lakshya sen
-
పెళ్లి తర్వాత తొలిసారి..
ఒకప్పుడు ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్...ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి... ప్రపంచ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన ఘనత... బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో ఇలా ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్ స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రస్తుతం పునర్వైభవం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన 31 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి రాకెట్ పట్టి బ్యాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టనున్నాడు. జకార్తా వేదికగా మంగళవారం నుంచి మొదలయ్యే సీజన్ మూడో టోర్నమెంట్ ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ విభాగంలో పోటీపడనున్నాడు. భారత్కే చెందిన ఆయుశ్ శెట్టితో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్లో శ్రీకాంత్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 45వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ షి ఫెంగ్ లీతో తలపడే అవకాశం ఉంది. గత ఏడాది శ్రీకాంత్ 14 టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. స్విస్ ఓపెన్లో సెమీఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి కిరణ్ జార్జి, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో కిరణ్ జార్జి క్వాలిఫయర్తో... టకుమా ఒబయాషి (జపాన్)తో లక్ష్య సేన్... కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రియాన్షు ఆడతారు. తొలి రోజు మంగళవారం సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు, డబుల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు నిర్వహిస్తారు. బరిలో పీవీ సింధుమరోవైపు... మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయింగ్లో ఇషారాణి బారువా, తాన్యా హేమంత్ పోటీపడనున్నారు. మెయిన్ ‘డ్రా’లో పీవీ సింధు, రక్షితశ్రీ, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప; పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్; తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. మరిన్ని క్రీడా వార్తలుహరికృష్ణ ఖాతాలో తొలి ‘డ్రా’ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ మాస్టర్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ నగరంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. భారత్కే చెందిన లియోన్ ల్యూక్ మెండోకాతో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్ను హరికృష్ణ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్లో జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మరోసారి కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్లో విజయవాడకు చెందిన 28 ఏళ్ల జ్యోతి సురేఖ రెండు స్థానాలు పురోగతి సాధించి రెండో ర్యాంక్లో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్లో జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ను సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ అంతర్జాతీయస్థాయిలో 30 కంటే ఎక్కువ పతకాలు సొంతం చేసుకుంది. -
పీవీ సింధు శుభారంభం.. లక్ష్య సేన్ విఫలం
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఊరట విజయం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న రెండో టోర్నమెంట్లో ఆమె జయకేతనం ఎగురవేసింది. విశ్వక్రీడల తర్వాత ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఓడిన సింధు... మంగళవారం మొదలైన డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం అందుకుంది.మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి పాయ్ యు పోతో జరిగిన మ్యాచ్లో సింధు 21–8, 13–7తో విజయం సాధించింది. అయితే, తొలి గేమ్ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్లో ఆరు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఈ క్రమంలో సింధు విజేతగా నిలిచి ప్రిక్టార్టర్స్కు అర్హత సాధించింది.ఇక నాలుగో సీడ్ హాన్ యువె (చైనా), పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్) మధ్య తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు తలపడుతుంది. మరోవైపు.. భారత్కే చెందిన రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మాళవిక 13–21, 12–21తో థుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో, ఆకర్షి కూడా 13–21, 12–21తో సుపనిద కటెథోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే తొలి రౌండ్ మ్యాచ్లో లౌరెన్ లామ్ (అమెరికా)తో ఉన్నతి హుడా పోటీపడుతుంది.ఇదిలా ఉంటే.. పురుషుల సింగిల్స్లో భారత స్టార్ లక్ష్య సేన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–12, 19–21, 14–21తో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) ద్వయం 18–21, 22–24తో చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓటమి పాలైంది. సోనమ్ గురికి రజతంన్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత జట్టు రజత పతకంతో బోణీ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సోనమ్ మస్కర్ రజత పతకాన్ని సాధించింది. 22 ఏళ్ల సోనమ్ ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు అర్జున్ (188.3 పాయింట్లు) ఐదో స్థానంలో, దివ్యాంశ్ (124 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అర్జున్ సింగ్ (109.9 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు రిథమ్ (197.2 పాయింట్లు) నాలుగో స్థానంలో, సురభి (176.6 పాయింట్లు) 5వస్థానంలో నిలిచారు. -
Denmark Open 2024: కళ్లన్నీ వాళ్లిద్దరిపైనే..
ఒడెన్స్ (డెన్మార్క్): ఈ సీజన్లో ఫామ్లోకి వచ్చేందుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పట్టుదలగా ఉంది. గత వారం ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్ వైఫల్యాన్ని అధిగమించి డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం చేయాలనే లక్ష్యంతో సింధు సన్నద్ధమైంది.ఆ అడ్డంకిని దాటితేనేరెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధుకు గత ఈవెంట్లో అనూహ్యంగా తొలి రౌండ్లోనే కెనడా ప్లేయర్ మిచెల్లీ లీ చేతిలో ఓటమి ఎదురైంది. గతంలో మిచెల్లీపై పదిసార్లు విజయం సాధించిన భారత షట్లర్కు ఫిన్లాండ్లో మాత్రం నిరాశ ఎదురైంది. తాజా డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో ఆమె చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పొతో తలపడుతుంది. ఈ అడ్డంకిని దాటితే సింధుకు రెండో రౌండ్లో చైనా షట్లర్ హాన్ యువె ఎదురవనుంది. మహిళల సింగిల్స్లో ఆమెతో పాటు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడాలు కూడా ఈ టోరీ్నలో శుభారంభంపై దృష్టి సారించారు. లక్ష్య సేన్ గాడిన పడతాడా?పురుషుల సింగిల్స్లో భారత స్టార్ లక్ష్య సేన్ కూడా మెరుగైన ఆటతీరుతో ఈ సీజన్లో గాడిన పడేందుకు శ్రమిస్తున్నాడు. ఈ టోర్నీలో 23 ఏళ్ల లక్ష్య సేన్ తొలిరౌండ్లో లూ గ్వాంగ్ జు (చైనా)తో పోటీపడతాడు. ఈ మ్యాచ్లో గెలిస్తే రెండో రౌండ్లో కిష్టమైన ప్రత్యర్థి ఎదురవనున్నాడు. ఇండోనేసియాకు షట్లర్ జొనాథన్ క్రిస్టీతో లక్ష్య సేన్ తలపడే అవకాశముంది.డబుల్స్లోఇక మహిళల డబుల్స్లో గాయత్రి–ట్రెసా జాలీ జంట తొలి రౌండ్లో ఐదో సీడ్ పియర్లీ తన్–తినా మురళీధరన్ (మలేసియా) జోడీతో ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కి రెడ్డి–సుమిత్ రెడ్డి ద్వయానికి తొలి రౌండ్లో కెవిన్లీ– ఎలియాన జంగ్ (కెనడా) జంట ఎదురవుతుంది. గతంలో భారత క్రీడాకారులకు డెన్మార్క్ ఓపెన్ కలిసొచ్చింది. సింగిల్స్లో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2017లో), సైనా నెహా్వల్ (2012లో) విజేతలుగా నిలిచారు. -
పోరాడి ఓడిన లక్ష్య సేన్
వాంటా (ఫిన్లాండ్): పారిస్ ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్కు నిరాశ ఎదురైంది. ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. తొలి రౌండ్లో ప్రత్యర్థి రస్ముస్ గెమ్కే (డెన్మార్క్) నుంచి ‘వాకోవర్’ దొరకడంతోపాటు లక్ష్య సేన్ నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగాడు. ఏడో సీడ్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–19, 18–21, 15–21తో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య సేన్ తొలి గేమ్ను దక్కించుకున్నా... ఆ తర్వాత ప్రత్యర్థి దూకుడుకు జవాబివ్వలేకపోయాడు. మరో భారత ప్లేయర్ కిరణ్ జార్జి కథ కూడా ముగిసింది. ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్లో కిరణ్ జార్జి 17–21, 8–21తో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో మాళవిక బన్సోద్ 15–21, 8–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ ఇంతనోన్ (థాయ్లాండ్) చేతిలో... ఉన్నతి హుడా 10–21, 19–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో... ఆకర్షి 9–21, 8–21తో హాన్ యువె (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆద్యా–సతీశ్ కుమార్ (భారత్) ద్వయం 12–21, 15–21తో చెంగ్ జింగ్–జాంగ్ చి (చైనా) జోడీ చేతిలో.. రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) జంట 8–21, 10–21తో టాప్ సీడ్ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. -
Arctic Open 2024: సింధు పునరాగమనం
వాంటా (ఫిన్లాండ్): పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం మరిచి తదుపరి టోరీ్నలో టైటిల్స్ లక్ష్యంగా భారత షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ తమ రాకెట్లకు పదును పెడుతున్నారు. ఆర్కిటిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పారిస్ మెగా ఈవెంట్ తర్వాత వీళ్లిద్దరు బరిలోకి దిగుతున్న తొలి టోర్నీ ఇదే కాగా... మహిళల సింగిల్స్లో సింధుకు ఆరో సీడింగ్ కేటాయించగా, పురుషుల ఈవెంట్లో లక్ష్య సేన్ అన్సీడెడ్గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు కెనడాకు చెంది మిచెల్లి లీతో తలపడుతుంది. ఇందులో శుభారంభం చేస్తే తదుపరి రౌండ్లో భారత టాప్ స్టార్కు 2022 జూనియర్ ప్రపంచ చాంపియన్, జపాన్ టీనేజ్ సంచలనం తొమకొ మియజాకి ఎదురవనుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్ల్లో లక్ష్య సేన్... డెన్మార్క్కు చెందిన రస్ముస్ గెమ్కేతో తలపడతాడు. గతేడాది ఇండియా ఓపెన్లో రస్మస్తో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం లక్ష్య సేన్కు ఆరంభరౌండ్లోనే లభించింది. ఈ అడ్డంకిని అధిగమిస్తే భారత ఆటగాడు చైనీస్ తైపీకి చెందిన ఏడో సీడ్ చౌ తియెన్ చెన్తో పోటీపడే అవకాశముంటుంది. -
‘ప్రతిసారి దూకుడు పనికిరాదు.. సూపర్ ఫిట్గా ఉండాలి’
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఆస్ట్రియాలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్లో 22 ఏళ్ల ఈ షట్లర్ కాంస్య పతకం చేజార్చుకొని నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో ఆడటానికి ముందు అత్యుత్తమ ఫిట్నెస్ సాధించేందుకు ఆదివారం ఆస్ట్రియా బయలుదేరాడు. ఈ నేపథ్యంలో లక్ష్య కోచ్ విమల్ కుమార్ మాట్లాడుతూ.. బలాబలాలు అంచనా వేసుకునేందుకు, సానుకూలతలు పెంచుకునేందుకు ఈ పర్యటన లక్ష్య సేన్కు ఉపయోగపడనుందని పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం లక్ష్యసేన్ పూర్తి ఫిట్నెస్తోనే ఉన్నాడు. కానీ అతడికి మరింత శారీరక శిక్షణ అవసరం. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్పై దృష్టి పెట్టాలి. అందుకే లక్ష్య వారం రోజుల పాటు ఆస్ట్రియాలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటాడు. ఫిట్నెస్ను మరింత మెరుగు పరుచుకోవడంతో పాటు... అతడి ఆటలో వేగం పెంచుకునేందుకు ఈ శిక్షణ తోడ్పడనుంది. సాధారణంగా లక్ష్య ఆటతీరు దూకుడుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు డిఫెన్స్ కూడా ముఖ్యమే. నెట్ గేమ్పై పట్టు సాధించాలంటే సూపర్ ఫిట్గా ఉండాలి’అని విమల్ పేర్కొన్నాడు. వచ్చే నెలలో హాంకాంగ్ సూపర్–500, చైనా ఓపెన్ సూపర్–1000 టోరీ్నల్లో లక్ష్యసేన్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. -
రూ. 1.5 కోట్లా?.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఫైర్
నిరాధార వార్తలు రాస్తే సహించే ప్రసక్తే లేదని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024కు సన్నద్దమయ్యే క్రమంలో ప్రభుత్వం తనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. విశ్వ క్రీడలకు సిద్దమయ్యేందుకు కేంద్ర క్రీడా శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం ఫినిష్ స్కీమ్(TOPS) పేరిట టాప్ అథ్లెట్ల శిక్షణకై నిధులు కేటాయించింది.అయితే, అంచనాలకు అనుగుణంగా భారత క్రీడాకారులు రాణించలేకపోయారు. ప్యారిస్లో కేవలం ఆరు పతకాలు మాత్రమే గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చారు. భారత్కు ఈ సారి షూటింగ్లో మూడు, హాకీ పురుషుల జట్టు, రెజ్లింగ్లో ఒక్కో కాంస్యం, జావెలిన్ త్రోలో రజతం మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్లు పూర్తిగా నిరాశపరిచారు.పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ తదితరులు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె సైతం భారత షట్లర్ల తీరును విమర్శస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగానూ ఓటములకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చురకలు అంటించారు.కోట్ల రూపాయల నిధులుఈ నేపథ్యంలో వార్తా సంస్థ పీటీఐ.. భారత షట్లర్లకు TOPS కేటగిరీలో కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించి ఓ కథనం వెలువరించింది. ఆ వివరాల ప్రకారం.. ‘‘2023 వరల్డ్ చాంపియన్షిప్స్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ ఒలింపిక్స్కు సిద్దమయ్యేందుకు.. క్రీడా శాఖ 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.అయితే, చికున్గున్యా బారిన పడ్డ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన లక్ష్యసేన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఇక పీవీ సింధు జర్మనీ ట్రెయినింగ్ కోసం రూ. 26.60 లక్షలు, లక్ష్యసేన్కు ఫ్రాన్స్లో శిక్షణ కోసం రూ. 9.33 లక్షల నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు ప్రిపరేషన్ కోసం ఓవరాల్గా 3.13 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అయితే, ఆమె కూడా ప్రిక్వార్టర్స్లో వెనుదిరిగింది.ఇక మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తానిషాలకు ఒక్కొక్కరికి 1.5 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది. అయితే, వారు గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు.. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి కోసం ఏకంగా భారీ మొత్తంలో రూ. 5.62 కోట్ల నిధులు కేటాయించింది. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్ కూడా దాటలేకపోయింది. ఓవరాల్గా బ్యాడ్మింటన్ బృందానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) రూ. 72.03 కోట్లు ఖర్చుపెట్టింది’’.ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఈ మేర వివరాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన ఆర్టికల్పై అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు? ఈ అబద్దాన్ని ఎందుకు రాశారు? ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఎవరి నుంచి? ఎవరికి? ఎందుకు? నేను ఎవరి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదే! అసలు TOPS ఫండింగ్లో నా పేరు కూడా లేదు’’ అని ఎక్స్ వేదికగా అశ్విని పొన్నప్ప తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.చదవండి: నీరజ్ చోప్రాతో మనూ పెళ్లి?.. స్పందించిన షూటర్ తండ్రి -
ఒలింపిక్స్లో పతకం మిస్.. లక్ష్యసేన్పై రణ్వీర్ సింగ్ ప్రశంసలు!
