radhika
-
రెండో విడత మెడికల్ పీజీ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ రెండో దశ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం కేటాయించింది. సీట్లు పొందిన వైద్యులు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రతి కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఇద్దరు లేదా ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీలను ఏర్పాటుచేసి ఆయా కాలేజీల్లో చేరే వైద్యుల ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సూచించారు. ముఖ్యంగా స్థానికత, రిజర్వేషన్ల వారీగా నీట్ కటాఫ్ స్కోర్ను పరిశీలించాలని పేర్కొన్నారు. -
ఇంటింటికి సౌర సిరులు
మనకు సూర్యుడున్నాడు.వద్దన్నా రోజూ ఉదయిస్తాడు.సిస్టమ్ ఉంటే పవర్ఫుల్గా పనిచేస్తాడు.కరెంట్ కష్టాలకు చెల్లు చీటి ఇస్తాడు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఘనంగా 75 ఏళ్ల ఉత్సవాలను కూడా చేసుకున్నాం. కానీ ఇప్పటికీ దేశంలో కరెంటు దీపం వెలగని గ్రామాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోని పాడేరు, చుట్టుపక్కల గ్రామాలు కూడా. ఇలాంటి గ్రామాల్లో వెలుగులు నింపారు ఈ హైదరాబాద్ ఇంజనీర్. వాహనం వెళ్లడానికి దారి లేని పాడేరు కొండలను కాలినడకన చుట్టి వచ్చిన రాధికా చౌదరి అక్కడి యాభై గ్రామాల్లో సౌరశక్తితో దీపాలు వెలిగించారు. కోటి ఇళ్లకు సౌర వెలుగులను అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆమె నాలుగు లక్షల ఇళ్లకు సర్వీస్ అందించారు. సోలార్ ఎనర్జీలో కెరీర్ని నిర్మించుకున్న రాధిక... పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా లబ్ది పొందమని సూచిస్తున్నారు.మూడు తర్వాత బయటకు రారుపాడేరు కొండల్లో నివసించే ఆదివాసీలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బయటకు రారు. బయటకు వెళ్లిన వాళ్లు సూర్యుడు అస్తమించేలోపే తిరిగి ఇల్లు చేరాలి కాబట్టి మధ్యాహ్నం మూడు తర్వాత ఇల్లు కదలేవాళ్లు కాదు. అలాంటి వాళ్లకు సౌరశక్తితో దీపం వెలుతురును చూశారు. మన పాడేరు వాసులే కాదు, కశ్మీర్లోయలోని లధాక్, లేప్రాంతాలు కూడా సౌర వెలుగును చూశాయి. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ జిల్లాలతో సహా మొత్తం 27 రాష్ట్రాల్లో 50 పట్టణాల్లో సేవలు అందించారామె. సోలార్ ఉమన్రాధికకు యూఎస్లో ఎమ్ఎస్ న్యూక్లియర్ ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ వచ్చింది. సోలార్ పవర్తో శాటిలైట్లను పనిచేయించడం అనే అంశంలో కోర్సు చేయడానికి నాసా స్పాన్సర్ చేసింది. యూఎస్లో కొంతకాలం విండ్ ఎనర్జీలో ఉద్యోగం, మరికొన్నేళ్లు స్వీడిష్ కంపెనీకి పని చేశారామె. ఆల్టర్నేటివ్ ఎనర్జీ సెక్టార్లో అడుగు పెట్టడం నుంచి సోలార్ పవర్ విభాగంలో పని చేయడంలో ఆసక్తి పెంచుకున్నారు రాధిక. ఇండియాలో సర్వీస్ ఇచ్చే అవకాశం రాగానే 2008లో ఇండియాకి వచ్చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు సోలార్ ఎనర్జీలో పని చేసిన సౌరవ్తో కలిసి ఫ్రేయర్ ఎనర్జీ ప్రారంభించారు. ‘‘నలుగురు వ్యక్తులం, ఓ చిన్న గది. ఆరు నెలలు జీతం తీసుకోలేదు. ఆ తర్వాత కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని విస్తరించాం. ఇప్పుడు 450 మంది ఉద్యోగులతో పని చేస్తోంది మా సంస్థ’’ అన్నారామె. మనదేశంలో సోలార్ ఎనర్జీ విభాగంలో ఇంత భారీ స్థాయిలో సర్వీస్ అందిస్తున్న ఏకైక మహిళ రాధిక. ఏ వ్యాపారానికైనా ఇండియా చాలా పెద్ద మార్కెట్. కాబట్టి ఇండియా మొత్తాన్ని కవర్ చేయాలన్న కేంద్రప్రభుత్వం విధానాలతో కలిసి పనిచేస్తూ దేశాన్ని సౌరవెలుగులతో నింపడమే ప్రస్తుతానికి ఉన్న ఆలోచన’’ అన్నారామె. ప్రత్యామ్నాయం ఇదిబొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి బొగ్గు గనుల మీద ఆధారపడడం తగ్గించి ఆల్టర్నేటివ్ ఎనర్జీని వినియోగంలోకి తెచ్చుకోవాలి. విండ్ పవర్ అనేది వ్యవస్థలు చేపట్టాల్సిందే కానీ వ్యక్తిగా చేయగలిగిన పని కాదు. ఇక మిగిలింది సోలార్ పవర్. సౌరశక్తిని వినియోగించుకోవడం సాధ్యమే. నిజమే... కానీ ఒక ఇంటికి సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? దాదాపు లక్ష అవుతుంది. సగటు మధ్య తరగతి నుంచి ‘అమ్మో ఒక్కసారిగా అంత ఖర్చా మా వల్ల కాదు’ అనే సమాధానమే వస్తుంది. అలాంటి వాళ్లకు రాధిక ఇచ్చే వివరణే అసలైన సమాధానం.నాలుగేళ్ల్ల బిల్ కడితే ఇరవై ఏళ్లు ఫ్రీ పవర్ సోలార్ సిస్టమ్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే పాతికేళ్లు పని చేస్తుంది. నెలకు రెండువేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే ఇంటికి రెండు కిలోవాట్ల కెపాసిటీ ΄్లాంట్ అవసరమవుతుంది. దాని ఖర్చు లక్షా నలభై వేలవుతుంది. ప్రభుత్వం నుంచి 60 వేల సబ్సిడీ వస్తుంది. వినియోగదారుడి ఖర్చు 80 వేలు. ఏడాదికి 24 వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వాళ్లకు నాలుగేళ్లలోపు ఖర్చు మొత్తం వెనక్కి వచ్చినట్లే. ఇక కనీసంగా ఇరవై ఏళ్లు సోలార్ పవర్ని ఫ్రీగా పొందవచ్చు. సోలార్ పవర్ను పరిశ్రమలకు కూడా విస్తరిస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గుతుంది.– రాధికా చౌదరి,కో ఫౌండర్, ఫ్రేయర్ ఎనర్జీ– వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోహనాచారి -
టిల్లు గాని 'రాధిక'.. ఇప్పుడేమో యమ హాట్గా! (ఫొటోలు)
-
రాధికా మర్చంట్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అనంత్ పెళ్లిలో హైలెట్గా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రూచ్..ఆ డిజైన్లోనే ఎందుకంటే..!
ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో వాళ్లు ధరించే దుస్తలు దగ్గర నుంచి డ్రస్లు, కార్లు అన్ని హైలెట్గా నిలిచాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే..ఆ వివాహ వేడుకలో అంబానీలంతా పైజామకు ధరించిన ఏనుగు ఆకారపు డైమండ్ పతకం అత్యంత హైలెట్గా నిలిచింది. ముఖేశ్తో సహా అనంత్, ఆకాశ్ అందరూ ఈ ఆకారపు ఆభరణాన్నే ధరించారు. దీని వెనుక దాగున్న ఆసక్తికర స్టోరీ ఏంటని అక్కడున్న వాళ్లందరూ చర్చించుకున్నారు. ఎందుకిలా వారంతా ఆ జంతువు ఆకృతిలో డిజైన్ చేసిన ఆభరణం ధరించారంటే..ఈ ఆభరణాన్ని కాంతిలాల్ ఛోటాలాల రూపొందించారు. అనంత్ అమిత జంతు ప్రేమికుడు. అతని వెంచర్ వంతారాలో వన్యప్రాణులు సంరక్షణ కోసం అనంత్ ఎంతగానో కేర్ తీసుకుంటాడు. అందుకు నిదర్శనంగా ఇలా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రోచ్లను సదరు ఆభరణాల వ్యాపారులు తయారు చేశారు. నీతా అంబానీ సూచన మేరకు ఇలా అంబానీ కుటుంబంలోని మగవాళ్లంతా ధరించేలా ఏనుగు ఆకారపు ఆభరణాలను రూపొందించారట. ఈ పతకం జామ్నగర్లోని వంటరా వద్ద వన్య ప్రాణుల సంరక్షణ కోసం అనంత్ చేస్తున్న కృషికి గుర్తుగా ఇలాంటి వజ్రాలతో రూపొందించిన ఏనుగు ఆకారపు బ్రోచెస్ తయారు చేసినట్లు ఆభరణ వ్యాపారులు చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఆభరణాన్ని రూపొందించడంతో నీతా కూడా తమకు సహకారం అందించినట్లు తెలిపారు. అనంత్కి మాత్రమే గాక ఆమె మనవడికి ఏనుగులంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇక్కడ అంబానీలు ధరించే బ్రూచ్ గంభీరమైన అరణ్యాన్ని ప్రదర్శించేలా పచ్చలు, వజ్రాలతో ఏనుగు ఆకృతిలో ఈ ఆభరణాన్ని అందంగా తీర్చిదిద్దారు. View this post on Instagram A post shared by Kantilal Chhotalal (@kantilalchhotalal)(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?) -
అనంత్ రాధికల పెళ్లిలో లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్-రాధికల వివాహ వేడుకులు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఎందరో ప్రుముఖులు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు, సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ఈ వేడుకకు విచ్చేశారు. ఈ వేడుకలో కేవలం సెలబ్రెటీలు, సినీ ప్రముఖులకు మాత్రమే గాదు తమ కుటుంబానికి సేవ చేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ పిలచింది అంబానీ కుటుంబం. అనంత్ రాధికల వివాహంలో బాగా హైలెట్గా నిలిచింది లలితా డిసిల్వా. అనంత్ పెళ్లికి వచ్చిన వారంలా ఈ లలితా డిసిల్వా గురించి మాట్లాడుకున్నారు. చెప్పాలంటే ఆ వివాహంలో ఆమెనే హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. View this post on Instagram A post shared by Lalita Dsilva (@lalitadsilva2965)లలితా డిసిల్వా కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ల కుమారులు తైమూర్, జెహ్ల సంరక్షణ చూచుకునే నానీ. ఆమె అనంత్ పెళ్లిలో సందడి చేయడం ఏంటని అనుకోకండి. ఎందుకంటే..? ఆమె ఒకప్పుడూ అనంత్ బాల్యంలో అతడి సంరక్షణ బాధ్యతలు చూసుకున్న నానీనే లలితా డిసిల్వా. ఇన్నేళ్లు గడిచిపోయినా..అంబానీ కుటుంబం తనను గుర్తించుకుని మరీ ఇలా అనంత్ రాధికల పెళ్లికి పిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నాడు అనంత్ బాధ్యతలను చూసుకున్న ఫోటోలను కూడా షేర్ చేశారు. View this post on Instagram A post shared by Lalita Dsilva (@lalitadsilva2965) అనంత్ బాబు, అంబానీ కుటుంబం తన జీవితంలోకి తెచ్చిన ఆనందం, ప్రేమలను ఎన్నటికీ మర్చిపోలేను. అతను చాలామంచి అబ్బాయి అని అన్నారు. అతను ఈ గొప్ప వేడుకతో సంతోషకరమైన వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న అనంత్కి శుభాకాంక్షలు అని పోస్ట్లో పేర్కొన్నారు. దేవుడు ఈ జంటను తప్పక ఆశీర్వదిస్తారు అని అన్నారు. ఆమె ఇప్పుడూ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె క్లిన్ కారాకు నానీ కూడా. ఆమె ఈ నేపథ్యంలో తాను పనిచేసిన సెలబ్రెటీ కుటుంబాలతో కలిసి దిగిన ఫోటోలను సైతం షేర్ చేసింది.(చదవండి: 'లావెండర్ వివాహం' అంటే..? చాలామంది దీన్నే ఎంచుకోవడానికి రీజన్..?) -
రాధిక మర్చంట్ 'విదాయి'వేడుక..భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహం చాలా లగ్జరీయస్గా జరిగిన సంగతి తెలిసిందే. వివాహ తంతులో భాగంగా జరిగే అప్పగింతల కార్యక్రమం ఎంతటి ధనవంతురాలైన కోడలుగా వేరే ఇంట అడుగుపెట్టే వేళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఇక ఈ వివాహతంతు తర్వాత నవ వధువు తను పుట్టిన చోటును వెళ్లిపోతున్నానన్న ఆలోచన తట్టుకోలేకపోతుంది. అలాంటి భావోద్వేగ సమయంలో ఆమెను చూస్తున్న వాళ్లు సైతం కన్నీళ్లుపెట్టుకుంటారు. అలాంటి తంతే అనంత రాధికల వివాహానంతరం సాగింది. దీన్ని వాళ్లు విదాయి వేడుక అంటారు. కోడలు రాధికా మర్చంట్ విదాయి వేడుకలో భాగంగా తనవాళ్లకు వీడ్కోలు పలుకుతూ కన్నీళ్లుపెట్టుకుంటున్న దృశ్యాన్ని చూసి మామగారు ముఖేష్ అంబానీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సున్నితమైన ఘట్టంలో రాధిక కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే అనంత్ ఓదార్చే ప్రయత్నం చేస్తుండగా..ఆ తంతుని చూసి ముఖేష్ కూడా చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన తన కోడళ్లను చాలా ప్రేమానురాగాలో చూసుకుంటారు అనేందుకు ఈ ఘట్టమే ఉదాహరణ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఏ ఆడపిల్లకైన జీవితంలో తప్పక ఎదురై ఈ ఘట్టం కంటతడి పెట్టించేలా చేస్తుంది కదూ. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: వింబుల్డన్ నేపథ్య చీరలో కంటెంట్ క్రియేటర్..!) -
అనంత్ రాధిక వెడ్డింగ్: మెనూలో ఏకంగా పది లక్షలకు పైగా వెరైటీలు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికాల వివాహం ఇవాళే(జూలై 12న) అంగరంగ వైభవోపేతంగా జరుగుతోంది. ఓ పక్క పెళ్లి కోలాహాలంతో వేడుకులు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈ వేడుకలో సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయనాయకులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఆ ఆతిధులకు అందించే ఆతిథ్య మెనూలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయంటే..ఈ విలాసవంతమైన పెళ్లి మెనూలో అతిథుల కోసం దాదాపు 10 లక్షలకు పైగా వంటకాలు సిద్ధమవుతున్నాయి. టిక్కీ, వడపావో, టోమాటో చాట్, పాలక్ చాట్, పూరీ, గట్టేకి సబ్జీ, పనీర్ కి సబ్జీ, రైతా, వెజ్ పులావ్, ధోక్లా వంటి వివిధ రాష్ట్రాల వంటకాలు కూడా ఉన్నాయి. ఈ వంటకాల్లో ఇండోర్ ఫేమస్ గరడు చాట్ కూడా మెనూలో భాగం కావడం విశేషం. గరడు చాట్ అంటే..?కర్ర పెండలంతో చేసే ఒక విధమైన చాట్. ఇది ఇండోర్లో బాగా ఫేమస్. అక్కడ ఈ గరడు చాట్ తోపాటు షకర్జంద్ చాట్కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంతకమునుపు ఇటలీలో క్రూయిజ్లో జరిగిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 1200 మంది అతిథులు హాజరు కాగా, అప్పటి మెనూలో వివిధ దేశాల రెసీపీలతో సహా మొత్తం 40 వెరైటీలు ఉన్నాయి. ఇక ఇవాళ జరుగుతున్న వివాహ ఈవెంట్లో మరింత గ్రాండ్గా వివాహ మెనూ ఉండొచ్చు.(చదవండి: రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్గా ఉన్న నీతా లుక్..!) -
రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్గా ఉన్న నీతా లుక్..!
ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి కోలాహలంతో సందడిగా ఉంది. రోజుకో ఈవెంట్లో కుటుబసభ్యులంతా కళ్లు చెదిరే ష్యాషన్ డిజైనర్ వేర్లతో అలరిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం చాలా వేడుకగా జరుగుతోంది. అందులో భాగంగా అనంత్ రాధికల శివశక్తి వేడుక జరిగింది. ఈ వేడుకలో నీతా ధరించిన లెహంగా మిస్మరైజ్ చేస్తోంది. చక్కటి రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో నీతా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిసిపోతోంది. ఆ గ్రాండ్ లెహంగాకి తగ్గట్టుగా ఆమె ధరించిన పెద్ద కుందన్ నెక్లెస్ సెట్ మిరుమిట్లు గొలిపే కాంతితో ఆమె ముఖ వర్చస్సు మరింత అందంగా కనిపిస్తోంది. అబు జానీ సందీప్ ఖోస్టో డిజైన్ చేసిన స్పెషల్ లెహంగాలో నీతా చాలా అందంగా కనిపించింది. ఆ లెహంగా..చిలుక ఆకుపచ్చ స్కర్ట్, పైన రిచ్ బ్లూ దుప్పట దానిపై చేతితో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్, మిర్రర్లతో కూడిన జరీ వర్క్తో అందంగా తీర్చిదిద్దారు. నీతా ధరించిన లెహంగా మంచి రిచ్ లుక్లో ఉండగా, ముఖ్యంగా ఆమె నెక్కి ధరించిన కుందనపు నగ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చెవులకు సైతం పెద్ద కుందనాలతో ఉన్న చెవిపోగులనే ధరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, అనంత్ రాధికల పెళ్లి జూలై 12న అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: అనంత్ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్ హెయిర్ స్టైల్లో ఇషా..!) -
అనంత్ అంబానీ హల్దీ వేడుక: 150 ఏళ్ల నాటి హైదరాబాదీ వస్త్రధారణలో నీతా..!
ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంగీత్ కార్యక్రమంలో అంబానీ కుటుంబ సభ్యుల వస్త్రధారణ, నగలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. సోమవారం జరిగిన హల్దీ వేడుకలో నీతా, శ్లోకామెహతా, ఇషా తమదైన డిజైనర్వేర్ దుస్తులతో మెరిశారు. ఇషా,శ్లోకా రంగురంగుల లెహంగాలతో అలరించగా..నీతా వారిద్దర్ని తలదన్నేలా సరికొత్త లుక్లో కనిపించారు. అదికూడా మన హైదరాబాద్కు చెందిన 150 ఏళ్ల చౌగోషియ సంప్రదాయ దుస్తులతో తళుక్కుమన్నారు. ఇది అత్యంత అరుదైన హైదరాబాద్ కుర్తా. దీనికి ఖాదా దుప్పటా చీర మాదిరిగా అతిపెద్దగా వస్తుంది. చెప్పాలంటే 150 ఏళ్ల నాటి దుస్తుల శైలి. హైదరాబాదీ ముస్లీం మహిళలు తమ నికాహ్ లేదా వివాహ వేడుకల సమయంలో ఈవిధమైన దుస్తులను ధరిస్తారు. దీని మూలాలు 17వ శతాబ్దంలో మొఘల్ శకంలో ఉద్భవించాయి. ఈ చారిత్రాత్మక సంప్రదాయాన్ని హైదరాబాద్లో రాజవంశస్థులైన రాణి, బేగంలు అనుసరించేవారు. అలనాటి సంప్రదాయ వస్త్రధారణ శైలి ఫ్యాషన్ నుంచి బయటపడదని మరోసారి తేటతెల్లమయ్యింది. ఏళ్ల నాటి ముస్లిం రాణుల సంప్రదాయ వస్త్రధారణతో సరికొత్త ట్రెండ్ని సెట్ చేసింది నీతా. అందుకు తగ్గట్టు అద్భుతమైన ఆభరణాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆమె చెవులకు ధరించిన కమ్మలు మంత్రముగ్దుల్ని చేసేలా ఉండగా, ఆ డిజైనర్ వేర్కి మ్యాచింగ్గా ధరించిన బ్రాస్లెట్, బిందీ తదితరాలన్ని ఆమె రూపాన్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేశాయి. చివరిగా స్టైలిష్ స్ట్రాపీ హీల్స్తో తన రాణి మాదిరి లుక్ని తెప్పించింది. పైగా ముఖానికి లైట్ మేకప్ని ఎంచుకున్నారు. మొత్తం ఈ హల్దీ వేడుకలో ఆమె ఏళ్ల నాటి సంప్రదాయాన్ని సరికొత్తగా గుర్తు చేశారు ఆమె. ముఖ్యంగా మన హైదరాబాదీ సంప్రదాయన్ని అంబానీలు అనుసరించడం విశేషం. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!) -
అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో మొదటగా జరిగిన సంగీత్ కార్యక్రమం నీతా ధరించిన ఆభరణాలు, వస్త్రాధారణ హైలెట్గా నిలిచింది. ఇక తర్వాత జరుగుతున్న హల్దీ వేడుక చాల కలర్ఫుల్గా సాగింది. ఈ హల్దీ వేడుకలో ఇషా పిరమల్, శ్లోకా మెహతా రంగరంగుల లెహంగాలతో స్టన్నింగ్ లుక్తో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో కాబోయే పెళ్లి కూతరు రాధిక ఆమె సోదరి సాంప్రదాయ వస్త్రధారణతో కళ్యాణ శోభను తీసుకొచ్చారు. ఈ గ్రాండ్ వేడుకలో శ్లోకా, అనామికా ఖన్నా డిజైనర్ వేర్ లెహంగాను ధరించింది. ఆమె ఎరుపు, నీలం, ఆకుపచ్చ, బంగారు రంగు వంటి మరెన్నో రంగులతో కూడిన శక్తివంతమైన లెహంగా సెట్ను ధరించింది. దానికి తగినట్టుగా చిలుక ఆకుపచ్చ స్కర్ట్ దానిపై పూల ఎంబ్రాయిడరీని అందంగా తీర్చిదిద్దారు. ఇక ఇషా మల్టీకలర్ కలర్ లెహంగాను ధరించింది. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ టోరాని దిల్ రంగ్ జీవా లెహంగా సెట్తో అలరించింది. ఇది ఇండో వెస్టట్రన్ టచ్తో కూడిన సరికొత్త డిజైనర్ వేర్ లెహంగా. దీనికి రా సిల్క్తో రూపొందించిన టాసెల్ అలంకారాలు హైలెట్గా ఉండగా, అందమైన నెక్లైన్తో కూడిన ప్రత్యేకమైన బ్లౌజ్ మరింత అకర్షణీయంగా ఉంది. ఈ లెహంగా ధర ఏకంగా రూ. 135,500/-.(చదవండి: అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!) -
వెర్సాస్ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా..!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఓ రేంజ్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఇంటిలో జరిగే ఆఖరి వివాహం కావడంతో మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల లగ్జరీ క్రూయిజ్లో ఏకంగా 800ల మంది అతిథుల సమక్షంలో అనంత్-రాధికల రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన అంబానీ కుటుంబ సభ్యుల వేషాధారణకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ వేడుకల్లో వధువు ధరించిన ప్రతి డ్రెస్ హైలెట్గా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా రాధిక ధరించిన అనంత్ లవ్ లెటర్ని ముద్రించిన గౌను అత్యంత హాట్టాపిక్గా మారింది. ఇక ఈ వేడుకలో ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా సైతం ప్రిన్స్ రేంజ్లో తన వేషాధారణతో ఆకట్టుకుంది. ఈ వేడుకలో రాధికాకు ఏ మాత్రం తగ్గకుండా ఆమె ఆహార్యం ఉంది. ముఖ్యంగా ఆమె ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ధరించిన డ్రెస్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఆమె నీలం- బంగారు డ్రెస్లో యువరాణిలో మెరిసింది శ్లోకా మెహతా. ఆమె ఈ వేడుకలో కోసం ధరించిన వెర్సాస్ బ్రాండ్ గౌనుని ఎంచుకుంది. ఈ గౌను 2018 మెట్ గాలో జిగి హడిద్ ఫ్యాషన్ శైలిని అనుకరించింది. ఈ గైనును రూపొందించింది స్టైలిస్ట్ దియా మెహతా జటియా. ఆమె ఈ వెర్సాస్ గౌను శ్లోకా మెహతా కోసం ఎందుకు రూపొందించారో వెల్లడించింది. శ్లోకా మెహతా ఇద్దరు పిల్లల తల్లి. మాతృత్వం రీత్యా శరీరాకృతి మారడం సహజం. అది బయటకు కనిపించకుండా ఉండేలా ఆమెలో ఉన్న యువరాణి లుక్ని వెలికి తీసేలా ప్రజెంట్ చేసేందుకు ఈ వెర్సాస్ గౌనుని రూపొందించామని చెప్పారు. మెట్ గాలాలో ఆకర్షణగా కనిపించిన జిగి హడిడ్ రూపాన్ని మెహాతాలో కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసేందుకు ఇలా నీలం బంగారు గౌనుని డిజైన్ చేశామని అన్నారు. శ్లోకా ఈ గౌనుకి తగ్గట్టుగా రోజీ మేకప్, డైమండ్ జ్యువెలరీని ధరించింది. ఈ గౌనులో శ్లోకా యువరాణి రేంజ్ స్టన్నింగ్ లుక్తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: ఒత్తిడికి గరైనప్పుడు జంక్ ఫుడ్ తినడకూడదా? పరిశోధన ఏం చెబుతోందంటే..) -
ట్రెడిషనల్ లుక్లో ‘రాధిక’ తిరుగే లేదిక (ఫొటోలు)
-
పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం..
మనలో చాలా మంది పక్షులను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువశాతం తమ ఆహ్లాదం కోసమే. నిజానికి పక్షులను ఆదరించాల్సింది మన ఆహ్లాదం కోసం కాదు, వాటి ఆనందం కోసం దగ్గరకు తీయాలి. వాటి రెక్కలు విరిచి పంజరంలో పెట్టి మనం చూస్తూ ఆనందించడం హేయమైన చర్య. స్వేచ్ఛగా ఎగరడం వాటి సహజ లక్షణం. అది వాటికి ప్రకృతి ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం మనకు లేదు... అంటున్నారు మహారాష్ట్ర, పుణేలో నివసిస్తున్న రాధికా సోనావానే. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న రాధిక పక్షి సంరక్షకురాలిగా మారిన క్రమాన్ని ఆమె చాలా ఇష్టంగా వివరిస్తారు.‘‘ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా పూనాలో ఉన్నాం. మా స్వస్థలం ఔరంగాబాద్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కచెప్పలేను. పక్షుల మీద మమకారం ఏర్పడింది. నేను బర్డ్ లవర్ని బర్డ్ వాచర్ని మాత్రమే అనుకున్నాను. కానీ ఏ మాత్రం ముందస్తు ప్రణాళికలు లేకుండా అనుకోకుండా పక్షి సంరక్షకురాలినయ్యాను. పెళ్లి తర్వాత నా నివాసం ఔరంగాబాద్లోనే ఒక ఫ్లాట్లోకి మారింది.మా పొరుగింట్లో ఓ పెద్దాయన బాల్కనీలో బర్డ్ ఫీడర్, ఒక గిన్నెలో నీరు పెట్టడం చూసిన తర్వాత నాకూ ఆలాగే చేయాలనిపించింది. పుణేకి బదిలీ అయిన తర్వాత కూడా కొనసాగింది. ఇప్పుడు మా ఇంటి గార్డెన్ పక్షుల విహార కేంద్రమైంది. నాకు తోచిన గింజలు పెట్టి సరిపెట్టకుండా ఏ పక్షికి ఏమిఇష్టమో తెలుసుకోవడానికి పక్షుల జీవనశైలిని అధ్యయనం చేశాను. రామ చిలుకలకు వేరుశనగ పప్పులు ఇష్టం. గోరువంకలు అరటి పండు తింటాయి. రామ చిలుక ముక్కు పెద్దది.గోరువంక, పిచ్చుకల ముక్కులు చిన్నవి. ఆ సంగతి దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్సులు డిజైన్ చేయించాను. నేను పెట్టిన ఆహారాన్ని అవి ఇష్టంగా తింటున్నాయా లేదా, నేను చదివింది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి బాల్కనీలో కూర్చుని శ్రద్ధగా గమనించేదాన్ని. అరటి పండు ముక్కలను చూడగానే గోరువంకలు సంతోషంగా పాటలు పాడడం మొదలుపెడతాయి. పాట పూర్తయిన తర్వాత తింటాయి. టైయిలర్ బర్డ్ అయితే పత్తి దూదిని చూడగానే రాగాలు మొదలుపెడుతుంది.గూడు కట్టుకోవడానికి పత్తి కనిపిస్తే దాని ఆనందానికి అవధులు ఉండవు. మనం సాధారణంగా కాకులను ఇష్టపడం. కానీ అవి చాలా హుందాగా వ్యవహరిస్తాయి. కాకులు, పిచుకలు, చిలుకలు, గోరువంకలు ఇతరులకు హాని కలిగించవు. పావురాలు అలా కాదు. వాటి ఆహారపు అలవాట్లు కూడా అంత సున్నితంగా ఏమీ ఉండవు. తమ ఆహారంలో ఇతరులను ముక్కు పెట్టనివ్వవు, ఇతరుల ఆహారాన్ని కూడా తామే తినేయాలన్నంత అత్యాశ వాటిది. పక్షి స్వేచ్ఛాజీవి..పెట్ డాగ్లాగా యజమానితో అనుబంధం పెంచుకోవడం పక్షుల్లో ఉండదు. స్వేచ్ఛగా విహరిస్తూ అనేక ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఒక ప్రదేశంతో కానీ వ్యక్తితో కానీ అనుబంధం పెంచుకోవు. మా ఇంటికి వచ్చే నా అతిథుల్లో చిలుకలే ఎక్కువ. అలెగ్జాండ్రియన్ ΄్యారట్, ఇండియన్ రింగ్నెక్ ΄్యారట్లు తరచూ కనిపిస్తుంటాయి. సన్బర్డ్, వీవర్ బర్డ్ కూడా వస్తుంటాయి. కాలం మారేకొద్దీ అవి అప్పటి వరకు ఉన్న ప్రదేశాలను వదిలి తమకు అనువైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటాయి.వాయు కాలుష్యం, వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా పక్షుల వలసలకు కారణమే. సెల్ ఫోన్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పక్షులు కంటి చూపును కోల్పోతున్నాయి. దాంతో అవి తమకు సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఎటుపోతున్నాయో తెలియడం లేదు. కరవు, అధిక వర్షాలు, యాసిడ్ వర్షాలు, అడవులలో చెట్లు నరకడం, మంటలు వ్యాప్తించడం... వాటికి ఎదురయ్యే ప్రమాదాలు. పక్షులు అడవిలో జీవించినంత ధైర్యంగా మనుషుల మధ్య జీవించలేవు.వాటికి మనుషులంటే భయం. ఆ భయాన్ని వదిలించి మచ్చిక చేసుకోవాలంటే వాటికి ఆహారాన్ని అందుబాటులో ఉంచడం ఒక్కటే మార్గం. ఆహారం కోసం ధైర్యం చేస్తాయి, క్రమంగా మన మీద నమ్మకం కలిగిన తర్వాత మన ఇంటిని తమ ఇంటిలాగా భావిస్తాయి. మా గార్డెన్కి రోజూ నలభై నుంచి యాభై పక్షుల వరకు వస్తుంటాయి. వాటి కోసం ఇంట్లో వంటగది, హాలు, బాల్కనీల్లో పక్షుల కోసం నీటి పాత్రలు పెట్టాను. దాహం వేసినప్పుడు నేరుగా దగ్గరలో ఉన్న నీటి పాత్ర దగ్గరకు వెళ్లిపోతాయి. పక్షులు మనతో మాట్లాడతాయి.రోజూ మా ఇంటి ఆవరణలో వినిపించే కిచకిచలన్నీ అవి నాకు చెప్పే కబుర్లే. కరోనా సమయంలో నా టైమ్ అంతా వీటి కోసమే కేటాయించాను. నన్ను నిత్య చైతన్యంగా ఉంచాయవి. నిజానికి పక్షి ప్రేమికులెవ్వరూ పక్షులను పంజరంలో బంధించరు. తమ సంతోషం కోసం పక్షులను పెంచే స్వార్థజీవులే ఆ పని చేస్తారు. దయచేసి పక్షులను బంధించవద్దు. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. చేతనైతే రోజుకు గుప్పెడు గింజలు, ఒక పండు పెట్టండి’’ అంటూ పక్షుల గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతారు రాధిక.ఇవి చదవండి: ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్గా..! -
Sara Ali Khan: అంబానీ ప్రీవెడ్డింగ్.. ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కుర్ర హీరోయిన్ (ఫోటోలు)
-
అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్: ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)
-
Major Radhika Sen: కాంగోలో శాంతిదూత
భారత ఆర్మీకి చెందిన మేజర్ రాధికా సేన్కు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరానికి గాను ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. ప్రతిష్టాత్మక ఈ అవార్డు కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింస చోటు చేసుకోకుండా రాధికా సేన్ చూపిన శాంతి ప్రబోధానికి, ప్రచారానికి నిదర్శనం. రాధికాసేన్ పరిచయం.తు΄ాకీ పట్టుకొని శాంతి కోసం ప్రయత్నించడం జటిలమైన పని. అంతర్యుధ్ధం జరిగే దేశాల్లో బయటి దేశాల నుంచి వెళ్లి ఈ పని చేయాలంటే ్ర΄ాణాలతో చెలగాటం. కాని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని పీస్ కీపింగ్ ఫోర్స్ ఆయా దేశాలలో శాంతి కోసం ΄ోరాటం చేస్తూనే ఉంటుంది. ్ర΄ాణాలకు తెగిస్తూనే ఉంటుంది. అందుకే ఈ శాంతి దళాలలో గొప్పగా పని చేసిన వారికి ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాలలో అవార్డులు ఇస్తుంటుంది. లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పని చేసే వారికి ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ ఇస్తోంది. 2023 సంవత్సరానికి ఆ అవార్డు మన ఆర్మీ మేజర్ రాధికా సేన్కు దక్కింది.ఈ కాంగోలో ఘోరాలుమధ్య ఆఫ్రికాలో రెండు కాంగోలు ఉన్నాయి. ఒకటి ‘రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (ఆర్ఓసి), రెండు ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (డిఆర్సి). ఆఫ్రికాలో రెండవ అతి పెద్ద దేశం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఒకప్పుడు బెల్జియం వలసగా ఉన్న ఈ దేశం స్వతంత్రం ΄÷ంది ‘మొబుతు’ అనే నియంత ΄ాలనలో మగ్గింది. అతణ్ణి ప్రజలు కిందకు దించాక 1998 నుంచి అక్కడ అస్థిర ΄ాలన కొనసాగుతూ ఉంది. తరచూ అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశ తూర్పు ్ర΄ాంతాలైన ఇటురి, నార్త్ కీవోలలో రెండు సాయుధ దళాల వల్ల దాడులు జరుగుతున్నాయి. ‘ఎయిడెడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్’ అనే గ్రూప్, ‘హుతూస్’ అనే మరో గ్రూప్ తమ తమ కారణాల రీత్యా తీవ్ర హింసకు ΄ాల్పడుతుంటాయి. ఈ రెండు గ్రూపుల మధ్య సామాన్య జనం నలుగుతున్నారు. వీరిని అదుపు చేయడానికి వచ్చే సైన్యం వీరి కంటే ఎక్కువ హింసకు ΄ాల్పడుతోంది. వీటన్నింటి మధ్య కనీస ఓదార్పుగా ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు పని చేస్తున్నాయి.అత్యాచార పర్వంరిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని దాదాపు 30 లక్షల మంది స్త్రీలు, బాలికలు ఏదో ఒక మేర హింసకు, లైంగిక హింసకు లోనయ్యారు. అర్ధరాత్రి అపరాత్రి ప్రత్యర్థి గ్రూపులు దాడి చేసి స్త్రీలు, బాలికల మీద అత్యాచారాలు చేసి మగవారిని చంపేసి ΄ోతారు. ఇవి అక్కడ స్త్రీల మీద తీవ్రమైన మానసిక ప్రభావాన్ని ఏర్పరుస్తున్నాయి. అత్యాచారాల వల్ల వారిలో చాలామంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అక్కడి చిన్నపిల్లలైతే దారుణమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. ΄ûష్టికాహారం ఊసే లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాధిత స్త్రీలలో విశ్వాసం నింపుతూ వారి కోసం సమర్థంగా పని చేయడం వల్ల రాధికా సేన్ను అవార్డు వరించింది.బాధితుల కోసం దూతగా వచ్చి...ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్ రాధికా సేన్ 2023 ఏప్రిల్లో డి.ఆర్.కాంగోకు వెళ్లింది రాధికా సేన్. ‘ఇండియన్ రాపిడ్ డి΄్లాయ్మెంట్ బెటాలియన్’కు ఆమె అక్కడ కమాండర్గా పని చేసింది. అక్కడ మొదటగా ఆమె చేసిన పని తన బెటాలియన్కు కాంగో సంస్కృతిని పరిచయం చేయడం. స్త్రీల పట్ల సుహృద్భావనతో ఎలా మెలగాలో తెలియచేయడం. వారిలో ఆత్మవిశ్వాసం ఎలా కలిగించాలో చెప్పడం. రాధికా సేన్ నార్త్ కీవోలో పని చేసింది. అక్కడ స్త్రీల కోసం హెల్త్ ఎడ్యుకేషన్, ఉ΄ాధి, లింగ సమానత్వం, కుటుంబ నిర్ణయాల్లో స్త్రీ ్ర΄ాధాన్యం వంటి అంశాలలో రాధికా సేన్ వర్క్షాప్లు నిర్వహించింది. భర్తలను, పిల్లలను కోల్పోయిన స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపేలా వారితో తరచూ ఆమె సంభాషణలు నిర్వహించేది. వారు మళ్లీ పనిలో పడేలా చూసింది. హింసను సమష్టిగా ఎలా ఎదుర్కొనాలో అవగాహన కల్పించింది. కాంగో మహిళలు రాధికా సేన్ను తమలోని మనిషిగా చూశారు. ఆమె ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరస్ రాధికా సేన్కు అవార్డు ప్రకటిస్తూ ‘రాధికా సేన్ కాంగో మహిళలను గొంతెత్తేలా చేయగలిగింది. శాంతి కోసం వారు ముందుకొచ్చేలా ఉద్యుక్తుల్ని చేసింది’ అని మెచ్చుకున్నారు. మే 30 (నేడు) రాధికా సేన్కు అవార్డు బహూకరించనున్నారు. -
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అత్యున్నత గౌరవం లభించింది. యూఎన్ ఆమెను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవించింది. ఇంతకీ ఎవరా అధికారిణి?. ఆమెకు ఎందుకు యూఎన్ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అంటే.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకుగానూ భారత ఆర్మీ అధికారిణి మేజర్ రాధికా సేన్కి 2023 ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆమె యూఎన్ శాంతి పరిరక్షకురాలిగా మహిళలు, బాలికల హక్కుల కోసం చేసిన విశేషమైన కృషికి గానూ యూన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించి గౌరవించింది.ఇవాళ (మే 29) యూఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సం పురస్కరించుకుని భారత ఆర్మీ అధికారిణి రాధికా సేన్ని ఇలా అవార్డుతో సత్కరించి గౌరవించింది యూఎన్. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణ, లైంగిక హింసలకు గురవ్వుతున్న బాలికలను రక్షించేందుకు ఆమె చేసిన విశేషమైన కృషిని ఇలా అవార్డుతో గుర్తించింది. ఎవరీ రాధిక సేన్..?⇒హిమచల్ప్రదేశ్లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్లో వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. అలా సేన్ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆతర్వాత ఆమె ఏప్రిల్ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్మెంట్ బెటాలియన్తో ఎంగేజ్మెంట్ ప్లాటూన్ కమాండర్గా పనిచేశారు.⇒మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్ నిలిచారు. సేన్ కంటే ముందు, మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్లోని UN మిషన్తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్ సుమన్కి ఈ అత్యున్నత గౌరవం లభించింది. ⇒యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మోహరించిన దాదాపు 6,603 మంది భారతీయ సిబ్బందిలో సేన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తరుఫున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పనిచేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఆమె పని మహిళలు ఏకం చేసేలా..సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం. ⇒యూఎన్ ప్రకారం.. సేన్ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె కమ్యూనిటీలకు సహాయం చేస్తpూ..కమ్యూనిటీ అలర్ట్ నెట్వర్క్లను కూడా స్థాపించారు. (చదవండి: మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!) -
‘మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి’.. సీఈఓ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు
మీ జీవితం ఎలా ఉందో మీరే చూసుకోవాలి. పక్కవారి జీవితాల్లో తొంగి చూడడం ఎందుకు? అంటూ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా నేటి తరం యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా భారత్తో పాటు, ఇతర దేశాల్లో నివసించే వారిలో మానసిక ఆరోగ్యం ఓ కీలక సమస్యగా మారింది. అనేక కారణాల వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్స్ వంటి విభిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా యువతీ యువకులు పక్క వారి జీవితంపై దృష్టిపెట్టడమే అందుకు కారణం. ఎందుకంటే వారి జీవితం ఎలా ఉందో పట్టించుకోవడలేదు. కానీ ఇన్ స్ట్రాగ్రామ్లో ఇతరుల జీవితాలు వారికి మెరుగ్గా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మీకు మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా భావించడం లేదు. పైగా ఇన్స్టాగ్రామ్లో ఇతరుల జీవితాలు తమకన్నా బాగున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ ఎక్స్ వేదికా ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. -
అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
విద్యానగర్ (కరీంనగర్): ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకున్న కరీంనగర్ ఫిలిగ్రీ కళానైపుణ్యం మరోసారి తన వైభవాన్ని చాటుకుంటోంది. ఆర్థిక కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్–రాధిక వివాహ వేడుకలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్లోని పెద్దస్టార్స్ కూడా హాజరుకానున్నారు. ఈ పెళ్లికి హాజరయ్యే వీవీఐపీలకు విలువైన బహుమతులను ఇచ్చేందుకు అంబానీ కుటుంబం నిర్ణయించింది. వాటిలో కరీంనగర్ వెండి ఫిలిగ్రీ కూడా ఉన్నాయి. ఈ విలువైన ఫిలిగ్రీ గిఫ్ట్స్ డెలివరీ కోసం దాదాపు 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచి్చనట్లు కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అర్రోజు అశోక్ తెలిపారు. ఇందులో నగల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు, ఇతర త్రా వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం 400 సంవత్సరాల నాటి పురాతన కళకు ప్రోత్సాహకంగా నిలు స్తుందని వారు పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళకు 2007లో జీఐ ట్యాగ్ లభించింది. స్వచ్ఛమైన వెండిని కరిగించి.. అవసరమైన ఆకారాల్లో వస్తువులు తయా రు చేయడం, తీగలు అల్లడం ఈ కళ విశేషం. -
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
రాజస్థాన్ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రాధికా ఖేరా కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు.కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తనని వేధిస్తున్నారంటూ రాధికా ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి సైతం రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించడం తాను విమర్శలకు గురైనట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను వేధించారని, గదిలో బంధించి దుర్భాషలాడారని ఆరోపించారు. ఇదే విషయంపై పార్టీ నేతలకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో పాటు అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకున్నందుకు అనేక విమర్శలు ఎదురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ యూనిట్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్పర్సన్ సుశీల్ ఆనంద్తో పాటు మరికొంత మంది తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని లేఖలో పేర్కొన్నారు -
రజతం నెగ్గిన రాధిక
బిషె్కక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్కు మూడు పతకాలు లభించాయి. రాధిక (68 కేజీలు) రజత పతకం సొంతం చేసుకోగా... శివాని పవార్ (50 కేజీలు), ప్రియా (76 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 68 కేజీల విభాగం ఫైనల్లో రాధిక 2–15తో నొనోకా ఒజాకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకాల బౌట్లలో శివాని 9–7తో ఒట్గాన్జర్గాల్ డొల్గొర్జవ్ (మంగోలియా)పై, ప్రియా 4–2తో ఎల్మీరా సిద్జికోవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. 59 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ పుష్పా యాదవ్ 8–11తో డయానా కయుమోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
అస్సలు బాధపడకండి..! వ్యాపారవేత్త రాధిక గుప్తా సలహా!
ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుట్టుకతోనే శారీరక లోపంతో పుట్టి, అనేక రకాల అవహేళనలను ఎదుర్కొంది. డెలివరీ సమయంలో చిన్న సమస్య కారణంగా రాధిక మెడ కొద్దిగా వంగింది. అంతేకాకుండా ఒక కంటిలో లోపం ఏర్పడింది. అయినా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. (పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత) పెన్సిల్వేనియాలో కంప్యూటర్సైన్స్లో పట్టభద్రురాలైన రాధిక ఉద్యోగం కోసం ప్రయత్నించగా దాదాపు 7 సార్లు రిజెక్ట్ అయిందనీ, దీంతో ఆత్మహత్య చేసు కోవాలనే ఆలోచన కూడా వచ్చిందని స్వయంగా రాధిక ఒకసారి చెప్పారు. దీంతో ఏదైనా సాధించాలనే పట్టుదలతో భర్త, స్నేహితులతో కలిసి ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించింది. కొనేళ్లకు ఈ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఆల్టర్నేటివ్ ఈక్విటీకి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా ఉన్నారు, ఆమె భర్త నలిన్ మోనిజ్. వీరికి 2022లోఒక కుమారుడుపుట్టాడు. View this post on Instagram A post shared by Radhika Gupta (@iamradhikagupta) షార్క్ ట్యాంక్ ఇండియా-3లో న్యాయనిర్ణేతగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్నారు. అంట్రప్రెన్యూర్స్ ఎకోప్రెన్యూర్స్ ఫ్యాషన్ సస్టైనబుల్ ఉండటమేకాదు అందంగా సౌకర్యవంతంగా ఉంటుంది.. అరటి, పైనాపిల్, జనపనార ఆకులు, కాండంతో డెనిమ్స్, టీ షర్టులు చీరలు రూపొందించే సంస్థలో పెట్టు బడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే మండే మోటివేషన్ అంటూఇన్స్టాలో ముఖ్యంగా ఉద్యోగం చేసే తల్లుల కోసం కొన్ని సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్బంగా తన తల్లి ఇచ్చిన విలువైన సలహాను ఆమె పంచుకున్నారు. తన చేతుల్లో తన బిడ్డను పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమె ఉద్యోగినులుగా పనిలో తలమునకలై పిల్లల గురించి, మీ గురించి పట్టించు కోలేకపోతున్నామని బాధపడుతున్నారా.. దీన్ని గుర్తుంచుకోండి అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు. మాతృత్వ బాధ్యతలతో పాటు కెరీర్ను బ్యాలెన్స్ చేయడం కష్టతరమైందే కానీ..దేనికీ బాధపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, కరియర్ను కొనసాగించా లన్నారు. ‘‘ఏ తల్లీ చెడ్డ తల్లి కాదని అమ్మ చెప్పింది. పదవారు, ధనవంతులు, విద్యావంతులు, చదువుకోనివారు, పని చేసేవారు, పని చేయకనివారు.. ఇలా ఎవరైనా అమ్మ అమ్మే.. ప్రతీ తల్లి తన బిడ్డకు మంచి చేయాలనే కోరుకుంటుంది’’ రాధిక గుప్తా అలాగే అటు తల్లి, ఇటు వ్యాపారవేత్తగా ఉంటూనే, రియాలిటీ షోలను కూడా ఎలా మేనేజ్ చేస్తున్నదీ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తాను ఎక్కడికి వెళ్లినా, ప్రెపెస కాన్ఫరెన్స్లలో కూడా కుమారుడు తనతో పాటు ఉంటాడని, షార్క్ ట్యాంక్సెట్లలో ఎక్కువ సమయం ఉంటాడని కూడా వెల్లడించా రామె. మాతృత్వం మహిళల సవాళ్లను స్వీకరించే సామర్థ్యానికి అడ్డుకోకూడదని తాను భావిస్తానన్నారు. మహిళలకు పెళ్లి, పిల్లలు తరువాత కరియర్లో బ్రేక్ వస్తుంది. ప్రసూతి సెలవు తరువాత మళ్లీ ఉద్యోగంలోకి రావడం అనేది మానసికంగా కొంత ఇబ్బంది కరమైన పరిస్థితే. పసిబిడ్డల్ని వదిలి వెళుతున్నామనే బాధ ఒకవైపు, ఉద్యోగంలో రాణించాలనే ఒక పట్టుదల ఒకవైపు వారిని స్థిరంగా ఉండనీయవు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కొంతమంది తల్లులు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. -
Swathi Muthyam@38: మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 38 వసంతాలు. మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్తో పోలిక!! ఆస్కార్స్కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్కపూర్కు చూపించడం విశ్వనాథ్కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇది విశ్వనాథ్కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్సీజన్లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
బంగారంతో లెహంగా.. అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది!
అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి. ఎక్కడ చూసినా.. అంబానీల కుటుంబ సభ్యలు ధరించిన నగలు, ఫ్యాషన్ బ్రాండ్ డ్రస్లపైన తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ మేడుకలు బాలీవుడ్ అగ్ర తారలు, ప్రముఖ పాప్ సింగర్లు తరలి వచ్చి మరీ ఆడి పాడి సందడి చేశారు. దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులంతా ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరవ్వడమే గాక భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకునేలా వస్త్రధారణతో అలరించారు. అయితే ఈ వేడుకలో నీతా అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కూతురు ఈషా అంబానీ ధరించిన లగ్జరీయస్ నగలు, చీరలు గురించి కథకథలుగా విన్నాం. అవన్నీ ఒక ఎత్తైతే నీతా అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చంట్ ధరించిన డ్రస్లు మరింత చర్చనీయాంశంగా మారాయి. కాబోయే పెళ్లి కూతురు, అందులోనూ ముఖేశ్ అంబానీ రేంజ్కి తగ్గట్టు ఆమె డ్రస్లు నగలు చాలా గ్రాండ్గా ఉంటాయి. అది కామనే. కానీ ఇలా ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసమే రాధిక మరీ ఈ రేంజ్లో డ్రస్లు డిజైన్ చేయించుకోవడమే నెట్టింట కాస్త చర్చనీయాంశమయ్యింది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ చివరి రోజున రాదిక ధరించే లెహంగాని ఏకంగా బంగారపు దారాలతో రూపొందించారట. అలాగే డ్రస్పై ధరించే దుప్పటను తయారు చేసేందుకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టిందట. దీన్ని ప్రముఖ డిజైన్ర్ మనీష్ మల్హోత్రా రూపొందించారట. అంతేగాదు ఈ కార్యక్రమానికి హాజరైన 1500 మంది సమక్షంలో వారి వివాహ బంధాన్ని చట్టబద్ధం చేసుకునేలా కాబోయే వధువరులు అనంత్ రాధికాలు తమ వివాహపత్రాలపై సంతాకాలు చేసినట్లు వోగ్ మీడియా పేర్కొంది. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: వజ్రాలు వైఢ్యూర్యాల డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!) -
Kuchipudi: మూడుతరాల నాట్యోత్సాహం
అది ఆదివారం సాయంత్రం. రవీంద్రభారతి ఆడిటోరియం. అందెలరవళి మధ్య శ్లోక ఆరంగేట్రం. కూచిపూడి సాధనలో మూడవతరం ఆమెది. పదహారేళ్ల నాట్యసాధనకు ప్రతీక ఆ అరంగేట్రం. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మొన్నటి రోజున ఆరంగేట్రం చేసిన శ్లోకారెడ్డి కూచిపూడి నాట్యసాధనను తన ఆరవ ఏట మొదలు పెట్టింది. పదకొండవ ఏట ‘బాల చైతన్య అకాడమీ అవార్డు’ అందుకుంది. నాట్యమే శ్వాసగా అడుగులు వేస్తూ గడిచిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి సీసీఆర్టీ స్కాలర్షిప్కు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నట్లు’ చెప్పారు. ఆరంగేట్రం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నా నాట్యగురువు అమ్మే. అమ్మ దీపాంజలి నాట్యసంస్థను ప్రారంభించి నాట్యంలో శిక్షణతోపాటు నాట్య ప్రదర్శనలు ఇస్తోంది. అలా నాకు ఆ ప్రదర్శనల్లో నాట్యం చేసే అవకాశం దక్కింది. గోదాకల్యాణం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవం సందర్భంగా నాట్య ప్రదర్శన, జీ ట్వంటీ సదస్సు, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్, ప్రపంచ తెలుగు మహాసభలు, రాజ్భవన్, ఖజురహో, హంపి, నిశగంధి, కింకిణి డాన్స్ ఫెస్టివల్స్, త్యాగబ్రహ్మ గానసభ, దుబాయ్లో భారత పర్యాటక రంగం ప్రదర్శన, భారత 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా టర్కీలోని ఇండియన్ ఎంబసీ నిర్వహించిన కార్యక్రమం, లెజెండరీ పర్సనాలిటీ మ్యాస్ట్రో పండిట్ బిర్జు మహారాజ్ డాన్స్ ఫెస్టివల్ ... ఇలా అమ్మతోపాటు, ఆమె ఆధ్వర్యంలో లెక్కలేనన్ని ప్రదర్శనల్లో నాట్యం చేయగలిగాను. అమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రదర్శనల్లో నేను కూడా వేదికమీద ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. శిక్షణ సమయంలో, వేదిక మీద ప్రదర్శనలిచ్చేటప్పుడు మాత్రమే గురువు. క్లాస్ నుంచి బయటకు వచ్చి ఇంట్లో అడుగుపెట్టగానే అమ్మలోని గురువు మాయమై అమ్మ బయటకు వస్తుంది. మేము ఏం తినాలి, హోమ్వర్క్ గురించి తెలుసుకుని మర్నాటి స్కూల్కి సిద్ధం చేయడంలో మునిగిపోయేది. అమ్మ బాగా గారం చేస్తుంది, కానీ నాకు నాన్న దగ్గరే ఎక్కువ చనువు. అమ్మమ్మ అడుగుజాడల్లో మా ఇంట్లో నాట్యసాధనకు అంకితమైన మూడవ తరం నాది. మా అమ్మమ్మ రాధిక, అమ్మ దీపిక, నేను. మేము ముగ్గురమూ ఒకే వేదిక మీద కనిపించడం సంతోషకరం. రుద్రమదేవి, భద్రకాళి అష్టకం, గోదాదేవి, కృష్ణలీలలు ప్రదర్శించాను. అమ్మమ్మ రవీంద్రభారతి ప్రారంభోత్సవ కార్యక్రమం(1961, మే, 11వ తేదీ) లో నాట్యప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు అదే వేదిక మీద నా ఆరంగేట్రం జరగడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్ గ్రహీత అలర్మేల్వల్లి గారు రావడం నా పూర్వజన్మ సుకృతం. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే... నాకు సమాజం పట్ల శ్రద్ధ కలగడానికి కారణం కూడా నాట్యమే. నాట్యం గొప్ప మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా పౌరాణిక, ఇతిహాసాలతోపాటు జాతీయాంశాలు, సామాజికాంశాలను కూడా సామాన్యులకు చేరవేయగలుగుతాం. ఒక కొత్త ఇతివృత్తాన్ని రూపొందించడానికి సమాజాన్ని చదువుతాం. కాబట్టి సమాజంలో ఉండే సమస్యలు అవగతమవుతాయి. వాటి మీద నాట్య రూపకాన్ని ప్రదర్శించి అంతటితో మిన్నకుండిపోవడం స్వార్థమే అవుతుంది. కళాకారులుగా మేము సమాజానికి మా వంతుగా తిరిగి ఇవ్వాలి కూడా. మన సమాజంలో సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి ఉండి కూడా ప్రోత్సాహం కరవైన వాళ్లెంతోమంది ఉన్నారు. వాళ్లలో కొందరికైనా నేను చేయగలిగిన సహాయం చేయాలనేది నా కోరిక. కోవిడ్ సమయంలో వైద్యరంగంలో పనిచేసే వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడం మీద చేసిన నాట్యరూపకం యూ ట్యూబ్లో బాగా వైరల్ అయింది. ప్రకృతి పరిరక్షణ, ప్రపంచశాంతి కోసం నాట్య రూపకాలను రూపొందిస్తున్నాను. లలితకళల ఇతివృత్తంగా చిత్రీకరించిన మ్యూజిక్ స్కూల్ ద్విభాషా చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా లండన్కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆడమ్ మర్రేతో పనిచేయడం నా కెరీర్లో మరో ఆణిముత్యం అనే చెప్పాలి. ఆరంగేట్రంలో రుద్రమ పాత్రను ఎంచుకోవడానికి కారణం మహిళాసాధికారత పట్ల చైతన్యవంతం చేయడం కూడా. నా భవిష్యత్తు రూపకాలు కూడా సమాజం, ప్రకృతితోపాటు మహిళల భద్రత, మహిళాభ్యుదయం మీద ఉంటాయి’’ అని వివరించారు శ్లోకా రెడ్డి. సంగీతమూ ఇష్టమే! నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్లోనే. పాఠశాల విద్య చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత లండన్లో క్వీన్ మేరీ యూనివర్సిటీ నుంచి డిజిటల్ మార్కెటింగ్లో మాస్టర్స్ చేశాను. మన కల్చర్ కోసం పనిచేయడం స్కూల్లోనే మొదలైంది. స్కూల్ కల్చరల్ కమిటీకి డిప్యూటీ హెడ్ని. డాన్స్, మ్యూజిక్ రెండూ ఇష్టమే. తమ్ముడితోపాటు ఏడేళ్లు కర్ణాటక సంగీతం కూడా సాధన చేశాను. కానీ నా స్ట్రెస్ బస్టర్ మాత్రం బుక్ రీడింగే. ‘స్పందన’ చిల్డ్రన్హోమ్లోని పిల్లలతో గడపడం కూడా నాకిష్టం. ‘యట్–రైజ్’ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపించి కళాభిరుచి ఉన్నవారితోపాటు గ్రామాల్లో కనీస అవసరాల కోసం పోరాడుతున్న వాళ్లకు ఆసరాగా నిలుస్తున్నాను. క్లెన్లీనెస్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నా వంతుగా కొంతమేర సహకారం అందిస్తున్నాను. – శ్లోకారెడ్డి, కూచిపూడి నాట్యకారిణి – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్
70 Hour Week Remark controversy: వారానికి 70 గంటల పనిపై ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. యువత వారానికి 70 గంటలు కచ్చితంగా పని చేయాలన్న వ్యాఖ్యలపై అటు నెటిజన్లు నుంచి ఇటు పలు టెక్ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో ఎడిల్వీస్ సీఎండీ రాధికా గుప్తా స్పందించారు. భారతీయ మహిళలు దశాబ్దాల తరపడి 70 గంటలకు మించి పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదంటూ విచారం వ్యక్తం చేశారు. ఇంటి పని, ఆఫీసు పనిని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు, తరువాతి తరం పిల్లలభవిష్యత్ను సక్రమంగా తీర్చిదిద్దుతూ చాలామంది భారతీయ మహిళలు 70 గంటల కంటే ఎక్కువే శక్తికి మించి పని చేస్తున్నారని రాధికా గుప్తా గుర్తు చేశారు. దశాబ్దాల తరబడి చిరునవ్వుతో ఓవర్ టైంని డిమాండ్ చేయకుండానూ అదనపుభారాన్ని మోస్తూనే ఉన్నారు. కానీ విచిత్రంగా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్పై చాలామంది సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్ లతా వెంకటేష్ స్పందిస్తూ నిజానికి, తన భర్త, తానూ కూడా తమ కుమారుడి పెంపకంలో చాలా సాయం చేశారు. అలాగే ముంబై లాంటి మహానగరాల్లో పనికంటే మనం అందరం ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటూ పరోక్షంగా మూర్తి వ్యాఖ్యలకు కౌంటర్గా ట్వీట్ చేశారు. అవును అమ్మకు ఆదివారం లేదు.. వారాంతంలో కూడా పనిచేయాలని ఒకరు, ఆఫీస్ పని లేకపోయినా కూడా భారతీ మహిళలు కుటుంబ పోషణ కోసం వారానికి 72 గంటలకు పైగానే పని చేస్తున్నారు. చాలా కరెక్ట్గా చెప్పారు..అలుపెరుగని ఆడవారి శ్రమను ఎవరూ గుర్తించడం లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇప్పటికైనా వారి కమిట్మెంట్ను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు మరో యూజర్. అందరికంటే ముందు లేచేది అమ్మ.. అందరికంటే చివర్లో తినేది అమ్మే.. ఆఖరికి చివరగా నిద్రపోయేదీ అమ్మే అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. పితృస్వామ్యం అంతరించేంత వరకు ఈ వివక్ష పోదు. వెస్ట్రన్లో కూడా పూర్తి సమయం ఉద్యోగం చేసే మహిళలు ఇంట్లో బానిసలుగా ఉన్నారు. వీకెండ్లో పురుషులంతా పార్టీలు చేసుకుంటారు. అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూసే వరకు...ఏదీ మారదు మరోయూజర్ వ్యాఖ్యానించారు. Between offices and homes, many Indian women have been working many more than seventy hour weeks to build India (through our work) and the next generation of Indians (our children). For years and decades. With a smile, and without a demand for overtime. Funnily, no one has… — Radhika Gupta (@iRadhikaGupta) October 29, 2023 కాగా ఇన్ఫోసిస్ మాజీ సీఈవో మోహన్దాస్ పాయ్తో నిర్వహించిన పాడ్కాస్ట్లో మాట్లాడిన సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా మన దేశం కూడా ఆర్థికంగా పుంజుకోవాలంటే యువత వారానికి 70 గంటలు తప్పనిసరిగా పనిచేయాలని నారాయణ మూర్తి సూచించారంటూ మీడియాలో పలు కథనాలు వెలు వడ్డాయి. దీంతో నెటిజన్లు చాలావరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భవిష్ అగర్వాల్, జేఎస్డబ్ల్యూ సజ్జన్సిందాల్ సహా కొంతమంది పరిశ్రమ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. Infosys employee pic.twitter.com/FN8y5BgGTu — Gabbar (@GabbbarSingh) October 28, 2023 -
రాధిక కొత్త ప్రయాణం
కథానాయికగా, ఆ తర్వాత క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా చిత్రసీమలో రాధిక ఎన్నో విజయాలు చూశారు. ఇటు బుల్లితెరపైనా నటిగా, నిర్మాతగా ఆమె కెరీర్ హిట్. భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కిళక్కే పోగుమ్ రైల్’ (1978) ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు రాధిక. ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న రాధిక ఫ్రెంచ్లో తొలి చిత్రం అంగీకరించారు. ‘‘నా సినిమా కెరీర్లో కొత్త ప్రయాణం ఆరంభించాను. ఫ్రెంచ్ సినిమాలో నటించడం నాకో కొత్త అనుభూతి. ఈ కొత్త ప్రయాణానికి ప్రోత్సహించిన శరత్కుమార్ (రాధిక భర్త), రేయాన్ (కుమార్తె)లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాధిక. ఈ చిత్రానికి లారెన్స్ వాలిన్ దర్శకుడు. -
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మనిషి యంత్రంలా మారాడు. నిద్ర లేచింది మొదలు ఉరుకులు.. పరుగుల జీవితానికి అలవాటు పడ్డాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాకా సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ కాలం గడిపేస్తున్నాడు. నలుగురు కలిసి కూర్చుని చెప్పుకునే ముచ్చట్లు లేవు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. భార్యభర్తలిద్దరూ ఇంట్లో ఉన్నా చెరో వైపు కూర్చుని ఫోన్లు, లాప్టాప్లతో కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు ఆశ, అత్యాశ పెరిగిపోయి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల కారణంగా ప్రజల్లో విపరీతంగా మానసిక సమస్యలు పెరిగిపోయాయి. ఒత్తిళ్లు, డిప్రెషన్ అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఈ ఏడాది ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రకటించింది. మానసిక ఆరోగ్యంపై దృష్టి ఏదీ ఆర్థిక ఇబ్బందులతో కొందరు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో విశ్రాంతి లేని జీవనం సాగిస్తూ అనేకమంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. ఆశ, అత్యాశలు బాగా పెరిగిపోయాయి. మనిషి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. పిల్లల ఆకాంక్షలు తెలుసుకోకుండా డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలని రూ.లక్షలు ఖర్చుచేసి ఆ కోర్సుల్లో చేర్చుతుంటే.. అక్కడ ఒత్తిళ్లు తట్టుకోలేక మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. వారంతా శారీరక అనారోగ్యాలకు తక్షణమే చికిత్స పొందుతున్నారు కానీ.. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఆలోచనే చేయడం లేదు. ఆత్మీయ, అనురాగాలేవి ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో జనం సమూహాలుగా ఒకచోట చేరి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు. ఉమ్మడి కుటుంబాల్లో సాయంత్ర ం వేళ ఇంట్లోని వారంతా కలిసి కబుర్లు చెప్పుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఉదయం నుంచి నిద్రించే వరకూ స్మార్ట్ ఫోన్ లేనిదే నిమిషం గడవడం లేదు. ఏదైనా సమాచారం చెప్పాలన్నా.. తెలుసుకోవాలన్నా చాటింగ్లోనే. కనీసం కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. బంధువులు, ఆత్మీయుల కలయికలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు ఒకప్పుడు రెండు మూడు రోజుల ముందే వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కల్యాణ మండపం వద్దకు రావడం.. కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా ఆత్మీయ , అనుబంధాలు అంతరించిపోవడం కూడా మానíÜక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మానసిక ప్రశాంతతోనే ఆరోగ్యం ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారిలో ఈ సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ఫలితంగా గుండెపోటు, మెదడు పోటుకు దారి తీయవచ్చునంటున్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతాడని వైద్యులు అంటున్నారు. పాజిటివ్గా ముందుకు సాగాలి ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసంపై దృష్టి సారించాలి. సెల్ఫోన్లు, టెక్నాలజీని అవసరం మేరకే వాడాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా దృష్టి సారించాలి. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ కొంత సమయం గడపటం ద్వారా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగా, మెడిటేషన్, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. – డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్యురాలు, రిజిస్ట్రార్, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
మంత్రి ఆర్కే రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను ఖండించిన రాధికా
-
పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్లకు మరోసారి కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్ కౌన్సెలింగ్ను రద్దు చేసినట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమో దు చేసుకోవాలని సూచించింది. అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట శాంతీరామ్, జీఎస్ఎల్, మహారాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సెలింగ్ను యూనివర్సిటీ రద్దు చేసి, రివైజ్డ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత రాజమండ్రి జీఎస్ఎల్ కళాశాలలో రేడియో డయగ్నోసిస్లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్–1 కౌన్సెలింగ్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. -
మెరుగైన పోర్ట్ఫోలియోకు 8 సూత్రాలు..
