cows
-
పుట్టింటి గోవు.. ఆ ఇంటికి ఆదరువు
కుమార్తెకు పెళ్లిచేస్తే.. తోడుగా గోవును సాగనంపడం కొన్ని కుటుంబాల్లో ఆచారం. ఆస్తిపాస్తులు లేని గ్రామీణ పేదలు ఇలా గోవును కట్నంగా సమర్పించుకోవడం ఆనవాయితీ. ఆ నూతన వధూవరులిద్దరూ కట్నంగా వచ్చిన గోవును వరంగా భావించి.. దానిలోనే మహాలక్ష్మిని చూసుకున్నారు.పుట్టింటి కానుకతో మెట్టినింట కాసుల పంటగా మలుచుకున్నారు. ఆ గోవుతో ఏకంగా 150 ఆవుల పాడిని సృష్టించారు. నలుగురు పిల్లల పెళ్లిళ్లు మంద ఆదాయంతోనే కానిచ్చారు. కరువు సీమలో ఒక్క ఆవుతో కరువును జయించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అయ్యమ్మ, వీరారెడ్డి కుటుంబం. – మంత్రాలయంఆ ఇంట అదే కామదేనువుకర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన మూకయ్య, బంగారమ్మ దంపతుల పెద్ద కుమార్తె అయ్యమ్మ. ఆమెకు 18వ ఏట కోసిగి గ్రామానికి చెందిన కామన్దొడ్డి వీరారెడ్డితో వివాహం నిశ్చయించారు. మూకయ్య స్థోమతకు తగ్గట్టు అయ్యమ్మకు కట్నంగా గోవును ఇవ్వాలని నిర్ణయించి సుమారు 30 ఏళ్ల క్రితం పెళ్లి బాజాలు మోగించారు. అప్పగింతల రోజున తండ్రి మూకయ్య ఓ పెయ్యి ఆవును అయ్యమ్మకు ఇచ్చి భర్తతో మెట్టినింటికి సాగనంపాడు. అయ్యమ్మ, వీరారెడ్డి అనుబంధం వరకట్నంగా వచ్చిన ఆవుతోనే మొదలైంది. గోవునే వరలక్ష్మిగా భావించి.. కూలీనాలి చేసుకుంటూ ఆ దంపతులిద్దరూ గోవును పెంచుకున్నారు. తొలి చూడిలోనే అది మరో పెయ్యి దూడకు జన్మనిచ్చింది. ఇలా ఏడాదికి రెండు ఆవుల చొప్పున జన్మించగా.. పుట్టిన ఆవుల సంతతిని విక్రయించకుండా కుటుంబ పోషణకు వనరుగా ఆ దంపతులు మలచుకున్నారు. కూలి పనులు మానేసి పశువులను పోషించుకుని కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చారు. ఇలా 30 ఏళ్లలో ఆవుల సంతతి 150కి పెరిగింది. వారింట అడుగుపెట్టిన గోవు సుమారు 16 ఏళ్ల క్రితం మరణించగా.. దాని సంతతి మాత్రం ఇప్పటికీ వృద్ధి చెందుతూనే ఉంది.వలసబాట పట్టకుండా..ఏటా వయసు మళ్లిన ఆవులు, దూడలను విక్రయిస్తూ అయ్యమ్మ, వీరారెడ్డి దంపతులు బాగానే కూడబెడుతున్నారు. ఏటా 10 టన్నులకు పైగా ఆవు పేడను సైతం రైతులకు విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతుల వద్ద 50 గోవులు ఉన్నాయి. కోసిగి ప్రాంతం కరువుకు ప్రసిద్ధి. ఇక్కడ వ్యవసాయ పనులు ముగియగానే ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలసపోతుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి బతుకు బండి నడుపుకుంటారు. ఏటా ఎంత లేదన్నా 15 వేల కుటుంబాలకు పైగా ఇక్కడి నుంచి వలస వెళ్తారు. అయితే, అయ్యమ్మ కుటుంబం ఏ ఒక్కరోజు వలసబాట పట్టలేదు. పాడితో కరువును జయించడం ఎలాగో అయ్యమ్మ కుటుంబానికి చూస్తే బోధపడుతుంది.ఊపిరి ఉన్నంత వరకు వదలనుమా అయ్యకు మేం ఐదుగురు కూతుళ్లం. నేను పెద్ద కూతుర్ని. మా నాన్న ఓ ఆవును కట్నంగా ఇచ్చాడు. తోబుట్టువులు నలుగురికి ఒక్కో ఆవును కట్నంగా ఇచ్చాడు. నేను అదే ఆవుతోనే జీవితం ఆరంభించాను. ఊపిరి ఉన్నంతవరకు పాడి పోషణను వదలను. నేను తనువు చాలించినా పాడిని వదల పెట్టవద్దని నా పిల్లలకు చెబుతాను. గోవులు లేకుంటే మా బతుకు ఎలా ఉండేదో ఊహించలేను. – కామన్దొడ్డి అయ్యమ్మ, కోసిగిఎప్పుడూ ఇబ్బంది పడింది లేదుఅత్తమామలు ప్రేమతో ఆవును కట్నంగా ఇచ్చారు. దానిని మేం దైవంగా స్వీకరించాం. ఆవు పోషిస్తూ పాడిని పెంచాం. ఏనాడూ పాడి పోషణలో విసుగు చెందలేదు. ఇబ్బంది పడింది కూడా లేదు. ఇద్దరం పాడిని చూసుకుంటూ సంసారం కొనసాగించాం. మేం ఇప్పటివరకు కరువును చూడలేదు. ఇక్కడి నుంచి ఎంతోమంది వలసపోతున్నారు. మేం మాత్రం ఏ రోజూ వెళ్లలేదు. మా మామ మూకయ్య నేటికీ మా ఆదర్శ జీవనంపై ఆనందం వ్యక్తం చేస్తాడు. – కామన్దొడ్డి వీరారెడ్డి, కోసిగిపైసా అప్పు లేకుండా పెళ్లిళ్లుఅయ్యమ్మ, వీరారెడ్డి దంపతులకు రాముడు, ఈరయ్య, వీరభద్ర, మహేష్, కుమార్తె రామేశ్వరమ్మతో కలిపి ఐదుగురు సంతానం. పెద్ద కుమారుడు రాముడికి 20వ ఏట వివాహం జరిపించారు. ఆ పెళ్లికి రూ.30 వేలు ఖర్చు కాగా.. మందలో కొన్ని దూడలను విక్రయించి గట్టెక్కారు. రెండో కొడుకు ఈరయ్యకు 21వ ఏట వివాహం జరిపించగా.. రూ.50 వేలు ఖర్చయ్యింది. దీంతో కొన్ని ఆవులు, దూడలను విక్రయించారు. మూడో కొడుకు వీరభద్ర పెళ్లికి రూ.1.50 లక్షలు ఖర్చు కాగా.. అందుకు కూడా లేగ దూడలను అమ్మి శుభకార్యం జరిపించారు. నాలుగో కుమారుడు మహేష్కు రెండేళ్ల క్రితం వివాహం చేయగా.. రూ.3 లక్షలు ఖర్చయ్యింది. ఆ మొత్తాన్ని కూడా కొన్ని దూడల్ని విక్రయించి సొమ్ము సమకూర్చుకున్నారు. ఇక ఒక్కగానొక్క కూతురు రామేశ్వరమ్మకు సంబంధాలు వెతుకుతున్నారు. -
ఆత్మీయ నేస్తాలు.. పుంగనూరు పొట్టి దూడలు
మూడడుగుల ఎత్తుంటాయి.. చూడముచ్చటగా కనిపిస్తాయి. మార్కెట్లో ధర మాత్రం లక్షల్లో పలుకుతాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ పుంగనూరు పొట్టి దూడలను పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. అదృష్ట చిహ్నంగా భావించే ఈ దూడలను పెంచుకునేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో ఔత్సాహిక రైతులు చిట్టి ‘పొట్టి’ నేస్తాలను ప్రత్యేకంగా ఉత్పత్తి చేయిస్తున్నారు. అపురూప దూడలను విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ విశిష్ట జాతిని మరింతగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోపొట్టి దూడల సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. పలమనేరు : పుంగనూరు పొట్టిరకం దూడల పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పుట్టిన సమయంలో ఈ దూడ కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. జీవితకాలంలో కేవలం మూడడుగులు మాత్రమే పెరుగుతుంది. తోక నేలను తాకేలా ఉండే ఈ రకం దూడలకు ప్రస్తుతం భలే డిమాండ్ వచ్చింది. ఫస్ట్ క్వాలిటీ రకం దూడలు రూ.2 నుంచి 4 లక్షలు పలుకుతున్నాయి. రెండో క్వాలిటీ దూడలు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రేటుకు అమ్ముడవుతున్నాయి. ఈ దూడలు ఇంట్లో ఇంటే ఆరోగ్యంతో పాటు అదృష్టం వరిస్తుందనే మాట వినిపిస్తోంది. వీటిని కొనేందుకు వందలాదిమంది నిత్యం పశువుల సంతలు, రైతుల వద్దకు తిరుగుతున్నారు. సాధారణంగా ఇళ్లలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల జాబితాలో ఇప్పుడు పొట్టిదూడలు సైతం చేరిపోయాయి. వీటికి పేరు పెట్టి ఆ పేరుతో పిలిస్తే వెంటనే వచ్చేస్తాయి. 15 సెం.మీ నుంచి 50 సెం.మీ మాత్రమే ఎత్తు కలిగిన ఈ దూడలు ముద్దులొలుకుతుంటాయి. పొట్టి ఆవులు 85 సెం.మీ నుంచి 110 సెం.మీ ఎత్తు పెరుగుతాయి. పలమనేరు ప్రాంతంలో కొందరు రైతులు వీటిని ఫామ్స్లో మేపి పొట్టి జాతిని ఉత్పత్తి చేయిస్తూ వాటిని రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పొట్టి రకం దూడల వ్యాపారం ఊపందుకోవడం విశేషం. ఇందుకే అంత డిమాండ్ పుంగనూరు పశువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి యజమానులపై విశ్వాసం ప్రదర్శిస్తాయి. æ పొట్టి దూడలు ఇంట్లో తిరుగుతుంటే చాలా మంచిదని జనం నమ్ముతారు. పొట్టి ఆవులు ఇచ్చే పాలలో రోగనిరోధకశక్తి అధికంగా ఉంటుంది. ఈ పాలను సేవిస్తే అనారోగ్యం దరిచేరదని విశ్వాసం.తక్కువ మేత.. అధిక పాల దిగుబడిపలమనేరు సమీపంలోని క్యాటిల్ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం ప్రారంభమైంది. ఇది 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. మేలైన పుంగనూరు ఎద్దుల వీర్యాన్ని పుంగనూరు రకం పొట్టి ఆవులను పెంచుతున్న రైతులకు అందిస్తోంది. వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు ఆర్కేవీవై కృషి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, ఇందులో 277 వరకు పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోనే ఉన్నాయి. ఈ పశువులు తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాల దిగుబడినిస్తాయి. వీటి మూత్రంలో సైతం ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.రైతులకు అందిస్తున్నాం పలమనేరు పరిశోధన కేంద్రంతోపాటు ఏపీ ఎల్డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని రైతులు పొందవచ్చు. ఆవు ఎదకొచ్చిన తర్వాత స్థానిక వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో సెమన్ అందిస్తున్నాం. పుంగనూరు పొట్టిజాతిని అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఈ వీర్యం అవసరమైన రైతులు క్యాటిల్ఫామ్లో కూడా తీసుకోవచ్చు. –వేణు, శాస్త్రవేత్త, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, తిరుపతి మూడేళ్లుగా పెంచుతున్నా మూడేళ్లుగా పుంగనూరు రకం పొట్టి దూడలు పెంచుతున్నా. దేశవాళీ రకం పుంగనూరు ఆవుల ద్వారా దూడలను ఉత్పత్తి చేయిస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలామంది పొట్టి దూడలు పెంచుతున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంది. ఆసక్తి ఉంటే రైతులకు ఇది ఎంతో లాభదాయకం. – మణి, రైతు, మారేడుపల్లె, గంగవరం మండలం -
భారీస్థాయిలో సిద్ధేశ్వర అగ్రికల్చరల్ షో, క్యాట్ అండ్ డాగ్ షో కూడా
సోలాపూర్: పట్టణంలోని ఓం మైదానంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25 వరకూ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించనున్నట్లు శ్రీ సిద్దేశ్వర దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ధర్మరాజు కాడాది తెలిపారు. స్మార్ట్ ఎక్స్ పో గ్రూప్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆత్మా, జిల్లా పరిషత్ విభాగం సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా 300 స్టాల్స్ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ పరిశోధన కేంద్రం, సోలాపూర్ దానిమ్మ పరిశోధన కేంద్రం, జొన్న పరిశోధన కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సోలాపూర్ , మోహల్ డివిజన్, సిల్క్ ఖాదీ గ్రామద్యోగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, సామాజిక అటవీ, జాతీయ బ్యాంకులు, నాబార్డ్, చక్కెర కర్మాగారాల సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ సాంకేతిక ఉత్పత్తులు, వ్యవసాయ యాంత్రికీకరణ, పాల ఉత్పత్తి, సెరికల్చర్, తేనెటీగల పెంపకం, అగ్రి బిజినెస్,వర్టికల్ ఫారి్మంగ్, ఆధునిక వ్యవసాయ పనిముట్లకు సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని రైతులు సులభంగా పొందగలుగుతారని చెప్పారు. ఈ వ్యవసాయ ప్రదర్శనలో సోలాపూర్కు గర్వకారణమైన ఖిలార్ ఎద్దులు, ఆవులతోపాటు ప్రపంచంలోనే అరుదైన, అత్యంత పొట్టి రకమైన పుంగనూరు దేశీయ ఆవులను కూడా ప్రదర్శించనున్నట్లు ధర్మరాజు కాడాది పేర్కొన్నారు. సోలాపూర్, నాసిక్, పుణే రైతులు ఉత్పత్తి చేసిన దాదాపు 500 రకాల అరుదైన దేశవాళీ విత్తనాల ప్రదర్శన, విక్రయాలను చేపట్టనున్నట్లు తెలిపారు.క్యాట్, డాగ్ షో అలాగే డిసెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాట్, డాగ్ షో పోటీలు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని, డిసెంబర్ 23న రాష్ట్రస్థాయి దేశవాళీ ఆవులు, ఎద్దుల ప్రదర్శన, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. అదేరోజున పుష్ప ప్రదర్శన కూడా జరుగుతుందని ధర్మరాజు కాడాది వివరించారుప్రదర్శనకు సంబంధించిన ఇతర విశేషాలు.. 300 కు పైగా కంపెనీల హాజరు ప్రముఖ కంపెనీల ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వాహనాల ప్రదర్శన. భయనా నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తున్న ఆరు కిలోల కోడి ప్రపంచంలోనే అతి పొడవైన దేశీయ మిరపకాయల ప్రదర్శన ప్రత్యేక హాలులో ఆర్గానిక్ ఫార్మింగ్, యానిమల్, బర్డ్, ఫ్లవర్ ఎగ్జిబిషన్ రైస్ ఫెస్టివల్, వ్యవసాయ సాహిత్య ప్రదర్శన -
అనాథ జీవాలకు అమ్మా.. నాన్న
సాటి మనిషికి సాయం చేయలేని మనుషులున్న నేటి రోజుల్లో మూగజీవాలను కూడా ప్రేమతో...అక్కున చేర్చుకుంటున్నారు.. ఆకలితో ఉన్న జీవాలకు ఆపన్నహస్తంగా ఆహారం పంపిణీ చేస్తున్నారు.. వారి ఇంటి దరిదాపుల్లో వివిధ జాతుల ఆవులు, దూడలు, కుక్కలు, పిల్లులు, కోతులు, కాకులు.. ఇలా ఒక్కటేమిటి..ఎన్నో మూగ జీవాలు చూపరులను అబ్బురపరుస్తాయి. అటుగా వెళ్లేవారికి ఆ మూగజీవాలు తారసపడుతుంటాయి. వీటిని అక్కున చేర్చుకున్న వారే కూకట్పల్లికి చెందిన మణికొండ దేవేందర్రావు, రమాదేవి దంపతులు. ఇదంతా వీరు గుర్తింపు కోసమో.. లేక వ్యాపారం కోసమో అనుకుంటే పొరపాటే.. వారికి తెలిసిందల్లా ఒక్కటే.. వాటికి నిస్వార్థంగా సేవ చేయడమే.. – తొట్ల పరమేష్ఆపదలోని మూగ ప్రాణులకు ఆపన్నహస్తంఅక్కున చేర్చుకుని ఆహారం పంపిణీ వందల సంఖ్యలో జీవాలకు సేవ నవ సేవే.. మాధవ సేవ.. ఇది అందరికీ తెలిసిన నానుడి. కానీ సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ అన్నది వారి పంథా. ఔను..భువిపై తనకు మాత్రమే హక్కు అన్నట్లు జీవుడు విర్రవీగుతుంటాడు. కానీ ఇలపై మనిషి ఎలాగో అన్ని ప్రాణులకూ జీవించే హక్కు ఉందంటూ వారు నినదిస్తున్నారు. ఆపై సేవకు అంకితమయ్యారు. ఒకటి కాదు..రెండు కాదు..వందల సంఖ్యలో మూగ జీవాలను అక్కున చేర్చుకుని కన్న బిడ్డల మాదిరిగా సాకుతున్నారు. మనిషికి మనిషే బరువైన ప్రస్తుత సమాజంలో ప్రతి ప్రాణినీ తన బిడ్డగా భావిస్తూ నిస్వార్థ సేవకు నిర్వచనం.. కూకట్పల్లికి చెందిన మణికొండ దేవేందర్రావు, రమాదేవి దంపతులు. వీరితోపాటు వీరి ఇద్దరి బిడ్డలు సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా కూడా మూగ జీవాల సేవలో తరిస్తున్నారు. జీవాలకూ సొంత పేర్లు...వీరి ఇంటి దరిదాపుల్లో వెళ్లిన వారికి కొన్ని పేర్ల పిలుపులు వినిపిస్తుంటాయి.. కొత్తగా వినేవారికి ఎవరి కోసమో వెతుకుతున్నారని పొరపడతారు.. కానీ, వారు పిలిచేది మూగజీవాలని తెలిశాక ఆశ్చర్యపోక మానరు... ‘ఏయ్ లక్ష్మీ ఇటు రావే..ఓయ్ శివా అటు వెళ్లరా..!’ ఎలాగైతే మనం సాటి మనుషులతో మాట్లాడతామో! అలాగే వారు మూగ జీవాలతో మాట్లాడుతుంటారు. వాటికి పేర్లు పెట్టడమే కాదు..ఆ పేరుతో పిలిస్తే అవి కూడా ఠక్కున అలెర్ట్ అయ్యి వారు చెప్పింది చేసేస్తాయి. మమకారం చూపించాలే గానీ మూగ జీవాలు అంతకంటే ఎక్కువ వాత్సల్యాన్ని చూపిస్తాయని ఆ దంపతులు నిరూపిస్తున్నారు. పేరు పెట్టి వారు రమ్మంటే వచ్చేస్తాయి.. వెళ్లు అంటే వెళ్లిపోతాయి..తిను అంటే తినేస్తాయి..ఇక చాలు అంటే ఆపేస్తాయ్..అంతగా మూగ జీవాలతో వారికి బాండింగ్ ఏర్పడింది.పక్కాగా టైం పాటిస్తూ.. మూగ జీవాలకు ఆహారంతో పాటు ప్రేమాప్యాయతలు కలగలిపి వడ్డిస్తారో ఏమో గానీ ఎక్కడున్నా సరే..రోజూ పక్కాగా టైం ప్రకారం వీరి వద్దకు వచ్చేస్తాయి. ఒక్క కాకులు, పావురాలే కాదు ఆవులు, కుక్కలు, పిల్లులు, కోతులు వాటికి నిర్దేశించిన సమయాల్లో వచ్చి వీరి రోజువారీ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తుంటాయి. ఇలా ఉదయం 6–7 గంటలకు ప్రారంభమయ్యే మూగ జీవాల రాక సాయంత్రం 7 గంటల వరకూ కొనసాగుతుంటుంది. ఉదయం6–7 గంటల మధ్య కాకులు, 9 గంటలకు పావురాలు, 10 గంటలకు ఆవులు, మధ్యాహ్నం 3 గంటలకు కుక్కలు, సాయంత్రం పిల్లులు..ఇలా ఒక్కో సమయంలో ఒక్కో మూగ జీవాలు ఇక్కడకు వచి్చపోతుండడం గమనార్హం.ఆవుల గైనిక్..రమాదేవిఆవుల ప్రసవానికి వచ్చాయంటే జీహెచ్ఎంసీలో గుర్తుకొచ్చే వైద్యురాలు రమాదేవి. తమ వద్దకు వచ్చే ఆవులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని గోశాలల్లో ఎక్కడైనా సరే ఆవులు ఈతకు వచ్చాయంటే ఆమెనే దగ్గరుండి ప్రసవం చేస్తారు. భుమి మీదకు వచ్చే ఆవు దూడపై మొదట తన చేతులు పడాల్సిందే.. ఒకరకంగా ఆమె ఆవులకు గైనిక్గా మారిపోయారు.లేగ దూడలకు ప్రత్యేక బెడ్మూగ జీవాల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ వాటికి సపర్యలు చేస్తుంటారు. వాటిని తనకుటుంబ సభ్యులు, పిల్లల మాదిరిగానే బెడ్ మీద పడుకోబెట్టి సేవలందిస్తారు. ఓసారి 20 రోజుల లేగదూడకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరగటంతో విషయం తెలుసుకున్న రమాదేవి రహదారి వద్దకు వెళ్లి దానిని ఆటోలో తీసుకొచ్చి అక్కడ నుంచి పశువుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో మూడు గంటల పాటు వేచి ఉండి డాక్టర్ను పిలిపించి చికిత్స చేయించిన అనంతరం రమాదేవి భర్త దేవేందర్రావు ఆ లేగ దూడను తన బెడ్పై పడుకోబెట్టి ఆహారంలో మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చి రెండు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మరణించిన వాటికి అంత్యక్రియలుదెబ్బతగిలిన లేగదూడ కొద్ది రోజుల తరువాత మూర్చ వ్యాధితో చనిపోయింది. దాంతో మనస్తాపానికి గురైన వారు లేగదూడను బహిర్భూమిలో వదిలివేయకుండా మనుషులకు చేసిన విధంగానే లేగ దూడకు అంత్యక్రియలు నిర్వహించి కొద్ది రోజుల పాటు ఆ దంపతులు దిగులుతో రెండు మూడు రోజులు ఆహార పానీయాలు కూడా ముట్టలేదు. ఈ విధంగా మూగ జీవాలతో వారి అనుబంధం కొనసాగింది. కుక్కలకు కూడా ఏ చిన్న దెబ్బ తాకినా వాటికి చికిత్స చేయించి మందులు ఇవ్వటం వారికి అలవాటుగా మారింది. కాంక్రీట్ జంగిల్లోనూ కావ్..కావ్..జాడ పితృ దేవతలకు ప్రతీకగా కాకులను విశ్వసిస్తారు. అలాంటి కాకులను కాంక్రీట్ జంగిల్లో భూతద్దం పెట్టి మరీ వెతికినా కనిపిస్తాయో లేదో తెలియదు. కనుమరుగు అయిపోతున్నాయి అనుకుంటున్న కాకులు సైతం రోజూ ఠంచనుగా ఒకే సమయంలో వీరి ముంగిట వాలిపోతుంటాయి. వారు అందించే ఆహారాన్ని ఆరగించి వెళ్లిపోతుండడం ఇక్కడ నిత్యకృత్యమే.ఐదేళ్ల క్రితం ప్రారంభమై... ఐదేళ్ల క్రితం మాట.. రెండు మూడు ఆవులతో ప్రారంభమై రోజులు గడిచే కొద్దీ ఆవుల సంఖ్య పెరిగింది. వీటికి తోడుగా కుక్కలు, పిల్లలు, కోతులు, కాకులు, పావురాలు.. ఇలా 70 వరకూ ఆవులు, 40 వరకు కుక్కలు, 15 వరకు పిల్లులు, 15 వరకు కాకులు, మరెన్నో పావురాలు వచ్చిపోతున్నాయి. అయితే ఇటీవల కోతులు కూడా వచ్చేవి. కానీ కుక్కల భయంతో అవి రావడం మానేశాయి.నెలకు లక్షన్నర ఖర్చు..మూగ జీవాలకు ఆహారం కోసం నెలకు లక్షన్నర వరకూ ఖర్చు చేస్తున్నారు. ఆవుల కోసం ప్రతిరోజూ రకరకాల కూరగాయలు, ఫలాలు, కుక్కల కోసం ఇంట్లో నాన్వెజ్ తినకపోయినప్పటికీ ప్రత్యేకంగా నాన్వెజ్ తెప్పించి పెడతారు. నెలకు నాలుగు క్వింటాళ్ల రైస్ మూగ జీవాల కోసం కొనుగోలు చేస్తుంటారు. -
గోశాలలో గోవుల గోస
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న గోశాలలో వసతులు కరువయ్యాయి. భక్తుల విశ్వాసంగా నిలిచే కోడెమొక్కుల కోడెలకు కనీస సౌకర్యాలు లేవు. వానకు తడుస్తూ.. ఎండకు ఇబ్బందిపడుతూ ఆరుబయటే ఉంటున్నాయి. చిన్నపాటి వర్షానికే బురదమయమవుతున్న నేలపైనే పడుకుంటున్నాయి. కనీస వసతులు లేక భక్తులు అందించే కోడెలు గోశాలలో ఇబ్బంది పడుతున్నాయి. కనీసం గోవులు నిల్చోలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కోడెమొక్కుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం వసతుల కల్పనపై ఆలయ అధికారులు దృష్టి పెట్టడం లేదు. రూ.కోట్లు వస్తున్నా..వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడెమొక్కులు చెల్లిస్తుంటారు. కోడె మొక్కు టికెట్ ధర రూ.200 ఉంది. అలాగే కోడెమొక్కుల ద్వారా స్వామికి వచ్చే ఆదాయం ఏడాదికి దాదాపు రూ.22 కోట్ల వరకు ఉంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా గోశాలలో మాత్రం సౌకర్యాలు లేవు. గోశాలల్లోని కోడెల సంరక్షణకు ఏటా రూ.2 కోట్ల వరకు వెచ్చిస్తున్నా, ఈ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కలి్పంచలేకపోతున్నారు. వసతికి మించిన కోడెలు..రాజన్న ఆలయానికి రెండు గోశాలలు ఉన్నాయి. గుడి చెరువు కట్ట కింద ఉన్న గోశాలలో 150 కోడెలు, 20 ఆవులు ఉన్నాయి. రాజన్నకు మొక్కులు చెల్లించే కోడెలను, ఆవులను ఉంచుతారు. తిప్పాపూర్లో రెండో గోశాల ఉంది. ఇక్కడ 300 కోడెల కోసం రేకులòÙడ్డు వేశారు. కానీ ఆరు నెలల క్రితం కోడెలను రిజి్రస్టేషన్ ఉన్న గోశాలకు ఇవ్వకుండా..అధికారులను తప్పుదోవ పట్టించి తీసుకెళ్లడంతో అప్పటి నుంచి ఇతర గోశాలలకు రాజన్న కోడెలు, ఆవులను ఇవ్వడం లేదు. కోడెలను తిప్పాపూర్ గోశాలలోనే సంరక్షిస్తున్నా రు. ఇక్కడ 300 కోడెలకు వసతి ఉండగా..ప్రస్తుతం 1,600 కోడెలు ఉన్నా యి. దీంతో చిన్నపాటి వర్షానికే గోశాల బురదమయం కావడంతో కోడెలు కనీసం పడుకునే పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక చోట, రాత్రి నుంచి తెల్లారేవరకు మరో చోట కోడెలను ఉంచుతున్నారు.తడిస్తే వ్యాధుల బారినపడే అవకాశం ఉంది వర్షాకాలంలో పశువులు, ఆవులతో జాగ్రత్తగా ఉండాలి. వర్షంలో తడిస్తే బలహీనమై వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. కాళ్లు మెత్తబడి డెక్కల్లో పుండ్లు అవుతాయి. సరిగా తినలేకపోతాయి. ఎప్పటికప్పుడు పేడ తియ్యకపోతే ఏదైనా ఒక్క ఆవుకు రోగం వస్తే అన్ని ఆవులకు సంక్రమించే అవకాశం ఉంది. బురద ఎక్కువైతే కాలు జారి కిందపడే అవకాశాలు ఉన్నాయి. – ప్రశాంత్రెడ్డి, మండల పశువైద్యాధికారి, వేములవాడ త్వరలోనే అందిస్తాంభక్తులు అందించిన కోడెలను తిప్పాపూర్ గోశాలలో సంరక్షిస్తున్నాము. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉన్నాయి. ఆలయ అధికారులతో కమిటీ నియామకానికి కలెక్టర్కు ఫైల్ పంపించాం. కమిటీ ఆదేశాలతో కోడెలను రైతులకు, రిజిస్ట్రేషన్ ఉన్న గోశాలలకు అందిస్తాం. వారం రోజుల్లోగా ఆదేశాలు వస్తాయని అనుకుంటున్నాం. – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో -
రాజన్న కోడెలు పక్కదారి!
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న భక్తులు శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో కోడెలను, ఆవులను అందజేస్తుంటారు. తమ కోరికలు నెరవేరితే కోడెమొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్న భక్తులు పలువురు కోడెలను ఆలయ గోశాలకు అప్పగిస్తుంటారు. ప్రధానంగా రైతులు తమ ఇంట్లో శుభకార్యాలు జరిగితే కోడెను తీసుకొచ్చి రాజన్న ఆలయానికి అప్పగించడం అనాదిగా జరుగుతోంది. అయితే ఈ కోడెలు, ఆవుల పోషణ ఇబ్బందిగా మారడంతో ఆలయ అధికారులు ఇటీవల వివిధ ప్రాంతాల్లోని ఇతర గోశాలల నిర్వాహకులకు కొన్ని కోడెలు, ఆవులను అందజేస్తున్నారు. వారు వాటిని పోషించడం లేదా రైతులకు అందజేయాల్సి ఉండగా.. కొందరు నిర్వాహకులు ఇతరులకు విక్రయిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అలాగే అసలు లేని గోశాలల పేరిట కూడా కొందరు కోడెలు తీసుకెళ్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల స్టేషన్ఘన్పూర్లో కోడెలతో వెళ్తున్న వ్యాన్ పట్టుబడడం, వారు చెప్పిన గోశాల అసలు లేనట్లు తేలడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. పోషణ భారం తగ్గించుకునేందుకు.. వేములవాడ రాజన్న ఆలయ గోశాలలు స్థానిక తిప్పాపూర్లో ఒకటి, గుడిచెరువు కట్టకింద ఒకటి ఉన్నాయి. తిప్పాపూర్ గోశాలలో సుమారు 150 కోడెలు, వేములవాడ కట్టకింద గోశాలలో 150 కోడెలు, ఆవులు ఉన్నాయి. వేములవాడ కట్టకింద గోశాలలోని కోడెలను ఆలయంలో కోడె మొక్కుల కోసం తీసుకెళ్తుంటారు. ఆవులను స్వామి వారి పూజకు ఉపయోగపడే పాల కోసం వినియోగిస్తున్నారు. తిప్పాపూర్ గోశాలలో భక్తులు అప్పగించిన కోడెలు ఉంటాయి. ఇక్కడి కోడెలు ఎక్కువైనప్పుడు నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఇతర గోశాలలకు అప్పగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమి పట్టా పాస్బుక్కు ఉన్న రైతులకు పెంచుకునేందుకు ఉచితంగా అందజేసేవారు. తర్వాత కాలంలో వేలం ద్వారా రైతులకే అమ్మేవారు. అయితే 2012 నుంచి తెలంగాణ గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో లేఖ తెచ్చుకున్నవారికి ఉచితంగా ఇస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో.. ఈనెల 2న తిప్పాపూర్ గోశాలలోని 20 కోడెలను ఫెడరేషన్ లేఖ తెచ్చుకున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బాతండాలోని శ్రీ సోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘానికి అందజేశారు. ఈ కోడెలతో బయలుదేరిన వ్యాన్ను జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో బజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకుని తనిఖీ చేశారు. 20 కోడెలు ఉండాల్సి ఉండగా 24 కనిపించడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో దుబ్బాతండాలో ఈ పేరుతో గోశాల లేదని తేలింది. దీంతో ఈ వ్యాన్ను నేరుగా స్టేషన్ఘన్పూర్ పోలీస్స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కోడెలను ధర్మసాగర్ మండలంలోని గోశాలకు తరలించారు. గోశాల ఫెడరేషన్ సూచించిన గోశాలలకు కోడెలను అప్పగిస్తున్న అధికారులు.. ఈ కోడెలు గోశాలలకు వెళ్తున్నాయా.. లేదా? అని పరిశీలించకపోవడంపై భక్తులు, స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలపై విచారణ చేపట్టాలి రాజన్న ఆలయ కోడెలను ఈ ప్రాంత రైతులకు అప్పగించాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. కోడెల అప్పగింతలో అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలి. హిందువుల మనోభావాలను కాపాడాలి. – గడప కిశోర్, విశ్వహిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి ఫెడరేషన్ లెటర్ మేరకే ఇచ్చాం ఎప్పటిలాగానే తెలంగాణ గోశాల ఫెడరేషన్ నుంచి వచ్చిన లేఖ మేరకే కోడెలను అందించాం. కానీ అక్కడ గోశాల ఉందో.. లేదో మాకు తెలి యదు. ఈ విషయం ఫెడరేషన్ వారు చూసుకోవాలి. – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్గా హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్లో మా కుటుంబం అంతా హైదరాబాద్లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్కి కమిటీ మెంబర్గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అతడు అలా అనంగానే..ఆ ఆవులన్నీ ఒక్కసారిగా..!
