Foreign
-
విదేశీ ఆస్తులు, ఆదాయం చూపించలేదా..
మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2024 నవంబర్ 17 నుంచి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. ‘మీలో ఎవరైనా విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని డిక్లేర్ చేశారా లేదా. ఒకవేళ చేయకపోతే వెంటనే చేయండి‘ అనేది దీని సారాంశం. సాధారణంగా ఐటీఆర్లు దాఖలు చేసినప్పుడు, ప్రతి అస్సెస్సీ ముఖ్యంగా రెసిడెంట్ స్టేటస్ గల వారు తమ ఆదాయాన్ని .. అంటే మనదేశంలో వచ్చిన ఆదాయంతో పాటు విదేశాల్లో వచ్చినదాన్ని కూడా చూపించాలి.నాన్ రెసిడెంట్లు కేవలం మన దేశంలో వచ్చిన ఆదాయాన్ని చూపిస్తే చాలు. విదేశాల్లోని ఆస్తులు, ఆదాయాలు డిక్లేర్ చేయక్కర్లేదు. పన్ను భారమనేది అస్సెస్సీ రెసిడెన్షియల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు భారత్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉన్న వ్యవధి 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే రెసిడెంట్ అవుతారు. లేకపోతే నాన్ రెసిడెంట్లవుతారు. ఈ వ్యవధిని లెక్కించడానికి పాస్పోర్ట్లోని పద్దులు, ఎంట్రీలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాటి ప్రకారం రోజులను లెక్కిస్తారు.సాధారణంగా మనందరం రెసిడెంట్లు అవుతాం. పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండటం వల్ల వారు నాన్ రెసిడెంట్లు అవుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టేటస్ను తప్పుగా పేర్కొనకూడదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు, అవగాహన కల్పించేందుకు, విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తప్పులుంటే/తప్పులు జరిగితే సరిదిద్దుకోండి. మీ రిటర్నును రివైజ్ చేసుకోండి .. అని చెప్పారు. దీనిపై మెసేజీలు పంపారు. ఇవి రాగానే అందరూ ఉలిక్కిపడ్డారు.వెంటనే తమ స్టేటస్ని, ఆదాయాన్ని, ఆస్తుల వివరాలను చెక్ చేసుకున్నారు. 30,161 మంది అస్సెస్సీలు తమ తప్పులను సరి చేసుకున్నారు. వారి వారి ఆస్తులను (విదేశాల్లోనివి) డిక్లేర్ చేశారు. వీరిలో 24,678 మంది రివ్యూ చేసుకున్నారు. 5,483 మంది తమ రిటర్నులను రివైజ్ చేసుకున్నారు. దీనితో రూ. 29,208 కోట్ల విదేశీ ఆస్తులు అదనంగా ఉన్నట్లు బైటపడింది. వాటి ద్వారా అదనంగా రూ. 1,089 కోట్ల ఆదాయం బైటికొచ్చింది.అంతే కాకుండా 6,734 మంది వారి స్టేటస్ను రెసిడెంటు నుంచి నాన్ రెసిడెంటుగా మార్చుకున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల ఎన్నో మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవగాహన, పారదర్శకత పెరుగుతోంది. నిబంధనలను పాటించడం (కాంప్లయెన్స్) పెరిగింది. కీలక వివరాలు తెలిశాయి. పన్నుల వసూళ్లు పెరిగాయి.కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (సీఆర్ఎస్) ద్వారా విదేశాల్లోని పన్ను అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అన్ని దేశాల నుంచి సమగ్రమైన సమాచారం వస్తోంది. అంతే కాకుండా విదేశీ ఖాతాల నుంచి సమాచారం వస్తోంది. పలు చోట్ల సెమినార్లు, వెబినార్లు నిర్వహించారు. కరపత్రాలు, బ్రోచర్లు పంచారు. సోషల్ మీడియా వాడుకున్నారు. ఇదంతా ఇప్పటివరకు స్నేహపూర్వకంగా జరుగుతోంది. ఇలాగే కొనసాగాలంటే, ‘వాళ్లు మన గురించి తెలుసుకుంటున్నారన్న విషయాన్ని‘ మనం అర్థం చేసుకుని మసలుకోవాలి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
మళ్లీ అదే మాట !
న్యూయార్క్: అమెరికా ఉత్పత్తులపై విదేశాలు వసూలు చేస్తున్న టారిఫ్ల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వెళ్లగక్కారు. భారతదేశంలో అధికంగా టారిఫ్లు విధిస్తున్నారని మళ్లీ అసంతృప్తి వ్యక్తంచేశారు. నిజంగా అధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని పేర్కొన్నారు. ఇది న్యాయబద్ధం కాదని చెప్పారు. తమకు న్యాయం జరగాలంటే అదే రీతిలో ప్రతిస్పందించక తప్పదని స్పష్టంచేశారు. ప్రతీకార సుంకాలు విధించబోతున్నామని, వచ్చే నెల 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తేలి్చచెప్పారు. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్లు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపైనా అదే స్థాయిలో టారిఫ్లు విధించబోతున్నామని ఉద్ఘాటించారు. ఇండియా, చైనాతోపాటు ఏ దేశమైనా సరే తమ ఉత్పత్తులు వాడుకుంటే భారీగా సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇన్నాళ్లూ అమెరికాను దోచుకున్నారని, ఇకపై అది సాగనివ్వబోమని హెచ్చరించారు. ఆయన గతంలో కూడా ఇండియాను ‘టారిఫ్ కింగ్’, ‘బిగ్ అబ్యూసర్’ అని నిందించారు. ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లుగా(రూ.8.70 లక్షల కోట్లు) ఉందని ట్రంప్ చెబుతున్నారు. దీన్ని తగ్గించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అమెరికాకు గేమ్ ఛేంజర్ వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో గురువారం కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేశారు. అమెరికా పాల ఉత్పత్తులతోపాటు ఇతర వస్తువులపై కెనడాలో 250 శాతం టారిఫ్లు విధిస్తున్నారని ఆక్షేపించారు. కెనడా ఉత్పత్తులు ఇకపై తమకు అవసరం లేదని, ఒకవేళ దిగుమతి చేసుకున్నా భారీగా సుంకాలు విధిస్తామని స్పష్టంచేశారు. విదేశీ ఉత్పత్తులపై ఇప్పుడు విధిస్తున్న టారిఫ్లు తాత్కాలికమేనని, అసలైన మోత ఏప్రిల్ 2 నుంచి మోగబోతోందని, అందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అమెరికాకు ఇదొక గేమ్ ఛేంజర్ కాబోతోందని వివరించారు. -
కిమ్ కీలక నిర్ణయం.. విదేశీ టూరిస్టులకు గుడ్న్యూస్
ఉత్తర కొరియాను సందర్శించాలనుకునే విదేశీ టూరిస్టులకు ఇది శుభవార్తే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ పర్యాటకులకు ఆ దేశం తలుపులు తెరవబోతోంది. పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టిన కిమ్ ప్రభుత్వం తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమైనట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.కొన్ని వారాల క్రితం విదేశీయులు ఉత్తర కొరియాలో పర్యటించారని.. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కిమ్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి విదేశీ మారక నిల్వలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.ఉత్తర కొరియా నిర్ణయంతో కెనడా, యూకే, న్యూజిలాండ్, చైనా వంటి దేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఉత్తర కొరియా వచ్చే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి ఉత్తర కొరియా పర్యాటకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుకు మళ్లీ విదేశీయులను అనుమతిస్తోంది.ఇదీ చదవండి: USA: ఎలాన్ మస్క్కు బిగ్ షాక్.. -
ఎఫ్పీఐల షాక్
దేశీ స్టాక్ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ. 23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జనవరిలో ఎఫ్పీఐలు దేశీ మార్కెట్ల నుంచి రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి కొత్త కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1,01,737 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మివేశారు. ఫలితంగా ఈ కాలంలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 4 శాతం నష్టపోయింది. పటిష్ట ఆరి్థక పురోగతి, కార్పొరేట్ ఫలితాలలో వృద్ధి వంటి సానుకూల అంశాలు మాత్రమే తిరిగి ఎఫ్పీఐలను ఆకట్టుకోగలవని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్.. పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. -
విదేశీ అంశాలు, ఎఫ్పీఐల చేతుల్లోనే..
న్యూఢిల్లీ: కంపెనీల త్రైమాసిక ఫలితాల సీజన్ (క్యూ3) ముగియడంతో.. అంతర్జాతీయ అంశాలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) ట్రేడింగ్ తీరు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరాయంగా అమ్మకాలు చేస్తుండడం, క్యూ3లో కంపెనీల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం గత వారం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీయడం గమనార్హం. దీంతో నిఫ్టీ కీలకమైన 22800 మద్దతు స్థాయికి సమీపానికి మరోసారి వచ్చింది. నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా ఎనిమిదో రోజూ (గత శుక్రవారం) నష్టాల్లో ముగిశాయి. ఇలా చాలా అరుదుగానే చూస్తుంటాం. ఎనిమిది రోజుల్లో కలిపి బీఎస్ఈ సెన్సెక్స్ 2,645 పాయింట్లు కోల్పోగా (3.36 శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 810 పాయింట్లు (3.41 శాతం) నష్టపోయింది. ‘‘డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు ముగిసిపోయాయి. డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశి్చతుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చు’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా తెలిపారు. వీటికి అదనంగా డాలర్తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని ఏంజెల్ వన్ సీనియర్ అనలిస్ట్ ఓషో కృష్ణన్ పేర్కొన్నారు. ‘‘మార్కెట్ పతనానికి ఎన్నో అంశాలు దారిచూపాయి. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్లపై చేసిన ప్రకటన సెంటిమెంట్కు దెబ్బకొట్టింది. దీనికి అదనంగా క్యూ3 కార్పొరేట్ ఫలితాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఇన్వెస్టర్ల విశ్వాసంపై ప్రభావం చూపించింది’’అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా తెలిపారు. దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ ఆవిరి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడికి మార్కె ట్ విలువ పరంగా టాప్–10లోని ఎనిమిది కంపెనీలు గడిచిన వారంలో రూ.2 లక్షల కోట్లకు పైన విలువను నష్టపోయాయి. అన్నింటిలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ నష్టాన్ని చూసింది. రూ.67,527 కోట్లు తగ్గి రూ.16,46,822 కోట్ల వద్ద స్థిరపడింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.34,951 కోట్ల మేర తగ్గి రూ.14,22,903 కోట్ల వద్ద ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.28,382 కోట్లను నష్టపోయింది. మార్కెట్ విలువ రూ.12,96,708 కోట్లుగా ఉంది. ఐటీసీ రూ.25,430 కోట్ల నష్టంతో రూ.5,13,670 కోట్ల వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 19,287 కోట్లు తగ్గిపోగా, ఎస్బీఐ రూ.13,431 కోట్లు, హిందుస్థాన్ యూనిలీవర్ రూ.10,714 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.4,230 కోట్లు చొప్పున మార్కెట్ విలు వను కోల్పోయా యి. ఎయిర్టెల్ మార్కె ట్ విలువ రూ.22,426 కోట్లు పెరగడంతో రూ.9,78, 631 కోట్లకు చేరింది. అలాగే, ఐ సీఐసీఐ బ్యాంక్ విలువ సైతం రూ.1,182 కోట్ల మేర లాభపడి రూ.8,88,815 కోట్లుగా ఉంది. ఎఫ్పీఐల అమ్మకాలు రూ.21,272 కోట్లు ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లోనూ ఎఫ్పీఐలు పెద్ద మొత్తంలో విక్రయాలు చేపట్టారు. నికరంగా రూ.21,272 కోట్లను ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. జనవరిలోనూ వీరు రూ.78,027 కోట్ల మేర అమ్మకాలు చేపట్టడం గమనార్హం. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు వీరు భారత ఈక్విటీల నుంచి రూ.99,299 కోట్లను వెనక్కి తీసుకెళ్లిపోయారు. డెట్ విభాగంలో ఈ నెల మొదటి రెండు వారాల్లో నికరంగా రూ.1,296 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డాలర్ ఇండెక్స్ తగ్గుముఖం పట్టినప్పుడు ఎఫ్పీఐలు తిరిగి పెట్టుబడులతో రావొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ తెలిపారు. ‘‘స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ టారిఫ్లు ప్రకటించడం, ప్రతీకార సుంకాల ప్రణాళికలతో మార్కెట్లో ఆందోళనలు చెలరేగాయి. దీంతో భారతసహా వర్ధమాన మార్కెట్లలో తమ పెట్టుబడులను ఎఫ్పీఐలు సమీక్షిస్తున్నాయి’’అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు. -
Trump: సాయం కోసం ఇంత ఏడుపులు దేనికి?
‘‘అది మీ ప్రభుత్వం కాదు. మీ దేశం అంతకన్నా కాదు. మీరేం అక్కడ పన్నులూ కట్టడం లేదు. ఏదైనా సాయం అందించడానికి వాళ్లకు కారణాలు అక్కర్లేదు కదా. అలాంటప్పుడు ఈ ఏడుపులు దేనికి? ముమ్మాటికీ ఇది మనకు ఓ మేలుకొలుపే..’’ అని ఓ సదస్సులో ఆఫ్రికా దేశాలను ఉద్దేశించి కెన్యా మాజీ అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఫెడరల్ గ్రాంట్లు, రుణాల నిలిపివేత నిర్ణయమే ఆయన అలా మాట్లాడటానికి కారణం. సాయాన్ని నిలిపివేస్తానని ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచమంతా ఆగమాగమైంది. పలువురు దేశాధినేతలు ట్రంప్ను బహిరంగంగానే తిట్టిపోశారు. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం ఇచ్చే సాయం మీద ఆధారపడి బతుకుతున్న చిన్న దేశాల తీవ్ర ఆందోళనకు గురయ్యాయి.అమెరికా నుంచి వెళ్తున్న అన్ని గ్రాంట్లపై సమీక్ష జరపాలని ట్రంప్ ప్రభుత్వం భావించింది. దీంతో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్ మినహా అమెరికా అందిస్తున్న అన్ని సాయాలు ఆపేద్దామనుకుంది. ఈ విధానం అమెరికాకు ప్రయోజకారిగా లేకపోగా.. విలువలకు విరుద్ధంగా ఉందని ట్రంప్ ఈ ఆదేశాలను జారీ చేశారు. అందుకే మూడు నెలలపాటు వాటిని సమీక్షించాలనుకున్నారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం వెలువడిన కాసేపటికే.. మ్యాటర్ కోర్టు గడప తొక్కింది. దీంతో విచారణ వేళ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను వెనక్కి తీసుకుంటున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. అయితే కెన్యా మాజీ అధ్యక్షుడు చెబుతున్నట్లు అమెరికా సాయం నిజంగా ఈ ప్రపంచానికి అవసరమా?.కిందటి ఏడాది అమెరికా నుంచి వివిధ దేశాలకు వెళ్లిన సాయం పరిశీలిస్తే.. ఉక్రెయిన్కు 16.5 బిలియన్ల డాలర్ల సాయానికిగానూ.. 16.2 బిలియన్ డాలర్లు పంపిణీ చేసింది.ఇథియోపియాకు 1.6 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. 2 బిలియన్ డాలర్లు పంపిణీ చేసింది.జోర్దాన్కు 1.2 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. అందజేసింది.డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. 1 బిలియన్ డాలర్ సాయం ప్రకటించి, 982 మిలియన్ డాలర్లు ఇచ్చిందిసోమాలియాకు 1 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించి, 1.1 బిలియన్ డాలర్లను పంపిణీ చేసిందియెమెన్కు 939 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. 1.1 బిలియన్ డాలర్లు అందజేసింది.నైజీరియాకు 904 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. 886 మిలియన్ డాలర్లు ఇచ్చిందిఅఫ్గనిస్థాన్కు 815 మిలియన్ డాలర్ల సాయానికిగానూ.. 1.2 బిలియన్ డాలర్ల సాయం అందజేసిందిదక్షిణ సూడాన్కు 794 మిలియన్ డాలర్ల సాయానికిగానూ 891 మిలియన్ డాలర్లు అందజేసిందిసిరియాకు 748 మిలియన్ డాలర్లకుగానూ.. 894 మిలియన్ డాలర్ల సాయం అందించిందిమానవతా కోణంలో సాయం అందించడం, ఆయా దేశాల అభివృద్ధిలో భాగంగా అమెరికా ఈ సాయం అందించింది. అయితే అమెరికాతో పాటు వివిధ దేశాలకు ఎంత గ్రాంట్లు కేటాయించాలన్నది మాత్రం అక్కడి చట్ట సభలే నిర్ణయిస్తాయి. ఈ అమెరికాకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని ఈ పద్ధతి మారాలని ట్రంప్ అనుకుంటున్నారు.ట్రంప్ నిర్ణయంతో విదేశాలకు, స్వచ్ఛంద సంస్థలకు చేసే ఆర్థిక సాయం ఆగిపోవడంతోపాటు విద్య, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, నిర్మాణ, విపత్తు నిర్వహణ కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆహారం, ఆశ్రయం, వైద్య సేవల్లాంటి మానవతా సాయం ఆగిపోతుంది. ఇది నేరుగా ఉద్యోగాల తొలగింపు.. అవసరమైతే ఆ వ్యవస్థల రద్దుకు దారి తీయొచ్చు. పౌష్టికాహార లోపం, రకరకాల జబ్బుల.. వైరస్లతో బాధపడుతున్న ఆఫ్రికన్ దేశాలకు ఇది ముప్పుగా మారచ్చు. మరికొన్ని దేశాల్లో సంక్షోభాలు ముదిరేలా చేయొచ్చు. అయితే సామాజిక భద్రత, మెడికేర్ చెల్లింపులు, వ్యక్తులకు నేరుగా అందించే ఆర్థికసాయంపై ప్రభావం చూపదని వైట్హౌస్ వర్గాలు చెబుతున్నా.. ఎక్కడా రాతపూర్వకంగా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అమెరికాలోనే మాత్రం కాదు.. ఆ దేశం నుంచి సాయం పొందుతున్న దేశాలకూ వర్తించనుంది. ఆర్థికంగా, సామాజికంగా ఆ దేశాలు సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఎదురుకానున్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు.. ప్రత్యేకించి ఆఫ్రికన్ దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి.నిజంగా అమెరికా ఈ సాయం చేయడం అవసరమా? అంటే.. లేదు. కానీ, ఈ తరహా సాయంతో అమెరికాకు ఎంతో మేలు చేకూరుతుంది. దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపర్చుకోవడం, వ్యాపార రంగంలో కీలక ఒప్పందాలు, అంతర్యుద్ధాలు-సంక్షోభాల నివారణ.. ఉగ్రవాద అంతం.. తద్వారా ఆ దేశాల్లో జాతీయ భద్రతను పెంపొందించడం ద్వారా మిత్రపక్షాలుగా మార్చుకోవడం, జబ్బుల నివారణకు మానవతా కోణంలో సాయం.. అందుకోసం పరిశోధనలకు భారీగా నిధులు వెచ్చించడం, ఇలా ఇతరత్రా సాయాలతో ప్రపంచదేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ వస్తోంది అమెరికా. Hilarious. Former President of Kenya on Trump cutting off foreign aid: “Why are you crying? It’s not your government. It’s not your country. He has no reason to give you anything. You don’t pay taxes in America. This is a wake up call for you to ask what are we going to do”. pic.twitter.com/tfjETD2qkS— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 29, 2025అయితే.. ప్రపంచవ్యాప్తంగా వైద్య సాయాన్ని కూడా నిలిపివేయాలనుకున్న ట్రంప్ నిర్ణయం.. తూర్పు ఆఫ్రికా దేశాల ఐకమత్యానికి, పరస్పర సాయానికి ఓ పిలుపులాంటిదని ఉహురు కెన్యట్టా అభిప్రాయపడ్డారు. అమెరికాను, ట్రంప్ను విమర్శించడం కన్నా స్వీయ సమీక్ష చేసుకోవాలని నేతలకు పిలుపు ఇచ్చారు. ఇతరుల సాయంపై ఆధారపడే బదులు.. ఉన్న వనరులతోనే ఇక్కడి దేశాలు ఒకరికొకరు సాయం చేసుకోవడం, తద్వారా ఆర్థిక పురోగతికి దోహదపడడం ఏనాటికైనా మంచిదని అంటున్నారాయన. మానవతా సాయం విషయంలో భారత్ కూడా ఏం తీసిపోలేదు. 2021-2022లో 2.1 బిలియన్ డాలర్ల(రూ.18,154 కోట్లు) సాయాన్ని పొరుగుదేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, అప్ఘనిస్థాన్ల అభివృద్ధికి భారత్ అందజేసింది. -
బ్రెడ్ తింటూ.. బాత్రూం నీరు తాగుతూ..!
విశాఖ సిటీ: రోజూ రెండు బ్రెడ్లు కోసం పది మంది కొట్టుకుంటూ.. బాత్రూమ్లో నీటినే తాగుతూ.. నెలల తరబడి నరకయాతన అనుభవించారు. విదేశాల్లో వేర్హౌస్ కంపెనీలో సూపర్వైజర్ ఉద్యోగం వచ్చిందని కోటి ఆశలతో విమానం ఎక్కిన నిరుద్యోగులతో అక్కడ బాత్రూమ్లు కడిగించారు. తోటల్లో గడ్డి కత్తిరిస్తూ.. కూలి పనులు చేయించారు. Students Facing Problems ఆకలి బాధలు తట్టుకోలేక.. ఉత్తరాంధ్రకు చెందిన 25 మంది తిరిగి విశాఖకు చేరుకొని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. యూరప్లోని పలు దేశాల్లో వేర్హౌస్లో స్టోర్ కీపర్, సూపర్వైజర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 2023లో నూజ్ కెరీర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ వారు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.క్యాబ్ డ్రైవరే కంపెనీ ఓనర్ అని..విదేశాల్లో ఉద్యోగం వస్తుందని భావించిన పలువురు నిరుద్యోగులు సదరు కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించారు. వీరికి నగరంలోని ఓ హోటల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అందులో యూరప్లోని ఒక ట్యాక్సీ డ్రైవర్ను తీసుకువచ్చి కంపెనీ ఓనర్గా నిరుద్యోగులకు పరిచయం చేశారు. అతని కంపెనీలోనే పనిచేయాల్సి ఉంటుందని, అతడే అందరికీ జీతాలు ఇస్తాడని నమ్మించారు.10 మందికి రెండు బ్రెడ్లే..జీవితంలో స్థిరపడవచ్చన్న ఆశతో విమానం ఎక్కిన నిరుద్యోగులు అక్కడికి వెళ్లాక నరకయాతన అనుభవించారు. అగ్రిమెంట్ ప్రకారం సదరు కంపెనీకి వెళ్లగా.. అవి ఉద్యోగానికి సంబంధించినవి కాదని, నకిలీవని ఆ ఒప్పంద పత్రాలను చింపేశారు. వారిని ఒక లేబర్ క్యాంప్నకు తరలించారు. అక్కడ ఓ చిన్న రూమ్లో పది మంది చొప్పున ఉంచారు. స్టోర్కీపర్, సూపర్వైజర్ ఉద్యోగాలు కాకుండా బాత్రూమ్లు కడిగించారు. అలాగే పొలాల్లో గడ్డి తీయడం, పండ్లు కోసే పనులు చేయించారు. రూమ్లో పది మంది ఉంటే.. రోజుకు కేవలం రెండు బ్రెడ్లు మాత్రమే పంపించేవారు. దీంతో ఆకలి తీర్చుకోడానికి ఆ బ్రెడ్ల కోసం కొట్టుకునేవారు. తాగడానికి నీరు లేక బాత్రూమ్లో నీటినే తాగేవారు. ఇలా కొద్ది నెలలు తీవ్ర ఇబ్బందులు పడి, ఇక ఉండలేక అతికష్టం మీద తిరిగి విశాఖకు చేరుకున్నారు. నూజ్ కన్సల్టెన్సీ ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని బెలగావిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ మొహిసిన్ అహ్మద్షేక్ను సంప్రదించారు. దీంతో అతడు మరి కొద్ది రోజుల్లో ఇటలీ, చెక్రిపబ్లిక్, ఇతర దేశాలకు పంపిస్తానని హామీ ఇచ్చాడు. ఆ తరువాత కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.. వారు స్పందించలేదు. ఫిర్యాదు చేస్తే చేసుకోవచ్చని చెప్పడంతో బాధితులు సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో జరుగుతున్న పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.ఒక్కొక్కరి నుంచి రూ.7.5 లక్షలు వసూలుఈ ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.7.5 లక్షలు నుంచి రూ.8 లక్షలు వసూలు చేశారు. ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 25 మంది వరకు డబ్బులు కట్టారు. అయితే నెలలు గడుస్తున్నా వారిని విదేశాలకు పంపించలేదు. దీంతో వారు కన్సల్టెన్సీ ప్రతినిధులపై ఒత్తిడి పెంచారు. ఆరు నెలల తరువాత నకిలీ అగ్రిమెంట్లు, నకిలీ వీసాలతో దక్షిణ యూరప్లోని మాంటెనెగ్రో దేశానికి పంపించారు. -
ట్రంప్ ఎఫెక్ట్.. 20 రోజుల్లో రూ.50,000 కోట్ల అమ్మకాలు
భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (Foreign Institutional Investors) 2025 జనవరిలో ఇప్పటివరకు దాదాపు రూ.50,000 కోట్లకుపైగా పెట్టుబడిని ఉపసంహరించుకున్నారు. ఈ భారీ అవుట్ ఫ్లో సెన్సెక్స్, నిఫ్టీలపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. ఎఫ్ఐఐల అమ్మకాల దోరణి కొనసాగుతుండడంతో సూచీలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాలు పెద్ద ఇన్వెస్టర్లకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. వార్షిక ప్రాతిపదికన చాలా కంపెనీల లాభాల వృద్ధి స్థిరంగానే ఉంది.ట్రంప్ ప్రభావం..అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో భారత్ మార్కెట్లో ఎఫ్ఐఐ(FII)ల అమ్మకాల్లో వేగం పెరుగుతోంది. అందుకుతోడు ట్రంప్ ‘కంట్రీఫస్ట్’ దోరణితో తీసుకుంటున్న నిర్ణయాలు మరింత భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి. ట్రంప్ అమెరికా అనుకూల విధానాల వల్ల చాలామంది ఇన్వెస్టర్లు యూఎస్లోనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే భారత్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు వాటిని విత్డ్రా చేసి అమెరికా మార్కెట్లో ఇన్వెస్ట్(Invest) చేయాలని భావిస్తున్నారు. దాంతో భారత మార్కెట్లు భారీగా కుదేలవుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతను ఇప్పటికే ప్రారంభించింది. అమెరికా బాండ్ ఈల్ట్లు పెరుగుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికా చమురు ఎగుమతులు పెంపుడాలర్ బలపడటం, విదేశీ నిధుల ఉపసంహరణతో అమెరికా డాలర్(US Dollar)తో పోలిస్తే ఇటీవల భారత రూపాయి 3 శాతం క్షీణించి రికార్డు స్థాయిలో రూ.86.70 వద్ద ముగిసింది. ఈ క్షీణత భారత స్టాక్ మార్కెట్పై ఒత్తిడి పెంచింది. ఈక్విటీ మార్కెట్లు స్థిరపడాలంటే బాండ్ ఈల్డ్స్, యూఎస్ డాలర్ నిలకడగా ఉండడం చాలా అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
Maha Kumbh: 15 లక్షలకుపైగా విదేశీ పర్యాటకుల రాక
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. ఈ మహా కుంభమేళాకు 15 లక్షల మందికి పైగా విదేశీ పర్యాటకులు హాజరవుతారని, వారి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రత్యేక టెంట్ సిటీని సిద్ధం చేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మీడియాకు తెలిపారు. ఈ టెంట్ సిటీలో ఆయుర్వేదం, యోగా, పంచకర్మ వంటి వైద్య సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు.ప్రయాగ్రాజ్(Prayagraj)లోని నాగవాసుకి ప్రాంతంలోని సెక్టార్ 7లో 10 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన భారతీయ సాంస్కృతిక వారసత్వ కేంద్రం ‘కళాగ్రామ్’ను ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వివరాలను తెలిపారు. మహా కుంభసమ్మేళనం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవమని, ఇది వైవిధ్యభరిత భారతదేశ ఐక్యతను ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. మహాకుంభమేళాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించేలా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆయన అన్నారు.2025 మహా కుంభ్లో కళాగ్రామం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని, ఇక్కడ నాలుగు ధామాల వేదిక ప్రదర్శన, 12 జ్యోతిర్లింగాల మహా ద్వారం, నిరంతర కుంభ ప్రదర్శన ఉంటాయన్నారు. వివిధ రకాల సాంస్కృతిక వైవిధ్యం(Cultural diversity) ఏడు ప్రాంతీయ సంస్కృతి ప్రాంగణాలలో ప్రదర్శితమవుతాయని షెఖావత్ అన్నారు. 230 మందికి పైగా కళాకారులు భారతదేశ విశిష్ఠతను కళాగ్రామంలో ప్రదర్శించనున్నారని తెలిపారు. ఇక్కడ వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయన్నారు. 14,630కు పైగా కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మహా కుంభమేళా(Kumbh Mela)కు వచ్చే భక్తులు అయోధ్య, కాశీ, మధుర తదితర ప్రదేశాలను సందర్శించేందుకు విమాన ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కళాగ్రామం భారతీయ జానపద కళ, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే శక్తివంతమైన వేదికగా నిలుస్తుందన్నారు. ఇది కూడా చదవండి: మహాకుంభ్కు వింత బాబాలు.. షాకవుతున్న జనం -
అప్పాల తయారీ అదుర్స్!
సాక్షి, పెద్దపల్లి: సంక్రాంతి పండుగ అనగానే పిండి వంటలు గుర్తుకొస్తాయి.. కానీ అప్పాలు అంటే సుల్తానాపూర్ గ్రామం గుర్తుకొస్తుంది. ఆ ఊరే అప్పాలకు కేరాఫ్ అడ్రస్. ఆ గ్రామస్తుల క్వాలిటీయే వారి బ్రాండ్. చూస్తేనే నోరూరించే పిండి వంటలు. ఒక్కఫోన్ చేస్తే చాలు.. ఎంచక్కా పిండివంటలు మన ఇంటికి వచ్చేస్తాయి. శుభకార్యాలకు కావాల్సిన సారెలో అందించే అన్నిరకాల పిండివంటలను తయారుచేసి తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఇతర దేశాలకూ సరఫరా చేస్తూ స్వయం ఉపాధి పొందుతూ.. మరికొంతమందికి ఉపాధి ఇస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన మహిళలు.మాకు చేసివ్వరా... పదిహేడేళ్ల క్రితం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి లీడర్గా పదిమంది సభ్యులతో ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. ఇంటివద్దే ఉంటూ చిన్న మొత్తాలతో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. పలురకాలుగా ఆలోచిస్తున్న సమయంలో గ్రూప్లోని ఒక సభ్యురాలి ఇంట్లో వివాహ వేడుకకు పెద్దమొత్తంలో అప్పాలు తయారు చేయాల్సి వచి్చంది. దీంతో తమ గ్రూప్ సభ్యుల సహకారంతో ఆ పెళ్లికి కావాల్సిన సారెను అందరూ కలిసి సరదాగా సిద్ధం చేశారు. దీంతో ఆ వేడుకకు వచి్చన బంధువులు ‘మా బిడ్డ సీమంతం ఉంది కొంచెం చేసి పెడతారా? మా కొడుకు, కోడలు అమెరికా వెళుతున్నారు.. అప్పాలు చేసి పెడతారా’అని అడగటంతో వారికి వీరు సైతం చేసిచ్చారు. అయితే ఊళ్లో ఉన్న మనకే సారె తయారు చేయడానికి ఇతరుల సహాయంతో చేయాల్సిన పరిస్థితి నెలకొందని, సిటీలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? వారు అప్పాలు పెద్దమొత్తంలో ఎలా తయారు చేసుకుంటారు? అనే ఆలోచన లక్ష్మికి తట్టింది. దీన్నే ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదని గ్రూప్ సభ్యులకు తెలిపింది. తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో కూడినది కావటంతో అందరూ సరేనన్నారు. దీంతో అప్పాలు చేయడం ఉపాధిగా మలుచుకొని లక్షణంగా లక్షలు సంపాదిస్తున్నారు. 8 గ్రూప్లు.. 400 మంది వర్కర్లుగ్రూప్నకు ఎటువంటి పేరు, బ్రాండ్ లేకపోయినా, క్వాలిటీతో మొదట తమ గ్రూప్ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులకు ఆర్డర్లపై అప్పాలు తయారు చేసి ఇచ్చేవారు. అలా నోటిమాటతో క్వాలిటీ నచ్చి ఆర్డర్లు పెరుగుతూపోయాయి. దాదాపు ఏడాదికి రూ.50 లక్షల పైనే ఆర్డర్లు వస్తుండటంతో అప్పాలు కాల్చడానికి, పిండి పిసకడానికి, సకినాలు చుట్టడానికి, ఇతరత్రా పనులకు రోజువారి వర్కర్ల సాయం తీసుకుంటూ వారికి కూడా ఉపాధి కల్పింపిస్తున్నారు. వీరిని చూసి గ్రామంలో మరో 8 సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కో గ్రూప్లో పదిమంది సభ్యులతోపాటు, వారికి సాయం పనికి వచ్చే 50మంది వర్కర్లతో పాటు, పిండిగిరి్న, ట్రాలీ, కట్టెలు కొట్టేవారు తదితరులతో కలిసి దాదాపు 400 మందికిపైగా ఆ గ్రామంలో అప్పాలతో ఉపాధి పొందుతున్నారు.బాహుబలి అప్పాలు.. 32 వరుసలతో చక్రాల్లా సకినాలు, కిలో పరిమాణంలో లడ్డూ, గరిజ, బెల్లం అరిసెలు, నువ్వుల లడ్డూ, మురుకులు, చెగోడీలు, గవ్వలు, ఖారా, ఇతరత్రా వంటకాలను పెద్దఎత్తున తయారు చేయడం వీరి ప్రత్యేకత.ఆర్డర్పై విదేశాలకు మా గ్రామంలో 17 ఏళ్లుగా ఆర్డర్పై అప్పాలను తయారు చేస్తూ ఎగుమతి చేస్తున్నాం. అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు, తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రకు సైతం పంపిస్తున్నాం. ఏడాదిలో రూ.50లక్షలపైగా ఆర్డర్లు వస్తాయి. తయారు చేసి వారు కోరుకున్న సమయానికి అందజేస్తాం. – తానిపత్తి లక్ష్మీదేవి, గ్రూప్ లీడర్కలిసి పనిచేస్తాం మా బంధువులం అందరం కలిసి అప్పాలను తయారు చేస్తాం. ప్రతీ ఒక్కరికి రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు గిట్టుబాటు అవుతుంది. ఆర్డర్లు ఎక్కువ వస్తే ఇతర గ్రూప్లతో పంచుకుంటాం. అందరం కలిసి పనిచేసుకుంటూ పిల్లలను మంచిగా సెటిల్ చేశాం. – అలివేణి, సుల్తానాపూర్ ఆర్డర్లపై తయారీ మా గ్రూప్ ద్వారా ఆర్డర్లపై సుమారు 11 ఏళ్లుగా అప్పాలను తయారు చేస్తూ విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలతోపాటు లండన్, అమెరికాకు పంపిస్తున్నాం. మా గ్రూపు సభ్యులకు ఉపాధి కల్పించటంతోపాటు ఇతరులకు సైతం ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – మాధవి, శ్రీరామ గ్రూప్ నిర్వాహకురాలు -
16కు సీఎం విదేశీ పర్యటన వాయిదా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 13 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. రెండ్రోజుల తర్వాత వెళ్లనున్నారు. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లి 15న జరగనున్న ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆయన 13న వెళ్లాల్సిన ఆ్రస్టేలియా పర్యటనను విరమించుకున్నారు. 16న సీఎం స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. 24న రాష్ట్రానికి తిరిగి చేరుకుంటారు.నేడు కలెక్టర్లతో సీఎం సమావేశంసాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కలెక్టర్లతో సమావేశం నిర్వ హించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రా రంభించనున్న రైతు భరోసా, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పా టు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఈ సమావేశంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. -
ఆందోళనలో ‘విదేశీ’ వైద్య విద్యార్థులు
లబ్బీపేట (విజయవాడతూర్పు): విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి సర్టిఫికెట్స్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు పాటిస్తున్నట్లు మెడికల్ కౌన్సిల్ అధికారులు చెబుతుండగా, రిజిస్ట్రేషన్లను జాప్యం చేయడం వలన తమ కాలం వృధా అవుతుందని విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్ ఏమిటో అర్ధం కావడం లేదంటూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఇటీవల ఆందోళనకు దిగారు. తమ పీఆర్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో విదేశాల్లో విద్యనభ్యసించామంటూ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు వచ్చిన వారి సర్టిఫికెట్స్ నకిలీవనీ నిర్ధారణ అయింది. ఈ విషయంపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పందించింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు వస్తే, వారు చదువుకున్న యూనివర్సిటీల నుంచి జెన్యునిటీ నిర్ధారణ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన సుమారు 400 మంది విద్యార్థుల సర్టీఫికెట్స్ను ధ్రువీకరణ కోసం ఆయా దేశాల ఎంబసీకి పంపించారు. ఇప్పటి వరకూ వాటి విషయంలో ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. ర్యాంకులొచ్చినా పీజీ చేయలేం.. విదేశాల్లో వైద్య విద్యనభ్యసించి, ఇక్కడ ఎన్ఎంసీ నిర్వహించే నీట్లో మెరిట్ ర్యాంకులు వచ్చినా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో పీజీలు చేయలేక పోతున్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు నీట్ నోటిఫికేట్ వచ్చిందని, తమ పరిస్థితి ఏమిటో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్ఎంసీ ఆదేశాల మేరకే..విదేశాల్లో వైద్య విద్య చదివిన వారి సర్టీఫికెట్లను జన్యునిటీ నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే పీఆర్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. వారి సూచనల మేరకు తమ వద్దకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి సర్టీఫికెట్స్ను ఆయా దేశాల ఎంబసీకి పంపిస్తున్నాం. యూనివర్సిటీల నుంచి జెన్యూన్ అని నిర్ధారిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇప్పటి వరకూ 400 సర్టీఫికెట్స్ను అలా పంపించాం. – డాక్టర్ ఐ.రమేష్, రిజి్రస్టార్, ఏపీ మెడికల్ కౌన్సిల్ -
విదేశీ పండ్లకు పెరిగిన క్రేజ్
అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివీ, వాషింగ్టన్ యాపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్ ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రసుత్తం నగర మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. దీంతో విదేశీ పండ్ల రుచులను ఆస్వాదించడానికి నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రోజు రోజుకూ నగరంలో వీటి అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సగటున రోజుకు 50–60 టన్నుల మేర అమ్మకాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సుమారు 18 దేశాల నుంచి వివిధ రకాలు దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపార వర్గాల చెబుతున్న మాట. కాగా ఈ మొత్తం ప్రక్రియలో అమ్మకాలు, దిగుమతులు గణనీయంగా పెరిగాయని, దీంతో విదేశీ పండ్ల విక్రయాల్లో నగరం దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెలుస్తోంది.. ఒకప్పుడు స్థానికంగా దొరికే ఫలాలే సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసేవారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫలాలు ఎగువ మధ్య తరగతి వారు, లేదా ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారు. అయితే మారుతున్న పరిస్థితులు, గ్లోబల్ మార్కెటింగ్లో భాగంగా ప్రతిదీ సామాన్యులకు అందుబాటులకి వచి్చంది. పైగా వాటికి ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు వాటి అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశంలో అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లు నగర మార్కెట్లో అందుబాటులో అమ్మకాలు జరుగుతున్నాయి... మాల్స్ నుంచి లోకల్ మార్కెట్కి.. విదేశీ పండ్లు ఒకప్పుడు పెద్ద పెద్ద మాల్స్లోనో.. లేదా సూపర్ మార్కెట్స్లోనో అమ్మకాలు జరిగేవి... అయితే విదేశీ పండ్లు నగరంలో మాల్స్, ఫ్రూట్ షాప్స్ నుంచి తోపుడు బండ్లపై అమ్మకాలు జరుగుతున్నాయి. పైగా దేశీయ పండ్ల ధరలకు సమానంగా వీటిని విక్రయిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఏదో ఒక సీజన్లో మత్రమే దేశయ మార్కెట్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వివిధ దేశాల పండ్లు అక్కడి సీజన్ల ప్రకారం మార్కెట్కు దిగుమతి అవుతున్నాయి. దీంతో యేడాది పొడవునా ఏదో ఒక దేశం నుంచి అన్ని రకాల పండ్లూ అన్ని సీజన్లలో లభ్యమౌతున్నాయి. దేశంలోనే మూడో స్థానంలో.. విదేశీ పండ్లుగా పేరుగాంచిన కివీ, స్ట్రాబర్రీ, బ్లాక్ బెర్రీస్, అవకాడో వంటి పళ్లు నగరంలో విరివిగా లభ్యమవుతున్నాయి. భారీగా అక్కడి నుంచి దిగుమతులు చేయడం ఒక కారణమైతే.. లోకల్ మార్కెట్తో పాటు ఇళ్ల వెంబడి కూడా అమ్మకాలు చేయడమే మరో కారణమని బాటసింగారం మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకూ, జిల్లాలకూ ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతాయి. అందుకే రాష్ట్రంలోనే బాటసింగారం పండ్ల మార్కెట్కు అతి పెద్దదిగా పెట్టింది పేరు. అయితే విదేశీ పండ్ల వినియోగంలో ముంబయి, బెంగళూరు తర్వాత నగరం మూడో స్థానంలో నిలిచింది. దిగుమతులు ఇలా.. గ్రీన్ యాపిల్కు ఇటీవల అదరణ పెరిగింది. నెదర్లాండ్స్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాపిల్ పళ్లను వాషింగ్టన్, చైనా, న్యూజిల్యాండ్, చిలీ, బెల్జియం నుంచి ముంబాయి, చెన్నై పోర్టు ద్వారా నగరానికి దిగుమతవుతాయి. అవకాడో టాంజానియా నుంచి, కివీ పండ్లు న్యూజిల్యాండ్, ఇటలీ, ఇరాన్తో పాటు చైనా నుంచి వస్తాయి. ఇదే క్రమంలో వివిధ పళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతవుతున్నాయి. ప్రతి ఫలం..ఔషధ గుణం.. ప్లమ్.. చూడడానికి పెద్ద రెగు పండు సైజులో యాపిల్ను పోలివుంటుంది. ఇందులో క్యాల్షియం, సీ, బీ విటమిన్లు, మెగీ్నíÙయంతో పాటు ఇతర పోషకాలు మొండుగా ఉంటాయి. కివీ ఫ్రూట్లో విటమిన్ సీ, కే, ఇ అధికంగా ఉంటాయి. ఇక డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సీ, ఫాస్పరస్, క్యాల్షియం, ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తితో పాటు కేన్సర్ను నియంత్రిస్తుంది. చెర్రీలో కార్బోహైడ్రేట్లు, షుగర్, విటమిన్ సీ, పోటాషియం పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సీ, క్యాల్షియం అధిక స్థాయిలో ఉంటుంది.ఆన్లైన్లోనే ఆర్డర్స్.. వివిధ దేశాల నుంచి ఇక్కడి వ్యాపారులు ఆయా సీజనల్ ఫ్రూట్స్ని ఆన్లైన్ ద్వారానే దిగుమతి చేసుకుంటారు.. అదెలా అంటే.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాట్సాప్, మెయిల్ ద్వారా పండ్ల నమునా ఫొటోలు పంపిస్తారు. దీంతో వ్యాపారులు ఆన్లైన్లో అడర్ ఇస్తారు. విదేశాల నుంచి ముంబయికి దిగుమితి అవుతాయి. అక్కడి నుంచి ఫ్రీజర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా నగరానికి వస్తాయి.మార్కెట్లో వివిధ దేశాల పండ్లు ప్రపంచ వ్యాప్తంగా లభించే దాదాపు 20 రకాల విదేశీ పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్కు కమీషన్ ఏజెంట్ల ద్వారా దిగుమతి అవుతున్నాయి. గతం కంటే ప్రస్తుతం దిగుమతులు పెరిగాయి. ట్రేడర్స్కు రెఫ్రిజిరేటర్ చాంబర్లు ఏర్పాటు చేశాము. దేశంలోని ఇతర పండ్ల మార్కెట్లతో పోలిస్తే నగర మార్కెట్లో అన్ని సౌకార్యలూ ఉన్నాయి. – ఎల్ శ్రీనివాస్, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపెరిగిన అమ్మకాలు గతంతో పోలిస్తే విదేశీ పండ్ల అమ్మకాలు పెరిగాయి. దీంతోపాటు నగరం ప్రజలకు కూడా విదేశీ పండ్లపై ఆసిక్తి పెరిగంది. కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెరగడం మరో కారణం.. దిగుమతులు కూడా విరివిగా జరుగుతుండడంతో ధరలు కూడా దేశీ పండ్ల స్థాయిలోనే ఉంటున్నాయి. యాపిల్, కివీ, పియర్స్తో పాటు మరికొన్ని విదేశీ రకాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. – క్రాంతి ప్రభాత్రెడ్డి, విదేశీ పండ్ల హోల్సేల్ వ్యాపారి -
ఎఫ్పీఐల స్పీడ్
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా అమ్మకాల బాటలో సాగిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఇటీవల ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు. దేశీ స్టాక్స్లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. వెరసి ఈ నెల తొలి వారంలో ఎఫ్పీఐలు రూ. 24,454 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అక్టోబర్లో కొత్త రికార్డుకు తెరతీస్తూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లో కొంత వెనకడుగు వేసి రూ. 21,612 కోట్ల అమ్మకాలకు పరిమితమయ్యారు. అయితే సెపె్టంబర్లో అంతక్రితం 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇకపై యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు, వడ్డీ రేట్లు, రాజకీయ భౌగోళిక అంశాల ఆధారంగా ఎఫ్పీఐల పెట్టుబడులు నమోదుకానున్నట్లు మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. -
‘అతిథులు’ ఆగయా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రానికి విదేశీ వలస పక్షుల రాక మొదలైంది. ఇప్పటికే సంగారెడ్డి సమీపంలోని అభయారణ్యంతోపాటు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల సరస్సుకు విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి. వాటిలో నార్తర్న్ షావెలర్.. నార్తర్న్ పిన్టైల్.. రెడ్ హెడ్ బంటింగ్.. బ్లాక్ హెడ్ బంటింగ్.. బ్లూత్రోట్.. రోజీ స్టార్లింగ్.. అ్రల్టామెరైన్ ఫ్లైక్యాచర్.. బ్లూథ్రోట్ బర్డ్, వెస్టర్న్ మార్‡్ష హారియర్, లిటిల్ కంఫర్ట్ బర్డ్, కామన్ పోచార్డ్ తదితర పక్షులు ఉన్నాయి. వెచ్చని వాతావరణం ఉండటంతో.. యూరప్, రష్యా, పశ్చిమాసియా దేశాల్లో మంచుచలికాలం నుంచి తప్పించుకోవడం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య తెలంగాణ ప్రాంతానికి విదేశీ పక్షులు వస్తున్నాయి. అక్కడితో పోలిస్తే వెచ్చని వాతావరణం ఉండటంతోపాటు తగినంత ఆహారం లభిస్తుండటం, సంతానోత్పత్తికి అనువైన పరిస్థితులు ఉండటంతో రాష్ట్రంలోని అభయారణ్యాలు, సరస్సులకు విచ్చేస్తున్నాయి.చిత్తడి నేలలు.. స్వచ్ఛమైన నీరు..మంజీరా వన్యప్రాణుల అభయారణ్యంలో జీవవైవిధ్యమున్న చిత్తడి నేతలు, గడ్డి భూములున్నాయి. మంజీరా డ్యాం ఎగువన.. సింగూరు ప్రాజెక్టు దిగువన ఉన్న ఈ జలాశయంలో సుమారు 20 వరకు చిన్న దీవులున్నాయి. అవి స్థానిక పక్షులతోపాటు విదేశీ పక్షులకు గమ్యస్థానంగా మారాయి. మరోవైపు పాకాల సరస్సు వద్ద లిటిల్ కోర్మోరెంట్, మైక్రో కార్బోనైజర్, ఇండియన్ కోర్మోరెంట్, ఫలక్రోకోరాక్స్, ఇండియన్ పాండ్ హెరాన్, ఏర్డియోలాగ్రై, గ్లోసీఇబీస్, ప్లెగడీస్ ఫాల్సినీలియస్ తదితర విదేశీ పక్షులు సంచరిస్తున్నాయి. ఈ సరస్సు కాలుష్యరహితం కావడంతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. దీనిచుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో పచ్చని చెట్లు విదేశీ పక్షుల విడిదికి నిలయంగా మారాయి. పాకాల అభయారణ్యంలో ఎత్తయిన చెట్లతోపాటు సరస్సులో స్వచ్ఛమైన నీరు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి విదేశీ పక్షులు వస్తున్నాయని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. వలసపక్షుల సంఖ్య తగ్గిపోతోంది.. మంజీరా అభయారణ్యంతోపాటు అమీన్పూర్ చెరువు, కిష్టారెడ్డిపేట్ చెరువు, పోచా రం అభయారణ్యానికి విదేశీ పక్షులు వచ్చా యి. ఏటా సైబీరియా, చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఈ పక్షులు వస్తుంటా యి. పట్టణీకరణ కారణంగా చెరువులు అన్యాక్రాంతం అవుతుండటంతో విదేశీ వలసపక్షుల సంఖ్య తగ్గిపోతోంది. వా తావరణంలో వస్తున్న మార్పులు కూడా ఇందుకు కొంత కారణమవుతున్నాయి. -
అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచిగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. వివరాలు చూద్దాం.న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ క్యూ2 ఫలితాలు దాదాపు ముగియనున్నాయి. దీంతో ఇకపై ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లు, పెట్టుబడులు, గణాంకాలవైపు దృష్టి సారించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బుధవారం(20న) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్కవరింగ్కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. 288మంది సభ్యుల మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు పారీ్టలు ఎన్నికలలో పోటీ పడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్ ఎఫెక్ట్ కొత్త ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. గత వారాంతాన ఒక దశలో 106.66ను తాకింది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. గురువారం(14న) రూపాయి సరికొత్త కనిష్టం 84.41 వద్ద ముగిసింది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. గత వారం చివర్లో 4.5 శాతానికి చేరాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. రియల్టీ రంగానికి వెసులుబాటు కల్పించింది. 5.3 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్టీగేజ్ రుణ వ్యయాలుసహా.. డౌన్ పేమెంట్ను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివెళుతున్నాయి. ఈ వారం జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్ నిరుద్యోగిత, తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. 10 శాతం దిద్దుబాటు.. గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 1,906 పాయింట్లు కోల్పోయి 77,580 వద్ద ముగిసింది. వెరసి రికార్డ్ గరిష్టం(86,000స్థాయి) నుంచి 8,395 పాయింట్లు(10 శాతం) పడిపోయింది. ఇక గత వారం నిఫ్టీ సైతం 616 పాయింట్లు క్షీణించి 23,533 వద్ద స్థిరపడింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టం(26,277) నుంచి 2,745 పాయింట్లు పతనమైంది.వర్ధమాన మార్కెట్లకు దెబ్బయూఎస్ బాండ్ల ఈల్డ్స్, డాలరు బలపడటంతో వర్ధమాన మార్కెట్లపై ప్రభావం పడుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. క్యూ2 ఫలితాల సీజన్ ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల తీరు ఆధారంగా కదలవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ట్రేడర్లు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్ను అనుసరించే వీలున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేశారు.అమ్మకాల బాటలోనే...దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. యూఎస్ డాలర్తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలిమి, చైనా ప్యాకేజీలు, దేశీ మార్కెట్ల గరిష్ట విలువల కారణంగా అమ్మకాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత నెల(అక్టోబర్)లో కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఈ స్థాయిలో రూ. 61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే ఈ ఏడాది సెపె్టంబర్లో 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానా
పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కొత్త వార్నింగ్ ఇచ్చింది. విదేశీ ఆస్తులు లేదా విదేశాల నుండి సంపాదించిన ఆదాయాన్ని తమ ఐటీఆర్లో బహిర్గతం చేయడంలో విఫలమైతే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్యాక్స్ పేయర్స్ను హెచ్చరిస్తూ అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించింది.పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో అసెస్మెంట్ ఇయర్ 2024-25కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నివేదించేలా చూడటమే లక్ష్యంగా ఈ "కంప్లయన్స్-కమ్-అవేర్నెస్ క్యాంపెయిన్"ను ఐటీ శాఖ చేపట్టింది. ఉల్లంఘించినవారికి బ్లాక్ మనీ నిరోధక చట్టం కింద జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.విదేశీ ఆస్తి అంటే ఏమిటి?ఐటి శాఖ అడ్వైజరీ ప్రకారం.. భారతీయ నివాసితులకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, నగదు రూప బీమా ఒప్పందాలు, ఏదైనా సంస్థ లేదా వ్యాపారంపై ఆదాయం, స్థిరాస్తి, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీలు, ట్రస్టీలుగా ఉండే ట్రస్ట్లు, సెటిలర్ ప్రయోజనాలు, మూలధన ఆస్తి వంటి వాటిని విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు. -
Foreign Students: వుయ్ ఆర్ విదేశీ
భాగ్యనగరం.. రోజూ వేలాది మంది నగరానికి వస్తుంటారు. వారందరికీ హైదరాబాద్ పట్నం.. ఓ కల్పతరువులా మారుతోంది. ఎవరు వచి్చనా అందరినీ ఆదుకుంటుంది.. ఆదరిస్తుంటుంది. ఇలా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, వేరే రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు. వారందరినీ హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది.. వ్యాపారం, పర్యాటకం కోసమే కాకుండా పై చదువుల కోసం కూడా ఇక్కడికి వస్తున్నారు. వీరందరినీ అమ్మలా ఆదరిస్తోంది భాగ్యనగరం.. వారంతా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాషపై ఎంతో మక్కువ చూపిస్తున్నారు. మన సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇక్కడి వారితో స్నేహం చేస్తూ.. కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. వేర్వేరు దేశాల నుంచి.. వేర్వేరు సంస్కృతుల నుంచి తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎల్లలు దాటి ఇక్కడికి వచ్చిన కొందరు విదేశీ విద్యార్థుల మనోగతం తెలుసుకుందాం.. దేశం కాని, దేశం.. భాష కాని భాష.. అనుకోకుండా కొందరు.. ఇష్టంతో కొందరు ఇలా ఎంతో మంది భాగ్యనగరం గడ్డపై అడుగుపెట్టారు. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త ఆహారం ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయం.. అనుమానం.. వాటన్నింటినీ భాగ్యనగరం ప్రజలు, వాతావరణం పటాపంచలు చేశాయి. కొత్త, వింత అనుకున్న సంస్కృతి, సంప్రదాయమే ఇప్పుడు వారికి ఎంతో ఇష్టంగా మారిపోయింది. ఈ సంస్కృతిలో భాగమవుతున్నారు. ఎలాంటి భయం లేకుండా మాతృభూమిపై ఉన్నట్టుగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. తెలుగుతో పాటు ఉర్దూ భాషలపై మమకారం పెంచుకుని వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మురిసిపోతున్నారు. ఎంతోమంది స్నేహితులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీల్లో విదేశీ విద్యార్థులకు డిగ్రీ, పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు వేలాది మంది ఇక్కడికి వచ్చి కాలేజీల్లో చేరుతున్నారు. నిజాం కాలేజీలోనే దాదాపు 300 మంది విద్యార్థులు ఏటా వస్తున్నారని చెబుతున్నారు. ఇక, వేరే కాలేజీలు, యూనివర్సిటీలు కలిపి 2 వేలకు పైగా విద్యార్థులు ఏటా వస్తున్నారు. నిబద్ధతతో నేర్చుకుంటారు.. ఇక్కడికి వచ్చే విదేశీ విద్యార్థులు పాఠాలను ఎంతో నిబద్ధతతో నేర్చుకుంటారు. ఏటా వందలాది మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ చదువుకుని వెళ్లిన వారు వారి బంధువులకు కూడా ఈ కాలేజీ గురించి చెప్పి ఇక్కడికి పంపిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు మంచి ఉద్యోగాలు సాధించామని ఫోన్ చేసి చెబుతుంటారు. ఇక్కడి పిల్లలతో కలిసిపోతుంటారు. విదేశీ విద్యార్థులకు కాలేజీలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మేం చూసుకుంటాం. – ప్రొ.మహ్మద్ అబ్దుల్ అలీ, విదేశీ విద్యార్థలు కో–ఆర్డినేటర్, నిజాం కాలేజీ ఫీజులు కాస్త తక్కువ.. తమ దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజులు కాస్త తక్కువగా ఉండటమే కాకుండా, చదువు కూడా క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. సుడాన్, తుర్కెమెనిస్తాన్, యెమెన్, సోమాలియా వంటి దేశాల నుంచి ఎక్కువగా వస్తుంటారని నిజాం కాలేజీ విదేశీ విద్యార్థుల కో–ఆర్డినేటర్ మహ్మద్ అబ్దుల్ అలీ తెలిపారు. స్థానిక విద్యార్థులు కూడా విదేశీ విద్యార్థులతో కలివిడిగా ఉంటూ, వారికి ఏ అవసరం ఉన్నా కూడా సాయపడుతున్నారు. భాష సమస్య ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఉంటామని, ఇంగ్లి‹Ùలో కమ్యూనికేట్ అవుతుంటామని నిజాం కాలేజీలోని పలువురు విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. తమకు ఇక్కడి వారు చాలా మంది స్నేహితులు ఉన్నారని, సెలవులు ఉన్నప్పుడు వారితో హైదరాబాద్లోని సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లి వస్తుంటామని వివరించారు.సంస్కృతి చాలా ఇష్టం..హైదరాబాద్ సంస్కృతి అంటే చాలా ఇష్టం. మట్టిగాజులు, మెహందీ మా దేశంలో ఎవరూ వేసుకోరు. కానీ నాకు వాటిపై ఎంతో ఇష్టం పెరిగింది. అందుకే ఎప్పుడూ మెహందీ పెట్టుకుంటాను. గాజులు వేసుకుంటాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి ఫ్రెండ్స్ను అప్పుడప్పుడూ అడిగి తెలుసుకుంటాను. భారత్కు ముఖ్యంగా హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది. – దుర్సుంజెమల్ ఇమ్రుజకోవా, బీఏ ఫస్ట్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్సొంతూర్లో ఉన్నట్టే.. ఇక్కడ చదువుకున్న ఓ బంధువు నిజాం కాలేజీ గురించి చెబితే ఇక్కడ చేరాను. మొదట్లో ఇక్కడి వాతావరణం, ఆహరంతో కాస్త ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు అలవాటైంది. స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్లో ఉంటాం. మా వంట మేమే చేసుకుంటాం. అప్పుడప్పుడూ ఇక్కడి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి.. హైదరాబాద్ రుచులను ఆస్వాదిస్తుంటాం. చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రదేశాలకు చాలాసార్లు వెళ్లాం. – మహ్రీ అమన్దుర్దీయువా, బీఏ థర్డ్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్చాలా సంతోషంగా ఉంది.. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఇక్కడి వారితో పాటు మా దేశం నుంచి వచి్చన ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తుంటాం. ఇక్కడి ఫుడ్, కల్చర్ చాలా నచి్చంది. – అనస్, బీఏ ఫస్ట్ ఇయర్, సూడాన్ -