ఇన్వెస్ట్ చేసి వదిలేయడం కాకుండా మధ్య మధ్యలో మన పోర్ట్ఫోలియోను సమీక్షించుకుంటూ కూడా ఉండాలి. అవసరమైతే రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అయితే, ఎన్నాళ్లకు ఈ ప్రక్రియ చేపట్టాలంటే.. ఐదేళ్లకోసారి అనేది నా సమాధానంగా ఉంటుంది. ఎందుకంటే జీవిత గమనంలో ఈ అయిదేళ్ల వ్యవధిలో లక్ష్యాలు, పరిస్థితులు, అవసరాలు మారిపోతూ ఉంటాయి. మీరు ఎంచుకున్న పెట్టుబడులు, సాధనాలు, వాటి పనితీరును మదింపు చేసుకోవడానికి కూడా ఈమాత్రం సమయం అవసరం. నా అనుభవం మేరకు ఫండ్ పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడానికి సంబంధించిన ఎనిమిది కీలక అంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అవేమిటంటే.. ఫండ్/ఏఎంసీ ఎంపిక .. ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ సావర్ధ్యాలు ప్రాతిపదికగా ఫండ్ను ఎంచుకోవచ్చు. ప్రతి ఏఎంసీకి ఒక స్పె షాలిటీ అంటూ ఉంటుంది. మిడ్క్యాప్, వేల్యూ లేదా గ్రోత్ అంటూ వివిధ సెగ్మెంట్లలో ప్రత్యేకానుభవం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఏఎంసీ/ఫండ్ పరిమాణం.. ఏఎంసీ పరిమాణమనేది అప్రస్తుతం. చిన్న ఏఎంసీలతో పోలిస్తే పెద్ద ఏఎంసీలు వెనకబడిన సందర్భాలు చాలానే చూశాను. ఆ చిన్న ఏఎంసీలు తర్వాత రోజుల్లో మీడియం ఏఎంసీలుగా ఎదిగాయి కూడా. భారీ బుడగలాగా పెరిగిపోయిన స్కీములకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ముఖ్యంగా ఎంత మంచి పనితీరు కనపర్చినా కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ విషయంలో దీన్ని మరింతగా దృష్టిలో పెట్టుకోవాలి. నిలకడ వర్సెస్ స్టార్ పెర్ఫార్మెన్స్.. స్టార్ రేటింగ్స్ కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. నా కొత్త పోర్ట్ఫోలియోలో, టాప్ పోర్టల్ ర్యాంకింగ్స్ లేదా 5 స్టార్ ర్యాంకింగ్స్ లేదా అందరూ ఎక్కువగా మాట్లాడుకునే ఫండ్స్ ఏవీ లేవు. నిలకడగా రాణిస్తున్న వాటిని నేను షార్ట్ లిస్ట్ చేసుకుని, వాటిల్లో నుంచి ఎంచుకున్నాను. అత్యుత్తమ పనితీరుకన్నా నిలకడకే ప్రాధాన్యమివ్వొచ్చు. సిప్ మంచిదే.. నెలవారీ సిప్లు బాగా పనిచేస్తాయి. సిప్ల వల్లే ఫండ్ పనితీరు కన్నా ఓ ఇన్వెస్టరుగా నా పనితీరు దాదాపు మెరుగ్గా ఉంటోంది. ఎందుకంటే.. మార్కెట్లు పడినప్పుడు కూడా నేను యూనిట్స్ కొంటూనే ఉంటాను. అంతేగాకుండా సిప్ల పని తీరు సైతం మెరుగ్గా ఉంటోంది. బీఏఎఫ్ కేటగిరీల్లో 14 శాతం పైగా, మిడ్ క్యాప్ కేటగిరీల్లో 18 శాతం పైగా రాబడులు ఇస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే, పెరిగే ఆదాయాలకు అనుగుణంగా సిప్లను కూడా పెంచుకుంటూ ఉండటం మంచిది. పరిమిత సంఖ్యలో స్కీములు.. పోర్ట్ఫోలియోలో ఎన్ని ఫండ్ స్కీములు ఉండాలి అంటే.. 10 వరకూ ఫర్వాలేదు. అంతకు మించి ఉండొద్దు. స్కీముల సంఖ్యను ఒక స్థాయికి పరిమితం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఫండ్స్లో చాలా కేటగిరీలు ఉన్నందున ఇది అంత సులభం కాదు. నా మటుకు నేను ఫండ్స్ను ఆరు కేటగిరీల కింద వర్గీకరించుకున్నాను. ఒకో కేటగిరీలో ఒకటి లేదా రెండు స్కీములు ఉంటాయి. మొత్తం మీద 10కి మించవు. వీటిల్లో ఫ్లెక్సీ లేదా లార్జ్, మిడ్క్యాప్; మిడ్క్యాప్; స్మాల్ క్యాప్; అసెట్ అలొకేషన్ ఫండ్స్; ఇండో గ్లోబల్ ఫండ్స్ (పన్ను ప్రయోజనాలు కలి్పంచేవి); పూర్తి గ్లోబల్ ఫండ్స్ ఉంటాయి. పన్నులపరమైన కారణాల రీత్యా చివరిది కొత్తగా జోడించాను. డైవర్సిఫికేషన్ ప్రధానం.. వైవిధ్యమైన స్టయిల్ పాటించే ఫండ్ హౌస్కు నేను ప్రాధాన్యం ఇస్తాను. ఏ ఏఎంసీలోనైనా ఒక్క స్కీములో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. డైవర్సిఫికేషన్తో ఎలాంటి సమయంలోనైనా మెరుగైన పనితీరు కనపర్చగలిగే వివిధ రకాల పెట్టుబడి విధానాల గురించి తెలుస్తుంది. యాక్టివ్, పాసివ్ విషయానికొస్తే నేను ఎక్కువగా యాక్టివ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతాను. రిస్క్ సామర్ధ్యాలు.. నా అసెట్ అలొకేషన్ విషయంలో నేను సంప్రదాయ పద్ధతిని పాటిస్తాను. అంటే నా ఫండ్ స్కీములు చాలా వాటిల్లో ఈక్విటీ పెట్టు బడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఇంటి కొ నుగోలు వంటి ఆర్థిక లక్ష్యం అవసరం లేనందున నేను కొంత దూకుడైన విధానం వైపు మ ళ్లుతున్నాను. మా అబ్బాయి కాలేజి చదువుకు అవసరమయ్యే డబ్బు కోసం నేను ప్రత్యేక పోర్ట్ఫోలియోను కూడా ప్రారంభించాను. సంక్లిష్టమైన సాధనాల జోలికెళ్లొద్దు.. పెట్టుబడుల విషయంలో దూకుడైన తీరు ఉంటే ఉండొచ్చు, కానీ పోర్ట్ఫోలియోలో సంక్లిష్ట సాధనాలు లేదా క్లోజ్డ్ ఎండెడ్ సాధనాలను నివారించడమే మంచిది. మీరు ఇన్వెస్ట్ చేసే పథకం గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. అలాగే ఉపసంహరణ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉండాలి. లిక్విడిటీ, అంటే కోరుకున్నప్పుడు నగదు రూపంలోకి మార్చుకోగలిగే వెసులుబాటు చాలా ముఖ్యం. -
Radhika Aggarwal: ఆత్మవిశ్వాసమే గెలుపు మంత్రం
రాధిక అగర్వాల్ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా జో«ద్పూర్ నుంచి అహ్మద్నగర్ వరకు ఎన్నో చోట్ల చదువుకుంది రాధిక. వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీయే చేసిన రాధిక అగర్వాల్కు ఎంటర్ప్రెన్యూర్గా పెద్ద పేరు తెచ్చుకోవాలనే కల ఉండేది. అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్లలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. ‘చదువు ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక వ్యాపారంలోకి నిస్సందేహంగా అడుగు పెట్టవచ్చు’ అనుకోలేదు ఆమె. అనుభవ జ్ఞానం విలువ ఏమిటో రాధిక అగర్వాల్కు తెలియనిదేమీ కాదు. చదువు పూర్తయిన తరువాత లైఫ్స్టైల్, ఇ–కామర్స్, ఫ్యాషన్, పబ్లిక్ రిలేషన్స్, రిటైల్ రంగాలలో 14 సంవత్సరాల పాటు పనిచేసింది. ఎన్నో రంగాలలో ఎంతో అనుభవాన్ని సంపాదించిన రాధిక అగర్వాల్ ఛండీగఢ్లో ఒక యాడ్ ఏజెన్సీకి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ప్రవాస భారతీయుల కోసం ‘ఫ్యాషన్ క్లూస్’ పేరుతో ఒక వెబ్సైట్ మొదలు పెట్టింది. మొదటి రెండు వ్యాపారాల విషయం ఎలా ఉన్నా... ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ ‘షాప్ క్లూస్’తో ఎంటర్ప్రెన్యూర్గా విజయకేతనం ఎగరేసింది రాధిక అగర్వాల్. రెండు సంవత్సరాల క్రితం బ్యూటీ, న్యూట్రీషన్, హోమ్కేర్కు సంబంధించి ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ ‘కైండ్ లైఫ్’ ప్రారంభించి మరోసారి విజయం సాధించింది. ‘ఒకసారి వెనక్కి చూస్తే... విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది ముఖ్యం. అది గెలుచుకుంటే కచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారానే ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాం’ అంటుంది రాధిక అగర్వాల్. ప్రతి సంవత్సరం ‘ఉమెన్స్ డే’ సందర్భంగా ఎక్కడో ఒకచోట మహిళలతో సమావేశం నిర్వహించి తన వ్యాపార ప్రస్థానాన్ని వారితో పంచుకుంటుంది. అగర్వాల్ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు వ్యాపారవేత్తలుగా విజయం సాధించారు. ‘వ్యాపారంలో విజయం సాధించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. బరిలోకి దిగే ముందు మన గురించి మనం విశ్లేషించుకోవాలి. ఎంతోమందితో మాట్లాడాలి. అయినా సరే, ఎప్పటికప్పుడు ఒక కొత్త సవాలు ఎదురవుతూనే ఉంటుంది. దానికి జవాబు చెప్పి ముందుకు కదలాలి. దీనికి కావాల్సింది ఆత్మవిశ్వాసం’ అంటుంది రాధిక అగర్వాల్. -
హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి!
బుల్లితెర నటిమణులు వెండి తెరకు పరిచయం కావడం కొత్తేమీ కాదు. ఆ మధ్య నటి ప్రియా భవానీశంకర్, వాణి భోజన్ బుల్లితెర నుంచి వచ్చి సినిమాలో సక్సెస్ అయిన వారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వరుసలో చాలామందే ఉన్నారు. ఇకపోతే నటుడు శశికుమార్ కొత్త హీరోయిన్లను ప్రోత్సహించడంలో ముందుంటారు. 'కారి' చిత్రంలో పార్వతి అరుణ్ అనే కొత్త నటికి అవకాశం కల్పించారు. ఇటీవల అయోత్తి చిత్రంలో ప్రీతి ఇస్రాణి అనే నూతన నటి శశికుమార్తో జత కట్టిన విషయం తెలిసిందే. ( ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్) తాజాగా శశికుమార్ హీరోగా నటించనున్న చిత్రంలో బుల్లితెర నటి రాధిక ప్రీతి కథానాయకిగా పరిచయం కానున్నట్లు సమాచారం. ఈమె పూవే ఉనక్కాగ సీరియల్ ద్వారా పరిచయమైన కన్నడం నటి కావడం గమనార్హం. ఆ సీరియల్లో పూవరసీ అనే పాత్రలో నటించి బుల్లి తెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఆ సీరియల్లో ప్రస్తుతం ఆమె నటించడం లేదు. కారణం సినిమాల్లో హీరోయిన్గా అవకాశాల కోసం ప్రయత్నించడమేనట. అలా అని ప్రయత్నం ఫలించి శశికుమార్ కథానాయకుడిగా నటించనున్న నూతన చిత్రంలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రంతో రాధిక ప్రీతి సినీ కథానాయకిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారన్నమాట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ( ఇది చదవండి: నాకు కలర్ తక్కువని హీరోయిన్స్ దూరం పెట్టారు: సీనియర్ హీరో) -
కాగితానికి కొత్త ఊపిరి
‘నేను ఇల్లు దాటి బయట అడుగు వేయలేకపోవచ్చు. అయితే నేను తయారు చేసిన బొమ్మలు మాత్రం దేశదేశాలకు వెళుతున్నాయి’ ఆనందంగా అంటుంది రాధిక. ఆమె చేతిలో కాగితం కూడా కొత్త ఊపిరి పోసుకుంటుంది. పాతన్యూస్ పేపర్లతో ఆమె తయారు చేసిన బొమ్మలలో ఆత్మవిశ్వాస కళ ఉట్టిపడుతుంది. ‘చీకటిని చూసి దిగులు పడకు. అదిగో వెలుగు’ అని ఆ బొమ్మలు మౌనంగానే చెబుతుంటాయి... తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాధిక బోన్ డిసీజ్ వల్ల నడకకు దూరమైంది. బడి మానేయవలసి వచ్చింది. రోజంతా బెడ్ మీద కూర్చోక తప్పనిసరి పరిస్థితి. ‘ఇక ఇంతేనా!’ అనే చింత ఆమెలో మొదలైంది. తన మనసులోని బాధను పంచుకోడానికి స్నేహితులు కూడా లేరు. కిటికీ నుంచి అవతలి ప్రపంచాన్ని చూస్తే... పిల్లలు బడికి వెళుతుంటారు... ఇలా ఎన్నో దృశ్యాలు ఆమె కంటపడేవి. తన విషయానికి వస్తే... బయటి ప్రపంచంలోకి వెళ్లడమంటే ఆస్పత్రికి వెళ్లడమే. తనలో తాను మౌనంగా కుమిలిపోతున్న సమయంలో ‘ఆర్ట్’ అనేది ఆత్మీయనేస్తమై పలకరించింది. పద్నాలుగేళ్ల వయసులో డ్రాయింగ్, పెయింటింగ్ మొదలుపెట్టింది. ఆర్ట్పై సోదరి ఆసక్తిని గమనించిన రాజ్మోహన్ పాత న్యూస్పేపర్లు, మెటల్ వైర్లతో ఆఫ్రికన్ బొమ్మలు తయారు చేసే యూట్యూబ్ వీడియోలను చూపెట్టాడు. అవి చూసిన తరువాత రాధికకు తనకు కూడా అలా తయారు చేయాలనిపించింది. పాత న్యూస్పేపర్ల నుంచి నవదంపతులు, సంగీతకారులు, వైద్యులు, దేవతలు... ఇలా రకరకాల బొమ్మలు తయారు చేసింది. పొరుగింటి వ్యక్తికి రాధిక తయారు చేసిన బొమ్మ బాగా నచ్చి కొనుగోలు చేసింది. అది తన ఫస్ట్ సేల్. ఆ సమయంలో రాధికకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. రాజ్మోహన్ స్నేహితుడు రాధిక తయారు చేసిన అయిదు బొమ్మలను తన షాప్లో పెడితే మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత మరికొన్ని బొమ్మలు కొన్నాడు. వారం వ్యవధిలో 25 బొమ్మలను అమ్మాడు. సోషల్ మీడియా ద్వారా రాధిక బొమ్మల వ్యాపారం ఊపు అందుకుంది. ఊటీకి చెందిన ఒక హోటల్ యజమాని 25 బొమ్మలకు ఆర్డర్ ఇచ్చాడు. ఊటీలోని ఆ హోటల్ను తాను తయారుచేసిన బొమ్మలతో అలంకరించడం రాధికకు సంతోషం కలిగించింది. తన బొమ్మల గురించి ప్రచారం చేయడానికి పైసా ఖర్చు చేయకపోయినా సోషల్మీడియాలోని పోస్ట్ల వల్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. మూడువేలకు పైగా బొమ్మలు తయారు చేసిన రాధిక... ‘బొమ్మలకు ప్రాణం పోస్తుంటే నన్ను నేను మరిచిపోతాను. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. టైమే తెలియదు. బొమ్మలు చేస్తున్నప్పుడు ఎంతో ఏకాగ్రత కావాలి. ఆసక్తి ఉన్నచోట సహజంగానే ఏకాగ్రత ఉంటుంది’ అంటుంది. రాధిక ఇప్పుడు ఆర్టిస్ట్ మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది. -
టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హీరో.. ఎంతో 'అజాగ్రత్త'గా!
బాలీవుడ్ నటుడు శ్రేయాస్, రాధిక కుమారస్వామి జంటగా నటిస్తోన్న చిత్రం 'అజాగ్రత్త'. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు శ్రేయాస్. ఈ చిత్రానికి ఎం. శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి రాజ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ను టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. (ఇది చదవండి; విమానం నుంచి 'సిన్నోడా ఓ సిన్నోడా' లిరికల్ ప్రోమో రిలీజ్) సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, సునీల్, ఆదిత్య మీనన్, రాఘవేంద్ర శ్రవణ్, జయ్ ప్రకాష్, వినయ ప్రసాద్, దేవ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్గా, శ్రీహరి సంగీత దర్శకుడిగా, రవి వర్మ ఫైట్ మాస్టర్గా వ్యవహరించనున్నారు. -
అంతరంగచిత్రం
హంస ముఖంలో ముఖం పెట్టి మురిపెంగా చూస్తున్న అమ్మాయి.నెమలి పింఛాన్ని ఆసక్తిగా చూస్తున్న బుట్టగౌను పాపాయి.ఏనుగు తొండాన్ని ఆత్మీయంగా నిమురుతున్న యువతి.ప్రకృతి... పక్షులు... సరస్సులు... పువ్వులు కళ్ల ముందే.థీమ్ ఏదయినా సరే... ఓ అమ్మాయి రూపం తప్పనిసరి.ఆర్టిస్ట్ ఆషా రాధిక బొమ్మల్లో కనిపించే ఆర్ద్రత ఇది. ఆషా రాధిక పుట్టింది, పెరిగింది, చదువు, ఉద్యోగం అంతా హైదరాబాద్లోనే. ఆమె బొమ్మల్లో హైదరాబాద్ సంస్కృతితోపాటు హైదరాబాద్లో కనిపించని జీవనశైలి కూడా ద్యోతకమవుతుంటుంది. ఆమె 24 సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్లు పెట్టారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ ద హార్ట్’ చిత్రలేఖన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిత్రకళా ప్రస్థానాన్ని ‘సాక్షిఫ్యామిలీ’తో పంచుకున్నారు. కుంచె నేర్పింది! ‘‘నాకు పెయింటింగ్ హాబీగా మారడానికి కారణం మా అమ్మనాన్న. అమ్మ ఎంబ్రాయిడరీ చేసేది. దారంతో వస్త్రం మీద ఒక రూపం తీసుకురావాలంటే గంటల సేపు పని చేయాలి. బ్రష్తో అయితే నిమిషంలో వచ్చేస్తుంది. అలా సరదాగా మొదలుపెట్టాను. స్కూల్లో కాంపిటీషన్లలో ప్రైజులు వస్తుంటే ఆ ఉత్సాహంతో మరికొన్ని బొమ్మలు వేసేదాన్ని. ఇక నాన్నగారు మహాసంప్రదాయవాది. ఆడపిల్లలు స్కూలుకి వెళ్లడం, ఇంటికి రావడం తప్ప ఇక దేనికీ బయటకు వెళ్లరాదన్నంత నియమం ఆయనది. ఖాళీ సమయం అంతా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో పెయింటింగ్స్లో ప్రయోగాలతో కాలక్షేపం చేయడం అలవాటైపోయింది. అలా కుంచే నాకు గురువైంది. సెవెన్త్ క్లాస్లో సమ్మర్ కోచింగ్ తప్ప పెయింటింగ్స్లో ప్రత్యేకమైన శిక్షణ ఏదీ లేకనే చాలా బొమ్మలు వేశాను. పెద్దయిన తర్వాత టెంపూరా ఆన్ పేపర్ కళను తెలుగు యూనివర్సిటీ, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీనివాసాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. కాన్వాస్లాగానే మైండ్ కూడా నా కుంచె గర్ల్ చైల్డ్ ప్రధానంగా జాలువారుతుంది. నేచర్, పక్షులు, పూలు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలను చూసినప్పుడు తప్పనిసరిగా ప్రభావితమవుతాం. అయితే అది అనుకరణ కోసం కాదు. ఒక గమనింపు మనలో ఉంటుంది. ఆ చిత్రకారుల గీతను నిశితంగా గమనిస్తుంది మన మేధ. జగదీశ్ మిట్టల్ గారి కలెక్షన్స్లో 14వ శతాబ్దం నాటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ మీనియేచర్ ఆర్ట్ నా మెదడు మీద అలా ముద్రించుకుపోయింది. రామ్కుమార్, ప్రభాకర్ కోల్టే వేసే ఆబ్స్ట్రాక్ట్లు చాలా ఇష్టం. ఎన్ని చిత్రాలను చూసి, ఎన్నింటి నుంచి స్ఫూర్తి పొందినా మన మెదడు కాన్వాస్ మీద తనకు తానుగా ఓ కొత్త రూపాన్ని ఆవిష్కరిస్తుంది. నేను బొమ్మ వేయడానికి కాన్వాస్ ముందు కూర్చునేటప్పుడు ఫలానా రూపం రావాలనే ఆలోచన ఉండదు. కాన్వాస్లాగానే మెదడు కూడా క్లియర్గా ఉంటుంది. రంగులు ఒక్కొక్క లేయర్ వేస్తూ ఉంటే కొంత సేపటికి రూపం వస్తుంది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి తప్పనిసరిగా ఉంటుంది. ఇక థీమ్ అంటే ‘హర్ అబ్జర్వేషన్’ అని చెప్పవచ్చు. ఒక అమ్మాయి ప్రకృతిని, తన పరిసరాలను గమనించడంతోపాటు మమేకం కావడం నా బొమ్మల్లో ఉంటుంది. ఒక అమ్మాయిగా బాల్యంలో నేను చూసినవి, ఊహించినవి, పెద్దయిన తర్వాత నా గమనింపుకు వచ్చినవి, ఒక అమ్మాయికి తల్లిగా ప్రేమానుబంధం నా బొమ్మల్లో ఆవిష్కారమవుతుంటుంది. ఇంట్లోనే ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను. నాలుగు వేల బొమ్మలు వేసి ఉంటాను. సోలో ప్రదర్శనలను గుర్తు పెట్టుకుంటాను, కానీ గ్రూప్ ప్రదర్శనల లెక్క ప్రత్యేకంగా గణనలోకి తీసుకోలేదు. అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లోనూ నావి సోలో ప్రదర్శనలే. చిత్రలేఖనం పట్ల ఎంత ఇష్టం ఉన్నప్పటికీ చదువు ప్రాధాన్యం తగ్గనివ్వలేదు. ఎస్బీఐలో 1992లో ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు శంకరపల్లి బ్రాంచ్ మేనేజర్ని. ‘ఆర్ట్ ఆఫ్ ద హార్ట్’లో పాల్గొన్నాను. సోలో ఎగ్జిబిషన్లు 2001 నుంచి మొదలుపెట్టాను. ఇప్పుడు 25వ ఎగ్జిబిషన్ నా చిత్రలేఖనం కెరీర్లో ఓ మైలురాయిగా నిలవాలనే ఆకాంక్షతో సిద్ధం చేస్తున్నాను’’ అని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు ఆర్టిస్ట్ ఆషా రాధిక. – వాకా మంజులారెడ్డి -
జీవితగా వస్తున్న రాధికా శరత్ కుమార్..
