Electronic Voting Machine (EVM)
-
జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్
-
Supreme Court of India: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలను వివరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు ఆస్కారం ఉండొద్దని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల సంతృప్తి, విశ్వాసం అనేవి చాలా ముఖ్యమని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నమోదైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులతో క్రాస్–వెరిఫికేషన్ చేయాలని కోరుతూ అసోసియేసన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏడీఆర్ తరపున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అన్నింటికీ అనుమానించవద్దని సూచించింది. పిటిషన్లపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. -
అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎం వాడరు!
ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు ఎన్నికల కోసం ఎన్నో సంస్కరణలు, మార్పులు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. ఇందులో ఈవీఎంల వాడకం అనేది టెక్నాలజీతో ముడిపడిన అంశం. ఎన్నికలొచ్చిన ప్రతీసారి చర్చనీయాంశంగా(రాజకీయ విమర్శలకు సైతం వేదిక) మారుతుంటుంది కూడా. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ఈవీఎంలనే ఉపయోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. మరి.. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలు ఎందుకు వాడటం లేదు?. బ్యాలెట్ పేపర్ విధానంతోనే రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు జరుగుతుందసలు?.. ముందుగా ఈవీఎం టెక్నాలజీ సంగతి చూద్దాం. ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు.. దాని పక్కనే సంబంధిత బటన్ ఉంటుంది. ఓటర్లు నచ్చిన అభ్యర్థి బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న సాఫ్ట్ వేర్ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని కౌంటింగ్ రోజున క్షణాల్లో చూపించేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి... దీని పోలింగ్ విధానం అలగ్ ఉంటుంది. ఈవీఎంలు ఎంత మాత్రం సరిపోవు. ఎందుకంటే.. ఓటు వేసే వారికి కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనే నిబంధన ఇక్కడ వర్తించదు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు తమ ఛాయిస్ ఆధారంగా ప్రిఫరెన్సియల్ ఓట్లు వేసే ఛాన్స్ ఉంది. ప్రాధాన్యతల ఆధారంగా, వారి ఇష్టానుసారం ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటర్లు ఓటేయొచ్చు. చివరికి.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఓట్లు పడ్డాయనే ఆధారంగా విజేతను ప్రకటిస్తారు!. బ్యాలెట్ పేపర్లోని కాలమ్ 2 లో ఓటర్ ఇష్టాన్ని బట్టి ఒకటి.. రెండు.. మూడు.. ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. అందువల్లే రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తారు. మరి ఈవీఎంలలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా. ఈ కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. -
‘ఈవీఎంల్లో గోల్మాల్ ’
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలు మోసపూరితమైనవని, ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల్లో 30 శాతం ఈవీఎంల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పనిచేయని ఈవీఎంల స్ధానంలో మార్చిన ఈవీఎంలను ఏ ఒక్కరూ పరీక్షించలేదని అన్నారు. ఆ ఈవీఎంల్లో మాక్ పోలింగ్ కూడా నిర్వహించకపోవడంతో ఈవీఎంల్లో ఓట్లు ముందస్తుంగా నిక్షిప్తం కాలేదని చెప్పేందుకు ఆధారాలు ఏంటని ఆమె ప్రశ్నించారు. తాము ఈసీని కలిసి పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని కోరతామని దీదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ పత్రాలను ప్రవేశపెట్టాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. బెంగాల్ను గుజరాత్గా మార్చాలనే ప్రయత్నాలను నిలువరిస్తామని, ఈ ఎన్నికలు మోసపూరిత ఎన్నికలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. -
మాతో పెట్టుకుంటే మసే
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారని హెచ్చరించారు. రంజాన్(ఈద్–ఉల్–ఫితర్) సందర్భంగా కోల్కతాలోని రెడ్ రోడ్డులో ప్రార్థనలకు హాజరైన 25,000 మందికిపైగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మాతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారు.. ఇకపై ఇదే మా నినాదం. బీజేపీ మతాన్ని రాజకీయం చేస్తోంది. హిందువులు త్యాగానికి ప్రతీకలు. ముస్లింలు ఇమాన్(సత్యప్రియత)కు, క్రైస్తవులు ప్రేమకు, సిక్కులు బలిదానానికి ప్రతీకలు. మనమంతా ప్రేమించే భారతదేశం ఇదే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుంటాం’ అని మమత తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. కొన్నిసార్లు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ కొంతసేపటికే అది తగ్గిపోతుంది. ఈవీఎంల సాయంతో వాళ్లు(బీజేపీ) ఎంతత్వరగా అధికారంలోకి వచ్చారో, అంతేత్వరగా తెరమరుగైపోతారు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముస్లింలకు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి, సీఎం మమత రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. -
ఆ నోటా ఈ నోటా
ఈవీఎంలో ఒక ఆప్షన్ ఉంటుంది. అదే నోటా... పైన తెలిపిన ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు (నన్–ఆఫ్–ది ఎబవ్) అని తేల్చి చెప్పడమే ఈ నోటా అర్థం. 2014లో నోటా ఓట్ శాతం ఎంత ఉందో... 2019లోనూ ఆ శాతం దాదాపు అదే విధంగా ఉండడం ఇక్కడ గమనార్హం. ఎన్నికల సంఘం వెబ్సైట్ అందించిన గణాంకాల ప్రకారం... సంబంధిత అంశాన్ని క్లుప్తంగా చూస్తే... ► 2019లో పోలైన మొత్తం ఓట్లలో నోటా శాతం 1.04% . 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ శాతం 1.08% . లోక్సభ ఎన్నికల చరిత్రలోనే 2019లో అత్యధిక ఓట్లశాతం నమోదయిన సంగతి తెలిసిందే. ► ఈ నోటారాష్ట్రాల వారీగా చూస్తే, నోటా శాతాల్లో తీవ్ర వ్యత్యాసం ఉండడం మరో విశేషం. అస్సాం, బిహార్లలో అత్యధికంగా 2.08% నోటా ఓటు నమోదయ్యింది. సిక్కింలో ఈ శాతం 0.65 శాతంగా ఉంది. ► ఈ నోటాపీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన ఒక తీర్పు నేపథ్యంలో దేశంలో నోటా విధానం ఆరంభమైంది. ► ఈ నోటాఛత్తీస్గఢ్, మిజోరం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా వినియోగం ప్రారంభమైంది. అప్పట్లో ఆయా రాష్ట్రాల్లో నోటా ఓటు 1.85 శాతంగా ఉంది. -
ఇండియన్ ఈవీఎంల ట్యాంపరింగ్ కష్టం
వాషింగ్టన్: భారత్లో ఉపయోగిస్తున్న ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం చాలా కష్టమని ప్రముఖ అమెరికన్ నిపుణుడు గెల్బ్ పేర్కొన్నారు. ఈ ఈవీఎంలు ఆఫ్లైన్లో పనిచేయడం వల్ల స్వతంత్ర యూనిట్లుగా ఉంటాయని తెలిపారు. ‘భారత్లో వాడుతున్న ఈవీఎంలలో ఉపయోగించిన సాంకేతికత నమ్మదగినదని నేను చేసిన అధ్యయనంలో స్పష్టమైంది. ఏ టెక్నాలజీ నిర్దిష్టమైనది కాదు. కానీ భారత్లో వాడుతున్న ఈవీఎంలు ఆఫ్లైన్లో పనిచేస్తున్నాయి. అందుకే వాటిని నేరుగా మాత్రమే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. మరో విధంగా చేయలేం’అని పేర్కొన్నారు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలను మాస్ ట్యాంపరింగ్ చేయడం కష్టమని తాను చేసిన పరిశోధనల్లో తేలిందని గెల్బ్ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక స్వతంత్ర ఎలక్ట్రానిక్ పరికరమని, ఇతర దేశాల్లో ఓటు వేసే విధానాలకు ఇది భిన్నంగా ఉంటుందని గెల్బ్ అన్నా రు. ఈవీఎంలను పరిశీలించకుండా, ఒక సమన్వయ ప్రాతిపదిక లేకుండా ట్యాంపరింగ్ చేయడం కష్టమన్నారు. అంతేకాకుండా వీవీప్యాట్ల వల్ల ఎన్నికల్లో విశ్వసనీయత, వాస్తవికత ఉంటుందన్నారు. -
జనాదేశం శిరోధార్యం
ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం జరిగినంత భీకరంగా, అనాగరికంగా, అరాచకంగా, అడ్డ గోలుగా మునుపెన్నడూ జరగలేదు. ప్రజల సమస్యలపైన చర్చించకుండా, ఐదేళ్ళలో ప్రభుత్వ సాఫల్యవైఫల్యాలను సమీక్షించకుండా మతంపైనా, కులంపైనా, పాకిస్తాన్పైనా, సరిహద్దు యుద్ధం పైనా, రఫేల్ యుద్ధవిమానాలపైనా ఆరోపణలూ, ప్రత్యారోపణలతో ప్రచారపర్వం ప్రచండ మారుతం వలె సాగింది. రాజకీయ ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకున్నాయి. నైతిక విలువలు పాతాళానికి దిగజారాయి. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్లు సర్వశక్తులూ ఒడ్డి చావోరేవో అన్న విధంగా ప్రచారం చేశాయి. ఈ ఎన్నికలను అధ్యక్ష తరహా ఎన్నికలుగా మార్చడంలో బీజేపీ విజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలమా, వ్యతిరేకమా అన్నట్టు ఒక రెఫ రెండం మాదిరి జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడి కానున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 11న జరిగితే ఏడవ, తుది దశ పోలింగ్ మే 19న నిర్వహించారు. ఫలితాల కోసం 42 రోజుల నిరీక్షణ నేటితో ముగుస్తున్నది. ఎగ్జిట్పోల్స్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వెల్లడించినప్పటికీ ఓట్లు లెక్కపెట్టేవరకూ ఓటమిని అంగీకరించేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. యుద్ధంలో, ప్రేమలో ఏదైనా చెల్లుబాటు అవుతుందంటారు. ఎన్నికల పోరాటంలోనూ మాటల ఈటెలు ప్రత్యర్థులను వేధించడం సహజం. ఒక వైపు ఎన్నికల సంఘం, మరో వైపు సర్వో న్నత న్యాయస్థానం హద్దులు చూపుతున్నప్పటికీ ఎన్నికల పూనకంలో నాయకులు సకల మర్యాద లనూ మంటగలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పైన 22 ప్రతిపక్షాలు దాడి చేయడం, సుప్రీంకోర్టు హితవు చెప్పినా వినకుండా ఎన్నికల సంఘానికి పదేపదే వినతిపత్రాలను సమర్పించడం ప్రహసనసదృశంగా సాగింది. ఓడినవారూ, ఓడిపోతామని భయపడేవారు మాత్రమే ఈవీఎంలను తప్పుపడతారనీ, విజేతలు ఈవీఎంల గురించి ఫిర్యాదు చేయరని అనడానికీ ఢిల్లీలో మొన్నటి వరకూ జరిగిన రభసే కారణం. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్స్ (స్లిప్పుల)ను కూడా లెక్కించాలంటూ ప్రతిపక్షాలు చేసిన వాదనను సుప్రీంకోర్టు, ఈసీ తిరస్కరించాయి. 2014లో ఇదే ఈవీఎంల పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. నిరుడు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో గెలుపొంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈవీఎంలపైన ఫిర్యాదు చేయలేదు. ఈసారి ఓటమి అనివార్యమని ముందే తెలుసుకున్న చంద్రబాబు అదే పనిగా జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈవీఎంలను ఒక భయంకర సమ స్యగా భూతద్దంలో చూపించి హడావుడి చేశారు. ఓడిపోతామని ముందే తెలుసుకున్నవారు ఈవీ ఎంలతోపాటు ఎగ్జిట్పోల్స్ని కూడా విశ్వసించరు. గెలిచినప్పుడు ఈవీఎంలను ఒప్పుకుంటూ, ఓడినప్పుడు వాటిని తప్పుపడుతూ మాట్లాడే రాజకీయ నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వ నక్కరలేదు. 50 శాతం వీవీప్యాట్స్ను లెక్కించాలంటూ అర్థం లేని డిమాండ్లు పెట్టిన ప్రతిపక్షాల ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించడం ముమ్మాటికీ సమంజసమే. ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉంటారనీ, ముగ్గురికీ సమానాధికారాలు ఉంటాయనీ, మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలనీ రాజ్యాంగంలోని 324 అధికరణలోని రెండో క్లాజ్ స్పష్టం చేస్తున్నది. ఈ ఎన్నికలలో ఎన్నికల సంఘం సభ్యులకు కొన్ని అంశాలపైన ఏకాభిప్రాయం లేదని వెల్లడైంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో మోదీ నియమావళికి విరుద్ధంగా మాట్లాడా రంటూ కాంగ్రెస్పార్టీ చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ప్రధానికి ‘క్లీన్చిట్’ ఇవ్వడాన్ని ఎన్నికల కమిష నర్ అశోక్ లావాసా వ్యతిరేకించారు. తన అభ్యంతరాలను నమోదు చేయాలనీ, బహిర్గతం చేయా లని లావాసా పట్టుపడుతున్నారు. బహిర్గతం చేయనవసరం లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా అనడం వివాదాస్పదమైంది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించవలసిన ఎన్నికల సంఘం దాపరికం పాటించడంలో అర్థం లేదు. నియమావళిని ఉల్లంఘించిన రాజకీయ నేతలు ఒకటి, రెండు, మూడు రోజులపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ ఎన్నికల సంఘం శిక్షాత్మక చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం. ఇందుకు సుప్రీంకోర్టు దన్ను ఉంది. ఎన్నికల సంఘం క్రమంగా రూపుదిద్దుకుంటున్న సంస్థ. నిష్పక్షపాతంగా, న్యాయంగా, ధర్మంగా ఎన్నికలు నిర్వహించడమే కాకుండా సూత్రబద్ధంగా నిర్వహిస్తున్నట్టు ప్రజలకు విశ్వాసం కలిగించడమే ఈ సంఘం కర్తవ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రధానమైనది. ఈ వ్యవస్థపైన ప్రజలు విశ్వాసం కోల్పోతే భారత ప్రజాస్వామ్య దుర్గం బీటలువారుతుంది. ఎన్నికల ప్రచారంలో పెడ ధోరణులు ప్రబలి మతసామరస్యానికీ, సౌభ్రాతృత్వానికీ, సంస్కారానికీ భంగం కలిగే విధంగా రాజకీయ నాయకుల ప్రసంగాలు సాగాయి. ఎన్నికలలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా గెలుపోటములను సమభావంతో స్వీకరించాలనీ, ఆటలో అరటి పండుగా పరిగణించాలనీ, ఎన్నికలలో పాల్గొనడమే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమనే స్ఫూర్తితో వ్యవహరించాలనీ అందరూ గ్రహిం చాలి. రాజీవ్గాంధీ అత్యంత అవినీతిపరుడుగా తనువు చాలించాడు అని ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తిన మోదీ రాజీవ్ 27వ వర్ధంతి సందర్భంగా మాజీ ప్రధానికి నివాళులు చెప్పడం సంస్కారం అనిపించుకుంటుంది. కానీ, కాస్త కృతకంగా కూడా కనిపిస్తుంది. అందుకే ఉన్నత పదవులలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి. దివంగత నాయకులపైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎన్నికల ప్రక్రియ ఆఖరి ఘట్టంలో ప్రవేశించిన కారణంగా ఎన్నికల ప్రచారంలో సృష్టిం చిన విభేదాలను తొలగించడానికీ, అగాధాలను పూడ్చడానికీ రాజకీయ పార్టీలన్నీ శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. భారతదేశ సమైక్యతకూ, సమగ్రతకూ భంగం కలిగించే ధోరణులను విడ నాడాలి. వైషమ్యాలకు స్వస్తి చెప్పాలి. ప్రజలతీర్పును అన్ని పార్టీలూ శిరసావహించాలి. ప్రజలు నిర్దేశించిన పాత్రను రాజకీయ నాయకులు వినమ్రంగా పోషించాలి. -
‘ఓటమి నైరాశ్యంతోనే ఈవీఎంలపై వివాదం’
సాక్షి, న్యూఢిల్లీ : ఓటమి తప్పదనే నిరాశతోనే విపక్షాలు వీవీప్యాట్లపై రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, ఎల్జేపీ చీఫ్ రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. ఈవీఎంలపై విపక్షాలు గగ్గోలు పెట్టడం వారి ఓటమికి సంకేతమని ఎద్దేవా చేశారు. ఓటమికి చేరువైనప్పుడు విపక్షాలు ఈవీఎంలపై ఫిర్యాదు చేస్తాయని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ఈవీఎంలను వ్యతిరేకిస్తున్న వారు ఎన్నికలను అర్ధ, అంగబలం శాసించే పాత రోజులకు దేశాన్నితీసుకువెళుతున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఇప్పటికే ఈవీఎం, వీవీప్యాటర్లపై విస్పష్ట ఉత్తర్వులు ఇచ్చినా ఓటమి భయంతో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పాశ్వాన్ మండిపడ్డారు. విపక్షాలు గెలిస్తే ఈవీఎంలు సరిగా పనిచేసినట్టు, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తారుమారు చేసినట్టు గగ్గోలు పెట్టే వైఖరి రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రక్రియకు చేటు అని వ్యాఖ్యానించారు. కాగా ఎన్డీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ముందుకొస్తారని ఆయన సంకేతాలు పంపారు. చిరాగ్ పాశ్వాన్కు కేంద్ర మంత్రి కాగల సామర్ధ్యాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఏపీలో మధ్యాహ్నం 2గంటలకు తొలి ఫలితం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ ట్రెండ్ తెలిసిపోతుందని, రేపు అర్థరాత్రికి మొత్తం ఫలితాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీ ప్యాట్లు లెక్కిస్తామని, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ తర్వాత రీ పోలింగ్ జరిగే అవకాశం చాలా తక్కువ అని ద్వివేది అభిప్రాయపడ్డారు. కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, పాదర్శకంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుందని ద్వివేది తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని, అసెంబ్లీ, లోక్సభకు వేర్వేరుగా పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. అలాగే అసెంబ్లీ, లోక్సభకు వేర్వేరుగా లాటరీలు తీసి వీవీ ప్యాట్లు లెక్కిస్తామన్నారు. ఫలితాలను సరిచూసుకోవడానికి వీవీ ప్యాట్ల స్లిప్పులు ఉపయోగించనున్నట్లు ద్వివేది తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, 100 మీటర్ల దూరం నుంచి వాహనాలకు అనుమతి లేదని, సుమారు 25వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సువిధ యాప్,ఈసీఐ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని ద్వివేది తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓట్లను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం నిర్వహించి ఫలితాలను వెనువెంటనే వెల్లడించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు ఎక్కడ ఫలితాలను తారుమారు చేస్తాయేమో అన్న ఆందోళన ప్రతిపక్ష పార్టీలను పట్టుకు పీకుతోంది. ఆ పార్టీలు గత కొన్నేళ్లుగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వాటిని పాలకపక్షం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందంటూ గొడవ చేస్తూనే ఉన్నాయి. అసలు ట్యాంపరింగ్ అంటే ఏమిటీ? అందుకు నిజంగా అవకాశాలు ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటివి? వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈవీఎంలు అంటే ఏమిటీ ? అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈవీఎంలు అంటే... భారత పార్లమెంట్కు, రాష్ట్ర అసెంబ్లీలకు గతంలో బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరిగేవి. అది సుదీర్ఘమైన ప్రహసనం. ఓట్లు లెక్కించి పూర్తి ఫలితాలు ప్రకటించేందుకు రెండు రోజులు కూడా పట్టేది. మందీ మార్బలంతో పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకొని రిగ్గింగ్కు పాల్పడే అవకాశం కూడా ఉండేది. ఆ ఎన్నికల ప్రక్రియ స్థానంలో ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లు వచ్చాయి. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగాన్ని ‘కంట్రోల్ యునిట్’గా వ్యవహరిస్తారు. ఈ యునిట్ ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి వద్ద ఉంటుంది. ఈ యునిట్ ప్రతి ఓటును లెక్కించి తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇది కరెంట్ఫై ఆధారపడకుండా బ్యాటరీపైనే నడుస్తుంది. ఇక రెండో విభాగాన్ని ‘బ్యాలెటింగ్ యునిట్’ అంటారు. వీటిపై అభ్యర్థుల పేర్లు, వారి పార్టీ గుర్తులుగల బటన్లతో ఓ ప్యానెల్ ఉంటుంది. ఈసారి అభ్యర్థుల ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు. ఈవీఎం ప్యానల్పైనున్న బటన్ను నొక్కి ఓటు వేయడం మూడవ విభాగం. ఓటరు ఏదైనా బటన్ను నొక్కినప్పుడు ఆ బటన్పైనున్న అభ్యర్థి పేరిట ఓటు పడుతుంది. ఇప్పుడు ఓటరు తానేసిన ఓటు ఎవరికి పడిందో తెలుసుకునేందుకు వీలుగా ‘వీవీపీఏటీఎం’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓటరు బటన్ను నొక్కగానే దానికి అనుసంధానించిన మరో యంత్రం స్క్రీన్ మీద ఆ ఓటు ఎవరికి పడిందో తెలియజేసే ఓ కాగితం ఏడు సెకడ్లపాటు కనిపిస్తుంది. ఆ తర్వాత అది యంత్రం లోపలి బాక్సులో పడిపోతుంది. ఈ మరో యంత్రాన్నే ‘వోటర్ వెరీఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషీన్ (వీవీపీఏటీఎం)’ అని వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత తనిఖీ చేసినప్పుడు ఈవీఎం మొదటి యునిట్లో నిక్షిప్తమైన డేటాతో వీవీపీఏటీఎంలో పడిన స్లిప్పులతో సరిపోవాలి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చా? ఓటింగ్ జరిగినప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైన డేటాను తారుమారు లేదా తలకిందులు చేయడాన్ని ట్యాంపరింగ్గా పేర్కొనవచ్చు. అంటే ఓడిపోయిన అభ్యర్థిని గెలిచినట్లుగా, గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లుగా చూపడం. ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. ఇంటర్నెట్ ద్వారా డేటాను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కనుకనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. అయినా ట్యాంపరింగ్ చేయాలంటే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి భౌతికంగా ఈవీఎంలను చేతుల్లోకి తీసుకొని అనుకూలంగా ట్యాంపర్ చేయవచ్చు. అసలు ఓటరుకు బదులు ఇతరులు బటన్ నొక్కి ఓటు వేయవచ్చు. ఎన్నికల సిబ్బంది, సీసీటీవీ కెమేరాలు, వివిధ పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో ఉంటారు కనుక అలా చేయడం అసాధ్యం. ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీల్చేసి గట్టి సెక్యూరిటీ మధ్య వాటిని నిల్వచేసే ‘స్ట్రాంగ్ రూమ్’లకు పంపిస్తారు. మరి ఎలా ట్యాంపర్ చేయవచ్చు? ఈవీఎంలను తరలించే క్రమంలోగానీ, వాటిని స్ట్రాంగ్ రూముల్లో నిల్వ చేసినప్పుడుగానీ వాటిని తస్కరించి వాటి స్థానంలో ముందుగా ట్యాంపరింగ్ చేసిన ఈవీఎంలను ఏర్పాటు చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయవచ్చు. స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్లే ఈవీఎంలకు నెంబర్లు, దానికి ఎన్నికల అధికారుల సంతకాలతో కూడిన సీలింగ్ ఉంటుంది. ఓట్లను లెక్కించే సమయంలో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. అక్రమాలకు పాల్పడాలంటే సంతకాల ఫోర్జరీ, సీల్ సరిపోవాలి. పైగా పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ వరకు గట్టి భద్రత మధ్య వాటిని తరలించడమే కాకుండా అడుగడుగున వాటిపై నిఘా ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల కమిషన్ నియమించిన ‘మైక్రో’ పరిశీలకులు సహా పలు రకాల పరిశీలకులు, వీడియో గ్రాఫర్లు తోడుగా ఉంటారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద అభ్యర్థి తాలూకు వ్యక్తి ఒకరు 24 గంటలపాటు కాపలా ఉండేందుకు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పిస్తోంది. కనుక అదంతా ఈజీ కాదు. పాలకపక్షాలకు అవకాశం ఉంటుందా? స్ట్రాంగ్రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను మార్చే అవకాశం పాలకపక్షాలకు ఉంటుందనేది అన్ని ప్రతిపక్షాల ఆరోపణ. పాలకపక్షం తలచుకుంటే ముందస్తు ప్రణాళికతో ఈవీఎంల నెంబర్లను, ఎన్నికల అధికారులు సూచించే కోడ్లను ముందే తెలుసుకోవచ్చు. అప్పుడు భద్రతా సిబ్బందిని, పలు అభ్యర్థుల నిఘాపరులను ప్రలోభపెట్టి ఈవీఎంలను తారుమారు చేయవచ్చు. అందుకు ఎన్నికల కమిషన్, పోలింగ్ నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది, పార్టీల ఏజెంట్లు కుమ్మక్కు కావాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం. అన్నింటికన్నా ముఖ్యం ఎన్నికలను తారుమారు చేయాలనుకునే వ్యక్తుల వద్ద ఈవీఎంలు ఉండాలి. వాటిని సాధించడం కూడా అంత సులభం కాదు. ఈవీఎంల తయారు చేసే చోటే జరగవచ్చా? ఈవీఎంలను తయారు చేసే చోటే వాటిని ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉంది. ఒకరికి ఓటు వేసేందుకు బటన్ను నొక్కితే మరొకరికి వెళుతుందంటూ ప్రత్యక్షంగా ఈవీఎంలను సవాల్ చేసినవాళ్లు ఉన్నారు. దేశంలో రెండు ప్రభుత్వరంగ సంస్థలు (ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్) మాత్రమే వీటిని తయారు చేస్తున్నాయి. వాటిని తయారు చేస్తున్న ఇంజనీర్లను పట్టుకొని తయారీలోనే ట్యాంపరింగ్ చేయవచ్చు. వాళ్లు తయారు చేసిన ఈవీఎంలు దేశంలో ఏ ప్రాంతానికి వెళతాయో వారికే కాదు. కంపెనీ యజమానులకు కూడా తెలిసే అవకాశం లేదు. నామినేషన్ల గట్టం పూర్తయ్యే వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు, ఎంత మంది నిలబడతారో తెలియదు. అలాంటప్పుడు ముందుగా ట్యాంపరింగ్ చేయడం కూడా సాధ్యం కాదు. వీడియోల్లో కనిపించే ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లోకి వెళ్లాల్సిన ఈవీఎంలు దారితప్పాయంటూ మనం పలు వీడియోలను సాక్షంగా చూస్తుంటాం. ఆ ఈవీఎంలు అత్యవసరం కోసం అందుబాటులో ఉంచిన అదనపు లేదా మొరాయించిన ఈవీఎంలని ఎన్నికల కమిషన్ వర్గాలే స్పష్టం చేశాయి. ఎన్నికల మార్గదర్శక సూత్రాల ప్రకారం అదనపు లేదా మొరాయించిన ఈవీఎంలను కూడా గట్టి భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లోకి తరలించాలి. ఈ విషయంలో ఈసీ వర్గాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయో అర్థం కాదు. ఈవీఎంలను మార్చడం సాధ్యం కాదు కనుక వాటిని ఎత్తుకు పోవచ్చు. యూపీ, బీహార్, పంజాబ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షల ఈవీఎంలు గల్లంతయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాటిలో నిజానిజాలను ఈసీ వర్గాలే తేల్చాలి. వీవీపీటీఎం పద్ధతే మంచిది ఈవీఎంలలో ఓట్లతోపాటు వీవీపీటీఎంలను లెక్కించడం ద్వారా అవకతవకలను సులభంగానే కనిపెట్టవచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ కేంద్రానికి మాత్రమే దీన్ని పరిమితం చేస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొనగా, సుప్రీం కోర్టు ఆ సంఖ్యను ఐదింటికి పెంచింది. ఈ సంఖ్యను 33 నుంచి 50 వరకు పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