ఇలా చేస్తే భారీగా విదేశీ పర్యాటకులు
న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులను భారీగా ఆకర్షించేందుకు, పర్యాటక రంగం వృద్ధికి వీలుగా బుకింగ్ డాట్ కామ్ కీలక సూచనలు చేసింది. అంతర్జాతీయంగా మరిన్ని ప్రాంతాల నుంచి డైరెక్ట్ విమాన సరీ్వసులను అందుబాటులోకి తీసుకురావడం, వీసా ప్రక్రియలను సులభతరం చేయడం, భారత్లోని విభిన్న, విస్తృతమైన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయాలని సూచించింది. వివిధ భాగస్వాముల నుంచి సమిష్టి చర్యలకు తోడు నిర్దేశిత పెట్టుబడులతో భారత పర్యాటకం కొత్త శిఖరాలకు వెళుతుందని పేర్కొంది. రానున్న ఏడాది, రెండేళ్లలో భారత్ను సందర్శించాలని అనుకుంటున్న వయోజనుల అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుని బుకింగ్ డాట్ కామ్ ఒక నివేదిక విడుదల చేసింది. 19 దేశాలకు చెందిన 2,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుంది. భారత్కు రావాలనుకుంటే, ఎదుర్కొనే సవాళ్లు, ప్రోత్సాహకాలు, ప్రాధాన్యతలు ఏంటని ప్రశ్నించి, వారి అభిప్రాయాలు రాబట్టింది. విదేశీ పర్యాటకుల్లో సగం మంది కేవలం భారత్ను చూసి వెళ్లేందుకే వస్తున్నారు. మూడింట ఒక వంతు భారత్తోపాటు, ఆసియాలో ని మరికొన్ని దేశాలకూ వెళ్లేలా ట్రావెల్ ప్లాన్తో వస్తున్నారు. యూఎస్, యూకే, జర్మనీ, యూఏఈ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. సంప్రదాయంగా చైనా, కెనడా, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు. భారత్కు వస్తున్న విదేశీ పర్యాటకులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఆ్రస్టేలియా, ఇటలీ, నెదర్లాండ్స్ తాజాగా చేరాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, జైపూర్ విదేశీ పర్యాటకులు సందర్శించే వాటిల్లో టాప్–5 ఎంపికలుగా ఉంటున్నాయి. హంపి, లేహ్కు ఆదరణ పెరుగుతోంది. పతి్నటాప్, పెహల్గామ్, మడికెరి, విజయవాడ, ఖజురహో ప్రాంతాలను సైతం సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. -
లాంగ్వేజ్ ఫర్ ఎర్న్.. విదేశీ భాష.. విజయాలు లెస్స
కొత్త భాషలు నేర్చుకోవడం కొన్నేళ్ల క్రితం వరకూ కేవలం హాబీగా భావించేవారు. అయితే, ప్రపంచీకరణతో విదేశీ భాషా నైపుణ్యం ఆదాయమార్గంగా కూడా అవతరించింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా నగరవాసుల్లోనూ విదేశీ భాషలపై ఆసక్తి పెరుగుతోంది. సంపాదన కోసమో, మరేదైనా లక్ష్యాలతోనో సీరియస్గా ఫారిన్ లాంగ్వేజెస్కు జై కొడుతున్నారు. ప్రస్తుతం ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ చైనీస్ అరబిక్ వంటి అనేక విదేశీ భాషలు బాగా డిమాండ్లో ఉన్నాయి. ఇటీవలే కొరియన్ వెబ్సిరీస్, మ్యూజిక్కూ పెరిగిన ఆదరణ కొరియన్ భాషా పరిజ్ఞానంపై యువత ఆసక్తిని పెంచింది. విదేశీ భాషని అధ్యయనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన రెస్యూమ్ను బలోపేతం చేయడంతో పాటు పర్యాటక రంగంలో, గైడ్స్గా ఇతరత్రా రంగాల్లో రాణించడానికి, ట్రావెల్, బ్లాగులను తయారు చేయడం తదితర ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రపంచం నలుమూలలకూ కమ్యూనికేట్ చేయగలిగేలా చేస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయలో ప్రవేశాలకు కూడా ఉపయుక్తం అవుతున్నాయి.. ప్రస్తుతం వర్క్ కల్చర్, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లకు మారడంతో విదేశీ భాషా నైపుణ్యాలతో ఫ్రీలాన్సర్గా అవకాశాలు పెరిగాయి. ఓటీటీ తదితర వేదికల విజృంభణతో అనువాదకులకు భారీగా డిమాండ్ పెరగడం కూడా విదేశీ భాషలను క్రేజీగా మార్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు దేశ విదేశాలలో రాయబార కార్యాలయాలు, హై–కమిషన్లలో విదేశీ భాషా ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీలైన కోర్సులకు డిమాండ్ సంతరించుకుంటున్నాయి. ఫ్రెంచ్ పట్ల ఆసక్తి.. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పైగా మాట్లాడే ఫ్రెంచ్ అత్యధికంగా మాట్లాడే భాషగా ఆరో స్థానంలో ఉంది. ఇది ఫ్రాన్స్, కెనడాతో సహా 29 దేశాల్లో అధికారిక భాష. ఫ్యాషన్, హాస్పిటాలిటీ, టూరిజంలో కెరీర్కు ఉపకరించే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి విశ్వవ్యాప్తంగా విలువైన భాష. శిక్షణా తరగతులు..ఈ నేపథ్యంలో విదేశీ భాష నేర్చుకోవడంలో సహాయపడే అనేక అకాడమీలు, సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి. ఆయా భాషల కోర్సు వ్యవధి సాధారణంగా ఆరు నుంచి 12 నెలల్లో పూర్తి చేసి ప్రొఫెషనల్ డిగ్రీని అందుకుంటారు. అయితే అనర్గళంగా మాట్లాడడం, చదవడం, రాయడం అర్థం చేసుకోవడంపై పూర్తి పట్టు సాధించేందుకు మరింత వ్య«వధి అవసరం అవుతుందని శిక్షకులు అంటున్నారు. ఇవి కాకుండా ఒక విద్యార్థి ఆ భాష చరిత్ర, భాష సంస్కృతి సంబంధిత దేశాల ప్రజలు, అర్థం చేసుకునే పద్దతి, ఆ భాష యాస, డిక్షన్ గురించి కూడా నేర్చుకుంటేనే పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత సరి్టఫికెట్ డిప్లొమా స్థాయి కోర్సు లేదా పన్నెండో తరగతి పూర్తి చేసిన తర్వాత విదేశీ భాషలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించవచ్చు. నగరంలో ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు వంటివి విదేశీ భాషల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అలాగే పలు ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్ఫారమ్లలో విదేశీ భాషా కోర్సులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. స్పాని‹Ù.. జోష్.. దాదాపు 50 కోట్ల మందికి పైగా మాట్లాడే వారితో స్పానిష్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషలలో రెండో స్థానంలో ఉంది. స్పానిష్ మాట్లాడే దేశాలతో మన దేశానికి ఇటీవల పెరుగుతున్న వాణిజ్యం దృష్ట్యా నేర్చుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యాపారం, ఆతిథ్యం పర్యాటక రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఇది బెస్ట్. విన్.. జపాన్.. సాంకేతిక హబ్ హోదా, భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన జపాన్ జపనీస్ అత్యధికులు కోరుకునే భాషగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా మాట్లాడే ఈ భాష సాంకేతికత, యానిమేషన్, గేమింగ్లో కెరీర్ను ఎంచుకున్న సిటీ యూత్ ఎంపికగా మారింది.జర్మన్కు జై.. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా, యూరోపియన్ యూనియన్లో అత్యధికంగా మాట్లాడే భాష జర్మన్. జర్మన్ నేర్చుకోవడం ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో విభిన్న అవకాశాలకు తలుపులు తెరుస్తోంది.ఇదీ..ఇటాలియన్.. యూరోపియన్ యూనియన్లో అత్యధికంగా మాట్లాడే నాల్గో భాష ఇది. పర్యాటక కేంద్రంగా మరియు ఫ్యాషన్ మరియు డిజైన్కు కేంద్రంగా ఇటలీకి ఉన్న ప్రాచుర్యంతో ఫ్యాషన్, డిజైన్, హాస్పిటాలిటీలో కెరీర్ను లక్ష్యంగా చేసుకున్న సిటీ విద్యార్థులకు రైట్ ఛాయిస్గా నిలుస్తోంది. మాండరిన్.. మంచిదే.. మనదేశపు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనాను దృష్టిలో ఉంచుకుంటే.. అంతర్జాతీయ వ్యాపారం, దౌత్యం పర్యాటక రంగం కోసం మాండరిన్ నేర్చుకోవడం అవసరంగా మారింది. కో అంటే కొరియన్.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మందికి పైగా మాట్లాడే కొరియన్కు నగరంలో బాగా డిమాండ్ ఉంది. ఆసియాలో మనదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కొరియా కావడం సాంకేతిక, వినోద పర్యాటక రంగాల్లో ఈ భాషా నైపుణ్యానికి డిమాండ్ పెంచుతోంది.గ్రేస్.. పోర్చుగీస్.. బ్రెజిల్ పోర్చుగల్తో సహా ఎనిమిది దేశాల్లో మాట్లాడేది పోర్చుగీస్. ఈ దేశాలతో మనకు విస్తరిస్తున్న సంబంధాల కారణంగా పోర్చుగీస్ భాషలో ప్రావీణ్యం అనేది భవిష్యత్తు విజయాలకు బాట వేస్తుంది.పలు భాషల్లో ప్రావీణ్యం కోసం.. విదేశీ భాషా పరిజ్ఞానం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో ప్రయోజనాలను యువత ఆశిస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు చేరింది. కెనడాలో ఉండే భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా మాకు స్టూడెంట్స్గా ఉన్నారు. నేర్చుకోవడం అనేది ఇలా సులభంగా మారడం కూడా విదేశీ భాషల పట్ల ఆసక్తిని పెంచుతోంది. – ఎం.వినయ్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్రెంచ్ భాషా విభాగం, ఉస్మానియా వర్సిటీ -
రండి.. తిని తరించండి
ప్రజల్లో విభిన్న ఆహారపు అలవాట్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచ పర్యాటకం కొత్త రుచులను అన్వేషిస్తోంది. ఫలితంగా భారతదేశంలో పాకశాస్త్ర సంస్కృతిని ఆస్వాదించే పర్యాటకం (గ్యాస్ట్రోనమీ టూరిజం) ఊపందుకుంటోంది. విదేశీ పర్యాటకులు భారత పాకశాస్త్ర సంస్కృతి, కొత్త వంటకాల తయారీపై మక్కువతో మన దేశానికి క్యూ కడుతున్నారు. 2023లో విదేశీ పర్యాటకుల రాకపోకలు 15.6 శాతం పెరిగాయి. ఈ పర్యాటకులలో అత్యధికులు తమ ప్రయాణంలో భాగంగా పాకశాస్త్ర అనుభవాలను కోరుకుంటారు. దేశంలోని సుసంపన్నమైన అహారం, వంటల సంప్రదాయాలు, విభిన్న ప్రాంతీయ వంటకాలు, ప్రామాణికమైన ఆహార అనుభవాలపై విదేశీ పర్యాటకులు ఆసక్తి పెంచుకుంటున్నారు. – సాక్షి, అమరావతిపాకశాస్త్ర పర్యాటకంలో టర్కీదే అగ్రస్థానంప్రపంచవ్యాప్తంగా గ్యాస్ట్రోనమీ పర్యాటకులను ఆకట్టుకోవడం, సరికొత్త అనుభూతులను అందించడంలో టర్కీ ముందంజలో ఉంది. గతేడాది రూ.1.52 లక్షల కోట్లుగా నమోదైన అక్కడి పాకశాస్త పర్యాటక మార్కెట్ నుంచి 2025 నాటికి రూ.2.10 లక్షల కోట్లకు విస్తరిస్తుందని అక్కడి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ దేశవ్యాప్తంగా 2,200 కంటే ఎక్కువ స్థానిక ఆహార, పానీయాల వెరైటీలున్నాయి. ముఖ్యంగా గాజియాంటెప్, అదావా, హటే, ఇజ్మీర్ వంటి నగరాల్లో గ్యాస్ట్రోనమీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే 41 రకాల విభిన్న ఆహార పదార్థాల తయారీ విధానంపై ప్రత్యేక కోర్సుల, శిక్షణను అందిస్తోంది. ఒక్క ఇస్తాంబుల్లోనే 16 శిక్షణ కేంద్రాలున్నాయి.స్థానిక ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించడానికి టర్కీ ఏకంగా 34 గ్యాస్ట్రోనమీ మ్యూజియాలను ఏర్పాటు చేయడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా 360 కంటే ఎక్కువ గ్యాస్ట్రోనమీ పండుగలను చేపడుతూ దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందుకే గాజియాంటెప్ను ‘సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’గా యునెస్కో గుర్తించింది. మసాలా వంటకాల నుంచి మొఘలాయ్ వరకు.. దక్షిణాదిలోని మసాలా కూరల నుంచి ఉత్తరాదిలోని మొఘలాయ్ వంటకాల వరకు భారతీయ హోటళ్లు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. దీనికితోడు వీధుల్లో అమ్మే ఆహారాలు (స్ట్రీట్ ఫుడ్) సైతం అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాలు గ్యాస్ట్రోనమీకి అడ్డాలుగా మారాయి. ఈశాన్య భారతదేశం అత్యంత స్థిరంగా అభివృద్ధి చెందుతున్న పాకశాస్త్ర గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది. ఆ తర్వాత చెట్టినాడ్ విభిన్న ఆహార రుచులను అందిస్తోంది. ఇక గోవా కేవలం స్థానిక వంటకాలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ వంటకాలను కూడా ప్రవేశపెడుతోంది. వీధి వంటకాల్లో లక్నోలో లభించే నెహారీ కుల్చా, షీర్మల్, మలై మఖాన్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అమృత్సర్లో లభించే చోలే–కుల్చే, జిలేబీ, గులాబ్ జామూన్, పొడవాటి గ్లాసుల్లో ఇచ్చే లస్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఆహారోత్సవాలతో ఆకర్షణవివిధ నగరాల్లో అనేక సంస్థల భాగస్వామ్యంతో ఆహారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో నార్త్–ఈస్ట్ స్లో ఫుడ్ అండ్ ఆగ్రో బయోడైవర్సిటీ సొసైటీ (నెస్పాస్) ఏటా నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మేఘాలయ రాష్ట్రంలోని మావ్లాంగ్లో నిర్వహించే ‘సేక్రేడ్ గ్రోవ్’ (మతపరమైన తోట చెట్ల పండుగ) ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నోరూరించే రుచికరమైన ఆహార పదార్థాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈశాన్య భారతదేశంలోని స్థానికులు తయారుచేసి వడ్డించే వివిధ అటవీ, స్థానిక ఆహార వంటకాలను సంరక్షించేందుకు, ఆయా వంటకాలపై ప్రచారానికి ఈ ఉత్సవాలు దోహదం చేస్తున్నాయి. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తూ గ్యాస్ట్రోనమీ టూరిజానికి ఊతమిస్తున్నాయి. -
వందేభారత్ రైళ్ల కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు విదేశాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. చిలీ, కెనడా, మలేషియా తదితర దేశాలు ‘వందే భారత్’ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రైలు నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.ఇతర దేశాలలో ఆధునిక సౌకర్యాలు కలిగిన రైళ్ల నిర్మాణానికి రూ. 160-180 కోట్ల మధ్య ఖర్చు అవుతుంది. భారతదేశంలో నిర్మితమయ్యే వందే భారత్ రైలు వ్యయం రూ.120 నుండి రూ. 130 కోట్ల మధ్య ఉంటుంది. వందే భారత్ గంటకు 0 నుండి 100 కి.మీ. వేగాన్ని చేరుకోవడానికి కేవలం 52 సెకన్లు పడుతుంది. ఇది జపాన్ బుల్లెట్ రైలు కంటే అధికం. జపాన్ బుల్లెట్ రైలు గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి 54 సెకన్లు పడుతుంది. వందేభారత్ను మరింత మెరుగ్గా రూపొందించారని విదేశీ ప్రతినిధులు చెబుతున్నారు.కాగా భారతీయ రైల్వేల అభివృద్ధి గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ గడచిన 10 ఏళ్లలో 31,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్లను జోడించామని తెలిపారు. దీన్ని 40,000 కిలోమీటర్ల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 10,000 లోకోలు, 9,600 కిలోమీటర్ల ట్రాక్కు టెండర్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇది కూడా చదవండి: ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్ -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ ఈ వారం కూడా కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ స్థూల ఆరి్థక గణాంకాలు సానుకూలంగా ఉండటం, అమెరికా ఆరి్థక మందగమనంపై ఆందోళనలు తగ్గడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటం తదితర అంశాలు సూచీలను లాభాల దిశగా నడిపిస్తాయని చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చనేది నిపుణుల అభిప్రాయం.‘‘ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుతో ఇన్వెస్టర్లు ‘పతనమైన ప్రతిసారి కొనుగోలు’ వూహాన్ని అమ లు చేస్తున్నారు. వినియోగ, ఆటో, ఫై నాన్స్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మ ద్దతు లభించవచ్చు. డాలర్ విలువ బ లహీనపడటంతో ఎగుమతి ఆధారిత రంగాల ఫార్మా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 26,000 స్థాయిని అందుకోవచ్చు. దిగువున 25,500 – 25, 450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అ ని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. అమెరికా నాలుగేళ్ల తర్వాత వడ్డీరేట్లను అంచనాలకు మించి 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రికార్డుల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. గతవారం మొత్తంగా సెన్సెక్స్ 1653 పాయింట్లు, నిఫ్టీ 434 పాయింట్లు లాభపడ్డాయి. గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ఈ గురువారం (సెపె్టంబర్ 22న) నిఫ్టీ సెపె్టంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికంగా నిఫ్టీకి 26,000 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని నిలుపుకోగలిగితే 26,100 – 26,350 శ్రేణిని పరీక్షిస్తుందని ఆప్షన్ డేటా సూచిస్తోంది.రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెపె్టంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ. 342 కోట్లు సమీకరించనుంది. ఎస్ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (సెపె్టంబర్ 24న) స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ పెట్టుబడులుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెపె్టంబర్లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘నాలుగేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ.., రేట్ల త గ్గింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంకేతాలిచి్చంది. వచ్చే ఏడా ది (2025) చివరికి ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.4 శాతా నికి పరిమితం చేసేందుకు ప్రయతి్నస్తోంది. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడంతో భారత్లో పెట్టుబడులు మరింత పెరగొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయంగా హెచ్ఎస్బీసీ కాంపోజిట్ సెపె్టంబర్ తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడనున్నాయి. అమెరికా ఆగస్టు నెల తయారీ, కన్జూమర్ కాన్ఫిడెన్స్ డేటా మంగళవారం విడుదల కానుంది. బ్యాంకు ఆఫ్ జపాన్ ద్రవ్య కమిటీ సమావేశ వివరాలు(మినిట్స్), అమెరికా క్యూ2 జీడీపీ వృద్ధి డేటా గురువారం వెల్లడి కానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 20తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్ను ప్రభావితం చేయగలవు. -
విస్తరిస్తున్న విదేశీ టూరిజం
విదేశీ పర్యటనలపై భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. గోవా, కేరళ వంటి పర్యాటక ప్రదేశాల్లో ఖర్చు పెరుగుతుండటంతో విదేశీ ప్రయాణాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ‘కొన్నిసార్లు మేం దేశీయ పర్యటన కోసం రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాం. కాబట్టి మరో రూ.10 వేలకుపైగా ఖర్చు చేసి విదేశాలకు ఎందుకు వెళ్లకూడదు. ఇక్కడ ఖర్చులతో పోలిస్తే విదేశాల్లో తక్కువే’ అని విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి హేమ అభిప్రాయపడ్డారు. ఆదాయ వనరుల్లో వృద్ధి, విమాన ప్రయాణాల కనెక్టివిటీ పెరగడంతో మధ్య తరగతి ప్రజలు విదేశీ పర్యటనలకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం దేశ జనాభాలోని 31శాతం మంది మధ్య తరగతి ప్రజలున్నారు. ఈ సంఖ్య 2040 నాటికి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో 100 కోట్ల కంటే ఎక్కువ మంది మధ్య తరగతి ప్రజలు ఉంటారని అంచనా. ఈ క్రమంలోనే 2027 నాటికి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్లను అధిగమించి ప్రపంచంలోని ఐదో అతిపెద్ద విదేశీ (అవుట్బౌండ్) టూరిజం మార్కెట్గా భారతదేశం అవతరిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పటికి భారత పర్యాటకుల మార్కెట్ విలువ రూ.7.47 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2019లో రూ.3 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు మరో మూడేళ్లలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద దేశీయ పర్యాటక మార్కెట్గా మారుతుందని భావిస్తున్నారు. – సాక్షి, అమరావతిమధ్యప్రాచ్య దేశాల్లో మనోళ్ల సందడిభారతీయుల్ని మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల పర్యాటక రంగం విశేషంగా ఆకర్షిస్తోంది. భారతీయ పర్యాటకుల్లో దాదాపు సగం విదేశీ పర్యటనలు ఇక్కడే చేస్తున్నారు. ఆ తర్వాత ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్లో కొనసాగుతున్నాయి. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఒమన్, దుబాయ్ హాలిడే మేకర్లలో అతిపెద్ద వనరుగా భారత్ మారింది. గోవా, కేరళ వంటి భారతీయ రిసార్ట్ గమ్యస్థానాల ధరలతో సమానంగానే వియత్నాం, శ్రీలంక, థాయ్లాండ్, సింగపూర్ వంటి సమీప దేశాల్లో ధరలు కూడా ఉంటున్నాయని టూరిజం ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలో తిరిగే ఖర్చుకు మరికొంత వెచ్చించగలిగితే విదేశాలకు వెళ్లవచ్చనే అభిప్రాయం భారతీయ పర్యాటకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జపాన్ సైతం భారతీయ పర్యాటకుల కోసం కొత్తగా ఈ–వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో దుబాయ్ సైతం భారతీయ సందర్శకులను అకట్టుకునేందుకు బహుళ ప్రవేశ పర్యాటక వీసాను రూపొందించింది. దక్షిణాఫ్రికా సరళీకృత వీసాను తీసుకొస్తోంది. మలేíÙయా, కెన్యా, థాయ్లాండ్, ఇరాన్ సహా ఇతర దేశాలు భారతీయ పర్యాటకుల కోసం వీసా అవసరం లేని పర్యటనలు అందిస్తున్నాయి.231 శాతం పెరుగుదలఅమెరికన్లు 63 రోజులు, బ్రిటిషర్లు 90 రోజులతో పోలిస్తే భారతీయులు కేవలం 30 రోజుల ముందుగానే పర్యటనలు ప్లాన్ చేస్తున్నారు. భారతీయులకు సమీప దేశాల ప్రయాణాలకు బడ్జెట్ ఎయిర్లైన్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది ఎక్కువ మంది వియత్నాం ప్రయాణించినట్టు గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. అక్కడ 2019తో పోలిస్తే భారతీయ సందర్శకుల సంఖ్య 231 శాతం పెరిగింది. ఇతర ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్లాండ్, సింగపూర్, ఇండోనేíÙయా రాకపోకల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.విదేశాలకు పెరుగుతున్న విమానాలు ఆ్రస్టేలియా, చైనా, జపాన్ వంటి ప్రధాన పోటీదారులను అధిగమించి భారతదేశం ప్రయాణ రంగంలో వేగంగా ముందంజ వేస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ వృద్ధిలో చెప్పుకోదగ్గ పురోగతితో దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. దేశీయ విమాన ట్రాఫిక్లో ఏటా 7.7 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ వృద్ధి రేటు చైనాలో 7.1 శాతం, జపాన్ 4 శాతం, ఆ్రస్టేలియాలో 2.6 శాతం ఉండగా.. భారత్ ఈ దేశాలను అధిగమించడం విశేషం. ఈ వృద్ధితో విమానయాన రంగంలో బ్రెజిల్, ఇండోనేíÙయాను భారత్ వెనక్కి నెట్టింది. ఏటా విమాన సీట్ల సంఖ్యలో 6.9 శాతం వార్షిక వృద్ధి రేటు కనిపిస్తోంది. యూఎన్ టూరిజం ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది త్రైమాసికంలో అంతర్జాతీయ ప్రయాణాలు ప్రీ–పాండమిక్ స్థాయిలో 97 శాతానికి చేరింది. భారతీయ విదేశీ టూరిజంలో ఉన్నంత వృద్ధి వేగం మరెక్కడా లేదు. వాస్తవానికి గత పదేళ్లలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. తాజాగా మరో 1,200కి పైగా విమానాల కోసం ఆయా సంస్థలు ఆర్డర్లు పెట్టడం విమాన ప్రయాణాల డిమాండ్ను సూచిస్తోంది.టమాటా పండుగకూ వెళ్లొస్తున్నారు టీవీలు, సినిమాల్లో చూపించే విదేశీ నగరాలను చూసేందుకు భారతీయుల్లో ఎక్కువమంది ప్రభావితం అవుతున్నారు. ఉదాహరణకు 2011 తర్వాత స్పెయిన్ను సందర్శించే భారతీయులు 40 శాతం పెరిగారు. అక్కడ జరిగే ‘లా టొమాటినా పండుగ’ ( టమాటాలు విసురుకోవడం) ‘జిందగీ నా మిలేగీ దొబారా’ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం కావడంతో ఆ పండుగను చూసేందుకు భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
చైనా గట్టి నిర్ణయం.. విదేశాలకు ఆహ్వానం!
చైనా తమ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా గట్టి నిర్ణయం తీసుకుంది. ఉత్పాదక రంగాన్ని విదేశీ పెట్టుబడులకు పూర్తిగా తెరుస్తోంది. దీంతోపాటు ఆరోగ్య రంగంలోనూ మరింత విదేశీ మూలధనానికి అనుమతించనుంది.చైనాకు చెందిన నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తాజా ప్రకటన ప్రకారం.. తయారీ రంగంలో ఇతర దేశాల పెట్టుబడులపై మిగిలి ఉన్న పరిమితులన్నింటినీ నవంబర్ 1 నుండి చైనా తొలగించనుంది. ముద్రణ కర్మాగారాలపై చైనీస్ మెజారిటీ నియంత్రణ, చైనీస్ మూలికా మందుల ఉత్పత్తిలో పెట్టుబడిపై నిషేధం వంటివి ఇందులో ఉన్నాయి.సేవా రంగాన్ని సైతం మరింత విస్తరిస్తామని, విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం కట్టుబడి ఉందని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించిన విధాన రూపకల్పనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.ఆరోగ్య రంగంలోనూ..మరోవైపు చైనా తమ ఆరోగ్య సంరక్షణ రంగంలో మరన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ పలు విధానాలను ప్రకటించింది. మూలకణాలు, జన్యు నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, అనువర్తనాల్లో అప్లికేషన్లో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటన తెలిపింది. వీటిని తొలుత బీజింగ్, షాంఘై, గ్వాంగ్డాంగ్, హైనాన్ వంటి పైలట్ ఫ్రీ ట్రేడ్ జోన్లలో అనుమతించనున్నారు.దీంతోపాటు బీజింగ్, టియాంజిన్, షాంఘై, నాన్జింగ్, సుజౌ, ఫుజౌ, గ్వాంగ్జౌ, షెన్జెన్, హైనాన్ ద్వీపంలో పూర్తిగా విదేశీ యాజమాన్యంలోని ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు కూడా చైనా ప్రభుత్వం అనుమతించింది. అయితే సాంప్రదాయ చైనీస్ వైద్యాన్ని అందించే స్థానిక ఆసుపత్రులను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతి లేదు. కొత్త విధానం వెంటనే అమల్లోకి వస్తుందని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది. -
విశాఖబీచ్ : అలలతో విదేశీ సర్ఫర్లు సయ్యాట (ఫొటోలు)
-
విదేశాల్లో మేడిన్ ఇండియా టూవీలర్ల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారైన ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో 12.48 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. దేశీయంగా అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో తయారీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే విషయం. అలాగే టూవీలర్ల తయారీ విషయంలో భారత్ అనుసరిస్తున్న నాణ్యత, భద్రత ప్రమాణాలకు ఈ గణాంకాలు నిదర్శనం. 2024 జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో మోటార్సైకిళ్లు 13 శాతం వృద్ధితో 10,40,226 యూనిట్లు వివిధ దేశాలకు సరఫరా అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా ఏకంగా 83 శాతానికి ఎగసింది. స్కూటర్ల ఎగుమతులు 21 శాతం అధికమై 2,06,006 యూనిట్లుగా ఉంది. టూవీలర్స్ ఎగుమతుల్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, ఇండియా యమహా మోటార్, హీరో మోటోకార్ప్, సుజుకీ మోటార్సైకిల్ ఇండియా టాప్లో కొనసాగుతున్నాయి. అగ్రస్థానంలో బజాజ్.. ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 5 శాతం వృద్ధితో ఏప్రిల్–జూలైలో 4,97,114 యూనిట్లు నమోదు చేసింది. ఇందులో 4,97,112 యూనిట్లు మోటార్సైకిళ్లు ఉండడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో 14 శాతం వృద్ధితో 3,13,453 యూనిట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ 76 శాతం దూసుకెళ్లి 1,82,542 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 28 శాతం అధికమై 79,082 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 33 శాతం ఎగసి 73,731 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. సుజుకీ మోటార్సైకిల్ ఇండియా 30 శాతం క్షీణించి 64,103 యూనిట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ 2 శాతం వృద్ధితో 28,278 యూనిట్లు, పియాజియో వెహికిల్స్ 56 శాతం దూసుకెళ్లి 9,673 యూనిట్ల ఎగుమతులను సాధించాయి. బైక్స్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా, స్కూటర్స్లో హోండా, టీవీఎస్ మోటార్, ఇండియా యమహా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. -
ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలం
న్యూఢిల్లీ: దేశీ పర్యాటక రంగం జోరు మీద ఉండడంతోపాటు, విదేశీ ప్రయాణాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ఈ రంగంలో పనిచేసే ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ ఆపరేటర్ల ఆదాయం 15–17 శాతం వరకు వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. మౌలిక వసతులు మెరుగుపడుతుండడం, ఖర్చు చేసే ఆదాయం పెరుగుదల, ప్రయాణాలకు మొగ్గు చూపించే ధోరణికి తోడు.. దేశీ పర్యాటక రంగంపై పెరిగిన ప్రభుత్వ ప్రాధాన్యం ఈ రంగం వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ఈ రంగంలో 60 శాతం వాటా కలిగిన నలుగురు ప్రధాన ఆపరేటర్లను విశ్లేíÙంచిన అనంతరం క్రిసిల్ రేటింగ్స్ ఈ గణాంకాలను విడుదల చేసింది. ‘‘ట్రావెల్ ఆపరేటర్ల రుణ పరపతి సైతం ఆరోగ్యకర స్థాయిలో ఉంది. బలమైన బ్యాలన్స్ షీట్లకుతోడు గత ఆర్థిక సంవత్సరంలో మాదిరే 6.5–7 శాతం మేర స్థిరమైన మార్జిన్లు.. మెరుగైన నగదు ప్రవాహాలకు మద్దతునిస్తాయి. దీంతో ట్రావెల్ ఆపరేటర్లు రుణంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం రాదు’’అని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. మెరుగైన వసతుల కారణంగా కొత్త పర్యాటక ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు, ఆధ్యాతి్మక పర్యాటకానికి డిమాండ్ పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు తెలిపింది. ముఖ్యంగా కార్పొరేట్సమావేశాలు, సదస్సుల నుంచి డిమాండ్ పెరిగినట్టు పేర్కొంది. ఎన్నో అనుకూలతలు.. అధికంగా ఖర్చు చేసే ఆదాయం, 37 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే సదుపాయం, అడుగు పెట్టిన వెంటనే వీసా కారణంగా విదేశీ విహార యాత్రలు సైతం పెరుగుతున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇక ఆకర్షణీయమైన ట్రావెల్ ప్యాకేజీలు, దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలకు ఎయిర్లైన్స్ సంస్థలు సరీ్వసులు నడిపిస్తుండడం కూడా డిమాండ్ను పెంచుతున్నట్టు వివరించింది. ‘‘కరోనా తర్వాత అప్పటి వరకు ఎటూ వెళ్లలేకపోయిన వారు పెద్ద ఎత్తున ప్రయాణాలకు మొగ్గు చూపించగా, ఆ ధోరణి తగ్గిపోయి.. సాధారణ పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు, పట్టణీకరణ, అందుబాటు ధరల్లో టూర్ ప్యాకేజీలు, ఆదాయంలో స్థిరమైన వృద్ధి, ఈ రంగంపై పెరిగిన ప్రభుత్వం దృష్టి ఇవన్నీ టూర్, ట్రావెల్ రంగాన్ని స్థిరంగా నడిపిస్తాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. -
చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ
అస్తానా: కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలుసుకున్నారు. వీరు కరచాలనం చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. భారత్-చైనా మధ్య గత కొన్నేళ్లుగా సత్సంబంధాలు లేవు. ఈ నేపధ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా వాంగ్ యీని కలవడానికి ముందు జైశంకర్ ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ను కూడా కలుసుకున్నారు.ఎస్సీఓ సమ్మిట్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు వచ్చిన జైశంకర్ తజికిస్తాన్ విదేశాంగ మంత్రి సిరాజుద్దీన్ ముహ్రిద్దీన్ను కూడా కలుసుకున్నారు. జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ లో తన పర్యటన వివరాలు వెల్లడించారు. ‘ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ను కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ప్రపంచ స్థితిపై అతని అంతర్దృష్టిని మెచ్చుకోవాల్సిందే. ప్రపంచ సమస్యలు, వాటి విస్తృత ప్రభావాల గురించి సమావేశంలో చర్చించాం. అలాగే సెప్టెంబరులో జరిగే శిఖరాగ్ర సమావేశ సన్నాహాలు, భారత్-యుఎన్ భాగస్వామ్య భవిష్యత్ అవకాశాల గురించి కూడా చర్చించామని జైశంకర్ తెలిపారు.గుటెర్రెస్ను కలవడానికి ముందు జైశంకర్ తజికిస్తాన్, బెలారస్, రష్యా ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు. కాగా ఎస్సీఓలో భారతదేశం, ఇరాన్, కజకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలు. ప్రస్తుత సమావేశాలను కజకిస్తాన్ నిర్వహిస్తోంది. #WATCH | External Affairs Minister Dr S Jaishankar meets his Chinese counterpart Wang Yi, in Astana. pic.twitter.com/xkTjNfpZjT— ANI (@ANI) July 4, 2024 -
తెలుగు విద్యార్థుల డెస్టినేషన్గా యూఎస్
సాక్షి హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ డెస్టినేషన్గా అమెరికాను ఎంపిక చేసుకుంటున్నారు. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యూఎస్ చదువుల కోసం బ్యాగ్లు సర్దిపెట్టుకుంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ఆధారంగా 2016తో పోల్చితే 2024 నాటికి అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగింతలు పెరిగిందని స్పష్టమవుతోంది. ప్రధానంగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, డల్లాస్, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, వర్జీనియా, అట్లాంటా, ఫ్లోరిడా, జార్జియా, నాష్విల్లే తదితర సిటీల్లో తెలుగు వారి ప్రాబల్యం వేగంగా పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంతలా ఉందంటే యూఎస్లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలు 350 ఉండగా అందులో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.ఐటీ, ఫైనాన్స్ రంగాలపై ఆసక్తి.. అమెరికా వెళుతున్న వారిలో దాదాపు 75 శాతం పైగా ఇక్కడ ఇక్కడే స్థిరపడుతున్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగు వారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. అయితే 80 శాతం కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫైనాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది. 3.2 లక్షల నుంచి 12.3 లక్షల వరకు.. యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 2016 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3.2 లక్షల మంది ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 12.3 లక్షలకు చేరింది. గతంలో వెళ్లి స్థిరపడిన నాలుగు తరాలకు చెందిన తెలుగు వారు, ఇటీవల కొత్తగా వెళ్లిన వారు సైతం అంతా అమెరికాను తమ సొంత ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా కాలిఫోరి్నయాలో 2 లక్షల మంది ఉండగా, టెక్సాస్ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్ 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేల మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.హిందీ, గుజరాతీ, తరువాతి స్థానంలో తెలుగు.. అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో అత్యధికంగా హిందీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, మూడో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. అమెరికాలో సుమారు 350 విదేశీ భాషలు వాడుకలో ఉండగా అందులో తెలుగు భాష 11 స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్యా ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికా వస్తున్నారని ఉత్తర అమెరికా తెలుగు భాషా సంఘం మాజీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది హెచ్1బి వీసా హోల్డర్లు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది తెలుగు సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్లాండ్లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్కోర్వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
చెల్లితో వితికా షెరు విదేశీ ట్రిప్.. ఇద్దరూ కలిశారంటే రచ్చే! (ఫొటోలు)
-
మాదాపూర్ కేరీర్ ఫేయిర్లో విదేశీ వర్సిటీ ప్రతినిధులతో ఉత్సాహంగా విద్యార్థులు (ఫొటోలు)
-
మన బంగారం విదేశాల్లో ఎందుకు? ఆసక్తికర కారణాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూకే నుంచి సుమారు 100 టన్నుల బంగారాన్ని భారత్కు తీసుకొచ్చింది. 1991లో భారత్ విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. రాబోయే నెలల్లో మరింత బంగారాన్ని బదిలీ చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ పరిణామాల అనంతరం టన్నుల కొద్దీ మన బంగారాన్ని విదేశాలలో ఎందుకు ఉంచారు అన్న సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానమే ఈ కథనం..వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి హామీగా, విలువ నిల్వగా బంగారం నిల్వలను కలిగి ఉంటాయి. చరిత్రాత్మకంగా, గోల్డ్ స్టాండర్డ్ యుగంలో ఈ నిల్వలను డిపాజిటర్లు, నోట్ హోల్డర్లకు వాగ్దానాలను చెల్లించడానికి ఉపయోగించేవారు. నేడు, ఇవే బంగారం నిల్వలు ఆయా దేశాల కరెన్సీల విలువకు మద్దతు ఇస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తున్నాయి.బంగారం నిల్వలు ఎందుకు?కేంద్ర బ్యాంకులు అనేక కారణాల వల్ల బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. బంగారాన్ని కలిగి ఉండటం దేశ విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి సహాయపడుతుంది. ఏదైనా ఒక కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.మన దగ్గరున్న బంగారం ఎంతంటే..2024 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం, భారత్ దేశీయంగా 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తన కరెన్సీకి మద్దతుగా కలిగి ఉంది. అదనంగా 100.28 టన్నుల బంగారం స్థానికంగా బ్యాంకింగ్ విభాగం ఆస్తిగా ఉంది. మొత్తంగా 413.79 మెట్రిక్ టన్నుల బంగారం విదేశాల్లో ఉంది. స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబై, నాగపూర్ లోని హై సెక్యూరిటీ వాల్ట్ లలో భద్రపరుస్తారు.827.69 మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్ లో భారత్ ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇది దాని విదేశీ మారక నిల్వలలో 8.9 శాతం. ఇక 8,133.5 మెట్రిక్ టన్నులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల బంగారం నిల్వల్లో ఇది 71.3 శాతం. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ గణనీయమైన బంగారు నిల్వలు ఉన్న ఇతర దేశాలలో ఉన్నాయి.విదేశాలలో నిల్వ చేయడమెందుకు?అనేక ఇతర దేశాల మాదిరిగానే, భారత్ కూడా అనేక కారణాల వల్ల తన బంగారు నిల్వలలో కొంత భాగాన్ని విదేశీ వాల్ట్లలో నిల్వ చేస్తోంది. బంగారాన్ని ఇతర దేశాలలో నిల్వ చేయడం వల్ల భౌగోళిక రాజకీయ అస్థిరత లేదా ప్రాంతీయ సంఘర్షణలు నుంచి భద్రత లభిస్తుంది.లండన్, న్యూయార్క్, జ్యూరిచ్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు, మార్పిడిలు లేదా రుణాలకు పూచీకత్తుగా సులభంగా పొందవచ్చు.బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికి చారిత్రక, భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. నమ్మకమైన సంరక్షకులుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలకు ఉన్న ఖ్యాతి, వాటితో ఉన్న చారిత్రక సంబంధాలు విదేశాల్లో బంగారాన్ని నిల్వ చేయాలనే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వాల్ట్ లలో అధునాతన భద్రతా చర్యలు ఉంటాయి. నిల్వల భద్రతను నిర్ధారిస్తాయి.ప్రధాన అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్ ఇవే..బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బంగారు నిల్వల ప్రధాన కస్టోడియన్గా ఉంది. సమగ్ర నిఘా వ్యవస్థలు, కఠినమైన యాక్సెస్ ప్రోటోకాల్స్తో సహా విస్తృతమైన భద్రతా చర్యలను అందిస్తుంది. యూకేతో భారత్కు ఉన్న చారిత్రక సంబంధాలు, బ్యాంక్ ఖ్యాతి.. ఇక్కడ బంగారాన్ని నిల్వ చేయడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.స్విట్జర్లాండ్ లోని బేసెల్ లో ఉన్న బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సహకారానికి దోహదపడుతుంది. ఇది కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలకు ప్రత్యేకంగా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. బంగారం నిల్వల భద్రత, ప్రాప్యతను పెంచుతుంది.అమెరికాలోని ఫోర్ట్ నాక్స్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, జర్మనీలోని డ్యుయిష్ బుండెస్ బ్యాంక్, ఫ్రాన్స్లోని బాంక్యూ డి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ నేషనల్ బ్యాంక్ మరియు జ్యూరిచ్ వాల్ట్స్ ఇతర అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్లలో ఉన్నాయి. -
చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
విశాఖ సిటీ: విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించారు.దీంతో బాధితులను తీసుకువచ్చేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టు విశాఖ పోలీసులు మూడు రోజుల కిందట బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గాజువాక ప్రాంతానికి చెందిన ముగ్గురు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణావిదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. సైబర్ నేరాలు చేయాలంటూ బలవంతంచైనా ముఠా నిరుద్యోగులకు టైపింగ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను పరీక్షించింది. తర్వాత టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చింది. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ఏడాది పాటు పనిచేసేలా అగ్రిమెంట్ రాయించుకుంది. మధ్యలో వెళ్లిపోతే 400 డాలర్లు చెల్లించాలని ఒప్పందం చేయించుకుని పాస్పోర్టులు స్వాధీనం చేసుకుంది. ఒప్పందం అనంతరం వారిని కంబోడియాలోనే ఒక చీకటి గదిలో బంధించారు. ఫెడెక్స్, టాస్క్గేమ్స్, ట్రేడింగ్తో పాటు ఇతర సైబర్ నేరాలు చేయాలని బలవంతం చేశారు.అలా చేయని వారికి ఆహారం పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేశారు. ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమీషన్గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకొనేది. వీరు అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్లో పలు రకాల ఎంటర్టైన్మెంట్లు పబ్, క్యాసినో గేమ్స్, మద్యపానం, జూదంతో పాటు వ్యభిచారం సదుపాయాలు కల్పించారు.ఒక వ్యక్తి ఫిర్యాదుతోఅక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. రాకెట్కు ప్రధాన ఏజెంట్ అయిన చుక్క రాజేష్తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు.బాధితుల తిరుగుబాటు.. అరెస్టుకంబోడియాలో చైనా గ్యాంగ్ హింసలను భరించలేని బాధితులు అక్కడి పరిస్థితులను వివరిస్తూ విశాఖ పోలీసులకు వీడియోలు పంపించారు. అలాగే చైనా ముఠాకు వ్యతిరేకంగా మంగళవారం సుమారు 300 మంది బాధితులు కంబోడియాని సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్ అయిన సిహనౌక్విల్లోని జిన్బీ కాంపౌండ్లో తిరుగుబాటు చేశారు. తమను వెంటనే భారత్కు పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో వీరిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విశాఖ సీపీ ఎ.రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వ్యవహారాన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీరిని బయటకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటుఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మానవ అక్రమ రవాణా రాకెట్ను వెలికితీసేందుకు విస్తృతంగా పనిచేస్తున్నాయి. విశాఖకు చెందిన బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం కోసం సైబర్ క్రైమ్ సీఐ 94906 17917, సీపీ వాట్సాప్ నెంబర్ 94933 36633, కంట్రోల్ రూమ్ నెంబర్ 0891–2565454 సంప్రదించాలని సీపీ సూచించారు. -
Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్సీఆర్ఏ) విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 7.08 కోట్లను విదేశాల నుంచి సేకరించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర హోం శాఖకు తెలిపింది. పంజాబ్ మాజీ ఆప్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాపై డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో సోదాలు చేపట్టినపుడు ఆప్ విదేశీ విరాళాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ఈ–మెయిల్స్ లభించాయని ఈడీ పేర్కొంది. 2014– 2022 మధ్య ఆప్ రూ. 7.08 కోట్లను అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్ల నుంచి సేకరించిందని.. ఇది ఎఫ్సీఆర్ఏ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఉల్లఘించడమేనని తెలిపింది. ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్, కుమార్ విశ్వాస్, అనికిత్ సక్సేనా, కపిల్ భరద్వాజ్ మధ్య జరిగిన ఈ–మెయిల్ సంప్రదింపుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలున్నట్లు పేర్కొంది. అమెరికా, కెనడాల్లో నిధుల సేకరణ కార్యక్రమాల్లో విరాళాలిచి్చన వ్యక్తుల వివరాలను ఆప్ తమ ఖాతా పుస్తకాల్లో చూపలేదంది. -
సెన్స్క్స్ డౌట్!
మళ్లీ వచ్చేది మోదీయే... ఈసారి ఎన్డీయే కూటమికి 400 పై చిలుకు సీట్లు పక్కా... బీజేపీకి కనీసం 370 సీట్లు ఖాయం... కమలనాథుల అంచనాలివి! తీరా ఎన్నికలు మొదలై ఒక్కో విడత పోలింగ్ ముగుస్తున్నకొద్దీ ఈ ఉత్సాహం మెల్లమెల్లగా నీరుగారుతోంది. నాలుగు విడతల్లోనూ పోలింగ్ గత ఎన్నికలతో పోలిస్తే తగ్గడంతో అధికార పార్టీలో కాస్త అలజడి మొదలైంది. ఇదే మూడ్ స్టాక్ మార్కెట్లోనూ ప్రతిబింబిస్తోంది. ఓటింగ్ తగ్గడంతో బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ను అందుకుంటుందో లేదోనన్న అనుమానాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం దెబ్బతింది. రోజుకో కొత్త రికార్డులతో రంకెలేసిన బుల్ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. ఎన్నికల ‘వేడి’కి తికమకపడుతోంది. నిన్నమొన్నటిదాకా పెట్టుబడుల వరద పారించిన విదేశీ ఇన్వెస్టర్లు పొలోమంటూ అమ్మకాలకు తెగబడుతున్నారు. అయి తే ఫలితాలపై అనిశ్చితి వల్లే సెంటిమెంట్పై ప్రభావం పడుతోందని, బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇన్వెస్టర్లు తరలివస్తారని నిపుణులు పేర్కొంటున్నారు... స్టాక్ మార్కెట్లో ఈసారి ఎన్నికల ముందస్తు ర్యాలీతో రికార్డుల మోత మోగింది. మోదీ 3.0పై నమ్మకానికి తోడు ఎన్డీయే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే, ఎన్నికల ‘వేడి’ జోరందుకుని, పోలింగ్ మొదలయ్యాక ఇన్వెస్టర్లలో నెమ్మదిగా నమ్మకం సడలుతూ వస్తోంది. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన నాలుగు విడతల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం దీనికి ఆజ్యం పోసింది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటి కారణాలు ఎన్నున్నా ... ఓటింగ్ పడిపోవడంతో ఫలితాల్లో బీజేపీ బంపర్ విక్టరీపై అనుమానాలు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవలే సెన్సెక్స్ (75,111 పాయింట్లు), నిఫ్టీ (22,795 పాయింట్లు) కొత్త ఆల్టైం గరిష్టాలను తాకిన తర్వాత భారీగానే క్షీణించాయి. గడచిన నెల రోజుల్లో సూచీలు దాదాపు 3 శాతం పైగానే పడటం దీనికి అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో తొలి విడతల్లో పోలింగ్ తగ్గినా, క్రమంగా పుంజుకుంది. దాంతో మొత్తమ్మీద రికార్డు స్థాయిలో 67.4 శాతం ఓటింగ్ జరిగింది. బీజేపీ సొంత బలం కూడా 282 నుంచి 303 లోక్సభ స్థానాలకు ఎగబాకింది. ఈసారి మాత్రం తొలి విడత నుంచే ఓటింగ్ క్రమంగా తగ్గముఖం పడుతూ వస్తోంది. మిగతా 3 విడతల్లోనూ ఇలాగే మందకొడిగా జరిగితే మొత్తం ఓటింగ్ గతం కంటే 2 నుంచి 3 శాతం తగ్గేలా కని్పస్తోంది.విదేశీ ఇన్వెస్టర్లు పీఛే ముడ్... ఓటింగ్ శాతం తగ్గుతుండటం, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ)లో కూడా ఆందోళన మొదలైంది. మన ఈక్విటీ మార్కెట్లలో గత నెలన్నరలో రూ.30 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మేయడం దీనికి నిదర్శనం. మార్కెట్లు భారీగా పడటానికి ఎఫ్పీఐల విక్రయాలే కీలకంగా నిలుస్తున్నాయి. 2023లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఏకంగా రూ.1.77 లక్షల కోట్లను దేశీ మార్కెట్లో కుమ్మరించి రికార్డులు బద్దలుకొట్టారు. అంతేకాదు, ఇందులో దాదాపు మూడో వంతు (రూ.58 వేల కోట్లు) ఒక్క డిసెంబర్లోనే ఇన్వెస్ట్ చేయడం విశేషం. దీనికి తోడు దేశీ ఇన్వెస్టర్లు, ఫండ్స్ జోరుతో బుల్ రంకెలేసింది. గతేడాది సెన్సెక్స్, నిఫ్టీ 20 శాతం రాబడులు అందించాయి. కార్పొరేట్ కంపెనీల లాభాలు పుంజుకోవడం, ప్రభుత్వ పెట్టుబడుల జోరు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు పుంజుకోవడం, సుస్థిర ప్రభుత్వం, స్థిరమైన పాలసీలు తదితర కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే, 2014లో ఎన్నికలు జరిగిన ఏప్రిల్–మే నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.23,607 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. 2019 ఇదే కాలంలో రూ.29,113 కోట్లు దేశీ మార్కెట్లో కుమ్మరించారు. దీంతో 2019లో నాలుగో దశ పోలింగ్ ముగిసే నాటికి నెల రోజుల్లో సెన్సెక్స్ 3.7 శాతం, నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగబాకాయి. ఈసారి మాత్రం ట్రెండ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తిరోగమన బాట పట్టగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం మార్కెట్కు ప్రతికూలంగా మారింది.విదేశీ మార్కెట్లు రయ్ రయ్ ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావం కంటే, ఎన్నికల ప్రభావమే మన మార్కెట్లో ప్రధానంగా కనిపిస్తోంది. విదేశీ మార్కెట్లు గత నెల రోజుల్లో భారీగా పెరిగినప్పటికీ.. మన సూచీలు ఆ స్థాయిలో పెరగకపోగా, 3 శాతం మేర పడిపోవడం దీనికి నిదర్శనం. గత నెల రోజుల వ్యవధిలో హాంకాంగ్ హాంగ్సెంగ్ ఇండెక్స్ ఏకంగా 15.2 శాతం జంప్ చేసింది. బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ సూచీ 6 శాతం, యూఎస్ డోజోన్స్ 4.7 శాతం, జర్మనీ డాక్స్ సూచీ 4.1 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ 3 శాతం చొప్పున ఎగబాకాయి. ‘‘ఎన్నికల ఫలితాలపై అనుమానంతోనే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. ఓటింగ్ శాతం భారీగా తగ్గితే, బీజేపీ అంచనాలు తారుమారు కావచ్చు. ఆ పార్టీ సాధించే సీట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది. మిగతా విడతల ఓటింగ్పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. తదనుగుణంగానే మార్కెట్ల గమనం ఉంటుంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఆందోళన...బీజేపీకి గనుక సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీఏ పక్షాలపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గడం, బుజ్జగింపులు తదితరాలతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఇప్పుడున్న స్వేచ్ఛ లేకపోవడం కూడా అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు మార్కెట్లకు ప్రతికూలాంశం. చివరి మూడు విడతల్లో భారీగా ఓటర్లు పోటెత్తితే తప్ప ప్రస్తుత ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏ కూటమికి 400 పై చిలుకు సీట్ల లక్ష్యం నెరవేరే అవకాశాలు లేనట్టే. అంతేగాక గతంలో మాదిరిగానైనా రాకుండా బీజేపీ ఏ 260 సీట్ల దగ్గరో ఆగిపోతే మళ్లీ సంకీర్ణ లుకలుకలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ఇవన్నీ మార్కెట్లకు రుచించని విషయాలే. విదేశీ ఇన్వెస్టర్లలో ఇలాంటి భయాలే నెలకొన్నాయిప్పుడు! అందుకే ప్రస్తుతానికి కొన్ని పొజిషన్లను తగ్గించుకుని, ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ ఇన్వెస్ట్ చేయొచ్చనే భావన వారిలో కనబడుతోందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. సూచీల తాజా పతనంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారంటే, ఇన్వెస్టర్లలో ఆందోళన అధికార పక్షాన్ని కూడా బాగానే కలవరపెడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ‘గతంలో కూడా మార్కెట్లు గట్టిగా పడిన సందర్భాలున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలకు ముడిపెట్టకూడదు. తాజా ఒడిదుడుకులకు ‘కొన్ని వదంతులు’ ఆజ్యం పోసి ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం జూన్ 4కు ముందే షేర్లు కొనుక్కోండి. ఫలితాల తర్వాత మార్కెట్ దూసుకెళ్తుంది’ అని అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు.2004లో 20% క్రాష్ఎన్నికల ముందస్తు పరిస్థితులతో సంబంధం లేకుండా గత నాలుగు ఎన్నికల్లోనూ ఫలితాల తర్వాత సెస్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలనే అందించాయి. అయితే 2004 ఎన్నికల్లో వాజ్పేయి సర్కారు అనూహ్య ఓటమి చవిచూడటం, హంగ్ కారణంగా ఫలితాల తర్వాత 20 శాతం మార్కెట్ క్రాష్ అయింది! కానీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం కొలువుదీరాక మార్కెట్ విశ్వాసం పుంజుకుంది. మిగతా ఏడాది కాలంలో రాబడులు దండిగానే వచ్చాయి. 2009 ఫలితాల తర్వాత మే 18 నుంచి డిసెంబర్ వరకు 31 వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 40 శాతం దూసుకెళ్లడం విశేషం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరుకు తోడు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాలో సహాయక ప్యాకేజీలు కూడా దోహదం చేశాయి. 2019 ఎన్నికల తర్వాత మాత్రం మార్కెట్లు ఏమంత పెద్దగా పెరగలేదు. ప్రపంచ మార్కెట్లలో అనిశి్చతి, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, బలహీన వృద్ధి రేటు వంటి ప్రభావాలతో 4 నుంచి 5 శాతం మాత్రమే రాబడులొచ్చాయి. అధికార పక్షం గెలుపు అంచనాలు తప్పొచ్చనే ఆందోళనల వల్లే దేశీ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీట్లు భారీగా తగ్గినా, సొంతంగా మెజారిటీ రాకపోయినా, ఫలితాల రోజున మార్కెట్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉండొచ్చు. ఫలితా లొచ్చేదాకా∙ఇదే అలజడి ఉంటుంది– మాధవీ అరోరా, ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ ముఖ్య ఆర్థికవేత్త– సాక్షి, నేషనల్ డెస్క్ -
Election 2024: ప్రధాని మోదీ బిగ్ ప్లాన్!
దేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు వంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అధికార బీజేపీ ఎన్నికల్లో ప్రచారం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలు, ప్రచార సరళిని క్షేత్రస్థాయిలో చూపించేందుకు ప్రపంచంలోని పలు దేశాలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపింది. సుమారుగా 25 విదేశాలకు చెందిన పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలను పంపిచినట్లు తెలుస్తోంది. అయితే అందులో 13 పార్టీల ప్రతినిధులు భారత్కు రావడానికి ఆసక్తి చూపినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే 13 పార్టీల ప్రతినిధులు ఏయే దేశాలకు చెందినవారనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. బీజేపీ ఆహ్వానించిన విదేశీ పార్టీలు.. అమెరికాలోని అధికార డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి బీజేపీ ఆహ్వానం పంపింది. ‘‘అమెరికాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అధ్యక్ష ఎన్నికలు కోసం తలమునకలై ఉంది. అయితే యూఎస్ పార్టీ ఇండియా, యూరప్లోని ఎన్నికల విధానానికి భిన్నంగా ఉంటుంది. యూఎస్ పార్టీ కార్యకర్తకు ఆ పార్టీ చీఫ్ తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అధ్యక్ష కార్యాలయం, యూఎస్ కాంగ్రెస్ (చట్ట సభ)కు అక్కడ చాలా ప్రాముఖ్యం ఉంటుంది’’అని ఓ బీజేపీ నేత తెలిపపారు. యూఎస్తో పాటు యూకేలోని కన్జర్వేటివ్, లేబర్ పార్టీల ప్రతినిధులను ఆహానం పంపారు. జర్మనిలో క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఆహ్వానించారు. అయితే పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఒక్కపార్టీని కూడా పిలువకపోవటం గమనార్హం. భారత్తో పాక్కు సరైన సంబంధాలు సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే. అదేవిధంగా సరిహద్దు వివాదంతో తరుచు కవ్వించే చైనా పార్టీలకు కూడా బీజేపీ ఆహ్వానం పంపించలేదు. మరోవైపు పొరుదేశమైన బంగ్లాదేశ్లో కేవలం అధికార అవామీ లీగ్ను మాత్రమే ఆహ్వానించింది. ఇటీవల అక్కడి ప్రతిపక్ష పార్టీ బీఎన్బీ.. ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో భారతీయ ఉత్పత్తులను బాయ్కాట్ చేసిన విషయం తెలిసిందే. నేపాల్, శ్రీలంకకు చెందిన అన్ని ప్రముఖ పార్టీలను బీజేపీ ఆహ్వానించింది. ఇక.. తాము ఆహ్వానించిన విదేశీ పార్టీల ప్రతినిధులు లోక్సభ ఎన్నికల మూడో లేదా నాలుగో దశ పోలిగ్ సమయం(మే రెండో వారం)లో భారత్ను సందర్శిస్తారని బీజేపీ భావిస్తోంది. విదేశి పార్టీకు చెందిన ప్రతినిధులు, పరిశీలకులు ముందుగా ఢిల్లీ చేరుకొని భారత్ రాజీకీయ వ్యవస్థ, ఎన్నికల విధానం గురించి తెలుసుకుంటారు. 5-6 మంది ప్రతినిధుల బృందం నేరుగా క్షేత్రస్థాయిలో 4-5 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ నేతలను కలుస్తారు. ప్రధాని మోదీ, హోం మంత్రి వంటి నేతల ర్యాలీల్లో విదేశీ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. బీజేపీ ప్రాముఖ్యత తెలపటమే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా బీజేపీ పార్టీ ప్రాముఖ్యత తెలియచేయటంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆయన విదేశీ పార్టీలకు చెందిన సుమారు 70 మంది ప్రతినిధులను కలువనున్నారు. ఇప్పటికే.. నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండను బీజేపీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సైతం విదేశీ పార్టీలకు చెందిన 4-5 మంది ప్రముఖుల బృందం పలు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇక.. ప్రపంచం దేశాల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చేరువకావటమే లక్ష్యంగా బీజేపీ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రజాస్వామ్యానికి ఇండియా తల్లి వంటిది. ప్రపంచంలోనే అతి పెద్దపార్టీ బీజేపీ. బీజేపీ ఎన్నికల విధానం, ఎన్నికల ప్రచారం, అమలు చేసే వ్యూహాలను ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి’’అని బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం నేత విజయ్ చౌతైవాలే తెలిపారు. -
ఖరీదైన మద్యం తాగాలని...
బంజారాహిల్స్: ఓ పబ్ సెక్యూరిటీ గార్డ్ విదేశీ లిక్కర్ బాటిల్ను చోరీ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఆర్.యూ పబ్లో కొంతకాలంగా వినీత్కుమార్ అనే యువకుడు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ పబ్కు వచ్చే యువత ఖరీదైన విదేశీ లిక్కర్ను సేవిస్తుండటాన్ని గుర్తించిన అతను తాను కూడా స్నేహితులతో కలిసి ఆ లిక్కర్ను తాగాలనుకుని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న రాత్రి పబ్ మూసివేసిన తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి లోపలికి వెళ్లి క్యాష్ బాక్స్లో ఉన్న రూ.2 లక్షల నగదుతో పాటు ఐదు రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు, ఒక చివాస్ రీగల్, ఒక మొహిట్ చాన్ దాన్ బాటిల్ను చోరీ చేసి పబ్పై అంతస్తు నుంచి పైపుల ద్వారా కిందకు దిగి పరారయ్యారు. మర్నాడు ఉదయం పబ్ మేనేజర్ మద్యం బాటిళ్లతో పాటు నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా సెక్యూరిటీ గార్డ్ వినీత్కుమార్తో పాటు మరో ఇద్దరు అగంతకులు నగదు, బాటిళ్లతో కిందకు పైపుల ద్వారా కిందకు జారుతున్న దృశ్యాలను గుర్తించారు. ఆ రోజు నుంచి వినీత్కుమార్ విధులకు హాజరుకావడం లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉందని మేనేజర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మచ్చా... మైండ్బ్లోయింగ్! ’ ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతడు
ఇంగ్లీష్లో తట్టుకుంటూ మాట్లాడటం వేరు, భయంగా మాట్లాడటం వేరు. ఫ్లుయెంట్గా, ధైర్యంగా మాట్లాడటం వేరు. దిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో తన రిక్షాలో కూర్చున్న విదేశీ దంపతులతో ఒక రిక్షావాలా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం చూస్తుంటే ‘మైండ్బ్లోయింగ్ మచ్చా’ అనిపిస్తుంది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారిలో ధైర్యం నింపుతోంది. ఈ వీడియోలాగే ఇటీవల మరో వీడియో వైరల్ అయింది. గోవా బీచ్లో గాజులు అమ్మే మహిళ ఆ ప్రాంతం గురించి విదేశీ టూరిస్టులతో గడ గడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వీడియో నెట్లోకంలో చక్కర్లు కొట్టింది. ఎనిమిదేళ్ల వయసు నుంచి గోవా బీచ్లో తల్లిదండ్రులతో కలిసి తిరిగిన ఆమెకు ఆ పరిసర ప్రాంతాల్లో వినిపించే మాటలే ఇంగ్లీష్ నేర్చుకునే పాఠాలు అయ్యాయి. -
‘బై బై ఇండియా’, అందుకే పరాయి దేశం వెళ్తున్న భారతీయులు!
భారత్ను వదిలి విదేశాల్లో స్థిరపడుతున్న భారతీయులకు సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) ఇటీవలే విడుదల చేసిన 2023 వార్షిక గణాంకాల ప్రకారం.. 2023లో 59 వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందినట్లు తెలిపింది. యూఎస్సీఐఎస్ నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8.7 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరులుగా మారారు. వీరిలో 1.1 లక్షల మంది మెక్సికన్లు, 59,100 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందగా.. కొత్తగా చేరిన అమెరికన్ పౌరుల్లో 35,200 మంది డొమినికన్ రిపబ్లిక్ చెందినవారు కాగా, ఫిలిప్పీన్స్ దేశస్తులు 44,800 మంది ఉన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో యుఎస్ పౌరసత్వం పొందిన వారు కనీసం 5 ఏళ్లు చట్టబద్ధంగా శాశ్వత నివాసం పొందిన వారు (ఎల్పీఆర్లుగా Lawful permanent residents) ఉన్నందున పౌరసత్వానికి అర్హులు. కనీసం 3 సంవత్సరాల పాటు ఎల్పీఆర్లుగా ఉండటానికి అర్హులైన యుఎస్ పౌరురుల వివాహం చేసుకున్న దరఖాస్తుదారులు కూడా ఉన్నారు. కొంతమంది దరఖాస్తుదారులు సైనిక సేవ ఆధారంగా కూడా అమెరికా పౌరసత్వాన్ని అందించినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ డేటా వెలుగులోకి వచ్చింది. ఈ తరుణంలో భారతీయులు స్వదేశం పౌరసత్వం వదిలేసి అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఎందుకు వలస వెళ్తున్నారనే అంశంపై పలు కారణాలున్నాయని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఉపాధి అవకాశాలు: చాలా మంది భారతీయులు విదేశాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు, కెరీర్ ఎదుగుదలను కోరుకుంటారు. యూఏఈ, అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలు గణనీయమైన సంఖ్యలో భారతీయ వలసదారులకు ఆతిథ్యం ఇస్తున్నాయి. విద్య: ఉన్నత విద్యను అభ్యసించడం మరో ప్రేరణ. మహమ్మారి కారణంగా వలసదారులపై ఆంక్షలు అమల్లోకి రాకముందు సుమారు 5.9 లక్షల మంది భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ క్యాంపస్లలో చదివేందుకు వెళ్లారు. మహమ్మారి సమయంలో ఈ తగ్గినప్పటికీ, కోవిడ్ ప్రోటోకాల్స్ సడలించడంతో వారు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. జీవన ప్రమాణాలు: మెరుగైన జీవన ప్రమాణాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కోసం కొందరు భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. కెనడా, యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్ డమ్ వంటి దేశాలు మెరుగైన జీవన ప్రమాణాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉండేందుకు : ఇప్పటికే విదేశాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యులతో తిరిగి కలవడం ఒక సాధారణ కారణం. ఆత్మీయులకు దగ్గరగా ఉండాలనే కోరిక వలసలు పెరిగేందుకు మరో కారణం ఆర్థిక స్థిరత్వం: వ్యక్తులు తరచుగా వారి మెరుగైన జీవితం గడిపేందుకు డబ్బు సంపాదన, అందుకు తగిన అవకాశాల్ని కోరుకుంటారు. ఫలితంగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల్లో స్థిరపడుతున్నారు. పౌరసత్వాన్ని వదులుకోవడం: 2011 నుండి 1.6 మిలియన్లకు పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇందులో 2022 లో 1,83,741 మంది ఉన్నారు. ఇతర దేశాల్లో పౌరసత్వం కోరుకునే భారతీయులకు అమెరికా తొలిస్థానంలో ఉంది. ప్రవాస భారతీయులు ఆర్థిక, విద్యా, వ్యక్తిగత కారకాల కలయికతో ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డారు. కెరీర్ పురోభివృద్ధి కోసమో, విద్య కోసమో, కుటుంబ బంధాల కోసమో భారతీయులు తమ మాతృభూమికి వెలుపల అవకాశాలను అన్వేషిస్తూనే ఉన్నారు. -
విదేశీ చెల్లింపులకు డిజిటల్ కరెన్సీ!: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: విదేశీ చెల్లింపులకు వీలుగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని మెరుగుపరచడంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ పూర్థిస్థాయి దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్బీఐ పైలట్ ప్రాజెక్స్గా దీనిని ప్రారంభించిందని, అమలుకుగాను తొమ్మిది బ్యాంకులు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీలను ఎంచుకుందని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే అదే విలువలతో జారీ అవుతుందన్నారు. బ్యాంకుల వంటి ఫైనాన్షియల్ మీడియేటర్ల ద్వారా పంపిణీ జరుగుతుందని అన్నారు. భాగస్వామ్య బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా వినియోగదారులు ఈ–రూపాయితో లావాదేవీలు చేయగలుగుతారని కూడా వెల్లడించారు. ‘‘విదేశీ చెల్లింపులలో డిజిటల్ కరెన్సీ సహాయపడుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఇది మరింత పారదర్శకత, లభ్యత సౌలభ్యతలను సమకూర్చుతుంది’’ అని హిందూ కళాశాల 125 సంవత్సరాలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో సీతారామన్ అన్నారు. ఇది తక్కువ ఖర్చుతో చెల్లింపులను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, దేశీయంగా, అంతర్జాతీయంగా జరిగే చెల్లింపుల విషయాల్లో వ్యయాలను తగ్గిస్తుందని వివరించారు. తయారీ, వ్యవసాయంపై దృష్టి.. భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా మార్చడానికి ప్రాధాన్యతా రంగాల గురించి అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, తయారీ వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘‘వ్యవసాయం దాని ప్రాధాన్యతను పటిష్టం చేసుకుంది. కొన్ని విధానాలు, ఆధునికీకరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి తగిన కృషి చేస్తున్నాము’’ అని మంత్రి అన్నారు. తయారీలో, పునరుత్పాదక శక్తి, సెమీ కండక్టర్, మెషిన్ లెర్నింగ్, ఎర్త్ సైన్సెస్, స్పేస్తో సహా 13 పురోగతి బాటలో ఉన్న రంగాలను ప్రభుత్వం గుర్తించిందని ఆమె చెప్పారు. సామాజిక పథకాల అమల్లో పురోగతి పేదలకు కనీస అవసరాలు అందించడానికి రూపొందించిన సామాజిక రంగ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం సంతృప్తికరమైన స్థాయికి చేరుకుంటోందని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతదేశం ఆర్థికంగా ’ఆత్మనిర్భర్’ (స్వయం సమృద్ధి) సాధించే సమయం ఆసన్నమైందని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఈ శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని వివరించారు. ఎటువంటి పురోగతి లేకుండా స్వాతంత్య్ర భారత్ 60 సంవత్సరాలు గడిపిందన్న ఆమె, ‘‘మేము వికసిత భారత్కు భౌతిక పునాదిని వేశాము. అందరికీ ప్రాథమిక అవసరాలను అందించడం ద్వారా ప్రజలను శక్తివంతం చేశాము’’ అన్ని అన్నారు. డీబీటీతో పారదర్శకత బోగస్, అవాంఛనీయ లబ్ధిదారులను తొలగించడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లను ఆదా చేయగలిగిందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. డీబీటీ ద్వారా ప్రభుత్వ నిధుల బదిలీలో పారదర్శకతను మెరుగుపరచడమే కాకుండా సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరిచిందని ఆమె అన్నారు. ప్రజలకు సామాజిక కార్యక్రమాలను అందించడంలో ప్రభుత్వానికి ఎటువంటి పక్షపాతం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రధాని భారతదేశాన్ని యువత, మహిళలు, రైతులు పేదలు అనే నాలుగు గ్రూపులుగా వర్గీకరించడారని, మతాలు, కులాలతో సంబంధం లేకుండా ఈ సమూహాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. నూనె గింజలు, పప్పుధాన్యాలు మినహా వ్యవసాయానికి సంబంధించినంతవరకు భారతదేశం దాదాపు స్వయం సమృద్ధి సాధించిందని ఆమె అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు సమస్యలను ఎదుర్కొంటున్నందున ఆహారాన్ని వృథా చేయవద్దని ఆమె ఈ సందర్భంగా సూచించారు. రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్టతో నాగరికత విలువల పునరుద్ధరణ జనవరి 22న రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట వేడుకను ’నాగరికత గుర్తు’గా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నాగరికత విలువల పునరుద్ధరణకు సాక్ష్యంగా నిలిచిన ప్రస్తుత తరానికి ఈ వేడుకలు అదృష్ట తరుణమని ఆమె అన్నారు. నైపుణ్యాల అభివృద్ధితో పాటు నాగరికత– జాతీయత రెండింటికీ సంబంధించి విలువల పటిష్టతపై దృష్టి పెట్టాలని ఆమె విద్యార్థులను కోరారు. దేశం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోందని విద్యార్థులకు గుర్తు చేస్తూ, ఓటు వేయడం పౌరుల హక్కు మాత్రమే కాదని, అది వారి కర్తవ్యం కూడా అని అన్నారు. మొదటి సారి ఓటరుగా ఉన్న వారిపై ఎక్కువ బాధ్యత ఉందని ఆమె అన్నారు. సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతున్న ప్రతికూలతలను చూసి విద్యార్థులు తప్పుదారి పట్టవద్దని ఆమె కోరారు. ఎకానమీపై తప్పుడు ప్రచారం భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థికమంత్రి పేర్కొంటూ, కంపెనీలు, స్టాక్ మార్కెట్ చాలా బాగా పని చేస్తున్నాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బాగా లేదని, తీవ్ర ఒడిదుడుకులతో పయనిస్తోందన్న కథనాలు అవాస్తమమని అన్నారు. అలాంటి ప్రచారం చేస్తున్న వారు ఏ ప్రాతిపదికన ఈ విషయాన్ని చెబుతున్నారో చెప్పాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. అయితే సమాధానం చెప్పడానికి వారు అందుబాటులో ఉండరని విమర్శించారు. తోచింది చెప్పిడం కొందరి పనిగా మారిందని అన్నారు. -
రియల్టీలోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి గతేడాది (2023లో) 2.73 బిలియన్ డాలర్ల మేర విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. 2022లో 3.96 బిలియన్ డాలర్లు వచ్చాయి. మరోవైపు, దేశీ సంస్థల పెట్టుబడులు రెట్టింపై 687 మిలియన్ డాలర్ల నుంచి 1.51 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మొత్తం మీద 2023లో రియల్ ఎస్టేట్లోకి సంస్థాగత పెట్టుబడులు 12 శాతం క్షీణించి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. విదేశీ ఫండ్స్ ఆచితూచి వ్యవహరించడం వల్ల పెట్టుబడులు మందగించినట్లు వెస్టియన్ సీఈవో శ్రీనివాస రావు తెలిపారు. ‘రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ 2023లో పెట్టుబడులు భారీగానే వచ్చాయి. భారత వృద్ధి గాథపై దేశీ ఇన్వెస్టర్లలో నెలకొన్న విశ్వాసం, వారి ఆశావహ దృక్పథం మార్కెట్ను నిలబెట్టింది‘ అని ఆయన పేర్కొన్నారు. 2023లో పెట్టుబడులు అయిదేళ్ల కనిష్టానికి తగ్గినా.. దేశీ ఎకానమీ మెరుగైన పనితీరు, ఇన్ఫ్రా రంగంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ఊతంతో 2024లో ఇన్వెస్ట్మెంట్లు మరింత పుంజుకోగలవని శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. కొత్త పెట్టుబడి సాధనాల రాకతో భారతీయ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోందని, దీంతో నిధుల అవసరం కూడా పెరుగుతోందని చెప్పారు. ఇలా పెట్టుబడులకు డిమాండ్ అధికంగా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్లపై కూడా అధిక రాబడులు రావొచ్చని, అదే ఆలోచనతో ఇన్వెస్టర్లు రియల్టీలో మరిన్ని పెట్టుబడులు పెట్టొచ్చని శ్రీనివాస రావు వివరించారు. 2019లో దేశీ రియల్ ఎస్టేట్లోకి సంస్థాగత పెట్టుబడులు 6.5 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. 2020లో 5.9 బిలియన్ డాలర్లు, 2021లో 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
కెనడా వెళ్లే విద్యార్థులకు మరో షాక్! ఇకపై అలా కుదరకపోవచ్చు..
కెనడా వెళ్లే విద్యార్థులకు ఆ దేశం మరో షాక్ ఇవ్వబోతోంది. 2024 ఆ తర్వాత దేశంలోకి తాత్కాలిక విదేశీ ఉద్యోగుల ప్రవేశంపై పరిమితులు విధించే అవకాశం ఉందని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. తాత్కాలిక విదేశీ ఉద్యోగుల భారీ ప్రవాహాన్ని పరిష్కరించడానికి వచ్చే ఏడాది ప్రారంభంలో పలు సంస్కరణలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కెనడాలో తలెత్తిన హౌసింగ్ సంక్షోభానికి విదేశీ విద్యార్థులు, తాత్కాలిక విదేశీ కార్మికులు పెద్ద సంఖ్యలో రావడానికి మధ్య సంబంధం ఉందని మిల్లర్ అభిపాయపడ్డారు. తాత్కాలిక ప్రాతిపదికన కెనడాలోకి ప్రవేశించిన వారి సంఖ్య ఆకాశాన్ని తాకిందన్నారు. అయితే తాను నిర్దిష్టంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం లేదని చెప్పారు. విద్యార్థుల రూపంలో.. దేశంలో చాలా కాలంగా అస్థిరంగా ఉన్న తాత్కాలిక విదేశీ కార్మిక వ్యవస్థ వల్ల తలెత్తుతున్న పరిణామాలపై తాను దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు మిల్లర్ పేర్కొన్నారు. తాత్కాలిక వ్యవసాయ కార్మికులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లను పొందిన అంతర్జాతీయ విద్యార్థుల రూపంలో తాత్కాలిక విదేశీ కార్మికులు కెనడాలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభా కెనడాలో జనాభా క్రమంగా పెరుగుతోంది. 2023 మూడో త్రైమాసికంలో ఆ దేశ జనాభా 4.3 లక్షలకుపైగా పెరిగిందని స్టాటిస్టిక్స్ కెనడా తన ఇటీవలి డేటాలో పేర్కొంది. ఇది వెల్లడైన వారం రోజుల్లోనే మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో 1957 తర్వాత ఓ త్రైమాసికంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు ఇదే. ఈ నివేదిక ప్రకారం.. కెనడాలో ప్రస్తుతం 4 కోట్లకుపైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 3.13 లక్షల మంది వలసదారులు ఉండటం గమనార్హం. కాగా విదేశీ విద్యార్థుల పట్ల కెనడా ప్రభుత్వం ఇదివరకే కఠిన నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి కెనడాలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధుల డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచింది. ప్రస్తుతం ఆ మొత్తం 10వేల డాలర్లు (రూ.6.14లక్షలు) ఉండగా దాన్ని ట్రూడో ప్రభుత్వ 20,635 డాలర్లు (రూ.12.7లక్షల)కు పెంచింది. 2024 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. -
ఫారిన్కు మహేశ్ బాబు.. 'గుంటూరు కారం' ప్రమోషన్స్ షురూ
‘గుంటూరు కారం’ సినిమాకు గుమ్మడికాయ కొట్టే సమయం ఆసన్నమైంది. హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో జరుగుతోంది. మహేశ్ బాబుతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, ఓ మాస్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట యూనిట్. ఈ పాట పూర్తయితే షూటింగ్ దాదాపు పూర్తయినట్లేనని టాక్. చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు కూడా కంప్లీట్ చేసి, ఈ నెలాఖరుకు ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తి అయ్యేలా చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్కు వెళతారట మహేశ్బాబు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుంటారని ఫిల్మ్నగర్ సమాచారం. ఫారిన్ నుంచి తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ తో బిజీ అవుతారు మహేశ్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. -
పోటెత్తిన ఎఫ్పీఐల పెట్టుబడులు...
విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో ఇప్పటికి వరకు (1–22 తేదీల మధ్య) రూ. 57,300 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎఫ్పీఐల పెట్టుబడుల్లో ఇదే గరిష్టం. ‘‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ గెలుపొందడం+తో బలమైన ఆరి్థక వృద్ధి, రాజకీయ సుస్థిరత ఏర్పడొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ స్థిరంగా తగ్గుతోంది. ఈ పరిణామాలు ఎఫ్ఐఐల కొనుగోళ్లను ప్రేరేపించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ కుమార్ తెలిపారు. ఈ ఏడాదిలో మొత్తంగా భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐల పెట్టుబడులు రూ.1.62 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. ఇక డెట్ మార్కెట్లోకి డిసెంబర్ నెలలో రూ. 15,545 కోట్ల ఎఫ్పీఐ నిధులు వచ్చి చేరాయి. గత నెలలో రూ.14,860 కోట్లు, అక్టోబర్లో 6,381 కోట్ల నిధులు వచ్చాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్తో పాటు ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, టెలికం రంగాల్లో ఎఫ్పీఐ పెట్టుబడులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారని గణాంకాలు చెబుతున్నాయి. -
విదేశాల్లో పెరిగిన భారత బ్యాంకు శాఖలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యాంకుల విదేశీ అనుబంధ సంస్థలు, శాఖల సంఖ్య 417కి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 399గా ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య విదేశీ శాఖల్లో 0.5 శాతం, అనుబంధ సంస్థల్లో 6.2 శాతం పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన 2022–23 ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విదేశాల్లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 14 భారతీయ బ్యాంకులు, అలాగే భారత్లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 44 విదేశీ బ్యాంకులపై ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారత్లో విదేశీ బ్యాంకుల శాఖలు, ఉద్యోగుల సంఖ్య తగ్గింది. -
విదేశాల్లో కూడా వనభోజన సంప్రదాయం.. ! ఐతే ఎలా ఉంటాయంటే..
ఇది కార్తీకమాసం. శివకేశవుల ఆరాధనకు విశిష్టమైన మాసం. కార్తీకమాసంలో దీపారాధన చేయడం, దాన ధర్మాలు చేయడం ఆచారంగా కొనసాగుతోంది. కార్తీకమాసం అంటే ఆలయ దర్శనాలు, పూజలు, వ్రతాలు మాత్రమే కాకుండా వనభోజనాలు కూడా గుర్తుకొస్తాయి. మన దేశంలో కార్తీక వనభోజనాలు సంప్రదాయ ప్రకారం కొనసాగుతున్నట్లే, వివిధ దేశాల్లో వనభోజనాలు చేసే సంప్రదాయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా కాస్త ముచ్చటించుకుందాం.. కార్తీకమాసంలో వనభోజనాలు చేయడం మనకు చిరకాలంగా కొనసాగుతున్న ఆచారం. శివకేశవులకు పవిత్రమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. యాగాలు, హోమాలు, పూజలు, వ్రతాలు, తర్పణాలు చేసేటప్పుడు జరిగిన లోపాల వల్ల సంభవించిన దోషాలను తొలగించుకోవడానికి తప్పనిసరిగా కార్తీకమాసంలో వనభోజనాలు చేసి తీరాలని ‘స్కాందపురాణం’ చెబుతోంది. ఈ పురాణం ప్రకారం కార్తీక వనభోజనాల కోసం ఎంపిక చేసుకునే వనంలో నానాజాతుల వృక్షాలు పుష్కలంగా ఉండాలి. వాటిలో ఉసిరి చెట్టు తప్పనిసరిగా ఉండాలి. ఉసిరిచెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి శాస్త్రోక్తంగా పూజించి, పురోహితులకు యథాశక్తి దక్షిణ తాంబూలాలను సమర్పించుకోవాలి. వనంలోనే వంటలు చేసుకుని, పురోహితులతోను, బంధుమిత్రులతోను కలసి భోజనాలు చేయాలి. కార్తీకమాసంలో ఉసిరిచెట్టు నీడన సాలగ్రామాన్ని పూజించి, పురోహితులకు అన్నసంతర్పణ చేసి, వనభోజనాలు చేసి, కార్తీక మహాత్మ్యాన్ని విన్నవారికి సమస్త పాపాలు తొలగి, మరణానంతరం విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ‘కార్తీక పురాణం’ చెబుతోంది. చరిత్రలో వనభోజనాలు వన భోజనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కార్తీక వనభోజనాల ప్రస్తావన స్కాంద, కార్తీక పురాణల్లో ఉంది. వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణం ఒకటి. స్కాందపురాణం ప్రాచీన తాళపత్ర ప్రతి 1898లో దొరికింది. ఇది క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిదని పరిశోధకుల అంచనా. దీనిని బట్టి మన దేశంలో వనభోజనాల సంస్కృతి ఎనిమిదో శతాబ్దికి ముందు నుంచే ఉండేదని అర్థమవుతుంది. పలు ఇతర దేశాల్లో కూడా సంప్రదాయకమైన వనభోజనాల సంస్కృతి మధ్యయుగం నాటికే వ్యాప్తిలో ఉండేది. ఇంగ్లిష్లో వనభోజనాలకు ‘పిక్నిక్’ అనే పేరు ఉంది. ‘పెక్’ లేదా ‘పిక్’ అంటే ఏరడం, ‘నిక్’ అంటే స్వల్ప పరిమాణం అని అర్థం. ఇవి ఫ్రెంచ్ మాటలు. ‘పిక్’, ‘నిక్’ అనే ఈ రెండు మాటల కలయికతో ‘పిక్నిక్’ అనే మాట ఏర్పడింది. ఇంగ్లిష్లో ఈ మాట పదహారో శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో సంపన్నులు తీరిక వేళల్లో బంధుమిత్రులతో కలసి ఊళ్లకు దగ్గర్లో ఉండే వనాలకు వెళ్లి, రోజంతా అక్కడే విందు వినోదాలతో కాలక్షేపం చేసేవారు. ఫ్రెంచ్ విప్లవం తర్వాత పద్దెనిమిదో శతాబ్ది నాటికి పిక్నిక్ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో బాగా వ్యాప్తి చెందింది. పాశ్చాత్య సాహిత్యంలో కూడా పిక్నిక్ల ప్రస్తావన కనిపిస్తుంది. ‘పిక్నిక్ భోజనం వంటి ఆహ్లాదకరమైన విషయాలు జీవితంలో చాలా తక్కువగా ఉంటాయి’ అని ప్రసిద్ధ ఇంగ్లిష్ రచయిత సోమర్సెట్ మామ్ అన్న మాటలు ఆనాటి పాశ్చాత్య ప్రపంచంలో పిక్నిక్ల ప్రశస్తిని తెలియజేస్తాయి. ఫ్రెంచ్ విప్లవకాలంలో ఫ్రాన్స్ నుంచి వచ్చి లండన్లో స్థిరపడిన సుమారు రెండువందల మంది సంపన్న ఫ్రెంచ్ యువకుల బృందం 1801లో లండన్లో ‘పిక్నిక్ సొసైటీ’ని నెలకొల్పింది. ‘పిక్నిక్ సొసైటీ’ నిర్వహించే వనభోజనాల్లో విందుతో పాటు వినోద కార్యక్రమాలు అట్టహాసంగా ఉండేవి. ఎలాంటి నటనానుభవం లేని అతిథులు సైతం ఈ పిక్నిక్ పార్టీల్లో నటీనటులుగా మారి నాటకాలు వేసేవారని ‘ది టైమ్స్’ దినపత్రిక అప్పట్లో ఒక కథనంలో పేర్కొంది. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభం నాటికి ఆధునిక వాహనాలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా పిక్నిక్ సంస్కృతి మరింతగా విస్తరించింది. అయితే, పాశ్చాత్య ప్రపంచంలో పిక్నిక్లు వ్యాప్తిచెందడానికి శతాబ్దాల ముందు నుంచే చైనా, జపాన్ వంటి తూర్పు దేశాల్లో సంప్రదాయ వనభోజనాల సంస్కృతి ఉండేది. ప్రాక్ పాశ్చాత్య దేశాల్లో వనభోజనాల సంస్కృతీ సంప్రదాయాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. క్లీన్ మండే: గ్రీస్ క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘గ్రేట్ లెంట్’ తొలిరోజును ‘క్లీన్ మండే’ అంటారు. క్లీన్ మండే రోజున విందు వినోదాలతో గడుపుతారు. గ్రీస్లో క్లీన్ మండే రోజున ప్రజలు పార్కులు, తోటలు, చిట్టడవులు, సముద్ర తీరాల్లో గుమిగూడి పిక్నిక్లు జరుపుకొంటారు. పిక్నిక్ సందర్భంగా చిత్రవిచిత్రమైన రంగు రంగుల గాలిపటాలను ఎగురవేయడం గ్రీకు ప్రజల ఆనవాయితీ. పిక్నిక్ విందులో సంప్రదాయబద్ధంగా చేసే రొట్టెలు, ఆల్చిప్పలు, ఆక్టోపస్, పీతలు, రొయ్యలతో చేసిన వంటకాలను ఆరగిస్తారు. మధ్యాహ్నం విందు తర్వాత పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తారు. బెర్రీ పికింగ్: ఐస్లాండ్ ఐస్లాండ్లో వేసవి మాత్రమే పిక్నిక్లకు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన కాలాలన్నీ ఆరుబయట నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఐస్లాండ్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసవికాలం ఉంటుంది. ఆగస్టు రెండోవారం నుంచి సెప్టెంబర్ రెండోవారం వరకు బెర్రీపండ్లు విరగకాస్తాయి. చెట్ల మీదనే బాగా పండినవి ఎక్కడికక్కడ రాలిపడతాయి. ఆరుబయటి వాతావరణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. అందువల్ల ఐస్లాండ్ ప్రజలు బెర్రీలు విరగకాసే కాలంలో ‘బెర్రీ పికింగ్’ పేరుతో పిక్నిక్లు చేసుకుంటారు. పార్కులు, తోటలు, చిట్టడవుల్లో చేసుకునే ఈ పిక్నిక్లలో నేలరాలిన బెర్రీ పండ్లను ఏరుకోవడం పిల్లా పెద్దా అందరికీ ఒక కాలక్షేపం. బెర్రీ పికింగ్ పిక్నిక్ విందులో సంప్రదాయబద్ధంగా చేసే రొట్టెలు, మంటపై కాల్చిన గొర్రెమాంసం, కప్కేకుల్లాంటి సాఫ్ట్స్కోన్స్, సాల్మన్ చేపలు, చీజ్తో చేసిన వంటకాలను ఆరగిస్తారు. తిండి పోటీలు: అమెరికా అమెరికాలో నేషనల్ పిక్నిక్ డే ఏప్రిల్ 23న జరుపుకొంటారు. దేశంలో అప్పటి నుంచే పిక్నిక్ల హడావుడి మొదలవుతుంది. మే 27న జరుపుకొనే మెమోరియల్ డే మొదలుకొని నవంబర్ 11న జరుపుకొనే వెటరన్స్ డే వరకు అమెరికాలో పిక్నిక్ సీజన్గానే పరిగణిస్తారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4న ఎక్కువ మంది పిక్నిక్లు జరుపుకొంటారు. దాదాపు ఆరునెలల పాటు కొనసాగే పిక్నిక్ సీజన్లో బంధు మిత్రుల బృందాలు మాత్రమే కాకుండా, కార్పొరేట్ సంస్థలు కూడా ఉద్యోగుల కోసం పిక్నిక్ పార్టీలు నిర్వహిస్తూ ఉంటాయి. ఎక్కువగా పార్కులు, తోటలు, సముద్ర తీరాల్లో బార్బెక్యూ పిక్నిక్ పార్టీలు చేసుకుంటారు. పలు పిక్నిక్లలో తిండి పోటీలు నిర్వహిస్తుంటారు. భారీ పరిమాణంలో వంటకాలను తక్కువ సమయంలో భోంచేయడంలో జరిగే ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉంటాయి. పిక్నిక్ డే: ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఆగస్టు మొదటి సోమవారాన్ని పిక్నిక్ డేగా పాటిస్తారు. వేర్వేరు చోట్ల నుంచి వచ్చి ఆస్ట్రేలియా గనుల్లో పనిచేసే గనికార్మికులు పంతొమ్మిదో శతాబ్దిలో ఇక్కడ పిక్నిక్ సంస్కృతిని ప్రారంభించారు. 1881లో బలారాట్ మైనర్స్ అసోసియేషన్ తొలిసారిగా అబ్బరీ బొటానికల్ పార్కులో వేలాదిమంది కార్మికులతో భారీ పిక్నిక్ నిర్వహించింది. ఆస్ట్రేలియాలో 1940ల నాటికి దేశవ్యాప్తంగా రైల్వేలైన్లు ఏర్పడటంతో ఆగస్టు మొదటి సోమవారాన్ని రైల్వే హెరిటేజ్ పిక్నిక్ డేగా పాటించడం ఆనవాయితీగా మారింది. ఆస్ట్రేలియన్లు పిక్నిక్లలో ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యమిస్తారు. పిక్నిక్లలో నృత్య గానాలు, టగ్ ఆఫ్ వార్ వంటి వివిధ క్రీడల పోటీలు నిర్వహిస్తారు. పిక్నిక్ టీ: న్యూజిలాండ్ న్యూజిలాండ్లో పిక్నిక్ సంస్కృతి పంతొమ్మిదో శతాబ్దిలో బ్రిటిష్ పాలకుల ద్వారా మొదలైంది. దక్షిణార్ధ గోళంలో ఉన్న న్యూజిలాండ్లో నవంబర్ నుంచి వసంత రుతువు మొదలవుతుంది. వసంతకాలంలో ఇక్కడ ఆరుబయట పిక్నిక్లు జరుపుకొంటారు. న్యూజిలాండ్ సంప్రదాయ పిక్నిక్లలో టీ పార్టీలు ప్రత్యేకం. పిక్నిక్ల కోసం జనాలు ఉదయాన్నే తోటలు, చిట్టడవులు, సముద్రతీరాలు వంటి ఆరుబయటి ప్రదేశాలకు చేరుకుంటారు. ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. మధ్యాహ్నం సంప్రదాయకమైన రొట్టెలు, కాల్చిన మాంసాహార వంటకాలతో విందు భోజనాలు ఆరగిస్తారు. పొద్దుగూకడానికి ముందు స్కోన్స్, బిస్కట్లు వంటి చిరుతిళ్లతో టీ పార్టీ చేసుకుంటారు. బాస్టీల్ డే రికార్డు నవ సహస్రాబ్దిలో వచ్చిన తొలి బాస్టీల్ డే సందర్భంగా 2000 సంవత్సరంలో ఫ్రాన్స్లో అత్యంత భారీ పిక్నిక్ జరిగింది. ఈ పిక్నిక్ ఆరువందల మైళ్ల పొడవున డన్కిర్క్ నుంచి స్పెయిన్ సరిహద్దుల్లో ఉన్న ప్రాట్స్ డి మోలో వరకు 337 నగరాలు, పట్టణాల మీదుగా సాగింది. ఈ విందులో లక్షలాది మంది పాల్గొన్నారు. వెండితెర మీద పిక్నిక్ హాలీవుడ్ దర్శకుడు జోషువా లోగాన్ 1955 ‘పిక్నిక్’ సినిమాను తెరకెక్కించాడు. విలియమ్ హోల్డన్, కిమ్ నోవాక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆరు ఆస్కార్ నామినేషన్లు పొందింది. వాటిలో రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు పొందింది. ఫిల్మ్ ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో ‘పిక్నిక్’ సినిమా ఈ అవార్డులను దక్కించుకుంది. హనామీ: జపాన్ జపాన్లోని వనభోజనాలను ‘హనామీ’ అంటారు. మన కార్తీక వనభోజనాల వేడుకలను ఉసిరిచెట్లు ఉన్న వనాల్లో జరుపుకున్నట్లే జపాన్ ప్రజలు చెర్రీచెట్లు విస్తారంగా ఉన్న వనాల్లో వనభోజనాలు చేస్తారు. ఏటా చెర్రీ వృక్షాలు విరగబూసే కాలంలో గుంపులు గుంపులుగా చెర్రీ వనాలకు చేరుకుని, అక్కడ విందు వినోదాలతో ఘనంగా వనభోజనాలు చేస్తారు. జపాన్ దేశవ్యాప్తంగా మార్చి నుంచి మే వరకు చెర్రీపూత కాలం కొనసాగుతుంది. ఒకినావా దీవిలో మాత్రం జనవరిలోనే చెర్రీపూత మొదలవుతుంది. జపాన్ వాతావరణ శాఖ ప్రతి ఏడాది చెర్రీపూత కాలం తేదీలను వెల్లడిస్తుంది. చెర్రీవృక్షాలకు పూలు పూయడం మొదలైతే, వాటి పూత ఒకటి రెండు వారాల వరకు మాత్రమే ఉంటుంది. పూత ఉన్న సమయంలోనే జనాలు విందు వినోదాలతో వనభోజన వేడుకలను జరుపుకొంటారు. విందులో సంప్రదాయ వంటకాలను ఆరగిస్తారు. జపాన్లో ఈ ‘హనామీ’ వనభోజనాల సంస్కృతి క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది ప్రారంభం నుంచి కొనసాగుతోంది. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో ‘హనామీ’ సంస్కృతి అమెరికా, కెనడా దేశాలకూ వ్యాపించింది. పిక్నిక్ డే: బ్రిటన్ బ్రిటన్లో ఏటా జూన్ 18న నేషనల్ పిక్నిక్ డేగాను, జూన్ 17 నుంచి 25 వరకు నేషనల్ పిక్నిక్ వీక్గాను పాటిస్తారు. జూన్ 18 ఇంటర్నేషనల్ పిక్నిక్ డే కూడా కావడం విశేషం. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా జనాలు ఆరుబయట పిక్నిక్ పార్టీలు చేసుకుంటారు. బ్రిటన్లో పద్దెనిమిదో శతాబ్ది నుంచి పిక్నిక్ సంస్కృతి ఉంది. పురాతన డిపార్ట్మెంట్ స్టోర్ ‘ఫోర్ట్నమ్ అండ్ మేసన్’ అప్పట్లో ప్రవేశపెట్టిన ‘స్కాచ్ ఎగ్’ను పిక్నిక్ విందుల్లో ప్రత్యేక వంటకంగా వడ్డించేవారు. సాసేజ్లో చుట్టిన గుడ్డును నిప్పుల మీద కాల్చి తయారు చేసే ఈ వంటకం సంపన్నుల పిక్నిక్ విందులో తప్పనిసరిగా ఉండేది. చిట్టడవులు, పార్కులు, సముద్ర తీరాల్లో నిప్పుల మీద కాల్చిన మాంసపు వంటకాలను ఆరగిస్తూ పిక్నిక్ విందులు జరుపుకోవడం బ్రిటిష్ సంస్కృతిలో భాగంగా మారింది. క్రిస్మస్ పిక్నిక్: అర్జెంటీనా అర్జెంటీనా ప్రజలు ఏటా క్రిస్మస్ సీజన్లో పిక్నిక్లు జరుపుకొంటారు. మంచు కురిసే ఈ కాలంలో ఆరుబయట వనభోజనాలు చేయడానికి అర్జెంటీనా ప్రజలు ఆసక్తి చూపుతారు. అర్జెంటీనాలో ఏటా డిసెంబర్ 8 నుంచి క్రిస్మస్ సీజన్ మొదలవుతుంది. డిసెంబర్ 8న ‘ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ డే’ జరుపుకొంటారు. ఆ రోజున మేరీమాత పాపవిమోచన పొందిందని కేథలిక్ల నమ్మకం. అర్జెంటీనాలో డిసెంబర్ 8న ప్రభుత్వ సెలవు దినం. దేశంలో పిక్నిక్ల సందడి కూడా అప్పటి నుంచే మొదలవుతుంది. కొందరు వనాల్లోను, తీరప్రాంతాల్లో ఉండేవారు సముద్ర తీరంలోను ఆరుబయట విందు వినోదాలతో పిక్నిక్లు చేసుకుంటారు. ఆరుబయట మంటలు వేసి, కోడి, టర్కీ, మేక, పంది వంటి వాటి మాంసాలను కాల్చుకుని, వాటితో విందు చేసుకుంటారు. హెరింగ్ లంచ్: ఫిన్లాండ్ ఫిన్లాండ్లో వసంత రుతువు కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. మేడే నుంచి దేశంలో పిక్నిక్ల హడావుడి మొదలవుతుంది. నిజానికి మేడే పిక్నిక్ల కోసం జనాలు ఏప్రిల్ 30 నుంచే హడావుడి ప్రారంభిస్తారు. ఊళ్లకు వెలుపల ఉండే చిట్టడవులు, పార్కులు, సముద్ర తీరాల్లో ఎక్కువగా పిక్నిక్లు చేసుకుంటారు. అట్టహాసంగా విందు వినోదాలతో జరిగే పిక్నిక్లలో సంప్రదాయబద్ధంగా వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని ‘హెరింగ్ లంచ్’ అంటారు. ఉప్పుచేపలు, ఊరవేసిన చేపలు, బంగాళ దుంపలు, ఆరుబయట నిప్పుల మీద కాల్చిన మాంసాహార పదార్థాలతో విందు భోజనాలు చేస్తారు. వెండిరంగులో మెరిసే చిన్నచేపలను ‘హెరింగ్’ అంటారు. సంప్రదాయక ఫిన్నిష్ పిక్నిక్ విందులో హెరింగ్ చేపలు తప్పనిసరి. పిక్నిక్ డే: ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఏటా జూలై 14న నేషనల్ పిక్నిడ్ డే జరుపుకొంటారు ఈ రోజు ‘బాస్టీల్ డే’ అని కూడా అంటారు. ఆ రోజున పిక్నిక్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రాన్స్లో ఏటా వేసవి పిక్నిక్లు జరుపుకోవడానికి అనుకూలమైన కాలం. అందువల్ల వేసవి పొడవునా ఫ్రెంచ్ ప్రజలు సెలవు రోజుల్లోను, తీరిక వేళల్లోను ఆరుబయట పిక్నిక్లు చేసుకుంటారు. ఫ్రెంచ్ విప్లవానికి ముందు పిక్నిక్ సంస్కృతి కేవలం సంపన్నులకే పరిమితమై ఉండేది. ఫ్రెంచ్ విప్లవం తర్వాత సామాన్యులకు సైతం ఇది పాకింది. సంప్రదాయ ఫ్రెంచ్ పిక్నిక్ విందుల్లో సంప్రదాయ వంటకాలతో పాటు మద్యానికి కూడా అమిత ప్రాధాన్యం ఉంటుంది. వైన్, షాంపేన్, బ్రాందీ వంటి మదిరానంద పానీయాలు లేకుండా ఫ్రెంచ్ ప్రజలు పిక్నిక్లు జరుపుకోరు. పిక్నిక్ విందుల్లో ఎక్కువగా రకరకాల చీజ్తో చేసిన వంటకాలు, కాల్చిన మాంసాహార వంటకాలను ఆరగిస్తారు. నృత్యగానాలలో ఓలలాడతారు. (చదవండి: ఘనాపాటీలు! అసామాన్యమైన కళతో మతాబుల్లా వెలిగిపోతున్న చిచ్చరపిడుగులు!) -
కొనసాగుతున్న ఎఫ్పీఐ అమ్మకాలు
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, అక్టోబర్లో డెట్ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
ఎమర్జెన్సీపై ఇందిరా గాంధీ వ్యాఖ్యలు.. విలేకరుల ముఖంపై చిరునవ్వులు
భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీపై మాయని మచ్చ ఎమర్జెన్సీ. దీని వల్ల భారత ప్రజలకు, ముఖ్యంగా జర్నలిస్టుల ఆగ్రహానికి గురైంది. దీని కారణంగా ఆమె పార్టీ ఘోరంగా తదుపరి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కూడా. ఆ టైంలో మళ్లీ మీడియా ముందుకుగానీ జర్నలిస్టులను ఎదుర్కొడం గానీ చేయలేక ఏ నాయకుడు లేదా నాయకురాలైనా ఇబ్బంది పడతారు. కానీ తన తప్పును అంగీకరిస్తూ మీడియాను ఎదుర్కొవడమే కాదు జర్నలిస్టులు ఆవేశంతో సంధించే ప్రశ్నల బాణాలకు బెదరకుండా తనదైన శైలిలో సమాధానంచెప్పి వారి కోపాన్ని ఉపశమించేలా చేసింది. వారి ముఖాల్లో నవ్వు తెప్పించి మరో ప్రశ్న తావివ్వకుండా చేసి "దటీజ్ ఇందిరా" అనుపించుకుంది. నేడు ఇందిరాగాంధీ వర్ధంతి(అక్టోబర్ 31) సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చూద్దాం. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా విధించిన అత్యవసర పరిస్థితి లేదా ఎమర్జెన్సీని 71 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కాలంగా అభివర్ణిస్తారు. అప్పటి రాష్ట్రపతి ఫకృదీన్ అలీ "ప్రబలిన అంతర్గత కలవరం" అని పేర్కొంటూ ఉత్తర్వు జారీ చేయడంతో భారతదేశ ప్రజలు ఒక్కసారిగా తమ హక్కులను కోల్పోపయారు. ఈ ఎమర్జెన్సీ 1977 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాల వరకు కొనసాగింది. దీని కారణంగా ఆమె తదుపరి ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యి పదవినీ కోల్పోయింది. సరిగ్గా ఆ టైంలో ఆగ్రహావేశాలతో విదేశీ జర్నలిస్టులు ఆమె వద్దకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించే యత్నం చేశారు. ఆ సమయంలో తన సంయమనాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా వారిని ఎదర్కొవడమే గాక ఆమె చేసిన వ్యాఖ్యలు విలేకరులను మరో ప్రశ్న అడగకుండా చేసి తనకు సాటి లేరని నిరూపించింది. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ఆ విదేశీ విలేకరులంతా చాలా ఆగ్రహంగా..మీరు విధించిన ఎమర్జెన్సీతో పొందిన ప్రయోజనం ఏమిటి అని సూటిగా ప్రశ్నించారు. వాళ్లంతా ఆమె ఏం చెబుతుందా అన్నట్లు అందరూ కళ్లు పెద్దవిగా చేసుకుని చెవులు రిక్కరించి మరీ కుతూహులంగా చూస్తున్నారు. ఆమె చాలా స్థైర్యంతో ఓటమిని ఒప్పుకుంటూ..తాము భారతీయ ప్రజలలోని అన్ని వర్గాలను సమగ్రంగా దూరం చేసుకున్నాం లేదా దూరం చేయగలిగాను అని తెలుసుకున్నా అని చెప్పారు ఇందిరా గాంధీ. ఆ వ్యాఖ్యకు ఒక్కసారిగా జర్నలిస్టులంతా పెద్దగా నవ్వారు. ఆ తర్వాత చాలా నిశబ్ధం..అంతా కామ్ అయిపోయి మళ్లీ మరో ప్రశ్న కూడా వేయకుండా వెనుదిరిగారు. ఆమె మాట్లాడిన తీరు విలేకరుల మనసులను ద్రవింపచేసింది. 1978లో జనిగిన ఈ ఆసక్తికర విషయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017లో తన వీడ్కోలు ప్రసంగంలో పంచుకున్నారు. ఆవిడ ఆ టైంలో కూడా ధైర్యంగా తన ఓటమిని అంగీకరిస్తూ.. మాట్లాడిన మాటలు జర్నలిస్ట్ల ముఖాల్లో నవ్వు తెప్పించినా..వారి ప్రశ్న పరంపరకు అడ్డుకట్ట వేయగలిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంలో జవహర్ లాల్ తరుచుగా చెప్పే వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు ప్రణబ్. "మార్పు" కొనసాగింపు, సమతుల్యత ఎప్పుడూ ఉంటుందని నెహ్రు తరుచుగా చెప్పేవారని అన్నారు. నాయకురాలిగా ఆమె విధానం.. 1971 నాటికి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా పూర్తి ఆధిక్యతను సాధించింది. అలాగే తన పార్టీలోని తన ప్రత్యర్థులను తీవ్రంగా అణచివేయడంతో 1949లో కాంగ్రెస్ ఓ, ఆర్ అనే రెండు గ్రూప్లగా విడిపోయింది. కాంగ్రెస్(ఆర్) అంటే ఇందిరకు అనుకూలమైన మంత్రులని, ఓ అంటే ఆర్గనైజేషన్, సిండికేట్ గా పేరొందిన కాంగ్రెస్ పాతనేతలు కింద విడిపోయింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీలోనూ, పార్టీ ఎంపీల్లోనూ ఎక్కువభాగం ప్రధాని ఇందిర పక్షం వహించారు. అలాగే తన మాట చెల్లించుకునేలా హఠాత్తుగా ఆర్డినెన్స్లు తీసుకొచ్చి ప్రత్యర్థులను షాక్ గురిచేసేది. ఇక 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1970లో రాజభరణాల రద్దు వంటి వామపక్ష అనుకూల, ప్రజారంజకమైన కార్యకలాపాలు, గరీబీ హఠావో! వంటి నినాదాలు ఇందిరకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే అగర్భ శత్రువైనా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంతో ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తాన్గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్గా ఏర్పరిచి పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టింది. అందుకుగానే భారతర్న పురస్కారాన్ని అందుకుంది. అలాగే ఆమెకు మంచి ఎకనమిస్ట్ , భారత సామ్రాజ్ఞి వంటి బిరుదులు అందుకుంది. నియంతలా వ్యవహరిస్తున్నారు అన్న ప్రత్యర్థుల చేతే దుర్గ, చండి వంటి ప్రశంసలు అదుకుంది. ఆమె ప్రధానిగా 1966 నుంచి 1977 వరకు, మళ్లీ 1980 నుంచి 1984లో ఆమె హత్యకు గురయ్యేంత వరకు భారతదేశానికి మూడవ ప్రధానిగా సేవలందించారు. ఆమె దూకుడుగా తీసుకున్న ఎమర్జెన్సీ విధింపు నిర్ణయమే ఆమె జీవితంలో చెరగని మచ్చగా మిగిలిందని చెప్పాలి. (చదవండి: వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?) -
జమ్ముకశ్మీర్పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం
శ్రీనగర్: ఇజ్రాయెల్- పాలస్తీనా సంస్థ హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్లో సంక్షోభం చోటు చేసుకుంది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్లో నిరసనలకు దారితీసే ముప్పును మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా శ్రీనగర్లోని 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. భద్రతా ప్రణాళికల గురించి ఈ సమావేశంలో చర్చించామని, రాబోయే రోజుల్లో నిరసనలు తలెత్తితే, వాటిని ఎలా నిరోధించాలనే దానిపై దృష్టి పెట్టామని ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం దిశగా సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ అత్యున్నత సమావేశంలో విదేశీ ఉగ్రవాదుల పాత్రపై కూడా చర్చ జరిగింది. ఈ ఏడాది జమ్ముకశ్మీర్లో హతమైన 46 మంది ఉగ్రవాదుల్లో 37 మంది పాకిస్తానీలేనని అధికారిక సమాచారం. 9 మంది మాత్రమే స్థానికులు ఉన్నారు. జమ్మూకశ్మీర్లోని 33 ఏళ్ల ఉగ్రవాద చరిత్రలో స్థానిక ఉగ్రవాదుల కంటే విదేశీ ఉగ్రవాదుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం దాదాపు 130 మంది ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా శ్రీనగర్లో జరిగిన ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు, ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ ఉపేంద్ర ద్వివేది అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చినార్ కార్ప్స్ కమాండర్,రాష్ట్ర పరిపాలన, భద్రతా సంస్థల ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎన్నికల బరిలో ‘మిజోరం’ కోటీశ్వరులు -
విజయదశమి వేళ వేదమంత్రాల మధ్య విదేశీ జంటల వివాహ వేడుకలు!
