Bigg Boss 8
-
సోనియా పెళ్లిలో బిగ్బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)
-
బిగ్ బాస్ షో తర్వాత 4 సినిమా ఆఫర్లు వచ్చాయి
-
నిఖిల్ గెలుపు పై గౌతమ్ షాకింగ్ కామెంట్స్..
-
కావ్య యష్మీల పై క్లారిటీ ఇచ్చిన నిఖిల్
-
తెర వెనక 'బిగ్బాస్ 8' ఫినాలే హంగామా (ఫొటోలు)
-
బిగ్బాస్ 8 విజేతగా నిఖిల్.. ఏమేం గెలుచుకున్నాడు? (ఫొటోలు)
-
Bigg Boss 8: నబీల్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్బాస్ 8వ సీజన్లో మరో ఎలిమినేషన్. వరంగల్ బిడ్డ, యూట్యూబర్ నబీల్ టాప్-5లో నిలిచినప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో హౌస్ నుంచి స్టేజీపైకి వచ్చేశాడు. ఫినాలే వరకు వచ్చినా సరే విజేత కాలేకపోయిన ఇతడు రెమ్యునరేషన్ మాత్రం బాగానే సంపాదించాడు. ఇంతకీ ఎంత మొత్తం అందుకుంటాడనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే)14 మందితో సెప్టెంబరు 1వ తేదీన బిగ్బాస్ 8వ సీజన్ మొదలైంది. యూట్యూబర్ నబీల్ అఫ్రిది పెద్దగా అంచనాల్లేకుండానే హౌసులోకి వచ్చాడు. ఒక్కోవారం తనదైన ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ నెగ్గుకొచ్చాడు. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటికీ.. వాళ్లతో కూడా మంచి బాండింగ్ పెంచుకుంటూ ఇప్పుడు టాప్-5 ఫినాలే వరకు వచ్చాడు. కానీ విజేత రేసులో ఇతడు లేడని ఇప్పుడు ఎలిమినేట్ కావడంతో అర్థమైంది.ఫినాలే వరకు అంటే 15 వారాల పాటు నబీల్.. బిగ్బాస్ హౌసులో ఉన్నాడు. ఇకపోతే వారానికి రూ.2 లక్షలుగా నబీల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ.30 లక్షల పారితోషికం అందుకున్నట్లే. ఏది ఏమైనా ఓ యూట్యూబర్గా హౌసులోకి అడుగుపెట్టి, ఫినాలే వరకు వచ్చి ఇంత మొత్తం రెమ్యునరేషన్గా అందుకోవడం విశేషమే. విజేత కానప్పటికీ మంచి మొత్తాన్ని అయితే అందుకున్నట్లేగా!(ఇదీ చదవండి: బిగ్బాస్: తేజకు నాగార్జున బంపరాఫర్.. అతడి పెళ్లికి..!) -
Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే
టాప్-5లో ఉన్న అవినాష్.. ఫినాలే ఎపిసోడ్లో తొలుత ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి బిగ్బాస్ హౌసులో కాస్తోకూస్తో ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంటే అది ఇద్దరివల్లే. ఒకరు అవినాష్ కాగా మరొకరు రోహిణి. గతంలో వీళ్లిద్దరూ బిగ్బాస్లో పాల్గొన్నారు కానీ ఈసారి మాత్రం రెచ్చిపోయి మరీ తమదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఫినాలేకి ముందు రోహిణి ఎలిమినేట్ కాగా.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్గా అవినాష్ నిలిచి టాప్-5లో అడుగుపెట్టాడు. కానీ ఫినాలేకి వచ్చిన గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్తో పోలిస్తే అవినాష్కి ఓటింగ్ శాతం తక్కువే! గతంలో నాలుగో సీజన్లోనూ అవినాష్.. వైల్డ్ కార్డ్గానే హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్-7 వరకు వచ్చాడు కానీ ఫైనల్కు రాలేకపోయాడు. ఈసారి మాత్రం కొద్దిలో ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ చాకచక్యంగా ఫినాలేలో అడుగుపెట్టేశాడు.అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదో వారం.. బిగ్బాస్ హౌసులోకి అడుగుపెట్టిన అవినాష్ చివరివరకు ఉన్నాడు. దాదాపు 10 వారాల పాటు హౌసులో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఒక్కో వారానికి రూ.2 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే రూ.20 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లే! -
BB Telugu 8 Telugu: బిగ్బాస్ 8 విజేతగా నిఖిల్ మళియక్కల్
బిగ్బాస్ 8వ సీజన్ ఫినాలే షురూ. 100 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన ఈ రియాలిటీ షో.. తుది అంకానికి చేరుకుంది. టాప్-5లో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ ఉన్నారు. వీళ్లలో విజేత ఎవరనేది మరో మూడు గంటల్లో తేలుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి విజేతకు రూ.55 లక్షల ప్రైజ్మనీ ఇవ్వబోతున్నట్లు హోస్ట్ నాగార్జున స్వయంగా ప్రకటించాడు. ఈసారి విజేతగా నిలిచిన వాళ్లకు హీరో రామ్ చరణ్ ట్రోఫీ బహుకరించనున్నారు. -
‘బిగ్బాస్ సీజన్ 8’ గ్రాండ్ ఫినాలే...హైలెట్స్ (ఫొటోలు)
-
బిగ్బాస్ 8 ఫినాలే.. పోలీసులు ముందస్తు వార్నింగ్
బిగ్బాస్ 8వ సీజన్ ఫినాలే సాయంత్రం జరగనుంది. అయితే గతేడాది జరిగిన అనుభవాల దృష్ట్యా.. హైదరాబాద్ వెస్ట్ పోలీసులు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియో బయట భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరకు రావొద్దని పోలీసులు తెలిపారు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్)కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే బిగ్ బాస్ నిర్వహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఇవన్నీ ఎందుకంటే గతేడాది డిసెంబరు 17న బిగ్బాస్ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ని ప్రకటించారు.పల్లవి ప్రశాంత్ బయటకొచ్చిన తర్వాత ఇతడి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తోటి కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేయడంతో పాటు ఆ దారిలో వెళ్తున్న ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈసారి ర్యాలీలపై నిషేధం విధించారు.(ఇదీ చదవండి: చిరంజీవి ఇంటికి కుటుంబంతో పాటు వెళ్లిన 'అల్లు అర్జున్') -
పెళ్లి చేసుకునే ఛాన్సే లేదు.. శపథం చేసిన నిఖిల్
బిగ్బాస్ 8వ సీజన్ సెంచరీ కొట్టేసింది. అంటే 100 రోజులు పూర్తయ్యాయి అనమాట. ప్రస్తుతం ఫినాలే వీక్ నడుస్తోంది. దీంతో టాస్కులు, గేమ్స్ అని పెట్టుకోకుండా వారమంతా ఎమోషనల్గా ఉండేలా బిగ్బాస్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే స్టార్ మాలో సీరియల్స్ చేస్తున్న నటీనటులు హౌసులోకి వచ్చి సరదాగా అలా కాసేపు గడిపి, హౌస్మేట్స్తో ముచ్చటించి వెళ్తున్నారు. మంగళవారం ఎపిసోడ్లోనూ అలా దీప్తి, సుహాసిని, ఆకర్ష్ వచ్చారు. ఇంతకీ బిగ్బాస్లో 100వ రోజు ఏం జరిగింది?'మామగారు' సీరియల్ జంట ఆకర్ష్-సుహాసిని హౌసులోకి వచ్చారు. అలానే ఇద్దరూ హౌస్మేట్స్ని తమ తొలి ప్రేమ- బ్రేకప్ స్టోరీలు చెప్పాలని అడిగారు. దీంతో నిఖిల్-గౌతమ్ తమ భగ్న ప్రేమకథల్ని బయటపెట్టారు. తొలుత గౌతమ్ ఓపెన్ అయ్యాడు. కాలేజీలో ఉన్నప్పుడు నేను చాలా సీరియల్ రిలేషన్లో ఉన్నాను. పెళ్లి చేసుకుందామని ఫిక్సయ్యా. కొన్ని కారణాల వల్ల అనుకున్నది జరగలేదు. చాలా బాధపడ్డా, డిప్రెషన్లోకి వెళ్లిపోయా. అప్పుడు నా కుటుంబం అండగా నిలిచింది. ఇలాంటి కష్టమొచ్చినప్పుడే కుటుంబం విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరూ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండటానికి రాలేదు. అది గుర్తుపెట్టుకొని జీవితాన్ని జాలీగా గడిపేసుకుంటూ వెళ్లాలని అర్థం చేసుకున్నా అని గౌతమ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు)తర్వాత నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నా తొలి బ్రేకప్ జరిగినప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్లాను. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రావడం, తొలి మూవీ పోస్టర్.. మా ఊరిలో నేను చదివిన కాలేజీ పక్కన థియేటర్ బయట కటౌట్ పెట్టడం, తర్వాత నేను గుర్తుకురావడంతో తను ఫోన్ చేసి క్షమాపణ చెప్పింది. సారీ మీరెవరో నాకు తెలీదు అని నేను ఆమెని బ్లాక్ చేశా అని నిఖిల్ చెప్పాడు. బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. పరోక్షంగా కావ్య గురించి చెప్పాడు.అందరి జీవితంలో బ్రేకప్ జరుగుతుంది. అయితే మనం చూడాల్సింది మనకేంటి అని కాదు, వదిలేసేటప్పుడు ఏం కారణం చెప్పారా అనేది ముఖ్యం. భవిష్యత్తులో నాకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి కూడా కొందరు బ్రేకప్ చెప్పి వెళ్తారు. ఉదాహరణ చెప్పుకొంటే.. నా వల్ల నీకు ఏమైనా అవుతుందా అని నిన్ను వదిలేసి వెళ్తాను, నువ్వు హర్ట్ అవ్వకూడదని.. అలాంటి బ్రేకప్ని బ్రేకప్ చేసుకోకుండా సెట్ చేసి పక్కన నిల్చోబెట్టుకోవడమే మంచిది.. నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావోనని వదిలేసి వెళ్లడం.. ఈ జనరేషన్లో కరెక్ట్ అనుకోవడం లేదని నిఖిల్ చెప్పాడు. అయితే ఇదంతా కూడా కావ్యని ఉద్దేశించి చెప్పాడా అనిపించింది.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)తర్వాత 'బ్రహ్మముడి' కావ్య పాత్రధారి దీపిక వచ్చింది. వచ్చీ రాగానే తనదైన వెరైటీ స్టెప్పులు, తింగరి మాటలు, పిచ్చివాగుడుతో అందరి బుర్రలు తినేసింది. ఓ దశలో ఈమె దెబ్బకు బిగ్ బాస్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. మిగతా వాళ్ల సంగతేమో గానీ దీప్తి, నిఖిల్ని ఓ ప్రశ్న అడిగింది. దీనికి అతడు చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నీకు ఓ గర్ల్ఫ్రెండ్ ఉంది. గతంలో నువ్వంటే తనకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు కాదు. మీకు తన మీద ఇంకా ప్రేమ ఉంది, కానీ నువ్వు వద్దు నిన్ను పెళ్లి చేసుకోను అని చెబుతుంది అలా అని ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోలేదు. మీ ఇంట్లోనూ పెళ్లి చేసుకోవాలని మీ అమ్మ నుంచి ప్రెజర్ వస్తుంది. అప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ఇంకా వెయిట్ చేస్తారా? లేకపోతే వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారా? అని దీప్తి, నిఖిల్ని అడిగింది.ప్రేమ ఉందంటే నేను నిజంగా ఎదురుచూస్తా, ఎన్ని ఏళ్లయినా కచ్చితంగా వెయిట్ చేస్తా, అమ్మవాళ్లు చెప్పిన సంబంధం చేసుకోను, నేను మూవ్ ఆన్ అవ్వలేను ఆ అమ్మాయిపైన ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయంటే కచ్చితంగా ఆమె కోసం ఎదురుచూస్తానని నిఖిల్ చెప్పాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: నా గుండెలపై తన్నావ్.. మోహన్ బాబు ఆడియో వైరల్) -
బిగ్బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?
బిగ్బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో షో ముగిసిపోనున్న దృష్ట్యా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇందులో భాగంగా రోహిణిని శనివారం బయటకు పంపేశారు. ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ మంచి గుర్తింపుతో పాటు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇంతకీ రోహిణి ఎన్ని వారాలు ఉంది? ఎన్ని లక్షలు సంపాదించింది?వచ్చేవారమంతా ఫినాలే వీక్ కాబట్టి.. టాప్-5ని మాత్రమే పంపించాలి కాబట్టి ఇప్పుడు రోహిణిని పంపించారు. ఆదివారం ఎపిసోడ్లో విష్ణుప్రియని ఎలిమినేట్ చేయబోతున్నారు. కాసేపు విష్ణుప్రియ గురించి పక్కనబెడితే రోహిణి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. అప్పటివరకు నీరసంగా ఉన్న షోని కాస్త అవినాష్తో కలిసి ఎంటర్టైన్ చేస్తూ కాస్త రేటింగ్స్ వచ్చేలా చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ')రోహిణిని అయితే పృథ్వీ, విష్ణుప్రియ లాంటి వాళ్లు అసలు నువ్వు కామెడీ చేయడానికి తప్పితే ఎందుకు పనికిరావ్ అని నానా మాటలు అన్నారు. దీంతో తను కేవలం కామెడీకి మాత్రమే కాదని, గేమ్స్ కూడా ఆడగలనని నిరూపించింది. తనని మాటలన్నా పృథ్వీపైనే గెలిచి అదరగొట్టేసింది. అయితే టాప్-5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్లో దాదాపు 9 వారాల పాటు ఉంది. హౌసులోకి వచ్చేముందు వారానికి రూ.2లక్షల చొప్పున ఈమె అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.18 లక్షల వరకు పారితోషికం సొంతం చేసుకున్నట్లే. గతంలో ఈమె బిగ్బాస్లో పాల్గొన్న ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈసారి మాత్రం అటు డబ్బు, ఇటు మరింత గుర్తింపు రోహిణికి దక్కడం విశేషం.(ఇదీ చదవండి: రోహిణితో పాటు విష్ణుప్రియ అవుట్.. ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్!) -
బిగ్బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!
బిగ్బాస్ 8 తెలుగు సీజన్ చివరికొచ్చేసింది. తర్వాత వారంలో ఫినాలే జరగబోతుంది. దీంతో ఈ వీకెండ్ జరగబోయే ఎలిమినేషన్ చివరిది. దీంతో ఎవరు బయటకెళ్లిపోతారా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం హౌసులోని పరిస్థితుల ప్రకారం ఇద్దరమ్మాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లలో ఒకరైనా స్టార్ కంటెస్టెంట్ ఈసారి ఎగ్జిట్ పక్కా అని అంటున్నారు.ఈ వారమంతా హౌసులో విభిన్న రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు వచ్చి, హౌసులోని సభ్యులతో కాసేపు ముచ్చట్లు పెట్టి వెళ్లిపోయారు. ఈ వారం అవినాష్ తప్పితే మిగిలిన ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలో నిఖిల్, గౌతమ్ ఏకంగా టైటిల్ రేసులో ఉన్నారు కాబట్టి వీళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ప్రేరణ కూడా టాప్-5 రేసులో ఉంది. దీంతో ఈమె కూడా బయటకెళ్లకపోవచ్చు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?)వీళ్లు కాకుండా అంటే నబీల్, విష్ణుప్రియ, రోహిణి ఉంటారు. కొన్నాళ్ల ముందు వరకు చాలా బ్యాలెన్స్గా గేమ్ ఆడుతూ వచ్చిన నబీల్.. ఈ మధ్య కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అయితేనేం టాప్-5కి నబీల్ అర్హుడే అనిపిస్తుంది. ఓటింగ్ పరంగానూ ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే చివరి రెండు స్థానాల్లో రోహిణి, విష్ణుప్రియ ఉన్నారు.పృథ్వీతో లవ్వాట తప్పితే విష్ణుప్రియ.. ఈ సీజన్ అంతా అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మెన్స్ చేస్తూ వస్తోంది. ఈమెతో పోలిస్తే ఎంటర్టైన్, గేమ్స్ పరంగా రోహిణి చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఓటింగ్ పరంగా చూసుకుంటే రోహిణి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ. అదే గేమ్ లెక్కల బయటకు తీస్తే మాత్రం విష్ణుప్రియ.. ఈ వారం ఎగ్జిట్ అయిపోవడం గ్యారంటీ. లేదంటే బిగ్బాస్.. గతవారం తేజ, పృథ్వీని పంపినట్లు డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ప్లాన్ చేసాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?) -
నిఖిల్ని ఓడించిన ప్రేరణ.. సారీ చెప్పిన గౌతమ్
మరో వారం పదిరోజుల్లో బిగ్ బాస్ ఫినాలే ఉండొచ్చు. దీంతో ఈసారి నామినేషన్స్ హడావుడి పెద్దగా లేదు. ఫైనలిస్ట్ అయిన అవినాష్ తప్పితే అందరూ లిస్టులో ఉన్నారు. అంటే గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్లో ఉన్నట్లే. అయితే బిగ్బాస్ ఈ వారమంతా కొన్ని గేమ్స్ పెడుతుంటాడు. వాటిలో ఎవరైతే గెలుస్తారో.. వాళ్లకు ఓట్లు అడుక్కునే అవకాశం దక్కుతుంది. మంగళవారం ఎపిసోడ్తో ఈ తంతు మొదలైంది. ఇంతకీ 93వ రోజు ఏమేం జరిగిందనేది హైలైట్స్లో చూద్దాం.(ఇదీ చదవండి: బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్)అయితే ఓటింగ్ రిక్వెస్ట్ కోసం జంటలుగా కొన్ని ఛాలెంజెస్లో పాల్గొనాలి. ఎవరికైతే జంట ఉండదో వారు ఈ ఓట్ అప్పీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ జంటలని ఎంచుకొని చెప్పండని బిగ్బాస్ చెప్పాడు. అలా అవినాష్-నబీల్, ప్రేరణ-నిఖిల్, విష్ణు-రోహిణి జంటలుగా సెట్ అవగా.. గౌతమ్ ఏకాకిగా మిగిలిపోయాడు. ఇంతలో ట్విస్ట్ ఇచ్చిన నబీల్.. అవినాష్ని వదిలేసి గౌతమ్తో జోడీ కట్టాడు.మూడు జంటలకు తొలి పోటీగా 'నా టవర్ ఎత్తయినది' అనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా జంటలు ఎవరికి వాళ్లు ఓ టవర్ నిర్మించాల్సి ఉంటుంది. నిలబెట్టిన దాన్ని వేరే జోడీలు పడగొట్టొచ్చు. బజర్ మోగేసరికి ఎవరిదైతే ఎత్తుగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఇందులో అందరూ బాగానే ఆడతారు గానీ ప్రేరణ-నిఖిల్ తొలి స్థానంలో నిలుస్తారు. రోహిణి-విష్ణుప్రియ రెండో స్థానం సొంతం చేసుకుంటారు. చివర్లో నిలిచిన గౌతమ్-నబీల్.. ఓటు అప్పీల్ రేసు నుంచి తప్పుకొన్నారు.(ఇదీ చదవండి: 'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ))మొదటి పోటీ తర్వాత రెండో పోటీ పెట్టారు. 'టక్ టకాటక్' అనే గేమ్లో భాగంగా తమ తమ ప్లేసులో ఉండే డిస్కులు.. పక్క వాళ్ల ప్లేసులోకి తోసేయాలి. ఈ పోటీని ఒక్కొక్కరుగా ఆడాలి. దీంతో ప్రేరణ-నిఖిల్ ఉంటారు. విష్ణు-రోహిణిలలో ఒక్కరే ఆడాలని బిగ్ బాస్ చెప్పగా.. రోహిణి ముందుకొస్తుంది. ఈ పోటీలో గెలిచిన ప్రేరణ.. ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దక్కించుకున్న తొలి విజేతగా నిలిచింది. దీంతో ఈమెని ఇన్ఫినిటీ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ప్రేక్షకుల్ని ఓట్లు అప్పీలు చేసుకోమన్నాడు.'బిగ్బాస్ జర్నీలో ఇక్కడ ఉంటానని అనుకోలేదు. తెలుగు ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమ, సపోర్ట్ దొరికింది. ఇక్కడికి వచ్చి నాలాగా ఉండాలనుకున్నాను, ఉంటున్నాను. కచ్చితంగా కొన్నిసార్లు తప్పు చేశా. ఎవరూ ఫెర్ఫెక్ట్గా ఉండరు. నేను తప్పులు చేశాను. ఎవరు చెప్పినా వాటి నుంచి నేర్చుకున్నాను. నా గురించి నాకే కొన్ని మంచి, కొన్ని చెడు అంశాలు తెలిశాయి. ఇప్పటివరకు 13 వారాలు సేవ్ అయ్యాను. ఇది దాటేస్తే ఇక ఫైనల్స్. మీ ఓట్స్ నాకు ఇవ్వండి. బిగ్బాస్ హిస్టరీలోనే తొలి మహిళా విన్నర్ అవ్వాలని ఆశ ఉంది. అది మీ వల్లే అవుతుంది. ఓటు మీది గెలుపు నాది' అని ప్రేరణ రిక్వెస్ట్ చేసింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. తమన్ని సైడ్ చేసేశారా?)సోమవారం నామినేషన్స్ లేకపోయినా సరే గౌతమ్-నిఖిల్ మధ్య పెద్ద వాగ్వాదమే నడిచింది. 'యష్మిని వాడుకున్నావ్' అని నిఖిల్పై నోరు జారిన గౌతమ్.. మంగళవారం ఎపిసోడ్లో మాత్రం అందరిముందు క్షమాపణలు చెప్పాడు. ఎవరిది తప్పు ఎవరిది కాదు అని నేను చెప్పను. వాడుకున్నావ్ అన్నది వేరే రకంగా అనలే, గేమ్లో నువ్వు ఆటాడుతున్నావ్ అని ఎట్ల అన్నావో నేను వాడుతున్నా అని అట్ల అన్నా.. దానికి నువ్వు హర్ట్ అయ్యావనిపించింది కాబట్టి నేను అన్న ఆ మాటని వెనక్కి తీసుకుంటూ ఆ బాధ్యత వహిస్తూ ఐయామ్ రియల్లీ సారీ నిఖిల్.. మరోసారి నీ దగ్గర నోరు జారకుండా జాగ్రత్త పడతానని గౌతమ్ అన్నాడు.దీనికి స్పందించిన నిఖిల్.. నాకు తెలినంతవరకూ నిన్న మాట్లాడింది నీది కానీ ఇంకెవరిదైనా పర్సనల్ విషయం నేను తీయలేదు. ఒకవేళ నీకు అలా అనిపించి ఉంటే ఐ యామ్ సారీ. వేరే ఎక్కడా నేను ఇప్పటివరకూ నోరు జారలేదు.. మూస్కొని నొక్కు అన్న మాట వాడినందుకు సారీ.. దానికి నేను నిజంగా సారీ చెబుతున్నా అని చెప్పాడు. వెంటనే ఇద్దరూ ఒకరికొకరు హగ్ ఇచ్చుకున్నారు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్) -
బిగ్బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?
బిగ్బాస్ 8 తెలుగు చివరకొచ్చేసింది. ఫినాలే కోసం నువ్వానేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఇందులో భాగంగా శనివారం ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. తన కోరికని ఈ సీజన్లో నెరవేర్చుకున్న తేజ.. రెమ్యునరేషన్ కూడా బాగానే సంపాదించాడట. ఇంతకీ ఎన్ని లక్షలు అందుకున్నాడంటే?(ఇదీ చదవండి: నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ)అక్టోబరు 6న వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఒకడిగా టేస్టీ తేజ వచ్చాడు. ప్రారంభంలో ఉన్నంతలో బాగానే ఎంటర్టైన్ చేశాడు. తర్వాత తర్వాత అరుపులు గొడవలు ఎక్కువైపోయాయి. బాగా నస పెట్టేశాడు. దీంతో ఎలిమినేట్ కావడం అయితే పక్కా అనుకున్నారు. కాకపోతే అలా సేవ్ అయిపోతూ వచ్చాడు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లలో ఒకడిగా బయటకొచ్చేశాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే తన తల్లి వస్తుందని ఆశపడ్డాడు. అనుకున్నట్లే అది నెరవేర్చుకున్నాడు.హౌసులో 8 వారాలు పాటు ఉన్న తేజ.. ఒక్కో వారానికిగానూ లక్షన్నర అందుకున్నాడట. అంటే 8 వారాలకు గానూ రూ.12 లక్షలు తేజకి రాబోతున్నాయట. ఓ రకంగా చూసుకుంటే తేజకి ఇది మంచి మొత్తమే అని చెప్పొచ్చు. ఇదలా ఉంచితే ఆదివారం ఎపిసోడ్లో కన్నడ బ్యాచ్లో ఒకడైన పృథ్వీ ఎలిమినేట్ అయి బయటకు రాబోతున్నాడు. బహుశా వచ్చే వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నాయండోయ్!(ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
ప్రేమపై విష్ణుప్రియ క్లారిటీ.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి!
బిగ్బాస్ 8 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే ఉండనుంది. దీంతో సోమవారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. మెగాచీఫ్ రోహిణి తప్పితే విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పుడు టికెట్ టూ ఫినాలే కూడా షురూ చేశారు. ఇంతకీ మంగళవారం (నవంబర్ 26) ఎపిసోడ్లో ఏం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ అయ్యింది. గతవారం ఈ సీజన్లోని పాల్గొని ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు. ఇప్పుడు గత సీజన్లలో పాల్గొన్న పలువురు హౌస్మేట్స్ వచ్చారు. టికెట్ టూ ఫినాలే పోటీలు పెట్టారు. నాలుగో సీజన్ ఫేమ్ అఖిల్ సార్ధక్, అలేఖ్య హారిక తొలుత వచ్చారు. వీరిని చూసి హౌస్మేట్స్ షాకయ్యారు. ఏందిరా బాబు మరో సెట్.. వైల్డ్ కార్డులను దింపుతున్నారా ఏంటా అని భయపడ్డారు. కానీ విషయం తెలిసి రిలాక్స్ అయ్యారు.వచ్చాక సరదాగా ముచ్చట్లు పెట్టిన అఖిల్.. విష్ణుప్రియను ఇన్ డైరెక్ట్గా కౌంటర్స్ వేశాడు. లైఫ్ అంటే అంతే కదా, కొందరిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే ప్రయాణం ఇంకా చాలా బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓటమినైనా లేకపోతే ప్రేమలో ఓడిపోయినా దాన్ని తీసుకుని ముందుకెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెబుతున్నానో వాళ్లకి అర్థమవుతుందని అఖిల్ అన్నాడు. ఎక్కడో ఈ రిలేషన్షిప్లో నాకు ఇది రైట్ అనిపించలేదు. అది మార్చుకుంటే బావుంటుందేమోనని అనిపించింది.. విష్ణు నీ గురించే నేను చెబుతున్నానని అఖిల్ అన్నాడు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)దీంతో విష్ణుప్రియ రియాక్ట్ అయింది. 'ఓ వ్యక్తిపై ఇష్టం మాత్రమే.. అది ప్రేమనా లేదంటే ఇంకేమైనా అని నేను ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మనం ఎలా ఉండాలో అలా ఉండటానికే వచ్చాం. నేను 100 శాతం నాకు నేనులానే ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఓవైపు ఇది జరుగుతుండగా హారిక.. పృథ్వీ దీనిపై నీ అభిప్రాయం ఏంటని అడిగింది. దీంతో క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ విష్ణు వచ్చినప్పుడు మేము గుడ్ ఫ్రెండ్స్, ఆమె తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చేశా. ఈ రిలేషన్షిప్ ఇవన్నీ నాకు సెట్ కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్ రాదు.. కానీ తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అని పృథ్వీ ఖరాఖండీగా చెప్పేశాడు.ఇలా పృథ్వీతో రిలేషన్ గురించి విష్ణు-అఖిల్ మధ్య చాలానే డిస్కషన్ సాగింది. కానీ చివరకు అసలు ఈమెని ఎందుకు ఇదంతా అడిగానా అని అఖిల్ అనుకుని నోరు మూసుకోవడంతో ఎండ్ అయింది. ఇన్నాళ్లు లవ్ బర్డ్స్ అన్నట్లు తెగ పోజులు కొట్టారు కానీ వీళ్లిద్దరూ షో కోసమే ఈ డ్రామా అంతా నడిపించారని అఖిల్-హారిక అడగడం.. విష్ణుప్రియ క్లారిటీ ఇవ్వడంతో అర్థమైంది. టికెట్ టూ ఫినాలే కోసం పోటీదారుల్ని సెలెక్ట్ చేయాలని అఖిల్-హారికకు బిగ్బాస్ చెప్పగా.. వీళ్లిద్దరూ గౌతమ్, రోహిణిని తొలుత ఎంపిక చేశారు. మరో ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయాలని చెప్పగా.. తేజ, విష్ణుప్రియని పోటీలోకి దించారు.(ఇదీ చదవండి: హీరో అఖిల్తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?)ఈ నలుగురికి కలిపి 'ది లిమిట్లెస్ బ్రిడ్జి' టాస్క్ పెట్టారు హౌసులోకి వచ్చిన అఖిల్-హారిక. ఇందులో చకచకా బ్రిడ్జి కంప్లీట్ చేసిన రోహిణి విజేతగా నిలిచింది. ఆ తర్వాత గౌతమ్, విష్ణుప్రియ పూర్తి చేశారు. టేస్టీ తేజ మాత్రం బజర్ మోగే వరకూ చేయలేకపోయాడు. ఈ పోటీలో గెలిచిన రోహిణికి తదుపరి ఛాలెంజ్లో పెద్ద ప్రయోజనం లభిస్తుందని బిగ్బాస్ ప్రకటించాడు. తులాభారం' అని మరో టాస్క్ కూడా పెట్టారు. ఇందులోనూ రోహిణి విజేతగా నిలిచింది. ఈ రెండు టాస్క్ల బట్టి మిగిలిన ముగ్గురిలో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలని బిగ్బాస్ ఆదేశించాడు. ఈ బ్యాడ్జి దక్కిన వారికి ఇక టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడేందుకు వీల్లేదు. రేసు నుంచి తప్పుకున్నట్లే అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు.అఖిల్-హారిక డిసైడ్ చేసుకుని విష్ణుప్రియకు బ్లాక్ బ్యాడ్జిని ఇచ్చారు. దీంతో విష్ణు ఏడుపు మొదలుపెట్టింది. తేజ కంటే బాగానే ఆడాను కదా అని పృథ్వీ దగ్గరకొచ్చి తెగ బాధపడిపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. విష్ణు.. టికెట్ టూ ఫినాలే పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది కాబట్టి ఈవారం ఆమె ఏమైనా ఎలిమినేట్ అవుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప 2' నిడివి లాక్.. ఏకంగా అన్ని గంటలా?!) -
శివంగి మళ్లీ గెలుపు.. బిగ్బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?