ఆవులు మేత మేస్తున్నప్పుడూ వాటికి నచ్చినట్లు వెళ్లిపోతాయి. ఒక్కొసారి వాటిని కాస్తున్న వ్యక్తి మాటలు కూడా వినవు. అలాంటిది ఓ వ్యక్తి జస్ట్ చేతులు చూపించి సైగ చేయగానే అవన్నీ ఏదో అర్థమైనట్లు భలే బిహేవ్ చేశాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ సైకిలిస్ట్ ఇంగ్లాండ్లోని రెండో ఎత్తైన పర్వతం గ్రేట్ డన్ ఫెల్ మీదుగా వెళ్తూ కాసేపు బ్రేక్ తీసుకున్నాడు. ఇంతలో అతడివైపుకే ఉన్నట్టుండి ఆవులన్నీ వచ్చేస్తున్నాయి. ఆవులు కాస్తున్న రైతు వాటిని రోడ్డుమీదకు రానీయకుండా ఆపాలని కోరాడు. దీంతో ఆ సైకిలిస్ట్ ఆవుల మందకు ఎదురుగా నిలబడి గట్టిగా "స్టాప్" అని అరుస్తూ.. చేతులతో సంజ్ఞ చేశాడు. అంతే అవన్నీ ఏమనుకున్నాయో గానీ భలేగా ఒక్కసారిగా అన్నీ కదలకుండా రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఏ ఒక్కటి ముందుకు రాలేదు. పైగా ఆ రైతు వాటిని సమీపించేంత వరకు అలానే ఉండటం విచిత్రం. ఈ విషయాన్ని సైకిల్ రైడర్ "రైడ్లో నాకెప్పుడు ఎదరవ్వని విచిత్రమైన అనుభవం" అనే క్యాప్షన్తో ఈ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోకి మిలయన్లలో వ్యూస్ లైక్లు వచ్చాయి. View this post on Instagram A post shared by Andrew O'Connor (@andrewon2wheels) (చదవండి: "విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..) -
కలిసి కట్టుగా.. పులిని తరిమికొట్టిన ఆవుల మంద
ఐకమత్యమే మహాబలం.. మన చిన్నప్పటి నుంచి వింటున్న మాటే ఇది. ఆరణలోనూ ఇది సాధ్యమేనంటూ నిరూపించే ఘటనలనూ చూస్తూ వస్తున్నాం కూడా. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన ఓ ఘటన.. సీసీటీవీఫుటేజీ బయటకు రావడంతో వైరల్ అవుతోంది. ఆవుల మంద నుంచి ఒంటరిగా ఉన్న ఓ ఆవుపై నక్కినక్కి వచ్చి దాడికి దిగింది ఓ పెద్దపులి. దీంతో అది చావుకేకలు వేయగా.. అది చూసిన మిగతా ఆవులు బెదిరి చెల్లాచెదురు కాలేదు. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు ఉరికాయి. వాటి ధైర్యానికి ఆ పులి బెదిరింది. ఆవును వదిలేసి అక్కడి నుంచి పొదల్లోకి లంఘించుకుంది. అయితే పులి అక్కడక్కడే ఉండడంతో.. గాయపడిన ఆ ఆవును చుట్టుముట్టి మళ్లీ దాడికి దిగకుండా తెల్లవారే దాకా కాపలాగా ఉన్నాయి మిగతా ఆవులు. ఆదివారం అర్ధరాత్రి భోపాల్ కేర్వా శివారుల్లోని ఓ డెయిరీ ఫామ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. గాయపడిన ఆ ఆవు పరిస్థితి పాపం విషమంగా ఉన్నట్లు సమాచారం. संगठन में शक्ति है… भोपाल के मदरबुल फार्म में बाघ ने एक गाय पर हमला किया तो उस गाय को बचाने दौड़ पड़ा गायों का झुंड। देखिए वीडियो…#Bhopal #cows pic.twitter.com/678Gy4YyN2 — Upmita Vajpai (@upmita) June 20, 2023 ఇదీ చూడండి: ఆ ఊర్లో మహిళలంతా దుస్తుల్లేకుండా ఐదురోజులపాటు.. -
చిట్టి పొట్టి ఆవులు.. చలాకీ గోవులు
పుంగనూరు జాతిలోనే అత్యంత బుల్లి ఆవు ఇది. 12 అంగుళాల (అడుగు) ఎత్తు.. 36 అంగుళాల (3 అడుగుల) పొడవుండే ఈ ఆవులను ‘మైక్రో మినీయేచర్ పుంగనూరు’గా పిలుస్తున్నారు. మనుషులకు ఇట్టే మచ్చికయ్యే ఈ ఆవులు ఇళ్లు, అపార్ట్మెంట్లు అనే తేడా లేకుండా.. ఏ వాతావరణంలో అయినా.. ఎక్కడైనా పెరుగుతాయి. వీటి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. నట్టింట్లో గంతులేస్తూ.. చిన్నపిల్లల మాదిరిగా మారాం చేస్తూ.. యజమానుల చుట్టూనే ఇవి తిరుగుతున్నాయి. గతంలో పెరటికి మాత్రమే పరిమితమైన ఈ బుజ్జి గోవులు ఇప్పుడు బెడ్ రూముల్లోనూ సందడి చేస్తున్నాయి. ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని పంచుతున్నాయి. సాక్షి, అమరావతి: గోవులు.. మనుషులకు ఎంతో మచ్చికైన జంతువులు. భారతీయ సంస్కృతిలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్వ అఖండ భారతదేశంలో 302 జాతుల ఆవులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 32కు పరిమితమైంది. పొట్టి జాతి ఆవుల విషయానికి వస్తే మల్నాడ్ గిడ్డ (కర్ణాటక), వేచూరు (కేరళ), మన్యం (ఆంధ్రప్రదేశ్), బోనీ (బెంగాల్), మినీ మౌస్ (నేపాల్) జాతులు ఉన్నాయి. మన్యం–ఒంగోలు బ్రీడ్స్ నుంచి అభివృద్ధి చేసినవే పుంగనూరు ఆవులు. ఇవి 3నుంచి 5 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. పుంగనూరుతో సహా కనుమరుగైన పొట్టి జాతి గోవులను సంరక్షించాలన్న తపనతో కోనసీమ జిల్లాకు చెందిన ప్రముఖ నాడీపతి వైద్యుడు పెన్మత్స కృష్ణంరాజు సాగించిన పరిశోధనల ఫలితంగా అతి చిన్నవైన ‘మైక్రో మినీయేచర్ పుంగనూర్’ ఆవులు పురుడు పోసుకున్నాయి. ఏ వాతావరణంలోనైనా పెరిగేలా.. మట్టి నేలలతోపాటు గచ్చు, ఫామ్హౌజ్, టైల్స్, మార్బుల్స్తో కూడిన ఇళ్లు, అపార్టుమెంట్స్లో సైతం పెంచకునేలా 4 రకాలుగా వీటిని అభివృద్ధి చేశారు. అడుగు నుంచి రెండున్నర అడుగుల ఎత్తు, 40 నుంచి 70 కిలోల బరువుతో రోజుకు లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు పాలిచ్చేలా వీటిని అభివృద్ధి చేశారు. వీటిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పశుగ్రాసంతోపాటు ఎలాంటి ఆహారన్నయినా జీర్ణించుకోగలుగుతాయి. పెద్దలకే కాకుండా పిల్లలకు సైతం కూడా ఇట్టే మచ్చికవుతాయి. ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మందికి వీటిని అందించారు. మైక్రో మినీయేచర్ సహా వివిధ జాతులతో అభివృద్ధి చేసిన 500 వరకు పొట్టి జాతుల ఆవులు నాడీపతి గోశాలలో సందడి చేస్తున్నాయి. నిత్యం గో ప్రేమికులు ఈ గోశాలను సందర్శిస్తూ చెంగుచెంగున గంతులేసే పొట్టి గోవుల మధ్య పుట్టిన రోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటూ మురిసిపోతున్నారు. నాడీపతి గోశాలలో సందడి చేస్తున్న పొట్టి ఆవులు వాటి అల్లరి చెప్పనలవి కాదు ఏడాది వయసున్న 2 అడుగుల ఎత్తు గల రెండు మినీయేచర్ పుంగనూరు ఆవులను తీసుకెళ్లి మా అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని ప్లాట్లో పెంచుకుంటున్నాం. ఎలాంటి ఆహారం పెట్టినా తింటున్నాయి. మాతో పాటే వాకింగ్ చేస్తాయి. కారులో కూడా మా వెంట తీసుకెళ్తాం. ఇంట్లో అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కుటుంబంలో భాగమైపోయాయి. చిన్నప్పటి నుంచి పెరట్లో ఆవులను పెంచుకోవాలన్న మా కోరికను ఇలా తీర్చుకుంటున్నాం. – వల్లివాటి శ్రీనివాసబాబు, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ వాటి మధ్య ఉంటే టెన్షన్ హుష్కాకి మా ఇంట్లో రెండు మినీయేచర్ గిత్తలను పెంచుకుంటున్నాం. అవి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. వాటిని చూస్తే చాలు మాలో ఉన్న టెన్షన్స్ చేత్తో తీసేసినట్టు పోతాయి. మాతోనే ఉంటున్నాయి. మాతో పాటే తింటున్నాయి. వాటికి ప్రత్యేకంగా బెడ్స్ కూడా ఏర్పాటు చేశాం. మాతో పాటే పడుకుంటున్నాయి. – పి.సూర్యనారాయణరాజు, పత్తేపురం, పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మి, విష్ణు అని పేర్లు పెట్టాం రెండు మినీయేచర్ పుంగనూరు ఆవుల్ని తెచ్చుకున్నాం. లక్ష్మి, విష్ణు అని పేర్లు పెట్టుకున్నాం. పేరు పెట్టి పిలవగానే చెంగున వచ్చి ఒడిలో వాలిపోతాయి. వాటిని చంటిపాపల్లా చూసుకుంటున్నాం. అవి లేకుండా ఉండలేకపోతున్నాం. ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్తున్నాం. వాటితో గడుపుతుంటే మనసు ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది – అమటం పద్మావతి, విశాఖ ప్రపంచంలో ఎక్కడా లేవు 1,632 ఆవులను బ్రీడింగ్ చేయడం ద్వారా వీటిని ఒక అడుగు ఎత్తు వరకు తీసుకురాగలిగాం. మినియేచర్ పుంగనూరు ఆవుల ఎత్తు 2 అడుగుల్లోపు కాగా, మైక్రో మినీయేచర్ పుంగనూరు ఆవుల ఎత్తు అడుగులోపే. ప్రపంచంలో ఇవే అత్యంత పొట్టి జాతి ఆవులు. వీటికి పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేశా. వచ్చే పదేళ్లలో కనీసం లక్ష ఆవులను పునరుత్పత్తి చేసి అడిగిన ప్రతీ ఒక్కరికి అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. – డాక్టర్ పెన్మత్స కృష్ణంరాజు, పరిశోధకుడు, నాడీపతి గోశాల వ్యవస్థాపకుడు 14 ఏళ్ల పరిశోధనల ఫలితం నాడీపతిలో పీహెచ్డీ చేసిన కృష్ణంరాజు వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయిన ప్రాచీన భారతీయ సనాతన వైద్యవిధానంతోపాటు అంతరించిపోతున్న అరుదైన పొట్టిజాతి గోవుల పునరుత్పత్తిపై 14 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. నాడీపతి వైద్య విధానంపై శిక్షణ ఇస్తూ సర్జరీలు, సైడ్ఎఫెక్ట్ లేని 100 రకాల థెరఫీల ద్వారా దీర్ఘకాలిక రోగాలకు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత పొట్టి జాతి అవులను సృష్టించాలన్న సంకల్పంతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద 5 ఎకరాల విస్తీర్ణంలో నాడీపతి గోశాల నెలకొల్పారు. తొలుత పుంగనూరు–బోనీ జాతులను క్రాసింగ్ చేసి 3 అడుగుల ఎత్తు గల పొట్టి ఆవులను అభివృద్ధి చేశారు. వాటిని దేశంలో ఇతర పొట్టి జాతి బ్రీడ్లతో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో మరిన్ని పొట్టి జాతి ఆవులను అభివృద్ధి చేశారు. చివరగా పుంగనూరుతో బోనీ, మల్నాడ్ గిడ్డ, మినీ మౌస్, వేచూరు ఆవులతో క్రాసింగ్ చేసి మైక్రో మినేయేచర్ పుంగనూరు ఆవును సృష్టించారు. -
‘అమ్మా’రావం!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఇలా అంతా కోరుకున్న రీతిలో వస్తున్న ఆవు దూడలు పాడి రంగంలో కొత్త క్షీర విప్లవానికి నాందిగా నిలుస్తున్నాయి. స్వదేశీ ఆవుల సంఖ్యను పెంచడం.. అలాగే అధికంగా పాలిచ్చే జాతి ఆవులను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2019లో ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దీన్ని తెలంగాణ, ఆంధ్రపదేశ్తోపాటు మరో పది రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టింది. ఇందులోభాగంగా కామారెడ్డి జిల్లా తిప్పాపూర్, ఎర్రపహాడ్, కొండాపూర్, చిన్నమల్లారెడ్డి, లింగంపల్లి, ఎల్లంపేట, మోతె, కొయ్యగుట్ట, మహ్మదాపూర్, కరత్పల్లి పది గ్రామాలను ఎంపిక చేశారు. ఇక్కడ వివిధ రకాల జాతులకు చెందిన 160 ఆవుల్లో లింగ నిర్ధారణ చేసి సాహివాల్, గిర్ తదితర స్వదేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే హెచ్ఎఫ్, జెర్సీ కోడెల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. ఇందులో ఇప్పటివరకు 134 ఆవులు గర్భం దాల్చి 126 (94 శాతం) ఆడ దూడలు, 8 కోడె దూడలకు జన్మనిచ్చాయి. దీంతో రైతులు స్వదేశీ గిర్, సాహివాల్ ఆడ దూడలతోపాటు అధిక పాలనిచ్చే ఆవులకు యజమానులయ్యారు. లక్షలు పోసినా దొరకని స్వదేశీ, విదేశీ ఆవుజాతులు ఇప్పుడు తమ పంటపొలాల్లో పరుగెడుతుండటంతో సంబరపడిపోతున్నారు. ‘స్వదేశీ ఆవును పెంచుకోవాలన్నది నా జీవితాశయం. ఎవరి వద్దనైనా కొందామంటే ధర.. రూ.లక్షల్లో చెబుతున్నారు. అంత సొమ్ము భరించే స్తోమత లేదు. నా కల ఇక నెరవేరదు అనుకున్నా..! కానీ ఓ రోజు కేంద్ర పశుసంవర్థక శాఖ వారు మా ఊరిలో క్యాంప్ పెట్టి.. నా వద్ద ఉన్న విదేశీ జాతి హెచ్ఎఫ్ ఆవుకు కృత్రిమ గర్భధారణతో కోరుకున్న స్వదేశీ ఆవు దూడ పుట్టేలా ఉచితంగా చేస్తామన్నారు. అందులో ఆడ–మగ.. ఏది కోరుకుంటే అదే పడుతుందన్నారు. నాకు సాహివాల్ రకం ఆడ దూడ కావాలని అడిగాను. నా దగ్గర ఉన్న ఆవు గర్భంలో లింగ నిర్ధారణ వీర్యం ప్రవేశపెట్టి 9 నెలల్లో సాహివాల్ ఆడ దూడను కానుకగా ఇచ్చారు. ఇలా మా ఊరి ఆవుల్లో చేసిన కృత్రిమ గర్భధారణతో అందరికీ కోరుకున్న జాతి ఆడ దూడలే పుట్టాయి. ఇది మాకు ఆశ్చర్యంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది’ అంటూ కామారెడ్డి జిల్లా తిప్పాపూర్ పాడిరైతు ఏలేటి గణేశ్రెడ్డి ఆనందంతో గంతేశాడు.. ఈ ఆనందం ఇప్పుడు ఈయన ఒక్కడిదే కాదు కామారెడ్డి జిల్లాలో మరికొందరిది కూడా. ఇక అన్ని పల్లెలకు.. కేంద్ర ప్రభుత్వం–విజయ డెయిరీ సహకారంతో చేపట్టిన కామారెడ్డి పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో వచ్చే నెల నుంచి అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,192 మంది వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులతో కృత్రిమ గర్భధారణ శిబిరాల్లో రైతు రూ.250 చెల్లిస్తే వారు కోరుకున్న దూడలకు జన్మనిచ్చేలా ఆవులను సిద్ధం చేయనున్నారు. అయితే 90 శాతం ఆడ దూడలు, 10 శాతం కోడె దూడలుండే విధంగా సమతౌల్యం పాటించనున్నారు. ఈ పథకం విస్తృతంగా రైతుల్లోకి వెళ్తే వచ్చే ఏడేళ్లలో టాప్–10 రాష్ట్రాల జాబితాలోకి తెలంగాణ చేరే అవకాశం ఉందని పాడి నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెరీవెరీ స్పెషల్.. ►గిర్, సాహివాల్ ఆవుల పాలల్లో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువ. సంతానోత్పత్తి సమర్థత కూడా అధికం. తక్కువ మేత, ఎక్కువ పాల దిగుబడితో ప్రస్తుతం ఈ స్వదేశీ జాతి ఆవులకు రూ.లక్షల్లో డిమాండ్ ఉంది. ►హెచ్ఎఫ్ ఆవుల్లో ఎక్కువ పాల దిగుబడితోపాటు ప్రసవించే పదిహేను రోజుల ముందు వరకు పాలు ఇవ్వడం ప్రత్యేకం. పాడిలో పెను మార్పులు పైలట్ ప్రాజెక్ట్గా పది గ్రామాల్లో చేసిన ప్రయోగం విజయవంతం కావడం శుభపరిణామం. ఈ పథకాన్ని మార్చిలో రాష్ట్రమంతా విస్తరిస్తాం. దీంతో పాడి రంగంలో పెనుమార్పులు రానున్నాయి. –డాక్టర్ మంజువాణి, సీఈఓ, లైవ్స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ మా ఇంట్లో పోషకాల గోవు.. స్వదేశీ గిర్ ఆవుకు కృత్రిమ గర్భధారణతో మళ్లీ గిర్ ఆడ దూడ పుట్టింది. గిర్ ఆవు పాలల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. నా ఆవు రోజుకు 16 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఒక్క స్వదేశీ ఆవు ఉంటే ఆరోగ్యం మన వెంట ఉన్నట్టే. –మన్నె గంగారెడ్డి, తిప్పాపూర్, కామారెడ్డి పుణేలో.. ఫలించిన ప్రయోగంతో.. అంతరిస్తున్న దేశీ జాతులతోపాటు అధిక పాలనిచ్చే విదేశీ జాతి సంతతి వృద్ధి కోసం భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (ఫుణే).. ఫ్లో సైటీమెట్రీ (బయాలాజికల్ విశ్లేషణ)తో తొలి అడుగు వేసింది. లింగ నిర్ధారణ వీర్యంతో పుణేలో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో, అక్కడి నుంచి తొలుత దేశీ జాతులు, ఆపై విదేశీ జాతుల లింగ నిర్ధారణ వీర్యాన్ని సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆవుల్లో కృత్రిమ గర్భధారణ చేయగా, ఆశించిన విధంగానే ఎక్స్ క్రోమోజోమ్తో అండ ఫలదీకరణ ప్రయోగంతో కోరుకున్న స్థాయిలో ఆడ ఆవుదూడలు పుట్టాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్, జమ్ము,కశ్మీర్, ఒడిశాల్లో కృత్రిమ గర్భధారణ వేగవంతం చేశారు. మిగతా రాష్ట్రాల్లో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని విస్తృతం చేయనున్నారు. -
ఆవు పేడతో కట్టిన ఇళ్లతో అణుధార్మికత నుంచి రక్షణ
వియారా(గుజరాత్): ఆవు పేడతో నిర్మించిన ఇళ్లు అణుధార్మికత నుంచి రక్షణ ఇస్తాయనే విషయం సైన్సు నిరూపించిందని గుజరాత్లోని తాపి జిల్లా సెషన్స్ జడ్జి సమీర్ వ్యాస్ పేర్కొన్నారు. గో మూత్ర ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుందని తెలిపారు. అందుకే దేశంలోని గోవులను, వధించడం మానేసి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన ఓ వ్యక్తికి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో ఈ విషయాలను ఆయన పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్లో ఇచ్చిన తీర్పు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రపంచంలోని అన్ని సమస్యలకు గోవధే కారణమని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అమిన్ అంజుమ్(20) 2020లో గుజరాత్ నుంచి ఆవులను తరలిస్తూ పట్టుబడ్డాడు. -
అమ్మకు వందనం.. పాతికేళ్లుగా గో సేవ.. పాలు పితకరు, అమ్మరు!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంటున్న ఎనభై ఏళ్ల బదాంబాయికి మూగజీవాలంటే ప్రేమ. పాతికేళ్ళ క్రితం గోశాల ఏర్పాటు చేసిన ఆమె, నేటికీ గో సంరక్షణ కోసం పాటుపడుతుంటుంది. గోవులపై ఆమెకున్న ప్రేమకు కుటుంబం కూడా మద్దతుగా ఉంటుంది. శక్తి ఉన్నన్ని రోజులు గో సేవ చేస్తానని చెబుతున్న ఆమెను అందరూ గోవుల అమ్మగా కీర్తిస్తుంటారు. మదన్లాల్, బదాంబాయి దంపతులు తమ వైవాహిక జీవితం మొదలుపెట్టిన నాటి నుంచే ఆవు కనబడితే చాలు దండం పెట్టుకునేవారట. ఈ విషయం గురించి బదాంబాయిని అడిగితే ప్రతీ రోజూ ఉదయం క్రమం తప్పకుండా గో పూజ చేసేదాన్నని, ఆ భక్తి, ప్రేమ ఏళ్లు గడిచినకొద్దీ పెరిగిందే కానీ తగ్గలేదని చెబుతుంది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో రాణించాడు మదన్లాల్. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వారూ జీవితాల్లో స్థిరపడుతున్నారు. ఆ సమయంలోనే గోశాల పెట్టాలన్న ఆలోచనను భర్తకు వివరించింది బదాంబాయి. అందుకోసం స్థలాన్వేషణ చేశారు. 1996లో 44వ నంబరు జాతీయ రహదారిపై జంగంపల్లి వద్ద స్థలాన్ని కొనుగోలు చేశాడు. ‘శ్రీ కుమార్ పాల్ జీవ్ దయా ట్రస్ట్’ను ఏర్పాటు చేసి అదే సంవత్సరం 21 ఆవులతో గోశాల మొదలుపెట్టారు బదాంబాయి దంపతులు. వాటి సంరక్షణకు పనివాళ్లను నియమించారు. బదాంబాయి రోజూ ఉదయం 9 గంటలకు టిఫిన్బాక్స్ పట్టుకొని గోశాలకు చేరుకునేది. అక్కడే సాయంత్రం వరకు గోవులను చూసుకుని తిరిగి ఇంటికి చేరుకునేది. మదన్లాల్, ఆయన కొడుకులు కూడా వ్యాపారంలో బిజీగా ఉన్నా ప్రతీ ఆదివారం గోశాలకు వచ్చేవారు. పాతికేళ్ల అనుబంధం... ఎవరైనా ఆవులు అమ్మడానికి తీసుకువెళుతున్నారంటే చాలు వాటిని బాదంబాయి కొనుగోలు చేస్తుంటుంది. అలాగే దేవాలయాల వద్ద ఆవులను పెంచడం భారంగా భావించి ఈ గోశాలకు తీసుకు వస్తుంటారు. ఇప్పుడు గోశాలలో ఆవులు, లేగల సంఖ్య 158కి చేరింది. ప్రతి రోజూ ఉదయమే బదాంబాయి కొడుకులు మహేందర్, మహిపాల్ లు ఆవులకు దాణా, కూరగాయలు, పండ్లు తీసుకువచ్చి వేస్తారు. ఆదివారం, సెలవు రోజుల్లో కొడుకులతోపాటు కోడళ్లు, మనవలు, మనవరాళ్లు కూడా గోశాలకు వచ్చి పనులు చేస్తుంటారు. అమావాస్య రోజున కుటుంబం అంతా గోశాలలోనే గడుపుతారు. అమ్మ వచ్చిందంటే చాలు ఆవులన్నీ ఆమెకు దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తాయి. ఆమె వయసు పైబడటం, ఆరోగ్య దృష్ట్యా అమ్మకు ఇబ్బంది కలగగూడదన్న ఉద్దేశ్యంతో ఇటీవల అడ్డుగా ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. జాలీల నుంచి వాటికి బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తుంటుంది. శక్తి ఉన్నన్ని రోజులూ గోవులకు సేవ చేస్తానని, పిల్లలందరూ ఇదే పనిని భక్తిగా చేస్తుంటారని వివరిస్తుంది బదాంబాయి. అన్నీ తానై.. 2008లో బదాంబాయి భర్త మరణించాడు. అయినా, ఆమె గో సంరక్షణ మానుకోలేదు. 21 ఆవులతో మొదలైన వాటి సంఖ్య వందల్లోకి చేరింది. గడ్డివేయడం, గోశాల శుభ్రం చేయడం, బెల్లం, ఇతర బలవర్ధకమైన ఆహారాన్ని తినిపించడం ద్వారా ఆవులతో ఆమె అనుబంధం పెంచుకుంటూనే ఉంది. ప్రతి గోవు బాగోగులు దగ్గర ఉండి చూసుకోవడంలోనే ఆమె రోజు మొత్తం గడుపుతుంటుంది. పాలు పితకరు, అమ్మరు ఈ గోశాలలో ఆవుల పాలు పితకరు. ఎన్ని ఆవులు ఈనినా సరే పాలు లేగలకు వదిలేస్తారు. ఆవులను గానీ, లేగలను గానీ అమ్మడం అనే మాట ఉండదు. వయస్సు పైబడి చనిపోయే దాకా వాటి సంరక్షణ బదాంబాయి, ఆమె కుటుంబం చూసుకుంటూ ఉంటుంది. చనిపోయిన గోవులను అక్కడే ఒక పక్కన గొయ్యి తీసి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆవు మూత్రాన్ని మాత్రం సేకరించి బాటిళ్లలో నింపి పెడతారు. ఎవరైనా గృహ ప్రవేశాలు, యాగాల సందర్భంగా ఆవు మూత్రం కావాలని వచ్చిన వారికి ఇస్తారు. ఆవు పేడ కూడా తీసుకువెళతారు. కాగా ఆవు పేడను ఒక చోట జమ చేసి ఏడాదికోసారి అమ్ముతారు. పేడ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను గోసేవా ట్రస్టుకే జమ చేస్తారు. ఆవులను మేపడం, గడ్డి కోసి వేయడం వంటి పనుల కోసం ఇప్పుడు నలుగురు పనివాళ్లను నియమించారు. వారికి వేతనాలతో పాటు దాణా కొనుగోలు కోసం నెలకు దాదాపు రూ.లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు బదాంబాయి కొడుకులు. నాలుగెకరాల్లో గడ్డి పెంపకం.... ఆవుల కోసం గోశాలలో నాలుగు ఎకరాల్లో గడ్డి పెంపకం చేపట్టారు. ఒక వైపు గడ్డి విత్తనం వేసి మొలకెత్తగానే, మరో పక్కన విత్తనం వేస్తారు. ఈ విధానం వల్ల ఎప్పుడూ గడ్డి అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటారు. ఈ జాగ్రత్తతో పాటు ఎండుగడ్డినీ కొనుగోలు చేసి నిల్వ చేస్తారు. దాతలు కొందరు గడ్డిని అందిస్తారు. ఏటా ఎండు గడ్డి కోసం రూ.3.50 లక్షల వరకు ఖర్చు చేస్తామని బదాంబాయి కొడుకులు మహేందర్, మహిపాల్లు తెలిపారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి చదవండి: Venkampalli: వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ Rainwater Harvesting: చినుకు చినుకును ఒడిసి పట్టి.. ఆ నీటితోనే ఇంటి అవసరాలు సహా ఆవరణలో సపోటా, జామ.. ఇంకా -
‘వందేభారత్’ రైలుకు వరుస ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
ముంబై: గుజరాత్– మహారాష్ట్ర రాజధానుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన వందే భారత్ సెమీ స్పీడు రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతుండటంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఎవరైనా రైల్వేట్రాక్ వెంబడి పశువులను వదిలితే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. ముంబై–గాంధీదీనగర్ రైల్వే మార్గం వెంబడి ఉన్న చుట్టుపక్క గ్రామాల సర్పంచ్లను రైల్వే భద్రతా విభాగం అధికారులు కలసి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వందేభారత్ ఎక్స్ప్రెస్రైలుకు పశువులు అడ్డం వచ్చి ఆగిపోయిన వరుస ఘటనలు జరిగిన గ్రామాల పెద్దలకు నోటీసులు జారీ చేశారు. రైల్వే ట్రాక్ వెంబడి పశువులను నిర్లక్ష్యంగా వదలొద్దని, సంబంధిత పశు యజమానులతో మాట్లాడే బాధ్యతలను గ్రామ సర్పంచ్లకు అప్పగించారు. రైల్వే ట్రాక్లపై ఎవరైనా పశువుల్ని నిర్లక్ష్యంగా వదిలితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు. సెపె్టంబరు 30న గాం«దీనగర్– ముంబై మార్గంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్నుంచి ఇప్పటివరకు వందేభారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు పశువులు ఢీకొట్టడంతో ఆటంకం ఏర్పడిన ఘటనలు తరచూ జరిగాయి. గత శనివారం గుజరాత్లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో పశువులను ఢీకొట్టి వందేభారత్ రైలు ఆగిపోయింది. అంతకుముందు అక్టోబర్ 6, 7 తేదీల్లో కూడా ఇవే ఘటనలు జరగడంతో రైలు ముందుభాగం కొంతమేర దెబ్బతింది. దీంతో రైల్వే భద్రతా విభాగం దృష్టి సారించింది. ఎక్కువమొత్తంలో పశువులు ఉన్న యజమానులతో ఆయా గ్రామాల పెద్దలు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. అయినప్పటికీ పశువులను రైల్వే ట్రాక్లపై నిర్లక్ష్యంగా వదులుతూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ప్రొవిజన్స్ ఆఫ్ రైల్వే యాక్టు 1989, సెక్షన్ 154, ప్రకారం ఒక ఏడాదిపాటు జైలుశిక్ష, జరిమాన, లేదా రెండింటిని అ మలు చేయవచ్చని, సెక్షన్ 147 ప్రకారం ఆర్నెల్ల పా టు జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా, లేదా రెండూ అమలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. -
తన మ్యూజిక్తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్
-
అద్భుత దృశ్యం.. ఆ గోవులన్నీ శ్రీకృష్ణుడే వచ్చాడనుకున్నాయేమో..!
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు తన పిల్లనగ్రోవితో మంత్రముగ్ధుల్ని చేసేవాడని చెబుతారు. పిల్లనగ్రోవి వాయిస్తుంటే గోవులన్నీ ఎక్కడున్నా ఆయన చుట్టూ చేరేవి. ఆ సంఘటనను ఇప్పుడు గుర్తు చేశారు ఈ మోడ్రన్ కృష్ణుడు. సాక్సోఫోన్ వాయిస్తుంటే ఓ పొలంలో గడ్డి మేస్తున్న ఆవులన్నీ పరుగున వచ్చి ఆయన చుట్టూ చేరాయి. సంగీతానికి భాష అవసరం లేదని నిరూపించారు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఆవులు గడ్డి మేస్తున్న ప్రాంతంలో రోడ్డు పక్కన నిలుచుని సాక్సోఫోన్ వాయించాడు. ఆయన మ్యూజిక్ విన్న కొద్ది క్షణాల్లోనే దూరంగా ఉన్న ఆవులన్నీ పరుగున వచ్చి చుట్టూ చేరాయి. సుమారు 20-30 గోవులు ఉన్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ సంగీతం శక్తి ఇది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను 10 లక్షలకుపైగా మంది వీక్షించారు. దీనిపై పలువురు కామెంట్లు చేశారు. ‘ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన భగవాన్ క్రిష్ణ చేసిన విధంగానే ఉంది. ఆయన తన పిల్లన గ్రోవితో అందరిని తనవైపు ఆకర్షించేవారు, ఆయన గోవులను సైతం’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ఇదీ చదవండి: క్రాకర్ కాల్చడం ఇంత కష్టమా.. ఎమ్మెల్యే తిప్పలు చూస్తే నవ్వు ఆగదు.. వీడియో వైరల్ -
విజృంభిస్తున్న ‘లంపీస్కిన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెల్లజాతి ఆవులు, ఎద్దులకు సోకుతున్న లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 5,219 పశువులు ఈ వ్యాధి బారినపడగా వాటిలో 24 ఆవులు మృతి చెందాయి. 2,484 పశువులు ఇప్పటికీ వ్యాధితో బాధపడుతున్నాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది. 32 జిల్లాల్లో లక్షణాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లోని పశువులకు ఈ వ్యాధి సోకిందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షలకుపైగా తెల్లజాతి పశువులుంటాయని అంచనా వేస్తుండగా ఇప్పటివరకు మొత్తం పశుసంపదలో 0.27 శాతానికి ఈ వ్యాధి సోకింది. గత వారం, పది రోజులుగా ఈ వ్యాధికారక క్యాప్రిపాక్స్ వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 150 పశువులకు ఈ వ్యాధి సోకిందని అధికారులు వివరించారు. వ్యాధి సోకిన పశువులను ఐసొలేషన్లో ఉంచడంతోపాటు ఇప్పటివరకు 5,34,273 పశువులకు వ్యాక్సిన్లు వేశారు. వాతావరణ సానుకూలతతో ఉత్తరాదిలో ఐదారు నెలల కిందటి నుంచే ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని వేలాది పశువులు లంపీస్కిన్ కారణంగా చనిపోయాయి. అయితే సెప్టెంబర్ మధ్య వరకు రాష్ట్రంలో లంపీస్కిన్ ఆనవాళ్లు కనిపించలేదు. ఆ తర్వాత అక్కడక్కడా కనిపించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ వ్యాధి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే నష్టనివారణ చర్యలు చేపట్టడంతో రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండదని పశుసంవర్ధక శాఖ అధికారులు భావించారు. కానీ ఉన్నట్టుండి లంపీస్కిన్ వ్యాధి తీవ్రరూపం దాలుస్తోంది. దోమలు, ఈగలు, గోమార్ల ద్వారా సంక్రమించే క్యాప్రిపాక్స్ వైరస్కు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం కూడా తోడైందని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి రాష్ట్రంలోని 20 శాతం పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్రం హెచ్చరికలు.. దేశంలో లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తున్న తీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. పశువులకు వ్యాక్సినేషన్ను ఉధృతం చేయాలని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సూచించింది. లంపీస్కిన్ లక్షణాలు కనిపించిన పశువులున్న 5 కి.మీ. పరిధిలోని అన్ని గ్రామాల్లోగల పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్న పశుసంవర్ధక శాఖ... ఇకపై రాష్ట్రంలో అన్ని తెల్లజాతి పశువులకు టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 రోజుల కార్యాచరణను రూపొందించింది. యుద్ధప్రాతిపదికన పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. లంపీస్కిన్ లక్షణాలివే.. ►పశువులకు తీవ్రమైన జ్వరం ►కంటి నుంచి నీరు కారడం ►చర్మంపై పెద్దపెద్ద గడ్డలు ►తీవ్రమైన ఒళ్లు నొప్పులు ►చర్మమంతా పొలుసులుగా మారడం ►పశువు మేత తినదు... పాలివ్వదు వ్యాధిబారినపడ్డ ఆవుల పాలు తాగొద్దు పశువుల్లో లంపీస్కిన్ లక్షణాలు కనిపిస్తే రైతులు వెంటనే స్థానిక పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. ముందుగా జ్వరం నియంత్రణకు వైద్యులు మందులు వాడతారు. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరం చేయాలి. ఆ పశువులు తిన్న గడ్డి ఇతర పశు వులకు వేయొద్దు. వాటి పాలు తాగొద్దు. ఈ వ్యాధి కారణంగా గొడ్డుమోతు తనం కూడా వచ్చే అవకాశముంది. – డాక్టర్ ఎస్. రాంచందర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రోగం గురించి చెప్పేవారే లేరు పశువులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ మందులు వాడాలి వంటి విషయాలు చెప్పే వారు మాకు అందుబాటులో లేరు. – బొక్కల మల్లారెడ్డి, హుజూరాబాద్ వ్యాక్సిన్ ఇచ్చారు.. లంపీస్కిన్ వ్యాధి నుంచి ఆవులను కాపాడేందుకు పశువైద్యులు మా ఆవులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆవులను మందలోకి వదలకుండా నేనే మేతకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నా. – కరుణాకర్రావు, మెట్పల్లి, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా రెండు ఎడ్లకు సోకింది మా రెండు ఎడ్లకు లంపీస్కిన్ వ్యాధి సోకింది. ఎడ్ల శరీరంపై దద్దుర్లు వచ్చాయి. పశు వైద్యాధికారికి చెబితే వచ్చి టీకాలు వేశారు. జాగ్రత్తలు చెప్పారు. – రాతిపల్లి మల్లేశ్, సుబ్బరాంపల్లి, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా -
స్వదేశీ సాహివాల్కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్గా గుర్తింపునిచ్చింది. నాగర్కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
గ్రామాలు ముంపులోకి.. గోవులు వనంలోకి
సహజంగా అటవీ ప్రాంతాల్లో ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు, జింకలు, దుప్పిలు, అడవిపందులు ఇలా రకరకాల జంతువులు ఎక్కువగా ఉంటాయి. కానీ సోమశిల వెనుక జలాలతో నిండిన అటవీ ప్రాంతంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో ఆవులు.. ఎద్దులు సంచరిస్తున్నాయి. నమ్మశక్యంగా లేదా.. అవును.. ఇది అక్షరాలా నిజం.. అంత భారీ సంఖ్యలో ఎలా ఉన్నాయని ఆశ్చర్యమేస్తోందా.. అయితే ఈ ఆసక్తికర సమాచారం మీకోసం.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వందకుపైగా గ్రామాలు సోమశిల వెనుక జలాలకు మునిగిపోయాయి. 1978 నుంచి సోమశిల జలాశయంలో నీటిని నింపేందుకు కడప జిల్లాలోని ముంపు గ్రామాలను గుర్తించి, వాటికి నష్టపరిహారం ఇప్పించి, ఖాళీ చేయించారు. 2007 నుంచి 70 టీఎంసీల నీరు నిల్వకు రంగం సిద్ధం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముంపు గ్రామాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ మరింత వేగంగా పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం నిర్మించారు. భూసేకణలో భాగంగా జిల్లాలోని వందకుపైగా గ్రామాలు నీట మునిగాయి. అప్పట్లో చాలామంది ముంపు బాధితులు గ్రామాలను వదిలి వెళ్లేటప్పుడు తమతోపాటు ఉన్న ఆవులు, ఎద్దులను అక్కడే వదిలి వెళ్లిపోయారు. విధిలేని పరిస్థితుల్లో అలా తమ పెంపుడు మూగజీవాలను వదిలి వెళ్లాల్సి వచ్చిందని వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. నాడు వందల్లో.. నేడు వేలల్లో సోమశిల ముంపు వాసులు 44 ఏళ్ల క్రితం తమ గ్రామాలను ఖాళీ చేసేటప్పుడు వదిలేసిన పశు సంపద అప్పట్లో వందల్లో ఉంటుంది. ఆ తర్వాత సంతానోత్పత్తి జరిగి వాటి సంఖ్య నేడు వేలల్లోకి చేరిందని అంచనా. ప్రస్తుతం సోమశిల అటవీ ప్రాంతానికి అలవాటు పడిన ఆవులు, ఎద్దులు వెనుక జలాలు తగ్గిన సమయంలో అప్పుడప్పుడూ గ్రామాల వైపు వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. వాటిని కొందరు ఉచ్చు వేసి పట్టుకునేందుకు ప్రయతి్నస్తుంటారని అంటున్నారు. ఉచ్చులేసిపట్టుకున్నా.. సోమశిల వెనుక జలాల అటవీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న ఆవులు, ఎద్దులను పట్టుకోవాలంటే కష్టమే. కొంతమంది వీటితో వ్యాపారం చేసుకునేందుకు ఊచ్చులేసి పట్టుకుంటుంటారు. ఇటీవల ఉచ్చులేసి పట్టుకున్న ఆవులను పోలీసులు విడిపించి, మళ్లీ అడవిలోకి పంపించిన సంఘటన నందలూరులో చోటుచేసుకుంది. మునిగిపోయిన గ్రామాలు.. అట్లూరు మండలంలో మల్లెలపట్నం, చెండువాయి, రాఘవరెడ్డిపేట, చెర్లోపల్లె, ఒంటిమిట్ట మండలంలో గుండ్లమాడ, మాధవరం, ఉప్పరపల్లె, బోయనపల్లె, చిన్నపరెడ్డిపల్లె, కలికిరి, మదిలేగడ్డ, పొన్నపల్లె, మల్లంపేట, కొండమాచుపల్లె, కుడగుంటపల్లె, కొడుములూరు, నందలూరు మండలంలో యల్లంపేట, రంగాయపల్లె, తిమ్మరాచపల్లె, చుక్కాయపల్లె, చాపలవారిపల్లె, కొమ్మూరు, కోనాపురం, వెంకటరాజంపేట, చింతకాయలపల్లె, ఎగువరాచపల్లె, జంగాలపల్లెతో పాటు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మరికొన్ని ఉన్నాయి. ముంపు గ్రామాలు పశుసంపదకు నిలయాలు సోమశిల ముంపు గ్రామాలు పశు సంపదకు నిలయాలుగా ఉండేవి. పచ్చటి పొలాలు, పాడిసంపదతో కళకళలాడేవి. సోమశిల జలాశయం కోసం అప్పటి ప్రభుత్వాలు పరిహారం ఇచ్చి జిల్లాలోని వందకుపైగా గ్రామాలను ఖాళీ చేయించాయి. ఆ సమయంలో చాలా వరకు పశుసంపదను వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. –భువనబోయిన లక్ష్మనయ్య, మాజీ ఎంపీపీ, నందలూరు అడవిలోకి ప్రవేశం నిషేధం సోమశిల వెనుక జలాలు గల అటవీ ప్రాంతం లో ప్రవేశం నిషేధం. అడవిలో ఉండే జీవాలు అడవికే పరిమితం. వాటిని అక్రమ రవాణా చే యడం చట్టరీత్యా నేరం. ముంపు గ్రామాలు ఖాళీ చేసినప్పుడు పశుసంపదను ఇక్కడే వది లేయ డంతో ఇప్పుడు ఆవులు, ఎద్దులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా అడవిలో ఉన్న వాటిని పట్టు కోవడం నేరమే. –కుందనూరి ప్రసాద్, రేంజర్, అటవీశాఖ, ఒంటిమిట్ట సోమశిల ప్రాంతంలో ఆవులు, ఎద్దులు అనేకం సోమశిల వెనుక జలాల వెంబడి ఉన్న అడవుల్లో ఆవులు, ఎద్దులు వేల సంఖ్యలో ఉంటాయి. ముంపు గ్రామాలు ఖాళీ చేసిన క్రమంలో వాటిని వదిలి వెళ్లారు. అవే ఇప్పుడు అడవిలో ఉన్నాయి. ముంపు గ్రామాలు ఒకప్పుడు పాడిపంటలతో కళకళలాడాయి. పాడి అడవిపాలై, పంటలు నీటమునిగిపోయాయి. –ఆశీర్వాదం, ముంపుబాధితుడు, కోనాపురం, నందలూరు -
Allola DIVYA REDDY: గోమాత
ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది. పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి. పెట్ రైట్స్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు. ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఎకలాజికల్ ఇంజనీరింగ్ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ఏటూ మిల్క్ మన ఆవులవే! ‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే. నాన్న వాటర్ వర్క్స్లో ఇంజనీర్ ఇన్ చీఫ్గా రిటైర్ అయ్యారు. నేను ఇంజనీరింగ్ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్లో ఏటూ మిల్క్ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్ పెట్టారు. దేశ పర్యటన మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను. సేంద్రియం మనకు కొత్త కాదు! మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను. రెడ్ సింధీ, సహీవాల్, గిర్ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్ నిలవలేదు, సొంత బ్రీడ్ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె. ఆవు నన్ను ఎంచుకుంది! అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను. – అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్ గోశాల – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
అయ్యో.. గోమాతలారా..
వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిలో మునిగి వంద ఆవులు గల్లంతయ్యాయి. మేతకు వెళ్తున్న ఆవుల మందను అడవి పందులు బెదిరించడంతో రిజర్వాయర్లోకి దూకాయి. వెంటనే అప్రమత్తమైన వాటి యజమానులు, మత్స్యకారులు రిజర్వాయర్లో చిక్కుకున్న 350 గోమాతలను రక్షించగా, మరో 100 ఆవుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగోడుకు చెందిన శంకర్, సుంకన్న, కురుమన్న, బాలలింగం, వెంకటరమణతో పాటు మరో ఐదుగురికి చెందిన వెయ్యి ఆవులు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని డీఎల్బీ రెగ్యులేటర్ వద్ద గట్టు వెంట శుక్రవారం ఉదయం మేతకు వెళ్లాయి. అదే సమయంలో ఎదురుపడిన అడవి పందుల గుంపు ఆవుల మందను బెదిరించాయి. దీంతో భయపడిన ఆవులు (దాదాపు 450) వెలుగోడు జలాశయంలోకి పరుగులు తీశాయి. బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 9 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోయాయి. దిక్కు తోచని స్థితిలో ఆవుల కాపరులు బిగ్గరగా కేకలు వేయడంతో రిజర్వాయర్ వద్ద ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై పుట్టీల సాయంతో నీటిలో ఉన్న 350 ఆవులను రక్షించారు. గల్లంతయిన ఆవుల కోసం గాలిస్తున్నారు. ఆవులను రక్షించటానికి గ్రామస్తులు జాలరులను రంగంలోకి దింపారు. మర బుట్టలతో జాలరులు ఆవుల కోసం శుక్రవారం సాయంత్రం వరకు గాలించారు. ఘటనా స్థలానికి ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ జగన్మోహన్, తహసీల్దార్ మహమ్మద్ రఫీ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీను, ఆర్ఐ రామాంజనేయులు, వీఆర్వోలు చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో వంద ఆవుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
ఇన్నోవాలో రెండు ఆవుల తరలింపు
కేతేపల్లి: ఇన్నోవా కారులో రెండు ఆవులను కుక్కి హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తుండగా గురువారం కేతేపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద గురువారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇన్నోవా కారులో రెండు ఆవులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.అనిల్రెడ్డి తెలిపారు. -
అరుదైన రకం.. మేలైన నిర్ణయం!
అరుదైన రకానికి చెందిన పుంగనూరు జాతి ఆవులకు మంచి రోజులు వచ్చాయి. వెయ్యేళ్ల నాటి ఆవుగా గుర్తింపు పొందిన ఈ పొట్టి రకాన్ని అధికంగా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసం ఐవీఎఫ్ ల్యాబ్తోపాటు సెమన్ స్టోరేజీ బ్యాంకును పలమనేరులోనే ఏర్పాటు చేసింది. సరోగసీ పద్ధతిలో పొట్టి జాతి ఆవుల అధికోత్పత్తికి అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతోంది. పలమనేరు: ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు జాతికి పేరుంది. ప్రస్తుతం వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే వీటిని అధికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశుపరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేయనున్నారు. ఈ ల్యాబ్ను నెలరోజుల్లో ప్రారంభించేందుకు ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని కేటిల్ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రం పేరుతో ప్రారంభమైన ఈ పశుపరిశోధన సంస్థ 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇన్సైటీవ్ కన్సర్వేషన్ (స్థానికంగా వీటి సంఖ్యను ఉత్పత్తి చేయడం) దీని లక్ష్యం. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 276 పశువుల వరకు పెరిగినప్పటికీ ఆశించినంత ఉత్పత్తి జరగడం లేదు. క్రమేణా ఇక్కడ పేయి దూడల ఉత్పత్తి తగ్గుతోంది. ఒకే రక్త సంబంధం కలిగిన కోడెలతో సంక్రమణం చెందడంతో జన్యుపరమైన ఇబ్బందులతో దూడలు ఆరోగ్యకరంగా జన్మించడం లేదు. దీనిపై దృష్టిపెట్టిన ప్రభుత్వం స్థానిక పరిశోధనా కేంద్రంలో పిండమార్పిడి కేంద్రాన్ని (ఎంబ్రయో ట్రాన్స్ఫర్ ల్యాబ్) నెలకొల్పింది. దీంతోపాటు ఎన్ఏహెచ్ఈపీ (నేషనల్ అగ్రికల్చర్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్)కింద ఐకార్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్) ద్వారా రూ.3 కోట్ల నిధులతో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా స్థానిక ల్యాబ్లో సెమన్ స్టోరేజీ చేసి, ఆ వీర్యాన్ని గుంటూరు జిల్లాలోని లాంఫారం, కర్ణాల్లోని యన్.బి.ఏ.జి.ఆర్ (జాతీయ జన్యువనరుల కేంద్రం)లో భద్రపరిచేవారు. ఇకపై పూర్తి స్థాయిలో అన్ని పనులు ఇక్కడే జరగనున్నాయి. పిండమార్పిడి పద్ధతి పుంగనూరు జాతి ఎద్దునుంచి సెమన్ను తీసి దాని ద్వారా ఎక్కువ అండాలను ఉత్పత్తి చేయిస్తారు. ఆపై కృత్రిమ గర్భ«ధారణ ద్వారా ఫలదీకరణం జరిపి ఈ అండాలను పోగుచేసి సరోగసీ పద్ధతిలో ఎదకొచ్చిన ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. తద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టిరకం పశువుల ఉత్పత్తి జరగనుంది. అంతరించిపోతున్న అరుదైన జాతులు దేశంలో 34 రకాల పశు జాతులున్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులే. ఇవి స్థానిక పశు పరిశోధనా కేంద్రంలో 200 ఉండగా వీటి సంఖ్య ఇప్పుడు 276కు చేరుకుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఇవి వందకు పైగా ఉన్నట్టు సమాచారం. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో వేచూరు రకం పొట్టి ఆవుల (ఇవి ఎరుపు రంగులో ఉంటాయి) సంఖ్య పదికి పడిపోయింది. ఇక అ«ధిక పాలనిచ్చే షాహీవాల్ రకం కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇవి మన దేశంలోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పాకిస్తాన్లోనూ మాటంగొమేరి జిల్లాలో మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనా వీటన్నింటికంటే అత్యంత అరుదైన జాతి పుంగనూరు రకమే. అందుకే వీటిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పుంగనూరు రకాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ఇక్కడి పరిశోధనా కేంద్రంలో 276 వరకు పుంగనూరు రకం పశువులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎల్డీఏ ద్వారా ఈ జాతి వీర్యాన్ని అందించేందుకు ఇప్పటికే కృషి చేస్తున్నాం. మరో నెల రోజుల్లో ఇక్కడ ఐవీఎఫ్ ల్యాబ్ సిద్ధమవుతుంది. దీంతో వీర్యాన్ని వృథా కానీయకుండా ఎక్కువ పశువులకు ఇచ్చి పుంగనూరు వెరైటీని పెంచుతాం. రాబోవు రెండేళ్లలో పశువుల సంఖ్యను 500 చేసేలా లక్ష్యం పెట్టుకున్నాం. డాక్టర్ వేణు, సైంటిస్ట్, పశుపరిశోధన కేంద్రం, పలమనేరు -
‘మేలు’ కలయిక మరింత పెరగాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పశు సంపద పెంపుదల, నాణ్యమైన పశుజాతుల అభివృద్ధి కోసం అమలవుతున్న కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ఏటేటా ఊపందుకుంటోంది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1.25 కోట్ల పశువులకు కృత్రిమ గర్భధారణ చేపట్టినట్టు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (టీఎస్ఎల్డీఏ) లెక్కలు చెప్తున్నాయి. పల్లెల్లో గోపాలమిత్రల సహకారంతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుతో మేలుజాతి గేదెలు, ఆవుల సంతతి వృద్ధి చెందుతోందని.. తద్వారా పాల ఉత్పత్తి కూడా పెరుగుతోందని అధికారులు తెలిపారు. 2014లో 13.7 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయగా.. 2019–20లో అత్యధికంగా 18.9 లక్షల పశువులకు కృత్రిమ గర్భాన్ని అందించగలిగినట్టు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి 16.9 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేసినట్టు తెలిపారు. జాతీయ స్థాయితో పోలిస్తే వెనుకే.. పశువుల కృత్రిమ గర్భధారణ విషయంగా జాతీయ స్థాయి గణాంకాలతో పోలిస్తే తె లంగాణ కొంత వెనుకబడే ఉంది. జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం మూడోదశ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్లో తెలంగాణలో ఏ ఒక్క జిల్లా కూడా 50శాతం లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోవడం గమనార్హం. 2019–20 సంవత్సరానికి గాను కేంద్రం పెట్టిన లక్ష్యాల్లో.. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కేవలం 9 శాతమే పూ ర్తిచేయగలిగారు. అత్యధికంగా గద్వాలలో 46%, వరంగల్ అర్బన్ జిల్లాలో 43% పశువులకు మాత్రమే కృత్రిమ గర్భధారణ చేయ గలిగినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కృత్రిమ గర్భధారణ ఎందుకు? పశువుల్లో గర్భధారణ కోసం ఆడ, మగ జాతి కలయిక కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చని.. ఆడ పశువు ఎదకు వచ్చిన 36 గం టల్లోనే ఈ కలయిక జరగాల్సి ఉంటుందని పశువైద్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా మేలుజాతి మగ పశువులు ఎక్కు వగా అందుబాటులో లేకపోవడం కూడా సమస్యగా ఉందని అంటున్నాయి. మేలుజాతి పశువుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చే యించడం వల్ల.. పశువులు మేలుజాతి దూడలకు జన్మనివ్వడంతోపాటు వాటి ద్వారా అధిక పాల దిగుబడి లభిస్తుందని వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశువులకు గర్భధారణ కార్యక్రమాన్ని చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ కేంద్రంగా.. రాష్ట్రంలో కరీంనగర్ కేంద్రంగా పశువుల వీర్యకణాల వృద్ధి సంస్థ కొనసాగుతోంది. అక్కడ మేలుజాతి (ముర్రా జాతి) దున్నపోతులను పూర్తి జాగ్రత్తలతో పెంచుతారు. వాటి నుంచి వీర్యాన్ని సేకరించి రైతులకు, పశువుల పెంపకందారులకు అందజేస్తుంటారు. ఈ బ్రీడింగ్ సీజన్ ఏటా అక్టోబర్ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి చివరివారం వరకు కొనసాగుతుంది. బర్రెలు చలికాలంలో ఎక్కువగా ఎదకు వస్తే.. ఆవులు ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఎదకు వస్తాయి. ఈ సమయాన్ని గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గ్రామాల్లో గోపాలమిత్రల సేవలను వినియోగించుకుంటారు. గోపాలమిత్రలకు ప్రోత్సాహకం కట్ వీర్యకణాల వృద్ధి సంస్థ నుంచి పశువుల వీర్యాన్ని స్ట్రాల రూపంలో ఇస్తారు. ఒక్కో స్ట్రాకు రూ.25 చొప్పున వీర్యకణాల వృద్ధి సంస్థకు చెల్లిస్తారు. ఆ వీర్యాన్ని పశువుల్లో ప్రవేశపెట్టేందుకు గోపాలమిత్రలకు రూ. 50 ప్రోత్సాహకంగా ఇస్తారు. సదరు పశు వు గర్భం ధరిస్తే రూ.100, ఈనితే మరో రూ.150 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులు కూడా ఒక్కో పశువుకు కొంత సొమ్మును గోపాలమిత్రలకు ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది గోపాలమిత్రలకు చెల్లించే ప్రోత్సాహకం రూ.50లో రూ.15 కోతపెడుతూ పశుగణాభివృద్ధి కమిటీలు తీర్మానం చేశాయి. మరీ రూ.35 మాత్రమే ఇవ్వడంపై గోపాలమిత్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బీర్ పీనా.. దూద్ దేనా !
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు మోతాదుకు మించి బీర్దాణా (బీర్ తయారు చేయగా మిగిలిన వ్యర్థాల లిక్విడ్) తాగిస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రత్యక్షంగా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు.. పరోక్షంగా పాలు తాగిన చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్నారు. సాధారణంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు రైతులు అధిక పాల దిగుబడి కోసం కడుపునిండా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పల్లిపట్టి, బెల్లంపట్టి, కుసుమ నూనె తీయగా మిగిలిన కిల్లి, తవుడు, కందిపొట్టు, మొక్కజొన్నతో తయారు చేసిన సంప్రదాయ దాణా వాడుతుంటారు. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అయితే బహిరంగ మార్కెట్లో ఈ దాణా ధరలు రెట్టింపవడంతో వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కొంతమంది పక్కదారిపట్టారు. ధర తక్కువ బీర్ తయారీ కంపెనీలు ట్యాంకర్ల ద్వారా రహస్యంగా సరఫరా చేస్తున్న బీర్దాణాను డ్రమ్ముకు రూ.900 నుంచి రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు. సంప్రదాయదాణాలో ఐదు శాతానికి మించి బీర్దాణా వాడకూడదు. కానీ తక్కువ ధర.. 20–30 శాతం పాలు ఎక్కువగా ఇస్తుండడంతో రైతులు ఒక్కో పశువుకు రోజుకు సగటున నాలుగు నుంచి ఐదు కిలోల చొప్పున వాడుతున్నారు. పశువుల ఆరోగ్యానికి ఇది హానికరమని వైద్యులు హెచ్చరించినా పెడ చెవిన పెడుతున్నారు. ఫలితంగా పశువుల జీవితకాలం పదిహేనేళ్ల నుంచి పదేళ్లకు పడిపోతోంది. ఎనిమిది నుంచి పది ఈతలు ఈనాల్సిన గేదెలు నాలుగైదు ఈతలకే పరిమితమవుతున్నాయి. ఆరోగ్యపరిస్థితి క్షీణించి, త్వరగా మృత్యువాత పడుతున్నాయి. పశువుల పాకలోని డ్రమ్ముల్లో బీర్ లిక్విడ్ డిమాండ్ ఎక్కువ కావడంతో.. పశువైద్యశాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లా లో 1,88,182 పశువులు ఉండగా, వీటిలో 1,22, 58 7 గేదెజాతివి ఉన్నాయి. విజయ, మదర్ డెయి రీలు 8,570 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. గ్రేటర్ వాసులకు రోజుకు కనీసం 25–30 లక్షల లీటర్ల పాలు అవసరమవుతుండగా, ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల లీటర్లకు మించి సరఫరా కావడం లేదు. బహిరంగ మార్కెట్లో లీటర్ పాలను రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దిగుబడికి, డిమాండ్కు మధ్య భారీ వ్యత్యాçసం ఉండడంతో రైతులు పశువుల నుంచి అధిక దిగుబడి సాధించేందుకు బీర్దాణాను వాడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,144 పాడిపశువులను 75 శాతం నుంచి 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశారు. పశుగ్రాస సాగు కోసం ఈ ఏడాది ఇప్పటి వరకు 140.2 మెట్రిక్ టన్నుల విత్తనాలు సరఫరా చేశారు. సొంతంగా పొలం ఉన్న వారు గడ్డినిసాగు చేసినప్పటికీ.. పొలం లేనివారు పశువులకు ఆహారంగా బీర్దాణాను వినియోగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల్లో ఇప్పటికే 417 చనిపోవడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు వస్తాయి సాధారణంగా మక్క, తవుడు, వేరుశశగ చెక్క, కందిపొట్టుతో తయారు చేసిన దాణాను పశువులకు వాడుతుంటారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఖర్చవుతుంది. బీర్దాణాకు లీటర్కు రూ.పదిలోపే దొరుకుతోంది. ఇందులో ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉండడంతో పశువులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలల్లో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగిన పిల్లలకు జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. – డాక్టర్ శంకర్,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, తలకొండపల్లి -
ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది
బాలాసోర్ జిల్లా(ఒడిశా) బస్తా బ్లాక్లోని అంబక్చౌ అనే గ్రామం అది. ఊరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కరువు కావచ్చు కరోనా కావచ్చు మరేదైనా కష్టం కావచ్చు. ఉపాధి కష్టమయ్యేది. ఊళ్లోని మగవాళ్లు పనుల కోసం పట్టణాలు వెదుక్కుంటూ వెళ్లేవాళ్లు. అలా పట్టణాలకు వెళ్లి కొత్త అలవాట్లు నేర్చుకొని కష్టపడిన సొమ్మును మద్యానికి తగలేసిన వారు కూడా ఉన్నారు. ఇక ఆ ఊళ్లో మహిళల విషయానికి వస్తే ఊరు దాటిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇంటిపనులు పూర్తయిన తరువాత, ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘మనం ఎందుకు వ్యాపారం మొదలుపెట్టకూడదు!’ అన్నారు ఒకరు. కొందరు నవ్వారు. కొందరు ఆలోచించారు. ఆ మాట ఈ మాట పూర్తయిన తరువాత అందరూ ఒక ఆలోచనకు వచ్చారు. ఆవులను కొనాలని. తాము కూడబెట్టుకున్న డబ్బు, అప్పు చేసిన సొమ్ముతో 13 మంది మహిళలు కలిసి 10 ఆవులను కొనుగోలు చేశారు. ‘శివశంకర్’ పేరుతో స్వయంసహాయక బృందంగా ఏర్పడ్డారు. ‘వాటిని మేపడానికే మీ జీవితం సరిపోతుంది’ అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. బృందంలోని సభ్యులలో చాలామంది భర్తల మూలంగా ఇబ్బంది పడ్డారు. భర్తలు భరించలేదు! ‘వాళ్ల మాటలు విని డబ్బు తగలేస్తావా?’ అంటాడు ఒక భర్త. ‘ఇంత డబ్బు నీ దగ్గర ఉందని ఎప్పుడూ చెప్పలేదేం’ అని ఈసడిస్తాడు ఒక భర్త. అయితే వారు వేటికీ చలించలేదు. మొదట పాలవ్యాపారం. ఆ తరువాత పెరుగు, నెయ్యి, వెన్న... మొదలైనవి అమ్మడం మొదలుపెట్టారు. ఆ ఊళ్లోనే కాదు... చుట్టు పక్కల ఊళ్లో నుంచి కూడా పాల ఉత్పత్తులు కొనడానికి వచ్చేవాళ్లు. ఆ తరువాత...రసగుల్లతో పాటు ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘చెన’లాంటి స్వీట్ల తయారీ మొదలుపెట్టారు. సమీప పట్టణమైన బాలాసోర్లో ఈ స్వీట్లను అమ్మే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ‘పట్టణాల్లో మీ పల్లె మిఠాయిలు ఎవరు కొంటారు? అక్కడ పెద్ద పెద్ద స్వీట్షాప్లు ఉంటాయి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు కొందరు. అయితే వారు వెనక్కి తగ్గలేదు. స్వీట్ హిట్æ ‘శివశంకర్ స్వీట్’ సూపర్ హిట్ అయింది! బాలాసోర్లోనే కాదు బధ్రక్, మహారాజ్గంజ్... మొదలైన పట్టణాలతో పాటు పశ్చిమబెంగాల్కు కూడా విస్తరించింది స్వీట్ల వ్యాపారం. ‘మొదట్లో భయమేసి వెనక్కి తగ్గుదాం అనుకున్నాను. కాని ఆతరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కొనసాగాను. శివశంకర్ బృందంలో నేను కూడా భాగం అయినందుకు గర్విస్తున్నాను’ అంటుంది మాలతి. ‘వారి మాటల్లోని నిజాయితీ, వారి ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తుంది. ఎక్కడా కల్తీ ఉండదు. నాణ్యంగా ఉంటాయి’ అంటున్నాడు బాలాసోర్కు చెందిన వైద్యుడు చందన్. ఇది అతడి మాట మాత్రమే కాదు ఎంతోమంది మాట. అందుకే ‘శివశంకర్’ పాల ఉత్పత్తులకు మంచి పేరు వచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉపయోగించడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఒక మంచిపని ఊరకే పోదు! ఎన్నో ఊళ్లకు స్ఫూర్తిని ఇస్తుందని గెలుపుజెండా ఎగరేసి నిరూపించారు పదమూడు మంది మహిళలు. -
ఆవు తల్లితో సమానం
వారణాసి: ఆవులు, గేదెలపై జోకులేస్తూ విపక్ష పార్టీలు.. పశుసంపదపై ఆధారపడ్డ ఎనిమిది కోట్ల మంది ప్రజానీకాన్ని అవమానపరుస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన వారణాసిలో పాడి పరిశ్రమ సహా రూ.2,095 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగించారు. ‘ గోమాత మనకు మాతృ సమానురాలు. దేశానికే గర్వకారణమైన పశుసంపద(ఆవులు, గేదెలు..)పై ఆధారపడి దాదాపు ఎనిమిది కోట్ల జనాభా జీవనం కొనసాగిస్తోందనే విషయాన్ని విపక్షాలు మరిచాయి. ఆవులు, గేదెలు, ఆవు పేడపై జోకులేస్తూ విపక్ష పార్టీలు పాపం మూటగట్టుకుంటున్నాయి. వారు ఆవులపై ఎగతాళిగా మాట్లాడతారు. కానీ, మనకు గోమాత పూజనీయం’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘సమాజ్వాదీ పార్టీ పదకోశంలో మాఫియావాదీ, పరివార్వాదీ అనే పదాలుంటాయి. కానీ, మా డిక్షనరీలో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ లాంటివే ఉంటాయి. కులం, మతం, వర్గం దృక్కోణంలోనే ఆలోచిస్తారు తప్ప ఉత్తరప్రదేశ్ అభివృద్ధి వారికి పట్టదు’ అని విమర్శించారు. ‘భావితరాల పరిరక్షణకు మళ్లీ సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంభించాల్సిందే’ అని మోదీ అన్నారు. గత పది రోజుల వ్యవధిలో మోదీ తన సొంత పార్లమెంట్ స్థానం వారణాసిలో పర్యటించడం ఇది రెండోసారి. కర్ఖియాన్లో నిర్మించే భారీ డైరీ ప్రాజెక్టు ‘బనాస్ డైరీ శంకుల్’కు మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. రూ.475 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ఈ డైరీ ప్రాజెక్టు ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల పాల దిగుబడి సాధ్యంకానుంది. -
TTD: ప్రకృతి సాగుకు శ్రీవారి ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి సాగు చేసే రైతన్నలకు టీటీడీ గోశాలలోని దేశీ ఆవులు, ఎద్దులను ఉచితంగా అందజేయడం ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి బాటలు వేస్తోంది. ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) కింద రాష్ట్రంలో 3,730 గ్రామ పంచాయతీల్లో 4.79 లక్షల మంది రైతులు 5.06 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేస్తున్నారు. వీరంతా రసాయనాలు, పురుగుల మందులు కాకుండా ఆవు పేడ, మూత్రంతో తయారు చేసే జీవామృతాలు వినియోగిస్తారు. ఇందుకోసం కొంతమంది రైతులు సొంతంగా పాడిని పోషిస్తుండగా, మరికొంత మంది ఊళ్లోని ఇతర రైతుల పోషించే ఆవులు, ఎద్దుల పేడను సేకరిస్తుంటారు. ఒక్కోసారి ఇవి సకాలంలో దొరక్క ప్రకృతి సాగు చేసే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం టీటీడీ దృష్టికి వెళ్లడంతో.. తమ గోశాలల్లో పెద్ద సంఖ్యలో ఉన్న దేశీ ఆవులు, ఎద్దులను రైతులకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతు సాధికార సంస్థతో టీటీడీ పాలకమండలి ఓ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ. 8 కోట్లకు పైగా విలువైన 930 ఆవులు, 1,200 ఎద్దులను చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రైతులకు ఉచితంగా అందజేస్తోంది. దశల వారీగా మిగిలిన జిల్లాల్లోని రైతులకు అందిస్తారు. ఈ నెల 9న చిత్తూరు జిల్లాలో పంపిణీకి టీటీడీ శ్రీకారం చుట్టింది. రోజుకి 30 నుంచి 50 పశువుల చొప్పున ఈ నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేయాలని సంకల్పించింది. ఒక ఆవు లేదా రెండు ఎద్దులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పూర్తిగా ప్రకృతి సాగు చేసే రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆవులు, ఎద్దులను అమ్మడం, కబేళాలకు తరలించమని లిఖిత పూర్వక హామీ పత్రమివ్వాలి. ఎంపికైన లబ్ధిదారులు స్వయంగా గోశాలకు వచ్చి తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కో లబ్ధిదారునికి ఒక ఆవు లేదా రెండు ఎద్దులిస్తారు. దేశీ ఆవు పేడలో ఉండే సూక్ష్మజీవులు (మైక్రోబ్స్) భూమిని సారవంతం చేస్తాయి. ఒక గ్రాము పేడలో 0.5–1.05 శాతం నత్రజని, 0.3–0.9 శాతం భాస్వరం, 0.5–1.09 శాతం పొటాషియం ఉంటాయి. ఆవు పేడ, మూత్రాలతో ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేయవచ్చు. ఇక దేశీ ఆవు పాలు లీటర్ రూ. 70 నుంచి రూ. 80 ధర పలుకుతుంది. ఇక నెయ్యి కిలో రూ. 2,500 ధర ఉంది. అవసరం మేరకు పేడ, మూత్రం వినియోగించుకుని.. మిగతా మొత్తాన్ని అమ్ముకోవచ్చు. ఇలా లబ్ధిదారు కుటుంబానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఎదురు చూసే బాధ తప్పింది నేను 2 ఎకరాల్లో 4 ఏళ్లుగా ప్రకృతి సాగు చేస్తున్నాను. ఘన, ద్రవ జీవామృతాలకు అవసరమైన ఆవు పేడ, మూత్రం కోసం ఇతర రైతుల ఇంటి వద్ద ఎదురు చూడాల్సి వచ్చేది. ఇటీవలే టీటీడీ గోశాల నుంచి దేశీ ఆవును తెచ్చుకున్నాను. సాగుకు అవసరమైన ఇన్పుట్స్ తయారు చేసుకోగా మిగిలిన పేడను సంఘ సభ్యులకు అందజేస్తున్నా. – ఎం.పాండు. కోటావారిపల్లి, మదనపల్లె మండలం ప్రకృతి సాగులో టీటీడీ భాగస్వామ్యం ప్రకృతి సాగు విస్తరణలో టీటీడీ భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కృషి ఫలితంగా టీటీడీ గోశాలలోని దేశీ గోవులు, ఎద్దులను రైతులకందించేందుకు టీటీడీ ముందుకురావడం శుభ పరిణామం. – టి.విజయకుమార్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వెంకన్న వర ప్రసాదం ఇప్పటి వరకు జెర్సీ ఆవు పేడ ఉపయోగిస్తున్నాను. టీటీడీ వారు ఇచ్చిన ఆవు వెంకన్న సన్నిధి నుంచి వచ్చిన వర ప్రసాదంగా భావించి కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. నా పొలానికేకాదు సంఘ సభ్యులకు అవసరమైన ఇన్పుట్స్ సామూహికంగా తయారు చేసుకుంటున్నాం. నాటి ఎద్దులతో దేశీ ఆవుల సంతతి పెంచేందుకు కృషి చేస్తాం. – జి.అమరావతి, మిట్టపల్లి, కుప్పం మండలం -
వైరల్: ఆవులపై పోలీసులకు ఫిర్యాదు.. ఇదేందిరా నాయనా..
శివమొగ్గ(కర్ణాటక): అమ్మ కొట్టిందని, పెన్సిల్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ మధ్యకాలంలో చూశాం. అటువంటిదే ఈ కేసు. నా ఆవులు పాలు ఇవ్వడం లేదు. పాలు ఇచ్చేలా చేయండి, లేదా వాటిపై కేసు నమోదు చేయండి.. అని ఒక రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలూకాలోని హళెహోన్నూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చదవండి: అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్! ‘ఆవులకు తగినంత దాణా, గడ్డి పెట్టి పోషిస్తున్నా, 4 రోజుల నుంచి పాలు ఇవ్వడం లేదు, పాలు పితకడానికి వెళ్తే తంతున్నాయి. వాటికి బుద్ధి వచ్చేలా చేయండి’ అని స్థానిక రైతు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు నివ్వెరపోయారు. ఇటువంటి కేసులను నమోదు చేయడం కుదరదు. ఆవులను మంచిగా చూసుకో, పాలు ఇస్తాయని నచ్చ చెప్పి పంపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: మటన్ కావాలా.. భర్త కావాలా.. తేల్చుకో..! -
ఉత్తరప్రదేశ్లో గోవులకు అంబులెన్స్
మధుర: దేశంలోనే తొలిసారిగా గోవుల కోసం అంబులెన్స్ సేవలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. అనారో గ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్ల్లో ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందించనున్నట్లు రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి ఆదివారం చెప్పారు. ఇలాంటి పథకం దేశంలోనే ఇది తొలిసారి అని తెలిపారు. 515 అంబులెన్స్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్ ‘112’కు ఫోన్ చేసి, అంబులెన్స్ సేవలు పొందవచ్చని సూచించారు. ప్రతి అంబులెన్స్లో ఒక వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులు ఉంటారు. ఫోన్ చేస్తే దాదాపు 20 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంటుందని చౌదరి వివరించారు. గోవులకు అంబులెన్స్ సేవల పథకాన్ని డిసెంబర్లో ప్రారంభిస్తామన్నారు. -
అనస్తీషియా వైద్యుడు..సేంద్రియ రైతుగా ఎలా మారాడంటే..
వ్యవసాయం, పశుపోషణను రసాయనాల ‘మత్తు’ నుంచి విడిపించేందుకు ఓ సీనియర్ మత్తు వైద్యుడు సేంద్రియ రైతుగా మారారు. సుమారు రూ. పది కోట్ల పెట్టుబడితో, విలక్షణ సమీకృత సేంద్రియ సేద్యానికి నమూనాగా నిలిచేలా భారీ వ్యవసాయ క్షేత్రాన్ని సొంత డిజైన్తో నిర్మించారు. రసాయనిక అవశేషాల్లేని బియ్యం, కూరగాయలతోపాటు.. దేశీ ఆవులు / ముర్రా గేదెల పాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు 250 మంది వైద్యులు, మరెందరో ఆరోగ్యాభిలాషుల మనసులు దోచుకుంటున్నారు. ఆయన పేరు డాక్టర్ యు. శేషఫణి (56). కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అనస్తీషియా విభాగానికి అధిపతి. వైద్య విధుల్లో నిత్యం తీరిక లేకుండా గడిపే ఆయన డాక్టర్గా రాణిస్తూనే.. భారీ ప్రణాళికతో పెద్ద సమీకృత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. మహానంది మండలం గోపవరం గ్రామంలో సొంత ఆలోచనతోనే వ్యసాయ క్షేత్రాన్ని ఔరా అనిపించేలా డిజైన్ చేసుకున్నారు. భూగర్భంలో 2 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్ను నిర్మించి, అందులోకి ఆవులు/ గేదెల మూత్రం, పేడ, కడిగిన నీరు వెళ్లేలా ఏర్పాటు చేసి.. అక్కడే సులువుగా జీవామృతం తయారు చేసుకుంటున్నారు. సంపులో నుంచే నేరుగా పంట పొలాలకు 4 అంగుళాల పైపులతో జీవామృతాన్ని తోడి పోసే విధంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం విశేషం. సొంత భూమి 12 ఎకరాలు ఉండగా.. 25 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. 13 ఎకరాల్లో వరి, కూరగాయలతోపాటు పశుగ్రాసాలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు. పండించిన ధాన్యం 4 నెలలు మాగబెట్టిన తర్వాత బియ్యం పట్టించి గిట్టుబాటు ధరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. పంటలపై సస్యరక్షణకు అవసరాన్ని బట్టి వేస్ట్ డీకంపోజర్, గోమూత్రం, వేపనూనె పిచికారీ చేస్తారు. మామిడి, సపోట, బాదం, అంజూర, బత్తాయి, దానిమ్మ, నేరేడు, జామతో పాటు, కొబ్బరి, టేకు చెట్లు పెంచుతున్నారు. దేశీ ఆవులు, ముర్రా గేదెల నమూనా క్షేత్రం రసాయనాలు, ఆక్సీటోసిన్ ఇంజక్షన్లు వాడకుండా.. దేశీ ఆవులు, ముర్రా గేదెలతో నాణ్యమైన పాల ఉత్పత్తితోపాటు ప్రమాణాలతో కూడిన ఆవు, గేదెల సంతతిని వృద్ధి చేస్తున్నారు డా. శేషఫణి. 2016లో ఒక పశువైద్యుడి సలహాతో 4 దేశీవాళీ ఆవులు, 6 ముర్రా గేదెలతో ఫామ్ పెట్టారు. ఈ ఫామ్ నేడు విశేషంగా అభివృద్ధి చెందింది. 38 ఒంగోలు, 4 సాహివాల్ ఆవులతోపాటు 130 ముర్రా గేదెలను శ్రద్ధగా, ఆరోగ్యవంతంగా పోషిస్తూ రసాయనిక అవశేషాల్లేని పాలు ఉత్పత్తి చేస్తున్నారు. ప్యాకెట్లను ఇంటింటికీ అందిస్తున్నారు. 400 ఆవులు, గేదెలకు సరిపోయేలా మౌలిక సదుపాయాలు కల్పించారు. 17 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేస్తున్నారు. 200 ఎకరాల వరి గడ్డి, జొన్న చొప్ప కొని భారీ గోదాములో నిల్వ చేసుకొని ఏడాది పొడవునా మేపుతున్నారు. సొంత దినుసులతోనే దాణా తయారు చేసుకొని ఖర్చు తగ్గించుకుంటూ సత్ఫలితాలు సాధిస్తుండటం విశేషం. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నందుకు సంతృప్తిగా ఉంది జాతి పశువులు అంతరించిపోకుండా ఉండాలనే లక్ష్యంతో దేశవాళీ ఆవులు, ముర్రా గేదెలతో ప్రత్యేక ఫామ్ను అభివృద్ధి చేశాం. నంద్యాల పరిశోధనా స్థానం నుంచి నాణ్యమైన ఒంగోలు గిత్తల సెమెన్ వాడుతున్నాం. సెక్స్డ్ సెమన్తో మేలు జాతి ముర్రా జాతి పశువులను ప్రత్యేక సొసైటీ ద్వారా శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నాం. ఆరోగ్యదాయకమైన ఎ2 పాలను, బియ్యం, ఇతర ఆహారోత్పత్తులను అందిస్తున్నాం. ఇటు గోసేవ, అటు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నందుకు సంతృప్తిగా ఉంది. – డా. శేషఫణి (94400 70234), గోపవరం, మహానంది మండలం, కర్నూలు జిల్లా -
సూర్యాపేట జిల్లాలో మూగ జీవుల దందా
-
మహిళకు షాక్.. ఇంటిని బందెల దొడ్డి చేశాయ్!
మెల్బోర్న్ : రెండు పెంపుడు ఆవులు ఓ మహిళకు షాక్ ఇచ్చాయి. బయటకెళ్లి తిరిగొచ్చేలోపు ఇంటిని బందెల దొడ్డి చేసేశాయి. ఫ్లోర్ మీద మల, మూత్ర విసర్జన చేసి, కుర్చీలు ఇతర సామాగ్రి విరగొట్టి నానా బీభత్సం సృష్టించాయి. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని థస్మేనియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. థస్మేనియాకు చెందిన చెల్సియా హింగ్టన్ కొద్దిరోజుల క్రితం కూతుర్ని ప్లే గ్రూప్( ప్లే స్కూల్)లో విడిచిపెట్టడానికి వెళ్లింది. ఓ గంట తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు బార్లా తెరిచిఉండటం చూసి ఖంగారు పడి ఇంట్లోకి వెళ్లింది. అంతే! అక్కడి దృశ్యాలు చూసి షాక్ అయింది. పెంపుడు ఆవులు బాండిట్, ఎస్ఓబీలు ఇంట్లో నానాబీభత్సం సృష్టించాయి. కుర్చీలు, పూల కుండీలు ధ్వంసం చేశాయి. బట్టలు, బ్లాంకెట్లు, పుస్తకాలు బొమ్మలు, పేపర్లు, ఫైల్స్ పాడు చేశాయి. కార్పెట్ను పెండతో నింపేశాయి. ఆమె వచ్చే సమయానికి సంఘటనా స్థలంలో హాయిగా తిరుగుతున్నాయి. దీనిపై హింగ్టన్ మాట్లాడుతూ.. ‘‘నేను భయకంపితురాలినయ్యా.. అక్కడి దృశ్యాలను నమ్మలేకపోయా. ఇంటి బయటున్న పశువుల పాక డోర్ లాక్ పాడవటంతో అవి బయటకు వచ్చేశాయి. ఇంటి వెనకాలి తలుపులనుంచి లోపలికి ప్రవేశించి నాశనం చేశాయి’’ అని వాపోయింది. చదవండి : ఆఫీస్ కోసం టాయిలెట్ అద్దెకు ఇవ్వబడును.. వారానికి అద్దె.. -
వృద్ధ గోవులకు పింఛను
పూడూరు: గోమాత రక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని దామ గుండం రామలింగేశ్వరాలయాన్ని మంగళవారం సందర్శించారు. అనంతరం పూడూరుకు చెందిన 20 వృద్ధ గోవులకు రూ.500 చొప్పున పింఛను అందజేశారు. అమృంతగమయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యానందస్వామి సౌజన్యంతో గోవుల రక్షణ కోసం యజమానికి ప్రతినెలా500 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో ఆవుకు రూ.375తో బీమా చేయించామని, ఆ గోవు మరణిస్తే రైతుకు రూ.35 వేల బీమా అందుతుందని స్పష్టం చేశారు. -
గోవధ ఆపాలంటూ హైకోర్టులో వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: గోసంరక్షణ చట్టం, గోవధ నిషేధ చట్టం–2011కు వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని సైతం అమలు కావడం లేదని, ఆవులను వధించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తిరుమల, తిరుపతి దేవస్థానాల బోర్డు మెంబర్, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బక్రీద్ పేరుతో వేలాదిగా ఆవుల్ని, కోడె దూడల్ని సైతం వధిస్తారని, తక్షణమే తమ పిల్ను విచారణకు చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ చేసిన విజ్ఙప్తిని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆమోదించింది. మంగళవారం పిల్ను విచారణ చేస్తామని సోమవారం బెంచ్ హామీ ఇచ్చింది. పాడి,సాగులకు యోగ్యమైన వాటిని వధించకూడదని, వాహనాల్లో ఆవులు,ఎద్దుల్ని కుక్కేసి రవాణా చేయకూడదని ఇటీవల కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను, వేటిని వధించవచ్చునో పశువైద్యుడు నిర్ధారించిన తర్వాతే నిర్ధిష్ట వధశాల్లో పశువైద్యుడి సమక్షంలోనే చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రాష్ట్రంలో అమలు కావడం లేదని పిల్లో పేర్కొన్నారు. ఆవులను అక్రమ రవాణా అవుతుంటే రాష్ట్ర పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, చెక్పోస్ట్ల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేసి హైకోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చేయాలని కోరారు. ఆవులు, కోడెదూడల అక్రమ రవాణా అవుతుంటే గోవు పూజ్యనీయమని భావించే వాళ్లు అడ్డుకుంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని పోలీసులు ఉల్టా కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల్ని పోలీసులు అమలు చేయనందుకే సీఆర్పీఎఫ్ బలగాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని శివకుమార్ దాఖలు చేసిన పిల్లో కోరారు. -
కరోనా ఎఫెక్ట్ : ఆవులకు స్ట్రాబెరీల దానా
ముంబై : కరోనా వైరస్ను అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ ఓ రైతు పాలిట శాపమైంది. రవాణా వ్యవస్థ నిలిచిపోవటంతో చేతికొచ్చిన స్ట్రాబెరీ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక పశువులకు దానాగా వేస్తున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సతారా జిల్లాలోని దేర్వాడి గ్రామానికి చెందిన అనిల్ సాలుంఖీ అనే వ్యక్తి తన రెండెకరాల పొలంలో స్ట్రాబెరీలను సాగుచేశాడు. పంట చేతికొచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్ అతడి కడుపు కొట్టింది. కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు విధించిన 21రోజుల యావద్దేశ లాక్డౌన్ కారణంగా పంటను అమ్ముకోవటానికి రవాణా సౌకర్యాలు లేక చేలోనే మిగిలిపోయింది. ( నెల్లూరులో అత్యధికంగా కరోనా కేసులు ) ఏం చేయాలో తెలియక, పంటను వృధా చేసుకోవటం ఇష్టం లేక, మనసు చంపుకుని దాన్ని పశువులకు దానాగా వేస్తున్నాడు. దీనిపై అనిల్ స్పందిస్తూ.. ‘‘ రూ. 2,50,000 ఖర్చుపెట్టి పంట వేశా. 8 లక్షలు వస్తుందని ఆశ పెట్టుకున్నా. ఇప్పుడు పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు. యాత్రికులు, ఐస్ క్రీమ్ తయారు చేసే కంపెనీలు స్ట్రాబెరీలను ఎక్కువగా కొంటారు. ఇప్పుడ ఆ పరిస్థితి లేద’’ని ఆవేదన వ్యక్తం చేశాడు. ( కరోనా : తండ్రి అంత్యక్రియలకు కూడా.. ) కొద్దిరోజుల క్రితం బెంగళూరుకు చెందిన ఓ రైతు తను పండించిన ద్రాక్ష పంటను కొనే దిక్కులేక దాన్ని అడవి పాలు చేశాడు. ఐదు లక్షలు ఖర్చు పెట్టి పండించిన పంటను ఎలా అమ్మాలో తెలియక ఈ నిర్ణయానికి వచ్చాడు. చుట్టుపక్కలి గ్రామాల ప్రజలను ఉచితంగా పళ్లను తీసుకుపోమని ఆహ్వానించినా కొద్దిమంది మాత్రమే ముందుకు రావటం గమనార్హం. -
ఆవులు మాట్లాడుకుంటాయ్!