సాక్షి, బెంగళూరు: భారతీయ సంప్రదాయ వివాహ సంస్కృతిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. దీనికి నిదర్శనంగా, జపాన్, మంగోలియా, అమెరికా తదితర దేశాల నుంచి మనదేశానికి విచ్చేసిన జంటలు ఇక్కడి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలోని వైదిక వివాహ మంటపంలో భారతీయ వైదిక సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. విజయదశమి పర్వదినాన జరిగిన ఈ వేడుకకు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆధ్యాత్మిక జ్ఞానం, యోగా, ఆయుర్వేదపు జ్ఞానాన్ని అందిస్తున్న గురుదేవ్, కాలక్రమంలో మరుగున పడుతున్న అనేక భారతీయ సంప్రదాయాలను కూడా పునరుద్ధరించారు. లోతైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగిన సంప్రదాయాలు. మంత్రాలతో కూడిన వైదిక వివాహ విధానం వాటిలో ఒకటి. వర్తమాన భారతీయ వివాహాలలో సంప్రదాయాలు క్రమంగా మరుగున పడి, ఆడంబరాలు పెచ్చుమీరుతున్న ఈ కాలంలో వేదమంత్రాల సాక్షిగా ప్రమాణాలు, ఒకరిపట్ల ఒకరు నిబద్ధత కలిగి ఉండటం వంటి మౌలిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చే వైదిక వివాహాలకు గురుదేవ్ తిరిగి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ప్రాచీన వాఙ్మయం ప్రకారం చూసినపుడు, వివాహ సందర్భంగా పఠించే వేదమంత్రాలు, విశ్వచైతన్యం ఒకటి మాత్రమే అనే సత్యాన్ని పెండ్లి చేసుకునే జంటకు గుర్తుచేస్తూ, వారి మధ్య అనంతకాలం నిలిచి ఉండే బాంధవ్యాన్ని ముడివేస్తాయి. మరోవిధంగా చెప్పాలంటే అన్నం, పప్పుతో కలిసి పూర్ణం అయినట్లుగా అన్నమాట. "ఇది మాపై ఆశీర్వాదాల వర్షం కురిసినట్లు అనిపించింది. ఈ రోజు మాకు సరికొత్త ప్రారంభం.” అని మంగోలియాకు చెందిన జంట బయాస్గలన్, సురేంజార్గల్ తమ అనుభవాన్ని పంచుకున్నారు. "మేము 8 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాము. వైదిక పద్ధతిలో వివాహం జరగాలని నా భాగస్వామి ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉండటం వలన ఇది ఎలా ఉండబోతోందో మాకు తెలుసు. పురోహితుల జపవిధానం, వివాహప్రక్రియ నుండి స్వయంగా గురుదేవుని ఆశీర్వాదాలు పొందడం వరకు వివాహవేడుక చక్కగా సంప్రదాయబద్ధంగా జరిగింది. 17 రకాల శాకాహార వంటకాలతో.. మాకు ఇంతకంటే మరే కోరికా లేదు." అని దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుండి ఇక్కడకు వచ్చి వివాహం చేసుకున్న రే మోంగీ, లారెన్ డెర్బీ-లూయిస్ దంపతులు పేర్కొన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత తొమ్మిది రోజులపాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ప్రాచీన వేద మంత్రోచ్ఛారణలు, పవిత్రమైన హోమాలు, భక్తి సంగీత-నృత్యోత్సవాల శోభతో కూడిన వాతావరణం వెల్లివెరిసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి, దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన లక్షలాది భక్తులు భక్తి, జ్ఞాన, ఆనందసంగమంగా సాగిన నవరాత్రి ఉత్సవాలలో పాలుపంచుకున్నారు. జగదంబను, దేవీశక్తిని పూజించే ఈ ఉత్సవాలలో భాగంగా నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మారిషస్, కెనడా సహా ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలలో చండీహోమం, మన దేశంలో 100 ప్రాంతాలలో దుర్గాహోమం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. దుర్గాష్టమిరోజున ఇక్కడి భక్తులకోసం ఆశ్రమంలోని వంటశాలలో 17 రకాల శాకాహార వంటకాలతో కూడిన భోజనాలు1,20,000 మందికి దేవీ ప్రసాదంగా వండి వడ్డించారు. (చదవండి: దసరా రోజున.. ఈ మూడు రకాల పక్షులను చూసారో.. ఇకపై విజయాలే!) -
మలేషియా యువతిని మోసం చేసిన యువకుడి అరెస్టు
తిరుత్తణి: ప్రేమ పేరుతో విదేశీ యువతిని మోసం చేసిన యువకుడిని తిరుత్తణి పోలీసులు అరెస్టు చేశారు. భగవతాపురం గ్రామానికి చెందిన వెంకట కుప్పరాజు కుమారుడు తిరుమలై కృష్ణన్ (28) బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి మలేషియాకు చెందిన నాగజ్యోతి అనే యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మిత్రులయ్యారు. కొద్దికాలానికి ప్రేమికులుగా మారారు. ఫలితంగా నాగజ్యోతి తరచూ ఇండియాకు వచ్చి చైన్నెలో తిరుమలై కృష్ణన్ను కలిసేది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. తనకు వేరొక యువతితో నిశ్చితార్థం జరిగిందని ఇకపై తనతో టచ్లో వద్దని తిరుమలై కృష్ణన్ చెప్పడంతో నాగజ్యోతి మలేషియా నుంచి తిరుత్తణి చేరుకుంది. తనను వివాహం చేసుకోవాలని నిలదీసింది. హత్యా బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రాఖీకుమారి కేసు నమోదు చేసి తిరుమలై కృష్ణన్ను అరెస్టు చేశారు. -
రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు
హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్థిరాస్తి రంగం హాట్కేక్లా మారింది. దీంతో దేశీయ స్థిరాస్తి రంగంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తు తున్నాయి. పెట్టుబడి లావాదేవీలలో పారదర్శకత, విధానపరమైన సంస్కరణలు, వ్యాపారాలకు ప్రోత్సాహం, పారిశ్రామిక రంగంలో సాంకేతికత వంటివి ఇన్వెస్టర్ల ఆకర్షణకు ప్రధాన కారణాలని కొలియర్స్ నివేదిక వెల్లడించింది. 2017-22 మధ్య కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలోకి 32.9 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. అదే 2011-16 మధ్య కాలంలో అయితే 25.8 బిలియన్ డాలర్లు వచ్చాయి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్లో విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్ఐఐ) వాటా 2017-22 మధ్య కాలంలో రూ.2.18 లక్షల కోట్లు (26.6 బిలియన్ డాలర్లు), కాగా.. 2011-16లో కేవలం 8.2 బిలియన్ డాలర్లు మాత్రమే. గత ఆరేళ్ల కాలంతో పోలిస్తే 2017-22లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా వచ్చాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ విదేశీ సంస్థాగత పెట్టుబడులలో 70 శాతం అమెరికా, కెనడా దేశాల నుంచే వచ్చా యి. యూఎస్ నుంచి 11.1 బిలియన్ డాల ర్లు, కెనడా నుంచి 7.5 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మన దేశంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర కారణాలతో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
అమెరికాలో వివాహేతర సంబంధం.. అందుకే పదవి ఊడింది..
న్యూయార్క్: చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కాలంలో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని చైనా దర్యాప్తులో తేలినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ కారణంగానే చైనా ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది. క్విన్ గ్యాంగ్ వివాహేతర సంబంధంతో అమెరికాలో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అమెరికాలో వివాహేతర సంబంధంతో ఓ బిడ్డకు క్విన్ గ్యాంగ్ తండ్రి అయ్యాడని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే.. ఈ వ్యవహారంలో క్విన్ గ్యాంగ్ దేశ భద్రతను పణంగా పెట్టారా..?లేదా..? అనే అంశంపై చైనా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరమైన పోటీ నడుస్తున్న క్రమంలో ఈ అంశం చైనాకు పెను సవాలుగా మారింది. క్విన్ గ్యాంగ్ను నియమించిన ఏడు నెలలకే చైనా అయన్ని పదవి నుంచి తొలగించింది. ఇంత తక్కువ సమయంలో పదవి నుంచి తొలగించడానికి గల కారణాలను కూడా చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. ఇలాంటి అస్థిరమైన నిర్ణయాలతో జిన్పింగ్ ప్రభుత్వం కూడుకుని ఉందని వాల్స్ట్రీట్ పేర్కొంది. చైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు విదేశాల్లో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలోను దర్యాప్తులు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: భారత్పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
Chandrababu Naidu: ఆ నాలుక ఎలాగైనా మడత పడుద్దీ.!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు మాటలకు ఆయన చేసే పనులకు పొంతన ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు. ఇప్పటికీ హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది తానేనని, సెల్ఫోన్ తీసుకొచ్చింది కూడా తానే అంటూ పదే పదే గప్పాలు కొట్టుకుంటున్న బాబు.. ఏపీలో అభివృద్ధి అనే అంశాన్ని తీసుకుని ప్రతిసారీ అవే మాయావి మాటలు వల్లెవేశారు. ముఖ్యంగా అమరావతి విషయంలో చేవ లేని కబుర్లు చెప్పి తనదైన శైలినే ప్రదర్శించారు బాబు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. రాజధానిని అలా కడతాను, ఇలా తీర్చిదిద్దుతాను, ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తానంటూ అంటూ తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేశారు. సింగపూర్, జపాన్, లండన్, దావోస్ ఇలా ఒక్కటేంటి.. వెళ్లిన ప్రతి చోటా అక్కడి ప్రాంతంలాగా ఏపీని మార్చుతానని సొల్లు కబుర్లు చెబుతూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. ప్రజాధనంతో ఫారిన్ టూర్లు చేసి.. ప్రజలను ఏమార్చడానికి కల్లబొల్లి ప్రకటనలు చేశారు. తీరా చూస్తే ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏమీ చేయలేని అసమర్థతను, అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్నీ కట్టలేని తన చేతకానితనాన్ని నిరూపితం చేసుకున్నారు. చంద్రబాబు నోటి నుంచి రాలే అణిముత్యాలు కేవలం ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేసే ఎత్తుగడ మాత్రమేనని.. ఆయన ఏం చెప్పినా.. వాటి వెనుక స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయనడానికి కింద తెలిపిన వివరాలే నిదర్శనం.. Nov 3 ,2014 : 3 రోజుల సింగపూర్ పర్యటన...జిల్లాకో ఎయిర్పనోర్టు తీసుకోస్తాం అని ప్రకటన. Nov 24,2014 : 6 రోజుల జపాన్ పర్యటన....ఆంధ్రప్రదేశ్ లోని అన్ని యూనివర్సిటీలలో జపనీస్ భాషని ప్రవేశపెడతాం అని ప్రకటన. జనవరి 20,2015: 4 రోజుల దావోస్ పర్యటన...స్పెయిన్ బులెట్ ట్రైన్ మీద స్టడీ చేసి అలాంటిదే ఆంధ్రప్రదేశ్ లో తీసుకోస్తాం అని ప్రకటన. ఏప్రిల్ 15,2015 : 6 రోజుల చైనా పర్యటన...షాంఘై లాగా అమరావతిని నిర్మిస్తాం. జులై 5,2015 : 3 రోజుల జపాన్ పర్యటన...టోక్యో లాగా అమరావతిని నిర్మిస్తాం. ఆగస్ట్ 3,2015 : 6 రోజుల టర్కీ పర్యటన...ఇస్తాంబుల్ లాగా అమరావతిని కడతాం. సెప్టెంబర్ 20,2015: 3 రోజుల సింగపూర్ పర్యటన....అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం...తుళ్లూరుని సింగపూర్గా చేస్తాం. జనవరి 16,2016: 4 రోజుల దావోస్ పర్యటన....అమరావతికి పెట్టుబడుల వరద రాబోతుంది. మార్చ్ 11,2016 : 3 రోజుల లండన్ పర్యటన...అమరావతిలో లండన్ ఐ ని నిర్మిస్తాం. మే 8,2016 : 6 రోజుల థాయిలాండ్, స్విట్జర్లాండ్ టూర్.....ఫామిలీ టూర్ అని చెప్పాడు... బహుశా స్విస్ బ్యాంకులో ఏదో పని ఉండి ఉండొచ్చు...అది divert చేయడానికి థాయిలాండ్ మీదుగా ఫ్యామిలితో స్విట్జర్లాండ్ వెళ్ళాడు. జూన్ 27,2016 : 6 రోజుల చైనా టూర్...ఆంధ్రప్రదేశ్లో బులెట్ ట్రైన్ తీసుకొస్తా. జులై 9,2016 : 2 రోజుల కజాకిస్తాన్ టూర్...కేబుల్ కార్లని ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తా. జులై 16,2017 : 3 రోజుల రష్యా టూర్...ఆంధ్రప్రదేశ్ లో మెరైన్ యూనివర్సిటీ స్టాపిస్తామని ప్రకటన. జనవరి 8,2017 : 2 రోజుల శ్రీలంక టూర్ ...అమరావతికి శ్రీలంక మాస్టర్ ప్లాన్ అని ప్రకటన. జనవరి 16,2017: 3 రోజుల దావోస్ టూర్....మాస్టర్ కారిడార్ వైజాగ్కు తీసుకొస్తామని ప్రకటన. మే 4,2017 : 8 రోజుల అమెరికా టూర్... వైజాగ్కు ఫ్రాంక్లిన్ టెంపులెటన్ తీసుకొస్తా అని ప్రకటన. అక్టోబర్ 19,2017: 8 రోజుల చికాగో, దుబాయ్, లండన్ల పర్యటన...ఆంధ్రప్రదేశ్ లో ఏరో సిటీ కడతాం,దుబాయ్ నుండి ఆంధ్రప్రదేశ్కు కనెక్టివిటీ ,లండన్ తరహా ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్రప్రదేశ్లో తీసుకోస్తాం అని ప్రకటన. డిసెంబర్ 4 ,2017 : 4 రోజుల సౌత్ కొరియా టూర్,అమరావతిని సౌత్ కొరియా రెండో రాజధానిగా చేస్తాం అని ప్రకటన. ఇవీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాధనంతో చేసిన ఫారిన్ టూర్లు, ప్రజలని ఏమార్చడానికి 2014 నుంచి 2017 చేసిన ప్రకటనలు.... 2018,19 ఫారిన్ టూర్స్ గురించి మాత్రం చెప్పట్లేదు. -
విశాఖలో విమాన ప్రయాణికుల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంతో పాటు కడపకు విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు అంటే.. ఏప్రిల్ నుంచి జూలై వరకు విమాన ప్రయాణికుల గణాంకాలను గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్యలో 33.93 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య కాలంలో విశాఖపట్నం నుంచి 7,74,925 మంది ప్రయాణిస్తే ఈ ఏడాది అదే సమయానికి 10,37,656 మంది ప్రయాణించారు. కడప విమానాశ్రయం 36.1 శాతం వృద్ధి నమోదు చేసింది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య 20,289 మంది ప్రయాణించగా.. ఆ సంఖ్య ఈ ఏడాది 27,612కు పెరిగింది. ఇక విజయవాడ ఎయిర్పోర్టు 19.3 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రయాణికుల సంఖ్య 3.09 లక్షల నుంచి 3.68 లక్షలకు పెరిగింది. రాజమండ్రి ఎయిర్పోర్టుకు కూడా గణనీయంగా ప్రయాణికులు పెరిగారు. కాగా, ఈ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల సంఖ్యలో 22.6 శాతం వృద్ధి నమోదైంది. తిరుపతి, కర్నూలు ఎయిర్పోర్టుల్లో మాత్రం ప్రయాణికుల సంఖ్యలో స్వల్ప క్షీణత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం ఆరు ఎయిర్పోర్టుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో 18,84,926 మంది ప్రయాణించారు. దేశం మొత్తం మీద చూస్తే ఆ నాలుగు నెలల కాలంలో విమాన ప్రయాణికుల సంఖ్య 10.04 కోట్ల నుంచి 12.30 కోట్లకు చేరుకుంది. పెరిగిన విదేశీ ప్రయాణికులు రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా ఉన్నప్పటికీ ప్రస్తుతం విశాఖ, విజయవాడ విమానాశ్రయాల నుంచి మాత్రమే విదేశీ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. త్వరలో తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు సర్వీసులు ప్రారంభించే విధంగా ప్రభుత్వం కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. విశాఖ నుంచి విదేశీ ప్రయాణికుల సంఖ్య 20.9 శాతం వృద్ధితో 20,097 నుంచి 24,143కు చేరితే, విజయవాడలో 14.4 శాతం వృద్ధితో 14,978 నుంచి 17,135కు చేరుకుంది. -
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో 87 శాతం మంది ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ) పాసవడం కష్టతరంగా మారింది. ఇటీవల జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలో 13 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులైనట్లు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీఈ) ప్రకటించింది. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుపై విమర్శలు వస్తున్నాయి. నాణ్యమైన వైద్య విద్య ఆయా దేశాల్లో ఉండటం లేదన్న ఆరోపణలకు ఈ ఫలితాలు నిదర్శనంగా చెబుతున్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మన దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు, లైసెన్స్ పొందడానికి, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్కు, పీజీ మెడికల్ చదవడానికి ఎఫ్ఎంజీఈ పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షకు ఆ నాలుగేళ్లలో 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే ఆ నాలుగేళ్లలో కేవలం 14.22 శాతమే పాస్ అయ్యారు. ఈ ఏడాది అది మరింత తక్కువగా ఉండటం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జూలైలో 24,269 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయగా, కేవలం 3,089 మందే పాసయ్యారు. మిగిలిన 21,180 మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఏకంగా 87 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. చైనా, రష్యాలకు ఎక్కువగా వెళుతుండగా, ఆయా దేశాల్లో చదివినవారిలో తక్కువ శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ విద్యార్థి ఈ ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు మాత్రమే అవకాశముంటుంది. కొన్ని దేశాలు, కొన్ని కాలేజీల్లో నాసిరకమైన వైద్య విద్య ఉండటం, మన దేశంలోని వైద్య విద్యకు సమాన స్థాయిలో ప్రమాణాలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. పైగా చైనా, రష్యాల్లో ఆయా దేశ భాషలోనే వైద్య విద్య నేర్చుకుంటారు. ఇక్కడకు వచ్చాక ఎఫ్ఎంజీఈ పరీక్ష ఇంగ్లిష్లో ఉంటుంది. దీనివల్ల చాలామంది ఫెయిల్ అవుతున్నారు. పైగా ఎఫ్ఎంజీఈ పూర్తిగా థియరీగా ఉండటం వల్ల కూడా ఫెయిల్ అవుతున్నట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకేల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమాన వైద్య విద్య పూర్తి చేసినవారికి మన దేశంలో ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయాల్సిన అవసరంలేదు. . ఎక్కువ ఫీజుతో విదేశాలకు దేశంలో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని పెరుగుతున్నా, డిమాండ్కు తగినంతగా సీట్లు లేకపోవడంతో అనేకమంది విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 20.38 లక్షల మందికి విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 11.45 లక్షల మంది అర్హత సాధించారు. కానీ మన దేశంలో కేవలం 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్లే ఉన్నాయి.దీంతో మన దేశంలో సీటు రానివారు, విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తుంటారు. మరికొందరు మన దేశంలోనే ఎండీఎస్ లేదా ఆయుష్ కోర్సులు చేస్తుంటారు. ఇక మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాగా, తెలంగాణ నుంచి ఈ ఏడాది 72,842 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. అందులో 42,654 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఇంకా చాలామంది సీటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు ఎక్కువగా ఉంటాయి. కోర్సు పూర్తి చేయాలంటే బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ. 23.10 లక్షల వరకు ఉంటుంది. ఆయా దేశాల్లో ఫీజు తక్కువే కానీ.. అదే విదేశాల్లో చదివితే దేశాన్ని బట్టి ఎంబీబీఎస్ కోర్సు మొత్తం పూర్తి చేసేందుకు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల ఫీజు మాత్రమే ఉంటుంది. దీంతో చాలామంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, పిలిఫ్పైన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా తదితర దేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. -
పోస్టాఫీసుల నుంచే ఫారిన్కు పార్శిల్
సాక్షి, అమరావతి: విదేశాల్లో ఉన్న మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు పార్శిళ్లు పంపించడం మరింత సులభతరం కానుంది. మీ సమీపంలోని పోస్టాఫీసు నుంచే ఫారిన్కు పార్శిళ్లు పంపించవచ్చు. ఇందుకోసం దేశంలో భారీగా పోస్టాఫీసులకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ శాఖ అనుమతించింది. పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్విసులను కొన్నేళ్ల క్రితమే ప్రవేశపెట్టారు. కానీ, వాటిని అతి తక్కువ పోస్టాఫీసులకే పరిమితం చేశారు. దీంతో విదేశాలకు పార్శిళ్లు పంపించాలంటే దూరంగా ఉన్న పోస్టాఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. లేదా అధిక రుసుము చెల్లించి ప్రైవేట్ కొరియర్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యను గుర్తించి పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్విసులను దేశవ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలని కేంద్ర ఎక్సైజ్–కస్టమ్స్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా కొత్తగా 715 పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్వీసులను అనుమతించింది. త్వరలోనే కొత్తగా అనుమతించిన పోస్టాఫీసుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో 4 నుంచి 24కు పెంపు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 55 పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్వీసులకు అనుమతించారు. వాటిలో హెడ్ పోస్టాఫీసులు(హెచ్వో), సబ్ పోస్టాఫీసులు(ఎస్వో) కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు నాలుగు పోస్టాఫీసుల నుంచే విదేశాలకు పార్శిల్ సర్వీసులు అందిస్తున్నారు. కొత్తగా 24 పోస్టాఫీసుల నుంచి ఈ సేవలు అందించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు తెలంగాణలో కేవలం ఒక్క పోస్టాఫీసు నుంచే విదేశాలకు పార్శిల్ చేసేందుకు అవకాశం ఉంది. తాజాగా 31 పోస్టాఫీసులకు అనుమతించారు. ఏపీలో కొత్తగా అనుమతించిన పోస్టాఫీసులు శ్రీకాకుళం హెచ్వో, విజయనగరం హెచ్వో, పార్వతీపురం హెచ్వో, అనకాపల్లి హెచ్వో, పాడేరు హెచ్వో, అమలాపురం హెచ్వో, కాకినాడ హెచ్వో, సామర్లకోట హెచ్వో, రాజమహేంద్రవరం హెచ్వో, తాడేపల్లిగూడెం హెచ్వో, మచిలీపట్నం హెచ్వో, విజయవాడ పాలిటెక్నిక్ ఎస్వో, గుంటూరు హెచ్వో, నరసరావుపేట హెచ్వో, బాపట్ల హెచ్వో, ఒంగోలు హెచ్వో, చిత్తూరు హెచ్వో, రాయచోటి హెచ్వో, కడప హెచ్వో, కర్నూలు హెచ్వో, నంద్యాల హెచ్వో, అనంతపురం హెచ్వో, ప్రశాంతినిలయం ఎస్వో, విజయవాడ బకింగ్హామ్పేట ఎస్వో. తెలంగాణలో కొత్తగా అనుమతించిన పోస్టాఫీసులు హైదరాబాద్ జీపీవో, భూపాలపల్లి ఎస్వో, జగిత్యాల హెచ్వో, జేఎన్టీయూ కూకట్పల్లి ఎస్వో, కొత్తగూడెం కోల్స్ హెచ్వో, మహబూబాబాద్ హెచ్వో, మహబూబ్నగర్ హెచ్వో, నిర్మల్ ఎల్ఎస్జీ ఎస్వో, వనస్థలిపురం ఎస్వో, వికారాబాద్ హెచ్వో, మంచిర్యాల హెచ్వో, మెదక్ హెచ్వో, ములుగు బి–క్లాస్ ఎస్వో, నాగర్కర్నూల్ ఎస్వో, నల్లగొండ హెచ్వో, నారాయణపేట ఎస్వో, భువనగిరి హెచ్వో, హన్మకొండ హెచ్వో, జనగాం హెచ్వో, కామారెడ్డి హెచ్వో, ఖమ్మం హెచ్వో, సిరిసిల్ల ఎస్వో, సిర్పూర్ కాగజ్నగర్ ఎస్వో, సూర్యాపేట హెచ్వో, లక్ష్మీపూర్ ఎస్వో, వనపర్తి హెచ్వో, గద్వాల్ హెచ్వో, నిజామాబాద్ హెచ్వో, పెద్దపల్లి హెచ్వో, ఆర్సీ పురం హెచ్ఈ ఎస్వో, షాద్నగర్ ఎస్వో. -
‘భారత్’తో బంధాన్ని తెంపేసుకుంటున్నారు. ఎందుకు వెళ్తున్నారు..?
ఆదాయార్జన, మెరుగైన సేవలు,మరిన్ని సౌకర్యాలు, వాతావరణానికి,పరిస్థితులకు అలవాటు పడిపోవడం..కారణం ఏదైనా కావొచ్చు..వీటన్నిటినీ సానుకూల అంశాలుగానే భావించడం వల్ల అయ్యిండొచ్చు. ఏటా వేలు, లక్షల సంఖ్యలో భారతీయులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. విదేశాల్లో స్థిరపడిపోతున్నారు. ఆయా దేశాల పౌరులుగా మారిపోతున్నారు. అక్కడి పౌరసత్వం కోసం భారతీయ పౌరసత్వం వదులుకుంటున్నారు. పుట్టి, పెరిగిన దేశంతో ఉన్న ‘బంధాన్ని’తెంపేసుకుంటున్నారు. దేశ పౌరుడిగా ఉన్న గుర్తింపునకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇలా విదేశాల్లో పౌరసత్వం తీసుకుంటున్న వారిలో విద్యావంతులు, ధనికులు, విశేషాధికారాలను పొందుతున్న వారే ఎక్కువగా ఉండగా, ఇలా విదేశీ పౌరసత్వం తీసుకుంటున్నవారి సంఖ్య ఏటా పెరుగుతుండటం గమనార్హం. -సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ విదేశీ పౌరసత్వానికే ఓటు గడిచిన పుష్కర కాలంలో ఏకంగా సుమారు 18 లక్షల మంది మన దేశ పౌరుని హోదాను వదులుకున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఉన్న విధంగా భారత్లో ఉమ్మడి పౌరసత్వానికి ఆమోదం లేకపోవడంతో భారతదేశ పౌరసత్వాన్ని (సిటిజెన్షిప్) కాదనుకుని విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 135 దేశాల్లో అక్కడి సిటిజెన్ షిప్ తీసుకున్న భారతీయులు ఉన్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నా్నయి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లేవారు ఉద్యోగం సంపాదించి ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోతున్నారు. వీరితో పాటు వర్క్ వీసాలపై వెళ్లేవారిలో ఎక్కువమంది భారత పౌరసత్వాన్ని వదులుకుని అక్కడి సిటిజెన్లుగా మారేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక దేశంలో అధిక ఆదాయం కలిగిన వారు, ఇతరులు కూడా విదేశాల్లో స్థిరపడే ఉద్దేశంతో భారత్ వదిలిపోతున్నారు. భారతదేశంలో అధిక ఆదాయం కలిగిన ఎనిమిది వేల మంది ఈ ఏడాది దేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశీ పౌరసత్వం తీసుకోనున్నట్లు.. ‘గ్లోబల్ సిటిజెన్ షిప్ అండ్ రెసిడెన్స్ అడ్వాన్సెస్’పై అధ్యయనం చేసే లండన్లోని ‘హెన్లీ అండ్ పార్టనర్స్’అనే సంస్థ ఇటీవల వెల్లడించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 87 వేల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్లారు. 12 ఏళ్లలో 18.5లక్షల మందివెళ్లిపోయారు.. ప్రతి ఏడాదీ లక్షకు పైగా భారతీయులు విదేశీ పౌరసత్వాన్ని పొందుతున్నారు. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. వీరిలో దాదాపు 60 శాతానికి పైగా ప్రజలు ఏడు దేశాల్లోనే పౌరసత్వం తీసుకుంటున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆ్రస్టేలియా, జర్మనీ, ఇటలీ వీటిల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు సింగపూర్లోనూ పౌరసత్వం తీసుకోవడానికి భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్లకు వెళ్లే వారిలో గోవా, పంజాబ్, గుజరాత్, తమిళనాడు, కేరళకు చెందినవారు ఎక్కువగా ఉంటున్నారు. ఇక్కడి పౌరసత్వం వదులుకునే క్రమంలో ఇచ్చే దరఖాస్తులో పొందుపరిచిన వివరాలను బట్టి ఇది వెల్లడైంది. ఎందుకు వెళ్తున్నారు..? విదేశీ పౌరసత్వం తీసుకుంటున్న వారిని ఏయే అంశాలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయనేది పరిశీలిస్తే.. ప్రధానంగా భారత్లో కంటే మెరుగైన జీవన ప్రమాణాలు, సంపద, ఎక్కువ అవకాశాలు, తక్కువ కాలుష్యం, పిల్లలకు మంచి భవిష్యత్తు వంటివి కారణాలుగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో ఆయారంగాల్లో విజయం సాధించిన వారు సైతం విదేశీ పౌరసత్వాన్ని కోరుకుంటున్నట్లు వెల్లడవుతోంది. వర్క్ వీసాలపై వెళ్లేవారు కూడా భారత్కు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అక్కడే పౌరసత్వం కోసం ప్రయతి్నస్తున్నారు. భారత్లో పన్నుల విధానం నచ్చని వారు.. తక్కువ ఆదాయ పన్ను వసూలు చేసే దేశాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఆయా దేశాల్లో ఎక్కువ నైపుణ్యం ఉన్న వారి కొరత.. భారతీయులకు అక్కడ శాశ్వత పౌరసత్వం కలి్పంచడానికి ఓ కారణంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఇక అధిక నెట్వర్త్ ఉన్న వ్యాపారవేత్తలు ఎక్కువగా దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, ఫ్రాన్స్, మాల్టా వంటి దేశాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఐరోపా దేశాల్లో డాక్టర్లు, నర్సులు, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీ షియల్ ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన ఐటీ ప్రొఫెషనల్స్తో పాటు వెల్డర్స్, ప్లంబర్స్, ఎల్రక్టీషియన్స్, కార్పెంటర్లకు డిమాండ్ బాగా ఉంది. వీరు కూడా అక్కడ పనిచేయడానికి వెళ్లి అక్కడి పౌరసత్వం పొందుతున్నారని చెబుతున్నారు. అమెరికా లేదా సింగపూర్ పౌరులైతే.. అమెరికా, సింగపూర్, జపాన్ దేశాల పౌరులైతే.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లడానికి వీసా ఇబ్బందులు పెద్దగా లేకపోవడం కూడా ఆయా దేశాల సిటిజన్లుగా మొగ్గుచూపడానికి ఓ కారణంగా చెబుతున్నారు. మన దేశం నుంచి అమెరికాకు పర్యాటక (టూరిస్ట్) వీసా మీద వెళ్లాలంటే.. ఆ వీసా స్లాట్ కోసమే దాదాపు ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. మళ్లీ భారత పౌరసత్వం కష్టమే..! భారత పౌరసత్వాన్ని వదులుకోవడం ఒకింత సులభమే అయినా, మళ్లీ భారత పౌరసత్వం పొందాలంటే మాత్రం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. స్థిరాస్తుల కొనుగోలు, ఇతర అంశాల విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. దేశంలో సంపాదించి వెళ్లిపోయేవారు ప్రమాదం భారత్ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారందరిలో.. దేశంలోని అన్నిరకాల వనరులు ఉపయోగించుకుని బాగా సంపాదించాక ఆ డబ్బుతో యూఎస్, ఆ్రస్టేలియా, ఐరోపా దేశాల్లో పౌరసత్వం తీసుకుంటున్న వారిని అత్యంత ప్రమాదకారులుగా చూడాల్సి ఉంటుంది. ఉద్యోగం, విద్య, తదితర కారణాలతో విదేశాలకు వెళ్లిన వారు కొన్నేళ్లు పోయాక అక్కడే స్థిరపడడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వీరంతా వేరే కేటగిరీ కిందకు వస్తారు. ఇక్కడ సంపాదించిన దానికి ఆదాయపు పన్నులు కట్టకుండా ఎగ్గొట్టి ఇతర దేశాల్లో కంపెనీలు పెట్టడం, ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టి స్థిరనివాసం ఏర్పరుచుకోవడం వంటివి చేస్తున్నారు. యూఎస్, యూకే తదితర దేశాలు.. ఇమ్మిగ్రేషన్ పాలసీలో భాగంగా పరిశ్రమలు పెట్టినా, కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినా పౌరసత్వం ఇస్తున్నాయి. గుజరాత్, పంజాబ్లకు చెందిన కొన్ని ప్రాంతాలవారు యూఎస్, కెనడా వంటి దేశాలకు వలస వెళ్లాలన్న లక్ష్యంతోనే ఉండడం గమనార్హం. యూఎస్లో గుజరాతీలు హోటల్ వ్యాపారంపై పట్టు సాధించగా, కెనడాలో పంజాబీలు వ్యవసాయంలో, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. – ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి,ప్రముఖ ఆర్థిక వేత్త, హెచ్సీయూ మాజీ డీన్ -
పాఠం కోసం ఫారిన్ వెళదాం చలోచలో!
ఇంగ్లాండ్లో అడుగు పెడుతూనే ‘ఎలాగో జ్ఞాపకం పెట్టుకొని కుడికాలే పెట్టాను. నిజానికి అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు. బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒక్కటే’ అనుకుంటాడు పార్వతీశం. బారిష్టరు చదువు కోసం ఉన్న పల్లెటూరు నుంచి ఇంగ్లాండ్కు వెళ్లిన పార్వతీశం తెలియని భాష, మనుషులు, సంస్కృతుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ మనల్ని తెగ నవ్విస్తాడు. కాలం మారినంత మాత్రాన, చదువు కోసం వెళ్లినవారికి దేశం కాని దేశంలో సమస్యలు ఉండవని కాదు. అవి వేరే రకంగా ఉండవచ్చు. అవి ఏ రకంగా ఉన్నా సరే... యూత్ వాటిని లైట్గా తీసుకుంటుంది. విదేశీ యూనివర్శిటీలలో చదువుపై బోలెడు లవ్వు చూపుతోంది... విదేశీ చదువు అనేది ఒకప్పుడు సంపన్న వర్గాల వారికి మాత్రమే పరిమితమైన విషయం. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. ఆర్థికస్థాయి, చిన్నా, పెద్దా పట్టణాలు అనే తేడా లేకుండా ఎంతోమంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. ఎనభైలలో ఫారిన్ యూనివర్శిటీ అంటే ఎక్కుమందికి అమెరికాలోని యూనివర్శిటీలు మాత్రమే. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు రిమోట్ ఈస్ట్ యూరోపియన్ దేశాలపై కూడా యువత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ‘ఎందుకు ఇలా?’ అనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. అందులో ఒకటి... ‘పాఠ్యపుస్తకాలను, తరగతి గదినీ దాటి మన విద్యావ్యవస్థ బయటికి రాలేకపోతోంది. పాఠ్యాంశం యూత్కు దగ్గర కాలేపోతోంది’ దిల్లీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల శ్రేయకు ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ అంటే ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను అమెరికాలోని ‘జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ వరకు తీసుకువ్చంది. ‘ఈ యూనివర్శిటీ డిగ్రీ మాత్రమే ఇవ్వదు. ఎంతో అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది’ అంటుంది శ్రేయ. ఫ్లెక్సిబుల్ కరికులమ్ నుంచి ప్రపంచంలోనే అత్యున్నతమైన బోధన సిబ్బంది వరకు ఆ యూనివర్శిటీ గురించి చెప్పుకోదగిన అంశాలను ప్రస్తావిస్తుంది శ్రేయ. ‘విద్యార్థులు తమను తాము వ్యక్తీకరించుకునే అనుభవ జ్ఞానాన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు ఇస్తాయి’ అంటున్నారు దిల్లీ యూనివర్శిటీ మాజీ వైస్–ఛాన్సలర్ దినేష్ సింగ్. అయితే ‘అత్యున్నత ప్రవణాలతో కూడిన చదువు’ మాత్రమే మన విద్యార్థులు దేశం దాటడానికి కారణం కావడం లేదు. ‘భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో గడపడం, ఇతర దేశాల విద్యార్థులతో కలిసి చదువుకొనే అవకాశం దానికదే ఒక ఎడ్యుకేషన్’ అనే అభిప్రాయం కూడా విదేశీ విశ్వవిద్యాలయాలపై ఆసక్తికి కారణం అవుతుంది. ‘విదేశీ యూనివర్శిటీలలో చదువుకోవడం అనేది మన విద్యావ్యవస్థను తక్కువ చేయడం కాదు. మన పరిధిని విస్తృతం చేసుకోవడం మాత్రమే’ అంటుంది పుణెకు చెందిన సుమన. దిల్లీకి చెందిన 19 సంవత్సరాల సైబా బజాజ్ కెనడాలోని ‘యూనివర్శిటీ ఆఫ్ మనిటోబ’లో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ‘విదేశాలలో చదువు అనేది డిగ్రీలను మించినది. ఇది ఒక రకంగా సెల్ఫ్–జర్నీ’ అంటుంది సైబా. బెంగళరుకు చెందిన ప్రతిభా జైన్ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు చేయడానికి యూకేకు వెళ్లాలనుకుంటోంది. ఈ మావ\త్రం దానికి అక్కడిదాకా వెళ్లాలా! అనిపిస్తుందిగానీ ప్రతిభ వెర్షన్ వేరు. ‘యూకేకు వెళ్లాలనుకోవడానికి కారణం... అక్కడి యూనివర్శిటీ ఫర్ ది క్రియేటివ్ ఆర్ట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ప్రపంచంలో పెద్ద పేరు ఉండడం ఒక కారణం అయితే, సాంస్కృతిక వైవిధ్యం, గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది రెండో కారణం. మూడోకారణం ఒకేరకమైన అభిరుచులు ఉన్న వారితో, సబ్జెక్ట్కు సంబంధించిన నిపుణులతో కలిసి నెట్వర్క్గా ఏర్పడే అవకాశం ఉండడం’ అంటుంది ప్రతిభ. జాబ్ మార్కెట్లో సులువుగా విజయం సాధిస్తారు అనే ధీమా వల్ల, మల్టీ కల్చరల్ యూనివర్శిటీలలో తమ పిల్లలను చదివించడానికి పేరెంట్స్ ఆసక్తి చూపుతున్నారు. పక్కా ఫైనాన్స్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ లోన్ల వల్ల పిల్లలను విదేశీ యూనివర్శిటీలలో చదివించడం చాలామంది పేరెంట్స్కు పెద్ద సమస్య కావడం లేదు. తల్లిదండ్రుల ఆసక్తిని గమనించి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు ఎడ్యుకేషన్ లోన్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. మరోవైపు ‘అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్’కు బెస్ట్ ఎన్బీఎఫ్సీలు ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పేరెంట్స్. టెస్ట్–ప్రిపేరేషన్, కంట్రీ, కోర్సు, యూనివర్శిటీ ఎంపిక, డాక్యుమెంటేషన్ ప్లానింగ్... మొదలైన వాటిలో స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీలపై ఆధారపడుతోంది యూత్. జపాన్ అయినా ఓకే అబ్రాడ్ ఎడ్యుషన్ అనగానే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ... మొదలైన దేశాలు గుర్తుకు వస్తాయి తప్ప జపాన్ గుర్తుకు రావడం జరగదు. అయితే గణాంకాల ప్రకారం జపాన్ యూనివర్శిటీలలో చదివే మన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం జపాన్లోని 20 యూనివర్శిటీల ప్రతినిధులు దిల్లీ, పుణె, చెన్నైలలో హైస్కూల్, కాలేజీలలో నిర్వహింన ఎడ్యుకేషన్ ఫెయిర్కు మం స్పందన లభించింది. (చదవండి: ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే) -
మంత్రి శ్రీనివాస్ గౌడ్తో విదేశీ పారిశ్రామికవేత్తల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపదపై అధ్యయనానికి వచ్చిన విదేశీ యువ పారిశ్రామికవేత్తలు.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ను మంగళవారం కలిశారు. యూత్ అంబాసిడర్స్ ప్రోగ్రాం(వైఏపీ)లో భాగంగా ఆ్రస్టియా, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్, బెల్జియం దేశాలకు చెందిన 13 మంది యువ పారిశ్రామికవేత్తలు 15 రోజుల పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ని సచివాలయంలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రాముఖ్యత, చారిత్రక, వారసత్వ సంపద, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఇండ్రస్టియల్ పాలసీ, ఐటీ, ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి విషయాలను వారికి మంత్రి వివరించారు. కార్యక్రమంలో యూత్ అంబాసిడర్స్ కో–ఆర్డినేటర్ నవీన్ మల్వేతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
శిశువు దత్తత వ్యవహారంలో అనూహ్య ఘటన.. చివరికి విషాదం..
సాక్షి, వరంగల్: వరంగల్లో విదేశీ దంపతుల శిశువు దత్తత వ్యవహారంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హనుమకొండలోని శిశువిహార్కు చేరేంత వరకు చలాకీగా ఉన్న ఏడు నెలల పాప.. చివరికి మత్యుఒడికి చేరుకుంది. గురువారం ఉదయం పిల్లల డాక్టర్ నవీన్ వద్ద వైద్యపరీక్షలు చేస్తే అంతా సాఫీగానే ఉన్నా.. గురువారం రాత్రితోపాటు శుక్రవారం ఉదయం పాపకు పలుచటి విరేచనాలు కావడంతో మందులు ఇచ్చినా తగ్గలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లినా గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. అయితే ఇది శిశువిహార్ సిబ్బంది నిర్లక్ష్యమా లేదా దీని వెనుక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అనేది పోలీసులు తేల్చాల్సిన అవసరముంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విదేశీ దంపతుల అక్రమ దత్తత కేసు ఇంకా విచారణ ఆరంభ దశలో ఉండగానే ఆ పాప చనిపోవడంతో అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. ఏడు నెలల పాటు వారి వద్ద బాగానే ఉన్న పాప.. శిశువిహార్కు రాగానే చనిపోవడం వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ముఖ్య రాజకీయ నేతల ఒత్తిడి ఉండడం కూడా అనుమానాలను రేపుతోంది. ఇప్పటికే జేజే యాక్ట్ 81 సెక్షన్ కింద అక్రమ దత్తత వ్యవహారంలో అమెరికాలో స్థిరపడిన కొంపల్లి వాసి కరీమ్విరాణి, అమెరికా సిటిజన్ అయిన అశామావిరాణితో పాటు వరంగల్కు చెందిన రషీదాభాను భోజని, అమ్యన్అలీ భోజానిపై కేసు నమోదైంది. ఆ 36 గంటల్లో ఏం జరిగిందంటే.. ఏడు నెలల పాపను బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ, జిల్లా బాలల సంరక్షణ విభాగంలో పనిచేసే ఎన్ఐసీ పీఓ సరిత హనుమకొండలోని శిశు విహార్లో చేర్పించారు. అయితే, గురువారం రాత్రి 10.30 గంటలకు పాపకు పలుచటి విరేచనాలు కావడంతో అక్కడ విధుల్లో ఉన్న ఏఎన్ఎం పౌడర్ కలిపి తాగించడంతో 12 గంటలకు పడుకుంది. మళ్లీ శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మళ్లీ పలుచటి విరేచనాలు కావడంతో మెడిసిన్ ఇవ్వడంతో పడుకుంది. అప్పటివరకు విధుల్లో ఉన్న ఏఎన్ఎం 8.30 గంటలకు వెళ్లిపోగా.. 9.30 గంటలకు మరో ఏఎన్ఎం విధుల్లో చేరింది. అప్పటికే ఆ పాపను పరిశీలించగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా కనిపించడంతో గవర్నమెంట్ మెటర్నిటీ ఆస్పత్రి (జీఎంహెచ్)కు తీసుకెళ్లారు. అక్కడినుంచి 10.30 గంటల వరకు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇది 174 సీఆర్పీసీ (అసహజ మరణం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ తల్లి కన్నబిడ్డనో.. పాపం.. చివరికి అనాథగా మారిన ఆ పాపకు బల్దియా సిబ్బంది అంత్యక్రియలు జరిపారు. అనుమానాలెన్నో.. తేల్చాల్సినవెన్నో? ► కేసు నమోదైన 48 గంటల్లోనే అనారోగ్యంతో పాప మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయి. ►విదేశీ దంపతుల కారాకు దరఖాస్తు చేసుకున్న ఇన్కంట్రీ అడాప్షన్ నుంచి విత్ డ్రా ఎందుకయ్యారు అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. అదే సమయంలో వీరిపై అక్రమ దత్తత కింద మట్టెవాడ ఠాణాలో కేసు నమోదైంది. ► ఆ పాప అనారోగ్యంతో బాధపడుతుంటే విరాణి దంపతులు ఎందుకు దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపారన్నది తేల్చాల్సి ఉంది. ► ఈ పాప దత్తత విషయంలో ఢిల్లీ నుంచి వరంగల్ వరకు కారా, సారా అధికారులనుంచి ఎందుకు ఒత్తిడి తెచ్చారన్నది తేల్చాల్సి ఉంది. ► అసలు వీళ్లకు నిజంగా సంతానం ఉన్నారా లేదా ఒకవేళ లేకుంటే ఆపా ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకొని కారా ద్వారా శిశు విహార్లో ఉంటున్న ఏ పాపనైనా దత్తత తీసుకుంటే ప్రొసీజర్ ప్రకారం ఉండేది కదా. అసలు ఈ పాపనే ఎందుకు దత్తత తీసుకున్నారు అన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ► ఇప్పటికే భోజాని దంపతులకు పాప ఇచ్చినట్లు చెబుతున్న మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే రాణితోపాటు కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆ పాప జాడ తెలుస్తుంది. ► అన్నింటికీ మూలమైన ఈ పాప తల్లిదండ్రుల ఆచూకీ దొరుకుతుందా.. లేదా దీని వెనుక ఉన్న అక్రమ రవాణా ముఠా మూలాలను వెలుగులోకి తెస్తారా.. లేదా పాప చనిపోయిందని కేసు పట్టించుకోకుండా ఉంటారా అన్నది ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. పాప కేసును వెలుగులోకి తెచ్చిన సాక్షి పాప అక్రమ దత్తత విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. పాప అడాప్షన్ విషయంలో ఉన్న లొసుగులు.. పాపను ఎవరు ఇచ్చారు.. మేడ్చల్ జిల్లానుంచి ఇక్కడికి ఉన్న లింకులు ఏమిటీ విషయాలను ‘సాక్షి’లో ఎక్స్క్లూజివ్గా ఇవ్వగా స్పందించిన పోలీస్, శిశు సంక్షేమ అధికారులు విచారణ జరిపి మరిన్ని విషయాలు రాబట్టారు. -
భారత్ విదేశీ రుణ భారం 625 బిలియన్ డాలర్లు!
ముంబై: భారత్ విదేశీ రుణ భారం 2023 మార్చితో ముగిసిన సంవత్సరానికి 624.7 బిలియన్ డాలర్లకు చేరింది. 2022 మార్చితో పోల్చితే 5.6 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. కాగా, ఇదే కాలంలో స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) విలువలతో పోల్చితే రుణ నిష్పత్తి తగ్గడం గమనార్హం. 2021–22 ఆర్థిక సంవత్సరం జీడీపీలో రుణ నిష్పత్తి 20 శాతం ఉంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ నిష్పత్తి 18.9 శాతానికి తగ్గింది. డాలర్–రూపీ విలువల్లో అలాగే యన్, ఎస్డీఆర్, యూరో–రూపీ విలువల్లో వ్యత్యాసాల వల్ల భారత్కు 2023 మార్చి నాటికి రుణ భారం 20.6 బిలియన్ డాలర్లు తగ్గింది. ఈ పరిస్థితి లేకపోతే భారత్ రుణ భారం ఈ కాలంలో 5.6 బిలియన్ డాలర్లు కాకుండా, 26.2 బిలియన్ డాలర్లుగా నమోదైఉండేది. -
విదేశాలకు మేయర్ ప్రియ
సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ విదేశీ పర్యటనకు వెళ్లారు. వారం రోజులు ఆమె స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలలో అధికారిక పర్యటన చేయనున్నారు. గత ఏడాది జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల ద్వారా చైన్నె రాజకీయ తెరపైకి ప్రియ వచ్చిన విషయం తెలిసిందే. కార్పొరేటర్గా తొలిసారి డీఎంకే తరఫు ఎన్నికలతో మేయర్ పదవికి అర్హత సాధించారు. అతిపిన్న వయస్సులో చైన్నె మేయర్ పగ్గాలు చేపట్టి నగరాభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. ప్రజల వద్దకే మేయర్ అంటూ నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్ మెంట్ అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆమెను విదేశీ పర్యటనకు ఎంపికచేయడం విశేషం. శనివారం రాత్రి చైన్నె నుంచి డెప్యూటీ మేయర్ మహేశ్వరర్, పలువురు అధికారులతో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈనెల 24వ తేదీ చైన్నెకు తిరుగు పయనం కానున్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న పథకాలను చైన్నెలో అమలు చేయడానికే ఈ పర్యటన అని అధికారులు పేర్కొన్నారు. -
ఈక్విటీల్లో ఫండ్స్ పెట్టుబడులు రూ.2,400 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మే నెలలో ఈక్విటీల్లో కొనుగోళ్ల బాట పట్టాయి. ఏప్రిల్ నెలలో నికరంగా రూ.4,553 కోట్లను ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) వెనక్కి తీసుకోగా, మే నెలలో రూ.2,446 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడం, జీడీపీ వృద్ధి బలంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు చెబుతున్నారు. మే నెలలో ఈక్విటీ పెట్టుబడుల విషయంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు), దేశీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య చాలా అంతరం నెలకొంది. ఎఫ్పీఐలు ఏకంగా రూ.43,838 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, మ్యూచువల్ ఫండ్స్ రూ.2,446 కోట్ల పెట్టుబడులకే పరిమితమైనట్టు సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్లోనూ ఎఫ్పీఐలు భారత ఈక్విటీల్లో రూ.11,631 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ తాత్కాలిక మార్పు ఈక్విటీలకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు భావిస్తున్నారు. ‘‘స్థిరమైన జీడీపీ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, ఇన్వెస్టర్కు అనుకూలమైన విధానాలు మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తోడ్పడ్డాయి. ఎఫ్పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ ఒకరికొకరు సమతుల్యంగా వ్యవహరించారు. ఎఫ్పీఐలు విక్రయించినప్పుడు దేశీ ఇనిస్టిట్యూషన్స్ (మ్యూచువల్ ఫండ్స్ సహా) కొనుగోళ్లకు ముందుకు వచ్చాయి’’అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ఎఫ్పీఐలు, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ గడిచిన 11 నెలలుగా మార్కెట్లు మొత్తం మీద సానుకూలంగా ట్రేడ్ అవుతుండడం గమనార్హం. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనంపై ఆందోళనలు నెలకొనగా, దీర్ఘకాలంలో భారత్కు మెరుగైన వృద్ధి అవకాశాలు ఉన్న విషయాన్ని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్రావు గుర్తు చేశారు. -
థాయ్లాండ్ నుంచి యువతులను తీసుకొచ్చి..