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్పై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించారు. తాజాగా పారిస్లో జరుగుతన్న ఒలింపిక్స్లో కాంస్యపతకం దక్కకపోవడంపై స్పందించారు. పురుషుల బ్యాడ్మింటన్లో సెమీఫైనల్ చేరుకున్న తొలి భారత షట్లర్గా రికార్డ్ సృష్టించాడని రణ్వీర్ కొనియాడారు. ప్రస్తుతం నీ వయస్సు 22 ఏళ్లేనని.. మరో రోజు నువ్వు పోరాడాలంటూ మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు.నువ్వు ఓడిపోయినప్పటికీ నీ ప్రయత్నం గొప్పదని రణ్వీర్ సింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఒలింపిక్స్లో నీ చురుకుదనం, ప్రదర్శన, ఏకాగ్రత అద్భుతంగా ఉందన్నారు. నిన్ను చూసి గర్వపడుతున్నానని.. నువ్వు ఒక స్టార్.. నీ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని పోస్ట్లో రాసుకొచ్చారు. భవిష్యత్తులో రాబోయే యువతకు నువ్వు ఒక ఆదర్శమని రణ్వీర్ సింగ్ మద్దతుగా నిలిచారు. కాగా.. ఒలింపిక్స్లో జరిగిన కాంస్య పతక పోరులో మలేషియా ప్లేయర్ చేతిలో ఓటమి చెందారు. -
నేను ఒత్తిడిలో తప్పులు చేశాను.. అతడు మాత్రం అద్భుతం: లక్ష్యసేన్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. పురుషుల బ్యాడ్మంటన్ సింగిల్స్ సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన లక్ష్యసేన్.. కాంస్య పతక మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. సోమవారం జరిగిన కాంస్య పతక పోరులో 21–13, 16–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో లక్ష్యసేన్ ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య సేన్ తొలి గేమ్ గెల్చుకున్నప్పటికీ అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. దీంతో 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత బ్యాడ్మింటన్లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిముఖం పట్టడం ఇదే తొలి సారి. 2012 లండన్లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించగా... 2016 రియోలో పీవీ సింధు రజతం, 2020 టోక్యోలో పీవీ సింధు కాంస్యం గెలిచారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం లక్ష్యసేన్ స్పందించాడు."ఏం తప్పు జరిగిందో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాను. నేను మ్యాచ్ను బాగా మొదలు పెట్టినా దానిని కొనసాగించలేకపోయాను. ఫలితంతో చాలా నిరాశ చెందాను. గత మ్యాచ్, ఈ మ్యాచ్లను ఎలా పోల్చాలో కూడా అర్థం కావడం లేదు. రెండూ కీలక మ్యాచ్లే. కానీ రెండూ ఓడిపోయాను.కీలక దశలో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నేను చాలా తప్పులు చేశాను. నా ప్రత్యర్థి రెండో గేమ్ నుంచి అద్భుతంగా పుంజుకున్నాడు. కుడి చేతికి గాయంతో కొంత రక్తం రావడంతో మధ్యలో ఆటను ఆపి చికిత్స చేయించుకోవాల్సి వచి్చంది. అయితే మ్యాచ్ ఫలితానికి దీనికి సంబంధం లేదని లక్ష్యసేన్ పేర్కొన్నాడు. -
ఊరించి... ఉసూరుమనిపించి
ఒలింపిక్స్లో పతకాలు సాధించాలంటే అపార నైపుణ్యంతోపాటు, చెక్కు చెదరని విశ్వాసం, మానసిక దృఢత్వం కలిగి ఉండాలి. లేదంటే కచ్చితంగా మెడలో పతకం వేసుకోవాల్సిన చోట... కీలకదశలో ఒత్తిడికిలోనై... అనవసరపు ఆందోళనతో తడబడి... ప్రత్యరి్థకి పతకాలు అప్పగించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. పారిస్ ఒలింపిక్స్లో సోమవారం భారత క్రీడాకారులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రెండు కాంస్య పతకాల వేటలో బరిలోకి దిగిన మనోళ్లు ముందుగా ఊరించి చివరికొచ్చేసరికి ఉసూరుమనిపించారు. బ్యాడ్మింటన్లో లక్ష్య సేన్... షూటింగ్లో మహేశ్వరి–అనంత్జీత్ జోడీ మంచి అవకాశాలను వదులుకున్నారు. ఫలితంగా రెండు పతకాలు రావాల్సిన చోట ఒక్క పతకమూ దక్కలేదు. ఇక మహిళల రెజ్లింగ్ 68 కేజీల విభాగంలో నిషా దహియా అయితే చివరి నిమిషంలో ఏకంగా తొమ్మిది పాయింట్లు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకుంది. పారిస్: ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్లో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించే అవకాశాన్ని లక్ష్య సేన్ వదులుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్లో ప్రపంచ 22వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–13, 16–21, 11–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య సేన్ తొలి గేమ్ గెల్చుకున్నప్పటికీ అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. లక్ష్య సేన్ ఓటమితో 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత బ్యాడ్మింటన్లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిముఖం పట్టారు. 2012 లండన్లో సైనా నెహా్వల్ కాంస్యం సాధించగా... 2016 రియోలో పీవీ సింధు రజతం, 2020 టోక్యోలో పీవీ సింధు కాంస్యం గెలిచారు. ఈసారి పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీపై భారీ అంచనాలు ఉన్నా వారు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. లీ జి జియాతో జరిగిన మ్యాచ్లో లక్ష్య సేన్ శుభారంభం చేశాడు. దూకుడుగా ఆడుతూ తొలి గేమ్ను అలవోకగా దక్కించుకున్నాడు. రెండో గేమ్ ఆరంభంలోనూ లక్ష్య తన ఆధిపత్యం చాటుకొని 8–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో లక్ష్య సేన్ ఒక్కసారిగా గాడి తప్పాడు. వరుసగా తొమ్మిది పాయింట్లు సమరి్పంచుకున్నాడు. ఇక్కడి నుంచి లీ జి జియా జోరు మొదలైంది. 3–8తో వెనుకబడిన లీ జి జియా 12–8తో ఆధిక్యంలోకి వచ్చి చివరకు 21–16తో గేమ్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో లీ జి జియా పూర్తి ఆధిపత్యం కనబరిచి 9–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా మలేసియా ప్లేయర్ ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడటంతో లక్ష్య సేన్ కోలుకోలేకపోయాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అక్సెల్సన్ 21–11, 21–11తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వితిద్సర్న్ కున్లావత్ (థాయ్లాండ్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్ సె యంగ్ (దక్షిణ కొరియా) 21–13, 21–16తో హి బింగ్జియావో (చైనా)పై విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫినిషింగ్ ‘గురి’ తప్పింది... షూటింగ్ పోటీల చివరిరోజు భారత్కు మరో పతకం వచ్చే అవకాశాలు కనిపించాయి. ఒలింపిక్స్లో తొలిసారి మెడల్ ఈవెంట్గా ప్రవేశపెట్టిన స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్కు చెందిన మహేశ్వరి చౌహాన్–అనంత్జీత్ నరూకా జోడీ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్య పతక మ్యాచ్లో మహేశ్వరి–అనంత్జీత్ ద్వయం 43–44 పాయింట్లతో జియాంగ్ యిటింగ్–జియాన్లిన్ లియు (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. ఒక్క పాయింట్ తేడాతో భారత జోడీకి కాంస్య పతకం చేజారడం గమనార్హం. ముందుగా 15 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్లో మహేశ్వరి–అనంత్జీత్.. జియాంగ్ యిటింగ్–జియాన్లిన్ (చైనా) జోడీలు 146 పాయింట్ల చొప్పున సాధించి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి కాంస్య పతక మ్యాచ్కు అర్హత సాధించింది. డయానా బకోసి–గాబ్రియెలా రొసెట్టి జోడీ (ఇటలీ; 149 పాయింట్లు), ఆస్టిన్ జెవెల్–విన్సెంట్ హాన్కాక్ ద్వయం (అమెరికా; 148 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ–రజత పతక మ్యాచ్కు అర్హత పొందాయి. ఫైనల్లో డయానా–రొసెట్టి ద్వయం 45–44తో జెవెల్–హాన్కాక్ జంటను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. చివరి నిమిషంలో ‘పట్టు’ కోల్పోయి... మహిళల రెజ్లింగ్ 68 కేజీల విభాగంలో భారత రెజ్లర్ నిషా దహియా క్వార్టర్ ఫైనల్లో 8–10 పాయింట్ల తేడాతో పాక్ సోల్ గుమ్ (ఉత్తర కొరియా) చేతిలో ఓడిపోయింది. బౌట్ ముగియడానికి ఒక నిమిషం ఉన్నంతవరకు నిషా 8–1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆఖరి 60 సెకన్లలో నిషా పట్టు కోల్పోయింది. ఉత్తర కొరియా రెజ్లర్ ధాటికి నిషా తొమ్మిది పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. అంతకుముందు నిషా తొలి రౌండ్లో 6–4తో తెతియానా సొవా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఒకవేళ ఉత్తర కొరియా రెజ్లర్ ఫైనల్ చేరుకుంటే నిషాకు ‘రెపిచాజ్’ పద్ధతిలో కాంస్య పతకం సాధించే అవకాశం లభిస్తుంది. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్ ఫైనల్లో అవినాశ్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్ ఈవెంట్లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే ఫైనల్కు అర్హత సాధించాడు. రెండో హీట్లో అవినాశ్ 8 నిమిషాల 15.43 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. 12 మంది అథ్లెట్స్తో కూడిన మూడు గ్రూప్లకు హీట్స్ నిర్వహించారు. మూడు గ్రూపుల్లో టాప్–5 నిలిచిన వారు ఫైనల్కు చేరారు. గురువారం రాత్రి ఫైనల్ జరుగుతుంది. -
Olympics 2024: కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ పరాజయం
పారిస్ ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. కాంస్యం కోసం ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన మ్యాచ్లో లక్ష్యసేన్.. మలేషియాకు చెందిన జెడ్ జే లీ చేతిలో 21-13, 16-21, 11-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్లో తొలి గేమ్ అలవోకగా నెగ్గిన సేన్.. రెండు, మూడు గేమ్లలో చేతులెత్తేశాడు. కాగా, ప్రస్తుత ఒలింపిక్స్లో భారత్ మూడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. షూటింగ్లో మనూ భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం, మిక్సడ్ విభాగాల్లో కాంస్య పతకాలు (సరబ్జోత్ సింగ్తో కలిసి) సాధించగా.. స్వప్నిల్ కుసాలే పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పోజిషన్స్లో కాంస్యం నెగ్గాడు. -
Paris Olympics 2024: లక్ష్యసేన్ పరాజయం
పారిస్ ఒలింపక్స్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీఫైనల్లో పరాజయంపాలయ్యాడు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన ఉత్కంఠ పోరులో డిఫెండింగ్ ఒలింపిక్స్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సేన్ (డెన్మార్క్) చేతిలో 20-22, 14-21 తేడాతో ఓటమిని ఎదుర్కొన్నాడు. రేపు జరుగబోయే బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో లక్ష్యసేన్.. మలేసియాకు చెందిన లీ జీని ఎదుర్కొంటాడు. ఫైనల్లో అక్సెల్సేన్.. థాయ్లాండ్కు చెందిన కున్లావుట్ విటిడ్సర్న్తో అమీతుమీ తేల్చుకుంటాడు. -
Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే
ప్యారిస్ ఒలింపిక్స్లో 9వ రోజు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే..షూటింగ్: పురుషుల 25 మీటర్ల క్వాలిఫికేషన్ మొదటి స్టేజ్: విజయ్వీర్, అనీశ్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). పురుషుల 25 మీటర్ల క్వాలిఫికేషన్ రెండో స్టేజ్: విజయ్వీర్, అనీశ్ (సాయంత్రం గం. 4:30 నుంచి). మహిళల స్కీట్ క్వాలిఫికేషన్: రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి) హాకీపురుషుల క్వార్టర్ ఫైనల్: భారత్ వర్సెస్ బ్రిటన్ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) గోల్ఫ్పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ప్లే నాలుగో రౌండ్: శుభాంకర్ శర్మ, గగన్జీత భుల్లర్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి)బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్: లక్ష్యసేన్ వర్సెస్ అక్సెల్సన్ (డెన్మార్క్) (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)బ్యాక్సింగ్ మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్: లవ్లీనా బొర్గోహైన్ వర్సెస్ లి కియాన్ (చైనా) (మధ్యాహ్నం గం. 3:02 నుంచి) -
పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్
-
‘లక్ష్యం’ దిశగా మరో అడుగు
పారిస్: భారత యువ షట్లర్ లక్ష్య సేన్ ఒలింపిక్స్ పతక ఆశలను సజీవంగా నిలిపాడు. అద్భుత ఆటతీరుతో చెలరేగుతున్న లక్ష్య సెమీఫైనల్లోకి అడుగు పెట్టి పతకంపై గురి పెట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–15, 21–12 స్కోరుతో ప్రపంచ 11వ ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. 75 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్ను కోల్పోయినా... ఆ తర్వాత సత్తా చాటిన 23 ఏళ్ల లక్ష్య సెమీస్ చేరాడు. ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్లో భారత్ తరఫున సెమీఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా సేన్ ఘనత సృష్టించాడు. గతంలో భారత్ నుంచి అత్యుత్తమంగా పారుపల్లి కశ్యప్ (2012), కిడాంబి శ్రీకాంత్ (2016) క్వార్టర్ ఫైనల్ వరకు మాత్రమే రాగలిగారు. లో కీన్ యె (సింగపూర్), అక్సెల్సన్ (డెన్మార్క్) మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు. సెమీస్లో లక్ష్య గెలిస్తే అతనికి స్వర్ణం లేదా రజతం ఖాయమవుతుంది. ఒకవేళ సెమీఫైనల్లో ఓడినా కాంస్య పత కం కోసం మళ్లీ పోటీ పడే అవకాశం ఉంటుంది. 2021 వరల్డ్ చాంపియన్షిప్ కాంస్యపతక విజేత అయిన లక్ష్య క్వార్టర్స్లో తొలి గేమ్లో కూడా పోరాడాడు. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన టిన్ చెన్ 11–9తో ముందంజ వేసి ఆపై 14–9తో నిలిచాడు. అయితే కోలుకున్న లక్ష్య వరుస పాయింట్లతో 16–15కు దూసుకెళ్లాడు. స్కోరు 19–19కి చేరగా, చివరకు గేమ్ తైపీ ఆటగాడిదే అయింది. రెండో గేమ్ కూడా పోటాపోటీగా సాగగా సేన్ 11–10తో ఆధిక్యంలో నిలిచాడు. స్కోరు 13–13కి చేరిన తర్వాత 10 పాయింట్లలో 8 గెలుచుకొని గేమ్ సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్కు వచ్చే సరికి లక్ష్య ఆటతో మరింత జోరు పెరిగింది. విరామ సమయానికి 11–7 వద్ద ఉన్న సేన్ ఆ తర్వాత దూసుకుపోయాడు. వరుస స్మాష్లతో దూకుడు కనబర్చడంతో టిన్ చెన్ వద్ద సమాధానం లేకపోయింది. -
భారత్కు ‘బ్యాడ్’మింటన్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో గురువారం భారత్కు కలిసి రాలేదు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న పీవీ సింధు... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఓటమి చవిచూసి రిక్తహస్తాలతో రానున్నారు. పురుషుల సింగిల్స్లో సహచరుడు ప్రణయ్ను ఓడించి లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్కు చేరి భారత్ ఆశలను నిలబెట్టాడు. పారిస్: ‘రియో’లో రజత పతకం. ‘టోక్యో’లో కాంస్యం... ‘పారిస్’లో మాత్రం నిరాశ... గత రెండు ఒలింపిక్స్లో పతకాలు సాధించి వరుసగా మూడో ఒలింపిక్ పతకం లక్ష్యంగా ‘పారిస్’కు వచ్చిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 19–21, 14–21తో ప్రపంచ 9వ ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో హి బింగ్జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెల్చుకున్న సింధు ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. పోరాడినా... పురుషుల డబుల్స్లో ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కూడా ముందంజ వేయలేకపోయింది. స్వర్ణ పతకంతో తిరిగి వస్తారనుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–13, 14–21, 16–21తో పరాజయం పాలైంది. ఆరోన్ చియా–సో వుయ్ యిక్లతో తలపడిన గత మూడు మ్యాచ్ల్లో నెగ్గిన సాత్విక్–చిరాగ్ ఈసారి పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ రెండు టైటిల్స్ గెలిచి, నాలుగు టో ర్నీ ల్లో రన్నరప్గా నిలిచారు. అంతేకాకుండా ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను కూడా అందుకున్నారు. కానీ వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ పతకం గెలవలేకపోయారు. ప్రణయ్ అవుట్ సింధు, సాత్విక్–చిరాగ్ నిష్క్రమించడంతో భారత పతక ఆశలన్నీ లక్ష్య సేన్పై ఉన్నాయి. భారత నంబర్వన్, సహచరుడు హెచ్ఎస్ ప్రణయ్తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–12, 21–6తో అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. పారుపల్లి కశ్యప్ (2012 లండన్), కిడాంబి శ్రీకాంత్ (2016 రియో) తర్వాత ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్ చేరిన మూడో భారత ప్లేయర్గా లక్ష్య సేన్ నిలిచాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్ తలపడతాడు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే లక్ష్య సేన్ సెమీఫైనల్ చేరి పతకం రేసులో ఉంటాడు. -
Paris Olympics 2024: ప్రణయ్పై గెలుపు.. క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో లక్ష్యసేన్.. భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్పై వరుస సెట్లలో (21-12, 21-6) విజయం సాధించాడు. ఈ మ్యాచ్లో లక్ష్యసేన్ ప్రణయ్పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. -
