MAruthi
-
యూరప్ వెళ్లనున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..?
ప్రభాస్ యూరప్ వెళ్లనున్నాడు. రాజాసాబ్ సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఆయన అక్కడకు వెల్లేందుకు సిద్ధం అవుతున్నాడు.మారుతి దర్శకత్వలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సలార్, కల్కి చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. అయితే, సాంగ్స్ చిత్రీకరణ పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉన్నట్లు సంగీత దర్శకుడు థమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో యూరప్లో ఒక సాంగ్ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కూడా ప్రభాస్, మాళవిక మోహనన్ల మధ్య ఉంటుందట. అదిరిపోయే లొకేషన్స్లో చాలా గ్లామరస్గా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచే రాజాసాబ్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా తొలి సాంగ్ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
'రాజాసాబ్' కోసం సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్
మారుతి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజాసాబ్లో ఆరు పాటలు ఉంటాయని అందులో ఒకటి పాపులర్ రీమిక్స్ సాంగ్ ఉంటుందని తెలిపారు. దీంతో ఆ హిట్ సాంగ్ ఏదై ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది.భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదని ఆయన అన్నారు. ఈ చిత్రం స్కేల్ను కూడా ఎవరూ ఊహించలేరని ఆయన అన్నారు. అయితే, రాజాసాబ్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హిట్ సినిమా నుంచి ఒక పాటను రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన రైట్స్ కోసం కూడా ఆయన సుమారుగానే ఖర్చు చేసినట్లు టాక్. సంజయ్దత్ హీరోగా నటించిన 'ఇన్సాఫ్ అప్నే లాహూ సే' సినిమా నుంచి 'హవా హవా..' అనే సాంగ్ను డైరెక్టర్ మారుతి ఎంపిక చేసుకున్నారట. 1994లో వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ కోసం థమన్ ఆ పాటనే రీమిక్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ప్రభాస్ లుక్పై మంచి టాక్ వస్తుంది. 2025 సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
టీజర్లోనే ఇన్ని బూతులు ఉంటే.. ఇక సినిమా పరిస్థితి ఏంటో..?
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో బూతు డైలాగ్స్కు ఎలాంటి కొదవ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా టీజర్,ట్రైలర్లోనే కొన్ని డైలాగ్స్తో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'డ్రింకర్ సాయి' సినిమా టీజర్ కూడా అదే కోవకు చెందినట్లు కనిపిస్తుంది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్లు ‘డ్రింకర్ సాయి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్లైన్ కూడా ఉంచారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేసిన విషయం తెలిసిందే.యూత్ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ డ్రింకర్ సాయి చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో ఎక్కువగా బోల్డ్ డైలాగ్స్తో పాటు ధర్మ , ఐశ్వర్య శర్మ లవ్ స్టోరీ హైలెట్గా కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ ఐశ్వర్య శర్మకు యూత్ ఫిదా అవుతున్నారు. షోషల్ మీడియాలో ఆమె డైలాగ్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రమ్, బిగ్ బాస్ ఫేమ్ కిర్రాక్ సీత, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!
‘ది రాజాసాబ్’ అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘ది రాజాసాబ్’. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని చేతిలో సిగార్ పటుకొని మహారాజులా కూర్చున్నాడు. మొత్తంగా ఈ సినిమాలో ప్రభాస్ని ఓ డిఫరెంట్ లుక్లో చూపించబోతున్నట్లు మోషన్ పోస్టర్తో చెప్పేశాడు డైరెక్టర్ మారుతి. (చదవండి: ఒకే ఒక మాటతో ట్రెండింగ్లోకి వచ్చేసిన ‘స్పిరిట్’)ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. బర్త్ డే రోజే వచ్చేస్తున్నాడు!
రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న చిత్రం ది రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని తెగ ఆరా తీస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం ది రాజాసాబ్ టీమ్ అప్డేట్తో ముందుకొచ్చింది. మరో రెండు రోజుల్లో డార్లింగ్ బర్త్ డే కావడంతో డైరెక్టర్ మారుతి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు.ఈనెల 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు బ్లాస్టింగ్ ఖాయమని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే అదే రోజున టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బర్త్ డే రోజు ఫ్యాన్స్కు ది రాజాసాబ్ టీమ్ రాయల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో రెబల్ స్టార్ న్యూ లుక్లో అదిరిపోయేలా కనిపించాడు.(ఇది చదవండి: ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్.. అది రెబల్ స్టార్ క్రేజ్!)ఇప్పటికే ది రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Swag turned up to the MAX 😎&Now….your Celebrations will go off in STYLE 😉 A ROYAL TREAT AWAITS on 23rd Oct 💥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/wEu31XSGFW— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024 -
‘రాజా సాబ్’ మేకింగ్ వీడియో చూశారా?
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ఫై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నేడు డైరెక్టర్ మారుతి బర్త్డే(అక్టోబర్ 8). ఈ సందర్భంగా రాజాసాబ్ మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: 'పుష్ప 2'.. ఫస్ట్ హాఫ్ అంతా రెడీ)ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగార్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్లో సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ప్రభాస్ 'రాజాసాబ్' గ్లింప్స్ వచ్చేసింది
ప్రభాస్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఆపై సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. కామెడీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు రివీల్ చేశారు.తాజాగా విడుదలైన రాజాసాబ్ గ్లింప్స్లో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు అందరూ డార్లింగ్ ఈజ్ రిటర్న్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ, మలయాళం భాషలలో 2025 ఏప్రిల్ 10న రాజాసాబ్ విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
'రాజాసాబ్' వచ్చేస్తున్నాడని ప్రకటించిన మేకర్స్
ప్రభాస్ ఫ్యాన్స్కు ఎట్టకేలకు శుభవార్త చెప్పారు డైరక్టర్ మారుతి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న'రాజాసాబ్' గురించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు వారు టైమ్ సెట్ చేశారు. రేపు (జులై 29) సాయింత్రం 5.03 నిమిషాలకు రాజాసాబ్ వచ్చేస్తాడని ప్రకటించారు.రాజా సాబ్ మూవీ కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సుమారు రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. కామెడీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. తెలుగు, హిందీ,తమిళ్,కన్నడ,మలయాలం భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.తాజాగా విడుదలైన రాజాసాబ్ పోస్టర్ చాలా బాగుందంటూ కామెంట్లు వస్తున్నాయి. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అయితే, ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్లు ఎవరనే విషయం అధికారికంగా వెలువడలేదు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఓ రూమర్ అయితే ఉంది. రేపు విడుదల కానున్న గ్లింప్స్తో పూర్తి వివరాలు వస్తాయిని అభిమానులు ఆశిస్తున్నారు. View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) -
ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన
ప్రభాస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి ఈ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే రీసెంట్గా 'కల్కి' మూవీతో వచ్చాడు. హిట్ టాక్ తెచ్చుకుని వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. ఇప్పటికే రూ.700 కోట్ల మార్క్ దాటేసింది. సరికొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రభాస్ తర్వాత మూవీ గురించి టీమ్ కీలక ప్రకటన చేసింది. ఓ విషయంలో మోసపోవద్దని హెచ్చరించింది.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)'బాహుబలి' తర్వాత డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. 'రాజాసాబ్'గా త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హారర్ కామెడీ కథతో తీస్తున్నారని టాక్. ఇందులో నిజమెంతనేది పక్కనబెడితే ఇప్పుడు ఈ మూవీ పేరుచెప్పి కొందరు ఫేక్ ఆడిషన్స్ చేస్తున్నారట. ఇది నిర్మాతలకు తెలిసి అలెర్ట్ చేశారు.'రాజాసాబ్ మూవీ ఆడిషన్స్ గురించి కొన్ని వార్తలు సర్క్యూలేట్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే అదంతా ఫేక్. ఒకవేళ నిజంగా ఉంటే మేమే ప్రకటిస్తాం' అని నిర్మాతలు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇకపోతే 'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బహుశా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్ వినిపిస్తుంది. (ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్సిరీస్ రివ్యూ) View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) -
‘భలే ఉన్నాడే!’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
ఆ దర్శకునికి ఫ్రీగా డేట్స్ ఇచ్చిన 200 Cr స్టార్ ప్రభాస్.. కారణం..!
-
అలాంటి వారి బాధే ఈ సినిమా: మారుతి
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రల్లో నటిస్తున్న కోలీవుడ్ చిత్రం ‘ట్రూ లవర్’. ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత రోజుల్లో ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ టాలీవుడ్ హక్కులను బేబీ నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ మారుతి దక్కించుకున్నారు. వీరిద్దరు సంయుక్తంగా ట్రూ లవర్ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ఎందుకు చూడమని చెబుతానంటే. ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో చూపించాడు. అమ్మాయి చాలా ఈజీగా తీసుకుంటారు. ఇక్కడ అమ్మాయిల తప్పుకాదు. తన ప్రియురాలిని ఎవరైనా ట్రాప్ చేస్తాడేమో అని ఆమె లవర్ భయపడుతూ ఉంటాడు. అతని బాధను తెరపై చూపించే ప్రయత్నమే ఈ సినిమా. సిన్సియర్గా లవ్ చేసే వారి బాధ వర్ణనాతీతం. అలాంటి వ్యక్తి తన ప్రేమ కోసం ఏం చేస్తాడనేదే కథ. ఈ కథను డైరెక్టర్ దాదాపు ఆరేళ్లు కష్టపడి రాశాడు. బేబీ సినిమా చూసేటప్పుడు ప్రతి సీన్ అలానే రాసుకున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ఎవరు మిస్సవరనేది నా నమ్మకం.' అని అన్నారు. కాగా.. మారుతి ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్తో రాజాసాబ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
ప్రేమిస్తే తర్వాత అలాంటి అనుభూతి కలిగింది
‘‘ప్రేమిస్తే’ అనే డబ్బింగ్ మూవీతో నా కెరీర్ ఆరంభమైంది. ‘ప్రేమిస్తే’ చూసి బాగుందనిపించి రిలీజ్ చేసి, హిట్ సాధించాం. ఇన్నాళ్లకు ‘ట్రూ లవర్’ చిత్రం చూడగానే మళ్లీ అలాంటి అనుభూతి కలిగింది. ఈ సినిమాను ప్రేమలో ఉన్నవాళ్లు, లేనివాళ్లు, ప్రేమలో పడాలనుకుంటున్న వాళ్లు.. ఇలా అందరూ చూడొచ్చు’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. మణికందన్, శ్రీ గౌరీప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ట్రూ లవర్’. నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేశన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్కేఎన్ సమర్పణలో దర్శకుడు మారుతి విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ప్రభురామ్ వ్యాస్ మాట్లాడుతూ– ‘‘ప్రేమికుల మధ్య ఉంటున్న మోడ్రన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ‘ట్రూ లవర్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 9న వస్తున్న పెద్ద సినిమాలతో మేము పోటీలో లేము. ‘ట్రూ లవర్’ చిన్న క్యూట్ సినిమా.. మా సినిమాని విడుదల చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అన్నారు మణికందన్. -
అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి
గత కొంతకాలంగా హిట్లు లేక సతమతమైన ప్రభాస్కు సలార్ రూపంలో సంజీవని దొరికినట్లైంది. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.611 కోట్లకు పైగా రాబట్టింది. ఈ జోష్లో వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. దర్శకుడు మారుతితో ఓ సినిమా ఉంటుందని గతంలోనే ప్రభాస్ ప్రకటించాడు. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీకి ది రాజాసాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. కథ ఇదేనా? ఇకపోతే సినిమా కథ ఇదేనంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆఖరికి ఐఎమ్డీబీ కూడా.. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడుతారు. కానీ నెగెటివ్ ఎనర్జీ వల్ల ఆ ప్రేమజంట తమ గమ్యాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.. ఇదే సినిమా కథ అని రాసుకొచ్చింది. ఇది చూసిన మారుతి ట్విటర్(ఎక్స్) మీడియాలో సెటైర్లు వేశాడు. అరెరె... ఈ విషయం నాకు తెలియక నేను వేరే స్క్రిప్ట్తో షూటింగ్ చేస్తున్నాను! ఇప్పుడు ఐఎమ్డీబీ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తదా? అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు. దాని జోలికి మాత్రం వెళ్లకండి ఇది చూసిన అభిమానులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అన్నా, దయచేసి ప్రభాస్ లుక్ ఎడిట్ చేసి ఇవ్వకండి, సహజంగా తీసినవే పోస్టర్లు వదలండి.. ఈ విధిరాతల జోలికి పోకండి.. హారర్ స్క్రిప్ట్ చాలు, మమ్మల్ని నిరాశపరచవని ఆశిస్తున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు ప్రభాస్.. కల్కి 2898ఏడీ అనే సైన్స్ ఫిక్షన్ మూవీలోనూ నటిస్తున్నాడు. దీనికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. Ararare I don't know this plot So shooting with different script Ippudu IMDB Samajam accept chestada mari 😁 pic.twitter.com/gCr2gNEybV — Director Maruthi (@DirectorMaruthi) January 17, 2024 -
ముఖ్య గమనిక మంచి థ్రిల్లర్ అనిపిస్తోంది
‘‘ముఖ్య గమనిక’ టీజర్ చూశాను. మంచి థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమా అనిపిస్తోంది. కానిస్టేబుల్గా విరాన్ క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా టీమ్ మొత్తానికి బూస్టప్ ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. హీరో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. సీనియర్ సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శివిన్ప్రోడక్షన్స్ పతాకంపై రాజశేఖర్, సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య హీరోయిన్. ఈ చిత్రం టీజర్ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘థ్రిల్లింగ్ అంశాలతో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించాం. విరాన్ చక్కగా నటించారు’’ అన్నారు వేణు మురళీధర్. ‘‘మా బేనర్ నుంచి వస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్. -
ప్రభాస్ కొత్త సినిమా ప్రకటన.. రెమ్యునరేషన్ వద్దని చెప్పిన డార్లింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. విడుదలైన వారంలోపే రూ. 500 కోట్ల క్లబ్లో సలార్ చేరిపోయంది. ప్రభాస్ గత సినిమాలు రాధేశ్యామ్,ఆదిపురుష్తో పాటు సలార్ అన్నీ కూడా విభిన్నమైన కథాంశాలతోనే తెరకెక్కాయి. ముఖ్యంగా సాహో, సలార్ సినిమాలతో ప్రభాస్కు మాస్ ఇమేజ్ క్రియేట్ అయింది. దీంతో ఆయన నుంచి తర్వాత వచ్చే సినిమాలు ఎలా ఉండబోతున్నాయని అందరిలో ఆసక్తి నెలకొంది. మారుతితో ఒక సినిమాను ఇదివరకే ప్రభాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సంక్రాంతి పండుగ రోజు మారుతి- ప్రభాస్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. ఇప్పటి వరకు మీరందరూ డైనోసార్ ప్రభాస్ను చూశారు.. ఇక త్వరలో మళ్లీ డార్లింగ్ ప్రభాస్ను చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఒక పోస్ట్ర్ విడుదల చేసి చిత్ర యూనిట్ తెలపింది. ప్రభాస్ను మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన్ను ఇష్టపడుతారు.. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ను మళ్లీ వింటేజ్ లుక్లో చూడొచ్చని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. సినిమా జోనర్ ఏంటి మారుతి- ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి గతంలోనే ఎన్నో వార్తలు వచ్చాయి. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఒక బంగ్లా చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని టాక్ ఉంది. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్కు ఛాన్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. రూ. 150 కోట్ల లోపే ఈ సినిమాకు బడ్జెట్ అని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండానే చేస్తున్నారని టాక్.. కానీ సినిమా విడుదలయ్యాక బడ్జెట్ పోను మిగిలిన ఆదాయంలో వాటా తీసుకునేలా ప్రభాస్ డీల్ సెట్ చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు 'కల్కి 2898 ఏడి' సైన్స్ ఫిక్షన్ చిత్రం కూడా వేగంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. People Media Factory proudly unveils the Dinosaur transformed into an absolute DARLING 😍 First Look and Title will be unveiled on Pongal 🔥#Prabhas #PrabhasPongalFeast ❤️🔥 A @DirectorMaruthi film. @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla pic.twitter.com/vGErsqcv1z — People Media Factory (@peoplemediafcy) December 29, 2023 -
ఆ రోజు వెంకటేష్ అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది
-
Director Maruthi: "తనే నా ఆల్టైమ్ ఫేవరెట్ హీరో"
-
ఆ సినిమాకి నా పేరు పెట్టలేదు ఎందుకంటే..?
-
మూవీ ఇండస్ట్రీలోకి రాకముందు చాలా కష్టపడ్డాను
-
లవ్ లో ఉన్నప్పుడు మేము చాలా దొంగగా కలుసుకునేవాళ్ళం
-
ఆ హీరో తో నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే..!
-
ఈ కాలమే.. మంచి ఫీల్ గుడ్ పాటలాగా ఉంది: మారుతి
లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘నచ్చినవాడు’. కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం 'ఈ కాలమే' పాటను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ చిత్రానికి యువ రచయిత హర్షవర్ధన్ రెడ్డి లిరిక్స్ అందించగా, ప్రముఖ గాయకుడు జావేద్ అలీ అద్భుతంగా ఆలపించాడు. పాట విడుదల సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ "మలయాళ సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన 'ఈ కాలమే' పాటను ఇప్పుడు విన్నాను, పాట మంచి ఫీల్ గుడ్ పాటలాగా చాలా బాగుంది. ఈ చిత్రం ట్రైలర్ కూడా చూశాను, చాలా బాగుంది. హీరో, దర్శకుడు, నిర్మాత అయిన లక్ష్మణ్ చిన్న గారికి ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అని భావిస్తున్నాను’ అన్నారు. ‘ఈ పాట మా చిత్రానికి ప్రాణం లాంటిది. మిజో జోసెఫ్ చాలా అద్భుతమైన స్వరాలు అందించాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తాం’అని హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా అన్నారు. -
ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ప్రభాస్- అనుష్క టాలీవుడ్ సినీ హిస్టరీలో వారిది హిట్ పెయిర్ అనే చెప్పవచ్చు. మిర్చి,బిల్లా,బాహుబలి సీరిస్లతో మెప్పించిన ఈ జోడి తెలుగు ప్రేక్షలపై చెరగని ముద్ర వేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్కు చేరుకున్నాడు. అనుష్క మాత్రం జీరో సైజ్ సినిమా దెబ్బతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. తాజాగా అనుష్క.. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. త్వరలో ఆ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో సినీ కెరీయర్కు ఫుల్స్టాప్ పెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరోక అదిరిపోయే వార్త ఒకటి ఇండస్ట్రీలో నడుస్తోంది. (ఇదీ చదవండి: ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ) ప్రభాస్- అనుష్క కాంబోలో ఒక సినిమా రాబోతున్నుట్లు చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే మళ్లీ జోరందుకుంది. కానీ ఈసారి కొంచెం బలంగానే ఈ టాపిక్ వైరల్ అవుతుంది. ఎందుకంటే అనుష్క సినిమాలకు గుడ్బై చెప్పాలనుకుందట. ఇదే విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ మారుతి.. ప్రభాస్తో తను తెరకెక్కిస్తున్న సినిమాలో నటించాలని అనుష్కను కోరారట. అందులో ఆమెను హీరోయిన్గా కాకుండా సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం మారుతి అడిగారట. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా మారుతీదే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఇంట్లో వాళ్లను కాదని యంగ్ డైరెక్టర్తో డేర్ చేస్తున్న నిహారిక ) ఇదిలా ఉంటే.. అనుష్క- ప్రభాస్ కాంబోలో మరో పిరియాడికల్ సినిమా తీసేందుకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ కథను రెడీ చేశారట. ఇదే స్టోరీని బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కూడా ఆయన కథను వినిపించారట. వారికి స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ ప్రభాస్- అనుష్క జంటను బిగ్ స్క్రీన్పై వారిద్దరి ఫ్యాన్స్ చూడవచ్చు. ఒక విధంగా ప్రభాస్,అనుష్క ఫ్యాన్స్కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. -
మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్ అనే థియేటర్ బ్యాక్డ్రాప్లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్లో వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాగానే మొదట్లో ప్రారంభించినా ప్రభాస్ రేంజ్ పెరగడంతో బడ్జెట్ కూడా రూ. 200 కోట్లకు చేరిందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సలార్, కల్కి ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న డార్లింగ్.. మారుతి సినిమా షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది కూడా. (ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్) ఇది ఇలా ఉంటే తాజాగా కల్కి టైటిల్ గ్లింప్స్ను వైజయంతి మేకర్స్ రిలీజ్ చేశారు. దానిని చూసిన వారంతా హాలీవుడ్ రేంజ్లో ఉందని ప్రశంసలు కూడా డార్లింగ్ అందుకున్నాడు. ఇప్పటికి కూడా అది యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ.. డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్తో సినిమా చేస్తున్న దర్శకుడు మారుతి మాత్రం ఈ గ్లింప్స్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీంతో వాళ్లు మారుతిపై ఇలా ఫైర్ అవుతున్నారు. (ఇదీ చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్హైమర్ సినిమా రివ్యూ) 'బేబీ సినిమా గురించి బన్నీ మాట్లాడిన మాటలు ట్విటర్లో షేర్ చేశావ్ అందులో ఎలాంటి తప్పు లేదు.. కానీ నీకు సినిమా అవకాశం ఇచ్చిన ప్రభాస్ గురించి ఒక్క ట్వీట్ అయినా చేశావా.. ? కల్కి మూవీకి సంబంధించిన గ్లింప్స్పై ఒక్క ట్వీట్ అయినా చేశావా..? ఎటువంటి సంబంధం లేకపోయినా నీతో రూ.200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాను మా ప్రభాస్ చేస్తున్నారు. అంకిత భావం, కృతజ్ఞత భావం లాంటివి నీకులేవు' అంటూ మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు పలువురు నెటిజన్లు కూడా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో షూటింగ్లో బిజీ కారణంగా ట్వీట్ పెట్టలేకపోవచ్చు కానీ.. ప్రభాస్పై మారుతికి ఎనలేని ప్రేమ, కృతజ్ఞత ఉందని అంటున్నారు. ఇకపోతే రాజా డీలక్స్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రభాస్,మారుతి షూటింటిగ్ స్పాట్ ఫోటోలు కొన్ని ఇప్పటికే బయటకు వచ్చాయి. Every word from our Icon Star and pillar of support @alluarjun garu about our film #BabyTheMovie Appreciation Meet moved our entire team to tears.❤️🔥 Thanks for this Iconic Appreciation sir, it's a big boost. We are overwhelmed with your unconditional love on #Baby… — Director Maruthi (@DirectorMaruthi) July 21, 2023 -
నిధి అగర్వాల్కు కొత్త కష్టాలు.. అన్నీ ఉన్నాసరే!