ఆరిలోవ : జీవీఎంసీ ఆదర్శనగర్లో ఆరెంజ్ లాడ్జిపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఎస్ఐ అనిల్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. థాయ్లాండ్ నుంచి ఈనెల 5న ఇద్దరు యువతులను మహేష్ అనే వ్యక్తి విశాఖ తీసుకొచ్చాడు. వారితో పాటు స్థానికంగా ఉంటున్న మరో మహిళను ఆదర్శనగర్లో ఆరెంజ్ లాడ్జిలో ఉంచాడు. వారి మధ్య ఏం జరిగిందో గానీ గురువారం థాయ్లాండ్కు చెందిన ఓ యువతిపై మహేష్ చేయిచేసుకున్నాడు. దీంతో ముగ్గురు మహిళలు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. విదేశీ మహిళలు కావడంతో సీపీ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని టాస్క్ఫోర్స్ పోలీసులను అలెర్ట్ చేశారు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు సాయంత్రం ఈ లాడ్జిపై దాడి చేశారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న మహేష్ ముందుగానే అక్కడ నుంచి పరారయ్యాడు. లాడ్జి నిర్వాహకుడి నుంచి వివరాలు సేకరించి ఫిర్యాదు చేసిన ముగ్గుర్ని కేజీహెచ్కు తరలించారు. పరారైన మహేష్ కోసం గాలిస్తున్నారు. కేసును ఆరిలోవ పోలీసులకు అప్పగించారు. -
కొత్త చట్టం పట్ల సీఏల్లో ఆందోళన
న్యూఢిల్లీ: చార్టర్ట్ అకౌంటెంట్లను నల్లధనం నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ పెట్టుబడుల పై, వ్యాపార సులభతర నిర్వహణపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. సీఏలతోపాటు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను పీఎంఎల్ఏ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సర్కారు ఇటీవలే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది. సీఏలు, కంపెనీ సెక్రటరీలు భారత్లో విదేశీ కంపెనీల ఏర్పాటుకు సహకారం అందిస్తుంటారని, తొలి దశలో విదేశీ కంపెనీల తరఫున తమ సొంత చిరునామా ఇస్తుంటారని పరిశ్రమ వర్గాలు వెల్లడించా యి. విదేశీ కంపెనీకి రెసిడెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ, ఇక్కడ కార్యాలయం ఏర్పాటుకు సాయం అందిస్తుంటారని.. తమ క్లయింట్ల తరఫున బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తుంటారని తెలిపాయి. విదేశీ క్లయింట్ భారత్కు తీసుకొచ్చే పెట్టుబడి సొంతమా లేక నల్లధనమా, వాటి మూలం తెలుసుకునే అవ కాశం సీఏలు, కంపెనీ సెక్రటరీలు లేదని పేర్కొన్నా యి. ప్రాపర్టీల కొనుగోలు, విక్రయం, బ్యాంకు ఖాతాలు లేదా ఆస్తుల నిర్వహణ, లిమిటెడ్ లయబి లిటీ పార్ట్నర్షిప్ లేదా ట్రస్ట్ల నిర్వహణ వ్యవహారాలన్నీ పీఎంఎల్ఏ పరిధిలోకి రానున్నాయి. ఫార్మే షన్ ఏజెంట్లు లేదా డైరెక్టర్/సెక్రటరీ/పార్ట్నర్గా వ్యవహరించే వారినీ పీఎంఎల్ఏ పరిధిలోకి తీసుకొ స్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
Rishi Sunak: విదేశీ పర్యటనల కోసం ఏకంగా రూ. 4 కోట్లు
యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై వివాదాలు విమర్శలు వెల్లువలా వస్తునే ఉన్నాయి. తాజగా విదేశీ పర్యటన ఖర్చుల విషయమై మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచారు. ఆయన విదేశీ పర్యటనల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఇష్టా రాజ్యంగా ఖర్చు పెట్టారంటూ విపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి. ఈ మేరకు యూకే ప్రధాని రిషి సునాక్ విదేశీ పర్యటనల కోసం కేవలం ప్రైవేట్ జెట్ల కోసమే సుమారు రూ. 4 కోట్ల ఖర్చు పెట్టినట్లు నివేదిక వెల్లడించింది. ఈజిప్టులో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరయ్యేందకు ప్రభుత్తం ప్రైవేట్ జెట్లకు దాదాపు రూ. 96 లక్షలు ఖర్చు చేసింది. ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు సుమారు రూ. 300 లక్షలు ఖర్చుపెట్టింది. అలాగే లాట్వియా నుంచి ఎస్టోనియా పర్యటలనకు రూ. 55 లక్షలు ఖర్చు పెట్టగా, ఆయన వ్యక్తిగత ఖర్చులుగా సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. దీంతో ప్రతిపక్ష లిబర్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు జీవన వ్యయ సంక్షోభంలో ఇలా ప్రజా ధనాన్ని ఇలా ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారంటూ ఆగ్రహించారు. ప్రజలు ఒకపక్క పన్నులు చెల్లించలేని దీనస్థితిలో ఉంటే ఇలా దిగ్బ్రాంతికరంగా ఖర్చు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనిపై కన్జర్వేటివ్ పార్టీ వ్యాఖ్యనించిదని కూడా ఆరోపణలు చేశాయి. దీంతో లండన్లోని ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ స్పందిస్తూ..ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలు కోసం ఇది తప్పదని పేర్కొంది. భద్రత, రక్షణ వాణిజ్యంతో సహా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై చర్చించడానికి ద్వైపాక్షిక పర్యటనలు, శిఖరాగ్ర సమావేశాల సమయంలో ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలను నిర్వహించడం ప్రధానమంత్రి పాత్రలో ఒక భాగమని తేల్చి చెప్పింది. అలాంటి వాటికి కోసం ప్రధాని హోదాలో ఖర్చు చేయక తప్పదని కూడా డౌన్ స్ట్రీట్ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా, ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రంగా జార్జియా!) -
ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ అదే!
ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ బీజేపీ అని రచయిత వాల్టర్ రస్సెల్ మీడ్ తన వాల్స్ట్రీట్ జర్నల్లో అభిప్రాయపడ్డారు . పైగా దీన్ని చాలా తక్కువ మందే అవగతం చేసుకోగలరని వాల్స్ట్రీట్ జర్నల్లో పేర్కొన్నారు. బీజేపీ 2014, 2019 వరుస విజయాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీ అదే గెలుపును 2024లో రిపీట్ చేసి విజయపథంలోకి దూసుకుపోతుందని చెప్పారు. భారత్ అగ్రగామి ఆర్థిక శక్తగా ఎదుగుతుందని, జపాన్తోపాటు అమెరికా వ్యూహ రచనలో అగ్రగామిగా నిలుస్తుందని తన జర్నల్ ప్రచురణలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పెరుగుతున్న చైనా శక్తిని సమతుల్యం చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు వంటి వాటితో సంబంధం లేకుండానే భారత్లోని బీజేపీ తనదైన శైలిలో దూసుకుపోతోంది. భారతీయేతరులందరికీ బీజేపీ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నుంచి అభివృద్ధి చెందుతుందన్న విషయం తెలియదని రచయిత మీడ్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు అస్పష్టమైన సామాజిక ఉద్యమంలా ఉండే బీజేపీని సామాజిక ఆలోచనాపరులు, కార్యకర్తలు తమ కృషితో ఆధునికరణకు తగట్టుగా విలక్షణమైన హిందూ మార్గాన్ని రూపొందించి ఎన్నికల్లో గెలుపును అందుకుని ఆధిపత్యం వహించే స్థాయికి ఎదిగేలా చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ వలే బిలియన్ల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న దేశాన్ని ప్రపంచ సూపర్ పవర్గా ఎదిగేలా చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇజ్రాయెల్లోని లికుడ్ పార్టీ మాదిరిగానే బీజేపీ కూడా కాస్మోపాలిటన్ , పాశ్చాత్య కేంద్రీకృత సాంస్కృతిక, రాజకీయ ప్రముఖుల ఆగ్రహానికి గురైనప్పటికీ వాక్చాత్యుర్యం, సంప్రదాయవాద విలువలతో కూడిన ఆర్థిక వైఖరిని మిళితం చేస్తోందని మీడ్ అన్నారు. భారత్లోని ఈశాన్య ప్రాంతంలో క్రైస్తవులు అధికంగా ఉన్నరాష్ట్రలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి విజయకేతనం ఎగరువేయగలిగిందని తెలిపారు.. అంతేగాదు భారత్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉన్న ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం షియా ముస్లింలు నుంచి బలమైన మద్దతు పొందినట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు నుంచి మతపరమైన విద్య వరకు అన్ని పనులను ఆయా వర్గాల నుంచి వచ్చిన వాలంటీర్లచే నిర్వహించేలా చేసి ప్రజల శక్తిని తనపై కేంద్రీకరించేలా చేసుకుని విజయం సాధించింది బీజేపి అని రచయిత మీడ్ తన జర్నల్ వివరించారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో సహా అంతా మెదీ వారసులుగానే మాట్లాడతారని అన్నారు. ఏదీ ఏమైన అట్టడుగున ఉన్న ఉద్యమానికి చెందిన నాయకత్వం అత్యంత శక్తిమంతంగా ఎదగాలని ఆ స్థానాన్ని నిలబెట్టకోవాలని బలంగా కోరుకుంటోందని రూడ్ తన వాల్స్ట్రీట్ జర్నల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురు..బెయిల్ విచారణ వాయిదా..) -
అదానీ స్టాక్స్లో విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇటీవల అదానీ గ్రూప్ స్టాక్స్లో రూ. 15,446 కోట్లు ఇన్వెస్ట్ చేయడంతో మార్చిలో పెట్టుబడులు లభించినట్లు నమోదైంది. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నికరంగా రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అదానీ గ్రూప్లో యూఎస్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ పెట్టుబడులను(రూ. 15,446 కోట్లు) మినహాయిస్తే దాదాపు రూ. 4,000 కోట్లమేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. యూఎస్లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ విఫలంకావడంతో ఇకపై విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం ఎఫ్పీఐలు మార్చి 1–17 కాలంలో రూ. 11,495 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 5,294 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా, జనవరిలో మరింత అధికంగా రూ. 28,852 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే 2022 డిసెంబర్లో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. -
గ్లోబల్ గవర్నెన్స్ ఫెయిల్! ఆ దేశాల గళం వినిపిస్తాం!
ఉక్రెయిన్లోని రష్యా యుద్ధమే ప్రధాన అంశంగా జీ20 విదేశాంగ మంత్రులు సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. ఈ జీ20 సమావేశాలు భారత అధ్యక్ష హోదాలో ఢిల్లీలోని హరియానాలో గురుగ్రామ్ వేదికగా మార్చి1 నుంచి 4వ వరకు జరగనున్నాయి. ఈ మేరకు జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ.. "ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విపలమయ్యాయన్నారు. అంతేగాదు ప్రస్తుతం ప్రపంచ స్థాయి సంస్థలు సంక్షోభంలో ఉన్నాయనే దానిని మనందరం గుర్తించాలి. దీనికి ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, మహమ్మారీ, ఉగ్రవాదం, యుద్ధాలే నిదర్శనమని, అందువల్లే ప్రపంచ పాలన వైఫల్యం చెందిందని స్పష్టంగా తెలుస్తోంది. సంవత్సరాల పురోగతి తర్వాత సుస్థిరాభి వృద్ధి లక్ష్యాల కోసం మనం మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదంలో ఉన్నాం. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధన భద్రతను కల్పించడం కోసం భరించలేని అప్పులతో సతమతమవుతున్నాయి. అలాగే ధనిక దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఈ దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. అందుకే భారత్ దక్షిణాది గళం వినిపించేందుకే యత్నిస్తోంది. మనమంతా ప్రపంచ విభజన సమయంలో కలుస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలపై సాముహికంగా పరిష్కారాన్ని కనుగొనాలి. అలాగే ఈ సమావేశంలో పాల్గొనని వారిపట్ల కూడా మాకు బాధ్యత ఉంది. మన కలిసి చేయగలిగిన వాటిల్లోకి పరిష్కరించలేని సమస్యలను తీసుకురాకూడదు. తమ చర్యలతో ప్రభావితమైన దేశాల మాట వినకుండా ఏ దేశం లీడర్షిప్ను సాధించలేదు. మనల్ని ఏకం చేస్తున్న వాటిపై దృష్టి సారించాలి గానీ విభజించే వాటిపై కాదని" సదస్సులో ప్రదాని మోదీనొక్కి చెప్పారు. కాగా, రాష్ట్రపతి భవన్ కల్చర్ సెంటర్లో జరుగుతున్న ఈ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో దాదాపు 40 మంత్రి పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో జీ20 సభ్య దేశాల తోపాటు బంగ్లాదేశ్, ఈ జిప్ట్, నెదర్లాండ్స, మారిషస్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోసహా తొమ్మిది అతిథి దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు సమాచారం. (చదవండి: బిల్గేట్స్తో సమావేశం వండర్ఫుల్! కోవిడ్ నిర్వహణపై ప్రశంసల జల్లు! కేంద్ర ఆరోగ్య మంత్రి) -
పాక్, చైనాలకు విదేశీ సాయం కట్ చేస్తా
రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాను అదికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటుందో చెబుతూ.. ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే నిక్కీ అమెరికా విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే పాక్, చైనాతో పాటు అమెరికాను ద్వేషించే శత్రు దేశాలకు విదేశీ సాయంలో కోత విధిస్తానని చెప్పారు. గర్వించదగ్గ అమెరికా ఎప్పుడూ ప్రజల సొమ్మును వృధా చేయదన్నారు. అమెరికా గతేడాది విదేశీ సహాయం కోసం 46 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అది ఇతర దేశాల కన్నా ఎక్కువ అని కూడా చెప్పారు. అంతేగాదు ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో పన్ను చెల్లింపుదారులు తెలుసుకునే హక్కు ఉందన్నారు. వాస్తవానికి ఆ సొమ్ము అంతా అమెరికాను వ్యతిరేకించే దేశాలకు నిధులు సమీకరించడానికి వెళ్తుందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తాను అధికారంలో ఉంటే మాత్రం అమెరికా విరోధులకు అందించే సాయంలోని ప్రతి పైసాలో కోత విధిస్తానని కరాకండీగా చెప్పారు. బైడెన్ ప్రభుత్వం పాక్కి మళ్లీ సైనిక సాయాన్ని ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదులకు నిలయమైన ఆ దేశ ప్రభుత్వం అమెరికాను వ్యతిరేకించే చైనాకు లోబడి ఉంది. అంతేగాదు పాలస్తీనా ప్రజల కోసం అని అమెరికా యూఎన్ అవినీతి ఏజెన్సీని అర బిలియన్ డాలర్లతో పునురుద్ధరించిందన్నారు. అలాగే ఇరాన్కి యూఎస్ సుమారు రెండు బిలయన్ డాలర్లు సాయం అందిస్తే..అది యూఎస్ దళాలపైనే దాడులకు దిగింది. అంతేగాదు యూఎన్లో అమెరికాకు అత్యంత వ్యతిరేకంగా ఓటింగ్ వేసే దేశాల్లో ఒకటైన జింబాబ్వేకు కూడా వందల బిలయన్ డాలర్లు అందించింది. అత్యంత హాస్యాస్పదమైన విషయమేమిటంటే. .చైనా నుంచి అమెరికాకు తీవ్ర స్థాయిలో ముప్పు ఉన్నప్పటికీ పర్వావరణ కార్యక్రమాల పేరుతో చైనాకు డాలర్లు అందిస్తోంది. అంతేగాదు రష్యన్ నియంత వ్లాదిమర్ పుతిన్ అత్యంత సన్నిహితమైన బెలారస్కి కూడా సాయం అందించాం. అలాగే క్యూబాకి కూడా సాయం అందించాం. " అంటూ విరుచుకుపడ్డారు నిక్కీ హేలీ. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. కేవలం అధ్యక్షుడు జో బైడెన మాత్రమే కాదు ఇరు పార్టీల అధ్యక్షులు దశాబ్దాలుగా విదేశీ సాయం విషయంలో ఇలాగే కొనసాగారు. వారంతా మా సహాయన్ని స్వీకరించే దేశాల ప్రవర్తనను పరిగణలోకి తీసుకోలేదన్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికా వ్యతిరేక దేశాలకు సాయం చేసి డాలర్లను వృధా చేయనని చెప్పారు. మన ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును అలాంటి దేశాలకు నిధులుగా అందించేదే లేదని తెగేసి చెప్పారు నిక్కీ హేలీ. (చదవండి: పాపం శ్రీలంక.. తిందామంటే జనాలకు తిండి లేదు.. ఇక ఎన్నికలు ఎలా?) -
ఫారిన్లో ఫైట్
ఫారిన్లో యాక్షన్ ప్లాన్ చేశారు ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. ఇందులో భాగంగా ఓ ఫారిన్ షెడ్యూల్ను ప్లాన్ చేశారట యూనిట్. ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం వచ్చే వారంలో చిత్ర బృందం విదేశాలకు వెళ్లనుందట. ఈ షెడ్యూల్తో ‘ఏజెంట్’ షూటింగ్ దాదాపు పూర్తవుతుందట. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ రిలీజ్ కానుంది. మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: హిప్ హాప్ తమిజా. -
మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తారా?
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బులిటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నా ఇంకా మెరుగుపడలేదు. గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమాషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం.. ఆయన హెల్త్ కండీషన్ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రీసెంట్గా మెదడు స్కానింగ్ తీసిన వైద్యులు రిపోర్డుల ఆధారంగా ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంస సభ్యులు ఉన్నట్లు సమాచారం. -
కశ్మీర్లో హిమపాతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో బుధవారం మంచు చరియల కింద చిక్కుకుని ఇద్దరు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మంచు కింద చిక్కుకుపోయిన మరో 21 మందిని పోలీసులు కాపాడారు. 21 మంది పోలండ్, రష్యా దేశస్తులు, ఇద్దరు స్థానిక గైడ్లు మూడు బృందాలుగా ఏర్పడి ప్రఖ్యాత స్కై రిసార్ట్ హపట్ఖుడ్ కాంగ్డోరి వద్ద ఉండగా భారీ 20 అడుగుల పొడవైన మంచు పెళ్ల వారికిపైకి దొర్లుకుంటూ వచ్చి పడింది. ఈ ఘటనలో మంచు కింద చిక్కుబడిన ఇద్దరు పోలండ్ జాతీయులు చనిపోగా, మిగతా వారినందరినీ కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో నిషేధ హెచ్చరికలు ఏర్పాటు చేశామన్నారు. -
రష్యా టూ నల్లమల.. 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి..
సాక్షి, ప్రకాశం: రష్యా నుంచి విదేశీ పక్షులు నల్లమల ప్రాంతానికి వచ్చాయి. రష్యా, మధ్య ఆసియా, ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్ దేశాల నుంచి సుమారు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ పక్షులు ప్రస్తుతం నల్లమలలో తిరుగుతున్నాయి. పెద్దదోర్నాల, రోళ్లపెంట ప్రాంతాల్లో వీటిని బయోడైవర్శిటీ శ్రీశైలం ఎఫ్ఆర్వో హాయత్ ఫొటోలు తీశారు. ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి వారంలో పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి ఫిబ్రవరి నెలలో మళ్లీ సొంత గూటికి చేరతాయన్నారు. అరుదైన ఈ పక్షులు నల్లమలకే అందాలనిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో నల్లమలలోని శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులోనే ఈ పక్షులు ఉన్నాయి. గడ్డి మైదానాలకు మాత్రమే ఈ పక్షులు వలస వస్తాయి. మిడతలు, చిన్నచిన్న పురుగులను తిని జీవిస్తాయి. ఈ సమయంలో మధ్య ఆసియాలో ఆహారం దొరకదు. దీంతో విడిది కోసం ఇక్కడికి వచ్చి ఆహారం తింటూ ఎండలు ప్రారంభం కాగానే వెళతాయి. డేగ జాతికి చెందిన ఈ పక్షులలో మాన్టెగ్యూస్ హారియర్, పాలిడ్ హారియర్, ఎరూషియన్ మార్స్ హారియర్ ముఖ్యమైనవి. నెల రోజుల పాటు కష్టపడి వీటి జీవనశైలిని పరిశీలించి ప్రత్యేక కెమెరాలతో ఫొటోలు తీసినట్టు హాయత్ తెలిపారు. -
విదేశాలకు గుంటూరు ఘాటు.. మలేషియా, థాయ్లాండ్పై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సన్న రకం మిర్చి ఘాటును మరిన్ని దేశాలకు రుచి చూపేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి ఏటా రూ.3,502 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరుగుతుండగా 2024–25 నాటికి రూ.4,661 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాల వారీగా ఉత్పత్తులను గుర్తించి ఎగుమతులను పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన వెల్లడించారు. ప్రస్తుతం గుంటూరు నుంచి సుమారు 16 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుండగా అత్యధికంగా చైనా, థాయ్లాండ్, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియాకు అత్యధికంగా జరుగుతున్నాయి. మిగిలిన దేశాలకు ఎగుమతులు నామమాత్రంగా ఉన్నాయి. థాయ్లాండ్ ఏటా దిగుమతి చేసుకుంటున్న మిర్చిలో గుంటూరు నుంచి 56.7 శాతం, మలేషియా 45.6 శాతం మాత్రమే ఉండటంతో ఎగుమతులు మరింత పెంచేలా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జీఎస్ రావు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ప్యాకింగ్ లేకపోవడం, ఎండబెట్టడం లాంటి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు సరిపడా లేకపోవటాన్ని ప్రధాన సమస్యలుగా గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు 121.6 ఎకర్లాల్లో స్పైసెస్ పార్క్తో పాటు క్లస్టర్ వ్యవస్థ అభివృద్ధి, ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రత్యేక పోర్టల్ను అభివృద్ధి చేయనున్నారు. మిర్చి ఉప ఉత్పత్తులను ప్రోత్సహించేలా చిల్లీసాస్, చిల్లీ పికిల్, చిల్లీ పేస్ట్, చిల్లీ ఆయిల్ లాంటి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించనున్నారు. గుంటూరు మిర్చి ప్రత్యేకతలివే.. మూడు నుంచి 5 సెంటీమీటర్ల పొడవైన గుంటూరు సన్న రకం మిరప ఎర్రటి ఎరుపుతో ఘాటు అధికంగా ఉంటుంది. విటమిన్ సి, ప్రోటీన్లు అధికంగా ఉండటం దీని ప్రత్యేకత. గుంటూరు మిర్చికి 2009లో భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. సన్న రకం మిర్చి సాగుకు గుంటూరు జిల్లా వాతావరణం అనుకూలం కావడంతో 77,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ మిర్చిని వంటల్లోనే కాకుండా సహజ సిద్ధమైన రంగుల తయారీలో వినియోగిస్తారు. కాస్మొటిక్స్, పానియాలు, ఫార్మా స్యూటికల్స్, వైన్ తయారీతో పాటు పలు రంగాల్లో ఈ మిర్చి ఉత్పత్తులను వినియోగిస్తారు. ఇన్ని విశిష్టతలున్న గుంటూరు మిర్చిపై చైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. చైనా ఏటా దిగుమతి చేసుకునే మిర్చిలో 86.7 శాతం భారత్ నుంచే కావడం గమనార్హం. గుంటూరు జిల్లా నుంచి 2021–22లో చైనాకు రూ.1,296 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరిగాయి. చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు? -
ఈక్విటీలపై ఎఫ్పీఐల ఆసక్తి
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల(డిసెంబర్)లో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలో నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. అనిశ్చుతులలోనూ రూ. 11,557 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కోవిడ్ ఆందోళనల నేపథ్యంలోనూ దేశీ ఈక్విటీలపట్ల ఆసక్తి చూపారు. అయితే సమీప భవిష్యత్లో యూఎస్ స్థూల ఆర్థిక గణాంకాలు, కోవిడ్ పరిస్థితులు ఎఫ్పీఐ పెట్టుబడులపై ప్రభావం చూపనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ పేర్కొన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం డిసెంబర్ 1–23 మధ్య ఎఫ్పీఐలు నికరంగా రూ. 11,557 కోట్ల విలవైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. కాగా.. గత నెల(నవంబర్)లో ఎఫ్పీఐలు మరింత అధికంగా రూ. 36,200 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! ఇందుకు యూఎస్ డాలరు బలహీనపడటం, స్థూల ఆర్థిక పరిస్థితుల సానుకూలత దోహదం చేశాయి. అయితే అంతకుముందు అంటే అక్టోబర్లో నామమాత్రంగా రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. సెప్టెంబర్లో రూ. 7,624 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
కొండారెడ్డిపల్లి అబ్బాయి.. ఐర్లాండ్ అమ్మాయి.. అక్కడే మొగ్గ తొడిగిన ప్రేమ
రంగారెడ్డి: కొండారెడ్డిపల్లి అబ్బాయి.. ఐర్లాండ్ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివరాలివీ. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంబరాజు చంద్ర ప్రకాష్ రావు, ఉషశ్రీ దంపతుల రెండో కుమారుడు రాహుల్ హైదరాబాద్లో ఎంబీబీఎస్ చదివి సైక్రియాటిస్ట్లో పీహెచ్డీ చేశాడు. అనంతరం ఉద్యోగం నిమిత్తం ఆరేళ్ల క్రితం ఐర్లాండ్ దేశానికి వెళ్లాడు. అక్కడ మెడికల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. రాహుల్కు అదే దేశానికి చెందిన ఎడ్మండ్ వాల్ష్, కార్మెల్ వాల్ష్ ల కూతురు క్లెయర్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వివాహం చేసుకునేందుకు ఇద్దరూ వారి కుటుంబ సభ్యులను ఒప్పించారు. హైదరాబాద్ కర్మన్ఘాట్లోని వంగ అనంతరెడ్డి గార్డెన్లో ఆదివారం వారి వివాహం ఘనంగా జరిగింది. కల్యాణ మండపం కళకళ వధువు క్లెయర్ తరఫున 60 మంది అతిథులు విమానంలో శనివారం హైదరాబాద్కు చేరుకున్నారు. విదేశీ అతిథుల రాకతో కల్యాణ మండపం కళకళలాడింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
విదేశీ బ్యాంక్ శాఖలకు కొంత స్వేచ్ఛ
ముంబై: భారత బ్యాంకులకు సంబంధించి విదేశీ శాఖలు, సబ్సిడరీలు.. ఇక్కడ అనుమతించని ఆర్థిక సాధనాల్లో లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. భారత మార్కెట్లో ప్రత్యేకంగా అనుమతించని సాధనాల్లో లావాదేవీలకు, గిఫ్ట్ సిటీ వంటి భారత్లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లలో వీటిని అనుమతించడానికి సంబంధించి ప్రత్యేకా కార్యాచరణ అవసరమని భావించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ అనుమతించని, ఇక్కడ అందుబాటులో లేని ఆర్థిక సాధనాల్లో భారత బ్యాంకుల విదేశీ శాఖలు, సబ్సిడరీలు లావాదేవీలు చేపట్టొచ్చని తన తాజా సర్క్యులర్లో పేర్కొంది. అలాగే, గిఫ్ట్ సిటీ (గుజరాత్)లో బ్యాంకు శాఖలకు సైతం ఇదే వర్తిస్తుందని తెలిపింది. -
విదేశీ ప్రయాణానికి గిరాకీ
ఇటీవల విదేశీ ప్రయాణానికి డిమాండ్ బాగా పెరుగుతోంది. కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం.. వివిధ దేశాలు పర్యాటకులను ఆకర్షించడానికి ప్యాకేజీలను ప్రకటిస్తుండటంతో ప్రయాణీకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 50,710 మంది ప్రయాణించారు. 2021–22 ఆరు నెలల కాలంలో ప్రయాణించిన 12,930 మందితో పోలిస్తే విదేశీ ప్రయాణీకుల సంఖ్యలో 292 శాతం వృద్ధి నమోదైందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్ల కాలంలో ఈ రెండు విమానాశ్రయాల నుంచి 411 విమాన సర్వీసులు నడవగా అంతకుముందు ఏడాది కేవలం 139 సర్వీసులు మాత్రమే నడిచాయి. రాష్ట్రంనుంచి ఇలా విదేశీ ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతుండటంతో సర్వీసుల సంఖ్య పెంచడానికి ఎయిర్లైన్స్ సంస్థలూ ముందుకొస్తున్నాయి. కోవిడ్ ముందున్న పరిస్థితికంటే మెరుగు మరోవైపు.. ఏపీలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య కోవిడ్ ముందున్న పరిస్థితి కంటే మెరుగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్ల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రయాణీకుల సంఖ్యలో 90.93 శాతం వృద్ధి నమోదైంది. 2021–22లో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 11,91,326 మంది ప్రయాణిస్తే ఈ ఏడాది ఆర్నెల్ల కాలంలో ఏకంగా 22,74,641 మంది ప్రయాణించారు. రానున్న కాలంలో సర్వీసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ట్రెండ్ మారింది.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు కొత్త తరం కార్లు వస్తున్నాయ్! -
ఐఐటీలకు విదేశాల నుంచి విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ఐఐటీ క్యాంపస్లను నెలకొల్పాలంటూ పలు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయని ఆయన అన్నారు. ఇవి కేవలం ఐఐటీలుగానే కాదు, పరివర్తన సాధనాలుగా కూడా మారాయన్నారు. ఐఐటీ –ఢిల్లీలో శుక్రవారం ఆయన రెండు రోజుల ఇన్వెంటివ్ ఫెయిర్ను ప్రారంభించి ప్రసంగించారు. ప్రతిభ, మార్కెట్ పరిమాణం, కొనుగోలు శక్తి వంటివి దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నాయని, మన ఐఐటీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. -
ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతాయి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లు మెరుగైన పనితీరే కనబరుస్తున్నా యని పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ హెడ్ (ఈక్విటీస్) అనిరుద్ధ నాహా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) విక్రయాలను కొనసాగిస్తారని, నిధులను ఇతర మార్కెట్లలోకి తిప్పుతుంటారని ఆయన పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా ఎఫ్ఐఐలు విక్రయించడం, దేశీ సంస్థలు కొనుగోళ్లు జరుపుతుండటం కొనసాగుతోందని నాహా చెప్పారు. భారీ అమ్మకాలు వెల్లువెత్తుతున్నా, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతు న్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు పరిణితితో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశీ మదుపుదారుల పెట్టుబడులు కొనసాగుతుండటంతో ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడిని తట్టుకుని మార్కెట్లు నిలబడు తున్నాయన్నారు. మార్కెట్లు మరికొంత కరెక్షన్కి లోనుకావచ్చని, అయితే ఈక్విటీలకు కేటాయింపులు జరిపేందుకు.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు ఇది సరైన సమయమని నాహా చెప్పారు. భారతీయులు సాధారణంగా ఈక్విటీలు, ఈక్విటీ ఫండ్లకు ఎక్కువగా కేటాయించరని, ప్రస్తుతం ఆ ధోరణి మారుతోందని తెలిపారు. మరోవైపు, రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూ మెరుగైన రాబడులు పొందేందుకు, ట్యాక్సేషన్పరంగా ప్రయోజనకరంగా ఉండేందుకు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ (బీఏఎఫ్) ఆకర్షణీయంగా ఉంటున్నాయని నాహా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే పీజీఐఎం ఇండియా బీఏఎఫ్ను నిర్వహిస్తున్నామని వివరించారు. మార్కెట్ వేల్యుయేషన్స్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు కొంత ఈక్విటీ భాగాన్ని హెడ్జ్ చేసి, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తామని.. తద్వారా మార్కెట్ పతనమైన పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుందని నాహా చెప్పారు. అలాగే తక్కువ స్థాయిలో కొనుగోలు చేసి అధిక స్థాయిలో విక్రయించే సూత్రాన్ని పాటిస్తాం కాబట్టి మెరుగైన రాబడులు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. -
ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియాభవానీ
సాధారణంగా ఇండియాలో వేసవికాలంలో విహారయాత్రలకు వెళ్తారు. కానీ హీరోయిన్లు మాత్రం వర్షాకాలంలో విదేశీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. నవ దంపతులు విఘ్నేష్ శివన్, నయనతార ఇప్పటికే స్పెయిన్ దేశంలో ఎంజాయ్ చేస్తుండగా సాక్షి అగర్వాల్ వంటి కొందరు హీరోయిన్లు కూడా విదేశాల్లో గడిపేస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రియా భవాని శంకర్ చేరింది. ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. కోలీవుడ్లో బిజీగా ఉన్న బ్యూటీ ఈమె. యువ హీరోలు, నవ హీరోలు అనే తారతమ్యం లేకుండా అందరితో జతకట్టేస్తోంది. పాత్రల పరిధి కూడా పట్టించుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒప్పేసుకుని రెండు చేతులా సంపాదించుకునే పనిలో పడింది. అలా ఇటీవల ధనుష్ సరసన నటించిన చిత్రం తిరుచిట్రంపలం. ఇందులో ఒక పాట రెండు మూడు సన్నివేశాలు మాత్రమే ఈ అమ్మడు కనిపిస్తుంది. అయినా చిత్ర విజయం సాధించడంతో అందులో తానున్నాననే క్రెడిట్ కొట్టేస్తోంది. బిజీ షెడ్యూల్లోనూ రిలీఫ్ కోసం తన ప్రియుడు రాజవేల్తో కలిసి వారం క్రితం విదేశాలకు చెక్కేసింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసింది. ట్రైనర్ సహాయంతో హెలీకాప్టర్ నుంచి పారాచ్యూట్ ద్వారా కిందికి దిగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం జయం రవికి జంటగా అఖిలన్, ఎస్జే సూర్య సరసన బొమ్మై, శింబుతో పత్తు తల, రుద్రన్ అనే మరో చిత్రంలో నటిస్తున్న ప్రియా భవాని శంకర్ త్వరలో ఇండియన్–2 చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతోంది. చదవండి: (మాజీ బాయ్ప్రెండ్తో సుష్మితా సేన్ షాపింగ్, వీడియో వైరల్) -
గొప్పలకు పోతున్న రష్యా!... కౌంటర్ ఇచ్చిన ఆర్మీ ఇంటెలిజెన్స్
Russia's Ministry of Defence Share Video Footage on its official Channel: రష్యా ఉక్రెయిన్ పై కొనసాగిస్తున్న దురాక్రమణ యుద్ధం వేళ రష్యా ఉక్రేనియన్ బలగాల నుంచి తాను స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించింది. రష్యాతో తలపడటానికి బ్రిటన్ అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు మిలటరీ సాయం తోపాటు శక్తివంతమైన ఆయుధ సామాగ్రిని కూడా పంపించి ఉక్రెయిన్కి సాయం అందించిన సంగతి తెలిసిందే. ఐతే తాము ఉక్రెయిన్ పై పట్టు సాధించేశాం అంటూ జబ్బలు చరుచుకుంటూ ఉక్రెయిన్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను రష్యన్ సైనికులడు ఒక వీడియో ఫుటేజ్లో చూపిస్తున్నాడు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో రెండు నిమిషాల 15 సెకన్ల నిడివి గల ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో... రష్యా సైనికుడు యూఎస్, యూకే , పోలాండ్, స్వీడన్ దేశాల యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ లాంఛర్లతో సహా వివిధ రకాల ఆయుధాలను పట్టుకుని మాట్లాడుతున్నాడు. పైగా ఉక్రెయిన్కి మిగతా దేశాలు అందించిన ట్రోఫీలు ఇవిగో అంటూ వెటకరిస్తూ ... ఉక్రెయిన్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చూపించాడు. ఐతే నివేదికలు ప్రకారం ఉక్రెయిన్ రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో పోల్చితే మాస్కో స్వాధీనం చేసుకున్నవి తక్కువేనని పేర్కోన్నాయి. అదీగాక మిలటరీ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బలగాలు దాదాపు ఐదు వేల మిలటరీ వాహనాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పాశ్చాత్య దేశాల మద్ధతుతో ఉక్రెయిన్ బలగాలు బాగా పోరాడటమే కాకుండా యుద్ధంలో చాలా వరకు విజయం సాధించినట్లు పేర్కొంది. కానీ రష్యా మాత్రం దీన్ని ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటూ రష్యాన్ మాట్లాడే వర్గాలను రక్షించడానికి సాగిస్తున్న యుద్ధంగా చెబుతుంది. ఐతే పాశ్చాత్య దేశాలు మాత్రం మాస్కో తన చర్యను సమర్థించుకుంటూ ఉక్రెయిన్ పై దూకుడుగా వ్యకవహరిస్తోందని మండిపడుతున్నాయి. (చదవండి: ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం.. లక్కీగా తప్పిన పెను ప్రమాదం) -
పెట్స్.. అదో స్టేటస్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల స్టేటస్ సింబల్ మారింది. లగ్జరీ వాహనాలు, హై ఎండ్ గృహాలు, విదేశీ ఫర్నీచర్, లైఫ్ స్టయిల్ జాబితాలో విదేశీ పెంపుడు జంతువులు కూడా చేరిపోయాయి. సినీ ప్రముఖులు, బడా వ్యాపారులు తమ వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌస్లు, లగ్జరీ విల్లాలలో విదేశీ పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. తాజాగా క్యాసినోవాలా చికోటి ప్రవీణ్ వ్యవసాయ క్షేత్రంలో ఎగ్జోటిక్ పెట్స్ను అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. విదేశాల్లోని అడవి జాతి పెంపుడు జంతువులను ఎగ్జోటిక్ పెట్స్ అంటారు. మన దేశంలో వీటి రవాణా వైల్డ్లైఫ్ యాక్ట్–1972 ప్రకారం చట్ట వ్యతిరేకం. అమెరికా, ఆ్రస్టేలియా, మెక్సికో వంటి విదేశాల నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకొని, విక్రయిస్తుంటారు. ఇటీవల కోల్కత్తా నుంచి హైదరాబాద్కు కంగారులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను వెస్ట్ బెంగాల్లోని కుమార్గ్రామ్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో అధిక డిమాండే అక్రమ రవాణాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇండియన్ బ్రీడ్ ఎగ్జోటిక్ పెట్స్ పెంపకానికి మన దేశంలో అనుమతి ఉంది. కానీ, ఆయా జంతువులను అటవీ శాఖ వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఈ తరహా వన్యప్రాణులు 150–200 రకాలుంటాయని అంచనా. నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు.. ప్రస్తుతం నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు ఉంటాయని బహుదూర్పల్లిలోని జూ అధికారి ఒకరు తెలిపారు. చేవెళ్ల, శంకర్పల్లి, కందుకూరు, శామీర్పేట, భువనగిరి వంటి పలు ప్రాంతాలలోని విశాలమైన ఫామ్ హౌస్లు, వ్యవసాయ క్షేత్రాలలో చిన్న పాటి జూలను ఏర్పాటు చేసి, వీటిని పెంచుతున్నారు. అలాగే పలువురు బడా డెవలపర్లు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో పెట్ పార్క్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. క్యాసినో వాలాగా పేరొందిన చికోటి ప్రవీణ్కు కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొండచిలువలు, ఊసరవెల్లి, మకావ్ చిలుకల వంటి వన్యప్రాణులున్నట్లు అధికారులు గుర్తించారు. అధ్యయనం చేశాకే పెంపకం.. ఎగ్జోటిక్ పెట్స్ జీవన విధానంపై అవగాహన ఉంటేనే పెంచుకోవాలి. లేకపోతే స్వల్పకాలంలోనే అనారోగ్యం పాలై చనిపోతాయని కూకట్పల్లిలోని ఎగ్జోటిక్ పెట్ విక్రయదారుడు, వెటర్నరీ స్టూడెంట్ యుగేష్ తెలిపారు. అవి ఏ జాతికి చెందినవి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, వాటి ఆహారం, వాటికి వచ్చే రోగాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. సల్కాటా, ఆల్డాబ్రా టార్టాయిస్: ప్రారంభ ధర రూ.2.5 లక్షలు. ఇగ్వానా: ఆకుపచ్చ, నీలం, పసుపు రంగుల ఇగ్వానాల ప్రారంభ ధర రూ.15 వేలు. స్నో, థానోస్ రంగులవైతే రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటాయి. బాల్ పైథాన్: వీటిని రాయల్ పైథాన్స్ అని కూడా పిలుస్తారు. ధర రూ.35–40 వేలు. డెడ్ బియర్డ్ డ్రాగన్: తెల్ల గడ్డంలాగా ఉంటాయి. వీటిని వెనక్కి తిప్పినా ఎలాంటి చలనం ఉండదు. వీటి స్పర్శ చల్లగా, గట్టిగా ఉంటుంది. తెలుపు, గోధుమ, ఎరుపు రంగుల్లోని డ్రాగన్స్ ప్రారంభ ధర రూ.80 వేలు. కార్న్ స్నేక్: నార్త్ అమెరికాకు చెందిన ఈ కార్న్ స్నేక్స్ విషపూరితం కావు. జన్యురకం, రంగులను బట్టి వీటి ధరలు రూ.25–35 వేల మధ్య ఉంటాయి. మార్మోసెట్ కోతులు: సౌత్ అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు చెందిన ఈ కోతులు ఆలివ్ గ్రీన్, గోధుమ రంగుల్లో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.5 లక్షలు.. మీర్కట్: దక్షిణాఫ్రికాకు చెందిన మీర్కట్స్ గోధుమ, తెలుపు రంగులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.1.5 లక్షలు. రామచిలుకలు: బ్లాక్పామ్ కాకాటూ, విక్టోరియా క్రౌన్, గోల్డెన్ కోనూర్, అమెరికన్ క్రౌ వంటి రంగురంగుల రామచిలుకలు ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ. 30 వేలు. యార్కి టెర్రియర్ డాగ్: అచ్చం బొమ్మలాగా నలుపు, గోధుమ రంగులలో ఈ కుక్క వీటి ప్రారంభ ధర రూ.85 వేలు. జోలో అనే రకం కుక్కలకు శరీరంపై వెంట్రుకలు ఉండకపోవటం వీటి స్పెషాలిటీ. గ్రే కలర్లో వీటి ధర రూ.లక్ష. (చదవండి: ‘ఫీజు’ లేట్.. మారని ఫేట్!) -
చౌక ధరల్లో విమాన టికెట్లు: రూ. 9 లకే ఫారిన్ చెక్కేయొచ్చు!
సాక్షి, ముంబై: రానున్న ఫెస్టివ్ సీజన్లో ఫారిన్ చెక్కేయ్యాలని న్ చేస్తున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్. కేవలం 9 రూపాయలలో విదేశాలకు వెళ్లే అవకాశం ఎదురుచూస్తోంది. వియత్నాంకు చెందిన విమానయాన సంస్థ వియట్జెట్ చాలా చౌకగా విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు ఇతర నాలుగు విమానయాన సంస్థలు కూడా పర్ తగ్గింపు ఆఫర్లు అందిస్తున్నాయి. ‘సీజన్ సేల్’ పేరుతో స్పైస్జెట్ కస్టమర్ల కోసం ఈ ఆఫర్ను అందిస్తున్నాయి. ముఖ్యంగా. బడ్జెట్ ఎయిర్లైన్స్ ఇండిగో, స్పైస్జెట్, గోఫస్ట్, ఎయిర్ ఏషియా ఇండియా ఇలాంటి ఆఫర్లతో ముందుకొచ్చాయి. ఈ సేల్లో కేవలం రూ.1498కే విమాన ప్రయాణ టిక్కెట్లను అందిస్తున్నాయి. రూ.9కే విమాన టికెట్లు: వియట్ జెట్ ఈ ఆఫర్లో కేవలంరూ.9కే (ట్యాక్స్లు మినహాయించి)విమాన ప్రయాణ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లోదాదాపు 30,000 ప్రమోషనల్ టిక్కెట్లను అందిస్తోంది. వియట్జెట్ ఎయిర్ కంపెనీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 26 ఆగస్టు 2022 వరకు ప్రతి బుధ, గురు శుక్రవారాల్లో ప్రయాణీకులు ఈ చౌక ప్రమోషనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా 2022 ఆగస్టు 15 నుంచి 2023 మార్చి 26 వరకు ప్రయాణం చేయవచ్చు. ఎయిర్ ఏషియా ఇండియా పే డే సేల్ ఎయిర్ ఏషియా ఇండియా తన కస్టమర్ల కోసం ‘పే డే సేల్’ను తీసుకొచ్చింది. ఇందులో ఢిల్లీ-జైపూర్ వంటి రూట్లలో విమాన టిక్కెట్లను రూ.1,499 నుంచి అందిస్తోంది. ఈ ఆఫర్ కింద, వినియోగదారులు జూలై 28 జూలై 31 మధ్య బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ వ్యవధి ఆగస్టు 15 నుండి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఇది కాకుండా, ఎయిర్ ఏషియా ఇండియా తన నెట్వర్క్లో మరిన్ని డిస్కౌంట్ సేల్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది. -
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా సిగరెట్లు పట్టివేత
-
ఇంజనీరింగ్ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు
సాక్షి, హైదరాబాద్: బీటెక్ పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది విదేశీ విద్య వైపే మొగ్గుచూపుతున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఎంపికైనా సరే... ఎంఎస్ చేసిన తర్వాతే ఏదైనా అంటున్నారు. ఎంటెక్ వంటి పీజీ కోర్సుల్లో చేరేందుకు తక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. గత ఐదేళ్లుగా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. ఎంటెక్ కోర్సుల్లో సీట్లు నిండే పరిస్థితి కూడా లేదు. ఏటా 70–65 వేల మంది బీటెక్ ప్రవేశాలు పొందుతుంటే, కనీసం 4 వేల మంది కూడా ఎంటెక్లో చేరడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదీ కూడా గేట్ ద్వారా ఐఐటీ, ఎన్ఐటీల్లో చేరే వారే 3 వేల మంది వరకూ ఉన్నారు. దాదాపు 12 వేల మంది ప్రతి ఏటా ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. మేనేజ్మెంట్, ఇతర పీజీ కోర్సులకు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్లే వారి సంఖ్య 15 వేల వరకూ ఉంటోంది. ఇలా మొత్తం మీద 27 వేల మందికిపైగా బీటెక్ తర్వాత ఇతర దేశాలకు పయనమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో బీటెక్కు ఉన్న పోటీ వాతావరణం ఇతర కోర్సులకు ఉండటం లేదు. అవకాశాలే లక్ష్యం... విదేశాల్లో సాధారణంగా ఎంఎస్ తర్వాత సాఫ్ట్వేర్ సంస్థల్లో నియామకాలు చేపడతారు. మన దేశంలో మాత్రం బీటెక్ తర్వాతే ఈ అవకాశాలు ఉంటున్నాయి. అయితే, మన దేశంతో పోలిస్తే విదేశాల్లో ఎంఎస్ చేసిన తర్వాత మంచి వేతనం లభిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఎంఎస్ చేసేందుకు బ్యాంకులు ఎక్కువగా రుణాలివ్వడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అమెరికా వంటి దేశాల్లో అనధికారికంగా ఏదో ఒక పార్ట్టైమ్ ఉపాధి పొందేందుకు అవకాశాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, కొంతకాలంగా ఇంజనీరింగ్ విద్యలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కంప్యూటర్ కోర్సుల్లో ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ ఉన్న కోర్సులొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సులు ఇక్కడ చేసి, కొనసాగింపుగా అమెరికాలో ఎంఎస్ చేయడం ప్రయోజనంగా ఉంటోందని సాఫ్ట్వేర్ నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా బీటెక్ తర్వాత ఎంఎస్కే ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర మేనేజ్మెంట్ కోర్సుల్లోనూ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ముందంజలో ఉన్నాయి. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికతో విద్యను అందిస్తున్నాయి. అందుకే విదేశీ మేనేజ్మెంట్ కోర్సులకూ ప్రాధాన్యమిస్తున్నారు. -
‘ఆల్ట్ న్యూస్’కు విదేశీ విరాళాలు
న్యూఢిల్లీ: ఆల్ట్ న్యూస్ ఆధ్వర్యంలోని ప్రావ్దా మీడియాకు విదేశాల నుంచి రూ.2 లక్షల మేర విరాళాలు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డబ్బు జమ చేసిన మొబైల్ ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్లు అన్నీ థాయ్ల్యాండ్, ఆస్ట్రేలియా, మనామా, హాలండ్, సింగపూర్, అమెరికా,, ఇంగ్లాండ్, సౌదీఅరేబియా, స్వీడన్, యూఏఈ, కెనడా, స్విట్జర్లాండ్, పాకిస్తాన్, సిరియా దేశాలకు చెందినవని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. మొత్తం రూ.2,31,933 ప్రావ్దా మీడియాకు చేరిందని తెలిపారు. జుబైర్ అరెస్ట్ అనంతరం అతడికి మద్దతుగా వచ్చిన ట్వీట్లను విశ్లేషించగా ఎక్కువ భాగం యూఏఈ, బహ్రెయిన్, కువాయిట్, పాకిస్తాన్ వంటి దేశాలవేనని గుర్తించామన్నారు. ఈ మేరకు మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడైన జుబైర్ 2018లో హిందూ దేవతపై చేసిన అభ్యంతరకర ట్వీట్పై జూన్ 27వ తేదీన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జుబైర్ పోలీస్ కస్టడీ శనివారంతో ముగియడంతో పోలీసులు ఢిల్లీ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వారియా ఎదుట హాజరుపరిచారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కొట్టేసిన మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. అయితే, కోర్టు తీర్పు ప్రతి అందకముందే జుబైర్ బెయిల్ పిటిషన్ తిరస్కరించినట్లు, కస్టడీకి అనుమతించినట్లు పోలీసులు మీడియాకు లీకులివ్వడం అవమానకరమని ఆయన తరఫు లాయర్ వ్యాఖ్యానించారు. -
రుతు పవనాలు, విదేశీ ట్రెండ్స్ కీలకం
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు నిర్దేశించనున్నట్లు పలువురు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. అయితే మరోపక్క రుతు పవనాల కదలికలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వడ్డీ రేట్ల పెంపు ధరలు అదుపు చేసేందుకు పలు కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాల అమలుకు మొగ్గుచూపాయి. ఫలితంగా గత వారంలో సెన్సెక్స్ 2,943 పాయింట్లు, నిఫ్టీ 908 పాయింట్లు చొప్పున క్షీణించాయి. గడిచిన రెండేళ్లలో ఒకవారంలో సూచీలు ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. ‘‘గడిచిన వారంలో సూచీలు ఐదున్నర శాతానికి పైగా క్షీణించడంతో షార్ట్కవరింగ్కు వీలున్నప్పటికీ ట్రెండ్ బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టీ 15,360 స్థాయిని నిలుపుకోగలిగితే తప్ప మార్కెట్ దిద్దుబా టు ఆగదు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,183 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 14,900 వద్ద మద్దతు లభించొచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు. విదేశీ గణాంకాలు 1–5 ఏళ్ల కాలానికి రుణాల ప్రామాణిక రేటును చైనా ఈ నెల 20న ప్రకటించనుంది. కోవిడ్–19 షాక్ తదుపరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ పే ర్కొంది. దీంతో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఆర్బీఐ, యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, స్విస్ నేషనల్ బ్యాంక్ తదితరాలు వడ్డీ రేట్ల పెంపుతోపాటు కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో పెట్టుబడులు స్టాక్స్ నుంచి రుణ సెక్యూరిటీలవైపుమళ్లుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. రుతు పవనాలు ప్రభావం ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వేశారు. అయితే నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోతే ద్రవ్యోల్బణ ధీర్ఘకాలం కొనసాగడంతో పాటు పెట్టుబడులు మందగించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ జూన్లో ఇప్పటి వరకు రూ.31,430 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022 ఆరంభం నుంచి మొత్తంగా రూ.1.98 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటి అంశాలే ఎఫ్పీఐల అమ్మకాలకు ప్రధాన కారణమని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
బ్లూ ఎకానమీ.. ఆ దిశగా ఏపీ సర్కార్ వేగంగా అడుగులు..
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యం (బ్లూ ఎకానమీ)పై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డు విదేశీ పోర్టుల భాగస్వామ్య అంశాలపై దృష్టిసారించింది. యూరప్లోనే అతిపెద్ద పోర్టుగా పేరొందిన నెదర్లాండ్స్లోని రోట్టర్ డ్యామ్, బెల్జియంకు చెందిన యాంట్వెర్ప్లతో కలిసి పనిచేసేందుకు అడుగులు వేస్తోంది. గత నెలలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతినిధులు రోట్టర్ డ్యామ్, యాంట్వెర్ప్ పోర్టు ప్రతినిధులను కలిసి రాష్ట్రంలోని పోర్టుల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఏపీలో సుమారు రూ.30,000 కోట్ల వ్యయంతో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టడంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా ఆ రెండు సంస్థలను కోరినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈఓ రవీంద్రనాథ్రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అంతర్జాతీయ పోర్టులతో చేతులు కలపడం ద్వారా విదేశీ వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం రాష్ట్ర పోర్టులకు వేగంగా కలుగుతుందన్నారు. ఇక రాష్ట్ర ప్రతిపాదనలపై రోట్టర్ డ్యామ్, యాంట్వెర్ప్ పోర్టు ప్రతినిధులు ఆసక్తిని వ్యక్తంచేశాయని, త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రావడానికి సుముఖతను వ్యక్తంచేసినట్లు ఆయన తెలిపారు. నౌకల తయారీ, రిపేరింగ్ రంగంలోనూ.. అదే విధంగా.. షార్జాకు చెందిన డామన్ షిప్యార్డ్ ప్రతినిధులతో కూడా సమావేశం జరిగిందని, రాష్ట్రంలో నౌకల తయారీ, రిపేరింగ్ రంగంలో పెట్టుబడుల అవకాశాలను వివరించినట్లు రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. దావోస్ పర్యటన సందర్భంగా ఆయా పోర్టులను సందర్శించి స్థానిక పరిశ్రమల ప్రతినిధులు, పోర్టు చైర్మన్లతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ఈ చర్చలకు కొనసాగింపుగా దావోస్ పర్యటన అనంతరం విదేశీ పోర్టుల ప్రతినిధులను రాష్ట్ర పర్యటనకు ఆహ్వానిస్తూ తాజాగా ఈ–మెయిల్స్ పంపామన్నారు. ఈ పర్యటనలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, మారిటైమ్ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, గత దుబాయ్ ఎక్స్పో సందర్భంగా షరాఫ్ గ్రూపు రాష్ట్ర లాజిస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపించిందని, త్వరలోనే ఈ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు రవీంద్రనాథ్రెడ్డి వెల్లడించారు. -
చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం..
