కొంది. మనుషులను తప్పుగా అంచనా వేశానని బాధపడింది. తాను ఒంటరినంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఇంత జరిగినా ఆమెకు అఖిల్ మీద ఇసుమంత ప్రేమ తగ్గలేదు. రాత్రి ఒళ్లు మరిచి నిద్రపోతున్న అఖిల్కు చలి పెట్టకుండా దుప్పటి కప్పింది. కాగా మొత్తంగా మోనాల్, అభిజిత్, హారిక, అవినాష్, అమ్మ రాజశేఖర్ నామినేషన్లో నిలిచారు. వీరిలో ఒకరు ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యేందుకు బిగ్బాస్ "ముఖం జాగ్రత్త" అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా నామినేట్ అయిన వాళ్లు టీ స్టాండ్ మీద ముఖం పెట్టాలి. ఎండ్ బజర్కు ఎవరి తల స్టాండ్ మీద ఉంటే వారు నామినేషన్ నుంచి సేఫ్. కొట్టుకున్నంత పని చేసిన అఖిల్, సోహైల్ ఇక టాస్క్లో భాగంగా మిగతా ఇంటిసభ్యులు నామినేట్ అయినవాళ్లను ఐస్ గడ్డలు, నీళ్లు, గడ్డి, మట్టి ఉపయోగిస్తూ నానారకాలుగా హింసించారు. అందరి కన్నా కాస్తంత ఎక్కువగా మోనాల్ను హింసించినట్లు కనిపించింది. అది చూసి తట్టుకోలేకపోయిన అఖిల్.. మోనాల్ దగ్గరకు వచ్చి ఆమె ముఖం శుభ్రం చేశాడు. దీంతో మెహబూబ్ మాస్టర్కు సాయం చేస్తే ఎందుకు వ్యతిరేకించావని సోహైల్ అఖిల్ మీద అరిచాడు. అలా వీళ్లిద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. అరియానా మరోసారి రాక్షసిగా మారి అందరినీ రాచిరంపాన పెట్టింది. కానీ ఎండ్ బజర్ మోగేసరికి టీ స్టాండ్ మీద మోనాల్, అవినాష్, అమ్మ రాజశేఖర్ స్టడీగా ఉన్నారు. దీంతో ఒక్కరి కన్నా ఎక్కువ మంది ఉన్న కారణంగా ఎవరికీ ఇమ్యూనిటీ లభించలేదు. (చదవండి: సోనూ సూద్, ప్లీజ్ మోనాల్ను కాపాడండి) ఎన్నో అవమానాలు పడి వచ్చాను: అవినాష్ ఇంతవరకు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని అవినాష్ బాధపడ్డాడు. ఎన్నో అవమానాలు పడి వచ్చాను. మళ్లీ ఆ షో(జబర్దస్త్)లోకి తీసుకోమని చెప్పారు. అవన్నీ గుర్తొచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ తనలాగే ఇక్కడ అందరూ స్ట్రాంగ్గా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. మరోవైపు అఖిల్ చేసిన మోసానికి మోనాల్ కుంగిపోయింది. నేను హర్ట్ అయ్యాను అఖిల్, నువ్వు నన్ను నమ్మనందుకు బాధపడుతున్నానని ఒంటరిగా తన కన్నీళ్లను జారవిడిచింది. (చదవండి: కాబోయే భార్య ఎలా ఉండాలంటే..: అఖిల్) -
మాస్టర్ను సేఫ్ చేసేందుకు బిగ్బాస్ ప్లాన్!