నాకౌట్ దశకు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగాల్లో భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ నాకౌట్ దశకు అర్హత సాధించారు. తద్వారా పతకం గెలిచే ఆశలను సజీవంగా నిలబెట్టుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎమ్’ రెండో లీగ్ మ్యాచ్లో సింధు 21–5, 21–10తో క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)పై అలవోకగా గెలిచింది.33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధుకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన సింధు గ్రూప్ ‘ఎమ్’ విజేతగా అవతరించి ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్లో భారత రెండో ర్యాంకర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించి గ్రూప్ ‘ఎల్’ టాపర్గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. 50 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రపంచ 22వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 21–12తో క్రిస్టీపై గెలిచాడు. రెండో గేమ్లో స్కోరు 19–12 వద్ద ఉన్నపుడు ఇద్దరి మధ్య 50 షాట్ల ర్యాలీ జరిగింది. చివరకు క్రిస్టీ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో పాయింట్ లక్ష్య సేన్కు లభించింది. ఆ తర్వాత లక్ష్య సేన్ మరో పాయింట్ నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. గ్రూప్ ‘కె’ టాపర్గా భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. చివరి లీగ్ మ్యాచ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ ప్రణయ్ 16–21, 21–11, 21–12తో ఫట్ లె డక్ (వియత్నాం)పై నెగ్గాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన లక్ష్య సేన్తో ప్రణయ్ తలపడతాడు. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ఆర్చరీ పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్): ప్రవీణŠ జాధవ్ X వెన్చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి). పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్): స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి). మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత ఫైనల్స్: గగన్జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్: నిఖత్ జరీన్ X యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్పురుషుల డింగీ తొలి రెండు రేసులు: విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). మహిళల డింగీ తొలి రెండు రేసులు: నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీభారత్ X బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్: (మధ్యాహ్నం గం. 12:00 నుంచి). పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్: సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి X చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి). మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
Olympics 2024: సంచలనం.. ప్రి క్వార్టర్స్లో ఆకుల శ్రీజ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఐదోరోజు భారత్కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ప్రిక్వార్టర్స్ చేరగా.. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ సైతం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాడు.మూడో సీడ్ పై లక్ష్య గెలుపుబుధవారం నాటి మ్యాచ్లో ఇండోనేషియా షట్లర్, మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీని 21-18, 21-12తో ఓడించి లక్ష్య సేన్ ప్రి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ఆరంభంలో క్రిస్టీ ఆధిపత్యం కనబరిచినా.. రెండో సెట్లో అన్సీడెడ్ లక్ష్య ఊహించని రీతిలో తిరిగి పుంజుకున్నాడు. వరల్డ్ నంబర్ 3 క్రిస్టీపై పైచేయి సాధించిన 22 ఏళ్ల లక్ష్య సేన్కు ఇవే తొలి ఒలింపిక్స్. Lakshya Sen 2️⃣ - 0️⃣ Jonatan ChristieSensational Sen has defeated World No.3 Christie 🇮🇩 in straight sets 21-18, 21-12Lakshya qualifies for Pre-QF, Well Done 🇮🇳♥️#Badminton #Paris2024 pic.twitter.com/q6klX0L0AY— The Khel India (@TheKhelIndia) July 31, 2024 ఆకుల శ్రీజ సంచలన విజయంమరోవైపు.. వుమెన్స్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. విశ్వ క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే ప్రిక్టార్టర్స్ చేరిన ప్లేయర్గా నిలిచింది. బుధవారం నాటి మ్యాచ్లో వరల్డ్ నంబర్ 16 శ్రీజ.. సింగపూర్కు చెందిన జియాన్ జెంగ్తో తలపడింది.తొలి గేమ్లో శ్రీజ వెనుకబడ్డా.. ఆ తర్వాత అదరగొట్టింది. ప్రత్యర్థిని 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇక భారత్ నుంచి మరో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా ఇప్పటికే ప్రిక్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే.ఫైనల్లో స్వప్నిల్ కుసాలే50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్కు చేరుకున్నాడు. మొత్తంగా 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన అతడు.. టాప్-8లో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మెడల్ఈవెంట్కు అర్హత సాధించాడు.ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మాత్రం ఈ అడ్డంకిని అధిగమించలేక ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాడు. చదవండి: ‘పిస్టల్’తో పంట పండించాడు! -
బ్యాడ్మింటన్లో భారత్ శుభారంభం.. రెండో రౌండ్కు చేరిన లక్ష్యసేన్
ప్యారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కు శుభారంభం దక్కింది. మెన్స్ సింగిల్స్ గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ అదరగొట్టాడు. శనివారం జరిగిన మ్యాచ్లో గ్వాటెమాల షట్లర్ కెవిన్ కోర్డాన్పై 21-08, 22-20 తేడాతో విజయం సాధించిన లక్ష్యసేన్.. తదుపరి రౌండ్కు ఆర్హత సాధించాడు.తొలి సెట్ను అలవోకగా దక్కించుకున్న లక్ష్యసేన్కు రెండో సెట్లో మాత్రం కెవిన్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే ఏమాత్రం పట్టువిడవని లక్ష్యసేన్ రెండో రౌండ్లోనూ ప్రత్యర్ధిని మట్టికరిపించాడు. జులై 29న గ్రూప్ స్టేజ్లో రెండో మ్యాచ్ లక్ష్యసేన్ ఆడనున్నాడు. లక్ష్యసేన్కు ఇదే ఇవే తొలి ఒలింపిక్స్ క్రీడలు కావడం గమనార్హం.సాత్విక్- చిరాగ్ బోణీ..మరోవైపు బ్యాడ్మింటన్ డబుల్స్ గ్రూప్ స్టేజ్లో కూడా భారత్ బోణీ కొట్టింది. గ్రూపు స్టేజి తొలి మ్యాచ్లో భారత స్టార్ జోడీ సాత్విక్, చిరాగ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వరుస సెట్లలో 21-17, 21-14 తేడాతో ఫ్రాన్స్ జంట లూకాస్ కార్వీ, రోనన్ లాబర్పై సాత్విక్, చిరాగ్ ఘన విజయం సాధించారు. ఈ విజయంతో రెండో రౌండ్లో ఈ జంట అడుగుపెట్టింది. జులై 29న గ్రూప్ స్టేజ్లో రెండో మ్యాచ్ సాత్విక్-చిరాగ్ ఆడనున్నారు. -
లక్ష్య సేన్ ఓటమి
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్, ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో 61 నిమిషాలపాటు జరిగిన పోరులో లక్ష్య సేన్ 22–24, 18–21తో ఓడిపోయాడు. లక్ష్య సేన్కు 7,150 డాలర్ల (రూ. 5 లక్షల 96 వేలు) ప్రైజ్మనీ లభించింది. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–9, 21–15తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై విజయం సాధించాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 2–3తో వెనుకంజలో ఉన్నాడు. మరోవైపు భారత్కే చెందిన ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రియాన్షు 10–21, 17–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. గాయత్రి జోడీ నిష్క్రమణ డబుల్స్ విభాగాల్లో భారత జోడీల కథ ముగిసింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–19, 19–21, 19–21తో మయు మత్సుమోటో–వకానా నాగహార (జపాన్) జంట చేతిలో... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ 13–21, 21–19, 13–21తో హ నా బేక్–సో హీ లీ (దక్షిణ కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 9–21, 11–21తో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ ద్వయం సి వె జెంగ్–యా కియాంగ్ హువాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. -
పారిస్ ఒలింపిక్స్కు ఏడుగురు భారత షట్లర్లు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన సింధు...ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ కూడా అర్హత సాధించింది.సోమవారంతో ఒలింపిక్ క్వాలిఫయింగ్ గడువు ముగిసింది. భారత్ నుంచి ఏడుగురికి బెర్త్లు లభించాయి. నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్లో టాప్–16లో నిలిచిన క్రీడాకారులకు ఒలింపిక్ బెర్త్లు అధికారికంగా ఖరారవుతాయి.ర్యాంకులు ఇలా..ప్రస్తుతం సింధు 12వ ర్యాంక్లో ఉంది. పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లు ప్రణయ్ (9వ ర్యాంక్), లక్ష్య సేన్ (13వ ర్యాంక్) తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండోసారి ఒలింపిక్స్కు అర్హత పొందారు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీకి ఒలింపిక్ బెర్త్ దక్కింది. అశ్వినికిది మూడో ఒలింపిక్స్కాగా, తనీషా తొలిసారి విశ్వ క్రీడల్లో పోటీపడనుంది. -
భారత జట్ల శుభారంభం
చెంగ్డు (చైనా): ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లు థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్ కప్లో భాగంగా గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్లో భారత పురుషుల టీమ్ 4–1 తేడాతో థాయిలాండ్పై విజయం సాధించింది. మహిళల టోర్నీ ఉబెర్ కప్ గ్రూప్ ‘ఎ’లో భారత్ 4–1 స్కోరుతోనే కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్పై కున్లావట్ వితిద్సన్ గెలుపొందాడు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. తీరారట్సకుల్ పై లక్ష్యసేన్, సరన్జమ్శ్రీపై కిడాంబి శ్రీకాంత్ విజయం సాధించారు. తొలి డబుల్స్లో సుక్ఫున్ – తీరారట్సకుల్ జంటపై సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్శెట్టి జోడి... పన్పనిచ్ – సొథోన్పై ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల గెలిచారు. ఉబెర్ కప్లో తొలి సింగిల్స్లో మిచెల్ లిపై అస్మిత చాలిహ, కేథరీన్ – జెస్లీన్పై ప్రియ – శృతి, వెన్ జాంగ్పై ఇషారాణి బారువా గెలుపొందారు. అయితే రెండో డబుల్స్లో జాకీ డెంట్ – క్రిస్టల్ లాయ్ చేతిలో సిమ్రన్ సింఘీ – రితిక ఠాకర్ ఓడిపోగా... చివరి మ్యాచ్లో ఎలియానా జాంగ్పై అన్మోల్ ఖర్బ్ విజయం సాధించింది. -
లక్ష్య సేన్ @13
న్యూఢిల్లీ: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సెమీఫైనల్ చేరిన భారత స్టార్ లక్ష్య సేన్ ర్యాంక్ మెరుగైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్లో పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ఐదు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్కు చేరుకున్నాడు. ప్రణయ్ ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంక్కు పడిపోయాడు. ఏప్రిల్ 30వ తేదీలోపు టాప్–16లో ఉంటే ప్రణయ్, లక్ష్య సేన్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు 11వ ర్యాంక్లో మార్పు లేదు. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ మూడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్తో భారత నంబర్వన్ జోడీగా అవతరించింది. పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం నాలుగు స్థానాలు పడిపోయి 26వ ర్యాంక్కు చేరుకుంది. -
సెమీస్లో లక్ష్యసేన్ ఓటమి
బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు ఈ సారీ పతకం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పురుషుల ఈవెంట్లో ఏకైక ఆశాకిరణం లక్ష్యసేన్కు సెమీస్లో చుక్కెదురైంది. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీలో భారత పోరాటం ముగిసింది. 2022 టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన 22 ఏళ్ల లక్ష్యసేన్పై ఈ సారి భారత బృందం గంపెడాశలు పెట్టుకుంది. అయితే శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్తో ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి. పురుషుల సింగిల్స్లో జరిగిన సెమీస్లో భారత ఆటగాడు 12–21, 21–10, 15–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. ఒక గంటా 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో ప్రత్యర్థి జోరుకు ఎదురు నిలువలేకపోయిన లక్ష్యసేన్ రెండో గేమ్లో పుంజుకోవడంతో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ క్రిస్టీకి కష్టాలు తప్పలేదు. ఈ గేమ్ను కైవసం చేసుకున్న భారత షట్లర్ నిర్ణాయక మూడో గేమ్లో ఆ పట్టుదల కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఫలితం నిరాశపరిచినప్పటికీ వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లలో సెమీఫైనల్స్లోకి ప్రవేశించడం ద్వారా లక్ష్యసేన్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్ ద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాల్ని మెరుగుపర్చుకున్నాడు. -
ప్రధాని మోదీ సహాయం కోరిన స్టార్ షట్లర్
Badminton Star Lakshya Sen Seeks PM Modi's Help: భారత బ్యాడ్మింటన్ స్టార్, కామన్వెల్త్ గేమ్స్-2022 స్వర్ణ పతక విజేత లక్ష్య సేన్ ప్రధాని నరేంద్ర మోదీ సహాయం కోరాడు. కీలక టోర్నీలు ముందున్న వేళ వీసా జాప్యం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లాడు. కాగా నవంబరులో రెండు ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు జరుగనున్నాయి. నవంబరు 14- 19 వరకు జపాన్ మాస్టర్స్, నవంబరు 21- 26 వరకు షెంజన్ వేదికగా చైనా మాస్టర్స్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇక వరల్డ్ నంబర్ 17 లక్ష్య సేన్తో పాటు మిగిలిన భారత షట్లర్లు కూడా ఈ టోర్నీలు ఆడేందుకు సిద్ధం కాగా.. వీసా సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎక్స్(ట్విటర్) వేదికగా లక్ష్య సేన్ తమ ఇబ్బందులను వెల్లడించాడు. నాతో పాటు నా టీమ్కి కూడా ‘‘జపాన్, చైనా ఓపెన్ ఆడేందుకు నేను ప్రయాణం కావాల్సి ఉంది. నాతో పాటు నా టీమ్ కూడా ఇందుకోసం అక్టోబరు 30న జపాన్ వీసా కోసం అప్లై చేసింది. కానీ ఇంతవరకు వీసా మంజూరు కాలేదు. చైనా వీసా కోసం కూడా మేము దరఖాస్తు చేయాల్సి ఉంది. నాతో పాటు మా కోచ్, ఫిజియో వీసా సమస్యల విషయంలో జోక్యం చేసుకుని తక్షణమే పరిష్కారం చూపాల్సిందిగా అభ్యర్థిస్తున్నా’’ అని ప్రధాని కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్తో పాటు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్కు లక్ష్య సేన్ విజ్ఞప్తి చేశాడు. I have to travel to Japan & China Open on Sat. Me and my team applied for Japan visa on 30/10/23. We still haven’t got the visa. I have to apply for a China visa as well. Urgent request for visa for myself, my coach and physio. Please help @ianuragthakur Sir @PMOIndia @meaindia1 — Lakshya Sen (@lakshya_sen) November 8, 2023 -
చైనా ఓపెన్లో భారత షట్లర్లకు చుక్కెదురు.. తొలి రౌండ్లోనే ముగ్గురు ఇంటిముఖం
చైనా ఓపెన్లో భారత షట్లర్లకు భారీ షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లోనే ఏకంగా ముగ్గురు ఇంటిముఖం పట్టారు. వీరిలో స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్ ఉన్నారు. ప్రపంచ ఆరో ర్యాంకర్ ప్రణయ్కు మలేసియా ఆటగాడు, వరల్డ్ నంబర్ 22 ప్లేయర్ జీ యంగ్ చేతిలో పరాభవం (21-12, 13-21, 21-18) ఎదురవగా.. లక్ష్యసేన్ను డెన్మార్క్ ఆటగాడు, వరల్డ్ నంబర్ 10 షట్లర్ ఆండర్స్ ఆంటన్సన్ 23-21, 16-21, 21-9 తేడాతో ఓడించాడు. గతేడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం సాధించి జోరు మీదున్న ప్రణయ్ను జీ యంగ్ 66 నిమిషాల్లో ఓడించగా.. లక్ష్యసేన్ను ఆంటన్సన్ 78 నిమిషాల్లో మట్టికరిపించాడు. అంతకుముందు ప్రియాన్షు రజావత్ను ఇండొనేసియాకు చెందిన షెసర్ హిరెన్ వరుస సెట్లలో (21-13, 26-24) ఓడించాడు. మరోవైపు ఈ టోర్నీలో పాల్గొంటున్న ఏకైక భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ కూడా ఇంటీబాట పట్టారు. ఈ జోడీ చైనా టాప్ సీడ్ పెయిర్ చెన్ కింగ్ చెన్-జియా ఇ ఫాన్ చేతిలో 18-21, 11-21 వరుస సెట్లలో ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్ విభాగంలో అర్జున్-దృవ్ కపిల (భారత్) జోడీ.. జపాన్ ద్వయం కెయ్చిరో మట్సుయ్-యోషినోరి టెకుచీ చేతిలో పోరాడి ఓడింది (23-21, 21-19). కాగా, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీ నుంచి నిన్ననే నిష్క్రమించింది. -
ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్లపై భారత్ ఆశలు
కొపెన్ హాగెన్ (డెన్మార్క్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్లపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేటి నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. మహిళల విభాగంలో మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్లో బై లభించింది. మాజీ ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్), తుయ్ లిన్ గుయెన్ (వియత్నాం) మధ్య తొలి రౌండ్ విజేతతో 2019 ప్రపంచ చాంపియన్ సింధు రెండో రౌండ్లో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. మొదటి రౌండ్లోనే అతను 14వ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)ను ఎదుర్కొంటాడు. 11వ సీడ్ లక్ష్య సేన్...జార్జెస్ జులియన్ పాల్ (మారిషస్)తో, 9వ సీడ్ ప్రణయ్... కెల్లే కొల్జనెన్ (ఫిన్లాండ్)తో పోటీపడతారు. పురుషుల డబుల్స్లో ప్రపంచ రెండో ర్యాంకింగ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఈసారి స్వర్ణంపై కన్నేసింది. గత ఏడాది జరిగిన ఈ టోర్నీలో మేటి డబుల్స్ జోడీ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మహిళల డబుల్స్లో 15వ సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటకు తొలి రౌండ్లో బై లభించింది. సిన్సినాటి ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్తో జొకోవిచ్ ‘ఢీ’ కెరీర్లో 39వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించేందుకు సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్... కెరీర్లో ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గేందుకు స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ అమీతుమీ తేల్చుకోనున్నారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరుగుతున్న సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో వీరిద్దరూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో అల్కరాజ్ 2–6, 7–6 (7/4), 6–3తో హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించగా... జొకోవిచ్ 7–6 (7/5), 7–5తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించాడు. ఈ క్రమంలో 36 ఏళ్ల జొకోవిచ్ ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన పెద్ద వయసు్కడిగా గుర్తింపు పొందాడు. అల్కరాజ్తో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 1–2తో వెనుకంజలో ఉన్నాడు. -
తొమ్మిదో ర్యాంక్కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం..