బీజింగ్: ప్రధాన విభాగాల్లో విదేశీ సాంకేతికతలను పక్కనబెట్టే దిశగా చైనా ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. విదేశీ బ్రాండ్ పర్సనల్ కంప్యూటర్ల వాడకం మానేసి దేశీయ సంస్థలవే కొనాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లలో ఈ ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలవుతాయని బ్లూమ్బర్గ్ వార్తాసంస్థ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ముందుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని సుమారు 5 కోట్ల కంప్యూటర్లను పక్కనపడేయనున్నారు. వీటి స్థానంలో స్థానికంగా డిజైన్ చేసిన సాఫ్ట్వేర్తో కూడిన కంప్యూటర్ల వాడకం మొదలుకానుంది. చిప్స్, సర్వర్లు, ఫోన్లు మొదలుకొని ప్రతిదానిపై అమెరికా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలనే దశాబ్ద కాలంనాటి నిర్ణయం తాజా ఆదేశాలతో కార్యరూపం దాల్చనుంది. రెండేళ్ల కార్యాచరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలతో మొదలై ప్రొవిన్షియల్ ప్రభుత్వ విభాగాల్లోనూ స్థానిక సంస్థల తయారీ కంప్యూటర్ల వాడకం మొదలుకానుంది. ప్రస్తుతం చైనాలో దేశీయ సంస్థ లెనోవో తర్వాత హెచ్పీ, డెల్ కంపెనీల పర్సనల్ కంప్యూటర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. నూతన విధానంతో అమెరికాకు చెందిన హెచ్పీ, డెల్ తదితర సంస్థలపై మరింత ఒత్తిడి పెరగనుంది. అయితే, పీసీ బ్రాండ్లు, సాఫ్ట్వేర్కే తప్ప ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల మార్పిడిపై ఎలాంటి ఆదేశాలు లేవని బ్లూమ్బర్గ్ పేర్కొంది. (భయపెట్టేలా రంగు మారిన ఆకాశం.. స్థానికుల్లో టెన్షన్) -
కచ్చితంగా వాటిల్లో నిజం లేదు! తెగేసి చెప్పిన యూఎస్
US Says Absolutely No Truth: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలన పట్ల విముఖతతో ఉన్న ప్రతిపక్షాల తోపాటుగా సొంత పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు యత్నించారు కూడా. అయితే ఈ సంక్షోభానికి కారణం యూఎస్ అని ఇమ్రాన్ ఖాన్ గతంలోనే కొన్ని మిమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీల సహాయంతో తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి వాషింగ్టన్లో కుట్ర పన్నారని, ఇదంత విదేశీ కుట్ర అని ఆరోపణలు చేశారు. తన స్వతంత్ర విదేశాంగ విధానం కారణంగా తనపై ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేలా చేసిందని విమర్శలు గుప్పించారు. అయితే యూఎస్ అప్పుడే ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది కూడా. ఈ మేరకు శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మళ్లీ తాజాగా యూఎస్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. యూఎస్లోని ఒక సీనియర్ దౌత్యవేత్త పాకిస్తాన్లో పాలన మార్పుల పై బెదిరింపులకు దిగారంటూ ఆరోపణలు పునరుద్ఘాటించారు. విదేశాంగ శాఖలోని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లూ తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘విదేశీ కుట్ర’లో పాలుపంచుకున్నారని కూడా ఖాన్ ఆరోపించారు. అయితే యూఎస్ డిప్యూటీ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి జలీనా పోర్టర్ తాజా ఆరోపణలనింటిని ఖండించడమే కాకుండా వాటిలో ఏ మాత్రం నిజం లేదని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. తాము పాకిస్తాన్లో ఎదురవుతున్న పరిణామాలను గమనిస్తున్నామన్నారు. అంతేగాదు తాము పాకిస్తాన్ రాజ్యాంగ ప్రక్రియ, చట్ట నియమాలను గౌరవించడమే కాకుండా మద్దతు ఇస్తాం అని చెప్పారు. ఇలా ఖాన్ ఆరోపణలను అమెరికా బహిరంగంగా ఖండిచడం మూడోసారి. (చదవండి: భారత్పై పొగడ్తల ఎఫెక్ట్.. ఇమ్రాన్ ఖాన్పై నవాజ్ కూతురి తీవ్ర విమర్శలు) -
వీదేశీ మోజు.. తొందరపడ్డారో బతుకు బేజారు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన 24 మంది, కేదారిపురం గ్రామానికి చెందిన 13 మంది, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మరో ఏడుగురు నిరుద్యోగులు గత ఏడాది డిసెంబర్లో ఓ ప్రకటన చూసి ‘అరౌండ్ ద వరల్డ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో గాజువాక గ్రాన్ ఆపిల్ హోటల్లో దుబాయ్ డ్రాగన్ కంపెనీ, అబుదాబీ శాంసంగ్ కంపెనీల్లో వెల్డర్, ఫిట్టర్, స్టోర్మెన్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీసా, పాస్పోర్ట్, విమానం టిక్కెట్ల కోసం రూ.45వేలు నుంచి రూ.55వేలు వరకు వసూలుచేశారు. ఈ ఏడాది జనవరి 24న ముంబై చేరుకోవాలని, అక్కడ నుంచి 28న విమానంలో విదేశాలకు వెళ్లాలంటూ చెప్పిన ట్రావెల్ ఏజెంట్లు ఆ తర్వాత ఆఫీసుకు తాళాలు వేసి ఉడాయించారు. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు కలిశెట్టి కృష్ణారావు. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామకృష్ణాపురం. ఆరు మాసాలు కిందట రూ.70వేలు ఏజెంట్కు చెల్లించి బహ్రెయిన్ వెళ్లాడు. ఉచిత ఏసీ వసతి, భోజనంతో పాటు, ఓటీలు ఉంటాయని చెప్పారు. కానీ, అక్కడికి వెళ్ల్సేరికి ఎడారిలో పడేశారు. చాకిరీ చేయించకుని జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో దాదాపు 2 వేల మందితో కలిసి ఆందోళన చేశారు. అణిచివేయాలని చూశారు. కెమికల్స్, ప్రమాదకరమైన గ్యాస్వల్ల ఆసుపత్రి పాలయ్యారు. సీఎం వైఎస్ జగన్, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చొరవతో భారత్కు తిరిగొచ్చారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : .. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి జిల్లాలో ఈ తరహా మోసాలు సర్వసాధారణం. ఇక్కడి ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలో వందలాది మంది యువత తరచూ ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. వివిధ శిక్షణా సంస్థలకు లక్షల్లో ముట్టజెప్పి లబోదిబోమంటున్నారు. తీరా విదేశాలకు వెళ్లాక చెప్పిన ఉద్యోగం చూపించకపోవడం, టూరిస్ట్ వీసాలంటూ వెనక్కి పంపడం.. నకిలీ ఆర్డర్లతో ఉద్యోగాలే ఇవ్వకపోవడంతో యువకులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. మోసం జరుగుతోందిలా.. ఉద్దానం ప్రాంతంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి నిరుద్యోగ యువకులకు పలు సంస్థలు విదేశీ ఉద్యోగాల ఎరచూపి దోపిడీకి పాల్పడుతున్నాయి. గ్రామాల్లో ఉద్యోగ ప్రకటనను అతికించి కొంతమంది, మధ్యవర్తుల ద్వారా కార్మికులకు మాయమాటలతో నమ్మించి మరికొందరూ మోసాలకు పాల్పడుతుంటే.. సైబర్ నేరాగాళ్లు ఆన్లైన్లో.. ఆకర్షణీయమైన జీతాలు అందిస్తామంటూ నిరుద్యోగ యువతకు ఎరవేస్తూ లక్షలాది రూపాయలు లాగేస్తున్నారు. ఏసీ గదుల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసి పెద్దలతో మాట్లాడుతున్నట్లు ఫోన్చేసి కళ్లెదుటే సినిమా చూపిస్తారు. తీరా డబ్బులు చేతికి అందాక చుక్కలు చూపిస్తున్నారు. మోసపోతున్నదిక్కడే.. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కంచిలి ప్రాంతాలతోపాటు, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుర్లారోడ్, బరంపుర్, ఛత్రపూర్ వంటి ప్రాంతాల్లో వెల్డింగ్ ఇనిస్టిట్యూట్లను ఏర్పాటుచేసి, నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి, విదేశాల్లో ప్ల్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రిగ్గర్, ఫిట్టర్, టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్రికేటర్ తదితర పోస్టులను బట్టి రూ.50వేల నుంచి రూ.3లక్షలు వసూలుచేస్తున్నారు. సింగపూర్, మలేసియా, దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్, అబుదాబి, ఒమెన్, ఇరాక్, సౌదీ అరేబియా, సూడాన్, రష్యా, పోలాండ్ తదితర ప్రాంతాలు ఇక్కడి నిరుద్యోగ యువత కష్టాలకు కేంద్రంగా మారాయి. మోసాలు అనేకం.. మచ్చుకు కొన్ని.. ∙ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఓ ఏజెంట్ 150 మంది నుంచి దాదాపు రూ.2కోట్లు వసూలు చేసి రష్యా స్టాంపుతో నకిలీ వీసాలిచ్చి మోసం చేశాడు. వాస్తవానికి వీసా అనేది పాస్పోర్టుపై అతికించి ఇవ్వాలి. కానీ, ఈ ఏజెంట్ 150 మందిని పట్టుకుని ఢిల్లీ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లగా అక్కడ భారత ఎంబసీ ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలుగా తేల్చి వెనక్కి పంపించేశారు. ∙కంచిలి మండల పరిధిలోని కత్తివరం రోడ్డులో శ్రీ గణేష్ వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు సుమారు 150 మంది నిరుద్యోగ యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసంచేసి, ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి రూ.70 వేలు చొప్పున వసూలు చేసి, దుకాణం మూసేశారు. బాధితుల్లో ఇన్నీసుపేట, సన్యాసిపుట్టుగ, కపాసుకుద్ది, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన వారున్నారు. ∙అలాగే, ఇదే మండలంలోని డోలగోవిందపురం గ్రామానికి చెందిన మట్ట దున్నయ్య అనే వ్యక్తి డోలగోవిందపురం, గంగాధరపురం, ఒడిశాకు చెందిన నరేంద్రపురం తదితర గ్రామాలకు చెందిన ఆరుగురి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేసి, మరో ఏజెంటు ద్వారా వీరికి శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు, ఓటీ, భోజనం, వసతి సౌకర్యం కల్పించే ఉద్యోగం ఇస్తానని చెప్పి నమబలికి, తీరా యువకులను శ్రీలంక పంపించి, అక్కడ కేవలం రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించాడు. దీంతో ఆయా యువకుల కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. -
విదేశాల్లో మనోళ్ల పెట్టుబడులు తగ్గాయ్
ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశాలలో దేశీ కార్పొరేట్ల పెట్టుబడులు 67 శాతం క్షీణించాయి. 75.36 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం దేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు విదేశాలలోని వెంచర్లలో 2021 ఫిబ్రవరిలో 228 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. విదేశాలలో ప్రత్యక్ష పెట్టుబడుల(ఓఎఫ్డీఐ) విభాగంలో గత నెలలో ఈక్విటీ రూపేణా 23.78 కోట్ల డాలర్లు, రుణాలుగా 23 కోట్ల డాలర్లు, గ్యారంటీల కింద 28.57 కోట్ల డాలర్లు నమోదయ్యాయి. కాగా.. నెలవారీ చూస్తే అంటే 2022 జనవరిలో నమోదైన 171 కోట్ల డాలర్ల ఓఎఫ్డీఐలతో పోలిస్తే ఫిబ్రవరిలో 56 శాతం వెనకడుగు వేశాయి. ఈ పెట్టుబడుల్లో పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్ 4.7 కోట్ల డాలర్లతో అగ్రపథాన నిలవగా.. మధురిమ ఇంటర్నేషనల్ 4.09 కోట్ల డాలర్లతో తదుపరి ర్యాంకును పొందింది. రష్యన్ జేవీలో ఓఎన్జీసీ విదేశ్ ఇన్వెస్ట్ చేయగా.. యూఎస్ జేవీలో మధురిమ పెట్టుబడులకు దిగింది. ఈ బాటలో టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ యూఏఈలో 2.95 కోట్ల డాలర్లు, సింగపూర్ అనుబంధ సంస్థలో ఇమేజిన్ మార్కెటింగ్ 2.60 కోట్ల డాలర్లు, సౌదీ అరేబియన్ జేవీలో కేఈసీ ఇంటర్నేషనల్ 1.6 కోట్ల డాలర్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. చదవండి: స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు: ఆనంద్ మహీంద్రా -
రియల్ ఎస్టేట్లోకి విదేశీ పెట్టుబడుల వరద
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగం విదేశీ ఇన్వెస్టర్లకు కల్పవృక్షంగా మారింది. 2017–21 సంవత్సరాల మధ్య రియల్ ఎస్టేట్ రంగంలోకి 23.9 బిలియన్ డాలర్ల మేర (రూ.1.79 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఐదు సంవత్సరాలతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్టు కొలియర్స్–ఫిక్కీ నివేదిక తెలిపింది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన పెట్టుబడులే 60 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ (రెరా) తీసుకురావడం విదేశీ ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ‘భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు’ పేరుతో ఈ నివేదిక విడుదలైంది. 2016లో నియంత్రణ పరమైన సంస్కరణలను (రెరా) చేపట్టడంతో భారత రియల్టీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూలత ఏర్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్ తెలిపింది. ‘‘పారదర్శకత లేమి వల్ల విదేశీ ఇన్వెస్టర్లు గతంలో భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉండేవారు. 2017 నుంచి ఎంతో ఆశావహంతో పెట్టుబడులు పెట్టడం మొదలైంది’’ అని కొలియర్స్ వివరించింది. పెట్టుబడుల వివరాలు.. 2017–21 కాలంలో భారత రియల్టీలోకి 23.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2012–16 మద్య వచ్చిన పెట్టుబడులు 7.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2012–21 మధ్యలో భారత్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి మొత్తం పెట్టుబడులు 49.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇందులో విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మొత్తం 64 శాతంగా ఉంది. 2017–21 మధ్య విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 82 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు ఐదేళ్ల కాలంలో 37 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్కు పెద్ద పీట రియల్ ఎస్టేట్లో విభాగాల వారీగా పరిశీలిస్తే.. 2017–21 మధ్య మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఆఫీస్ స్పేస్ వాటా 43 శాతంగా ఉంది. మిశ్రమ వినియోగ రంగం రెండో స్థానంలో, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. ఆఫీసు ప్రాజెక్టుల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2017–21 మధ్య ఏటా 2 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. నివాసిత ప్రాజెక్టుల పట్ల అప్రమత్తత ఎన్బీఎఫ్సీ రంగంలో సంక్షోభం తర్వాత గృహ రంగం పట్ల విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. నివాస ఆస్తుల వాటా మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల ప్రాపర్టీ పెట్టుబడుల్లో 2017–21 మధ్య 11 శాతానికి తగ్గింది. అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఇది 37 శాతంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్ల వైఖరికి అద్దం పడుతోంది. ఆల్టర్నేటివ్ అసెట్స్లోకి వచ్చిన పెట్టుబడులు బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. డేటా సెంటర్ల బూమ్ డేటా స్థానికంగానే నిల్వ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు, డేటా సెంటర్లకు మౌలిక రంగం హోదా తాజాగా కల్పించడం దేశంలో నూతన డేటా సెంటర్ల బూమ్కు దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. -
ప్రైవేటీకరణ ఎలా చేద్దాం? విదేశీ ఇన్వెస్టర్లతో ప్రధాని కీలక సమావేశం
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అసెట్ మానిటైజేషన్ వ్యూహాలు, దేశ వృద్ధిలో వాటి పాత్ర తదితర అంశాల గురించి చర్చించేందుకు ఇన్వెస్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ 2022 మార్చి 9న సమావేశం కానున్నారు. ఉత్తర అమెరికా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా, ఆ్రస్టేలియా తదితర ప్రాంతాలకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, మౌలిక రంగం .. రియల్ ఎస్టేట్ వర్గాలు , లీగల్ నిపుణులు మొదలైన వారు ఈ భేటీలో పాల్గోనున్నారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం), నీతి ఆయోగ్ కలిసి నిర్వహిస్తున్న ఈ అత్యున్నత స్థాయి వెబినార్లో 22 శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా పాలుపంచుకోనున్నారు. ‘ప్రైవేటీకరణ వ్యూహాల అమలు విషయంలో ఆయా రంగాల నిపుణులు, ఇన్వెస్టర్లు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నది ఈ వెబినార్ లక్ష్యం‘ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించుకున్నప్పటికీ ఆ తర్వాత రూ. 78,000 కోట్లకు సవరించింది. కానీ ఇప్పటి వరకూ రూ. 12,400 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. చదవండి: మోదీ సర్కార్ అనుకున్నదొకటి.. అయ్యిందొకటి! -
విమానాలు నిలిపేసిన ఏరోఫ్లోట్
న్యూయార్క్: రష్యాకు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఏరోఫ్లోట్ అన్ని రకాల అంతర్జాతీయ విమానాలను ఈ నెల 8నుంచి నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. బెలారస్కు మాత్రం తమ విమానాల రాకపోకలు సాగుతాయని తెలిపింది. విదేశీ విమానాలను అద్దెకు తీసుకునే రష్యా వైమానిక సంస్థలు ప్రయాణికుల, సరుకుల రవాణాను కొన్నాళ్లు నిలిపివేయాలని ఇటీవలే రష్యా విమానయాన నియంత్రణా సంస్థ రోసావైట్సియా సూచించింది. రష్యాపై ఆంక్షలు విధించడంతో లీజుకిచ్చిన విదేశీ విమానాలను వెనక్కు స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందుకనుగుణంగానే ఏరోఫ్లోట్ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి నగదు రిఫండ్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే రష్యాకు చెందిన ఎస్7 సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. (చదవండి: నూతన చట్టంతో మీడియా పై ఉక్కుపాదం మోపిన రష్యా) -
యుద్ధానికి బ్రేక్ వేసింది అందుకే! తరలించేందుకు సహకరిస్తాం!
Russia Says In UN Security Council meeting: ఉక్రెయిన్ పై రష్యా పది రోజులుగా దాడి కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఉక్రెయిన్లో ప్రధాన నగరాలు వైమానిక క్షిపణులు, బాంబుల దాడులతో అత్యంత దయనీయంగా మారాయి. ఈ మేరకు రష్యా ఉక్రేయిన్లో చిక్కుకున్న విదేశీయులను, భారతీయులను తరలించే నిమిత్తం యుద్ధానికి బ్రేక్ వేసింది కూడా. అంతేగాక ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను, ఇతర విదేశీయులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలియజేసింది. పైగా వారిని తరలించడానికి తూర్పు ఉక్రెయిన్ నగరాలైన ఖార్కివ్, సుమీకి వెళ్లడానికి రష్యా బస్సులు క్రాసింగ్ పాయింట్ల వద్ద సిద్ధంగా ఉన్నాయని కూడ స్పష్టం చేసింది. ఐరోపాలో అతి పెద్దదైన ఉక్రెయిన్లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్పై రష్యా దాడి చేయడంతో అంతర్జాతీయ భద్రతా మండలి అల్బేనియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి 15 దేశాలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విదేశీయులను శాంతియుతంగా తరలించేందుకు రష్యా సైన్యం అన్ని విధాలా కృషి చేస్తోందని రష్యా రాయబారి రాయబారి వాసిలీ నెబెంజియా తెలిపారు. ఉక్రెయిన్ జాతీయవాదులు తూర్పు ఉక్రెయిన్లోని ఖార్కివ్, సుమీ నగరాల్లో 3,700 మంది భారతీయ పౌరులను బలవంతంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి, ఐక్యరాజ్యసమితి రాయబారి సెర్గి కిస్లిత్సా రష్యా రాయబారి నెబెంజియాతో మాట్లాడుతూ.."దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. విదేశీ విద్యార్థులు ఆందోళన చెందుతున్న ప్రాంతాలను విడిచిపెట్టడానికి సురక్షితమైన కారిడార్ను నిర్ధారించేలా సాయుధ దళాలకు (రష్యా) విజ్ఞప్తి చేయండి. అని కోరారు. అంతేకాదు మీరు నిజంగా ఉక్రెయిన్ రాజధానితో సంబంధంలో ఉంటే అక్కడ ఏమి జరుగుతుందో మీకు బాగా తెలుసు" అని వ్యగ్యంగా అన్నారు. (చదవండి: జెలెన్ స్కీ తీవ్ర ఆవేదన.. బాంబులు వేసేందుకే ఇలా చేశారా..) -
గుడ్ న్యూస్: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!
ఒమిక్రాన్ వేరియంట్తో ప్రమాదం అంచున ఉన్న దేశాలను తప్పించి మిగతా దేశాల నుంచి రాకపోకలు సాగించే వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి వచ్చేవాళ్లు క్యారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని, కేవలం 14 రోజుల స్వీయ పర్యవేక్షణ సరిపోతుందని పేర్కొంది. అయితే ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అంతేకాదు నిరంతరం మార్పు చెందుతున్న ఈ కోవిడ్ -19 వైరస్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కానీ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. కొత్త మార్గదర్శకాలు... విదేశీయులందరూ తప్పనిసరిగా గత 14 రోజుల ప్రయాణ చరిత్రతో సహా ఆన్లైన్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ను సమర్పించాలి తప్పనిసరిగా ప్రయాణ తేదీ నుండి 72 గంటలలోపు నిర్వహించబడిన ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్షను కూడా అప్లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. వ్యాక్సిన్ ప్రోగ్రాంలో భాగంగా భారత్ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. ఆయా దేశాల్లో కెనడా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, బహ్రెయిన్, ఖతార్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. "ఈ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్లో మొత్తం సమాచారాన్ని నింపి... ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదిక లేదా కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేసిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్లైన్స్ (విమానయాన సంస్థలు) బోర్డింగ్కి అనుమతిస్తాయి. ఫ్లైట్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ని పాటించాలి " అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. డ్రోన్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఇదే) -
తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్కు మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) గణనీయంగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. లోక్సభలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయెల్ బుధవారం చేసిన ఒక లిఖిత పూర్వక సమాధానం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఆయన తెలిపిన వివరాలను పరిశీలిస్తే... కీలక అంశాలు - 2020–21 ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో (2021 ఏప్రిల్–నవంబర్) దేశానికి వచ్చిన మొత్తం ఎఫ్డీఐల విలువ 81.97 బిలియన్ డాలర్లు. 2021–22 ఇదే కాలంలో (2021 ఏప్రిల్–నవంబర్) మధ్య ఈ విలువ 54.1 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. - మొత్తం ఎఫ్డిఐలో ఈక్విటీ ఇన్ఫ్లోలు, రీఇన్వెస్ట్ చేసిన ఆదాయాలు, ఇతర మూలధనాలు ఉంటాయి. - దేశీయ మూలధనాన్ని పెంపొందించడంలో దేశానికి ఎఫ్డీఐ ప్రవాహాలు కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ రంగాలు, పరిశ్రమలలో పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పనను ప్రోత్సహించడంలో సహాయపడతాయని మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. 16,737 స్టార్టప్లకు గుర్తింపు కాగా, 2022 జనవరి నాటికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ 16,737 స్టార్టప్లను గుర్తించినట్లు ఒక ప్రత్యేక ప్రకటనలో మంత్రి గోయల్ వివరించారు. మరో ప్రశ్నకు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ సమాధానం ఇస్తూ, అన్ని రంగాలు, ప్రాంతాలలో ఆమోదించబడిన ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్లకు సీడ్ ఫండింగ్ను అందించడానికి ఉద్దేశించి గత ఏడాది ఏప్రిల్ 16వ తేదీన స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ను పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (డీపీఐఐటీ) ప్రారంభించినట్లు తెలిపారు. ఈ స్కీమ్ కింద 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్లకు వర్తించే విధంగా రూ.945 కోట్ల ఒక గ్రాంట్ను కూడా ఆమోదించినట్లు తెలిపారు. 58 ఇంక్యుబేటర్లు, 146 స్టార్టప్స్కు 2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి రూ.232.75 కోట్లను గ్రాంట్గా అందించినట్లు వివరించారు. యూనికార్న్లో 3వ స్థానం దేశీయంగా స్టార్టప్లలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత కేలండర్ ఏడాది(2021)లో అత్యంత అధికంగా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది(2020)లో సమకూర్చుకున్న 11.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లుకంటే ఎక్కువకావడం గమనార్హం. దీంతో గతేడాది ఏకంగా 46 యూనికార్న్లు ఆవిర్భవించాయి. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్లను యూనికార్న్లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఫలితంగా దేశంలో యూనికార్న్ల సంఖ్య 90 దాటింది. దీంతో ప్రపంచంలోనే అమెరికా(487), చైనా(301) తదుపరి భారత్ 90 యూనికార్న్లతో మూడో ర్యాంకులో నిలిచింది. దాదాపు 40 యూనికార్న్లతో బ్రిటన్ నాల్గవ స్థానంలో నిలిచింది. 10 బిలియన్ డాలర్లు అంతకుమించిన విలువను అందుకున్న కంపెనీలను డెకాకార్న్లుగా వ్యవహరిస్తుంటారు. దేశీయంగా ఫ్లిప్కార్ట్, పేటీఎమ్, బైజూస్, ఓయో రూమ్స్ డెకాకార్న్లుగా ఆవిర్భవించాయి. -
అనధికార ఫ్లాట్ఫామ్స్పై ఫారెక్స్ ట్రేడింగ్ వద్దు..ఆర్బీఐ హెచ్చరిక
ముంబై: అనధికార ఎలక్ట్రానిక్ ఫ్లాట్ఫామ్స్పై విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) ట్రేడింగ్ చేయవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అటువంటి ఆర్థిక లావాదేవీల వల్ల విదేశీ మారకద్రవ్య నిర్వహణా చట్టం (ఫెమా) కింద జరిమానాలు పడే అవకాశం ఉందని కూడా సూచించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు, సెర్చ్ ఇంజన్లు, ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ఫారమ్లు, గేమింగ్ యాప్ తదితర ఫ్లాట్ఫామ్స్పై భారతీయ నివాసితులకు ఫారెక్స్ ట్రేడింగ్ సౌకర్యాలను అందిస్తామంటూ వస్తున్న తప్పుదోవ పట్టించే అనధికార ఈటీపీల ప్రకటనలను ఆర్బీఐ గమనిస్తున్నట్లు తెలిపింది. అనుమతించబడిన ఫారెక్స్ లావాదేవీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆర్బీఐ లేదా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా) అధికారిక ఈటీపీల మాత్రమే నిర్వహించాలని సూచించింది. ఫెమా కింద రూపొందించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ ఎక్సే్ఛంజీలు, విదేశీ కౌంటర్పార్టీలకు మార్జిన్ల కోసం చెల్లింపులకు ఎంతమాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. ఫారెక్స్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పథకాలను చేపట్టేందుకు కొందరు మోసపూరిత సంస్థలు వారి ఏజెంట్లు ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా సంప్రదించి భారీ రాబడుల హామీలతో వారిని ప్రలోభపెడుతూ, అనధికార ఈటీపీలను నిర్వహిస్తున్న అంశాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇటువంటి అనధికార ఈటీపీలు, పోర్టల్లు చేసిన మోసపూరిత పథకాలు, ట్రేడింగ్ల వల్ల అనేకమంది భారీ ఎత్తున డబ్బును పోగొట్టుకుంటున్న సంఘటనలూ వెలుగుచూస్తున్నట్లు తెలిపారు. -
విదేశాల్లో దేశీ పెట్టుబడులు తగ్గాయ్
ముంబై: గత నెలలో దేశీ కంపెనీలు విదేశాలలో పెట్టుబడులను తగ్గించుకున్నాయి. దీంతో డిసెంబర్లో ఈ పెట్టుబడులు 8 శాతం క్షీణించి 2.05 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2020 డిసెంబర్లో విదేశీ భాగస్వామ్య సంస్థలు, సొంత అనుబంధ కంపెనీలలో దేశీ కంపెనీలు 2.23 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2021 డిసెంబర్లో దేశీ కంపెనీలు 1.22 బిలియన్ డాలర్లను గ్యారంటీల జారీ రూపంలో ఇన్వెస్ట్ చేశాయి. ఈక్విటీ రూపేణా దాదాపు 46.44 కోట్ల డాలర్లు, రుణాల ద్వారా మరో 36.72 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ఓలా టాప్లో.. ప్రధానంగా మొబిలిటీ సొల్యూషన్ల కంపెనీ ఓలా మాతృ సంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్.. సింగపూర్ అనుబంధ సంస్థలో 67.5 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ యూఎస్ భాగస్వామ్య సంస్థలో దాదాపు 15 కోట్ల డాలర్ల పెట్టుబడులను చేపట్టింది. ఈ బాటలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ జర్మనీలోని జేవీతోపాటు, నార్వేలోని పూర్తి అనుబంధ సంస్థలో 16.86 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. పీఎస్యూ దిగ్గజం గెయిల్ ఇండియా మియన్మార్లోని జేవీసహా, యూఎస్ అనుబంధ సంస్థలో 7.01 కోట్ల డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. ఇదేవిధంగా ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్జీసీ వివిధ దేశాలలోని ఐదు వెంచర్లలో 7.415 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
మిషనరీస్ ఆఫ్ చారిటీకి లైసెన్స్ పునరుద్ధరణ
న్యూఢిల్లీ: మదర్ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ(ఎంఓసీ)’ ఎన్జీవోకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ను కేంద్ర హోం శాఖ శుక్రవారం పునరుద్ధరించింది. విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద సంస్థ లైసెన్స్ను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇకపై విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి దక్కాయి. కోల్కతా కేంద్రంగా పనిచేసే ఎంఓసీ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల ఖాతాలో నిల్వ ఉన్న నగదు మొత్తాలను వినియోగించుకునే అవకాశం చిక్కింది. నిరుపేదలకు శాశ్వత సేవే ఆశయంగా నోబెల్ గ్రహీత మదర్ థెరిస్సా 1950లో కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను నెలకొల్పారు. ‘నాటి నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఇకమీదటా కొనసాగుతాయి. లైసెన్స్ పునరుద్ధరించారనే వార్త మా సంస్థకు నిజంగా పెద్ద ఊరట. లైసెన్స్ రాని ఈ రెండు వారాలూ దేశీయ విరాళాలతో మాకు పూర్తి సహాయసహకారాలు అందించిన దాతల దాతృత్వం అమూల్యం’ అని ఎంఓసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎంఓసీకి వచ్చిన గత విదేశీ విరాళాలకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారం ఉందనే కారణంతో 2021 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునే ఆ సంస్థ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించడం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాలతోపాటు భిన్న వర్గాల నుంచి మోదీ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నాళ్లూ ముస్లింలను వేధించిన బీజేపీ సర్కార్ తాజాగా క్రిస్టియన్ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుందని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్ను పునరుద్ధరించడం గమనార్హం. భారత్లోని ఏదైనా ఎన్జీవో.. విదేశీ విరాళాలను పొందాలంటే లైసెన్స్ తప్పనిసరి. తప్పుగా కనబడింది.. 15 రోజుల్లో ఒప్పయిందా?: తృణమూల్ ఎంపీ డిరెక్ విరాళాల్లో అసంబద్ధ సమాచారం ఉందంటూ దరఖాస్తును తిరస్కరించిన 15 రోజుల్లోనే మళ్లీ లైసెన్స్ను కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని మోదీ సర్కార్ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డిరెక్ ఓబ్రియన్ సూటిగా ప్రశ్నించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను రాబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందన్నారు. క్రైస్తవుల ప్రేమకు మోదీ తలొగ్గారన్నారు. ‘పవర్ ఆఫ్ లవ్ గ్రేటర్ దన్ ది పవర్ ఆఫ్ 56 ఇంచెస్’ అని ట్వీట్చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీనుద్ధేశిస్తూ 56 అంగుళాల ఛాతి అని గతంలో వ్యాఖ్యానించడం తెల్సిందే. -
జనావాసాల్లో గాయపడ్డ విదేశీ కొంగ
సాక్షి, అంబర్పేట(హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ అడవికి ఆనుకొని ఉన్న బాగ్ అంబర్పేట మల్లికార్జున్నగర్లో ఓ విదేశీ పక్షి గాయపడింది. బుధవారం ఉదయం స్థానికులు గమనించి అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పక్షిని పోలీసుస్టేషన్కు తీసుకువచ్చి జూ పార్కు అధికారులకు సమాచారం అందించారు. జూ పార్కు అధికారులు ఈ పక్షి నైబీరియా నుంచి వలస వచ్చినట్లుగా జూ పార్కు అధికారులు గుర్తించారు. గాలిపటం మాంజా కారణంగా ఈ పక్షి గాయపడి నేలపై పడ్డట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జూ పార్కుకు తరలించి చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. -
ఫినో బ్యాంకు.. అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్ సేవలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ నగదు బదిలీ సేవలు అందించడానికి ఫినో పేమెంట్స్ బ్యాంకు (ఫినో)కు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఇకపై విదేశాల్లోని వారు పంపే రెమిటెన్సులను ఫినో ఖాతాదారులు కూడా ఇక్కడ అందుకునేందుకు వీలవుతుంది. విదేశాల్లోని కుటుంబసభ్యులు పంపే నిధులను, కస్టమర్లు నేరుగా తమకు దగ్గర్లోని మైక్రో ఏటీఎంలలో లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసులు అందించే ఫినో బ్యాంకు మర్చంట్ పాయింట్లలోనైనా విత్డ్రా చేసుకోవచ్చని ఫినో పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ఈ సేవలు అందించగలమని బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మేజర్ ఆశీష్ అహూజా తెలిపారు. ఈ రాష్ట్రాల నుంచి గుజరాత్, పంజాబ్, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా విదేశాల నుంచి రెమిటెన్సులు వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని వ్యాపార సంస్థల నెట్వర్క్ను పటిష్టం చేసుకున్నామని, దీంతో ఈ తరహా సర్వీసులను మరింత త్వరితగతిన అందించడానికి సాధ్యపడగలదని అహూజా తెలిపారు. సెప్టెంబర్ 30 నాటికి తమ నెట్వర్క్లో ఎనిమిది లక్షల మంది పైగా వ్యాపారులు ఉన్నట్లు వివరించారు. త్వరలో విదేశాలకు త్వరలో విదేశాలకు రెమిటెన్స్ సర్వీసులను కూడా ప్రారంభించాలనే యోచన ఉన్నట్లు అహూజా చెప్పారు. 2021లో భారత్లోకి 87 బిలియన్ డాలర్ల మేర రెమిటెన్సులు రావచ్చని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికంగా ఉండగలదని ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక నివేదికలో అంచనా వేసింది. చాలా మంది వర్కర్లు గల్ఫ్ దేశాలకు తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్నందున.. ఈ రెమిటెన్సులు 2022లో మూడు శాతం పెరిగి 89.6 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. చదవండి: యూపీఐ పేమెంట్స్ చేసే యూజర్లకు శుభవార్త..! ఎన్నారైలకు మరింత సులువు..! -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
AP: సుగంధ పరిమళాలు.. ఎగుమతులకు భారీ డిమాండ్
సాక్షి, అమరావతి: మన రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు సుగంధ ద్రవ్యాల ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలం నాటికి రాష్ట్రం నుంచి 15.16 కోట్ల కిలోల సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. సుమారు 80కిపైగా దేశాలకు రూ.2,462.95 కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాలను మనం రాష్ట్రం ఎగుమతి చేసింది. రాష్ట్రంలో సాగవుతున్న మిర్చి, పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతోపాటు కాఫీ, జీడిపప్పు వంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఏటా వీటి ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, అమెరికా, చైనా వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. చదవండి: AP: అదుపులోనే అప్పులు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. 71 దేశాలకు అరకు కాఫీ ఎగుమతులు విశాఖ మన్యంలో పండించే అరకు కాఫీకి ప్రచారం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో రాష్ట్రం నుంచి 1.49 కోట్ల కిలోల కాఫీ ఎగుమతి అయ్యింది. సుమారు 71 దేశాలకు మన రాష్ట్రం నుంచి ఏడు నెలల్లో రూ.659.62 కోట్ల విలువైన కాఫీ ఎగుమతులు జరిగాయి. ఇదే సమయంలో రాష్ట్రం నుంచి రూ. 2,202.22 కోట్ల విలువైన 9.7 కోట్ల కిలోల పొగాకు కూడా వివిధ దేశాలకు ఎగుమతి అయ్యింది. విదేశాల్లో మంచి డిమాండ్ రాష్ట్రంలో సాగయ్యే కొన్ని పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. పొగాకు బోర్డు, సుగంధద్రవ్యాల బోర్డు, జీడిపప్పు ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ వంటి వాటితో చర్చలు జరిపి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో జీడిపప్పు ఎగుమతులు రూ.3 కోట్లుగా ఉన్నాయి. వీటిని మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – జీఎస్ రావు, జాయింట్ డైరెక్టర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ -
స్వదేశీ వస్తువులకు విదేశాల్లో డిమాండ్
పెదవేగి : చేతివృత్తుల ద్వారా దేశంలో తయారైన వస్తువులకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని టెక్స్టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీ తెలిపారు. పెదవేగి మండలం పెదవేగిలో ఎస్ఎంసీ పాఠశాలలో విద్యార్థులకు చేతి వృత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో తయారైన చేతివృత్తుల వస్తువులకు ఇతర దేశాలలో మంచి గిరాకీ ఉందని, చేతివృత్తుల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులు వస్తువుల తయారీపై శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జి మాణిక్యాలరావు, ఎస్ఎంసీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుక్క అవినాష్ రాజు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రామన్న, పాఠశాల హెచ్ ఎం ఉషారాణి పాల్గొన్నారు. -
వైద్య విద్య కఠినతరం .. ‘ఎగ్జిట్’ దాటితేనే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో నాసిరకమైన వైద్య విద్యకు చెక్ పెట్టేలా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశాల్లో నాణ్యమైన ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికే మన దేశంలో శాశ్వత మెడికల్ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఏ దేశంలోనైనా గుర్తింపు పొందిన వైద్య కాలేజీల్లోనే చదవాలని విద్యార్థులకు సూచించింది. మన దేశంలో మాదిరిగా వైద్య విద్య కోర్సు (నాలుగున్నరేళ్లు), ఇంటర్న్షిప్ (ఏడాది) రెండూ కలిపి ఐదున్నరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. విద్యార్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయాలి. కోర్సు పూర్తయి వచ్చాక, స్వదేశంలో మరో 12 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఎగ్జిట్ పరీక్షలో పాసై తీరాలి. పదేళ్లలోపే ఎంబీబీఎస్ కోర్సు, ఇంటర్న్షిప్ మొత్తం పూర్తిచేయాలి. అప్పుడే మనదేశంలో రిజి స్ట్రేషన్కు, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి లేదా ఏదైనా ఆసుపత్రిలో పనిచేయడానికి వీలుపడుతుందని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. చదవండి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం సీటు రాక .. తక్కువ ఫీజుతో.. ఈ ఏడాది 15.44 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, దాదాపు 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కానీ, మన దేశంలో కేవలం 85 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే చాలామంది విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం 5,200 బీబీఎస్ సీట్లున్నాయి. కానీ 20 వేల మందికిపైగా నీట్ అర్హత సాధించి ఉంటా రని అంచనా. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.50 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ.23 లక్షల వరకు ఉంటోంది. విదేశాల్లో చదివితే రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షలవుతోంది. ఈ కారణంగానే చాలా మంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా, పాకిస్తాన్ ల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎఫ్ఎంజీఈ ఉత్తీర్ణత 14 శాతమే... విదేశాల్లో ఎంబీబీఎస్ అంత నాణ్యతతో ఉండటం లేదన్న అభిప్రాయం ఉంది. పలు దేశాల్లో చదివి వచ్చినవారు అనేకమంది ఇక్కడ రిజిస్ట్రేషన్కు ముందు రాసే పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోవడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మనదేశంలో ప్రాక్టీస్ చేసేలా లైసెన్స్ పొందడానికి మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలకు 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, కేవలం 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే 14.22 శాతమే ఉత్తీర్ణులయ్యారన్నమాట. చైనా, రష్యా, ఆయా దేశాల్లో చదివినవారు చాలా తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారని కేంద్రం తెలిపింది. ప్రతి విద్యార్థికీ ఈఎఫ్ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు అవకాశముంటుంది. కొత్త నిబంధనల మేర కు విదేశాల్లో వైద్యవిద్య ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు నాణ్యమైన విద్యకు తోడ్పాటు ఎన్ఎంసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు విదేశాల్లో నాణ్యమైన వైద్య విద్యను అభ్యసించడానికి తోడ్పడతాయి. తద్వారా ఇక్కడ ఎఫ్ఎంజీఈ పరీక్ష పాసవడానికి, ప్రాక్టీస్ చేయడానికి వీలుకలుగుతుంది. మన దేశంలో మాదిరి కోర్సు కాలవ్యవధి, ఇలాంటి సిలబస్ ఉన్న వియత్నాంలో చదివేం దుకు అడ్మిషన్ తీసుకున్నా. – నర్మద తూతూ మంత్రం చదువుకు చెక్ కొన్ని విదేశీ మెడికల్ కాలేజీలు తూతూమంత్రంగా చదువుచెప్పి మన విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి. వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ఎన్ఎంసీ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. – డాక్టర్ కరుణాకర్రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ -
ఐఐటీల్లో తగ్గుతున్న విదేశీ విద్యార్థులు
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎంపికయ్యే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ నుంచి వారికి మినహాయింపునిచ్చారు. నేరుగా జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా ఎంపిక అవకాశం కల్పించారు. అయినా అడ్వాన్స్డ్కు రిజిస్ట్రేషన్ చేసుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. పరీక్షకు హాజరవుతున్నవారిలోనూ ఒక శాతానికి మించి ఉత్తీర్ణులు కావడం లేదు. అర్హత సాధిస్తున్నవారు తక్కువే.. గతేడాది (2020) జేఈఈ అడ్వాన్స్డ్లో దాదాపు 209 మంది ప్రవాస భారతీయులు (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా–ఓసీఐ), 23 మంది పీఐవోలు (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్), 23 విదేశీ జాతి కేటగిరీ అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాశారు. వీరిలో విదేశీ జాతి కేటగిరీ కింద నలుగురు, పీఐవో కేటగిరీలో 16 మంది, ఓసీఐ కేటగిరీలో 133 మంది అర్హత సాధించారు. అర్హత సాధించకపోవడానికి కారణం ఇదే.. దేశంలోని విద్యార్థులు జేఈఈకి ఇంటర్మీడియెట్ ఆరంభం నుంచే సన్నాహాల్లో ఉంటున్నారు. విదేశీ విద్యార్థులు కేవలం పరీక్షకు ముందు మాత్రమే సిద్ధమవుతున్నారు. పైగా వారి విద్యలోని అంశాలకు, అడ్వాన్స్డ్ సిలబస్లోని అంశాలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. దీంతో వారు అర్హత మార్కులను సాధించలేకపోతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అర్హత సాధించినవారిలోనూ ఐఐటీల్లో చేరుతున్నవారు తక్కువగానే ఉంటున్నారు. పొరుగు దేశాల విద్యార్థులే అధికం.. ఐఐటీల్లో యూజీ కోర్సుల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది మనదేశానికి చుట్టుపక్కల ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు దేశస్తులే. ఇతర దేశస్తులు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో యూజీ కోర్సులు చేయడానికి వెళ్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. మనదేశంలో యూజీ కోర్సుల్లో చేరేవారి కంటే పోస్ట్రుగాడ్యుయేషన్, పీహెచ్డీ కోర్సుల్లో చేరే విదేశీ విద్యార్థుల సంఖ్యే ఎక్కువ. ఐఐటీ రూర్కీలో 144 మంది విదేశీ విద్యార్థులుండగా వారంతా పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరినవారే. ఇక ఢిల్లీ ఐఐటీలో 98 మంది విదేశీ విద్యార్థులుండగా వారు కూడా పీజీ, పీహెచ్డీ కోర్సులను అభ్యసిస్తున్నవారే. జేఈఈ అడ్వాన్స్డ్కు నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో విదేశాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఈసారి రద్దు చేశారు. అంతర్జాతీయ ర్యాంకింగ్పై ప్రభావం కాగా.. విదేశీ విద్యార్థుల తగ్గుదల ప్రభావం దేశంలోని విద్యా సంస్థలకు ప్రపంచ ర్యాంకింగ్పై పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ స్థాయి ర్యాంకులు ప్రకటించే సంస్థలు ఆయా విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్ధుల సంఖ్యను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటాయని వివరిస్తున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుదల ఐఐటీలకు ప్రతికూలంగా మారుతోందని చెబుతున్నారు. -
భారత్ విదేశీ రుణ భారం 570 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం 2021 మార్చి నాటికి వార్షికంగా 2.1 శాతం పెరిగి 570 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం 2020 మార్చి ముగిసే నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో విదేశీ రుణ భారం 20.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి ఈ విలువ 21.1 శాతానికి చేరింది. ఒక్క సావరిన్ డెట్ వార్షికంగా 6.2 శాతం పెరిగి 107.2 బిలియన్ డాలర్లకు చేరింది. నాన్ సావరిన్ రుణాలు 1.2 శాతం పెరిగి 462.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. నాన్ సావరిన్ డెట్లో వాణిజ్య రుణాలు, ఎన్ఆర్ఐ డిపాజిట్లు, స్వల్ప కాలిక వాణిజ్య రుణ అకౌంట్ వెయిటేజ్ 95 శాతం కావడం గమనార్హం. ఎన్ఆర్ఐ డిపాజిట్లు వార్షికంగా 8.7 శాతం పెరిగి 141.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య రుణాల విలువ 0.4 శాతం తగ్గి 197 బిలియన్ డాలర్లకు చేరింది. స్వల్పకాలిక వాణిజ్య రుణ అకౌంట్ 4.1 శాతం తగ్గి 97.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2021 మార్చి నాటికి దీర్ఘకాలిక రుణం (ఏడాది దాటి వాస్తవ మెచ్యూరిటీ ఉన్నవి) 468.9 బిలియన్ డాలర్లు. వార్షికంగా ఈ విభాగంతో 17.3 బిలియన్ డాలర్లు పెరిగింది. -
ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి
పటాన్చెరు టౌన్: విదేశాలకు వెళ్లేందుకు పరీక్ష రాసి డిస్క్వాలిఫై అయ్యింది. దీంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గార్లపాటి సింధు (23) తన సోదరుడు తేజతో కలసి అమీన్పూర్ పరిధిలోని పీఎన్ఆర్ కాలనీలో ఉంటోంది. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన క్లినికల్ అనాలసిస్ట్గా పని చేసే ఆమె కరోనా కారణంగా ఉండడంతో ఇంటివద్ద నుంచే విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లేందుకు మూడుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించలేక పోయింది. అప్పటి నుంచి తన స్నేహితులు విదేశాలకు వెళ్లారని, తాను వెళ్లలేకపోయానని సోదరుడికి చెప్పి బాధపడుతుండేది. ఈ క్రమంలోనే సింధు బుధవారం తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సోదరుడు తేజ బెడ్పై నురగలు కక్కుకుంటూ సింధు పడి ఉండడాన్ని గమనించి వెంటనే చందానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా తన సోదరి మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేజ ఫిర్యాదు చేశాడని అమీన్పూర్ పోలీసులు తెలిపారు. చదవండి: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్ -
మహాత్ముడు కొల్లాయి గట్టింది ఎందుకు?
గాంధీజీ నిర్ణయం తీసుకున్నారు! అంతే, రాత్రి పది గంటలప్పుడు గుండు గీయించుకున్నారు. మర్నాడు చేనేత కార్మికుల సభలో కొల్లాయి గుడ్డతో ప్రసంగించారు. అది 1921 సెప్టెంబర్ 22. సరిగ్గా వందేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. మోకాళ్ళు దాటని గోచీ, పైన తువ్వాలు. ఇంతే ఆహార్యం! చలికాలం అవసరమనుకుంటే నూలు శాలువా. కన్ను మూసే దాకా అలాగే కొనసాగారు. ఖాదీ తనకు ‘ఐడియా’, ‘ఐడియల్’ అని గాంధీజీ పేర్కొంటారు. పలు భాషలు, సంస్కృతుల భారత దేశానికి ఆయన దుస్తులు గొప్ప ‘కమ్యూనికేషన్’గా పనిచేశాయి. 1921 జూలై 31న బొంబాయిలో అధికారికంగా ప్రారంభించిన విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్కి ముగిసిపోవాలి. అయితే అది తృప్తిగా సాగడం లేదు. తగినంత ఖద్దరు దొరకడం లేదని తెలిసింది. ఖరీదు ఎక్కువ కావడంతో కొనడం కష్టం అని కూడా చెప్పారు. దానికి గాంధీజీ, ‘ఖాదీ చాలి నంత దొరక్కపోతే కొల్లాయితో సరిపుచ్చుకోండి’ అంటూ ఉపన్యసించారు. సరిగ్గా ఈ దశలో గాంధీజీ వ్యక్తిగా వంద రెట్లు, కాదు వెయ్యి రెట్లు ఎదిగారు. బిహార్ చంపారణ్య ప్రాంతంలో నీలిమందు పండించే రైతుల కష్టాల పరిష్కారానికి దోహదపడింది గాంధీజీ నాయకత్వం వహించిన తన తొలి భారత దేశపు ఉద్యమం. అహ్మదాబాద్ జౌళి కార్మికుల కోర్కెలకు మద్దతుగా నిలిచింది రెండో పెద్ద ఉద్యమం. ఈ రెండూ గుడ్డలకు సంబంధించినవే. 1918లో జరిగిన జౌళి కార్మిక ఉద్యమంలో రెండు వారాలు గడిచింది. నిరసన తెలిపే కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఓ రోజు గాంధీజీ, అనసూయబెన్ వచ్చారు. సమ్మె కార్మికులెవరూ చెట్టుకింద లేరు. కారణం ఏమిటి అని ఆరా తీశారు. ఓ కార్మికుడు చెప్పాడు: వారికి పోయేదేముంది? కార్లో వస్తారు, ఇంటికెళ్లి భోంచేస్తారు అనే అభిప్రాయముందని! గాంధీజీ మనసు కల్లోలమై, దీర్ఘాలోచనల్లో పడింది. దాని ఫలితమే తన తొలి నిరాహారదీక్ష. 1918 మార్చి 15న ప్రారంభమైంది. ఫలితంగా వారం రోజుల్లో పరిష్కారం లభించింది. ‘త్రికరణ శుద్ధి’ అని అంటామే, దాన్ని సంపూర్తిగా కలిగిన నాయకుడు గాంధీజీ. మోకాళ్లు దాటని గోచీ, లేదా కొల్లాయి కట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? గాంధీజీ మూడవ తరగతి రైలు బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ గుండా రాయలసీమ ప్రాంతపు రైతులను చూశారని, అదే స్ఫూర్తి అని అక్కిరాజు రమాపతిరావు తన ‘దుర్గా బాయి దేశ్ముఖ్’ మోనోగ్రాఫ్లో పేర్కొన్నారు. మోప్లాల తిరుగుబాటు విషయం తెలిసి మహమ్మ దాలీతో మలబారు ప్రయాణమయ్యారు గాంధీజీ. కానీ వాల్తేరులో మహమ్మదాలీని అరెస్టు చేయడమే కాక, గాంధీజీ మలబారు పర్యటనను కూడా బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. దీనితో గాంధీజీ తన పర్య టనను కుదించుకుని, మదురై వెళ్ళారు. తిరుచురాపల్లి నుంచి మదురైకి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు – తను కొల్లాయి కట్టుకోనంత వరకు రైతులకు ఆ ప్రబోధం చేయకూడదని నిర్ణయించు కున్నారు. తనతో పాటు ప్రయాణం చేస్తున్న రాజాజీకి చెబితే నచ్చలేదు. కానీ గాంధీజీ స్థిర నిర్ణయానికి వచ్చేశారు. విదేశీ వస్త్ర బహిష్కరణకు ఇది తోడ్పడుతుంది. ఖద్దరు ధరించాలనే నియమానికి ప్రతీక అవుతుంది. ఖద్దరు లోటును కొంత పరిష్కరిస్తుంది. మన దేశపు శీతోష్ణస్థితుల్ని బట్టి కూడా గోచీ ధరించడం ఇబ్బంది కాదు. మన సంస్కృతి కూడా మగవాళ్లను తమ శరీరం పూర్తిగా కప్పుకోమని నిర్దేశిం చదు. ఇన్ని కారణాలతో గాంధీజీ యాభై రెండేళ్ళ వయసులో, స్వాతంత్య్రోద్యమం తొలి రోజుల్లో కొల్లాయి గట్టడం ప్రారంభించారు. దేశంలోని ఎందరో దరిద్ర నారాయణులకు ప్రతీక అయ్యారు. కోటానుకోట్ల భారతీయులకు ఆరాధ్యుడయ్యారు. డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి మొబైల్ : 94407 32392 (నేడు గాంధీజీ కొల్లాయి ధారణ శత వసంతాల వేడుక) -
విదేశాల్లో నేరుగా భారత కంపెనీల లిస్టింగ్
ముంబై: భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్సేంజ్ల్లో లిస్ట్ అయ్యేందుకు అవసరమైన చట్ట సవరణలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టొచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పలు స్టార్టప్లు (యూనికార్న్లు) నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం. ‘‘భారత సంస్థలు నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు అనుమతి ఉంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఈ దిశగా అనుమతించాలని కోరిన సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నాం’’ అని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు ఏటా జనవరి చివర్లో ప్రారంభమై రెండు దశల్లో కొనసాగుతాయని తెలిసిందే. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) సెక్యూరిటీలను లిస్ట్ చేసేందుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. భారత కంపెనీలు విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తే అది పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా.. నిధుల సమీకరణను సులభతరం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్సేంజ్ల్లో, అదే మాదిరి విదేశీ కంపెనీలు భారత స్టాక్ ఎక్సేంజ్ల్లో లిస్టింగ్కు అనుమతించాలని సెబీ 2018లోనే ప్రతిపాదించింది. ధరల స్పీడ్కు వంట నూనెలు, పప్పుదినుసులే కారణం ముంబై: వంట నూనెలు, పప్పు దినుసుల ధరల తీవ్రత వల్లే మొత్తం ద్రవ్యోల్బణం రేటు తీవ్రంగా ఉంటోదని తరుణ్ బజాబ్ పేర్కొన్నారు. మార్కెట్లో వాటి లభ్యత పెంపు, సరఫరాల వ్యవస్థ మెరుగుదల, సుంకాల తగ్గింపు వంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం ప్రయత్నిస్తుందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.అలాగే పంట దిగుబడి ఒకసారి అందుబాటులోకి వచ్చాక సమస్య మరికొంత దిగివస్తుందన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం నిర్దిష్ట శ్రేణిలో కొనసాగుతుందన్న అంచనాలను వెలువరించారు. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
ఎల్ఐసీలోకి విదేశీ పెట్టుబడులు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లు కూడా పాలుపంచుకునేందుకు అవకాశం లభించనుంది. దీనిపై గత కొద్ది వారాలుగా చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై వివిధ శాఖలు కూడా చర్చించాక, క్యాబినెట్ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుందని వివరించాయి. ప్రస్తుత ఎఫ్డీఐ విధానం ప్రకారం బీమా రంగ సంస్థల్లో ఆటోమేటిక్ విధానంలో 74 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంది. అయితే, ప్రత్యేకంగా చట్టం ద్వారా ఏర్పాటైన ఎల్ఐసీకి మాత్రం ఇది వర్తించదు. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లను కూడా అనుమతించాలంటే సెబీ నిబంధనలకు అనుగుణంగా ఎల్ఐసీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్, గుంటూరులో పలు కంపెనీల్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తల వెంట్రుకలను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలపై ఈడీ ఆకస్మిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, గుంటూరులో పలు కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనపై తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో భాగంగా వికాస్ ఎంటర్ప్రైజెస్, నరేష్ హెయిర్ ఎక్స్పోర్టర్, హృతిక్ కంపెనీలతో పాటు నా లా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్స్, ఎక్స్లెంట్ హెయిర్ కంపెనీలపై ఈడీ దాడులు జరిపింది. చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
రూపాయి.. అధరహో
ముంబై: చాలా రోజుల తర్వాత డాలర్తో పోల్చితే రూపాయి బలపడింది. విదేశీ ఇన్వెస్టర్లు నుంచి పెట్టుబడుల వరద పారడంతో రూపాయి క్రమంగా బలం పుంజుకుంది. డాలర్ మారకంతో పోల్చితే 17 పైసలు లాభపడింది. గత కొంత కాలంగా ఇండియన్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్లు ఆల్టైం హైలను తాకినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బుధవారం ఒక్క రోజే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 238 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మరోవైపు అమెరికా మార్కెట్లో డాలర్ ఒడిదుడులకు లోనవుతోంది. ఫలితంగా గురువారం మార్కెట్లో డాలర్లతో పోల్చితే రూపాయి గణనీయంగా బలపడింది. ఏకంగా 17 పైసల వరకు విలువను పెంచుకుని 74.27 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకు ముందు డాలర్తో రూపాయి మారకం విలువ 74.44 దగ్గర కొనసాగింది. -
విదేశీ కోచ్ల సత్తా! ఒక్కొక్కరి జీతాలు ఎంతంటే..