సిడ్నీ : ఆవులు మాట్లాడుకోవడమేంటి? ‘అంబా’అని అరవడం తప్ప వాటికింకేమి మాటలొస్తాయ్? అంటారా..! నిజమే.. కానీ ‘అంబా’అనే ఆ ఒక్క పదంలోనే అవి తమలోని విరుద్ధ భావాలను పరస్పరం తెలియజేసుకుంటాయని తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ రీసెర్చర్ల బృందం ఈ పరిశోధన నిర్వహించింది. వీరు ఆవు అరుపులపై అధ్యయనం చేశారు. వాటి అరుపులను తర్జుమా చేయడానికి గూగుల్ ట్రాన్స్లేట్ వంటి ఓ పరికరాన్ని తయారుచేసి ఉపయోగించారు. దీని ద్వారా ఆవుల ‘అంబా’అరుపులో భావోద్వేగాన్ని బట్టి స్వరం తీవ్రతలో తేడాలుంటాయని గుర్తించారు. కోపం, బాధ, భయం, సంతోషం.. ఇలాంటి వివిధ రకాల భావాలను వ్యక్తం చేసేటపుడు, తోటి ఆవులను పిలిచేటప్పుడు వాటి అరుపుల్లో తేడాలుంటాయని పరిశోధనలో పాలుపంచుకున్న అలెగ్జాండ్రా గ్రీన్ తెలిపారు. ఆవుల ‘అంబా’ అరుపులోని ఈ తేడాలు వాటి జీవితాంతం కొనసాగుతాయని పేర్కొన్నారు. 333 ఆవుల అరుపులను రికార్డ్ చేసి, అనలైజ్ చేయగా ఈ విషయం తెలిసిందని వెల్లడించారు. ఒక మందలో ఏ ఆవు అరిచిందో దాన్ని చూడకుండా కేవలం వినడం ద్వారా మిగిలినవి గుర్తుపట్టగలవని, ప్రతి ఆవుకూ భిన్న వాయిస్ ఉంటుందని పరిశోధనలో కనుగొన్నట్లు గ్రీన్ వివరించారు. -
నన్ను ప్రధాని ఆహ్వానిస్తే.. అదే చెప్తా!
న్యూఢిల్లీ: ఆమె ఈశాన్య భారతానికి చెందిన అందాల పోటీలో కంటెస్టెంట్. 2019 మిస్ కోహిమా అందాల పోటీలో మొదటి రన్నరప్గా నిలిచారు. అందాల పోటీలో ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ఆమె ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆవుల కన్నా మహిళల మీద ప్రధాని మోదీ ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఆమె సూచించారు. అందాలపోటీ ఫైనల్ రౌండ్ భాగంగా జ్యూరీ సువోహును ప్రశ్నిస్తూ.. ‘ప్రధాని నరేంద్రమోదీ మిమ్మలి పిలిచి మాట్లాడితే.. మీరు ఏం మాట్లాడారు?’ అని అడిగింది. దీనికి సువోహు సమాధానమిస్తూ.. ‘నన్ను భారత ప్రధాని మాట్లాడేందుకు పిలిస్తే.. ఆవుల మీద కన్నా మహిళల మీద ఎక్కువ శ్రద్ధ చూపాలని ఆయనకు చెప్తాను’అంటూ సూటిగా సమాధానం చెప్పారు. ఆమె తెలివిగా ఇచ్చిన ఈ సమాధానంతో ఆడియేన్స్లో నవ్వులు విరిశాయి. పదిరోజుల కిందట నాగాలాండ్లోని జోట్సోమాలో ఈ అందాల పోటీ ఫైనల్ రౌండ్ జరిగింది. ‘ఎడ్యుకేట్ ఏ గర్ల్.. ఎంపవర్ ఏ సొసైటీ’ అనే థీమ్తో స్థానిక అగాథోస్ సొసైటీ ఈ అందాల పోటీని నిర్వహించింది. అందాల పోటీలో సువోహు ఇచ్చిన సమాధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. -
మిత్రుడి కోసం ఆవుల మూగ వేదన
సాక్షి, ఆసిఫాబాద్ : తమ ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనుషులే కాదు. మూగ జంతువులు సైతం బాధతో విలపిస్తాయి. బుధవారం కుమురం భీం జిల్లా కలెక్టరేట్కు వెళ్లే దారిలో ఓ ఆవు అనారోగ్య కారణంతో మృతి చెందింది. మరణించిన ఆవును గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ వెనక వైపు తాడుతో కట్టి పట్టణ శివారువైపు తీసుకెళ్తుండగా తోటి పశువులు చూసి తమ ఆత్మీయురాలిని కోల్పోతున్నామనే బాధతో ఆ ట్రాక్టర్ను అరుస్తు వెంబడించసాగాయి. సబ్ జైలు సమీపం నుంచి ఆదిలాబాద్ చౌరస్తా వరకు ఆ ట్రాక్టర్ వెనకలే దాదాపు రెండు కిలోమీటర్ల మేర పరిగెడుతూ తమ మూగ బాధను వెల్లబుచ్చాయి. మృతి చెందిన ఆవును బాధతో వెంబడిస్తున్న తోటి ఆవులు -
ఆవులపై విష ప్రయోగం జరగలేదు
సాక్షి, విజయవాడ: కొత్తూరు తాడేపల్లిలోని గోసంరక్షణశాలలో ఆవుల మృతికి టాక్సిసిటీ కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పశుసంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. అయితే, టాక్సిసిటీ అంటే విష ప్రయోగం కాదని, విషతుల్యమైన పదార్థాలు కారణమని ఆయన చెప్పారు. పచ్చగడ్డిలో పాస్ఫరస్, నత్రజని శాతం ఎక్కువైనా టాక్సిసిటీ కారణమయ్యే అవకాశముంటుందని తెలిపారు. ఆవులపై విషప్రయోగం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మృతిచెందిన ఆవుల పోస్టుమార్టం నివేదిక మంగళవారం వస్తుందని, వారంలోపు ఫోరెన్సిక్ నివేదిక కూడా రానుందని దామోదర్ నాయుడు వెల్లడించారు. కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలోని దాదాపు 80కిపైగా గోమాతలు ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణ వేగవంతం ఆవుల మరణంపై పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనపై గోశాల నిర్వాహకులు చెప్తున్న విషయాలపై పోలీసులు సంతృప్తి చెందడం లేదు. ఈ ఘటన వెనుక వాస్తవాలు వెలికితీసేందుకు రహస్య విచారణ చేపట్టారు. గోవులు మృతిచెందిన రోజు సాయంత్రం నుంచి రాత్రివరకు గోశాలలో ఎవరెవరు ఉన్నారు?. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా?. పశుగ్రాసం విషతుల్యం అయిందా? చనిపోయిన గోవులు మాత్రమే ఆ గ్రాసం తిన్నాయా? అది సాధ్యమా? పనికట్టుకుని ఎవరైనా గోవులకు విషతుల్యమైన ఆహారం అందేలా చేశారా? ఒకవేళ పశువైద్యులు అనుమానిస్తున్నట్లు అధిక ఆహారం వల్లే గ్యాస్ ఏర్పడి మృత్యువాత పడ్డాయా? విషపూరితమైన లేత జున్నుగడ్డిని గోవులకు ఎవరైనా పెట్టారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆవుల మృతి చెందిన ఘటనపై విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. గో సంరక్షణ సమితి కార్యదర్శి సాబు గోవిందకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 9వ తేదీ రాత్రి గడ్డి తిన్న ఆవులు మృతి చెందాయని గోశాల సూపర్వైజర్ ఫోన్చేసి తమకు సమాచారం అందించాడని, దాంతో తామంతా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించామని గోవింద్కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గోశాలను సందర్శించిన కమలానంద భారతీ స్వామి వీహెచ్పీ నేతలతో కలిసి కొత్తూరు తాడేపల్లిలోని గోశాలను భువనేశ్వరి మఠం పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి సందర్శించారు. గోశాలలో జరిగిన సంఘటన హృదయాన్ని కలచివేసిందని ఈ సందర్భంగా కమలానంద భారతీ స్వామి పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఖననం చేసిన గోమాతలకు శాంతి పూజలు చేయించాలని నిర్వాహకులకు సూచించారు. -
గోవుల మృతిపై విచారణ జరిపిస్తాం : మోపిదేవి
సాక్షి, విజయవాడ : నగర శివారులోని కొత్తూరుతాడేపల్లి గోశాలలోని గోవుల మృతిపై శాఖపరంగా విచారణ జరిపిస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో గోవులు మృతి చెందడం బాధాకరమన్నారు. విచారణ నివేదిక రాగానే గోవుల మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని గోశాలల్లో ఉన్న గోవుల పరిస్థితిపై తనిఖీలు చేపడతామని చెప్పారు. గోవుల మృతి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా..? అని కూడా విచారిస్తామన్నారు. గోవుల మృతి బాధాకరం : మల్లాది విష్ణు గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందటం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కొత్తూరుతాడేపల్లి గోశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గోవుల మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఇక మీదట గోశాలలపై పశుసంవర్ధక శాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా విజయవాడ నగర శివారులోని కొత్తూరుతాడేపల్లి గోశాలలో 100 గోవులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవుల మరణ మృదంగం కొనసాగుతోంది. గోవుల మృతి సంఖ్య 101కి చేరగా మరో 20 గోవుల పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం గోశాలకు వచ్చిన 22 టన్నుల పసుగ్రాసం మీదే నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషపూరితమైన లేత జున్నుగడ్డి తినటం వల్లే ఘోరం జరిగి ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మృతి చెందిన పెద్ద గోవులకు పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే గోవుల మృతికి సరైన కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
విషాదం: తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి
సాక్షి, కృష్ణా: విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. శ్రావణ శుక్రవారం అర్థరాత్రి సమయంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మృతిచెందిన ఆవులకు పోస్ట్మార్టం చేసిన తరువాత వాటి మృతికి కారణం చెబుతామని వైద్యులు తెలిపారు. మరికొన్ని పశువులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో కూడా ఇదే గోశాలలో పుడ్ పాయిజనింగ్ కారణంగా 24 గోవులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. 100 గోవులు చనిపోవడంపై గో సంరక్షణ కార్యదర్శి సాహు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. ఘటన జరగడం బాధకరమన్నారు. రాత్రి సమయంలో పశువులకు వేసిన దాణా పాయిజనింగ్ అయి వుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
మూగశిక్ష
చేయని నేరానికి ‘మూగ’జీవాలు శిక్ష అనుభవిస్తూ, తిండిలేక కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వైనమిది. నెల రోజులుగా మూగజీవాలు మేత, నీళ్లు లేక కృశిస్తూ ప్రాణాలు పోయే స్థితికి చేరుకుంటున్నాయి. తల్లి పాలు లేకున్నా తన పాలిచ్చి వారికి ప్రాణదానం చేసే గోవులు ఇప్పుడు తమకు మేత భిక్ష పెట్టేవారి కోసం చావు చూపులతో దీనంగా చూస్తున్నాయి. ఒక మహిళ హత్య ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల పెను విషాదమిది. ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫ్లాష్బ్యాక్లో వెళ్దాం రండి. చిత్తూరు, పుత్తూరు రూరల్ : మండలంలోని వేపగుంట క్రాస్, ఎన్టీఆర్ కాలనీలో గత నెల 3న దేవకి అనే మహిళ హత్యకు గురవడం విదితమే. పశువుల కొట్టం స్థలంపై ఉన్న వివాదమే హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన నిందితులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు పంపారు. తదనంతరం హతురాలి కుటుంబ సభ్యులు నిందితుల నివాసం వద్దకు వెళ్లి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వారు భీతిల్లారు. తమకేమైనా ముప్పు తప్పదేమోననే భయంతో వారు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మకాం మార్చారు. అయితే వారు పెంచుకుంటున్న సుమారు 40 ఆవులు, లేగ దూడలను అక్కడే వదిలి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి వాటి ఆలనాపాలనా పట్టించుకునే దిక్కు లేక, వాటికి మేత పెట్టేవారు లేకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికి పది రోజులు దాటింది. హత్యతోను, తగాదాలతోను ఏ సంబంధం లేకపోయినా మేత కరువై మూగ శిక్ష అనుభవిస్తున్నాయి. పుష్ఠిగా ఉన్న కొన్ని పశువులకు డొక్కలెగరేస్తున్నాయి. చర్మానికి అంటుకుపోయినట్లు ఎముకలు కనిపిస్తున్నాయి. ఎవరైనా అటు వెళ్లితే..దీనంగా చూస్తూ అంబా..అంబా! అని మేత కోసం అంగలార్చుతున్నాయి. మనసున్న మారాజులు రాకపోతారా? తమకింత గడ్డి పెట్టి ప్రాణాలు రక్షించపోతారా? అని దిక్కులు చూస్తున్నాయి. లేగదూడలైతే నిలబడే శక్తి లేక చతికిలపడిన స్థితిలో ఉండటం చూస్తుంటే మనసు ద్రవించకమానదు. వాటి దీనావస్థను చూసిన సమీపంలోని కొందరు అప్పుడప్పుడూ కొంత మేత వేస్తున్నా అవి వాటికేమాత్రం సరిపోవడం లేదు. బహుశా అడపా దడపా వేసే కొద్దిపాటి మేత వలనే కళ్లల్లో ప్రాణం పెట్టుకుని మనగలుగుతున్నాయోమే అనిపించకమానదు. పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ మూగజీవాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘21 గోవులు మరణించాయి.. అది కనిపంచడం లేదా’
లక్నో : మీకు ఇద్దరు మనుషులు చనిపోవడం మాత్రమే కనిపిస్తోంది.. కానీ అక్కడ మరో 21 ఆవులు కూడా చనిపోయాయి.. అది మీకు కనిపించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ శర్మ. కొన్ని రోజుల క్రితం బులందషహర్ ప్రాంతంలో జరిగిన మూక దాడిలో ఇద్దరూ పోలీసు అధికారులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి వెనక వేరే ఉద్దేశాలున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సంఘటనల గురించి యూపీ సీఎం ఆదిత్యనాథ్ మౌనంగా ఉన్నారు. దాంతో ఆగ్రహించిన మాజీ సివిల్ సర్వీస్ అధికారులు కొందరు ఈ విషయం గురించి పూర్తిగా విచారణ చెపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ శర్మ ‘కేవలం ఇద్దరు మనుషులు చనిపోయారని ఇంత రాద్ధంతం చేస్తున్నారు. కానీ అక్కడ 21 గోవులు కూడా చనిపోయాయి. ఆవులను చంపేవారే నిజమైన నేరస్తులు. గోమాతను చంపుతున్నారనే ఆగ్రహంతోనే ఈ మూక దాడి చర్యలు పుట్టుకొచ్చాయం’టూ సంజయ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూక దాడిలో ఇద్దరూ పోలీస్ అధికారులు మరణించినప్పటికి ఆదిత్యనాథ్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ‘ఆదిత్యనాథ్కు మనుషుల ప్రాణాలకంటే గోవుల గురించి చింతే ఎక్కువైంది. గో రక్షణ పేరిట మనుషుల ప్రాణాలు తీస్తున్న చలించడం లేద’ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు సంజయ్ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి మరిన్ని విమర్శలకు అవకాశం కల్పించారు. -
మానవ తప్పిదం
వైఎస్ఆర్ జిల్లా , ప్రొద్దుటూరు టౌన్ : కసువు తొట్ల వద్ద పడేస్తున్న బయో మెడికల్ వ్యర్థాలను తింటున్న మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి.పట్టణంలోని గాంధీరోడ్డు విజయనగర్వీధి, సూపర్బజార్రోడ్డు, హోమస్పేట తదితర వీధుల్లో రోడ్లపై కసువును డంప్ చేస్తున్నారు. సమీపంలో ఉంటున్న ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బంది బయో మెడికల్ వ్యర్థాలను ప్రత్యేక డబ్బాల్లో, కవర్లలో ఉంచకుండా నేరుగా చెత్తలో పడేస్తున్నారు. ఆహారం కోసం వీధుల్లో తిరుగుతున్న ఆవులు చెత్తను తినేందుకు వచ్చి బయోమెడికల్, ప్లాస్టిక్వ్యర్థాలను కూడా తినేస్తున్నాయి. దీంతో వీటి ఆరోగ్యం దెబ్బతింటోంది. ముక్కుల నుంచి పసుపుపచ్చటి ద్రవం కారుతూ ఆహారం తీసుకోక చివరకు మృత్యువాత పడుతున్నాయి. పోస్టుమార్టంలో... మృతి చెందిన ఆవులను కొన్నింటికి పశువైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు. కడుపులో ఉన్న వ్యర్థాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కడుపులో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కవర్లతోపాటు సెలైన్ ఎక్కించే పైపులు, సిరంజిలు, పగిలిన గాజు ముక్కలు ఇలా ఒక్కటేమిటి వివిధ రకాల వ్యర్థాలు బయట పడ్డాయి. మానవ తప్పిదం వల్ల మూగ జీవాల మనుగడకే ప్రమాదం ఏర్పడుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఆవులు ఎక్కడ పడితే అక్కడ మృతి చెందుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. ప్రధాన కాలువల్లోనూ బయోమెడికల్ వ్యర్థాలు పడేస్తుండటంతో నీరు విషతుల్యం అవుతోంది.మండల పరిధిలోని గ్రామాల్లో ఈ నీరు ప్రవహిస్తుండటంతో మేత కోసం వచ్చిన మూగ జీవాలు ఆ నీటిని తాగడంతో జబ్బుల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. రూ.వేలు పెట్టి కొనుగోలు చేసిన గేదెలు చనిపోతుండటంతో పాడి రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. రోడ్లపై వదులుతున్న యజమానులపై చర్యలేవీ.. పాలు పిండు కొని ఆవులను రోడ్లపై వదిలేస్తున్న యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి వద్ద కట్టేసి ఆహారం పెట్టలేక రోడ్ల వెంట వదిలేస్తున్నారు. ఇవి వ్యర్థాలను తిని మృతి చెందుతున్నాయి. గతంలో దాదాపు 150కి పైగా ఆవులను దువ్వూరు మండలంలో ఉన్న గోశాలకు తరలించినా మరో 100 ఆవులు రోడ్ల వెంట తిరుగుతున్నాయి. రోడ్లపై ఉన్న చెత్త డంప్ పాయింట్లు తొలగించాల్సిన అవసరం ఉంది. ఇంటింటి కసువు సేకరణ 100 శాతం జరుగుతుందంటూ తూతూ మంత్రంగా నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నారే తప్ప అది అమలు చేయడం లేదు. ఈ చెత్తలోనే బయోమెడికల్ వ్యర్థాలు పడేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. -
గోవుల చట్టం కోసం 8 ఏళ్ల ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ : ఆవులను ప్రేమించడంలో, గౌరవించడంలో బహూశ భారత్ తర్వాత ప్రపంచంలో రెండో దేశం స్విడ్జర్లాండే కావచ్చు. వారి జాతీయ చిహ్నం కూడా ఆవులే. ఆవుల విషయంలో అక్కడి రైతులకు ఓ ఆటవిక ఆనవాయితీ ఉంది. వారు ఓ దశలో ఆవుల కొమ్ములను నాటు పద్ధతిలో కత్తిరించి వేస్తారు. స్విడ్జర్లాండ్ మొత్తం మీద 80 శాతం ఆవులకు కొమ్ములుండవు. ఈ అనాచారం ఎందుకొచ్చిందో వారికి కూడా తెలియదుగానీ, కొమ్ములుండడం వల్ల గోశాలలకు స్థలం ఎక్కువ అవసరం పడుతుందని, కొమ్ముల వల్ల ఆవులు కోపతాపాలకు గురవుతాయని, పరస్పరం పొడుచుకుంటాయని, అప్పుడప్పుడు వాటిని సాదుతున్న రైతులనే పొడిచే ప్రమాదం ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఆవుల కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే ఆర్మిన్ కపాల్ అనే రైతు ఈ అనాచారానికి వ్యతిరేకంగా చట్టం తీసుకరావడానికి పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. విజయం సాధించారు. ఫలితంగా ఆయన ప్రతిపాదించిన చట్టంపై రేపు (ఆదివారం) స్విడ్జర్లాండ్ ప్రభుత్వం ‘రిఫరెండమ్ (ప్రజాభిప్రాయ సేకరణ)’ నిర్వహిస్తోంది. రిఫరెండానికి అనుకూలంగా మెజారిటీ ప్రజలు ఓటేస్తే చట్టం ఖాయమవుతుంది. స్విడ్జర్లాండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం అవడం వల్ల ఏ అంశంపైనైనా, ఏ పౌరుడైన చట్టాన్ని ప్రతిపాదించవచ్చు. అయితే అందుకు కనీసం లక్ష మంది ప్రజల సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. మన రైతు ఆర్మిన్ కపాల్ లక్షా ఇరవై వేల మంది సంతకాలు సేకరించారు. అయితే ఆర్మిన్ ప్రతిపాదించిన చట్టంలో ఆవుల కొమ్ముల కత్తిరింపుపై నిషేధం కోరలేదు. ఆవుల కొమ్ములను కత్తిరించని రైతులకు, రాయితీగా రోజుకు ఒక్కో ఆవుకు ఒక్క స్విస్ ఫ్రాంక్ అంటే, దాదాపు 70 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాలంటూ చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టం కోసం ఆర్మిన్ దాదాపు ఎనిమిదేళ్లుగా పౌరుల సంతకాల కోసం కృషి చేస్తున్నారు. చట్టం కోసం చేసే ప్రతిపాదనపై స్విస్ పౌరులు గుడ్డిగా సంతకం చేయరు. ప్రతిపాదనతో పూర్తిగా ఏకీభవించినప్పుడే వారు సంతకాలు చేస్తారు. అందుకే లక్షా ఇరవై వేల సంతకాలు సేకరించేందుకు ఆయనకు అంతకాలం పట్టింది. ఆజానుభావుడిలా కనిపించే ఆర్మిన్కు ఇప్పుడు 67 ఏళ్లు. బవురు గడ్డంతో కనిపించే ఆర్మిన్ రకరకాల దుస్తులు, పలు రకాల టోపీలతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ‘మేము ఆవులను ప్రేమిస్తాం, వాటిని తింటాం’ ‘ఆవు కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే మీరు, ఆవు మాంసాన్ని ఎలా తింటారు? అది క్రూరత్వం కాదా?’ అని జర్మనీ జర్నలిస్ట్ పీటర్ జాగ్గి (ఆమె భారత దేశంలో ఆవులను పవిత్రంగా చూడడంపై జర్మనీలో ఇటీవల ఓ పుస్తకం రాశారు) ప్రశ్నించగా ‘మేము ఆవులను ప్రేమించేమాట నిజమే. వాటి మాంసాన్ని ఇష్టంగా తినే మాట కూడా నిజమే. కొన్ని ఆవులను కబేళాలకు పంపించకపోతే నేడు స్విడ్జర్లాండ్లో మనుషులకన్నా ఆవులే ఎక్కువగా ఉండేవి. ఆవుల సంరక్షణను మనుషులమైన మనం బాగా చూసుకుంటాం కనుక, అవి ఆహారంగా మారి మన రుణం తీర్చుకుంటాయి. ఆవులను గౌరవించడం వల్లనే మా దేశస్థులు విమానాశ్రయాల్లో అతిథులను రికార్డు చేసిన ఆవు శబ్దాలతో ఆహ్వానిస్తారు’ అని ఆర్మిన్ అన్నారు. ఆయన మాటల్లో నిజాయతీ ఉందని, భారత దేశంలో గోమాంసాన్ని నిషేధించడంలో నిజాయితీ లేదని ఆమె ఈ సందర్భంగా ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా నేరం చేస్తోంది! ‘నా దష్టిలో ఆవులను అవసాన దశలో కబేళాలకు పంపించడం నేరం కాదు. ఆ దశలో అవి బతికి ఉండడం వల్ల ఎక్కువ బాధను అనుభవించాల్సి ఉంటుంది. గోమాంసాన్ని తినడాన్ని నేరంగా పరిగణించేవారు ఆవు పాలను తాగడం కూడా నేరమే అన్న విషయాన్ని గ్రహించాలి! ప్రకృతి సిద్ధంగా ఆవు పాలనిచ్చేది వాటి సంతానం కోసం. మనుషుల కోసం కాదు. ఈ లెక్కన ప్రపంచమంతా నేరం చేస్తోంది’ అని అమె ‘హోలి కౌవ్స్ ఇండియా (జర్మనీలో)’ పుస్తకంలో వ్యాఖ్యానించారు. -
ఆవుతో మాట్లాడిస్తా..
-
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గో రక్షా పేరిట గోవులను రక్షిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ బషీర్ బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు నిరాహారదీక్ష చేస్తానని రాజా సింగ్ ప్రకటించారు. దీంతో సోమవారం సాయంత్రం ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బషీర్బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ బయలుదేరడానికి వెళుతుండగా పోలీసులు రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నారు. గోవులను రక్షించి గోశాలకు తరలిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. గోరక్ష కార్యకర్తలపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. బక్రీద్ కోసం ఓల్డ్ సిటీకి తరలించిన గోవులను, గోవు దూడలను వెంటనే గోశాలకు తరలించాలన్నారు. గోవులను వదించడానికి పిలిపించిన కసాయిలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరాహారదీక్ష కొనసాగిస్తానని తెలిపారు. కాగా, నిరసన దీక్షకు అనుమతి లేదని పోలీసులు రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నారు. -
అర్ధరాత్రి ఆవుల అపహరణ
కృష్ణరాజపురం: ఇంటి ఆవరణలో కట్టేసిన ఆవులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన సోమవారం రాత్రి కేఆర్పురం పరిధిలోని దేవసంద్రలో చోటు చేసుకుంది. దేవసంద్రలోని ఉర్దూ పాఠశాల సమీపంలో మునిరాజు, రత్న దంపతులు పాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజూ తరహాలోనే సోమవారం సాయంత్రం పాలను పితికి వాటిని రాత్రి సమయంలో ఇంటి ఆవరణలో కట్టేశారు. మంగళవారం తెల్లవారేసరికి ఆవులు కనిపించలేదు. దీంతో కేఆర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా కొంతమంది వ్యక్తులు ఆవులను అపహరించిన దృశ్యాలు కనిపించాయి. ఫుటేజ్ల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
గో రక్షకులూ.. వెంటనే రువాండా వెళ్లండి...!
దేశంలోని గో రక్షకులకు బహిరంగ విజ్ఞప్తి... మీరంతా దయచేసి వెంటనే రువాండా దేశానికి వెళ్లి ఈ ఆవుల పరిరక్షణకు చర్యలు తీసుకోండి. ప్లీజ్... దక్షిణాష్రికా బ్రిక్స్ శిఖరాగ్ర భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనేందుకు వెళుతూ మార్గమధ్యంలో రువాండాలో ఆగి 200 ఆవులను కానుకగా ఇచ్చారు. దీనిపై ట్విటర్ వేదికగా సాగిన హాస్యపూర్వకచర్చలో భాగంగానే ఈ విజ్ఞప్తి సోషల్ మీడియా తెరపైకి వచ్చింది. రువాండాలో కొన్ని శతాబ్దాలుగా ‘గిరింకా పథకం’లో భాగంగా గోవులను కానుకగా ఇవ్వడం ఓ సంప్రదాయంగా వస్తోంది. గౌరవం, కృతజ్ఞతను వ్యక్తపరచడంలో భాగంగా ఒకరి నుంచి మరొకరికి ఆవులు అందజేస్తారు. అయితే రువాండాలో బీఫ్ను ఆహారంలో భాగంగా పరిపాటి కావడంతో ఈ అంశం ట్విటర్లో చర్చకు కేంద్రమైంది. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ను నిషేధించడంతో పాటు ఇటీవల గోవుల పరిరక్షణపేరిట మూక దాడుల సంబంధిత వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ట్విటర్లో సరదా కామెంట్లు... రువాండాలోని బుగెసెరలో అతి పెద్ద బీఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్ రాబోతోంది. ఆ దేశానికే ప్రధాని మోదీ ప్రేమతో 200 ఆవులు కానుకగా ఇచ్చారంటూ ఓ వ్యక్తి స్పందించాడు=మోదీ మాస్టర్ స్ట్రోక్...200 ఆవులు కానుకగా ఇచ్చేశారు అని ఆప్కా దేవేందర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు రువాండాలో మాంసం కొరత ఏర్పడింది అనే శీర్షికతో... రెండుదేశాల్లోనూ ఆవులను పూజిస్తారు. అయితే ఈ ఫోటోను చూడాలంటే భయమేస్తోంది అంటూ రువాండాలో బీఫ్ అమ్మే ఫోటోను రోహిత్ కన్నన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు ఆ దేశంలో గోవులను ఇష్టపడతారు. అయితే డైనింగ్ టేబుళ్ల మీద...అక్కడ గోరక్షకుల దళాన్ని వెంటనే ఏర్పాటుచేయాలి. దళ సభ్యులంతా కూడా రాత్రికి రాత్రి ప్యారాఛూట్లలోఅవసరమైన చోట్ల దిగే ఏర్పాటు చేయాలి అంటూనైనా డీ షేత్ పేర్కొన్నారు రువాండాకు 200 ఆవులను ఎత్తుకెళుతున్న వారు కనిపించారని మై ఫెల్లో ఇండియన్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు ఓ వ్యక్తి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు గోవులను తీసుకెళుతుంటేనే దాడి జరిగింది. మరో వ్యక్తి భారత్ నుంచి 200 ఆవులను తీసుకుని రువాండాకు వెళ్లినట్టు ఇప్పుడే విన్నాను. అతడికి ఏమి కాకూడదని ప్రార్థిస్తున్నాను అని అతుల్ ఖత్రి వ్యాఖ్యానించాడు. -
పాల వ్యాపారంలోకి ప్రముఖ నిర్మాత
ఇన్నాళ్లు సినిమా, థియేటర్ల వ్యాపారంతో బిజీబిజీగా ఉన్న నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. 'హ్యాపీ ఆవులు' పేరుతో స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి ఆయన శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నగర శివార్లలో తనకున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు. మార్కెట్లో లభిస్తున్న పాలు, కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్వచ్ఛమైన పాలు, సేంద్రీయ సేద్యంతో కూరగాయలు అందించాలని నిర్ణయానికి వచ్చారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులకు సేంద్రీయ ఆహారం, స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్టు సురేష్ బాబు తెలిపారు. దీంతో అవి స్వచ్ఛమైన పాలను ఇస్తున్నాయన్నారు. డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో కాకుండా స్వచ్ఛమైన పాలకు, బయట దొరుకుతున్న పాలకు ఉన్న తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. తన ఫాంలోని ఆవు ఇచ్చిన పాలను లీటరు 150 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా రామానాయుడు స్టూడియోని పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదిగా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్బాటిళ్ల స్థానంలో స్టీలు సీసాలను వాడుతున్నామని సురేష్బాబు తెలిపారు. -
అంబులెన్స్లో ఆవుల దొంగతనం
సాక్షి, హైదరాబాద్: ఆవుల దొంగతనానికి అంబులెన్స్ను వినియోగించిన నిందితులను పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.7.5 లక్షల నగదు, ఒక ఆవు, అంబులెన్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చిలకలగూడ ఠాణాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరమండలం డీసీపీ సుమతి, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ డీఐ నర్సింహారాజు, డీఎస్ఐ వెంకటాద్రిలు వివరాలు వెల్లడించారు. మేడిబావికి చెందిన మల్లేష్యాదవ్, రాజుయాదవ్లు మేతకు వెళ్లిన రెండు ఆవులు మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు. అదే తరహాలో మరో రెండు సంఘటనలు జరగడంతో డిటెక్టివ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కుత్బుద్దీన్గూడకు చెందిన మహ్మద్ అయూబ్ అలియాస్ బడాఅయూబ్ (57) కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి పాతబస్తీ బార్కస్లోని నెబీల్ కాలనీలో నివసిస్తున్నాడు. వృతిరీత్యా ఆటో డ్రైవరైన ఆయూబ్ ప్రవృత్తి దొంగతనాలు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, మెదక్ జిల్లాలో 150 కేసుల్లో అయూబ్ నిందితుడు. లారీ దొంగతనం కేసులో అరెస్ట్ అయి ఈ ఏడాది ఫిబ్రవరి 16న విడుదలయ్యాడు. తన సోదరుడు బాబా, తలాబ్కట్టకు చెందిన మహ్మద్ సద్దామ్ ఖురేషీ (27)తో జత కట్టాడు. మేతకు వదిలిన పశువులను దొంగిలించి అమ్ముకుంటూ జల్సాలు చేస్తున్నారు. ఈ విధంగా నగరంలోని పలు ఠాణాల పరిధిలో మొత్తం 39 పశువులను దొంగిలించారు. ఓఎల్ఎక్స్లో అంబులెన్స్ కొనుగోలు... పశువుల దొంగతనానికి అంబులెన్స్ అయితే ఎవరికీ అనుమానం రాదని, ఫుట్బోర్డు కిందికి ఉండడంతో వాటిని సులభంగా ఎక్కించొచ్చని భావించారు. యశోద ఆస్పత్రికి చెందిన ఓ అంబులెన్స్ను ఓలెక్స్ వెబ్సైట్లో కొనుగోలు చేసిన వ్యక్తిని గుర్తించిన ఈ గ్యాంగ్... అధిక మొత్తం చెల్లించి దాన్ని కొనుగోలు చేసింది. ఆరెంజ్ రంగుతో చిక్కారు.. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అంబులెన్స్ నంబర్ ఏపీ 29గా మాత్రమే ఉంది. నగరంలో ఆ నెంబర్ అంబులెన్స్లు 200 లకు పైగా ఉన్నట్లు తేలింది. ఓ దృశ్యం లో అంబులెన్స్ అరెంజ్ కలర్లో కనిపించింది. ఆ రంగు అంబులెన్స్లు కేవలం యశోద ఆస్పత్రి మాత్రమే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలా దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సుమతి, వృత్తంలో నిందితులు -
పశువుల దొంగలు అరెస్టు
చిలకలగూడ రంగారెడ్డి : ఆవుల దొంగతనానికి అంబులెన్స్ను వినియోగించిన నిందితులను పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.7.5 లక్షల నగదు, ఒక ఆవు, అంబులెన్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ ఠాణాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరమండలం డీసీపీ సుమతి, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ డీఐ నర్సింహారాజు, డీఎస్ఐ వెంకటాద్రిలు వివరాలు వెల్లడించారు. మేడిబావికి చెందిన మల్లేష్యాదవ్, రాజుయాదవ్లు మేతకు వెళ్లిన రెండు ఆవులు మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు. అదే తరహాలో మరో రెండు సంఘటనలు జరగడంతో డిటెక్టివ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కుత్బుద్దీన్గూడకు చెందిన మహ్మద్ అయూబ్ అలియాస్ బడాఅయూబ్ (57) కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి పాతబస్తీ బార్కస్లోని నెబీల్ కాలనీలో నివసిస్తున్నాడు. వృతిరీత్యా ఆటో డ్రైవరైన ఆయూబ్ ప్రవృత్తి దొంగతనాలు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, మెదక్ జిల్లాలో 150 కేసుల్లో అయూబ్ నిందితుడు. లారీ దొంగతనం కేసులో అరెస్ట్ అయి ఈ ఏడాది ఫిబ్రవరి 16న విడుదలయ్యాడు. తన సోదరుడు బాబా, తలాబ్కట్టకు చెందిన మహ్మద్ సద్దామ్ ఖురేషీ (27)తో జత కట్టాడు. మేతకు వదిలిన పశువులను దొంగిలించి అమ్ముకుంటూ జల్సాలు చేస్తున్నారు. ఈ విధంగా నగరంలోని పలు ఠాణాల పరిధిలో మొత్తం 39 పశువులను దొంగిలించారు. ఓఎల్ఎక్స్లో అంబులెన్స్ కొనుగోలు... పశువుల దొంగతనానికి అంబులెన్స్ అయితే ఎవరికీ అనుమానం రాదని, ఫుట్బోర్డు కిందికి ఉండడంతో వాటిని సులభంగా ఎక్కించొచ్చని భావించారు. యశోద ఆస్పత్రికి చెందిన ఓ అంబులెన్స్ను ఓలెక్స్ వెబ్సైట్లో కొనుగోలు చేసిన వ్యక్తిని గుర్తించిన ఈ గ్యాంగ్... అధిక మొత్తం చెల్లించి దాన్ని కొనుగోలు చేసింది. ఆరెంజ్ రంగుతో చిక్కారు.. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అంబులెన్స్ నంబర్ ఏపీ 29గా మాత్రమే ఉంది. నగరంలో ఆ నెంబర్ అంబులెన్స్లు 200లకు పైగా ఉన్నట్లు తేలింది. ఓ దృశ్యం లో అంబులెన్స్ అరెంజ్ కలర్లో కనిపించింది. ఆ రంగు అంబులెన్స్లు కేవలం యశోద ఆస్పత్రి మాత్రమే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలా దొంగలను పోలీసులు పట్టుకున్నారు. -
వీధి కుక్కలకు, ఆవులకు వసతి గృహాలు నిర్మించండి
న్యూఢిల్లీ : వీధి కుక్కలకు, ఆవులకు వసతి గృహాలు నిర్మించాలని ‘‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ)’’ రాష్ట్రాలను కోరింది. యవ్వనంలో ఉన్న జంతువులు కబేళాలకు బలికాకుండా ఆ కమిటీ చూసుకుంటుదని తెలిపింది. చలనచిత్రాలలో జంతువులు హింసకు గురికాకుండా చూసుకోవటానికి ప్రత్యేకంగా మరో కమిటీ వేస్తామని పేర్కొంది. ఒక వేళ జంతువులను చలనచిత్రాలలో ఉపయోగించినట్లయితే ఏడబ్ల్యూబీఐ నుంచి ‘నో అబ్జక్షన్ సర్టిఫికేట్’ తీసుకోవాలని తెలిపింది. ఇంకో నెలలోగా వీధి జంతువుల సమస్యను పరిష్కరించాలని కోరింది. జంతువులకు వసతిగా ఉండేలా గృహాలను నిర్మించాలని సూచించింది. ‘‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’’ ఛైర్పర్సన్ ఎస్పీ గుప్తా మాట్లాడుతూ.. తామెవరినీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలనటం లేదని, మాంసం తినేవారు తినటానికి ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. కాకపోతే అన్ని జంతు వధశాలలు నియమాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. జంతు వధశాలల్లో యవ్వనంలో ఉన్న జంతువులను చంపకుండా ఉండటానికి దుకాణాలను తనిఖీ చేయటం జరుగుతుందన్నారు. రహదారులపై జంతువులు తిరగటం కూడా క్రూరత్వం కిందకే వస్తుందన్నారు. వీధి జంతువులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవటానికి ఉత్తరప్రదేశ్తో పాటు మరో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించటమే కాకుండా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశామని పేర్కొంది. -
కుక్కకు ముద్దులే ముద్దులు..!!