‘నేను ఓడితే ఈవీఎంలు టాంపరైనట్లే’
లక్నో: ఈ ఎన్నికల్లో తాను మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించకపోతే ఈవీఎంల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లేనని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) రాంపూర్ లోక్సభ అభ్యర్థి అజంఖాన్ అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తనకే మద్దతుగా నిలిచారని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తాన ఓడిపోతే దానికి కారణం ఈవీఎంల టాంపరింగేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితాలకు ఆయన ఒక్కరోజు ముందు ఈయన ఈవ్యాఖ్యల చేశారు. కాగా వీవీప్యాట్లు,ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు ఇదివరకే తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈవీఎంలను టాపరింగ్ చేయడం అసాధ్యమని ఈసీ తేల్చిచెప్పింది. కాగా తాము ఓడిపోతే దానికి ఈవీంలే కారణమంటూ ఇటీవల బీస్పీకి చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈవీఎంలపై అజంఖాన్ చేసిన వ్యాఖ్యలను యూపీ బీజేపీ శాఖ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిప్డడారు. కాగా ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అజంఖాన్ ఇప్పటికే ఈసీ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. రాంపూర్లో బీజేపీ నుంచి పోటీచేస్తున్న జయప్రదపై పలుమార్లు నోరుజారి వివాదాస్పదంగా నిలిచారు. -
‘100% వీవీప్యాట్’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఓట్లు లెక్కింపులో దేశమంతటా వంద శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి, వాటిని ఈవీఎంలతో సరిపోల్చాలని కోరుతూ వచ్చిన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం ఆర్ షాల ధర్మాసనం తాజాగా గుర్తుచేసింది. చెన్నైకి చెందిన ‘టెక్4ఆల్’ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. సీజేఐ ఇచ్చిన ఆదేశాలను తాము మార్చలేమనీ, ఈ పిటిషన్ వేయడం అర్థంలేని పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ 21 ప్రతిపక్ష పార్టీలు పిటిషన్ వేయగా, మే 7న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు నిరాకరించడం తెలిసిందే. ఈవీఎంల ద్వారా మోసం సాధ్యం కాదు ఈవీఎంల ద్వారా మోసం చేయడం, వాటిని ట్యాంపర్ చేయడం పూర్తిగా అసాధ్యమని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రణవీర్ సింగ్ చెప్పారు. ఈవీఎంలు పారదర్శకమైనవని ఆయన పేర్కొన్నారు. ‘ఈవీఎంల డిజైన్ దృఢంగా ఉంటుంది. వాటిని ట్యాంపర్ చేయడం, హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వాటికి బయటి నెట్వర్క్తో కనెక్టివిటీ ఉండదు. ఈవీఎంలకు ఇంటర్నెట్, వైఫై, బ్లూటూత్ వంటివి ఏవీ ఉండవు. కేవలం ప్రోగ్రామింగ్ చిప్ మాత్రమే ఉంటుంది. ప్రోగ్రామ్ను ఎవరైనా మార్చాలని చూస్తే ఈవీఎం తీవ్రంగా వైబ్రేట్ అయ్యి, స్విచ్ఛాఫ్ అయ్యి ఇక పనిచేయకుండా పోతుంది’ అని సింగ్ వివరించారు. ‘పరిశీలకుల’ పిటిషన్ విచారణకు నో లోక్సభ ఎన్నికల సందర్భంగా బెంగాల్లో ఎన్నికల పరిశీలకులుగా ఇద్దరు పదవీ విరమణ పొందిన ప్రభుత్వం ఉద్యోగుల నియామకాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ల్లో కేంద్ర పోలీస్ పరిశీలకుడిగా వివేక్ దుబేను, అలాగే పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక పరిశీలకుడిగా అజయ్ నాయక్లను నియమించారు. వారిద్దరినీ చట్ట విరుద్ధంగా నియమించారని, దీంతో ఎన్నికల సమయంలో కొన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశముందని పిటిషన్ పేర్కొంది. ‘ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆర్టికల్ 32 ప్రకారం ఈ పిటిషన్పై మేం ఎలాంటి విచారణ చేపట్టలేం’ అని కోర్టు పేర్కొంది. -
ఈవీఎంలపై ఫిర్యాదులకు ఈసీ హెల్ప్లైన్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై వచ్చే ఫిర్యాదులపై స్పందించేందుకు 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్రూమ్ను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో ఉపయోగించిన అసలైన ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని స్ట్రాంగ్ రూమ్ల్లో పెట్టి, వాటిలోని ఓట్లనే లెక్కించనున్నారన్న ఆరోపణలు రావడం, అవన్నీ అవాస్తవాలేనని ఈసీ మంగళవారం కొట్టిపారేయడం తెలిసిందే. అయితే స్ట్రాంగ్ రూమ్ల్లో ఈవీఎంలను భద్రపరిచిన తీరు, స్ట్రాంగ్ రూమ్లకు కల్పించిన భద్రత, స్ట్రాంగ్ రూమ్ల వద్ద తమ ఏజెంట్లను నియమించేందుకు అభ్యర్థులకు అనుమతి, ఆ పరిసరాలపై సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టడం, ఈవీఎంల తరలింపు సహా ఈవీఎంలకు సంబంధించిన ఏ సమస్యలపైనైనా ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ వెల్లడించింది. ఈ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఐదు లైన్లతో హెల్ప్లైన్ను ఏర్పాటు చేశామనీ, ఫిర్యాదుదారులు 011–23052123 నంబర్కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని ఈసీ తెలిపింది. -
ఊహాగానాలకు ఈసీ తెరదించాలి
లక్నో, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపునకు మరో రెండురోజులు కూడా సమయంలేని నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు మంగళవారం రాజకీయంగా దుమారం సృష్టించాయి. దీనిపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల తీర్పు తారుమారు వార్తలు తనను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు యంత్రాల (ఈవీఎంలు)ను చుట్టుముట్టిన ఊహాగానాలన్నిటికీ తెరదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పైనే ఉందని ఆయన చెప్పారు. తమ అధీనంలో ఉన్న ఈవీఎంలకు రక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ దిగ్గజ నేత కూడా అయిన ప్రణబ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రజా తీర్పు చాలా పవిత్రమైనదని, అది ఏ అతి చిన్న సందేహానికీ తావివ్వనంత ఉన్నతంగా ఉండాలని అన్నారు. ఎన్నికలు సమర్ధంగా నిర్వహించినందుకు ఈసీని ప్రణబ్ సోమవారం అభినందించిన సంగతి తెలిసిందే. విపక్షాల ఆందోళన ఈవీఎంల తరలింపు, ట్యాంపరింగ్ ఆరోపణల సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం నిరసన ప్రదర్శనలకు దారితీసింది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంల తరలింపు ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈసీ తక్షణమే సరైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడాన్ని బీజేపీ ఖండించింది. మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటర్లు తీర్పు ఇచ్చిన పక్షంలో, ఓటమిని హుందాగా అంగీకరించాలని కోరింది. ఘాటుగా స్పందించిన ఈసీ పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంల స్థానంలో వేరే ఈవీఎంలను ఉంచుతున్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించింది. అవన్నీ తప్పుడు, పనికిమాలిన, నిరాధార ఆరోపణలుగా పేర్కొంది. ఏడు విడతల్లో వినియోగించిన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూముల్లో అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపింది. టీవీలు, సోషల్ మీడియాల్లో చూపిస్తున్న దృశ్యాలకు, పోలింగ్ సందర్భంగా వినియోగించిన ఈవీఎంలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారం చేపట్టనుందని దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఈసీతో ముగిసిన విపక్ష నేతల భేటీ
-
ఈసీతో విపక్ష నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)తో 22 విపక్ష పార్టీలు మంగళవారం సమావేశమయ్యాయి. కౌంటింగ్కు ముందుగా ఈవీఎంల్లో పోలైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని కోరాయి. ఒక్కో నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిపులను ముందుగా లెక్కించి అవి సరిపోలితే, మిగిలిన అన్ని కేంద్రాల్లో కేవలం ఈవీఎంలను లెక్కించి గెలుపోటములను నిర్ధారించవచ్చని సూచించాయి. ఈవీఎంలోని ఓట్ల సంఖ్యకు, వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యకు తేడా ఉంటే ఆ నియోజకవర్గంలోని మిగిలిన అన్ని పోలింగ్ కేంద్రాల్లోని అన్ని ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిగా లెక్కించాలని విపక్ష నేతలు ఈసీకి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. సంక్లిష్ట సందర్భాల్లో రిటర్నింగ్ అధికారి ఎలా వ్యవహరించాలో ఈసీ గైడ్లైన్స్ ఇవ్వాలని కోరారు. ముందుగా వీవీప్యాట్లు లెక్కించిన తర్వాతే ఫలితం ప్రకటించాలని అన్నారు. ఫామ్ 17సీని కౌంటింగ్ ఏజెంట్లు, లెక్కింపు కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు అనుమతించాలని, రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా చర్యలు తీసుకోరాదని కోరారు. కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఈసీతో ముగిసిన విపక్ష నేతల భేటీ -
‘ఈవీఎంలపై ఈసీ మౌనం’
సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంల అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నా ఈసీ మౌనంగా వ్యవహరించడం ఆవేదన కలిగిస్తోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈవీఎంలపై పలు సందేహాలు వెల్లడవుతున్నా ఈసీ వివరణ ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం తర్వాత ఎగ్జిట్ పోల్స్ను వ్యూహాత్మకంగా వెల్లడించడం చూస్తుంటే మరో బాలాకోట్ తతంగాన్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తోందని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా సార్వత్రిక సమరంలో బీజేపీ గెలుపొంది మళ్లీ అధికారంలోకి వచ్చినా మంచి కోసం ప్రజలు జరిపే పోరాటం ఆగరాదని అన్నారు. బీజేపీ గెలుపు ఓటములతో ప్రపంచంఆగిపోదని, వ్యవస్ధలను నిర్వీర్యం చేయడం, సమగ్రతను దెబ్బతీయడం వంటి విపరిణామాలకు వ్యతిరేకంగా సమాజం, జర్నలిస్టులు నిబద్ధతతోనిలబడి పోరాటం కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు. -
వందశాతం వీవీప్యాట్లు లెక్కింపు: సుప్రీంలో చుక్కెదురు
సాక్షి,న్యూఢిల్లీ: 100శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న డిమాండ్కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వందశాతం వీవీప్యాట్లను లెక్కించాలని దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. టెక్నోపర్ ఆప్ అనే సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని వెకేషణ్ బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, ఇది న్యూసెన్స్ పిటిషన్ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఎన్డీయేతర 21 విపక్ష పార్టీల నాయకులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్లనే మొదట లెక్కించి తర్వాత ఈవీఎంలను లెక్కించాలని.. ఈవీఎం, వీవీప్యాట్లలో నమోదైన ఓట్ల మధ్య తేడాలుంటే నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా వీవీప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు ఇదివరకే ఎదురుదెబ్బ తగిలిన విషయంతెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల) ఫలితాలతో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ స్లిప్(వీవీప్యాట్)లను సరిపోల్చాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం ఇదివరకే తోసిపుచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏవేని 5 పోలింగ్ బూత్లలోని ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన తాము వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని ఇదివరకే సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. -
వీవీ ప్యాట్లన్నీ లెక్కించాలి
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) ఫ్రీక్వెన్సీ మార్చే అవకాశం ఉందని అన్నిచోట్లా చెబుతున్నారని, తాను ఢిల్లీ వెళితే దీనిపైనే చర్చిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈవీఎంలు, సెల్ఫోన్లు తయారు చేసే ప్రోగ్రామర్ ఒక్కరేనని, వారి కంట్రోల్లోనే అంతా జరుగుతుందని చెప్పారు. కారు స్టార్ట్ చేసినట్లు, ఏసీ, టీవీలను రిమోట్తో ఆన్ చేసినట్లు ఈవీఎంలను కూడా మానిటర్ చేసే అవకాశం ఉందన్నారు. వీవీ ప్యాట్ల ప్రింటర్లను మార్చే అవకాశం ఉంటుందని అంటున్నారని, ఉన్న ఈవీఎంలను మార్చివేసి కొత్త ఈవీఎంలను పెడుతున్నారని చెబుతున్నారని, ఇవన్నీ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వీవీ ప్యాట్లన్నింటినీ లెక్కించాలని, వీవీ ప్యాట్ స్లిప్ తీసుకుని, తమ ఓటు తాము వేసిన వారికే పడిందో లేదో ఓటరు చూసుకుని, ఒక బాక్సులో వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో అన్ని పార్టీలు ఈవీఎంలను కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... వీవీ ప్యాట్లు పెట్టించింది నేనే... ‘‘తమకు 300 ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు అంటున్నారు. సర్వేలన్నీ వారికి 300 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈవీఎంలలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల లెక్కల్లో తేడా వస్తే ఏం చేయాలి? తేడా వచ్చిన చోట మిగిలిన వీవీ ప్యాట్లన్నింటినీ లెక్కించాలని 23 రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలు ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర్నుంచి ప్రధాని మోదీ కేదార్నాథ్లో ధ్యానం చేసి పోలింగ్ను ప్రభావితం చేసే వరకూ చాలా అంశాలున్నాయి. రాష్ట్రంలో అవసరమైనప్పుడు కేంద్ర బలగాలను పంపలేదు, ఇప్పుడు పంపుతున్నారు. అన్ని పార్టీలను ఏకంచేసి, వీవీ ప్యాట్లు పెట్టించిందని నేనే. వాటిపై మాజీ సీఈసీ ఖురేషీకి నేనే ఐడియా ఇచ్చా. వీవీ ప్యాట్ల లెక్కింపుపై మా పోరాటం కొనసాగుతుంది. తమ ఓటు తాము అనుకున్న వారికే పడిందో లేదో అనే అనుమానం ప్రజలకు ఉండకూడదు. ఈ సమస్యకు పరిష్కారం లభించేదాకా పోరాడుతాం. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘంలోనే లుకలుకలు తలెత్తాయి. రూ.9 వేల కోట్ల ఖర్చుతో వీవీప్యాట్లు పెట్టారు. అంత లగ్జరీ అవసరమా? ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 33 ఏళ్లుగా సర్వేలు చేస్తున్నా.. సర్వేలు చేయడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. నేను 33 సంవత్సరాల నుంచి సర్వేలు చేస్తున్నా. ఈ ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం గెలిచేది తెలుగుదేశం పార్టీయే. ఎలాంటి అనుమానం అవసరం లేదు. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందపడిపోతున్నారు, అప్పుడే మంత్రివర్గం కూడా తయారు చేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గతంలో వన్సైడ్గా ఇచ్చారు, ఇప్పుడు మిశ్రమంగా ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ చూసి భయపడొద్దు ఉండవల్లి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి భయపడవద్దని చెప్పారు. మన ప్రభుత్వమే వస్తుందని అన్నారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాల్లో గెలుస్తున్నామని, 110 అసెంబ్లీ స్థానాలతో మొదలై 120–130 వరకూ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైండ్గేమ్తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలపై మంగళవారం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలుస్తామన్నారు. -
కౌంటింగ్లో ఫారం –17సీ ...ఇదే కీలకం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సీ పార్ట్–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులకు దీనిపై అవగాహన ఉండాలి. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం –17సీ లో పొందు పరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం నంబరు, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రం వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఫారం–17సీలో నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోనే ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య (ఫారం–17ఏ లో నమోదు చేసిన వివరాలు), పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లి పోయిన వారు, ఓటు వేసేందుకు పీఓ అనుమతించని వారిసంఖ్య, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. టెండరు బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపరు సీల్ సీరియల్ నంబర్లు, సీల్, ఎన్ని పేపర్లు సీల్కు వినియోగించారు? వినియోగించని పేపర్ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి? పాడైన పేపర్ సీళ్ల సీరియల్ నంబర్లు వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కౌంటింగ్లో ఫారం –17సి ఏజెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. నమోదైన ఓట్లలో తేడా వస్తే.... కౌంటింగ్ సమయంలో టేబుల్ వద్దకు కంట్రోల్ యూనిట్తోపాటు ఫారం–17 సీ, పార్ట్–1 తప్పనిసరిగా తీసుకొస్తారు. ఆయా అభ్యర్థులకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు అంతా ఫారం–17సీలో ఉన్న వివరాలను రాసుకోవాలి. కంట్రోల్ యూనిట్ డిస్ప్లే సెక్షన్లో చూపిన పోలైన మొత్తం ఓట్లు, ఫారం–17 సీలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్ తప్పిదం, మరే కారణం వల్ల కానీ కంట్రోల యూనిట్, ఫారం –17సీ, ఓట్ల సంఖ్యలో తేడాలు వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్ యూనిట్లు పక్కన ఉంచి సమాచారాన్ని రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్కు పంపుతారు. కంట్రోల్ యూనిట్ టేబుల్ పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ కేంద్రానికి చెందిందో ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ట్యాంపరింగ్ జరిగితే...... కంట్రోల్ యూనిట్ టేబుల్పైకి రాగానే అభ్యర్థి సీలింగ్ సెక్షన్ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్ ఏజెంట్లు, పరిశీలకులు చూసుకోవాలి. రిజల్ట్ సెక్షన్పై ఉన్న స్ట్రిప్ సీల్ గ్రీన్ పేపర్ సీల్ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్ నంబర్లు ఫారం–17సీ లో నమోదు చేసినవే ఉండాలి. కంట్రోల్ యూనిట్ పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్ల ట్యాంపరింగ్ జరిగాయని గుర్తిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ట్యాంపరింగ్ జరగని కంట్రోల్ యూనిట్లను మాత్రమే కౌంటింగ్ నిర్వహించాలి. వరుస క్రమంలో లెక్కింపు..... కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తి అయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్ యూనిట్లను జనరల్ అబ్జర్వర్ తన టేబుల్ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు కౌంటింగ్ పరిశీలకులతో ఓట్లు లెక్కిస్తారు. కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్యకు ఫారం –17సీ, పార్ట్–2లో కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పరిశీలకుడిని కౌంటింగ్ నుంచి తప్పిస్తారు. ఆ పరిశీలకుడు తనిఖీ చేసిన మిగిలిన కంట్రోల్ యూనిట్లన్నింటినీ జనరల్ అబ్జర్వర్ మరోసారి లెక్కిస్తారు. వివరాలు తప్పుగా నమోదు చేసిన కౌంటింగ్ పరిశీలకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. అసాధారణంగా ఇరువురు అభ్యర్థులకు కౌంటింగ్లో ఓట్లు సమానంగా వస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఫలితాన్ని ప్రకటిస్తారు. ఆ లాటరీలో ఎవరు గెలుపొందితే వారినే విజేతగా ప్రకటిస్తారు. -
‘ముందు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలి’
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్లను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది యలమంజుల బాలాజీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఒకవేళ వీవీ ప్యాట్లకు, ఈవీఎంలకు మధ్య తేడాలుంటే, ఈ అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై మంగళవారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. కాగా కనీసం యాభై శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిటిషనర్ అన్నీ వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న అభ్యర్థనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందా అనే దానిపై వేచి చూడాల్సిందే. -
మరో 96 గంటలే..