BWF world rankings: గతవారం జపాన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ప్రణయ్, సెమీఫైనల్లో ఓడిన లక్ష్య సేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్లో పురోగతి సాధించారు. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్కు... లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 19వ ర్యాంక్లో నిలిచాడు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు 17వ ర్యాంక్లో, పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండో ర్యాంక్లో కొనసాగుతున్నారు. సాకేత్–మార్టినెజ్ జోడీ శుభారంభం మిఫెల్ టెన్నిస్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. తన భాగస్వామి మార్టినెజ్ (వెనిజులా)తో కలిసి సాకేత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మెక్సికోలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–మారి్టనెజ్ ద్వయం 6–3, 2–6, 10–5తో ఎర్నెస్టో ఎస్కోబెడో–రోడ్రిగో మెండెజ్ (మెక్సికో) జోడీపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ జంట మూడు ఏస్లు సంధించింది. -
Japan Open 2023 badminton: పోరాడి ఓడిన లక్ష్యసేన్
టోక్యో: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–750 జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత షట్లర్ లక్ష్య సేన్ ఆట ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్య పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్లో ఇండోనేసియాకు చెందిన ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ 21–15, 13–21, 21–16 స్కోరుతో సేన్ను ఓడించాడు. 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరు తొలి గేమ్లో క్రిస్టీ చేసిన పొరపాట్లతో సేన్ 7–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిన క్రిస్టీ 15–12తో ఆధిక్యంలోకి వచ్చేశాడు. రెండో గేమ్లో చక్కటి సర్వీస్, ర్యాలీలతో 11–5తో సేన్ ముందంజ వేశాడు. ఆపై పదునైన స్మాష్లతో చెలరేగి భారత షట్లర్ రెండో గేమ్ను సొంతం చేసుకున్నాడు. చివరి గేమ్లో మాత్రం మొదటినుంచి ఆధిక్యం ప్రదర్శించిన క్రిస్టీ చివరి వరకు దానిని నిలబెట్టుకున్నాడు. -
భారత్ కథ ముగిసింది.. సెమీస్లో లక్ష్యసేన్ ఓటమి
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టీ చేతిలో 21-15,13-21,21-16తో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్లో ఇద్దరు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడ్డారు. అయితే గేమ్ ఆఖర్లో లక్ష్యసేన్ పట్టు సడలించడంతో 21-15 తేడాతో జొనాథన్ మొదటి గేమ్ను సొంతం చేసుకున్నాడు. దాంతో లక్ష్యసేన్ రెండో గేమ్ను కసిగా మొదలుపెట్టాడు. గేమ్ ఆద్యంతం ఎక్కడా జొనాథన్ను పైచేయి సాధించనీయలేదు. దాంతో 13-21 తేడాతో రెండో గేమ్ను కైవసం చేసుకున్నాడు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్లో లక్ష్యసేన్ అదే జోరును కంటిన్యూ చేయలేకపోయాడు. చివరకు జొనాథన్ 21-16తో గేమ్ను గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాడు. Jonatan Christie 🇮🇩 and Lakshya Sen 🇮🇳 give it their all for a spot in the finals.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/0eSj6ZLOIH — BWF (@bwfmedia) July 29, 2023 చదవండి: ‘హండ్రెడ్’ టోర్నీకి జెమీమా 151 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్! వీడియో వైరల్ -
సెమీస్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి
భారత టాప్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటిల్కు దగ్గరయ్యాడు.జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన లోకల్ ప్లేయర్ కోకి వతాన్బేను 21-15, 21-19 వరుస గేముల్లో చిత్తు చేశాడు. ఇక రేపు(శనివారం) జరగనున్న సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు. Lakshya Sen enters semifinals of Japan Open, Satwik-Chirag out READ: https://t.co/XMwjavlFmc#LakshyaSen #Badminton #JapanOpen pic.twitter.com/oRgSxUuxR3 — TOI Sports (@toisports) July 28, 2023 వరల్డ్ నెంబర్ పదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం క్వార్టర్స్లో ముగిసింది. డెన్మార్క్కు చెందిన ప్రపంచ నెంబర్వన్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో 21-19, 18-21,8-21తో ఓడిపోయాడు. అయితే తొలి గేమ్ను 21-19తో గెలిచి రెండో గేమ్లోనూ ఒక దశలో 7-1తో ఆధిక్యంలో కనిపించిన ప్రణయ్ ఆ తర్వాత అనవసర ఒత్తిడికి లోనయ్యాడు. ఆ తర్వాత 18-21తో రెండో గేమ్ కోల్పోయిన ప్రణయ్.. మూడో గేమ్లో పూర్తిగా చేతులెత్తేశాడు. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి భారత డబుల్స్ టాప్ షట్లర్స్ సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి పోరాటం ముగిసింది. ఇటీవలే కొరియా ఓపెన్ నెగ్గి జోరు మీదున్న ఈ ద్వయం ఈ టోర్నీలో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలుస్తూ మరో టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన ఒలింపిక్ చాంపియన్స్ లీ యాంగ్- వాంగ్ చీ-లాన్ చేతిలో 15-21, 25-23, 16-21తో ఓటమి పాలయ్యారు. చదవండి: రోహిత్ చివరగా ఏడో స్థానంలో ఎప్పుడు బ్యాటింగ్కు వచ్చాడంటే? Major League Cricket 2023: డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ -
క్వార్టర్స్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. సింగిల్స్ విభాగంలో హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్లు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. డబుల్స్ విభాగంలో టాప్ షట్లర్లు స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి జోరు కనబరుస్తూ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్లో కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ జపాన్కు చెందిన కాంటా సునేయమాపై 21-14, 21-16 వరుస గేముల్లో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ఇక డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ జోడి డెన్మార్క్కు చెందిన జెప్ బే- లాసే మొల్హెగ్డే ద్వయంపై 21-17, 21-11 వరుస సెట్లలో ఖంగుతినిపించారు. Lakshya Sen 🇮🇳 sets the pace against Kanta Tsuneyama 🇯🇵.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/INyZMUO6HR — BWF (@bwfmedia) July 27, 2023 ఇక హెచ్ఎస్ ప్రణయ్.. ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్పై 19-21, 21-9, 21-9 తేడాతో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ప్రణయ్ తొలి గేమ్ను కోల్పోయినప్పటికి ఆ తర్వాత ఫుంజుకొని రెండు వరుస గేములను గెలుచుకొని మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో భారత టాప్ జోడి ట్రీసా జోలీ-పుల్లెల గాయత్రి గోపిచంద్ జంట ప్రీక్వార్టర్స్లో పరాజయం పాలైంది. జపాన్కు చెందిన నమీ మత్సయుమా-చిమారు షీడా చేతిలో 21-13, 19-21తో ఓటమిపాలయ్యారు. చదవండి: SL Vs PAK 2nd Test: ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్స్వీప్ Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! -
సింధు ఓటమి.. లక్ష్యసేన్ శుభారంభం; సాత్విక్-చిరాగ్ జోడి దూకుడు
తెలుగుతేజం పీవీ సింధు వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కొరియా ఓపెన్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సింధు తాజాగా జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ తొలి రౌండ్కే పరిమితమైంది. బుధవారం రౌండ్ ఆఫ్ 32లో చైనాకు చెందిన జాంగ్ యిమాన్ చేతిలో పీవీ సింధు.. 21-12, 21-13తో ఓటమిపాలయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన 13 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో సింధు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. Zhang Yi Man 🇨🇳 takes on former world champion Pusarla V. Sindhu 🇮🇳.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/RzycVktT53 — BWF (@bwfmedia) July 26, 2023 లక్ష్యసేన్ శుభారంభం.. ఇక పురుషుల విభాగంలో టాప్ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో మన దేశానికే చెందిన ప్రియాన్షు రావత్పై 21-15, 12-21, 24-22తో గెలిచి ప్రీక్వార్టర్స్లో అడుగుపెట్టాడు. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీకి దూరంగా ఉన్న లక్ష్యసేన్ అంతకముందు జరిగిన కెనడా ఓపెన్ టోర్నీలో పురుషుల సింగిల్స్లో విజేతగా అవతరించాడు. జోరు మీదున్న సాత్విక్-చిరాగ్ జోడి ఈ ఆదివారం కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్స్ గెలిచి జోరు మీదున్న భారత డబుల్స్ స్టార్ షట్లర్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడి కూడా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాడో, డేనియల్ మార్టిన్ ద్వయంపై 21-16, 11-21, 21-13తో గెలిచి రెండో రౌండ్లో అడుగుపెట్టారు. Rankireddy/Shetty 🇮🇳 take to the court against Carnando/Marthin 🇮🇩.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/o2GfitVREC — BWF (@bwfmedia) July 26, 2023 చదవండి: IND Vs WI ODI Series: తొలి వన్డే.. సంజూ శాంసన్కు చోటు, ఇషాన్కు మొండిచెయ్యేనా! రెండు పెళ్లిళ్లు పెటాకులు! 69 ఏళ్ల వయసులో మూడోసారి! ఎవరీ బ్యూటీ? -
పీవీ సింధు ఓటమి.. సెమీస్కు చేరిన లక్ష్యసేన్
భారత స్టార్ షెట్లర్ లక్ష్యసేన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇటీవలే కెనడా ఓపెన్ను గెలిచి దూకుడు మీదున్న లక్ష్యసేన్ మరో టైటిల్ గెలిచేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మన దేశానికే చెందిన శంకర్ ముత్తుస్వామిపై 21-10, 21-17తో వరుస గేముల్లో గెలిచిన లక్ష్యసేన్ సెమీస్కు చేరుకున్నాడు. మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు మాత్రం క్వార్టర్స్లోనే తన పోరాటాన్ని ముగించింది. క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన గావో ఫాంగ్ జీ చేతిలో 22-20, 21-13తో సింధు ఓటమి పాలయ్యింది. ప్రపంచ 36వ ర్యాంకర్ అయిన గావో ఫాంగ్ జీ తొలి గేమ్ను గెలవడానికి కష్టపడినప్పటికి.. రెండో గేమ్ను మాత్రం సులువుగానే నెగ్గింది. చదవండి: #BAN Vs AFG: ఈజీగా గెలవాల్సిన మ్యాచ్.. చచ్చీ చెడీ చివరకు #ViratKohli: ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి -
క్వార్టర్ ఫైనల్లో సింధు, లక్ష్యసేన్
కౌన్సిల్ బ్లఫ్స్ (అమెరికా): యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో భారత స్టార్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్లు క్వార్టర్ ఫైనల్కు చేరారు. శుక్రవారం జరిగిన ప్రి క్వార్టర్స్లో సింధు చైనీస్ తైపీకి చెందిన సంగ్ షువో యన్ను 21-14, 21-12తో ఓడించింది. ఇక లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్లో చెక్ రిపబ్లిక్కు చెందిన జాన్ లౌడాను 21-8, 23-21తో మట్టికరిపించి క్వార్టర్స్కు చేరుకున్నాడు. అంతకముందు తొలి రౌండ్లో సింధు 21–15, 21–12తో దిశా గుప్తా (అమెరికా)పై నెగ్గింది. హైదరాబాద్ అమ్మాయి గద్దె రుతి్వక శివాని 14–21, 11–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. లక్ష్య సేన్ 21–8, 21–16తో కాలి కొల్జోనెన్ (ఫిన్లాండ్)పై, శంకర్ ముత్తుస్వామి 21–11, 21–16తో ఎన్హట్ నుగుయెన్ (ఐర్లాండ్)పై నెగ్గారు. హైదరాబాద్కు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ 15–21, 12–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ లి షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. చదవండి: #JyothiYarraji: జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు #YashasviJaiswal: 'ఇది ఆరంభం మాత్రమే.. చేయాల్సింది చాలా ఉంది' -
చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్
కాల్గరీ: ఏడాదిన్నర తర్వాత భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ మరో అంతర్జాతీయ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్య సేన్ చాంపియన్గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 22–20తో ప్రపంచ పదో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షి ఫెంగ్ లీ (చైనా)పై గెలుపొందాడు. గత ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టైటిల్ సాధించాక లక్ష్య సేన్ నెగ్గిన మరో అంతర్జాతీయ టైటిల్ ఇదే కావడం విశేషం. టైటిల్ నెగ్గిన లక్ష్య సేన్కు 31,500 డాలర్ల (రూ. 25 లక్షల 99 వేలు) ప్రైజ్మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గత ఏడాది ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వ్యక్తిగత స్వర్ణ పతకం గెలిచిన లక్ష్య సేన్ ఈ సంవత్సరం తాను పాల్గొన్న 12వ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచాడు. షి ఫెంగ్ లీపై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్కు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. 50 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో లక్ష్య సేన్ కీలకదశలో విజృంభించి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 18–15తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గేమ్ను దక్కించుకున్నాడు. రెండో గేమ్లో స్కోరు 5–6 వద్ద ఉన్నపుడు షి ఫెంగ్ లీ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11–6తో ముందంజ వేశాడు. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ షి ఫెంగ్ లీ 20–16తో నాలుగు గేమ్ పాయింట్లు సంపాదించాడు. అయితే లక్ష్య సేన్ దూకుడుగా ఆడి ఊహించనిరీతిలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచాడు. తద్వారా రెండో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ‘ఒలింపిక్ అర్హత సంవత్సరం కావడం, దానికి తోడు అన్నీ నాకు ప్రతికూల ఫలితాలు వస్తున్న సమయంలో ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ టోర్నీ కొనసాగినకొద్దీ నా ఆటతీరు మెరుగైంది. ఫైనల్లో రెండో గేమ్లో వెనుకబడిన దశలో సంయమనం కోల్పోకుండా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఇది ఫలితాన్నిచ్చింది’ అని ఉత్తరాఖండ్కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ వ్యాఖ్యానించాడు. Congratulations to the talented @lakshya_sen on his outstanding victory at the Canada Open 2023! His triumph is a testament to his tenacity and determination. It also fills our nation with immense pride. My best wishes to him for his upcoming endeavours. pic.twitter.com/DqCDmNSbhk— Narendra Modi (@narendramodi) July 10, 2023 Sometimes, the hardest battles lead to the sweetest victories. The wait is over, and I am delighted to be crowned the Canada Open winner! Grateful beyond words 🎉🏆 #SenMode #BWFWorldTour#CanadaOpen2023 pic.twitter.com/u8b7YzPX01— Lakshya Sen (@lakshya_sen) July 10, 2023 -
కెనడా ఓపెన్ టైటిల్ విజేత లక్ష్య సేన్
కెనడా ఓపెన్ టైటిల్ విజేతగా భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన లిషి ఫెంగ్పై 21-18, 22-20 తేడాతో వరుస గేమ్లలో లక్ష్య సేన్ విజయం సాధించాడు. ఇది అతడికి రెండో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న లక్ష్య సేన్ టైటిల్ పోరులో కూడా చెలరేగి పోయాడు. వరల్డ్ రాంకింగ్స్ లో తన కంటే మెరుగైన స్థానంలో ఉన్న చైనా ప్లేయర్ పై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. రెండో గేమ్ లో ప్రత్యర్ధి కాస్త పోటీ ఇచ్చిన కీలక సమయంలో ఆధిక్యం నిలుపుకుని టైటిల్ గెలుచుకున్నాడు. ఇక మరో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్లో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. చదవండి: సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి -
పీవీ సింధుకు ఘోర పరాభవం.. సెమీ ఫైనల్లో ఓటమి! ఫైనల్లో లక్ష్య సేన్