వాషింగ్టన్ : వ్యవసాయ క్షేత్రంలో తమతో పాటు కలిసి నివసించే కుక్కపై ఆవులు తెగ ప్రేమను పెంచేసుకున్నాయి. కెనైన్ జాతికి చెందిన కుక్కను, బొవైన్ జాతికి చెందిన ఆవులు గుంపుగా ముద్దులతో ముంచెత్తాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. రచయిత క్రిస్ ఇవాన్గెలిస్టా ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయిన ఫొటో సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి మీరూ ఆ ఫొటోను చూసేయండి. -
పశువులకు అడ్డాగా రహదారులు
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం పట్టణంలో పశువులు ప్రధాన రహదారులపైనే సంచరిస్తూ.., ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొంత మంది పశువులను ఇలా రోడ్డుపై వదిలేయడంతో రోడ్లపైనే సేద తీరుతున్నాయి. బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సెంటర్, అదే విధంగా చర్ల, కూనవరం రోడ్డులో పదుల సంఖ్యలో పశువులు కూర్చుంటున్నాయి. పశువులు రోడ్డుపైనే ఉండడంతో పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే రోడ్లుపై సంచరిస్తున్న ఆవుదూడను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. పాత మార్కెట్ ఏరియాలో మిగిలిపోయిన కూరగాయలు రోడ్ల వెంట పడేడంతో ఆ ప్రాంతంలో కూడా పశువులు సంచరిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాయి. పశువులను ఉంచేందుకు గతంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.3.50 లక్షల వ్యయంతో బందెలదొడ్డి నిర్మించారు. ఇప్పుడు ఆ బందెలదొడ్డి వృథాగా పడివుంది. బందెల దొడ్డి వేలం కనీస ధరను రూ.45 వేలుగా నిర్ణయించారు. దీన్ని తగ్గిస్తే పాటదారులు ముందుకు వచ్చే అవకాశముందని పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. పరిష్కరిస్తాం.. రోడ్లు మీద సంచరిస్తున్న పశువులను ఉంచేందుకు బందెల దొడ్డి నిర్మించాం. కానీ ఈ సంవత్సరం నిర్వహించిన వేలం పాటలో ఎవరు ముందుకు రాలేదు. కనీస ధరను తగ్గించే విషయంలో పునరాలోచన చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతాం. – శ్రీనివాసరావు, పంచాయతీ ఈఓ ఇబ్బందిగా ఉంది.. నిత్యం రోడ్లపైన పశువుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి పగులు తేడా లేకుండా రోడ్లపైనే తిరుగుతున్నాయి. వాటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి కింద పడుతున్నాం. తగిన చర్యలు తీసుకోవాలి. – జి.రామకృష్ణ, ద్విచక్ర వాహనదారుడు మళ్లీ మళ్లీ వస్తున్నాయి రాత్రి వేళ ఈ పశువులు ఇక్కడే మా దుకాణాల ముందు పడుకుంటున్నాయి. ఎంత తోలినా మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తూ మా వ్యాపారాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాటి కోసం ఏర్పాటు చేసిన బందెల దొడ్డిలో ఉంచితే బావుంటుంది. అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. – బి.ఫణిబాబు వ్యాపారి -
ఆవుడెక్కల కింద నలిగిన బాలుడు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయ ఆవరణలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయ సమీపంలోని గుడిచెరువులో తల్లి దండ్రులతో కలసి నిద్రిస్తున్న బాలుడు ఆవుడెక్కల కింద నలిగి మృతిచెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూర్కు చెందిన తిరుపతి, స్వప్న దంపతులు కుమారుడు అనూష్(3), కూతురితో కలసి ఆదివారం శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి హాజరయ్యారు. రాత్రివేళ గుడిచెరువు ఖాళీ ప్రదేశంలో నిద్రపోయారు. ఈ క్రమంలో ఓ ఆవుల మంద అటుగా పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ గుంపులోని ఆవులు వారు నిద్రిస్తున్న ప్రాంతంలోంచి వెళ్లగా వాటి డెక్కల కింద నలిగి అనూష్ గాయపడ్డాడు. తల్లి దండ్రులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకు వచ్చిన తమకు పుత్రశోకమే మిగిలిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
అనంతపురంలో దొంగల బీభత్సం.. కాల్పులు
సాక్షి, అనంతపురం: అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.. తమపైనే దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన అనంతపురం నగరంలో సంచలనం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి ఓ వాహనంలో ఆవుల చోరీకి కొందరు దొంగలు యత్నించారు. విషయం తెలిసి అడ్డుకోబోయిన పోలీసులపై ఆ ముఠా దాడిచేసింది. దీంతో పోలీసులు దుండగులపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులపై రాళ్లు రువ్వుతూ దుండగులు పారిపోయారు. పోలీసుల రక్షక్ వాహనం దెబ్బతినడంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అంబులెన్స్ ఉపయోగించగా దాన్నికూడా ఢీకొట్టి పారిపోవడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మరుగుజ్జు ఎద్దు..దులియా జాతి గేదెలు!
హైదరాబాద్: పశుసంక్రాంతితో హైదరాబాద్ నగరశివారు గండిపేట మండలం నార్సింగి గ్రామం సందడిగా మారింది. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే రెండవ శుక్రవారం వివిధ రాష్ట్రాల నుంచి గేదెలను తెచ్చి వ్యాపారులు ఇక్కడ అమ్ముతారు. గుజరాత్, హరియాణా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ముర్రా, దులియా, ఆంధ్రా గుజ్జారీ లతో పాటు దేశీ ఆవులు అమ్మకానికి తరలి వచ్చాయి. ఇందులో మూడు అడుగుల లోపు ఎత్తున్న కొంగనూరు మరుగుజ్జు ఎద్దు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది ఇక్కడ పొట్టేళ్ల జాడే కనిపించలేదు. రికార్డు ధర దులియా జాతి గేదె రూ.2.10 లక్షలు పలకగా ముర్రాజాతి గేదె రూ.2లక్షలు పలికింది. నార్సింగి సమీపంలో పాల వ్యాపారి బి.భరత్ వాటిని దక్కించుకున్నారు. పూటకు 20లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలు కావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. వీటితో ఓ దున్నపోతు సైతం రూ.2లక్షల ధర పలికింది. దేశవ్యాప్త గుర్తింపు : ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ నార్సింగిలో జరిగే పశుసంక్రాంతికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బందులు పడేకంటే స్థానికంగా కొనుగోలు చేస్తేనే నయమనే ఉద్దేశంతో ఇక్కడ కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేతోపాటు ఎంపీపీ తలారి మల్లేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పత్తి ప్రవీణ్కుమార్, మంచర్ల మమత శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు ఇక్కడకు వచ్చిన వారిలో ఉన్నారు. -
సంక్రాంతికి బసవన్నలు ఆడుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి వేళ గంగిరెద్దులాటకు పోలీసుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు తెలిపారు. రహదారులపై, చౌరస్తాల వద్ద భిక్షాటన చేస్తూ ప్రజలకు ఆటంకం కలిగిస్తున్న వారిని మాత్రమే అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని వారు చెబుతున్నారు. గంగిరెద్దులు ఆడించేవారు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు శ్రీనివాసరావు, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్ శనివారం ప్రకటనలు విడుదల చేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గంగిరెద్దులాట అనేది హిందూ సంస్కృతిలో భాగమని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆటకు పోలీసుల నుంచి ఆటంకం ఉండదని వారు వెల్లడించారు. గంగిరెద్దులాడించే వారికి నగరంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే కంట్రోల్ రూమ్ నం. 100కు తెలపవచ్చని.. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. -
బాక్సర్లకు.. రివార్డుగా దేశీ ఆవులు..!
రోహ్తక్: ప్రపంచయూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో పతకాలతో మెరిసిన భారత మహిళా బాక్సర్లకు హరియాణ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి రివార్డుగా దేశీ ఆవులను ప్రకటించింది. పతకం సాధించిన ఒక్కో బాక్సర్ ఒక్కో దేశీ అవును ప్రభుత్వం తరుపున రివార్డుగా ఇవ్వనున్నట్ల హరియాణ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకాశ్ ధనకర్ తెలిపారు. గురువారం రోహ్తక్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( సాయ్) నిర్వహించిన బాక్సర్ల ఘనస్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐదు స్వర్ణాలు, రెండు కాంస్యలు గెలిచిన మహిళా బాక్సర్ల కష్టానికి గుర్తుగా ప్రతి ఒక్కరికి పాలిచ్చే దేశీ ఆవులను రివార్డుగా ఇస్తామన్నారు. దీంతో వారు మరింత ధృడంగా తయారవుతారని పేర్కొన్నారు. ఐదు స్వర్ణాలు, రెండు కాంస్యలు సాధించిన భారత అమ్మాయిలు ఈ టోర్నీ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఘనత సాధించిన విషయం తెలిసిందే. గత నెల 19 నుంచి 26 మధ్య జరిగిన ఈ టోర్నిలో నీతూ, సాక్షి, జ్యోతి, శశిలు స్వర్ణపతకాలు సాధించగా.. అనుపమా, నేహాలు కాంస్య పతకాలు సాధించారు. -
కౌసెల్ఫీల మోజుతో క్రాష్
సాక్షి, కోల్కతా : సెల్ఫీలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదరకర దేశంగా మారిన భారత్లో ఈ మోజు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రమాదకర సెల్ఫీల చోట 'కౌసెల్ఫీ'లు వచ్చి పడుతున్నాయి. వేలాది కౌసెల్ఫీలు వచ్చి పడుతుండడంతో అందుకు పిలుపునిచ్చిన సంస్థ వెబ్సైటే క్రాష్ అయింది. కౌసెల్ఫీ అంటే మరేమో కాదు, ఆవులతో కలిసి ఫొటో దిగడమే. ఆవులను పరిరక్షించాల్సిన ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం కోసం పశ్చిమ బెంగాల్లోని 'గో సేవా పరివార్' సంస్థ కౌసెల్ఫీల పేరిట ఓ వినూత్న పోటీలకు తెర తీసింది. గోకుల అష్టమి నాడు ప్రారంభమైన ఈ పోటీ డిసెంబర్ 31వ తేదీ వరకు నిర్వహిస్తోంది. పోటీల్లో నెగ్గిన సెల్ఫీలకు ఆకర్షణీయమైన అవార్డులు ఇస్తామని గో సేవా పరివార్ ప్రకటించింది. పోటీలో పాల్గొనేవారు ఆవులతో సెల్ఫీలు దిగి వాటిని 'గో సేవా పరివార్.ఆర్గ్'లో అప్లోడ్ చేయాల్సిందిగా సూచించింది. అందుకోసం ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది. దీంతో వందల్లో, వేలల్లో కౌసెల్ఫీలు వచ్చి పడడంతో సంస్థ వెబ్సైట్ క్రాష్ అయిందని, దాంతో అదనపు సర్వర్తను అరువు తీసుకొని పోటీ నిర్వహిస్తున్నామని గోసేవా పరివార్ సీనియర్ సభ్యుడు అభిషేక్ ప్రతాప్ తెలిపారు. ఇప్పుడు కూడా రోజుకు 50 నుంచి 60 వరకు ఈ సెల్ఫీలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఆవుల పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడంతోపాటు ప్రమాదరకరంగా మారిన సెల్ఫీల మోజును మంచి దారి పట్టించడం కోసం ఈ పోటీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2014, మార్చి నుంచి 2016, సెప్టెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 127 మంది మరణించగా, ఒక్క భారత్లోనే 75 మంది మరణించారు. గో సేవా పరివార్ గత మూడేళ్లుగా బెంగాల్ రాష్ట్రంలో గోరక్షణాలయాలను నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పరివార్లో ఆరువేల మంది సభ్యులు ఉన్నారు. -
వందేళ్ల ఆచారం.. ఇలా చేస్తే..
ఉజ్జయిని : ఉజ్జయిని పట్టణ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు నేలపై పడుకున్నారు. వందల సంఖ్యలో గోవులు వారి మీదుగా వెళ్లాయి. అంతే వారిలో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. అయినా వారు సంతోషంగా నవ్వారు. అందుకు కారణం ఉంది. అలా గోవులతో తొక్కించుకుంటే తమ భవిష్యత్, ఊరి భవిష్యత్ బావుంటుందని నమ్మకం. ఉజ్జయిని పట్టణ పరిసర ప్రాంతాల్లో గత 100 ఏళ్లుగా ఈ ఆచారం అమలువుతోంది. ఏటా దీపావళి పర్వదినం తర్వాత వచ్చే ఏకాదశి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఉజ్జయినికి తరలివెళ్తారు. కార్యక్రమంలో పాల్గొనే గోవులకు రంగులు, దండలు వేసి అలంకరిస్తారు. ఈ తంతును తిలకించేందుకూ పెద్ద ఎత్తున ప్రజలు ఉజ్జయినికి వెళ్తుంటారు. -
గో రక్షకుల దుర్మార్గం
సాక్షి, కోల్కతా : పశ్చిమ బెంగాల్లో గో రక్షకులు రెచ్చిపోయారు. గోవులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన జల్పేగురి జిల్లాలోని ధూప్గురిలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను హఫీజుల్ షేక్(22), అన్వర్ హుస్సేన్(20)లుగా గుర్తించారు. ఇద్దరు యువకులు అర్థరాత్రి గ్రామంలోకి వచ్చి ఏడు గోవులను వ్యాన్లో ఎక్కించుకుని వెళ్లబోయారని గ్రామస్థులు చెప్పినట్లు తెలిపారు. అర్థరాత్రి వ్యాన్ తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు దాన్ని అడ్డుకోగా.. అందులో గోవులు ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. అనంతరం వ్యాన్లో ఉన్న ఇద్దరు యువకులను ఆవులను తరలిస్తున్న దొంగలుగా భావించిన గ్రామస్థులు వారిని రాళ్లతో కొట్టి చంపినట్లు వెల్లడించారు. అయితే, వ్యాన్ డ్రైవర్ మాత్రం గ్రామ ప్రజల చేతికి చిక్కకుండా పారిపోయినట్లు చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. యువకులు దొంగాలా? లేక గోవులను ఏదైనా సంత నుంచి తీసుకెళ్తున్నారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సివుందని చెప్పారు. -
ప్రధాని మోదీపై అభ్యంతరకర వీడియో.. కలకలం
రాంచీ: ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ ముస్లిం యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా అతడికి 14 రోజుల పోలీసు కస్డడీ విధించారు. హజారిబాగ్ ఎస్పీ అనూప్ బిర్తారే కథనం ప్రకారం.. 25 ఏళ్ల యువకుడు మహమ్మద్ ఆరిఫ్ ఝార్ఖండ్లోని హజారిబాగ్లో నివాసం ఉంటున్నాడు. గోవధ నిషేధంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరిఫ్ తన నిరసనను వ్యక్తం చేయాలని భావించి కటకటాల పాలయ్యాడు. స్థానిక కెరెదారి బ్లాక్ లో మెకానిక్గా పనిచేస్తున్న ముస్లిం యువకుడు ఆరిఫ్.. గోవధ నిషేధంపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ప్రధాని మోదీని అవమానించేలా అసభ్య పదజాలంతో దూషించాడు. ఆపై బహిరంగంగానే గోవులను వధిస్తామని, ఏం చేస్తారో చేసుకోండి అంటూ సవాల్ విసిరాడు. దీంతో పాటు మత పరమైన వివాదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన నిందితుడు ఆరిఫ్ ఈ తతంగాన్ని వీడియా తీశాడు. ఆపై వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం అర్ధరాత్రి ఆరిఫ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం మేజిస్టేట్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. నిందితుడికి 14 రోజుల పోలీసు కస్డడీకి తరలించారు. కాగా, కేవలం హజారిబాగ్ లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వీడియోలు షేర్ చేసిన కారణంగా ఈ ఏడాది 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీటి కారణంగానే ఈ నెల 14న, 18న హజారిబాగ్ లో మత కలహాలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇంటికి సమీపంలో గోమాంసం కనిపించిందన్న కారణంగా జూన్ 27న గోరక్షకులు గిరిద్ లో ఓ ముస్లిం వ్యక్తిని చితకబాదారు. పటిష్ట చర్యలు తీసుకున్నా సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న పోస్టుల కారణంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఎస్పీ అనూప్ బిర్తారే వివరించారు. -
ఆవులతో హెచ్ఐవీ వ్యాక్సిన్?
హెచ్ఐవీని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సరికొత్తగా ఆవుతో హెచ్ఐవీ వ్యాక్సిన్ తయారు చేయొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. హెచ్ఐవీ వైరస్ తాలూకూ ప్రొటీన్లను ఆవుల్లోకి ఎక్కించినప్పుడు వాటిల్లో తయారైన యాంటీబాడీలతో హెచ్ఐవీని నిరోధించొచ్చని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఓ ప్రయోగం ద్వారా తెలిసింది. ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్ఐవీ వైరస్ తరచూ తన రూపం మార్చుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. వ్యాధికి తగిన మందు లభించకపోవడానికి కారణమిదే. అయితే ఈ వ్యాధి మిగిలిన జంతువులకు సోకినా.. ఆవులకు మాత్రం సోకదు. దీనికి కారణమేమిటో తెలుసుకునేందుకు స్క్రిప్స్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం చేశారు. హెచ్ఐవీ వైరస్ ఉపరితలాన్ని పోలిన ప్రొటీన్ను ఆవుల్లోకి ఎక్కించారు. ఆ తర్వాత ఏడాది పాటు అప్పుడప్పుడూ ఆవుల రక్తం సేకరించి యాంటీబాడీలను వేరు చేశారు. ఈ యాంటీబాడీలు కణాల్లోకి హెచ్ఐవీ వైరస్ చేరకుండా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ యాంటీబాడీలు అనేక ఇతర వైరస్లను కూడా నిరోధిస్తున్నట్లు తెలిసింది. ఆవుల జీర్ణవ్యవస్థ ప్రత్యేక నిర్మాణం.. నిత్యం అనేక రకాల సూక్ష్మజీవులతో దాని రోగ నిరోధక వ్యవస్థ పోరాడుతూ ఉండటం వంటి కారణాల వల్ల ఈ క్షీరదాలు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు చాలా పొడవుగా ఉంటాయని.. అందువల్లే ఇవి హెచ్ఐవీని అడ్డుకోగలుగుతున్నాయని ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్కు చెందిన శాస్త్రవేత్త డెవిన్ సోక్ చెబుతున్నారు. ఆవులకు ఉన్న ఈ వినూత్న లక్షణం ఆధారంగా భవిష్యత్తులో హెచ్ఐవీకి మాత్రమే కాకుండా.. అనేక ఇతర వైరస్ సంబంధిత వ్యాధులకూ మెరుగైన చికిత్స లభించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం
పోలీసుల దాడిలో గాయపడిన గోసంరక్షక సమితి నిర్వాహకుడికి పరామర్శ తాడేపల్లిగూడెం: పోలీసుల దెబ్బలతో గాయపడి తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న గో సంరక్షణ సమితి నిర్వాహకుడు కొండ్రెడ్డి శ్రీనివాసును ఆదివారం మంత్రి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గో ప్రేమికుడిగా ఉన్న వ్యక్తిని గో మాఫియాతో చేతులు కలిపి, కావాలని ఇరికించి చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తారా అంటూ పోలీసుల తీరును దుయ్యబట్టారు. కర్ణభేరికి దెబ్బతగిలేలా కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పేరును కూడా ప్రస్తావిస్తూ నువ్వేమైనా మోడీవా అంటూ పోలీసులు వ్యంగంగా మాట్లాడిన మాటలు మొబైల్లో విన్నానని, చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు తప్పుడు కేసులు బనాయించాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు. చర్యలకు ఆదేశం గో సంరక్షకులపై అమానుషంగా ప్రవర్తించి, 32 గోవుల మరణానికి కారకులైన దేవరపల్లి, అనంతపల్లి ఎస్సైలపై విచారణ జరపాలని కలెక్టర్, ఎస్పీలను మంత్రి మాణిక్యాలరావు ఆదివారం ఆదేశించారు. ఒడిశా, విశాఖ నుంచి వచ్చిన ఆవులతో కూడిన కంటైనర్లను అడ్డుకుని అనంతపల్లి, దేవరపల్లి పోలీసులకు గోశాల నిర్వాహకులు కొండ్రెడ్డి శ్రీనివాసు అప్పగించారన్నారు. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కంటైనర్లను కాకినాడ తదితర ప్రాంతాలకు తరలించి తిరిగి దేవరపల్లి తీసుకువచ్చారని చెప్పారు. దీంతో 36 గంటలపాటు ఆహారం, నీరు లేక ఆవులు దుర్మరణం పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసు కోరినా గోవులను గోశాలకు పోలీసులు అప్పగించలేదన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై కొవ్వూరు ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యం పోలీసులు కొట్టిన దెబ్బలతో కర్ణభేరి దెబ్బతిన్న గో ప్రేమికుడు రాఘవేంద్రకు ప్రభుత్వపరంగా వైద్య సాయం అందిస్తామని మంత్రి తెలిపారు. గోవులను ప్రభుత్వానికి అప్పగిస్తా గో సంపదను సంరక్షించేందుకు నిస్వార్థంగా పనిచేస్తున్న తాను ఇటీవల జరిగిన ఘటనలతో మానసికంగా కలత చెందానని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య గౌరవ కార్యదర్శి కొండ్రెడ్డి శ్రీనివాసు అన్నారు. ఏడాదిగా వివిధ పోలీసుస్టేషన్ల నుంచి వచ్చిన గోజాతిని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సమక్షంలో అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. చట్టాల ప్రకారం కోర్టుల ద్వారా పోరాడి గోవులను రక్షిస్తున్నానని, ఇదే పని ప్రభుత్వ అధికారులు చేయాలని కోరారు. -
మొలకెత్తిన ఆశలు.. ఆవుతో హెచ్ఐవీ నయం!
హెచ్ఐవీ(హ్యుమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్) సోకితే మరణం తప్పదనే మాటకు కాలం చెల్లబోతోందా?. హిందూవులు పవిత్రంగా పూజించే గోవు జన్యువులతో మనుషులకు సోకే హెచ్ఐవీని నయం చేయోచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవును. హెచ్ఐవీ వైరస్కు గోవు శరీరంలో అత్యతం వేగంగా ప్రతిరక్షకాలు తయారవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ప్రపంచాన్ని వేధిస్తున్న హెచ్ఐవీ చికిత్సలో కొత్త ఆశాలు రేగుతున్నాయి. హెచ్ఐవీపై పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు.. నాలుగు ఆవు దూడలకు హెచ్ఐవీ ఇమ్యునోజన్స్ను ఇంజక్షన్ ద్వారా ఎక్కించారు. అనంతరం ఆ దూడల రక్తంలో హెచ్ఐవీ ప్రభావాన్ని నిరోధించే ప్రతిరక్షకం వెంటనే అభివృద్ధి కావడం వారిని విస్మయపరిచింది. వాటిలో ‘ఎన్సీ-సీఓడబ్ల్యూ 1’ అనే ప్రతిరక్షకం హెచ్ఐవీని ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. దీంతో ఆవులోని రోగ నిరోధక శక్తి ఇలాంటి ప్రతిరక్షకాలను వెంటనే ఎలా తయారు చేయగలుగుతుందో అర్థం చేసుకోవాలని వ్యుహం రచించారు. ప్రతిరక్షకాల ప్రక్రియను కనుగొంటే హెచ్ఐవీ సోకకుండా టీకాను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ది ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (ఐఏవీఐ), టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఈ పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
నిర్లక్ష్యం... ‘ఆవు’లిస్తోంది...
నెరవేరని దాతల ఆశయం మూగజీవాల పేరిట మోసం నాడు కామధేను ట్రస్టు నేడు ఎస్పీసీఏ వంతు హైకోర్టు జోక్యం చేసుకున్నా మారని స్థితి బక్కిచిక్కి చచ్చిపోతున్న పశువులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : స్పందించే గుణం ఉంది. ఆదుకునే దాతలు ఉన్నారు. కానీ, నడిపే నిర్వాహకులకే చిత్తశుద్ధి కొరవడుతోంది. మూగజీవుల పేరిట మోసం చేస్తున్నారు. పోషణ చూడక పశువులు ఆకలి మంటలతో అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నాయి. మరికొన్నిచోట్ల పశువులే మాయమైపోతున్నాయి. మొన్న గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారున గల సురభి కామధేను ట్రస్టు...నేడు కాకినాడ జంతు హింస నివారణ సంఘం...పశువుల పాలిట భక్షక కేంద్రాలయ్యాయి. . నాలుగు రోజుల్లో 40 పశువుల మృతి...అదే ఎస్పీసీఏ ఘనత పిఠాపురం మహారాజా మూగజీవాలను సంరక్షణ కోసం 1906లో స్థానిక నాగమల్లితోట సమీపంలో పది ఎకరాలు భూమిని కేటాయించారు. ‘సొసైటీ ఫర్ ద ప్రివెంటివ్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ ( ఎస్.పి.సి.ఎ.) సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ కమిటీకి చైర్మన్గా ఆయన వ్యవహరించేవారు. రోడ్లుపై తిరుగుతున్న మూగజీవాలను, అక్రమ రవాణా చేస్తున్న పశువులను చేరదీసి అలనాపాలనా చూసేవారు. అప్పట్లో సక్రమంగా నడిచిన ఈ సంస్థ... కమిటీ సభ్యులు నిర్వాకం కారణంగా క్రమేపీ ఆధ్వానంగా తయారయింది. కనీసం మూగజీవాలకు కడుపునిండా తిండిపెట్టి, వాటి సంరక్షణకు షెడ్లు కూడా వేయించలేని స్థితికి చేరుకుంది. అప్పట్లో సంస్థకు ఆదాయం లేకపోవడంతో 1944లో సెంట్రల్ డిఫెన్స్కు నాలుగు ఎకరాలు భూమిని అమ్మేశారు. 1975లో సంస్థ నిర్వహణ కోసం మరో 3.21 ఎకరాలను డీసీఎంఎస్కు విక్రయించారు. దాత విరాళంగా ఇచ్చిన పదెకరాలకు ప్రస్తుతం కేవలం 2.6 ఎకరాలు మాత్రమే జంతుహింస నివారణ సంఘానికి మిగిలింది. . వర్గపోరుతో సంఘానికి అవస్థలు కమిటీ సభ్యులు చీలిపోయి రెండు వర్గాలుగా కావడంతో మూగజీవాలను పట్టించుకొనేనాధుడే కరువయ్యాడు. దీంతో ఆరేళ్ల క్రితం జంతు హింస నివారణ సంఘాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి ఆర్డీఓ సమక్షంలో నిర్వహణ బాధ్యతను పశు సంవర్థక శాఖ అధికారులు చూసుకునేవారు. కానీ ఆ తర్వాత సంస్థ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించడం, జిల్లా అధికారులు సరైన ఆధారాలు కోర్టుకి సమర్పించకపోవడంతో జంతు హింస నివారణ సంస్థ బాధ్యతలు మళ్లీ కమిటీ చేతికందాయి. ఆ తర్వాత కమిటీలో కూడా విభేదాలు రావడం...తామంటే తామంటూ పంతాలకు పోయి రెండు వర్గాల్లో ఏ వర్గం కూడా పశువుల ఆలనపాలన పట్టించుకోవడం మానేశాయి. వాస్తవానికైతే ఆ సంస్థకు సంబంధించి పలు షాపులు ఉన్నాయి. వీటి ద్వారా అద్దెలొస్తున్నాయి. రికార్డుల్లో ఎంత చూపుతున్నారో తెలియదు గాని ఒక్కో షాపు నుంచి రూ.5 వేల వరకూ ఆదాయం వస్తుందన్న వాదనలున్నాయి. అందులో నిజమెంతో నిర్వాహకులే చెప్పాలి. . దాతల సాయం ఉన్నా... క్రమేపీ ఇక్కడ పశువులు సంఖ్య పెరగడం సంఘానికి నిధులు లేకపోవడంతో పశువులకు గడ్డికూడా వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో వీటి ఆలనాపాలనా కూడా చూడడానికి మనుషులు నియమించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో దాతలు సహకారంతోనే వీటికి గడ్డి అందజేసేవారు. ఎండాకాలంలో ఎండకు ఎండుతూ, వర్షాకాలం వానకు తడుస్తూ నరకయాతన పడుతున్నాయి. దీన్ని గుర్తించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మూగజీవాల కోసం షెడ్లును ఏర్పాటు చేశారు. కానీ షెడ్లును ప్రతిరోజూ పరిసరాలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లి ఆధ్వానంగా తయారైంది. జైన్ సంస్థ సభ్యులు నాగార్జున ఎరువుల కర్మాగారంలో పచ్చగడ్డిని వేలంలో పాడి అందిస్తున్నారు. మరో దాత వారానికి రెండుసార్లు రెండు బస్తాల తౌడు సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ పశువులకు మేత అందలేదు. దీంతో గత నాలుగు రోజులుగా సుమారు 40 వరకూ పశువులు చనిపోయాయి. మాయమైన సురభి కామధేను ట్రస్టు... గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారున మూగజీవాల పోషణకు ఏర్పాటు సురభి కామధేను ట్రస్టు ఏకంగా మాయమయింది. మల్లేపల్లిలో జాతీయ రహదారి పక్కన కూళ్ళ కృష్ణ అనే వ్యక్తి స్థలం, షెడ్లను అద్దెకు తీసుకుని సురభి కామధేను ట్రస్టు అక్టోబరు 5న రిజిస్టర్ చేయించారు. సోమాని సురేష్కుమార్ చైర్మన్గాను, గార్లంక రాంబాబు, దాసరి ప్రసాద్లు వైస్ చైర్మన్లు, కార్యదర్శిగా సుమన్చంద్ర విడితి, కోశాధికారిగా బావిశెట్టి ఉదయ్పుష్కరం పేర్లను ట్రస్టుకు కార్యవర్గంగా పేర్కొన్నారు. అక్టోబరు నుంచి ట్రస్టు వద్ద ఆవులు, గేదెలు, ఎద్దులను ఉంచి వాటి ఆలనా పాలన చూశారు. ఈ క్రమంలో అక్రమంగా రవాణా చేస్తున్న పశువుల్ని పోలీసులు ట్రస్టుకు అప్పగించేవారు. ఏలూరు, తణుకు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి పశువులు సంఖ్య సుమారు వంద వరకు ఉండేవి. ట్రస్టు ఆశయం ప్రకారం పోషణ చేపట్టాల్సి ఉండగా ఆహారం, నీరు లేకుండా పస్తులుండే పరిస్థితులు దాపురించడంతో నిర్వాహకుల తీరును స్థానికంగా ఉన్న రైతులు తీవ్రంగా ఆక్షేపించారు. మేత, సౌకర్యం లేక పశువులు చనిపోయే పరిస్థితికి చేరుకోవడంతో మల్లేపల్లికి పురోహితులు చింతా అరుణ్కుమార్ శర్మ తదితరులు పశువులకు గ్రాసాన్ని అందించారు. ట్రస్టుకు తీసుకు వచ్చే పశువులను కబేళాకు తరలించేందుకే దీని నిర్వాహణ జరుగుతుందని అప్పట్లో చుట్టు పక్కల ప్రాంతాల ఆరోపణలు చేశారు. సురభి కామధేను ట్రస్టు నిర్వాహకులు దీని వెనుక పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపలు వినిపించాయి. ముఖ్యంగా ఆవులు, గేదెలను వేలాది రూపాయలు ధరలు పలకడంతో వాటిని దొడ్డిదారిన విక్రయించి సొమ్ములు చేసుకున్నారన్న వాదనలు వచ్చాయి. లక్షలాది రూపాయలు ఈ వ్యవహరంలో చేతులు మారగా పోలీసుల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు గుసగుసలు గుప్పుమన్నాయి. అక్టోబరు నుంచి పశువుల పోషణ ప్రారంభించిన ట్రస్టు నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా మార్చిలో తొలగించారు. దీనిపై టి.చంద్రశేఖర్ అనే వ్యక్తి హైకోర్టులో సురభి కామధేను ట్రస్టుపై ప్రజావ్యాజ్యం వేశారు. దీంతో పోలీసులు మాత్రం పశువులను యజమానులకు అప్పగించారని కోర్టుకు నివేదించగా కలెక్టరు మాత్రం ట్రస్టు నిర్వహిస్తున్న వ్యక్తులు గాని, పశువులుగాని లేవని నివేదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ట్రస్టుకు అప్పగించిన పశువులు ఎక్కడకు పోయాయి, దీనిపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను విచారణకు ఆదేశించింది. ఏదేమైనప్పటికీ మూగ జీవాల మృత్యు ఘంటికలు మాత్రం ఆగడం లేదు. -
అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత
పెద్దపల్లి: పెద్దపల్లి నుంచి గజ్వేల్కు అక్రమంగా తరలిస్తున్న 19 ఆవులను గోమాత రక్షక్ సేన సభ్యులు పట్టుకున్నారు. డీసీఎం వ్యానులో మొత్తం 19 ఆవులు ఉండగా రెండు ఆవులు మృతిచెందాయి. మరో మూడు ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. వీటిని వదశాలకు తరలిస్తున్నట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని గోమాత రక్షక్ సేన సభ్యులు పోలీసులకు చేరవేశారు. -
గోరఖ్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న యోగీ
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శనివారం ఉదయం గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న గోశాలను సందర్శించారు. గోవులకు ముఖ్యమంత్రి దాణా తినిపించారు. ఈ గోశాలలో సుమారు 500 ఆవులు ఉన్నాయి. ఈ సందర్భంగా గోశాల సంరక్షకుడు శివ్ పార్సెన్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి గోశాలను సందర్శించారని, బెల్లం, బిస్కెట్లు, పండ్లు, దాణాను గోవులకు తినిపించినట్లు తెలిపారు. అలాగే పలు గోవులకు ఆయన పేర్లు పెట్టారు. గతంలోనూ సీఎం యోగీ గోశాలను దర్శించిన విషయం తెలిసిందే. -
గో రక్షణకు హర్యానా సీఎం ముందడుగు
చండీగఢ్: బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యాక దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. యూపీ సీఎం యోగి కబేళాలు మూయించడం, గోవధను నిషేధించడంతో మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఆవులను రక్షించకుండా బయట వదిలేస్తే ఆ మూగజీవుల యజమానులు జరిమానా కట్టాల్సి ఉంటుందని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. పాల ఉత్పత్తిని ఇవ్వని ఆవుల విషయంలోనూ తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. సోమవారం అన్ని జిల్లాల ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ఖట్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆవులను గోశాలలు, పాకలలో కట్టివేయకుండా వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా నడుచుకునే వాటి యజమానులు ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆవులను గోశాలలో ఉంచి వాటి ద్వారా ఎన్నో ఉత్పత్తి చేయవచ్చునని, ఉత్పత్పి ఆగిపోయినా తదితర మార్గాలు ఆన్వేషించాలని అధికారులకు సూచించారు. సహకార సంఘాల సహకారంతో గో ఉత్పత్తులు విక్రయించాలని చెప్పారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఆవుల రక్షణకు పటిష్ట రక్షణకు చర్యలు చేపట్టాలని హర్యానా సీఎం ఆదేశించారు. -
గో రక్షణ పేరుతో...గోల్మాల్...