కొందరు హీరోయిన్లని చూడగానే 'అబ్బా.. ఏముందిరా బాబు' అని అనుకుంటాం. నిధి అగర్వాల్ ఆ కేటగిరీలోకే వస్తుంది. ఈమెని చూడగానే సరిగ్గా ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజిక్ సూపర్, గ్లామర్ అంతకంటే సూపర్. డ్యాన్సులు బాగా చేస్తుంది. అయినాసరే ఈమెని ఆ కష్టాలు వదలట్లేదు. 'అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని' అన్నట్లు ఈమె లైఫ్ తయారైంది. కొన్ని సమస్యలు ఈమెని శనిలా వెంటాడుతున్నాయా అనిపిస్తోంది. అభిమానుల మధ్య ఇప్పుడు ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారిపోయింది. సినిమా కష్టాలు! చాలామంది హీరోయిన్లకు అందం ఉన్నా.. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావు. ఒకవేళ వస్తే మాత్రం హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ సొంతం చేసుకుంటారు. 'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఒకటి 'హరిహర వీరమల్లు', మరొకటి ప్రభాస్-మారుతి కలిసి చేస్తున్న మూవీ. వీటిలో 'హరిహర..' 2020లోనే ప్రారంభమైంది. ఇప్పటికి సగం షూటింగే జరిగింది. మిగిలిన పార్ట్ ఎప్పుడు మొదలవుతుందో, అసలు జరుగుతుందో లేదా అనేది డౌటే! (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) ఉంచుతారో.. తీసేస్తారో? ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్నాడు. హారర్ కామెడీ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లు అని అన్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'సలార్', 'ప్రాజెక్ట్ K' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే మారుతి మూవీ కోసం పనిచేస్తాడు. ఇదంతా జరగడానికి వచ్చే ఏడాది పట్టొచ్చు! అంతలో చిత్రబృందం మనసు మారకపోతే ఓకే. ఒకవేళ ఏమైనా జరిగి హీరోయిన్లు మార్చే ఆలోచన వస్తే మాత్రం నిధికి మూడినట్లే! ఎందుకంటే మహేశ్-త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. లాంచ్ అయినప్పుడు ఇందులో లీడ్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డేని ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఆమెని పక్కనబెట్టేశారని, సెకండ్ హీరోయిన్ శ్రీలీలని మెయిన్ లీడ్ గా చేశారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే ఫార్ములా ప్రభాస్-మారుతి సినిమాకు అప్లై చేస్తే మాత్రం నిధిని పీకేయడం గ్యారంటీ. ఒకవేళ ఇలా జరిగితే టాలీవుడ్ లో నిధి కెరీరే సందిగ్ధంలో పడిపోతుంది! View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) (ఇదీ చదవండి: ఆ రోజు గొడవలో అమ్మాయిదే తప్పు: హీరో నాగశౌర్య) -
ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో చిల్లర పనులు చేశా: మారుతి
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఒక్కసారి హిట్ వచ్చిందంటే నెక్స్ట్ అంతకు మించిన సినిమా తీయాలి. తేడా కొట్టి ఫ్లాప్ అయిందంటే విమర్శలను ఎదుర్కొనేంత సత్తా ఉండాలి. అదే వరుసగా ఫ్లాపులు పడితే మనుగడను కాపాడుకునేందుకు కష్టపడాలి. ఇలా చిత్రపరిశ్రమలో నానాసమస్యలను దాటుకుని స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు మారుతి. కేవలం రెండు రూపాయల జిలేబీ తిని కడుపు నింపుకున్న రోజుల నుంచి అరటి పండ్లు అమ్మిన రోడ్డుపై జాగ్వార్ కారులో తిరిగే స్థాయికి ఎదిగాడు. సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించిన మారుతి ఈ రోజుల్లో చిత్రంతో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా సత్తా చాటుతున్న అతడు ప్రస్తుతం ప్రభాస్తో సినిమా తీస్తున్నాడు. తాజాగా అతడు తన భార్య వీరనాగ స్పందనతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ తమ ప్రేమ విశేషాలను పంచుకున్నారు. స్పందన మాట్లాడుతూ.. 'మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. అతడు నా సీనియర్. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన ముఖం నచ్చింది. 9వ తరగతిలో టాలెంట్ నచ్చింది. పదవ తరగతికి వచ్చేసరికి తను వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా మా ప్రేమ కొనసాగింది. ఆయన నన్ను కలుసుకునేందుకు ఆర్టీసీ బస్సులో వచ్చేవాడు, నేను స్కూటీపై వెళ్లేదాన్ని. ఇద్దరం దొంగతనంగా కలుసుకుని నా స్కూటీపై తిరిగేవాళ్లం' అని చెప్పుకొచ్చింది. మారుతి మాట్లాడుతూ.. 'స్పందనకు డైరీ రాయడం అలవాటు. ఈ రోజు వచ్చాడు, ఇది జరిగిందని అన్నీ రాస్తుంది. తనను ఇంప్రెస్ చేయడానికి చేసిన వెధవ పనులన్నీ అందులో ఉంటాయి' అని పేర్కొన్నాడు. కాగా మారుతి జీవితంలో సెటిలయ్యాక ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్లి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. చదవండి: మెసేజ్ చేసినందుకు నేరుగా ఇంటికి వెళ్లిన డైరెక్టర్ గ్రాండ్గా బాలీవుడ్ నటి సీమంతం -
షాకివ్వబోతున్న ప్రభాస్..
-
ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ సినిమాకు నో రెమ్యూనరేషన్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే రాజా డీలక్స్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త వైరలవుతోంది. ప్రభాస్ ఈ చిత్రానికి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని సమాచారం. ప్రభాస్ వరసగా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సాలార్ లాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ల్లో నటించనున్నారు. ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో రాజా డీలక్స్లో కనిపించనున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం ఆయన ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట. కొన్ని కథనాల ప్రకారం సినిమా బడ్జెట్ పరిమితికి మించి పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరిమిత బడ్జెట్తో తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని ప్రభాస్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సాలార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీలతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కూడా నటించనున్నారు. నటుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా ప్రకటించారు. -
ప్రభాస్ లంబోర్గిని కారు తీసుకొని చక్కర్లు కొట్టిన డైరెక్టర్
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే షూట్కి సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా లీక్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ గ్యారేజీలు పలు ఖరీదైన కార్లు ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఆ జాబితాలోకి లంబోర్గిని కూడా వచ్చి చేసింది. ప్రభాస్ కూడా ఈ కారులోనే షూటింగ్స్కి హాజరువుతున్నాడు. తాజాగా డైరెక్టర్ మారుతి ప్రభాస్ లంబోర్గినిని డ్రైవ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడుఉ నెట్టింట చక్కర్లు కొడుతుంది. #Prabhas anna Lamborghini driving by @DirectorMaruthi 🤩👌 pic.twitter.com/RjoAFdFdrQ — ᴠɪꜱʜᴀʟ 🏹 (@vishal_x_x_7) January 29, 2023 -
జూబ్లీహిల్స్లో ప్రభాస్కు 84 ఎకరాల ఫామ్హౌస్? నిజమనుకుంటున్నారా?
సెలబ్రిటీల గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొందరు వాటిని చూసీచూడనట్లు ఊరుకుంటే మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తుంటారు. తాజాగా ప్రభాస్ గురించి ఓ వెబ్సైట్ వార్తను వండివార్చింది. ప్రభాస్కు ఓ ఫామ్హౌస్ ఉందని, అది జూబ్లీహిల్స్లో 84 ఎకరాల్లో విస్తరించి ఉందని పేర్కొంది. అక్కడితో ఆగకుండా కేవలం రూ.1.05 కోట్లకే ఈ ఫామ్హౌస్ను సొంతం చేసుకున్నట్లు పేర్కొనడం గమనార్హం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ 84 ఎకరాల ఫామ్హౌస్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉండొచ్చని రాసుకొచ్చింది. దీనికి రాధేశ్యామ్లోని ఓ ఫొటోను వాడేసింది. పాష్ ఏరియా అయిన జూబ్లీహిల్స్లో 84 ఎకరాలు, అది కూడా కేవలం కోటి రూపాయలతో దక్కించుకోవడమేంటని నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వార్తపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ.. 'ఏంటి, నిజమా? అసలు జూబ్లీహిల్స్లో 84 ఎకరాలు అంటే దాని విలువెంతుంటుందో మీకేమైనా తెలుసా? ఏదో ఒక చెత్త రాసేసి దానికి ఓ సెలబ్రిటీ పేరును జోడించడం బాగా అలవాటైపోయింది' అని చురకలంటించాడు. అటు డైరెక్టర్ మారుతి సైతం 'ప్రభాస్ విల్లాకు ఇంకా రాధేశ్యామ్ ఇంటీరియర్ డిజైనే వాడుతున్నట్లున్నారే?' అంటూ సెటైర్లు వేశాడు. చదవండి: ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే ఓటీటీలో ఊర్వశివో రాక్షసివో -
‘అలిపిరికి అల్లంత దూరంలో'.. టీజర్ విడుదల
రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత హీరో హీరోయిన్లుగా నటించిన రాబరీ థ్రిల్లర్ ‘అలిపిరికి అల్లంత దూరంలో..’. జె. ఆనంద్ దర్శకత్వంలో రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి. నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. శనివారం దర్శకుడు మారుతి ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రావణ్ మాట్లాడుతూ– ‘‘నాటక రంగంలో అనుభవం ఉన్న నాకు యాక్టర్గా వెండితెరపై ఇది తొలి చిత్రం’’ అన్నారు. ‘‘తిరుమలలో షాపు సంపాదించుకోవాలనుకునే ఓ యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సవహారమే ఈ చిత్రం. ఈ చిత్రంలోని ప్రతి సీన్లో వెంకటేశ్వరస్వామి రిఫరెన్స్ ఉంటుంది’’ అన్నారు ఆనంద్. జె. ‘‘డివైన్ ఎలిమెంట్స్తో థ్రిల్లింగ్గా సాగే రాబరీ డ్రామా ఈ చిత్రం’’ అన్నారు నిర్మాతలు రమేష్, రాజేంద్ర. -
నన్నీ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే
‘‘చిన్న సినిమా సూపర్ హిట్టవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకణ్ణి. నన్ను ఈ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అజయ్, వీర్తి వఘాని జంటగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బీజీ గోవింద రాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా మధ్యతరగతి కుటుంబం లాంటింది.. మధ్య తరగతి బాగుంటేనే మిగతా తరగతులు బాగుంటాయి’’ అన్నారు. ‘‘అబ్బాయికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఒక అమ్మాయి.. ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించే అబ్బాయి మధ్య జరిగే కథే ఈ సినిమా’’ అన్నారు హనుమాన్ వాసంశెట్టి. ‘‘భోజనం ఎంత పెట్టినా చివర్లో స్వీట్ ఇస్తారు.. మా సినిమా కూడా స్వీట్ లాంటింది’’ అన్నారు గోవింద రాజు. ‘‘మా సినిమాని థియేటర్లో చూసి మంచి విజయం అందించాలి’’ అన్నారు అజయ్, వీర్తి వఘాని. -
మారుతితో ప్రభాస్ మూవీ, ఇంతకీ కథేంటో తెలుసా?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్ అనే థియేటర్ బ్యాక్డ్రాప్లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్లో వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆల్రెడీ హైదరాబాద్లోని ఓ స్టూడియోలో థియేటర్ సెట్ను రెడీ చేస్తున్నారట చిత్రయూనిట్. అలాగే వీలైనంత త్వరగా రెండు షెడ్యూల్స్లోనే షూటింగ్ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మారుతి. హారర్ కామెడీ జానర్లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్ త్వరలోనే జాయిన్ కానున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల షూటింగ్స్లో పాల్గొంటున్నారు. అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రానికి కూడా ప్రభాస్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే! కాగా ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. చదవండి: పబ్లిక్గా నటికి ముద్దులు.. అమ్మ చూస్తే ఏమంటుందోనంటున్న నటుడు హీరోతో సహజీవనం వార్తలపై ఇస్మార్ట్ బ్యూటీ గప్చుప్! -
మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమే. ప్రభాస్, మారుతి కాంబినేషన్లోని సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్ర నిర్మాణసంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో పూజా కార్యక్రమాల జరిగాయి. ఇటలీలో ఉండటంవల్ల ప్రభాస్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. హారర్–కామెడీ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించ నున్నారని, ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. -
మారుతితో ప్రభాస్ మూవీ, చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్!