కెనడా ఓపెన్ సెమీ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. ఆదివారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో జపాన్కు చెందిన అకానే యమగుచి చేతిలో 14-21,15-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. రెండు గేమ్స్లోనూ సింధుపై యమగుచి అధిపత్యం చెలాయించింది. కాగా యమగుచి చేతిలో సింధు ఓడిపోవడం వరుసగా ఇది రెండో సారి కావడం గమనార్హం. సింగపూర్ ఓపెన్-2023లో తొలిరౌండ్లోనే సింధును ఈ జపాన్ స్టార్ షెట్లర్ ఓడించింది. ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత సింధు మునుపటిలా ప్రదర్శన చేయలేకపోతోంది. తాజాగా బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్స్లోనూ మూడు స్ధానాలు దిగజారి 15వ ర్యాంక్లో సింధు నిలిచింది. ఫైనల్లో లక్ష్య సేన్ ఇక పీవీ సింధు నిరాశపరిచినప్పటికీ మరో భారత షెట్లర్ లక్ష్య సేన్ మాత్రం అదరగొట్టాడు. కెనడా ఓపెన్ ఫైనల్లోకి లక్ష్య సేన్ అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో జపాన్కు చెందిన కెంటా నిషిత్మోటోను 21-17, 21-14 వరుస గేమ్లలో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విజయంతో లక్ష్య సేన్ దాదాపు ఏడాది తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్కు చేరుకున్నాడు. చదవండి: ఆసియా క్రీడలకు భారత టీటీ జట్టులో శ్రీజ.. జట్ల వివరాలివే -
అదరగొట్టిన పీవీ సింధు, లక్ష్య సేన్
కాల్గరీ: కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–11తో వైగోర్ కొల్హో (బ్రెజిల్)పై నెగ్గగా... సింధుకు ఆమె ప్రత్యర్థి నత్సుకి నిదైరా (జపాన్) నుంచి వాకోవర్ లభించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ ద్వయం 9–21, 11–21తో రెండో సీడ్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది. బ్రిజ్భూషణ్కు కోర్టు సమన్లు న్యూఢిల్లీ: రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను పరిశీలించిన ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఈ కేసులో విచారించేందుకు తగిన సాక్ష్యాధారాలున్నాయని తెలిపారు. ఈ నెల 18న కోర్టు ముందు హాజరు కావాలని బ్రిజ్భూషణ్కు సమన్లు జారీ చేశారు. -
పోరాడి ఓడిన లక్ష్యసేన్
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భారత పోరాటం ముగిసింది. ఏకైక ఆశాకిరణం లక్ష్యసేన్ కూడా సెమీ ఫైనల్లో ఓడిపోయాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్లో భారత షట్లర్ లక్ష్యసేన్ 21–13, 17–21, 13–21తో థాయ్లాండ్కు చెందిన రెండో సీడ్ కున్లావుత్ వితిద్సర్న్ చేతిలో పోరాడి ఓడాడు. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21 ఏళ్ల భారత ఆటగాడు తొలి గేమ్లో సీడెడ్ ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచాడు. ఆరంభంలో 11–6 స్కోరు వద్ద పైచేయి సాధించాడు. కానీ థాయ్ ఆటగాడు వరుసగా నాలుగు పాయింట్లు చేశాడు. అయితే దీటుగా ఆడిన లక్ష్యసేన్ వరుసగా ఐదు పాయింట్లు సాధించాడు. అక్కడినుంచి గేమ్ తన నియంత్రణలోనే ముగిసింది. రెండో గేమ్ అయితే నువ్వానేనా అన్నట్లు సాగింది. కున్లావుత్ క్రాస్కోర్ట్ స్మాష్లతో పదును పెంచగా... దీటుగా ఎదుర్కొన్న భారత ఆటగాడు సుదీర్ఘ ర్యాలీలతో సత్తా చాటుకున్నాడు. స్థానిక షట్లర్ 12–10 వద్ద ఉన్నప్పుడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి జోరు పెంచినా చివరకు గేమ్ ప్రత్యర్థికే దక్కింది. నిర్ణాయక మూడో గేమ్లో లక్ష్యసేన్ పోరాడినా... కున్లావుత్ జోరు ముందు సేన్ ఆట ఫలితమివ్వలేదు. -
Thailand Open 2023: సింధు, శ్రీకాంత్లకు చుక్కెదురు
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రియాన్షు రజావత్, మిథున్ మంజునాథ్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, మాళవిక తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు కిరణ్ జార్జ్, లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, అష్మిత చాలిహా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్కు కిరణ్ షాక్ పురుషుల సింగిల్స్లో 26వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 8–21, 21–16, 14–21తో ఓడిపోయాడు. సాయిప్రణీత్ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, ప్రియాన్షు 19–21, 10–21తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా) చేతిలో, సమీర్ వర్మ 15–21, 15–21తో జొహాన్సన్ (డెన్మార్క్), మిథున్ (భారత్) 21–17, 8–21, 15–21తో కున్లావుత్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. ప్రపంచ 59వ ర్యాంకర్ కిరణ్ జార్జ్ 21–18, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2018 ప్రపంచ చాంపియన్షిప్ రన్నరప్ షి యు కి (చైనా)పై సంచలన విజయం సాధించగా... లక్ష్య సేన్ 21–23, 21–15, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై కష్టపడి గెలిచాడు. 26 నిమిషాల్లోనే... దాదాపు రెండు నెలల తర్వాత మరో అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో కేవలం 26 నిమిషాల్లో 21–13, 21–7తో వెన్ జు జాంగ్ (కెనడా)పై గెలిచింది. మరో మ్యాచ్లో క్వాలిఫయర్ అష్మిత 21–17, 21– 14తో భారత్కే చెందిన మాళవికను ఓడించింది. తొమ్మిదేళ్ల తర్వాత... కెనడా ప్లేయర్, ప్రపంచ 15వ ర్యాంకర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు 8–21, 21–18, 18–21తో ఓటమి చవిచూసింది. మిచెల్లి చేతిలో సింధు ఓడిపోవడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13,18–21, 21–17తో రస్ముస్ జెర్ –సొగార్డ్ (డెన్మార్క్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
Malaysia Masters: లక్ష్య సేన్, ప్రణయ్ సంచలనం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ సంచలన విజయాలతో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 16–21, 21–14, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై... ప్రపంచ 23వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–10, 16–21, 21–9తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత లో కీన్ యె (సింగపూర్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–12, 21–16తో తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21–13, 17–21, 21–18తో లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై కష్టపడి విజయం సాధించింది. భారత్కే చెందిన అషి్మత 17–21, 7–21తో యు హాన్ (చైనా) చేతిలో, ఆకర్షి 17–21, 12–21తో అకానె యామగుచి (జపాన్) చేతిలో, మాళవిక బన్సోద్ 11–21 13–21తో జి యి వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. -
ప్రీ క్వార్టర్స్కు సింధు.. లక్ష్య సేన్కు చుక్కెదురు
దుబాయ్: స్వర్ణ పతకమే లక్ష్యంగా ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–15, 22–20తో ప్రపంచ 17వ ర్యాంకర్ వెన్ చి సు (చైనీస్ తైపీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో సింధు 11–14తో వెనుకబడింది. ఈ దశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా తొమ్మిది పాయింట్లు గెలిచి 20–14తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయిన సింధు వెంటనే మరో పాయింట్ నెగ్గి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్ హోరాహోరీగా సాగినా కీలకదశలో సింధు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ హాన్ యువె (చైనా)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–13, 21–8తో అద్నాన్ ఇబ్రహీం (బహ్రెయిన్)పై, ప్రణయ్ 21–14, 21–9తో ఫోన్ ప్యాయె నైంగ్ (మయన్మార్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. లక్ష్య సేన్ 7–21, 21–23తో లో కీన్ యెవ్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూశాడు. సిక్కి–రోహన్ జోడీ విజయం మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–12, 21–16తో చాన్ పెంగ్ సూన్–చె యి సీ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 17–21, 21–17, 21–18తో లానీ ట్రియ మాయసరి–రిబ్కా సుగియార్తో (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 21–17తో టాన్ కియాన్ మెంగ్–టాన్ వీ కియాంగ్ (మలేసియా) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
All England 2023: లక్ష్య సేన్, ప్రణయ్ శుభారంభం
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్స్ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ లక్ష్య సేన్ తొలి రౌండ్లో సంచలన విజయం సాధించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 21–19తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో చౌ తియెన్ చెన్తో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్ మూడో ప్రయత్నంలో మాత్రం పైచేయి సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ 21–19, 22–20తో జు వె వాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. -
German Open 2023: లక్ష్య సేన్కు షాక్
జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) 21–19, 21–16తో ఆరో సీడ్ లక్ష్య సేన్ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. పొపోవ్పై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ రెండోసారి ఓటమి చవిచూశాడు. -
German Open 2023: నేటినుంచి జర్మన్ ఓపెన్
ముల్హీమ్: భారత యువ షట్లర్, గత ఏడాది రన్నరప్ లక్ష్య సేన్ ఈ సారి జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నేటినుంచి జరిగే ఈ టోర్నీలో అతను ఆరో సీడ్గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో లక్ష్య ఫ్రాన్స్కు చెందిన క్రిస్టో పొపోవ్తో తలపడతాడు. పురుషుల సింగిల్స్లో లక్ష్యతో పాటు మిథున్ మంజునాథ్ బరిలో ఉన్నాడు. అయితే మరో భారత టాప్ ఆటగాడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ అనూహ్యంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు. సరైన సమయంలో అతనికి వీసా లభించకపోవడంతో శ్రీకాంత్ తప్పుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్, తస్నీమ్ మీర్ బరిలో నిలిచారు. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్లలో భారత్నుంచి ఒక్క ఎంట్రీ కూడా లేకపోగా...మిక్స్డ్ డబుల్స్లో సుమీత్ రెడ్డి – అశ్విన్ పొన్నప్ప ద్వయం పోటీ పడుతోంది. -
లక్ష్య సేన్ ఓటమి.. అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో కూడా ఇంటికే
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఓడిపోయారు. ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–15, 10–21, 13–21తో మూడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య సేన్ తొలి గేమ్లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్ను సొంతం చేసుకున్నాడు. అయితే క్రిస్టీ పుంజుకొని వరుసగా రెండు గేముల్లో గెలిచి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా 13–21, 18–21తో యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: MS Dhoni: ఏ మాత్రం తగ్గని ధోని మేనియా T20 WC Ind Vs Eng: ఆసీస్పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్. End of 🇮🇳's campaign. 📸: @badmintonphoto#IndonesiaMasters2023#Badminton pic.twitter.com/etm7svf1rQ — BAI Media (@BAI_Media) January 27, 2023 -
భారత్ పోరాటం ముగిసె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, మహిళల సింగిల్స్లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ గాయంతో వైదొలగగా... కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ ఓడిపోయింది. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట కూడా నిరాశపరిచింది. గురువారం జరిగిన పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, ఏడో సీడ్ లక్ష్యసేన్ 21–16, 15–21, 18–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ రస్మస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సైనా 9–21, 12–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యు ఫె (చైనా) ధాటికి నిలువలేకపోయింది. మహిళల డబుల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జంట 9–21, 16–21తో ఆరో సీడ్ జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్లో గరగ కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 14–21, 10–21తో లియాంగ్ వి కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఇంటిదారి పట్టింది. సాత్విక్ సాయిరాజ్ తుంటిగాయం వల్ల చిరాగ్ షెట్టితో కలిసి బరిలోకి దిగలేకపోయాడు. దీంతో చైనాకే చెందిన లియు చెన్–జువాన్ యి జంట వాకోవర్తో ముందంజ వేసింది. -
BWF Rankings: ఎనిమిదో ర్యాంక్కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం
World Badminton Rankings 2022: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ఎనిమిదో ర్యాంక్కు చేరుకున్నాడు. కొంత కాలంగా చక్కటి ఫామ్లో ఉన్న ప్రణయ్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో ఆడటంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. ఇతర భారత షట్లర్లలో లక్ష్యసేన్ తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా, కిడాంబి శ్రీకాంత్ 12వ స్థానానికి దిగజారాడు. గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరమైన పీవీ సింధు కూడా ర్యాంకింగ్స్లో ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయింది. ఇది కూడా చదవండి: అర్జున్కు మిశ్రమ ఫలితాలు ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఇరిగేశి అర్జున్ మంగళవారం జరిగిన నాలుగు రౌండ్లలో రెండు గేముల్లో గెలిచి, మరో రెండు గేముల్లో ఓటమి పాలయ్యాడు. 9 రౌండ్లు ముగిసిన అనంతరం అర్జున్ 6.5 పాయింట్లతో మరో ఆరుగురి తో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల ర్యాపిడ్ చెస్లో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి భారత క్రీడాకారిణి సవితశ్రీ (6.5) మరో ఇద్దరితో కలిసి ఆధిక్యంలో ఉంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో లక్ష్య సేన్
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఉత్తరాఖండ్కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు పురోగతి సాధించి ఆరో ర్యాంక్లో నిలిచాడు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు ఐదో ర్యాంక్లో ఉంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్కు చేరుకోగా... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఐదు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్లో నిలిచింది. -
తొలి రౌండ్లోనే లక్ష్య సేన్ ఓటమి
హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం నుంచి భారత నంబర్వన్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. జర్మనీలో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 8వ ర్యాంకర్ లక్ష్య సేన్ 12–21, 5–21తో ప్రపంచ 15వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. భారత్కే చెందిన స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ, సైనా నెహ్వాల్ తమ తొలి రౌండ్ మ్యాచ్లను నేడు ఆడనున్నారు. చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ -
డెన్మార్క్ ఓపెన్లో ముగిసిన భారత పోరాటం
ఓడెన్స్ (డెన్మార్క్): డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత లక్ష్య సేన్.. జపాన్కు చెందిన కొడాయ్ నరవోకా చేతిలో 17-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి పాలవ్వగా, ఇవాళ (అక్టోబర్ 22) జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి జోడీ.. డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సో వేయ్ ఇక్ జోడీ చేతిలో 16-21, 19-21 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. వీరి ఓటమితో ఈ టోర్నీలో భారత పోరాటం సమాప్తమైంది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ ప్రిలిమినరీ దశలో ఓటమిపాలయ్యారు. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్కు ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయంపాలయ్యాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో సింగపూర్కు చెందిన ఏడో సీడ్ లో కీన్ యూ 21–13, 21–15 స్కోరుతో శ్రీకాంత్ను ఓడించాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఏపీ షట్లర్ శ్రీకాంత్ తగిన పోటీ ఇవ్వడంలో విఫలమయ్యాడు. అయితే మరో భారత ప్లేయర్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్స్లో లక్ష్య 21–9, 21–18 స్కోరుతో భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ను చిత్తు చేశాడు. గత రెండు మ్యాచ్లలో ప్రణయ్ చేతిలో ఓడిన సేన్ ఈ సారి పదునైన ఆటతో చెలరేగి 39 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు. గాయత్రి–ట్రెసా జోడి ఓటమి... పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్లో ఈ భారత షట్లర్లు 21–14, 2–16తో ఇండోనేసియాకు చెందిన ముహమ్మద్ షోహిబుల్ – బగాస్ మౌలానాలను ఓడించారు. అయితే మహిళల డబుల్స్లో భారత జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీకి చుక్కెదురైంది. థాయిలాండ్కు చెందిన జొంగొల్ఫాన్ కిటిథారకుల్ – రవీంద ప్రజొంగ్జాయ్ ద్వయం 23–21, 21–13 స్కోరుతో గాయత్రి–ట్రెసాపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ఇషాన్ భట్నాగర్ – తనీషా క్రాస్టో 16–21, 10–21 తేడాతో యుటా వతనబె – అరిసా హిగాషినో (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: World Shooting Championship: భారత షూటర్ల జోరు -