స్వదేశీ కోచ్లు ఎక్కడ? అనే విమర్శలను కాసేపు పక్కనపెడితే.. ఫారిన్ కోచ్లు, సపోర్టింగ్ స్టాఫ్లు ఈ దఫా ఒలింపిక్స్లో పతకాల సంఖ్యను పెంచడంలో భారత్కు వెన్నెముకగా నిలిచారు. నీరజ్ కోసం జర్మనీ ఉవీ హోన్, పురుషుల హాకీ కోసం ఆసీస్ గ్రాహం రెయిడ్, లవ్లీనా-మహిళా బాక్సింగ్ టీం కోసం ఇటలీ రఫలే బెర్గామాస్కో, భజరంగ్ పూనియా కోసం షాకో బెంటిండిస్, పీవీ సింధు కోసం దక్షిణకొరియా పార్క్, సెమీస్ దాకా చేరిన మహిళా హాకీ టీం కోసం నెదర్లాండ్స్ జోయర్డ్ మరీన్.. ఇలా అంతా విదేశీ కోచ్ల హవానే ఈసారి కనిపించింది. భారత అథ్లెట్లు-ప్లేయర్లు నీరజ్ చోప్రా, పీవీ సింధు, లవ్లీనా, మీరాబాయ్ ఛాను, రవి దహియా, భజరంగ్ పూనియా, మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల హాకీ టీం-రాణి రాంపాల్ నేతృత్వంలోని మహిళా హాకీ టీం.. టోక్యో 2020 ఒలింపిక్స్లో ప్రముఖంగా నిలిచిన వీళ్లందరికీ ఉన్న ఒకే కామన్ పాయింట్.. అంతా విదేశీ కోచ్ల ఆధ్వర్యంలో సత్తా చాటినవాళ్లే. అవును.. వీళ్ల ఘనత వల్ల స్వదేశీ కోచ్ల ప్లేసుల్లో ఈసారి విదేశీ కోచ్ల పేర్లు ఎక్కువగా తెరపై వినిపించి.. కనిపించాయి. పతకాల మేజర్ సక్సెస్ రేటు పరదేశీ కోచ్లదే అయినా.. స్వదేశీ కోచ్లకు స్థానం దక్కకపోవడంపై కొంత విమర్శలు వినిపించాయి. వీళ్లే టా(తో)ప్ విదేశీ కోచ్ల్లో ఎక్కువ జీతం అందుకుంది ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం, భారత పురుషుల హాకీ జట్టు కోచ్ గ్రాహం రెయిడ్. నెలకు పదిహేను వేల డాలర్ల జీతం(పదకొండు లక్షలకుపైనే) అందుకున్నాడాయన. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్ హాకీ లెజెండ్ జోయర్డ్ మరీన్ నెలకు పదివేల డాలర్లు(ఏడున్నర లక్షల రూపాయలపైనే) అందుకున్నారు. ఇక బాక్సింగ్ డైరెక్టర్ శాంటియాగో నియేవా(అర్జెంటీనా) ఈ లిస్ట్లో ఎనిమిది వేల డాలర్ల(దాదాపు ఆరు లక్షల రూపాయలు)తో మూడో ప్లేస్లో నిలవగా, జావెలిన్ త్రో కోచ్ ఉవే హోన్ నెలకు ఎనిమిదివేల డాలర్లతో నాలుగో ప్లేస్లో, రైఫిల్ కోచ్లు ఓలెగ్ మిఖాయిలోవ్-పావెల్ స్మిర్నోవ్ (రష్యా)లు చెరో 7,500 డాలర్లు ( ఐదున్నర లక్షల రూపాయలు)లతో తర్వాతి స్థానంలో నిలిచారు. కొత్తేం కాదు విదేశీ కోచ్ల్ని ఆశ్రయించడం మనకేం కొత్త కాదు. అందులో ఎలాంటి దాపరికమూ లేదు. 80వ దశకం నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ విదేశాల నుంచి స్పెషలిస్టులను తెప్పించుకోవడం మొదలుపెట్టింది. సిడ్నీ ఒలింపిక్స్(2000) టైం నాటికి అది తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా హాకీ, షూటింగ్, వెయిట్లిఫ్టింగ్ లాంటి మేజర్ ఈవెంట్లు విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో మెరుగైన ప్రదర్శనకు దారితీయడంతో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ప్రముఖంగా విదేశీ కోచ్లకే ఎందుకు ప్రాధాన్యం? అనే ప్రశ్నకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నుంచి వివరణ.. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడమే. శాయ్ ఎంపిక చేసే కోచ్లలో ఎక్కువ మంది గతంలో ఛాంపియన్లుగా ఉన్నవాళ్లో లేదంటే విజయాలను అందుకున్న అనుభవం ఉన్నవాళ్లో ఉంటారు. వాళ్లకు మన కోచ్లతో పోలిస్తే సైంటిఫిక్-టెక్నికల్ నాలెడ్జ్, ట్రిక్కులు- జిమ్మిక్కులు, డైట్కు సంబంధించిన వివరాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అందుకే కేవలం సలహాల కోసమే ఒక్కోసారి వాళ్లను నియమించుకుంటాయి కూడా. అలాగని మన దగ్గరా సత్తా ఉన్నవాళ్లు లేరని కాదు. ‘సక్సెస్తో పాటు అనుభవం’ అనే పాయింట్ మీదే ఫోకస్ చేస్తూ ఫారిన్ కోచ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తోంది శాయ్. అలాగే వీళ్లకు నెలకు మినిమమ్ నెలకు నాలుగు వేల డాలర్లకు తగ్గకుండా శాలరీ ఇస్తుంటుంది. అలాగే వాళ్లతో పని కూడా అదే తీరులో చేయించుకుంటాయి మన స్పోర్ట్స్ అథారిటీలు. విదేశీకే ప్రయారిటీ టోక్యో ఒలింపిక్స్ కోసం టోక్యోకు వెళ్లిన 126 మంది అథ్లెట్ల కోసం (9 విభాగాలు) 32 మంది విదేశీ కోచ్లు(50 మంది స్వదేశీ కోచ్లను సొంత ఖర్చులతో భారత ప్రభుత్వం పంపించింది) పని చేశారు. సక్సెస్ జోరు.. ఆటగాళ్లతో ఈ కోచ్ల టెంపో కారణంగా మరికొంత కాలం వీళ్లనే కోచ్లుగా కొనసాగించాలని శాయ్ భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 30, 2021 వరకు వీళ్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. పారిస్, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టకుని.. మరో నాలుగేళ్లపాటు విదేశీ కోచ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
దేశీయ హాకీకి... ‘విదేశీ చీడ’
స్వతంత్ర భారత రిపబ్లిక్లో ఆదినుంచీ దేశీయ క్రీడలకు పట్టిన చీడ, పీడ ఏమిటంటే.. ప్రధానంగా వలస భారతంలో సంపన్న రాచరిక ప్రభువులు తమ కొడుకుల కోసమని ఇంగ్లాండ్ నుంచి దేశంలోకి దిగుమతి చేసిన క్రికెట్ క్రీడే! అదిమొదలు ఈ ‘జీడి’ అంటుకుపోయి దేశీయ, గ్రామీణ, పట్టణ జాతీయక్రీడలను ధ్వంసం చేస్తూ వచ్చింది. ఈ విదేశీ క్రీడా బానిసత్వం ఫలితంగానే అనేక దేశీయ క్రీడలకు ముఖ్యంగా గొప్ప జాతీయ క్రీడా శిఖరం ‘హాకీ’కి ప్రోత్సాహం కరువై కుంటుపడిపోతూ వచ్చింది. చెడుగుడు, కోకో, కర్రా–బిళ్ల ఆట, వగైరా దేశీయ క్రీడలకు ఖర్మకాలి మన దేశంలో గిరాకీ లేదు. ఎందుకని? విదేశీ క్రికెట్లాగా రెండుచేతులా అవినీతికి పాల్పడి వందలాది కోట్లు దోచుకోవడానికి వీలైన వ్యాపారానికి వీలులేని సామాన్య ప్రజల దేశవాళీ క్రీడలివి. బహుశా అందుకనే విదేశీ క్రికెట్ పట్ల అంత గిరాకీ.. దేశీయ క్రీడలపట్ల అంత పరాకు, చిరాకూ!! సుమారుగా గత యాభై ఏళ్లుగా దేశవాళీ ‘హాకీ’ లాంటి జాతీయ క్రీడలకు, గ్రామీణ క్రీడలకు పట్టిన విదేశీ వలస పాలనావశేషంగా భారతదేశానికి అంటుకున్న వ్యాధులలో ఒకటి ‘అంటూ సొంటూ’ లేని క్రికెట్ క్రీడ! అలాంటి క్రికెట్ను భారత జాతీయ క్రీడ అయిన ‘హాకీ’ అర్ధ శతాబ్ది తరువాత మొన్ననే ముగిసిన ప్రపంచస్థాయి టోక్యో ఒలింపిక్స్లో ‘బ్రహ్మభేద్యం’గా తన పూర్వ ప్రతిష్టను నిలబెట్టుకోవడమేగాక తిరిగి జాతీయ క్రీడలకే తల మానికంగా నిలవడం జాతీయ క్రీడాభిమానులందరి హర్షోద్రేకాలకు కారణమైంది. అంతేగాదు, సుమారు గత వందేళ్ల వ్యవధిలో నాటి పారిస్ ఒలింపిక్స్ నుంచి నిన్నమొన్నటి టోక్యో ప్రపంచ ఒలింపిక్స్ దాకా మన జాతీయ హాకీ పలుసార్లు స్వర్ణాలు కైవసం చేసుకోవడమే కాకుండా తాజాగా అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం, హాకీలో కాంస్యం సాధించి, ప్రపంచ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఇంతవరకు పొందిన మొత్తం 47 స్థానాల హోదాను మరొక మెట్టుకు నెట్టి 48వ స్థానానికి చేర్చడం మరొక ఘనవిజయం. రైతు బిడ్డకు స్వర్ణ పతకం ఇందుకు సూత్రధారిగా నిలిచిన భారత సైనిక సుబేదార్ టోక్యో విశ్వక్రీడల్లో ‘ఈటె’ (జావెలిన్త్రో)ను అనితరసాధ్యమైన దూరానికి (87.58 మీటర్లు) విసిరి మన ఒలింపిక్స్ పతకాల జాబితానే సువర్ణ ఖచితం చేసిన రైతుబిడ్డ నీరజ్ చోప్రా! అయితే, ఈసారైనా పట్టుమని పది పతకాలైనా వస్తాయని ఆశించిన ఇండియాకు గతంలో కన్నా ఒకే ఒక్క పతకం కలిసొచ్చి ఆరునుంచి ఏడు మెడల్స్కు పాకింది. (ఒక స్వర్ణం, 2 రజతం, 4 కాంస్య, ఎటు తిరగేసినా మొత్తం ఏడు పత కాలు) ! ఇలా వలస భారతం నేటి స్వతంత్ర భారత రిపబ్లిక్ వరకూ 10 బంగారు పతకాలతో సహా ఇండియా దక్కించుకున్న మొత్తం 35 పతకాలలో ఎనిమిది పతకాలు దేశీయ ‘హాకీ’ క్రీడవల్ల 8 పతకాలు, షూటింగ్, తదితర క్రీడల్లో ఒక్కొక్క పతకం చొప్పున జమకూడినవే నని మరచిపోరాదు! షరా మామూలుగానే టోక్యో ఒలింపిక్స్లో అమెరికా చివరిరోజున తృటిలో ఎగబాకి 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలతో మొత్తం 113 పతకాలతో ప్రథమ స్థానంలో నిల బడగా, చివరివరకు స్వర్ణపతకాలతో ఆధిక్యం కొనసాగించిన చైనా 38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలతో ద్వితీయ స్థానంలో నిలిచి అబ్బురపరిచింది. దేశీయ క్రీడలకు క్రికెట్ చీడ స్వతంత్ర భారత్ రిపబ్లిక్లో ఆదినుంచీ దేశీయ క్రీడలకు పట్టిన చీడ, పీడలు ఏమిటంటే.. ప్రధానంగా వలస భారతంలో సంపన్న రాచరిక ప్రభువులు తమ కొడుకుల కోసమని ఇంగ్లాండ్ నుంచి దేశంలోకి దిగుమతి చేసిన క్రికెట్ క్రీడే! బ్రిటన్ పాలనలో పాటియాలా సంస్థానం మహారాజాగా ఉన్న భూపేంద్ర సింగ్ (భూప్పా) తన కొడుకు, నవానగర్ జామ్ సాహిబ్ అయిన కుమార్ రంజిత్ సింగ్కి క్రికెట్ను ప్రత్యేక శిక్షణ ఇప్పించి నేర్పించాడు. 1932 నుంచీ ఈ క్రికెట్ సంరంభాలు ప్రారంభం కాగా, రాజా కొడుకు అనారోగ్యం వల్ల ఈ ఆటకు అనంతరం పోర్బందర్ మహారాజా వారసుడయ్యాడు. దేశ స్వాతంత్య్రానికి ముందు 1932లో ఇంగ్లాండులో జరుగుతున్న టెస్ట్ క్రికెట్లో ఇండియా తరపున ఆడడానికి మన స్వాతంత్య్రానికి ముందు అప్పటికే ప్రసిద్ధుడుగా ఉన్న సి.కె. నాయుడి నాయకత్వంలో భారత దేశం తరపున టెస్ట్ క్రికెట్లో పాల్గొనడానికి ఒక టీమును పంపిం చారు. నాయుడి క్రీడాబృందం ఇంగ్లండుపై గెలుపొందడంతో ఇండియాకు ‘టెస్ట్ క్రికెట్ ఆడే జాతి’గా పేరుపడింది. ఆ తర్వాత స్వతంత్రదేశంగా ఇండియా 1948లో ఆస్ట్రేలియాపై టెస్ట్మాచ్లో ఆస్ట్రేలియాతో పోటీపడి ఓడిపోయింది. ఒక్క 1952లో మాత్రమే మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్పై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది. అదిమొదలు ఈ ‘జీడి’ అంటుకు పోయి దేశీయ, గ్రామీణ, పట్టణ జాతీయక్రీడలను ధ్వంసం చేస్తూ వచ్చింది. విదేశీ క్రీడా బానిసత్వం తొలగేదెన్నడు? ఈ విదేశీ క్రీడా బానిసత్వం ఫలితంగానే అనేక దేశీయ క్రీడలకు ముఖ్యంగా గొప్ప జాతీయ క్రీడా శిఖరం ‘హాకీ’కి ప్రోత్సాహం కరువై కుంటుపడిపోతూ వచ్చింది. టోక్యోలో జరిగిన తాజా ప్రపంచ ఒలింపిక్స్లో మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని హాకీ టీమ్ 41 ఏళ్ల నిరీక్షణ అనంతరం కాంస్యపతకంతో తొలి అడ్డంకిని అధిగమించి పురుషుల హాకీని నిలబెట్టగల్గింది! అదే మోతాదులో మహిళా హాMీ టీమ్ కూడా తొలిసారిగా పురుషులకు పోటీగా రంగప్రవేశం చేసి మన్ననలు పొందగలిగింది. అయితే మనదేశం ఇంకా కులగోత్రాల కంపులో కూరుకుపోయి బయటపడలేక పోతున్నందున ఆ ‘సెగ’ నుంచి ప్రతిభావంతులైన హాకీ మహిళా క్రీడాకారులకు రక్షణ కరువు కావడం ఒక దుర్మార్గపు పరిణామం! తాజా ఒలింపిక్స్లో హాకీలో వందనా కటారియా నేతృత్వంలోని భారత్ హాకీ జట్టు అర్జెంటీనా జట్టుపై నాలుగు గోల్స్ స్కోర్ చేసినందుకు ఆనందించవలసిన సమయంలో దళిత మహిళగా ఆమెకు హరిద్వార్లో కుల కంపు ఎదురుకావడం సర్వత్రా ఖండనార్హం! విలువిద్యా రహస్యం తెలిసిన వాళ్లే బాణం విసిరినా, ఈటె విసిరినా గురితప్పనిది ద్రోణాచార్య విద్య! 88.07 మీటర్ల దూరానికి గురిపెట్టి నీరజ్ చోప్రా విసిరిన ‘జావెలిన్త్రో’ గురిపెట్టి మరీ విసిరే ఈటెతో సమానమే! అందుకే అంత బలిష్టంగా నీరజ్‘జావెలిన్’ విసిరిన తరువాత అదాటున నేలకొరిగే పరిస్థితిలో తమాయించుకుని తేరుకుని లేచాడు! విలువిద్యలో వింటినారిని (బలంగా గురిపెట్టి) లాగి కొట్టినపుడు భుజంపైన ‘బొప్పి’ కడుతూ ఉంటుంది. అందుకే ‘ఈ వింటినారే కదా నా భుజాన్ని రక్షిస్తోంద’ని ప్రాచీనుడు (జ్యాకిణాంకమీభుజమెగా రక్షించునదియని తనర గలవు) వాపోవలసివచ్చింది! (ఆ భుజాన్ని రక్షించిన ఆ కాయలే గదా నాకు రక్ష అని తృప్తి చెందుతారట)! ఆ పరిస్థితికి ప్రతిబింబమే నేటి అభినవ నీరజ్ చోప్రా! ఇలా మన గ్రామ సీమల్లో దేశమంతటా ఎన్నిరకాల చిత్ర, విచిత్రమైన ప్రాచీన క్రీడలు (కనుమరుగైన వాటితో సహా) ఉన్నాయో, చెడుగుడు, కోకో, కర్రా– బిళ్ల (నేటి క్రికెట్కు సమానమైన) ఆట, వగైరా, వగైరా! అవినీతికి తావులేనందుకే దేశీ ఆటలకు తగ్గిన గిరాకీ ఖర్మకాలి వీటికి గిరాకీ లేదు. ఎందుకని? విదేశీ క్రికెట్లాగా రెండు చేతులా అవినీతికి పాల్పడి వందలాది కోట్ల రూపాయలు దోచు కోడానికి వీలైన వ్యాపారానికి వీలులేని సామాన్య ప్రజల ఆటలు దేశవాళీ క్రీడలు. గతంలో ఆంగ్ల మహారచయిత కథకుడైన జార్జి బెర్నార్డ్ షా ఇంగ్లిష్వాడైనా, అక్కడ పుట్టి ప్రపంచానికి ఇంగ్లిష్వాడే పాకించిన (క్రికెట్ను పట్కార్తో కూడా ముట్టుకోని అమెరికాను మినహాయించి) క్రికెట్ ‘వ్యాధి’ని ఏమన్నాడో తెలుసా? పదకొండు మంది ఫూల్స్ ఆడతారు, మరో పదకొండువేలమంది పనిలేని దద్దమ్మలు చూస్తూండే క్రీడ క్రికెట్ అని చురక అంటించాడు! రాను రాను క్రికెట్ కొంతమంది అవినీతిపరుల చేతి ఎత్తుబిడ్డగా మారి పచ్చిదోపిడీ క్రీడగా మారిపోయింది. చివరికి క్రికెట్ క్రీడాకారులు కొందరు ప్రతి ఆటకీ సంపాదించే కోట్లు చాలక వారిలో అగ్ర గాములుగా ముద్రపడిన కొందరికి బహుమతిగా పొందిన కోట్ల రూపాయల విలువైన కార్లకు చెల్లించాల్సిన దేశీయ పన్నులను ఎగ్గొట్టి, పట్టుబడిన ఉదంతాలూ ఉన్నాయి. దోపిడీకి ఇలాంటి అవకాశం మన దేశీయ క్రీడలకు లేదు! బహుశా అందుకనే విదేశీ క్రికెట్ పట్ల అంత గిరాకీ దేశీయ క్రీడలపట్ల అంత పరాకు చిరాకూ!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
విదేశీ మద్యం అమ్మకంపై వివాదం.. రివాల్వర్తో యువకుడి హల్చల్!
జయపురం: విదేశీ మద్యాన్ని అధికధరకు అమ్మడంపై తలెత్తిన వివాదంలో ఒక యువకుడి నుంచి పిస్టల్ను స్వాధీనపరచుకున్నట్లు జయపురం సబ్డివిజనల్ పోలీసు అధికారి అరూప్ అభిషేక్ బెహర తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. బొయిపరిగుడ వాసి ఉమాశంకర గౌడను అరెస్టు చేసినట్లు బెహర వెల్లడించారు. బొయిపరిగుడలో ప్రభుత్వ లైసెన్స్తో విదేశీ మద్యం దుకాణం ఉందని, 12వ తేదీన నిందితుడు ఉమాశంకర గౌఢతో పాటు అతని సహచరుడు అసమత్ఖాన్ ఉరఫ్ పప్పు విదేశీ మద్యం దుకాణానికి వెళ్లి ఒక మద్యం బాటిల్ అడిగినట్లు తెలిపారు. బాటిల్ ధర రూ.200 కాగా, సేల్స్మాన్ రూ.220 చెప్పాడని వాగ్వాదానికి దిగారు. దీంతో ఉమాశంకర్ రివాల్వర్ తీసుకొని సేల్స్మాన్ రామప్రసాద్ సాహు గురిపెట్టి చంపుతామని బెదిరించాడని వెల్లడించారు. రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఉమాశంకర్ను అదుపులోకి తీసుకున్నట్లు బెహర వెల్లడించారు. అతనితో పాటు వచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. -
భారీ విదేశీ పెట్టుబడులే లక్ష్యం! 25 దేశాలపై ఏపీ దృష్టి
సాక్షి, అమరావతి:రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి, వేలాది మందికి ఉపాధి కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ) వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరపడం ద్వారా రూ. 34,813 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. వీటి ద్వారా 60వేల మందికిపైగా ఉపాధి లభించింది. తాజాగా రాష్ట్రంలో అవకాశాలను వివరిస్తూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా వర్చువల్గా రోడ్షోలు, డిప్లొమాటిక్ సమావేశాలు అక్టోబర్ నుంచి నిర్వహించడానికి ఏపీ ఈడీబీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జపాన్, అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా, ఇటలీ, మిడిల్ ఈస్ట్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కువైట్ వంటి దేశాల రాయబారులు, వ్యాపార సంఘాలతో సమావేశాలను ఏయే నెలల్లో నిర్వహించాలన్న దానిపై ఒక ప్రణాళికను రూపొందించింది. అక్టోబర్లో జపాన్, నవంబర్లో అమెరికా, డిసెంబర్లో తైవాన్, దక్షిణకొరియా దేశాల ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. మిగిలిన దేశాలతో వచ్చే ఏడాది ప్రారంభంలోనే చర్చలు జరుగుతాయి. వీటితోపాటు మరో 16 దేశాలకు సంబంధించి సంప్రదింపులు జరుపుతోంది. మొత్తం 25 దేశాల్లో 30 వ్యాపార సంఘాలతో కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను తెలియజేయనున్నట్లు ఏపీ ఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రమణ్యం సాక్షికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆథారిత ప్రయోజనాలు (పీఎల్ఐ) స్కీం కింద తయారీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న తరుణంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రంగాల వారీగా ఈడీబీ బృందాలను ఏర్పాటు చేసి కరోనా సమయంలోనూ వెబినార్ ద్వారా సమావేశాలను నిర్వహిస్తోంది. రెండేళ్లలో 110కి పైగా పెట్టుబడుల సదస్సులు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే సీఎం జగన్ అధ్యక్షతన ఆగస్టు, 2019లో నిర్వహించిన డిప్లామాటిక్ ఔట్ రీచ్ సమావేశంలో 35కు పైగా దేశాలకు చెందిన రాయబారులు పాల్గొన్నారు. ఈ రెండేళ్లలో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో 110కిపైగా పెట్టుబడి సదస్సులు, రాయబారులతో సమావేశాలు జరిగాయి. సీఎం జగన్ అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనల సందర్భంగా ఆయా దేశాల వ్యాపార ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను స్వయంగా వివరించారు. 15కు పైగా సమావేశాల్లో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొనగా, 20కి పైగా రంగాల వారీగా రోడ్షోలు, 75కుపైగా సీఈవోలు, రాయబారులతో సమావేశాలు జరిగాయి. -
గ్లోబల్ టెండర్లు: ఎవరూ ఆసక్తి చూపలేదు!
సాక్షి, అమరావతి: రాష్ట్రాలకు నేరుగా వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లకు వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ టెండర్లు తెరవగా... ఏ కంపెనీ కూడా సరఫరాకు ముందుకు రాలేదని అధికారులు తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండడం, రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలన్నా ఎన్ని విక్రయించాలనేది కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలన్న తాపత్రయంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు వెళ్లింది. తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలు ఏపీని అనుసరించి గ్లోబల్ టెండర్లు పిలిచాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సరఫరా చేస్తామని, రాష్ట్రాల టెండర్లకు స్పందించకూడదని గ్లోబల్ కంపెనీలు నిర్ణయించుకున్న నేపథ్యంలో రాష్ట్రాలు పిలిచిన టెండర్లకు స్పందన రాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీ బాటలో 9 రాష్ట్రాలు.. తొలుత ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెండర్లకు వెళ్లగా, అదే బాటలో మరో తొమ్మిది రాష్ట్రాలు నడిచాయి. ఆ మేరకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు వ్యాక్సిన్కోసం గ్లోబల్ టెండర్ల ద్వారా కంపెనీలను ఆహ్వానించాయి. అయితే ఉత్తరప్రదేశ్ టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జూన్ 10వ తేదీ వరకు గడువు పెంచింది. ముంబైలో డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చారు. దీంతో ఆ రాష్ట్రం ఆసక్తిగా లేదు. కర్ణాటకలోనూ కేవలం డిస్ట్రిబ్యూటర్లే ముందుకు రావడంతో టెండరు రద్దు చేశారు. రాజస్థాన్లో టెండర్లకు ఎవరూ ముందుకు రాలేదు. ఒడిశాలోనూ ఇదే పరిస్థితి. దీంతో జూన్ 4 వరకు గడువు పెంచింది. కేరళ, తమిళనాడులో జూన్ 5 వరకు టెండర్లకు గడువుంది. తెలంగాణ శుక్రవారం టెండర్లు తెరవబోతోంది. ఢిల్లీలో మాత్రం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్(ఆసక్తి వ్యక్తీకరణ) కింద నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటివరకూ గ్లోబల్ టెండర్లకు ఏ రాష్ట్రంలోనూ గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపలేదు. చదవండి: ఆనందయ్య మందు.. ‘ఔషధచక్ర’? వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్ -
కరోనా సంక్షోభం: 16 ఏళ్ల తర్వాత భారత్లో కీలకమార్పు
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి ఈ ఏడాది సెకండ్ వేవ్లో తన తీవ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రతీరోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్కసారిగా చికిత్స పొందాల్సిన రోగుల సంఖ్య లక్షల్లో పెరిగిపోవడంతో ఆసుపత్రులు ఆక్సిజన్, మందులు మరియు వైద్య పరికరాల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. కనీసం అందాల్సిన ఆక్సిజన్ సరైన సమయంలో దొరకని పరిస్థితుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత 16ఏళ్ళుగా భారత్ అవలంబిస్తున్న ఒక కీలక విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన సహాయాన్ని విదేశాల నుంచి తీసుకోవడం తప్ప ఇతర మార్గమేదీ కేంద్రప్రభుత్వం ముందు లేకుండా పోయింది. దీంతో 16 సంవత్సరాల తరువాత విదేశీ సహాయం పొందే విధానంలో భారత్ పెద్ద మార్పు చేసింది. ఈ మార్పు తరువాత విదేశాల నుంచి విరాళాలు, సహాయాన్ని స్వీకరించడం మొదలైంది. అంతేగాక చైనా నుంచి వైద్య పరికరాలు కొనేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విదేశీ సహాయం పొందడంలో రెండు పెద్ద మార్పులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొరుగుదేశమైన చైనా నుంచి ఆక్సిజన్ సంబంధ పరికారాలతో పాటు, ఔషదాలను తీసుకోవడంలో ఇప్పుడు భారత్కు ఎలాంటి సమస్య లేదు. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిణామాల నేపథ్యంలో సహాయం అందించేందుకు పాకిస్తాన్ సైతం ముందుకొచ్చింది. అయితే పాకిస్తాన్ సహాయానికి సంబంధించినంతవరకు, ఈ విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే మందులను నేరుగా విదేశీ ఏజెన్సీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయగలవని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుపడే పరిస్థితిలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతోందని, శక్తివంతమైన దేశంగా ఆత్మనిర్భర భారత్ ఇమేజ్ని ఇతర దేశాలకు తెలియచేసేందుకు 16 ఏళ్ళ క్రితం 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఎ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా విదేశీ వనరుల నుంచి గ్రాంట్లు, సహాయం తీసుకోరాదని నిర్ణయించింది. అంతకుముందు ఉత్తరకాశి భూకంపం(1991), లాతూర్ భూకంపం (1993), గుజరాత్ భూకంపం(2001), బెంగాల్ తుఫాను (2002), బిహార్ వరదలు (2004) సమయంలో భారత్ విదేశీ ప్రభుత్వాల సహాయాన్ని అంగీకరించింది. అయితే 2004 డిసెంబర్ నెలలో వచ్చిన సునామీ సమయంలో ఈ పరిస్థితిని తామే ఎదుర్కోగలమని నమ్ముతున్నామని, అవసరమైతే సహాయం తీసుకుంటామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. మన్మోహన్ చేసిన ఈ ప్రకటన భారతదేశ విపత్తు సహాయ విధానంలో కీలక ఘట్టంగా అభివర్ణించుకోవచ్చు. ఈ నిర్ణయంతో వచ్చిన విధానాన్ని , ఆ తరువాత వచ్చిన విపత్తుల సమయంలో భారత్ అనుసరించింది. 2005లో కశ్మీర్ భూకంపం, 2013లో సంభవించిన కేదార్నాథ్ విషాదం, 2014లో కశ్మీర్ వరదలు వచ్చినప్పుడు సైతం విదేశీ సహాయాన్ని కోరేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరించింది. ఆ తరువాత 2018లో వచ్చిన కేరళ వరదల సమయంలోనూ భారత్ విదేశాల నుంచి ఎటువంటి సహాయాన్ని అంగీకరించలేదు. కేరళ విపత్తుకు రూ.700 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు యూఏఈ ముందుకొచ్చిందని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలపగా, కేంద్రప్రభుత్వం విపత్తు ఉపశమనం, పునరావాస అవసరాలను తామే తీర్చుతామని తెలిపింది. కానీ యూఏఈ అందిస్తామన్న ఆర్థిక సహాయాన్ని తీసుకొనేందుకు మాత్రం కేంద్రప్రభుత్వం నిరాకరించింది. కానీ కేరళ విపత్తు జరిగిన మూడేళ్ళ అనంతరం దేశంలో పరిస్థితులు కరోనా దెబ్బకి ఒక్కసారిగా మారిపోయాయి. గతేడాది కరోనా సంక్రమణతో మొదలైన ఆర్థిక సవాళ్ళకు తోడు ఈ ఏడాది సెకండ్ వేవ్తో వైద్య సవాళ్ళు ఒక్కసారిగా ఎక్కువ య్యాయి. దేశంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య పెరిగిపోవడం, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పతనమౌతున్న వైద్య వ్యవస్థను అత్యవసరంగా నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 16ఏళ్ళ క్రితం తీసుకున్న కీలక విధానాన్ని పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో భయాందోళనలు, దయనీయ పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రజలను మహమ్మారి నుం చి కాపాడేందుకు భారతదేశానికి సహాయం చేయడానికి దాదాపు 40 దేశాలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం అమెరికా, యుకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, స్వీడన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫిన్లాండ్, స్విట్జర్లాం డ్, బెల్జియం, రుమేనియా, లక్జెంబర్గ్, పోర్చుగల్, భూటాన్,సింగపూర్, సౌదీ అరేబియా, హాంకాంగ్, థాయ్లాండ్, నార్వే, ఇటలీ, యూఏఈ దేశాలు భారత్కు వైద్య సహాయం పంపుతున్నాయి. విదేశాల నుంచి భారత్కు అందనున్న వైద్య సహాయం.. ఆక్సిజన్ – ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్.. ►బ్రిటన్ నుంచి వచ్చిన రెండో స్టాక్లో 120 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ►అమెరికా నుంచి 1700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 1100 సిలిండర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ►ఫ్రాన్స్ నుంచి 5 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కంటైనర్లు రానున్నాయి. దీంతో రోజుకి 10వేల మందికి ఆక్సిజన్ అందించవచ్చు. ►ఐర్లాండ్ 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ►రుమేనియా 80 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 75 ఆక్సిజన్ సిలిండర్లు ►జర్మనీ మూడు నెలల కోసం మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాన్ని పంపిస్తోంది. ►పోర్చుగల్ నుండి 20,000 లీటర్ల ఆక్సిజన్ ►సౌదీ అరేబియా నుంచి 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ►యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 6 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు ►హాంకాంగ్ నుంచి 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ►థాయ్లాండ్ నుంచి 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు ►రష్యా నుంచి 20 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వెంటిలేటర్లు – మాస్క్లు... ►అమెరికా నుంచి 15 కోట్ల ఎన్95 మాస్క్లు ►రష్యా నుంచి 75 వెంటిలేటర్లు ►ఫ్రాన్స్ నుంచి 28 వెంటిలేటర్లు ►ఐర్లాండ్ నుంచి 365 వెంటిలేటర్లు ►స్వీడన్ నుంచి 120 వెంటిలేటర్లు ►లక్జెంబర్గ్ నుంచి 58 వెంటిలేటర్లు ►జర్మనీ నుంచి 120 వెంటిలేటర్లు, 8కోట్ల కెఎన్ 95 మాస్క్లు ఆక్సిజన్ జనరేటర్లు.. ►ఫ్రాన్స్ నుంచి 8 ఆక్సిజన్ జనరేటర్లు... ఒక్కొక్కటి 250 పడకల ఆసుపత్రికి 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం ►ఐర్లాండ్ నుంచి ఒక ఆక్సిజన్ జనరేటర్ రెమిడెసివిర్తో పాటు ఇతర వైద్య సామాగ్రి.. ►అమెరికా నుంచి 10 లక్షల రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్ కిట్లతో పాటు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ►రష్యా నుంచి 150 బెడ్ సైడ్ మానిటర్లు, మందులు ►పోర్చుగల్ నుంచి 5వేల రెమిడెసివిర్ వయల్స్ ►బెల్జియం నుంచి 9వేల మోతాదుల రెమిడెసివిర్ -
విదేశాలకు ‘ద టీ ప్లానెట్’...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బబుల్ టీ, కశ్మీరీ ఖావా, పీచ్ ప్యాషన్ ఐస్ టీ, వాటర్మిలన్ టీ, సాల్టెడ్ క్యారమెల్ మిల్క్ టీ, హాంకాంగ్ మిల్క్ బబుల్ టీ.. ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే 900 చాయ్ రకాలను హైదరాబాద్ బ్రాండ్ ‘ద టీ ప్లానెట్’ అభివృద్ధి చేసింది. భారత్తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్లకు ఈ బ్రాండ్ చేరువైంది. వేలాది రుచులను తయారు చేయగల సామర్థ్యం తమకుందని అంటున్నారు ‘ద టీ ప్లానెట్’ ఫౌండర్ మాధురి గనదిన్ని. మహిళలు అరుదుగా ఉండే టీ వ్యాపారంలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్. సంస్థ ప్రస్థానం, భవిష్యత్ ప్రణాళికలు ఆమె మాటల్లోనే.. దశాబ్ద కాలంపైగా.. బీపీవో సేవల కంపెనీని 2007లో ప్రారంభించాను. మాంద్యం కారణంగా 2010లో మూసేయాల్సి వచ్చింది. నా జీవిత భాగస్వామి శ్రీనివాస్ గనదిన్ని న్యూయార్క్లో ఎంబీఏ చదువుతున్న రోజుల్లో శ్రీలంక నుంచి నాణ్యమైన టీ పొడులను సేకరించి విక్రయించేవారు. 2010లో ఆయన భారత్ రాగానే వ్యాపారాన్ని విస్తరించాం. 15 దేశాలు తిరిగి అవగాహన పెంచుకున్నాను. ద టీ ప్లానెట్ పేరుతో సొంత బ్రాండ్లో ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. 900 రకాల రుచులను పరిచయం చేశాం. కొత్త ఫ్లేవర్లు జోడిస్తూనే ఉంటాం. ద టీ ప్లానెట్ స్టోర్లలో 80 రుచులను కస్టమర్లు ఆస్వాదించొచ్చు. బబుల్ టీ మా ప్రత్యేకత.. టీ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా గతేడాది వ్యవస్థాగతంగా ఔత్సాహిక యువత చాలా మంది టీ హోటళ్ల వ్యాపారంలోకి ప్రవేశించారు. టాటా సైతం ఎంట్రీ ఇచ్చిందంటే మార్కెట్ అవకాశాలను అర్థం చేసుకోవచ్చు. కన్సల్టింగ్ సేవలతోపాటు ఎగుమతులు చేస్తున్న 15 బ్రాండ్లకు థర్డ్ పార్టీగా టీ పొడులను సరఫరా చేస్తున్నాం. విదేశాలకు మా సొంత బ్రాండ్ టీని ప్రవేశపెట్టనున్నాం. ఇక మా ఔట్లెట్లలో బబుల్ టీ ప్రత్యేకం. దీనికి అవసరమైన ముడి పదార్థాలను భారత్లో మేము మాత్రమే తయారు చేస్తున్నాం. కార్డి ప్లస్ పేరుతో రోగనిరోధక శక్తిని పెంచే టీ సైతం రూపొందించాం. డిసెంబర్కల్లా 250 ఔట్లెట్లు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పోలాండ్తో కలిపి 40 ద టీ ప్లానెట్ స్టోర్లు ఫ్రాంచైజీ విధానంలో నిర్వహిస్తున్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 225 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో 50 నగరాలకు విస్తరించడం ద్వారా ఈ ఏడాది డిసెంబరుకల్లా 250 కేంద్రాల స్థాయికి చేరుకోవాలన్నది లక్ష్యం. ఏటా 10 లక్షల కిలోల టీ పౌడర్ ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంది. 10 దేశాల నుంచి సేకరించిన 400 రకాల క్రీమర్స్, మసాలాలు, ఫ్లేవర్స్, పూలు, మొక్కలు, పండ్లతో టీ పొడులను తయారు చేసి విస్తృత పరిశోధన తర్వాత మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. -
మన కంపెనీల విదేశీ పెట్టుబడులు అదరహో
సాక్షి, ముంబై: విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎనిమిది నెలల కాలంలో భారత కంపెనీలు విదేశాల్లో 1,225 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయని కేర్ రేటింగ్స్ వెల్లడించింది. భారత కంపెనీలకు సంబంధించి విదేశీ పెట్టుబడులపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు... (జనవరి నుంచి కార్ల ధరలు మోతే!) మన కంపెనీలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, సింగపూర్, నెదర్లాండ్స్ల్లోని తమ అనుబంధ సంస్థల్లో అధికంగా పెట్టుబడులు పెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి మన కంపెనీలు అమెరికాలో 236 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. సింగపూర్లో 207 కోట్ల డాలర్లు, నెదర్లాండ్స్లో 150 కోట్ల డాలర్లు, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్లో 137 కోట్ల డాలర్లు, మారిషస్లో 130 కోట్ల డాలర్లు చొప్పున మన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మన కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన నిధుల్లో దాదాపు 70 శాతం వాటా ఈ ఐదు దేశాలదే కావడం గమనార్హం. (యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు) ఇక కంపెనీల పరంగా అత్యధికంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా ఓఎన్జీసీ విదేశ్ (185 కోట్ల డాలర్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్(87 కోట్ల డాలర్లు), హల్దియా పెట్రోకెమికల్స్(60 కోట్ల డాలర్లు), హెచ్సీఎల్ టెక్నాలజీస్(59 కోట్ల డాలర్లు), మహీంద్రా అండ్ మహీంద్రా(55 కోట్ల డాలర్లు), అదానీ ప్రాపర్టీస్(39 కోట్ల డాలర్లు), లుపిన్ (38 కోట్ల డాలర్లు), పిరమల్ ఎంటర్ప్రైజెస్ (31 కోట్ల డాలర్లు), క్యాడిలా హెల్త్కేర్(22 కోట్ల డాలర్లు), ఇన్ఫోసిస్(22 కోట్ల డాలర్లు), టాటా స్టీల్(20 కోట్ల డాలర్లు) నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో భారత కంపెనీలు 1,300 కోట్ల డాలర్ల మేర విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. మన కంపెనీల విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ 1,000 కోట్ల డాలర్లు మించడం ఇది వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం. 2008–09 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు అత్యధికంగా 1,900 కోట్ల డాలర్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. 2007–08 ఆర్థిక సంవత్సరంలో కూడా 1,800 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ మన కంపెనీలు విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో 297 కోట్ల డాలర్లు ఈక్విటీ సెగ్మెంట్లో ఉన్నాయి. 338 కోట్ల డాలర్లు తీర్చాల్సిన రుణాలు కాగా, 590 కోట్ల డాలర్లు గ్యారంటీల రూపంలో ఇచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు కాలానికి భారత్లోకి మొత్తం 3,573 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో ఈ స్థాయి ఎఫ్డీఐలు రావడం ఇదే రికార్డ్ స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన ఎఫ్డీఐలు(3,160 కోట్ల డాలర్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిటైల్, టెలికం విభాగాలు జోరుగా ఎఫ్డీఐలను ఆకర్షించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 7,600 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు మన దేశంలోకి వచ్చాయి. రిప్రాట్రియేషన్ సర్దుబాటు అనంతరం నికరంగా 5,600 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఈ స్థాయి ఎఫ్డీఐలు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
పెరుగుతున్న ‘ఫారెన్ లిక్కర్’పై మోజు..
విదేశీ మద్యంపై మనోళ్లు మనసు పారేసుకుంటున్నారు. ‘ఫారెన్ లిక్కర్’పై మోజు పెంచుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో విదేశీ మద్యం వినియోగం పెరుగుతోంది. దేశీయ ప్రీమియం బ్రాండ్లే కాదు, ఖరీదైన ఫారెన్ స్కాచ్ను సేవించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. హైదరాబాద్ వంటి మహా నగరాలు, గోవా వంటి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లోనే ఎక్కువగా వినియోగించే ఈ ఫారెన్ లిక్కర్ ఇప్పుడు జిల్లాలోనూ అమ్ముడు పోతుండడం గమనార్హం. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో విదేశీ మద్యం విక్రయాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. గత మూడు నెలల్లో ఈ ఫారెన్ స్కాచ్ అమ్మకాలు సుమారు పది నుంచి 20 శాతం పెరిగినట్లు ఆబ్కారీశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో జిల్లాలో 90 కేసుల విదేశీ మద్యం అమ్మకాలు జరగగా, అది అక్టోబర్ మాసాంతానికి 110 కేసులకు పెరిగింది. గత నెల నవంబర్ మాసానికి ఏకంగా 122 కేసుల విదేశీ మద్యం అమ్ముడు పోయినట్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. రూ.5 వేల నుంచి రూ.20 వేల దాకా.. గతంలో ఒకటీ, రెండు మద్యం షాపుల నుంచి మాత్రమే ఫారెన్ లిక్కర్ ఇండెంట్ ఉండేదని, అది కూడా ప్రతి నెలా ఉండేది కాదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం ప్రతి నెలా ఈ ఫారెన్ లిక్కర్ ఇండెంట్ ఉంటోందని మాక్లూర్లోని ఐఎంఎల్ డిపో మెనేజర్ జె.వెంకటస్వామి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఈ ఫారెన్ లిక్కర్ ఫుల్ బాటిల్ ధర రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తమ డిపోలో సుమారు 54 బ్రాండ్ల విదేశీ మద్యం నిల్వలున్నాయని, సుమారు 30 బ్రాండ్లే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని డిపో అధికారులు తెలిపారు. దేశీయ మద్యం కంపెనీలే ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసిన మద్యాన్ని దిగుమతి చేసుకుని ఐఎంఎల్ డిపోలకు సరఫరా చేస్తున్నాయని వారు చెబుతున్నారు. గతంలో ఫారెన్ నుంచి వచ్చేవారు తెస్తేనే.. ఉపాధి కోసం జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు అధికంగా వెళ్లారు. వారు తిరిగి వచ్చే సమయంలో అక్కడి నుంచి ఒకటీ, రెండు మద్యం బాటిళ్లు తెచ్చేవారు. ఈ విదేశీ మద్యాన్ని బంధువులు, అత్యంత సన్నిహితులతో మాత్రమే సేవించే వా రు. ఇలా విదేశాల నుంచి వచ్చిన వారి వద్ద మాత్రమే గతంలో ఫారెన్ ‘సరుకు’ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. ఆ విదేశీ బ్రాండ్లన్నీ జిల్లా లోని వైన్సుల్లో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఫారెన్ స్కాచ్ వినియోగదారులు పెరగడానికి కారణమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇటీవలి కాలంలో ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే లిక్కర్ ‘సిట్టింగ్’లు సాధారణమై పోయాయి. పెళ్లిళ్లలోనూ మందు ప్రియుల కోసం ‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేస్తున్నారు. కాస్త సంపన్నుల ఇళ్లలో శుభకార్యాలకు సాధారణ ఖరీదైన లిక్కర్తో పాటు ఈ ఫారెన్ స్కాచ్ను అతిథులకు అందించడం స్టేటస్ సింబల్గా మారి పోయింది. -
భారీగా వెనక్కి మళ్లిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో 1.5 బిలియన్ డాలర్లు (రూ.11,250 కోట్లు) వెనక్కి తీసుకున్నారు. మార్నింగ్ స్టార్ నివేదిక ప్రకారం చూస్తే.. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగింది. అయితే, ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో వెనక్కి వెళ్లిపోయిన నిధులతో చూస్తే చాలా తక్కువే. మార్చి క్వార్టర్ లో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా ఫోకస్డ్ ఫండ్స్, ఈటీఎఫ్ ల నుంచి ఏకంగా 5 బిలియన్ డాలర్లు (రూ.37,500 కోట్లు) ఉపసంహరించుకున్నారు. దీంతో 2020లో జూన్ నాటికి మొత్తం 6.5 బిలియన్ డాలర్లు (రూ.48,750 కోట్లు) భారత్ నుంచి వెళ్లిపోయినట్టు అయింది. 2019 పూర్తి సంవత్సరంలో ఇన్వెస్టర్లు 5.9 బిలియన్ డాలర్లనే వెనక్కి తీసుకోగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఇంతకంటే అధికంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో ప్రధానంగా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్, ఫోకస్డ్ ఈటీఎఫ్ ల ద్వారానే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. ► జూన్ త్రైమాసికంలో వెనక్కి వెళ్లిపోయిన పెట్టుబడులు.. ఇండియాఫోకస్డ్ ఫండ్స్ నుంచి 698 మిలియన్ డాలర్లు, ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఈటీఎఫ్ ల నుంచి 776 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్ లోకి వచ్చే పెట్టుబడులు సాధారణంగా దీర్ఘకాల విధానంతో ఉంటాయి. అదే ఆఫ్ షోర్ ఈటీఎఫ్ ల పెట్టుబడులు స్వల్పకాల విధానంతో కూడినవి. ► ఈ రెండు విభాగాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ 2018 ఫిబ్రవరి నుంచి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్ నుంచి 14.5 బిలియన్ డాలర్లు (రూ.1,08,750 కోట్లు) బయటకు వెళితే, ఇండియా ఫోకస్డ్ ఈటీఎఫ్ ల నుంచి ఇదే కాలంలో 4.2బిలియన్ డాలర్లు (రూ.31,500 కోట్లు) వెనక్కి తీసుకోవడం గమనార్హం. అంటే దీర్ఘకాల పెట్టుబడులే ఎక్కువగా బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. భారత్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న అప్రమత్త ధోరణిని ఇది తెలియజేస్తోందని మార్నింగ్ స్టార్ నివేదిక తెలియజేసింది. ► ఈ స్థాయిలో నిధులు వెనక్కి వెళ్లడం ఊహించనిదేనని, భారతదేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, కరోనా వైరస్ చూపే ప్రభావంపై అనిశ్చిత పరిస్థితులను ఇందుకు కారణంగా పేర్కొంది. ► కరోనాపై భారత్ ఏ విధంగా పైచేయి సాధిస్తుందన్న దాని ఆధారంగానే భవిష్యత్తు పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని తెలిపింది. ► ఈ రెండు రకాల ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో 13 శాతం పెరిగి 33.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లు భారీగా కోలుకోవడం ఆస్తుల విలువ పెరిగేందుకు దోహదపడింది. -
విదేశీ జర్నలిస్ట్లు భారత్ రావొచ్చు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: చెల్లుబాటు అయ్యే వీసాలతో విదేశీ జర్నలిస్టులను కుటుంబ సభ్యులతో పాటు భారత్కు రావడానికి కేంద్రం అనుమతించింది. భారతదేశానికి రావాలనుకునే మరిన్ని వర్గాల విదేశీ పౌరులకు వీసా, ప్రయాణ ఆంక్షలను మరింత సడలించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది.దీని ప్రకారం, ఇప్పటికే భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతి పొందిన విదేశీ పౌరులతో పాటు, జర్నలిస్ట్ (జే -1) వీసాలు కలిగి ఉన్న విదేశీ పౌరులను, జే -1 ఎక్స్ వీసాలు కలిగి ఉన్న వారిపై ఆధారపడిన వారిని భారతదేశంలోకి అనుమతించాలని నిర్ణయించినట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవేళ ఎవరైనా సస్పెండ్ చేయబడిన జే-1 లేదా జే-1 ఎక్స్ వీసాలు కలిగి ఉంటే, అటువంటి వారి వీసాలు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీలుగా తక్షణమే పునరుద్ధరించబడతాయని ఆ నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ద్వారా భారతదేశంలోకి వచ్చే ప్రయాణీకుల రాకపోకలపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలు వీరికి వర్తించవని ప్రభుత్వం తెలిపింది. యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ నుంచి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఒసీఐ) కార్డుదారులకు ప్రభుత్వం ఇప్పటికే భారతదేశం సందర్శించడానికి వీలు కల్పిస్తూ 'ఎయిర్ బబుల్' ఏర్పాట్లపై సంతకం చేసింది. ఈ దేశాల నుంచి వచ్చిన ఇతర విదేశీయులు కూడా వ్యాపారం, వైద్య, ఉపాధి ప్రయోజనాల కోసం భారతీయ వీసా సౌకర్యాన్ని పొందటానికి వీలు కల్పించారు. కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి భారతదేశానికి విదేశీయుల ప్రయాణాన్ని ప్రభుత్వం పరిమితం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: మహిళల వివాహ వయసు పెంపుపై కసరత్తు -
హెచ్సీయూకి ‘విదేశీ’ వెల్లువ
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కోవిడ్ పంజా విసురుతున్నప్పటికీ నగరంలోని సెంట్రల్ వర్సిటీకి విదేశీ విద్యార్థులు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక వర్సిటీగా వెలుగొందుతున్న ఈ విశ్వవిద్యాలయానికి 2020–21 విద్యాసంవత్సరానికిగాను పలు దేశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు వందలాదిగా దరఖాస్తు చేసుకుంటున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. గతేడాది కేవలం 203 దరఖాస్తులు విదేశాల నుంచి రాగా..ఈ సారి 258 ఇంటర్నేషనల్ విద్యార్థుల దరఖాస్తులందాయని పేర్కొన్నారు. అంటే గతేడాదితో పోలిస్తే విదేశీ విద్యార్థుల రాక 20 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) నుంచి 175 దరఖాస్తులు రాగా..ఈ సారి 200 దరఖాస్తులందినట్లు తెలిపాయి. ఇక ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు కలిగి, విదేశీ పాస్పోర్టు కలిగిన వారి నుంచి 38 దరఖాస్తులందడం విశేషం. గతేడాది ఓసీఐ కార్డు కలిగిన వారి నుంచి 30 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నాయి. ఇక వర్సిటీలో అత్యధిక డిమాండ్ కలిగిన ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్కు 18 విదేశీ విద్యార్థుల దరఖాస్తులందడం విశేషం. వర్సిటీకి అందిన విదేశీ విద్యార్థుల దరఖాస్తులు.. 2019–20 విద్యాసంవత్సరం: 30 మంది డైరెక్ట్గా,మరో 175 దరఖాస్తులు ఐసీసీఆర్ సంస్థ ద్వారా విదేశీ విద్యార్థుల దరఖాస్తులందాయి. 2020–21 విద్యాసంవత్సరం: 40 మంది డైరెక్ట్గా,మరో 200 ఐసీసీఆర్ ద్వారా,మరో 18 మంది ఇంటిగ్రేటెడ్ మాస్టర్ప్రోగ్రాంకు విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ దేశాల నుంచే అత్యధికం.. బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, సూడాన్, గాంబియా, మడగాస్కర్, దక్షిణాఫ్రికా, టాంజానియా, గుయానా తదితర దేశాల విద్యార్థులు సెంట్రల్ వర్సిటీలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయా దేశాలతో మెరుగైన సాంస్కృతిక, ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పేందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసిసిఆర్)సంస్థ ఆయా దేశాల విద్యార్థులకు ఇక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు చెందిన విద్యార్థులే పలు కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. విదేశీ విద్యార్థుల వెల్లువతో సెంట్రల్ వర్సిటీకి ఇన్సిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్(ఐఓఈ)స్టేటస్ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గతేడాది కేటాయించిందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఐసీసీఆర్ సౌజన్యంతో మరింత మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు వర్సిటీ ప్రయత్నిస్తోందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. విదేశీ విద్యార్థులకు 15 శాతం కోటా.. నగరంలోని సెంట్రల్ వర్సిటీలో అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కలిగిన పలు కోర్సుల్లో సుమారు 15 శాతం సీట్లను విదేశీ విద్యార్థులకు కేటాయిస్తున్నారు. విదేశీ విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తుండడంతో ఈవర్సిటీని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్(ఐఓఈ) హోదా కల్పించడం విశేషం. ఈ హోదా దక్కడంతో విదేశాలకు చెందిన పలువురు వృత్తి నిపుణులను వర్సిటీలో బోధన చేసేందుకు వీలుగా వారిని నియామకం చేసుకునే అధికారాన్ని వర్సిటీకి ప్రభుత్వం కేటాయించింది. విదేశాలకు చెందిన పలువురు విద్యావేత్తలతో గెస్ట్ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడం, పలు స్వల్పకాలిక కోర్సులకు విదేశీ విద్యార్థులను ఆహ్వానించడం వంటి చర్యలకు సెంట్రల్ యూనివర్సిటీ శ్రీకారం చుడుతోందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. విద్య,పరిశోధన తదితర అంశాల్లో సెంట్రల్ వర్సిటీతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పలు విద్యాసంస్థలు,కంపెనీలు,పరిశోధన సంస్థలు ముందుకొస్తున్నాయని పేర్కొన్నాయి. -
దిగొచ్చిన ట్రంప్ సర్కార్ : వారికి భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి వివాదాస్పద నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఆన్లైన్ క్లాస్లకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులకు షాక్ ఇస్తూ గత నెలలో తీసుకొచ్చిన ఆర్డర్లను తాజాగా రద్దు చేశారు. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఆదేశాలను వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు. తద్వారా లక్షలాది విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. (ఆన్లైన్ క్లాసులా...? మీ దేశాలకు వెళ్లిపోండి!) కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైతే, విదేశీ విద్యార్థులు దేశంలోఉండటానికి వీల్లేదని, అమెరికా విడిచి వెళ్లాల్సిందేనంటూ చేసిన జులై 6 నాటి ప్రకటన జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే వారికి వీసాలు జారీ చేయబోమని ప్రకటించి పెద్ద దుమారాన్ని రేపింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్-1, ఎం-1పై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న వారు కూడా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ఐసీఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అటు ప్రతిపక్షం, ఇటు అమెరికాలోని పలు యూనివర్శిటీలు విద్యార్థులు, టెక్ దిగ్గజాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వీటిని సవాలు చేస్తూ పలు వ్యాజ్యాలు కూడా దాఖలు చేశాయి. ఈ ఒత్తిడి నేపథ్యంలో ట్రంప్ సర్కారు దిగి రాక తప్పలేదు. -
తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్
సాక్షి, విజయవడ: విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక విమానాల్లో విదేశాల నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. సోమవారం ఉదయానికి తొలి ఎయిర్ ఇండియా విమానం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనుందన్నారు. ముంబాయి నుంచి హైరారబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్టుకు తరలింపు జరుగుతుందన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. (కేర్ సెంటర్లలోనే కరోనా కేసులెక్కువ!) కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారంతా గన్నవరం ఎయిర్పోర్టుకే వస్తారని ఆయన చెప్పారు. 14 రోజులపాటు క్వారెంటైన్కు తరలిస్తామన్నారు. ప్రభుత్వ క్వారెంటైన్లో ఉండేందుకు ఇష్టపడని వారికోసం పెయిడ్ క్వారెంటైన్ కేంద్రాలు సిద్ధం చేశామని ఆయన అన్నారు. విజయవాడలోని పలు హోటళ్లు, లాడ్జ్ల్లో 1200 రూములు సిద్ధం చేశామన్నారు.నాలుగు కేటగిరీలుగా రూములను కేటాయిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్లో హోటళ్లకు తరలిస్తామని చెప్పారు. 14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతామని వివరించారు. పెయిడ్ క్వారెంటైన్ల వద్ద మెడికల్ టీం, పారిశుధ్య సిబ్బంది ఉంటారని తలిపారు. పోలీసుల పర్యవేక్షణ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ని వినియోగిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. (ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు) -
కరోనా: వాళ్లంతా సేఫ్...