సాక్షి, అమరావతి: సుదీర్ఘ నిరీక్షణకు మరో 96 గంటల్లో తెరపడనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరిగాయి. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు రావడానికి మిగిలింది ఇక నాలుగు రోజులే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం తేలడానికి కౌంట్డౌన్ మొదలైంది. ఓటరు దేవుడి ఆగ్రహానికి, అనుగ్రహానికి గురైంది ఎవరో తెలిసిపోనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ఆదివారం జరగనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వెలవడనున్నాయి. ఈ ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు, అసలు ఫలితాలకు మధ్య లంకె కుదిరేనా? అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు టీవీ చానళ్లు, సర్వే ఏజెన్సీలు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. రాష్ట్రంలో లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరచడం ఖాయమని పలు జాతీయ టీవీ చానళ్లు, సర్వే సంస్థలు వెల్లడించాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడంతోపాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నారని ఇప్పటికే జాతీయ పత్రికలు, చానళ్లు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగిసే వరకు అంటే సాయంత్రం 6 గంటల దాకా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడిపై నిషేధం ఉంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బహిర్గతం చేయడానికి జాతీయ చానళ్లు, సర్వే సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కొంత స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓటమి భయంతో చంద్రబాబు గగ్గోలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం తప్పదని సర్వేల్లో తేటతెల్లమైంది. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన కూడా అదే వాతావరణం నెలకొంది. పోలింగ్ ముగిసిన తరువాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాము ఘనవిజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తన ఓటమిని ఊహించి, ఈవీఎంలపై గగ్గోలు ప్రారంభించారు. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే రాష్ట్రంలో 30 శాతం మేర ఈవీఎంలు పనిచేయడం లేదని ఆరోపించారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకుని, ఓటు వేసినట్లు వేలికి ఉన్న సిరా గుర్తును మీడియాకు చూపిస్తూ ఫోజులు ఇచ్చారు. సాయంత్రం అయ్యే సరికి తన ఓటు ఎవరికి పడిందో తెలియడం లేదని చెప్పారు. పోలింగ్ ముగిసిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని చంద్రబాబు దుర్భాషలాడారు. పలు ఆరోపణలు చేశారు. ఆ మరుసటి రోజు ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగ్గా పని చేయలేదంటూ ఫిర్యాదు చేశారు. ఈవీఎంలపై నమ్మకం లేదు, బ్యాలెట్తోనే ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిరోజూ పాత పాటే పాడారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అనవసర రాద్థాంతం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘చిలక’ జోస్యంపై జనం అనాసక్తి సీఎం చంద్రబాబు గూటిలోని చిలక ‘లగడపాటి’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించి, బొక్కబోర్లాపడ్డారు. పోలింగ్ పూర్తయిన తరువాత సర్వే ఏజెన్సీలు టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ప్రకటించగా, లగడపాటి మాత్రం మహా కూటమి గెలుపు తథ్యమని తేల్చిచెప్పారు. తీరా ఫలితాలను చూస్తే లగడపాటి చిలక జోస్యం వాస్తవానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. దీంతో లగడపాటి సర్వేలపై ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. చంద్రబాబుకు లాభం చేకూర్చడానికే లగడపాటి దొంగ సర్వేలు నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం జనంలో నాటుకుపోయింది. -
ఓట్ల లెక్కింపులో బాధ్యతగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బాధ్యతగా వ్యవహరించాలని కౌంటింగ్ ఏజెంట్లకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. శనివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సికింద్రా బాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ ఏజెంట్లు, కార్పొరేటర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఏజెంట్లు ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 6.30 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు, వీవీ ప్యాట్ల లెక్కింపుల్లో ఎలాంటి సందేహాలు వచ్చినా... అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల బాధ్యతల గురించి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ అవగాహన కల్పించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, జనార్దన్రెడ్డి, ప్రభాకర్, స్టీఫెన్ సన్, పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్లో ఫారం–17సీ కీలకం
సాక్షి, కడప సెవెన్రోడ్స్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఫారం–17సి పార్ట్–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు దీనిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం–17సిలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి.పార్లమెంటు/అసెంబ్లీ నియోజకవర్గ నెంబరు, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రంలో వినియోగించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెటింగ్ యూనిట్ల ఐడెంటిఫికేషన్ నెంబర్లను ఫారం–17సిలో నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్ర పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య (ఫారం–17ఏలో నమోదు చేసిన వివరాలు), పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయకుండా నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటేసేందుకు పీఓ అనుమతించని వారి సంఖ్య, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. అలాగే టెండర్డ్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపరు సీళ్ల సీరియల్ నెంబర్లు, ఎన్ని పేపర్ సీళ్లు వినియోగించారు? వినియోగించని పేపరు సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి? డ్యామేజ్ అయిన పేపరు సీళ్ల సీరియల్ నెంబర్లు వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కౌంటింగ్లో ఫారం–17సి ఏజెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. నమోదైన ఓట్లలో తేడా వస్తే..?! కౌంటింగ్ సమయంలో టేబుల్ వద్దకు కంట్రోల్ యూనిట్తోపాటు ఫారం–17సీ పార్ట్–1 తప్పనిసరిగా తీసుకు వస్తారు. ఆయా అభ్యర్థులకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లంతా ఫారం–17సిలో ఉన్న వివరాలను రాసుకోవాలి. కంట్రోల్ యూనిట్ డిస్ప్లే సెక్షన్లో చూపిన పోలైన మొత్తం ఓట్లు, ఫారం–17సిలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్ తప్పిదం, మరే కారణం వల్లగానీ కంట్రోల్ యూనిట్, ఫారం–17సి ఓట్ల సంఖ్యలో తేడాలు వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్ యూనిట్లు ప్రక్కన ఉంచి సమాచారాన్ని రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్కు పంపుతారు. కంట్రోల్ యూనిట్ టేబుల్పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ కేంద్రానికి చెందినదో ఏజెంట్లు నిర్దారించుకోవాలి. ట్యాంపరింగ్ జరిగితే... కంట్రోల్ యూనిట్ టేబుల్పైకి రాగానే క్యాం డిడేట్ సెక్షన్ సీలింగ్ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్లు చూసుకోవాలి. రిజల్ట్ సెక్షన్పై ఉన్న స్ట్రిప్ట్ సీలు, గ్రీన్ పేపరు సీలు సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్ నెంబర్లు ఫారం–17సిలో నమోదు చేసినవే ఉండాలి.కంట్రోల్ యూనిట్, పేపరు సీళ్లు, అడ్రస్ ట్యాగులు ట్యాంపరింగ్ జరిగాయని గుర్తిస్తే సూపర్వైజర్లు ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకు వెళ్లాలి. ట్యాంపరింగ్ జరగని సీయూలను మాత్రమే కౌంటింగ్ నిర్వహించాలి. ర్యాండమ్గా కౌంటింగ్ కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్ యూనిట్లను జనరల్ అబ్జర్వర్ తన టేబుల్ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు కౌంటింగ్ సూపర్వైజర్తో ఓట్ల లెక్కింపు చేయిస్తారు. కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్యకు, ఫారం–17సీ పార్ట్–2లో కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే సూపర్వైజర్ను కౌంటింగ్ నుంచి తప్పిస్తారు. ఆ సూపర్వైజర్ తనిఖీ చేసిన మిగతా కంట్రోల్ యూనిట్లలన్నింటినీ జనరల్ అబ్జర్వర్ మరోసారి లెక్కింపజేస్తారు. వివరాలు తప్పులు నమోదు చేసిన కౌంటింగ్ సూపర్వైజర్పై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.అసాధారణంగా ఇరువురు అభ్యర్థులకు కౌంటింగ్లో ఓట్లు సమానంగా వస్తే ఏం చేయాలనే సందేహం రావడం సహజం. అలాంటి సందర్బం ఎదురైనపుడు ప్రజాప్రతినిద్య చట్టం ప్రకారం రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఫలితాలను ప్రకటిస్తారు. లాటరీలో ఎవరు గెలుపొందితే వారిని విజేతగా ప్రకటిస్తారు. -
తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే
సాక్షి, విశాఖపట్నం : మరో ఆరు రోజుల్లో చేపట్టనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఆర్వోలు, ఏఆర్వోలు, సూపర్వైజర్లు, ఇతర కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విశాఖలో మూడు లోక్సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు అత్యల్పంగా 17 రౌండ్లు, అత్యధికంగా 23రౌండ్ల వరకు సాగనుంది. తొలి రౌండ్ ఫలితం లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన అరగంటలోనే వెల్లడికానుంది. 12 గంటలకు తొలి ఫలితం వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లతోపాటు రౌండ్ల వారీగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 1.30గంటలకల్లా పూర్తి కానుంది. వీవీ ప్యాట్ల స్లిప్ల కౌంటింగ్ పూర్తయితేకానీ అధికారికంగా ఫలితాలు వెల్లడించకున్నప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంటకే దాదాపు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలిసారి రౌండ్ల వారీగా ఫలితాలను సువిధ పోర్టల్లో నమోదు చేయనున్నారు. దీంతో ఏ అభ్యర్థికి ఏ రౌండ్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో పోర్టల్ ద్వారా క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే బూత్ల సంఖ్యా పరంగా చూసినా, పోలైన ఓట్ల పరంగా చూసినా తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే. ఈ నియోజకవర్గ పరిధిలో 236 పోలింగ్ బూత్లున్నాయి. పైగా జిల్లాలో అత్యల్ప ఓట్లు నమోదైన రెండో నియోజకవర్గం కూడా ఇదే. 2,09,186 ఓట్లకు గానూ 1,27,909 ఓట్లు పోలయ్యాయి. రౌండ్కు 14 ఈవీఎంలలో కౌంటింగ్ సాగనుండడంతో 17 రౌండ్లలోనే ఈ నియోజకవర్గ ఫలితం వెల్లడికానుంది. విశాఖ దక్షిణం తర్వాత కొద్ది నిముషాల తేడాలో రెండో ఫలితంగా విశాఖ పశ్చిమం వెల్లడికానుంది. ఈ నియోజకవర్గ పరిధిలో 237 పోలింగ్ బూత్లే ఉన్నప్పటికీ పోలైనవి 1,37,499 ఓట్లు కావడంతో దక్షిణం తర్వాత కొద్ది నిముషాల వ్యవధిలోనే పశ్చిమ ఫలితం వెల్లడవుతుంది. భీమిలి, పాడేరుల్లో 23 రౌండ్ల కౌంటింగ్ పోలైన ఓట్లను బట్టి చూస్తే ఆ తర్వాత వరుసగా పాడేరు, అరుకు, మాడుగుల, అరుకు, అనకాపల్లి, యలమంచలి, విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి, గాజువాక, భీమిలి నియోజకవర్గాల వారీగా ఫలితాలు వెల్లడికావాల్సి ఉన్నప్పటికీ పోలింగ్ బూత్ల వారీగా చూస్తే మాత్రం మాడుగుల, విశాఖ పశ్చిమం, చోడవరం, యలమంచలి, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖ ఉత్తరం, విశాఖ తూర్పు, పెందుర్తి, అరుకు, పాడేరు, చివరగా భీమిలి నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. భీమిలి, పాడేరుల్లో 23 రౌండ్ల వరకు కౌంటింగ్ సాగనుంది. తొలి రౌండ్కు అరగంట సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత ప్రతి రౌండ్కు 20 నిముషాలకు మించి సమయం పట్టే అవకాశాలు లేవు. ఏజెంట్లతో ప్రమాణంతో మొదలు.. 23వ తేదీ ఉదయం 7.55 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తొలుత నియోజకవర్గాల వారీగా ఆర్వోలు సరిగ్గా 7.55 గంటలకు కౌంటింగ్ ప్రక్రియపై ఈసీ నియమ నిబంధనలను వివరిస్తూ ఏజెంట్లతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తొలుత సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపునకు శ్రీకారం చుడతారు. వీటి లెక్కింపు పూర్తయినా అవకపోయినా సరిగ్గా 8.30గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెడతారు. లోక్సభ, అసెంబ్లీల వారీగా ఈవీఎంలను వేర్వేరుగా రెండు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపర్చారు. కౌంటింగ్ కోసం కూడా అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి రెండు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. సీరియల్ ప్రకారం పోలింగ్ బూత్ల వారీగా అసెంబ్లీ, లోక్సభ ఈవీఎంలను వేర్వేరుగా రౌండ్కు 14 చొప్పున బయటకు తీసుకొస్తారు. అసెంబ్లీ ఈవీఎంలను అసెంబ్లీ కౌంటింగ్ హాలుకు, లోక్సభ ఈవీఎంలను లోక్సభ కౌంటింగ్ హాలుకు తీసుకెళ్తారు. 8.30 గంటలకు తొలి రౌండ్ కౌంటింగ్కు శ్రీకారం చుడతారు. 14 టేబుల్స్లో కౌంటింగ్ పూర్తి కాగానే టేబలేషన్ (ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను ఓ చార్ట్లో రౌండ్ల వారీగా కూడే విధానం) చేస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా వివరాలను ఈసీకి పంపడంతో పాటు సువిధ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అలా చేసిన తర్వాతే రౌండ్ ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఆ తర్వాత మళ్లీ రెండో రౌండ్కు సంబంధించిన ఈవీఎంలను కౌంటింగ్ హాలుకు తీసుకొస్తారు. ఇలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తుది రౌండ్కొచ్చేసరికి సమాంతరంగా సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తికావాల్సి ఉంటుంది. ఒక వేళ పోలైన ఓట్ల సంఖ్యను బట్టి వాటి లెక్కింపు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని భావిస్తే తుది రౌండ్ను ఆపుతారు. సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది రౌండ్ ఫలితాలకు పోస్టల్, సర్వీస్ ఓట్లను కలిపి తుది ఫలితాలను నిర్ణయిస్తారు. మైక్రో అబ్జర్వర్కే సెల్ఫోన్ లోక్సభ ఓట్లను కౌంటింగ్ చేసే హాలులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లకు 14 మంది ఏజెంట్లు ఉంటారు. ఇక లోక్సభ ఆర్వో టేబుల్ పక్కనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. వీటి వద్ద ఒక్కో టేబుల్కు ఒక్కో ఏజెంట్ ఉంటారు. అలాగే అభ్యర్థితో పాటు జనరల్ ఏజెంట్గా మరొకరుంటారు. ఇక అసెంబ్లీ కౌంటింగ్ హాలులో మాత్రం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. 14 టేబుల్స్కు 14 మంది ఏజెంట్లు ఉంటారు. అసెంబ్లీ ఆర్వో పక్కనే పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం చెరో టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఆయా టేబుల్స్ వద్ద ఒక్కో ఏజెంట్ ఉంటారు. ఇక్కడ కూడా అభ్యర్థితో పాటు ఓ జనరల్ ఏజెంట్ ఉంటారు. అభ్యర్థితో సహా ఏజెంట్లు ఎవ్వరూ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిగ్ పరికరాలను కౌంటింగ్ హాలులోకి తీసుకెళ్లడానికి వీల్లేదు. అలాగే కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్కు మాత్రమే సెల్ఫోన్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక విధుల్లో ఉన్న ఇతర కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ఎవరిని సంప్రదించాలన్నా హ్యాండ్సెట్ల ద్వారానే మాట్లాడాల్సి ఉంటుంది. -
టివీ9 భారత్ వర్ష్కు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్
-
విపక్షాలకు సుప్రీం కోర్టు షాక్
-
50% వీవీప్యాట్ల లెక్కింపు కుదరదు
సాక్షి, న్యూఢిల్లీ: వీవీప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల) ఫలితాలతో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ స్లిప్(వీవీప్యాట్)లను సరిపోల్చాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏవేని 5 పోలింగ్ బూత్లలోని ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన తాము వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ అంశంపై 21 ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు ఏఎం సింఘ్వి, కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్కు బదులు ఏవైనా ఐదు బూత్లలో ఈవీఎంల ఫలితాలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇది మొత్తం ఫలితాలలో కేవలం 2 శాతం మాత్రమే. దీనివల్ల ఉపయోగం లేదు. అందుకే కనీసం 50 శాతం ఫలితాలతో సరిపోల్చాలని మేం అడుగుతున్నాం. దీనిని 33 శాతం లేదా కనీసం 25 శాతం పెంచినా మాకు సంతోషమే. దీనివల్ల ఈసీ వ్యవస్థపై కేవలం రాజకీయ పార్టీలకే కాదు, ఓటర్లలోనూ ఆమోదయోగ్యతతోపాటు, విశ్వాసం పెరుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘ఒకవేళ, 5 పోలింగ్ బూత్లలో ఎలాంటి తేడాలు కనిపించకుంటే ఏం చేస్తారు? దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు లేవు’ అని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గతంలో జరిగిన విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని ఈసీ తప్పుదోవ పట్టించిందని వారు పేర్కొనగా.. ప్రస్తుత వాదనలు కేవలం రివ్యూ పిటిషన్పై మాత్రమేనంటూ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 8వ తేదీనాటి తీర్పును సమీక్షించటానికి సిద్ధంగా లేమని తేల్చింది. ఈ బెంచ్ ఒక్క నిమిషంలో తీర్పు ముగించింది. వాదనలప్పుడు ప్రతిపక్ష నేతలు ఫరూక్ అబ్దుల్లా, డి.రాజా, చంద్రబాబు నాయుడు కోర్టు హాల్లోనే ఉన్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన విపక్ష నేతలు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక నియోజకవర్గానికి కేవలం 5 శాతం వీవీ ప్యాట్లు కాకుండా కనీసం 15 లేదా 25 శాతం లెక్కించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని 21 విపక్షాలు కోరాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వీ, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, ఏపీ సీఎం చంద్రబాబు, సీపీఐ ఎంపీ డి. రాజా సహా పలు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ను కలిశారు. ఐదు శాతం వీవీప్యాట్ల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తీర్పు సమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలతో 15 లేదా 25 శాతం వీవీప్యాట్లు లెక్కించేలా ఆదేశాలు ఇవ్వవచ్చని పార్టీలు పేర్కొన్నాయి. అలాగే ఓట్ల లెక్కింపు సందర్భంగా నియోజకవర్గాల వారీగా ఈవీఎంలలో పోలైన ఓట్లకు వీవీప్యాట్లలోని ఓట్లకు తేడాలోచ్చిన చోట మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని కోరారు. ఈవీఎంలతో సమాంతరంగా వీవీప్యాట్లను లెక్కించా లని విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థి రీకౌంటింగ్ కోరితే మళ్లీ లెక్కించాలని ఈసీని కోరినట్టు కూడా ఆ నేతలు మీడియాకు తెలిపారు. -
చంద్రబాబు భయంతోనే ఈవీఎంలపై నెపం నెడుతున్నారు
-
‘ఓటమికి కారణాలు వెతుకుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ విచ్చిన్నం అవుతుందనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై నెపం నెడుతున్నారని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఓటమి కారణాలను వెతుకుతున్నారని, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఈవీఎంలతోనే అని ఆయన గుర్తుచేశారు. మంగళవారం నాగిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలింగ్ సరళి చూసి భయపడ్డ చంద్రబాబు.. ఓటు వేసిన గంటకే నా ఓటు ఎటుపోయిందో అంటూ మాట్లాడారని పేర్కొన్నారు. ఈవీఎంలే ఫైనలని.. వీవీప్యాట్లని ట్రయల్గా తీసుకున్నారని నాగిరెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికల సంఘం, సీఎస్పై లేనిపోని ఆరోపణలకు చేస్తున్నారని మండిపడ్డారు. విజయంలేకపోతే పార్టీని నడపలేమనే భయంతో చంద్రబాబు ఉన్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు ప్రజలతో గడిపారని.. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడారని స్పష్టం చేశారు. -
‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు’
సాక్షి, అమరావతి: ఫొని తుపాన్ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ వెసులుబాటు కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా సీఈసీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కోడ్ వెసులుబాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం సీఈసీకే ఉంటుందని పేర్కొన్నారు. సీఈసీ ఇచ్చే ఆదేశాలను తాము అమలు చేస్తామని అన్నారు. తుపాన్ వల్ల స్ట్రాంగ్ రూమ్ల్లోని ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని వెల్లడించారు. తుపాన్ ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండమని కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు. -
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారిలా!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల (స్లిప్పులు) లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే చీటీలను వెలికి తీసి అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను లెక్కిస్తారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలను వాడలేదు. ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఈసీ కొత్తగా వీవీప్యాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. తొలుత పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్ను ఎంపికచేసి, అక్కడ ఉపయోగించిన వీవీప్యాట్ యంత్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు బూత్లోని వీవీప్యాట్లను లెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయా యంత్రాల్లోని చీటీలను వెలికి తీసి, లెక్కింపు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై లెక్కింపు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. లెక్కింపు ఇలా... ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. పోలింగ్ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం–17ఏ’తో సరిపోల్చుతారు. అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఏజెంట్ల సమక్షంలో బయటకు తీస్తారు. వీటిని అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు. తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అభ్యర్థుల వారీ విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్నే దీనికి వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీ వేరుచేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక... లోక్సభ నియోజవర్గానికి సంబంధించి రాండమ్గా 35 వీవీప్యాట్ మెషీన్లను (అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ మెషీన్ల చొప్పున) ఎంపికచేసి లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్ల వారీ యంత్రాలను వెలికి తీసి వాటిల్లో ఉన్న చీటీలను లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను, సర్వీసు ఓట్లను గణిస్తారు. తదుపరి ఈవీఎం యంత్రాల్లో పోలైన ఓట్లను గణిస్తారు. చివరిగా వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల లెక్కింపు ఆరంభిస్తారు. ఇదంతా పూర్తయ్యాక విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో చీటీల లెక్కింపు ఆరంభం కాకమునుపే రౌండ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే నెలలో లెక్కింపు సిబ్బందికి ఈ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారిలా.. .
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ యం త్రాల్లో ఉన్న చీటీల (స్లిప్పులు) లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే చీటీలను వెలికి తీసి అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను లెక్కిస్తారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలను వాడలేదు. ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఈసీ కొత్తగా వీవీప్యాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. తొలుత పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్ను ఎంపికచేసి, అక్కడ వినియోగించిన వీవీప్యాట్ యం త్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెగ్మెంట్కు లెక్కించే వీవీప్యాట్ సంఖ్యను పెంచాలని నిర్ణయిం చారు. ఈ మేరకు ఆయా యంత్రాల్లోని చీటీలను వెలికి తీసి, లెక్కింపు వరకు తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై లెక్కింపు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. లెక్కింపు ఇలా... ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. పోలింగ్ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం–17ఏ’తో సరిపోల్చుతారు. అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఏజెంట్ల సమక్షంలో బయటకు తీస్తారు. వీటిని అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు. తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అభ్యర్థుల వారీ విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్నే దీనికి వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీ వేరుచేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక... లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రాండమ్గా 35 వీవీప్యాట్ మెషీన్లను (అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ మెషీన్ల చొప్పున) ఎంపికచేసి లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు/వారి ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్ల వారీ యంత్రాలను వెలికి తీసి వాటిల్లో ఉన్న చీటీలను లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను గణిస్తారు. తదుపరి ఈవీఎం యంత్రాల్లో పోలైన ఓట్లను గణిస్తారు. చివరిగా వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల లెక్కింపు ఆరంభిస్తారు. ఇదంతా పూర్తయ్యాక విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో చీటీల లెక్కింపు ఆరంభం కాకమునుపే రౌండ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే నెలలో లెక్కింపు సిబ్బందికి ఈ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
ఈవీఎం.. ఆ..భయం!