బిగ్బాస్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే జరగబోతుంది. దీంతో ఎవరెవరు ఫైనల్లో ఉండాలనేది ఇప్పటి నుంచే పోటీలు పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలా గేమ్స్ పెడితే కిక్ ఏముంటుందా అని గతంలోని కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి మరీ కొత్త వాళ్లతో పోటీలు పెడుతున్నారు. అలా ఈ రోజు అఖిల్, హారిక వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.'టికెట్ టూ ఫినాలే'లో మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు పోటీదారుల్ని ఎంపిక చేయాలని హౌస్లోకి వచ్చిన అఖిల్, హారికకు బిగ్బాస్ చెప్పగా.. తేజ, గౌతమ్, రోహిణి, విష్ణుప్రియని ఎంపిక చేశారు. దీంతో వీళ్లకు టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్లోని కలర్ బాక్సులని తీసుకొచ్చి, రెయిన్ బో ఆకారం వచ్చేలా చేయాలి. తొలుత రోహిణి సరిగా పేర్చింది కానీ అవి పడిపోయాయి. ఆ తర్వాత తేజ కూడా పెట్టాడు కానీ అవి నిలబడలేదు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్పై పోలీసు కేసు)రోహిణి అన్ని సరిగా పేర్చి త్వరగా వెళ్లి గంట కొట్టింది. దీంతో తెగ సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలోనే రోహిణి.. టికెట్ టు ఫినాలే తొలి ఫైనలిస్ట్ అని అంటున్నారు. కానీ బిగ్ బాస్.. మళ్లీ పోటీలు పెడతాడా? లేదంటే రోహిణిని ఫైనలిస్ట్గా ఫిక్స్ చేస్తాడా అనేది చూడాలి?కొన్నిరోజుల ముందు వరకు ఎంటర్టైనర్గా అదరగొట్టిన రోహిణి.. గతవారం కుండని బ్యాలెన్స్ చేసే టాస్కులో మాత్రం చివరివరకు నిలబడి గెలిచింది. కాలునొప్పి బాధిస్తున్నా సరే విజేతగా నిలిచి మెగాచీఫ్ అయింది. ఒక్కసారి తన గ్రాఫ్ పెంచుకుంది. ఒకవేళ ఈమె గనక తొలి ఫైనలిస్టు అయితే మాత్రం మంచిదే!(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ గీత రచయిత కన్నుమూత) -
Bigg Boss 8: 13వ వారం నామినేషన్స్.. ఆ ఇద్దరు తప్పితే!
బిగ్బాస్ 8వ సీజన్ 13వ వారంలోకి ప్రవేశించింది. యష్మి ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడింది. ఎప్పటిలానే సోమవారం మళ్లీ నామినేషన్స్ రచ్చ మొదలైంది. ప్రస్తుతం హౌసులో తొమ్మిది మంది ఉండగా.. ఇద్దరిని తప్పితే మిగిలిన అందరూ నామినేట్ అయ్యారట. ఇప్పటికే షూట్ జరగ్గా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా?)ప్రోమో బట్టి చూస్తే నబీల్.. గౌతమ్-విష్ణుప్రియని, పృథ్వీ.. అవినాష్ని నామినేట్ చేసినట్లు చూపించారు. వీళ్లతో పాటు రోహిణి-విష్ణుప్రియ మధ్య కూడా గతవారం పోటీల్లో చేసుకున్న 'క్యారెక్టర్' గొడవ గురించి ఈసారి నామినేషన్లలో రచ్చ జరిగిందట.మెగా చీఫ్ అవడంతో రోహిణి, ఈమెతో పాటు నబీల్.. ఈ వారం నామినేషన్లలో లేరట. మిగిలిన పృథ్వీ, నిఖిల్, అవినాష్, విష్ణుప్రియ, ప్రేరణ, తేజ, గౌతమ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 13వ వారం కాబట్టి ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ వీక్ అంతా ఏమేం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
Bigg Boss 8: బిగ్ బాస్ ఈ వారం విశ్లేషణ... 'బోల్డ్ వీక్'
తెగించిన వాడికి తెడ్డే అన్నట్టు బిగ్బాస్ ఆఖరి దశకు చేరుకునే సమయంలో బాగా బోల్డ్ కంటెంట్తో ముందుకు వెళుతోంది. ఈ వారమంతా నామినేషన్స్ దగ్గర నుంచి ఎలిమినేషన్ వరకు ఈ బోల్డ్ కంటెంట్తోనే ఈ వారమంతా నడిచిందని చెప్పొచ్చు. ముందుగా ఈ వారం చివరి చీఫ్ కంటెండర్ జరిగిన పోటీలో పార్టిసిపెంట్స్ పదజాలం బాగా బోల్డ్. మెగా చీఫ్గా గెలిచిన రోహిణి, దానికోసం పోటీ పడ్డ విష్ణుప్రియ మధ్య సంభాషణంతా సాలిడ్ బోల్డ్.విష్ణు ఓపెన్గా రోహిణి క్యారెక్టర్పై నిందవేస్తే.. రోహిణి ఏకంగా నువ్వు ఒకరిని ఇష్టపడి వారు దొరకక ఇంకొకరి కోసం ప్రయత్నించావని విష్టుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ రకంగా ఇటువంటివి బుల్లితెరలో అదీ తెలుగు ఎంటర్టైన్మెంట్ మీడియాలో చాలా కొత్త అని చెప్పొచ్చు. ప్రేక్షకుల పరంగా పరమ చెత్త అనొచ్చు. నాలుగు గోడల మధ్య ఆవేశపడితే ఇంటి గుట్టవుతుంది, అదే లక్షలాది ప్రేక్షకుల మధ్య అసభ్యంగా మాట్లాడితే అదే గుట్టు రట్టవుతుంది. ఈ విషయం కంటెస్టెంట్స్కు తెలిసినా తెలియకపోయినా బిగ్బాస్కు మాత్రం తెలుసు. ఎందుకంటే అదే బిగ్బాస్కు లాభదాయకం కాబట్టి.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా?)వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లు ఇతర కంటెస్టెంట్లపై కంప్లైంట్లను ఓ చక్కటి ఆట రూపేణా చూపడం కొంతవరకు బావుంది. ఈ వారం యశ్మి ఎలిమినేట్ అవడం అటు కంటెస్టెంట్లకు ఇటు యష్మికి ఏ మాత్రం బాధ కలిగించలేదన్నది వాస్తవం. యష్మి వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ రూపేణా గౌతమ్ను నేరుగా నామినేట్ చేసింది. ఈ వారం ఓ విషయమైతే చెప్పుకోవాలి, హౌసులో గ్రూపిజం సరిగ్గా ఉందో లేదో కాని బయట సోషల్ మీడియాలో మాత్రం బిగ్బాస్పై కుల, ప్రాంత, మతతత్వాలతో కొట్టుకు చస్తున్నారు కొందరు అమాయక నెటిజన్లు.ఏ సంబంధం లేని వారి కోసం తమ విలువైన టైమ్ వెచ్చించి అర్ధం లేని కార్యక్రమం కోసం తమ జీవితాలను వ్యర్ధం చేసుకుంటున్న సోషలోళ్లు మీకు హాట్సాఫ్. దీనికంతటికీ కారణజన్ముడు ఆ బిగ్బాస్ మహానుభావుడని వేరే చెప్పాలా!-ఇంటూరు హరికృష్ణ(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?
బిగ్బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లకంటే నెగిటివ్ అయిన వాళ్లే ఎక్కువ. అలా ప్రస్తుత సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన బ్యూటీ సోనియా ఆకుల. ఇప్పుడు ఈమె తన ప్రియుడు యష్ పాల్తో నిశ్చితార్థం చేసుకుంది. పెద్దగా హడావుడి లేకుండా గురువారం ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్బాస్ 8వ సీజన్ అంటే ఈసారి ఓ కంటెస్టెంట్గా హౌసులోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.బయటకొచ్చిన తర్వాత నిఖిల్ నిజ స్వరూపం తెలుసుకుని పలు ఇంటర్వ్యూలో అతడిని కడిగిపారేసింది. బిగ్బాస్ లోనే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. డిసెంబరు రెండో వారంలో పెళ్లి జరిగే అవకాశముంది.(ఇదీ చదవండి: 'జీబ్రా' సినిమా రివ్యూ) -
డేంజర్ జోన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అతడి ఎలిమినేషన్ పక్కా?
తెలుగు బిగ్బాస్ షోలో 12వ వారం చివరకొచ్చేసింది. లెక్క ప్రకారం గతవారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. ఇక అయిపోతుంది అనుకునేలోపు నబీల్.. తన దగ్గరున్న ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించడంతో బతికిపోయారు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చిన.. ఈ వారం నామినేషన్స్ పూర్తిచేశారు. అలా అందరూ కన్నడ బ్యాచ్ని టార్గెట్ చేసి వాళ్లందరూ నామినేషన్స్లో ఉండేలా చేశారు. మరి ఈసారి వీళ్లలో ఎవరు బయటకెళ్లిపోయే ఛాన్స్ ఉంది?12వ వారం నామినేషన్స్లో కన్నడ బ్యాచ్ అయిన ప్రేరణ, నిఖిల్, యష్మి, పృథ్వీ ఉన్నారు. వీళ్లతో పాటు నబీల్ కూడా ఉన్నాడు. వీళ్లలో ప్రస్తుతం ప్రేరణ.. ఓటింగ్లో టాప్లో కొనసాగుతోంది. దాదాపు 26 శాతం ఓట్లతో ఈమె లీడింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో నిఖిల్ ఉన్నాడట. అలా వీళ్లిద్దరూ టాప్ ప్లేయర్స్ అనిపించుకున్నారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)వీళ్ల తర్వాత అంటే మూడో స్థానంలో యష్మి, నాలుగో స్థానంలో నబీల్ ఉన్నట్లు సమాచారం. చిట్టచివరగా పృథ్వీ ఉన్నాడట. చివరి రెండు స్థానాల్లో ఉన్న నబీల్, పృథ్వీ మధ్య ఓటింగ్ పరంగా 3 శాతం మాత్రమే వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. అంటే పృథ్వీతో పాటు నబీల్ డేంజర్ జోన్లో ఉన్నట్లేగా!ఈ సీజన్లో వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు పృథ్వీ. కానీ నామినేట్ అయిన ప్రతిసారి ఎలాగోలా తప్పించుకుంటూ వస్తున్నాడు. ఈసారి మాత్రం ఎలిమినేషన్ గ్యారంటీ అనిపిస్తుంది. ఒకవేళ ఇతడు సేవ్ అయితే మాత్రం నబీల్ బయటకెళ్లిపోతాడు. మరి ఈవారం ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్పై బన్నీ) -
అందరి టార్గెట్ కన్నడ బ్యాచ్.. నామినేషన్స్లో ఎవరెవరు?
బిగ్బాస్ 12వ వారం విచిత్రమైన పద్ధతిలో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయినవాళ్లు హౌసులోకి వచ్చి ఈ వారం ఎవరెవరు నామినేట్ అవ్వాలనేది డిసైడ్ చేశారు. సోమవారం కొంతవరకు జరగ్గా.. మంగళవారం కూడా ఇదే కొనసాగింది. మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత వచ్చారు. తన పాయింట్లు చెప్పి రఫ్ఫాడించేశారు. ఇంతకీ బిగ్బాస్లో మంగళవారం(79వ రోజు) ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్గా అడుగుపెట్టిన శోభా శెట్టి)తొలుత హౌసులోకి వచ్చిన నైనిక.. నిఖిల్ని పలకరించి హగ్గు ఇచ్చింది. ఎక్కువగా ఆలోచించి బాధపడకు అని చెప్పింది. ఇక తన మొదటి నామినేషన్ నబీల్ పేరు చెప్పింది. 'నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావ్ నబీల్.. షేర్ (సింహం) అన్నావ్ కదా! మరి అది ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయింది. గత కొన్నివారాలుగా నువ్వు కనిపించట్లేదు' అని అడిగింది. దీనికి సమాధానంగా.. నేను వచ్చిందే ఆ కప్పు కోసం.. ఖచ్చితంగా దాని కోసమే ఆడతా.. నేను ఎవరి గురించి వెనకాల మాట్లాడలే అని నబీల్ తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు.నైనిక తన రెండో నామినేషన్ యష్మీకి వేసింది. ఒకప్పుడు యష్మీ ఇప్పుడు కనిపించట్లేదని, ఎప్పుడైతే నిఖిల్ వెంటపడటం మొదలుపెట్టావో అప్పటినుంచి యష్మీ మిస్ అయిపోయిందని చెప్పింది. దీనికి ఆన్సర్ ఇచ్చిన యష్మీ.. నేనెందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు.. నేను బాగానే ఆడుతున్నా అంటూ యష్మీ ఏడ్చింది. ముందు యష్మీని తీసుకొస్తా.. కప్పు కొట్టడానికి ట్రై చేస్తానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: క్షమించమంటూ నిఖిల్ ఏడుపు.. అది చూసి మోసపోవద్దన్న కావ్య!)తర్వాత వచ్చిన మణికంఠ.. నిఖిల్ని నామినేట్ చేశాడు. నేను వెళ్లేటప్పుడే నీ గ్రాఫ్ పడిపోతుందని నీకు చెప్పా. కానీ నీకెలా తెలుసు అని నువ్వు అడిగావ్.. ఇప్పుడు నేనే చూసి వచ్చా అందుకే చెబుతున్నా.. నీ గ్రాఫ్ పడిపోయింది, నువ్వు ఇక్కడికి కనెక్షన్స్ పెట్టుకోవడానికి వచ్చావా? కప్పు కోసం వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే టైటిల్ గెలవడం చాలా కష్టం నిఖిల్ అని అన్నాడు. దీనికి నిఖిల్ వైపు నుంచి పెద్దగా సమాధానం ఏం రాలేదు. సైలెంట్గా ఉండిపోయాడు.రెండో నామినేషన్ నబీల్కి వేసిన మణికంఠ పెద్ద మోటివేషన్ ఇచ్చాడు. నాలుగు వారాలుగా నువ్వు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నావ్. త్యాగాలు చేస్తున్నావ్. సైలెంట్ అయిపోయావ్. ఇవన్నీ ఎందుకు. నిన్ను ఇష్టపడే వాళ్లు నీ గేమ్ చూడాలనుంకుంటారు.. నీ త్యాగాలు కాదు అని అన్నాడు. దీంతో ఇకపై నా ఆట చూపిస్తా అని నబీల్ సవాల్ చేశాడు.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్కి విడాకులు ఇచ్చేసిన భార్య)అనంతరం హౌసులోకి వచ్చిన సీత.. విష్ణుప్రియని సూపర్ ఆడుతున్నావ్ అని మెచ్చుకుంది. ప్రేరణని నామినేట్ చేసింది. నువ్వు చీఫ్గా అట్టర్ ఫ్లాప్. డిక్టేటర్లా బిహేవ్ చేశావ్. ఇదే విషయం నీ భర్త కూడా చెప్పారు. ఆయన చెప్పి వెళ్లిన కాసేపటికే కిచెన్ దగ్గర తేజతో దోస గురించి గొడవపడ్డావ్. నువ్వు చిరాకుగా మాట్లాడే మాటలు గుచ్చుకుంటున్నాయ్ అని చెప్పుకొచ్చింది. నేను వాటిని మార్చుకుంటానని ప్రేరణ చెప్పింది. సీత తన నెక్స్ట్ నామినేషన్ యష్మీకి వేసింది. నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలుపెట్టిన తర్వాతి నుంచి నీ గేమ్ పోయింది. నిఖిల్ ఉంటేనే నువ్వు కనపడుతున్నావ్ అని గట్టిగానే క్లాస్ పీకింది.తర్వాత వచ్చిన ఆదిత్య ఓం.. కర్మ ఈజ్ బ్యాక్ అనే డైలాగ్తో హౌసులోకి వెళ్లాడు. యష్మిని మొదటగా నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మీరు ముందే ఫిక్సయి లోపలికి వచ్చినట్లున్నారు. ఎందుకంటే ప్రేరణ, నిఖిల్, పృథ్వీలను మీరు ఇప్పటివరకూ నామినేట్ చేయలేదు. వేరే వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. వాళ్లు పెద్ద తప్పులు చేసినాసరే మీరు వదిలేస్తున్నారు. పక్షపాతంగా ఉంటున్నారు. ఫేవరిటిజం చూపిస్తున్నారు. న్యూట్రల్గా ఉన్నట్లు నటిస్తున్నారు. ఇది 12వ వారం అండి.. ఇంకెన్ని వారాలు చేస్తారని తన అసహనాన్ని వ్యక్తపరిచాడు.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఆదిత్య మాటలపై స్పందించిన యష్మీ.. గ్రూప్ గేమ్ ఆడితే నా గేమ్ స్పాయిల్ అవుతుందని నాకు క్లారిటీ ఉందని చెప్పింది. గ్రూపిజం గురించి ఆదిత్యతో యష్మి కాస్త వాదన పెట్టుకుంది. కానీ చివరకు తను కొన్ని గేమ్స్లో ఫేవరెటిజం చూపించానని ఒప్పుకొంది. తర్వాత ప్రేరణని ఆదిత్య నామినేట్ చేశాడు. ఈమె కూడా గ్రూప్ గేమ్ ఆడుతోందనే కారణమే చెప్పాడు. దీంతో యష్మీని మీరు 12 వారాల్లో ఒక్కసారి కూడా ఎందుకు నామినేట్ చేయలేదు? అని ఆదిత్య అడిగాడు. అంతకంటే ఎక్కువ తప్పులు వేరే చోట కనిపించాయ్ అని ప్రేరణ అనేసరికి.. అవును మీకు నబీల్లో, నాలో, విష్ణుప్రియలో కనిపించాయ్, ప్రతిసారి మీకు మేమే కనిపిస్తామా? బయట జనాలు ఎలా నమ్ముతారు అని అడిగేసరికి ప్రేరణ సైలెంట్ అయిపోయింది.అలా ఈసారి నామినేషన్స్ కాస్త వెరైటీగా జరిగింది. కాకపోతే కన్నడ బ్యాచ్ ఫుల్ టార్గెట్ అయింది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్ ఆడుతూ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు కానీ ఈసారి మాత్రం వీళ్లు నలుగురిపై కత్తి వేలాడుతోంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి లిస్ట్లో యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, నబీల్ చేరారు.(ఇదీ చదవండి: నటి కస్తూరిపై మరిన్ని కేసులు) -
Bigg Boss 8: అమ్మ రాకతో నబీల్ ఫుల్ హ్యాపీ.. బాధతో తేజ కన్నీళ్లు
ఈ వారం నామినేషన్ ఒక్కరోజులోనే పూర్తయ్యాయి. గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు. ప్రతి సీజన్లో మిగతా ఎపిసోడ్స్ గురించి జనాలు ఎంత తిట్టుకున్నా సర 'ఫ్యామిలీ వీక్' వస్తే మాత్రం తప్పకుండా చూస్తారు. ఈ వారం అదే జరగనుంది. తల్లి రాకతో నబీల్ ఫుల్ హ్యాపీగా ఫీలవగా.. తేజ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. గడ్డం గురించి నిఖిల్-యష్మీ సోదిలో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంతకీ మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్లో అసలేం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం)స్వీట్ రూల్ బ్రేక్గతంలో హౌస్మేట్స్ కోసం వారంరోజుల పాటు అన్లిమిటెడ్ ఫుడ్ అందించేందుకు నబీల్.. సీజన్ అంతా స్వీట్స్ తిననని త్యాగం చేశాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసిన బిగ్బాస్.. యాక్షన్ రూంకి రమ్మని పిలిచి హల్వా ఇచ్చాడు. ఇది జరిగిన కాసేపటికి మరోసారి యాక్షన్ రూంకి పిలిచి ప్లేటులో స్వీట్స్ పెట్టాడు. ఇవి తింటుండగానే ఇతడి తల్లి నజ్మా నూష్రత్ హౌసులోకి వచ్చారు.నీ ఆట నువ్వు ఆడాలిహౌసులోకి వచ్చిన తర్వాత అందరూ నబీల్ తల్లిని పలకరించారు. ఆ తర్వాత నబీల్-అతడి తల్లి కూర్చుని మాట్లాడుకున్నారు. ఎలా ఆడుతున్నా, టీవీలో కనిపిస్తున్నానా లేదా అని నబీల్.. తన గేమ్ గురించి తల్లిని అడిగాడు. నబీల్ అడిగితే బాగా ఆడుతున్నావ్, ఇండివిడ్యువల్గా అట్లనే ఆడు, ఎమోషనల్ కావద్దు, నీ ఆట నువ్వు ఆడు.. ఎవరి గురించీ పట్టించుకోవద్దు.. ఎవరో ఏదో అన్నారని ఏం ఫీల్ కాకు.. అందరితో మంచిగానే ఉండు అని విలువైన సూచనలు ఇచ్చారు.(ఇదీ చదవండి: రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ!)నబీల్ కోసం గేమ్ఇంతలో నబీల్ తల్లి బయటకు వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని బిగ్బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. కాకపోతే మీరు బయటకెళ్లేముందు మీ అబ్బాయి కోసం ఓ గేమ్ ఆడాలని చెప్పి.. టేబుల్ ముందున్న ఓ డిస్క్ విసరమని చెప్పాడు. అది ఓ చోట ఆగడంతో ఎన్వలప్ కవర్లో ఏముందా అని చూడగా.. అమ్మ చేతి గులాబ్ జామున్ 20 పీస్ అని రాసుంది. దీంతో ఆ స్వీట్లని తీసుకున్న నబీల్.. హౌస్మేట్స్ అందరికీ ఇచ్చాడు. వెళ్లేముందు 'మనం' మూవీలోని 'కనిపించిన మా అమ్మకి..' పాట ప్లే చేయగా.. అందరూ కలిసి డ్యాన్స్ చేసి నబీల్ తల్లికి టాటా చెప్పేశారు. తల్లి వెళ్లిపోవడంతో నబీల్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.గడ్డం గురించి డిస్కషన్నబీల్ తల్లి వెళ్లిపోయిన తర్వాత నిఖిల్ ఒంటరిగా కూర్చుని ఉంటే.. యష్మీ టీజ్ చేసింది. గడ్డం గురించి మాట్లాడుతూ.. మంచి గడ్డం వద్దురా వద్దురా అంటే అస్సలు విన్నాడా అని నిఖిల్ గురించి పృథ్వీకి చెప్పింది. దీంతో నువ్వు (నిఖిల్) గడ్డం పెంచుకోరా అని నిఖిల్ అన్నాడు. అవును నువ్వు తీసేసి రెడ్ ఫ్లాగ్ అయ్యావ్ అని నిఖిల్ని పరోక్షంగా కౌంటర్ వేసింది. హౌస్లో గడ్డం ఉన్నవాడివి నువ్వు (పృథ్వీ) ఒక్కడివే.. ఆ గడ్డానికి పడిపోయా నేను.. అని పృథ్వీతో యష్మి ఫ్లర్ట్ చేసింది. ఇది విని నవ్వేసిన నిఖిల్.. ఈ డైలాగ్ వింటే 'విష్ణు ఏం చేస్తది తెలుసా.. నైట్కి నైట్ నిన్ను చంపేస్తాది' అని యష్మిని ఆటపట్టించాడు.(ఇదీ చదవండి: అక్కినేని ఇంట పెళ్లిసందడి.. ఆ విషయంలో సెంటిమెంట్!)తేజ ఏడ్చేశాడునబీల్ తల్లి వచ్చి వెళ్లిన తర్వాత తన తల్లిని గుర్తుచేసుకుని తేజ తెగ బాధపడ్డాడు. అందరి పేరెంట్స్ వస్తారు, కానీ నా కోసం మాత్రం రారు.. ప్లీజ్ బిగ్బాస్.. నేను ఏడిస్తే మా అమ్మకి నచ్చదు.. కానీ అమ్మ కోసం ఏడుస్తా అనుకోలేదు బిగ్బాస్.. ఇంకా కష్టపడి ఆడతా బిగ్బాస్ ప్లీజ్.. ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వొద్దు.. మీరు ఏదంటే అదే.. నాకు ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం ఉండదు.. కావాలంటే ఎవ్రీ వీక్ డైరెక్ట్ నామినేషన్ అవుతా అని తనలో తానే అనుకుంటూ తేజ ఏడ్చాడు.ఇక కాసేపటి తర్వాత అవినాష్ దగ్గర నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నాకు తేజదే గిల్ట్ అవుతుంది.. నాకేం తెలుసురా అలా అవుతుందని.. ఇప్పుడు మా అమ్మ వచ్చినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేను అని నిఖిల్ అన్నాడు. దీని తర్వాత ఫ్రీజ్-రిలీజ్ అనే గేమ్ని బిగ్బాస్ పెట్టాడు. మిగతా వాళ్ల సంగతేమో గానీ విష్ణుప్రియ, పృథ్వీ దగ్గరికి రాగానే పలుమార్లు ఫ్రీజ్ చేశాడు. దీంతో విష్ణు.. పృథ్వీ మీద వాలిపోయి తెగ ఫీలైపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!) -
బిగ్బాస్లోకి వచ్చిన నబీల్ తల్లి.. ఏడ్చేసిన టేస్టీ తేజ
బిగ్బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే మిగతా రోజులు హౌస్మేట్స్ ఎవరెలా ప్రవర్తించినా, ఎన్ని తిట్టుకున్నా సరే ఓ వారం మాత్రం అందరూ ఒక్కటైపోతారు. అదే 'ఫ్యామిలీ వీక్'. ప్రతి సీజన్లో ఉన్నట్లే ఈసారి కూడా వచ్చేసింది. ఈ వారమే కుటుంబ సభ్యులు.. హౌస్లోకి రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేశారు.షో ప్రారంభంలో కాస్త హడావుడి చేసిన ఓరుగల్లు కుర్రాడు నబీల్.. ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఫ్యామిలీ వీక్లో మొదటిగా ఇతడి తల్లి హౌస్లో అడుగుపెట్టింది. అంతకు ముందు నబీల్ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్బాస్.. తినమని స్వీట్స్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)మరోసారి లోపలికి పిలిచి కాసేపు అలానే ఉండమన్నాడు. ఆ తర్వాత టీవీ స్క్రీన్పై అమ్మ హౌసులోకి వచ్చిన విషయాన్ని చూపించాడు. దీంతో 70 రోజుల తర్వాత తల్లిని కలిసిన నబీల్.. ఎమోషనల్ అయ్యాడు. చాలాసేపు మాట్లాడుకున్నాడు. ఇదంతా చూసి టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు.గత వీకెండ్లో తేజకి చిన్న తప్పుకి పెద్ద క్లాస్ పీకిన నాగార్జున.. ఫ్యామిలీ వీక్కి అనర్హుడిని చేశాడు. అంటే తేజ కోసం కుటుంబ సభ్యులు ఎవరూ హౌస్లోకి రారు. దీంతో నబీల్ కోసం అతడి తల్లి రావడం చూసి.. ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. దీంతో మిగతా హౌస్మేట్స్ అతడిని ఓదార్చుతూ కనిపించారు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు?