బాయ్కాట్.. ట్విటర్లో ఎక్కువ ట్రెండ్ అయ్యే హ్యాష్ట్యాగ్ ఇది. సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ను టార్గెట్ చేస్తూ బాయ్కాట్ను ట్రెండ్ చేస్తుంటారు నెటిజన్లు. కానీ ఈసారి ఏకంగా టాలీవుడ్లో ఓ దర్శకుడిని బాయ్కాట్ చేయాలంటూ పిలుపునివ్వడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ప్రస్తుతం ట్విటర్లో #BoycottMaruthiFromTFI అన్న హ్యాష్ట్యాగ్ వరుస ట్వీట్లతో ట్రెండింగ్లో ఉంది. ఇంతకీ డైరెక్టర్ మారుతిని అసలు తెలుగు ఇండస్ట్రీలో నుంచే పంపించేయాలని డిమాండ్ చేయడానికి కారణమేంటో తెలుసుకుందాం.. మారుతి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఈ రోజుల్లో. ఈ చిత్రంతో అందరి కంట పడ్డ ఆయన తర్వాత బస్ స్టాప్ తెరకెక్కించాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని కొత్త జంట, భలే భలే మగాడివోయ్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇటీవల ఆయన తెరకెక్కించిన పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అది కమర్షియల్గా హిట్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్లో భయం మొదలైంది. రేపు ప్రభాస్- మారుతి సినిమా లాంఛ్ అవుతుండటంతో అభిమానులు రంగంలోకి దూకారు. ఇప్పుడీ సినిమా అవసరమా? వద్దేవద్దంటూ వరుస ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. పైగా ప్రభాస్కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇప్పటికే కొందరు దర్శకులకు ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు ప్రభాస్. రన్ రాజా రన్తో టాలీవుడ్కు దర్శకుడిగా పరిచయమైన సుజిత్ రెండో సినిమా ప్రభాస్తో తీశాడు. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన సాహో ఘోర పరాజయం పాలైంది. ప్రయాణం, సాహసం చిత్రాలకు డైలాగ్స్ రాసిన రాధాకృష్ణకుమార్ జిల్ మూవీతో దర్శకుడిగా మారాడు. ఆయన సెకండ్ మూవీ రాధేశ్యామ్ ప్రభాస్తో తీయగా అది కూడా ఫ్లాప్ అయింది. వరుసగా రెండు ఫ్లాప్లతో డీలా పడిన ప్రభాస్ ఇటీవలే ఫ్లాప్ అందుకున్న డైరెక్టర్ మారుతితో జత కట్టకూడదని అభిమానులు ఫిక్సయ్యారు. అందుకే నెట్టింట ఈ రచ్చ! Tag is going #BoycottMaruthiFromTFI And #Prabhas is trending national wide now pic.twitter.com/ZKUECuZs9m — A★🤘 (@masscrime_mb) August 24, 2022 Fans situation right now 🥲#BoycottMaruthiFromTFI pic.twitter.com/O766VvA2Mb — SALAAR 🏹 (@bhanurockz45) August 24, 2022 Our cofan @ThePavanVarma18 beating himself because of your project @DirectorMaruthi 🙏🙏#BoycottMaruthiFromTFIpic.twitter.com/pL9jgLIiLo — The Punisher💀 (@PuneethRebel9) August 24, 2022 Prabhas anna fans situation 🥺🥲#BoycottMaruthiFromTFI pic.twitter.com/TSbb2vcAJD — Team #SSMB28 (@RoHiT____dhfm) August 24, 2022 I’m supporting this trend 🙂 Ah maruti vaddu ra babu 🙏 Smash that rt button Rebels #BoycottMaruthiFromTFI pic.twitter.com/kmFKG3nLHD — NANI || DHFPB || 3 (@nanidhfpb3) August 24, 2022 For the first time in the HISTORY of the Indian Cinema prabhas fans Boycotting their own movie & the director vere level hype🔥 #BoycottMaruthiFromTFI — UDAY 🔔 (@UDAyVarma1882) August 24, 2022 చదవండి: మేఘనా సర్జా రెండో పెళ్లి? ఆమె ఏమందంటే? సింపుల్గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! -
ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా?
Producer Is Change To Prabhas Maruthi Raja Deluxe Movie: 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు ప్రభాస్. అప్పటి నుంచి ప్రభాస్కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రభాస్ డేట్లు దొరికితే చాలు అని అనుకుంటున్నారు నిర్మాతలు. అలాంటి ప్రభాస్తో సినిమా అంటే వద్దనుకుంటున్నాడట ఓ నిర్మాత. కొన్నేళ్ల క్రితం ఓ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత ప్రస్తుతం ఆ డబ్బు ఇస్తే చాలు, సినిమా అవసరం లేదని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ప్రభాస్, మారుతి కాంబినేషన్లో 'రాజా డీలక్స్' అనే సినిమా రానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలసిందే. ఈ సినిమా గురించి ఎక్కడా కన్ఫర్మ్గా చెప్పలేదు కానీ, కథ, హీరోయిన్లు, చిత్రం కోసం సెట్ వంటి తదితర పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు నిర్మాత మారే అవకాశం ఉందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను నిర్మిద్దామనుకున్న నిర్మాత డీవీవీ దానయ్య రెమ్యునరేషన్ కింద ప్రభాస్కు రూ. 50 కోట్లు ఇచ్చారని ఆ మధ్య టాక్ నడిచింది. అందుకు తగినట్లుగానే మారుతి బృందం పని చేసినట్లు సమాచారం. చదవండి: Hyderabad AMB థియేటర్లో దళపతి విజయ్.. ఏ సినిమా చూశారంటే? నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ అయితే ఆ మూవీ ఎప్పటికీ సెట్స్పైకి వెళ్లకపోయేసరికి, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న క్లారిటీ లేకపోవడంతో డీవీవీ దానయ్య వెనక్కి తగ్గుతున్నారని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఎవరైనా నిర్మాత ముందుకొస్తే ఆ రెమ్యునరేషన్ డబ్బు తీసుకుని ప్రభాస్ డేట్స్ను ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యారను భోగట్టా. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది క్లారిటీ లేదు. కాగా ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం. చదవండి: రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ? -
వరుస ఫ్లాప్స్.. ప్రభాస్ ‘రాజా డీలక్స్’ అనుమానాలు!
పక్కా కమర్షియల్ మూవీ ప్రమోషన్స్ లో మారుతి నెక్ట్స్ తాను చేయబోతున్న సినిమాల లిస్ట్ ప్రకటించాడు.అందులో ఒకటి ప్రభాస్ తో ఉంటుందని తెలిపాడు.ప్రభాస్ ఫ్యాన్ గా వింటేజ్ యంగ్ రెబల్ స్టార్ ను తెరపై చూపిస్తానని అభిమానులకు మాట కూడా ఇచ్చాడు. పక్కా కమర్షియల్ రిలీజైన 20 రోజులకు ఈ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడతానన్నాడు.అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డౌట్స్ రైజ్ అయ్యాయి. గతేడాది మారుతి తెరకెక్కించిన ‘మంచి రోజులు వచ్చాయి’బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.ఇక ఇటీవల గోపిచంద్తో తీసిన ‘పక్కా కమర్షియల్’చిత్రం కూడా కాసుల వర్షం కురిపించలేకపోయింది. దీంతో మారుతికి ప్రభాస్ సినిమా మిస్ అయిందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా తీయడం అంత ఈజీకాదు. ఆయనకున్న స్టార్డమ్ని దృష్టిపెట్టుకొని పకడ్బంధీగా కథను తీర్చిదిద్దాలి. దాన్ని యంగ్ డైరెక్టర్ మారుతి హ్యాండిల్ చేయగలడా అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలు నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రభాస్ ఇలాంటి యంగ్ డైరెక్టర్స్కి అవకాశాలు ఇచ్చి వరుస అపజయాలను మూటగట్టుకున్నాడు. బాహుబలి తర్వాత సుజిత్తో తీసిన సాహో, రాధాకృష్ణ తెరకెక్కించిన ‘రాధేశ్యామ్’ చిత్రాలు బక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ దశలో మారుతికి కొత్త సినిమాను చేసే ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే స్టోరీతో కనుక ఇంప్రెస్ చేస్తే, మారుతితో సినిమా చేస్తానని ప్రభాస్ మాట ఇస్తే కనుకగా రాజా డీలక్స్ ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ లో పట్టాలెక్కడం ఖాయం. -
'పక్కా కమర్షియల్'గా హిట్టు.. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కు !
Gopichand Pakka Commercial 1St Week Collections: మ్యాచో హీరో గోపీచంద్, విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన 'పక్కా కమర్షియల్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. రాశీ ఖన్నా క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసాడు మారుతి. ఈ సినిమా కోసం పబ్లిసిటీతో కలుపుకొని దాదాపు రూ. 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. అందులో 32 కోట్లు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్, శాటిలైట్, హిందీ రీమేక్, డబ్బింగ్ అన్ని) రూపంలోనే వచ్చాయి. ఇక సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అందుకే ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది 'పక్కా కమర్షియల్' సినిమా. ఇంత ప్లానింగ్ ఉంటుంది కాబట్టే మారుతి మోస్ట్ బ్యాంకబుల్ డైరెక్టర్ అయ్యాడు. మొదటి రోజు రూ. 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండు రోజులు బాగానే క్యాష్ చేసుకుంది. ఓవరాల్గా 'పక్కా కమర్షియల్' మూడు రోజుల్లోనే సేఫ్ అయిపోయింది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. #PakkaCommercial collects over 𝟏𝟓.𝟐 𝐂𝐑 Worldwide in 3 Days! 🔥💥 This Week, catch the ACTION - FUN Family Entertainer at cinemas near you! 🤩 🎟️: https://t.co/BcOUguIiyK @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @SKNonline @UV_Creations @adityamusic pic.twitter.com/vQpCrMOUQd — GA2 Pictures (@GA2Official) July 4, 2022 -
కమర్షియల్ హిట్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: మారుతి
‘పక్కా కమర్షియల్’ చిత్రం మేము అనుకున్నట్లే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తోంది. నా సినిమాకు వచ్చే అడియన్స్ ఏం ఆశిస్తారో అవన్ని ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తున్నారు. వారందరికి నా ధన్యవాదాలు’అన్నారు ప్రముఖ దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ పతకాలపై బన్నీ వాస్ నిరించారు. జులై 1న ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. (చదవండి: అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా) ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబరాలను జరుపుకుంది. అనంతరం మారుతి మాట్లాడుతూ.. ‘మా సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్ని స్టైలీష్గా చూపించారని, రాశీఖన్నా ట్రాక్ బాగుందని చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ ఇంకా బెటర్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను’ అని అన్నారు. చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఆడియన్స్ మంచి మాస్ ఎంటర్ టైనర్ సినిమా ఇస్తే బాగుంటుందని ఈ సినిమా తీశాం. మేము అనుకున్నట్లే అది ఈ రోజు అందరికీ రీచ్ అయ్యింది. తొలి రోజే రూ.6 కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మా సినిమా క్లియర్ కమర్సియల్ హిట్ కింద పరిగణించవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాను. మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పనిచేసిన గోపి చంద్, రాశి ఖన్నా లకు మరియు మిగిలిన నటీ నటులందరికీ ధన్యవాదాలు ’అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు నటుడు సప్తగిరి. ‘ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికీఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం మేము టికెట్స్ రేట్ తగ్గించాం. ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు. కాబట్టి అందరూ వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ’అన్నారు సహ నిర్మాత ఎస్కేఎన్. ఈ చిత్రంలో రావు రమేశ్, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘పక్కా కమర్షియల్’మూవీ (ఫొటోలు)
-
‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ
టైటిల్ :పక్కా కమర్షియల్ నటీనటులు : గోపిచంద్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్, తదితరులు నిర్మాణ సంస్థలు : జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్ నిర్మాత: బన్నీ వాసు రచన,దర్శకత్వం: మారుతి సంగీతం : జేక్స్ బిజాయ్ సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా ఎడిటర్: ఎన్ పి ఉద్భవ్ విడుదల తేది: జులై 1, 2022 వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో ఈ శుక్రవారం(జులై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉంది ? కమర్షియల్ హిట్ కొట్టేసిందా లేదా రివ్యూలో చూద్దాం. కథేంటంటే... సూర్య నారాయణ (సత్య రాజ్) ఓ సిన్సియర్ న్యాయమూర్తి. వ్యాపారవేత్త వివేక్ (రావు రమేశ్) చేతిలో మోససోయిన యువతికి న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ న్యాయవాద వృత్తికి రాజీనామా చేసి కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తాడు. అతని కొడుకు లక్కీ(గోపిచంద్) కూడా లాయర్ అవుతాడు. కానీ తండ్రిలా నిజాయతీగా కాకుండా మార్కెట్లో అవలీలగా న్యాయాన్ని అమ్మెస్తుంటాడు. తప్పు ఒప్పు చూడకుండా పక్కా కమర్షియల్గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ఓ కేసు విషయంలో వివేక్ తరఫున వాదించి.. అతనికి దగ్గరవుతాడు. అయితే వివేక్ వల్ల బాధింపబడిన యువకుడి కోసం, అతని భార్య కోసం మళ్లీ నల్లకోర్టు వేసి కోర్టుమెట్లు ఎక్కుతాడు సూర్య నారాయణ. వివేక్ తరఫున కొడుకు లక్కి రంగంలోకి దిగుతాడు. ఈ న్యాయ పోరాటంలో ఎవరు గెలిచారు? సొంత తండ్రిని కాదని వివేక్ తరఫున లక్కీ ఎందుకు వాదిస్తాడు ? లక్కీ మరీ అంత కమర్షియల్గా ఎందుకు మారాడు ? చివరకు సూర్యనారాయణ కోరుకున్నట్లుగా వివేక్కి శిక్ష పడిందా లేదా? తండ్రికొడుకుల న్యాయపోరాటంలో సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’ ఎలాంటి పాత్ర పోషించింది? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. పక్కా కమర్షియల్లో కథను పక్కకు పెట్టి కామెడీతో లాక్కోచ్చాడు. హీరోయిజం మీదనే ఎక్కువ దృష్టిపెట్డాడు. టైటిల్కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఓ ఎమోషనల్ సీన్తో సినిమా మొదలవుతుంది. లాయర్ లక్కీగా గోపిచంద్ ఎంట్రీతోనే టైటిల్ దగ్గట్టుగా పక్కా కమర్షియల్గా సినిమా సాగుతుంది. సీరియల్ నటి ‘లాయర్ ఝాన్సీ’ ఎంట్రీతో కామెడీ డబుల్ అవుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్స్ విషయంలో మారుతి మరోసారి తన మార్క్ చూపించాడు. సీరియల్లో తన క్యారెక్టర్ని చంపారంటూ ‘లాయర్ ఝాన్సీ’ కోర్టు ఆశ్రయించే సీన్ నవ్వులు పూయిస్తుంది. రొటీన్ కామెడీ సీన్స్తో ఫస్టాఫ్ అంతా సోసోగా సాగుతుంది. ఇక సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్కి దగ్గరైన లక్కీ చివరకు అతన్ని ఎలా జైలు పాలు చేశాడనేది వినోదాత్మకంగా చూపించాడు. సెకండాఫ్లో చాలా ఫ్రెష్ కామెడీతో నవ్వించాడు మారుతి. సినిమాల్లో వచ్చే ఫైట్ సీన్స్పై వేసిన సెటైర్, రావు రమేశ్, అజయ్ ఘోష్ల మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ ప్రేక్షకుడి ఊహకి అందేట్లుగా ఉంటుంది. కథని, లాజిక్స్ని పక్కకు పెట్టి చూస్తే.. ‘పక్కా కమర్షియల్’ పక్కా నవ్విస్తుంది. ఎవరెలా చేశారంటే.. డబ్బు కోసం అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చే పక్కా కమర్షియల్ లాయర్ లక్కీ పాత్రలో గోపిచంద్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్గా కనిపించాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత తనదైన కామెడీతో నవ్వించాడు.ఫైట్ సీన్స్లో కూడా అద్భుతంగా నటించాడు. ఒక సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’గా రాశీఖన్నా ఇరగదీసింది. స్క్రీన్పై చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. సీరియల్ భాషలో ఆమె చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఇక హీరో తండ్రి సూర్యనారాయణ పాత్రలో సత్యరాజ్ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు చేయడం ఆయనకు కొత్తేమి కాదు. మారుతి గత సినిమాల మాదిరే ఇందులో కూడా రావు రమేశ్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. విలన్ వివేక్గా తనదైన నటనతో మెప్పించాడు. సప్తగిరి, వైవా హర్ష, ప్రవీణ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజాయ్ సంగీతం బాగుంది. 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్తో పాటు 'అందాల రాశి..'పాట కూడా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా ఫ్రెష్గా ఉంది. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
అలాంటి పాత్రలు దొరికితే మళ్లీ విలన్గా చేస్తా: గోపిచంద్
మాచో స్టార్ గోపిచంద్-రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషనల్లో భాగంగా గోపిచంద్, డైరెక్టర్ మారుతి ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలపై గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: నాకు అలాంటి సీన్స్లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా ఈ సందర్భంగా షో హోస్ట్.. పక్కా కమర్షియల్ అనే పదాన్ని ఎక్కువగా నెగెటివ్ సెన్స్ వాడతాం.. మరి అసలు ఎలా ఉండనుందనే ప్రశ్నకు గోపిచంద్ ఇలా స్పందించాడు. ‘ఈ మూవీ చాలా వినోదభరితంగా ఉంటుంది. రణం, లౌక్యం చిత్రాల తర్వాత నేను ఫుల్ లెన్త్ కామెడీ చేసింది ఈ సినిమాలోనే. పక్కా కమర్షిల్లో ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే అన్ని అంశాలు ఉంటాయి’ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు మళ్లీ విలన్గా చేస్తారా? అని అడగ్గా.. తప్పకుండ చేస్తానని చెప్పాడు గోపిచంద్. చదవండి: సినిమాలకు గుడ్బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా? అయితే తాను ఇప్పటి వరకు చేసిన విలన్ రోల్స్ అన్ని కూడా హీరోలకు ధీటుగా ఉన్నవేనని, మళ్లీ అలాంటి వైవిధ్యమైన పాత్రలు ఉంటేనే చేస్తానని తెలిపాడు. అనంతరం దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మీరు అసలైన గోపిచంద్ని చూస్తారంటూ ఆసక్తకర కామెంట్స్ చేశాడు. గోపిచంద్ సెట్లో చాలా ప్రశాంతంగా ఉటాడని, సీన్లలోనే నటించేటప్పుడు ఆయనలోని నటుడిని చూసి ఆశ్చర్యం వేసేదన్నాడు. ఇక బయట ఉండే క్యాజువల్ గోపిచంద్ని మీరు ఈ సినిమాలో చూస్తారని మారుతి చెప్పుకొచ్చాడు. -
పక్కా కమర్షియల్.. బ్లాక్లో టికెట్స్ అమ్ముతు దొరికిపోయిన కమెడియన్!
గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ టికెట్స్ను బ్లాక్లో అమ్ముతూ దొరికిపోయాడు కమెడియన్ సప్తగిరి. సప్తగిరి ఈ చిత్రంలో తన కమెడియన్గతో నవ్వించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సప్తగిరి బ్లాక్లో టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ మారుతికి అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం సప్తగిరి మారుతి చివాట్లు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇదంత నిజం కాదండోయ్. చదవండి: ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వెనక్కి నెట్టిన కన్నడ చిత్రాలు జూలై 1న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ రేట్స్పై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. పక్కా కమరయల్ టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయనా అని ప్రతి ఒక్కరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ రేట్స్పై క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర బృందం ఇలా కొత్తగా ప్లాన్ చేసింది. గీతా ఆర్ట్స్ వారు తమ యూట్యూబ్ చానల్లో షేర్ చేసినీ ఈ వీడియోలో సప్తగిరి బ్లాక్ టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ మారుతికి దొరికపోయాడు. ఏంటి.. టికెట్స్ బ్లాక్లో అమ్ముతున్నావా? అని మారుతి అడగ్గా... అవును సర్.. సినిమాల్లోకి రాకముందే చిరంజీవి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అని బదులిస్తాడు. అయితే ఒక టికెట్ను ఎంతకు అమ్ముతున్నావని అడగ్గా.. 150 రూపాయలకు అంటాడు. దీనికి కౌంటర్లో కూడా ఇదే రేట్కు ఇస్తున్నారు కదా! అంటాడు మారుతి. అది విని షాక్ అయిన సప్తగిరి అంటే పాత రేట్స్కే సినిమాను ప్రదర్శిస్తున్నారా? అని ప్రశ్నిస్తాడు. చదవండి: మాధవన్ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్ దీంతో మారుతి అవునయ్యా.. ఈ సినిమాను నాన్ కమర్షియల్ రెట్స్కే అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్మాత బన్నీ వాసు మూవీ ప్రమోషన్లో చెబుతున్నాడు కదా! అది వినలేదా? అని చెప్పగా. అవునా సర్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు సప్తగిరి. ఇక మూవీ టికెట్ రేట్స్పై వివరణ ఇస్తూ మరుతి.. ‘మా పక్కా కమర్షియల్ సినిమా మిమ్మిల్ని మళ్లీ పాత థియేటర్ల వైభవం రోజులకు తీసుకెళ్లడానికి సందడిగా హ్యాపీగా నవ్వుతూ మూవీని ఎంజాయ్ చేసేందుకు పాత రెట్స్కే() ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాను థియేటర్లోనే చూడండి. గ్రూపులు వచ్చి మా సినిమాను ఎంజాయ్ చేయండి. పాత టికెట్స్ రెట్స్కే మా సినిమాను థియేటర్లో ప్రదర్శించబోతున్నాం’ అంటూ డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చాడు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే -
నా ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తం: గోపీచంద్
గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా జూలై 1న విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్స్తో బిజీ అయ్యాడు గోపీచంద్. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన వారిలో నిర్మాత నాగేశ్వరరావు ఒకరు. ఆయన నన్ను హీరోగా పెట్టి తొలి వలపు సినిమా చేశారు. అది ఫస్ట్ మూవీ కావడంతో నేనెలా చేస్తానో అని చాలామందికి అనుమానపడ్డారు. చివరకు ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఆరునెలల వరకు ఏ సినిమా రాలేదు. ఆ తర్వాత పరిస్థితుల వల్ల విలన్గా చేశాను. నేను చేసినవాటిలో కొన్ని ఆడవని ముందే అనిపించాయి. ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబు అని మనసులో అనుకున్నాను. చిన్నప్పుడు నా అన్న ప్రేమ్చంద్ బ్లేడు తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ముక్కు కోసి పప్పులో పెడతారా? ఎలా పెడతారు? అంటూ బ్లేడు తీసుకుని నా ముక్కు కోసేశాడు. అప్పుడు నేను పెరుగన్నం తింటున్నా.. రక్తం కారి నా పళ్లెంలో నిండిపోయింది. ఇక నా చిన్నతనంలో అంటే దాదాపు నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది' అని ఎమోషనలయ్యాడు గోపీచంద్. ఆ తర్వాత మారుతి తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఒకసారి ల్యాబ్కు వెళ్లినప్పుడు.. సినిమా ఫస్ట్ కాపీ చూసి తక్కువ నిడివిలో తీయాలి, ఇలా తీయకూడదు అని సూచించాను. దానికాయన నువ్వు డైరెక్టర్ అయి సినిమా తీయు, తెలుస్తుంది. అప్పుడు ఎలా తీయాలో మాకు చెప్పండి, నేర్చుకుంటాం అంటూ నానామాటలు అన్నారు' అని గుర్తు చేసుకున్నాడు. చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె సైరన్, షూటింగ్స్ బంద్! -
పక్కా కమర్షియల్ ట్రైలర్: నేను హీరోను కాదు, విలన్..
'ప్రతిరోజు పండగే' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి -
Prabhas: అందుకే మారుతితో మూవీ చేస్తున్నా.. ప్రభాస్ క్లారిటీ!
పాన్ ఇండియా ట్రెండ్ లోకి ఎంత మంది హీరోలు వచ్చినప్పటికీ,ప్రభాస్ స్టార్ డమ్ కు మాత్రం తిరుగులేదు.ఆ విధంగా తాను ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. వచ్చే ఏడాదిలో ఆదిపురుష్, సలార్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రాలతో బాహుబలి 2 రిలీజైనప్పటి రోజులను,ఇంకా చెప్పాలంటే కేజీయఫ్ 2 రిలీజ్ హంగామాను మరోసారి రిపీట్ చేస్తానంటున్నాడు.మరో వైపు ప్రాజెక్ట్ కే , స్పిరిట్ లాంటి చిత్రాలు కూడా చేతిలో ఉన్నాయి. అయినా డైరెక్టర్ మారుతి సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. అయితే దానికి ఓ కారణం ఉంది అంటున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా చిత్రాల మధ్య రాధేశ్యామ్ లాంటి లవ్స్టోరీ, మారుతితో మరో డిఫరెంట్ మూవీని ఎందుకు చేస్తున్నాడో క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో ఎక్కువ భాగం యాక్షన్ మూవీస్ ఉన్నాయని, వీటి మధ్య తాను విభిన్నంగా కనిపించేందుకు రాధేశ్యామ్ లాంటి చిత్రాలు చేస్తున్నట్లు చెప్పాడు ప్రభాస్. మారుతితో కూడా అలాంటి డిఫరెంట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రభాస్ మారుతికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా రిలీజ్ డేట్ తో సహా సలార్ టీజర్ ను మేలో రిలీజ్ చేయబోతున్నారు. -
'పక్కా కమర్షియల్'గా ఆ ఓటీటీకి డిజిటల్ రైట్స్..