రక్షిత్ అట్లూరి హీరోగా, సంకీర్తనా విపిన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. వెంకట సత్య దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో జీవితపాత్ర చేస్తున్న రాధికా శరత్కుమార్ లుక్ని విడుదల చేశారు. ‘‘స్వాతిముత్యం, స్వాతి కిరణం’ లాంటి ప్రజాదరణ పొందిన చిత్రాల తర్వాత ‘ఆపరేషన్ రావణ్’లో నటనకి ప్రాధాన్యం ఉన్న జీవితపాత్ర చేశాను. తెలుగుతోపాటు తమిళంలో ఏక కాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు రాధిక. -
ఆమె నా ఆల్టైమ్ ఫేవరేట్ హీరోయిన్: మెగాస్టార్
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ఓటీటీ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోనీలివ్లో ప్రసారమయ్యే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి మొదటి గెస్ట్గా పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా.. తొలి ఎపిసోడ్లో చిరంజీవి ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఈ షో లో పాల్గొన్న మెగాస్టార్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయన సినీ జీవితంలో ఎదురైన సంఘటనలను పంచుకున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన హీరోయిన్లపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరిశ్రమలోని కొంతమంది నట దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే అప్పట్లో మెగాస్టార్తో స్క్రీన్ పంచుకున్నవారి గురించి స్మిత ప్రశ్నించారు. రాధికా శరత్ కుమార్, రాధ, విజయ శాంతి, శ్రీ దేవి లాంటి స్టార్లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి మెగాస్టార్ నిరాకరించారు. అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని.. మా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని చెప్పుకొచ్చారు. అయితే వారిలో ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు. వాటి గురించి మెగాస్టార్ వివరించారు. సులభంగా, సహజంగా నటించే విషయంలో రాధిక ఫర్ఫెక్ట్ అని తెలిపారు. ఇక నాతో డ్యాన్స్ విషయంలో అయితే రాధ, విజయశాంతి జీవించేస్తారని అన్నారు. ఆ విషయంలో వారిద్దరి డ్యాన్స్ పవర్ఫుల్గా ఉంటుందన్నారు. అయితే శ్రీ దేవితో గొప్ప వ్యక్తిగత, వృత్తిపరమైన రిలేషన్ పంచుకున్నానని వెల్లడించారు. అందువల్ల ఆమె ఎల్లప్పుడూ తన ఫేవరేట్ హీరోయిన్ అని చిరంజీవి పేర్కొన్నారు. దివంగత శ్రీదేవి గురించి మాట్లాడుతూ..' ఆమెతో పని చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికీ కూడా ఉత్తమ జంటగానే పరిగణిస్తారు. శ్రీదేవి నటన, డ్యాన్స్ బెస్ట్. అందుకే ఆమెతో 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మోసగాడు', 'ఎస్పీ పరశురామ్' లాంటి సూపర్ హిట్ సినిమాలు చేయగలిగా.' అని అన్నారు మెగాస్టార్. -
అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్లో మెరిసిన తారలు
-
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్బై, కేటీఆర్ ఏం చేశారంటే?
సాక్షి,ముంబై: ప్రముఖ టీవీ ఛానల్ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆలస్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా ఇద్దరూ డైరెక్టర్ పదవులకు గుడ్ బై చెపారు. అయితే 32.26 శాతం వాటా ఉన్న ప్రమోటర్లుగా ఛానెల్ బోర్డుకు రాజీనామా చేయలేదు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ట్విటర్లో ఎన్డీటీవీని అన్ఫాలో చేస్తున్నానంటూ తెలంగాణా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ చేసిన సేవకు వారికి ధన్యవాదాలు తెలిపారు. Unfollowing @ndtv Thanks for the good work thus far 👍 https://t.co/7IsU6TljjJ — KTR (@KTRTRS) November 30, 2022 కొత్త డైరెక్టర్లు ఈ క్రమంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగ్లియా, సంథిల్ సమియా చంగళవరాయన్లు ఎన్డీటీవీకి కొత్త డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రకటించింది. పుగాలియా అదానీ గ్రూప్లో మీడియా కార్యక్రమాలకు సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్గా ఉన్నారు. ఎన్డీటీవీ షేరు జోరు మరోవైపు ఓపెన్ ఆఫర్ ప్రకటించిన దగ్గర్నించి జోరుమీదున్న ఎన్డీటీవీ స్టాక్ తాజా వార్తలతో 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ తాకింది. గత 5 రోజుల్లో 22 శాతానికి పైగా జంప్ చేయగా,ఆరు నెలల కాలంలో స్టాక్ 161 శాతం పెరిగింది. Radhika and Dr. Prannoy Roy have resigned from NDTV's holding company RRPR's board of directors, effectively immediately. pic.twitter.com/LX7J9QuJDx — Abhishek Baxi (@baxiabhishek) November 29, 2022 కాగా అదానీ గ్రూప్ ఎన్డీటీవీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈఏడాది ఆగస్ట్ 23న, అదానీ ఎంటర్ప్రైజెస్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్, విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్లో 100శాతం ఈక్విటీ వాటాలను రూ.113.74 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తర్వాత,వీపీసీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతంవాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఎలాంటి నోటీసు లేకుండానే టేకోవర్ జరిగిందని ఎన్డీటీవీ వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. చివరికి ఐపీవో కోసం అదానీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నవంబర్ 22, డిసెంబర్ 5 మధ్య నిర్వహిస్తున్న ఓపెన్ ఆఫర్కు స్పందన బాగానే లభిస్తోంది -
రాధిక మంగిపూడి నూతన కవితా సంపుటి ఆవిష్కరణ
సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన కవితా సంపుటి "నవ కవితాకదంబం" వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వేడుకల సభలో, హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న సినీనటి జమున రమణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, మాజీ కేంద్రమంత్రి టీ సుబ్బరామిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.గురవారెడ్డి, పలు విదేశీ తెలుగు సంస్థల ప్రతినిధులు రాధికను అభినందించారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రచురించిన ఈ పుస్తకం తొలిప్రతిని శుభోదయం గ్రూప్స్ ఛైర్మన్ డా. కే. లక్ష్మీప్రసాద్ అందుకున్నారు. ప్రముఖ సినీ కవులు సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, ఆచార్య ఎన్ గోపి, డా. తెన్నేటి సుధా దేవి ఈ పుస్తకానికి ముందుమాట అందించగా, ప్రచురణకర్తగా డా. వంశీ రామరాజు రాధికను అభినందించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితరులు రాధికకు అభినందనలు తెలిపారు. "ఎందరో సినీ దిగ్గజాలు, ప్రముఖ రచయితల సమక్షంలో వెంకయ్యనాయుడు గారు తన పుస్తకం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని," రాధిక నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
Beauty Tips: వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది: నటి
'మేరీ ఆషీకి తుమ్ సే హై' అనే టీవీ షోతో కెరీర్ ఆరంభించింది ఢిల్లీ బ్యూటీ రాధికా మదన్. 2018లో పటాకా సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఇక ఆంగ్రేజీ మీడియం సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూతురిగా నటించి మెప్పించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనితో పాటు రే వెబ్సిరీస్లోనూ తన నటనకు గానూ రాధిక విమర్శల ప్రశంసలు అందుకుంది. త్వరలోనే కుట్టీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధికా.. తన బ్యూటీ సీక్రెట్ ఏమిటో అభిమానులతో పంచుకుంది. అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా.. ‘నా చర్మ సౌందర్య రహస్యం.. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాకే. ఇది మా అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా అందిన చిట్కా అని చెప్పొచ్చు. చాలా సింపుల్. ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి, ఒక టీ స్పూస్ పసుపు, రెండు టీ స్పూన్ల బాదం పప్పు పొడి, ఒక టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు పాలు.. అన్నిటినీ కలిపి ప్యాక్లా తయారు చేసుకోవాలి. దీనిని మొహానికి, మెడకు అప్లయ్ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసు కోవాలి. మెత్తటి టవల్తో తడిపొడిగా తుడుచుకుని మాయిశ్చరైజన్ రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా.. మొహం డ్రై అవకుండా తేమతో నిగనిగలాడుతూ ఉంటుంది’’ అని రాధికా మదన్ చెప్పుకొచ్చింది. చదవండి: Anushka Sharma Beauty Secret: టీనేజ్లో ఉన్నపుడు అమ్మ చెప్పింది.. నా బ్యూటీ సీక్రెట్ అదే! Beauty Tips: నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? ఈ సులభమైన చిట్కాలతో చెక్ పెట్టేయండి! -
‘ఆకలి రాజ్యం’ నటుడు ప్రతాప్ పోతెన్ మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్, సీనియర్ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్(70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో చేశారు. తెలుగులో ఆయన ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రతాప్ పోతెన్ నటుడిగా మాత్రమే కాదు పలు చిత్రాలకు డైరెక్టర్గా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఆయన సీనియర్ నటి రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. -
మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలో తెలుగు బ్యూటీ
పోటీలో తెలుగు బ్యూటీ మనకు... మిస్ యూనివర్స్ పోటీలు... బాగా తెలుసు. మిస్ వరల్డ్ కూడా... పరిచయమే. అలాగే... మిస్ ఎర్త్ గురించి తెలుసు. మరి... మిసెస్ యూనివర్స్? మిసెస్ వరల్డ్?? మిసెస్ ఇంటర్నేషనల్??? పెద్దగా తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం. మిసెస్ ఇంటర్నేషనల్కు అర్హత సాధించిన తెలుగు మహిళ రాధికామూర్తిని పరిచయం చేసుకుందాం. మిసెస్ ఇంటర్నేషనల్ పోటీల్లో దేహం కొలతల చట్రంలో ఇమడాల్సిన అవసరం లేదు. ఆత్మసౌందర్యం, అంతఃసౌందర్యమే ప్రధానం. అంతఃసౌందర్యం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఉలి. ఆ ఉలి చెక్కిన శిల్పమే ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం... భావవ్యక్తీకరణలో బహిర్గతమవుతుంది. భావవ్యక్తీకరణకు సాధనం మాట. మాటలో వెలుగు చూసే భావమే అంతఃసౌందర్యానికి కొలమానం. బాధ్యతాయుతమైన వ్యక్తి అని, ఒక సామాజిక బాధ్యత అప్పగిస్తే కర్తవ్యానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారనే విశ్వాసం కలిగించడానికి ఒక వేదిక ఈ మిసెస్ ఇంటర్నేషనల్ పీజంట్. అమెరికాలో జరిగే ఈ మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలకు ఈ ఏడాది కూడా అనేక దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. జూలై 18 నుంచి 23 వరకు జరిగే ఈ పోటీల్లో పొల్గొంటున్న వారిలో ఓ తెలుగు మహిళ ఉంది. ఆమె రాధికామూర్తి. మరో విశేషం ఏమిటంటే... ఆమె పాల్గొంటున్నది యూకే నుంచి. అవును, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా పన్నెండేళ్ల నాడు లండన్లో అడుగుపెట్టిన రాధిక అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. భర్త, ఇద్దరు పిల్లల బాధ్యత చూసుకుంటూ కెరీర్ను బాలెన్స్ చేసుకుంటూ గడిచిపోయిన కాలాన్ని, విద్యార్థి దశలో మొగ్గలు విచ్చుకున్న అభిరుచులను, సామాజిక కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన శూన్యత తనను అంతరయానం చేయించిందన్నారు రాధికామూర్తి. రొటీన్ చట్రం బయట ప్రపంచం ఉంది ‘‘నేను పుట్టింది పెరిగింది, చదువుకున్నది అంతా నెల్లూరులోనే. ఉద్యోగం కోసం బెంగళూరులో ఐదేళ్లు ఉన్నాను. యూకేలో ఉద్యోగం రావడంతో 2010లో లండన్కి వచ్చాను. ఆరేళ్ల తర్వాత సిటిజన్షిప్ కూడా వచ్చింది. పెళ్లి, ఇద్దరు అబ్బాయిలు, ఉద్యోగం... ఈ చట్రంలో గడిచిపోతూ ఉన్న సమయంలో కరోనా వచ్చింది. జ్ఞాపకాల్లోకి వెళ్లడానికి కొంత విరామం దొరికింది మనసుకి. స్కూల్లో, కాలేజ్లో నేను ఫ్యాషన్ షోలు, డాన్స్, పాటల పోటీలు, చిన్న చిన్న నాటికలు... ఇలా స్టేజ్ షోలలో చురుగ్గా పాల్గొనేదాన్ని. యూకేలో నివసిస్తున్న భారతీయులు పరస్పరం కలవడం కోసం మిసెస్ ఇండియా యూకే వంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. నా సెకండ్ ఇన్నింగ్స్ అలా మొదలైంది’’ అన్నారామె. కరోనా వదల్లేదు కరోనా తగ్గినట్లే తగ్గి తిరిగి విజృంభించడంతో ఆ పోటీలు ఎప్పటిలాగ ఆఫ్లైన్లో జరగలేదు. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. అలా ఎంపికైన నేను ఈ ఏడాది యూఎస్లో జరిగే మిసెస్ ఇంటర్నేషనల్కు యూకే ప్రతినిధిగా పాల్గొంటున్నాను. ఈ పోటీల్లో ఉండే సంతృప్తి ఏమిటంటే... విజేతలు ఏ రంగంలో సేవలందించాలనేది ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు. నేను మెంటల్ హెల్త్ అవేర్నెస్ కోసం పని చేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు రాధికామూర్తి. కెరీర్, కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ కాలంతో పోటీ పడి పరుగులు తీస్తున్న సమయంలో కూడా రాధికామూర్తి ఫిట్నెస్ను నిర్లక్ష్యం చేయలేదెప్పుడూ. రోజూ వర్కవుట్కి, యోగసాధనకు తప్పనిసరిగా కొంత టైమ్ కేటాయిస్తారు. ఆమె ఒక హెర్బల్ ఉత్పత్తికి ప్రమోటర్ కూడా. కొత్త ప్రదేశాలను చూడడం, అక్కడి జీవనశైలి, ఆహారపు అలవాట్లను తెలుసుకోవడం ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. కుటుంబ బంధం సమాజం పట్ల బాధ్యత మిసెస్ పోటీల్లో పాల్గొనే వాళ్ల నేపథ్యాన్ని నిశితంగా పరిశీలిస్తారు. కుటుంబాన్ని, కుటుంబంతో ఉన్న బంధాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన ట్రాక్ రికార్డ్ను కూడా. స్థూలంగా చెప్పాలంటే సమాజంలో ఒక వ్యక్తిగా, కుటంబంలో కీలకమైన వ్యక్తిగా ఎంత బాధ్యతగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నారనేది ముఖ్యం. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఇతరుల పోస్టులకు ప్రతిస్పందించే తీరు కూడా ముఖ్యమైన అంశమే. సమాజాన్ని సానుకూల ధోరణిలో ప్రభావితం చేయగలరా లేదా అనే నిర్ధారణకు రావడానికి ఆ పోస్టులు కూడా కొలమానం అవుతాయి. నేను నా వంతు సామాజిక బాధ్యతగా చేసిన కొన్ని పనుల గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రభావవంతంగా తెలియచేయగలిగాను. మిసెస్ ఇండియా యూకే టీమ్ గత ఏడాది నుంచి నాకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ పోటీలకు మనదేశం నుంచి వచ్చే ప్రతినిధిని కలిసి పరిచయం చేసుకుంటాను. – జె. రాధికా మూర్తి, ‘మిసెస్ ఇంటర్నేషనల్’ (యూకే) పార్టిసిపెంట్ – వాకా మంజులారెడ్డి -
Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు!
కష్టసుఖాల కలయికే జీవితం. కానీ కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఊపిరాడనీయకుండా చేçస్తుంటాయి. ఇలాంటప్పుడు మనసులో ఏదోఒక మూలన ఉన్న.. ఉన్నతంగా ఎదగాలన్న కోరిక కూడా ఆవిరైపోతుంది. అచ్చం ఇలాగే జరిగింది రాధికా గుప్తా జీవితంలో. అర్హతలు ఉన్నప్పటికీ, పుట్టుకతో ఉన్న శారీరక సమస్యను సాకుగా చూపుతూ ఉద్యోగానికి పనికిరావని చీత్కారాలకు గురైంది. దీంతో 22 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ కొన్నాళ్లకు ఎడారిలో వర్షంపడినట్లుగా రాధిక జీవితంలో ఉద్యోగ అవకాశం రావడం.. దానిని అందిపుచ్చుకుని నేడు ఏకంగా ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయ్యింది. ఇండియాలో ఉన్న అతిపిన్న వయసు సీఈవోలలో రాధిక కూడా ఒకరిగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. యోగేష్, ఆర్తీ గుప్తా దంపతుల ముద్దుల కూతురు రాధికా గుప్తా. యోగేశ్ వృత్తిరీత్యా దౌత్యవేత్త కావడంతో రాధిక చిన్నతనం మొత్తం పాకిస్థాన్, నైజీరియా, అమెరికా, ఇటలీలలో గడిచింది. విదేశాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కావడంతో ..‘‘బాగా చదువుకో జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతావు’’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండేవారు. దీంతో రాధిక కూడా చక్కగా చదువుకుంటూ స్కూల్లో టాప్–ఫైవ్ జాబితాలో ఉండేది. అంతా బాగానే ఉన్నప్పటికీ రాధికకు పుట్టుకతో కొన్ని సమస్యల కారణంగా మెడ వంకరగా ఉండేది. వంకర మెడతో స్కూలుకెళితే మిగతా విద్యార్థులంతా.. ఆమెను చూసి గేలి చేసేవారు. నువ్వు మీ అమ్మకంటే అందవిహీనంగా ఉన్నావు’’ అంటూ తరచూ మాటలతో హింసించేవారు. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ అవ్వడం.. వెళ్లిన ప్రతి కొత్త స్కూల్లో అవమానాలు వెన్నంటి వేధిస్తుండేవి. అయినప్పటికీ తనని తాను నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడేది . డ్యూయల్ డిగ్రీ ఉన్నప్పటికీ.. ప్రతిష్టాత్మక వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్లలో డ్యూయల్ డిగ్రీ చేసింది. రెండు డిగ్రీలు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ ప్రారంభించింది. ఆమె విద్యార్హతలు, ప్రతిభా నైపుణ్యాలను పక్కనపెట్టేసి ‘నీ మెడ వంకరగా ఉంది నీలాంటి వాళ్లకు ఉద్యోగం ఇవ్వలేము’’ అని వెనక్కి తిప్పి పంపేవారు. ఇలా వరుసగా ఏడుసార్లు జరగడంతో రాధిక తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యింది. ఎందుకు ఈ జీవితం ఆత్మహత్య చేసుకుంటే ఏబాధ ఉండదు అనిపించింది ఆమెకు. కౌన్సిలింగ్తో... నిరాశనుంచి బయటపడేందుకు కొంతమంది స్నేహితుల సాయంతో సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ తీసుకుంది. ఆ తరువాత మెకిన్సేలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, ఏక్యూఆర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియో మేనేజర్గా చేరింది. తరువాత తన భర్తతో కలిసి ఇండియా వచ్చింది. సొంతంగా ‘ఫోర్ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్మెంట్’ కంపెనీని ప్రారంభించింది. కంపెనీ క్యాపిటల్, పనితీరు బావుండడంతో ఎడిల్వీజ్ ఫోర్ఫ్రంట్ను కొనేసింది. ఇదే సమయంలో రాధిక పనితీరుని మెచ్చి ఎడిల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్కు సీఈవోని చేసింది. అనేక అవమానాలు, కష్టాల తరువాత సీఈవోగా రాణిస్తోన్న రాధిక ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘దట్ గర్ల్ విత్ ఏ బ్రోకెన్ నెక్’ వీడియోలో తన కథను వివరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అనేక అవమానాలనుంచి అందనంత ఎత్తుకు ఎదిగి నేను ఇది అని నిరూపించి చూపిస్తోంది రాధిక. నాన్నే ప్రేరణ.. నాన్న ..ఉత్తరప్రదేశ్లోని ఓ కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్లో ఏడో ర్యాంక్ సాధించారు. నిరుపేదరికం నుంచి వచ్చిన ఆయన అన్నిసాధించ గలిగినప్పుడు, నాకున్న ఒక సమస్యతో ఎందుకు వెనుకబడిపోవాలి అనుకుని, బాగా కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నాను. అందం, అనుమానాలను పక్కనపెట్టి, నేను ఎదుర్కొన్న ప్రతిసమస్యను అనుభవాలుగా మార్చుకుని ముందుకు సాగాను. దాంతోనే ఈ స్థాయిలో నిలబడిగలిగాను. – రాధికా గుప్తా -
రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం
Asian Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ మహిళల విభాగంలో శుక్రవారం భారత్కు రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం మూడు పతకాలు లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ అన్షు మలిక్ (57 కేజీలు), రాధిక (65 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... మనీషా (62 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సుగుమి సకురాయ్ (జపాన్)తో జరిగిన ఫైనల్లో అన్షు 0–4తో ఓడిపోయింది. అంతకుముందు అన్షు వరుసగా మూడు బౌట్లలో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించడం) పద్ధతిలో షోఖిడా (ఉజ్బెకిస్తాన్)పై... డానియెలా స్యు చింగ్ లిమ్ (సింగపూర్)పై, బొలోర్తుయా (మంగోలియా)పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐదుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో 65 కేజీల విభాగంలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. భారత రెజ్లర్ రాధిక మూడు బౌట్లలో గెలిచి, ఒక బౌట్లో ఓడిపోయి రెండో స్థానంతో రజతం నెగ్గింది. 62 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మనీషా 4–2తో హన్బిట్ లీ (కొరియా)పై గెలిచింది. చదవండి: Rishabh Pant: హైడ్రామా.. పంత్ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సండే సిరీస్..: ఏది నేరం? ఏది పాపం?