బిగ్బాస్ 8లో పదోవారం కూడా అయిపోయింది. హరితేజ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఎప్పటిలానే సోమవారం వచ్చేసింది. దీంతో నామినేషన్స్ హంగామా మొదలైంది. హౌస్ట్ నాగార్జున ఇప్పటికే కన్నడ బ్యాచ్ చేసిన తప్పుల్ని చూసిచూడనట్లు వదిలేస్తున్నాడు. హౌస్లో మాత్రం అలా సాగదు కదా! తేజ, గౌతమ్ వాళ్లకు ఇచ్చిపడేశారు. ఈ ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు.11వ వారానికి సంబంధించిన నామినేషన్ వేసేందుకు ఈసారి హౌస్మేట్స్ పెయింటింగ్స్ని స్మాష్ చేయాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పాడు. దీంతో ప్రేరణ.. గౌతమ్ ఫొటోని స్మాష్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాదన నడిచింది. నిఖిల్ వంత వచ్చేసరికి.. గతవారం తేజ చేసిన తప్పుని ఎత్తి చూపుతూ నామినేట్ చేశాడు. బయటకొచ్చిన తర్వాత తేజ వదల్లేదు. నేను చేసింది తప్పు సరే, యష్మీ చేసింది తప్పు కాదా అని ప్రశ్నించాడు. దానికి నేను సమాధానం చెప్పను అని నిఖిల్ మాట దాటవేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)అలా నిఖిల్-తేజ మధ్య చాలాసేపు గొడవ జరిగింది. ఇదంతా చూస్తుంటే హోస్ట్ నాగార్జున.. వీకెండ్ వచ్చి మిగతా వాళ్లు చేసిన తప్పుల్ని చెబుతున్నాడు. అదేదో పెద్ద పాపం అన్నట్లు రచ్చ చేస్తున్నాడు. సోమవారం వచ్చేసరికి దాన్నే కన్నడ బ్యాచ్.. నామినేషన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ వారం కూడా అదే జరిగేలా ఉంది. అలా ఈ వారం దాదాపు ఆరుగురు నామినేట్ అయినట్లు తెలుస్తోంది.నామినేట్ అయినవాళ్లలో పృథ్వీ, యష్మీ, విష్ణుప్రియ, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్ ఉన్నట్లు సమాచారం. లిస్ట్ చూస్తుంటే నిఖిల్, ప్రేరణ లేరు కాబట్టి వాళ్ల ఫ్యాన్స్.. కన్నడ బ్యాచ్లో భాగమైన పృథ్వీ, యష్మీకి సపోర్ట్ చేస్తారు. మిగతా వాళ్లలో ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్లకు ఉంది. కానీ ఈసారి ఎందుకు విష్ణుప్రియ మీద దెబ్బపడుద్దా అనే సందేహం వస్తోంది. చూడాలి మరి ఈ వారం ఎవరు బలైపోతారో?(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్) -
Bigg Boss 8: ఈసారి ఆమె ఎలిమినేషన్ తప్పదేమో?
బిగ్బాస్ 8లో ప్రస్తుతం పదకొండో వారం నడుస్తోంది. ఈసారి గౌతమ్, నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, హరితేజ.. నామినేషన్స్లో ఉన్నారు. ఓవైపు హౌసులో మెగాచీఫ్ అయ్యేందుకు పోటీ నడుస్తోంది. ఇంతకీ మెగా చీఫ్ అయ్యిందెవరు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశముంది?మొన్నటివరకు హౌసులో కన్నడ బ్యాచ్ హవా నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిసారి నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీలలో ఒకరో ఇద్దరో నామినేట్ అయ్యేవారు. దీంతో ఒకరి ఫ్యాన్స్ మరొకరిని సపోర్ట్ చేస్తూ గండం నుంచి తప్పించేవాళ్లు. ఈసారి అందరూ నామినేషన్స్లో ఉండేసరికి ఎవరి ఓట్లు వాళ్లకే పడుతున్నాయి. ఇది గౌతమ్కి కలిసొచ్చింది.(ఇదీ చదవండి: పృథ్వీనే కొట్టాలనుకున్న విష్ణు.. యష్మి ఎంత పని చేసింది?)ఈ వారం ఓటింగ్లో గౌతమ్.. టాప్లో కొనసాగుతున్నాడట. రెండో ప్లేసులో నిఖిల్ ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత స్థానాల్లో వరసగా ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో అంటే డేంజర్ జోన్లో యష్మి, హరితేజ ఉన్నట్లు తెలుస్తోంది.గత రెండు వారాల నుంచి హరితేజ.. చివరి స్థానాల్లో ఉంటూ వస్తోంది. మెహబూబ్, నయని పావని ఎలిమినేట్ కావడంతో సేవ్ అవుతూ వచ్చింది. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చివర్లో ఉన్న విష్ణుప్రియ గానీ యష్మీ గానీ ఎలిమినేట్ కాకపోవచ్చు. దీంతో హరితేజపై వేటు పడటం గ్యారంటీ అనిపిస్తుంది. మరి ఇదే జరుగుతుందా? బిగ్బాస్ మరేదైనా ప్లాన్ వేశాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా) -
గౌతమ్కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి నామినేషన్స్లో ఎవరెవరు?
బిగ్బాస్ 8లో అప్పుడే పదోవారం వచ్చేసింది. నయని పావని ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ సందడి మొదలైంది. కాకపోతే ఇద్దరికి బదులు ఒక్కరినే నామినేట్ చేయాలని బిగ్బాస్ ఆదేశించాడు. దీంతో ఒకరిపై ఒకరు అరుస్తూ రచ్చ లేపారు.తాజాగా రిలీజ్ చేసిన మొదటి ప్రోమోలో పృథ్వీ.. రోహిణిని నామినేట్ చేశాడు. 'నెక్ ఫ్యాంటసీ' అనడం తనకు అస్సలు నచ్చేలేదని, అదో పెద్ద బూతు అన్నట్లు సీన్ క్రియేట్ చేశాడు. కానీ రోహిణి అస్సలు ఊరుకోలేదు. గట్టిగానే ఇచ్చిపడేసినట్లు కనిపించింది. మరోవైపు హరితేజ.. ప్రేరణని నామినేట్ చేసింది. ఈ నామినేషన్ కూడా మంచి ఫన్ ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఇక గౌతమ్-నిఖిల్ మధ్య హీట్ పుట్టించే డైలాగ్ వార్ నడిచినట్లు తెలుస్తోంది. 'అశ్వద్ధామ ఈజ్ బ్యాక్' అని మళ్లీ గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో నిఖిల్ ఊరుకుంటాడా.. 'సరే నువ్వు బయటకెళ్లడానికి రెడీ హా. బయటకు వెళ్లి చూసుకుని వద్దాం, అమ్మతోడు దమ్ముంటే గేట్ తీయమను' అని అనేసరికి.. 'పదా.. దా' అని గౌతమ్ గట్టిగానే ఛాలెంజ్ చేసినట్లు తెలుస్తోంది.ఓవరాల్గా ఈ వారం నామినేషన్స్లో హరితేజ, యష్మి, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వాళ్ల సంగతేమో గానీ గౌతమ్-నిఖిల్ మధ్య మినీ మాటల యుద్దమే జరిగిందని తెలుస్తోంది. అయితే ఎవరు ఎవరిని ఏ కారణం చెప్పి నామినేట్ చేశారనేది తెలియాలంటే రాత్రికి ఫుల్ ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: బిగ్బాస్: నయని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
బిగ్బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?
బిగ్బాస్ 8లో తొమ్మిదో వారం చివరకొచ్చేసింది. ఈసారి గౌతమ్, యష్మి, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని నామినేషన్స్లో నిలిచారు. ఈసారి మెగా చీఫ్ అయ్యేందుకు బిగ్బాస్ పలు పోటీలు పెట్టాడు. అవినాష్ మెగాచీఫ్ అయ్యాడు. అలానే పానిపట్టు అనే టాస్క్లో జోష్ చూపించిన యష్మి.. ఓటింగ్లోనూ మంచి జోరు చూపించింది. ఈ వారం టాప్లో నిలిచింది. కానీ ఇప్పుడు ఈమె ప్లేస్ మారినట్లు తెలుస్తోంది.ఈసారి ఐదుగురు నామినేషన్స్లో ఉండగా.. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఆన్లైన్ పోలింగ్ ప్రకారం గౌతమ్ తొలి స్థానంలోకి వచ్చాడట. ఇప్పటివరకు టాప్లో ఉన్న యష్మి రెండో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల ముందు వరకు మూడు, నాలుగు, స్థానాల్లో ఉన్న టేస్టీ తేజ, హరితేజ, నయని పావని ప్లేసులు మారాయట.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలీరెడ్డి)చివరలో ఉన్న నయని.. ఓటింగ్ ముగిసే సమయానికి మూడులోకి వచ్చిందట. నాలుగులో టేస్టీ తేజ, ఐదులోకి హరితేజ వెళ్లారట. అంటే చివరి రెండు స్థానాల్లో టేస్టీ తేజ, హరితేజ ఉన్నారు. లెక్క ప్రకారమైతే వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాలి. కానీ హరితేజ లేదా నయని పావని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.నామినేషన్స్లో ఉన్నవాళ్లలో గౌతమ్, యష్మి, టేస్టీ తేజ మంచిగా ఫెర్ఫార్మ్ చేస్తున్నారు. వీళ్లతో పోలిస్తే నయని, హరితేజ మాత్రం అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. దీంతో వీళ్లిద్దరిలో ఒకరు ఈసారి బయటకెళ్లడం పక్కా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య) -
నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో
బిగ్బాస్ 8 నుంచి రీసెంట్గా ఎలిమినేట్ అయిన మెహబూబ్.. అందరికీ క్షమాపణలు చెప్పాడు. కంటెస్టెంట్గా ఫెయిల్ అయ్యానని బాధంతా బయటపెట్టాడు. అలానే కొన్నాళ్ల క్రితం హౌస్లో ఉన్నప్పుడు కమ్యూనిటీ ఓటింగ్ గురించి మాట్లాడటం, అదేమో హాట్ టాపిక్ అయిపోవడం పైనా స్పందించాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.మెహబూబ్ ఏం చెప్పాడంటే?'బిగ్బాస్లో గంటలు గంటలు మాట్లాడితే వాళ్లు చూపించేది 30 సెకన్లు. అయితే నేను మాట్లాడిన దానిలో చిన్న క్లిప్ బయట చాలా రాంగ్గా ప్రొజెక్ట్ అవుతోంది. దాని గురించి మట్లాడుదాం అనే వచ్చాను. మనం బిగ్బాస్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మనం మంచిగా ఆడితే, మంచిగా ప్రవర్తిస్తే.. అరె మనలో ఒకడు అని మనల్ని ఇష్టపడతారు. మనకు ఓట్ చేస్తారు అని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ నేను అన్న మాట చాలామందిని బాధపెట్టింది. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ప్రామిస్ చేసి చెబుతున్నా.. నా ఉద్దేశం అదికాదు. దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను.'(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం)'డబ్ స్మాష్, టిక్ టాక్, యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ ఇక్కడివరకు వచ్చారు. ఏ కాస్ట్ ఫీలింగ్ లేకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. త్వరలోనే నేను స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాను. ఆడియెన్స్గా మీరందరూ గెలిచారు. కంటెస్టెంట్గా నేను ఫెయిలయ్యాను. ఐ యామ్ సారీ' అని మెహబూబ్ వీడియోలో తన బాధనంతా బయటపెట్టాడు.బిగ్బాస్ దెబ్బకు బలినాలుగో సీజన్ పాల్గొని బాగానే ఫెర్ఫార్మ్ చేసిన మెహబూబ్.. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. కానీ పెద్ద ఇంప్రెసివ్గా ఆడలేదు. దీంతో ఎలిమినేట్ అయిపోయాడు. కొన్నాళ్ల క్రితం హౌస్లో నబీల్తో మాట్లాడుతూ మన కమ్యూనిటీ ఓట్లు మనకు పడతాయ్, భయమెందుకు అనేలా మాట్లాడాడు. మెయిన్ ఎపిసోడ్లో ఇది లేనప్పటికీ లైవ్ స్ట్రీమింగ్ నుంచి ఈ వీడియోని తీసుకొచ్చి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో మెహబూబ్పై చాలా వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవడంలో భాగంగా సారీ చెప్పాడు. మంచిగా ఆల్బమ్ సాంగ్స్ చేసుకుంటున్నవాడు కాస్త బిగ్బాస్ దెబ్బకు బలైపోయాడు!(ఇదీ చదవండి: Bigg Boss 8: నిఖిల్ వయలెన్స్.. అమ్మాయిలని కూడా చూడకుండా) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) -
Bigg Boss 8: నిఖిల్ వయలెన్స్.. అమ్మాయిలని కూడా చూడకుండా
ఈసారి బిగ్బాస్ షోలో కాస్తోకూస్తో కూల్గా, స్ట్రాటజీతో ఆడుతున్నది నిఖిల్ ఒక్కడే. ఫైనల్ రేసులో ఉన్న ఇతడు.. ఇప్పుడు వయలెంట్ అయిపోయాడు. మంగళవారం ఎపిసోడ్ సందర్భంగా అమ్మాయిలని కూడా చూడకుండా కంట్రోల్ తప్పి ప్రవర్తించాడు. గేమ్ కోసమే అయ్యిండొచ్చు కానీ మరీ ఈ రేంజ్లో అరాచకం చూపించడం మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇంతకీ తాజాగా(అక్టోబర్ 29) హౌస్లో ఏమేం జరిగిందనేది 58వ రోజు హైలైట్స్లో చూద్దాం.రెండు కాదు ఒక్కటే క్లాన్గౌతమ్, హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, యష్మి ఈ వారం నామినేషన్స్లో ఉండటంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. రాయల్, ఓజీ క్లాన్స్ కాదు ఇకపై అందరూ బీబీ క్లాన్లోనే ఉంటారని బిగ్బాస్ చెప్పడంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. ఈసారి కెప్టెన్ కంటెండర్షిప్ కోసం 'బీబీ ఇంటికి దారేది' అనే గేమ్ పెడుతున్నట్లు బిగ్బాస్ చెప్పాడు. ఇందుకోసం హౌస్మేట్స్ని నాలుగు టీమ్స్గా విడగొట్టారు. టీమ్ రెడ్లో గౌతమ్-ప్రేరణ-యష్మీ.. టీమ్ బ్లూలో అవినాష్-నిఖిల్-హరితేజ.. టీమ్ గ్రీన్లో తేజ-విష్ణుప్రియ-నబీల్.. టీమ్ ఎల్లోలో రోహిణి-పృథ్వీ-నయని పెట్టారు. గంగవ్వని ఏదో ఓ జట్టులోకి తీసుకోవాలని చెప్పాడు. దీంతో ఆమెని బ్లూ టీమ్ తీసుకుంది.(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం)తొలి టాస్క్ బ్లూ టీమ్దేఒక్కో టీమ్లో హరితేజ, పృథ్వీ, నబీల్ని లీడర్లుగా ఎంచుకున్నారు. ఇక తొలి టాస్క్ మంచు మనిషిని తయారు చేయడం. ఇందులో భాగంగా టీమ్స్లోని ముగ్గురు సభ్యులు ఒకే స్కీ బోర్డ్ని ఉపయోగించి బొమ్మకి రూపు తీసుకురావాలి. ఇందులో గెలిచిన టీమ్.. రెండు డైస్ని రోల్ చేసే అవకాశంతో పాటు ఓడిపోయిన మిగిలిన టీమ్ నుంచి ఓ టీమ్కి ఎల్లో కార్డ్ ఇవ్వొచ్చు. ఎప్పుడైతే ఓ టీమ్కి రెండు ఎల్లో కార్డ్స్ వస్తాయో ఆ టీమ్ లీడర్ తమ టీమ్ నుంచి ఓ సభ్యుడ్ని ఆట నుంచి తప్పించాల్సి ఉంటుంది. తొలి పోటీలో గెలిచిన బ్లూ టీమ్.. టీమ్ రెడ్కి ఎల్లో కార్డ్ ఇచ్చింది. డైస్ రెండు సార్లు రోల్ చేయగా.. 6,3 పడ్డాయి. దీంతో 6 పాయింట్లని హరితేజ తీసుకుంది, 3 పాయింట్లని అవినాష్కి ఇచ్చింది.నీళ్ల ట్యాంక్ తెచ్చిన తంట'పానిపట్టు యుద్ధం' అని రెండో టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా చిన్నసైజు ట్యాంకుల్లో ఉన్న నీటిని ఆయా టీమ్స్.. బజర్ మోగేంతవరకు కాపాడుకోవాలి. నీటి ఎత్తు తగ్గిన టీమ్.. పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు బజర్ మోగిన తర్వాత ట్యాంక్లోని నీటిని తగ్గించేందుకు అపోజిట్ టీమ్స్ నుంచి ఒక్కొక్కరు ప్రయత్నించొచ్చు. అయితే ఈ గేమ్ సాఫీగా సాగిపోతే బాగుండేది కానీ నిఖిల్.. అందరితో గొడవ పెట్టుకోవడం రచ్చ రచ్చ అయింది.(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్లోని చెరువులో దూకేశాడు: శ్రియ)నిఖిల్ టీమ్కి కలిసిరాలేదుతొలిసారి బజర్ మోగగానే నబీల్, నిఖిల్ లైన్ దాటి లోపలికి వచ్చారు. దీంతో నీటిని తగ్గించే అవకాశం వీళ్లకు ఇచ్చింది సంచాలక్ గంగవ్వ. తర్వాత ఛాన్స్.. నబీల్-పృథ్వీకి రాగా వీళ్లిద్దరూ కలిసి బ్లూ టీమ్ని టార్గెట్ చేశారు. ఓసారి బజర్ ఆగిపోయిన తర్వాత బ్లూ టీమ్ ప్లగ్గులని పృథ్వీ విసిరేశాడు. దీంతో నిఖిల్-పృథ్వీ మధ్య కాసేపు డిష్యూం డిష్యూం జరిగింది. మూడోసారి పృథ్వీ, గౌతమ్కి ఛాన్స్ వచ్చింది. హరితేజని పక్కకు లాగిన గౌతమ్.. బ్లూ టీమ్ ట్యాంక్లోని నీరంత పోయేలా చేశాడు. దీంతో బ్లూ టీమ్ గేమ్ నుంచి ఔట్ అయిపోయింది.అమ్మాయిలపై నిఖిల్ అరాచకంతర్వాత ఛాన్స్ నిఖిల్కి వచ్చింది. తమని గేమ్ నుంచి తప్పుకొనేలా చేసిన గౌతమ్ ఉన్న టీమ్ రెడ్ని టార్గెట్ చేశాడు. వాటర్ దగ్గర అడ్డుగా ఉన్న యష్మి-ప్రేరణని పక్కకి లాగేశాడు. అటు ఇటు విసిరేస్తూ రచ్చ రచ్చ చేశాడు. ఇలా చేయకూడదని రూల్స్లో ఉందా అని ఉల్టా గౌతమ్తోనే గొడవ పెట్టుకున్నాడు. నిఖిల్ అరాచకం దెబ్బకు హౌస్మేట్స్ చాలా హెచ్చరించాడు. అయినా సరే అమ్మాయిలిద్దరినీ కాస్త కంట్రోల్ తప్పి ప్రవర్తించాడు.గౌతమ్ పాయింట్స్బజర్ మోగి ఈ రచ్చ అంతా ఆగిపోయిన తర్వాత.. అక్కడ అమ్మాయి ఉందనే సెన్స్ లేదా అని గౌతమ్, నిఖిల్తో గొడవ పెట్టుకున్నాడు. నీకుందా అని నిఖిల్ కూడా గౌతమ్పై రెయిజ్ అయ్యాడు. ప్రేరణ కూడా ఏదో తిట్టడంతో మైండ్ యూ ఆర్ వర్డ్స్ అని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. ఒకరిపై ఒకరు వచ్చి కొట్టేసుకుంటారా అన్నంతలా హడావుడి చేశాడు. చివరకు హౌస్ అంతా వీళ్లని విడదీయడంతో ఎపిసోడ్కి ఎండ్ కార్ట్ పడింది.(ఇదీ చదవండి: మా ఆయన కోసం సినిమా చూడండి: హీరో కిరణ్ అబ్బవరం భార్య) -
Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు
బిగ్బాస్ 8లో ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఇతడు.. ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు ప్రవర్తించాడు. పెద్దగా ఇంప్రెసివ్ అనిపించలేదు. దీంతో ఓట్లు తక్కువ పడి ఎలిమినేట్ అయిపోయాడు. అదే టైంలో అవినాష్ కూడా సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు ఆదివారం ఎపిసోడ్ చివరలో చూపించారు. కానీ అదంతా ఉత్తిదే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)మెహబూబ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బెడ్రూంలోకి వచ్చిన అవినాష్.. రిపోర్ట్ వచ్చింది. కడుపులో ఏదో సమస్యగా ఉంది. మీకు కష్టం అవుతుంది. బయటకు వచ్చేసేయండి అని డాక్టర్స్ చెప్పారు. 'ఏది పడితే చెప్పకు.. అను (అవినాష్ భార్య) మీద ఒట్టేసి చెప్పు' అని నిఖిల్ అడిగేసరికి.. ఫొటోపై ఒట్టేసి మరీ నిజంగానే వెళ్లిపోతున్నా అని అవినాష్ చెప్పాడు. నాపై ఒట్టేసి నిజం చెప్పు అని నయని పావని అడిగినప్పుడు కూడా అవినాష్ అదే చెప్పాడు. 'నొప్పి తట్టుకోలేకపోతున్నా' అని ఏడ్చాడు. హౌస్లో అందరూ ఇతడిని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.అయితే ఇదంతా ప్రాంక్లో భాగంగానే అవినాష్ చేశాడు. సోమవారం ఎపిసోడ్తో ఈ విషయం క్లారిటీ వస్తుంది. 24 గంటల స్ట్రీమింగ్ వల్ల అవినాష్.. తిరిగి ఇంట్లోకి వచ్చిన వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సెల్ఫ్ ఎలిమినేట్ అని చెప్పి అవినాష్.. ప్రాంక్ చేయడం వరకు బాగుంది కానీ మరీ భార్య మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పడమే కాస్త ఇబ్బందిగా అనిపించింది.(ఇదీ చదవండి: మీడియాకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్)#Avinash Back To BB House 😁 Andarini Housemates Ni Kasepu Erri Pap*alni Chesadu Ga 😂😂#BiggBossTelugu8 pic.twitter.com/LbDV2UFXs7— BiggBossTelugu8 (@Boss8Telugu) October 27, 2024 -
బిగ్బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!
బిగ్బాస్ 8వ వారం కూడా చివరకొచ్చేసింది. ఈసారి ఆరుగురు నామినేషన్స్లో ఉన్నారు. ఓజీ క్లాన్ నుంచి నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, పృథ్వీ.. రాయల్ క్లాన్ నుంచి నయని పావని, మెహబూబ్ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎవరికి వాళ్లు గేమ్స్ పరంగా తమ బెస్ట్ ఇచ్చేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ డేంజర్ జోన్లో మాత్రం ఇద్దరు ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కావొచ్చు?లెక్క ప్రకారం ఈసారి ఏడుగురు నామినేట్ అయ్యారు. కానీ మెగా చీఫ్ గౌతమ్ తన సూపర్ పవర్ ఉపయోగించి, హరితేజ నుంచి తప్పించాడు. మిగిలిన వాళ్లలో నిఖిల్.. ఓటింగ్లో ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటాడు. ఈసారి మాత్రం అతడిని ప్రేరణ దాటిపోయినట్లు కనిపిస్తుంది. చెప్పాలంటే విన్నర్ రేసులోనూ ఈమె ఉందని టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)ఓటింగ్ పరంగా చూసుకుంటే తొలి రెండు స్థానాల్లో ప్రేరణ, నిఖిల్ ఉండగా.. తర్వాతి స్థానాల్లో ప్రేమ పక్షులు పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మెహబూబ్, నయని ఉన్నారు. గేమ్స్ పరంగా మెహబూబ్ అంతంత మాత్రమే కనిపిస్తుండగా.. గొడవల్లో తప్పితే నయని ఎక్కడా కనిపించట్లేదు. అంతా చూస్తుంటే వీళ్లిద్దరిలో ఒకరు వెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తుంది. మరోవైపు గంగవ్వని బయటకు పంపే సూచనలు కనిపిస్తున్నాయి.అప్పుడెప్పుడో 2022లో చేసిన ఓ వీడియో కారణంగా గంగవ్వతో పాటు రాజు అనే యూట్యూబర్పై పోలీస్ కేసు నమోదైంది. దీని విచారణలో భాగంగా గంగవ్వని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈసారి మాత్రం రాయల్ క్లాన్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావడం పక్కా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
అవినాష్ సరదా.. నిజంగానే డోర్ తెరిచిన బిగ్బాస్
బిగ్బాస్ హౌసులో ఎనిమిదో వారం నామినేషన్ పూర్తయ్యాయి. మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. మెహబూబ్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, నయని పావని లిస్టులో ఉన్నారు. హరితేజ కూడా నామినేట్ అయింది. కాకపోతే మెగాచీఫ్ గౌతమ్.. సూపర్ పవర్ ఉపయోగించిన ఆమెని తప్పించాడు. ఈ వారానికి సంబంధించి కీలక ఘట్టం ముగియడంతో కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ మొదలుపెట్టారు.(ఇదీ చదవండి: ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత)పృథ్వీ మెడలోని బంగారు గొలుసు గురించి తేజ అడగ్గా.. 'గోల్డ్, గోల్డ్ వేసుకుని తిరగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా' అని విష్ణుప్రియ మధ్యలో దూరి కామెంట్ చేసింది. అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని సరదాగా కామెంట్ చేశారు. అయితే అవినాష్ అన్నప్పుడు బిగ్బాస్ నిజంగానే డోర్ తెరిచాడు. దీంతో అందరూ అతడిని పట్టుకుని మరీ బయటకు తోసేయడానికి ప్రయత్నించారు. ఇదంతా కూడా ఫన్నీగా సాగింది.దీని తర్వాత అవినాష్ జిమ్ ట్రైనర్గా మారి, ఇంటి సభ్యులు వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్పాలని బిగ్బాస్ ఆదేశించాడు. ఆ తర్వాత టేస్టీ తేజతో వర్కౌట్స్ చేయించాడు. ఇదంతా కూడా ఫన్నీగా సాగేసరికి మిగిలిన హౌస్మేట్స్ అందరూ పగలబడి నవ్వారు. పదేపదే అవినాష్, రోహిణి, టేస్టీ తేజతో తప్పితే మిగిలిన వాళ్ల నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది రావట్లేదు. బుధవారం కూడా అవినాష్ తన కామెడీతో నవ్విస్తాడని అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫొటోలతో ప్రభాస్ చెల్లి) -
విష్ణుప్రియకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ.. ఎంత పనిచేశావ్ యష్మి
వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత నామినేషన్స్ రెండు రోజుల పాటు జరుగుతోంది. ఈ వారం కూడా వాడీవేడిగా సాగింది. నబీల్ వంతు పూర్తవడంతో సోమవారం నామినేషన్ ప్రక్రియ ఆగింది. ఇన్నాళ్లు విష్ణుప్రియ-పృథ్వీ మధ్య లవ్ ట్రాక్ ఏదో అలా కనిపించింది. మంగళవారం ఎపిసోడ్తో అది కాస్త బ్రేకప్ అయింది. ఇంతకీ ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? విష్ణు బ్రేకప్ సంగతేంటి? అనేది మంగళవారం ఎపిసోడ్ (51వ రోజు) హైలైట్స్లో చూద్దాం.ముందుగా తేజ మొదలుపెట్టాడు. నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తోందని గంగవ్వని అని విష్ణుప్రియ అనడం నచ్చలేదని చెప్పి ఆమెని నామినేట్ చేశాడు. ప్రతిసారి రివేంజ్ అనడం అస్సలు నచ్చలేదని చెప్పి పృథ్వీ పేరు చెప్పాడు. దీంతో పృథ్వీ-రోహిణి మరోసారి గొడవపడ్డారు. తర్వాత వచ్చిన మెహబూబ్.. హరితేజ సరిగా ఆడట్లేదని, ఫైర్ కాస్త ఫ్లవర్ అయిందని అన్నాడు. బ్యాటరీ టాస్క్లో నయని సరిగా ఆడలేదని నామినేట్ చేశాడు.తర్వాత వచ్చిన ప్రేరణ.. విష్ణుప్రియని నామినేట్ చేసింది. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని కారణం చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం నడించింది. విష్ణుప్రియ ఓ ఫేక్ ఫ్రెండ్ అని ముద్ర వేసేసింది. పృథ్వీని నేను నామినేట్ చేయడం నీకు నచ్చలేదు అంతే కదా అని ప్రేరణ అనేసరికి... అవును, ఆ నిర్ణయం నాకు నచ్చలేదు అని విష్ణు వాదించింది. మధ్యలో నబీల్ టాపిక్ వచ్చింది. ఓసారి నబీల్ చెంప పగలగొడతా అన్నావ్ కదా ప్రేరణ అని విష్ణుప్రియ అనేసరికి.. అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు అని ప్రేరణ వాదించింది.(ఇదీ చదవండి: ఖైరతాబాద్లో రామ్ చరణ్ సందడి.. కొత్త కారు నంబర్ ఎంతంటే?)నీ గేమ్ మొత్తం పృథ్వీ వైపే ఉంది, అతడే నీ గేమ్ అని ప్రేరణ వాదించేసరికి.. అవును అయితే ఏంటి, నువ్వు పెడిక్యూర్, మేనిక్యూర్, హెయిర్ స్టైల్ తప్ప హౌస్లో ఏం చేస్తున్నావ్ అని ప్రేరణ గురించి విష్ణు కామెంట్ చేసింది. తర్వాత ప్రేరణ.. పృథ్వీ పేరు చెప్పింది. నువ్వు రివేంజ్ నామినేషన్ వేస్తావ్, బయటికెళ్లడానికి చాలా అర్హత ఉంది నీకు అని కుండ బద్దలు కొట్టేసింది. రెండు వారాల ఇమ్యూనిటీ ఇస్తానన్నా సరే గడ్డం తీయలేదు. మరెవరైనా అయితే చేసేవాళ్లు అని కారణాలు చెప్పింది. దీంతో రెచ్చిపోయిన పృథ్వీ.. ఓటింగ్ ప్రకారం ఉంటా, గేమ్పై నమ్మకముంది. నువ్వు టాస్క్ ఇవ్వండి అని అడుక్కుంటూ కూర్చో అని పృథ్వీ అన్నాడు.తర్వాత వచ్చిన గంగవ్వ.. నిఖిల్, విష్ణుప్రియని నామినేట్ చేసింది. అనంతరం నిఖిల్ వచ్చి.. మెహబూబ్, నయనిని నామినేట్ చేశాడు. యష్మి వంతు వచ్చేసరికి.. విష్ణుప్రియ, మెహబూబ్ని నామినేట్ చేసింది. అవినాష్.. గతవారం గొడవని బయటకు తీసి పృథ్వీని నామినేట్ చేశాడు. తర్వాత నిఖిల్ని కూడా నామినేట్ చేశాడు. అలా ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి.నామినేషన్స్లో నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, హరితేజ, నయని పావని ఉన్నట్లు బిగ్బాస్ ప్రకటించాడు. షీల్డ్ ఉన్నప్పటికీ హరితేజని ఇద్దరు సభ్యులు నామినేట్ చేసిన కారణంగా ప్రైజ్మనీ నుంచి లక్ష రూపాయలు తగ్గిపోయాయి. ఇక వీళ్లలో ఒకరిని కాపాడొచ్చు అని బిగ్బాస్ చెప్పేసరికి మెగా చీఫ్ గౌతమ్.. హరితేజని సేవ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, నయని నామినేషన్స్లో నిలిచారు.ఇదంతా అయిపోయిన తర్వాత అర్థరాత్రి పృథ్వీ-యష్మీృ-ప్రేరణ చాలాసేపు డిస్కషన్ పెట్టారు. విష్ణుప్రియతో రిలేషన్ ఉందా? లేదా అనే టాపిక్పై చాలాసేపు మాట్లాడుకున్నారు. విష్ణుప్రియపై ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని యష్మి అడిగేసరికి లేదు జస్ట్ ఫ్రెండ్ అని పృథ్వీ చెప్పాడు. దీని తర్వాత విష్ణు-పృథ్వీ కూడా కాసేపు మాట్లాడుకుని తమ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదన్నట్లుగా బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: Happy Birthday Prabhas: అజాతశత్రువు.. అందరికి ‘డార్లింగ్’) -
పృథ్వీ వంకర చూపులు.. బిగ్బాస్లో గలీజు ప్రవర్తన!