న్నికల యజ్ఞం ముగిసింది. ప్రజాతీర్పు ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైంది. ఆ తీర్పు వెల్లడి కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నడూ లేనంత సుదీర్ఘంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు జరుగుతుండటం.. మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాకే.. అంటే మే 23న ఓట్ల లెక్కింపునకు ముహూర్తం నిర్ణయం.. మొదటి దశలోనే రాష్ట్రంలో పోలింగ్ జరిగిపోవడం వంటి కారణాలతో ఏకంగా 43 రోజులపాటు ప్రజాతీర్పును తమలో దాచుకున్న ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడాల్సిన పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాండ్ రూములకు మెజిస్టీరియల్ అధికారాలుండే తహసీల్దార్ల నేతృత్వంలో రౌండ్ ది క్లాక్ భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆ మేరకు దాదాపు అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు తహసీల్దార్ల పర్యవేక్షణలో భద్రత ఏర్పాటు చేశారు.కానీ విశాఖ జిల్లాలో మాత్రం ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తహసీల్దార్ను మాత్రమే నియమించారు. వారికి సహాయకులుగా ముగ్గురు చొప్పున డీటీలను ఇచ్చారు. వారు కూడా సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని సాక్షి పరిశీలనలో వెల్లడైంది. స్ట్రాంగ్ రూములున్న ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో పరిస్థితి చూస్తే.. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఈవీఎంలు కొన్ని ఆరుబయట కనిపించాయి. భద్రతను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు గానీ.. కొన్ని నియోజకవర్గా స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా సిబ్బంది జాడ గానీ కనిపించలేదు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్–కౌంటింగ్ మధ్య 43 రోజుల సుదీర్ఘ విరామం రావడంతో.. అంతవరకు స్ట్రాంగ్ రూముల్లో ఉండే ఈవీఎంల భద్రతకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు విశాఖ జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదు. ఈవీఎంల భద్రతపై సాక్షి పరిశీలన జరిపినప్పుడు ఎన్నికల అధికారుల పర్యవేక్షన, భద్రత లోపాలు స్పష్టంగా కనిపించాయి. పోస్టల్, సర్వీస్ బ్యాలెట్ల జారీలోనే కాదు.. ఈవీఎంల భద్రత విషయంలోనూ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశామని జిల్లా అధికారులు గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ.. నేటికీ సగం మందికి కూడా అందని పరిస్థితి నెలకొంది. పైగా పోస్టల్ బ్యాలెట్లు అందిన వారిలో చాలామందికి లోక్సభ తప్ప అసెంబ్లీ బ్యాలెట్లు పంపడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి. ఈ తరుణంలో కొత్తగా ఈవీఎంల భద్రతలోని డొల్లతనం అధికారుల ఉదాసీనతను బయటపెడుతోంది. విశాఖలో మాత్రం డిప్యూటీ తహసీల్దార్లతో సరి విశాఖ జిల్లాలో మూడు లోక్సభ స్థానాలతో పాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మ«ధ్య ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తహసీల్దార్నే ఇన్చార్జిగా నియమించారు. వీరికి సహాయకులుగా ముగ్గురు చొప్పున డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ)ను నియమించారు. దీంతో స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధి నిర్వహణను డీటీలకు అప్పగించి తహసీల్దార్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కనీసం రోజుకోసారైనా స్ట్రాంగ్ రూమ్లను పరిశీలిస్తున్నారా? అంటే.. లేదనే సమాధానం వస్తోంది. పోనీ డీటీలైనా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉంటున్నారా? అంటే అదీ లేదని ‘సాక్షి’ పరిశీలనలో స్పష్టమైంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద పరిస్థితిని ‘సాక్షి’ బృందం పరిశీలించినప్పుడు రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లిన దాఖలాలు కన్పించలేదు. పర్యవేక్షణాధికారుల గురించి ఇంజినీరింగ్ కళాశాల సిబ్బందిని ఆరా తీస్తే.. రెవెన్యూ అధికారులు కాదు కదా.. కనీసం సిబ్బంది కూడా రావడం లేదని ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసులే 24 గంటలూ ఉంటున్నారని చెప్పుకొచ్చారు. పైగా కొన్ని నియోజకవర్గాల ఈవీఎంలు ఆరు బయటే పెట్టినట్టుగా కన్పిస్తోంది. వీటిని మరో 25 రోజుల పాటు ఈవీఎంలు కంటికిరెప్పలా కాపాడాల్సి ఉంది. భద్రత, పర్యవేక్షణ ఇలా ఉంటే.. ఎదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈవీఎంల భద్రత, పర్య వేక్షణపై ప్రత్యేకదృష్టి సారించాలని ప్రధాన పార్టీల అభ్యర్థులు కోరుతున్నారు. స్ట్రాంగ్ రూముల భద్రతకు ఇవీ గైడ్లైన్స్ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతకు ఎన్నికల కమిషన్ స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేసింది. 24 గంటలూ పర్యవేక్షించేలా మేజిస్టీరియల్ అధికారాలు ఉన్న తహసీల్దార్లను నియమించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్లు.. ఆ పైస్థాయి అధికారులకే భద్రత పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని స్పష్టంగా సూచిం చింది. కిందస్థాయి అధికారులెవరూ ఉండడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొంది. తహసీల్దార్ స్థాయి అధికారులైతేనే స్ట్రాంగ్ రూముల వద్ద ఎవరైనా అపరిచితులు సంచరించినా, ఏవైనా అనుకొని ఘటనలు జరిగినా.. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూడకుండా తమకున్న మేజిస్టీరియల్ అధికారాలతో అక్కడికక్కడే.. వెనువెంటనే తగిన చర్యలు చేపట్టే అవకాశముంటుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ గైడ్లైన్స్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలకు తూట్లు స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా సిబ్బందితో కలసి పర్యవేక్షించేందుకు మేజిస్ట్రేట్ హోదా కల్గిన తహసీల్దార్లను నియమించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కానీ మన జిల్లాలో మాత్రం డిప్యూటీ తహసీల్దార్లను నియమించారు. తహసీల్దార్లు స్ట్రాంగ్ రూంల పరిశీలనకు అసలు వెళ్లడం లేదు. డిప్యూటీ తహసీల్దార్లే పర్యవేక్షిస్తున్నారు. ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాలకు తూట్లు పొడవడమే.– కాండ్రేగుల వెంకటరమణ, అధ్యక్షుడు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య తహసీల్దార్లు, ఆర్వోలు పరిశీలిస్తున్నారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు గెజిటెడ్ హోదా కల్గిన డిప్యూటీ తహసీల్దార్లను నియమించడం వాస్తవమే. అయితే తహసీల్దార్లు, ఆర్వోలు రోజూ మూడు పూటలుగా వెళ్లి తమ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలను పరిశీలిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఈ నియామకాలు జరిగాయి. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడడం లేదు. రౌండ్ ది క్లాక్ భద్రతను పర్యవేక్షిస్తున్నాం. – ఆర్.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి -
అవన్నీ పుకార్లే, నమ్మొద్దు: ద్వివేది
సాక్షి, అమరావతి: స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై ఎలాంటి సందేహాలు వద్దని, ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలను భద్రపరిచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందన్నారు. రాజకీయా పార్టీలు, తమ ఏజెంట్లను స్ట్రాంగ్ రూమ్ సమీపంలోని కంట్రోల్ రూమ్లలో ఉంచవచ్చని తెలిపారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండదన్నారు. అపోహలకు తావివ్వకుండా ఉండేలా భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లపై వచ్చినవి పుకార్లు మాత్రమేనని ద్వివేది కొట్టిపారేశారు. స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని, పుకార్లను ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దివ్వేది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ద్వివేదిని కలిసిన మేరుగ నాగార్జున కాగా అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ....సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. వేమూరు నియోజకవర్గంలో అకృత్యాలు, దాడులపై చర్యలు తీసుకోకపోగా బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. టీడీపీ రౌడీలపై పెట్టిన కేసుల్లో పురోగతి లేదని, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మేరుగ నాగార్జున తెలిపారు. బాధ్యులను వదిలేసి బాధితులను వేధిస్తున్నారని అన్నారు. దళితులపైనా, అండగా నిలిచిన ఇతర కులస్తులపైనా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ నేతలు, పోలీసులు సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్నే సవాల్ చేస్తున్న టీడీపీ నేతలు గ్రామాల్లో నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియతోపాటు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న చంద్రబాబు అండ్ కో పై ఎన్నికల కమిషన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులని చెప్పుచేతల్లో పెట్టుకుని టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. వ్యవస్థను తన జేబు సంస్థగా మార్చుకున్న చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. -
ఈవీఎంలను హ్యాక్ చేయలేం!
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను హ్యాకింగ్/ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ను డీ–కోడ్ చేయడం కష్టతరమని, వీటిలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్ను ఇన్స్టాల్ చేయలేరని సందీప్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో ఈవీఎంల సెక్యూరిటీని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ముఖ్యమైన వ్యక్తులు.. అభద్రతాభావంతో ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేనో ఎంబేడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా క్రిప్టాలజీ, ఎన్క్రిప్టింగ్ మీద 15ఏళ్లుగా పనిచేస్తున్నాను. నా అనుభవం ద్వారా తెలుసుకున్న వాస్తవాలను యావదాంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఓ ఈవీఎంను ట్యాంపర్ చేయాలంటే దానికి హార్డ్వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కీలకం. ఒకవేళ ఈవీఎంని నెట్వర్క్ వీడియోస్తో అనుసంధానం చేయాలంటే చాలా ఖరీదైన పని. ఈవీఎంలలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయలేరు. ఒకసారి ఫర్మ్వేర్ కంపైల్ చేసిన తర్వాత ఈవీఎంపైన ఫ్లాష్చేస్తే.. రెండోసారి రీ–ఫ్లాష్చేసే అవకాశం ఉండదు. అదే విధంగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ యూనిట్ మధ్య జరిగే కమ్యూనికేషన్ ప్రొపరేటరీ సెక్యూర్ ప్రొటోకాల్ ద్వారానే జరుగుతుంది. ఏజెంట్ సమక్షంలో సమక్షంలో బ్యాటరీ స్విచాఫ్ చేస్తారు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అయిపోతుంది. దీంతో అటోమెటిక్గా ఈవీఎంలో మెమరీ అలాగే ఉన్నప్పటికీ.. బయటి వారు యాక్సెస్ చేసేందుకు వీలుండదు. ఈవీఎంలను హ్యాక్ చేయాలని ప్రయత్నించి చాలా మంది విఫలమయ్యారు’అని సందీప్ రెడ్డి వెల్లడించారు. మన ఈవీఎంలను చాలా దేశాల్లో వినియోగిస్తున్నారని.. కానీ కావాలనే కొందరు మన దేశంలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఓ హ్యాకర్ ఈవీఎంలను హ్యాక్ చేస్తానంటూ సవాల్ విసిరి భంగపడ్డారని సందీప్ తెలిపారు. ఈ ఏడాది కూడా సయ్యద్ షుజా అనే వ్యక్తి యూకే నుంచి ఈవీఎంలను హాక్ చేస్తానని, గతంలో తాను ఈసీఐఎల్లో పనిచేస్తున్న సమయంలో హ్యాకింగ్ చేశానని చెప్పుకున్నారు. దీంతో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్, మరికొందరు మీడియా, రాజకీయ ప్రముఖులు లండన్ వెళ్లొచ్చారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అవాస్తవమని వారు తెలుసుకున్న విషయాన్ని కూడా సందీప్ రెడ్డి గుర్తుచేశారు. వీవీప్యాట్కు, బ్యాలెట్ యూనిట్కు మధ్య మార్పు జరిగే సమయంలో ట్యాంపర్ (మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్) జరుగుతుందంటూ కొందరు చేస్తున్న వాదన అర్థరహితం అన్నారు. ఏపీ ఎన్నికల సమయంలో 36 చోట్ల ఈవీఎంలు మోరాయించాయని.. అది కూడా ఆపరేటర్ అసమర్థత ద్వారానే జరిగిందన్నారు. ఇందులో ఈవీఎంల తప్పిదమేమీ లేదన్నారు. -
బాబుకు తన ప్లాన్ ఫెయిలైందని అర్థమైంది...
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసు తీగ లాగితే డొంకంతా కదులుతోందని, ఏపీ తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారమే కాకుండా పంజాబ్ పౌరుల సమాచారం కూడా దొంగలించారని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచార సంస్థ కంటే ప్రమాదకరంగా రహస్య సమాచార దోపిడీ జరిగిందని అన్నారు. మే 23 తర్వాత డేటా దొంగలంతా కటకటాల వెనక్కే అని వ్యాఖ్యానించారు. ఓవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోట్లలో బిల్లుల చెల్లింపులు చేస్తున్న అధికారులు సీఎస్ పునేఠాలాగే ఇబ్బంది పడతారని విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, ఆపద్ధర్మ సిఎం చేసిన బదిలీలను రద్దు చేయాలని ఆయన కోరారు. నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, ప్రైవేట్ యూనివర్సిటీల సిబ్బందిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఈసీ అడ్డుకున్నప్పుడే చంద్రబాబుకు తన ప్లాన్ ఫెయిలైందని అర్థమైందన్నారు. ఆ తర్వాత తాను నియమించుకున్న ఆర్వోల మీద భారం వేశారని, అయితే ప్రజా తీర్పు మరోలా ఉండటంతో ఇప్పుడు ఈవీఎంలను బదనాం చేస్తున్నారని దుయ్యబట్టారు.’ అని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. ‘కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీయడానికి వెళ్లాడట. చంద్రబాబులాగా. ఇక్కడ ఈగల మోతను తప్పించుకోవడానికి రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేస్తున్నారు. చిత్రమేమిటంటే ఆయన స్నేహితులెవరూ స్పెషల్ స్టేటస్ ఊసే ఎత్తరు. ఈయన గాబరా పడ్డట్టు ఈవీఎంల పైనా మాట్లాడరు.’ అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. -
పోలింగ్ శాతం ఎలా పెరిగింది?
జగిత్యాల: నిజామాబాద్ లోక్సభ ఎన్నికలపై పలు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. గంటలోపే 14 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ జీవన్రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్లోని ఓ హోటల్లో ఈవీఎంను పట్టుకున్నారని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరిగిన రోజునే ఈవీఎంలను తరలించాల్సింది పోయి 15వ తేదీ రాత్రి తరలించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. జగిత్యాల, నిజామాబాద్ కలెక్టర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్కుమార్ ఓడిపోలేదని వ్యాఖ్యా నించారు. లక్ష్మణ్కుమార్ ఓడిపోవడంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ‘ప్రజాగొంతుకైన కలానికి సంకెళ్లా?’ అనే పోస్టర్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం జగిత్యాల కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మకు వినతిపత్రాలు అందించారు. -
ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం: సందీప్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంలను హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి తెలిపారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను డీ కోడ్ చేయడం కష్టతరమని సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈవీఎం మిషన్లలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్ను ఇన్స్ట్రాల్ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో పరిశీలించిన తర్వాతే ఈవీఎంలను వినియోగిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ... ‘గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్నటువంటి కీలక పెద్దలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అభద్రతా భావంతో దుష్ప్రచారం చేస్తున్నారు. తాను ఒక ఎంబేడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా క్రిప్టాలజీ, ఎన్క్రిప్టింగ్ మీద గత 15 సంవత్సరాలుగా పని చేస్తూ ఉన్న వ్యక్తిగా వాస్తవాలను యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దల ఆరోపణలు చేస్తున్నట్లు ఒక ఈవీఎంను ట్యాంపర్ చేయాలంటే దానికి హార్డ్వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కీలకం. ఒకవేళ ఈవీఎంని నెట్వర్క్ వీడియోస్తో బిల్డ్ చేయాలంటే చాలా ఖరీదయిన పని’ అని అన్నారు. పూర్తి వీడియో... -
ఈవీఎంలను హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం
-
నిర్లక్ష్యమా..పెద్దల డైరెక్షనా?
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికలను 2014లో కంటే సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ తప్పుడు ప్రచారం కొనసాగుతుండటం వెనుక ఉన్న శక్తులపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రాథమికంగా వెల్లడైంది. ప్రధానంగా మూడు జిల్లాల అధికారులు ఉద్దేశ పూర్వకంగా విధుల నిర్వహణలో అలసత్వం వహించినట్లు తేలింది. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే సరి చేయడం కోసం బెంగళూరు నుంచి 600 మంది సాంకేతిక నిపుణులను రప్పించి, ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున కేటాయించినా వారిని ఉపయోగించుకోనట్లు తేలింది. కనీసం వీరికి రూట్ మ్యాప్లు కూడా ఇవ్వలేదన్న విషయంలో తెలియడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందువల్లే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందని భావిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 37, ప్రకాశంలో 25, గుంటూరు జిల్లాలో 21 చోట్ల రాత్రి తొమ్మిది దాటాక కూడా పోలింగ్ జరిగినట్లు గుర్తించారు. ఈవీఎంల మొరాయింపుపై అనుమానం అన్ని జిల్లాలో సక్రమంగా పనిచేసిన ఈవీఎంలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే మాటిమాటికి మొరాయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల ఆరేడు సార్లు ఈవీఎంలు మార్చడం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఏమైనా దాగి ఉందా అనే విషయంపై ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారిస్తోంది. ఉదాహరణకు కృష్ణా జిల్లా తీసుకుంటే మైలవరం నియోజకవర్గంలో అర్ధరాత్రి దాటినా పోలింగ్ జరగడం, నూజివీడు నియోజకవర్గంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా వినియోగించని ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి మార్చడం, పెనమలూరు నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఈవీఎంలను చాలా ఆలస్యంగా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చడం.. ఇలా ఒకే జిల్లా నుంచి పలు ఫిర్యాదులు వస్తుండటంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా తప్పులు చేసిన అధికారులపై ఎఫ్ఐఆర్లను నమోదు చేయడానికి కూడా వెనుకాడమని ద్వివేది హెచ్చరించారు. సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ జరగడానికి గల కారణాలు రాత పూర్వకంగా ఇవ్వాలని 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని చోట్ల ఏర్పాట్లు సరిగా చేయకపోవడానికి గల కారణాలను కూడా తెలియజేయాలన్నారు. రాజంలో మైనర్లు ఓటు వేసిన ఘటనల్లో వెంటనే నివేదికలు పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పోలింగ్ మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈవీఎంలను ఆర్వో అప్పగించలేదన్న విషయమై కలెక్టర్ను నివేదిక కోరామని, అయితే అలాంటిదేమీ లేదని కలెక్టర్ నివేదిక ఇచ్చారని ద్వివేది చెప్పారు. చర్యలు మొదలు పెట్టిన ఈసీ ఈవీఎంల భద్రత విషయంలో కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు దివ్వేది తెలిపారు. ఇప్పటికే నూజివీడు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తహసీల్దారు పి.తేజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. కృష్ణా యూనివర్సిటీ భవనంలో భద్రపరిచిన నూజివీడు నియోజకవర్గ రిజర్వు ఈవీఎంల తరలింపుపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్న నూజివీడు తహసీల్దార్ తేజేశ్వరరావుకు ఎన్నికల అధికారులు కొద్ది రోజుల క్రితమే షోకాజ్ నోటీసు జారీ చేశారు. స్ట్రాంగ్ రూంలలో ఉన్న ఈవీఎంలను కదలించకూడదని ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ వీటిని ఎందుకు తరలించారనే విషయమై ఉన్నతాధికారులు విస్తృత విచారణ చేపట్టారు. అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు వివాదం, ఈవీఎం స్ట్రాంగ్ రూంలో అనధికారిక వ్యక్తుల ప్రవేశంపై మరో ఇద్దరు అధికారులపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. ఐదు చోట్ల రీపోలింగ్కు అవకాశం గూంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 94వ పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్ కేంద్రం, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని 247వ పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీకి సిఫారసు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. -
ఒకటి ఓకే.. రెండు, మూడు అయితే కరెంట్ షాకే
రాయ్పూర్ : రెండో దశ లోక్సభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఛత్తీస్గడ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కావాసి లఖ్మా వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నికల సంఘంతో నోటీసులు ఇప్పించుకున్నారు. ఈవీఎంలో మొదటి బటన్ మాత్రమే నొక్కాలని, రెండో, మూడో బటన్ నొక్కితే కరెంట్ షాక్ తగులుతుందని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మంత్రి కావాసి లఖ్మా బుధవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కావాసి లఖ్మా ..‘రాష్ట్ర ఓటర్లంతా ఈవీఎంలపై ఉన్న మొదటి బటన్ మాత్రమే నొక్కాలి( మొదటి బటన్ కాంగ్రెస్ పార్టీ గుర్తు) అలా కాదని రెండో బటనో లేదా మూడో బటనో నొక్కితే కరెంట్ షాక్ తగులుతుంది. అందరు జాగ్రత్తగా మొదటి బటన్ నొక్కండి’ అని ఓటర్లకు సూచించారు. కాగా కావాసి మాటలు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా ఉందని, అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కావాసికి నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా రెండో దశ లోక్సభ ఎన్నికలు ఈ నెల 18న జరగనున్నాయి. ఛత్తీస్గఢ్లోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయి. -
‘పోలింగ్’ అవకతవకలు: ఆ అధికారులపై వేటు
-
స్ట్రాంగ్రూమ్ భద్రతపై వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ భద్రతపై రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. న్యాయవాదుల బృందంతో జిల్లా ఏఎస్పీ,ఆర్డీవోను కలిసి వైఎస్సార్సీసీ నేతలు మెమోరాండంను సమర్పించారు. అనుమతులు లేకుండా స్ట్రాంగ్రూమ్లోకి ఇతరులు ప్రవేశిస్తున్నారని మండిపడ్డారు. అధికారులే అనుకూల న్యూస్ చానెల్ రిపోర్టర్లను వీడియో గ్రాఫర్ పేరుతో స్ట్రాంగ్రూమ్కు తీసుకువెళ్లడంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలకు కల్పించే భద్రత ఇదేనా అని అధికారులను ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూమ్లకు వీడియో కవరేజ్ పేరుతో టీడీపీ నేతలు చెప్పిన వారికే బాధ్యతలు అప్పగించడం విస్మయం కల్గిస్తోందని మండిపడ్డారు. స్ట్రాంగ్ రూమ్ పుటేజ్ బయటకు వచ్చినా.. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో కలెక్టర్ చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా అధికారుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సిలార్ దాదా పేర్కొన్నారు. -
‘పోలింగ్’ అవకతవకలు: ఆ అధికారులపై వేటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైన అధికారులపై విచారణ కొనసాగుతోంది. నెల్లూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జరిగిన నాలుగు ఘటనల్లో అవకతవకలపై సంబంధిత ఎన్నికల సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ ఘటనలపై మూడు జిల్లాల కలెక్టర్ల నుంచి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. పోలింగ్ తర్వాత తలెత్తిన వివాదాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోల)పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేది సిఫారసు చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ద్వివేది తాజాగా మంగళవారం హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్ రూములకు తరలించిన పోలింగ్ నాటి ఈవీఎంలను కదిలించొద్దని, రిజర్వ్ ఈవీఎంలను తరలించాల్సి వస్తే ముందస్తు అనుమతితో, అందరి సమక్షంలోనే తరలించాలని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పెంచాలని కోరాయని, భద్రత పెంపు సాధ్యాసాధ్యాలపై డీజీపీని వివరణ కోరామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఘటనకు బాధ్యులెవరో విచారణలో తేలుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందో మీడియా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. -
రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు
సాక్షి, జగిత్యాల: జిల్లాలో రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు కలకలం రేపింది. సోమవారం రాత్రి జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఈవీఎంలను తీసుకువచ్చారు. వీటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే దానిపై ఆటో డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈవీఎంలను ఆటోలో తరలించడం గమనించిన కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవి డెమో ఈవీఎంలు అని ఆటో డ్రైవర్తో పాటు అక్కడున్న మరో వ్యక్తి చెబుతున్నారు. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఆటోలో ఈవీఎంలు..జగిత్యాలలో కలకలం
-
ఎందుకు ఈ యాగీ?