పాపం చేస్తే అంతర్లోకం కల్లోలం అవుతుంది. నేరం చేస్తే చట్టం వెంటబడి జీవితం బందీ అవుతుంది. అన్నీ బాగుంటే నేరం ఎందుకు చేస్తారు? అన్నీ బాగున్నా పాపం ఎందుకు చేస్తారు? మనిషి వీలైనంత వరకు నేరం, పాపం చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తాడు. కాని నేరమో, పాపమో చేసే పరిస్థితులు వస్తే? జీ ఫైవ్లో తాజాగా విడుదలైన 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ జీవితంలో ఎదురయ్యే అనూహ్య ప్రహేళికలను ఆసక్తికరంగా చూపిస్తుంది. నేరం చేస్తే చట్టం శిక్షిస్తుంది. పాపం చేస్తే అంతరాత్మ శిక్షిస్తుంది. కాని పాపాన్ని ఆపబోయి నేరం చేస్తే? ‘గాలివాన’ కథ ఇదే. జీవితంలో కొన్ని ఎప్పటికీ జరక్కూడదు. కాని జరిగినప్పుడు వాటిని ఆచితూచి ఎదుర్కొనాలి. ఆ నష్టాన్ని నివారించాలి తప్ప ఆ నష్టానికి విరుగుడుగా మరిన్ని నష్టాలు తెచ్చే పని చేయకూడదు. ఉద్వేగాలు చాలా ప్రమాదకరమైనవి. అందుకే ఏ నిర్ణయమైనా స్థిమితంగా, ఆలోచనతో, వాస్తవిక అవగాహనతో చేయాలి. లేకుంటే చాలా ప్రమాదం. అవును... చాలా ప్రమాదం. జీ 5లో ప్లే అవుతున్న వెబ్ సిరీస్ ‘గాలివాన’ కథ ఏమిటి? ఒక గాలివాన రోజు. రాకపోకలకు వీలు లేని రాజోలు దగ్గర ఉన్న ఒక లంక దీవి. రెండు పెద్ద పెద్ద ఇళ్లు. ఆ ఇళ్లలోని ఒక ఇంటి అమ్మాయి, మరో ఇంటి అబ్బాయికి కొత్తగా పెళ్లయ్యింది. తర్వాత వాళ్లు హనీమూన్కు వైజాగ్ వెళ్లారు. వాన కురుస్తున్న రోజు అది. వైజాగ్లో అమ్మాయి, అబ్బాయి ఆ రాత్రికి హనీమూన్ జరుపుకోవాలి. ఇక్కడ అబ్బాయి ఇంటి వాళ్లు, అమ్మాయి ఇంటి వాళ్లు రొటీన్ పనుల్లో మునిగి ఉంటారు. కాని హటాత్తుగా వైజాగ్లో ఉన్న కొత్త జంటను ఒక దుండగుడు దారుణంగా హత్య చేస్తాడు. వధువు ఒంటి మీదున్న నగలను దొంగిలిస్తాడు. వాటిని అమ్మి దారిన పోయే కారును దొంగిలించి ఆ వానలో అదే లంక దీవి వైపు వస్తూ యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి ఇంటి ముందు కారుతో సహా బోర్లా పడతాడు. అప్పటికే దుర్వార్త ఆ రెండు ఇళ్లకు చేరింది. వధూవరులు హత్యకు గురయ్యారు. వాళ్లను చంపిన హంతకుణ్ణి టీవీలో చూపిస్తున్నారు. ఆ శోకంలో ఉన్న అబ్బాయి కుటుంబం వారు తమ ఇంటి బయట యాక్సిడెంట్కు గురైన కారు దగ్గరకు వస్తారు. తమ వాళ్లను హత్య చేసింది ఆ కారు నడుపుతున్నవాడే అని తెలియక ఇంట్లోకి తెచ్చి వైద్యం చేస్తారు. అమ్మాయి ఇంటి వారు కూడా హెల్ప్ చేయడానికి వస్తారు. అప్పుడే ఆ ఆగంతకుడే హంతకుడు అని తెలుస్తుంది. అంటే తమ ఇంటి ముక్కుపచ్చలారని జంటను చంపింది ఇతడేనన్న మాట. వీణ్ణి కాపాడాలా? చంపేయాలా? అందరి భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. ఏం చేయాలన్న నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేసి హంతకుణ్ణి గొడ్ల చావిడిలో పెడతారు. రాత్రి సమయం అది. గాలివాన. కాని తెల్లారే సరికి హంతకుడు చచ్చిపడి ఉంటాడు. ఎవరో అతణ్ణి చంపేసి ఉంటారు. ఆ చంపింది ఎవరు? అమ్మాయి తరఫు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? అబ్బాయి తరపు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? ఎవరు చంపారు? కాని అసలు ప్రశ్న తర్వాత వస్తుంది. అది– ఎందుకు చంపారు? బిబిసి వారు 2016లో తీయగా విపరీతమైన జనాదరణ పొందిన వెబ్ సిరీస్ ‘ఒన్ ఆఫ్ అజ్’కు తెలుగు రూపాంతరం ఈ సిరీస్. స్కాట్లాండ్లోని పర్వత ప్రాంతంలో జరిగినట్టుగా ఉండే ఒరిజినల్ కథను మన లంక దీవికి మార్చి తీశారు. హత్యకు గురైన వరుడి తల్లిగా రాధిక, వధువు తండ్రిగా సాయి కుమార్ కీలకమైన పాత్రలు. మిగిలిన పాత్రల్లో చాందినీ, చైతన్య కృష్ణ, నందిని రాయ్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. బిబిసి, జీ 5 కలిసి ఈ నిర్మాణం చేశాయి. రచన చంద్ర పెమ్మరాజు. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ దాదాపు మూడున్నర గంటల నిడివి ఉంది. మర్డర్ మిస్టరీ కనుక ఆసక్తి సహజం. అందులో ఉప కథలు కూడా ఉండటంతో వేదికలు మారుతూ కథ ముందుకు కదులుతుంది. హంతకుణ్ణి చంపాక తమలో ఎవరో ఒకరు చంపారు అని అందరికీ తెలుసు. కాని అందరూ అందరినీ కాపాడుకోవాలనే చూస్తారు. కాని వ్యక్తులు నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో కూడా వారిని పీక్కు తిని లబ్ధి పొందాలని చూసే వారుంటారు. బ్లాక్మెయిల్ చేసి ఇంకా టెన్షన్ ఇస్తారు. అలా టెన్షన్ పెట్టే పాత్రలు కూడా ఉన్నాయి. అంటే పరిస్థితులను బట్టి మనిషి నీచుడా, గొప్పవాడా అనేది తేలుతుంది. అదే సమయంలో నేరం, పాపం అనే చర్యల చర్చ కూడా ఉంటుంది. మన కుటుంబ సభ్యులను చంపినవాడిని చంపడం నేరం ఎలా అవుతుంది? అని అందరూ అనుకుంటారు. కాని అలా చంపడం పాపం కదా. అలాగే తల్లిదండ్రులు చేసే తప్పులు, పాపాలు పిల్లలను ఎలా వెంటాడుతాయో ఈ కథలో ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమలు, పెళ్లి తర్వాత విడాకులు అవి ఎక్కడికీ పోవు. తర్వాతి తరాలకు శాపాలుగా మారే అవకాశం ఉంటుందని చూపుతారు. అసలు కథేమిటంటే వీరిలో ఒకరు ఆ హంతకుణ్ణి చంపారు. నిజానికి వీరిలో ఒకరు ఆ కొత్త వధువరులను చంపడానికి కూడా కారకులయ్యారు. ఆ ఒకరు ఎవరు అనేదే కథ. ఖర్చుకు వెనుకాడకుండా రాధిక, సాయికుమార్ వంటి సీనియర్లను పెట్టి తీయడం వల్ల సిరీస్ నిలబడింది. కొడుకును కోల్పోయిన దుఃఖం, ఉన్నవారిని కాపాడుకోవాలనే తపన రాధికలో అలవోకగా పలికింది. సాయికుమార్ తన గొంతుతోనే సగం ఎఫెక్ట్ తీసుకు వచ్చాడు. సిరీస్కు మరో కీలకపాత్ర అయిన చాందిని తన శక్తికి మించి రక్తి కట్టించింది. నందిని రాయ్కు మంచి పాత్ర. కాని చివరి ఎపిసోడ్లు మరింత బాగుండాల్సింది. నేరం జరిగినా, పాపం జరిగినా అందుకు బదులుగా చేసే పని ఏదైనా కావచ్చుగాని ప్రాణం తీసేది మాత్రం కాకూడదు. మనిషి ప్రాణం తీస్తే అది ఏక కాలంలో నేరం, పాపం. రోజూ పేపర్లలో ఎన్నో క్షణికావేశాల చర్యలు కనిపిస్తాయి. వాటి నుంచి బయటపడి జీవితాలను కాపాడుకోవాలని ఈ సిరీస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏప్రిల్ 14న విడుదలైంది. జీ5లో చూడండి. -
చిరంజీవిపై నటి రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు, ఏం చెప్పిందంటే
Radhika Interesting Comments On Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై సినీయర్ నటి, అలనాటి హీరోయిన్ రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధిక, చిరంజీవి కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పరిశ్రమలో రాధిక, చిరంజీవిలు ఇప్పటికీ మంచి స్నేహితులు. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్తో ముచ్చటించిన రాధిక ఈ సందర్భంగా చిరంజీవి గురించి చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి సెల్ఫ్మేడ్ మ్యాన్ అంటూ కొనియాడారు. చదవండి: ‘గని’ టీంకు రాష్ట్ర ప్రభుత్వం షాక్, తగ్గించిన టికెట్ రేట్స్ ‘ఆయన తన కష్టంతో పైకి వచ్చారు. ఇప్పటికీ అంతే డేడికేషన్తో పని చేస్తున్నారు. మెగాస్టార్ అయినప్పటికీ చాలా ఒదిగి ఉంటారు. అందరితో బాగా కలిసిపోతారు. మేమంతా కలిసినప్పడు చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తుంటారు’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్న రాధిక చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే ఎలాంటి రోల్ చేస్తారని అడగ్గా.. ఆయనకు విలన్గా ఆయినా చేస్తాను కానీ, తల్లి పాత్రలు అసలు చేయనంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అనంతరం తాను ఒక నటినని, ఎలాంటి పాత్రలైన చేస్తానని చెప్పారు. చదవండి: RC15: ఒక్క ఫైట్ సీన్కే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్! ప్రస్తుత టాలీవుడ్ హీరో గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న హీరోలందరూ తనకు ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్కు తాను అభిమానని తెలిపారు. తారక్ ఎనర్జీ లెవల్స్ ఫెంటాస్టిక్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపించారు. అలాగే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్లను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, ఇప్పుడు వారు స్టార్ హీరోలుగా ఎదగడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా ఇటీవల విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో రాధిక, శర్వానంద్కు తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రాధికతో పాటు ఖుష్బు సుందర్, ఊర్వశీలు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. -
గిన్నిస్ రికార్డు కెక్కిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్
Choreographer Radhika Guinness Record: ప్రముఖ సినీ నృత్య దర్శకురాలు రాధిక గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నారు. ఏఎంఎస్ ఫైన్ఆర్ట్స్ సంస్థ నిర్వాహకుడు, సమాజ సేవకుడు డాక్టర్ ఆర్.జె.రామనారాయణన్ నాట్యకళలను ప్రోత్సహించే విధంగా వాటిపై అవగాహన కలిగించే విధంగా చెన్నైలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా సినీ నృత్య దర్శకురాలు రాధిక బృందం నేతృత్వంలో చెన్నైలోని పలు వేదికలపైనా, అదే విధంగా ఆన్లైన్ ద్వారా రోజూ గంట చొప్పున 365 రోజులు నాట్యకళ వేడుకలను నిర్వహించారు. ఇందులో పలువురు నాట్య కళాకారులు పాల్గొన్నారు. కాగా చివరిరోజున 600 మంది నాట్య కళాకారులతో నిర్వహించిన నాట్యకళ కార్యక్రమం గిన్నిస్ బుక్లో నమోదైంది. న్యాయమూర్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డ్ బుక్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా తిలకించారు. పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి అతిథిగా పాల్గొని నాట్య కళాకారులను అభినందించడంతో పాటు గిన్నిస్ రికార్డ్ ధ్రువపత్రాన్ని నృత్య దర్శకురాలు రాధికకు ప్రదానం చేశారు. -
నేను ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించను: నటి
Radhika Madan Opens Up About Love: 'నాకు ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించడం నచ్చదు. అందుకే లవ్ విషయంలో చాలా సీరియస్గా ఉంటా. అయితే జీరో పర్సెంట్ లేదంటే 100%' అంటూ లవ్ విషయంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది నటి రాధిక మదన్. ఇటీవలె ఆమె నటించిన 'శిద్ధత్' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్స్లో పాల్గొన్న రాధిక ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక 'మేరీ ఆషీకి తుమ్ సే హై' అనే టెలివిజన్ షోతో కెరీర్ ప్రారంభం చేసిన రాధిక 'పటాకా' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆంగ్రేజీ మీడియం సినిమాతో పాటు రే వెబ్సిరీస్లో రాధిక నటనకు గాను విమర్శల ప్రశంసలు పొందింది. తాను పోషించే ప్రతి పాత్రను సవాల్గా స్వీకరిస్తానని, 200శాతం బెస్ట్గా ఇచ్చేందుకు ట్రై చేస్తానని తెలిపింది. కాగా ఈమె నటించి శిద్ధత్ సినిమా అక్టోబర్ 1నుంచి డిస్నీ+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. -
చేయూతలో మహా‘రాణి’
పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ రాజవంశ కుటుంబాలే. సమాజంలో హంగూ ఆర్బాటాలతో ఎంతో వైభవంగా మహారాణిలా జీవించాల్సిన రాధికారాజే గైక్వాడ్ నిరాడంబరంగా జీవిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన సాధారణ జీవనశైలికి తన తండ్రే స్ఫూర్తి అని గర్వంగా చెబుతున్నారామె. గుజరాత్ రాష్ట్రంలోని వాంకనేర్ రాయల్ కుటుంబంలో పుట్టిన∙రాధికా రాజే .. కొన్నాళ్లు అక్కడే పెరిగినప్పటికీ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చడంతో తన సొంత ప్యాలెస్కు దూరమయ్యారు. ఢిల్లీలో స్కూలు విద్యనభ్యసించిన రాధిక సాధారణ విద్యార్థినిలా ఆర్టీసీ బస్సునే స్కూలుకు వెళ్లేవారు. తోటి విద్యార్థులతో కలిసి మెలిసి ఉండేవారు. వేసవికాలం సెలవుల్లో వాంకనేర్కు వెళ్లేవారు. అక్కడి స్థానికులంతా తనను మహారాణిని చూసినట్లు చూడడం రాధికకు కొత్తగా అనిపించేది. డిగ్రీ పూర్తయ్యాక.. ఇరవై ఏళ్ళ వయసులో ఆమె ఓ పత్రికలో జర్నలిస్టుగా చేరారు. ఒక పక్క పత్రికకు కంటెంట్ను అందిస్తూనే మరోక్క పోస్టుగ్రాడ్యుయేషన్ను పూర్తి చేసారు. వీరి కుటుంబంలో ఒక మహిళ ఉద్యోగం చేయడం ఇదే తొలిసారి. 21 ఏళ్ళకే పెళ్లిచేసే కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం విశేషం. బరోడా మహారాణి.. ఒకపక్క రాధిక తన చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే తల్లిదండ్రులు ఆమెకోసం వరుణ్ణి వెతకడం ప్రారంభించారు. ఎంతోమందిని చూశాక బరోడా యువరాజు సమర్జిత్ సిన్హ్ గైక్వాడ్ రాధికకు నచ్చడంతో ఆయన్ని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక కూడా తన చదువుని కొనసాగిస్తానంటే ఆయన అందుకు సమ్మతించడమేగాక చదువుకునేందుకు ప్రోత్సహించారు కూడా. వివాహం తరవాత బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ రాధికకు స్థిర నివాసంగా మారింది. రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసి... బరోడా ప్యాలెస్ గోడలపై రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసిన రాధిక.. పాతకాలం నాటి కళాఖండాలు, నేత పద్ధతులు, చేతివృత్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకుని వీటిని ఇప్పుడు కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఇలా స్థానికులకు కూడా ఆర్థికంగా తోడ్పడవచ్చన్న ఉద్దేశ్యంతో తన అత్తగారితో కలిసి నేత పద్ధతులు, చేతివృత్తులను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో వీరి తొలి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఉత్పత్తులన్నీ అమ్ముడయ్యాయి. లాక్డౌన్ సమయంలోను రాధిక చేతివృత్తుల కార్మికులకు అండగా నిలబడ్డారు. దీనికోసం వారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పర్యటించి అక్కడి వారి పరిస్థితులను సోషల్ మీడియాలో పోస్టు చేసి దాతల ద్వారా అందిన సహాయ సహకారాలను వారికి అందించారు. అలా దాదాపు ఏడు వందల మంది కుటుంబాలను ఆదుకున్నారు. నాన్న దగ్గరే తొలిపాఠం నేర్చుకున్నాను.. ‘‘నేను సంప్రదాయ రాజరికపు హద్దులు దాటి బయటకు వచ్చాను. రాజరిక కట్టుబాట్లు దాటి మానాన్న గారు మహారాజ్ కుమార్ డాక్టర్ రంజిత్ సింగ్జి నాకన్నా ముందు బయటకు వచ్చారు. 1984 లోనే ఆయన ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. భోపాల్ గ్యాస్ విషాదం జరిగినప్పుడు నాన్న కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన ్రçపజల ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి భయం లేకుండా పోరాడారు. అప్పుడు నాకు ఆరేళ్ళు. ఆ రోజు రాత్రి నాన్నగారి నుంచి నేను తొలిపాఠం నేర్చుకున్నాను. సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, సేవచేయడంలో ఉన్న ఆనందం ఏంటో ఆ రోజు అర్థమయ్యింది. అప్పటినుంచి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిగా కాక సాధారణ జీవితం గడిపేందుకు ప్రయత్నించాను. ఈ విషయంలో అమ్మకూడా ప్రోత్సహించేవారు. అందుకే నా ఇద్దరు కూతుర్లకు ఎటువంటి కట్టుబాట్లు పెట్టడం లేదు. వాళ్లకు నచ్చిన విధంగా చేయండని ప్రోత్సహిస్తున్నాను’’ అని రాధికరాజే చెప్పారు. నాన్నతో రాధికారాజే గైక్వాడ్ -
నటుడు మృతిపై కస్తూరి సంతాపం; మండిపడుతున్న నెటిజన్లు
తమిళ నటుటు, నిర్మాత వెంకట్ సుభా మృతికి సంతాపం తెలుపుతూ నటి కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(మే 29) తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పరిశ్రమకు చెందిన పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటుడు ప్రకాశ్ రాజ్, నటి రాధిక శరత్ కుమార్లతో పాటు నటి కస్తూరి శంకర్ సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో కస్తూరి ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు. కొద్ది రోజుల కిందటే ఆయన ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు. ఆ మరుసటి రోజే ఆయనకు జ్వరం వచ్చింది. టెస్టులు చేసుకోగా ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు ఆయన మరణించారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. సారీ సుభాగారు’ అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. అది చూసిన డీఏంకే కార్యకర్తలు, ఫాలోవర్స్ ఆమెపై మండిపడుతున్నారు. అయితే ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా? అంటు కస్తూరిపై విరుచుకుపడుతున్నారు. Shocked beyond belief. Venkat sir . Returned frm Udhaynidhi new film shoot , got fever next day, but not positive... after a week got sick... and now he is gone. he wasn't vaccinated it seems. I am so sorry subha. pic.twitter.com/trdZ41ZSBa — Kasturi Shankar (@KasthuriShankar) May 29, 2021 ఇక రాధిక ట్వీట్ చేస్తూ.. ‘మీకు వీడ్కోలు చెప్పేందుకు ఎంతో బాధగా ఉంది. రాడాన్ సంస్థలో ఆయన భార్య నాతో ఎప్పటి నుంచో కలిసి పని చేస్తున్నారు. వెంకట్ గత కొన్నేళ్ల నుంచి నాకు తెలుసు. ఎంతో మంచి వ్యక్తి. ఆయన మరణవార్త తెలియగానే గుండె ముక్కలైనట్టు అనిపిస్తోంది’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ‘ఎంతో బాధగా ఉంది.. ఇలా ఒక్కొక్కరిగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ను కోల్పోవడం తట్టుకోలేకపోతోన్నాను.. నిస్సహాయుడిగా మిగిలిపోయాను. వారి జ్ఞాపకాలతో నా జీవితం ఎంతో భారంగా మారుతోంది.. నా ఈ జీవితప్రయాణంలో భాగస్వామివి అయినందుకు ధన్యవాదాలు.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. నీ ఆత్మకు శాంతి కలగాలి’ అని కోరుకుంటున్నాను అన్నారు. So very saddened to say goodbye to Venkat, his wife Subaa has been associated with me for many years in Radaan. Venkat was a kind, strong thinking person& known him for many years. Subaa fought so strongly for his recovery, heartbreaking to see he lost the fight. Prayers to all pic.twitter.com/43oorm0lvz — Radikaa Sarathkumar (@realradikaa) May 29, 2021 -
వైరలవుతున్న నటి రాధిక న్యూ లుక్ ఫోటోలు
సినీ నటి రాధిక శరత్ శరత్కుమార్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా హెయిర్ కట్ చేయించి న్యూ లుక్లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..ఈ కొత్త లుక్ మీ అందరికి నచ్చుతుందని ఆశాస్తున్నానంటూ పేర్కొన్నారు. మొన్నటి దాకా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాధిక ఇప్పుడు మేక్ఓవర్పై దృష్టి పెట్టినట్లున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక చెక్బౌన్స్ కేసులో నటుడు శరత్కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న అనంతరం రాధిక ఆరోగ్యంపై పలు వదంతులు వచ్చాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక ఆమెకు కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్వయంగా స్పందించిన రాధిక..అలాంటి పుకార్లను నమ్మవద్దంటూ పేర్కొంది. తనకు కరోనా సోకలేదని, కానీ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయని క్లారిటీ ఇచ్చింది. Cheering myself up ,hope u all like the look😄😄😄😄 pic.twitter.com/M5XCMu4cgi — Radikaa Sarathkumar (@realradikaa) April 28, 2021 చదవండి : శరత్కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' -
నా ఆరోగ్యం బాగుంది!