సాత్విక్–చిరాగ్ జోడీ ముందంజ
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్లు ఖరారు చేసుకున్నారు. అయితే మహిళల సింగిల్స్లో మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 21–19తో కాంగ్ మిన్ హ్యుక్–సియో సెయుంగ్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత జోడీ తొలి గేమ్లో 16–15తో ఆధిక్యంలో ఉన్నదశలో వరుసగా ఐదు పాయింట్లు గెలిచింది. సింగిల్స్లో ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–16, 21–12తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–13, 22–20తో జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ 32వ ర్యాంకర్ సైనా 17–21, 21–19, 11–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
వరల్డ్ నంబర్ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్ ఔట్
జపాన్ ఓపెన్ 2022లో బుధవారం భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టగా, కిదాంబి శ్రీకాంత్.. వరల్డ్ నంబర్ 4 ఆటగాడికి షాకిచ్చి ప్రీక్వార్టర్స్కు అర్హత సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లోనూ భారత్కు చుక్కెదురైంది. బుధవారం శ్రీకాంత్ ఒక్కడే తొలి రౌండ్ గండాన్ని అధిగమించాడు. శ్రీకాంత్.. మలేషియాకు చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీకాంత్.. ఈ గేమ్లో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. మిగతా గేమ్ల్లో లక్ష్యసేన్.. జపాన్కు చెందిన కెంట నిషిమొటొ చేతిలో 21-18, 14-21, 13-21 తేడాతో, సైనా నెహ్వాల్.. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 21-9, 21-17 తేడాతో ఓడారు. పురుషుల డబుల్స్లో అర్జున్-కపిల ద్వయం.. చోయ్-కిమ్ చేతిలో, మహిళల డబుల్స్లో జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ.. కిటితరకుల్-ప్రజోంగజ్ చేతిలో, మిక్స్డ్ డబుల్స్లో ప్రసాద్-దేవాంగన్ జంట.. జెంగ్-హుయాంగ్ చేతిలో ఓటమి చవిచూశాయి. కాగా, ఈ టోర్నీలో మంగళవారం హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. చదవండి: యూఎస్ ఓపెన్లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్కు బిగ్షాక్ -
ఒకే పార్శ్వంలో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్
టోక్యో: గత ఏడాది జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో భారత్కు కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్య పతకం అందించారు. అయితే ఈసారి మాత్రం భారత్కు మళ్లీ రెండు పతకాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈనెల 22 నుంచి టోక్యోలో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ఒకే పార్శ్వంలో ఉండటమే దీనికి కారణం. ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. మరో పార్శ్వంలో 2019 ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ ఉన్నాడు. సాయిప్రణీత్కూ కఠినమైన ‘డ్రా’నే పడింది. తొలి రౌండ్లో ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; విటింగస్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్; లూకా వ్రాబర్ (ఆస్ట్రియా)తో ప్రణయ్; నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్ తలపడతారు. చౌ తియెన్ చెన్తో ఇప్పటివరకు ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోయాడు. తొలి రౌండ్ అడ్డంకి దాటితే రెండో రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్ ఆడతాడు. మూడో రౌండ్లో మొమోటా లేదా ప్రణయ్లతో లక్ష్య సేన్ ఆడే అవకాశముంది. మరోవైపు శ్రీకాంత్ రెండో రౌండ్లో చైనా ప్లేయర్ జావో జున్ పెంగ్.తో ఆడతాడు... ఈ మ్యాచ్లో గెలిస్తే మూడో రౌండ్లో ఐదో సీడ్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడవచ్చు. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్కు లక్ష్య సేన్ లేదా ప్రణయ్ లేదా మొమోటాలలో ఒకరు ఎదురుపడతారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో హాన్ యు (చైనా) లేదా కి జుయ్ఫె (నెదర్లాండ్స్)లలో ఒకరితో సింధు ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరియా స్టార్ ఆన్ సె యంగ్ ఎదురుకానుంది. భారత్కే చెందిన సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో... లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో మాళవిక తలపడతారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
CWG 2022: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు
Commonwealth Games 2022- బర్మింగ్హామ్: గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్గా నిలిచింది. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలిచింది. 2014 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు, 2018 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీని ఓడించి ఫైనల్ చేరి తుది పోరులో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలైంది. మూడోసారి మిషెల్లి లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచింది. చివరిసారి ఎనిమిదేళ్ల క్రితం సింధును ఓడించిన మిషెల్లి ఈసారి తన ప్రత్యర్థికి అంతగా పోటీనివ్వలేకపోయింది. అవకాశం ఇవ్వకుండా.. అనుభవజ్ఞురాలైన మిషెల్లిని ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన సింధు అనుకున్న ఫలితం సంపాదించింది. తొలి గేమ్లో 14–8తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి అదే జోరులో గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్లోనూ సింధు విజృంభణ కొనసాగడంతో మిషెల్లికి తేరుకునే అవకాశం లేకుండాపోయింది. లక్ష్యసేన్ సైతం.. అంచనాలకు అనుగుణంగా మెరిసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ముచ్చటగా మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్గా అవతరించింది. 2014 గ్లాస్గో గేమ్స్లో కాంస్యం... 2018 గోల్డ్కోస్ట్ గేమ్స్లో రజతం నెగ్గిన ఈ తెలుగుతేజం సోమవారం ముగిసిన బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ కూడా అదరగొట్టి పసిడి పతకం దక్కించుకోగా... పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం బంగారు పతకాన్ని తమ మెడలో వేసుకుంది. శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత టేబుల్ టెన్నిస్లో ఆచంట శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత రెండోసారి పురుషుల సింగిల్స్లో పసిడి పతకం నెగ్గగా... సత్యన్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. పురుషుల హాకీలో టీమిండియా మరోసారి రజత పతకంతో సంతృప్తి పడింది. మొత్తానికి ఈ గేమ్స్ చివరిరోజు భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించి చిరస్మరణీయ ప్రదర్శనతో ముగించింది. ఓవరాల్గా ఈ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరుగుతాయి. అభిమానులకు ధన్యవాదాలు: సింధు సుదీర్ఘ కాలంగా కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం కోసం నిరీక్షించాను. ఎట్టకేలకు పసిడి పతకాన్ని సాధించడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన వేలాది మంది ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. –పీవీ సింధు PC: PV Sindhu Twitter సింధు ఘనతలు: ►కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి సింధు. గతంలో సైనా నెహ్వాల్ (2010, 2018) రెండుసార్లు పసిడి పతకాలు సాధించింది. ►కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయ ప్లేయర్గా సింధు (3 పతకాలు) నిలిచింది. గతంలో అపర్ణా పోపట్ (1998లో రజతం; 2002లో కాంస్యం), సైనా రెండు పతకాల చొప్పున సాధించారు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
CWG 2022: బ్యాడ్మింటన్లో భారత్కు మరో స్వర్ణం..
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆఖరి రోజు బ్యాడ్మింటన్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. భారత షట్లర్ లక్ష్య సేన్ ఫైనల్లో సత్తా చాటాడు. మలేషియా ప్లేయర్ ఎన్జీ జీ యోంగ్ను ఓడించాడు. తద్వారా పసిడి పతకం గెలిచాడు. కాగా అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. తడబడినా.. ఇక లక్ష్య సేన్ సోమవారం నాటి మెన్స్ సింగిల్స్ ఫైనల్లో మలేషియా షట్లర్ ఎన్జీ జీ యోంగ్తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన మొదటి గేమ్లో లక్ష్య సేన్ 19-21తో వెనుకబడ్డాడు. అయితే, రెండో గేమ్లో పుంజుకున్న అతడు 21-9తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఇక ఆఖరి గేమ్లో ఆధిపత్యం కొనసాగిస్తూ 21-16తో లక్ష్య సేన్ యోంగ్ను ఓడించి స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. కాగా లక్ష్య సేన్ గెలుపుతో భారత్ ఖాతాలో 20వ పసిడి పతకం చేరింది. దిగ్గజాల సరసన.. వరల్డ్ చాంపియన్షిప్స్లో కాంస్యం సాధించిన 20 ఏళ్ల లక్ష్య సేన్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇదే మొదటి టైటిల్. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్లు ప్రకాశ్ పదుకొణె(1978), సయ్యద్ మోదీ(1982), పారుపల్లి కశ్యప్(2014) తదితరుల సరసన నిలిచాడు. ఇక భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్కు రజత పతకం లభించిన విషయం తెలిసిందే. గత మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్డ్ టీమ్ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన టీమిండియా రజతంతో సరిపెట్టుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవడంతో స్వర్ణం గెలవాలన్న ఆశలు నెరవేరలేదు. ఇదిలా ఉంటే.. భారత్ ఇప్పటి వరకు 20 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 58 మెడల్స్తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: PV Sindhu Gold Medal: చాంపియన్లకే చాంపియన్.. గోల్డెన్ గర్ల్.. క్వీన్.. సింధుపై ప్రశంసలు Asia Cup 2022: ఆసియా కప్కు భారత జట్టు.. అయ్యర్కు నో ఛాన్స్! హుడా వైపే మెగ్గు! -
ఆఖరి రోజు 5 స్వర్ణాలు, ఓ కాంస్యంపై భారత్ గురి.. సింధు సహా పురుషుల హాకీపై గంపెడాశలు
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడలు చివరిదశకు చేరుకున్నాయి. ఇవాల్టితో (ఆగస్ట్ 8) ఈ మహా సంగ్రామం ముగియనుంది. క్రీడల ఆఖరి రోజు భారత్ మరో ఆరు పతకాలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు (10వ రోజు) భారత్ ఖాతాలో 55 పతకాలు (18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతుంది. 11వ రోజు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో లక్ష్యసేన్, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ, పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్లో ఆచంట శరత్ కమల్, పురుషుల హాకీ టీమ్ స్వర్ణం కోసం పోరడనుండగా.. పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్లో సాథియాన్ జ్ఞానశేఖరన్ కాంస్యం కోసం ఇంగ్లండ్కు చెందిన పాల్ డ్రింక్హాల్తో తలపడనున్నాడు. 11వ రోజు భారత షెడ్యూల్ ఇదే.. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.20) పీవీ సింధు వర్సెస్ మిచెల్ లీ (కెనడా) పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 2.10 ) లక్ష్య సేన్ వర్సెస్ జే యోంగ్ ఎన్జీ (మలేషియా) పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3 గంటలకు) సాత్విక్ సాయి రాజ్-చిరాగ్ శెట్టి వర్సెస్ బెన్ లేన్-సీన్ వెండీ (ఇంగ్లండ్) పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35) సాథియాన్ జ్ఞానశేఖరన్ వర్సెస్ పాల్ డ్రింక్హాల్ (ఇంగ్లండ్) పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 4.25) ఆచంట శరత్ కమల్ వర్సెస్ లియామ్ పిచ్ఫోర్డ్ (ఇంగ్లండ్) పురుషుల హాకీ గోల్డ్ మెడల్ మ్యాచ్ సాయంత్రం (5 గంటల నుంచి ప్రారంభం) ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇదిలా ఉంటే, ప్రస్తుత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఇవాళ ఆరు పతకాలు (5 స్వర్ణాలు , కాంస్యం) సాధించినా (55+6=61) 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్ రికార్డును (66 పతకాలు (26 గోల్డ్, 20 సిల్వర్, 20 బ్రాంజ్)) బద్దలు కొట్టే అవకాశం లేదు. వీటిలో రెండు స్వర్ణాలు గెలిచినా పతకాల పట్టికలో న్యూజిలాండ్ను (48 పతకాలు (19 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలు)) వెనక్కునెట్టి నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (170), ఇంగ్లండ్ (165), కెనడా (87) తొలి మూడు స్థానాల్లో ఉంటాయి. 2010 న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ రికార్డు స్థాయిలో 101 మెడల్స్ సాధించింది. ఇప్పటికీ భారత్కు అదే అత్యుత్తమ ప్రదర్శన. చదవండి: బాక్సింగ్లో మరో పతకం.. సాగర్ అహ్లావత్కు రజతం -
Commonwealth Games 2022: సెమీస్లో సింధు, శ్రీకాంత్
బ్యాడ్మింటన్లో మహిళల సింగిల్స్లో సింధు... పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి చేరారు. క్వార్టర్ ఫైనల్స్లో సింధు 19–21, 21–14, 21–18తో గో వె జిన్ (మలేసియా)పై, శ్రీకాంత్ 21–19, 21–17తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై, లక్ష్య సేన్ 21–12, 21–11తో జూలియన్ (మారిషస్)పై గెలిచారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 21–8, 21–6తో తాలియా–కేథరిన్ (జమైకా) జంటపై గెలిచింది. -
తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్, లక్ష్య సేన్
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్, ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–23, 10–21తో ప్రపంచ 41వ ర్యాంకర్బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోగా... భారత్కే చెందిన ప్రపంచ 23వ ర్యాంకర్ ప్రణయ్ 21–10, 21–9తో లక్ష్య సేన్ను బోల్తా కొట్టించాడు. గతంలో లెవెర్డెజ్తో ఆడిన ఐదుసార్లూ గెలిచిన శ్రీకాంత్ ఆరోసారి మాత్రం ఓటమి చవిచూశాడు. లక్ష్య సేన్పై ప్రణయ్కిదే తొలి విజయం కావడం విశేషం. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ జోడీ 27–25, 18–21, 21–19తో మత్సుయ్–టెకుచి (జపాన్) జంటపై గెలిచింది. చదవండి: Asia Cup Qualifiers: సునీల్ ఛెత్రీ అరుదైన రికార్డు.. మెస్సీకి రెండు అడుగుల దూరంలో -
Indonesia Masters 2022: సింధు నిష్క్రమణ
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. పీవీ సింధు, లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఏదశలోనూ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రచనోక్ చేతిలో సింధుకిది తొమ్మిదో ఓటమి. 2018 వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో చివరిసారి రచనోక్పై నెగ్గిన సింధు ఆ తర్వాత ఈ థాయ్ ప్లేయర్తో జరిగిన ఆరు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 62 నిమిషాల్లో 16–21, 21–12, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు, లక్ష్య సేన్లకు 2,160 డాలర్ల (రూ. లక్షా 68 వేలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది. -
Thomas Cup 2022: షటిల్ కింగ్స్