- మల్లేపల్లిలో మూన్నాళ్ల ముచ్చటగా సురభి కామధేను ట్రస్టు - మూగజీవాల పేరిట వ్యాపారం - హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యంతో చర్చనీయాంశం - అధికారులకు తలనొప్పిగా మారనున్న విచారణ, నివేదిక జగ్గంపేట : గోవుల రక్షణ పేరుతో గోల్మాల్...ట్రస్టు ముసుగులో సాగుతున్న బాగోతం ప్రజావ్యాజ్యంతో బట్ట బయలైంది. హైకోర్టు జోక్యంతో ఇటు రెవెన్యూ...పోలీసు యంత్రాంగంలో కదలిక ఏర్పడడంతో లోగుట్టులో డొంకంతా కదులుతోంది. గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారున మూగజీవాల పోషణంటూ ఏర్పాటు చేసిన సురభి కామధేను ట్రస్టులో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మల్లేపల్లిలో జాతీయ రహదారి పక్కన కూళ్ళ కృష్ణ అనే వ్యక్తి స్థలం, షెడ్లను అద్దెకు తీసుకుని సురభి కామధేను ట్రస్టును గత ఏడాది అక్టోబరు 5న రిజిస్టర్ చేయించారు. సోమాని సురేష్కుమార్ చైర్మన్గా, గార్లంక రాంబాబు, దాసరి ప్రసాద్లు వైస్ చైర్మన్లుగా, కార్యదర్శిగా సుమన్చంద్ర విడితి, కోశాధికారిగా బావిశెట్టి ఉదయ్ పుష్కరం పేర్లను ట్రస్టుకు కార్యవర్గంగా పేర్కొన్నారు. అక్టోబరు నుంచి ట్రస్టు వద్ద ఆవులు, గేదెలు, ఎద్దులను రప్పించుకొని వాటి ఆలనా, పాలనా చూస్తున్నట్టు నటించారు. అది నిజమేననుకొని అక్రమంగా రవాణా చేస్తున్న పశువుల్ని కూడా పోలీసులు ఈ ట్రస్టుకు అప్పగించేవారు. ఈ విధంగా ఏలూరు, తణుకు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పశువుల సంఖ్య సుమారు వంద వరకూ ఉండేవి. వీటికి ఆహారం, నీరు అందజేయకపోవడంతో రోజు,రోజుకూ బక్కచిక్కిపోవడంతో స్థానికుల్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. దీనస్థితి నుంచి చనిపోయే దుస్థితికి చేరుకోవడంతో మల్లేపల్లికి పురోహితులు, చింతా అరుణ్ కుమార్ శర్మ, తదితరులు పశువులకు స్వచ్ఛందంగా గ్రాసాన్ని అందించారు. బయటపడిందిలా... అయితే ట్రస్టుకు తీసుకువచ్చే పశువులను కబేళాకు తరలిస్తున్నారన్న విమర్శలు రావడంతో టి.చంద్రశేఖర్ అనే వ్యక్తి ప్రజావ్యాజ్యం పిటీషన్ను హైకోర్టులో దాఖలు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. పశువులను సంబంధిత యజమానులకు అప్పగించారని పోలీసులు కోర్టుకు నివేదించగా అప్పటి జిల్లా కలెక్టరు అరుణ్ కుమార్ మాత్రం ఆ ట్రస్టు ఆవరణలో పశువులు లేవని, నిర్వాహకులు కూడా లేరని నివేదిక ఇచ్చారు. ఈ రెండు నివేదికలు భిన్నంగా ఉండడంతో మళ్లీ దర్యాప్తునకు కోర్టు ఇటీవల ఆదేశించడంతో కదలిక ప్రారంభమయింది. రైతులు ఇచ్చిన పశువులు కూడా... పాల దిగుబడి తగ్గిన తరువాత పశు యజమానులు, రైతులు పశు పోషణ చేయలేక గో రక్షణ కమిటీలకు, ఆశ్రమాలకు అందజేస్తారు. ఇలా అందజేసిన పశువులు కూడా ట్రస్టు నిర్వాహకులు మాయం చేశారు. సేవ ముసుగులో ఆవులు, గేదెలను వేలాది రూపాయలకు కబేళాలకు, ఇతరులకు విక్రయించేశారని ఆరోపణలున్నాయి. వ్యాన్లపై అక్రమంగా తరలించేవాళ్లను కూడా బెదిరించి లక్షలాది రూపాయలు వసూళ్లు చేసిన ఘటనలు కూడా ఉన్నాయని పరిసర ప్రాంత గ్రామస్తులు చెబుతున్నారు. రక్షణ కోసమేనని ...మంచి పని చేస్తున్నారని మేం కూడా సహకరించామని, ఇలా చేస్తారని అనుకోలేదని వాపోయారు. ఈ వ్యవహరంలో పోలీసుల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ట్రస్టుకు అప్పగించిన పశువులు ఎక్కడకు పోయాయి, ట్రస్టు వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను విచారణకు ఆదేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై స్పందించేందుకు ట్రస్టు నిర్వాహకులు అందుబాటులో లేరు. -
ఆవులకూ ‘ఆధార్’ తరహా కార్డులు!
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఆవులకు, వాటి సంతతికి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు (యూఐడీ) సంఖ్య కేటాయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దు గుండా పశువుల స్మగ్లింగ్ నిరోధం కోసం వాటికి యూఐడీ కేటాయించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాలపై ఏర్పాటైన ఈ కమిటీ.. ట్యాంపర్ చేయడానికి వీలుకాని పాలీయురేథేన్ (ప్లాస్టిక్) ట్యాగులను పశువులకు జోడించాలని సిఫార్సు చేసింది. ‘దీన్ని అన్ని ఆవులకు, వాటి సంతతికి తప్పనిసరి చేయొచ్చు. పశువు వయసు, జాతి, ఎత్తు, రంగు, కొమ్ముల రకం, ఇతర ప్రత్యేక వివరాలు యూఐడీలో ఉండాలి. రాష్ట్రవ్యాప్త సమాచారాన్ని సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేసి జాతీయ డేటాబేస్కు అనుసంధానించవచ్చు. పోలీసులు, రోడ్డు రవాణా, పశుసంవర్ధక శాఖల అధికారులు పశువుల స్మగ్లింగ్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రాలు దశలవారీగా సమీక్షలు జరపాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, ఈ అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కనుక కోర్టు ఆదేశాలు జారీ చేయాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్.. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ చంద్రచూడ్ల బెంచ్కు నివేదించారు. -
ముచ్చుమర్రి మురళీధరుడు!
గోధూళి వేళ.. నెమరేస్తూ ఊరు ముఖం పట్టిన ఆలమందలు.. అన్నింటికన్నా ముందు ఆరడుగులపైగా ఎత్తుతో వంపులు తిరిగిన విగ్రహం.. ముడతలు తేలిన చర్మం, తీక్షణమైన చూపులతో ఠీవిగా ఒక్కో అడుగు వేస్తూ నడిచే ఒంగోలు గిత్త భారతీయ పల్లెకు కొత్త వెలుగు. రాజసానికి, దర్పానికి నిలువెత్తు ప్రతీక. తరతరాల భారతీయ పశుసంపద పౌరుషానికి ప్రఖ్యాతి కూడా. కానీ వాటి ఘనతంతా గతం. యాంత్రీకరణతో రైతుల నిర్లక్ష్యం కొంత ప్రభుత్వం నిర్లిప్తత మరికొంత... వెరసి ఒంగోలు జాతి పశుసంపద గ్రహణం పట్టిన చంద్రుడులా అంతర్థానమయ్యే పరిస్థితి. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొడిగడుతున్న ఒంగోలు జాతి పశువు అనే దీపానికి ప్రేమ అనే చమురును ఇంధనంగా మార్చి కాచుకుంటున్న కారుణ్యమూర్తి ఆ రైతు. రేపల్లెలో గో సంతతిని కాచుకున్న గోపాల కృష్ణుడుకు మల్లే ఒంగోలు జాతి పశుసంపద పరిరక్షణకు అహరహం పాటుపడుతున్నాడీ మురళీధరుడు. జాతీయ స్థాయి ఒంగోలు కేటిల్ బ్రీడ్ సేవియర్ అవార్డు –2016కు మురళీధరరెడ్డిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం విశేషం. మే 21న హర్యానాలోని కర్నల్లో ఆయన ఈ అరుదైన పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా ‘సాగుబడి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం.. దశాబ్దాల ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒంగోలు జాతి పశువుల పిండాలు, వీర్యం కోసం బ్రెజిల్ను అడుక్కునే దుస్థితికి చేర్చితే.. ఆ జాతి పశువులపై ఉన్న మమకారం ఓ సాధారణ రైతును కదిలించింది. ఆయన చేతి స్పర్శ ఒంగోలు జాతి పాలిట సంజీవనిగా మారి అంతర్జాతీయంగా ఆ గ్రామానికి కొత్త గుర్తింపును తెచ్చింది. 500లకు పైగా ఒంగోలు కోడెలను సాకిన ఆ దొడ్డ మనసు పెద్దాయన పేరు కాటం మురళీధర్రెడ్డి. కర్నూలు జిల్లా పగిడాల మండలం కొత్త ముచ్చుమర్రి ఆయన స్వగ్రామం. 1975 ప్రాంతంలో ట్రాక్టర్ల రాకతో అరకలకు కాలం చెల్లింది. మరోవైపు కూలీల రేట్లు పెరిగాయి. బీడు భూములు సాగు భూములుగా మారి పచ్చి మేత లభ్యత తగ్గింది. దీంతో గ్రామంలోని రైతులు క్రమంగా ఆవులను అమ్ముకోవటం ప్రారంభమైంది. కాటం మురళీధర్ రెడ్డికి చిన్నతనం నుంచి ఒంగోలు జాతి కోడెలంటే అమితమైన ఇష్టం. ఒంగోలు జాతి పశువులను పోగొట్టుకోవటానికి మనసొప్పలేదు. అన్నదమ్ముల వాటాలతో కలిపి వందకు పైగా ఎకరాల్లో సేద్యం చేస్తూనే మరో చేత ఒంగోలు గిత్తల పోషణ చేస్తూ పశువుల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు ఆయన జీవితం వాటికే అంకితం అయింది. ఆ ఇల్లు రేపల్లె.. ఐదేళ్ల క్రితం వరకు మురళీధర్రెడ్డి కల్లం దొడ్లు, ఇల్లు ఒంగోలు జాతి పశుసంపదతో నిండి కంటికి విందు చేసేవి.Sకానీ వరిగడ్డి ధరలు పెరిగి పోషణ కష్టమవటంతో యాబైకి పైగా ఉన్న ఒంగోలు జాతి పశువులను అమ్మేశారు. ప్రస్తుతం మురళీధర్ రెడ్డి వద్ద ఆరు ఒంగోలు జాతి గిత్తలు, 10 ఆవులు, రెండు ఆంబోతులున్నాయి. వీటిలో కొన్నింటిని పేరుతో పిలిస్తే చాలు ఎక్కడున్నా పరుగుతో ఆయన చెంతకు చేరతాయి. ఆయన చేయి పడగానే పొగరు బోతు గిత్తలు సైతం కుక్కపిల్లలా ముడుచుకుంటాయి. వారి కుటుంబంలోని సభ్యుల్లా మారిపోయాయి. కొన్నాళ్ల క్రితం వరకు కంటికి కనిపించేలా ఇంటివాకిట్లోనే వాటిని కట్టేసేవారు. ఊరు విడిచి వెళ్లినా ఆయన మనసు మాత్రం వీటిని వదలి వెళ్లదు. ఇంటికి తిరిగొచ్చి వాటి మేను తాకి పలకరించి పులకరించేదాక మనసు ఉగ్గబట్టదు. వాటి ఆలనా పాలనా గురించి ఎప్పటికప్పుడు ఫోన్లో సూచనలిచ్చి జీతగాళ్లను పురమాయిస్తాడు. ఒంగోలు జాతి పశువుల పెంపకం కోసం మురళీధర్రెడ్డి ప్రత్యేకంగా ముగ్గురు జీతగాళ్లను నియమించారు. ఆరెకరాల్లో సాగు చేసిన జొన్నపైరును పచ్చిమేతగా ఇస్తారు. వరిగడ్డి, జొన్న చొప్ప, వేరుశనగ కట్టెను ఎండుమేతగా ఇస్తారు. ఒక్కో ఒంగోలు గిత్త పోషణకు ఏడాదికి రూ. 50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న దాణా ఇస్తారు. ఉదయం సాయంత్రం ఐదు కిలోల చొప్పున ఉలవల దాణా పెడతారు. వేసవిలో మాత్రం ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రత్యేకంగా రాగులతో తయారు చేసిన దాణా పెడుతున్నారు. ఉలువలు, బెల్లంతో చేసిన పూర్ణాలు తినిపిస్తారు. మధ్యాహ్నం కిలోన్నర రాగులు/ బార్లీ గింజలతో చేసిన జావను ఇస్తారు. ప్రతి కోడెకు ఫ్యాన్లు, అవసరమైతే కూలర్లు ఏర్పాటు చేసి గాలి తగిలే ఏర్పాటు చేశారు. ఒంగోలు జాతి పశువులకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పెద్దగా వ్యాధులు సోకవు. సీజనల్గా వచ్చే వ్యాధులు సోకకుండా టీకాలు వేయిస్తారు. ప్రతి నెలా పశువైద్యుడి చేత వైద్య పరీక్షలు చేయిస్తారు. నొప్పులు, చర్మవ్యాధుల నివారణకు స్థానికంగా లభించే ఆకు పసర్లు వాడుతున్నారు. పొదుగు వాపు వ్యాధి నివారణకుSఅల్లోపతి మందులు వాడుతున్నారు. ఒంగోలు ఆవులను మేలుజాతి ఒంగోలు ఆంబోతులతో దాటించడం ద్వారా సంతానాన్ని వృద్ది చేస్తున్నారు. ఒక్కో గిత్త ఖరీదు రూ. 10–25 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి ఒంగోలు గిత్తలను కొనేందుకు ముచ్చుమర్రికి వస్తుంటారు. బ్రెజిల్ దేశస్ధులు కూడా మురళీధర్రెడ్డి వద్ద గిత్తలను కొనుగోలు చేశారు. అలా ఆయన అమ్మిన 500కు పైగా గిత్తలు, ఆవులు రెండు తెలుగు రాష్ట్రాల్లోను నలుచెరగులా ఉన్నాయి. ఆరేళ్ల వయసున్న గిత్తలు రూ. 10 నుంచి 25 లక్షల ధరకు విక్రయిస్తున్నారు. ఏడాదిన్నర వయసున్న కోడె దూడ కనీసం రూ. 2 లక్షల వరకు ధర పలుకుతోంది. కాటం మురళీధర్రెడ్డి అభివృద్ధి చేసిన ఒంగోలు జాతి కోడెలు రాష్ట్రంలోనే గాక జాతీయ స్థాయి పశువుల పోటీల్లోనూ సత్తా చాటాయి. అవార్డులు, ప్రశంసాపత్రాలు, నగదు బహుమతుల పంట పండించాయి. ఇప్పటివరకు 100 అవార్డులు, నగదు బహుమతులు లభించాయి. 1994లో ఢిల్లీలో జరిగిన పశువుల పోటీలకు గౌతమి ఎక్స్ప్రెస్లో ఒక ప్రత్యేక బోగిని ఏర్పాటు చేసి మూడు గిత్తలు రెండు ఆవులను తీసుకెళ్లగా మొదటి స్థానంలో నిలిచాయి. గుంటూరు, తిరుపతిలో జరిగిన అందాల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి. ఎటైనా పోటీలకు తీసుకెళ్లాలంటే లారీలో గడ్డిపరిచి, కర్రలతో అడ్డుకట్టలు కట్టి జాగ్రత్తగా తీసుకెళతారు. పశువుల రవాణాలో అనుభవం ఉన్న డ్రైవర్లు లారీ నడుపుతారు. జీతగాళ్లు వాటి వెంట ఉండి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటారు. 1994, 1996లో గుంటూరులో.. ఆల్ ఇండియా క్యాటిల్ షో(1998)లో మొదటి స్థానం గెలుచుకున్నాయి. ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకే జీవితం అంకితం చేసిన అవిశ్రాంత కృషీవలుడు మురళీధర్రెడ్డి. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు ఫొటోలు : పక్కీరయ్య, పగిడాల ప్రభుత్వాలు మేల్కొనకపోతే ఒంగోలు జాతి మనుగడ కష్టం ప్రస్తుతం కృత్రిమ గర్భోత్పత్తి వల్ల కోడెదూడల్లో నాణ్యత తగ్గిపోతోంది. మేలు జాతి కోడెదూడల కోసం నాణ్యమైన జాతుల పశువుల వీర్యాన్ని సేకరించి స్పెర్మ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచాలి. ఒంగోలు బ్రీడ్ అంతరించి పోకూడదనే వీటిని అభివృద్ధి చేస్తున్నాను. వీటి పోషణ సులభం కాదు. వ్యవసాయంలో సంపాదించిన దంతా ఖర్చు పెడుతున్నా. ఒంగోలు జాతి పశువుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా వందల్లోకి పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నేళ్లలోనే ఒంగోలు జాతి పూర్తిగా కనుమరుగవుతుంది. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఒంగోలు గిత్తల ధర లక్షల్లో పలుకుతున్నాయి. చిన్న రైతులకు వీటి పెంపకం కష్టమే. ఆసక్తి ఉన్న వాళ్లకు పోషణలో మెళకువలు నేర్పుతాను. – కాటం మురళీధర్ రెడ్డి (94402 91877), ఒంగోలు జాతి పశు పోషకులు, కొత్త ముచ్చుమర్రి, పగిడాల మండలం, కర్నూల్ జిల్లా -
పశువులకు ప్రాణాంతకం.. కుందేటి వెర్రి
జంగారెడ్డిగూడెం: పశువుల్లో వచ్చే వ్యాధుల్లో కుందేటి వెర్రి వ్యాధి ఒకటి. ఈ వ్యాధిని ‘సర్రా’ లేక ‘ట్రిపనోసోమియాసిస్’ అంటారు. ఈ వ్యాధి ఒంటెలు , గుర్రాలు, ఆవులు, గేదెలు, గొర్రెల్లో వస్తుంది. రక్తంలో ఉండే ‘ట్రిపనోసోమా’ అనే పరాన్నజీవి ఈ వ్యాధికి కారణం. టబానస్, స్టోమాక్సిస్ అనే జోరీగ కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. అన్ని వయసు గల పశువులకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి సోకిన గుర్రాలు, ఒంటెలు నూరు శాతం మరిణిస్తాయని, ఆవుల్లో ఈ వ్యాధి వల్ల గర్భస్రావం జరగడం, పాల దిగుబడి తగ్గడం జరుగుతుందని జంగారెడ్డిగూడెం పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స ఆయన మాటల్లోనే.. లక్షణాలు: వ్యాధి సోకిన పశువుల్లో 103 నుంచి 106 డిగ్రీల ఫారన్ హీట్ జ్వరం వస్తుంది. బరువు తగ్గిపోతాయి. నీరసంగా ఉంటాయి. వెర్రి చూపులు చూస్తాయి. కళ్లు, ముక్కు ఎర్రబడి వాటి నుంచి నీరు కారుతుంది. కాళ్లు, పొట్ట కింద భాగం, గొంతుపైన నీరు చేరి వాపు ఏర్పడుతుంది. కంటి చూపు మందగిస్తుంది. కొన్ని పశువులు పూర్తిగా కంటి చూపును కోల్పోతాయి. రక్తహీనత ఏర్పడుతుంది. పళ్లు కొరుకుతూ గుండ్రంగా తిరుగుతాయి. ఫిట్స్ వస్తాయి. అకస్మాత్తుగా పాల దిగుబడి తగ్గిపోతుంది. చూడి ఆవులు ఈసుకుపోతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోయి చివరగా మరణిస్తాయి. వ్యాధి నిర్ధారణ..వ్యాధి సోకిన పశువుల నుంచి రక్తాన్ని సేకరించి గాజు పలకపైన పూతగా పూసి సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించినప్పుడు వ్యాధికారక పరాన్నజీవులు కనిపిస్తాయి. దీని ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. చికిత్స..వ్యాధి సోకిన ఆవులు, గేదెలకు డిమనిజన్ ఆసిట్యూరెట్ ఇంజక్షన్ను 100 కిలోగ్రాముల శరీర బరువుకు 350 మి.గ్రా చొప్పున కండరాలలోనికి ఇప్పించాలి. ఈ ఇంజక్షన్ ఇవ్వడానికి ముందు గ్లూకోజ్ ఇవ్వాలి. నివారణ..వ్యాధి సోకిన పశువులను మిగలిన వాటి నుంచి వేరు చేయాలి. బాహ్య పరాన్నజీవుల నివారణ కోసం బూటక్స్ వంటి మందులు పశువుల చర్మంపై పిచికారీ చేయాలి. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి. పశువుల కొట్టాలలో క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాలి. పశువులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలి. -
ఇంతకు ఈ గోరక్షకులు ఎవరు?
న్యూఢిల్లీ: కేంద్రంలో, ఇటీవల పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిలో గోరక్షకుల ఆగడాలు పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న రాజస్థాన్లో గోరక్షకులు జరిపిన దాడిలో ఓ ముస్లిం వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఇంతకు ఈ గోరక్షకులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వారికి చట్టపరమైన హక్కులుగానీ చారిత్రక నేపథ్యంగానీ ఏమైనా ఉందా? వెయ్యేళ్లకుపైగా చరిత్ర భారత దేశంలో నాటి గో రక్షకులకు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. నేటి గోరక్షకులకు చరిత్ర లేదు. పశు సంపదన రక్షించడం కోసం ప్రాణ త్యాగాలు చేసి నాటి గో రక్షకులు చరిత్రలో నిలిచిపోగా, నేటి గో రక్షకులు ప్రాణాలు తీస్తూ చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారు. నాడు గోరక్షకులను దేవులీలు, పల్లవులు అని ప్రాంతాన్నిబట్టి పిలిచేవారు. మధ్యయుగాల నాడు పశు సంపదే దేశ బలమైన ఆర్థిక వ్యవస్థ. పశ్చిమ, ఉత్తమ భారత దేశంలో అధిక పశు సంపద కలిగిన వారిని ధన్గర్, మాల్ధారి అని కూడా పిలిచేవారు. వ్యవసాయ పనుల కోసం ఉపయోగ పడడమేకాకుండా అపార పాడినివ్యడంతోపాటు ఊలు, చర్మంతోపాటు మాంసాన్నిచ్చే పశు సంపదే నాడు బలమైన ఆర్థిక శక్తి. పశు సంపద కోసం యుద్ధాలు జరిగేవి పశు సంపదను సొంతం చేసుకోవడానికి చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. రాజస్థాన్లో వీటి కోసమే 17,18 శతాబ్దంలో కూడా యుద్ధాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. పశువులను ఎత్తుకుపోయి అంగట్లో అమ్మేందుకు దొంగతనాలు జరిగేవి. కొంత మంది దొంగలు తమంతట తామే దొంగతనాలకు పాల్పడితో మరికొంత మంది ఇతరులిచ్చే డబ్బాశకు దొంగతనాలు చేసేవారు. అమ్మాల్సిన పశువులను సంతకు తీసుకెళ్లేందుకు, వాటిని కొనుక్కున్న రైతుల ఇంటికి వాటిని తీసుకెళ్లేందుకు బంజారీలు మధ్యవర్తులుగా పనిచేసే వారు. రాజ్పుత్లు, జాట్లు పశుపోషకులు వెయ్యేళ్ల క్రితం దేశంలో పశువుల పెంపకం, వాటి పోషణ బాగా లాభసాటి వ్యాపారం అవడంతో రాజ్పుత్లు, జాట్ కులస్థులు పెద్ద సంఖ్యలో పశువులను పెంచేవారు. వాటిని దొంగల బారి నుంచి శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు దేవులీలు, పల్లవులని పిలిచే గోరక్షకులను నియమించే వారు. వారిని మొత్తం గ్రామ ప్రజలు ఎంతో గౌరవంగా చూసేవారు. వారిలో కూడా రాజ్పుత్, జాట్ కులస్థులు ఎక్కువే ఉండేవారు. వారు పశువుల రక్షణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేవారు. అలా ప్రాణత్యాగం చేసిన వారి పేర్లతో గ్రామస్థులు శిలా విగ్రహాలు ఏర్పాటుచేసి పూజించేవారు. పాబూజీ, తేజాజీ, గోగాపిర్, రామదేవ్లు అలా పూజలందుకొని చరిత్రలో నిలిచిపోయారు. వారిలో పాబూజీ, గోగాపిర్లు రాజ్పుత్లుకాగా, తేజాజీ జాట్ కులస్థుడు. పరస్పర సహకారంతో జీవించేవారు... పశు సంపదపై ఆధారపడి వ్యవసాయం, పాడి, ఊలు, తోలు, మాంసం పరిశ్రమలు కొనసాగేవి. వీటిలో పనిచేసే అగ్రవర్ణాల వారు, రైతులు, దలితులు, ముస్లింల మధ్య పరస్పర సహకారం ఉండేది. మాంస కోసం పశువులను అపహరిస్తున్నారన్న ఆరోపణలపై ముస్లింలపై రాజ్పుత్లు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అవి రాజ్యాల మీద కాంక్షతో జరిగిన యుద్ధాలేనని చరిత్రకారులు చెబుతారు. ఏదేమైనా గోరక్షకులు మాత్రం ఏ దలితుల మీద, ఏ ముస్లింల మీద దాడి చేసిన దాఖలాలు లేవు. ఇంతకూ ఈ గోరక్షకులెవరూ? 2012లో భారతీయ గోరక్షాదళ్ను పవన్ పండిట్ ఏర్పాటు చేశారు. ఆయనే దీనికి చైర్మన్గా ఉంటున్నారు. దేశావ్యాప్తంగా దీనికి 32 శాఖలున్నాయి. ఈ శాఖల్లో ఆరువేల మంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని శాఖలు చురుగ్గా ఉన్నాయి. రాజకీయంగా భారతీయ గోరక్షాదళ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకపోయినా ఇందులో హిందూ సంస్థలకు చెందిన సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో పనిచేసే సంస్థలకు చట్టాపరంగా ఎలాంటి హక్కులు, బాధ్యతలు లేవు. హిందూ రత్న, గోరక్షక్ సమ్మాన్ లాంటి పురస్కారాలు ఉన్నాయిగానీ వేతనాలు కూడా లేవు. చందాలు, బలవంతపు వసూళ్లు రాష్ట్ర కమిటీల్లో పనిచేస్తున్న గోరక్షకులు గోరక్షణ పేరిట విరాళాలు వసూలు చేస్తారు. రోడ్డుపక్కన డాబాలను, రెస్టారెంట్లను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కబేళాలకు ట్రంకుల్లో తరలిస్తున్న పశువులను అనుమతించేందుకు గోరక్షకులు డబ్బులు తీసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. గోరక్షక కమిటీల్లో ఎక్కువగా హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలే ఉండడం వల్ల మనదే ప్రభుత్వం అధికారంలో ఉందన్న దీమాతో తాజాగా దాడులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అహింసే మా సిద్ధాంతం అహింసే తమ సిద్ధాంతమని, ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద దాడులకు పాల్పడరాదని తాము గోరక్షకులకు చెబుతూ వస్తున్నామని భారతీయ గోరక్షా దళ్ వ్యవస్థాపకుడు పవన్ పండిట్ తెలిపారు. తల్లిలాంటి గోవును కబేళాలకు తరలిపోకుండా రక్షించేందుకు పోలీసుల సహకారం తీసుకోవాలే తప్ప చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేతుల్లోకి తీసుకోరాదని తమ కార్యకర్తలకు తాను చెబుతున్నాని ఆయన చెప్పారు. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో గోరక్షకులు తుపాకులు కూడా పట్టుకుంటున్నారు. సైనికుల్లా దుస్తులేసుకుంటున్నారు. -
వాటి జోలికెళ్తే కాళ్లు విరగ్గొడతా: బీజేపీ ఎమ్మెల్యే
-
వాటి జోలికెళ్తే కాళ్లు విరగ్గొడతా: బీజేపీ ఎమ్మెల్యే
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు అప్పుడే నోటికి పని చెప్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఆవుల విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఎవరైనా ఆవులను కించపరిచినా.. వాటిని చంపినా కాళ్లు విరగ్గొడతా' అని ఆయన హెచ్చరించారు. ఇటీవల యూపీలో బీజేపీ బంపర్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే అక్రమ గోవధశాలలపై కొరడా ఝళిపించారు. అక్రమ గోవధశాలలన్నీ మూసేయాలని ఆదేశించారు. శనివారం స్వస్థలం గోరఖ్పూర్ పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ ఉన్న గోశాలను ప్రత్యేకంగా సందర్శించారు. మొత్తం మీద యోగి ప్రభుత్వం ఆవుల సంరక్షణ విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. -
షరతులపై ఉచితంగా గోశాల గిత్తదూడలు
-సోమవారం తొమ్మిది జతలు రైతులకు అందజేత -సరిగా సాకకపోతే దేవస్థానం స్వాధీనం చేసుకునే అవకాశం అన్నవరం :రత్నగిరి దిగువన దేవస్థానం గోశాలలో గల గిత్తదూడలను రైతులకు ఉచితంగా అందచేస్తున్నారు. సోమవారం తొమ్మిది జతల దూడలను వివిద గ్రామాల రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం గోశాలలో ఉన్న 12 జతల గిత్త దూడలను తీసుకువెళ్లేందుకు దరఖాస్తులు కోరగా 11 మంది రైతులు ధరఖాస్తు చేసుకున్నారని, వారిలో తొమ్మిది మందిని ఎంపిక చేసి అందజేశామని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఈ విధంగా కొన్ని గిత్తదూడలను రైతులకు ఇవ్వగా తిరిగి ఇప్పుడు ఇచ్చామని తెలిపారు. ఏఈఓ సాయిబాబా, గోశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇవీ షరతులు.. దూడలను తీసుకువెళ్లే వ్యక్తి చిరునామా తదితర వివరాలతో పాటు దేవస్థానం పెట్టిన షరతులన్నీ పాటిస్తానని స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి దానిని నోటరీ చేయించి దేవస్థానానికి ఇవ్వాలి. దూడలను తీసుకునే రైతులు ఆరు నెలలకొకసారి వాటిని దేవస్థానం అధికారులకు చూపాలి. దూడలను సరిగా చూస్తున్నారో లేదో అని దేవస్థానం సిబ్బందికి అనుమానం వస్తే ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. వాటిని సరిగా మేపకపోతే దేవస్థానం వాటిని స్వాధీనం చేసుకుంటుంది. దూడను కబేళాకు తరలించడం వంటివి చేస్తే ‘గోసంరక్షణ చట్టం’ ప్రకారం దేవస్థానం అధికారులు కేసు పెడతారు. ఈ షరతులన్నింటికీ అంగీకరిస్తేనే గిత్త దూడలను అందజేస్తారు. -
సీఎం ఆస్తుల్లో పది ఆవులు, ఐదు దూడలు!
పట్నా: సాధారణంగా ఆవులు, గేదెల వంటి పశు పోషణ అనగానే బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తొస్తారు. కానీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చరాస్తుల్లోనూ 10 ఆవులు, 5 దూడలు ఉన్నాయి. నితీశ్, ఆయన మంత్రివర్గ సహచరులు డిసెంబర్ 31న తమ ఆస్తులను ప్రకటించారు. అందులో నితీశ్ తన వద్దనున్న ఆవులు, దూడల విలువను రూ. 1.45 లక్షలుగా ఆయన పేర్కొన్నారు. సీఎం నితీశ్ వద్ద రూ. 56.49 లక్షల విలువ కలిగిన స్థిర, చరాస్తులున్నాయి. వాటిలో ఢిల్లీలోని రూ. 40 లక్షల విలువైన ఫ్లాట్, రూ. 16.49 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. వాటిలో ఒక ఫోర్డ్ ఇకోస్పోర్ట్, ఒక హ్యుందయ్ గ్రాండ్ ఐ10 కార్లున్నాయి. అలాగే, ఆయన పేరుపై రూ. 3.79 లక్షల వాహన రుణం కూడా ఉంది. కాగా, నితీశ్ కుమారుడు నిశాంత్ వద్ద నితీశ్ కన్నా నాలుగు రెట్లు అధికంగా విలువ కలిగిన స్థిర, చరాస్తులుండటం విశేషం. ఆయన పేరుపై రూ. 2.36 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. -
గోమాతకు ప్రకృతి శాంతి పూజలు
వెలుగుబంద (రాజానగరం) : సకల దేవతామూర్తులు కొలువై ఉన్న గోమాతను పూజించాల్సిన సమయంలో హింసించడం వల్లే తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళిని రక్షించగల శక్తి ఒక్క గోమాతకే ఉందన్నారు. ప్రపంచ శాంతిని కోరుతూ రాజానగరం మండలం, వెలుగుబందలో మంగళవారం గోమాతకు ప్రకృతి శాంతి పూజలు చేశారు. అదే గ్రామానికి చెందిన ప్రగడ సత్యనారాయణ ఆధ్వర్యంలో గోగాయత్రీ మంత్రపఠనం, కామధేను కలశపూజ, గో ప్రదక్షిణ చేశారు. రానున్న కొత్త సంవత్సరం అంతా హాయిగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళిని కాపాడాలని వేడుకున్నారు. -
సత్తాచాటిన మంగళగిరి ఎడ్లజత
ముగిసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు కారంపూడి: పల్నాటి వీరారాధనోత్సాల సందర్భంగా కారంపూడిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్ల పందేలు బుధవారం రాత్రి ముగిశాయి. పాల పళ్ల( (నాలుగుపళ్ల))విభాగం పోటీలను వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, నాయకులు డాక్టర్ గజ్జెల బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘం ప్రతినిధి బొమ్మిన అల్లయ్య, హనుమయ్యలను అభినందించారు. దాతలు పాతూరి రామిరెడ్డి, షేక్ షఫీ, కంపా శిర్రయ్య, కొంగర సుబ్రమణ్యం, మేకల శ్రీనివాసరెడ్డి, క్రిష్టపాటి అంకిరెడ్డి, బండ్ల వెంకటేశ్వర్లు(బుల్లోడు) చేతులమీదగా బహుమతులు అందించారు. విజేతలు.. మంగళగిరికి చెందిన బత్తుల సరోజినీదేవి ఎడ్ల జత, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన జక్కుల రాజశేఖరయాదవ్, మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన తెనగాల అచ్చెయ్య కంబైన్డ్ జత 4,600 అడుగుల దూరం లాగాయి. ఈ రెండు జత్లకు ప్రథమ, ద్వితీయ బహుమతులను సమానంగా అందించారు. తృతీయ బహుమతి దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన తోట వీరబ్రహ్మనాయుడు జత, నాలుగో బహుమతి బొల్లాపల్లి మండలం హనుమాపురంతండాకు చెందిన కేతావత్ బద్యానాయక్ జత, ఐదో బహుమతి కొల్లూరు మండలం దోనేపూడికి చెందిన వెనిగండ్ల విఘ్నేశ్వరి జత కైవసం చేసుకున్నాయి. -
బ్రెజిల్లో ఒంగోలు ఆవు రూ. 14.86 కోట్లు!
బ్రెజిల్ దేశంలో పశుపోషకులు గిర్, ఒంగోలు తదితర భారతీయ జాతుల ఆవులు, గిత్తలను అత్యంత శ్రద్ధాసక్తులతో పెంచి పోషిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ఒంగోలు వంటి దేశీ ఆవులు, గిత్తల ధర కూడా ఔరా అనిపించేలా ఉంటుంది. అక్టోబర్ 28వ తేదీన బ్రెజిల్ సావో పాలోని ఇండియాటుబలో జరిగిన వేలంలో పర్ల ఐవీఎఫ్ ఏజేజే అనే పేరుగల ఒంగోలు ఆవు రూ.14.86 కోట్ల (72 లక్షల బ్రెజిలియన్ రియళ్ల)కు అమ్ముడుపోయింది! బ్రెజిల్లో భారతీయ సంతతి ఆవుకు ఇంతకుముందెన్నడూ ఇంత అధిక ధర పలకలేదట! -
రూ.250 కోట్లతో దేశీయ ఆవుల పునరుత్పత్తి కేంద్రం
పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ దొరబాబు చెల్లూరు(రాయవరం) : దేశీయ ఆవుల పరిరక్షణ కు నెల్లూరు జిల్లాలోని చింతలదీవిలో రూ.250 కోట్లతో పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు తెలిపారు. మండలంలోని చెల్లూరులో బీజేపీ నేత ముత్యాల పుల్లయ్యచౌదరి ఇంట్లో శనివారం జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2,400 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రానికి ఇప్పటికే రూ.25 కోట్లు మంజూరైందని, ఈ కేంద్రంలో ఒంగోలు, పుంగనూరు, సాహివాల్, గిర్, తదితర దేశీయ ఆవుల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా నకిరేకల్ వద్ద పిండమార్పిడి విధానం అభివృద్ధికి, మేలుజాతి దూడల ఉత్పత్తికి కర్నూలు జిల్లా బన్వాసి, నంధ్యాల, విశాఖపట్నంలోని హనుమంతవాకలో సెమన్ బ్యాంక్స్ ఏర్పాటు చేశామన్నారు. ఏటా 40 లక్షల ఏఐ(ఆర్టిఫిషియల్ ఇనుస్ట్రుమెంట్) ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 2,400 మంది గోపాలమిత్రలకు అందజేసే గౌరవ వేతనం పెంచేందుకు కృషిచేస్తున్నట్లు దొరబాబు తెలిపారు. పశువుల పాల, అందాల ఈ పోటీల నిర్వహణకు జిల్లా స్థాయిలో రూ.3 లక్షలు, రాష్ట్ర స్థాయిలో రూ.6 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెల పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పశువుల పాల, అందాల పోటీలు నిర్వహించామన్నారు. -
గోవులను వెంటాడుతున్న ‘థ్రిప్స్’
– గురువారం కుప్పకూలిన 4 ఆవులు – శ్రీమఠాన్ని కదిలించిన ‘సాక్షి’ కథనం – కళేబరాలపై జేసీబీతో మట్టి మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం గోపురం ఆవులను థ్రిప్స్ (మెదడువాపువ్యాధి) వెంటాడుతూనే ఉంది. గురువారం మరో నాలుగు గోవులు థ్రిప్స్తో కుప్పకూలాయి. అందులో రెండు గోవులు మృత్యువాత పడ్డాయి. మరణశయ్యపై గోమాతలు కొట్టుమిట్టాతుండటం స్థానికులను కలచివేస్తోంది. ఇంతగా గోవులు మృతి చెందుతున్నా మఠం మేనేజర్ మాత్రం వాతావరణ మార్పుపై సమస్యను నెట్టేయడం గమనార్హం. గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘మృత్యుఘోష’ కథనంతో సూపర్వైజర్ శ్రీనివాసఆచార్ నేతృత్వంలో స్థానిక వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే గోవులను మేపటానికి తరలిస్తుండగా నాలుగు ఉన్నపాటున కుప్పకూలి పడిపోయాయి. మఠం సిబ్బంది ఎంతగా యత్నించినా రెండు గోవులు కూలిన చోటనే ప్రాణాలు వదిలాయి. మెదడువాపు కారణంగా ఆవులు కళ్ల తిరిగి నడవడానికి చేతగాక ఉన్నచోటనే కూలిపోతున్నాయి. కాళ్లలో సత్తువ లేక వ్యాధి విషమించి చనిపోతున్నాయి. అలాగే గోవులను తుంగభద్ర నది ఒడ్డున గోతులో పడేసిన కళేబరాలను జేసీబీతో మట్టివేసి పూడ్చిపెట్టారు. తీరమంతా ఆవుల కళేబరాలతో దుర్వాసన, కలుషితభరితంగా మారింది. స్థానిక వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తున్నా వ్యాధి అదుపులోకి రావడం లేదు. -
గోమాతా! నమోస్తుతే!