సినీ సెలబ్రిటీల ఆరోగ్యంపై ఆన్లైన్లో పలు రకాల వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఒక్కోసారి ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియక వారి అభిమానులు కంగారు పడుతుంటారు. ఆ వార్తలు అటూ ఇటూ తిరిగి సంబంధిత సెలబ్రిటీ వద్దకు చేరాక ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. వదంతులు నమ్మొద్దు’ అంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. తాజాగా నటి రాధికకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘రాధిక ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై తాజాగా ట్విట్టర్ వేదికగా రాధిక స్పందిస్తూ– ‘‘మీరు (అభిమానులు) నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వాటిని నమ్మొద్దు. నాకు కరోనా సోకలేదు. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఆఫీసుకు హాజరవుతున్నా’’ అన్నారు. -
ఆ విషయంపై కోర్టుకు వెళ్తా: రాధిక
నటి రాధికకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వార్తలను ఖండించిన రాధిక తనకు కరోనా రాలేదని స్పష్టం చేసింది. సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాస్త ఒళ్లునొప్పులతో బాధపడ్డానని తెలిపింది. తన ఆరోగ్యం గురించి, చెక్ బౌన్స్ కేసు గురించి అసత్యవార్తలు రాస్తున్న వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాగోగుల గురించి ఆరా తీస్తున్నవారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే చెక్ బౌన్స్ కేసు విషయంలో ఉన్నత కోర్టులో పోరాడతానని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఈ కేసులో రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. నటుడు శరత్ కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ 'ఇదు ఎన్న మాయం' సినిమా నిర్మాణం కోసం రాడియన్స్ సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకుంది. దీన్ని 2015 మార్చిలో చెల్లిస్తామని వారు మాటిచ్చారు. ఒకవేళ అప్పు తీర్చకపోతే టీవీ ప్రసార హక్కులు లేదా తర్వాత నిర్మించే సినిమా హక్కులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీనికి తోడు అదనంగా కోటి రూపాయలు అప్పు తీసుకుని చెన్నై టీనగర్లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఈ డబ్బుతో మరో సినిమా నిర్మించారు. అయితే ఇక్కడ ఒప్పందాన్ని ఉల్లంఘించడంలో తమకు రావాల్సిన రూ.2.50 కోట్లను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలివ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డబ్బు చెల్లించాల్సిందే అని కోర్టు తీర్పు వెలువరించడంతో రాధిక దంపతులు 7 చెక్కులు సదరు సంస్థకు అందజేశారు.. శరత్కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్కుమార్, స్టీఫెన్లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. Thanks everyone for the love and affection, I am not down with corona virus, just body ache after second vaccine. On line press are just filing rubbish about health and case.We will fight it in higher courts. I am back at work, have a good day ❤️❤️❤️ — Radikaa Sarathkumar (@realradikaa) April 9, 2021 చదవండి: రాధిక, శరత్కుమార్ దంపతులకు షాక్ కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు: నటుడి ఆవేదన -
శరత్కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెక్బౌన్స్ కేసులో నటుడు శరత్కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. వివరాలు ఇలా.. శరత్కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ ‘ఇదు ఎన్న మాయం’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్ర నిర్మాణం కోసం రాడియన్స్ అనే సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకున్నారు. 2015 మార్చిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అప్పు తీర్చని పక్షంలో టీవీ ప్రసార హక్కులు లేదా ఆ తరువాత నిర్మించే చిత్ర హక్కులను ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అదనంగా రూ.కోటి అప్పుతీసుకుని చెన్నై టీనగర్లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఆ డబ్బుతో ‘పాంబు సట్టై’ అనే మరో చిత్రాన్ని నిర్మించి ఒప్పందానికి కట్టుబడనందున తమకు రావాల్సిన రూ. 2.50 కోట్లు వడ్డీ సహా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడంతో శరత్కుమార్, రాధిక కలిసి 7 చెక్కులను రాడియన్స్ సంస్థకు అందజేశారు. శరత్కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్కుమార్, స్టీఫెన్లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. -
రాధిక, శరత్కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష
సాక్షి, చెన్నై: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్కుమార్, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం రాధికా, శరత్కుమార్లు రేడియంట్ గ్రూప్ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. అయితే సకాలంలో ఆ అప్పును తీర్చలేదు. తర్వాత వీరు ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. దీంతో రేడియంట్ గ్రూప్ 2018లో కోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్ కోర్టు ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు వెలువరించింది. చదవండి: రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు! -
మేము పోటీ చెయ్యం.. అభ్యర్థులకు ప్రచారం చేస్తాం
సాక్షి, చెన్నై: ఎస్ఎంకే నేత, నటుడు శరత్కుమార్, మహిళా నేత, నటి రాధికా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. ఈ మేరకు ఎస్ఎంకే వర్గాలు మంగళవారం ప్రకటించాయి. కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యంతో కలిసి ఎస్ఎంకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కూటమిలో ఎస్ఎంకే 37 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థుల జాబితాను శరత్కుమార్ ప్రకటించారు. ప్రతి ఎన్నికల్లోనూ శరత్కుమార్ పోటీ చేస్తూ వచ్చారు. ఈ సారి రాధిక కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా ఇది వరకే శరత్కుమార్ ప్రకటించారు. ఈ జాబితాలో ఆ ఇద్దరి పేర్లు లేవు. ఆ ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎస్ఎంకే ప్రకటించింది. అయితే కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇద్దరు ప్రచారం చేయాల్సి ఉన్న దృష్ట్యా పోటీ నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు. చదవండి: బెంగాల్ గెలుపు బీజేపీకి కీలకం -
రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు!
హీరోలకు పారితోషికం ఎక్కువ ఉంటుంది. వారితో పోలిస్తే – హీరోయిన్లకు చాలా తక్కువ ఉంటుంది. ఇక వయసు విషయానికొస్తే.. హీరో ఎప్పటికీ హీరోనే! 50 – 60 ఏళ్లు దాటినా హీరోగా చేయొచ్చు. కానీ హీరోయిన్కు 30 మహా అయితే 40 టచ్ అయ్యేవరకూ ఓకే. అది కూడా ఏ కొందరో 30 దాటినా హీరోయిన్లుగా చేయగలుగుతారు. చాలామటుకు 30 టచ్ అయ్యాక అక్కా, వదిన పాత్రలకు అడుగుతారు. 40 దాటితే అమ్మ పాత్రలు ఆఫర్ చేస్తారు. మేల్ యాక్టర్, ఫీమేల్ యాక్టర్కి ఉన్న ఈ వ్యత్యాసం గురించి ఓ కార్యక్రమంలో నటి రాధిక మాట్లాడుతూ – ‘‘నేను ఒకవైపు సినిమాల్లో నటించడంతో పాటు బిజినెస్ ఉమన్ (సినిమా, సీరియల్ నిర్మాణం) గానూ మారాను. ఎందుకంటే నా కెరీర్ నా కంట్రోల్లో ఉండాలనుకున్నాను. భవిష్యత్తులో నన్ను రజనీకాంత్కి అమ్మ (రజనీ సరసన తమిళంలో పలు సూపర్హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించారు రాధిక)గా చేయమని అడుగుతారని నాకు ముందే తెలుసు. నటుల విషయంలో ఎవరికీ ఎలాంటి ముందస్తు ఆలోచనలు ఉండవు. కానీ నటీమణుల విషయంలో మాత్రం కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి. ఏది ఏమైనా కెరీర్ పరంగా దాటుతున్న ప్రతి మైలురాయికీ నేనింకా బెటర్ అవుతున్నాను’’ అన్నారు. కథానాయికగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ – ‘‘చూసేవారికి నా కెరీర్ చాలా సింపుల్గా అనిపించవచ్చు. కానీ ఈ జర్నీ అంత సులభంగా సాగలేదు. ఎన్నో కష్టాలున్నాయి. అసలు నేను యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. ఒక డైరెక్టర్ నన్ను నటించమని అడిగారు. నేను లెజండరీ యాక్టర్ ఎం.ఆర్. రాధ కూతుర్ని అని ఆయనకు తెలియదు. వాస్తవానికి నేనప్పుడు అంత అందంగా కూడా ఉండేదాన్ని కాదు. ‘నా ముఖాన్ని ఎవరు చూస్తారు’ అని ఆయనతో అన్నాను. ఎలాంటి అంచనాలు, కలలు లేకుండానే కెమెరా ముందుకొచ్చాను. ఇంతదాకా వచ్చేశాను’’ అన్నారు రాధిక. -
మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 35 వసంతాలు. కమలహాసన్, రాధిక మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్తో పోలిక!! ఆస్కార్స్కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్కపూర్కు చూపించడం విశ్వనాథ్కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. శతదినోత్సవ వేదికపై రాజ్కపూర్, ఎన్టీఆర్, ఏడిద క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇది విశ్వనాథ్కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! రాధికకు నటించి చూపిస్తూ కె. విశ్వనాథ్ తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్సీజన్లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
'నాంది' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు
ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘స్వాతిముత్యం, స్వాతి కిరణం’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు రాధిక. తనకు రెండు అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకుడిని కలిశారామె. ప్రస్తుతం హైదరాబాద్లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు రాధిక. దర్శకులు విశ్వనాథ్ను ఆయన స్వగృహంలో కలిశారామె. ఈ సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసి, ‘‘విశ్వనాథ్గారు నాకు గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు ఇచ్చారు. ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒక లెజెండ్. విశ్వనాథ్గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’’ అన్నారు రాధిక. ‘స్వాతిముత్యం’ లొకేషన్లో... -
ఎన్డీటీవీ ప్రమోటర్లపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లపై సెబీ కొరడా ఝళిపించింది. రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్ఐ)ను దుర్వినియోగపరచి న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)షేర్ల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ధి పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా సెబీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పీల్కు కంపెనీ... అయితే ఈ ఆరోపణలను కంపెనీ తప్పుపట్టింది. తగిన ఆధారాలు లేకుండా సెబీ ఈ రూలింగ్ ఇచ్చిందని పేర్కొంది. ఈ రూలింగ్పై అప్పీల్కు వెళతామని ఒక ప్రకటనలో తెలిపింది. 2006 సెప్టెంబర్– 2008 జూన్ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీకి చైర్మన్గా, హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నారు. రాధికా రాయ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అక్రమ లబ్ధికి సంబంధించి మరికొందరు వ్యక్తులు, సంస్థలపైన కూడా సెబీ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధాజ్ఞలు విధించింది. అప్పట్లో సంస్థ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన విక్రమాదిత్య చంద్ర, సీనియర్ అడ్వైజర్ (ఎడిటోరియల్ అండ్ ప్రాజెక్ట్స్), ఈశ్వరీ ప్రసాద్ బాజ్పాయ్, ఫైనాన్స్ డైరెక్టర్, గ్రూప్ సీఎఫ్ఓ సౌరవ్ బెనర్జీలు వీరిలో ఉన్నారు. -
అంతుచిక్కని ‘విశ్వాంతరాళం’
పత్రికల్లో పజిల్స్ వస్తుంటాయి. దారి చూపండి.. రంగులు వేయండి. ఆరు తేడాలను గుర్తించండి. ఖాళీలు నింపండి. అన్నీ.. చిన్నపిల్లలు చేసేవి. వీళ్లూ చిన్నపిల్లలే.. టెన్త్ పిల్లలు. స్పేస్ ఇండియా వీళ్లకో పెద్ద పజిల్ ఇచ్చింది. ‘కనుక్కోండి చూద్దాం?’ అంది. ఆ పజిల్నీ పూర్తి చేశారు! కొత్త ఆస్టరాయిడ్ను కనిపెట్టి.. ‘కనుక్కున్నాం చూడండి’ అన్నారు! పైన అంతరిక్షంలో అనేకం తిరుగుతుంటాయి. గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు! నక్షత్రాలు కూడా ఉంటాయి కానీ వాటిని ‘తిరుగుతున్నాయి’ అనకూడదు. వాటి దారి వేరే. సూర్యుడిలా సొంత రూట్లో ప్రయాణిస్తూ ఉంటాయి. అదొక మర్మదేశం. దేశం అంటే చిన్నదైపోతుంది. అంతుచిక్కని ‘విశ్వాంతరాళం’. ఆదీ అంతమూ తెలియని రహస్యం. వాటిల్లో కొన్ని శాస్త్ర పరిశోధకులకు మాత్రమే కనిపించేవి. మరికొన్ని మామూలు కంటికి కూడా కనిపించేవి. కొన్ని రోజులుగా డాబాలపై నుంచి ‘నియోవైజ్’ అనే తోకచుక్క కనిపిస్తోంది. నిన్నటి వరకు ఆ తోకచుక్కను వట్టి కంటితో చూడగలిగాం. దాదాపు 5 కి.మీ. పొడవున ఉన్న నియోవైజ్ భూమికి పది కోట్ల కిలో మీటర్ల దూరం నుంచి కూడా రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో తూర్పు దిక్కున పైకి తేలుతోంది. మళ్లీ 6,766 ఏళ్ల తర్వాతే నియోవైజ్ కనిపించడం! ఇప్పుడిక ‘నియోవైజ్’ తోక చుక్కను మించిన అద్భుతంలోకి వద్దాం. మనలాగే రోజూ ఆ తోకచుక్కను చూస్తూ, ఆశ్చర్యపడవలసిన ఇద్దరు అమ్మాయిలు.. ఆ తోక చుక్కను కూడా దాటిపోయి, ఆకాశంలో ఓ లఘు గ్రహాన్ని (ఆస్టరాయిడ్) కనిపెట్టారు! ఆ ఆస్టరాయిడ్ వీళ్ల కళ్లలో పడింది భూకక్ష్యలో ఉండి కాదు. అంగారకుడి చుట్టూ తిరుగుతూ!! నియోవైజ్ తోక చుక్క గురించి ‘నాసా’ వాళ్లు ప్రపంచానికి వెల్లడించక ముందు నుంచే గత రెండు నెలలుగా వైదేహి, రాధిక అనే ఆ ఇద్దరమ్మాయిలు కొత్త గ్రహాల కోసం ఖగోళాన్ని అన్వేషించే పనిలో ఉన్నారు. గుజరాత్లోని సూరత్లో ‘సవానీ చైతన్య విద్యాసంకుల్’లో టెన్త్ విద్యార్థినులు వాళ్లు. ‘ఆలిండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ 2020’ భాగంగా గగనాన్ని గాలిస్తున్నప్పుడు ఆ ఆస్టరాయిడ్పై వీళ్ల దృష్టి పడింది! ‘పాన్ స్టార్స్’ అనే టెలిస్కోప్లో పరిశీలిస్తూ ఇద్దరూ ఒకేసారి అంగారకుడి కక్ష్యలో ఆస్టరాయిడ్ను గుర్తించారు. అంత శక్తిమంతమైన టెలిస్కోప్ ఈ అమ్మాయిల చేతికి ఎలా వచ్చింది? ఆస్టరాయిడ్ సెర్చ్ ప్రోగ్రామ్ కోసం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్ (ఐజక్) అనే బహుళ విశ్వవిద్యాలయాల సంస్థ, టెక్సాస్లోని హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీ ఉమ్మడిగా ఏర్పాటు చేశాయి. వాటితో ఒప్పందంలో ఉన్న ఇండియాలోని ‘స్పేస్ ఇండియా’ (హర్యానా) ఈ అన్వేషణ కోసం.. అంతరిక్ష పరిజ్ఞానం, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తుల నుంచి ఆహ్వానించి, పోటీ పరీక్ష నిర్వహించి వైదేహి, రాధికలను ఎంపిక చేసుకుంది. భూమికి కనుచూపు మేరలో ఉన్న ఆస్టరాయిడ్స్ను కనిపెట్టడం సెర్చ్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం. కరోనా సమయం కాబట్టి వీళ్ల ఈ అన్వేషణ అంతా ఇంటి నుంచే జరిగేలా స్పేస్ ఇండియా ఏర్పాట్లు చేసింది. అంతకుముందే అన్వేషణ విధానాలలో శిక్షణ ఇచ్చింది. అంతరిక్షంలో మొదట వీళ్లు దాదాపు ఇరవై ఖగోళ పదార్థాలేవో గుర్తించారు. అయితే అవేవీ ఆస్టరాయిడ్స్ కాదు. చివరికి అసలైన ఆస్టరాయిడ్ కంటికి చిక్కింది. అయితే అది ఆస్టరాయిడేనా?! నిర్థారణ కోసం ఆ లోకేషన్ని ‘స్పేస్ ఇండియా’ నాసాకు పంపింది. ‘ఎస్.. ఆస్టరాయిడే’ అంది నాసా. తాత్కాలికంగా ఆ ఆస్టరాయిడ్కు హెచ్.ఎల్.వి.2514 అనే పేరు పెట్టింది. దాని కక్ష్యను కూడా నాసా గుర్తించాక (ఇందుకు సంవత్సరాలు పడుతుంది) ఆ ఆస్టరాయిడ్కు పేరు పెట్టే అవకాశాన్ని ఈ ఇద్దరు అమ్మాయిలకు ఇస్తుంది! హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీలో గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మిల్లర్ పంపిన ప్రత్యేక అభినందనలలో వైదేహి రాధిక ఇప్పుడు మేఘాలలో విహరిస్తున్నారు. యు.ఎస్.లోని నాసా వరకు ఎగరాలన్నది వారి కోరిక. వైదేహి తండ్రి వస్త్రవ్యాపారి. రాధిక తండ్రి కంప్యూటర్స్ విడిభాగాలు దుకాణం. కూతుళ్లు ఇంత సాధించాక తల్లిదండ్రులు గాలితో తేలిపోకుండా ఉంటారా! -
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
రాజాం సిటీ: మండల పరిధి శ్రీకాకుళం రోడ్డులోని అంతకాపల్లి బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం మండలం వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన దుప్పలపూడి రాధిక (17) సైకిల్పై రాజాం వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కుమార్తె మరణ వార్త విన్న తల్లిదండ్రులు జయలక్ష్మి, మురళి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ లక్ష్మణరావు తెలియజేశారు.(చుక్కేసి.. చిక్కేసిన జూడాలు ) ప్రమాదకరంగా బ్రిడ్జి ప్రాంతం శ్రీకాకుళం రోడ్డులో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జికి ఒకవైపు ఎత్తుగా ఉండడంతో వచ్చిన వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడే గతేడాది ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. అలాగే గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయింది. అందువలన ఇప్పటికైనా అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