బిగ్బాస్ నాల్గో సీజన్లో తొమ్మిదోవారం నామినేషన్ ప్రక్రియ వరుసగా రెండో రోజూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎక్కువ ఓట్లు పడ్డవారు నేరుగా నామినేట్ కాకుండా బిగ్బాస్ వారికి మరో అవకాశమిచ్చినట్లు కనిపిస్తోంది. తలపై ఎక్కువ గుడ్లు పడ్డ అభిజిత్, మోనాల్, హారిక, అవినాష్, అమ్మ రాజశేఖర్ ఒక్కో స్టాండ్ మీద తల పెట్టి నిల్చున్నారు. వీరిని మిగతావాళ్లు డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నీళ్లు, గడ్డి పరక, ఐస్ గడ్డలు కూడా వాడుకోవచ్చు. దీంతో అరియానా అందరిపై నీళ్లు గుమ్మరిస్తోంది. లాస్య.. అవినాష్ను ఇబ్బంది పెడుతోంది. మెహబూబ్, సోహైల్ కూడా అందరినీ నానారకాలుగా హింసిస్తున్నారు ఒక్క అమ్మ రాజశేఖర్ను తప్ప. పైగా ఈ ఇద్దరూ అమ్మ రాజశేఖర్పై ఈగ వాలనివ్వకపోవడం గమనార్హం. ఇది చూసిన అఖిల్కు కోపం నషాళానికంటింది. మరోవైపు తన కళ్ల ముందే మోనాల్పై నీళ్లు గుమ్మరిస్తూ హింసించడం తట్టుకోలేకపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. మాస్టర్ దగ్గరకు వెళ్లి ముఖంపై ఐస్ గడ్డలు వేసేందుకు ప్రయత్నించాడు. కానీ అతని గుడ్డి శిష్యులైన మెహబూబ్, సోహైల్ అఖిల్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మాస్టర్ను కాపాడుకుంటూ ఆయన ముఖాన్ని పూర్తిగా వస్త్రంతో కప్పేశారు. దీంతో అఖిల్కు మండింది. చెప్తా.. ఒక్కొక్కడికి, ఆడుకోండ్రా అని సీరియస్ అయ్యాడు. ఇదంతా స్టార్ట్ చేసింది నువ్వు అని సోహైల్ అనడంతో ఎవడు స్టార్ట్ చేసిండు బే అని అఖిల్ ఛాతీ విరుస్తూ ముందుకెళ్లాడు. సహనం తప్పిన సోహైల్ బే అనకు అని అఖిల్కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ గొడవపై చాలామంది నెటిజన్లు సోహైల్ను తప్పు పడుతున్నారు. కన్నింగ్ మాస్టర్కు సోహైల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అఖిల్-మోనాల్ గొడవ: అగ్నికి ఆజ్యం పోస్తున్న మాస్టర్?) అలాగే మోనాల్ను నామినేట్ చేసి ఇప్పుడేమో ఆమె ఇబ్బంది పడుతుంటే అఖిల్ ఎందుకు చూడలేకపోతున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా అఖిల్, సోహైల్ గొడవ పెట్టుకోవడం ఏమీ బాలేదని మరికొందరు పెదవి విరుస్తున్నారు. ఇంతకుముందు చాక్లెట్ విషయంలో మాస్టర్ వల్లే అభిజిత్, హారిక మధ్య గొడవ రాజుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అతడి వల్లే సోహైల్, అఖిల్ గొడవపడుతుండటంతో చాలామంది మాస్టర్ను ఆడిపోసుకుంటున్నారు. అమ్మ రాజశేఖర్ను సేఫ్ చేసేందుకే ఈ టాస్కు పెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే అతడిని సేవ్ చేసుకుంటూ వెళ్తే మున్ముందు బిగ్బాస్ ఎవరూ చూడరని చెప్పుకొస్తున్నారు. మాస్టర్ను బిగ్బాస్ దత్తత తీసుకున్నాడా, ఏంటి? ఈ గేమ్ అంతా ఎందుకు? అతడికే టైటిల్ ఇచ్చేయండి అని ఆవేశపడుతున్నారు. కాగా గతవారం తక్కువ ఓట్లు వచ్చిన మాస్టర్ను నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించడాన్ని కూడా పలువురు తప్పు పడుతున్నారు (చదవండి: మోనాల్ ముద్దు.. అవినాష్కి పిల్ల దొరికేనా!)