సాక్షి, గుంటూరు: ఓ గండం గట్టెక్కింది. అధికారుల శ్రమ ఫలించింది, ఏమవుతుందా అని భయం తీరింది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి హోం క్వారంటైన్ శనివారంతో ముగిసింది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా 28 రోజుల పాటు స్వీయ నిర్భంధం ముగిసింది. ఇంటిల్లిపాదికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేకపోవటంతో కరోనా మహమ్మారి నుంచి బయట పడ్డామంటూ సంబరపడిపోయారు. హోం ఐసోలేషన్లో ఉన్న వీరి పట్ల వైద్యాధికారుల, ఏఎన్ఏంలు, వలంటీర్లు, పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,087 మందిని గుర్తించి హోం ఐసోలేషన్లో పెట్టారు. వారి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులను కూడా కలవకుండా 28 రోజుల గహనిర్బంధంలో ఉంచారు. 24 గంటలు వీరి కదలికలపై నిఘా ఉంచారు. ఇళ్ల ముందు పోలీస్ పహారా పెట్టి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. కరోనా లక్షణాలు లేవు జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారు 2,087 మంది ఉన్నారు. వీరందరి హోం క్వారంటైన్ ముగిసింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రస్తుతం కరోనా లక్షణాలు లేవు. –డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, గుంటూరు. -
ఆటోలో విదేశీ దంపతుల విహారం
చెన్నై ,తిరువొత్తియూరు: ఫ్రాన్స్ దేశానికి చెందిన దంపతులు చెన్నై గిండి ప్రాంతంలో ఆటోలో తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని హోటల్కు పంపించారు. గిండి క్రైం విభాగం ఇన్స్పెక్టర్ కన్నన్, పోలీసులు గిండి ఆల్టా ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా విదేశీ దంపతులు ఆటోలో వస్తున్నట్టు సమాచారం అందింది. ఆ మార్గంలో వచ్చిన ఆటోను నిలిపి తనిఖీ చేయగా అందులో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఏసీ(40), అతని భార్య మరియ(28) ఉన్నారు. వారిని పోలీసుస్టేషన్కు తరలించి విచారించారు. వారు జనవరి 26వ తేదీ ముంబయి విమానాశ్రయానికి వచ్చారని, అక్కడి నుంచి గోవాకు వెళ్లారని గుర్తించారు. తర్వాత సొంతంగా ఆటో తీసుకుని మైసూరు, బెంగళూరు, కోవై, ఊటీ, కొడైక్కెనాల్లో తిరిగి చెన్నై వచ్చినట్టు తేలింది. 144 సెక్షన్ అమలులో ఉందని, బయట తిరగవద్దని వారికి సూచించి హోటల్కు తరలించారు. -
పాఠశాలకు ఫారిన్ టచ్
సాక్షి, హైదరాబాద్: ఐటీ, బీపీవో, కేపీవో రంగాలకు కొంగు బంగారంగా నిలిచిన హైదరాబాద్ నగరానికి, విద్యారంగంలోనూ విదేశీ పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విఖ్యాత విద్యాసంస్థలు నగర విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. హైదరాబాద్లో పిల్లలను అంతర్జాతీయ ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం, లక్షల్లో ఫీజులు చెల్లించేందుకు వెనుకాడకపోవటం, నాణ్యమైన విద్యను బోధించే టీచర్లు ఉండడం, తీరైన మౌలిక వసతులు, జీవన ప్రమాణాలకు నగరం నిలయంగా మారటంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది నగర విద్యారంగంలోకి సుమారు రూ.2 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రముఖ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా సంస్థ ‘సెరేస్ట్రా ’తాజా అధ్యయనంలో తేలింది. రూ. 200 నుంచి 500 కోట్ల పెట్టుబడులు అమెరికా, యూకే దేశాల్లో అమల్లో ఉన్న విద్యా విధానాలను నగర విద్యార్థులకు చేరువ చేసేందుకు పలు కార్పొరేట్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ కరిక్యులంతో పాటు.. అత్యాధునిక విద్యావిధానాన్ని పరిచయం చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో ఓక్రిడ్జ్, చిరెక్, యూరోకిడ్స్ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వీటికి తోడు తాజాగా ఫిన్లాండ్కు చెందిన కాగ్నిటా, హాంకాంగ్ చెందిన నార్డ్ ఏంజిలా వంటి విద్యా సంస్థలు నగరంలో తమ బ్రాంచీలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ సంస్థలతో పాటు నూతనంగా వస్తున్న సంస్థలు రూ.200 – 500 కోట్ల పెట్టుబడులను ఈ ఏడాది నగర విద్యా రంగంలో పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. పెట్టుబడుల వెల్లువకు కారణాలివే.. ►కార్పొరేట్ విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం. ►లక్షల్లో ఫీజులు చెల్లించేందుకు వెనుకాడకపోవడం. అంతర్జాతీయ ప్రమాణాలను తమ చిన్నారులు అందిపుచ్చుకుంటారన్న నమ్మకం. ►కార్పొరేట్ విద్యా సంస్థల ఫ్రాంచైజీలను దక్కించుకునేందుకు నగరంలో పలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం. -
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణే ముందు..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువు, ఉద్యోగం కోసం ఎందాకైనా వెళ్లేందుకు ఈ తరం వడివడిగా అడుగులేస్తోంది. పుట్టిన ప్రాంతం, పెరిగిన రాష్ట్రమే కాదు ఏకంగా దేశ సరిహద్దులు దాటి విదేశీ గడ్డపై కాలుమోపేందుకు ఏమాత్రం సంశయించటం లేదు. డిగ్రీ పట్టా చేతికొచ్చే కంటే ముందుగానే ఈ తరం యువత పాస్పోర్ట్ను పొందేస్తుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పాస్పోర్ట్లు తీసుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉందని తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన లెక్కలు తేల్చేశాయి. మరాఠా, మలయాళీలే టాప్.. పాస్పోర్ట్ల స్వీకరణలో దేశంలో జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలను కాదని మహారాష్ట్ర, కేరళ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 2014–19 మధ్యలో మహారాష్ట్రలో 71,22,849 పాస్పోర్ట్లు జారీ అయితే అందులో 11,89,846 మంది తమ పాస్పోర్ట్లను కేవలం 2019లోనే అందుకున్నారు. జనాభా పరంగా చాలా చిన్న రాష్ట్రమైన కేరళ విద్య, ఉపాధి విషయంలో వేగిరపడే దిశగా గడిచిన ఐదేళ్లలో 67,44,557 మందికి పాస్పోర్ట్లను జారీ చేసింది. అందులోనూ 2019 ఒక్క ఏడాదిలోనే 10,89,859 మంది పాస్పోర్ట్లు పొందారు. తమిళ, కన్నడనాడుల్లోనూ జోరు.. ప్రపంచంలో ఎక్కడ ఉపాధి లభించినా వెళ్లేందుకు ఆసక్తి చూపే తమిళవాసులు తమ ఆనవాయితీని కొనసాగిస్తూనే ఉన్నారు. గడిచిన ఏడాదిలో తమిళనాడులో 9,58,073, కర్ణాటకలో 7,01,990 పాస్పోర్ట్లు జారీ అయ్యాయి. దేశంలోనే జనాభా పరంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 9,00,462 పాస్పోర్ట్లు జారీ అయ్యాయి. అతిచిన్న ప్రాంతాలైన లక్షదీ్వప్లో కేవలం 1,903, అండమాన్లో 2,263 పాస్పోర్ట్లను ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణే ముందు.. విద్య, ఉపాధి వేటలో తెలుగోడి స్పీడ్ కొనసాగుతూనే ఉంది. గడిచిన ఏడాదిలో తెలంగాణలో 4,79,408, ఆంధ్రప్రదేశ్లో 3,73,492 మందికి పాస్పోర్ట్లు జారీ అయ్యాయి. గడిచిన ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 53,85,964 మందికి పాస్పోర్ట్లు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐటీ జాబ్లతోపాటు గల్ఫ్ కంట్రీలకు వివిధ రంగాల్లో కారి్మకులుగా(బ్లూకాలర్) వెళ్లేందుకు పాస్పోర్ట్లు పొందుతున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది. దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ సమయం పదిన్నర రోజులు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 3 నుంచి 5 పనిదినాలే ఉండటం మరో విశేషం. పాస్పోర్ట్.. మస్ట్ అయింది ఐటీ జాబ్లకు వెళ్లిన సమయాల్లో పాస్పోర్ట్ ఉండటం అనేది అదనపు అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రముఖ కంపెనీలు పాస్పోర్ట్లోని వివరాలనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో పాస్పోర్ట్ తప్పనిసరైంది.– పి.జశ్వంత్రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడికైనా.. రెడీ పాస్పోర్ట్ అనేది కీలక ఐడెంటిటీ. పాస్పోర్ట్తో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుంది. అందుకే తొలుత పాస్పోర్ట్ పొంది ఆపై అవకాశాల కోసం ఈ తరం ఎదురు చూస్తోంది.– నీలిమ, మేనేజర్, ఐటీ -
లిఫ్ట్ ఇస్తానని విదేశీ మహిళపై లైంగిక దాడి
పూణే : లిఫ్ట్ ఇస్తామని చెప్పి తమ బైక్పై ఎక్కించుకున్న ఉగాండా యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన పూణేలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి కొరేగావ్లోని ఓ రెస్టారెంట్ వెలుపల వేచిచూస్తున్న మహిళను బైక్పై వచ్చిన వ్యక్తి మాటల్లోకి దింపాడు. ఆమె బైక్ ఎక్కేందుకు సమ్మతించగా మరో వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించి ముగ్గురూ కలిసి బయలుదేరారు. మహిళను ఆమె ఇంటివద్ద దింపకుండా వేరే మార్గంలోకి బైక్ను మళ్లించి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుపై ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
విదేశీ పర్యాటకులపై క్యాబ్ ఎఫెక్ట్
-
హాయ్ డియర్.. ఐ యామ్ ఫారినర్!
అవును...విదేశీయులే మంచి టూరిజం ప్రేమికులు అంటున్నారు మన దేశీ టూరిస్ట్ గైడ్స్. మన దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఈ సీజన్లో ఎక్కువ మంది విదేశీయులు వస్తుంటారని, వారితో కలిసి పర్యటించి ఇక్కడి విశేషాలను వారికి వివరించడం ఎంతో ఆనందాన్నిస్తుందనివారంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మన దేశానికి వచ్చే విదేశీపర్యాటకులను మొదట అంచనావేసేది టూరిస్ట్ గైడ్స్ మాత్రమే.వీరి మీద దేశీ పర్యాటకులకన్నా ఫారినర్సే ఎక్కువ ఆధారపడతారు. మన దేశంలో ఆతిథ్యం గురించి చెప్పేదీ వారే. సాధారణంగా సెప్టెంబర్ నెల నుంచి మార్చి వరకూ విదేశీ పర్యాటకులు వెల్లువెత్తుతారు. ఈ నేపధ్యంలో నగరానికి చెందిన పలువురు గైడ్స్ విదేశీయులతో తమకు ఎదురైన అనుభవాలను ‘సాక్షి’తోపంచుకున్నారు. టూరిజమ్.. జీవితమ్.. మనలో ఎక్కువ మందికి ‘పర్యటన’ అంటే ఒక విలాసం, ఒక వినోదం, ఆనందం మాత్రమే. అయితే, విదేశీయులకు మాత్రం ప్రయాణాలు జీవితంలో ఓ భాగం. వారు ప్రతీది తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు.ప్రత్యేకించి సామాజిక జీవన విధానం,జంతు జీవన విధానం తెలుసుకోవాలనే ఆసక్తి వీరిలో ఎక్కువ. మన సంస్కృతి, సంప్రదాయాలు, బాంధవ్యాలు, కళలు, చారిత్రక కట్టడాలను సందర్శించి, విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారంటున్నారు నగరానికి చెందిన టూర్ గైడ్స్. బతుకమ్మ కోసం జపాన్ నుంచి.. జపాన్ నుంచి ఓ పర్యాటకుడు బతుకమ్మ పండగ చూడటానికే గత కొన్నేళ్లుగా రాష్ట్రానికి వస్తున్నాడు. అతనికి జపాన్లో పువ్వుల అలంకరణ పాఠశాల ఉంది. దేవీ నవరాత్రుల సమయంలో 10 రోజుల పాటు కరీంగనర్లో ఉండి, ఒక్కో రోజు ఒక్కో ఇంటికి వెళ్లి బతుకమ్మ తయారీ విధానం తెలుసుకున్నాడు. విదేశీ పర్యాటకలకు మనదేశంలో ప్రతి అంశం తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. వారిని గైడ్గా రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోతే వెంటనే మరో గైడ్ను వెతుక్కుంటారు. అందుకే రోజులో కనీసం 5 నుంచి 6 గంటలు పుస్తకాలు చదువుతూ, నెట్ శోధిస్తూనే ఉంటాం. – మధు, టూరిస్ట్ గైడ్ మరచిపోరు.. పర్యాటకులు మాతో కలిసి పది, ఇరవై రోజులు ఉంటారు. తమ దేశాలకు వెళ్లాక కూడా మెయిల్స్, ఫోన్లు, ఇంటర్నెట్ చాటింగ్ ద్వారా పలకరిస్తూనే ఉంటారు. ఒక్కోసారి కొందరు తరచుగా వస్తుంటారు. అప్పుడు మా పేరు చెప్పి, మేమే గైడ్గా కావాలని కోరుకునేవారు ఉన్నారు. రెండేళ్ల క్రితం టెక్స్టైల్ టూర్ కోసం ఓ కంపెనీ వారు న్యూయార్క్ నుంచి రాష్ట్రానికి ఐదు రోజుల పర్యటనకు వచ్చారు. పోచంపల్లి, గద్వాల, పెడన.. ప్రదేశాలను చూపుతూ, వస్త్ర పరిశ్రమకు సంబంధించి పూర్తి సమాచారం అందించాను. వారు చాలా ఇంప్రెస్ అయి న్యూయార్క్ టెక్స్టైల్ మ్యూజియంలో నాకు మెంబర్షిప్ కూడా ఇచ్చారు. – వెంకటేశ్వర్లు మనసుకు హత్తుకున్న జ్ఞాపకం దక్షిణాఫ్రికాలోని డర్బన్ నుంచి ఒక కుటుంబం తమ మూలాలను వెతుక్కుంటూ మనదేశానికి వచ్చింది. వాళ్ల పూర్వీకులెవరో అనకాపల్లికి 40 కి.మీ దూరంలో ఉన్న జంపన అనే కుగ్రామం నుంచి దక్షిణాఫ్రికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారట. తమ మూలాలు భారత్లో ఉన్నాయనే విషయం వందేళ్ల తర్వాత వారి మనమలకు ఒక పేపర్ కటింగ్ ద్వారా తెలిసింది. దాంతో ‘జంపన’ అనే ఊరు తెలుసుకోవడానికి మనదేశం వచ్చారు. ఆ ఊళ్లోనూ, చుట్టుపక్కల ఊళ్లలోనూ తమ పూర్వీకులకు చెందిన కుటుంబీకులను కలుసుకొని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. నా ‘హృదయాన్ని స్పర్శించిన ఆ సంఘటన నాకూ కంట నీరు తెప్పించింది.– సుబ్రహ్మణ్యం సమాచారం ముఖ్యం వరల్డ్ హాంగ్కాంగ్ ఫొటోగ్రఫీ అసోసియేషన్ వారు విదేశాల నుంచి ఫొటోగ్రఫీ పోటీ కోసం ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ నుంచి కాకినాడ టు ఇచ్చాపురం వరకు కోస్తా తీర ప్రాంతంలో పది రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో తిరిగి ఫిషరీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? ఉష్ణోగ్రత, చేపలు బాగా ఉండే సమయం, సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో ప్రకృతి వింతలు.. వివరాలన్నీ సేకరించాను. నేను అందించిన వివరాల ఆధారంగా పదిరోజుల పాటు ఆ బృందం ఇక్కడే ఉండి, సముద్ర జీవరాశులను కెమెరాల్లో బంధించారు.– అరవవల్లి శ్రీనివాస్రెడ్డి బట్టమేక పక్షి కోసం.. ఒక విదేశీయుడు.. అంతరించిపోతున్న ‘బట్టమేక పక్షి’ కోసం మాత్రమే మన దగ్గరకు వచ్చాడు. ఆ పక్షి ఎక్కడకు వస్తుందో వెతకడానికే నాకు రెండు రోజులు పట్టింది. ఎవరెవరినో సంప్రదిస్తే రోళ్లపాడు దగ్గర నందికొట్కూరులో ఒక పక్షి ఉందని తెలిసింది. అతన్ని తీసుకొని, ఆ పక్షి కోసం బయల్దేరాను. ముందుగా ఆ పక్షి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని, అతనికి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగాను. – శ్రీనివాస్ పండగ పూటా వారితోనే.. పండగలు, పర్వదినాల సమయంలోనే విదేశీ పర్యాటకులతో టూర్స్ ఉంటాయి. దాంతో పండగ పూట ఇంట్లో ఉండండం కష్టమే. తరచుగా మన పండుగలను వారితో కలిసే చేసుకుంటా. కుటుంబ, వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేస్తే తప్ప ఈ వృత్తిలో విజయం సాధించలేం.– కరుణానిధి క్రిస్మస్కుమా దేశానికి రండి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు క్రిస్మస్ టూర్ల సందడి రాజుకుంటోంది. క్రిస్మస్ను పురస్కరించుకుని ఏర్పాటు చేసే విభిన్న రకాల వేడుకలు, ప్రదర్శనలతో పలు దేశాల్లో రహదారులన్నీ సంబరాల ప్రవాహంతో తడిసి ముద్దవుతుంటాయి. గాల్లో దర్శనమిచ్చే శాంతాక్లజ్లు, 3డీ లైటింగ్ షోస్, ఫ్లైయింగ్ లైట్స్.. వంటి విభిన్న తరహా విశేషాలను ఆస్వాదించేందుకు ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపధ్యంలో పలు దేశాలు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ప్రకటిస్తుంటాయి. ఈ కోవలోనే స్విట్జర్లాండ్ ‘ది గ్రాండ్ ట్రైన్ టూర్’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో ఆ దేశంలోని సుందర ప్రదేశాలతో పాటు క్రిస్మస్ సందడి జరిగే ప్రాంతాలను కూడా సందర్శించేందుకు వీలు కల్పిస్తోంది. ఆ దేశంలోని జర్మట్లో ఈ నెల 1 నుంచి, సెయింట్ మారిట్జ్లో 4న ప్రారంభమైన క్రిస్మస్ మార్కెట్ ఈ సారి సందర్శకులకు కళ్లు చెదిరే అనుభూతులను అందిస్తుందని స్విట్జర్లాండ్ పర్యాటకశాఖ ప్రతినిధులు చెబుతున్నారు. -
పారిశ్రామికవేత్తపై ఐరోపా యువతి ఫిర్యాదు
తమిళనాడు ,టీ.నగర్: చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త మోసగించినట్లు ఐరోపా యువతి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై అమింజికరై రైల్వే కాలనీ మూడో వీధికి చెందిన రూమోస్ అహ్మద్ (28) పారిశ్రామికవేత్త. పెద్ద స్థాయిలో రొయ్యల వ్యాపారం చేస్తున్నాడు. ఇతను వ్యాపారరీత్యా కొన్ని నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఆ సమయంలో ఐరోపాలోని లిథువేనియా ప్రాంతానికి చెందిన యువతి (22) దుబాయ్లో ఉన్నత విద్య చదువుతోంది. రూమోస్ అహ్మద్ ఆమెను కలిసి మాట్లాడడంతో స్నేహం ఏర్పడింది. ఇది కాలక్రమంలో ఇరువురి మధ్య ప్రేమకు దారితీసింది. ఇరువురూ పలుసార్లు ఏకాంతంగా కలుసుకున్నారు. దీంతో ఆమె ఐదు నెలల గర్భిణి. తర్వాత యువతిని రూమోస్ అహ్మద్ చెన్నై తీసుకువచ్చి ఎగ్మూరులోని ఒక హోటల్లో ఉంచాడు. ఇలాఉండగా రూమోస్ అహ్మద్ తండ్రి ప్రోద్బలంతో జూన్ 21న థౌజండ్ లైట్స్లోని ఆస్పత్రిలో యువతికి అబార్షన్ చేయించినట్లు సమాచారం. అయితే మళ్లీ ఆ యువతి రెండు నెలల గర్భిణి అని తెలిసింది. దీంతో రూమోస్ అహ్మద్ను వివాహం చేసుకోవాలని బలవంతం చేసింది. అతను ఆమెను వివాహం చేసుకోకుండా అదృశ్యమయ్యాడు. దిగ్భ్రాంతి చెందిన బాధిత యువతి థౌజండ్లైట్స్లోని మహిళా పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు రూమోస్ అహ్మద్ కోసం గాలిస్తున్నారు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సాయి ఎన్క్లేవ్లో ఉన్న డౌన్టౌన్ హోటల్పై బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఓ విదేశీ యువతితో పాటు పంజాబ్కు చెందిన మరో యువతి ఇక్కడ వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరిని పోలీసులు శనివారం పునరావాస కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే... సైఫాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న అమృతాక్యాజిల్ హోటల్లో సాయి అలియాస్ శర్మ అనే వ్యక్తి రెండు గదులను అద్దెకు తీసుకొని విదేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. కొంత మంది విటులు ఈ హోటల్కు కాకుండా తాము కోరుకున్న హోటల్కు యువతులను పంపించాలని ఒప్పందం కుదర్చుకుంటే ఆ మేరకు ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తూ సహాయకుడిగా రాజేష్కుమార్ సాహును నియమించుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఓ విటుడు బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ది డౌన్టౌన్ హోటల్లో గదిని బుక్ చేసుకొని అక్కడికి ఉజ్బకిస్తాన్ దేశానికి చెందిన ఓ యువతిని రప్పించుకున్నాడు. ఆమెతో పాటు పంజాబ్కు చెందిన మరో యువతిని కూడా ఒప్పందంలో భాగంగా పంపించాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హోటల్పై దాడి చేసి ఉజ్బకిస్తాన్కు చెందిన అజీజాతో పాటు ఖుషీపాటక్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన వ్యభిచార నిర్వాహకుడు సాయి పరారీలో ఉండగా ఆయన అనుచరుడు రాజేష్కుమార్ను అరెస్ట్ చేశారు. యువతులను సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. ది టౌన్టౌన్ హోటల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ఎస్ఐ బచ్చు శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఊరెళ్దాం.. పల్లెటూరెళ్దాం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఫ్లోరిడాకు చెందిన దంపతులు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో అంతర్జాతీయ సెమినార్కు హాజరయ్యారు. వారి పదేళ్ల కూతురుని అక్కడి ఓ దృశ్యం విపరీతంగా ఆకర్షించింది. ఎంతగా అంటే, ఆ దృశ్యాన్ని మరోసారి చూసేందుకు హైదరాబాద్కు వచ్చేంతగా.. ఇంతకూ ఆకట్టుకున్న ఆ దృశ్యమేంటో తెలుసా.. కుండల తయారీ. దీంతో విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ పల్లెలను ముస్తాబు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విలేజ్ టూరిజం... కొత్త కాన్సెప్ట్ కానప్పటికీ, మనకున్న విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేవి అవే. రెండేళ్ల గణాంకాలను పరిశీలించిన ప్రభుత్వం దాన్ని ఖరారు చేసుకుని ఆ దిశగా అడుగులేస్తోంది. రెండేళ్లలో మన పల్లెలను చూసేందుకు వచ్చిన పర్యాటకుల్లో 21% పెరుగుదల నమోదైంది. దీంతో విదేశీ టూరిస్టుల సంఖ్యను ఏడాది కాలంలో 30 శాతానికి పెంచాలని పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. 2014లో తెలంగాణను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య కేవలం 75 వేలు. అదే సమయంలో మన పొరుగున ఉన్న కర్ణాటకను సందర్శించినవారి సంఖ్య 6 లక్షలు. 2017లో తెలంగాణకు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య 2.51 లక్షలు, 2018కి ఈ సంఖ్య 3.18 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటికీ ఆ సంఖ్య దాదాపు 2 లక్షలుగా ఉంది. కేవలం ఏడాది కాలంలో పెరుగుదల రేటు 21 శాతంగా ఉండటం ప్రభుత్వంలో కొత్త ఆశలు చిగురించాయి. ఏమిటా కసరత్తు.. నగరాల్లో మగ్గే జనానికి పల్లె వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. అక్కడి గాలి, ఉదయం–సాయంత్రం వేళ కనిపించే ప్రకృతి రమణీయత, వ్యవసాయం, చేతివృత్తులు, జంతుజాలం.. ఒకటేమిటి, గ్రామీణ సౌందర్యం ఆహ్లాదపరుస్తుంది. అందుకే గ్రామీణ ప్రాంతాలను పర్యాటకంలో చేర్చటం ద్వారా వారిని ఆకట్టుకోవాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. - నగర శివారులోని శామీర్పేటలో పల్లె వాతావరణంతో కూడిన ఓ కృత్రిమ గ్రామాన్ని నిర్మించబోతున్నారు. తెలంగాణ వల్లె వాతావరణం ప్రతిబింబించేలా ఉండటంతోపాటు కులవృత్తులను కళ్లముందుంచనున్నారు. తెలంగాణ రుచులను కూడా అందుబాటులో ఉంచుతారు. - దేశంలోనే కవ్వాల్ అభయారణ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆదిలాబాద్ జిల్లాల్లో మహారాష్ట్రతో అనుసంధానమై ఉన్న ఈ ప్రాంతం పులులు, జింకలు, అడవి దున్నలు, ఇతర జంతువులు, పక్షులకు పెట్టింది పేరు. అభయారణ్యాన్ని ఆనుకుని పలు గ్రామాలున్నాయి. ఈ మొత్తాన్ని విదేశీయులకు చూపే విధంగా అటవీ శాఖతో పర్యాటకాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకోబోతోంది. ట్రెక్కింగ్, బోటింగ్, బంగీ జంపింగ్లాంటి క్రీడలను, గ్రామీణ రెస్టారెంట్లను ఏర్పాటు చేయనుంది. - కవ్వాల్ అభయారణ్యం విస్తరించిన జన్నారం నుంచి కడెం రిజర్వాయర్ వరకు పర్యాటక ప్లాన్ను రూపొందిస్తున్నారు. - శ్రీశైలం నల్లమల అడవుల్లోని మన్ననూరు, అక్క మహాదేవి గుహలు, ఉమామహేశ్వరం, ఫరాబాద్, మల్లెల తీర్థం ప్రాంతాల్లో కూడా విదేశీయు లను ఆకట్టుకునే ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. - గోదావరి తీరంలో ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి, జంపన్నవాగు.. ఆ ప్రాంతంలోని ప్రపంచంలోనే ఎక్కువ పరిధిలో విస్తరించిన ఆదిమానవుల జాడలతో కూడిన ప్రాంతాన్ని చేర్చి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే తోవలో ఉండే లక్నవరం, రామప్ప సరస్సుల వద్ద కూడా రూరల్ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు. - ఇప్పటివరకు తెలంగాణలో యునెస్కో గుర్తించిన ప్రాంతాలు లేవు. తాజాగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో పరిశీలిస్తోంది. ప్రపంచ పర్యాటక పటంలో దానికి చోటు దక్కితే అక్కడికి వచ్చే విదేశీయుల సంఖ్య వేలల్లో ఉండనుంది. ఆ మేరకు ఆ ప్రాంతాన్ని గ్రామీణ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ టు అడవులు... టీహబ్ లాంటి చర్యలతో ఇప్పుడు హైదరాబాద్కు వచ్చే విదేశీయుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడి ఐటీ పరిశ్రమకు అనుబంధంగా నగరంలో రకరకాల ఇతివృత్తాలతో వందకుపైగా ఎగ్జిబిషన్లు, అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యేవారు వీలు చిక్కితే పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. విదేశీయులను ఆకట్టుకునే ఏర్పాట్లు మన వద్ద అంతగా లేకపోవటం, తెలంగాణ పర్యాటకానికి ప్రపంచపటంలో పెద్దగా చోటు దక్కకపోవటంతో వాటిపై ముందస్తు ప్రణాళికలను వారు సిద్ధం చేసుకోవటం లేదు. ఇప్పుడు దీన్ని అధిగమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఫారిన్ పండు.. భలేగుండు
అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివీ, వాషింగ్టన్ ఆపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్ ఫ్రూట్.. ఇలాంటి పండ్లు కావాలంటేఆ దేశాలకు వెళ్లనక్కరలేదు.ఏ దేశంలో పండే పండ్లయినా సరే నగర మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటి రుచిని ఆస్వాదించేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్టే నగరంలో ప్రతి వేసవిలో విదేశీ పండ్ల వినియోగం భారీగా పెరిగుతోంది. హోల్సేల్ మార్కెట్, ఫుడ్ బజార్లు, పెద్ద వాణిజ్య కేంద్రాలు, సూపర్ మార్కెట్లలో ఇవి దర్శనమిస్తున్నాయి. పైగాప్రతి గల్లీలోనూ విదేశీ పండ్ల విక్రయించే చిల్లర వ్యాపారులుతెగ తిరుగుతున్నారు. ఈ తరహా పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయని నమ్మేవారు పెరుగుతుండడంతో వీటి అమ్మకాలు సైతం ఊపందుకుంటున్నాయి.గతేడాది కంటే ఈసారి విదేశీ పండ్ల వ్యాపారం పెరగడమే ఇందుకు నిదర్శనమని వ్యాపారులు చెబుతున్నారు. 20 దేశాల నుంచి దిగుమతి ఇటీవల కాలంలో నగరానికి విదేశీ రకాల పండ్ల దగుమతులు భారీగా పెరిగాయి. రోజుకు 50 నుంచి 60 టన్నుల వరకు అన్ని రకాల పండ్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని గడ్డిఅన్నారం మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నగరం నుంచి ఈ పండ్లను పక్క రాష్ట్రాలు, జిల్లాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలోనే పెద్దదైన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ విదేశీ పండ్లకు పెట్టింది పేరు. ఇక్కడికి దాదాపు 20 విదేశాల నుంచి వివిధ రకాల పండ్లు ఇక్కడి దిగుమతి అవుతున్నాయి. ఈ పండ్ల వినియోగంలో ముంబై, బెగళూరు తర్వాత నగరం దేశంలో మూడో స్థానంలో ఉంది. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా పండే అన్ని రకాల పండ్లు నగర మార్కెట్లో సీజన్ ప్రకారం అందుబాటులో ఉండడం విశేషం. ఆన్లైన్లోనే బేరసారాలు.. మార్కెట్ హోల్సెల్ వ్యాపారులు వివిధ దేశాల్లో లభించే పండ్లలను అక్కడి వ్యాపారులను ఆన్లైన్లో సంప్రదిస్తారు. వారివద్దనున్న పండ్లను వాట్సప్, మెయిల్లో ఫొటోలు పంపగా ధరలను నిర్ణయించుకుని ఆన్లైన్లోనే అడర్ చేస్తున్నారు. తర్వాత ఆయా దేశాల నుంచి పండ్లు చెన్నై, ముంబై ఓడ రేవులకు దిగుమితి అవుతాయి. అక్కడి నుంచి నగరానికి కూల్ కంటైనర్లలో నగరానికి చేరుతున్నాయి. విదేశాల్లో కంటే ఇక్కడే ధర తక్కువ.. విదేశీ పండ్ల ధరలు ఇక్కడే తక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఒక ఆపిల్ ఒకటి నుంచి రెండు డాలర్లు. అదే పండు మనకు రూ.30కి లభిస్తోంది. ఇలా విదేశాల నుంచి వచ్చే అన్ని పండ్లూ అక్కడి ధరల కంటే మనకే తక్కువకు లభిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఏ పండు ఎక్కడి నుంచంటే.. ♦ గ్రీన్ ఆపిల్.. నెదర్లాండ్స్, యూఎస్, ఫ్రాన్స్, ఇటలీ నుంచి నెలకు దాదాపు 12 వేల పెట్టెలు నగర హోల్సెల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటన్నారు. ♦ ఆపిల్, రాయల్ ఆపిల్.. వాషింగ్టన్, చైనా, న్యూజిలాండ్, చిలీ, బెల్జియం నుంచి ముంబై, చెన్నై పోర్టుల ద్వారా నగరానికి దిగుమతి అవుతున్నాయి. ♦ కివీ.. న్యూజిలాండ్, ఇటలీ, ఇరాన్తో పాటు చైనా నుంచి వస్తున్నాయి. ప్రసుత్తం దేశీయ పండ్ల కంటే విదేశీ కివీకి ఎక్కువ డిమాండ్ ఉంది. ♦ ప్లమ్.. చూడ్డానికి చిన్న ఆపిల్, టమాటలా కనిపించే ఈ పండును స్పెయిన్ నుంచి వస్తుంది. ♦ డ్రాగన్ ఫ్రూట్.. వియత్నాం, థాయిలాండ్ దేశాల నుంచి వసుతంది. ♦ చెర్రీ.. నగరానికి దిగుమతి అవుతున్న పండ్లలో చెర్రీ కూడ ఒకటి. దీన్ని న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేస్తున్నారు. ♦ యాపిల్ రెడ్ గాలా.. ఫిజీ, ఫ్లేమ్ ద్రాక్ష.. ఆస్ట్రేలియా నుంచి.. ఈజిప్ట్ నుంచి పెద్ద సైజు నారింజ పండ్లు దిగుమతి అవుతున్నాయి. నగరంలో అధిక డిమాండ్ గతంలో పోలిస్తే విదేశీ పండు తినాలనే ఆసక్తి నగర ప్రజల్లో పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని అందించే ఆపిల్, కివీ, పియర్స్తో పాటు మరిన్ని విదేశీ రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. – క్రాంతి ప్రభాత్రెడ్డి, విదేశీ పండ్ల హోల్సేల్ వ్యాపారి దిగుమతులు పెరిగాయి మార్కెట్కు గతంలో కంటే విదేశీ పండ్ల దిగుమతులు పెరిగాయి. వాటిని నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్ చాంబర్లు ఏర్పాటు చేశాం. దేశంలోని ఇతర పండ్ల మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మార్కెట్ ఆదాయం కూడా పెరిగింది, గడ్డి అన్నారం మార్కెట్కే విదేశీ పండ్ల దిగుమతి జరుగుతోంది. – ఈ. వెంకటేశం, గడ్డి అన్నారం మార్కెట్ కార్యదర్శి -
గ్రామస్తుల ఐక్యతకు ‘విదేశీయుల’ సలామ్
సాక్షి, ఐనవోలు: మండలంలోని ఒంటి మామిడిపల్లి గ్రామస్తుల ఐక్యతను బాల వికాస ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన విదేశీ బృందం ప్రశంసించింది. శుక్రవారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సూడాన్, అఫ్ఘనిస్తాన్, శ్రీలంక దేశాలకు చెందిన 11 మంది సభ్యుల విదేశీ ప్రతినిధుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలను గ్రామస్తులు ఏవిధంగా సమిష్టి నిర్ణయంతో తిరిగి తెరిపించుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలకు జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉందని గ్రామస్తులు తెలియజేశారు. విదేశీ ప్రతినిధి బృందం గ్రామం మొత్తం తిరిగి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి çపనుల గురించి సర్పంచ్ ఆడెపు దయాకర్, ఎంపీటీసీ పెండ్లి కావ్య తిరుపతిలను అడిగి తెలుసుకున్నారు. మౌళిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. బాలవికాస ప్రతినిధులు పీడీటీసీ మేనేజర్ సునీత, ఆఫీసర్ ఫ్రాన్సిస్ మంజుల, గజేందర్, సురేందర్, పాఠశాల చైర్మన్ పొన్నాల రాజు, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ జైపాల్, రాజు, వెంకన్న, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నారై.. ఎవరికి సై?
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా పాతబస్తీ నుంచి వేల సంఖ్యలో జనం విదేశాల్లో నివసిస్తున్నారు. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అంచనా ప్రకారం విదేశాల్లో ఉంటున్నవారిలో మొదటి స్థానంలో కేరళవాసులు ఉండగా, రెండో స్థానంలో పంజాబ్ ఉంది. మూడో స్థానంలో తెలంగాణవాసులు ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో వీరి ఓటు గెలుపు ఓటములను ప్రభావితం చేయనుందా.. ఏ పార్టీ వైపు వీరు మొగ్గు చూపనున్నారనే అంశం ఉత్కంఠగా మారింది. కాగా ఓటర్ జాబితాలో వీరి పేర్లు ఎన్నారైలుగా గుర్తించి లేవు. గతంలో ఓటర్ జాబితాలోని చివరి పేజీలో ఎన్నారైల సంఖ్య ఉండేది. ఇటీవల విడుదలైన జాబితాలో ఎన్నారై కాలమ్ లేకపోవడం గమనార్హం. అయితే వీరి పేర్లు ఓటర్ లిస్ట్లో వేరుగా లేకపోవడంతో బోగస్ ఓటింగ్ అయ్యే ప్రమాదం ఉందని పలు రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాలపై ప్రత్యేక కథనం. సుమారు ఇంటికి ముగ్గురు చొప్పున.. చాంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్పేట్, చార్మినార్, నాంపల్లి నియోజకవర్లాల్లోని పలు బూత్ల్లో సుమారు ఇంటికి సుమారు ముగ్గురు చొప్పున విదేశాల్లో ఉంటున్నారు. ఇది కేవలం చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలో కాదు.. చార్మినార్, యాకత్పురా, నాంపల్లి, కార్వాన్, మలక్పేట్, ఖైరతాబాద్, ఎల్బీనగర్తో పాటు గ్రేటర్లోని వివిధ నియోజవర్గాల ప్రజలు విదేశాల్లో ఉంటున్నారు. ఎమ్మిగ్రేషన్ అధికారుల అంచనా ప్రకారం గ్రేటర్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన దాదాపు 1.5 లక్షల మంది విదేశాల్లో ఉంటున్నారు. ఇందులో గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం పాతబస్తీలోని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో పోలింగ్ బూత్నంబర్ 93 నుంచి 110లో ఎన్నారైలు అత్యధికంగా ఉన్నట్లు సాక్షి సర్వేలో తేలింది. దీంతో పాటు కార్వాన్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 116 నుంచి, 185 వరకు ఇదే నియోజకవర్గంలోని బూత్ నంబర్ 223 నుంచి 240 వరకు ఉన్న ఇళ్లలో ఉంటున్న వారు కూడా విదేశాల్లో ఉంటున్నారు. బోగస్లనుఅరికట్టడం కష్టమే.. ఓటరు లిస్టులో ఎన్నారై ఓటుగా నమోదు కాకపోవడంతో బోగస్ ఓట్లను అరికట్టడం కష్టమవుతుందని నియోజకవర్గాల ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఓటేసే వ్యక్తి పురుషుడై తే అతని ముఖం చూసి గుర్తు పట్టవచ్చని, మహిళ అయితే మాత్రం గుర్తించడం కష్టమేనని భావిస్తున్నారు. విదేశాల్లో ఉండే వ్యక్తులు ఎన్నారైలుగా ఓటరు లిస్ట్లో ప్రత్యేకంగా గుర్తించాలని, దీంతో బోగస్ ఓట్లను పోల్ కాకుండా చర్యలు తీసుకోచ్చని రిట్నరింగ్ అధికారుల అంచనా. పాస్పోర్టు చూపించి ఓటేయవచ్చు.. భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి అయినా విదేశాల్లో ఉంటే అతను తన ఓటును ఎన్నారైగా నమోదు చేసుకొవాల్సి ఉంటుంది. ఎన్నారైగా నమోదు అయి ఉంటే అతడు ఉంటున్న దేశంలో ఓటు వేసుకునే సౌకర్యం ఉంటుంది. ఒకవేళ అతడు విదేశాల్లో ఉండి కూడా ఓటు స్థానికంగా ఓటరు లిస్ట్లో నమోదు అయి ఉంటే అతని ఓటు వేరేవారు వినియోగించే అవకాశం ఉంటుంది. ఎన్నారైగా నమోదు చేసుకున్న ఎన్నికల సందర్భంగా అతడు స్వదేశానికి వచ్చి ఉంటే ఏ ప్రాంతంలో ఓటు ఉందో అక్కడి వెళ్లి తన పాస్పోర్టును చూపించి ఓటు వినియోగించుకోవచ్చు. ఎన్నారైల ఓట్లు యథాతథంగా.. పాతబస్తీలోని బార్కస్తో పాటు కార్వాన్లోని టోలిచౌకి, మలక్పేటలోని సైదాబాద్ తదితర ప్రాంతాలకు చెందినవారిలో విదేశాల్లో ఉంటున్న వారి పేర్లు ఓటర్ లిస్టులో ఎన్నారైలుగా నమోదై లేవు. అయినా వీరి పేర్లు యథాతథంగా ఓటర్ లిస్టులో ఉన్నాయి. 2009 కంటే ముందున్న ఓటర్ లిస్టును పరిశీలిస్తే అందులో చివర బూత్లో పురుషులు, మహిళలు, ఇతరులు ( థర్డ్జెండర్స్)లో పాటు ఎన్నారైలుగా వీరి పేర్లు స్పష్టంగా ఉన్నాయి. ఈ అక్టోబర్ 12న విడుదలైన ఓటరు లిస్ట్లో ఎన్నారై కాలమ్ లేకపోవడం గమనార్హం. ఎన్నారైల ఓట్లనువేరుగా గుర్తించాలి ఎన్నారైల ఓట్లు ఓటరు లిస్ట్లో వేరుగా నమోదు కాకపోవడంతో ఎన్నికల అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురి కానున్నారు. బోగస్ ఓట్లు వేసే ప్రమాదం ఉంది. దీనిపై ఎన్నికల అధికారులు, జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాం. ఎన్నారైలను ఓటర్ లిస్టులో వేరుగా గుర్తించాలి. – అంజదుల్లాఖాన్ ఖాలిద్, ఎంబీటీ అధికార ప్రతినిధి -
విదేశీ జంట.. వినోదమంట
వ్యాపార పనుల నిమిత్తం సిటీకి వచ్చిన ఓ విదేశీ జంట.. భారత్లోని ప్రముఖ నగరాలను చుట్టేసింది. వారి ట్రిప్ విమానంలోనో, కారులోనో కాదు. బైక్పై సాగింది. అక్టోబర్ 11న నగరంలో ప్రారంభమైన వీరి రైడ్ 23న ముగిసింది. మట్టి రోడ్లపై ప్రయాణిస్తూ,ప్రజలతో మమేకమవుతూ ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు తెలుసుకున్నారు మెక్సికో కపుల్ రౌల్ రిసెండిజ్, కారోలినా. వివిధ దేశాలను చుట్టేసి... అక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక విశేషాలు, ప్రజల అభిరుచులు తెలుసుకోవాలని కొంతమందికి ఆసక్తి ఉంటుంది. అలాంటి వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. పనిలో పనిగా ఆయా దేశాలు వెళ్లినప్పుడు సమయం కేటాయించి ఓ ట్రిప్వేసేస్తారు. అలా మెక్సికో నుంచి భారత్ వచ్చిన ఓ జంట బైక్పై ఇక్కడి ప్రదేశాలను చుట్టేసింది. సాక్షి, సిటీబ్యూరో :మెక్సికోకు చెందిన పారిశ్రామికవేత్త రౌల్ రిసెండిజ్, కారోలినా దంపతులు. వీరు మెక్సికోలోని క్యాండీస్ ఐస్క్రీమ్ సంస్థ యజమానులు. వీరికి ఏడుగురు సంతానం. తమ దేశంలో బైక్ రైడ్లు చేస్తుంటారు. వీరి దగ్గర బీఎండబ్ల్యూ, ఏడు కేటీఏం బైక్లు ఉన్నాయి. రౌల్ ఇప్పటికే 12 దేశాల్లో బైక్ రైడ్ చేశారు. ఆయనకు ఫ్లైట్లో వెళ్లడం కంటే బైక్పై తిరుగుతూ ఆయా ప్రాంతాల గురించి తెలుసుకోవడమంటే ఇష్టం. వ్యాపార పనుల నిమిత్తం తొలిసారి భారత్ వచ్చిన వీరు ఇక్కడి ప్రదేశాలను చుట్టేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి అక్టోబర్ 11న బైక్ రైడ్ ప్రారంభించారు. సిటీకి చెందిన ట్రావెల్ గైడ్ నాగార్జునరెడ్డి సహకారంతో నాగపూర్, జబల్పూర్, ఖజురహో, ఓర్చా, ఆగ్రా, ఢిల్లీ, జైపూర్, ఉదయ్పూర్, అజ్మీర్, ఇండోర్.. ఇలా దేశంలోని ప్రముఖ నగరాలను చుట్టేసి అక్టోబర్ 23న తిరిగొచ్చారు. ఆ ట్రిప్ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారిలా... ? విదేశీ రైడర్లకు మీరిచ్చే సలహాలు. భద్రత ముఖ్యం. మంచి కండీషన్డ్ బైక్ను ఎంచుకోవాలి. ఇక్కడి భాష, సంప్రదాయాలు తెలిసిన గైడ్ ఉండాలి. అయితే రోడ్ ట్రిప్లు పూర్తిగా మనం ప్లాన్ చేసుకున్నట్లు సాగవు. అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లాలి. విదేశీయులు రోడ్ ట్రిప్ చేసేందుకు భారత్ సేఫ్ కంట్రీ. కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ. ఇక్కడ రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు తగ్గితే టూరిస్టులు మరింత మంది ఇక్కడ రోడ్ ట్రిప్లు చేస్తారు. ? బైక్ రైడ్ ఎంచుకోవడానికి కారణం. రోడ్డు ప్రయాణం చేసినప్పుడే ఆ ప్రాంతం గురించి, అక్కడి ప్రజల గురించి వివరంగా, కరెక్టుగా తెలుసుకోగలం. భారత్ గొప్ప సంస్కృతి ఉన్న దేశం. ఎన్నో చారిత్రక నిర్మాణాలకు ఇది నెలవు. చరిత్ర గురించి తెలుసుకోవడమంటే మాకు ఎంతో ఇష్టం. ? ఈ ట్రిప్లో మీ అనుభవాలు. చాలా వరకు మంచి అనుభవాలే ఉన్నాయి. ఇక్కడి ప్రజలు స్నేహంగా ఉంటారు. సంస్కారం గొప్పది. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు, ఆహారం విభిన్నం. విదేశీయులకు ఇక్కడి అభిరుచులు, అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు చూడడం కనులపండగే. ఇక చేదు అనుభవాలంటే డ్రైవింగ్ స్టైల్. చాలా వరకు ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోరు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అస్సలు బాగాలేవు. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. అలాంటి చోట్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా రోడ్డు మార్గంలో దేశం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది పెద్ద ఇబ్బంది. ఇక మరో ముఖ్య విషయం అపరిశుభ్రత. రోడ్డు పక్కన ఉండే దాబాలు, రెస్టారెంట్లలో టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూస్తే బాగుంటుంది. ? ఇండియా గురించి ఏం తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చే ముందు వరకు ఇండియా గురించి పెద్దగా ఏం తెలియదు. ఈ దేశానికి చాలా చరిత్ర, గొప్ప సంస్కృతి సాంప్రదాయాలున్నాయని మాత్రమే విన్నాం. ఇక్కడి చారిత్రక ప్రదేశాలను చూసి ఇంకా చాలా తెలుసుకున్నాం. యోగా, మెడిటేషన్ భారత్లోనే పుట్టాయని తెలుసుకున్నాం. వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టే ఇక్కడి ప్రజలు ప్రశాంత స్వభావంతో ఉన్నారు. ఇక ట్రాఫిక్ చిక్కులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు వాటిని సీరియస్గా తీసుకోరు. అదే పనిగా హారన్ కొట్టినా, గమ్మున పక్కకు వెళ్లిపోతారు. అదే మెక్సికోలో అయితే ఒక్కసారి కంటే ఎక్కువ హారన్ కొడితే గొడవకి దిగుతారు. బిర్యానీ.. ఇరానీ హైదరాబాద్ నుంచే మా రోడ్ ట్రిప్ ప్రారంభించాం. ఇక్కడి చారిత్రక కట్టడాలు, చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సాంకేతిక, ఐటీ రంగాల్లో నగరం పురోగమిస్తోంది. ఒక నగరం త్వరగా అభివృద్ధి చెందేందుకు ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్ టెస్ట్ అదిరింది. వీటిని టేస్ట్ చేయడానికి మళ్లీ వస్తాం. -
అరుదైన ఘనత సాధించిన ‘గాంధీ’ వైద్యులు
హైదరాబాద్: అంతర్జాతీయ వైద్య రంగంలో అత్యంత అరుదైన ఘటనకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వేదికైంది. శరీరంలోకి చేరిన విరిగిన సిరంజీ నీడిల్ రక్తంతోపాటు ప్రయాణించి గుండెను చుట్టివచ్చి ఊపిరితిత్తుల్లోని రక్తనాళంలో ఆగిపోయింది. పలు కార్పొరేట్ ఆస్పత్రులు తమ వల్ల కాదని చేతులు ఎత్తేయడంతో బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఇటువంటి ఘటనను మొదటిసారి చూసిన గాంధీ వైద్యులు దీన్ని చాలెంజ్గా తీసుకున్నారు. ఈ విషయమై దేశ విదేశాలకు చెందిన వైద్య నిపుణులను సంప్రదించారు. ఎట్టకేలకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి సిరంజీ నీడిల్ను బయటకు తీసి రోగికి పునర్జన్మ ప్రసాదించారు. గాంధీ ఆస్పత్రి సెమినార్ హాలులో శుక్రవారం మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్, కార్డియో«థొరాసిక్ హెచ్వోడీ రవీంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ కాన ఇతర వైద్య సిబ్బందితో కలసి వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలానికి చెందిన కొవ్వాడయ్య (32) నగరంలో నివసిస్తున్నాడు. 3 నెలల క్రితం ఓ మధ్యవర్తి ద్వారా కొంపల్లి సమీపంలోని దూలపల్లిలోగల ఐజెంట్ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన డ్రగ్ టెస్టింగ్కు వెళ్లాడు. డ్రగ్ ఎక్కించే క్రమంలో చేతి రక్తనాళంలోకి ఐవీ క్యాన్ను అమర్చారు. ఒత్తిడితో డ్రగ్ను పంపింగ్ చేయడంతో అనుసంధానంగా ఉన్న సింథటిక్ సిరంజీ 4 సెంటీమీటర్ల వరకు విరిగి లోపలే ఉండిపోయింది. రక్తనాళంలోని సిరంజీ నీడిల్ ముక్క రక్తప్రవాహం ద్వారా గుండెకు చేరింది. అక్కడి నుంచి ప్రయాణించి కుడివైపు ఊపిరితిత్తిలోని రక్తనాళంలో ఆగిపోయింది. రక్తనాళంలో నీడిల్ ప్రయాణిస్తున్న కొద్దీ కొవ్వాడయ్యకు చాతిలో నొప్పి, ఆయాసం, దగ్గు విపరీతంగా రావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకున్నాడు. రక్తనాళంలో ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించిన వైద్యులు పలు ప్రయోగాలు చేసినా ఫలించకపోవడంతో తమ వల్ల కాదన్నారు. పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించగా రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని, ప్రాణాలకు భరోసా ఇవ్వలేమన్నారు. స్థానికుల సూచన మేరకు ఈ నెల 18న బా«ధితుడు కొవ్వాడయ్య గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఈ నెల 24న సుమారు రెండున్నర గంటలు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించి ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న నీడిల్ను బయటకు తీశారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులకు కొవ్వాడయ్య కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ వైద్య నిపుణుల ఆసక్తి.. ప్రపంచంలోనే తొలిసారి నమోదైన ఇలాంటి కేసుతోపాటు, శస్త్రచికిత్సపై అంతర్జాతీయ వైద్యనిపుణులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. రక్తనాళంలోకి చేరిన సిరంజీ నీడిల్ రక్తంతోపాటే ప్రయాణించి ఊపిరితిత్తిలో చిక్కుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, శస్త్రచికిత్స వీడియో దృశ్యాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్కు చెందిన కొంతమంది వైద్య నిపుణులు ఫోన్ ద్వారా సంప్రదించి రోగితోపాటు శస్త్రచికిత్స చేసిన వైద్యులకు విమాన టికెట్లు పంపిస్తామని, దుబాయ్ వచ్చి నేరుగా వివరాలు వెల్లడించాలని కోరుతున్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు రవీంద్ర, అరుణ తెలిపారు. -
వీధి కుక్కలు విదేశాలకు చెక్కేస్తున్నాయి..
నోయిడా : ఆ వీధి కుక్కల దశ తిరిగింది. ఒకప్పుడు తిండి దొరక్క దుర్భర జీవితాన్ని గడిపి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆ కుక్కలు ఇప్పుడు ఖరీదైన ఆహారం తింటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన ‘‘కన్నన్ ఎనిమల్ వెల్ఫేర్’’ అనే స్వచ్ఛంద సంస్థ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వీధి కుక్కలను చేరదీస్తోంది. వాటి ఆరోగ్యం మెరుగు పరిచి శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది. అందులో భాగంగా కుక్కలను పెంచుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపే విదేశీయులకు వాటిని దత్తత ఇస్తున్నారు. వీరు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా దాదాపు 90కుక్కలను విదేశాలకు పంపారు. వీధి కుక్కలను పెంచుకుంటున్న విదేశీయులు సైతం వాటి ప్రవర్తన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.