-
ఈసీవి డ్రామాలు
సాక్షి, అమరావతి: పేపర్ బ్యాలెట్కు ఉన్న సౌలభ్యాన్ని చూడకుండా ఈవీఎంల విషయంలో ఈసీ ఎందుకు ఇన్ని డ్రామాలాడుతోందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. మీరే డిక్టేటర్ అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలను మీరే నియమించుకోండని విమర్శించారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద ప్రజావేదిక హాలులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ను బీజేపీ పంపిస్తే ఈసీ చదివిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సారి ఎన్నికలను గతంలో కంటే విరుద్ధంగా ఎందుకు ముందుగా పెట్టారంటే సమాధానం లేదన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారులను బదిలీ చేసి భయబ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. వీవీ ప్యాట్స్ విషయంలో లెక్కింపు కుదరదనడానికి ద్వివేది ఏమైనా ఎక్స్ఫర్టా? ఆయన నిన్నటి వరకు నా దగ్గర పని చేయలేదా? అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీని ప్రమోట్ చేసింది తానేనని, సాంకేతిక వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చానని చెప్పారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం చాలా సులువని అన్నారు. 191 దేశాలకుగాను 18 దేశాలు మాత్రమే ఈవీఎంలు వాడుతున్నాయన్నారు. జర్మనీ, నేదర్లాండ్, ఐర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం గతంలో వాడి ఇప్పుడు వెనక్కు వచ్చాయన్నారు. ప్రపంచంలో ఈవీఎంల వినియోగం తీరుపై ఈ సందర్భంగా ఆయన పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2009 నుంచి ఈవీఎంలకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేస్తోందన్నారు. పోలింగ్ రోజునే అవకతవకలు జరుగుతూంటే ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం ఏమిటని, ఎన్నికల సంఘం ఎక్కడ సజావుగా ఎన్నికలు జరిపిందని ప్రశ్నించారు. ఈవీఎం యంత్రాలను ఎప్పటికప్పుడు సక్రమంగా సమీక్షించే సరైన వ్యవస్థ లేదన్నారు. నా ఓటు ఎవరికి పడిందో? వీవీ ప్యాట్లలోను ఓటు ఎవరికి వేశామనేది ఏడు సెకన్లు కన్పించాల్సి ఉండగా, మూడు సెకన్లు కూడా కనిపించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటు ఎవరికి వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికలకు ముందుగానే తమకు ఈవీఎంలపై అనుమానాలున్నాయని చెప్పామని చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు ముందు బ్యాలెట్ అంటే సమయం సరిపోదన్నారని, అందువల్ల 100 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేశామన్నారు. కనీసం 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ స్లిప్లు కౌంట్ చేయనప్పుడు వాటికి రూ.9 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని అడిగారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత తీసుకు రావడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేస్తే సారీ అనే ఒక్క పదంతో ఈసీ తేల్చేసిందన్నారు. అసలు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ విధానంపై అందరికీ స్పష్టత ఉండాలని, ఎన్నికల సంఘం ముందు అనేక అంశాలు వివరించామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఇందుకు ఐక్య కార్యాచరణ చేపడతామని ప్రకటించారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా 23 రాజకీయ పార్టీలు జాయింట్ పిటిషన్ వేశాయని చెప్పారు. వీవీ ప్యాట్ల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని ఈసీ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపునకు ఆరు రోజులు ఎందుకు పడుతుందని, ఈ విధానంపై సుప్రీంకోర్టుకు కొత్త పిటిషన్ (రివ్యూ పిటిషిన్) వేస్తామన్నారు. 150 సీట్లకు పైగా గెలుస్తాం.. ఈవీఎంలపై తాను మాట్లాడుతుంటే తాము ఓడిపోతామనే అనుమానాలు రేపుతున్నారని చంద్రబాబు అన్నారు. ‘గెలుపు విషయంలో నేను భయపడటమేంటి? మేమెందుకు ఓడిపోతాం? ఎలా ఓడిపోతాం? ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అర్ధరాత్రి వరకు ఉండి ఒక స్ఫూర్తితో ఓటేశారు. ఎవరెన్ని మాట్లాడుతున్నా అండర్ కరెంట్ చూడబోతున్నారు. 150కి పైగా సీట్లలో మేమే గెలుస్తాం. మోదీ ఎన్నికల్లో డబ్బు పంచి గెలవాలనుకుంటున్నారు. హెలికాఫ్టర్లో డబ్బులు తీసుకుపోతున్నారు. మోడల్ కోడ్ మోదీకి వర్తించదా? మొత్తం వ్యవస్థను మోదీ భ్రష్ట్రు పట్టించారు. నేరస్తులకు ఆయన చౌకీదారు. పెద్ద నోట్లు రద్దు చేసి మళ్లీ రూ.2 వేలు తేవడం ద్వారా వ్యవస్థను అస్తవ్యస్థం చేశారు. రాఫెల్ విషయంలో సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు’ అన్నారు. పాకిస్తాన్పై దాడుల విషయంలో కూడా మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. -
ఆత్మకూరు వీవీ ప్యాట్ స్లిప్లపై సీఈ ఆగ్రహం
-
ద్వివేది ఆగ్రహం
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరికిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆ స్లిప్పులు పోలింగ్ నాటివి కాదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా నూజివీడులో వాడని ఈవీఎంల తరలించిన వ్యవహారంపై స్పందించిన ద్వివేది.. ఈ రెండు వ్యవహారాల్లోనూ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలను ఈవీఎంల కమిషనింగ్ సెంటర్గా మాత్రమే వినియోగించామని, ఆత్మకూరు ఆర్డీవో ఆధీనంలో ఉన్న ఈ కమిషనింగ్ సెంటర్లో బ్యాలెట్ పత్రాలు పెట్టిన తర్వాత చెక్ చేశారని, పోలింగ్కు ముందే ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంలలో వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్ చేశారని, ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించారని తెలిపారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలు కమిషనింగ్ చేసిన సమయంలో వచ్చిన వీవీప్యాట్ స్లిప్పులను బయట పారేశారని, వీవీ ప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్ కేసు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ను సీఈఓ ద్వివేది ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో జరిగే తప్పులకు రిటర్నింగ్ అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఆ ఈవీఎంల తరలింపుపైనా ఆగ్రహం.. స్ట్రాంగ్ రూమ్ నుంచి వాడని ఈవీఎంలను తరలించడంపై సీఈఓ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) వెంటనే ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో దాదాపు గంటన్నరపాటు ఈవీఎంల తరలింపుపై నుజువీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కృష్ణా జిల్లా జేసీ మిషా సింగ్ వివరణ ఇచ్చారు. వినియోగించని, రిజర్వ్ చేసిన ఈవీఎంలను మాత్రమే తరలించామని వారు తెలిపారు. పోలింగ్ కేంద్రాలనుంచి ఈవీఎంలు రాకముందే.. వినియోగించని ఈవీఎంలను ఎందుకు తరలించలేదని ద్వివేది నిలదీశారు. ఈ విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఈవీఎంలపై 42 పార్టీల సంతృప్తి : ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై వస్తున్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.2017, మే 20న ఈవీఎంల ఛాలెంజ్కు రావాలని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తే కేవలం రెండు పార్టీలు సీపీఎం, ఎన్సీపీ మాత్రమే ముందుకొచ్చాయని పేర్కొంది. ఈ రెండు పార్టీలు ఈవీఎంలను పరీక్షించి వాటి పనితీరు పట్ల పూర్తి సంతృప్తి ప్రకటించాయని తెలిపింది. ఇక అదే ఏడాది మే 12న 42 పార్టీలు ఈవీఎంలను పరిశీలించి పలు సందేహాలను నివృత్తి చేసుకున్నాయని వెల్లడించింది. భవిష్యత్లో వీవీప్యాట్లతో అనుసంధానించిన ఈవీఎంలతో ఎన్నికలు జరుపుతామని పార్టీలకు ముందుగానే సమాచారం ఇచ్చామని, ఈవీఎంలను హ్యాక్ చేయలేరని ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈసీ గుర్తుచేసింది. గత 67 ఏళ్లుగా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని, మరింత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఈసీ స్పష్టం చేసింది. -
దొరికిన వీవీ ప్యాట్ స్లిప్పులు.. కలకలం!
సాక్షి, నెల్లూరు : ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో ఈవీంఎలకు అమర్చిన వీవీ ప్యాట్ స్లిప్పులు దొరకడం కలకలం రేపింది. ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుకు ఓటు వేశారో ఓటరకు తెలిపేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మేషిన్ల (ఈవీఎంల)కు వీవీ ప్యాట్లు అమర్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దాదాపు 200 వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికాయి. ఈ స్లిప్పులను ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి సోమవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల వినియోగానికి సంబంధించిన శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన స్లిప్పులు ఇవని రిటర్నింగ్ అధికారి తెలిపారు. నిబంధనల ప్రకారం శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా భద్రపరచాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనపై అధికారులను వివరణ కోరతామని కలెక్టర్ స్పష్టం చేశారు. -
ఈ బాబుకు ఏమైంది?
సాక్షి, అమరావతి: టెక్నాలజీయే తాను.. తానే టెక్నాలజీ.. అని చెప్పిన నోటితో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్ కావాలంటూ రాద్ధాంతం చేయడం.. తన ఓటు తనకే పడిందో లేదో తెలియడం లేదని అనుమానాలు వ్యక్తం చేయడం.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అధికారులపై నోరు పారేసుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఏమో అయిందని సాధారణ ప్రజలు, సొంత పార్టీ నేతల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో అభద్రత, అసహనంతో పాటు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం చూస్తుంటే ఓటమిని ముందే గ్రహించి.. దాన్ని జీర్ణించుకోలేక గ్రౌండ్ను సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు, ఢిల్లీ వెళ్లి చేస్తున్న హడావుడి అంతా ఓటమిని అంచనా వేసిన నాయకుడు చేసే చేష్టలని చెబుతున్నారు. ఈవీఎంలను మొదట ఎందుకు వ్యతిరేకించలేదు? ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఈవీఎంల మీద నమ్మకం లేదని, ప్రజాస్వామ్యాన్ని మిషన్ల చేతిలో పెడతారా? అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు గత ఎన్నికల్లో వాటి ద్వారానే గెలిచిన విషయాన్ని ఎందుకు గమనంలోకి తీసుకోవడంలేదనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. 2014లో ఆయన అధికారంలోకి వచ్చాక జరిగిన నంద్యాల ఉప ఎన్నికలోనూ ఈవీఎంలే వాడారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థే గెలిచారు. అంతకు ముందు 1999లో గ్రేటర్ హైదరాబాద్లో ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపొందింది. అప్పటి నుంచి ఈవీఎంలతోనే దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి. 2004, 2009 ఎన్నికలూ ఈవీఎంలతోనే జరిగాయి. అప్పుడు వాటిని వ్యతిరేకించని చంద్రబాబు హఠాత్తుగా ఈ ఎన్నికల్లోనే కొత్తపల్లవి అందుకోవడానికి రాజకీయ అంశాలే కారణమని చెబుతున్నారు. అంతా టెక్నాలజీ అంటూ.. ఈవీఎంలు వద్దంటే ఎలా? టెక్నాలజీ లేకపోతే బతుకులే లేవని, దాంట్లో తాను లబ్ధ ప్రతిష్టుడినని చెప్పుకునే చంద్రబాబు ఈవీఎంలను వ్యతిరేకించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 11వ తేదీన ఏపీలో జరిగిన పోలింగ్లో 30 శాతం ఈవీఎంలు పనిచేయ లేదని చంద్రబాబు చేసిన ఆరోపణపై ఎన్నికల ప్రధాన అధికారి వెంటనే వివరణ ఇచ్చారు. అయినా ఈ విషయాన్ని రచ్చ చేయాలని నిర్ణయించుకున్న ఆయన అదేపనిగా విమర్శలు చేస్తూనే ఉండటంపై టీడీపీ నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడంలేదని, లేనిపోని సమస్యలు సృష్టిస్తూ తనంతట తాను అందరిలో పలుచన అయిపోతున్నారని వాపోతున్నారు. ఈవీఎంలపై లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకు నేర చరిత్ర ఉన్న వేమూరి హరి ప్రసాద్ను పంపడాన్ని ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోవడం కచ్చితంగా పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమేనని ఆందోళన చెందుతున్నారు. టీడీపీకి ఓటేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని, తన ఓటు టీడీపీకే పడిందో లేదో తెలియడం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు స్వపక్షీయులకు సైతం ఆశ్చర్యం కలిగించాయంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఈ స్థాయి నేలబారు విమర్శలు చేస్తారని పార్టీ నాయకులు, శ్రేణులతో సహా ఎవరూ ఊహించలేదని సీనియర్ రాజకీయ నేతలు సైతం అశ్చర్యపోతున్నారు. అధికార యంత్రాంగంపై అభాండాలేమిటి? ఎన్నికల కమిషన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చంద్రబాబు.. కోవర్టుగా అభివర్ణించడంపై అధికార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు ఆయన నడిపిన ప్రభుత్వంలోనే పని చేసిన ఒక ఉన్నతాధికారిపై అంత దారుణమైన అభాండం వేయడం ఏమిటని సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొంది. నియమితులైన అధికారులంతా చంద్రబాబు ప్రభుత్వంలో పని చేస్తున్న వారే. ఎన్నికల కమిషన్ నేతృత్వంలో పని చేసిన అధికార యంత్రాంగమంతా ప్రభుత్వంలో మొన్నటివరకూ ఆయన కనుసన్నల్లోనే పని చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదారుగురు అధికారులను బదిలీ చేస్తే మిగిలిన యంత్రాంగంమంతా కోవర్టులైపోయినట్లు చంద్రబాబు మాట్లాడడం సరికాదనే భావన సొంత పార్టీలోనే వినిపిస్తోంది. విపరీత ప్రవర్తన ఆయన మానసిక స్థితిని తెలుపుతోందా! చంద్రబాబు ఎందుకు ఇలా వింతగా, విపరీతంగా ప్రవర్తిస్తున్నారనే దానిపై రకరకాల అనుమానాలు సొంత పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఆయనకు మానసికంగా ఏమో అయిందేమోనని అంతర్గత సంభాషణల్లో ముఖ్య నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ‘మా బాస్ ఉన్నట్లుండి తీవ్ర స్థాయిలో మమ్మల్ని కోప్పడుతున్నారు. ఎందుకు అలా అన్నారు.. ఏం తప్పు చేశామని పరిశీలించుకుంటే మాకు ఏమీ కనిపించడంలేదు. ఇదే విషయాన్ని మరో నేత వద్ద ప్రస్తావించినా, ఆయన మాటలు ఇప్పుడేమీ పట్టించుకోవద్దు. ఎన్నికల్లో మన పరిస్థితి మనకు అర్థమైపోతుంది కదా... మరి పార్టీకి బాస్ అయిన ఆయన మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి’అని ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. తానే సర్వస్వం అయినట్లు, ఆంధ్ర రాష్ట్రం అంటే తాను, టీడీపీ అని రకరకాలుగా చేస్తున్న చిత్రీకరణలపైనా విస్మయం వ్యక్తమవుతోంది. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఆయన ఇలా ప్రవరిస్తున్నారనే ప్రచారం అన్ని వర్గాలతో పాటు ఉన్నతాధికారుల చర్చల్లోనూ జరుగుతుండటం గమనార్హం. ఎన్నికలు ఫార్స్ అని, కమిషన్ చేతగానిదని చెప్పడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విచక్షణ కోల్పోయి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, కంట్రోల్లో లేని హావభావాలు ఆయన మానసిక స్థితి సరిగా లేదని తేటతెల్లం చేస్తున్నాయని మానసిక నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. -
నేతల భవిత భద్రం!
మహబూబ్నగర్ క్రైం: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ తీర్పు తెలపగా.. ఈవీఎంలలో నేతల భవిత భద్రంగా ఉంది. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 12మంది అభ్యర్థులు బరిలో ఉండటం తెలిసిన విషయమే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలన్నింటినీ ఇప్పుడు జిల్లా కేంద్రంలోని జేపీఎన్సీఈ కళాశాల భవనాల్లో ఉంచారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఈవీంలు, వీవీప్యాట్లు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఇక అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో దాగి ఉంది. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అంటే సరిగ్గా 38రోజుల సమయం ఉంది. ఇన్ని రోజులు అభ్యర్థులు ఓపిక పట్టక తస్పదు. ఇప్పుడు అందరి చూపు జేపీఎన్ఈఎస్ కళాశాల వైపే ఉంది. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు మహబూబ్నగర్, షాద్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. భవనంలోని కింది అంతస్తులో మూడు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలు, పైన అంతస్తులో నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక స్ట్రాంగ్ రూం, ఒక ఓట్ల లెక్కింపు గదిని ఏర్పాటు చేశారు. అధికారులు, అభ్యర్థులు కూర్చునేందుకు, అలాగే మీడియా పాయింట్కు వేర్వేరు గదులను కేటాయించారు. నిఘా నేత్రాలతో పర్యవేక్షణ భవనం లోపల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలో ఇతర విలువైన ఎన్నికల సామాగ్రి ఉన్నందున నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల్లోని స్ట్రాంగ్ రూంలు, గదులు తలుపులకు, హాళ్లలో, విధులు నిర్వహించే పోలీసుల గదుల వద్ద, భవనం, బయట కెమెరాలు బిగించారు. ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన గదులు, హాల్లో కనీసం కలిపి దాదాపు 30వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భవనం బయట, లోపల అన్ని గదులు సీసీ కెమెరాల నిఘా నేత్రంలో నిక్షిప్తమవుతున్నాయి. బందోబస్తు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండేందుకు ఇవి దోహదపడటమే కాకుండా ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పని చేస్తాయి. భవనం లోపల, పైన ఆరుబయట ప్రాంగణం మొత్తంలో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేశారు. పారామిలటరీ పోలీసుల ఆధీనంలో.. జేపీఎన్ఈఎస్ భవనాన్ని సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్), పారామిలటరీ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 40మంది సీఆర్పీఎఫ్, 20మంది జిల్లా పోలీసులు నిత్యం ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భవనం లోపల పారామిలటరీ పోలీసులే ఉంటారు. సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపరు. జిల్లా లోకల్ పోలీసులను కూడా లోనికి అనుమతించారు. స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు నిర్వహించే సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి డ్యూటీ వేస్తారు. భవనం లోనికి వెళ్లే ప్రధాన ద్వారంతో పాటు పక్కన, వెనుక ఉన్న గేట్ల వద్ద బందోబస్తు పెట్టారు. ఉన్నతాధికారుల అనుమతితో పని నిమిత్తమై వచ్చే ఆర్వో, ఏఆర్వోలను అప్పుడప్పుడూ అధికారులకు లోపలికి వెళ్లడానికి మాత్రం అవకాశం కల్పిస్తారు. అలాగే భవనం చుట్టూ పోలీసులు పికెటింగ్లు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. భవనం వద్ద బందోబస్తుపై లోకల్ పోలీసులకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచనలు చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ ప్రాంగణంలోనికి రానివ్వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
ఈవీఎం భద్రతలో బయటపడ్డ డొల్లతనం
-
ఈవీఎం విజువల్స్.. కలెక్టర్ ఆగ్రహం
కృష్ణా జిల్లా: మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా యూనివర్శిటీలో శనివారం అర్ధరాత్రి ఈవీఎంల తరలింపులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ఓ న్యూస్ చానల్లో ప్రచారం కావటంతో పాటు, ఓ దినపత్రికలో కూడా వార్త ప్రచురితమైంది. దీనిపై రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడు నియోజకవర్గానికి చెందిన పోలింగ్ ప్రక్రియకు ఉపయోగించిన ఈవీఎంలతో పాటు, రిజర్వ్లో ఉన్న ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అనంతరం రిజర్వ్లో ఉన్న ఈవీఎంలను మచిలీపట్నంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదాముకు తరలించారు. ఈ సంఘటనపై న్యూస్ చానల్, దినపత్రికలో స్ట్రాంగ్ రూంలను తెరిచి ఈవీఎంలను తరలించినట్లు ప్రచురితమైంది. దీనిపై ఆదివారం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్తో పాటు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జిల్లా అధికారులు స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ రిజర్వ్లో ఉన్న ఈవీఎంలను మాత్రమే స్ట్రాంగ్ రూంకు తరలించటం జరిగిందన్నారు. అది కూడా నూజివీడు నియోజకవర్గ రాజకీయ పార్టీ నాయకుల సమ్మతితోనే తరలించటం జరిగిందన్నారు. అయితే ఓ న్యూస్ చానల్లో ప్రసారం అయిన వీడియోను ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంట ఉన్న వీడియో గ్రాఫర్ ద్వారా లీకైనట్లుగా భావిస్తున్నామన్నారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణతో పాటు, సీసీ కెమోరాల పుటేజీలను కూడా సేకరించి సంబంధిత వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఆ దృశ్యాలను సదరు మీడియా ఛానల్లో ప్రసారం కూడా చేశారు. -
ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీపై ఆరోపణలు : జీవీఎల్
-
టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయం
సాక్షి, ఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్లో ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జీవీఎల్ ఆదివారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పుడు ఈవీఎంను తప్పుబడుతున్న చంద్రబాబు....2014 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు యాగీ చేస్తున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. ఏపీలో మూడు కోట్లమంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. వారికి రాని అనుమానం చంద్రబాబుకు మాత్రమే ఎందుకు వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఓ పరిపక్వత గల రాజకీయ నాయకుడు అలా ప్రవర్తించరాదని, చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఎందుకని ప్రశ్నించారు. ఆయనలో ఆ హుందాతనం కనిపించకపోగా, చౌకబారుతనం కనిపించిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. -
రు‘బాబు’పై విస్మయం!
సాక్షి, చిత్తూరు: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సామే. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తోంది. కచ్చితత్వం కోసం ఎంత కఠిన నిర్ణయాలనైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఎన్ని రాజకీయాలు ఎదురొస్తున్నా స్వతంత్రతను కాపాడుకుంటూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతోంది. అలాంటి ఎన్నికల సంఘంపై చంద్రబాబు నాయుడు ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు. పెరిగిన ఓటింగ్ తమకే లాభమని ఒకసారి.. ఓటింగ్ తగ్గించేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని మరోసారి.. ఈవీఎంలు సరిగ్గా పనిచేయనీకుండా చేసి వైఎస్సార్సీపీకి లాభం చేకూరేలా ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోందని ఇంకో సారి మాట్లాడుతుండడంపై పలువురు మేధావులు ఆక్షేపిస్తున్నారు. పసుపు కుంకుమ ద్వారా మహిళల ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అయితే ట్రెండ్ మాత్రం టీడీపీకి అనుకూలంగా లేకపోవడంతో చంద్రబాబు నాయుడు పరనిందలు మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేయడం వల్లే ఘోరపరాభవం ఎదురవుతోందని టీడీపీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. మొరాయించిన ఈవీఎంలు 0.3 శాతమే జిల్లా వ్యాప్తంగా 13వేల ఈవీఎంలు ఓటింగ్ కోసం ఉపయోగించారు. వీటిలో కేవలం 0.3 శాతం ఈవీఎంలు మాత్రమే మొరాయించాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని పదేపదే ప్రెస్మీట్లో చెప్పారు. బాబు ఆదేశంతోనే టీడీపీ నాయకులు ఎన్నికల్లో గొడవలు సృష్టించారు. కొన్నిచోట్ల దాడులకు కూడా తెగబడ్డారు. ఇవన్నీ పోలింగ్ను తగ్గించేందుకు చేసిన కుట్రలే. అయినా జనం దేనికీ వెరవకుండా ఓటింగ్లో పాల్గొన్నారు. 80 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనం. ఈవీఎంలు సరిగా పనిచేయకపోతే పోలింగ్ ఎక్కువ శాతం ఎందుకు నమోదవుతుందని తటస్థులు ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయంతోనే డ్రామాలా? ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని తెలిసే చంద్రబాబు నాయుడు ఈసీపై యుద్ధం అనే డ్రామాలాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పెరిగిన ఓటింగ్ శాతంపై విద్యావేత్తలు, మేధావులు ప్రశంసిస్తున్నారు. అయితే బాధ్యతగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎన్నికలను ఫార్సుగా చూపిస్తున్నారు. ఇది ప్రజాతీర్పును, ఎన్నికల వ్యవస్థను అవమానపరచడమే అని ప్రభుత్వ అధికారులు సైతం తేల్చి చెబుతున్నారు. అరాచక పాలనపై ఓటర్లు దండెత్తడంతోనే ఆయన ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. వైఫల్యాలను అంగీకరించి ఉంటే హుందాగా ఉండేదని వారు అంటున్నారు. 2014లో టాంపరింగ్తోనే గెలిచారా? ఈవీఎంలను టాంపరింగ్ చేశారని చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలపై ప్రజలు భగ్గుమంటున్నారు. మరి 2014లో ఈవీఎంలను టాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హైటెక్ బాబుకు ఈవీఎంల పనితీరు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. బాబు వైఖరిపై రాజకీయ వర్గాల్లోనూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. ‘మన ఈవీఎంలను ఇతర దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. వీటిల్లో తప్పు ఉంటే ఎందుకు వాడుకుంటారు’ అని వారు చర్చించుకుంటున్నారు. ప్రజలు తిరస్కరించినట్లు స్పష్టమైన ట్రెండ్ ఉండబట్టే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. బాబుకు బుద్ధి చెప్పడానికే ప్రజలు ఓటెత్తారని వారు చెప్పుకుంటున్నారు. 2014 కంటే జిల్లాలో దాదాపు 2 శాతం పోలింగ్ ఎక్కువ నమోదైంది. -
బాబూ ఇదేనా మీ అనుభవం?