Gopichand Pakka Commercial Movie Digital Rights Acquires Aha OTT: హీరో గోపీచంద్, బొద్దుగుమ్మ రాశీ ఖన్నా ముచ్చటగా మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్లో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ జులై 1న ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్ తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ విడుదలకు ముందే పోస్ట్ థియేట్రికల్ హక్కులను మంచి మొత్తానికి ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కొన్ని వారాల తర్వాత డిజిటల్ రైట్స్ను 'పక్కా కమర్షియల్'గా సొంతం చేసుకున్న ఆహా ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరిసారిగా పాటలు రాశారు. ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చదవండి: జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. ఫిబ్రవరి 2 సిరివెన్నెల చివరి పాట -
వరుస ఫెయిల్యూర్స్.. అయినా వారికే చాన్స్ ఇస్తున్న ప్రభాస్!
బాహుబలి సిరీస్తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు ప్రభాస్.పాన్ ఇండియా స్టార్ గా మారాడు.అదే స్పీడ్ లో వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.కాని యంగ్ డైరెక్టర్స్ వరుసగా అవకాశాలు ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.వారు ఫెయిల్యూర్స్ ఇస్తున్నా సరే,యంగ్ టాలెంట్ ను మాత్రం ప్రభాస్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఏరికోరి రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ కు సాహో తీసే అవకాశం ఇచ్చాడు.సీన్ కట్ చేస్తే ఈ సినిమా బాలీవుడ్ లో తప్పితే ఎక్కడ విజయం సాధించలేకపోయింది.జిల్ తీసిన రాధాకృష్ణకు పిలిచి రాధేశ్యామ్ తెరకెక్కించాల్సిందిగా కోరాడు ప్రభాస్.సాహో కంటే పెద్ద బడ్జెట్తో అంతకంటే ఎక్కువ రోజుల షూటింగ్ తో తెరకెక్కింది రాధేశ్యామ్.భారీ అంచనాల మద్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. సాహో, రాధేశ్యామ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత కూడా ప్రభాస్ ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇవ్వాలనుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు మారుతి. కెరీర్ లో చాలా వరకు యంగ్ హీరోస్ తో సినిమాలు చేస్తూ వచ్చాడు. బాబు బంగారంతో వెంకీని డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్రెండ్ గోపీచంద్ తో పక్కా కమర్షియల్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ లాక్ చేసుకున్నాడు మారుతి. సాహోతో సుజిత్ అందిచలేకపోయిన సక్సెస్ ను, రాధేశ్యామ్ తో రాధాకృష్ణ అందిచలేకపోయిన విజయాన్ని ప్రభాస్ కు తాను అందిస్తాను అంటున్నాడు మారుతి.యంగ్ రెబల్ స్టార్ కోసం పవర్ స్టోరీ రెడీ చేశాడట. ముగ్గురు హీరోయిన్స్ కు స్కోప్ ఉన్న ఈ స్టోరీలో అనుష్కకు కూడా ఒక హీరోయిన్ గా కనిపించనుందట. మిర్చి, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్, అనుష్క జోడి మారుతి మూవీలో మరో మారు కనిపించబోతున్నారనే వార్త టీటౌన్ ను షేక్ చేస్తోంది. -
గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
మ్యాచో హీరో గోపీచంద్తో దర్శకుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ టైటిల్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. చదవండి: మెగా కోడలు ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డు జులై 1, 2022న పక్కా ఎంటర్టైన్మెంట్తో వస్తున్నామంటూ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. మారుతి డైరెక్షన్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీలో రాశీ ఖాన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీలో సత్యరాజ్, జగపతి బాబులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జేకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ Get ready for 100% Pakka Entertainment! 🤙 Macho star @YoursGopichand & @DirectorMaruthi 's #PakkaCommercial in theatres from 𝐉𝐔𝐋𝐘 𝟏𝐬𝐭, 2022.#PakkaCommercialOnJuly1st #AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/Rxg217DIqc — BA Raju's Team (@baraju_SuperHit) March 30, 2022 -
క్రేజీ అప్డేట్: మరోసారి ప్రభాస్తో అనుష్క..!
హీరో ప్రభాస్తో అనుష్కది సూపర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరోసారి ప్రభాస్, అనుష్క జంట కలిసి సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఇటీవల ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక పక్కా మాస్ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించబోతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అందులో మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం అనుష్కను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో జేజమ్మ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఇక రెండో హీరోయిన్గా కృతి శెట్టిని దాదాపుగా కన్ ఫార్మ్ చేసినట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్గా మాళవిక పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే కొంతకాలంగా అనుష్క సినిమాలకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్తో అనుష్క కాంబినేషన్పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
శ్రీవారి సేవలో సినీ దర్శకుడు మారుతి
Director Maruthi Visits Tirumala With His Family: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సినీ దర్శకుడు దాసరి మారుతి మంగళవారం సందర్శించారు. 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకున్నారు. సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూ జలు చేయించారు. పండితులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలి కారు. శ్రీవారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. చదవండి: (రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఎప్పుడంటే?) -
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ మూవీ, హాటాటాపిక్గా ‘డార్లింగ్’ రెమ్యునరేషన్
‘బాహుబలి’, ‘సాహె’ చిత్రాల తర్వాత ప్రభాస్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. అప్పటి వరకు సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ప్రభాస్ నటించే ప్రతీ సినిమా దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్తో ఇటీవల ఫ్యాన్స్ను పలకరించాడు. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కామెడీ, హార్రర్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్ తొలి ట్వీట్, నెటిజన్ల అసహనం అయితే ఈ సినిమాకు ప్రుభాస్ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 60 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడట. దీనికి గాను ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే ప్రభాస్ రోజుకు ఏకంగా రూ. 1.25 కోట్ల వరకు తీసుకోనున్నాడన్నమాట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీలో ‘డార్లింగ్’కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారటి టాక్. వీరిలో ఉప్పెన ఫేమ్ కృతీ శెట్టి ఒకరని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్, సలార్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమాలను పూర్తి చేసి మారుతి సినిమాను సెట్స్పైకి తీసుకువస్తాడని సమాచారం. చదవండి: Ram Gopal Varma: ‘రాధేశ్యామ్’ మూవీపై వర్మ షాకింగ్ కామెంట్స్ -
ప్రభాస్తో మారుతి చిత్రం.. 'రాజా డీలక్స్' కాదా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. కామెడీ, హార్రర్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి ఇప్పటికే 'రాజా డీలక్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక తాజా విషయం ఏంటంటే ఈ సినిమాకు మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించినా ఆ టైటిల్ ప్రభాస్ కోసం కాదని మరో హీరో కోసమని సమాచారం. మారుతి మాస్ రాజా రవితేజతో కూడా ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఆ చిత్రం కోసం మారుతీ 'రాజా డీలక్స్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక దీంతో ప్రభాస్ చిత్రానికి సరైన టైటిల్ ఖరారు చేసే పనిలో మారుతీతో పాటు అతని బృందం బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సరైన టైటిల్ను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజక్టుకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో బేబమ్మ రొమాన్స్..
Prabhas And Krithi Shetty In Raja Deluxe Movie: ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండే ఈ కన్నడ భామ.. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ‘ఉప్పెన’తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ భామ. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి ఇప్పుడు మరో మూడు సినిమాల్లో నటిస్తుంది. సుధీర్బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', రామ్తో 'ది వారియర్', నితిన్తో 'మాచర్ల నియోజక వర్గం' సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ భామ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో జతకట్టే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. రీసెంట్గా రాధేశ్యామ్తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కాగా, ఇప్పటికే కృతిశెట్టి ఎంపికయినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
ప్రభాస్ సినిమాకి టైటిల్ మారనుందా? త్వరలోనే అప్డేట్
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. కామెడీ, హార్రర్ బ్యాక్డ్రాప్లో సాలిడ్ ఎంటర్టైన్మెంట్గా రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజాగా క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఆ టైటిల్ను మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఆ టైటిల్కి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో దాన్ని మార్చాలని చూస్తున్నారట. పాన్ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. చదవండి: 'రాధేశ్యామ్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్ -
స్పిరిట్ కంటే ముందు ‘రాజా డీలక్స్’ను సెట్స్పై తీసుకొచ్చే ప్లాన్లో ప్రభాస్?
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో దాదాపు అరజడజను చిత్రాలు ఉన్నాయి. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్తో పాటు మరిన్న ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అయితే ఇప్పటికే రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు షూటింగ్ను పూర్తి చేసుకోగా మార్చిలో రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమైంది. సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K షూటింగ్ను జరుపుకుంటోంది. వీటి తర్వాత ప్రభాస్ సందీప్ వంగతో స్పిరిట్ మూవీని సెట్స్పై తీసుకువస్తాడని అంతా అనుకున్నారు. కానీ దీని కంటే ముందు ప్రభాస్ మారుతి సినిమాను పట్టాలెక్కించేలా కనిపిస్తున్నాడట. కాగా డైరెక్టర్ మరుతితో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని, ఇప్పటికే చర్చలు, స్క్రిప్ట్ కూడా పూర్తయ్యాయంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ప్రాజెక్ట్కు 'రాజా డీలక్స్'గా టైటిల్ ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలను మారుతి ఖండించలేదు. దీంతో ఇది నిజమే అని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయంటూ ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసి, గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. దీని బట్టి చూస్తుంటే 'స్పిరిట్' కాస్త ఆలస్యమయ్యేలాగే కనిపస్తుంది. -
ప్రభాస్ సరసన పెళ్లి సందD హీరోయిన్!
Sri Leela To Share Screen With Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఆదిపురుష్, సలార్ సినిమాలు సైతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘రాజా డీలక్స్’ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సర్క్యులేట్ అవుతుంది. ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల.. ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనుండగా అందులో శ్రీలీల ఒక హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తుంది. -
పక్కా కమర్షియల్ నుంచి ఫస్ట్ సింగిల్, ఆకట్టుకుంటున్న లిరిక్స్..
మ్యాచో హీరో గోపీచంద్తో విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు మూవీ విడుదల తేదీని ప్రకటించిన ప్రకటించిన చిత్రం బృందం, తాజాగా ఫస్ట్ సింగిల్ను విడుదల చేసింది. పాటలోని లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఓ ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇదికావడం విశేషం. సిరివెన్నెల గారు చివరిగా రాసిన జీవిత సారాంశం ఈ పాటలో కనిపిస్తుంది. పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్.. దేవుడు జీవుడు భక్తులు అగత్తులు అన్నీ పక్కా కమర్షియల్.. ఎయిర్ ఫ్రీయా.. నో.. నీరు ఫ్రీయా.. నో.. ఫైర్ ఫ్రీయా.. నో.. నువ్ నుంచున్న జాగా ఫ్రీయా.. అన్నీ పక్కా పక్కా పక్కా కమర్షియల్.. జన్మించినా మరణించినా అవదా ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు.. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెల గారిని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్లో ఉంటాయని మారుతి చెప్పారు. -
సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్
Maruthi Emotional On Pakka Commercial Title Song Lyricist Sirivennela: మాచో స్టార్ గోపిచంద్ సినిమాలపై జోరు పెంచాడు. సీటిమార్ సినిమా తర్వాత వెంటనే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ అయిన 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్ ను ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంగ్ టీజర్ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ టీజర్లో గోపిచంద్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. 'పక్కా.. పక్కా.. పక్కా కమర్షియలే' అంటూ సాగుతున్న ఈ టీజర్కు మంచి స్పందన వస్తుంది. అయితే ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇది. సిరివెన్నెల చివరిసారిగా రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉండనుందట. దీంతో డెరెక్టర్ మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. జన్మించిన మరణించినా ఖర్చే ఖర్చు అంటూ సాగే అందమైన పాట రాశారని మారుతి పేర్కొన్నారు. మరణం గురించి ముందే తెలిసినట్లు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు మారుతి. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యంతోపాటు ఈ సాంగ్లో మరెన్నో అద్భుతాలు ఉన్నాయని మారుతి తెలిపారు. -
ప్రభాస్తో సినిమా? కాలమే సమాధానం చెబుతుందన్న డైరెక్టర్
Director Maruthi New Movie Updates: ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’.. ఇలా వరుసగా పాన్ ఇండియన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోన్న ప్రభాస్ తర్వాతి చిత్రం గురించి ఫిల్మ్నగర్లో ఓ హాట్ టాపిక్ వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని, ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది పాన్ ఇండియన్ ఫిల్మ్ కాదని, కేవలం తెలుగులో మాత్రమే రానుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా చేయడం లేదని, దాదాపు 30 నిమిషాల నిడివి ఉండే ఓ లీడ్ క్యారెక్టర్ చేయనున్నారన్నది మరో టాక్. ఈ వార్తలు ఇలా ప్రచారం అవుతున్న నేపథ్యంలో మారుతి చేసిన ఓ ట్వీట్ ఈ చిత్రానికి సంబంధించినదే అయ్యుంటుందనే ఊహాగానాలు కూడా నెలకొన్నాయి. ‘‘నా భవిష్యత్ ప్రాజెక్ట్స్ గురించిన కొన్ని టైటిల్స్, సినిమాల జానర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, నటీనటుల గురించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కాలమే అన్నీ చెబుతుంది’’ అని మారుతి ట్వీట్ చేశారు. మరి.. ‘రాజా డీలక్స్’ ఉంటుందా? కాలమే చెబుతుంది. There are too many speculations about my future projects, titles, genres, music directors and crew etc. But Time will reveal everything. Thank you to everyone for your support and encouragement Take care and stay safe 😷 — Director Maruthi (@DirectorMaruthi) January 22, 2022 -
Pakka Commercial: ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజమ్..ఎప్పుడో వదిలేశా!