నలుగురు చూసే షోలో ఉన్నప్పుడు కాస్త ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిగ్బాస్ 8లో ఆడుతున్న పృథ్వీకి అలాంటి లక్షణాలు అసలు లేవనిపిస్తుంది. ఎందుకంటే గతవారం అవినాష్ భార్య గురించి చీప్ కామెంట్స్ చేశాడు. నామినేషన్స్లో ప్రేరణని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రోహిణితో గలీజుగా ప్రవర్తించాడు.(ఇదీ చదవండి: ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా)ఏడో వారం మణికంఠ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఎప్పటిలానే ఎనిమిదో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. దిష్టిబొమ్మకు కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్బాస్ చెప్పాడు. మణికంఠ విషయంలో మెహబూబ్కి పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సిందనే కారణంతో విష్ణుప్రియ.. నిఖిల్ని నామినేట్ చేసింది. ఫుడ్ విషయంలో ప్రేరణని కూడా నామినేట్ చేసింది. అనంతరం పృథ్వీని నామినేట్ చేసిన రోహిణి.. రూల్స్ అసలు వినట్లేదని, చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావని కారణాలు చెప్పింది. గతవారం జరిగిన ఓవర్ స్మార్ట్ గేమ్ గురించి ప్రస్తావించి కేబుల్ మొదట్లోనే మడతపెట్టి జేబులో పెట్టేస్తా ఎలా? అని ప్రశ్నించింది. అది నా స్ట్రాటజీ అని పృథ్వీ చెప్పడంతో.. అలాంటప్పుడు గేమ్ ఎక్కడ మొదలవుతుంది, గేమ్ ఆడకుండా స్ట్రాటజీ అంటే ఎలా? అని వరసగా సరైన కౌంటర్లు వేసేసరికి పృథ్వీ సైలెంట్ అయిపోయాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)తనవంతు వచ్చేసరికి రోహిణిని పృథ్వీ నామినేట్ చేశాడు. ఆటలో మీరు జీరో అనిపిస్తున్నారని కారణం చెప్పాడు. ఆటలో ఎఫర్ట్స్ పెట్టట్లేదా? అని రోహిణి అడిగితే.. అలా కాదని అన్నాడు. ఇదంతా చూస్తుంటే పృథ్వీ పగతో చేసిన నామినేషన్లా అనిపించింది తప్పితే సరైన కారణమే కనిపించలేదు. చివర్లో మాటామాటా పెరిగిన టైంలో రోహిణిని పై నుంచి కిందవరకు పృథ్వీ ఆదో రకంగా చూశాడు. అలా చూడటం నాకు నచ్చలేదని చెప్పి రోహిణి పెద్ద గొడవే పెట్టుకుంది.బిగ్బాస్ షోలో పృథ్వీ ప్రవర్తన రోజురోజుకీ దిగజారుతోంది. గతవారం అవినాష్తో మాట్లాడుతూ మీ భార్యనే షోకి పంపాల్సింది అనడం గానీ.. తను నామినేట్ అయ్యేలా చేసిందని చెప్పి ప్రేరణని మానసికంగా వేధించడం గానీ చూస్తుంటే పృథ్వీకి ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా అనిపిస్తుంది. అసలు ఇతడిని బిగ్బాస్ నిర్వహకులు ఇన్నాళ్లు ఎందుకు భరిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?) -
ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా
బిగ్బాస్ 8లో విచిత్రమైన క్యారెక్టర్ అంటే మణికంఠనే. ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడనేది అస్సలు అర్థం కాదు. వచ్చిన కొత్తలో భార్యబిడ్డలు కావాలి అని నానా హంగామా చేశాడు. ఇప్పుడవన్నీ పక్కనబెట్టి సరిగా ఆడుతున్నాడేమో అనుకుంటే.. ఆరోగ్యం బాగోలేదని చెప్పి తనకు తానుగా బయటకొచ్చేశాడు. తీరా ఇప్పుడేమో మాటలు మార్చేస్తున్నాడు. బిగ్బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్పకుండా అర్జున్కే ఝలక్స్ ఇచ్చాడు.గెలవాలనే ఆలోచనతో వచ్చిన మీరు.. కనీసం చీఫ్ అవ్వకుండానే బయటకు ఎందుకొచ్చారు? అని హోస్ట్ అర్జున్ అడగ్గా.. విన్నర్ అవ్వాలనే ఆలోచనతో అయితే నేను రాలేదని అన్నాడు. దీంతో అర్జున్ నోరెళ్లబెట్టాడు. అదెంత పెద్ద కంటెంటో తెలుసా అని ఆశ్చర్యపోయాడు. 'నా పెళ్లాం బిడ్డ నాకు కావాలి. నా రెస్పెక్ట్ నాకు కావాలి' అని మణికంఠలా ప్రవర్తించి అర్జున్ చూపించాడు. అప్పటివరకు నవ్వు ముఖంతో ఉన్న మణికంఠ కాస్త దెబ్బకు డీలా పడిపోయాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కేరింత' సినిమా హీరో)గోరంత దాన్ని కొండంత చేస్తావ్ అని హౌస్మేట్స్ అభిప్రాయం.. దీనిపై ఏమంటావ్ అని అడగ్గా.. నేను ఆలోచించే విధానం అలా ఉంటుంది కాబట్టి రియాక్ట్ అయ్యే విధానం కూడా అలానే ఉంటుందని మణికంఠ చెప్పాడు. సరే ఇవన్నీ కాదు గానీ హౌస్లో నువ్వు చేసిన పాజిటివ్ విషయం ఒకటి చెప్పు అని అర్జున్ అడగ్గా.. నేను నాలా ఉండటమే పాజిటివ్ అని మణికంఠ తలతిక్క సమాధానం చెప్పాడు.నీకు సాయం చేసిన వాళ్లనే నువ్వు వెన్నపోటు పొడిచావ్ అంటే ఏమంటావ్? అని అడగ్గా.. ఇదైతే అస్సలు అంగీకరించను అని మణికంఠ ససేమిరా అన్నాడు. హౌస్లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని మీకు అనిపించిందా? అంటే తడముకోకుండా నిఖిల్ పేరు చెప్పాడు. ఇక పృథ్వీ-విష్ణుప్రియ మధ్య రెండు వైపుల నుంచి ప్రేమ చిగురిస్తోందని చెప్పి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. 'ఇది మాకు తెలీదయ్యో' అని హోస్ట్ అర్జున్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?) -
Bigg Boss 8: పులిహోర పార్టిసిపెంట్స్ ఉప్పు సత్యాగ్రహం
బిగ్ బాస్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాడు. తన ప్రేక్షకులను తిమ్మెని బమ్మిని అయినా చేసి ఆకట్టుకునే తీవ్ర ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా హౌస్లోకి కొంతమందిని కొత్తవారిని తీసేసి పాతవారిని తీసుకువచ్చి కలగాపులగం చేశాడు. ఇంకా చెప్పాలంటే... ఓ పులిహోర లాంటి పార్టిసిపెంట్స్ ఇప్పుడు హౌస్లో ఉన్నారు. కొత్తవాళ్లు ఎంతలా ఆడినా, నామినేషన్స్ ప్రక్రియ నుండి టాస్క్లు కాని, ఎలిమినేషన్ కాని అంతా రాయల్ క్లాన్స్దే పైచేయిగా ఉంది. గమనిక... ఇక్కడ పాతవాళ్లుగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్రూప్కు రాయల్ క్లాన్స్ అనే పేరు పెట్టాడు బిగ్ బాస్. హౌస్లో కన్నడ పార్టిసిపెంట్స్, తెలుగు పార్టిసిపెంట్స్ మధ్య పోటీ అనిపిస్తుంది కాని హౌస్ మొత్తం ఒకే పార్టిసిపెంట్స్ అని అనిపించట్లేదు. బిగ్ బాస్ ఫాలో అవుతున్న సదరు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుంది గేమ్ అంతా ఏకపక్షమైందని. ఇక ఈ వారం టాస్క్ల పరంగా ఉప్పు గురించి ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కాకపోతే అది చాలా సిల్లీగా అనిపించింది. దసరా పండగ స్పెషల్గా వారాంతం ఎపిసోడ్ కొన్ని మెరుపులతో కొన్ని పాత ఆటలతో మమ అనిపించాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అన్ని సిరీస్లు ఫాలో అవుతున్నవారికి తెలుస్తుంది... బిగ్ బాస్ టాస్కులన్నీ పాత టాస్కులే అని. ఇక్కడ టాస్కులు పాతవైతే ఫర్వాలేదు ఆ పాత టాస్కులు ఆడేవారు కూడా పాతవారే. ఓ సారి ఆట ఆడినవారు మరోసారి జాగ్రత్తగా ఆడతారు కదా. అప్పుడు కొత్తవాళ్ళెప్పుడూ పాతవాళ్ల మీద గెలుస్తారు కదా. ఇంత చిన్న లాజిక్ బిగ్ బాస్ ఎందుకు గమనించలేదో ఏమో. కాని ఒక్క విషయంలో మాత్రం బిగ్ బాస్ను మెచ్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ పరదేశానిదైనా మన దేశంలో చేస్తున్నప్పుడు మన సంస్కృతికి పెద్ద పీట వేసి మన పండగ శోభలను కార్యక్రమంలో పొందుపరచడం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా వారాంతంలో ప్రసారమయిన ఎపిసోడ్లో ప్రముఖ గాయని మంగ్లీ హౌస్లోని పార్టిసిపెంట్స్ చేత బతుకమ్మ ఆడించడం ఆకర్షణగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ ఈ సీజన్లో ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడి ప్రేక్షకుల కోసం ఇంకెంత పులిహోర కలుపుతాడో చూడాలి మరి. -
అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా
ప్రస్తుత బిగ్బాస్ 8లో పాల్గొని రెండో వారానికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ శేఖర్ భాషా. తాజాగా ఇతడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని, విచారిస్తున్నారని న్యూస్ ఒకటి వైరల్ అయింది. హర్ష సాయిపై అత్యాచారం కేసులో భాగంగా ఇతడిని అదుపులోకి తీసుకున్నారని కామెంట్స్ వినిపించాయి. కానీ అలాంటిదేం లేదని, తనని అసలు అరెస్ట్ చేయలేదని శేఖర్ భాషా ఇప్పుడు వీడియో రిలీజ్ చేశాడు.కొన్నిరోజుల క్రితం యూట్యూబర్ హర్షసాయిపై ఓ నటి, నిర్మాత కేసు పెట్టింది. తనని లైంగికంగా వేధించి, రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు చేసింది. ఈ విషయంలో పోలీసులు హర్షసాయి కోసం వెతుకుతున్నారు. మరోవైపు తనపై పలు ఇంటర్వ్యూల్లో శేఖర్ భాషా అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఈమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శేఖర్ భాషాని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి విచారించినట్లు న్యూస్ ఒకటి బయటకొచ్చింది.(ఇదీ చదవండి: మణికంఠ చిన్న పొరపాటు.. కొత్త మెగా చీఫ్గా గౌతమ్)అలాంటిదేం లేదని తాను ప్రో కబడ్డీ లీగ్ చూసేందుకు గచ్చిబౌలి స్టేడియానికి వెళ్లానని, తన ఫోన్ స్విచ్చాఫ్ అయిపోవడం వల్ల తాను అందుబాటులోకి రాలేకపోయానని చెప్పాడు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్స్ అని అన్నాడు. మరి నిజంగానే శేఖర్ భాషాని అరెస్ట్ చేశారా? లేదంటే ఈ పుకార్లు ఎందుకొచ్చాయనేది తెలియాల్సి ఉంది.శేఖర్ భాషా ఓ రేడియో జాకీ. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు గానీ పెద్ద గుర్తింపు అయితే రాలేదు. రాజ్ తరుణ్-లావణ్య వివాదం జరుగుతుంటే మధ్యలో దూరి కాస్త ఫేమస్ అయ్యాడు. అలా బిగ్బాస్ ప్రస్తుత సీజన్ వచ్చాడు. రెండు వారాలు ఉన్నాడో లేదో ఎలిమినేట్ అయిపోయాడు. వైరల్ కావడం ఏ వివాదం జరుగుతుంటే అందులో దూరిపోతున్నాడా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బిచ్చగాడిలా మారిపోయిన స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?) View this post on Instagram A post shared by RJ Shekar Basha (@shekarbasharj) -
మణికంఠ చిన్న పొరపాటు.. కొత్త మెగా చీఫ్గా గౌతమ్
ఈ వారం నామినేషన్స్ పూర్తయిన దగ్గర నుంచి ఓవర్ స్మార్ట్ అనే టాస్క్ నడుస్తోంది. ఒకరిని ఒకరు కొట్టుకుంటారా అన్నంతలా బుధవారం గురువారం ఎపిసోడ్ నడిచాయి. ఇప్పుడు మెగా చీఫ్ ఎవరవుతారనే దానికోసం పోటీలు జరిగాయి. ఇందులో గౌతమ్ గెలిచాడు. కాకపోతే మణికంఠ చేసిన చిన్న తప్పు ఇతడికి ఈ పదవి వరించేలా చేసింది. నిఖిల్ గురించి గంగవ్వ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో (అక్టోబర్ 18) ఏమేం జరిగిందనేది చూద్దాం?(ఇదీ చదవండి: అతనితో లిప్లాక్ సీన్.. చాలా చిన్న విషయం అన్నాడు: సీనియర్ నటి)తుస్సుమనిపించిన ఓజీ క్లాన్ఓవర్ స్మార్ట్ టాస్క్ జరుగుతుండగానే బిగ్బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో కొన్ని గుర్తులు ఉన్న తలగడలు ఉంచారు. టీవీలో సింబల్ చూపించగానే అలాంటి తలగడని తీసుకెళ్లి మరోచోట గీసిన బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది. తాను ఎంతమంది చెబితే అందరూ రావాలని, బాక్స్లో తలగడ పెట్టేంతవరకు అడ్డుకోవచ్చని ఒక్కసారి తలగడ పెట్టిన తర్వాత మాత్రం వ్యక్తిని తాకకూడదని క్లారిటీ ఇచ్చాడు. ఇందులో తొలి రెండుసార్లు ఓజీ క్లాన్ గెలిచింది. కానీ తర్వాత మాత్రం రాయల్ క్లాన్ పూర్తి ఆధిపత్యం చూపించింది.నిఖిల్ డేంజర్ గాడుఈ టాస్క్లో గెలిచిన రాయల్ క్లాన్కి బిగ్బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఓజీ క్లాన్లోని ఇద్దరిని మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ నుంచి తీసేయొచ్చని అన్నాడు. దీంతో ఓజీ క్లాన్ అంతా మాట్లాడుకుని నిఖిల్, నబీల్ అనుకున్నారు. గంగవ్వని పిలిచి అభిప్రాయం అడిగితే.. నిఖిల్ గాడిని తీసేయాలే, ఆడు పెద్ద డేంజర్ గాడు అని చెప్పింది. దీంతో అందరూ నవ్వేశారు. అలా నిఖిల్, నబీల్ని రేసు నుంచి తప్పించారు.వాళ్లందరూ పోటీలోఅప్పటికే నిఖిల్, నబీల్, పృథ్వీ గేమ్లో ఔట్ అయిపోయారు. సరిగ్గా ఈ టైంలో ఓవర్ స్మార్ట్ టాస్క్ పూర్తయిందని ఈ ముగ్గురు తప్పితే మిగిలిన వాళ్లందరూ మెగా చీఫ్ కంటెండర్ పోటీకి అర్హులే అని బిగ్బాస్ ప్రకటించాడు. 'పట్టుకో లేదే తప్పుకో' పేరుతో టాస్క్ పెట్టాడు. దీని ప్రకారం ఓ రౌండ్ ప్లేస్లో కుక్క ఎముక బొమ్మ ఉంటుంది. బజర్ మోగినప్పుడు తొలుత ఎవరైతే పట్టుకుంటారో గేమ్ నుంచి మరొకరిని సరైన కారణం చెప్పి ఎలిమినేట్ చేయొచ్చని అన్నాడు. నిఖిల్ని సంచాలక్గా పెట్టాడు.(ఇదీ చదవండి: పోలీసుల అదుపులో తెలుగు బిగ్బాస్ కంటెస్టెంట్!)గౌతమ్ తెలివితేటలుతొలిసారి బజర్ మోగిన వెంటనే అందరూ బోన్ మీద పడ్డారు. కానీ చివరకు గౌతమ్-మెహబూబ్ మాత్రమే దక్కించుకునేందుకు తెగ గింజుకున్నారు. చివరకు గౌతమ్ పట్టేసుకున్నాడు. అవినాష్-మెహబూబ్లనే తప్పిస్తున్నట్లు చెప్పాడు. వాళ్లు బలమైన కంటెస్టెంట్స్ అని, అందుకే ఎలిమినేట్ చేస్తున్నా అని కారణం చెప్పాడు. రెండోసారి మోగినప్పుడు అమ్మాయిలందరూ బోన్ కోసం చాలా ప్రయత్నించారు. కానీ గౌతమ్ బలం ముందు వాళ్లు నిలబడలేకపోయారు. ఈసారి విష్ణుప్రియ-ప్రేరణని తప్పిస్తున్నట్లు చెప్పాడు.మణికంఠ తప్పటడుగుమూడోసారి బోన్ మణికంఠ చేతికి చిక్కింది. దీంతో గౌతమ్ పేరు చెబుతాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ టేస్టీ తేజ-హరితేజ పేర్లు చెప్పాడు. గేమ్ మొదలవకముందే గౌతమ్తో డీల్ మాట్లాడుకున్నానని అన్నాడు. అలాంటి డీల్ నేను ఫాలో కావట్లేదని గౌతమ్ ప్లేట్ తిప్పేశాడు. దీంతో మణికంఠ తన నిర్ణయం మార్చుకున్నానని అన్నాడు. కానీ సంచాలక్ నిఖిల్ మాత్రం తొలిసారి చెప్పిన పేర్లనే ఫైనల్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా మణికంఠ తప్పు వల్ల గౌతమ్ బతికిపోయాడు. చివరకు ఒక్కొక్కరిని దాటుకుంటూ గౌతమ్ విజేతగా నిలిచాడు. మెగా చీఫ్ అయిపోయాడు.అమ్మాయిలకు విశ్రాంతిగౌతమ్ మెగా చీఫ్ కాగానే గంగవ్వ కాళ్లు మొక్కాడు. రోహిణి అయితే.. బొక్కలో లక్కు నీ వైపు ఉంది, అందుకే గెలిచావ్ అని ఫన్నీ సెటైర్ వేసింది. గత సీజన్లో చేసినట్లే ఈసారి కూడా హౌసులోని లేడీ కంటెస్టెంట్స్కి వారం పాటు విశ్రాంతి అని, అబ్బాయిలే అన్ని పనులు చేస్తారని చెప్పాడు. అలానే తన సహాయకులుగా హరితేజ-గంగవ్వని పెట్టుకుంటున్నట్లు చెప్పాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
బిగ్బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!
బిగ్బాస్ 8లో ఏడో వారం చివరకొచ్చేసింది. ప్రస్తుతం హౌస్లో ఓవర్ స్మార్ట్ గేమ్ నడుస్తోంది. కొట్లాడుకుని మరీ ఛార్జింగ్ కోసం ఆపసోపాలు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం కల్లా ఇది అయిపోతుంది. వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి ఎలిమినేషన్ టెన్షన్ కచ్చితంగా ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈసారి ఓటింగ్లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.గత ఆరు వారాల్లో బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, నైనిక, ఆదిత్య ఓం, సీత ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్లో ఏకంగా తొమ్మిది మంది ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, నబీల్, మణికంఠ, ప్రేరణ, యష్మి, గౌతమ్, హరితేజ, టేస్టీ తేజ ఉన్నారు. గేమ్ పరంగా ఆకట్టుకుంటున్న నబీల్.. టాప్లో కొనసాగుతున్నాడట.(ఇదీ చదవండి: బిగ్బాస్ నుంచి బయటకెళ్లిపోతా.. నిఖిల్ vs గౌతమ్)ఓటింగ్ పరంగా నబీల్ తర్వాతి స్థానాల్లో వరసగా నిఖిల్, మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, యష్మి, హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నారు. వీళ్లలో పృథ్వీపై సోషల్ మీడియాలో ఘోరమైన వ్యతిరేకత ఉంది. నామినేషన్ సందర్భంగా అవినాష్ భార్య గురించి చీప్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. అదే టైంలో ఇతడి ఆటని ఇష్టపడేవాళ్లు కూడా ఉన్నారని ఓటింగ్ చూస్తుంటే తెలుస్తోంది.చివరి మూడు స్థానాల్లోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్సే ఉన్నారు. వీళ్లలో టేస్టీ తేజ కాస్తోకూస్తో ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గౌతమ్ అయితే యష్మితో మెల్లగా మాటలు కలుపుతూ లవ్ ట్రాక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. లెక్క ప్రకారం చూసుకుంటే వీళ్లిద్దరి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తారా? లేదంటే ఉన్నా లేనట్లే కనిపిస్తున్న హరితేజని ఇంటికి పంపించేస్తారా అనేది చూడాలి. (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
బిగ్బాస్ నుంచి బయటకెళ్లిపోతా.. నిఖిల్ vs గౌతమ్
బిగ్బాస్ హౌస్లో బూతులు తిట్టడం, ఫిజికల్గా కొట్టడం లాంటివి చేయకూడదు. కానీ ప్రస్తుతం నడుస్తున్న 'ఓవర్ స్మార్ట్' గేమ్ చూస్తుంటే కొట్టుకోవడానికి, గొడవలు పడటానికే ఇది పెట్టారా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు టీమ్స్ ఆపసోపాలు పడ్డాయి. ఈ క్రమంలో గౌతమ్-నిఖిల్ మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఇంతకీ గురువారం (అక్టోబర్ 17) ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.తెలివి చూపించిన యష్మిఎంతకీ ఛార్జింగ్ ఇవ్వకపోయేసరికి రాయల్స్ టీమ్.. కిడ్నాప్ ప్లాన్ వేశాడు. తేలిగ్గా ఉంటాడని చెప్పి మణికంఠని లాగేశారు. కానీ ఓజీ క్లాన్ టీమ్ ఇంతా దీనికి అడ్డుపడింది. అందరూ మణికంఠని డిఫెండ్ చేస్తుంటే చాకచక్యంగా యష్మిని అవినాష్ లోపలికి లాగేశాడు. వెంటనే తేజ డోర్ మూసేశాడు. ఇక యష్మిని బయటకు తీసుకొచ్చేందుకు ఓజీ క్లాన్ తెగ ప్రయత్నించింది. లోపలున్న యష్మి కేబుల్ కలిపేసి అవినాష్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు. ఎంత గింజుకున్నా కుదరకపోయేసరికి కేబుల్ తెగ్గొట్టి, ఊడిపోయిందని తెలివి చూపించింది. దీంతో ఈమెని వదిలేయాల్సి వచ్చింది.(ఇదీ చదవండి: ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత)మణికంఠ వల్ల గొడవఉదయం లేవడమే బిగ్బాస్ ఓ ప్రకటన చేశాడు. సైరన్-సైరన్ రావడానికి మధ్యలో ఛార్జింగ్ పాట్ని పగలగొట్టారని, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ నుంచి ఓ సభ్యుడిని టాస్క్ నుంచి తప్పించాలని ఆదేశించాడు. ఇక ఎవరినీ పక్కనబెట్టేద్దామా అని ఓజీ క్లాన్ ఆలోచిస్తుండగా మణికంఠ వల్ల మరో గొడవ జరిగింది. బాత్రూమ్లోకి వెళ్లిన మణికంఠ, విష్ణుప్రియని రాయల్ క్లాన్ లాక్ చేశారు. అనుమతి లేకుండా లోపలికి వచ్చాం కాబట్టి రెండు పాయింట్ల ఛార్జింగ్ ఇస్తామని నిఖిల్ అన్నాడు. ఇంతలో రాయల్ క్లాన్.. మణికంఠ నుంచి బలవంతంగా ఛార్చింగ్ చేసేందుకు ప్రయత్నించారు.నిఖిల్ వర్సెస్ గౌతమ్బాత్రూం బయటున్న తేజని నిఖిల్ పక్కకి లాగేశాడు. దీంతో నిఖిల్ని గౌతమ్ వెనక నుంచి గట్టిగా పట్టేసుకున్నాడు. అలా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరూ కిందపడిపోయారు. అయితే గౌతమ్ చేతులతో గుద్దుతున్నాడని నబీల్ ఆరోపించాడు. దీంతో ఆవేశపడిపోయిన గౌతమ్.. తోయలేదు అంటూ మీదకొచ్చేశాడు. నిఖిల్ని పక్కకు లాగేశాడు. దీంతో కోపంలో గౌతమ్ మెడ పట్టుకుని సోఫాపైకి విసిరేశాడు. కొడితే నేను కొడతా అని నిఖిల్ అనేసరికి.. కావాలని కొట్టలే అని గౌతమ్ రెచ్చిపోయాడు. అక్కడి నుంచి గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. కొట్టినట్లు ఉంటే బిగ్బాస్ నుంచి బయటకెళ్లిపోతా అని గౌతమ్ సవాలు చేశాడు.మణికంఠ భయంభయంబాత్రూం దగ్గర ఇచ్చిన మాట ప్రకారం మెహబూబ్కి నిఖిల్ ఓ పాయింట్ ఇచ్చాడు. మరోవైపు రాయల్ క్లాన్ చెప్రిన ప్రకారం పృథ్వీని టాస్క్ నుంచి తప్పుకోవాలని బిగ్బాస్ ప్రకటించాడు. ఇదంతా చూసి బెదిరిపోయిన మణికంఠ.. హరితేజ దగ్గరకెళ్లి నన్ను గేమ్ నుంచి తీసేయండి. ఆడేవాళ్లతో ఆడండి. వాళ్లకి చీఫ్ అవ్వాలని ఉంది. నాకు దెబ్బలు తగిలితే ఏంటి పరిస్థితి అని తన బాధలు చెప్పుకొన్నాడు. కాసేపటి తర్వాత కూడా నా శరీరం సహకరించట్లేదు. గేమ్ ఇంత కష్టంగా ఉంటుందని అనుకోలేదు అని చెప్పడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. శుక్రవారం ఎపిసోడ్లో ఈ టాస్క్కి ముగింపు ఉండొచ్చు.(ఇదీ చదవండి: తొలి రోజే తనతో ప్రేమలో పడిపోయా: హీరో కిరణ్ అబ్బవరం) -
బిగ్బాస్ 8లో 'కమ్యూనిటీ' ఓటింగ్? మెహబూబ్ షాకింగ్ వీడియో
బిగ్బాస్ షోలో గెలవాలంటే ఏం కావాలి? అయితే కండబలం లేదంటే బుద్ధి బలం ఉండాలి. ఒకవేళ ఇవన్నీ లేకపోతే కనీసం గ్లామర్ అయినా ఉండాలి. అలా అయితే కొన్ని వారాలు నెట్టుకురావచ్చు. కానీ చివరకు ఇక్కడికి కూడా మతాన్ని, కులాన్ని తీసుకొచ్చేసినట్లు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం తెలుగులో 8వ సీజన్ నడుస్తోంది. 14 మంది వస్తే ఒక్కరూ సరిగా ఎంటర్టైన్ చేయలేకపోయారని, వైల్డ్ కార్డ్ పేరిట మరో ఎనిమిది మందిని తీసుకొచ్చారు. వీళ్లలో మెహబూబ్ ఒకడు. నాలుగో సీజన్లో పాల్గొన్నాడు. గెలవలేదు గానీ చివరలో సొహెల్ డబ్బు దక్కించుకునేందుకు సాయపడ్డాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి.(ఇదీ చదవండి: నాన్నతో నేను మాట్లాడలేదు.. విష్ణుప్రియ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ)అదంతా పక్కనబెడితే ఇప్పుడు కూడా హౌస్లోకి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడుతున్నాడు సరే. నబీల్తో కమ్యూనిటీ ఓటింగ్ గురించి చర్చించాడు. వివాదం అవ్వొచ్చని ఆ వీడియోని ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో వచ్చినట్లుంది. ఎవరో దాన్ని తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.వీడియోలో మెహబూబ్ ఏమన్నాడంటే.. 'మన ప్లస్ ఏంటంటే కమ్యూనిటీ ఉంది. దారుణంగా ఓట్లు పడతాయి. ఎటొచ్చి ఇద్దరం ఒకేసారి నామినేషన్లలో లేకుండా చూసుకోవాలంతే' అని నబీల్తో అంటున్నాడు. ఈ వీడియోలో నబీల్ చేతికి మెగా చీఫ్ బ్యాడ్జి ఉంది. అంటే ఇది పాత వీడియోనే అనిపిస్తుంది. మిగతా వాటిలో ఏమో గానీ చివరకు బిగ్బాస్ షోలో కులం-మతం ప్రాతిపదికన ఓట్లు వేస్తారా? నిజంగా అది వర్కౌట్ అవుతుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)#Mehboob and #nabeel discussion about Community Mana Community votes manake padathay just manam iddaru okesari nominations lo lekunda chuskovali anthe pedha plan thone vacharu ga vellu 🙉🙉🙉 Konni sensitive topics matladakudadu bb house lo asalu 🙂🙏🙏#BiggBossTelugu8… pic.twitter.com/vEjeJtHptB— World Discovery By SP (@WorldDiscoverSP) October 15, 2024 -
నాన్నతో నేను మాట్లాడలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ
బిగ్బాస్ ఏడో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. రెండు రోజుల పాటు రచ్చ రచ్చగా సాగింది. మొత్తం తొమ్మిది మంది లిస్టులో ఉన్నారు. అసలు ఘట్టం అయిపోయింది కాబట్టి కాస్త ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ బయటపడ్డాయి. విష్ణుప్రియ తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండటం గురించి చెప్పగా.. గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక నామినేషన్లో జరిగిన సీరియస్ విషయాన్ని రోహిణి-తేజ-అవినాష్ కలిసి ఫుల్ కామెడీ చేసేశారు.ఉదయం లేచిన తర్వాత ముచ్చట్లు పెట్టిన టైంలో విష్ణుప్రియ తన కుటుంబంలో గొడవ గురించి బయటపెట్టింది. 'నాన్న ఊరిలో ఉంటారు. ఆయనతో మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు. అమ్మ కోసం నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మిస్ అయినా కూడా నాన్నతో నేను మాట్లాడలేదు' అని చెప్పింది. దీంతో గంగవ్వ ఎమోషనల్ అయింది. కళ్లలో నీళ్లు రావడంతో విష్ణుప్రియ ఓదార్చింది. ఇకపోతే కొన్నేళ్ల క్రితం విష్ణుప్రియ తల్లి చనిపోయింది.(ఇదీ చదవండి: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)మరోవైపు మనిద్దరం డీలింగ్ చేసుకుందామని గంగవ్వతో మణికంఠ మాట్లాడాడు. ఈ వారం గనక తాను సేవ్ అయితే బంగారు ముక్కు పుడక చేయిస్తానని గంగవ్వతో అన్నాడు. దీంతో పక్కనే ఉన్న హరితేజ.. నాకు బంగారు వడ్డనం ఇస్తావా చెప్పు అని జోక్ చేసింది. నాకు ఏమిస్తావ్ అని రోహిణి అడగ్గా.. ముద్దు ఇస్తానని చెప్పాడు. ఎనిమిదో వారం సేవ్ అయితే నాకు తులం బంగారం పెట్టు అని గంగవ్వ మణితో చెప్పింది.ఏడో వారం సేవ్ కావాలి, తొమ్మిదో వారం సేవ్ కావాలి అనే మణికంఠ చెప్పేసరికి.. నువ్వు అప్పటివరకు ఉండవ్, ఎనిమిదో వారమే ఎలిమినేట్ అయిపోతావ్ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వారం నామినేషన్స్లో గొడవ గొడవ చేసిన గౌతమ్, పృథ్వీలని ఇమిటేట్ చేస్తూ అవినాష్-తేజ-రోహిణి ఫుల్ కామెడీ చేశారు. అలా ప్రోమో కాస్త ఎమోషనల్, కాస్త ఎంటర్టైనింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. 10 నెలల తర్వాత) -
పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!