-
ఆ నిందితుడు చంద్రబాబు సన్నిహితుడే!
ఆంధ్రప్రదేశ్లో మూడు కోట్ల మందికి పైగా ఓటేశారు. వారంతా వీవీ ప్యాట్లో తమ ఓటు పడిన గుర్తును నిర్ధారణ చేసుకున్నారు. ఆ తర్వాత సంతృప్తితో బయటకు వచ్చారు. తాము బటన్ నొక్కిన గుర్తు కాకుండా మరో గుర్తు వీవీ ప్యాట్లో కనిపించి ఉంటే అక్కడే ఫిర్యాదు చేసేవారు. కానీ మూడు కోట్లకు పైగా ఓటర్లలో ఒక్కరి నుంచి కూడా ఒక్క ఫిర్యాదు రాలేదు. ఎన్నికల కమిషన్ వైఫల్యంతో రాష్ట్ర ప్రజలంతా తెల్లవారుజాము దాకా ఓటేయడానికి నిరీక్షించాల్సి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. కానీ రాష్ట్రంలోని 46 వేల పోలింగ్ బూత్లలో రాత్రి 8 గంటల తర్వాత పోలింగ్ కొనసాగిన బూత్ల సంఖ్య 200 పైచిలుకు మాత్రమే. దొంగా దొంగా అని దొంగే అరచినట్టు.. వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థ యాత్రకు వెళ్లినట్లు.. ప్రజాస్వామ్య వ్యవస్థల పని తీరుపై చంద్రబాబు మొగసాల కెక్కడం వింతగా,రోతగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ దొడ్లో కట్టేసుకున్న పెద్దమనిషి బహురూప వేషంపై విమర్శల జడి కురిసింది. ట్యాంపరింగ్ దొంగ బాబు సన్నిహితుడే ఈవీఎంల ట్యాంపరింగ్పై చంద్రబాబు మాటలు చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి పాడు పనులు అన్నట్లున్నాయి. ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడిన వారితో సన్నిహిత సంబంధాలున్నది ఆయనకే. దశాబ్దం క్రితం ఎన్నికల సంఘం నుంచి ఈవీఎంను దొంగలించి ట్యాంపరింగ్కు పాల్పడిన నేరంంలో వేమూరి హరిప్రసాద్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇతను, ఇతని సోదరుడు రవికుమార్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. వారి సంస్థకే చంద్రబాబు దాదాపు రూ.2 వేల కోట్ల ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టును కట్టబెట్టారు. ఆ సోదరుల సంస్థకే గన్నవరం వద్ద 100 ఎకరాలను కారుచౌకగా కేటాయించడం గమనార్హం. ఎన్ఆర్టీ సంస్థ పేరిట రాజధాని అమరావతిలో కూడా 5 ఎకరాల భూమిని కేటాయించారు. కాగా ఈవీఎంలపై సందేహాల నివృత్తి కోసం పంపించే బృందం నుంచి హరి ప్రసాద్ను తొలగించాలని సీఈసీ ఆదేశిస్తూ ఝలక్ ఇవ్వడం గమనార్హం. తప్పు చేసిన ప్రతిసారీ ఢిల్లీకెళ్లి యాగీ రాష్ట్రంలో చంద్రబాబు తప్పు చేసి దొరికిన ప్రతి సందర్భంలోనూ ఢిల్లీకి వెళ్లి యాగీ చేశారు. రాష్ట్ర విభజనకు తానే లేఖ ఇచ్చి.. తర్వాత ఆయనే వెళ్లి వద్దంటూ నిరాహార దీక్ష చేశారు.. ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు.. వెంటనే ఢిల్లీకి వెళ్లి వ్యవస్థలను మేనేజ్ చేసేపనిలో పడ్డారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరించానంటారు.. చీకట్లో వెళ్లి బీజేపీ నాయకులతో మంతనాలు సాగించారు. ఇప్పుడు కూడా అయిదేళ్లూ అరాచకాలు చేశారు.. చివరి నిమిషంలో ఈవీఎంలమీద, ఈసీ చేసిన ట్రాన్స్ఫర్లమీద నేరం నెడుతున్నారు. మరోవైపు తనకు 130 సీట్లు వస్తాయంటున్నారు. టీచర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉంటే తనకు నష్టం అని భావించిన చంద్రబాబు.. ఎన్నికల విధుల్లో ప్రైవేట్, ఇతర ఉద్యోగులను భారీగా నియమించారు. అనుభవం లేని ఉద్యోగులను నియమించడం వల్లే ఈవీఎంలు మొరాయించాయని తెలుస్తోంది. ఈ విషయంపై కూడా విచారణ జరపాలి. ఓటమి ఖాయమవడంతో చంద్రబాబు ఫ్రస్టేషన్ చూస్తుంటే.. దేశం వదిలి కుటుంబంతో సింగపూర్లోనో, మలేషియాలోనో సెటిల్ అవుతారనిపిస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు ఉన్న 3.13 కోట్ల మంది ఓట్లు వేశాక.. తాము ఓటేసిన అభ్యర్థి పేరు, గుర్తు వీవీ ప్యాట్లోని తెల్ల కాగితంపై స్పష్టంగా కనిపించడం చూసి సంతృప్తి చెందారు. తాము ఏ గుర్తుకు ఓటు వేశామో ఆ గుర్తుకే ఓటు పడిందని నిర్ధారించుకున్నాక పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చారు. తమ ఓటు హక్కును సజావుగా, సులువుగా సద్వినియోగం చేసుకున్నామన్న సంతోషంతో ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, సన్నిహితులకు.. పోలింగ్ ఎలా సక్రమంగా, సులువుగా జరిగిందో వివరించి చెప్పారు. దాంతో అంత వరకు కాస్త బద్దకించిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెంటనే పోలింగ్ బూత్లకు వెళ్లి సజావుగా ఓటేశారు. అలా ఒకరు.. ఇద్దరు కాదు.. రాష్ట్రంలో 3.13 కోట్ల మంది నిర్భయంగా, సక్రమంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కరు కూడా తమ ఓటు ఎవరికి పడిందో తమకు తెలియలేదని ఫిర్యాదు చేయలేదు. ఈవీఎంలతోగానీ, వీవీప్యాట్లతోగానీ ఇబ్బంది ఏర్పడిందని ఒక్కరు కూడా ఆరోపించనే లేదు. అందరిదీ ఒకదారైతే.. చంద్రబాబుది మరోదారి రాష్ట్రంలో 80 శాతం మంది ఓటర్లుకు రాని సందేహం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఎందుకు వచ్చిందోనని జనం ఆశ్చర్యపోతున్నారు. తానేసిన ఓటు ఎవరికి పడిందో తనకే తెలియలేదని ఆయన దిగజారుడు ఆరోపణలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఈవీఎంలతోపాటు వోటర్ వెరిఫెరబుల్ పేపర్ ఆడిట్ ట్రోల్ (వీవీప్యాట్)లను వినియోగించారు. ఈవీఎంలో బటన్ నొక్కగానే ఓటు పొందిన అభ్యర్థి పేరు, గుర్తు ఆ వీవీ ప్యాట్లో ఓటర్లందరికీ కనిపించాయి. తమ ఓటు ఎవరికి పడిందో తెలీలేదని నిరక్ష్యరాస్యులు, వయోవృద్ధులు కూడా సందేహం వ్యక్తం చేయలేదు. కానీ చంద్రబాబుకు మాత్రం తన ఓటు ఎవరికి పడిందో కూడా తెలీదట. మరి ఓటు ఎవరికి పడిందో తెలియకపోతే ఆయన వెంటనే ఆ పోలింగ్ బూత్లో అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఫిర్యాదు చేసి ఉంటే అధికారులు వెంటనే స్పందించే వారు కదా.. రాష్ట్రంలో 3.13 కోట్ల మంది సవ్యంగా ఓటేశారు. వారిలో టీడీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ ఒక్కరు కూడా తమ ఓటు ఎవరికి పడిందో అన్న సందేహం వ్యక్తం చేయలేదు. నిజంగా ఎవరికి ఓటు పడిందో తెలియకపోతే రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అలజడులు జరిగేవి. అలా జరగలేదంటే తాము ఎవరికి అయితే అనుకున్నామో వారికే తమ ఓట్లు పడ్డాయని రాష్ట్రంలోని ఓటర్లందరికీ తెలిసిందన్నది సుస్పష్టం. ఈవీఎంలపై 80 శాతం మందికి పూర్తి నమ్మకం రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 79.60 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అంటే మొత్తం 3.13 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతను నిర్వర్తించారు. 2014 ఎన్నికల్లో 78.41 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకంటే ఈసారి 1.23 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో 46,120 పోలింగ్ బూత్లలో ఎన్నికలు నిర్వహించారు. అందు కోసం రికార్డు స్థాయిలో 92 వేల ఈవీఎంఎలను వినియోగించారు. గురువారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓపిగ్గా క్యూలలో నిలబడి మరీ క్రమశిక్షణతో పోలింగ్ బూత్లలోకి వచ్చారు. ఈవీఎంల వద్దకు వెళ్లి తమకు నచ్చిన పార్టీకి ఓటేశారు. తాము వేసిన వారికే ఓటు పడిందో లేదా వీవీ ప్యాట్లలో నిర్ధారించుకుని సంతృప్తితో బయటకు వచ్చారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఓటరు కూడా పోలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎన్నికల సంఘం ఇంత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించబట్టే రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 సాధారణ ఎన్నికల ప్రక్రియలో తొలి దశలో దేశంలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించింది. దేశంలో దాదాపు 14 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఏపీ, బెంగాల్లలోనే 80 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా ఈవీఎంల పని తీరుపట్ల దాదాపు సంతృప్తి వ్యక్తమైంది. ఓటమి ఖాయమని తెలిసే బాబు చిందులు ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతోనే చంద్రబాబు నానా రభస చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించనుందని కొంత కాలంగా జాతీయ సర్వేలు స్పష్టం చేస్తుండటంతో చంద్రబాబులో గుబులు పట్టుకుంది. దాంతో ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు పన్నాగం పన్నారు. కానీ ఆయన అక్రమాలకు వత్తాసు పలికే అప్పటి ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లా ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. టీడీపీకి వత్తాసు పలుకుతున్న ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ను కూడా పోలింగ్కు ముందు రోజు బదిలీ చేసింది. తమ కుతంత్రాలను ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో చంద్రబాబు తట్టుకోలేకపోయారు. హడావుడిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వద్దకు నేరుగా వెళ్లి ఆయన్ని నిలదీయడం అందర్నీ విస్మయపరిచింది. అప్పటి నుంచి చంద్రబాబు అపరిచితుడి మాదిరిగా పూటకో రీతిలో చెలరేగిపోతున్నారు. అమరావతి, హస్తినలో నిస్సిగ్గుగా అబద్ధాలు పోలింగ్ రోజు గురువారం ఉదయం 10 గంటల్లోపే పోలింగ్ ట్రెండ్ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు చంద్రబాబుకు నివేదించాయి. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తూ నానా హడావుడి చేశారు. ఆయన ఉండవల్లిలోని పోలింగ్ బూత్కు వెళ్లి సజావుగా ఓటేసి బయటకు వచ్చారు. ఆ పోలింగ్ బూత్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కానీ, అసౌకర్యంకానీ కలగలేదు. కానీ బయటకు రాగానే ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా 30 శాతం ఈవీఎంలు పని చేయడం లేదని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రీపోలింగ్కు డిమాండ్ చేశారు. ఏ గుర్తుకు ఓటేసినా ఫ్యాన్కు పడుతోంది.. కమలం గుర్తుకు పడుతోంది.. అంటూ నిస్సిగ్గుగా అసత్య ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లింది. పోలింగ్ జరిగిన మర్నాడు అంటే శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘంపై చిందులు తొక్కారు. శనివారం ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ రభస చేయడం అందర్నీ విస్మయ పరిచింది. చంద్రబాబు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాతో శనివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై అహేతుకమైన, ఊహాజనితమైన ఆరోపణలు చేశారు. తాము నిబంధనల మేరకే ఎన్నికలు నిర్వహించామని అరోరా స్పష్టం చేసినట్లు తెలిసింది. దాంతో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అదేరీతిలో నిస్సిగ్గుగా అసత్య ఆరోపణలు చేశారు. 0.03% మొరాయిస్తే 30% అన్న చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించడం చాలా తక్కువగానే జరిగింది. సాధారణంగా ఏ ఎలక్ట్రానిక్ మేషిన్లు అయినా సాంకేతిక సమస్యలతో మొదట్లో 5 శాతం వరకు మొరాయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో కేవలం 0.03 శాతం ఈవీఎంలే మొదట కాస్త మొరాయించాయి. మొత్తం 92 వేల ఈవీఎంలలో కేవలం 400 ఈవీఎంలు మాత్రమే మొరాయించాయి. అది కూడా ముందురోజు నిర్వహించిన మాక్ పోలింగ్ డాటా తొలగించక పోవడంతోనే సాంకేతిక సమస్య ఏర్పడింది. సంబంధిత ఇంజినీర్లు వెంటనే వచ్చి వాటిని సరిచేయడంతో పోలింగ్ సజావుగా సాగింది. చంద్రబాబు మాత్రం ఏకంగా 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని చెబుతూ అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయడం విస్మయ పరిచింది. అందుకే ఆయన డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. 6 గంటల తర్వాత పోలింగ్ కేవలం 228 బూత్లలోనే రాష్ట్రంలో 46 వేల పోలింగ్ బూత్లలో కేవలం 228 బూత్లలోనే సాయంత్రం 6 గంటల తరువాత పోలింగ్ కొనసాగింది. అది కూడా ఎండ తీవ్రతతో ఆ బూత్లలో ఓటర్లు మధ్యాహ్నం ఓట్లు వేయడానికి రాలేదు. సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న వారందరినీ ఓటింగ్ను అనుమతించాలి. కాగా, పోలింగ్ చివరి దశలో అక్రమాలకు టీడీపీ మరింత బరితెగించడంతోనే ఆలస్యమైంది. ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడు వద్ద సాయంత్రం 7 గంటల తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన వర్గీయులను క్యూలైన్లలోకి పంపించారు. వారికి ఓటువేసే అవకాశం కల్పించకూడదని, పోలింగ్ ముగించాలని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరులపై ఎమ్మెల్యే వంశీ తన అనుచరులతో దాడికి దిగారు కూడా. కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఏకంగా 30 శాతం పోలింగ్బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. 2014 ఎన్నికల్లోనూ ఈవీఎంలే దేశంలో 2004 నుంచి ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికలు కూడా ఈవీఎంల ద్వారానే నిర్వహించారు. అప్పుడు ఆయన ఈవీఎంల మీద సందేహం వ్యక్తం చేయనే లేదు. అప్పట్లో వీవీ ప్యాట్లు లేవు. ప్రస్తుతం వీవీ ప్యాట్లు కూడా ఏర్పాటు చేయడంతో తాము వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటర్లకు కచ్చితంగా తెలుస్తోంది. ఇక 2016లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఈవీఎంలే వినియోగించారు. అప్పుడు అక్కడ టీడీపీ ఘన విజయం సాధించింది. అప్పుడు కూడా ఆయన ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేయలేదు. 2014 నుంచి 2018వరకు కేంద్రంలో బీజేపీతో కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఏనాడు ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించనే లేదు. అయితే ఇప్పుడు మాత్రం.. అదీ పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు వద్దు.. మళ్లీ పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేయడం గమనార్హం. కంప్యూటర్లు నేనే తెచ్చాను.. సెల్ఫోన్లు నేనే తెచ్చాను.. టెక్నాలజీ నేనే తెచ్చాను.. అంటూ హైటెక్ సీఎంగా చెప్పుకునే చంద్రబాబు మళ్లీ పేపర్ బ్యాలెట్ తేవాలని అనడం విడ్డూరమని జనం నవ్వుకుంటున్నారు. బాబుకు దక్కని మద్దతు ఎన్నికల సంఘం, ఈవీఎంలపై అసంబద్ధ ఆరోపణలు చేసిన చంద్రబాబు జాతీయ స్థాయిలో ఎలాంటి మద్దతు కూడగట్టలేకపోయారు. ఆయన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం కూడా తోసిపుచ్చినట్లు సమాచారం. తాము నిబంధనల మేరకు సజావుగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారని తెలిసింది. దాంతో చంద్రబాబు అసహనంగా బయటకు వచ్చేశారు. ఇరత పార్టీల నుంచి చంద్రబాబుకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్తోసహా పలు బీజేపీయేతర పార్టీలు ఆయన వాదనను సమర్థించేందుకు సుముఖత చూపలేదు. ఈవీఎంల ద్వారానే ఇటీవల రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే ఆ పార్టీ చంద్రబాబుకు ఈ విషయంలో మద్దతు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. ఢిల్లీలో తనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో చంద్రబాబు డీలా పడ్డారు. దాంతో మరో రోజు ఢిల్లీలో ఉండి కాస్త హడావుడి చేయాలని భావిస్తున్నారు. ఈసీ ఛాలెంజ్ను ఎందుకు స్వీకరించలేదు? ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెట్టడాన్ని ఢిల్లీలోని అధికార వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. అప్పటి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నదీం జైదీ తీవ్రంగా స్పందించారు.ఎవరైనా ఈవీఎంలు ట్యాంపర్ చేయండి చూస్తాం అని ఆయన 2017 మేలో రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. గడువులోగా టీడీపీతోపాటు ఏ పార్టీ కూడా ఆ సవాల్ను స్వీరించనే లేదు. అప్పుడు సవాల్కు స్పందించని చంద్రబాబు ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారు.. చిప్పే కదా మేనేజ్ చేసేస్తున్నారని అసంబద్ధ ఆరోపణలు చేయడాన్ని ఎన్నికల సంఘం అధికారులు తప్పుబడుతున్నారు. చంద్రబాబు మాటలు హాస్యాస్పదం నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు తాను వేసిన ఓటు ఎవరికి పడిందో తెలియడం లేదని చెప్పడం చూస్తున్న ప్రజలు నవ్వుకుంటున్నారు. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. ఓటు వేశాక డిస్ప్లేలో మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్లో కనిపిస్తుంది. నేను ఓటు వేసిన సమయంలో గమనించి సంతృప్తి చెందా. – రామకృష్ణమరాజు, విజయపురం, చిత్తూరు జిల్లా మేమంతా స్వేచ్ఛగా ఓటు వేశాం.. బాబుకి చాదస్తం ఎక్కువైనట్లుగా ఉంది. అందుకే ఎన్నికల కమిషన్పై నిందలు మోపుతున్నారు. మేమంతా స్వేచ్ఛగా ఓటు వేశాం. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. నేను దీనిని గమనించా. ఓటు వేశాక కొన్నిసెకన్ల పాటు మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్ డిస్ప్లేలో కనిపిస్తుంది. – రాజశేఖర్, గ్రామదట్ల, రాయదుర్గం మండలం, అనంతపురం పేరు, గుర్తు డిస్ప్లేలో కనిపించాయి రాష్ట్రంలో అవినీతి పాలనతో విసుగు చెందారు. రాష్ట్రాభివృద్ధి కోసం పొరాడే వ్యక్తిని కోరుకుంటున్నారు. నేను ఎవరికి ఓటు వేశానో పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. ఓటు వేశాక కొద్ది సమయం డిస్ప్లేలో మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్లో కనిపిస్తోంది. నేను ఓటు వేసిన సమయంలో ఈ విషయం స్పష్టమయ్యింది. – సిరాజిన్బేగం, పులివెందుల ఓటు వేసినప్పుడు కనిపిస్తుంది చంద్రబాబునాయుడుకు తన సొంత ఇంటెలిజెన్స్ బృందం ఓటమి తప్పదని హెచ్చరించడంతో ఆయన గుండెలు గుబిల్లుమంటున్నాయి. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. ఓటు వేశాక కొన్ని సెకన్ల సమయం డిస్ప్లేలో మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్లో కనిపిస్తుంది. నేను ఓటు వేసిన సమయంలో ఆ విషయాన్ని గుర్తించాను. – గర్నెపూడి వెంకటేశ్వరావు, అమృతలూరు భూతద్దంలో చూడాల్సిన పనిలేదు ఈవీఎంల్లో నేను వేసిన ఓటు వీవీ ప్యాడ్ల్లో గుర్తు కనిపించింది. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. – అట్టాడ హేమసుందర్, రెడ్క్రాస్ సొసైటీ మాజీ చైర్మన్, విజయనగరం ఈవీఎంలలో మోసం ఉండదు.. మనం ఓటు ఎవరికి వేశామో సెకన్లలోపు తెలియడం ఆనందాన్నిచ్చింది. ఈవీఎం మిషన్లలో తారుమారు చేయడం అనేది జరగదని నేను నమ్ముతున్నాను. ఇందులో మోసం జరిగే అవకాశమే ఉండదు. అనవసర రాద్ధాంతం చేయడమేనని అనుకుంటున్నా. – సాయిన రమాగౌతమి, పాతూరు, బీడీఎస్ స్టూడెంట్, పశ్చిమగోదావరి జిల్లా గత ఎన్నికలూ ఈవీఎంలతోనే .. గత ఎన్నికల్లోనూ ఈవీఎంలపైనే ఓటింగ్ జరిగింది. అపుడు అందరూ ఓటమిని, విజయాన్ని అంగీకరించారు. అప్పటి కన్నా ఇపుడు వీవీప్యాట్ మెషీన్ సంతృప్తికరంగా ఉంది. మనం వేసిన ఓటు ఏ గుర్తుకు పడిందీ కనిపించడం బాగుంది. – బేతా నూకరాజు, సీనియర్ సిటిజన్,రిటైర్డ్ ఉపాధ్యాయుడు, కొత్తకోట, విశాఖ జిల్లా నాకు కనిపించాయి.. కంప్యూటర్లను నేనే తెచ్చా, సెల్ఫోన్లను నేనే పరిచయం చేశానని నిత్యం చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఈవీఎంలు పనికి మాలినవి అని మాట్లాడుతుండటం వింతగా ఉంది. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. – షేక్ నాయబ్ రసూల్, కావలి వీవీ ప్యాట్లో సరి చూసుకున్నా.. ఓటమి భయంతో చంద్రబాబు ఈసీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఓటు వేసి, వీవీ ప్యాట్లో సరిచూసుకున్నాను. అంతా సక్రమంగానే ఉంది. –పి.వైకుంఠరావు, న్యాయవాది, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా నాకు స్పష్టంగా కనిపించాయి.. నేను ఏ పార్టీకి ఓటు వేశానో చూసుకున్నా. అభ్యర్థి ఫొటో, పేరు, పార్టీ గుర్తు స్పష్టంగా కనిపించాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకు కనిపించలేదో! –జి సోమన్న యాదవ్, తడకనపల్లె, కర్నూలు జిల్లా వీవీ ప్యాట్లో నేను నొక్కిన గుర్తు కనబడింది మొదట ఈవీఎంలో నాకు నచ్చిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తు పక్కన ఉన్న బటన్ నొక్కా. తరువాత పక్కన ఏర్పాటు చేసిన వీవీప్యాట్లో నేను నొక్కిన గుర్తు కనబడిందా లేదా అని పరిశీలించుకున్నాను. – జెట్టి చంద్రశేఖరరెడ్డి, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్, సింగరాయకొండ బీప్ శబ్దం కూడా వచ్చింది చంద్రబాబు ఓటమి భయంతో ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు. ఈవీఎంలో ఏ గుర్తుపై ఓటు వేశామో వీవీ ప్యాట్లో ఎవరికి ఓటు పడిందో కూడా స్పష్టంగా కనిపించింది. గుర్తుపై నొక్కినప్పుడు బీప్ శబ్దం కూడా వచ్చింది. వీవీ ప్యాట్లు సరిగా పనిచేయలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – పమిడిపల్లి నానాజీ, ఏడిద, మండపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా అందరికీ అర్థమయ్యేలా.. గతంలో ఈవీఎం ద్వారా ఎన్నికల్లో ఓటు వేసినట్లు బీప్ శబ్ధం గుర్తించి సంతృప్తి చెందాం. ఇప్పుడు మాత్రం ఈవీఎంలతోపాటు వీవీప్యాట్ కూడా అదనంగా జతచేయడంతో అభ్యర్థి ఫొటో, పార్టీ గుర్తును చూడగలుగుతున్నాం. ఎవరికి ఓటు వేశామనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ ఈ సారి ఎన్నికలను చాలా పారదర్శకంగా, పగడ్భందీగా నిర్వహించింది.. – జోజిమేరి, చిరువ్యాపారి ఆనందపురం,ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా -
ఈవీఎంల పనితీరును తప్పుపట్టడం సరికాదు
-
స్ట్రాంగ్ రూంలకు పటిష్ట భద్రత
నర్సాపూర్: ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. నర్సాపూర్లోని స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచి.. గదులకు సీలు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లను నర్సాపూర్లోని బీవీరాజు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చినట్లు చెప్పారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన ఈవీఎంలను పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలో భద్రపరిచామన్నారు. సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లను పట్టణంలోని అల్లూరి సీతరామరాజు గిరిజన గురుకుల విద్యాలయంలోని స్ట్రాంగ్ రూంలలో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్యారా మిలిటరీ బలగాలతో గట్టి భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు. ఒక్కో స్ట్రాంగ్ రూం వద్ద ఒక సెక్షన్ ప్యారామిలిటరీ బలగాలు భద్రతగా ఉంటాయని, ఆయుధాలు కలిగిన ఇద్దరు జవాన్లు నిరంతరం పహారా కాస్తారని కలెక్టర్ వెల్లడించారు. స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన భవనాల బయట స్థానిక పోలీసులు ఉంటారన్నారు. ఎన్నికల అబ్జర్వర్ సంజయ్మీనా పర్యవేక్షణలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సూచించిన ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలకు సీలు వేసినట్లు చెప్పారు. ఆయా పార్టీల అభ్యర్థులు సూచించిన ప్రతినిధులు స్ట్రాంగ్ రూంలను చూడాలని భావిస్తే స్ట్రాంగ్ రూంలు ఉన్న భవనంలోని ఒక గదిలో సీసీ కెమెరాల మానిటర్ ఏర్పాటు చేశామని, మానిటర్లో భద్రత చర్యలను చూసుకునే వీలుంటుందన్నారు. దగ్గరుండి సీలు వేయించిన కలెక్టర్, అబ్జర్వర్.. ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలకు ఎన్నికల అబ్జర్వర్ సంజయ్మీనా, కలెక్టర్ ధర్మారెడ్డి దగ్గరుండి పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీలు వేయించారు. సీలు వేసే సమయంలో కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గురుకుల విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం వద్ద కరెంటు వైర్లను సరి చేయించాలని సూచించారు. ఎస్పీ చందనా దీప్తి స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత, ఇతర అంశాలపై కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి ఎన్నికల అబ్జర్వర్ సంజయ్మీనాతో చర్చించారు. ఇదిలాఉండగా స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన భవనాల వద్ద ముందస్తు జాగ్రత్తగా ఒక్కో ఫైరింజన్ను అందుబాటులో ఉంచారు. పార్టీ ప్రతినిధులకు పత్రాలు అందజేత.. మెదక్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వివరాలు, వినియోగించిన ఈవీఎంల వివరాలు, పోలైన ఓట్ల వివరాలతో కూడిన పత్రాలను అధికారులు శుక్రవారం పోటీలో ఉన్న అభ్యర్థులు సూచించిన ఆయా పార్టీల ప్రతినిధులకు అందజేశారు. స్ట్రాంగ్ రూంలకు సీలు వేసే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి నియమించిన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ నియమించిన ఆ పార్టీ ప్రతినిధులు ఆంజనేయులుగౌడ్, మల్లేష్ ఉన్నారు. -