‘ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజమ్, మీరు ఇప్పుడు చేస్తున్నారు.. నేను ఎప్పుడో చూసి, చేసి వదిలేశాను’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్తో ‘పక్కా కమర్షియల్’ టీజర్ విడుదలైంది. గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్–యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్యగమిడి, సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: కమర్ చావ్ల. -
20 రోజుల్లో కథ రాసుకుని..30 రోజుల్లో సినిమా తీశా..
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): కరోనా సమయంలో సరదాగా 20 రోజుల్లో కథను రాసుకుని, 30రోజుల్లో మంచిరోజులు వచ్చాయి సినిమాను తీశానని ఆ సినిమా దర్శకుడు మారుతి పేర్కొన్నారు. ఆదివారం అనుశ్రీ సినిమా థియేటర్ మ్యాట్నీషోకు ఆయన, హీరో సంతోష్ శోభన్, నటులు సుదర్శన్, శ్రీనివాసరావు, నిర్మాత ఎస్కేఎన్ సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కమెడియన్ సుదర్శన్ మాట్లాడుతూ అందరూ థియేటర్లకు ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ముందుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ కరోనా కాలంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని భయం అనే కాన్సెప్ట్తో ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా తీశామన్నారు. తమ సినిమా ఓటీటీ ద్వారా విడుదల చేసినా నష్టం లేకపోయినప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావాలన్న లక్ష్యంతో విడుదల చేశామన్నారు. సినిమా మంచి విజయాన్ని సాధించిందన్నారు. ఒకవైపు పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మధ్యలో తనకు నచ్చిన కాన్సెప్ట్తో చిన్న చిన్న సినిమాలు తీస్తుంటానన్నారు. గోపీచంద్ హీరోగా ప్రతిరోజు పండగ నిర్మాణ టీమ్తో కమర్షియల్ సినిమా తీస్తామన్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని మారుతి తెలిపారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ యూవీ క్రియేషన్స్, వైజయంతి మూవీస్ బ్యానర్లో సినిమాలు చేస్తున్నానన్నారు. పాలసీమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహానుభావుడు సినిమా ద్వారా ప్రభుత్వ ఉద్యోగి అయిన తాను నటునిగా వచ్చానని, దర్శకుడు మారుతి ఈ సినిమా ద్వారా మంచి క్యారెక్టర్ ఇచ్చి బ్రేక్ ఇచ్చారన్నారు. అనుశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ మేనేజర్ హరిబాబు, అనుశ్రీ థియేటర్ మేనేజర్ శంకర్, విష్ణు, రాజేష్ పాల్గొన్నారు. -
యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ‘పక్కా కమర్షియల్’ ఫస్ట్ గ్లింప్స్
గోపిచంద్, రాశీఖన్నా జంట మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో గోపిచంద్ సినిమా అనగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను వదిలారు మేకర్స్. ఈ సందర్భంగా నవంబర్ 8న టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం విడుదల పక్కా కమర్షియల్ ఫస్ట్ గ్లీంప్స్కు యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతోంది. 2 మిలియన్ల వ్యూస్ను ఈ ఫస్ట్ గ్లింప్స్ దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని సెట్స్పై తీసుకెళ్లనున్నట్లు ఇటీవల చిత్ర బృందం పేర్కొంది. -
‘రామ్ వర్సెస్ రావణ్’ షూటింగ్ షురూ
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "రామ్ వర్సెస్ రావణ్". ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె శుక్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ "రామ్ వర్సెస్ రావణ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రామ్ వర్సెస్ రావణ్" సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.శుక్రన్ మాట్లాడుతూ.. రామ్ వర్సెస్ రావణ్.. ఒక పల్లెటూరిలో జరిగే కథ. ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కథలో కలిసి ఉంటుంది. కథ మీద పూర్తి నమ్మకంతో సినిమా ప్రారంభించాం. కపటధారి లాంటి పెద్ద చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నా మిత్రుడు రాజామతి ఈ కథ విని బాగా నచ్చి ముందు ఈ సినిమా కంప్లీట్ చేద్దామన్నారు. ఏంజెల్ సినిమాను మించిన విజయం రామ్ వర్సెస్ రావణ్ సాధిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం. అన్నారు. ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది అన్నారు హీరో సొలమన్ జడ్సన్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజామతి, సంగీతం : వికాస్ బాడిశ, స్టంట్స్ : రామ్ లక్ష్మణ్, బి జె శ్రీధర్. -
అబ్బాయి నుంచి అమ్మాయిగా.. ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’
‘‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’ షార్ట్ ఫిలిం చూసి దర్శకుడు నాగ్ అశ్విన్గారు ‘చాలా బాగుంది. అమ్మాయి పాత్ర పెద్ద బోనస్’ అన్నారు. అలాగే డైరెక్టర్ మారుతిగారు కూడా ‘మంచి ప్రయత్నం... బాగుంది’ అన్నారు. ఆ ఇద్దరి ప్రశంసలను మరచిపోలేను’’ అని రుత్విక్ రెడ్డి అన్నారు. విజయ్ దాస్ దర్శకత్వంలో రుత్విక్ రెడ్డి స్త్రీ పురుష పాత్రల్లో నటించిన షార్ట్ ఫిలిం ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’. శ్రీలతా రెడ్డి నిర్మించిన ఈ షార్ట్ ఫిలింని డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. రుత్విక్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాకు నటన అంటే ఇష్టం. న్యూయార్క్లో రెండేళ్లు నటనలో శిక్షణ తీసుకున్నాను. తొలి ప్రయత్నంగా ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’ షార్ట్ ఫిలిం చేశా. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులతో పాటు లింగ మార్పిడి అనేది ప్రకృతికి విరుద్ధం అనీ, చిన్న విషయాలకే భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదనే విషయాలను చూపించాం. నా షార్ట్ ఫిలిం బాగుందని ఫోన్లు చేయడంతో పాటు కామెంట్లు పెడుతుండటం హ్యాపీ. ఇటీవల కొన్ని సినిమా కథలు విన్నాను. నా నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. చదవండి : విజయ్ను కలిసి షణ్ముక ప్రియ, లైగర్ ఓ పాట పాడే అవకాశం ఆ ట్విస్ట్ తెలిసి వావ్ అనుకున్నా! -
ఎవరూ మిస్ కారని అనుకుంటున్నా : మారుతి
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా శ్రీని జోస్యుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్సింగ్’. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బడ్జెట్ చిన్నదా? పెద్దదా? అని కాదు. ఓ క్వాలిటీ ఫిల్మ్ చేశారని చెప్పగలను. టైటిల్ ‘మిస్సింగ్’. కానీ ఈ చిత్రాన్ని ఎవరూ మిస్ కారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మిస్సింగ్’ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘మా కలను నిజం చేసిన మా నాన్న భాస్కర్, హీరో ఫాదర్ శేషగిరి రావులకు రుణపడి ఉంటాను’’ అన్నారు శ్రీని. ‘‘యాక్షన్.. లవ్.. ఎమోషన్ అన్నీ ఉన్న సినిమా ఇది’’ అన్నారు హీరో హర్ష. -
మెహ్రీన్కు ‘మంచి రోజులు వచ్చాయి’..త్వరలోనే అనౌన్స్మెంట్
హీరోయిన్ మెహ్రీన్కు మంచి రోజులు వచ్చాయి. ఆమెకు మంచి రోజులు రావడం ఏంటి అనే కదా మీ సందేహం. మరేం లేదండి..రీసెంట్గా మెహ్రీన్ నటిస్తున్న సినిమాకు ఖరారు చేసిన టైటిల్ అది. ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్లో మంచి క్రేజ్ సంపాదిచుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్తో మెహ్రీన్ జతకట్టింది. తాజాగా ఈ చిత్రానికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిట్ను ఖరారు చేశారు. ఈ మేరకు మూవీ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్లో సందడి చేయనుంది. విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన రానుంది. నిజజీవిత పాత్రలను స్పూర్తిగా తీసుకుని యూత్ఫుల్ ఎంటర్ టైనర్గా ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తుంది. ఎస్కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఎఫ్3 తప్పా పెద్ద సినిమాలు లేవు. మరోవైపు 'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన సంతోష్ చేతిలో నందినీరెడ్డి సినిమాతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
30 రోజుల్లో సినిమా..'ఏక్ మినీ కథ' హీరోతో మెహ్రీన్
'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్లో మంచి క్రేజ్ సంపాదిచుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఏక్ మినీ కథ సంతోష్ కెరీర్ను మార్చేసింది. ఇప్పటికే పలు అవకాశాలు ఈయన్ని వరిస్తున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా ఫైనలైజ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో సంతోష్కు జోడీగా మెహ్రీన్ కనిపించనుందట. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఎఫ్3 తప్పా పెద్దగా అవకాశాలు లేదు. దీంతో ఈ కుర్ర హీరోతో జత కట్టేందుకు రెడీ అయ్యిందట ఈ భామ. అంతేకాకుండా పెళ్లి కూడా వాయిదా పడటంతో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుందట. కేవలం 30 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ అయ్యేలా డైరెక్టర్ మారుతి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పటికే షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. లవ్ అండ్ కామెడీ జోనర్లో తెరకెక్కతున్న ఈ సినిమాకు ‘మంచిరోజులు వచ్చాయి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు నెట్టింట వైరలవుతుంది. ఈ సినిమా అనంతరం డైరెక్టర్ నందినీ రెడ్డితోనూ సంతోష్ శోభన్ ఓ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. చూస్తుంటే సంతోష్ శోభన్ వరుస ఆఫర్లతో బిజీ బిజీగా మారినట్లు కనిపిస్తుంది. చదవండి : ఇష్టం లేకపోయినా చేశా.. నటిగా అన్నీ చెయ్యాల్సిందే : శ్రద్దా దాస్ పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్ -
TNR కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన డైరెక్టర్ మారుతి
ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ ఇటీవలె కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్ఆర్కు ఇటీవలె కరోనా సోకింది. మొదట హోం ఐసోలేషన్లో ఉన్న టీఎన్ఆర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. టీఎన్ఆర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు కొందరు టీఎన్ఆర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సైతం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది. తాజాగా డైరెక్టర్ మారుతి టీఎన్ఆర్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. తన వంతు సాయంగా 50 వేల రూపాయలను అందించారు. ఈ మేరకు టీఎన్ఆర్ భార్య జ్యోతి బ్యాంక్ అకౌంట్కు నగదును పంపించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు తమకు తోచినంత సహాయం చేయాల్సిందిగా మారుతి సూచించారు. It's time to show our solidarity for our friend in media TNR we miss you, but we are with your family. Let's support #TNR's family pic.twitter.com/rLUfavz9EX — Director Maruthi (@DirectorMaruthi) May 13, 2021 చదవండి : TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్ఆర్ -
'వేశ్య'గా యాంకర్ అనసూయ!
టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఈ బ్యూటీ సొంతం. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరను మెప్పిస్తున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. అక్కడ విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్ని మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న ఓ సినిమాలో అనసూయ నటించనుంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్తో ఈ సినిమా రూపొందనుందని మూవీ టీం వెల్లడించింది. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాశి ఖన్నా, ఈషా రెబ్బా కథానాయుకలుగా నటించున్నట్లు సమాచారం. చదవండి : (అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!) (వైరల్ అవుతున్న దీపికా పదుకొనె డ్యాన్స్ వీడియో) -
గోపీచంద్- మారుతి సినిమా టైటిల్ ఇదే
మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫిబ్రవరి 14) ఈ సినిమా టైటిల్ని ప్రకటించింది చిత్ర యూనిట్. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. Bless us my next with Macho star @YoursGopichand garu#PakkaCommercial It is..👌#AlluAravind #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/SsAM9brNJ3 — Director Maruthi (@DirectorMaruthi) February 14, 2021 -
మారుతి కొత్త సినిమా ప్రకటన.. హ్యూమరస్ వీడియో
‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మళ్లీ మారుతి దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్–యూవీ క్రియేషన్స్–బన్నీ వాసు నిర్మించనున్న మూడో చిత్రానికి శ్రీకారం జరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రంలో గోపీచంద్ హీరో. ‘‘సూపర్ డూపర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కించడానికి మారుతి రంగం సిద్ధం చేశారు. గోపీచంద్–మారుతి కాంబినేషన్లో సినిమా రాబోతుందనే ప్రకటన కూడా వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేశాం. ‘ప్రతిరోజూ పండగే’ తర్వాత మారుతి చేయబోయే సినిమాపై వచ్చిన పుకార్లకు సెటైర్లు వేస్తూ, మారుతి మార్క్ స్టైల్లో ఓ హ్యూమరస్ వీడియోను విడుదల చేశాం. ఈ వీడియోకి రావు రమేశ్గారి వాయిస్ ఓవర్ బాగా కుదిరింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కూతురు Vs బాబాయి
-
మిర్యాలగూడలో ఉద్రిక్త వతావరణం
-
ప్రేమ పండగ
-
ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ
టైటిల్: ప్రతిరోజూ పండుగే జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, విజయ్కుమార్, నరేశ్, ప్రభ తదితరులు సంగీతం: థమన్ ఎస్ సినిమాటోగ్రఫీ: జయకుమార్ నిర్మాత: బన్నీ వాస్ దర్శకత్వం: మారుతి బ్యానర్లు: యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘ప్రతిరోజూ పండుగే’. వినూత్న కాన్సెప్ట్లతో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఒక ఫీల్గుడ్ టైటిల్తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అడపాదడపా హిట్లతో నెట్టుకొస్తున్న సాయి ‘చిత్రలహరి’ సినిమాతో సూపర్హిట్ అందుకున్నారు. అటు మారుతీ కూడా భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంతకూ ‘ప్రతిరోజూ పండుగే’ అంటూ తాత-మనవళ్లు ప్రేక్షకులకు ఏం చెప్పారు? సంక్రాంతికి ముందే తెర నిండుగా పండుగ తీసుకొచ్చారా? కథ: రాజమండ్రికి చెందిన పసుపులేటి రఘురామయ్య వయస్సు మీదపడిన పెద్దాయన. ఆయన పిల్లలు దూరంగా సెటిలయ్యారు. ఈ దశలో ఆయనకు లంగ్ క్యాన్సర్ తీవ్రమవుతుంది. ఇంకా కొన్ని వారాలే బతుకుతారని డాక్టర్ చెప్తారు. కానీ ఎక్కడో దూరంగా సెటిలైన పిల్లలు తండ్రికి వచ్చిన కష్టం కన్నా.. ఎన్ని రోజులు ఆయనతో ఉండి.. ఎంత తర్వగా ఆయన చావు తతంగం పూర్తి చేసి.. చేతులు దులుపుకొని వెళ్లిపోవాలా? అని చూస్తారు. కానీ, ఆయన మానవడు మాత్రం తాత చివరి రోజులు సంతోషంగా చూడాలనుకుంటాడు. ఆయన నెరవేరని కోరికలు తీర్చాలనుకుంటాడు. కానీ, అతని తల్లిదండ్రులు, బాబాయి-పిన్నిలు, అత్త-మామల ధోరణి అందుకు భిన్నంగా ఉంటుంది. చివరి రోజుల్లో తండ్రిని సుఖంగా చూసుకోవడం కంటే తమ జాబ్లు, జీవితాలు ఇవే ముఖ్యమనుకుంటారు. పెద్దాయన మనస్సు నొప్పించేలా ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాత కోసం తపించే సాయి ఏం చేస్తాడు? తమ పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే వాళ్లు కూడా యాంత్రిక జీవితంలో పడి.. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవడంలో నిర్లిప్తంగా ఉంటారు. ఏదోలే పోతేపోయారు అనుకుంటారు. అలాంటి వారిని ఈ మనవడు ఎలా మారుస్తాడు? అన్నది మిగతా కథ. విశ్లేషణ: ‘ప్రతిరోజూ పండుగే’ అనే ఫీల్ గుడ్ టైటిల్తో బీటలు వారుతున్న కుటుంబ సంబధాల నేపథ్యంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాప్ కథ ఒకింత ఫ్లాటుగా ప్రారంభమవుతుంది. తాతకు లంగ్క్యాన్సర్ అని తెలియడం, మనవడు సాయి పరిగెత్తుకురావడం, తాత కోరికలు తీర్చడం, తాత కోసం ఏంజిల్ అరుణను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటం, సత్యరాజ్ పిల్లలంతా ఇంటికి చేరడం ఇలా కథ.. ఒకింత సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ, ఫస్టాఫ్లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. పలుచోట్ల గిలిగింతలు పెడుతాయి. కామెడీ సీన్లతో సాగుతూ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి కథ ప్రధాన మలుపు తిరుగుతుంది. సెకండాప్లోనూ కథ పెద్దగా కనిపించదు. తండ్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం ఆరాటపడుతూ.. బతికుండే తండ్రి చావు కోసం పిల్లలు చేసే ఆరాట ఆర్భాటాలు... సమాజంలోని అసంబద్ధతను చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు భావోద్వేగంగా సాగుతూ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. క్లైమాక్స్ ఒకింత లెంగ్తీగా అనిపించినా సినిమాకు ఇదే ప్రధాన బలమని చెప్పవచ్చు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని వారిని కడిగిపారేసేలా క్లైమాక్స్ సీన్లు సాగుతాయి. ఇక, తాతమనవళ్లుగా సత్యరాజ్-సాయి సెంటిమెంట్ను పండించారు. సినిమాలో ప్రధానపాత్ర సత్యరాజ్దే. చావుకు చేరువగా ఉన్న తన పట్ల కుటుంబసభ్యుల అనుచిత ప్రవర్తన, ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనుకునే వారి తీరుతో ఆయన పడే మానసిక క్షోభ.. సత్యరాజ్ అద్భుతంగా పండిచారు. మనవడిగా, పెద్దలకు బుద్ధిచెప్పే కొడుకుగా సాయి కూడా తన నటనతో మెప్పించాడు. ఒక ఫైట్ సీన్లో తొలిసారి తెరమీద సాయి సిక్స్ప్యాక్ బాడీని ఎక్స్పోజ్ చేశాడు. సాయి తండ్రిగా రావు రమేశ్ పాత్ర సెటిల్డ్ యాక్టింగ్తో ఆద్యంతం నవ్వులు కురిపిస్తుంది. అందంగా కనిపించడమే కాదు.. టిక్టాక్ పిచ్చిలో మునిగిపోయిన ఏంజిల్ అరుణగా రాశీ ఖన్నా తన పరిధి మేరకు పాత్రను పండించారు. పాటలు, కొన్ని కామెడీ సీన్లు మినహాగా హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్ లేదు. మిగతా నటులూ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. థమన్ పాటలు బావున్నాయి. క్యాచీ వర్డ్స్తో సాగే ‘ఓ బావా’ పాటను తెరకెక్కించిన విధానమూ బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్గా నిలిచింది. సినిమా స్థాయి తగ్గట్టుగా నిర్మాణ విలువలు రిచ్గా ఉన్నాయి. ఎడిటింగ్లో సినిమాకు మరింత పదును పెట్టాల్సింది. కథ ఒకింత రొటీన్గా అనిపించడం, కామెడీ సీన్లు, క్లైమాక్స్ బాగున్నా.. స్క్రీన్ప్లే అంతగా నవ్యత లేకపోవడం, సాగదీసినట్టు అనిపించడం, ఇలాంటి కథతో ఇప్పటికే శతమానం భవతి లాంటి సినిమాలు రావడం.. ఈ సినిమాను ప్రేక్షకులు మేరకు ఆదరిస్తాన్నది చూడాలి బలాలు తాత-మనవళ్ల సెంటిమెంట్ కామెడీ సీన్లు క్లైమాక్స్ సీన్లు బలహీనతలు రొటీన్ కథ, కథనాలు సాగదీసినట్టు అనిపించడం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘ప్రతిరోజూ పండగే’ మూవీ స్టిల్స్
-
పండగలా వచ్చారు
-
ప్రతి రోజూ పుట్టినరోజే
‘‘ఈ రోజుల్లో’ సినిమా ముందు వరకూ సినిమా తీయడమే నా లక్ష్యం. ఆ సినిమాతో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత నుంచి వచ్చిన అవకాశాలను నా శక్తి మేరకు సద్వినియోగం చేసుకుంటున్నాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాల్లో తన ప్రయాణం గురించి మారుతి పంచుకున్న విశేషాలు... ► ‘ఈరోజుల్లో’ సమయంలో నా స్కిల్ని నమ్మడానికి ఒక డీవీడీలా అయినా ఆ సినిమా ఉంటుంది అనుకున్నాను. ఆ తర్వాత మనల్ని నమ్మి నిర్మాతలు డబ్బులు పెడితే చాలనిపించింది. ఆ తర్వాత కొంచెం ఎక్కువ పారితోషికం వస్తే బావుండు అనిపించింది. ఇప్పుడు నేను ఏ హీరోతో సినిమా చేసినా అతనికి కెరీర్ బెస్ట్ సినిమా ఇవ్వాలి అనుకుంటున్నాను. ► ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా నేను చేస్తున్న ‘ప్రతి రోజూ పండగే’ సినిమా విషయానికి వస్తే చాలా తక్కువ రోజుల్లో రాసిన కథ ఇది. చాలా నిజాయతీ ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ కథ. కుటుంబ ప్రేక్షకులకు 100 శాతం కనెక్ట్ అవుతుంది. కథ వినగానే తేజు చాలా ఎగ్జయిట్ అయ్యాడు. సమాజానికి అద్దం పట్టేలా కథ ఉంటుంది. మనల్ని మనం నిలదీసుకునేలా ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్లో ‘ఈరోజుల్లో, బస్స్టాప్’ సినిమాల్లో కూడా సొసైటీలో ఏం జరుగుతుందో అదే చూపించాను. ► మనం పుట్టినప్పటి నుంచి ప్రతి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. మరి చావుని ఎందుకు సెలబ్రేట్ చేసుకోం? జీవితంలో వచ్చే చివరి వేడుక చావు. దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి.. వయసు పైబడుతున్న వాళ్లకు బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ చుట్టూ ‘ప్రతి రోజూ పండగే’ సినిమా ఉంటుంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా రాలేదు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతిరోజూ పుట్టినరోజులానే అనిపించింది. సెట్లో ప్రతి రోజూ 18–20 మంది ఆర్టిస్ట్లు ఉండేవారు. ప్రతిరోజూ పండగలానే గడిచిపోయింది. ► ప్రస్తుతం వస్తున్న చిన్న సినిమాల్లో ఎక్కువ శాతం వల్గారిటీనే టార్గెట్ చేసి ఆడియన్స్ను రప్పించాలనుకుంటున్నారు. నా తొలి సినిమాల్లో నేనూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టాను. అదే సినిమాను నడిపించదు. ► మారుతి టాకీస్ బ్యానర్లో చిన్న సినిమాలు ఆపేశాను. సినిమా తీస్తున్నప్పుడు మన పూర్తి శ్రద్ధ అందులోనే పెట్టాలి. అలా వీలు కానప్పుడు సినిమా చేయకూడదు. అందుకే జీఏ2, యూవీ బ్యానర్లతో కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నాను. ‘మహానుభావుడు’ సినిమా హిందీ రీమేక్ చర్చలు జరుగుతున్నాయి. నేనే దర్శకత్వం వహించవచ్చు.