బిగ్బాస్ 8లో ఏడో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగింది. ఎంతలా అంటే పృథ్వీ నిజంగా పిచ్చోడిలా ప్రవర్తించాడు. ప్రేరణని టార్గెట్ చేశాడు. అవినాష్ వ్యక్తిగత విషయాలు తీసి దారుణంగా మాట్లాడాడు. ఇంతా చేశాడు గానీ ఏదైనా గట్టిగా అనుకున్నాడో అది మాత్రం సాధించలేకపోయాడు. వీళ్లిద్దరి వల్ల హరితేజ అడ్డంగా బుక్ అయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో (అక్టోబర్ 15) ఏమేం జరిగిందనేది హైలైట్స్లో చూద్దాం.యష్మి డబుల్ ఫేస్ఏడో వారం నామినేషన్స ప్రక్రియ మధ్యలో ఆగడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మళ్లీ అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. టోపీని ప్రేరణకి దక్కకుండా చేయాలని నయని, పృథ్వీ అడ్డుకున్నారు. ప్రేరణకి సపోర్ట్ చేస్తూ, వీళ్లని డిఫెండ్ చేసే క్రమంలో యష్మి కింద పడిపోయింది. తనకు కాలు విరిగినా పర్లేదు కానీ ఏది కరెక్టో దానివైపే నిలబడతా అని చెప్పింది.యష్మి కన్ఫ్యూజన్ మాటలుపోడియం పైకి తేజ, నబీల్ వచ్చారు. నబీల్.. తేజని నామినేట్ చేశాడు. సొంత ఫ్రెండ్ని చెప్పి ప్రేరణని నామినేట్ చేస్తానని యష్మి చెప్పిందని, ఇది తనకు నచ్చలేదని యష్మిని నామినేట్ చేశాడు. అయితే యష్మి.. ఫ్రెండ్ అనే ముసుగు వేసుకుని మరీ ప్రేరణని మోసం చేస్తోంది అని, యష్మిది డబుల్ స్టాండర్డ్ అని చెప్పుకొచ్చాడు. ఈ హంగామా అంతా కాసేపు నడిచింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!)టార్గెట్ తేజఓజీ క్లాన్ అందరూ కలిసి తేజని టార్గెట్ చేయాలనుకున్నారు. నిఖిల్ చాలా తెలివిగా తన క్లాన్ అందరికీ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో పోడియంపైకి వచ్చిన విష్ణుప్రియ.. నయని పావనిని రివేంజ్ నామినేషన్ చేయాలనుకుంటున్నానని చెప్పింది. ఇదంతా చెల్లదు అని బిగ్బాస్ చెప్పాడు. అయితే ఇదంతా తనని టార్గెట్ చేయడానికే అని తేజ బయటపెట్టాడు. విష్ణుప్రియ డమ్మీ నామినేషన్ వేస్తే.. పక్కనోళ్లు తన పేరు చెబుతారని.. అలా తను నామినేషన్ లోకి వచ్చేలా ఇదంతా చేస్తున్నారని ఓజీ క్లాన్ బండారాన్ని తేజ బయటపెట్టాడు. కానీ నిఖిల్, తేజ పేరే చెప్పాడు. టోపీ ఉన్న హరితేజ.. తేజ పేరునే నామినేట్ చేస్తూ ఫైనల్ చేసింది. దీని తర్వాత గౌతమ్ మరోసారి పసలేని వాదన తీసుకొచ్చి నబీల్ పేరు చెప్పాడు. కాస్త హంగామా నడిచిన తర్వాత ఊహించని విధంగా నబీల్ నామినేట్ అయ్యాడు.పృథ్వీ చీప్ కామెంట్స్బిగ్బాస్ ఎపిసోడ్స్ ఏం చూడకుండా తనని గతవారం అవినాష్ నామినేట్ చేశాడని, అందుకే ఈ వారం అతడిని నామినేట్ చేస్తున్నానని పృథ్వీ చెప్పాడు. దీంతో అవినాష్ నిజాయతీగా తన వాదన వినిపించాడు. షూటింగ్స్ వల్ల తాను అన్ని ఎపిసోడ్స్ చూడలేదని, ఈ విషయాన్ని నాగ్ సర్కి కూడా చెప్పానని అన్నాడు. తన భార్య ఎపిసోడ్స్ అన్నీ చూసి తనకు కొన్ని పాయింట్స్ చెప్పిందని, వాటి వల్ల పృథ్వీని నామినేట్ చేశానని అన్నాడు. అలాంటప్పుడు మీరెందుకు వచ్చారు, మీ భార్యనే ఇక్కడకు రావాల్సింది అని పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. వైఫ్ మ్యాటర్ తీయకు అని అవినాష్ ఫుల్ సీరియస్ అయ్యాడు.నోరు జారిన పృథ్వీషూటింగ్స్లో బిజీగా ఉండటం తాను చూడలేకపోయానని అవినాష్ ఎంత చెబుతున్నా సరే పృథ్వీ ఊరుకోలేదు. సరికదా సైకోలా ప్రవర్తించి బిగ్బాస్లోకి వచ్చేందుకు షూటింగ్స్ లేవా? అని వెటకారంగా మాట్లాడాడు. పృథ్వీ పనేం చేయట్లేదని, గంగవ్వ కూడా అదే పాయింట్ చెప్పిందని గుర్తుచేశాడు. 'గంగవ్వ అని ఎందుకు చెప్తావ్ రా' అని పృథ్వీ అనేసరికి.. 'రేయ్ రా అనకు' అని అవినాష్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నేను అలానే అంటాను అని పృథ్వీ పైపైకి వచ్చాడు. అలా తన్నుకోవడం ఒక్కటే తక్కువైంది అనే రేంజులో తగాదా పడ్డారు. మరో పోడియంపై నిలబడ్డ నయని.. విష్ణుప్రియ పేరు చెప్పింది. కానీ పాయింట్లో బలం లేకపోయింది. దీంతో పృథ్వీ చెప్పిన అవినాష్ పేరునే పరిగణలోకి తీసుకుంది.అనుకున్నది జరగలేఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, టేస్టీ తేజ, నబీల్, మణికంఠ నామినేషన్స్లో ఉన్నారని.. అలానే తక్కువసార్లు టోపీ పట్టుకున్న కారణంగా ప్రేరణ నామినేట్ అయిందని బిగ్బాస్ ప్రకటించాడు. ఓజీ క్లాన్ దగ్గర ఇమ్యూనిటీ ఉన్నందున ఒకరిని సేవ్ చేసుకోవచ్చని కానీ మరొకరిని ఆ స్థానంలో పెట్టాల్సి ఉంటుందని బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో అవినాష్.. తన బదులు హరితేజ పేరుని చెప్పాడు. అలా ఈసారి ఓజీ క్లాన్ నుంచి ఆరుగురు.. రాయల్ క్లాన్ నుంచి ముగ్గురు నామినేషన్స్లోకి వచ్చారు.పృథ్వీ మనిషి కాదు సైకో?రెండు రోజుల పాటు జరిగిన నామినేషన్స్లో అందరూ గేమ్ పరంగా ఎంత ఉండాలో అంతలా కనిపించారు. పృథ్వీ మాత్రం సైకోలా ప్రవర్తించాడు. ప్రేరణ తనని కావాలనే టార్గెట్ చేసిందని, ఆమెని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక అవినాష్తో అయితే కనీసం బుర్ర లేని పిచ్చోడిలా ప్రవర్తించాడు. ఇలాంటి వాడిని అసలు బిగ్బాస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో? ప్రేక్షకుల మైండ్ ఎందుకు కలుషితం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. -
అవినాష్ భార్యపై పృథ్వీ చీప్ కామెంట్స్.. మరీ ఇలానా?
బిగ్బాస్ 8 షో మరీ హద్దులు దాటేస్తున్నట్లు కనిపిస్తుంది. మాట్లాడుకోవడం, తన్నుకోవడం అనేది గేమ్స్ వరకు అయితే పర్లేదు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. మంగళవారం ఎపిసోడ్లో అలాంటి గొడవే జరిగింది. నామినేషన్ సందర్భంగా అవినాష్ భార్య గురించి పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఫ్రెండ్షిప్ అనే పదాన్ని తీసి మరీ తనని బాధపెట్టారని యష్మి ఏడ్చింది. దీంతో ప్రేరణ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక గ్రూప్గా ఫామ్ అయిన నిఖిల్.. నబీల్, పృథ్వీ, మణికంఠతో మాట్లాడుతూ తేజని ఎలాగైనా సరే టార్గెట్ చేయాలని అన్నాడు. గుర్రం సౌండ్ వినిపించగానే యష్మి టోపీ లాగేసుకుని ప్రేరణకి ఇచ్చింది. పోడియంపై నిలబడ్డ విష్ణుప్రియ.. రివేంజ్ పేరుతో నయని పావనిని నామినేట్ చేయాలనుకుంది. కానీ రివేంజ్ అనేది ఇక్కడ కుదరదని బిగ్బాస్ అల్టిమేటం ఇచ్చేశాడు. ఇదంతా చూసిన తేజ.. ఓజీ క్లాన్ బండారాన్ని బయటపెట్టాడు. తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. ఓజీ vs తేజ చేసేస్తున్నారని, ఇక మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడతా అని తేజ.. వాళ్లకు సవాలు విసిరాడు.(ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి)తర్వాత వచ్చిన పృథ్వీ.. ప్రోమో చూసి తను టాస్క్లు ఆడుతున్నానని చెప్పడం అస్సలు నచ్చలేదని అవినాష్ని నామినేట్ చేశాడు. దీంత ఇద్దరి మధ్య తగువు మొదలైంది. 'నేను చూసిన ఎపిసోడ్స్లో రెండు మూడు టాస్క్లు తప్పితే ఎక్కడా కనిపించలేదు. మా వైఫ్ చూసింది' అని అవినాష్ అనగానే.. మరి అలాంటిప్పుడు మీ భార్యనే బిగ్బాస్కి రావాల్సింది, మీరెందుకు వచ్చారు అని పృథ్వీ నోరు జారాడు. వైఫ్ టాపిక్ తీయకు అని అవినాష్ సీరియస్ అయ్యాడు.సోఫాలు కూర్చోవడం తప్పితే ఇంకేం చేయవ్ అని అవినాష్ అనేసరికి.. కామెడీ తప్ప ఇంకేం చేశావ్ నువ్వు అని పృథ్వీ అన్నాడు. పోయిన వారం నేను ఏ పాయింట్ చెప్పానో, ఈ వారం కూడా గంగవ్వ అదే పాయింట్ చెప్పిందని అవినాష్ అనేసరికి.. 'గంగవ్వ పేరు ఎందుకు చెబుతావ్ రా' అని పృథ్వీ మరోసారి నోరు జారాడు. 'రేయ్ రా అనకు' అని అవినాష్ వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇది నీ సంస్కారం. బిగ్బాస్కి వచ్చావ్ కదా నేర్చుకో' అవినాష్-పృథ్వీ ఒకరిపై ఒకరు వెళ్లారు.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత) -
కిర్రాక్ సీత ఎలిమినేటికి కారణాలు ఇవే..
-
విన్నర్ గురించి చెప్పడం వేస్ట్
-
Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత
బిగ్బాస్ 8 హౌస్ నుంచి ఆరో వారం కిరాక్ సీత ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. తన తమ్ముడు నబీల్ విజేతగా నిలవాలని కోరింది. అలానే స్టేజీపై బోలెడన్ని విశేషాలు పంచుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత జరిగే బజ్ ఇంటర్వ్యూలోనూ అర్జున్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. మంచితనమే కొంపముంచిందా అనే దానికి కూడా క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: సీత ఎలిమినేట్.. 'అతడు గెలిస్తే చూడాలనుంది')బిగ్ బాస్ అనేది లైఫ్ టైమ్ అవకాశం, మీరు దాన్ని సరిగా ఉపయోగించానని అనుకున్నారా? అని అడగ్గా.. 100 శాతం అయితే నేను ఇచ్చానని సీత చెప్పింది. హౌసులో మీ పతనం ఎప్పుడు మొదలైందో గమనించారా? అని అడగ్గా.. టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్లని పంపినప్పుడు డౌన్ అయ్యానని నేను అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.ఏడవటం స్ట్రాంగా? అని అడగ్గా.. మరి అరవడం స్ట్రాంగా? అని అర్జున్కే కౌంటర్ వేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత మంచితనమే కొంపముంచిందా అని మీకు అనిపించలేదా? అని అడగ్గా.. కొంప మునగదు కదా అని క్యారెక్టర్ మార్చుకోలేను కదా అని సీత ఆన్సర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: కిర్రాక్ సీత పారితోషికం ఎంతంటే?)ఇక హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. టేస్టీ తేజ చిరాకులా అనిపించాడని, వారం అయినా సరే పెద్దగా ఫెర్ఫార్మ్ చేసినట్లు, కాన్ఫిడెన్స్ పెద్దగా కనిపించలేదని సీత చెప్పింది. గౌతమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అనిపించిందని చెప్పింది. గేమ్ పరంగా చూస్తే నిఖిల్ ట్రాన్స్పరెన్సీతో లేడని అంది.మీ అమ్మ ఓ లెటర్ పంపించారు కదా అందులో ఏముంది? అని అర్జున్ అడిగేసరికి.. సీత ఎమోషనల్ అయిపోయింది. ఏం జరిగిందో పక్కనబెడితే, నాకు దాని గురించి ఆలోచించాలని లేదు. ఎందుకంటే నేను నాలానే ఉన్నాను, సంతోషంగా బయటకొచ్చాను. మా అమ్మని హౌసులో చూడాలనుకున్న ఒక్కటే కల. అది తీరలేదు అని సీత ఏడ్చేసింది. ఏడుస్తూ, హౌసులో కాస్త మెతకగా ఉండటమే సీత ఎలిమినేషన్కి కారణం అయ్యుండొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: Bigg Boss 8: తేజ చేతిలో సీత బలి.. ఈ వేట ఆగదా?) -
నీకు నయని నచ్చిందా? పృథ్వీ-విష్ణుప్రియ ప్రేమ ముచ్చట్లు!
బిగ్బాస్లో ప్రతిసారి హోటల్ టాస్క్ ఉంటుంది. ఈసారి కూడా అలాంటిది పెట్టారు. కానీ ఎక్కడో ఒకటో రెండో చోట్ల నవ్వు తప్పితే, పెద్దగా చూడాలనే ఇంట్రెస్ట్ కలిగించలేకపోయారు. పోటీపోటీగా సాగిన ఈ టాస్క్లో ఓజీ క్లాన్ సభ్యులే గెలిచారు. కానీ చివర్లో తేజ కిందపడిపోవడంతో కాస్త కంగారు అనిపించింది. ఇంతకీ 39వ రోజు బిగ్బాస్ హౌస్లో ఏమేం జరిగింది?(ఇదీ చదవండి: 'విశ్వం' మూవీ ట్విటర్ రివ్యూ)బుధవారం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి బీబీ హోటల్ టాస్క్ మళ్లీ షురూ చేశారు. మణికంఠతో రోహిణి డ్యాన్స్ చేయించింది. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్.. కొందరి పాత్రలని మార్చేశాడు. తేజ.. రోహిణి-అవినాష్కి అసిస్టెంట్ అని, కొడుకు గురించి గర్వంగా ఫీలవుతూ, అతడిని హీరోని చేద్దామని తల్లి పాత్ర హరితేజది అని.. ఆకతాయి అబ్బాయి కమ్ నయని బాయ్ఫ్రెండ్ గౌతమ్ అని, అవినాష్కి ఎట్రాక్ట్ అయిన హోటల్ మేనేజర్ ప్రేరణ అని, హోటల్ ఓనర్ నబీల్ కొడుకు పృథ్వీ అని ఫిక్స్ చేశారు.ఇక స్టాఫ్ సేవలు మెచ్చి స్టార్ ఇవ్వాలని చెప్పడంతో.. యష్మి, సీతకు రాయల్ క్లాన్ సభ్యులు స్టార్ ఇచ్చారు. అలానే హోటల్ స్టాఫ్ శారీరక బలం ఏంటో తెలుసుకోవాలని, దానికోసం రాయల్ క్లాన్ పలు పోటీలు నిర్వహించాలని బిగ్బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో తొలుత కప్ప గెంతులు గేమ్ పెట్టారు. యష్మి, ప్రేరణ ఇందులో ఓడిపోయారు. తర్వాత లెమన్ అండ్ స్పూన్ గేమ్ పెట్టగా నబీల్, పృథ్వీ ఔట్ అయిపోయారు.(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)చివరగా ఒంటికాలిపై రెండు చేతుల్లో నీళ్లున్న గ్లాస్ పట్టుకోవాలనే గేమ్ పెట్టగా.. సీత, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ పోటీపడ్డారు. చివరివరకు మణికంఠ, నిఖిల్ గెలిచారు. వీళ్లిద్దరికి.. స్విమ్మింగ్ పూల్ నుంచి స్పూన్స్ తెచ్చే టాస్క్ పెట్టగా మణి పూర్తిగా నిరాశపరిచాడు. నిఖిల్ గెలిచాడు. ఇతడికి స్టార్ ఇచ్చారు. మరోవైపు మణికంఠ గేమ్ కూడా నచ్చడంతో రాయల్ క్లాన్ సభ్యులు ఇతడికి కూడా స్టార్ ఇవ్వడం విశేషం.ఇప్పటివరకు గేమ్స్ మూడ్ ఉన్నది కాస్త లవ్ మూడ్లోకి మారిపోయింది. ఓ చోట సోఫాలో కూర్చుని విష్ణుప్రియ-పృథ్వీ ప్రేమ కబుర్లు చెప్పుకొన్నారు. పృథ్వీ ఒడిలో పడుకుని మరీ విష్ణుప్రియ కబుర్లు చెప్పింది. ఈ డబ్బులు కూడా తీసుకో, కానీ నన్ను ప్రేమించు అని తెగ పోజులు కొట్టింది. పృథ్వీ ఏదో చెప్పబోతుంటే.. నీకు నిజంగా నయని నచ్చిందా అని విష్ణు అడిగింది. కాసేపు సైలెంట్గా ఉన్న పృథ్వీ.. తర్వాత లేదు అని బదులిచ్చాడు.(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)ఇంటిలో నీటి సరఫరా ఆపేసి ఇరు టీమ్స్కి వాటర్ సేకరించే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఓ చోట నుంచి మరో చోటుకి.. కింద అడుగుపెట్టకుండా దిగువన ఉన్న కొన్ని వస్తువులపై మాత్రమే నడుస్తూ గ్లాసుతో నీళ్లు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇరు క్లాన్స్ నుంచి బాగా కష్టపడ్డారు కానీ ఓజీ క్లాన్ సభ్యులే ఇందులో విజయం సాధించారు. దీంతో విజేతకు రూ.25 వేలు ఇచ్చాడు బిగ్బాస్.టాస్క్ పూర్తయిన తర్వాత ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమని బిగ్బాస్ అడిగాడు. కానీ తమ దగ్గర డబ్బులు తక్కువగా ఉండటంతో రాయల్ క్లాన్ సభ్యులకు అనుమానం వచ్చింది. ఓజీ క్లాన్ దగ్గరకు వెళ్లి అడగ్గా.. అవును దొంగతనం చేశానని సీత ఒప్పుకొంది. ఎంత అడిగినా సీత ఇవ్వకపోయేసరికి.. నాగ్ సర్ దగ్గర పంచాయతీ పెడదాం లే అని చాలాసేపు రచ్చ చేశారు. మెగా చీఫ్ నబీల్ వచ్చి సర్ది చెప్పేసరికి ఏమనుకుందో ఏమో గానీ సీత.. తన కొట్టేసిన డబ్బుల్ని తిరిగిచ్చేసింది. అలా రాయల్ క్లాన్ దగ్గర లక్ష 16 వేల 500 రూపాయలు.. ఓజీ క్లాన్ దగ్గర లక్ష 8 వేల 500 రూపాయలు ఉన్నాయి. దీంతో రాయల్ క్లాన్ విజయం సాధించింది. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
మణికంఠ చెల్లి చెప్పిన సంచలన నిజాలు.. చిన్నప్పటి నుంచీ
ప్రస్తుతం తెలుగులో బిగ్బాస్ 8వ సీజన్ టెలికాస్ట్ అవుతుంది. రీసెంట్గానే దాదాపు 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు. అయితే అందరిలో కాస్త విచిత్రమైన క్యారెక్టర్ ఎవరా అంటే చాలామంది చెప్పే పేరు మణికంఠ. ఒక్కో టైంలో ఒక్కోలా ప్రవర్తించే ఇతడికి సపోర్ట్ చేసేవాళ్లు ఉన్నట్లే.. విమర్శించేవాళ్లు కూడా బోలెడుమంది ఉన్నారు. ఇప్పుడు మరిన్ని నిజాలని మణికంఠ చెల్లి కావ్య బయటపెట్టింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్.. అమ్మాయిని గర్భవతి చేశాడు: పూనమ్ కౌర్)అనవసరంగా బిగ్బాస్ షోకి వెళ్లి ఫ్యామిలీ విషయాలన్నీ రోడ్డు మీద పెట్టేశాడని అనుకున్నారా? అని యాంకర్ అడగ్గా.. 'అవును ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే చెప్పాకుండా ఉండాల్సింది కదా అనిపించింది. రీసెంట్గా నాకు నిశ్చితార్థం జరిగింది. మా అత్తయ్య వాళ్ల ఫ్యామిలీకి కూడా కాల్స్ రావడం, వాళ్ల బంధువులు ఫోన్ చేసి.. ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎందుకు అమ్మాయిని తెచ్చుకున్నారని అని అందరూ అడగడం మొదలుపెట్టారు''అంత లో క్లాస్ అయినప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు ఇలాంటి అమ్మాయిని మా అత్తమ్మని అడిగారు. కానీ ఆమెకు నా గురించి ముందే తెలుసు కాబట్టి మాకు లేని ప్రాబ్లమ్ మీకేంటి అని వాళ్లని అడిగి, నాకు సపోర్ట్గా నిలిచింది. ఈ విషయంలో ఆమె చాలా గ్రేట్' అని మణికంఠ చెల్లి కావ్య చెప్పింది.(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)'చిన్నప్పటి నుంచి వాడు(మణికంఠ) అంతే. నాదే, నా ఒక్కడితే బాధ అని అనుకుంటాడు. పక్కనోళ్లు బాధ గురించి వాడికి సంబంధం లేదు. ఇవన్నీ పక్కనబెడితే వాడు గెలిచి రావాలి. ఎందుకంటే వెళ్లిందే దానికోసం. మేమందరం ఇన్ని అవమానాలు తీసుకున్నాం. ఎందుకంటే వాడు గెలిచి వస్తాడనే కదా. బయటనే కాదు హౌసులో కూడా చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు' అని మణికంఠ చెల్లెలు తన ఆవేదన బయటపెట్టింది.మణికంఠ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో.. ఇతడి తల్లి రెండో పెళ్లి చేసుకుంది. సవతి తండ్రి వల్ల.. అలానే పెళ్లయి, పాప పుట్టిన తర్వాత భార్య తనకు విడాకులు ఇచ్చిందని.. ఈ రెండింటి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డాడని బిగ్బాస్ షోలో చెప్పాడు. ఇది విని బాధపడే వాళ్లు కొందరైతే. సింపతీ గేమ్ ఆడుతున్నాడని ట్రోల్ చేసేవాళ్లు లేకపోలేదు. దీని వల్ల మణికంఠనే కాదు ఇతడి తీరు వల్ల బయట ఉన్న చెల్లి, భార్య కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది.(ఇదీ చదవండి: 'బిగ్బాస్' గేమ్ కాదు ట్రామా?) -
'బిగ్బాస్' గేమ్ కాదు ట్రామా?