ధీమా అందరిది.. విజయం ఎవరిదో!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్సభ స్థానంలో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. ఒక పక్క మునుపెన్నడూ లేని విధంగా తగ్గిన పోలింగ్ శాతం దడ పుట్టిస్తున్నా.. గెలుపుపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు చాలా మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. కనీసం 50 శాతం మార్క్ను కూడా అధిగమించలేదు. గ్రామీణ ఓటర్లలో మాత్రం చైతన్యం వెల్లివిరిసింది. గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగానే నమోదైంది. రెండింటి మధ్యే.. చేవెళ్ల స్థానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలు టీఆర్ఎస్కు సానుకూలంగా ఉండగా.. ఇంకొన్ని కాంగ్రెస్కు అండగా నిలిచినట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అవగతమవుతోంది. ఒకటి రెండు సెగ్మెంట్లలో బీజీపీ కూడా అధిక ఓట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు అంచనా. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చూస్తే చేవెళ్లలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. 71.05 శాతం పోలైన ఓట్లలో కాంగ్రెస్ది పైచేయి ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగ ఓటర్లను కాంగ్రెస్ బాగా ఆకర్షించినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా పట్టణ ప్రాంతమైన శేరిలింగంపల్లిలో పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. ఇక్కడ 41.80 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడి ఓటర్లలో అత్యధికులు సెటిలర్లే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వీరు టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ వలస ఓటర్లందరూ ఓటేసేందుకు తమ సొంత ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు. ఇక మిగిలిన వారిలో అత్యధికులు స్థానికులు. వీరిలో అధిక ఓటర్లు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు అంచనా. రాజేంద్రనగర్ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నువ్వా నేనా అన్న రీతిలో పోరు నడిచినట్లు తెలుస్తోంది. ఇక్కడి సెటిలర్లలో చాలామంది తమ సొంత స్థలాలకు వెళ్లారు. ఇందులో దాదాపు టీఆర్ఎస్ సానుకూల ఓటర్లే ఎక్కువగా ఉంటారని రాజకీయ విశ్లేషకుల భావన. దీంతో టీఆర్ఎస్కు కొంతమేర గండి పడినట్లు తెలుస్తోంది. ఈ లోటును ముస్లిం ఓటర్లు భర్తీ చేసినట్లు వెల్లడవుతోంది. బహిరంగంగానే ఎంఐఎం.. టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం వల్ల వారి ఓట్లన్నీ కారు గుర్తు వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. సగం పట్టణ, మిగిలిన సగభాగం గ్రామీణంగా ఉన్న మహేశ్వరంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడినట్లు స్పష్టమవుతోంది. పట్టణ ప్రాంతవాసులు బీజీపీ పట్ల మొగ్గుచూపినట్లు ఆయా వర్గాలను బట్టి తెలుస్తోంది. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు దక్కడం, తాజాగా లోక్సభ ఎన్నికలకు రెండురోజుల ముందు ఆ పార్టీ చీఫ్ అమిత్షా సభ కొంత ప్రభావం పడినట్లు కనబడుతోంది. ఇక పల్లె ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనే రీతిలో ఓట్లను రాబట్టుకున్నట్లు వెల్లడవుతున్నాయి. వికారాబాద్లో కారు, హస్తం మధ్యం రసవత్తర పోరు నడిచినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే వెంట నడిచేందుకు మొగ్గుచూపని నేతలు ప్రచారానికి పెద్దగా ఆసక్తి చూపనట్లు చర్చ జరుగుతోంది. దీని కారణంగా ఓట్లు హస్తం వైపు మళ్లినట్లు తెలుస్తోంది. పరిగి నియోజకవర్గంలో కారు జోరు కొనసాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సెగ్మెంట్పై పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించి విస్తృత ప్రచారం చేసినట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఫలితంగా అధిక శాతం ఓటర్లు కారు వైపు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్కు ఓట్లు దక్కినట్లు తెలుస్తోంది. తాండూరులో కాంగ్రెస్ గాలి వీచినట్లు వెల్లడవుతోంది. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. పైగా కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో కొండా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా హస్తానికి అధిక ఓట్లు పడినట్లు స్పష్టమవుతోంది. గ్రామీణంలో ‘స్థానికత’ అస్త్రం చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల స్థానికత అంశం బాగా పనిచేసినట్లు ఆయా వర్గాల ఓటర్లు చెబుతున్నారు. స్థానిక అభ్యర్థి అయితే తమకు అందుబాటులో ఉంటారని వారు భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక అభ్యర్థి అంశం.. ఓట్లు సాధించేందుకు కొంత అస్త్రంగా పనిచేసి ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థికి కలిసిరావొచ్చు. -
భవితవ్యం భద్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. లోక్సభ పరిధిలో 11,37,231 మంది ఓట్లు వేయగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 67.9 శాతం ఓటింగ్ జరిగినట్లు తొలుత అధికారులు ప్రకటించగా.. 5గంటల తర్వాత కూడా అనేక మంది ఓటర్లు క్యూలో నిల్చోవడం.. వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఓటింగ్ శాతం 75.16కు చేరింది. పోలింగ్ సరళినిబట్టి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి.. తమకెన్ని ఓట్లు వస్తాయని లెక్కలేసుకుంటున్నారు. ఖమ్మం లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటి పరిధిలో 15,13,094 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,39,600 మంది, 7,73,428 మంది మహిళలు, 66 మంది ఇతరులు ఉన్నారు. వీరిలో 11,37,231 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 5,59,387 మంది పురుషులు, 5,77,812 మంది మహిళలు, 32 మంది ఇతరులు ఉన్నారు. దీంతో మొత్తం పోలింగ్ 75.16 శాతం జరిగినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఉదయం సమయంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మొదట పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకు ఓటర్లు చాలా తక్కువ మంది పోలింగ్ బూత్లకు వచ్చారు. అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం తర్వాత ఓటర్లు బూత్ల వద్దకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ సమయం దాటిన తర్వాత కూడా ఓటు వేసేందుకు వచ్చిన వారు మిగిలిపోవడంతో అప్పటి వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈవీఎంలలోనే.. ఖమ్మం లోక్సభ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్లను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచారు. ఇక్కడ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి దశలో కేంద్ర బలగాలు, రెండో దశలో రాష్ట్రస్థాయి బలగాలు, మూడో దశలో జిల్లాస్థాయి బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. మే 23వ తేదీ వరకు స్ట్రాంగ్రూమ్లలో అభ్యర్థుల భవిష్యత్ నిక్షిప్తమై ఉంటుంది. అప్పటి వరకు అభ్యర్థుల తరఫున కూడా బందోబస్తు నిర్వహించే అవకాశం కూడా కల్పించారు. ఈసారి ఎన్నికల నిర్వహణకు, ఫలితాల ప్రకటనకు దాదాపు 40 రోజుల గడువు ఉంది. అంచనాల్లో పార్టీలు.. ఎన్నికలు ముగియడంతో వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థులు అంచనాల్లో మునిగిపోయారు. పోలింగ్ సరళి ఎలా నమోదైంది.. తమ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఎక్కడ ఉంటుంది.. ఎక్కడ ఓట్లు పడలేదనే దానిపై లెక్కలు వేయడంలో అభ్యర్థులు లీనమయ్యారు. ఫలితాల వెల్లడికి ఎక్కువ రోజులు గడువు ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠతో కూడిన ఆందోళన నెలకొంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలతోపాటు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, జనసేన అభ్యర్థులు పోలింగ్ సరళినిబట్టి తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనే దానిపై అంచనాలకు వస్తున్నారు. పాలేరులో అత్యధికంగా పోలింగ్.. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 75.16 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 82.87 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,16,622 మంది ఓటర్లు ఉండగా.. 1,79,518 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మధిర నియోజకవర్గంలో 81.40 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2,10,358 మంది ఓటర్లు ఉండగా.. 1,71,232 మంది ఓటు వేశారు. వైరాలో 79.15 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 1,83,286 మంది ఓటర్లు ఉండగా.. 1,45,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో 77.84 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ మొత్తం 2,30,426 మంది ఓటర్లు ఉండగా.. 1,79,353 మంది ఓటు వేశారు. అశ్వారావుపేటలో 77.72 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 1,50,205 మంది ఓటర్లు ఉండగా.. 1,16,735 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 66.77 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,28,597 మంది ఓటర్లు ఉండగా.. 1,52,641 మంది ఓటర్లు ఓటు వేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 65.63 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,93,600 మంది ఓటర్లు ఉండగా.. 1,92,675 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో గల స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచారు. భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ శుక్రవారం పరిశీలించారు. స్ట్రాంగ్రూమ్ను దగ్గరుండి సీల్ చేయించారు. అలాగే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూడా సందర్శించారు. స్ట్రాంగ్రూమ్కు సీల్ వేస్తున్న దృశ్యం -
పోలింగ్ తగ్గెన్.. ఓటింగ్ ముగిసెన్
సాక్షి, జగిత్యాల: లోక్సభ సమరం ముగిసింది. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 70.04 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో 77.61 శాతం నమోదైంది. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 62.53శాతం నమోదైంది. జగిత్యాల నియోజకవర్గంలో 69.20 శాతం, కోరుట్ల నియోజకవర్గంలో 68.85శాతం ఓటింగ్ నమోదైంది. ఎండ తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నం వరకే చాలా కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తగ్గిన ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 77.61 శాతం పోలింగ్ నమోదుకాగా ప్రస్తుతం 70.04 శాతానికి పరిమితమైంది. ధర్మపురి నియోజకవర్గంలో అసెంబ్లీలో 78.02శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 62.53, కోరుట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో 75.45 శాతం, లోక్సభ ఎన్నికల్లో 68.85, జగిత్యాలలో 79.35 శాతం నుంచి 69.20 శాతానికి పడిపోయింది. తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందనే చర్చ ఆసక్తిగా మారింది. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మాక్పోలింగ్ నిర్వహణ జాప్యం కావడంతో పోలింగ్ సైతం ఆలస్యంగా ప్రారంభమైంది. రాయికల్ మండలం మూటపల్లి, మైతాపూర్ బూత్ నంబరు 46, పెగడపల్లిలోని 262 పోలింగ్కేంద్రంలో, సారంగాపూర్తోపాటు కోనాపూర్ గ్రామాల్లో 9 గంటలకు పోలింగ్ మొదలైంది. కోరుట్ల మండలం పైడిమడుగులో 114 పోలింగ్కేంద్రం, కోరుట్లలోని 181 ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. మల్లాపూర్తోపాటు రాఘవపేటలోని 84 పోలింగ్కేంద్రంలో, మల్లాపూర్ మండలం వెంకట్రావ్పేటలోని 59 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల మండలం ధరూర్లో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. జిల్లా కేంద్రంలోని 164 పోలింగ్కేంద్రంలో ఈవీఎంలు పనిచేయక 9 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. లింగంపేటలో, మెట్పల్లిలోని 196 కేంద్రంతోపాటు కోరుట్లలోని కల్లూరు 141 కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాత పోలింగ్ మొదలైంది. జగిత్యాలలోని కొత్తవాడలో ప్రభుత్వ బాలికల పాఠశాల, జగిత్యాల మండలం కల్లెడ, పొరండ్ల గ్రామాల్లో పోలింగ్ ముగింపు సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ జాప్యమైంది. కేంద్రాలు సందర్శించిన అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని బీట్బజార్ 192 పోలింగ్ కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత సందర్శించారు. గొల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ సందర్శించారు. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు స్ట్రాంగ్రూమ్లకు చేరాయి. పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను ఎన్నికల అధికారులు జిల్లా కేంద్రంలోని వీఆర్కే కళాశాలకు తరలించారు. ఓటింగ్ ముగియడంతో నిజామాబాద్ స్థానం నుంచి బరిలో ఉన్న 185 మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పు డు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజా తీర్పు మే 23న వెలువడనుంది. -
ఈవీఎంలలో దాగిన భవితవ్యం
సాక్షి, మహబూబాబాద్: లోక్సభ ఎన్నికలు గురువారం ముగియటంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. ఈవీఎంలలో ఎంపీ అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. మే 23వ తేదీ గురువారం రోజున కౌంటింగ్ జరగనుంది. ఫలితాల పై అభ్యర్థులతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంరత నెలకొంది. గెలుపు ఎవరిని వరిస్తుందో అంచనాలకు అందడం లేదు. ఓటింగ్ శాతం అనూహ్యంగా తగ్గటంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంలోని పోలింగ్ 1737 కేంద్రాల్లో జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం, వీవీప్యాట్)లను పోలింగ్ కేంద్రాల నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాల పైనే చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఎంపీ అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు గతంలోలాగా కాకుండా వేరువేరుగా రావటంతో, పోలింగ్ శాతం తగ్గవచ్చని రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా పోలింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. దీంతో ఓటింగ్ ప్రభావాన్ని విశ్లేషించుకునేందుకు ఎంపీ అభ్యర్థులు పోలింగ్ బూత్ల వారీగా ఓట్ల లెక్కలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రేపు, ఎల్లుండి ప్రధాన పార్టీల రాజకీయ పార్టీల అభ్యర్థులు పార్టీ ముఖ్యనాయకులు, బూత్ కన్వీనర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో ఓటింగ్ తీరు తెనులతోపాటు పార్టీ విజయావకాశాలను ఎంపీ అభ్యర్థులు విశ్లేషించుకోనున్నారు. -
ఆగుతూ.. సాగుతూ పోలింగ్
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాలకు పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చెదురు ముదురు టనలు మినహా పోలింగ్ సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికారులు సమస్యాత్మకంగా గుర్తించిన జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 4గంటలకే ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అరగంట నుంచి గంట ఆలస్యం పోలింగ్ ప్రారంభం సమయంలో వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో అక్కడక్కడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) మొరాయించడంతో అరగంట నుంచి గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. దీంతో చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. అయితే, నిర్ణీత సమయం లోగా కేంద్రాలకు వచ్చిన వారందరూ ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కాగా వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో జరిగిన పోలింగ్ వివరాలను గురువారం రాత్రి అధికారులు వెల్లడించారు. వరంగల్ లోక్సభ పరిధిలో 60.41 శాతం, మహబూబాబాద్లో 64.46 శాతంగా నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పేరిట విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా, గత ఎన్నికలతో పోలిస్తే ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ పోలింగ్ శాతం భారీగా తగ్గడం గమనార్హం. మందకొడిగా ప్రారంభమై.. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని చోట్లా ఉదయం ఏడు గంటలకు మందకొడిగా మొదలైన పోలింగ్ 9 గంటల తర్వాత పుంజుకుంది. చాలాచోట్ల ఈవీ ఎంలు మొరాయించడం కారణంగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. సమస్యాత్మక నియోజకవర్గం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 4 గంటలే కాగా, మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా రాత్రి వరకు పోలింగ్ కొ నసాగించారు. సాయంత్రం 5 గంటల వరకు వరంగల్ పార్లమెంట్ పరి«ధిలో 60.41 శాతం, మహబూబాబాద్ పరిధిలో 64.46 శాతంగా పోలింగ్ నమోదైనట్లు రాత్రి 10.30 గంటలకు ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. మొరాయించిన ఈవీఎంలు అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు ఆలస్యం జరిగినా... మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధికారులు ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం కంఠాత్మకూరు, చిల్పూరు మండలం మల్కాపూర్, హసన్పర్తి మండలం మడిపెల్లి, వరంగల్ 27వ డివిజన్ ఏవీవీ కళాశాల పోలింగ్ బూత్ 87, పర్వతగిరి మండలం చింతనెక్కొండలో 238, ఆత్మకూరులో 105 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు చాలాసేపు మొరాయించాయి. మహబూబాబాద్ లోక్సభ పరిధి నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం కొనపురం బూత్ నెంబర్ 195, బొజేరువులో 221 పోలింగ్ కేంద్రాల్లోను ఈవీఎంలు మొరాయించాయి. వీటితో పాటు చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు పరిస్థితులను చక్కదిద్ది పోలింగ్ సజావుగా సాగేలా చూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆయా జిల్లాల పోలీసు కమీషనర్లు, ఎస్పీలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు పహారా కాశాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాల్లో గస్తీ బందాలు, స్రైకింగ్ ఫోర్సు, పోలీసుల పహారా పెంచారు. ఓటేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు లోక్సభ ఎన్నికల సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు గురువారం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున, కుమారుడు, కూతురు, కోడలుతో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయన సతీమణి ఉషా దయాకర్ పర్వతగిరిలో ఓటేశారు. ఇక రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఆయన కుమారుడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్కుమార్ వారి స్వగ్రామం హుజూరాబాద్ మండలం సింగాపురంలో ఓటు వేశారు. హన్మకొండ టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కుటుంబసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.బొల్లికుంటలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, కుటుంబ సభ్యులు, నక్కలగుట్ట వాటర్ట్యాంక్ బూత్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కుటుంబసభ్యులు, వడ్డెపల్లి ప్రభుత్వ పాథమిక పాఠశాలలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్భాస్కర్, కుటుంబసభ్యులు, వరంగల్ పెరుకవాడలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ కుటుంబీకులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, జాయింట్ కలెక్టర్ దయానంద్, హన్మకొండలో వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, జులైవాడలోని ఎస్టీ హాస్టల్ పోలింగ్ బూత్లో టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, కుటుంబ సభ్యులు ఓటు వేశారు. గణనీయంగా తగ్గుదల 2014 సాధారణ ఎన్నికల పోలింగ్తో పోలిస్తే ఈసారి గణనీయంగా తగ్గింది. వరంగల్ లోక్సభ పరి«ధిలో 2014లో 76.56 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 63.08 శాతానికే పరిమితమైంది. అంటే 13.48 శాతం పోలింగ్ తగ్గినట్లు. అదే విధంగా మహబూబాబాద్ లోక్సభకు 2014లో 82.81 శాతం పోలింగ్ జరగగా, ఈసారి 13.70 శాతం తగ్గి 69.11 శాతానికే పరిమితమైంది. కాగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో తొలుత పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ తీరును ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎన్నికల పరిశీలకులు వీణా ప్రదాన్, అమిత్కుమార్ సింగ్లు పలు కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రశాంత్ జీవన్ పాటిల్, శివలింగయ్య, కలెక్టర్లు హరిత, వినయ్కృష్ణారెడ్డి, వాసం వెంకటేశ్వర్లులు పోలింగ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. -
మందకొడిగా సాగిన ఓటింగ్ ప్రక్రియ
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన పోలింగ్ (2019 సార్వత్రిక ఎన్నికలకు సబంధించి) తొలుత మందకొడిగా ప్రారంభమైంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించారు. దీంతో ఓటర్లు అక్కడక్కడ కొంత తడపడ్డారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయం నుంచి సాయింత్రం వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు పూర్థి స్థాయిలో వసతులు కల్పించలేకపోయారు. ఎండ ఎక్కువగా ఉన్నందున ఓటర్లు ఇబ్బందిపడ్డారు. కొంతమంది ఇళ్లకు వెళ్లి సాయంత్రం వచ్చి ఓటు వేశారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, వీవీప్యాట్లు పనిచేయకపోవడం వంటి సమస్యలతో ఓటర్లు విసిగి ఇళ్లకు వెళ్లిపోయారు. అధికార పార్టీ ఆగడాలు పలుచోట్లు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు వివాదాలకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని గుర్తించిన చోట ఘర్షణలకు తెరలేపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంయమనం పాటించి ఓటింగ్కు సహకరించారు. పలుచోట్ల ఆలస్యంగా ప్రారంభం ప్రారంభంలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చినా అక్కడ ఓటింగ్ యంత్రాలు ఇబ్బంది పెట్టడంతో చాలామంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. జిల్లాలో సుమారుగా 357 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలకు ఇరత మిషన్లు సమకూర్చడం జరిగినా, అప్పటికే ఎండలు ప్రారంభం కావడంతో ప్రధానంగా వృద్ధులు, మహిళలు ఓటు వేసేందుకు రాలేదు. పది నుంచి మూడు గంటల వరకు తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళి ఇలా.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 11 గంటల వరకు కేవలం 19.78 శాతం మాత్రమే నమోదు అయింది. పది గంటల నుంచి పలుచోట్ల ఈవీఎంలు పనిచేయడంతో ఒంటి గంటకు 37.92 శాతానికి చేరింది. మూడు గంటలకు 52.11 శాతానికి చేరింది. నాలుగు గంటలకు 59.18 శాతం 5 గంటలకు 63.77 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత జిల్లాలో 186 కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. రాత్రి ఎనిమిది గంటల వరకు 45 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. -