రత్నగిరిపై ఘనంగా గోపూజా మహోత్సవం అన్నవరం : కృష్ణాష్టమి సందర్భంగా గురువారం రత్నగిరిపై సత్యదేవుని ఆలయప్రాంగణంలో సామూహిక గోపూజా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల సమక్షంలో దేవస్థానంలోని రామాలయం ఎదురుగా గల ఆలయప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని గోవులను పూజించారు. ఉదయం 8.30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రామాలయం వద్ద గల కళావేదిక వద్దకు తీసుకువచ్చారు. పండితులు స్వామి, అమ్మవార్లకు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశస్థాపన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం గోశాల, రత్నగిరి సప్తగోకులం నుంచి తెచ్చి 25 గోవులను పూజించారు. గోవులో లక్ష్మీ,గౌరీ,సరస్వతీ మాతలు కొలువై ఉంటారని, మూడుకోట్ల దేవతలు. చతుర్దశ పురాణాలు నిక్షిప్తమై ఉంటాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. పంచామృతాల్లో గోక్షీరం, నెయ్యి, పెరుగు గోవు నుంచి వచ్చేవేనని, వీటితో బాటు గోమూత్రం, గోమయం విశేష ప్రాధాన్యత కల్గినవని తెలిపారు. యజ్ఞ, యాగాదుల్లో గోవు నుంచి వచ్చే ఈ ఐదింటిని తప్పక ఉపయోగిస్తారని తెలిపారు. గోధూళి సైతం పవిత్రమైనదని వివరించారు. వ్యవసాయంలో కూడా గోవుకున్న ప్రాధాన్యత గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారన్నారు. పండితులు గోవు శరీరంలోని ఏ భాగంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడో వివరిస్తూ గోవులకు ఈఓ నాగేశ్వరరావు దంపతులతో, భక్తులతో పూజలు చేయించారు. అనంతరం వేదపండితులు గోమాతలకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. బియ్యం, బెల్లం, ఆవుపాలతో చేసిన క్షీరాన్నాన్ని తినిపించారు. తరువాత ఆ క్షీరాన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. నేడు రత్నగిరిపై సామూహిక ఉచిత వరలక్ష్మీ పూజ శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని నిత్యకల్యాణ మండపం, దాని పక్కనే గల వాయవ్య, నైరుతీ మండపాలలో సామూహిక ఉచిత వరలక్ష్మీ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ గురువారం విలేకర్లకు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి పూజలు ప్రారంభిస్తారని, 9 గంటలకే మహిళలు మండపాల వద్దకు చేరుకోవాలని సూచించారు. వచ్చిన వాళ్లందరితో పూజలు చేయిస్తారన్నారు. రెండు వేల మందికి పైగా పూజలాచరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాల్గొనే మహిళలు కొబ్బరికాయ, అరటిపళ్లు, రాగి లేదా ఇత్తడి చెంబు, పూలు, గాజులు తెచ్చుకోవాలని తెలిపారు. పూజకు అవసరమయ్యే పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, జాకెట్టుముక్క, అమ్మవారి రూపు, తోరం దేవస్థానం అందచేస్తుందని తెలిపారు. పూజలనంతరం మహిళలకు, వారితో వచ్చిన వారికి స్వామివారి దర్శనం, ఉచిత భోజనసౌకర్యం కల్పిస్తామని వివరించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్షాలు కురవాలని కోరుతూ శుక్రవారం నుంచి ఆదివారం వరకూ దేవస్థానంలో వరుణ జపాలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. -
పశువుల లారీ పట్టివేత
దత్తిరాజేరు : నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తున్న లారీని స్థానిక పోలీస్లు పట్టుకున్నారు. పెదమానాపురం ఎస్సై మహేష్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదమానాపురంనకు చెందిన పశువుల వ్యాపారి కిల్లాడ భాస్కరరావు పశువులను లారీలో ఎక్కించి కేరళకు తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాసరిపేట వద్ద లారీని పట్టుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ రామస్వామి, క్లీనర్ కట్టుముత్తు, తదితరులను అదుపులోకి తీసుకున్నారు. పశువులను విజయనగరంలోని గోశాలకు తరలిస్తామని ఎౖస్సై తెలిపారు. పశువుల యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
అంబా.. ఆకలి
నిధులు కరువు ... పర్యవేక్షణ బరువు ఎండకు ఎండి... వానకు తడిసి... బురదలోనే నిలబడి... అనారోగ్యంతో కొన్ని, ఆకలితో మరికొన్ని మరణం ఎండుగడ్డికీ ఎదురుచూపులే సంరక్షణ కేంద్రంలో నరకం చవి చూస్తున్న గోవులు గో రక్షణంటూ పెద్ద పెద్ద మాటలొద్దు ... గోమాతంటూ పూజలూ మాకొద్దు ... మాకున్న ఈ పెద్ద పొట్టలో సగమైనా ఎండిగడ్డి పడేస్తే అదే మాకు ‘పచ్చ’భక్ష్య పరమాన్నం’ అనుకుంటాం. ఒకరం కాదు ... ఇద్దరం కాదు ఏకంగా 400 మందిమి ‘అంబా’ అంటూ చేస్తున్న ఆర్తనాదం మిమ్మల్ని కదిలించడం లేదా...? అర్ధాకలితో అలమటిస్తూ తనువు చాలిస్తుంటే కనీస కనికరమైనా లేదా... ఏటా మంజూరయ్యే రూ.80 వేలు కూడా 2015 సంవత్సరం నుంచి ఆగిపోవడంతో మరిన్ని ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. పోషణ చేతకాకపోతే మమ్మల్ని వదిలేయండి ... రోడ్లపై పడి నోటికందింది తింటాం... రక్షణ పేరుతో జైలులో బంధించినట్టు బాధిస్తే ఎలా... గాంధీనగర్, (కాకినాడ) : అంబా... ఆకలంటూ ఆ ఆవులు ఆర్తనాదాలు చేస్తున్నాయి... పట్టెడు ఎండుగడ్డి కోసం బారెడు పొట్ట తహతహలాడుతోంది. ఎంతో సదాశయంతో పెట్టిన గో రక్షణ శాలలోని ఆవులు ఆర్తనాదాలతో అల్లాడుతున్నాయి. కాకినాడలోని రమణయ్యపేట మార్కెట్ వద్ద ఉన్న గోశాల సంరక్షణ కేంద్రాన్ని ‘సాక్షి’ సందర్శించినప్పుడు దయనీయ పరిస్థితులు కనిపించాయి. వధశాలకు అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించి ఈ గోశాలలో పెట్టి ఆహారం, ఆరోగ్యం సంరక్షించడం గోశాల సంరక్షణ సంఘం బాధ్యత. ఈ కేంద్రంలో 400 వందలకుపైగా గోవులున్నాయి. ఈ 400 గోవుల్లో 200 పెయ్య దూడలున్నాయి. వీటికి కనీసం గడ్డి పరక కూడా వేయని పరిస్థితి నెలకొంది. దయతో గూడిచ్చినా... 1906వ సంవత్సరంలో పిఠాపురం మహారాజా గారు జంతువులను హింసించడం, చంపడం వంటివి చేయకూడదనే ఉద్దేశ్యంతో జంతుహింస నివారణ సంఘాన్ని ఏర్పాటుచేసి, దానికి కావాల్సిన ఐదెకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలో గోశాల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా తరువాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సంరక్షణలో కూడా నిర్లక్ష్యం ఆవహించింది. ఎండకు ఎండి ... వానకు తడుస్తూ... గోవులను షెడ్లలో ఉంచకుండా ఆరుబయటనే కట్టేస్తున్నారు. ఎండకు మాడుతూ, వానకు తడుస్తూ దీనంగా బతుకునీడుస్తున్నాయి. దీనికితోడు తినడానికి గ్రాసం, తాగడానికి నీళ్ళు లేకపోవడంతో బక్కచిక్కిపోతున్నాయి. అధిక సంఖ్యలో అనారోగ్యాల బారిన పడుతున్నాయి. 400 వందలకుపైగా ఉన్న గోవుల్లో సుమారు 250 గోవులకు పైగా బక్కచిక్కిపోయాయి. ఇంకో 100 పైగా ఆవులు చనిపోయే స్థితిలో ఉన్నాయి. ఎక్కడనుంచో రక్షించి ఇక్కడకు తీసుకువచ్చి నరకం చూపిస్తున్నారని గో ప్రేమికులు వాపోతున్నారు. ఆరోపణలెన్నో... 2008–2009 సంవత్సరంలో ఈ గోశాల సంరక్షణ సంఘం నిర్వహణపై పలు వివాదాలు, విమర్శలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్పటి కలెక్టర్ ఈ కమిటీని రద్దు చేశారు. అయితే ఈ రద్దుపై హైకోర్టును ఆశ్రయించగా పాత కమిటీకే బాధ్యతలను అప్పగిస్తూ 2015 సెప్టెంబర్లో కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గోశాల సంరక్షణ సంఘం కమిటీ అధ్యక్షుడిగా దివంగత పిఠాపురం మహారాజా, ఉపాధ్యక్షుడిగా పి. రఘురామారావు, కార్యదర్శిగా గురుప్రసాద్, జాయింట్ సెక్రటరీగా గోపాల్, కోశాధికారిగా కృష్ణ గోపాల్, కౌన్సిల్ న్యాయశాఖ సలహాదారునిగా రవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ గోశాలను సంరక్షించడానికి 80,000 వేల రూపాయిలను అందించేది. 2005 వ సంవత్సరం నుంచి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం నిలిపివేయడంతో ఇక్కట్లు ప్రారంభమయ్యాయని కమిటీ సభ్యులు చెబుతున్నారు. దాతలెవరైనా అందజేసే గడ్డి, తవుడూ, కాయగూరలను ఆహారంగా ఇస్తున్నామని తెలిపారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు... మేము మా గోశాల సంరక్షణ కేంద్రాలలోని గోవులకు ప్రతి పూటా ఆహారం, నీళ్లు ఇస్తున్నాం. మాపై వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలను మా కమిటీæ తీవ్రంగా ఖండిస్తుంది. – గురు ప్రసాద్, గోశాల సంరక్షణ సెక్రటరీ, కాకినాడ మాకెలాంటి సంబంధం లేదు గోశాల సంరక్షణ భాద్యత పూర్తిగా ఈ కమిటీనే చూసుకుంటుంది. దీనిలో మేము ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదు. ఈ గోశాల భూ సంరక్షణ బాధ్యత గోశాల కమిటీ సభ్యులదే. – పిల్లి. అనంతలక్ష్మి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే -
గో రక్ష దళ్ చీఫ్పై ఎఫ్ఐఆర్ నమోదు
చండీగఢ్: గో రక్ష దళ్ చీఫ్ సతీష్ కుమార్పై పంజాబ్ పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోరక్షణ పేరుతో దాడులకు పాల్పడిన ఘటనపై సతీష్ కుమార్పై పాటు పలువురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కాగా గోవులను కబేళాకు తరలిస్తున్నారన్న నేపథ్యంలో యువకులపై దాడికి పాల్పడిన ఘటనలో సతీష్ కుమార్ సహా రాజ్పుర, అన్నూ, గుర్ప్రీత్ అలియాస్ హ్యాపీలపై ఐపీసీ సెక్షన్లు 382, 384, 342, 341, 323, 148, 149 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారు పేర్కొన్నారు. గో రక్షణ సమితి సభ్యులు దాడికి పాల్పడిన వీడియో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పటియాల ఎస్ఎస్పీ చౌహాన్ మాట్లాడుతూ వీడియఓ ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. -
కబేళాకు గోవుల తరలింపు
వీహెచ్పీ, భజరంగ్దళ్ ఫిర్యాదుతో కేసు కరీంనగర్ గోశాలకు తరలింపు చొప్పదండి : అనుమతి లేకుండా కబేళాకు తరలిస్తున్న పది ఆవులను మండల కేంద్రంలో మంగళవారం భజరంగ్దళ్, వీహెచ్పీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారమ ందించడంతో ఎస్ఐ రవీందర్ కేసు నమోదు చేశారు. వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో మంగళవారం జరిగిన పశువుల సంతలో ఐదు పెద్ద ఆవులు, ఐదు చిన్న ఆవులను కొని ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా చొప్పదండిలో భజరంగ్దళ్, వీహెచ్పీ నాయకులు అడ్డుకొని ఆటో డ్రైవర్ను ప్రశ్నించారు. ఎండీ మోయిన్ ఆవులను కబేళాకు తరిలిస్తున్నట్లు తెలుసుకున్న నాయకులు ఎస్ఐ రవీందర్కు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేసి అనంతరం వాటిని కరీంనగర్ గోసంరక్షణ శాలకు తరలించారు. గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందిగా ఆమలు చేయాలని వీహెచ్పీ మండల అధ్యక్షుడు పడకంటి క్రిష్ణ, గోరక్షక్ కాపర్తి మల్లికార్జున్, భజరంగ్దళ్ ప్రముఖ్ బత్తిని మురళీ, నలుమాచు రామక్రిష్ణ, పొన్నాల తిరుపతి, మావురం జగన్, సాయిగణేశ్, విజయ్, దుర్గా ప్రసాద్ కోరారు. -
గోశాలకు గోవుల అప్పగింత
నిర్మల్రూరల్ : భైంసాలో అక్రమంగా తరలిస్తుండగా హిందూవాహిని సభ్యులు పట్టుకున్న గోవులు శనివారం నిర్మల్లోని గాయత్రీ గోశాలకు చేర్చారు. భైంసాలో హిందూవాహిని సభ్యులు పట్టుకున్న ఆవులను స్థానిక పోలీసులకు అప్పజెప్పగా.. అక్కడి పట్టణ సీఐ రఘు వివిధ గోశాలలను సంప్రదించారు. పశుగ్రాసం కొరతతో ఆయా గోశాలల వారు ముందుకు రాలేదు. చివరకు నిర్మల్లోని బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయ సమీపంలోని గాయత్రీగోశాలను సంప్రదించి, వాటిని ఇక్కడకు పంపించారు. గోశాల నిర్వాహకులు దోముడాల ప్రవీణ్కుమార్, స్థానిక హిందూవాహిని నాయకులు దొనగిరి మురళీ, విక్కీ తదితరులు వాటిని గోశాలకు తరలించారు. గోవులను స్వీకరించినందుకు భైంసా పట్టణ సీఐ అభినందించినట్లు ప్రవీణ్కుమార్ తెలిపారు. పశుగ్రాసం కొరతతోనే ఇబ్బంది ఉందని, దాతలు సహకరిస్తే మరిన్ని గోవులకు సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు. -
రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
బాపట్ల : మండలంలోని మరుప్రోలువారిపాలెం గ్రామంలో రాష ్ట్రస్థాయి ఎడ్లపందేలు గురువారం రసవత్తరంగా సాగాయి. 15 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొనగా 3 క్వింటాళ్ల ఎద్దులు మాత్రమే పోటీల్లో పాల్గొన్నాలనే నిబంధన పెట్టారు. పోలురాద పద్ధతిలో బండిచక్రాలు కదలకుండా కట్టి ఎక్కువ దూరంగా ఏ ఎడ్ల జత లాగితే వారికి బహుమతులు ఇచ్చే విధంగా పోటీలు నిర్వహించారు. న్యాయనిర్ణేతగా రాధాకృష్ణ వ్యవహరించగా గురువారం రాత్రి మూడు జతలు మాత్రమే పోటీల్లో పాల్గొన్నాయి. రాత్రికి కూడా పోటీలు నిర్వహించి శుక్రవారం బహుమతులు ఇచ్చేవిధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోటీల నిర్వాహకులుగా గవిని వెంకటేశ్వర్లు, మరుప్రోలు చెన్నకేశ్వరెడ్డి, కోకి శ్రీనివాసరెడ్డి, నాయుడు శ్రీరామమూర్తిరెడ్డి, సత్యంరెడ్డి, మంచాల శ్రీనివాసరెడ్డి, కావూరు రామకృష్ణారెడ్డి, మామిడాల ఏడుకొండలరెడ్డి, కావూరు శేషారెడ్డి వ్యవహరించారు. పోటీలు చూసేందుకు ఆయా గ్రామాల నుంచి వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. -
ఇది సూడాన్ గోకులం..
దక్షిణ సూడాన్.. నైలు నదీతీరం.. తెలవారింది.. ముండరీ తెగ నిద్రలేచింది.. పళ్లు తోముకున్నారు..తర్వాత గోమూత్రాన్ని నెత్తిన పోసుకున్నారు!! యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయనే కాదు. ఆవు అమ్మలాంటిది, తమను ఎలాంటి ఆపదనుంచైనా రక్షిస్తుందన్నది వారి నమ్మకం. నేరుగా పొదుగు నుంచి పాలు తాగారు.. ఢంకా మోగించారు.. పశువులను మేతకు తీసుకెళ్లే సమయమైంది అనడానికి సంకేతంగా.. ఇది సూడాన్ గోకులం.. ఆవుతోనే వీరికి రోజు మొదలవుతుంది. ఆవుతోనే ముగుస్తుంది. గోవులు.. ముండరీ తెగ బలం, గర్వం, ఆస్తి, ఆత్మాభిమానం. పశువులను వీరు తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. గోమూత్రంతో స్నానం చేస్తారు. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంతోపాటు వారి జుత్తు కూడా ఎర్రగా మారి ఎంతో అందంగా ఉంటుందట. అంతేకాదు పిడకలను కాల్చి, పొడి చేసి, టాల్కం పౌడర్లా ఒళ్లంతా రాసుకుంటారు. పశువులకూ రాస్తారు. యాంటీసెప్టిక్గా ఉండటంతోపాటు దోమల కాటు నుంచీ రక్షణ కల్పిస్తుందట. అటు ఎండల నుంచి కూడా కాపాడుతుందట. ముండరీ తెగ ప్రజల జీవితాలు శతాబ్దాలుగా పశువులతో పెనవేసుకుపోయాయి. ఇక్కడి పశువులు ఎంతో బలంగా ఉంటాయి. వీటిని దొంగిలించుకుపోవడానికి దాడులూ జరుగుతుంటాయి. వీటిని కాపాడుకోవడానికి వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా పశువులను అమ్మరు. ఎందుకంటే.. వీరికి ఆవు అమ్మ.. ఆవే అన్నీనూ.. -
'కరువు పరిస్థితుల్లో గోవులను కాపాడుకోవాలి'
మణికొండ(హైదరాబాద్): రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు గోవులను పరిరక్షించేందుకు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని రాష్ట్ర గోసేవాదళ్ అధ్యక్షుడు అంతారం నరేశ్కుమార్ కోరారు. ఆయన ఆదివారం గండిపేట్ గోశాలలోని గోవులకు లారీలో తీసుకువచ్చిన పచ్చిగడ్డిని వేసి తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నోరులేని జీవులు ఆకలితో అలమటిస్తుంటే నోరున్న మనం మనవంతుగా వాటిని ఆదుకోవాలన్నారు. గోవులు ఎక్కడ కనిపించినా వాటికి కడుపునింపే మార్గాన్ని ఆలోచన చేయాలని, ఆసేవ ఎంతో పుణ్యాన్ని ఇస్తుందన్నారు. -
ఆవు లెటర్ రాయడం చూశారా!
ఐపూర్/జైసల్మీర్: విద్యాసంస్థలకు రాజకీయ రంగు తప్పడం లేదు. బీజేపీ హిందూత్వ భావజాల ప్రభావమో, వ్యక్తిగత ఉద్దేశమో.. మరేదైనా కారణమో.. మొత్తానికి రాజస్థాన్ లో తొలిసారి పాఠ్యంశాల్లో గోవు పేరిట ఓ లేఖను చేర్చి అలాంటి పాఠం పెట్టిన తొలి రాష్ట్రంగా నిలిచింది. అందులో గోవు ఓ తల్లి మాదిరిగా విద్యార్థులకు లేఖ రాసినట్లు పాఠ్యాంశాన్ని చేర్చగా దానిపై పలువురు పెదవి విరుస్తున్నారు. బీజేపీ తన హిందూత్వ భావజాలాన్ని వసుంధరా రాజేతో జొప్పిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఐదో తరగతి హిందీ పుస్తకాల్లో ఓ చాప్టర్ లో రెండు ఆవుల ఫొటోలను ముద్రించి.. గోవును తమ తల్లిగా పూజిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఇందులో ఆ గోవు సంభాషణ విద్యార్థులతో ఎలా ఉందంటే.. 'నా కుమారుల్లారా.. కూతుర్లార.. నేను ప్రతి ఒక్కరికి శక్తిని ఇస్తాను. తెలివిని ఇస్తాను. సుదీర్ఘ ఆయుష్షును ఇస్తాను. నా గొప్పతనాన్ని గురించి ఎవరు తెలుసుకుంటారో వారు కచ్చితంగా మంచి అనుభూతిని, ఆనందాన్ని పొందుతారు. ఎవరు నన్ను తల్లిలాగా భావిస్తారో నేను వారిని నా బిడ్డలుగా భావిస్తాను. నేను పాలను, పెరుగును, నెయ్యిని ఇస్తాను. నా మలమూత్రములతో మెడిసిన్, ఫెర్టిలైజర్స్ తయారవుతాయి. నా సంతానమైన ఎద్దులు మీకు వ్యవసాయంలో సాయం చేస్తాయి. నా వల్ల వాతావరణం కూడా స్వచ్ఛంగా మారిపోతుంది' అంటూ లేఖ సాగింది. అయితే, గోవునుంచి పొందే లాభాలపై అవగాహన కల్పించేందుకే ఈ పాఠం పెట్టినట్లు మంత్రి ఓతారామ్ దేవాసి చెప్పారు. -
మేత కోసం వస్తే.. కాటేసిన తీగలు
♦ 29 ఆవులు మృత్యువాత వైర్లు తెగిపడటంతో విద్యుదాఘాతం ♦ కరువు వేళ బతికించుకుందామని వస్తే.. బలైన వైనం ♦ అంతర్గాం, ఇబ్రహీంపూర్లో ఘటనలు పిడుగుపాటుకు ♦ మరో రెండు ఎడ్లు మృతి దుఃఖసాగరంలో బాధిత రైతులు ♦ ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు పరిహారమిస్తామన్న ట్రాన్స్కో ఎస్ఈ ఘోరం జరిగిపోయింది... పూడ్చలేని నష్టం ఏర్పడింది... యమపాశాలుగా మారిన విద్యుత్ తీగలకు అభం శుభం తెలియని 29మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. అస్తవ్యస్త తీగలు తెగిపడుతున్నాయి. ఫలితంగా విలువైన పశుసంపదకు తీవ్రనష్టం చేకూరుతుంది. తాజాగా జిల్లాలో రెండు చోట్ల విద్యుత్ తీగలు తెగి పడడంతో 29 ఆవులు, పిడుగు పడడంతో మరోచోట రెండు పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలతో రైతాంగం దుఃఖసాగరంలో మునిగింది. కరువుతో పశువులను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతుంటే విద్యుత్ తీగలు వాటిని వెంటాడుతున్నాయి. కల్హేర్/న్యాల్కల్: కరెంటు కాటుకు వేర్వేరు చోట్ల 29 మూగజీవాలు నేలకొరిగాయి. పిడుగుపాటుకు ఇంకోచోట రెండు పశువులు ప్రాణా లు విడిచాయి. అకాల వర్షాల కారణంగా వీచిన ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడడంతో పాడి పశువులు మృత్యువాత పడ్డాయి. రెండేళ్లుగా కరువు కాటకాలతో అష్టకష్టా లు పడుతున్న రైతన్నను తాజా ఘటనలు కోలుకోలేని దెబ్బతీశాయి. గ్రాసం, నీటికోసం కల్హేర్ మండలం అంతర్ గాంకు వలస వచ్చిన పశువులను విద్యుత్ వైరు రూపంలో మృత్యువు కబళించింది. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న పశువుల మందపై 11కేవీ విద్యుత్ వైరు తెగిపడడంతో 23 మూగజీవాలు అక్కడికక్కడే ప్రాణాలు వది లాయి. కంగ్టి మండలానికి చెందిన ధూంసింగ్, గోవిం ద్, రమేష్ అనే రైతులు తమ కుటుంబాలతో కలిసి దాదాపు 300 పశువులను తీసుకుని వలస వచ్చారు. పగలంతా పశువులను మేపి రాత్రి పూట ఓ పొలం వద్ద పశువులను కట్టి ఉంచగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా సోమవారం మధ్యాహ్నం న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్లోనూ విద్యుత్ వైరు తెగిపడడంతో ఆరు ఆవులు మరణించాయి. ఇక్కడా 11కేవీ విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో తీగ లు తెగి పశువులపై పడడంతో విద్యుదాఘాతం తో కన్నుమూశాయి. హత్నూర మండలం చింతల్చెరువు శివారులో ఆదివారం రాత్రి పిడుగుపడడంతో రెండు ఎడ్లు మరణించాయి. ఇలా పెద్ద సంఖ్యలో పశువులు మృతి చెందడం తో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈనెల ఒకటిన పెళ్లిబృందం లారీని విద్యుత్ తీగలు తగల డంతో విద్యుదాఘాతానికి గురై ఏడుగురు మరణించిన విషయం తెల్సిందే. ఈ ఘటనను మరచిపోకముందే 31 పశువులు మృత్యువాత పడడం అందరిని కలిచివేసింది. బోరున విలపించిన రైతులు... పశువులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడడం తో కల్హేర్ మండలం అంతర్గాం, న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కంగ్టి మండలానికి చెందిన ధూంసింగ్, గోవింద్, రమేష్, ఇబ్రహీంపూర్కు చెందిన రైతులు నాగమ్మ, దేవేందర్, మానిక్, పి.దేవేందర్ కన్నీరుమున్నీరయ్యారు. ఓవైపు కరువు కాటేస్తే మరోవైపు పశువులను పోగొట్టుకున్నామంటూ తల్లడిల్లిపోయారు. అంతర్గాంలోనే ఖననం... మరణించిన పశువులకు అంతర్గాంలోనే వెట ర్నరీ వైద్యులు సయ్యద్ ముస్తాక్, నేతాజీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అక్కడే జేసీబీతో పెద్ద గోతి తవ్వి వాటిని ఒకేచోట ఖననం చేశారు. ఖననం సందర్భంగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత రైతులే కాకుండా స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోరున విలపించారు. బతికించుకుందామని వస్తే... కరువు కారణంగా పశువులను బతికించుకునేందుకు కల్హేర్ వైపు వస్తే ఇలా జరిగిందంటూ కంగ్టి మండలం ముకుంద్నాయక్ తండాకు చెందిన ధూంసింగ్, సాధు తండాకు చెందిన గోవింద్, గాజుల్పాడుకు చెందిన రమేష్ కుటుంబీకులు వాపోయారు. నీటి జాడలున్నాయని పశువులను తీసుకుని వారం రోజుల క్రితం ఇటువైపు వస్తే ఈ దుర్ఘటన జరిగిందంటూ బోరుమన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. గిరిజనులకు తప్పిన ప్రమాదం అంతర్గాం ఘటనలో గిరిజన రైతులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రైతులు ధూంసింగ్, గోవింద్ కుటుంబీకులు రామారావు, అశోక్, సుభాష్, కాలు, రమేష్, శివ, రాహుల్ తమ పశువుల మంద పక్కనే నిద్రించారు. వైరు తెగి పశువుల మీద పడిన సమయంలో వీరంతా పక్కనే నిద్రలో ఉన్నారు. పశువుల అరుపులకు వీరు లేచేసరికి ఘోరం జరిగిపోయింది. మరణించిన పశువుల విలువ దాదాపు రూ.10 లక్షలకుపైగా ఉంటుందని అంచన. ట్రాన్స్కో అధికారుల నిలదీత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే 23 పశువులు మృతి చెందాయని అంతర్గాం వాసులు ట్రాన్స్కో అధికారులను నిలదీశారు. ట్రాన్స్కో ఎస్ఈ సదాశివరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఒక్కో పశువుకు రూ.40వేల చొప్పు న వారం రోజుల్లో పరిహారాన్ని అందజేస్తామని ఎస్ఈ ప్రకటించారు. ఘటనా స్థలాన్ని పశుసంవర్థక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, ఖేడ్ సీఐ సైదానాయక్, ఆర్ఐ ఎండీ ఖాలీద్, వీఆర్ఓ సాయిలు, నాయకులు కృష్ణమూర్తి, రాంసింగ్, గుండు మోహన్, మహిపాల్రెడ్డి తదితరులు సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. పరిహారమిస్తామన్న తహసీల్దార్... న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ ఘటనలో బాధిత రైతులకు పరిహారమిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దశరథ్సింగ్, హద్నూర్ ఎస్ఐ సుభాష్, పశువైద్యాధికారి అజింక్య, ట్రాన్స్కో ఏఈ రవీందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో ఆవుకు రూ.40 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షల మేర పరిహారం వచ్చేలా కలెక్టర్కు నివేదిక పంపుతామని తహసీల్దార్ బాధిత రైతులకు హామీ ఇచ్చారు. విద్యుత్ అధికారులపై కేసు కల్హేర్: అంతర్గాం ఘటన నేపథ్యంలో ట్రాన్స్కో అధికారులపై కేసు నమోదు చేశామని సిర్గాపూర్ ఎస్హెచ్ఓ రవీందర్ సోమవారం తెలిపారు. నారాయణఖేడ్ సీఐ సైదానాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ వైరు తెగిపడడంతో 22 ఆవులు, ఓ గేదె మరణించిందని ఎస్హెచ్ఓ రవీందర్ వెల్లడించారు. ట్రాన్స్కో అధికారులను బాధ్యులు చేస్తూ కేసు నమోదు చేశామన్నారు. ట్రాన్స్కో అధికారులు, లైన్మన్పై విచారణ జరుపుతామన్నారు. పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి హత్నూర: చింతల్చెరువు శివారులో ఆదివా రం రాత్రి పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి చెందాయి. ఫత్త్తే హైమద్ అనే రైతుకు చెందిన రెండు ఎడ్లు గ్రామ శివారులోని పొలం వద్ద ఆదివారం రాత్రి కట్టేశాడు. ఉరుములతో కూ డిన వర్షంతోపాటు పిడుగుపడడంతో రెండు ఎడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతుతు పరిస్థితిని చూసి బోరున విలపిం చారు. లక్ష రూపాయల విలువల గల రెండు ఎడ్లు మృతిచెందడంతో తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు. మేపడానికి తోలుకొస్తే.. తీవ్ర కరువుతో కంగ్టి మండలంలో గ్రాసం, నీరు దొరుకుతలేదు. పశువుల తిప్పలు చూడలేక నీళ్లు, గ్రాసం కోసం కల్హేర్ మండలం అంతర్గాం వైపు వచ్చాం. గ్రాసం ఎక్కడ దొరికితే అక్కడికి పశువుల మందతో వలస పోతుంటాం. కరెంట్ షాక్ తగిలి 23 పశువులు చనిపోయినయి. పశువులు లేకపోతే మేం రోడ్డున పడినట్టే. - ధూంసింగ్, బాధిత రైతు -
ఆవులతో తొక్కించుకుంటే అదృష్టం మనదే!
పదుల సంఖ్యలో ఆవులు వీధుల్లో వేగంగా పరుగులు తీస్తున్నాయి. మామూలుగా అయితే మనమేం చేస్తాం? మనల్ని తొక్కేస్తాయని భావించి.. పక్కకు తప్పుకుంటాం.. కానీ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో పక్కకు తప్పుకోరు.. తొక్కించుకుంటారు! గోవుల గిట్టల వల్ల గాయాలైనా.. భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు. ఈ వినూత్న సంప్రదాయం ఏటా దీపావళి మరుసటి రోజున ఉజ్జయినిలో జరుగుతుంది. ఇలా చేయడం వల్ల తమ జీవితాల్లోని సమస్యలన్నీ తొలగిపోతాయని.. అదృష్టం కలసి వస్తుందని నమ్ముతారు. అందుకే ప్రమాదమని తెలిసినా.. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పురుషులు ఇక్కడికి తరలివస్తారు. ఈ సంప్రదాయం కొన్ని వందల ఏళ్ల నుంచి కొనసాగుతోందని.. ఇప్పటివరకూ ఒక్కరు కూడా చనిపోలేదని నిర్వాహకులు చెబుతున్నారు. ‘ఇది ప్రమాదమే.. అయితే.. ఆవు అమ్మలాంటిది. అమ్మ ఎవరినీ చంపదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలు ఉన్నాయి. ఈ గోవులు తమ పాదాలతో వాటిని అణచివేస్తాయి. భగవంతుడు మా బాధను, త్యాగాన్ని గమనించి.. అదృష్టం కలసివచ్చేలా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని మనోజ్కుమార్ అనే స్థానికుడు తెలిపాడు. -
పశువులకు మేతగా కుళ్లిన బిర్యానీ
-
కబేళాకు తరలిస్తున్న గోవులను కాపాడిన ఎమ్మెల్యే
ఎల్బీనగర్: కబేళాకు తరలిస్తున్న గోవులను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు పట్టించారు. వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం నుంచి లారీలో నగరంలోని బహదూర్పురాలోని కబేళాకు గోవులను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన అనుచరులతో కలిసి ఆటోనగర్లో అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుకున్న లారీలో ఏడు ఆవు దూడలు, 31 కోడె దూడలు ఉన్నాయి. వీటిని నగరంలోని ప్రభుత్వ గోశాలకు తరలించారు. గోవులను తరలిస్తున్న కృష్ణ, గణపతి, బైరాగిలను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ గోవులొస్తున్నాయ్ జాగ్రత్త!