బిగ్బాస్ షోని ఇష్టపడి చూసేవాళ్లు కొందరైతే. ఇదో దిక్కుమాలిన ప్రోగ్రాం అని తిట్టేవాళ్లు మరికొందరు! మంచి-చెడు అనే చర్చ పక్కనబెడితే ఈ షోలో గెలిస్తే లక్షల రూపాయలు డబ్బు, ఊహించని ఫేమ్ వస్తాయని అందరికీ తెలుసు. కానీ ఇదే షో వల్ల కంటెస్టెంట్స్ మానసికంగా ఎంతలా ఇబ్బంది పడుతున్నారో ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు తొలిసారి ఒకామె నోరు విప్పింది. ఎవరికీ తెలియని చీకటి కోణాన్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)ప్రస్తుతం తెలుగులో బిగ్బాస్ 8వ సీజన్ నడుస్తోంది. ఈసారి 14 మందిని తీసుకొస్తే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగా ఎంటర్టైన్ చేయలేకపోయారు. దీంతో గత కొన్ని సీజన్లలో పాల్గొన్న గంగవ్వ, అవినాష్, రోహిణి, హరితేజ, టేస్టీ తేజ, మెహబూబ్, నయని పావని తదితరుల్ని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పేరిట హౌసులోకి తీసుకొచ్చారు. ముందు ముందు వీళ్లు ఏం చేస్తారో చూడాలి?అసలు పాయింట్కి వస్తే మంగళవారం (అక్టోబరు 09) ఎపిసోడ్ చివరలో నయన పావని.. ఈ షో వల్ల తాను ఎంత ట్రామాకు గురయ్యాననేది బయటపెట్టింది. అందరితో సరదాగా కూర్చుని మాట్లాడుతున్న టైంలో నయని పావనిని గత సీజన్ ఎలిమినేషన్ గురించి సీత అడిగింది. క్యాజువల్ సంభాషణ కాస్త.. నిన్ను బయట బండబూతులు తిట్టారు అని తేజ ఈమెతో అనేసరికి ఒక్కసారి సీరియస్ అయింది.తేజ కాస్త హర్ష్గా అనేసిన 'బండబూతులు' పదం నయని పావనికి ఎక్కడో తగలరాని చోట తగిలేసింది. దీంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. 'అలా ఎలా అంటాడు. అంత రూడ్గా మాట్లాడాడు. ఒక్కసారిగా నా పైకి వచ్చి పడినట్లు మాట్లాడాడు. సంవత్సరం పాటు ఆ ట్రామా ఫేస్ చేశాను. అంతకుముందే మా నాన్న చనిపోయారు. తను అలా అనేసరికి అదంతా ఒక్కసారిగా ఫ్లాష్ అయింది. ఇప్పుడు బండ బూతులు తిట్టారని ఎలా అన్నాడు. మరి అలాంటప్పుడు నేను ఎలిమినేట్ అయినప్పుడు ఎందుకు ఏడ్చాడు' అని కన్నీళ్లు పెట్టుకుంది.నయని చెప్పిన దానిబట్టి చూస్తే వారం ఉండి ఎలిమినేట్ అయిన దానికే ఇంత బాధపడిందా అనిపించింది. ఒక్క వారానికే ఇలా అయిపోతే ఎక్కువ వారాలు ఉండి ఎలిమినేట్ అయిన వాళ్ల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతారు. కానీ ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి అనే ముసుగులో కంటెస్టెంట్స్ ఎంతలా మానసిక సంఘర్షణకు లోనవుతున్నారనేది ఎవరు చెప్పరే?అంతెందుకు ఇదే బిగ్బాస్ షోలో పాల్గొని అవకాశాలు, ఫేమ్ తెచ్చుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటే. అలాంటివి ఏం రాక కనుమరుగైన వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్ల మనోగతాన్ని బయటకు తీస్తే నయని పావని కంటే ఎక్కువ కన్నీళ్లు వస్తాయేమో?(ఇదీ చదవండి: 'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం)Veedini ekamga PAALERU ani Pilichaaru.. anni marichipoyi.. #NayaniPavani ni antunnadu..Rey.. nuvvu anni weeks unnaa.. Shobha ki chesina oodigam tho negativity techukunnaav... #Nayani one week eh undhi kani positivity tho vellindhi.. #BiggBossTelugu8 pic.twitter.com/20ab6DuneR— BigBoss Telugu Views (@BBTeluguViews) October 8, 2024 -
నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని
ఈ సీజన్లో నామినేషన్స్ మరీ సప్పగా సాగేవి. కేవలం ఒక్కరోజులో పూర్తయిపోయేవి. అలాంటిది ఈ వారం మంగళవారం కూడా సాగింది. మరోవైపు డాక్టర్ బాబు గౌతమ్ ప్రతి దానిలో దూరుతున్నాడని నబీల్ ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్లో జరిగిన ఓ పని వల్ల టేస్టీ తేజ, నయని పావని మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇంతకీ 37వ రోజు బిగ్బాస్ హౌసులో ఏం జరిగింది? అనేది హైలైట్స్లో చూద్దాం.(ఇదీ చదవండి: కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్)యష్మికి రోహిణి కౌంటర్స్యష్మిని రోహిణి నామినేట్ చేయడంతో ఈ రోజు ఎపిసోడ్ మొదలైంది. మెగా చీఫ్ టాస్క్లో నబీల్-పృథ్వీ ఆడుతున్న టైంలో సంచాలక్ ప్రేరణని తప్పు చేయమనే అర్థమొచ్చేలా పదేపదే చెప్పడం తనకు నచ్చలేదని రోహిణి కారణం చెప్పింది. యష్మి దీనికి ఎంతకీ ఒప్పుకోలేదు. రోహిణి కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్స్ వేసింది. అలానే మొదటితో పోలిస్తే విష్ణుప్రియ ఆట తగ్గిపోయిందని గ్రాఫ్ పెంచుకోమని చెప్పి రోహిణి ఈమెని నామినేట్ చేసింది.అలిగిన గంగవ్వరోహిణి తర్వాత గంగవ్వ వచ్చింది. గేమ్ ఆడట్లేదు, కాళ్లు చేతులు సక్కగా లేవా? ఉన్నా మరెందుకు ఆడట్లే, ఉత్తిగనే కూసుంటున్నావ్ అని చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఇక హౌసులోకి వచ్చిన తర్వాత తమ ఎనిమిది మందిని అస్సలు పలకరించట్లేదని, కనీసం టీ కూడా ఇవ్వలేదని చెప్పి యష్మిని నామినేట్ చేసింది. తెలంగాణ స్లాంగ్లో గంగవ్వ చెప్పిన మాటలు తొలుత యష్మికి అర్థం కాలేదు. నయని చెప్పడంతో అర్థం చేసుకుంది. ఈసారి రోజూ మాట్లాడతా, చాక్లెట్ కూడా షేర్ చేసుకుంటానని యష్మి చెప్పింది.(ఇదీ చదవండి: సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)కొత్తోళ్లు నామినేషన్స్లో ఎందుకు?చివరగా వచ్చిన అవినాష్.. పృథ్వీ, యష్మిని నామినేట్ చేశాడు. ప్రభావిత టాస్క్లో ఆడవాళ్లతో కాస్త హర్ష్గా ప్రవర్తించాడని, అలానే గేమ్ కనిపించట్లేదనే కారణంతో పృథ్వీకి కారణాలు చెప్పుకొచ్చాడు. ఇక కన్ఫెషన్ రూంలో మణికంఠకి ఫుడ్ ఇచ్చేసి ఉంటే బయటకొచ్చి అతడిని ఓదార్చే అవసరముండేది కాదు కదా అని యష్మిని నామినేట్ చేశాడు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ నుంచి కూడా ఇద్దరిని నామినేట్ చేయాలని, వాళ్లిద్దరూ ఎవరూ ఓజీ క్లాన్ (హౌసులోని పాతోళ్లు) నిర్ణయించాలని అన్నాడు. అన్ని చర్చల తర్వాత మెహబూబ్, గంగవ్వని నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. హౌసులోకి వచ్చిన ఒక్కరోజులోనే వీళ్లని నామినేట్ చేయాలని ఎలా డిసైడ్ చేస్తారు? అనేది అర్థం కాలేదు.ఉప్పు ప్యాకెట్ రూ.50 వేలుఓవరాల్గా ఈ వారం పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, సీత, మెహబూబ్, గంగవ్వ నామినేషన్స్లో ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత రేషన్ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఇంట్లోని రేషన్ అంతా బిగ్బాస్కి ఇచ్చేయాలని అన్నాడు. బిగ్బాస్ మార్కెట్ ఉంటుందని, బజర్ మోగి, ఆగేలోపు ఎంత తీసుకొస్తే ఆ రేషన్ని ఇరు క్లాన్స్ పంచుకోవాలని బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. నబీల్-నిఖిల్ అన్నీ తెచ్చారు కానీ ఉప్పు ప్యాకెట్ తీసుకురావడం మర్చిపోయారు. చివరకు బిగ్బాస్ని ప్రాధేయపడితే ప్రైజ్మనీలో నుంచి రూ.50 వేలు తగ్గించుకుని సాల్ట్ ప్యాకెట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: 'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం)గౌతమ్ తీరుపై నబీల్ అసహనంఏదైనా అనౌన్స్మెంట్ మెగా చీఫ్గా తనకు బాధ్యత ఉందని, కానీ గౌతమ్ కృష్ణ ప్రతిసారీ వచ్చి తన చేతిలో పేపర్ లాగేసుకుని మరీ చదువుతున్నాడని నబీల్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నానని తన క్లాన్ సభ్యులతో అన్నాడు. అంటే వచ్చే వారం ఇదే కారణం చెప్పి గౌతమ్ని నబీల్ నామినేట్ చేయడం గ్యారంటీ.నోరు జారిన టేస్టీ తేజబయట లాన్లో అందరూ కూర్చున్న టైంలో అవినాష్, మెహబూబ్.. నయని పావనిని గత సీజన్లో నామినేట్ చేయడం గురించి మాట్లాడుకున్నారు. ఈసారి వైల్డ్ కార్డ్గా వచ్చిన తేజ కూడా తనని నామినేట్ చేశాడని నయని చెప్పింది. దీంతో దగ్గర్లో ఉన్న తేజ.. నామినేషన్ విషయంలో నిన్నే బండ బూతులు తిట్టారని, కావాలంటే బయటకెళ్లిన తర్వాత చూస్కో అని నోరు జారాడు. దీంతో నయని పావని వెక్కి వెక్కి ఏడ్చింది. చివరకు ఆమె దగ్గరకెళ్లి సారీ చెప్పాడు. నీకు ఎందుకురా అంత నోటి దూల అని తనని తానే తిట్టుకున్నాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.(ఇదీ చదవండి: సమంత-త్రివిక్రమ్తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) -
Bigg Boss 8: పాపం.. వచ్చిన 24 గంటల్లోనే ఎలిమినేట్
ఇప్పటికే బిగ్బాస్ 8 తెలుగులో మొదలైపోయింది. ఐదు వారాలు గడిచిపోయాయి. వచ్చిన కంటెస్టెంట్స్లో పసలేకపోయేసరికి వైల్డ్ కార్డ్స్ పేరిట మరో ఎనిమిది మందిని తీసుకొచ్చారు. దీని సంగతి పక్కనబెడితే తమిళంలోనే తాజాగా (అక్టోబర్ 6) బిగ్బాస్ 8వ సీజన్ మొదలైంది. ఈసారి విజయ్ సేతుపతి హోస్ట్. అయితే వచ్చిన 24 గంటల్లోనే ఎలిమినేషన్ అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.తమిళం గత సీజన్ వరకు కమల్హాసన్ హోస్ట్గా ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈసారి తప్పుకొన్నాడు. దీంతో విజయ్ సేతుపతి కొత్త హోస్ట్గా ఎంట్రీ ఇచ్చాడు. షో మొదలై ఒకరోజే అయింది కాబట్టి ఇప్పుడే హోస్టింగ్ గురించి ఇంకా ఏం చెప్పలేం. కానీ ఈసారి షో మొదలైన 24 గంటల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పి బాంబ్ పేల్చాడు.(ఇదీ చదవండి: చిచ్చు పెట్టిన బిగ్బాస్.. ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు?)తాజాగా తమిళ బిగ్ బాస్ తొలిరోజు ప్రోమోలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది చూపించారు. 'మహారాజ' సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన సచన అనే అమ్మాయి ఈసారి హౌసులోకి వచ్చింది. ఆమెనే ఇప్పుడు ఎలిమినేట్ చేసినట్లు చూపించారు. కనీసం వారమైనా అయితే కదా ఎవరు ఎలా ఫెర్ఫార్మ్ చేశారు? ఎలిమినేట్ చేయడానికి కారణాలైనా కనిపిస్తాయి. ఇలాంటివి ఏం లేకుండా ఈ ఎలిమినేషన్ ఎందుకో? బిగ్బాస్ తలతిక్క నిర్ణయం వెనక మరేదైనా మతలబు ఉందా అనేది చూడాలి?ఇక తమిళ బిగ్బాస్ 8లోకి వచ్చిన వాళ్లలో నటి మహాలక్షి భర్త రవీందర్ ఒకడు. రెండేళ్ల క్రితం వీళ్ల పెళ్లి సెన్సేషన్ అయిపోయింది. ఇతడితో పాటు దర్శ గుప్తా, సత్య, దీపక్, ఆర్జే అనంతి, సునీతో గోగోయ్, జెఫ్రీ, రంజిత్, పవిత్ర జనని, సౌందర్య, అరుణ్ ప్రసాద్, తర్షిక, వీజే విశాల్, అన్షిదా, అర్ణవ్, ముత్తుకుమార, జాక్వెలిన్ హౌసులోకి వచ్చారు. వీళ్లలో చాలామంది టీవీ నటులే ఉండటం విశేషం.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి) -
బిగ్బాస్ సీజన్-8.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీళ్లే (ఫొటోలు)
-
చిచ్చు పెట్టిన బిగ్బాస్.. ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు?
బిగ్బాస్ 8లో చాన్నాళ్లకు కాస్త కళ కనిపిస్తోంది. కొత్తగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చారు. కాసేపు కామెడీ చేసి నవ్వుకున్నారు. కానీ ఇంతలోనే నామినేషన్స్ పుల్ల పెట్టేశాడు. దీంతో కొత్త వర్సెస్ పాత అన్నట్లు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వచ్చేసింది.ఇకపోతే వ్యక్తి వ్యక్తికి రూల్స్ మారుతున్నాయని చెప్పి హరితేజ.. యష్మిని నామినేట్ చేసింది. తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తానని యష్మి సమాధానమిచ్చింది. మీకు ఇష్టం లేదు అన్నచోట వేరే రూల్ అప్లై అవుతుందని హరితేజ చెప్పగా.. నా గేమ్, నాకు ఎవరు డిస్ట్రబింగ్గా ఉన్నారో వాళ్లని కదా చెయ్యాలి అని యష్మి కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరీ మాట్లాడుతున్నట్లు అనిపించింది. పృథ్వీని కూడా నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి)అయితే ఈ నామినేషన్ని నేను అంగీకరించను అని పృథ్వీ అనేరికి.. ఈ నామినేషన్ని నేను అంగీకరించాను. ఎందుకంటే ఇది నా ఓపీనియన్ అని హరితేజ గట్టిగానే ఇచ్చేసింది.ఇక గౌతమ్ కృష్మ.. విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నీ గేమ్ పక్కనబెడ్డి వేరే వ్యక్తి మీద దృష్టి పెట్టినట్లు అనిపిస్తుందని గౌతమ్ కృష్ణ కారణం చెప్పాడు. నేనేంటి, నేనేం ఫీలయ్యాను, నా ఎమోషన్స్ ఏంటి అనేదే నేను చూపిస్తానని విష్ణు ఆన్సర్ చెప్పింది. నయని పావని కూడా ఈమెనే నామినేట్ చేసింది. సీరియస్నెస్ అస్సలు లేదనిపిస్తోందని రీజన్ చెప్పింది.(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఐదవ వారం విశ్లేషణ...'పాత బొమ్మలతో కొత్త పోస్టర్')షోని అర్థం చేసుకోవడానికే టైమ్ కావాలని విష్ణుప్రియ చెప్పగా.. బిగ్బాస్ ఉండేది 15 వారాలే కదా అని నయని పావని సైలెంట్గా కౌంటర్ వేసింది. దీంతో విష్ణుప్రియ నోరు మూసేసుకుంది. అలానే ఎమోషన్స్ అంటే కేవలం ఏడుపు కాదు కదా అని నయని పావని.. సీతని నామినేట్ చేసింది.యష్మి, విష్ణు, గంగవ్వ, సీత, పృథ్వీ, మెహబూబ్.. ఈసారి నామినేషన్స్లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పటికీ కచ్చితంగా ఇద్దరూ లిస్టులో ఉండాలని బిగ్బాస్ చెప్పడంతో మెహబూబ్, గంగవ్వ వచ్చారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?(ఇదీ చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!) -
జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి
బిగ్బాస్ 8 తెలుగు షోలో కాస్త జోష్ వచ్చినట్లు కనిపించింది. కొత్తగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ పేరిట ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు గతవారం మిడ్ వీక్ ఆదిత్య ఎలిమినేట్ కాగా.. ఆదివారం ఎపిసోడ్లో నైనిక ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈమె తల్లికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అవుతుంది. అందులో జానీ మాస్టర్ ప్రస్తావన రావడమే కాస్త ఆసక్తికరంగా అనిపించింది.(ఇదీ చదవండి: బెయిల్ విషయంలో జానీ మాస్టర్కు షాకిచ్చిన పోలీసులు)ఢీ షోలో డ్యాన్సర్గా కాస్త గుర్తింపు తెచ్చుకున్న నైనిక.. గత కొన్నాళ్లు నుంచి మాత్రం నటిగా అవకాశాలు వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్బాస్ 8లో ఓ కంటెస్టెంట్గా వచ్చింది. కానీ పట్టుమని ఐదు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది.గతంలో ఢీ డ్యాన్స్ షో తర్వాత గణేశ్ మాస్టర్, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశాలు వచ్చాయని తాను పంపించలేదని నైనిక తల్లి చెప్పింది. జానీ మాస్టర్ దగ్గరకు అయితే వద్దని శశి మాస్టర్ తమతో చెప్పాడని అన్నారు. రీసెంట్గా తన అసిస్టెంట్ని వేధించారనే ఆరోపణలతో జానీ అరెస్ట్ అయ్యారు. దీంతో నైనిక తల్లి కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!) -
బిగ్బాస్ 8 రీలోడ్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ.. వాటే ట్విస్ట్
గత ఏడు సీజన్లకంటే కూడా ఈసారి బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు అత్యధిక టీఆర్పీ వచ్చింది. కానీ కంటెస్టెంట్లు ఆ రేటింగ్ను అలాగే కాపాడుకోలేకపోయారు. నెమ్మదిగా షో బోరింగ్గా మారుతుండటంతో బిగ్బాస్ ఇక లాభం లేదనుకుని పాత సీజన్లలో పాల్గొన్న పలువురినే వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట హౌసులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం.. 'బిగ్బాస్ గ్రాండ్ రీలోడ్' పేరిట ఎపిసోడ్ ప్రసారమైంది. ఇంతకీ హౌస్లోకి వచ్చిందెవరో చూసేయండి..నైనిక ఎలిమినేట్'జవాన్' టైటిల్ సాంగ్, 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్గా రిలీజైన 'రా మచ్చా' పాటలకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఎలా ఎదుర్కోబోతున్నారో ఎదుర్కోబోతున్నారని హౌస్మేట్స్ను అడగ్గా వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరున ఏడ్చేసింది.ఎవరికి ఏ ట్యాగ్?స్టేజీపైకి వచ్చిన నైనికని హౌసులో ఎవరు ఎలాంటి వారనేది నాగ్ అడగ్గా.. ప్రేరణ మ్యానిప్యులేటర్, మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి, విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు, పృథ్వీ అటెన్షన్ సీకర్, నబీల్ అవకాశవాది, సీత నిజమైన ఫ్రెండ్, నిఖిల్ గేమ్ ఛేంజర్, యష్మిది మంద బుద్ధి అని చెప్పుకొచ్చింది.ఉత్తరాలు వచ్చాయ్..ఈ వారం హౌస్మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్, యష్మి, మణికంఠ తమ లెటర్స్ అందుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్) టీమ్గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్గా ఉంటాయని నాగ్ వెల్లడించాడు.. తొలి వైల్డ్ కార్డ్గా హరితేజసీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్బాస్ మొదటి సీజన్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్గానూ అవతారమెత్తింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. తనకు నవదీప్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపించారు. అలానే హౌసులోకి వెళ్లేముందు స్టేజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.రెండో వైల్డ్ కార్డ్గా టేస్టీ తేజతేజ అసలు పేరు తేజ్దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ చేసిన పాల తాళికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు. అలానే తేజకి శోభాశెట్టి బెస్ట్ విషెస్ చెప్పింది.మరో రూ.20 లక్షలుసెట్పైకి వచ్చిన స్వాగ్ టీమ్ (శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్) తన సినిమా కబుర్లు చెప్పింది .తర్వాత హౌస్లోకి వెళ్లి హౌస్మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్తో గేమ్ ఆడించారు. ఈ గేమ్లో వైల్డ్కార్డ్ కంటెస్టెంట్లు హరి-తేజ గెలిచి రూ.20 లక్షలు ప్రైజ్మనీలో యాడ్ చేశారు. అనంతరం మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా నయని పావని హౌస్లో అడుగుపెట్టింది.మూడో వైల్డ్ కార్డ్గా నయని పావనిఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్టాక్ స్టార్గా ఫేమస్. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక శివాజీ.. నయనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.నాలుగో వైల్డ్ కార్డ్గా మెహబూబ్డ్యాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. ఇక మెహబూబ్ కోసం సొహైల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలానే నాలుగో సీజన్లో ఎలా అయితే ఆడావో ఈసారి అంతకు మించి ఆడి గెలవాలన్నాడు.'జనక అయితే గనక' మూవీ ప్రమోషన్లో భాగంగా సుహాస్, దిల్ రాజ్ టీమ్ వచ్చారు. సుహాస్, హీరోయిన్ సంగీర్తన హౌసులోకి వెళ్లి ఓజీ, రాయల్ టీమ్స్తో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచిన సీత-మణికంఠ.. బెడ్ రూమ్, రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.ఐదో వైల్డ్ కార్డ్గా రోహిణిఒకప్పుడు సీరియల్స్లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్సిరీస్లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. తన కామెడీ టైమింగ్స్తో అందరికీ వినోదాన్ని పంచుతోంది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపిస్తోంది. బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంది.ఆరో వైల్డ్ కార్డ్గా గౌతమ్ కృష్ణగౌతమ్ కృష్ణ.. బిగ్బాస్కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్బాస్ ఏడో సీజన్తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్లోనూ సిద్దూ: ది రాక్స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్కు వెళ్లాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చాడు.ఏడో వైల్డ్ కార్డ్గా అవినాష్ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్బాస్కు వెళ్లాడు. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్లో ఉండి ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్బాస్ 8లో వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలానే స్టేజీపై మణికంఠ, నబీల్, విష్ణుప్రియలా యాక్ట్ చేసి నవ్వించాడు.ఎనిమిదో వైల్డ్ కార్డ్గా గంగవ్వవయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది. స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్బాస్ 8లోకి వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.రాయల్ టీమ్కు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ టీమ్కు చివరగా మరో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ ఆడారు. ఓజీ టీమ్పై వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికంఠపై రెచ్చిపోయిన ఆదిత్య.. దగ్గరుంటే కొట్టేసేవాడేమో!
బిగ్బాస్ 8 మరీ చప్పగా సాగుతోంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓంని బయటకు పంపేశారు. ఆదివారం కూడా నైనిక ఎలిమినేట్ కాబోతుందని చెబుతున్నారు. అలానే 'రీలోడెడ్' పేరుతో స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ కానుంది. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఆదివారమే ఉన్నాయి.సరే ఇదంతా పక్కనబెడితే వారం మధ్యలో ఎలిమినేట్ అయి బయటకొచ్చిన ఆదిత్యని బిగ్బాస్ బజ్ కోసం అర్జున్ ఇంటర్వ్యూ చేశాడు. పలు విషయాల్ని చర్చించుకున్నారు. హౌస్లో ఉన్న నాలుగు వారాల జర్నీ గురించి ఏం చెబుతారని ఆదిత్యని అడగ్గా.. అది పెద్ద సైకాలజీ, మెంటల్ టెస్ట్ అని చెప్పుకొచ్చాడు. మరి అందులో పాసయ్యారా అంటే సమాధానం చెప్పలేకపోయిన ఆదిత్య నవ్వి తప్పించుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్కి బాబు లాంటి సినిమా)ఇక హౌస్లో గొడవల గురించి కూడా మాట్లాడిన ఆదిత్య.. కావాలని గొడవ పడుతున్న వాళ్లు, యాక్ట్ చేస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారని చెప్పుకొచ్చాడు. గొడవలు పడే కంటెంటే ముఖ్యమని వాళ్లు అనుకుంటున్నారని ఆదిత్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక మణికంఠపై ఫుల్ ఫైర్ అయిపోయాడు. మనిషివా జంతువువా అని పట్టరాని కోపాన్ని ప్రదర్శించాడు.'మణికంఠ.. అసలు నువ్వు మనిషివా జంతువా? ఎన్నిసార్లు మీ దగ్గరు వచ్చి చెప్పాను మీకు, కరెక్ట్ సలహా ఇచ్చాను. కానీ ప్రతిసారీ నేను ఇచ్చిన సలహా సరిగా తీసుకోలేదు. ఎప్పుడు నేర్చుకుంటారు లైఫ్లో? అసలు బుర్ర ఉందా మీకు?' అని ఆదిత్య తెగ ఫైర్ అయిపోయాడు. ఒకవేళ మణికంఠ దగ్గరుంటే కొట్టేసేవాడేమో అన్నంతగా ఆవేశపడిపోయాడు.(ఇదీ చదవండి: ‘బిగ్బాస్’ ఫేం శుభశ్రీకి యాక్సిడెంట్.. తుక్కుతుక్కైన కారు) -
Bigg Boss 8 : మాజీలతో మసాలా వర్కౌట్ అయ్యేనా?
ఈ వారం హౌస్లోని కంటెస్టెంట్ల మనసులో ఉన్న ముసుగులను తొలగించడానికి ఫోమ్ని నామినేషన్ పర్వంలో వాడాడు బిగ్ బాస్. ఏ నురగైనా కరిగితే అసలు పదార్థం బయట పడుతుందన్నట్టు ఈ ఫోమ్ ఉపయోగించిన తరువాత కంటెస్టెంట్ల అసలు రంగులు చాలానే బయటపడ్డాయని చెప్పవచ్చు. ఆ రంగులు బయటకు రాగానే ఆట మళ్లీ ఫామ్లోకి వచ్చింది. యథావిధిగా నామినేషన్లో వాడి వేడి రచ్చతో పాటు ఈ వారం క్లాన్ల మధ్య పోటీగా నిర్వహించిన వినూత్న బెలూన్ కాంటెస్ట్ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. (చదవండి: కాలేజీలో మోసపోయానన్న యష్మి.. కన్నింగ్, సెల్ఫిష్ 'మణికంఠ' ఏడుపు)ఒక్క నామినేషన్లో తప్ప మిగతా రోజులంతా కంటెస్టెంట్లు ఆనందంగా కనిపించారు. కానీ వారి ఆనందాన్ని ఎక్కువ సేపు బిగ్ బాస్ తట్టుకోలేకపోయాడు. అంతే బెలూన్ కాంటెస్ట్ ముందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని బాంబు పేల్చాడు. దాంతో ఇంకేముంది... ఓ పక్క తమను తాము కాపాడుకుంటూ వైల్డ్ కార్డ్స్ని హౌస్లోకి రానివ్వకుండా బిగ్ బాస్ పెట్టే ఆటలన్నీ ప్రాణం పెట్టి ఆడుతున్నారు ప్రస్తుత కంటెస్టెంట్స్. ఇక ఇదంతా ఒక ఎత్తయితే గత వారం ఊహించని ఎలిమినేషన్ సోనియా. కాకపోతే ఈ సోనియాని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదు... హౌస్లోని కంటెస్టెంట్స్ చేయడం విశేషం. ముఖ్యంగా కంటెస్టెంట్స్లోని మిగతా లేడీ పార్టిసిపెంట్స్ సోనియాని వద్దనుకోవడం విడ్డూరం. ఎలిమినేట్ అయిన తరువాత ఈ విషయాన్ని నాగార్జునతో సోనియా బాహాటంగానే అందరి ముందు చెప్పింది. (చదవండి: విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల)కండబలం ఉన్నవారికి గుండెబలం తక్కువ ఉంటుందన్న విషయాన్ని నిరూపించాడు నిఖిల్. సోనియా ఎలిమినేట్ అవ్వగానే ఒక్కసారిగా భోరుమన్నాడు హౌస్లోనే బలవంతుడైన నిఖిల్. పృథ్వీ కూడా నిఖిల్తో జత కలిశాడు. ఆఖరికి ఇద్దరికిద్దరూ ఓ అమ్మాయి కోసం ఏడవడం ప్రేక్షకులకు కాస్త నవ్వు తెప్పించి ఉండవచ్చు. ఈ వారం చివర్లో కూడా నాగార్జున ప్రేక్షకులకు ఓ ఝలక్ ఇచ్చి ముగించారు. వారం మధ్యలో ఒక ఎలిమినేషన్ ఉంటుంది అని ప్రకటించారు. చెప్పినట్లుగానే మిడ్ వీక్లో ఆదిత్యను ఎలిమినేట్ చేశాడు. ఇక ఇప్పుడు హౌస్లో ఉన్నవాళ్ల దగ్గర నుండి ఎక్కువ మసాలా రావట్లేదని అనుకున్నాడో ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేరిట ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపడానికి రెడీ అయ్యాడు బిగ్ బాస్. మరి ఈ మాజీలతో మసాల వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
బిగ్బాస్ 8లో వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా దివి? బ్యూటీ ఏమందంటే?