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రపంచ షటిల్ సామ్రాజ్యంలో మన జెండా ఎగిరింది. ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్గా పేరున్న థామస్ కప్లో ఒకప్పుడు మనం ప్రాతినిధ్యానికే పరిమితమయ్యాం. ఒకట్రెండుసార్లు మెరిపించినా ఏనాడూ పతకం అందుకోలేకపోయాం. కానీ ఈసారి అందరి అంచనాలను పటాపంచలు చేశాం. ఏకంగా విజేతగా అవతరించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ ఫైనల్లో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాకు విశ్వరూపమే చూపించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో ఆఖరి మ్యాచ్లో ఫలితం తేలగా... టైటిల్ సమరంలో వరుసగా మూడు విజయాలతో ఇండోనేసియా కథను ముగించి మువ్వన్నెలు రెపరెపలాడించాం. భారత చరిత్రాత్మక విజయంలో తెలుగు తేజాలు కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్లో, డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్... తెలంగాణ ప్లేయర్ పంజాల విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమయ్యారు. బ్యాంకాక్: ఇన్నాళ్లూ వ్యక్తిగత విజయాలతో మురిసిపోయిన భారత బ్యాడ్మింటన్ ఇప్పుడు టీమ్ ఈవెంట్లోనూ అదరగొట్టింది. 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్లో తొలిసారి భారత్ చాంపియన్గా అవతరించింది. ప్రకాశ్ పడుకోన్, సయ్యద్ మోడీ, విమల్ కుమార్, పుల్లెల గోపీచంద్లాంటి స్టార్స్ గతంలో థామస్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన వాళ్లే. కానీ ఏనాడూ వారు ట్రోఫీని ముద్దాడలేకపోయారు. ఎట్టకేలకు వీరందరి కలలు నిజమయ్యాయి. అసాధారణ ఆటతీరుతో ఈసారి భారత జట్టు థామస్ కప్ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాను చిత్తు చేసి థామస్ కప్ను సొంతం చేసుకుంది. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి ఇండోనేసియాకు షాక్ ఇచ్చింది. శుభారంభం... తొలిసారి థామస్ కప్ ఫైనల్ ఆడిన భారత్కు శుభారంభం లభించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్తో జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 65 నిమిషాల్లో 8–21, 21–17, 21–16తో విజయం సాధించి భారత్కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. తొలి గేమ్లో తడబడిన లక్ష్య సేన్ ఆ తర్వాత చెలరేగి ఆంథోనీ ఆట కట్టించాడు. డబుల్స్ విభాగంలో జరిగిన రెండో మ్యాచ్లో ఇండోనేసియా ప్రపంచ నంబర్వన్ కెవిన్ సంజయ సుకముల్యో, రెండో ర్యాంకర్ మొహమ్మద్ అహసాన్లను బరిలోకి దించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆద్యంతం అద్భుత ఆటతీరుతో 73 నిమిషాల్లో 18–21, 23–21, 21–19తో సుకముల్యో–అహసాన్ జంటను బోల్తా కొట్టించి భారత్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్గా జరిగిన రెండో సింగిల్స్లో 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్ జొనాథాన్ క్రిస్టీతో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తలపడ్డాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ 21–15, 23–21తో గెలుపొంది భారత్ను చాంపియన్గా నిలిపాడు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి కళ్లు చెదిరే ఆటతో ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ ఈ మ్యాచ్లోనూ దానిని కొనసాగించాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీతో ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించాడు. తొలి గేమ్ను అలవోకగా నెగ్గిన శ్రీకాంత్ రెండో గేమ్లో ఒకదశలో 13–16తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ స్కోరును సమం చేశాడు. అనంతరం 20–21తో వెనుకబడ్డ దశలో మళ్లీ కోలుకొని వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయా న్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్లను నిర్వహించలేదు. మనం గెలిచాం ఇలా... లీగ్ దశ: గ్రూప్ ‘సి’లో భారత జట్టు వరుసగా తొలి రెండు లీగ్ మ్యాచ్ల్లో జర్మనీపై 5–0తో... కెనడాపై 5–0తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ 2–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడి గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్: ఐదుసార్లు చాంపియన్ మలేసియాపై భారత్ 3–2తో గెలిచింది. 1979 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి ప్రవేశించి తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్: 2016 విజేత డెన్మార్క్పై భారత్ 3–2తో నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో మొదటిసారి ఫైనల్కు అర్హత సాధించింది. గెలుపు వీరుల బృందం... థామస్ కప్లో భారత్ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్), లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్), హెచ్ఎస్ ప్రణయ్ (కేరళ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) పోటీపడ్డారు. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)... ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–ధ్రువ్ కపిల (పంజాబ్) జోడీలు బరిలోకి దిగాయి. నా అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. వ్యక్తిగత టోర్నీలతో పోలిస్తే టీమ్ ఈవెంట్లలో ఆడే అవకాశం తక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద ఘనతను అందుకోవడం నిజంగా గొప్ప ఘనతగా భావిస్తున్నా. మేం సాధించామని నమ్మేందుకు కూడా కొంత సమయం పట్టింది. జట్టులో ప్రతీ ఒక్కరు బాగా ఆడారు. ఏ ఒక్కరో కాకుండా పది మంది సాధించిన విజయమిది. టీమ్ విజయాల్లో ఉండే సంతృప్తే అది. –కిడాంబి శ్రీకాంత్ ‘అభినందనల జల్లు’ థామస్ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. భారత్కు తిరిగి వచ్చాక తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. ‘భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్ గెలుపుపై దేశమంతా హర్షిస్తోంది. మన జట్టుకు అభినందనలు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలి. ఈ గెలుపు వర్ధమాన ఆటగాళ్లకు స్ఫూర్తినందిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా తొలిసారి థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. తొలిసారి థామస్ కప్ గెలవడం భారత బ్యాడ్మింటన్కు చారిత్రాత్మక క్షణం. విజయం సాధించే వరకు పట్టు వదలకుండా, ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కిడాంబి శ్రీకాంత్, భారత బృందానికి అభినందనలు. ప్రతిష్ట, సమష్టితత్వం కలగలిస్తేనే విజయం. చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, సాత్విక్సాయిరాజ్, ప్రణయ్లకు కూడా అభినందనలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి ఈ గెలుపు గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. మా ఆటగాళ్లపై కొంత ఆశలు ఉన్నా ఇంత గొప్పగా ఆడతారని ఊహించలేదు. భారత క్రికెట్కు 1983 ప్రపంచకప్ ఎలాంటిదో ఇప్పుడు బ్యాడ్మింటన్కు ఈ టోర్నీ విజయం అలాంటిది. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ థామస్ కప్ విజయం చాలా పెద్దది. జనం దీని గురించి మున్ముందు చాలా కాలం మాట్లాడుకుంటారు. భారత బ్యాడ్మింటన్ గర్వపడే క్షణమిది. ఇకపై మన టీమ్ గురించి ప్రపంచం భిన్నంగా ఆలోచిస్తుంది. ఒకప్పుడు వ్యక్తిగత పతకాలు గెలవడం కలగా ఉండేది. ప్రిక్వార్టర్స్ చేరినా గొప్పగా అనిపించేది. ఇది వాటికి మించిన ఘనత. దానిని బట్టి చూస్తే ఈ టీమ్ ఎంత గొప్పగా ఆడిందో అర్థమవుతుంది. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ రూ. 2 కోట్ల నజరానా థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 1 కోటి, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి రూ. 1 కోటి జట్టు సభ్యులకు ఇవ్వనున్నారు. -
అందరి దృష్టి సింధు, లక్ష్యసేన్ పైనే
మనీలా (ఫిలిప్పీన్స్): భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. వైరస్ వల్ల రెండేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ మంగళవారం నుంచి జరగనుంది. ఒలింపిక్స్ క్రీడల్లో రజతం, కాంస్యం... ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన సింధుక ఆసియా టైటిల్ బాకీ ఉంది. గతంలో 2014లో సెమీస్ చేరడం ద్వారా సింధుకు కాంస్యమైతే వచ్చింది. అయితే ఈసారి పతకం రంగు మార్చేందుకు గట్టిపట్టుదలతో బరిలోకి దిగుతోంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పై యు పొ (చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది. ప్రపంచ మాజీ నంబర్వన్ సైనా నెహ్వాల్... సిమ్ యుజిన్ (కొరియా)తో పోటీపడుతుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ఐదో సీడ్గా, కిడాంబి శ్రీకాంత్ ఏడో సీడ్గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ రన్నరప్ లక్ష్యసేన్ చైనాకు చెందిన లి షి ఫెంగ్ను ఎదుర్కోనుండగా, శ్రీకాంత్... మలేసియా ప్రత్యర్థి ఎన్జీ తే యంగ్తో తలపడతాడు. ఇంకా సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్లో స్టార్ జోడీ సాత్విక్–చిరాగ్ షెట్టి, కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ బరిలో ఉన్నారు. గాయాలతో సింగిల్స్లో ప్రణయ్, మహిళల డబుల్స్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ వైదొలిగాయి. -
ప్రిక్వార్టర్స్లో లక్ష్య సేన్, మాళవిక
సన్చెయోన్ (దక్షిణ కొరియా): భారత నంబర్వన్ ర్యాంకర్ లక్ష్య సేన్ కొరియా ఓపెన్ వరల్డ్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశాడు. చోయ్ జీ హూన్ (దక్షిణ కొరియా)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 14–21, 21–16, 21–18తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 72వ ర్యాంకర్ చీమ్ జూన్ వె (మలేసియా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 23వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 7–21తో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక బన్సోద్ (భారత్) 20–22, 22–20, 21–10తో ప్రపంచ 24వ ర్యాంకర్ హాన్ వయి (చైనా)పై సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో కృష్ణప్రసాద్ గారగ–పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (భారత్) జోడీ 14–21, 19–21తో ప్రమ్యుద–రామ్బితాన్ (ఇండోనేసియా) జంట చేతిలో... సుమీత్ రెడ్డి–బొక్కా నవనీత్ (భారత్) ద్వయం 14–21, 12–21తో ఒంగ్ యె సిన్–తియో ఇ యి (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
BWF Rankings: కెరీర్ బెస్ట్.. తొలిసారి టాప్–10లోకి లక్ష్య సేన్
BWF Rankings: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ రన్నరప్తో టాప్–10 ర్యాంకింగ్స్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో 20 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 9వ ర్యాంక్కు ఎగబాకాడు. ఇక మహిళల డబుల్స్లో నిలకడగా రాణిస్తోన్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 12 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 34వ ర్యాంక్ను అందుకుంది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
లక్ష్యం చేరలేదు..!
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గెలిచిన మూడో భారతీయుడిగా నిలవాలని ఆశించిన భారత యువతార లక్ష్య సేన్కు నిరాశే ఎదురైంది. టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన లక్ష్య సేన్ బలమైన ప్రత్యర్థి ముందు నిలవలేక ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నంబర్వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) 21–10, 21–15 స్కోరుతో లక్ష్య సేన్పై విజయం సాధించి రెండోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. 2020లోనూ అక్సెల్సన్ ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. 53 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో కొన్నిసార్లు లక్ష్య సేన్ దీటుగా పోరాడినా తుది ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. గత ఏడాది ఇదే టోర్నీ ఫైనల్లో అనూహ్యంగా ఓటమి పాలై రన్నరప్గా సంతృప్తి చెందిన అక్సెల్సన్ ఈసారి తన స్థాయికి తగ్గ ఆటతో చాంపియన్ అయ్యాడు. విజేత అక్సెల్సన్కు 70 వేల డాలర్లు (రూ. 53 లక్షల 17 వేలు), రన్నరప్ లక్ష్య సేన్కు 34 వేల డాలర్లు (రూ. 25 లక్షల 83 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. సుదీర్ఘ ర్యాలీలతో... ఫైనల్ పోరుకు ముందు అక్సెల్సన్తో ముఖాముఖి సమరాల్లో లక్ష్య 1–4తో వెనుకంజలో ఉన్నాడు. అయితే ఆ ఒక్క విజయం ఎనిమిది రోజుల ముందే జర్మన్ ఓపెన్లో సెమీఫైనల్లో వచ్చింది. దాంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న సేన్పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే విక్టర్ ఆరంభంలోనే సేన్ను దెబ్బ కొట్టాడు. వరుస పాయింట్లతో దూసుకుపోయిన అతను 6–0తో ముందంజలో నిలిచిన తర్వాత గానీ లక్ష్య తొలి పాయింట్ సాధించలేకపోయాడు. తొలి గేమ్ మొత్తం దాదాపు ఇదే తరహాలో సాగింది. అక్సెల్సన్ ఆధిపత్యం ముందు సేన్ జవాబివ్వలేకపోయాడు. 2–8 వద్ద 61 షాట్ల ర్యాలీ కూడా రావడంతో సేన్ బాగా అలసిపోయాడు. చక్కటి డిఫెన్స్ ప్రదర్శిస్తూ 11–2తో ముందంజ వేసిన డానిష్ ఆటగాడు దానిని కొనసాగిస్తూ అలవోకగా తొలి గేమ్ను గెలుచుకున్నాడు. రెండో గేమ్లో సేన్ కొంత పోటీనిచ్చాడు. ముఖ్యంగా అతని స్మాష్లు మంచి ఫలితాలనిచ్చాయి. అయితే 4–4తో సమంగా ఉన్న స్థితి నుంచి అక్సెల్సన్ 11–5 వరకు తీసుకుపోగా, విరామం తర్వాత కోలుకొని వరుసగా మూడు పాయింట్లు సాధించి సేన్ 9–12తో అంతరాన్ని తగ్గించాడు. ఈ దశలో విక్టర్ మళ్లీ చెలరేగి 10–17తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ సమయంలో ఇద్దరు హోరాహోరీగా తలపడుతూ 70 షాట్ల ర్యాలీ ఆడగా, సేన్కు పాయింట్ దక్కి స్కోరు 11–17కు చేరింది. అయితే చివర్లో లక్ష్య మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్నా... అప్పటికే ఆలస్యమైపోయింది. అనుభవలేమి, ఒత్తిడిలో ఓటమి పాలైనా... వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో రన్నరప్గా నిలవడం 20 ఏళ్ల లక్ష్య సేన్ కెరీర్కు కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
సూపర్ లక్ష్య: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్లోకి భారత యువతార
వేదిక ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా... పరిస్థితి ఎలా ఉన్నా... తగ్గేదేలే... అంటూ భారత బ్యాడ్మింటన్ యువతార లక్ష్య సేన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో దూసుకుపోతున్నాడు. ఎవరూ ఊహించని విధంగా చెలరేగిపోతున్న 20 ఏళ్ల లక్ష్య సేన్ ఈ మెగా టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ లీ జి జియా (మలేసియా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్ మరో విజయం సాధిస్తే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన మూడో భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందుతాడు. ప్రపంచ నంబర్వన్ అక్సెల్సన్ (డెన్మార్క్), నాలుగో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు. బర్మింగ్హమ్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ రూపంలో మళ్లీ ఓ భారతీయ ప్లేయర్ టైటిల్ బరిలో నిలిచాడు. 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మెగా టోర్నీలో ఉత్తరాఖండ్కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ 76 నిమిషాల్లో 21–13, 12–21, 21–19తో ప్రపంచ 7వ ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ లీ జి జియా (మలేసియా)పై గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్లో లక్ష్య సేన్ 10–14తో, 12–16తో, 16–18తో వెనుకబడ్డాడు. కానీ వెనుకంజలో ఉన్నానని ఆందోళన చెందకుండా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్ స్కోరు 16–18 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఒక పాయింట్ కోల్పోయిన లక్ష్య సేన్ ఆ వెంటనే మరో పాయింట్ గెలిచి చిరస్మరణీయ విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్)ను ఓడించిన లీ జి జియా సెమీఫైనల్లో మాత్రం లక్ష్య సేన్ ధాటికి కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో సౌరభ్ వర్మ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై నెగ్గిన లక్ష్య సేన్కు క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ లూ గ్వాంగ్ జు నుంచి వాకోవర్ లభించింది. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న లక్ష్య సేన్ కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో తనకంటే మెరుగైన ప్లేయర్లను ఓడిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్లో ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకం గెలిచిన లక్ష్య సేన్ ఈ ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టైటిల్ను సాధించాడు. గత వారం జర్మన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచాడు. గాయత్రి–త్రిషా జంట ఓటమి మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ (భారత్) జంట పోరాటం ముగిసింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో గాయత్రి– త్రిషా జోడీ 17–21, 16–21తో జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) జంట చేతిలో ఓడింది. గాయత్రి–త్రిషా జోడీకి 14 వేల డాలర్ల ప్రైజ్మనీ (రూ. 10 లక్షల 64 వేలు) తోపాటు 8,400 పాయింట్లు లభించాయి. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఫైనల్కు చేరిన ఐదో భారతీయ ప్లేయర్ లక్ష్య సేన్. గతంలో పురుషుల సింగిల్స్లో ప్రకాశ్నాథ్ (1947; రన్నరప్), ప్రకాశ్ పదుకొనే (1980–విజేత; 1981–రన్నరప్), పుల్లెల గోపీచంద్ (2001–విజేత)... మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ (2015–రన్నరప్) ఈ ఘనత సాధించారు. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ తెలుగుతేజం పీవీ సింధుకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ల్లో పతకాలు సాధించిన స్టార్కు ‘ఆల్ఇంగ్లండ్’ మాత్రం మరోసారి అందని ద్రాక్షే అయ్యింది. పురుషుల సింగిల్స్లో యువ సంచలనం లక్ష్యసేన్ భారత ఆశల పల్లకిని మోస్తున్నాడు. మూడో సీడ్ అంటోన్సెన్ను కంగుతినిపించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బర్మింగ్హామ్: భారత రైజింగ్ స్టార్ లక్ష్యసేన్ టోర్నీ టోర్నీకి తన రాకెట్ పదును పెంచుతున్నాడు. తాజాగా ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో దూసుకెళ్తున్నాడు. అన్సీడెడ్ లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్లో మూడో సీడ్ అండర్స్ అంటోన్సెన్పై సంచలన విజయం సాధించాడు. గతేడాది ఆల్ ఇంగ్లండ్ టోర్నీ, ప్రపంచ చాంపియన్షిప్ సెమీఫైనలిస్ట్ అయిన అంటొన్సెన్ను ఈ సారి ప్రిక్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టించాడు. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ ఓడిపోగా... మహిళల సింగిల్స్లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్, మాజీ ప్రపంచ చాంపియన్ సింధులకు నిరాశ ఎదురైంది. తమ ప్రత్యర్థుల చేతుల్లో ప్రిక్వార్టర్స్లో ఇద్దరూ పోరాడి ఓడారు. డబుల్స్లో గాయత్రీ–ట్రెసా జాలీ, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీలు క్వార్టర్స్ చేరాయి. వరుస గేముల్లోనే... ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ పట్టుదలతో ముందంజ వేస్తున్నాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అతను 21–16, 21–18తో ప్రపంచ మూడో ర్యాంకర్ అండర్స్ అంటొన్సెన్ (డెన్మార్క్)పై అసాధారణ విజయం సాధించాడు. అంతర్జాతీయ టోర్నీలో తనకెదురైంది టాప్–3 ప్లేయర్ అయినా... లక్ష్యసేన్ మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా యథేచ్ఛగా తన ‘మిషన్’ పూర్తిచేశాడు. తొలి గేమ్లో 11–9తో ఆధిక్యంలోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడలేదు. నెట్ వద్ద పాదరసంలా కదిలిన భారత ఆటగాడు అదేజోరు గేమ్ను వశం చేసుకున్నాడు. ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ రన్నరప్ అయిన అంటొన్సెన్ రెండో గేమ్లో సత్తాచాటాడు. దీంతో ఈ గేమ్ హోరాహోరీగా సాగింది. దీంతో రెండుసార్లు 14–14, 16–16వద్ద స్కోరు సమమైంది. వరుసగా రెండు పాయింట్లు సాధించి 18–16తో ఆధిక్యంలోకి వచ్చిన లక్ష్యషేన్ తర్వాత చకచకా పాయింట్లు సాధించి గేమ్తో పాటు మ్యాచ్ను గెలుచుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత యువ షట్లర్... చైనాకు చెందిన లు గ్వాంగ్ జుతో తలపడతాడు. మరో ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ 21–9, 18–21, 19–21తో ఐదో సీడ్ ఆంథోని సిన్సుకా (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నాడు. సింధు... మరో ‘సారీ’ ప్రతిష్టాత్మక టోర్నీల్లో పతకాలు గెలిచిన పూసర్ల వెంకట సింధుకు ఎందుకనో ఆల్ ఇంగ్లండ్ కలిసిరావడం లేదు. ఈ ఏడాదీ ఆమె పతకం లేకుండానే నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్లో ఆరో సీడ్ సింధు 19–21, 21–16, 17–21తో సయాక టకహషి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. సైనా నెహ్వాల్ 14–21, 21–17, 17–21తో రెండో సీడ్ యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ మాజీ ప్రపంచ నంబర్వన్ ఈ మ్యాచ్లో తన ఆటతీరుతో ఆకట్టుకుంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో పుల్లెల గాయత్రీ–ట్రెసా జాలీ తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్లో దూసుకెళుతుండగా 18–21, 19–14 స్కోరువద్ద ఆరో సీడ్ ప్రత్యర్థి జోడీ గ్రేసియా–అప్రియని (ఇండోనేసియా) రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగింది. దీంతో భారత జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–7, 21–7తో మార్క్ లామ్స్ఫుజ్–మార్విన్ సీడెల్ (జర్మనీ) ద్వ యంపై ఏకపక్ష విజయాన్ని సాధించింది. కేవలం 27 నిమిషాల్లోనే భారత జంట మ్యాచ్ను ముగించింది. -
ప్రణయ్పై గెలుపుతో సెమీఫైనల్లో లక్ష్య సేన్
జర్మన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువస్టార్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–16తో భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్పై గెలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 10–21, 21–23తో టాప్ సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్కిది వరుసగా ఆరో ఓటమి. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ జోడీ 11–21, 21–23తో హి జి టింగ్–హావో డాంగ్ జౌ (చైనా) జంట చేతిలో ఓడింది. -
Asia Team Championships 2022: లీగ్ దశలోనే భారత్ నిష్క్రమణ
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల, మహిళల జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించాయి. కౌలాలంపూర్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో భారత పురుషుల జట్టు 2–3తో ఇండోనేసియా చేతిలో... భారత మహిళల జట్టు 1–4తో జపాన్ చేతిలో ఓడిపోయాయి. ఇండోనేసియాతో పోటీలో భారత యువస్టార్స్ లక్ష్య సేన్, మిథున్ మంజునాథ్ రెండు సింగిల్స్లో గెలిచారు. చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్కు కూడా డౌటే.. ఎందుకంటే! -
Asia Badminton Championship: ఓటమితో మొదలు
షా ఆలమ్ (మలేసియా): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టుకు తొలి మ్యాచ్లో భారీ ఓటమి ఎదురైంది. దక్షిణ కొరియాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో భారత్ 0–5తో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్ 11–21, 19–21తో ప్రపంచ 2094వ ర్యాంకర్ జియోన్ హైక్ జిన్ చేతిలో ఓటమి చవిచూశాడు. ఆ తర్వాత రవికృష్ణ–శంకర్ ప్రసాద్ 8–21, 10–21తో వి తె కిమ్–కిమ్ జెవాన్ చేతిలో... కిరణ్ జార్జ్ 18–21, 14–21తో జూ వాన్ కిమ్ చేతిలో... మంజిత్ సింగ్–డింకూ సింగ్ 7–21, 15–21తో యోంగ్ జిన్–నా సుంగ్ సెయుంగ్ చేతిలో... మిథున్ మంజునాథ్ 16–21, 27–25, 14–21తో మిన్ సన్ జియోంగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల విభాగంలో నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్లో ఆతిథ్య మలేసియా జట్టుతో భారత్ ఆడనుంది. -
సాత్విక్–చిరాగ్ జంట సంచలనం.. టైటిల్ సొంతం.. ప్రైజ్మనీ ఎంతంటే!
India Open 2022: బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్లో ... అదీ సొంతగడ్డపై భారత షట్లర్లు అద్భుతం చేశారు. ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నమెంట్లో భారత్కు రెండు టైటిల్స్ అందించారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి ద్వయం ప్రపంచ రెండో ర్యాంక్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్స్గా నిలిచిన మొహమ్మద్ ఎహ్సాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్ దక్కించుకోగా... పురుషుల సింగిల్స్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్)ను కంగుతినిపించి భారత యువస్టార్ లక్ష్య సేన్ విజేతగా అవతరించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ శెట్టి 21–16, 26–24తో టాప్ సీడ్ ఎహ్సాన్–సెతియవాన్ జోడీ ని ఓడించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టికిది రెండో సూపర్ –500 స్థాయి టైటిల్ కావడం విశేషం. 2019లో థాయ్లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో విజేతగా నిలిచిన ఈ జోడీ అదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో రన్నరప్గా నిలిచింది. ఎహ్సాన్–సెతియవాన్ జంటతో 43 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం కీలకదశలో పట్టు కోల్పోకుండా ఓర్పుతో ఆడింది. తొలి గేమ్లో స్కోరు 13–13తో సమంగా ఉన్న దశలో సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–13తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని తొలి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్లో రెండు జోడీలు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడాయి. చివరకు భారత జోడీనే పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 31,600 డాలర్లు (రూ. 23 లక్షల 43 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. గత నెలలో కొత్త ప్రపంచ చాంపియన్గా అవతరించిన లో కీన్ యుతో 54 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 24–22, 21–17తో గెలుపొంది కెరీర్లో తొలి సూపర్–500 టైటిల్ సాధించాడు. గత నెలలో ప్రపంచ చాంపియన్ షిప్లో కాంస్యం నెగ్గిన 20 ఏళ్ల లక్ష్య సేన్ ఫైనల్లో ఆద్యంతం నిలకడగా ఆడాడు. తొలి గేమ్లో 19–20, 21–22 వద్ద రెండుసార్లు గేమ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కిన లక్ష్య సేన్ రెండో గేమ్లో మాత్రం లో కీన్ యుపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. విజేతగా నిలిచిన లక్ష సేన్కు 30 వేల డాలర్లు (రూ. 22 లక్షల 24 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు 14–21, 21–13, 10–21 తో సుపనిద (థాయ్లాండ్) చేతిలో ఓడింది. చదవండి: IPL 2022: ధోని ‘గుడ్ బై’.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా రవీంద్ర జడేజా!? How Lakshya Sen won his first World Tour 500 title on his debut at the India Open 🥇 (via @bwfmedia) pic.twitter.com/02od3Arg73 — ESPN India (@ESPNIndia) January 16, 2022 -
India Open 2022: ప్రపంచ ఛాంపియన్స్కు షాకిచ్చిన భారత ఆటగాళ్లు
India Open 2022: భారత క్రీడాకారుడు లక్ష్యసేన్ ఇండియా ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్యూను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో లక్ష్యసేన్ లోహ్ కీన్యూపై 24-22, 21-17 తేడాతో గెలుపొందాడు. 54 నిమిషాలపాటు సాగిన ఈ గేమ్లో వరుస రెండు సెట్లలో విజయం సాధించి టైటిల్ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో లక్ష్యసేన్ తన తొలి సూపర్ 500 టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఓవరాల్గా ఈ టైటిల్ గెలుచుకున్న మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. Take a bow for the Men’s Singles champions! 🔥🔥👏 🥇: @lakshya_sen 🥈: @reallohkeanyew #YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/iM9wkpiDLD — BAI Media (@BAI_Media) January 16, 2022 ఇండియా ఓపెన్ డబుల్స్ ఫైనల్లో చిరాగ్శెట్టి- సాత్విక్ సాయిరాజ్ జోడి మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్లు అయిన ఇండోనేషియాకు చెందిన మహ్మద్ అహ్పాన్, హెండ్రా సెటియావాన్లను ఓడించి టైటిల్ను గెలుపొందారు. ఫైనల్లో ఈ జోడి వరుస సెట్లలో అద్భుతమైన ఆటతీరుతో 21-16, 26-24 తేడాతో గెలుపొందింది. Put your hands together for the Men’s doubles champions! 🇮🇳 🇮🇩 👏👏🔝 🥇: @satwiksairaj & @Shettychirag04 🥈: Mohammad Ahsan & Hendra Setiwan#YonexSunriseIndiaOpen2022 #IndiaKaregaSmash #Badminton pic.twitter.com/hHC4i5ybOE — BAI Media (@BAI_Media) January 16, 2022 చదవండి: (విరాట్ కోహ్లి రిటైర్మెంట్.. స్పందించిన పుజారా) -
India Open: ఫైనల్స్కు దూసుకెళ్లిన లక్ష్య సేన్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన సెమీస్లో మలేషియాకు చెందిన ప్రపంచ 60వ ర్యాంకర్ యోంగ్ను 19-21, 21-16, 21-12 తేడాతో ఓడించి తుది పోరుకు అర్హత సాధించాడు. FIRST SUPER 5️⃣0️⃣0️⃣ FINAL! ✅✅🔥👏Kudos @lakshya_sen ! 👏🔝#YonexSunriseIndiaOpen2022#IndiaKaregaSmash#Badminton pic.twitter.com/FM5kWQlPbe— BAI Media (@BAI_Media) January 15, 2022 ఫైనల్స్లో సింగపూర్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ లో కియా యూతో సమరానికి సిద్ధమాయ్యాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్యసేన్.. క్వార్టర్ఫైనల్లో సహచర భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్పై 14-21, 21-9, 21-14 తేడాతో గెలిచి సెమీస్కు చేరాడు. కాగా, ఈ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భారత షట్లర్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన భారత షట్లర్.. సింధు, సైనాలకు సాధ్యం కాని ఘనత సొంతం -
లక్ష్య సేన్కు రూ. 15 లక్షలు నజరానా
Lakshya Sen: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన భారత ప్లేయర్, ఉత్తరాఖండ్ క్రీడాకారుడు లక్ష్య సేన్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందించింది. ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్గా ఘనత వహించిన లక్ష్య సేన్ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ సన్మానించి రూ. 15 లక్షల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్లో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. It was an honour to meet Uttarakhand Chief Minister @pushkardhami sir! Thank you for your kind and inspiring words sir! pic.twitter.com/YbdDF1xYk9 — Lakshya Sen (@lakshya_sen) December 27, 2021 -
అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్.. రెండేళ్ల తర్వాత..!
Kidambi Srikanth Returns To Top 10 World Rankings: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో తెలుగు తేజం, మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టాడు. రెండేళ్ల తర్వాత తిరిగి టాప్-10లోకి అడుగుపెట్టాడు. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని పదో ర్యాంక్లో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్లో మరో భారత షట్లర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ ర్యాంక్(17)ను అందుకోగా, హెచ్ఎస్ ప్రణయ్ 6 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్కు చేరుకున్నాడు. 𝗥𝗔𝗡𝗞𝗜𝗡𝗚 𝗨𝗣𝗗𝗔𝗧𝗘𝗦 😍🔥@srikidambi entered 🔝 10 after 2 years@lakshya_sen achieved career high ranking@P9Ashwini & @sikkireddy entered top 20@PRANNOYHSPRI moved 6 ranks 🆙 Keep up the good work guys! 👊#IndiaontheRise#Badminton 📸 Badminton Photo pic.twitter.com/UOHHIRi96W — BAI Media (@BAI_Media) December 21, 2021 మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో పీవీ సింధు ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. మహిళల డబుల్స్లో అశ్విని, సిక్కి జోడీ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 20వ స్థానంలో నిలిచింది. కాగా, తాజాగా జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్కు చేరుకొని రజత పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు మరో భారత షట్లర్ లక్ష్యసేన్ సైతం సెమీస్కు చేరుకుని కాంస్య పతకం గెలిచాడు. చదవండి: హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్కు కాంస్యం -
World Badminton Championship: భారత్కు రజత, కాంస్యాలు.. ప్రైజ్మనీ మాత్రం ఉండదు!
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు లక్ష్య సేన్. అయితే, తన ప్రదర్శన పట్ల మాత్రం సంతృప్తిగా లేనని, వచ్చే ఏడాది స్వర్ణ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. కాగా ఈ మెగా ఈవెంట్లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ పసిడి గెలిచే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోగా... సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్ (భారత్) కాంస్యం గెలుచుకున్నాడు. దీంతో.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లోభారత్ ఖాతాలో ఒకేసారి రజత, కాంస్య పతకాలు చేరాయి. ఇలా జరగడం ఇది రెండోసారి. అంతకుముందు... 2017లో మహిళల సింగిల్స్లో పీవీ సింధు రజతం, సైనా నెహ్వాల్ కాంస్యం సాధించారు. ఈసారి పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పతకాలు సాధించారు. కాగా ఈ మెగా టోర్నీలో విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ప్రైజ్మనీ ఉండదు. సంతోషమే.. కానీ.. పతకం గెలిచిన లక్ష్య సేన్ మాట్లాడుతూ... ‘చరిత్ర సృష్టించడానికి చేరువగా వచ్చి సెమీఫైనల్లో ఓడటం బాధగా ఉంది. ఏదైతేనేం... నాకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకం దక్కింది. అయితే నేను ఈ పతకంతో సంతృప్తి చెందడంలేదు. ఓవరాల్గా టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలిసారి ఆడుతున్నప్పటికీ... కాంస్యం సాధించి నా గురువు ప్రకాశ్ పదుకొనే సరసన నిలవడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని పేర్కొన్నాడు.