ఇటీవల పశుమాంసం, గోమాంసం గురించిన చర్చ అవధులు దాటి సాగుతోంది. భారతీయ సమాజపు ఏకత్వంలోని భిన్నత్వాన్ని మరచిపోయినందువల్లనే కొన్ని పిదప బుద్ధులు కొందరికి అలవాటయ్యాయి! ఉదాహరణకు, కేరళలో 72 రకాల సమాజాలు (కమ్యూనిటీస్) ఉన్నాయి! వాళ్లంతా ‘‘అంటరానివారు’’ కారు సుమా! ఆ మాటకొస్తే మన రాష్ట్రం సహా అన్ని రాష్ట్రాలలోనూ గొర్రె మాంసం, మేక మాంసం చాలా ఖరీదైనందున, వీరు గొడ్డుమాంసం వినియోగిస్తున్నారు. మనుషుల మనసులు మార్చగల పరిణామం ఏది? సమాజంలో కొందరు మూర్ఖులుగా మిగిలిపోవడానికి కారణం, భయమా? కొన్ని విశ్వాసాలకు భయమే కారణమైతే, దాన్ని తొలగించుకోవడం ఎలా? కార్యకారణ సంబం ధానికి ప్రకృతే మాతృక. తన ప్రస్తుత పరిస్థితి గురించి వివరించలేని భయ స్తుడొకడు ఆత్మతృప్తి కోసం ఒక టుమ్రీ వదిలాడట, ‘మూడు జన్మల సంగతి చెప్పగలను! పూర్వజన్మలో ఇచ్చి పెట్టుకోలేదు. కనుక ఈ జన్మలో దేవుడు నాకీయలేదు. కాబట్టి ఇకముందు జన్మలో నాకేమీ ఉండదు.’’ దీని బెంగతోనే, విశ్వాసం నుంచి దూరమై భయాన్ని ఆశ్రయించాడట. అందుకే మూడు తరా ల దరిద్రులు కొందరు ముష్టికి బయలుదేరారేగానీ, తమ దారిద్య్రానికీ, ఈ అసమానతలకీ అసలు కారణం దోపిడీ, అసమానతలు, మూఢ నమ్మకా లేనని తెలుసుకోలేకపోయారు. ఇలాంటి సన్నివేశం ఒకటి మానవ సమాజ పరిణామవాద శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్కు ఎదురైంది. ఇందుకు సంబంధించినదే ఒక విశేషం నాలు గైదు రోజుల క్రితం బయటపడింది కూడా. అది కూడా డార్విన్ స్వదస్తూరీతో ఉన్న లేఖ రూపంలో వెలుగుచూసింది. ఫ్రాన్సిస్ మెడెర్మాట్ అనే న్యాయ వాదికి డార్విన్ రాసిన లేఖ అది. బైబిల్ పుట్టుపూర్వోత్తరాలు, జీసస్ క్రీస్తును దేవుని బిడ్డగా భావించుకోవడం గురించిన మీమాంసకు సంబంధించి మెడె ర్మాట్ లేవనెత్తిన సందేహానికి (నవంబర్ 23, 1880) డార్విన్ ఇచ్చిన ప్రత్యు త్తరమది (ది హిందు, 25-9-15). ‘బైబిల్ రచనను దైవ ప్రవచనంగా నమ్మ ను గాక నమ్మను. జీసస్ను దేవపుత్రునిగా భావించడం లేదు’ అని చెప్పారా యన. ఇంతకీ బారిస్టర్ మెడెర్మాట్ ఏమని రాస్తే, డార్విన్ ఇలా స్పందించవ లసివచ్చింది? మెడెర్మాట్ మాటల్లోనే.. ‘‘మీ పుస్తకాలు చదివి నేను ఆనందిం చాలంటే, నా పఠనం తరువాత ముగింపులో బైబిల్ కొత్త నిబంధన లో (న్యూటెస్ట్మెంట్) నాకు అంతకుముందే ఏర్పడిన విశ్వాసాన్ని కోల్పోకూ డదు. నేను ఈ ఉత్తరం రాయడంలో ఉద్దేశం- బైబిల్ నూతన నిబంధనలలో మీకు అసలు నమ్మకం ఉందా, లేదా అని తెలుసుకోవడం. అందుకు ‘అవును’ లేదా ‘కాదు’ అన్న సమాధానం కావాలి.’’ దీనికే డార్విన్ ఆ సమాధానం ఇచ్చాడు. కాగా సమాధానాన్ని బయట పెట్టవద్దని మెడెర్మాట్ వేడుకున్నాడు. ఎందుకు ప్రాధేయపడవలసి వచ్చిందంటే, ఆ కాలంలో అవిశ్వాసులను మౌఢ్యం కొద్దీ కొరత వేస్తూ ఉండడం వల్లనే. హితం పోయింది మతం వచ్చింది ఈ మధ్య మన దేశంలో ప్రాచీన శాస్త్రవేత్తలు ప్రబోధించిన ధర్మచింతన పోయి, ‘మతం’పేరుతో గతం పాతర తవ్వి, ఆనాటి క్రైస్తవ సమాజంలోనూ, ఇస్లామిక్ సమాజంలోనూ కనిపించిన కొన్ని నమ్మకాలు పరివ్యాప్తం కావ డంతో ధర్మచింతన వెనకడుగు వేసి, సమాజహితం స్థానంలో మతం చోటు చేసుకుంది. మనిషికి మంచిమాటే అలంకారం అన్న సూత్రాన్ని నమ్మిన సుప్ర సిద్ధ జాతీయవాది, షికాగోలో సర్వధర్మ ప్రపంచ సమ్మేళనంలో ప్రసంగించిన దేశభక్త స్వామి వివేకానంద గానీ, ఆయన గురువుగా భావించే దయానంద గానీ మూఢ నమ్మకాలకు సాధ్యమైనంత దూరం జరిగి, భారతీయతను మాత్రమే చాటగలిగారు. వారు ఏనాడూ భిన్న భాషా సంస్కృతుల చింతన లను విమర్శించలేదు. అయితే పలు జీవన విధానాలు సహ జీవనం సాగి స్తున్న భారతీయత మొక్కట్లను చెదరగొట్టడానికి కొన్ని సంస్థలు, నాయక స్థానాలలో ఉన్న కొందరు వ్యక్తులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. దేశంలో వివిధ వర్గాల వారి ఆహార నియమాల మీద, అలవాట్ల మీద విరుచుకుపడు తున్నారు. ఈ ధోరణి భారతీయతకు విరుద్ధం. అతివేలం, ఉన్మాదం ఎందులో ఉన్నా (క్రైస్తవం, ఇస్లాం, భారతీయత లేదా హైందవం) ఖండనార్హమే. చిత్రమేమిటంటే ధర్మానికి అర్థాలు మారిపో తున్న దశలో ఆదిశంకరుని ప్రవచనాలలో ‘మనది వైదిక ధర్మమేగానీ, హిం దూమతం కాదు. హిందూమతమని పిలిచినవాళ్లు పరదేశీయులని, హిందూ మతం అనరాదనీ ప్రబోధించారు (చూ. ఆదిశంకరుని ప్రవచనాలు: తెలుగు సేత: స్వామి శివశంకరశాస్త్రి). కాగా పర్షియన్లు, ఇతర విదేశీయులు సింధునదీ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ‘సింధు’ పదంలోని ‘స’కారం ఉచ్చరించలేక ‘స’కు బదులు, ‘హ’ కారంతో ‘సింధు’ను ‘హిందు’గా మార్చారనీ రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు. అటు ఆదిశంకరాచార్యులు, ఇటు రాహుల్జీ తెలిపిన వివరణను, నిర్వచనాన్నీ కొందరు స్వార్థపరులు తొక్కిపట్టి, ప్రచారం లోకి రానివ్వకపోవడానికి బలమైన స్వార్థప్రయోజనాలే కారణమై ఉండాలి. ఆహార అలవాట్లపై దాడి తగునా? మత విశ్వాసాల పేరిట భిన్న ధర్మచింతనలకు చెందిన వారి ఆహార అలవా ట్లపై దాడులు తగదు. ఇటీవల పశుమాంసం, గోమాంసం గురించిన చర్చ అవధులు దాటి సాగుతోంది. భారతీయ సమాజపు ఏకత్వంలోని భిన్నత్వాన్ని మరచిపోయినందువల్లనే కొన్ని పిదప బుద్ధులు కొందరికి అలవాటయ్యాయి! ఉదాహరణకు, కేరళలో 72 రకాల సమాజాలు (కమ్యూనిటీస్) ఉన్నాయి! వాళ్లంతా ‘‘అంటరానివారు’’ కారు సుమా! ఆ మాటకొస్తే మన రాష్ట్రం సహా అన్ని రాష్ట్రాలలోనూ గొర్రె మాంసం, మేక మాంసం చాలా ఖరీదైనందున, వీరు గొడ్డుమాంసం వినియోగిస్తున్నారు. మన సంకీర్ణ భారతీయ సమాజంలో ఇస్లాం ప్రవేశానికి ముందే పశు మాంస భక్షణ ఒక భాగమని సుప్రసిద్ధ చరిత్రకారుడు, పరిశోధకుడు ప్రొఫె సర్ డి.ఎన్.ఝా (ఢిల్లీ విశ్వవిద్యాలయం) వెల్లడించాడు! దేశంలో వ్యవసా యం వృత్తిగా స్థిరపడే వరకూ అనేక సంచారజాతులు, ఇక్కడ స్థిరపడిన పెక్కు దేశ దిమ్మర జాతులలో పశుబలులు ప్రధానంగా సాగుతూండేవని ప్రాచీన భారతీయ సంహితలు, ముఖ్యంగా వేదాలు నిరూపిస్తున్నాయని పం డిత పరిశోధకులు వెల్లడించారు. ఆ కాలంలో దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పేరుతో పశువుల్ని నైవేద్యంగా చూపించేవారు. ఇంద్రుడికి, అగ్నికి ఎద్దు, ఆవు మాంసం సమర్పించేవారు; మరుత్తులు, అశ్వనీదేవతల పేరిట గోమాంసం నివేదించుకునే వారు; వేదాలలో 250 రకాల పశువులను పేర్కొన్నారనీ, వాటిలో కనీసం 50 రకాల పశువుల్ని బలివ్వడానికి, వాటి మాంసాన్ని ఆహా రంగా స్వీకరించడానికి అనువైన జాతులుగా పేర్కొన్నారని చరిత్రకారుల నిర్ధారణ! మహాభారతంలో రంతిదేవుడనే రాజు ప్రస్తావన ఉంది. ఆయన, బ్రాహ్మణ వర్గానికి ఆహారధాన్యాలతో పాటు గొడ్డుమాంసం కూడా పంచిపె ట్టాడన్న ఖ్యాతి పొందాడు. ‘తైత్తిరీయ బ్రాహ్మణం’ ‘ఆవు మాంసం ఆహా రం’గా పేర్కొన్నదని, లేత ఆవు మాంసం కావాలని యాజ్ఞవల్క్యుడు పట్టుప ట్టాడనీ పరిశోధకలు ఉదహరించారు! ‘బ్రాహ్మణాలు’ కూడా గొడ్డుమాంసం వాడకానికి సాక్ష్యంగా నిలిచాయని నిపుణులు స్పష్టం చేశారు! ‘మనుస్మృతి’ కూడా గొడ్డు మాంసం వాడకాన్ని నిషేధించలేదు! ప్రాచీన ఆయుర్వేద గ్రం థం ‘చరక సంహిత’ ప్రకారం గోమాంసం అనేక రోగాలకు మందు. పశు బలులు-పూర్వాపరాలు ఈ విధంగా వ్యవసాయార్థికవ్యవస్థ క్రమంగా నిలదొక్కుకున్నకొద్దీ, సంఘం లో భారీ ఎత్తున పరివర్తనా దశ ప్రారంభం కావడంతో పశువుల్ని బలిపెట్టే కార్యాచరణలో కూడా మార్పులు అనివార్యం అయ్యాయనీ చరిత్రకారులు పేర్కొన్నారు. సరిగ్గా ఈ దశలోనే బ్రాహ్మణ్యం పాల్గొంటున్న పశుబలులు లాంటి యజ్ఞయాగాదుల నిర్వహణ కూడా కొనసాగిందనీ, అందుకే బుద్ధుడు అహింసను ప్రబోధిస్తూ ఈ కర్మకాండలపైన ధ్వజమెత్తాడని చరిత్రకారులు రాశారు. ఈ పశుబలుల కర్మకాండలో యజ్ఞయాగాదుల్లో 500 ఎడ్లు, 500 కోడెదూడలు, 500 ఆవుదూడలు, 500 గొర్రెలను యజ్ఞవాటికలో స్తంభాలకు కట్టి మరీ వధించేవారనీ ప్రొఫెసర్ రామ్ పునియానీ (బొంబాయి) పేర్కొ న్నారు. కనుకనే ఆనాటి సమాజంలో గొప్ప హేతువాదిగా, దార్శనికుడిగా, త్యాగిగా చైతన్యశక్తితో ప్రభవిల్లిన బుద్ధుడు - అశ్వమేధ, పురుషమేధ, వాజ పేయ యాగాదుల వల్ల భారతీయ సమాజానికి మంచి ఫలితాలు రాలేదని పేర్కొనవలసి వచ్చింది. బుద్ధుడు ఒకసారి మగధ పర్యటనలో ఉండగా ‘కూటదంతుడు’ అనే ఒక బ్రాహ్మణ వర్గీయుడు 700 ఎద్దులను, 700 గొర్రెల్ని బలివ్వడానికి సిద్ధమవడం చూశాడు. అది గ్రహించిన బుద్ధుడు జోక్యం చేసు కుని ఈ హింసాకాండను అడ్డుకున్నాడు. అప్పటికే నూతన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ రంగంలోకి ప్రవేశించింది. దానితో పశుసంపద రక్షణ సామాజికుల బాధ్యతగా, ముఖ్యావసరంగా పరిగణనలోకి వచ్చిందని మరువరాదు. అహింస గురించి బుద్ధుడు అంతగా పట్టుబట్టడం అనేది గుడ్డిగా జరగలేదనీ, పశు మాంసాన్ని ఒకసారి బుద్ధుడు కూడా రుచి చూడటమూ చరిత్రకు తెలి సిన ఘట్టమేననీ, ఒక సందర్భంలో పంది మాంసం (పోర్క్) తినడం వల్లనే ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడనీ చరిత్రకారులు తెలిపారు. నిజానికి దేశంలో బౌద్ధధర్మం వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే లేదా బౌద్ధంపైన ఒక వర్గం బ్రాహ్మ ణ్యం దాడులు ప్రారంభమైన తర్వాతనే, బౌద్ధం వల్లనే యజ్ఞయాగాదులకు, వర్ణవ్యవస్థలోని వివక్షా విలువలకూ అడ్డంకులు, సవాళ్లూ ఎదురైనందువల్లనే అన్ని స్థాయిల్లోనూ ప్రతిఘటన పెరిగింది. ఆ సమయంలోనే యజ్ఞయాగాదు లను నమ్ముకున్న బ్రాహ్మణ్యంలోని ఒక వర్గం బౌద్ధ భిక్షువులపైన, ధర్మప్రచా రకుల మీద పుష్యమిత్ర శుంగ చక్రవర్తి ఆసరాతో ప్రత్యక్షదాడులకు దిగింది. ఇంకొక వైపున గౌతమ బుద్ధుడు జ్ఞానమార్గానికి ఆదరవైన ‘బోధి’ వృక్షా న్ని కాస్తా శశాంక రాజు కూల్చివేశాడనీ మరవరాదు! అప్పటిదాకా బలిబశువు గానే బతుకు ఈడ్చిన ‘ఆవు’ కాస్తా కొందరికి అకస్మాత్తుగా ‘గోమాత’గా మార డమే ఒక విశేషం! రాచకొండ వివ్వనాథశాస్త్రి మరొకసారి హెచ్చరించినట్టు మళ్లీ ‘గోవులొస్తున్నాయ్, జాగ్రత్త’ సుమా! రాహుల్జీ నిర్ధారించినట్టు మానవ జాతి ప్రగతి పథం వైపు సాగించిన ప్రతి ఒక్క అడుగడుగు రక్తతర్పణంలోనే సాగింది. ఇటీవల గుజరాత్ ‘ప్రగతిపథం’లో కూడా ఆ ‘నర రక్తతర్పణం’ చారికలూ, సారికలూ నమోదైనాయి! ‘గోవులొస్తున్నాయ్, జాగ్రత్త’! వ్యాసకర్త మొబైల్: 9848318414 - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
'రాయితీపై రైతులకు ఆవులు'
తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు రాయితీపై ఆవులను అందజేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పలాల వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. -
చిరుత దాడి: ఆవులు మృతి
అనంతపురం : కల్యాణదుర్గం మండలం పాల్వాయి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చిరుతలు ... భీమన్న అనే రైతుకు చెందిన రెండు ఆవులపై దాడి చేశాయి. ఈ దాడిల్లో రెండు ఆవులు చనిపోయాయి. దాంతో భీమన్న గురువారం ఉదయం గ్రామస్తులు, అటవీశాఖా అధికారులకు తెలిపారు. అయితే చిరుతల సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. -
పిడుగుపాటుకి ఎద్దులు మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ప్రాణాలొదిలాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని మూల్కనూరు గ్రామంలో నేటి ఉదయం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీనితోపాటు పిడుగుపడింది. ఆ ప్రదేశంలోనే ఉన్న కాడెడ్లు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధిత రైతు కనకయ్య కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎద్దుల విలువ రూ. 70 వేలు ఉంటుందని రైతు తెలిపారు. -
దేవరకద్రలో చిరుత సంచారం
దేవరకద్ర : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చిరుత సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండలంలోని గద్దెగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి చిరుత ప్రవేశించి ఆవు దూడను చంపేసింది. శనివారం ఉదయం ఆనవాళ్లను గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమీపంలోని గుట్టల ప్రాంతం నుంచి చిరుత వచ్చి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. తరచూ చిరుతల సంచరించడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
ఆవుల మందపై చిరుత దాడి
అనంతపురం: అనంతపురం జిల్లాలో చిరుత సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా బుధవారం ఉదయం కంభదూరు మండలం కుర్లపల్లిలో ఆవుల మందపై చిరుత దాడి చేసింది. ఆ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి. అదే విధంగా రాత్రి పూట పొలాల్లో చిరుత సంచరిస్తోంది. దాంతో రాత్రి వేళల్లో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనేచర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
గోవుల వధను అడ్డుకున్న గోసంరక్షణ సమితి!
-
పశువులు పస్తులేనా..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితు కారణంగా వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. వర్షాల్లేక పచ్చిగడ్డి, వరి సాగు లేక ఎండుగడ్డి దొరకడం గగనంగా మారింది. వచ్చే వేసవిలో మూగజీవాలకు మేత దొరకడం కష్టం కానుంది. జిల్లాలో గేదెలు, ఆవులు, ఎద్దులు అన్నీ కలిపి 10లక్షలకు పైగా ఉన్నాయి. ఎక్కువగా పత్తి, సోయాబీన్, ఆ తర్వాత వరి సాగు చేస్తుంటారు. ధాన్యం దిగుబడి అనంతరం ఎండుగడ్డి పశువులకు మేతగా ఉపయోగపడేది. కానీ తగ్గిన వర్షాల కారణంగా జిల్లాలో 60వేల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా.. 20వేల ఎక్టార్లకు పడిపోయింది. దీంతో ఎండాకాలంలో ఎండుగడ్డి దొరకలేని పరిస్థితి ఏర్పడనుంది. గడ్డి విత్తనాలు పశుసంవర్ధక శాఖ పంపిణీ చేసినా కరెంటు కోతల కారణంగా సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. నీటి సదుపాయం ఉన్న కొంతమంది రైతులు విత్తనాలు తీసుకెళ్లినా తీవ్రమైన కరెంటు కోతల కారణంగా విత్తుకున్నా గడ్డిని వృథాగా వదిలేశారు. చెరువులు, కుంటలు నిండకపోవడంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఏటా జనవరి మాసం పూర్తయ్యే సరికి పశువులకు మేత కరువు ఉండేది కాదు. ప్రస్తుతం నవంబర్లోనే కనుచూపు మేరలో పచ్చగడ్డి కనిపించడం లేదు. వాణిజ్య పంటల సాగుకే ప్రాధన్యం.. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా కురవడంతో వరి, జొన్న, మొక్కజొన్న సాగుకు ఎక్కువగా నీటి అవసరం ఉన్నందునా వర్షాలు లేక ఎక్కువగా వేసుకోలేదు. ఈ పంటల దిగుబడి అనంతరం ఎండుగడ్డిగా పశువులకు ఆహారంగా ఉపయోగపడేది. తగ్గిన వర్షాల కారణంగా పత్తి, సోయా, కంది పంటలు వేసుకున్నారు. ఈ పంటల దిగుబడి అనంతరం ఎండుగడ్డిగా కూడా పశువులకు ఉపయోగకరంగా ఉండదు. అరకొరగా గడ్డి విత్తనాలు రైతులు పశువుల పెంపకానికి 75 శాతం రాయితీపై మేలు రకపు గడ్డి విత్తనాలు అందజేస్తున్నారు. గడ్డి విత్తనాల పెంపకంపై అవగహన కల్పించి పశు సంతతిని కాపాడుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని మండలాల్లో పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. తూర్పు ప్రాంతాంలో విత్తన పంపిణీ ఊసే లేకుండా పోయింది. అవగాహన కరువు.. ప్రభుత్వ పథకాలపై పాడి రైతులుకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. పశుగ్రాసం కోసం రబీలో నీటి సౌకర్యం ఉన్న రైతులకు గడ్డి విత్తనాలు రాయితీపై అందించాలి. దీనిపై గ్రామాల వారీగా ప్రచారం చేయకపోవడంతో రైతులు పశుగ్రాసం కోసం నానా తంటాలు పడుతున్నారు. విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నా అవి ఎవరికి చేరుతున్నాయో తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పశుసంపద అభివృద్ధి దిశగా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో గడ్డి విత్తనాల పంపిణీపై అంతగా అవగాహన ఉండడం లేదు. మార్చి తర్వాతే కష్టాలు.. ప్రతీ ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పంటలు చేతికొస్తాయి. ఈ దశలో పశుగ్రాసానికి ఇబ్బందులు ఉండవు. మార్చి తర్వాత సమస్య మొదలయ్యేది. కానీ ఈ ఏడాది డిసెంబర్కు ముందే పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఎండుగడ్డి దొరకని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్, మే,జూన్ వరకు పశుగ్రాసం దొరకక మూగజీవులు అల్లాడాల్సిందే. మేకలు, గొర్రెలు పెంపకందారుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాటిని మేపేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాలను కాపాడుకునే మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం పాడి రైతుల కష్టాలు తెలుసుకుని వారికి సైతం వంద శాత ం రాయితీపై గడ్డివిత్తనాలు అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రతి గ్రామంలో నీటితొట్టెలు ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. -
బీ(ధీ)మా లేక బిక్కుబిక్కు!
ప్రమాదంలో పశువులు మృత్యువాతపడితే రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రవేశపెట్టిన బీమా పథకం నిర్లక్ష్యానికి గురవుతోంది. గడువు ముగిసి నెలరోజులు గడిచినా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకపోవడంపై పశుపోషకులు, అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగి జీవాలు మరణిస్తే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవులు, గేదెలు, గొర్ల కోసం బీమా పథకం ప్రవేశపెట్టింది. మూగజీవాలు మృతి చెందితే ఇన్సూరెన్స్ ఉన్న రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ప్రభుత్వం గత సంవత్సరం న్యూఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడంతో అక్టోబర్ 18 నుంచి నవంబర్ వరకు ప్రీమియం కట్టుకునేం దుకు గడువు విధించారు. దీంతో జిల్లా వ్యాప్తం గా 4,626 మంది రైతులు బీమా డబ్బులు చెల్లించగా, సిద్దిపేట డివిజన్లో 1,650 మూగజీవాలకు రైతులు ఇన్సూరెన్స్ చేయించారు. రైతు ఒక్కో గేదెకు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు రూ.10 నుంచి రూ.30 వేల వ రకు బీమా చేయించుకునే సదుపాయం కల్పిం చారు. ఇన్సూరెన్స్ చేయించుకున్న పశువులను వెటర్నరీ వైద్యులు పరీక్షించిన అనంతరం సర్టిఫైడ్ చేసిన తర్వాత పశువులకు పోగులు వేసి వాటిని ఫొటోలను బీమా కంపెనీ వారికి అందజేస్తారు. ఒక్క గేదె లేదా ఆవుకు ప్రీమియం కట్టుకుంటే రూ.50 వేలు, రెండు కంటే ఎక్కువ పశువులకు బీమా కట్టి అవి చనిపోతే రూ.2 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు. ఇదే కాకుం డా పశువులకు బీమా చేయించిన ప్రమాదవశాత్తు చనిపోతే అతనికి కూడా బీమా వర్తించేది. దీంతో అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందేది. పట్టించుకోని ప్రభుత్వం... బీమా గడువు అక్టోబర్ నెలతో ముగిసినా ప్రభుత్వం ఇప్పటి వరకూ విధివిధానాలు ప్రకటించలేదు. జిల్లా వ్యాప్తంగా అందరు రైతులు తమ పశువులకు సంవత్సరం వరకే బీమా చేయించి నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పశువుల బీమా ముగిసిన 15 రోజుల వరకు గ్రేస్ పీరి యడ్ ఉంటుంది. ఇది కూడా ముగి యడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సీజన ల్ వ్యాధులు ప్రబలడంతో పాటు చాల చోట్ల ఎన్నో మూగజీవాలు ప్రమాదవశా త్తు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యం లో అక్టోబర్ మాసంలోనే ప్రీమియం గడువు ముగిసినా ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకటించకపోవడంతో రైతులకు నష్టం జరిగే అవకాశముంది. అధికారులు స్పందించి ఇన్సూరెన్స్ మార్గదర్శకాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
పాలు పితకడమూ ఓ కళే..
ఆవులు.. బర్రెల పాలు పితకడమంటే చాలామంది తేలికగా తీసుకుంటారు. అయితే ఇందులోనూ రకాలుంటాయని, ఒక్కో రకంలో ఆవులు, బర్రెలు ఒక్కో రకంగా పాలు ఇస్తాయంటున్నారు. నక్లింగ్ : బొటనవేలును మడతపెట్టి పాలు తీయడాన్ని నక్లింగ్ పద్ధతి అంటారు. ఇలా పాలు పితికితే ఆవులు, బర్రెల చన్నులు ఒత్తిడికి లోనై వాచిపోతాయి. చన్నుల్లోని కణజాలం కూడా దెబ్బతింటుంది. ఇలా పితికేవారు ఎంతత్వరగా మానుకుంటే అంత మంచిది. స్ట్రిప్పింగ్ పద్దతి : బొటనవేలు, ఇతర చేతివేళ్ల మధ్య చన్నులను పట్టుకుని పైనుంచి కిందివరకు నొక్కుతూ పాలను నెమ్మదిగా, సున్నితంగా పితకడాన్ని స్ట్రిప్పింగ్ పద్ధతి అంటారు. ఇలా పితకడం ద్వారా చన్నులు కిందకుజారే ప్రమాదముంది. ఫిస్టింగ్ పద్దతి : చన్నులను చేతుల్లోకి తీసుకుని వేళ్లతో మృదువుగా నొక్కుతూ పాలు పితకడాన్ని ఫిస్టింగ్ పద్ధతి అంటారు. ఈవిధానంతో పశువులకు ఎలాంటి నొప్పీ కలగదు. అన్ని రకాల్లోకంటే ఈ పద్ధతిలో పాలు పితకడమే ఉత్తమం. రైతులూ మరెందుకు ఆలస్యం.. ఫిస్టింగ్ పద్ధతిలో పాలు తీయండి.. - నిజామాబాద్ -
తిన్నది అరిగిందో లేదో చూడాలని..
చిత్రంలో రెండు ఆవులు, వాటి వీపులపై రంధ్రంతో ఉన్న గొట్టాలు అమర్చి ఉండటం చూస్తున్నారు కదా.. ఆ ఆవులు తింటున్న గడ్డి, దాణా ఎంతమేరకు అరుగుతుందో తెలుసుకుందామనే స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఈ గొట్టాలను అమర్చారు! ఎనిమిది అంగుళాల రంధ్రంతో ఉన్న ఈ గొట్టాలు నేరుగా వాటి జీర్ణాశయంలోని ఓ గదిలోకి తెరుచుకుని ఉంటాయి. అంటే ఒకరకంగా ఆ ఆవుల కడుపులకు ఇవి కిటికీల వంటివన్నమాట. వీటిలోంచి చూస్తే.. ఆవుల కడుపులో మేత ఎంతవరకూ అరిగిందో కనిపిస్తుంది. అంతేకాదు.. ఆ గొట్టంలోంచి కొంత మేతను సేకరించి పరీక్షలు చేయడం ద్వారా అది ఆవుకు ఎంత మేలైన ఆహారమో కూడా అంచనా వేస్తారు. స్విట్జర్లాండ్ ప్రభుత్వ పరిశోధన సంస్థ ‘అగ్రోస్కోప్’ శాస్త్రవేత్తలు ఇలా 14 ఆవులకు కాన్వులాస్ అనే ఈ గొట్టాలను అమర్చారు. ప్రస్తుతం యూరప్తోపాటు అమెరికాలో కూడా ఇలాంటి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. అయితే నోరులేని అమాయకపు జంతువులను ఇలా ప్రయోగాల పేరుతో హింసించడం క్రూరమైన చర్య అంటూ.. జంతుహక్కుల కార్యకర్తలు మండిపడుతున్నా.. గోమాతల మేలు కోసమే ఈ ప్రయోగం చేస్తున్నామని శాస్త్రవేత్తలు బదులిస్తున్నారు. ఆవులకు ఏది మంచి ఆహారమో నిర్ణయించి, ఆ ఆహారాన్నే ఇవ్వడం ద్వారా వాటికి ఆరోగ్యాన్ని, ఆయువునూ ఇవ్వవచ్చని చెబుతున్నారు. అన్నట్టూ.. పశువులపై ఇలాంటి ప్రయోగాలు 1833లోనే మొదలయ్యాయట. -
తపాలా: పేడ శాంపిల్
నేను 1968లో విశాఖపట్నంలో జిల్లాకోర్టు పక్కనున్న పశువుల హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసేవాణ్ని. నక్కపల్లి నుండి కొత్తగా బదిలీ మీద వచ్చాను. రోజూ పాడి ఆవులు, గేదెలు, కుక్కలు వైద్యానికి వచ్చేవి. అప్పటికి పశువుల డాక్టర్గా నా అనుభవం నాలుగేళ్లే! నాతో పాటు ముగ్గురు కాంపౌండర్లు, నలుగురు అటెండర్లు పనిచేసేవాళ్లు. హాస్పిటల్ పక్కన ఎత్తులో ల్యాబరేటరీ ఉండేది. ఇప్పుడూ అక్కడే ఉంది. బ్లడ్ శాంపిల్స్, పేడ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్, రోగ నిర్ధారణకోసం పంపేవాళ్లం. ఒకరోజు ఆనందపురం దగ్గర నుండి అనుకొంటా, ఒక రైతు- పేరు నాయుడు- వచ్చి, ఎంతో బేల ముఖంతో ‘‘డాక్టరుబాబు, నాకు రెండు గేదెలున్నాయి. మా కుటుంబం అంతా దానిమీద బతుకుతున్నాం. అవి రెండూ గడ్డి తినడం లేదు! తెగ పారేస్తున్నాయి. మా ముసలిదానికీ, నాకూ గంజి నీళ్లు లేవు. నా ఇద్దరు కొడుకులు బడికి వెళ్లకుండా బిక్కు బిక్కుమంటూ ఇంటి దగ్గర ఉండిపోనారు. నానేటి చేయాలి బాబూ,’’ అన్నాడు. గేదెలు ఉపశమనానికి మందు ఇచ్చి, ‘‘ఏమయ్యా నాయుడూ! రేపు వచ్చేటప్పుడు రెండు గేదెల పేడ తీసుకొనిరా. పేడలోని దోషమేమైనా ఉంటే పరీక్ష చేయాలి,’’ అన్నాను. మరుసటి రోజున ఆ రైతు కావిడితో రెండు గేదెలూ రోజంతా వేసిన పేడ కావిడితో వచ్చాడు. ఒక పక్కన తాటాకుల బుట్ట, రెండో పక్కన గోనెతో మూట కట్టిన మొత్తం పేడ! నేను అప్పటికి స్నానం చేస్తున్నా అనుకొంటా. మా ఆవిడ ఆ రైతుని చూసి ఏదో బెల్లం బుట్ట తెచ్చాడేమో అనుకొందట. ఆయనకు మంచినీళ్లిచ్చి, ‘డాక్టరుగారు వస్తారు’ అని చెప్పిందట. ఈలోపు నేను రావడం, నాయుడు పేడ కావిడి గురించి చెప్పడం, నేనూ మా ఆవిడా నవ్వుకోవడం జరిగింది. ఈలోపున నా పక్క క్వార్టర్స్లో ఉన్న రామారావు- స్టాక్మెన్ కాంపౌండర్ రావటం, విషయం తెలుసుకొని, అందరితోపాటు ఒకటే నవ్వు. ఇదంతా ఎందుకు జరిగిందీ అంటే, నేను పేడ శాంపిల్ తెమ్మని చెప్పకుండా, రెండు గేదెలు వేసిన పేడ తెమ్మనడం వలన జరిగిన పొరపాటు. సామాన్యంగా పేడ శాంపిల్స్ అగ్గిపెట్టెలోగానీ, కాగితంలోగానీ పది గ్రాములు తెస్తే సరిపోతుంది. ఆ రోజు వైద్యానికి వచ్చినవాళ్లు నాయుడుని చూసి నవ్వటమే! నన్ను చూసీ నవ్వడమే! తదుపరి నాకు ఓపీ అయిపోగానే నా స్కూటరు మీద నాయుడును ఎక్కించుకుని, ఆనందపురం వెళ్లటమూ, ఆ రెండు గేదెలకూ మందివ్వడమూ జరిగింది. నాయుడు తెచ్చిన శాంపిల్స్ ల్యాబ్లో పరీక్ష చేసి, కడుపులో జలగల మూలంగా ఆ వ్యాధి వచ్చిందని నిర్ధారించాం. దానికి విరుగుడుగా ఏవలోధీన్ అనే మందు ఇవ్వటం జరిగింది. రైతులు ఎంత అమాయకంగా ఉంటారో, అంత మంచివాళ్లు కూడా. నేను విశాఖపట్టణంలో ఉన్న మూడు సంవత్సరాలూ ఆ రైతు వచ్చి కాయగూరలు ఇచ్చివెళ్లేవాడు. ఇది ఇప్పటికీ ఎప్పటికీ నేను మరువలేని విషయం. - డా॥రెడ్డిపల్లి సీతన్న నాయుడు విశాఖపట్నం గుడిలో భోజనాలు పెడతార్లే! మా మనవడి పేరు అశుతోష్. అంటే అల్ప సంతోషి, భోళా శంకరుడు. వాడికి అన్నీ సందేహాలే! తెల్లారి లేచింది మొదలు ప్రశ్నలు వేస్తూనేవుంటాడు. ‘‘సూర్యుడు పొద్దున్నే ఎందుకు వస్తాడు?’’ ‘‘పక్షులు ఎందుకు అరుస్తాయి?’’ ‘‘టీవీ ఎలా చేస్తారు?’’ ఇక వాడి చేష్టలు ఎలా ఉంటాయంటే, ఒకరోజు, ‘నాన్నా! నువ్వు ఆఫీస్కి వెళ్లొ’ద్దని తలుపు వేశాడు. ‘అరేయ్! వెళ్లకపోతే అడుక్కుతినాల్సొస్తుందిరా’ అని వాళ్ల నాన్న జవాబిచ్చాడు. దానికి వాడు, ‘ఏం భయం లేదు నాన్నా. మా స్కూల్ ముందు సాయిబాబా గుడిలో భోజనాలు పెడతారు; అప్పడాలు, ఐస్క్రీమ్ కూడా వేస్తారు’ అని సమాధానమిచ్చాడు. పై పోర్షన్లో ఉన్న కుటుంబం దగ్గరికి వాడు వెళ్తుంటాడు. వాళ్లని వేధిస్తున్నాడేమోనని ‘ఎందుకురా వాళ్లనలా చంపుతావ్. ఇక రా’ అంటే, ‘ఇంకాసేపు చంపనీ ఆంటీ’ అంటుంటారు వాళ్లు. ‘మా ఇంట్లోకి ఇంకా అశుతోష్ రాలేదండీ’ అంటుంటారు పక్కవాళ్లు. మా అల్లరి మనవడిని అందరూ ఇలా ముద్దు చేస్తుంటారు. - కందేపు లక్ష్మి లాంగ్రామం, గుంటూరు ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
పశువైద్యం మృగ్యం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: పశువులకు వైద్యం దూరమవుతోంది. గ్రామాలకు దూరంగా పశువైద్యశాలలు ఉండటంతో ఎక్కువ మంది పశుపోషకులు వాటి వద్దకు తీసుకువెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అవి మూతపడ్డాయి. వేళలులను కూడా సక్రమంగా పాటించడం లేదు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు పశువైద్యశాలలు తెరిచి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఎక్కువ శాతం పశువైద్యశాలల్లో వేళలకు మంగళం పాడేస్తున్నారు. నిర్ణీత వేళల్లో వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి. దాంతో అనేక మంది పశుపోషకులు ప్రైవేట్ పశువైద్యులను ఆశ్రయిస్తున్నారు. 172 మంది గోపాలమిత్రులు ఉన్నప్పటికీ కృత్రిమ గర్భధారణ, ప్రాథమిక చికిత్సలకే వారు పరిమితమవుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పశువులకు సుస్తీ చేస్తే వాటి పోషకులు వైద్యం అందించేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. జిల్లాలో 118 పశువైద్యశాలలు, 103 గ్రామీణ పశువైద్యశాలలు, 9 సహాయ సంచాలకుల పశువైద్యశాలలతోపాటు జిల్లా కేంద్రంలో బహుళార్థ పశువైద్యశాల ఉంది. 9 లక్షల 70 వేల 319 గేదెలు, 74,530 ఆవులు, 14లక్షల 6 వేల 401 గొర్రెలు, 4 లక్షల 6 వేల 260 మేకలు, 9 లక్షల 73 వేల 959 కోళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ సకాలంలో వైద్యం అందించాల్సిన బాధ్యత పశుసంవర్థకశాఖపై ఉంది. పశువైద్యశాలలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడం వల్ల పశువైద్యం దూరమవుతోంది. బుధవారం నిర్వహించిన ‘న్యూస్లైన్’ పరిశీలనలో పశుపోషకులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్తోపాటు కొత్తపట్నం మండలాలున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో మెరుగైన వైద్య సేవలు అందుతూనే ఉన్నాయి. ఒంగోలు మండలంలోని సుదూర గ్రామాలకు చెందిన పశువులకు, కొత్తపట్నం మండలంలోని పశువులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదు. కందుకూరు పరిధిలో పశువులకు గాలికుంటు, బొబ్బ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వ్యాక్సిన్ వేసినప్పటికీ వ్యాధులు తగ్గకపోవడంతో వాటిపై ఆధారపడిన పోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల పశువైద్యులు సకాలంలో స్పందించడం లేదని పశుపోషకులు వాపోతున్నారు. కనిగిరి నియోజకవర్గంలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉంది. దానికి తగినట్లుగా అక్కడ గతంలో సేవలు అందించినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పశువుల, గొర్రెల మార్కెట్ యార్డులు గతంలో ఉంటే ప్రస్తుతం వాటి ఆచూకీ లేకుండా పోయింది. సంచార పశువైద్యశాల సేవలు నిలిచిపోయాయి. సీఎస్పురం మండలం నల్లమడుగుల ఉప పశువైద్యశాల వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో మూతపడింది. మార్కాపురం పరిధిలో పశువైద్య సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలోని పశువైద్యశాల మూతపడింది. మీర్జాపేట, తుమ్మలచెరువుల్లో సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తర్లుపాడుకు చెందిన పశువైద్యుడు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుండటంతో పశు పోషకులు పెదవి విరుస్తున్నారు. యర్రగొండపాలెం పరిధిలో పశువులకు సంబంధించి మందులున్నప్పటికీ వ్యాక్సిన్ సకాలంలో రావడం లేదు. తొలకరి వర్షాలకు ముందు పశువులకు వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నా వర్షాలు పడిన తరువాత వేయడం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. పుల్లలచెరువులో పశువైద్యుడు ఒక్కరే ఉన్నారు. సిబ్బంది లేరు. సంతనూతలపాడు పరిధిలో పశువులకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. చీమకుర్తిలోని పశువైద్యశాల నాలుగు సెంట్ల స్థలంలో నిర్వహిస్తున్నారు. ఆ స్థలంలోని గది నిండా దాణా, మందులతో నిండిపోతుంది. వర్షం వస్తే వాటిని కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొండపి పరిధిలోని పశువైద్యుల్లో ఎక్కువ మంది ఒంగోలు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొండపిలో పశువైద్యశాలకు భవనం లేకపోవడంతో పాల కేంద్రంలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. పొన్నలూరులో 50 గ్రామాలకు ఒక్క పశువైద్యశాల ఉంది. 25 కిలోమీటర్ల నుంచి పశువులను తీసుకురావడం కష్టతరంగా మారింది. అద్దంకి పరిధిలో పశువైద్యశాలలు పశువులకు అందుబాటులో ఉండటం లేదు. అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు పశువైద్యశాల 26 గ్రామాల పరిధిలోని పశుపోషకులు ఉపయోగించుకోవలసి వస్తోంది. వైద్యులు, సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడంతో బల్లికురవ, కొరిశపాడుల్లో ఎక్కువగా మూతపడే ఉంటున్నాయి. చీరాల పరిధిలో పశువైద్యం అంతంత మాత్రంగానే ఉంది. గవినివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉచితంగా అందించాల్సిన దాణాను అక్కడివారు విక్రయించుకుంటున్నారని పశుపోషకులు బాహాటంగా ఫిర్యాదు చేస్తున్నారు. మందులను కూడా ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారు. దాంతో ఎక్కువ మంది మందులు బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పర్చూరు పరిధిలో పశువైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. నూతలపాడు, చెరుకూరు, వీరన్నపాలెం గ్రామాల్లో పశువైద్యశాలలు ఉన్నప్పటికీ సకాలంలో వాటిని తెరవడం లేదు. పర్చూరులో పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది, పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. దర్శి పరిధిలో పశువైద్యం సక్రమంగా అందడం లేదు. కురిచేడులో 54 వేల వరకు పశువులు ఉంటే ఒక్క పశువైద్యశాల ఉంది. దాంతో ఎక్కువ మంది పశుపోషకులు వాటికి వైద్యం చేయించలేకపోతున్నారు. వ్యాధుల బారిన పడిన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొనకొండలో కూడా వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో పశువైద్య సేవలు అందించాలంటే వాటి పోషకులకు భారంగా మారింది. అర్ధవీడు మండలం వెలగలపాయలోయ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి వైద్యశాల 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం, మండల కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పశుపోషకులు ఇబ్బంది పడుతున్నారు. -
బసవన్న రంకె
చంద్రగిరి, న్యూస్లైన్: చంద్రగిరి మండలం ఆరేపల్లె రంగంపేటలో గురువారం జల్లికట్టును ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ఆవులు, ఎద్దులు, కోడెగిత్తలను గుంపులు, గుంపులుగా పరుగు లు పెట్టించారు. జోరుగా దూసుకొచ్చే కోడెగిత్తలను, ఎద్దులను నిలువరించేందుకు యువకులు గ్రూపులుగా ఏర్పడి పోటీలు పడ్డారు. చెక్కపలకలను సొంతం చేసుకునేందుకు ఎగబడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ జల్లికట్టును తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. జల్లికట్టులో భాగంగా ఎద్దులను, కోడెగిత్తల ను గుంపులుగా వదిలారు. పలకలు వాయిం చుకుంటూ పరుగులు పెట్టించారు. కోడెగిత్తలను పట్టుకుని చెక్కపలకలను సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం ప్రదర్శిం చారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు గ్రూపులుగా ఏర్పడ్డారు. జల్లికట్టులో గెలుపొందిన వారు చెక్కపలకలను చేతపట్టి విజయగర్వంతో ఊగిపోయారు. అంతకు ముందు స్థానికులు గ్రామదేవతకు పొంగళ్లు పెట్టారు. ఆ తరువాత కోడెగిత్తలను పోటీలకు సిద్ధం చేశారు. కొమ్ములు చెలిగి రంగులు వేశారు. కొమ్ములకు చెక్కపలకలు, టవళ్లను కట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జల్లికట్టును ప్రారంభించారు. రెడ్డివారిపల్లె, పుల్లయ్యగారిపల్లెలో కూడా జల్లికట్టును ఘనంగా నిర్వహించారు. ఇరువర్గాల గొడవ జల్లికట్టులో రెండు గ్రూపుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఎద్దును నిలువరించే సమయంలో తాము పట్టామంటే తాము పట్టామని గొడవకు దిగారు. చెక్కపలక కోసం కొట్టుకునే వరకు వచ్చారు. స్థానికుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇరువర్గాల వారు మళ్లీ ఉత్సాహంతో జల్లికట్టులో పాల్గొన్నారు. గట్టి బందోబస్తు జల్లికట్టులో భాగంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జల్లికట్టు చట్టవిరుద్దమం టూ ముందురోజున పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా గ్రామస్తులు ఏళ్ల తరబ డి సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్న పం డుగను నిలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రగిరి, తిరుప తి పోలీసులు, స్పెషల్ ఫోర్స్, ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.