-
మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి
బిగ్బాస్ 8లో ఐదో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్యని ఇంటికి పంపించేశారు. ఆదివారం ఎవరిని పంపిస్తారో చూడాలి. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట దాదాపు ఎనిమిది హౌసులోకి రాబోతున్నారు. ఇలా సందడిగా ఉంది. శనివారం కావడంతో నాగార్జున వచ్చేశాడు. హౌస్మేట్స్కి ఓ వైపు ప్రశంసలు, మరోవైపు వార్నింగ్లు ఇచ్చాడు. మణికంఠని అయితే పూర్తిగా గాలి తీసేశాడని చెప్పాలి.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో భాగంగా సీత, నైనిక తప్పుల గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడాడు. వీళ్ల తర్వాత మణికంఠతో ముచ్చటించాడు. సీత బాడీ లాంగ్వేజ్లో నీకు సమస్య ఏంటి? అని అడగ్గా.. తను వెక్కిరించినట్లు అనిపించిందని మణికంఠ అన్నాడు. మధ్యలో మాట్లాడిన సీత.. మణినే తమందరినీ కార్నర్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. దీని తర్వాత నాగార్జు, మణికంఠని యాక్షన్ రూమ్లోకి రమ్మన్నాడు.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లి పేరుతో అందరినీ ఫూల్ చేసిన నటి వనిత)మణికంఠ.. నీకు 8 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను, నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో అంత ఏడ్చేసేయ్ అని నాగ్ చెప్పాడు. ఆల్మోస్ట్ అయిపోయింది సర్ అని మణి ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో మాట్లాడిన నాగ్.. ఒకవేళ కన్నా నా దగ్గరికి రావొద్దు, అక్కడే ఉండిపో అని ప్రియ చెప్పిందనుకో అని నాగ్ అనగానే.. నాకు భయమేస్తుంది సర్ అని భార్య గుర్తొచ్చి మణికంఠ ఏడుపు మొదలుపెట్టాడు.నీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి కూడా ఉందని నాగ్ బాంబు పేల్చాడు. ఏడవటం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు. హౌస్ అందరికీ తెలుసు అని మణికంఠ గాలి మొత్తం తీసేశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఎమోషన్ చూపిస్తూ, ఏడుస్తూ హౌస్లో ఉండిపోవాలనేది మణికంఠ ప్లాన్. దీన్నే ఇప్పుడు నాగార్జున బయటపెట్టాడా అనిపించింది. అలానే ఇకపై ఏడిస్తే కుదరదు అని స్మూత్ వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది.(ఇదీ చదవండి: మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్) -
సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు
బిగ్బాస్ 8లో ఐదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఈసారి నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబీల్ లిస్టులో ఉన్నారు. తాజాగా మంగళవారం ఎపిసోడ్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకునేందుకు బిగ్బాస్ మరికొన్ని గేమ్స్ పెట్టాడు. పోటీల సంగతేమో గానీ యష్మి ఓవరాక్షన్ మాత్రం తట్టుకోలేకపోతున్నాం. నబీల్, మణికంఠ గురించి ఆమె చేసిన కామెంట్స్ అయితే సోనియాని గుర్తుచేస్తున్నాయి. ఇంతకీ మంగళవారం (అక్టోబరు 01) ఎపిసోడ్లో ఏం జరిగింది?మణికంఠ చాలా డేంజరస్నామినేషన్స్ తర్వాత యష్మి-ప్రేరణ మాట్లాడటంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మణికంఠ, ఆదిత్యలో ఎవరికైనా ఈ వారం బయటకెళ్లడానికి టైమ్ వచ్చిందని అనుకుంటున్నావా అని ప్రేరణ, యష్మిని అడిగింది. అమ్మా వెళ్లాలిరా మణి.. ఇలాంటోళ్లు అసలు ఎన్ని వీక్స్ ఉంటారు. ఇది ఐదోవారం అయినా ఇంకా ఉన్నాను. ఎదుటివాళ్ల ఎమోషన్స్తో ఆడుకుంటూ, నమ్మించి మోసం చేయడం.. ఇదే గేమ్ రా.. ఆయన్ని చూస్తుంటేనే నాకు కోపం వస్తోంది అని యష్మి తెగ రెచ్చిపోయింది. నువ్వు వాడిని గ్రేట్ ఫ్రెండ్ అన్నావారా అని ప్రేరణ అడగ్గా.. ఫ్రెండ్ అని పాపం నమ్మాను. నాలాగే బ్యాడ్ స్టోరీ ఉందని సపోర్ట్ చేయాలని చూశా. కానీ చాలా డేంజరస్, క్రిమినల్ ఫేస్ ఉందని అనుకోలేదు అని యష్మి లోపలున్నదంతా బయటకు కక్కేసింది.గేమ్స్ షురూమంగళవారం నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకునేందుకు 'తాళం విడిపించు.. టైంని నడిపించు', 'జాగ్రత్తగా నడువు లేకపోతే పడతావ్', 'రోల్ బేబీ రోల్' అని మూడు గేమ్స్ పెట్టారు. స్విమ్మింగ్ పూల్లో తాళం విడిపించి టైర్లు తీయాలని పెట్టిన తొలి గేమ్లో విష్ణుప్రియ, నిఖిల్ పోటీ పడ్డారు. కానీ టైంలోపు పూర్తి చేయలేకపోయారు. రెండో గేమ్లో మణికంఠ, యష్మి తలపడ్డారు. ఇందులో గెలిచేసరికి యష్మి తెగ ఓవరాక్షన్ చేసింది. మూడో పోటీలో నబీల్, ఆదిత్య పోటీ పడగా.. ఆదిత్యనే విజయం వరించింది. అలా శక్తి క్లాన్ రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఆపేసింది.నబీల్ బక్వాస్ గేమ్మూడో గేమ్లో నబీల్ ఓడిపోయిన తర్వాత యష్మి అతడి గురించి నోటికొచ్చినట్లు మాట్లేడేసింది. 'గేమ్ అనగానే పరిగెత్తుకొస్తాడు నబీల్. కానీ ఏమన్నా ఆడాడా అంటే బక్వాస్గా ఆడాడు' అని ప్రేరణతో మాట్లాడుతూ నోరు పారేసుకుంది. రీసెంట్గా వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున అడిగితే నబీల్ గురించి యష్మీ తెగ పొగిడేసింది. ఇప్పుడేమో ఒక్క గేమ్లో ఈమె గెలిచేసరికి బక్వాస్ గేమ్ అని చాడీలు చెబుతూ ఓవరాక్షన్ చేస్తోంది.మణికంఠ, సీత ఔట్ఇక గేమ్స్లో ఓడిపోయిన తర్వాత 'సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్' నుంచి ఒకరిని తీసేయాలని చెప్పగా తొలుత కాంతార క్లాన్ అంతా డిసైడ్ చేసుకుని మణికంఠని సైడ్ చేశారు. ఇక రెండోసారి శక్తి క్లాన్కి అవకాశమివ్వగా సీతని సైడ్ చేశారు. అలా రాబోయే గేమ్స్లో వీళ్లిద్దరూ పోటీ పడకుండా అయిపోయింది. గేమ్స్ ఆడదామని టీమ్ మారినా సరే మణికంఠని బ్యాడ్ లక్ వరించింది. ఇలా ఈ రోజు పెట్టిన మూడు టాస్కుల్లో రెండింట్లో నిఖిల్ టీమ్ గెలవగా మరో టాస్కులో ఎవరూ గెలవలేదు.సోనియాలా యష్మి ప్రవర్తనఇన్నాళ్లు సోనియా ప్రవర్తన చూసి ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుందని అందరూ అనుకున్నారు. ఆమె ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది అని అనుకున్నారు. దీంతో ఆడియెన్స్ వ్యతిరేకత వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసింది. దీంతో హౌస్ ప్రశాంతంగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ సోనియా ఖాళీ చేసిన స్థానాన్ని యష్మి తీసేసుకుందా అనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ ఎపిసోడ్లో నబీల్, మణికంఠ గురించి ఆమె మాట్లాడిన తీరు చూస్తే అలానే అనిపించింది. -
Bigg Boss 8: ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరో గుర్తుపట్టారా?
బిగ్బాస్ 8 మరీ చప్పగా సాగుతోంది. రీసెంట్గా సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ఇప్పటికే బాంబు పేల్చారు. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది సస్పెన్స్గా మారింది.మరోవైపు గత కొన్నిరోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో తెగ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే ఇప్పుడు తొలి కంటెస్టెంట్ ఎవరో చెప్పుకోండి చూద్దాం అని నిర్వహకులు నీడతో ఉన్న ఫొటోని రిలీజ్ చేశారు. అయితే ఇది గత సీజన్లో పాల్గొన్న టేస్టీ తేజనే అని కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: అంబటి రాయుడిని అప్పట్లో నెక్ట్స్ సచిన్ అన్నారు: హీరో శ్రీ విష్ణు)తేజతో పాటు ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, యాంకర్ రవి, నయని పావని.. ఇలా పలువురు పేర్లయితే వినిపిస్తున్నాయి. వీళ్లలో ఎవరు వస్తారనేది ఈ వీకెండ్ లేదంటే వచ్చే వీకెండ్ కల్లా తెలిసిపోతుంది.మంగళవారం ఎపిసోడ్లో 'జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు' అనే టాస్క్ పెట్టారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. తొలుత ఈ టాస్క్ ఎవరు ఆడాలి? అనే విషయమై కాంతార క్లాన్లో చాలా డిస్కషన్ నడిచింది. నామినేషన్స్లో ఉన్నామని చెప్పి నైనిక రిక్వెస్ట్ చేసింది. ప్రేరణకు ఆరోగ్యం బాలేదని, సీత చీఫ్ కాబట్టి సేఫ్ అని, చివరికి మణికంఠను ఈ టాస్క్లో నిలబెట్టారు. మరోవైపు యష్మి కూడా పోటీ పడింది. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు? చివరకు ఏమైందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాలి.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
బిగ్బాస్ 4వ వారం విశ్లేషణ.. ఫోమ్తో ఫామ్లోకి వస్తే
బిగ్బాస్ 8వ సీజన్లో గడిచిన వారం(4వ) హౌస్లోని కంటెస్టెంట్స్ మనసులోని ముసుగులు తొలగించడానికి ఫోమ్ని నామినేషన్స్ పర్వంలో వాడాడు బిగ్బాస్. ఏ నురగైనా కరిగితే అసలు పదార్ధం బయట పడుతుందన్నట్టు ఈ ఫోమ్ ఉపయోగించిన తరువాత కంటెస్టెంట్ల అసలు రంగులు చాలానే బయటపడ్డాయని చెప్పొచ్చు. ఆ రంగులు బయటకు రాగానే ఆట మళ్ళీ ఫాంలోకి వచ్చింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)యధావిధిగా నామినేషన్స్ లో వాడి వేడి రచ్చతో పాటు ఈ వారం క్లాన్స్ మధ్య పోటీగా నిర్వహించిన డిఫరెంట్ బెలున్ కాంటెస్ట్ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. ఒక్క నామినేషన్స్లో తప్ప మిగతా రోజులంతా కంటెస్టెంట్లు ఆనందంగా కనిపించారు. కానీ వారు ఆనందంగా ఉండటం చూసి బిగ్బాస్ తట్టుకోలేకపోయాడు. ఈ పోటీకి ముందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని బాంబు పేల్చాడు. దాంతో ఇంకేముంది, ఓ పక్క తమను తాము కాపాడుకుంటూ వైల్డ్ కార్డ్స్ని హౌస్లోకి రానివ్వకుండా బిగ్బాస్ పెట్టే ఆటలన్నీ ప్రాణం పెట్టి ఆడారు.ఇదంతా ఓ ఎత్తయితే ఈ వారం ఊహించని ఎలిమినేషన్ సోనియా. కాకపోతే ఈమెని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదు. హౌస్లోని కంటెస్టెంట్స్ చేయడం విశేషం. ముఖ్యంగా మిగతా లేడీ హౌస్మేట్స్ సోనియాని వద్దనుకోవడం విడ్డూరం. ఈ విషయం ఎలిమినేట్ అయిన తరువాత సోనియా నాగార్జునతో బాహటంగానే అందరిముందు చెప్పింది. కండబలం వున్నవారికి గుండెబలం తక్కువుంటుందన్న విషయాన్ని నిరూపించాడు నిఖిల్.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా బాగోతం.. గ్యాప్ ఇవ్వకుండా అర్జున్ రోస్టింగ్)సోనియా ఎలిమినేట్ అవ్వగానే ఒక్కసారిగా భోరుమన్నాడు హౌస్లోనే బలవంతుడైన నిఖిల్. ఇతడితో పాటు పృథ్వీ కూడా అదే తీరు. ఆఖరికి ఇద్దరికిద్దరూ ఓ అమ్మాయి కోసం ఏడవడం ప్రేక్షకులకు కాస్త నవ్వు తెప్పించి ఉండవచ్చు. ఈ వారం చివర్లో నాగార్జున ప్రేక్షకులకు ఓ ఝలక్ ఇచ్చి ముగించాడు. వారం మధ్యలో ఎలిమినేషన్ ఉంటుందని అన్నాడు.హౌస్లో ఉన్నవాళ్ళ నుంచి ఎక్కువ మసాలా రావట్లేదని అనుకున్నాడో ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేరిట ఇంకొంతమందిని హౌస్లోకి పంపడానికి రెడీ అయ్యాడు బిగ్బాస్. ఏదేమైనప్పటికీ అటు బిగ్బాస్ ఇటు తెలుగు ప్రేక్షకులు ఒకింత సమానంగా ఆలోచిస్తారనుకోవచ్చేమో ఆలోచించండి.-ఇంటూరి హరికృష్ణ(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
Bigg Boss 8: సోనియా బాగోతం.. గ్యాప్ ఇవ్వకుండా అర్జున్ రోస్టింగ్
బిగ్బాస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. స్టేజీపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చేసింది. కానీ బిగ్బాస్ బజ్లో మాత్రం కచ్చితంగా మాట్లాడాలి. హోస్ట్ అర్జున్ అదే చేశాడు. గ్యాప్ ఇవ్వకుండా రోస్టింగ్ చేసి వదిలేశాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన సోనియా.. కొన్నింటికి మాత్రం ఆన్సర్ చెప్పలేక సైలెంట్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)హౌసులో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఏర్పడింది అని అడగ్గా.. అభయ్, నిఖిల్, పృథ్వీ పేర్లు చెప్పింది. నిఖిల్కి నీపై ఎలాంటి ఫీలింగ్ ఉందని అడగ్గా.. మా అన్నలాగా, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడని సోనియా చెప్పింది. లోపల హౌసులో వాళ్లని ఏమారుస్తావేమో గానీ నన్ను వద్దులే అని అర్జున్ సైలెంట్గా సెటైర్ వేశాడు.పృథ్వీకి కోపమే మైనస్ అని తెలిసినా.. వాడిని మీరు ఓ ఆయుధంలా ఉపయోగించుకున్నారని మేం అంటున్నాం అని.. అలానే ముందుండి ఆట పట్టిస్తున్నారని మీరనుకుంటున్నారు గానీ వెనకుండి ఆట నడిపిస్తున్నారని ఆడియెన్స్కి తెలుసులే అని సోనియా బాగోతాలన్ని అర్జున్ బయటపెట్టాడు. చేయాల్సిందంతా చేసేసి నాకేం తెలియదన్నట్లు కూర్చుంటారు 'కపటనాటక సూత్రధారి' అని సోనియాకి కొత్త పేరు పెట్టాడు.(ఇదీ చదవండి: మణికంఠకి మెంటలెక్కించారు.. ఈ వారం నామినేషన్స్లో ఉన్నదెవరు?)ఆడపులి అని సోనియా తనకు తానే అనుకోవడంపైన కూడా అర్జున్ కౌంటర్ వేశాడు. ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడతుంది, పిల్లిలా వెనకుండదని అన్నాడు. ఇక నిఖిల్-పృథ్వీ గురించి అర్జున్ మాట్లాడుతూ.. వాళ్లు బాధితులు, మీరు బాధపెట్టినోళ్లు కాబట్టి ముందు మీరు బయటకొచ్చేశారు అని అన్నాడు. దీంతో కోపమొచ్చినా సరే సోనియా ఆపుకొంది. చూద్దాం వాళ్లు ఎన్నిరోజులు ఉంటారో? వాళ్లేం ఆట ఆడతారో చూద్దాం అని తనదైన శైలిలో సమాధానమిచ్చింది.ఇలా హౌసులో శివంగిలా చెలరేగిపోయింది గానీ ఇంటర్వ్యూలో మాత్రం పిల్లిలా అర్జున్ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక సౌండ్ చేయలేకపోయింది. మిగతా వాటి సంగతేమో గానీ నిఖిల్, తనకు అన్నయ్య లాంటోడు అని సోనియా చెప్పడం మాత్రం విడ్డూరంగా అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?) -
మణికంఠకి మెంటలెక్కించారు.. ఈ వారం నామినేషన్స్లో ఉన్నదెవరు?
ఆదివారం ఎపిసోడ్లో సోనియా ఎలిమినేట్ అయిపోయింది. అలా బిగ్బాస్ షో ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. సోమవారం వచ్చింది కాబట్టి ఎప్పటిలానే నామినేషన్స్ హడావుడి మొదలైంది. ఈసారి ఫొటోని మంటల్లో వేసే కాన్సెప్ట్తో నామినేషన్స్ సాగింది. ఎప్పటిలానే మణికంఠ టార్గెట్ అయ్యాడు. సీత అయితే మణిని ఓ రేంజులో రెచ్చగొట్టి వదిలేసింది.(ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?)ప్రోమో ప్రకారం మణికంఠ.. సరిగా ఆడట్లేదని నైనికని నామినేట్ చేశాడు. అలానే యష్మిని మళ్లీ టార్గెట్ చేశారు. నైనిక-నబీల్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. సీత-మణికంఠ మధ్య అయితే చిన్నపాటి యుద్ధమే జరిగింది. గత వారాల్లో జరిగిన పాయింట్స్ తెచ్చేసరికి మణి సైలెంట్ అయిపోయాడు. ఓ సందర్భంగా అతడిలా సీత ఇమిటేట్ చేసినట్లు అనిపించింది. దీంతో మణికంఠకి మెంటలెక్కిపోయింది.బాడీ లాంగ్వేజ్ మార్చుకో అని సీతతో మణికంఠ చెప్పగా.. ఇది నా బాడీ లాంగ్వేజ్, నేను ఎలా అయినా చేసుకుంటా అన్నట్లు సీత అంతే ధీటుగా సమాధానమిచ్చింది. ఇలా హోరాహోరీగానే సాగినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే నామినేషన్స్ షూటింగ్ పూర్తవగా ఎవరెవరు లిస్టులో ఉన్నారనేది బయటకొచ్చింది. ఈ వారం విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, నబీల్, మణికంఠ, నిఖిల్.. నామినేషన్స్లో ఉన్నారు. అలానే ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?) -
Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?
బిగ్ బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలామంది పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే షో మొదలైన కొత్తలో సోనియా.. మిగిలిన వాళ్లతో పోలిస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్లా కనిపించింది. లా పాయింట్స్ చెబుతూ అవతలి వాళ్లని ఇరకాటంలో పెట్టింది.ఎప్పుడైతే నిఖిల్ పక్కన చేరిందో అప్పటి నుంచి సోనియా గేమ్ పక్కకు వెళ్లిపోయింది. యష్మి, మిగిలిన వాళ్లతో ప్రతిదానికి వాదిస్తూ పోయింది తప్పితే టాస్కులు కూడా ఆడాలి అనే సంగతి మర్చిపోయింది. అలానే హౌసులో ఉన్న అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా గేమ్స్ ఆడుతూ స్ట్రాంగ్ అవుతూ వచ్చారు. ఈమె మాత్రం ఎప్పుడు చూడు పృథ్వీ-నిఖిల్తో కలిసి ముచ్చట్లు పెడుతూ వచ్చింది. అలా మిగిలిన వాళ్లందరికీ టార్గెట్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఈసారి సోనియాని టార్గెట్ చేశారు. దీంతో ఓటింగ్లో చివరి స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున కూడా బయటపెట్టాడు. లెక్క ప్రకారం చూసుకుంటే నిఖిల్ ఫ్యాన్స్ అందరూ తనకు ఓట్లు వేస్తారని సోనియా అనుకుంది. కానీ అలా జరగలేదు.సోనియాని ఎలిమినేట్ చేసి బిగ్బాస్ మంచి పని చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈమె వెళ్లిపోయింది కాబట్టి నిఖిల్ గేమ్ ఇకపై కరెక్ట్గా ఉంటుందనిపిస్తోంది. ఇదలా ఉంచితే వచ్చే వారం దాదాపు ఆరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)Their Bond 💔 The way he said miss u machan in tears 🥺 ❤️Stay Strong Nikhil 💪#SoniyaAkula #NikhilMaliyakkal #Soniya #BiggBoss #BiggBossTelugu #BiggBossTelugu8 pic.twitter.com/OzPWuSSonx— GeethaRyder (@GeethaRyder) September 29, 2024 -
బిగ్బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?
బిగ్బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఈమె బయటకొచ్చేయడంపై సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఈసారి రెండు వికెట్లు పడతాయనమాట. వాళ్లు ఎవరు కావొచ్చు? ఎందుకు ఇదంతా?బోరింగ్ బిగ్బాస్ఈసారితో పోలిస్తే గత సీజనే కాస్తోకూస్తో బెటర్ అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కరు కూడా సరైన కంటెంట్ ఇవ్వట్లేదు. బిగ్బాస్ టీమ్ కూడా ఏదో ప్రయత్నిస్తున్నారు కానీ వర్కౌట్ కావట్లేదు. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయింది కానీ రెగ్యులర్గా షో చూస్తే కొందరికి తప్పితే మిగతా ప్రేక్షకులు దీనివైపే చూడట్లేదు. ఇది కాస్త బిగ్బాస్కి అర్థమైనట్లుంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ఎలిమినేట్ వేటుఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగానే జరిగినట్లు కనిపిస్తుంది. మంటల్లో ఫొటో వేయాలి అనే కాన్సెప్ట్తో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఈసారి విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, మణికంఠ, నబీల్, నిఖిల్ నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో ఆదిత్య, నైనికకి తప్పితే మిగిలిన వాళ్లకు కాస్తోకూస్తో ఫ్యాన్ బేస్ ఉంది. ఓట్లు కూడా బాగానే పడుతున్నాయిఆ ఇద్దరు వీళ్లేనా?అలా ఆదిత్య, నైనికలో ఒకరిని వారం మధ్యలో పంపేస్తారు. మరొకరిని వీకెండ్లో పంపించేస్తారనిపిస్తోంది. వచ్చే వారం దసరా సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్లలో ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, నయని పావని, గౌతమ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. యాంకర్ రవి కూడా ఈ లిస్టులో ఉండొచ్చని అంటున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే మరో వారం ఆగితే సరిపోద్ది.(ఇదీ చదవండి: సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!)TWIST - There is a Mid-Week Elimination this week!#BiggBossTelugu8 pic.twitter.com/yaSu22gXPx— TeluguBigg (@TeluguBigg) September 29, 2024 -
ప్రేయసిని పరిచయం చేసిన బిగ్బాస్ 8 నబీల్.. ఈమె ఎవరంటే? (వైరల్)
-
బిగ్ బాస్ 8: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు.. కానీ అతడిపై వేటు?