ప్రకాశంలో ఓటెత్తిన జనం
ఊరు వాడా కదిలొచ్చింది. ప్రజా చైతన్యం ఓటెత్తింది. పూటకో మాట, రోజుకో వేషం వేసే వంచన రాజకీయానికి..అవినీతి, అక్రమాలతో జనాన్ని దోచుకుని నిరంకుశ పాలన సాగించిన నేతల దాష్టీకానికి చరమగీతం పాడేందుకు ముందుకొచ్చింది. దగాపడిన బడుగు జీవుల తలరాతను మార్చే నేత కోసం.. మార్పు కోసం.. విశ్వసనీయతకు పట్టం కట్టేందుకు జనం తరలివచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, యువత ఓపిగ్గా గంటల తరబడి క్యూలలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాక్షి, ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గురువారం జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. స్వచ్ఛందంగా ఓటు వేసుకోవడానికి కేంద్రాల వద్ద బారులుతీరారు. ఈవీఎంల ఓటింగ్ సజావుగా సాగింది. అక్కడక్కడా చెరుదుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ వినయ్చంద్, బాపట్ల రిటర్నింగ్ అధికారి ఎస్.నాగలక్ష్మిలు పోలింగ్ సజావుగా జరిగేలా పర్యవేక్షించారు. వీరు మధ్యలో కొన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి లైవ్ టెలికాస్ట్ అనుసంధానం కావడంతో జిల్లా ఎన్నికల అధికారి మీడియా సెంటర్ నుంచి పరిశీలించారు. అక్కడికక్కడే సంబంధిత రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోటెత్తిన ఓటర్లు జిల్లాలో మొత్తం 26,32,407 మంది ఓటర్లు ఉన్నారు. 3269 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ను ప్రారంభించారు. ఏజెంట్లు, అధికారులు ఉదయం మాక్పోలింగ్లో పాల్గొన్నారు. సుమారు 300 పోలింగ్ కేంద్రాల్లో మాక్పోలింగ్ సమయంలోనే సమస్యలు వచ్చాయి. కొన్ని కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు మరి కొన్ని కేంద్రాల్లో 9 గంటలకు కొలిక్కి వచ్చాయి. ఒంగోలు కేంద్రంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ మూడు గంటల ఆలస్యంగా మొదలైంది. అప్పటి దాకా ఓటర్లు ఓపికగా వేచి ఉన్నారు. జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం - 85.82 శాతం నియోజకవర్గం నమోదైన పోలింగ్ శాతం వై పాలెం 86.4 చీరాల 83.98 మార్కాపురం 85.31 దర్శి 90.54 కొండపి 83.29 పర్చూరు 87.28 గిద్దలూరు 82.22 ఎస్.ఎన్.పాడు 85.7 కనిగిరి 82.51 ఒంగోలు 82.09 కందుకూరు 89.66 అద్దంకి 90.06 మొరాయించిన ఈవీఎంలు పోలింగ్ మొదలు కావడంతోనే ఈవీఎంలు మొరాయించాయి. జిల్లా వ్యాప్తంగా 154 పోలింగ్ కేంద్రాల్లో ఈ సమస్య వచ్చింది. కొన్ని కేంద్రాల్లో వెంటనే ఈవీఎంలను పునరుద్ధరించారు. ఒంగోలు కేంద్రంలోని బండ్లమిట్ట కేంద్రంలో ఈవీఎంలు పని చేయకపోవడంతో వెంటనే వేరొక ఈవీఎంలను తెప్పించారు. వాటిని అనుసంధానం చేసిన తర్వాత పీవో తడబాటుతో తప్పులు చేయడంతో 138 పోలింగ్ కేంద్రంలో రెండు గంటల పాటు పోలింగ్ నిలిచింది. ఓటర్లలో అసహనం ఎదురై సిబ్బందిపై తిరగబడ్డారు. పోలీసులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. జిల్లా వ్యాప్తంగా మొరాయించిన ఈవీఎంలు పోలింగ్ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన ఈవీఎం యంత్రాలు చాలా చోట్ల మొరాయించాయి. దీంతో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఒంగోలు రామ్నగర్ రెండోలైన్లోని 167 పోలింగ్ బూత్లో ఉదయం 9 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. ఇక్కడే ఓటు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి చాలా సేపు ఓటు వేసేందుకు వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్లో నిలుచున్న ఓటర్లు ఈవీఎంలు పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యర్రగొండపాలెం పోలింగ్బూత్ నెం 59 నర్సాయపాలెంలో ఉదయం 9.30 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. త్రిపురాంతకం పోలింగ్బూత్ నెం. 122లోనూ ఇదే పరిస్థితి. గిద్దలూరు నియోజకవర్గంలో దద్దవాడ పోలింగ్ బూత్ నం. 251, 252లలో ఉదయం 9.30 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం గంగపాలెం పోలింగ్ బూత్ నం.51లో రెండు గంటల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. సంతనూతలపాడు నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెం. 204 ఉప్పలపాడులో ఈవీఎంలు పనిచేయలేదు. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా వందకు పైగా పోలింగ్ బూత్ల్లో ఉదయం రెండు గంటల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. మిగిలిన చోట్ల సైతం ఈవీఎంలు తరుచూ ఆగిపోతూ ఓటర్లను ఇబ్బందులకు గురి చేశారు. క్రమంగా పెరిగిన ఓటింగ్ శాతం: గత ఎన్నికల్లో 84 శాతం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో దానికన్నా ఎక్కువగా పోలింగ్ జరిగింది. పోలింగ్ ఆలస్యంగా మొదలైనా జిల్లాలో ఓటింగ్ నెమ్మదిగా ఊపందుకుంది. మొదటి రెండు గంటల వ్యవధిలో జిల్లా సరాసరి పోలింగ్ శాతం 9 గంటలకు 7.96గా నమోదైంది. 11 గంటలకు 22 శాతం, ఒంటి గంటలకు 41.48 శాతం, 3 గంటలకు 56.47 శాతం, 5 గంటలకు 63.36 శాతం నమోదైంది. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారు పూర్తిగా ఓటేసేవరకు పోలింగ్ కొనసాగింది. మీడియా కేంద్రం నుంచి పర్యవేక్షణ ఒంగోలు ప్రకాశం భవన్లోని మీడియా కేంద్రం నుంచి జిల్లా ఎన్నికల అధికారి వినయ్చంద్, బాపట్ల ఆర్వో ఎస్.నాగలక్ష్మి పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 95 ఫిర్యాదులు హెల్ప్ లైన్, ఫిర్యాదుల విభాగానికి అందాయి. వీటిలో మొదటి రెండు మూడు గంటల వరకు ఈవీఎంల సమస్య, ఆ తర్వాత పోలింగ్ అక్రమాలు, సాయంత్రం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తల దురాగతాలపై ఫిర్యాదులు అందాయి. వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. మర్రిపూడి మండలం శివరాయునిపేటలో టీడీపీ ఏజెంటు వేము రమేష్కు పీవో మాల్యాద్రి పోలింగ్ సమయంలో సహకరిస్తున్నట్లుగా జిల్లా ఎన్నికల అధికారి మానిటరింగ్లో చూశారు. స్వయంగా ఆయనే గుర్తించినందున పీవోపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వేరొక పీవోకు విధులను కేటాయించారు. వైఎస్సార్ సీపీదే విజయం మీడియాతో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈవీఎం రాజకీయాన్ని చేయాలన్న కుట్రతో ఉన్నారని అన్నారు. ప్రజలు సైకిల్కు ఓటు వేస్తుంటే టెక్నికల్గా ఫ్యాను గుర్తుకు పడ్తున్నాయని చెప్పడం ఆయన అవివేకమని అన్నారు. వైఎస్సార్ సీపీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. జిల్లాలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుపు సాధిస్తారని అన్నారు. ముగిసిన పోలింగ్ పర్వం ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం సజావుగా ముగిసింది. సాయంత్రం 6గంటలకు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అనుమతించారు. గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 84.25 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు దాదాపు ఒకటిన్నర లక్ష మంది పెరిగారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లు కొన్నిచోట్ల రాత్రి 11 గంటల తరువాత కూడా ఓటు వేశారు. మొత్తం పోలింగ్ ముగిసే సరికి 85.82 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా అధికారులు వెల్లడించారు. సరైన శిక్షణ లేకనే.. పోలింగ్ సమయంలో అనుసరించాల్సిన అంశాలపై సరైన శిక్షణ లేనందు వల్ల సిబ్బంది తడబడ్డారు. పీవోలు ఓటర్ల సహనాన్ని పరీక్షించారు. ఉదయం ఏడు గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు వచ్చేశారు. అప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొన్ని కేంద్రాల్లో మాక్ పోలింగ్ పూర్తి కాకపోవడంతో ఓటర్లు గంటల కొద్ది నిల్చుండిపోయారు. పోలింగ్ సిబ్బందికి సరైన అవగాహన లేక మాక్పోలింగ్ చేసిన తర్వాత ఈవీఎం ఫార్మెట్లను ఒక సారికి బదులు రెండు పర్యాయాలు, ఇలా పలురకాల తప్పులు చేయడం వల్ల తిరిగి సీలు వేసిన ఈవీఎంలకు సీలు తొలగించి మొదటి నుంచి ఈవీఎంను సిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలింగ్ రెండు నుంచి మూడు గంటల ఆలస్యంగా మొదలైంది ఓటు హక్కు ఉపయోగించుకున్న అభ్యర్థులు ♦ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణి బాలినేని శచీదేవి, తనయుడు బాలినేని ప్రణీత్రెడ్డిలతో కలిసి లాయరుపేట వద్ద ఉన్న ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీలో తమ ఓటు వేశారు. ♦ ఒంగోలు వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డి తన కుటుంబ సభ్యులతో రాంనగర్ రెండో లైనులోని మున్సిపల్ హైస్కూలులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ♦ ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గద్దలగుంట పోలేరమ్మ దేవస్థానం వీధిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ♦ తెలుగుదేశం అభ్యర్ధి శిద్దా రాఘవరావు తన కుటుంబ సభ్యులతో ఒంగోలు ఎస్ఎస్ఎన్ జూనియర్ కళాశాల పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ♦ తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ ఒంగోలు రాంనగర్ హైస్కూలులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ♦ జనసేన పార్లమెంట్ అభ్యర్థి బెల్లంకొండ సాయిబాబా కంభం మండలం తురిమెళ్లలో ఓటు వేశారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి రియాజ్ ఒంగోలులో ఓటు వేశారు. ♦ కలెక్టర్ వినయ్చంద్ డీఆర్ఆర్ఎం పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జేసీ ఎస్.నాగలక్ష్మి ఈ కేంద్రంలోనే ఓటు వేశారు. -
స్టాంగ్ రూంల వద్ద ఆర్మీతో భద్రత కల్పించాలి: గూడూరు
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద ఆర్మీ లేదా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కౌంటింగ్కు మరో 42 రోజుల గడువున్న నేపథ్యంలో ఈవీఎంలు ఎలాంటి ట్యాంపరింగ్కు గురికాకుండా భద్రంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో కోరారు. స్ట్రాంగ్ రూంలలోకి స్థానిక పోలీసులకు ప్రవేశం కల్పించవద్దని, భద్రతను సమన్వయం చేసే బాధ్యత మాత్రమే వారికి అప్పగించాలన్నారు. హైసెక్యూరిటీ జామర్లను స్ట్రాంగ్రూంల వద్ద ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన అన్ని పోలింగ్ బూత్లు, స్ట్రాంగ్ రూంల సీసీటీవీ ఫుటేజీని భద్రపర్చాలన్నారు. ఈ ఎన్నికల్లో ఉపయోగించని ఈవీఎంలను ఇతర రాష్ట్రాలకు తరలించాలని, లేదంటే సీజ్ చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరు, ట్యాంపరింగ్పై తీవ్ర ఆరోపణలు వచ్చినందున ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ కేడర్తో స్ట్రాంగ్రూంల వద్ద విజిలెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కేడర్ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే టీపీసీసీ నాయకత్వానికి తెలియపర్చాలని కోరారు. -
ఏపీలో రీపోలింగ్పై నేడు నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోసున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీనిపై ఎన్నికల సంఘం పరిశీలకులు శుక్రవారం ఉదయం పరిశీలిస్తారని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సం ఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఏపీలో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని, హింసాత్మక సంఘటనల్లో ఒకరు మృతి చెందారని తెలిపారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు దేశవ్యాప్తంగా 15 నమోదవ్వ గా.. అందులో 6 ఏపీలో అయ్యాయన్నారు. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ న్నారు. ఏపీలో కొన్నిచోట్ల ఈవీఎంల రీప్లేస్మెంట్ చేయడానికి కొంత సమయం పట్టినట్టు చెప్పారు. ఏపీలో 0.98 శాతం బ్యాలెట్ యూనిట్లను, 1.04 శాతం కంట్రోల్ యూనిట్లను, 1.6 శాతం వీవీ ప్యాట్లను రీప్లేస్ చేసినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల పరిశీలకులు పోలింగ్ స్టేషన్లవారీగా పరిశీలన జరిపి రీపోలింగ్ ఆవశ్యకతపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారని వివరించారు. దాన్నిబట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
తెలంగాణ లోక్సభ ఎన్నికలు ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగగా, ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మొత్తంగా 70 శాతం వరకు పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారుల తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి బూత్లో 12 ఈవీఎంలను వినియోగించారు. తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా.. నిజామాబాద్లో 6 గంటల వరకు కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల యత్రాంగం ఊపిరి పీల్చుకుంది. -
‘ఈవీఎంలో కాంగ్రెస్ బటన్ పనిచేయడం లేదు’
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరో ఐదేళ్ల పాటు తమ భవిష్యత్తును నిర్ణయించే నేతలను ఎన్నుకునేందుకు ప్రజలంతా పోలింగ్ సెంటర్ల ముందు బారులు తీరారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఈవీఎంలు మోరాయించడంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈవీఎంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బటన్ పని చేయడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో కాంగ్రెస్ బటన్ పని చేయలేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో స్థానిక మీడియాలో ప్రసారం అయిన వార్తను ఆయన తన ట్వీటర్లో షేర్ చేశారు. Congress symbol button not working in Poonch polling stations ||Mangnar ... https://t.co/g9f6q4Phw4 via @YouTube — Omar Abdullah (@OmarAbdullah) April 11, 2019 ఈ సంఘటన షాపూర్ పోలింగ్ స్టేషన్లో చోటు చేసుకుంది. వీడియోలో పోలింగ్ అధికారి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘ఈవీఎంలోని 4వ నంబర్ హస్తం గుర్తు బటన్ పని చేయడం లేదు. ఈ కారణంగా పోలింగ్కు ఆలస్యం అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బటన్ పని చేయకపోవడానికి గల కారణాలు తెలియదు’ అని పేర్కొన్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో ఇదే సమస్య తలెత్తిందని ఓటర్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో పూంచ్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన జుగల్ కిషోర్ విజయం సాధించాడు. ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. -
ఈవీఎంలో లోపాలు.. ఈసీ కీలక ప్రకటన
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పోలింగ్కు సంబంధించిన దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లో వేచి ఉన్నారని, దీంతో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఓటర్లు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని, ఈవీఎంలలో సాంకేతిక లోపాలను సాంకేతిక సిబ్బంది పరిష్కరించారని తెలిపారు. సక్రమంగా కనెక్షన్లు ఇవ్వకపోవడంవల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఓటు వేయాలని, సాయంత్రం ఆరుగంటల వరకు క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని ద్వివేది తెలిపారు. పలుచోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని, ఆ సమస్యలను చాలావరకు సరిదిద్దామని, అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నందున.. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓటు వేయాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక సమస్యలను ఎక్కడిక్కడ అధిగమించడానికి ఈసీ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం 45,900 ఈవీఎంలు వినియోగిస్తున్నారు. ఇందులోని కేవలం 362 ఈవీఎంలలోనే స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లోపాలు తలెత్తిన 310 ఈవీఎంలను అధికారులు అప్పటికప్పుడు సరిచేశారు. 52 చోట్ల సాంకేతికంగా సమస్యలు తలెత్తిన ఈవీఎంలను మార్చామని, ప్రజలు ఏమాత్రం సంకోచించకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ ఓటర్లను కోరింది. -
వెల్లువెత్తిన చైతన్యం.. ఓటరుకు వందనం!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉయదం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దసంఖ్యలో బారులు తీరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రజలు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నారు. మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రత పెరిగే అవకాశముండటంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం.. ఓటింగ్పై ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని చాటుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపు.. ఓటు వేసేందుకు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నా.. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. ఉదయం 9.30 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు.. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్పురం పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు బూత్ నంబర్ 197లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. ఇదే జిల్లాలోని చింతలపూడిలో 153 బూత్లో ఈవీఎం లు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. జిల్లాలోని పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని 161వ పోలింగ్ బూత్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. తాడేపల్లిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ బూగ్ నంబర్లు 20,24,26, 39,27, 51, 54, 69 లో ఈవీఎంలు పనిచేయడం పనిచేయడం లేదు. శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలస మండలం లో 214, 210 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. విజయనగరం జిల్లా సీతాపురం మండలం గెడ్లలుపిలోని 105 పోలింగ్ బూత్లో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఇక, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈవీఎంలు మొరాయించడంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో 51 పోలింగ్ కేంద్రాల్లో, పాతపట్నంలో 72, టెక్కలిలో 49 పోలింగ్ బూత్ల్లో పోలింగ్ నిలిచిపోయింది. -
ఓటర్లతో కలిసి ఆర్కే ధర్నా
సాక్షి, గుంటూరు : ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రారంభమై రెండున్నర గంటలు అయినా ఇంకా పలు బూత్ ల్లో పోలింగ్ ప్రారంభం కాకపోవటం పై అసహనం వ్యక్తం చేసారు. అనేక మంది ఓటర్లు చాలా సేపు నిరీక్షించి తిరిగి వెనక్కు మళ్ళుతున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడంపై ఆర్కే ఎన్నికల అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా ఆర్కే ధర్నాకు దిగారు. నియోజకవర్గంలోని దాదాపు 60 ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కొని చోట్ల ఇప్పటి వరకు పోలింగ్ మొదలు కాలేదన్నారు. ఎండకు తట్టుకోలేక ముందుగానే ఓటు వేద్దామని వచ్చిన ఓటర్లు ఈవీఎంలు పనిచేయకోవడంతో వెనుతిరిగి పోతున్నారన్నారు. మాక్ పోలింగ్ సమయంలో పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు పనిచేయకకోవడం పట్ల అనుమానాలు ఉన్నాయన్నారు. వైఎస్సా సీపీకి ఓట్లు పడే చోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. లోకేష్ ఓడిపోతారనే ఉద్దేశ్యంతోనే ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు. అధికారుల తీరు పై ఆర్కే తో పాటుగా ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండకు తట్టుకోలేక ఉదయాన్నే ఓటు వేద్దామని వస్తే ఇప్పటి వరకు బయటటే నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి వస్తే ఈవీఎంలు పనిచేయడం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. -
యంత్రంలో ఓటు మంత్రం
సాక్షి, నరసరావుపేట : ఎన్నికల సమరంలో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అందులోనూ గతంలో మాదిరి బ్యాలెట్ ఓటింగ్ కాకుండా.. ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో ఓటు ఏలా వేయాలో తెలుసుకుందాం. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశం మీరు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లేసరికి ప్రిసైడింగ్ అధికారి మీ బ్యాలెట్ను సిద్ధంగా ఉంచుతారు. ఓటు వేయడం ఇలా బ్యాలెట్ యూనిట్(ఈవీఎం)పైన మీకు నచ్చిన అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు(బ్లూ) బటన్ను గట్టిగా నొక్కాలి. సిగ్నల్ : ఓటు వేసినప్పుడు మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఎర్రలైట్ వెలుగుతుంది. ప్రింట్ను చూడండి ప్రింటర్– మీరు ఎన్నుకున్న అభ్యర్థి సీరియల్ నంబర్, పేరు, ఫొటో, గుర్తుతో ఓ బ్యాలెట్ స్లిప్ ప్రింట్ను వీవీప్యాట్లో చూడవచ్చు. గమనించాల్సిన విషయం ఒక వేళ మీకు బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా, బీప్ శద్ధం గట్టిగా వినిపించకపోయినా ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించవచ్చు. ఓటు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటేయొచ్చు! ఓటర్ జాబితా సవరణతో కొత్తగా ఓటర్గా నమోదైన వారికి సైతం ఇటీవల గుర్తింపు కార్డులు వచ్చాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండీ గుర్తింపు కార్డు లేదని బాధపడుతున్నారా! ఇప్పుడు ఆ చింత అవసరం లేదు. ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇవి ఉంటే సరి.. డ్రైవింగ్ లైసెన్సు, పాన్కార్డు, పాస్పోర్టు, ఆధార్కార్డు, ఫొటోతో ఉన్న బ్యాంక్ పాస్పుస్తకం, పోస్టాఫీసులు జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్బుక్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, పింఛన్కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు .. ఇలా వీటిల్లో ఏదో ఒక దానిని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. చాలెంజ్ ఓటు.. ఏప్రిల్ 11 2019ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటర్ తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటర్ను.. ఏజెంట్ను ప్రిసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచి రూ. 2 చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు. అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్ఓను పిలిచి అతడు స్థానిక ఓటరా కాదా అనే విషయం.. పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై, జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే వయన్సు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్ను, ఓటరును పోలీసులకు అప్పగించవచ్చు.