బిగ్బాస్ 8లో నాలుగో వారం వచ్చేసింది. ఈ వారానికి సంబంధించి నామినేషన్స్ పూర్తయ్యాయి. కొత్త చీఫ్ని కూడా ఎంపిక చేసేశారు. క్లాన్స్ (గ్రూపులు) కూడా డిసైడ్ అయిపోయాయి. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. బిగ్బాస్ ముద్దుబిడ్డ కోసం ఊహించని వ్యక్తిని ఇంటినుంచి పంపేస్తారనే టాక్ వినిపిస్తోంది.హౌసులో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. ఈసారి ప్రేరణ, మణికంఠ, పృథ్వీ, సోనియా, ఆదిత్య, నబీల్ నామినేషన్స్లో ఉన్నారు. అయితే ఓటింగ్లో నబీల్ టాప్లో కొనసాగుతున్నాడట. 35 శాతం మంది ఇతడు హౌసులో ఉండాలని కోరుకుంటున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో నాగమణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, పృథ్వీ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే డేంజర్ జోన్లో దోస్తులు సోనియా-పృథ్వీ ఉన్నారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా వల్ల నిఖిల్కి చెడ్డపేరు.. మొత్తం సీన్ ఛేంజ్)ప్రస్తుతం నిఖిల్ చీఫ్గా ఉన్న క్లాన్లోనే పృథ్వీ-సోనియా ఉన్నారు. గొడవల పడటం దగ్గర నుంచి గేమ్స్ వరకు అన్నింటిలోనూ వీళ్లిద్దరూ మంచి పోటీ ఇస్తున్నారు. అలానే సోనియా ఎన్ని తప్పులు చేస్తున్నా సరే ఎపిసోడ్లో వాటిని చూపించట్లేదు. అంటే ఈమె హౌస్లో ఉండాలని బిగ్బాస్ గట్టిగానే ఫిక్సయినట్లున్నాడు. పృథ్వీని కూడా పంపిస్తాడా అంటే డౌటే.ఇదంతా చూస్తుంటే ఈసారి ఆదిత్య ఓంపై వేటు పడుతుందా అనిపిస్తోంది. ఎందుకంటే అతడు హౌస్లో పెద్దగా యాక్టివ్గా కనిపించట్లేదు. మిగతా వాళ్లతో సరిగా ఇంకా కలవలేకపోతున్నాడు. మరి ఈ వారం బిగ్బాస్.. ఓటింగ్లో చివర్లో ఉన్న పృథ్వీ, సోనియాలలో ఒకర్ని ఎలిమినేట్ చేస్తాడా.. ఆదిత్యని బలి ఇచ్చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి) -
Bigg Boss 8: సోనియా వల్ల నిఖిల్కి చెడ్డపేరు.. మొత్తం సీన్ ఛేంజ్
బిగ్బాస్ 8లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఈరోజు వరకు స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఓ వైపు ఉన్నోళ్లంతా మరోవైపు జంప్ అయిపోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇలాంటి పరిస్థితే నిఖిల్కి ఎదురైంది. సోనియా వల్ల అతడికి చెడ్డపేరు రావడంతో పాటు నెగిటివిటీ కూడా మరింత ఎక్కువైపోతోంది. తాజా ప్రోమోలో ఇదే స్పష్టమైంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా బండారం బయటపెట్టిన యష్మి.. నిఖిల్-సోనియా మధ్య మనస్పర్థలు)బిగ్బాస్ 8లో ప్రస్తుతమున్న వాళ్లలో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. శక్తి క్లాన్కి ఇతడు చీఫ్గానూ ఉన్నాడు. అలానే పెట్టిన ప్రతి గేమ్లోనూ పోటీ పడుతూ బెస్ట్ ఇస్తున్నాడు. ఇతడి కూడా ఉంటున్న సోనియా మాత్రం ఆడటం సంగతి పక్కనబెడితే అందరి మధ్య పుల్లలు పెడుతోంది. ఈమె చేస్తున్న పనివల్ల నిఖిల్కి చెడ్డ పేరు వస్తోంది. ఈ వారం నామినేషన్స్లోనూ యష్మి-నిఖిల్ బంధం గురించి సోనియా మాట్లాడిన తీరు చాలా వరస్ట్. ఇదంతా అప్పుడు ఎవరూ చెప్పనప్పటికీ ఇప్పుడు బయటపెట్టారు.తాజాగా క్లాన్ కోసం జరిగిన పోటీల్లో గెలిచిన సీత.. కొత్త చీఫ్గా ఎంపికైంది. హౌస్లోని ఉన్నవాళ్లు ఎవరు ఏ క్లాన్ లో ఉండాలనేది నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఎప్పటిలానే నిఖిల్ చీఫ్గా ఉన్న శక్తి క్లాన్లోకి సోనియా, పృథ్వీ వెళ్లగా.. మిగిలిన వాళ్లందరూ సీత చీఫ్గా ఉన్న 'కాంతార' క్లాన్లోకి వెళ్లినట్లు చూపించారు. దీనిబట్టి చూస్తే సోనియా చీప్ బిహేవియర్ ఆమెకు మాత్రమే కాదు నిఖిల్కి కూడా మరింత చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి) -
Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి
బిగ్బాస్ 8లో ఈసారి పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్ నామినేషన్స్లో ఉన్నారు. సోమవారమే ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. కానీ యష్మి-సోనియా మధ్య జరిగిన గొడవ మాత్రం ఆ తర్వాత కూడా చాలాసేపు కొనసాగింది. మంగళవారం ఎపిసోడ్లోనూ ఈ రచ్చనే సగం ఎపిసోడ్లో చూపించారు. ఈ క్రమంలోనే సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టగా.. నిఖిల్-సోనియా మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అనిపించింది. ఇంతకీ బిగ్బాస్లో 23వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.సోనియా బండారంనామినేషన్స్లో సోనిమా తీసిన పాయింట్స్.. యష్మికి ఎక్కడలేని కోపాన్ని తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా నిఖిల్-పృథ్వీలనే నువ్వు చూస్తుంటే నా గేమ్ నీకు ఎందుకు కనబడతుందని యష్మికి కౌంటర్గా సోనియా చెప్పింది. దీని వల్ల నామినేషన్స్ పూర్తయిన తర్వాత సోనియా-యష్మి గొడవపడుతూనే ఉన్నారు. 'నిఖిల్, పృథ్వీని వేరే ఉద్దేశంతో చూడలేదని, సోనియా చెప్పింది కరెక్ట్ అయితే మీరు మాట్లాడాలి' అని పృథ్వీతో చెప్పింది. సోనియా ఇంత లూజ్గా మాటలు వదులుతుంటే నేను వంద మాట్లాడతా.. కానీ నేను అంత చీప్గా దిగజారను అని సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టింది.(ఇదీ చదవండి: తగ్గిన 'దేవర' రన్ టైమ్.. ఇప్పుడు ఎంతంటే?)యష్మి ఏడుపుఇంతలో సోనియా వచ్చి యష్మితో మరోసారి వాదన పెట్టుకుంది. వాడు (పృథ్వీ) ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడు అని అంత క్లియర్గా నువ్వు చెబుతుంటే.. ఎంత అబ్జర్వ్ చేశావో అదే నేను చెప్పా అని సోనియా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ యష్మి కోపం పట్టలేకపోయింది. ఎక్స్క్యూజ్ మీ.. గేమ్ పరంగా నేను చెప్పాను.. నీలా ఆలోచించలేదు.. నువ్వు మాత్రం దానికి ఒక రిలేషన్ తగిలించి.. చేయి చేయి పట్టుకొని మాట్లాడుతున్నావ్. మేము తప్పుగా మాట్లాడకూడదా.. అంటే ఎవరు హౌస్లో తప్పుగా ఆలోచిస్తున్నారో నువ్వు గుర్తుపెట్టుకో.. నువ్వు వాళ్లకి సిస్టర్ కాదు మదర్ కాదు.. నీ ఇష్టమచ్చినట్లు వాళ్లని వాడుకుంటున్నావని నాకు అనిపిస్తుంది.. ఈరోజు అది క్లియర్ అయింది అని యష్మి గుక్కపట్టి ఏడ్చింది.నిఖిల్ ఓదార్పుసోనియా పెట్టిన చిచ్చు వల్ల యష్మి చాలా బాధపడింది. ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడ నోరు జారి ఏం అనేస్తుందోనని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అంటే ఇన్నాళ్లూ నీతో (నిఖిల్) మాట్లాడతుంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. నోటికొచ్చింది మాట్లాడుతుంది అని యష్మి ఏడ్చేసింది. దీంతో నిఖిల్ దగ్గరుకు తీసుకుని ఆమెని ఓదార్చాడు.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)హర్ట్ బ్రేక్ చేశావ్ఈ గొడవంతా అయిపోయిన తర్వాత అర్థరాత్రి నిఖిల్-సోనియా డిస్కషన్ పెట్టారు. చేతిలో చేయి వేసి మరీ సోనియాకు నిఖిల్ సారీ చెప్పాడు. దీంతో ఈమె ఎమోషనల్ అయిపోయింది. ఫస్ట్ ఎవరితో మాట్లాడినావ్ అన్నది పాయింట్ కాదురా.. ఏం విన్నాము ఏం అర్థం చేసుకున్నాం అన్నది కదా అని అంది. అలానే ఫేక్ బతుకు బతుకున్నావ్ అని, వాళ్లని యూజ్ చేసుకుంటున్నావ్ అని యష్మి అందని.. అయితే ఇవన్నీ నువ్వు వినను కూడా వినలేదని.. కానీ ఎక్కడో ఆమె చెప్పిన పాయింట్స్ నీకు కరెక్ట్ అనిపిస్తోంది. నీ వరకు నువ్వు కరెక్ట్గానే ఉన్నప్పటికీ ఈరోజు నా మనసు విరిచేశావ్ అని నిఖిల్తో సోనియా అంది. ఇదంతా చూస్తుంటే వీళ్లిద్దరి దూరం పెరిగినట్లే అనిపిస్తోంది.కొత్త చీఫ్గా సీతఇక రాత్రంతా సోనియా-యష్మి గొడవ జరగ్గా.. ఉదయం లేచేసరికి కొత్త చీఫ్ గురించి బిగ్బాస్ పోటీ పెట్టాడు. శక్తి క్లాన్కి ఇప్పటికే నిఖిల్ ఉండగా.. కాంతార క్లాన్ చీఫ్గా ఉన్న అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఎవరికి చీఫ్ అయ్యే అర్హత లేదే వాళ్ల బొమ్మ విరగ్గొట్టాలని, దీనికోసం బజర్ మోగినప్పుడు సుత్తిని పట్టుకుని.. దాన్ని మరో వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్బాస్ ఆర్డర్ వేశాడు. ఈ ప్రొసెస్లో చివరగా సీత మిగిలింది. అలా కాంతార క్లాన్కి చీఫ్గా బాధ్యతలు అందుకుంది. అయితే ఏ క్లాన్లో ఎవరెవరు ఉండబోతున్నారనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుస్తోంది. ఏదేమైనా మంగళవారం ఎపిసోడ్ దెబ్బకు సోనియా చీప్ బిహేవియర్ బయటపడింది. అలానే యష్మి మంరింత స్ట్రాంగ్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
బిగ్బాస్ 8: అభయ్ ఎలిమినేట్ అయ్యాడుగా.. కొత్త చీఫ్ ఎవరంటే?
బిగ్బాస్ 8లో నాలుగో వారం వచ్చేసింది. ఇప్పటికే నామినేషన్స్ పూర్తవగా ఈ వారం పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్, నైనిక లిస్టులో ఉన్నారు. కాంతార చీఫ్గా ఉన్న అభయ్.. ఆదివారం ఎలిమినేట్ కావడంతో ఆ పోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు దాని కోసం బిగ్బాస్ ఎప్పటిలానే పోటీ పెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.గత సీజన్లలో కెప్టెన్లు ఉన్నట్లు ఈసారి బిగ్బాస్ హౌసులో చీఫ్స్ ఉన్నారు. కంటెస్టెంట్స్ని శక్తి, కాంతార క్లాన్స్ అని పిలిచే గ్రూపులుగా విభజించారు. శక్తి చీఫ్గా నిఖిల్ ఉండగా.. కాంతార చీఫ్గా అభయ్ ఉండేవాడు. అతడు ఎలిమినేట్ కావడంతో ఆ పోస్ట్ కోసం ఇప్పుడు పోటీ పెట్టారు. నిఖిల్ తప్పితే మిగతా పదిమంది ఫొటోలు స్టాండ్పై పెట్టారు. ఇక బజర్ మోగే సమయంలో సుత్తిని ఎవరైతే పట్టుకుంటారో ఓ ఫొటోని పోటీ నుంచి తొలగించొచ్చు.(ఇదీ చదవండి: ఎవడిని కొడతానో నాకే తెలీదు.. పూనకంతో ఊగిపోయిన సోనియా)అలా నిఖిల్, ఆదిత్య బొమ్మని.. పృథ్వీ, మణికంఠ బొమ్మని.. సీత, యష్మి బొమ్మని.. సోనియా, నబీల్ బొమ్మని.. నైనిక, విష్ణుప్రియ బొమ్మని.. సీత, సోనియా బొమ్మని సుత్తితో పగలగొట్టారు. అలా చివరగా సీత-ప్రేరణ మిగిలినట్లు ప్రోమోలో చూపించారు. అయితే షూటింగ్ కంప్లీట్ కావడంతో చీఫ్ ఎవరయ్యరనేది బయటకొచ్చింది. కాంతార క్లాన్కి కొత్త చీఫ్గా సీత ఎంపికైంది.హౌస్లోకి వచ్చిన కొత్తలో సీత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏం కాదు. కానీ రోజురోజుకీ తన పాయింట్స్ చెబుతూ హౌసులో గట్టిగా నిలబడుతోంది. ఇక ఈ వారం చీఫ్ అయిపోయింది కాబట్టి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయినట్లే. (ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
Bigg Boss 8: మణికంఠకి క్లాస్ పీకిన నైనిక.. నామినేషన్స్ రచ్చ
బిగ్బాస్ 8లో మూడు వారాలు గడిచిపోయాయి. తాజాగా అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో ఎప్పటిలానే సోమవారం వచ్చేసింది. నామినేషన్స్ రచ్చ రచ్చ అయింది. ఈసారి పృథ్వీ, సోనియా, మణికంఠ ఎక్కువగా టార్గెట్ అయినట్లు కనిపించారు. హౌస్మేట్స్ ఒకరిపై ఒకరు గట్టిగట్టిగా అరుస్తూ రెచ్చిపోయాడు. ఇంతకీ ప్రోమోలో ఏముంది?పృథ్వీ టార్గెట్ప్రోమోలో చూపించిన దాని ప్రకారం ఆదిత్య ఓం, నబీల్.. పృథ్వీని నామినేట్ చేశారు. అవమానించేలా గట్టిగా మాట్లాడుతావ్ గానీ సారీ మాత్రం మెల్లగా చెబుతావ్ అని ఆదిత్య తన పాయింట్ చెప్పాడు. దీనికి బదులిచ్చిన పృథ్వీ.. మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేనెందుకు తీసుకోవాలని రిటర్న్ కౌంటర్ ఇచ్చాడు. ఇక నబీల్ కూడా పృథ్వీనే నామినేట్ చేశాడు. గట్టి గట్టిగా అరుస్తున్నావని, నరాలన్నీ కనిపిస్తున్నాయని, ఆ అరుపుల వల్ల నా మాట నీకు వినిపించడం లేదని కారణం చెప్పాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఎలిమినేషన్పై అభయ్ వీడియో.. అందుకే ఇలా)పృథ్వీ కూడా ఫైర్ఇక నబీల్ చెప్పిన కారణానికి బదులిచ్చిన పృథ్వీ.. నా ప్రకారం నువ్వు ఫెయిల్, బయాస్డ్(కొందరికే సపోర్డ్) అని కౌంటర్ ఇచ్చాడు. ఎలా కావాలంటే అలా మాట్లాడతా, మెడ దగ్గర నరాల్ని చూపిస్తూ.. ఇవి బయటకు పడినా పర్లేదు నేను ఇలానే మాట్లాడుతా అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఈ మధ్యలోనే సోనియా-నబీల్ మధ్య వాగ్వాదం జరిగింది. అలానే తొలి మూడు రోజులు కనిపించిన సోనియా ఇప్పుడు కనిపించట్లేదని ఆదిత్య ఆమెని నామినేట్ చేశాడు.మణికంఠకి క్లాస్గత వారాల్లో ప్రతిదానికి ఓవర్ చేసిన మణికంఠ.. ఈసారి నామినేషన్స్లో మాత్రం కాస్త సైలెంట్గా ఉన్నట్లున్నాడు. నైనిక అతడిని నామినేట్ చేస్తూ.. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే వేరేవాళ్ల కాన్ఫిడెన్స్ తగ్గించొద్దని అతడికి క్లాస్ పీకింది. అలా ప్రోమో మొత్తం మాటలతో కొట్టేసుకుంటారా అనే రేంజులో సాగింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్) -
Bigg Boss 8: ఎలిమినేషన్పై అభయ్ వీడియో.. అందుకే ఇలా
బిగ్బాస్ 8లో మూడో ఎలిమినేషన్. తెలంగాణ పోరడు అభయ్ నవీన్ బయటకొచ్చేశాడు. తొలి రెండు వారాలు మంచి పోటీ ఇచ్చేలా కనిపించిన ఇతడు.. మూడో వారం వచ్చేసరికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. పైపెచ్చు బిగ్బాస్నే నోటికొచ్చిన మాటలన్నాడు. దీంతో నీ ఆట చాలులే అని బయటకు పంపించేశారు. ఇప్పుడు తీరిగ్గా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాడు. ఎలిమినేషన్ తర్వాత అభయ్ నవీన్ ఓ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేశాడు.అభయ్ ఏమంటున్నాడు?'బిగ్బాస్ హౌస్లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఉంటానని మీరు అనుకున్నారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు వెరీ వెరీ సారీ. కానీ వెళ్లే ముందే నేను చెప్పి దిల్ దార్ ఉంటానని. అది నచ్చితే లోపల ఉంటా లేదంటే ఉండనని. దురదృష్టవశాత్తూ బయటకొచ్చేశా. నాకు ఓట్లు వేసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ మరోసారి థ్యాంక్స్. మీకు సినిమాలతో మరింత దగ్గరవుతా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా' అని అభయ్ నవీన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే?తొలి రెండు వారాల్లో బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడో వారానికి వచ్చేసరికి కన్నడ బ్యాచ్ నుంచి ఎవరైనా ఎలిమినేట్ అవుతారేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఓ జట్టుకి(క్లాన్) లీడర్గా వ్యవహరించిన అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ చూపించాలి. కానీ అది మితిమీరిపోతే సమస్య వస్తుంది. అభయ్ కూడా అలా ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు. అయితే అయ్యాడు కానీ దాన్ని బయటకు చూపించడం దెబ్బేసిందని చెప్పొచ్చు.బిగ్బాస్నే తిడితే ఎలా?గత వారం జరిగిన గుడ్లు టాస్క్లో తన జట్టు గెలుపు కోసం పోరాడుతుంటే చీఫ్గా ఉన్న అభయ్ మాత్రం ఆటని లైట్ తీసుకున్నాడు. దీనికి తోడు తన టీమ్ సభ్యులని కూడా ఆడొద్దని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు. తన టీమ్పై విరుచుకుపడుతున్న అవతలి టీమ్ వాళ్లపై అరవాల్సింది పోయి బిగ్బాస్ మీద ప్రతాపం చూపించాడు. బిగ్బాస్.. బయాస్డ్ (ఒకరికే సపోర్ట్ చేయడం) అని నానాబూతులు తిట్టాడు. ఆడలేక మద్దెల దెరువు అన్నట్లు తప్పంతా బిగ్బాస్ మీదకు తోసేశాడు. ఇప్పుడేమో ఎలిమినేట్ అయి బయటకొచ్చిన తర్వాత కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్) View this post on Instagram A post shared by B Naveen Kumar (@abhainaveen) -
బిగ్బాస్ షోలో ప్రముఖ కమెడియన్?
తమిళ బిగ్బాస్ ఎనిమిదో సీజన్ లాంచ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో బిగ్బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. కొందరిని ఆల్రెడీ ఫైనలైజ్ చేయగా మరికొందరికి ఇంకా ఏ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరోవైపు షోలోకి వచ్చే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..తాజాగా ఆ జాబితాలో సీనియర్ నటుడు, కమెడియన్ సెంథిల్ పేరు వినిపిస్తోంది. కేవలం తమిళంలోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ ఈయనకు గుర్తింపు ఉంది. ఎక్కువగా పాపులర్ కమెడియన్ గౌండమణితో కలిసి వెండితెరపై నవ్వులు పూయించేవాడు.సెంథిల్ జర్నీ..సెంథిల్ 1970వ దశకంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చిన్నాచితకా పాత్రలే చేసేవాడు. ఎప్పుడైతే కమెడియన్ గౌండమణితో కలిసి నటించడం మొదలుపెట్టాడో అప్పుడు తన దశ తిరిగిపోయింది. వీరి కాంబినేషన్లో వచ్చిన కరగట్టకరన్, మన్నన్, చిన్నతంబి, ఇండియన్.. వంటి ఎన్నో చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. తెలుగులో తొలి ముద్దు, మనీ మనీ మోర్ మనీ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. దాదాపు 500 సినిమాల్లో యాక్ట్ చేసిన ఈయనను సినీప్రియులు ఎంతగానో ఇష్టపడతారు, గౌరవిస్తారు. అలాంటి ఈయన ఇప్పుడు బిగ్బాస్కు రాబోతున్నాడని వార్తలు వస్తుండటంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి అతడి ఎంట్రీ నిజమేనా? కాదా? అనేది తెలియాలంటే అక్టోబర్లో తమిళ బిగ్బాస్ 8 ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?
బిగ్బాస్ 8 అప్పుడే మూడో వారానికి వచ్చేసింది. మరీ సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా పర్లేదనిపిస్తోంది. గత వారం ఊహించని విధంగా శేఖర్ భాషా ఎలిమినేట్ అవడంతో చాలా మంది షాకయ్యారు. తనకి తానుగా వెళ్లిపోయానని తర్వాత చెప్పేసరికి ఊరుకున్నారు. ఇక ఈ వారం ఓటింగ్లోనూ లెక్కలు మారుతున్నాయి. ఏకంగా ఇద్దరు అబ్బాయిలు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.నామినేషన్స్లో ఎవరెవరు?ఎప్పుడు రెండు రోజులు పట్టే నామినేషన్స్ ప్రక్రియ ఈసారి సోమవారం ఒక్కరోజులోనే తేలిపోయింది. 8 మంది లిస్టులోకి వచ్చారు. వీళ్లలో నాగమణికంఠ, యష్మీ, సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. అయితే టీమ్ లీడర్స్ని ఎవరూ నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్బాస్.. వీళ్లలో ఒకరు నామినేషన్స్లో ఉండాలని చెప్పాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)రివర్స్ అవుద్దేమో?అయితే నిఖిల్ ఇప్పటికే ఓసారి నామినేట్ అయ్యాడని, కాబట్టి తాను వస్తానని అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తన గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుందని అభయ్ నవీన్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు అదే అతడికి రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓటింగ్ మంచి రసపట్టులో ఉంది. విష్ణుప్రియ టాప్లో కొనసాగుతోంది. తర్వాత వరసగా మణికంఠ, సీత, యష్మీ గౌడ, నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు.చివర్లో పృథ్వీ కానీప్రస్తుతం ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్, పృథ్వీరాజ్ చివరి స్థానాల్లో ఉన్నారు. కానీ బిగ్బాస్కి పృథ్వీ కావాల్సినవాడిలా కనిపిస్తున్నాడు. లవ్ ట్రాక్ నడిపించడానికి తెగ ట్రై చేస్తున్నాడు. దీని వల్ల అభయ్ నవీన్కి దెబ్బ పడుతుందేమోనని అనిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమై అభయ్ బయటకొస్తే మాత్రం ఇతడంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడేమో? ఎందుకంటే ఆడియెన్స్ పల్స్ తెలుకుందామని సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఏమన్నా పరిస్థితులు ఎదురు తిరిగితే మాత్రం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఇతడే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం) -
Bigg Boss 8: టాస్క్ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?
బిగ్ బాస్ షోలో మెల్లమెల్లగా గీత దాటేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్లో గేమ్స్ కంటే పులిహోర కబుర్లే ఎక్కువవుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్లోనూ రేషన్ కోసం బిగ్బాస్ మూడు గేమ్స్ పెట్టాడు. వీటిలో ఎవరు గెలిచారు అనే దానికంటే పృథ్వీ-యష్మి, సీత-నిఖిల్ మధ్య నడిచిన ఫర్టింగ్ రచ్చ ఆసక్తికరంగా మారిపోయింది. అసలు ఇంతకీ 16వ రోజు (మంగళవారం) బిగ్బాస్ హౌస్లో ఏం జరిగిందనేది చూద్దాం.తట్టుకోలేకపోయిన యష్మియష్మిని నామినేట్ చేసిన మణికంఠ.. నామినేషన్స్ అయిన తర్వాత ఈమె దగ్గరకు వచ్చి ఐస్ చేయాలని గట్టగానే ప్రయత్నించాడు. నచ్చజెప్పడానికి చాలా ట్రై చేశాడు. కానీ యష్మి ఎంతకీ వినకపోయేసరికి వెనక నుంచి యష్మిని హగ్ చేసుకున్నాడు. దీనికి ఆమె చిరాకుపడి వదిలెయ్ అని గట్టిగా చెప్పింది. ఇలా మణికంఠ వింత ప్రవర్తనని తట్టుకోలేకపోతున్నానని యష్మి ఏడుస్తూ బిగ్బాస్కి చెప్పింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం)రేషన్ కోసం మూడు టాస్క్లుఈ వారం రేషన్ దక్కించుకోవడం కోసం రెండు కాన్స్ (గ్రూప్స్)కి మూడు పోటీలు పెట్టాడు. తొలుత 'ఫొటో పెట్టు ఆగేటట్టు' గేమ్లో శక్తి టీమ్ నుంచి పృథ్వీ, కాంతార టీమ్ నుంచి నబీల్ వచ్చారు. సీత సంచాలక్. టీమ్ లీడర్స్ ఫొటోలని స్టాండ్లో పెట్టే ఈ పోటీలో చివరకు నబీల్ విజేతగా నిలిచాడు. 'నత్తలా సాగకు ఒక్కటీ వదలకు' అని పెట్టిన రెండో పోటీలో పాకుతూ క్యాబేజీలని మరో చోటకు చేర్చాలనే గేమ్ పెట్టారు. ఇందులో నిఖిల్ శక్తి టీమ్ గెలిచింది.తొక్కలో సంచాలక్అయితే రెండో గేమ్లో క్యాబేజీ రెడీ చేసి పెట్టడంలో సంచాలక్ ఫెయిల్ అయ్యాడని ఒకే జట్టుకి చెందిన ప్రేరణ.. మణికంఠపై అగ్గిపై గుగ్గిలం అయింది. ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో అక్కడి వరకే గేమ్ అని మణికంఠ చెప్పగా.. నువ్వెవరు చెప్పడానికి, తొక్కలో సంచాలక్ అని మణికంఠని రఫ్ఫాడించేసింది. సంచాలక్గా తప్పు చేశాడన్నట్లు తొలుత మాట్లాడిన ప్రేరణ.. తర్వాత వెళ్లి అతడికి సారీ చెప్పింది.బెలూన్ వల్ల గొడవ'బూరని కొట్టు రేషన్ పట్టు' అని మూడో గేమ్ పెట్టగా టీమ్ లీడర్స్ నిఖిల్, అభయ్ పోటీ పడ్డారు. ఇందులో భాగంగా ఒకరి ఒంటిపై అంటించిన బూరల్ని మరొకరు స్టిక్తో పగలగొట్టాల్సి ఉంటుంది. చివరకు ఎవరి బెలూన్స్ తక్కువ ఉంటే వాళ్లు గెలిచినట్లు అన్నది రూల్. అయితే ఈ పోటీలో బాక్స్ నుంచి అభయ్ పదే పదే బయటకొచ్చాడని హెచ్చరించిన సంచాలక్ సోనియా.. చివరకు బజర్ మోగేసరికి నిఖిల్ని విజేతగా ప్రకటించింది. చివరగా అభయ్ ఒంటిపై ఒక బూర ఉంది. నిఖిల్ ఒంటిపై ఏం లేవు. కింద మాత్రం నిఖిల్ బూరలు తక్కువగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా లెక్కేసుకుంటే నిఖిల్ విజేత అని సోనియా ప్రకటించింది. దీంతో శక్తి టీమ్ రేషన్ టాస్క్లో విజేతగా నిలిచింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. తెర వెనక ఇంత జరిగిందా?)యష్మి vs సోనియాకొన్నాళ్లుగా యష్మి, సోనియాకు పడట్లేదు. చివరగా పెట్టిన గేమ్లో సంచాలక్ సోనియా స్వార్థంగా వ్యవహరించిందని, చీటర్ అని నిరూపించుకుందని, ఇష్టమొచ్చినట్లు రూల్స్ మార్చేసిందని యష్మి గట్టిగట్టిగా అరుస్తూ రెచ్చిపోయింది. నీకు కావాల్సినట్టుగా రూల్స్ మార్చేసుకొని విన్నర్ను డిక్లేర్ చేశావ్ అని ఫైర్ అయింది. ఏదేమైనా నిఖిల్ టీమ్ గెలిచింది కాబట్టి వాళ్లకు ఏమేం రేషన్ ఇస్తారో చూడాలి.పులిహోర కబుర్లుగేమ్ గురించి పక్కనబెడితే మంగళవారం ఎపిసోడ్లో పులిహోర కబుర్లు ఎక్కువయ్యాయి. యష్మితో ఫ్లర్ట్ చేస్తున్నావా అని నిఖిల్తో అంది. యష్మిని పిలిచి మరీ క్లారిటీ తీసుకుంది. అలాంటిదేం లేదని యష్మి చెప్పేసరికి తనకు లైన్ క్లియర్ అయిపోయిందని సీత తెగ ఆనందపడిపోయింది. తనతో ఫ్లర్ట్ చేసుకున్నా పర్లేదు అని తెగ హింట్స్ ఇచ్చింది. మరోవైపు పృథ్వీ-సోనియా మధ్య కూడా సమ్థింగ్ సమ్థింగ్. ఎందుకంటే యష్మి అంటే ఇష్టమా? అని పృథ్వీని సోనియా అడిగింది. అలాంటిదేం లేదే అని పృథ్వీ చెప్పినప్పటికీ నవ్వేసింది.ఇక రెండో గేమ్లో గెలిచిన తర్వాత సోనియా బుగ్గపై పృథ్వీ ముద్దుపెట్టేశాడు. అంతకు ముందు కిచెన్లోనూ సీత.. పృథ్వీని హగ్ చేసుకుంది. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీల కోసం హౌస్మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు. పులిహోర కబుర్లు చెప్పి మరీ కంటెంట్ ఇస్తున్నారు. మరి ఈ యవ్వారాలన్నీ ఏ తీరానికి చేరుతాయో చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss 8: రూల్స్ పాటించరు.. పైగా అరుస్తూ దబాయింపు) -
Bigg Boss 8: రూల్స్ పాటించరు.. పైగా అరుస్తూ దబాయింపు
బిగ్బాస్ 8 ప్రస్తుతం 16వ రోజు వరకు వచ్చేసింది. హౌస్లో ఇన్నిరోజులు ఉన్నారంటే ఎప్పుడు ఎలా ఆడాలి? గేమ్లో ఎలా గెలవాలి? అనేది కంటెస్టెంట్స్కి అర్థమైపోవాలి. కానీ కొందరికీ అవి అర్థం కావట్లేదా? తెలియనట్లు ప్రవర్తిస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ప్రేరణ, అభయ్ తీరు చూస్తే అలానే అనిపించింది. తొకల్లో సంచాలక్ అని ఒకరంటే.. ఇకపై గేమ్స్ ఆడను, కావాలంటే బయటకు పంపేయ్ అని మరొకరు అన్నారు.రేషన్ గెలవడం కోసం ఇచ్చిన రెండో టాస్క్ 'నత్తలా సాగకు ఒక్కటీ వదలకు'. ఇందులో భాగంగా క్యాబేజీని నత్తలా పాకుతూ తలతో కొంతదూరం తోసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రెండు క్లాన్స్ సభ్యులు బాగానే ఆడారు. అయితే గేమ్ సంచాలక్గా వ్యవహరించిన నాగమణికంఠతో ప్రేరణ గొడవపడింది. తొక్కలో సంచాలక్ అని అరుస్తూ గట్టిగానే చెప్పింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం)ఇక మనసుకు నచ్చిన ఆహారాన్ని పొందేందుకు బిగ్బాస్ ఇచ్చిన మూడో టాస్క్ 'బూరని కొట్టు రేషన్ పట్టు'. ఇందులో భాగంగా తలో టీమ్ నుంచి ఒక్కొక్కరు ఒళ్లంతా బూరలు అంటించుకుని బాక్సులో ఉంటారు. ఒకరు బూరల్ని మరొకరు ఇచ్చిన టైంలో పేలగొట్టాల్సి ఉంటుంది. నిఖిల్తో పోటీపడిన అభయ్ నవీన్.. పదేపదే గీత దాటి బయటకొచ్చేశాడు. సంచాలక్ సోనియా ఇదే విషయం చెప్పినా వినిపించుకోలేదు. తీరా నిఖిల్ని విజేతగా ప్రకటించేసరికి రెచ్చిపోయాడు. ఇక నుంచి ఏ గేమ్ ఆడను, బయటకు పంపించేసిన ఓకే అని కెమెరా వంక చూస్తూ సీరియస్గా చెప్పాడు. అంటే ఏం చేస్కుంటావో చేస్కో అని బిగ్బాస్ని అన్నట్లే.పైరెండు సందర్భాలు చూస్తే ప్రేరణ, నవీన్ ఇద్దరు కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ గేమ్ రూల్స్ పాటించలేదని విషయాన్ని మర్చిపోతున్నారు. అయితే వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జునతో చెప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారా? లేదంటే ఇది వాళ్ల గేమ్ ప్లాన్ అనేది తెలియాలి. ఇంకా ఈ రోజు ఏమేం జరిగిందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్)