తప్పుడు వార్తలపై ఏపీ సీఐడీ కొరడా
సాక్షి, అమరావతి : కరోనా వైరస్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలన భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే కోవిడ్పై అసత్య ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ప్రారంభించిన వాట్సాప్కు అనూహ్య స్పందన వస్తోంది. తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదులకుగాను ఏపీ సీఐడీ ఏర్పాటు చేసిన (9071666666) వాట్సాప్ నంబర్కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 11 ,474 ఫిర్యాదుల అందాయి. ఊహించని విధంగా ప్రజల్లో స్పందన రావడంతో దీని కోసం సీఐడీ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసింది. (ఏపీలో కొత్తగా 71 కరోనా కేసులు) దీనిపై ఏపీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక మాట్లాడుతూ.. స్టే సేఫ్, స్టే స్మార్ట్ అనే నినాదంతో నాలుగు వాట్సాప్ నంబర్లను ప్రారంభించామని తెలిపారు. సైబర్ బుల్లియింగ్లో సభ్యత లేకుండా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా కామెంట్స్ పెడితే సుమోటాగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాట్సాప్, టిక్ టాక్, ట్విట్టర్లో వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారి ట్రాక్ రికార్డ్ మొత్తం సీఐడీ దగ్గర ఉంటుందని ఎస్పీ రాధిక వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా తోక జాడిస్తే కత్తిరిస్తామని హెచ్చరించారు. త్వరలోనే మొబైల్ యాప్, డాష్ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తామని ఎస్పీ రాధిక తెలిపారు. (చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై కేసు నమోదు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాధిక కథ సినిమా తీయొచ్చు
ఇటీవల యాసిడ్ అటాక్ సర్వయివర్ జీవితం ఆధారంగా ‘చపాక్’ సినిమా వచ్చింది. ప్రమాదం వచ్చినా గెలిచి చూపిన అమ్మాయి కథ అది.రాధిక కథ అంతకు తక్కువ కాదు.గట్టిగా వేళ్లు విరుచుకుంటే ఆ వేళ్ల ఎముకలు విరిగిపోయేంత సున్నితమైన అరుదైన వ్యాధిఆమెకు ఉంది.ఇంత కర్కశమైన వ్యాధిలో ఎవరైనా కుంగిపోతారు. విరిగిపోతారు.రాధిక నిలబడింది.ప్రకృతి అన్యాయం చేసినా పోరాడి గెలవమని చెబుతోంది. రాధికకు అయిదేళ్లున్నప్పుడు ఆడుకుంటూండగా కిందపడింది. ఎడమ తొడ ఎముక విరిగింది. ఆడుకుంటూ పడితే తొడ ఎముక విరగడం విచిత్రం. అయితే డాక్టర్లు సీరియస్గా తీసుకోలేదు. పడటం వల్లే విరిగిందని అనుకున్నారు. ఆరునెలల తర్వాత ఉన్నట్టుండి నొప్పి మొదలైంది. అడుగు తీసి అడుగు వేయలేకపోయింది. ఆపరేషన్ చేసి ప్లేట్ను అమర్చారు. అక్కడితో నయం కాలేదు. దాంతో దాదాపు ఏడు సార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మాటిమాటికీ ఎందుకిలా జరుగుతోందని 2010లో మరిన్ని వైద్యపరీక్షలు చేయిస్తే తేలింది ఎముకలకు సంబంధించిన అరుదైన వ్యాధి అని, ఇది జన్యుపరమైనదనీ, ఈ జబ్బు వల్ల ఆమె ఎముకలు అత్యంత బలహీనంగా ఉన్నాయని. అంటే కోడిగుడ్డు పెంకుల్లా అన్నమాట. ఎముక మజ్జ పిండిలా అయిపోతుందన్నమాట. ఫలితంగా స్కూల్లో గంటలు గంటలు కూర్చోవడంతో వెన్నెముక వంగడం మొదలైంది. దీంతో రాధిక స్కూల్కి వెళ్లి చదువుకోలేక ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. కాస్త గట్టిగా కదిలినా ఫెళఫెళమని ఎముకలు విరగడమే. ఆపరేషన్లు జరగడమే. కోలుకొని ఇంటికొచ్చిన మర్నాడే మరో ఫ్రాక్చర్తో ఆసుపత్రికి పరిగెత్తేవారు. రాధిక సరే.. ఇంట్లో వాళ్లకూ బెంగ.. ఇలాగైతే పిల్ల పరిస్థితి ఏంటి అని. సగం టైమ్ ఆసుపత్రిలో.. సగం ఇంట్లోనే గడిచిపోయింది బాల్యము, కౌమారమూ. ఆపరేషన్ అయ్యి కోలుకోగానే.. ఎముకలు విరగకుండా నడవడం ప్రాక్టీస్ చేసేది. ఇదే జీవితం అయిపోయింది. ఏం చేయాలి? ‘అన్న స్కూల్కు, నాన్న ఆఫీస్కు వెళ్లేవాళ్లు. ఇంట్లో పనులతో అమ్మ బిజీ. నాతో మాట్లాడేవాళ్లే లేక దిగులు అనిపించేది. ఒకానొక టైమ్లో పిచ్చిపట్టినట్టే అయింది. నా స్థితి మీద నాకే జాలి. ఏదైనా వ్యాపకం మొదలుపెట్టుకోవాలనిపించింది. అప్పటికే నా చదువు డిస్టర్బ్ కావద్దని ట్యూటర్ను పెట్టి ఇంటి దగ్గరే చదువుకునే ఏర్పాటు చేశారు అమ్మా, నాన్న. అయినా బోలెడంత ఖాళీటైమ్. అయితే అదేపనిగా రెండుగంటల కంటే ఎక్కువ కూర్చోలేను.. కూర్చోకూడదు కూడా. ఆ రెండు రెండు గంటల టైమ్నే సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. చదువుకోసం కేటాయించుకున్నది పోను మిగిలిన టైమ్ని. ఫ్రెండ్స్ కోసం చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం, డ్రాయింగ్ వేయడం చేసేదాన్ని’ అంటూ తనను తాను తీర్చిదిద్దుకున్న తీరును చెప్తుంది రాధిక. తను తయారుచేసిన ఆఫ్రికన్ డాల్స్తో రాధిక యూ ట్యూబ్ మార్గం ఇలాగే ఒకసారి కూర్చోని డ్రాయింగ్ వేసుకుంటూంటే రాధిక వాళ్లన్నయ్య ఫ్రెండ్ మణికందన్.. ఆమెను చూసి క్రాఫ్ట్కు సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ను ఆమెకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి రాధిక ఆ వీడియోలను చూడ్డం.. కొత్త కొత్త క్రాఫ్ట్స్ను నేర్చుకోవడం మొదలుపెట్టింది. వాల్ హ్యాంగింగ్స్, పెన్హోల్డర్స్, బుట్టలు, ఫొటో ఫ్రేమ్స్, బాక్స్లు... అన్నీ పేపర్తో చేసినవే. తాను తయారు చేసివన్నీ ఫ్రెండ్స్కు, బంధువులకు కానుకలుగా ఇచ్చేది. ‘ఎప్పుడూ ఇవేనా? అని బోర్ కొట్టింది కొన్నాళ్లకు. అందుకే యూట్యూబ్ వీడియోలతో నేర్చుకున్న ఆర్ట్నే కొంత డెవలప్ చేసుకుందామని.. బొమ్మల ప్రయోగం చేశా. బాగా కుదిరాయి. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆఫ్రికన్ డాల్స్ తయారీమీద పడ్డా. కాగితంతోనే. ముందు ఒకటి చేశా. చాలా బాగా వచ్చింది. తర్వాత పది.. ముందుకన్నా అద్భుతంగా ఉన్నాయన్నారు ఇంట్లో వాళ్లు. అంతే ఇక ఆగలేదు. వాటన్నిటినీ మా అన్నయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమందైతే ఏకంగా కొనడానికే ముందుకొచ్చారు. అసలు అమ్మడమనే ఆలోచనేలేదు నాకు. అదే చెప్పాను వాళ్లకు. కాని వినలేదు. చేసేది లేక ఎంతో కొంత వాళ్లనే ఇమ్మన్నాను. అలా కొనడమే కాక అలాంటి ఇంకో 25 బొమ్మలను ఆర్డర్ చేశారు కూడా. ఆశ్చర్యం నాకు’ అని చెప్తుంది రాధిక. ఆఫ్రికన్ డాల్స్ రాధిక చేతిలో రూపుదిద్దుకున్న ఆఫ్రికన్ డాల్స్ సోషల్ మీడియాలో ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్కు ఫార్వర్డ్ అయి అందరికీ తెలిశాయి. డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అది చిన్న సైజు కుటీర పరిశ్రమగా మారింది రాధికకు.‘నిజానికి ఈ క్రాఫ్ట్ను ఓ మెంటల్ థెరపీగా స్టార్ట్ చేశా. ఈ బొమ్మలను చేస్తున్నంతసేపు హ్యాపీగా.. హాయిగా ఉంటాను. ఇంకే ఆలోచనా రాదు. దీంతో నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. కాని ఇప్పుడదో బిజినెస్గా మారింది. నమ్మలేకున్నాను. చెప్పాను కదా.. ఎక్కువసేపు కూర్చోలేను అని. ఆ కూర్చున్నంతలోనే ఈ బొమ్మలను చేస్తున్నాను’ అంది రాధిక చేతిలో ఉన్న ఆఫ్రికన్ డాల్ను ఆప్యాయంగా తడుముతూ.ఇప్పటివరకు రెండువందల పైచిలుకు బొమ్మలు అమ్ముడుపోయాయి. నూటయాభై రూపాయల నుంచి ఏడువందల రూపాయల మధ్య ఉంటుంది వాటి వెల.ప్రస్తుతం ప్రైవేట్గా పదకొండో తరగతి పరీక్ష రాయడానికి సన్నద్ధమవుతోంది రాధిక. నిజానికి పదకొండు, పన్నెండు తరగతులను స్కూల్కు వెళ్లి చదువుకోవాలని ఆమె తాపత్రయం. కాని కోయంబత్తూరులోని స్కూళ్లు ఆమెను చేర్పించుకోవడానికి సిద్ధంగా లేవు. రకరకాల కారణాలు చెప్పి, సాకులు చూపి ఆమెకు ప్రవేశం ఇవ్వడం లేదు.‘నాలాంటి వాళ్లకు స్కూల్లో చదువుకునే ఆవకాశమే ఉండదా? వ్యాపకంతో ఎంత బిజీగా ఉన్నా ఆర్నెల్ల కిందటిదాకా ఇలాంటి నెగటివ్ ఆలోచనలతోనే సతమతమయ్యా. ఒక్కోసారి నా జీవితం ఇలా ఒక ఫెయిల్యూర్లా ఎండ్ అయిపోతుందా అని కూడా భయపడ్డా’ అంటుంది రాధిక. పాజిటివ్ ఎనర్జీ ఎంతటి ప్రతికూలతలు తనను చుట్టుముట్టినా.. వాటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోగల సత్తా ఆమెది. ఇప్పుడు తన తల్లిదండ్రులు, సోదరుడి సహాయంతో తన పేపర్ క్రాఫ్ట్ను వ్యాపారంగా వృద్ధి చేయాలనుకుంటోంది. ఆఫ్రికన్ డాల్స్నే కాకుండా.. కార్టూన్ క్యారెక్టర్స్, అబ్దుల్ కలాం వంటి ప్రసిద్ధుల బొమ్మలనూ తయారు చేసే పనిలో ఉంది.పాజిటివ్నెస్కు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏం ఉంటుంది?! -
అంతు చిక్కని రాధిక హత్య కేసు
సాక్షి, కరీంనగర్ : ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో మూడు రోజుల విచారణలో ఏమీ తేలకపోవడంతో గురువారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం కరీంనగర్ చేరుకుంది. హైదరాబాద్ సీటీ పోలీసు విభాగం నుంచి క్రైం సీన్ ఆఫీసర్ ఇంద్రాణి ఆధ్వర్యంలో ఐదుగురితో కూడిన బృందం కరీంనగర్ పట్టణం విద్యాగనర్లోని రాధిక ఇంటికి వెళ్లి వివిధ కీలకమైన ఆధారాలు సేకరించారు. అత్యాధునిక జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి రక్తం మరకలు కడిగినా తర్వాత కూడా తెలుసుకునే త్రీడీ క్రైం సీన్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫారో 3డీ స్కానర్, బాడీ ప్లూయిడ్ కిట్స్ వంటివి ఉపయోగించి పలు ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. క్రైం సీన్ ఆఫీసర్ ఇంద్రాణి అడిషినల్ డీసీపీ చంద్రమోహన్తోపాటు టూ టౌన్ సీఐ దేవారెడ్డిని రాధిక ఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. పూర్వపరాలు వివరించిన తర్వాత క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. (మిస్టరీగా మారిన రాధిక హత్య..) ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆధారాలు... హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక ఫోరెన్సిక్ క్లూస్టీం బృందం రాధిక హత్య జరిగిన బెడ్రూంలో రక్తపు మరకలు పడిన చోటు, ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ఆధారాలు సేకరించారు. త్రీడీ క్రైంసీన్ ఫొటోగ్రఫీ, వీడీయోగ్రఫీతో ఘటన జరిగిన ప్రదేశంలో ఫొటోలు, వీడియోలు తీశారు. హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తం కడిగిన స్థలం, గతంలో ఇక్కడి క్లూస్టీం సేకరించిన ఆధారాల గురించి వివరంగా తెలుసుకొనిఅవసరమైన సమాచారాన్ని తీసుకున్నారు. నూతన టెక్నాలజీతో కావాల్సిన ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. (హంతకుడు ఎవరు..?) ఆధారాలు సేకరిస్తున్న హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం ప్రీఫైనల్ పరీక్ష రోజే హత్య..! రాధిక హత్య జరిగిన రోజే రెండో ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు 10వ తేదీ నుంచి వారాంతం వరకు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 వరకు పరీక్ష జరిగింది. కానీ ప్రీఫైనల్ పరీక్షలకు హాజరు కాలేదు. ఒక వేళ హాజరు కావాలనుకుంటే పరీక్ష సమయానికి ముందే చేరుకోవాలి. అంటే మధ్యాహ్నం 12 నుంచి 1గంటల మధ్య కళాశాలకు చేరుకోవాల్సి ఉంటుంది. రాధిక హత్య జరిగిన తీరు చూస్తే మాత్రం దాదాపుగా మధ్యాహ్నమే జరిగి ఉంటుందని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ కళాశాలకు వెళ్లాలనుకుంటే సిద్దమమ్యేటప్పుడు హత్య గురై ఉంటుందా..? అంతకుముందే హత్యకు గురైందా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పోలీసులు విచారణ జరిపినట్లు తెలిసింది. హంతకుడి జాడేది..? రాధిక హత్య కేసు విచారణ నాలుగవ రోజుకు చేరినప్పటికీ హంతకుడెవరో తెలియలేదు. గతంలో సేకరించిన ఆధారాలు, ఫోన్కాల్ డాటా, సీసీ పుటేజీల పరిశీలన, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడం వంటివి చేసినా అనుకున్న ఫలితాలను ఇవ్వలేదని తెలుస్తోంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఫోరెన్సిక్ నిపుణులు కేసుకు కావాల్సిన ఆధారాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. వాటి రిపోర్టుల వచ్చాక కేసు ఛేదనకు కావాల్సిన ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. హంతకుడెవరనే విషయంపై ఇటు పోలీసుల్లో, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాక ఏమైనా ముందుకు సాగుతుందో చూడాల్సిందే. చదవండి : గొంతు కోసి.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య -
కోటీశ్వరి కౌసల్య
కౌసల్య ‘ప్రత్యేక ప్రతిభావంతురాలు’! ఇప్పుడు కోటీశ్వరి. ప్రపంచంలోనే ఒక గేమ్ షోలో కోటి గెలిచిన తొలి ‘స్పెషల్లీ చాలెంజ్డ్’ మహిళా కంటెస్టెంట్! ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డురాదని చాటిన కౌసల్యా కార్తిక.. మాట్లాడలేరు. వినలేరు. అందుకే ఆమెలా ఆమె సాధించిన విజయం కూడా ప్రత్యేకమైనది. కౌసల్య (31) పుట్టింది, పెరిగింది అంతా తమిళనాడులోని మదురైలో. బియస్సీ టెక్నాలజీ, ఎం.ఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశారు. ఎంబిఏ కూడా. ఇన్నీ చదివిన కౌసల్య పుట్టు మూగ, చెవుడు. కౌసల్యకు భర్త, ఏడాది పిల్లాడు ఉన్నారు. కౌసల్య మదురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో జూనియర్ అసిస్టెంట్. చిన్న వయస్సు నుండే తెలివైన పిల్లగా గుర్తింపు తెచ్చుకుంది. ప్లస్ టూ వరకు నాగర్ కోయిల్ లోని బదిరుల పాఠశాలలో చదివింది. ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ ర్యాంకే. బిఎస్సీ, ఎం.ఎస్సీ, ఎంబిఏలో కూడా గోల్డ్ మెడలిస్ట్. కౌసల్యకు రెండు కలలు ఉండేవి. మొదటిది తాను చదివిన బదిరుల పాఠశాలకు సాయం చేయాలి. రెండోది ఇటలీ లేదా స్విట్జర్లాండ్ పర్యటన చేయాలి. ఈ రెండు కలలతో పాటు.. ఆత్మ విశ్వాసం ఇప్పుడు ఆమెను ‘కోటీశ్వరి’ని చేసింది. కలర్స్ చానెల్ వాళ్లు తమిళంలో మహిళల కోసం ప్రత్యేకంగా గత ఏడాది డిసెంబరు 23న ‘కోటీశ్వరి’ అనే గేమ్ షో ప్రారంభించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆ షో ప్రసారం అవుతోంది. సీనియర్ నటి రాధిక అనుసంధానకర్తగా వ్యవరిస్తున్నారు. ఈ ‘షో’లోనే కౌసల్య కోటి రూపాయలు సాధించారు. రాధిక అడిగిన ప్రశ్నలను లిప్ రీడింగ్ ద్వారా అర్థం చేసుకుని సమాధానాలను అందించిన కౌసల్య.. సుదీర్ఘంగా జరిగిన గేమ్లో కోటి రూపాయల బహుమతి సాధించారు. షో మొదటి సీజన్లోనే కోటిరూపాయల ప్రైజ్ మనీ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ప్రత్యేక ప్రతిభావంతురాలి’గా కౌసల్య నిలిచారు. కోటిరూపాయల ఫైనల్ ఎపిసోడ్ జనవరి 21 రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ్ చానెల్లో ప్రసారం అయింది. ‘‘ఈ షో ద్వారా నా రెండు కలలు నిజం కాబోతున్నాయి’’ అంటూ కౌసల్య ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి ఒక ప్రత్యేక ప్రతిభావంతురాలు కౌసల్యను ప్రపంచం చూడటం ఇదే మొదటిసారి అని రాధిక అభినందనల వర్షం కురిపించారు. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి టీవీ, చెన్నై -
ఎం.ఆర్. రాధా బయోపిక్
ఎం.ఆర్ రాధ... తమిళంలో పాపులర్ నటుడు, రాజకీయ నాయకుడు. నాటక రంగం నుంచి సినిమాకు వచ్చి హీరోగా, విలన్గా, కమెడియన్గా తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆయన సంతానమే రాధిక, రాధా రవి, నిరోషా. తన తండ్రికి నివాళిగా ఓ బయోపిక్ను రూపొందించే ఆలోచనలో ఉన్నారట రాధిక. తన నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్పై ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాకు రాధా రవి మనవడు ఐకీ రాధా దర్శకత్వం వహిస్తారట. -
ఆత్మవిశ్వాసమే ఆయుధం
దసరా అంటే శక్తికి ఉత్సవం. చెడును సంహరించిన మంచి శక్తి. చీకటిని చీల్చిన వెలుగు శక్తి. భావోద్వేగాలను జయించిన నిగ్రహ శక్తి. తనను తాను నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసపు శక్తి! అంటే శక్తికి ఆయుధం ఆత్మవిశ్వాసమే.. దసరా సందేశమూ అదే.. స్త్రీకి ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలని!! అలాంటి కథానాయికలను పరిచయం చేసిన కొన్ని సినిమాలు, ఆ శక్తి స్వరూపిణుల గురించి... ‘ఆయుధ పూజ’ సందర్భంగా..! అమ్మ కడుపులోంచే ఆడపిల్ల వినమ్రత, అణకువ, త్యాగం అనే పర్యాయ పదాలను జన్మనామాలుగా స్థిరపర్చుకొని ఈ భూమ్మీద పడ్తుంది. వీటన్నిటినీ ‘పరాధీన’ అనే ఒక్క ట్యాగ్తో కుదించేయొచ్చు. ఈ ఒక్క ఎలిమెంట్తో టన్నుల కొద్దీ సెంటిమెంట్ను పండించి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు నాడు.. నేటికి కూడా! ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటూ అమ్మ, భార్య, అక్క, చెల్లికి కుటుంబం తప్ప ఇంకో ప్రపంచం ఉండకూడదు.. కుటుంబ సేవలో గంధం చెక్కలా అరిగి తరించాలనే సందేశాన్నీ నూరిపోశాయి. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిని అహంకారిగా చూపించాయి. సరిగ్గా అలాంటి సమయాల్లోనే ఆ మూస రీళ్లను పెట్టెలో అట్టిపెట్టే కొన్ని భిన్నమైన చిత్రాలు వచ్చాయి. ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు ఆత్మగౌరవం అని చాటే సినిమాలు. వాటిల్లో ముఖ్యమైనవి అంతులేని కథ, ఇది కథ కాదు, న్యాయం కావాలి, 47 రోజులు, కోకిలమ్మ, తలంబ్రాలు. పనికి గౌరవం గంపెడు సంతానాన్ని కని.. పోషించలేక భయంతో తండ్రి పారిపోతే , వ్యసనాలకు బానిసైన అన్న బాధ్యత మరిచిపోతే.. వారి స్థానాన్ని భర్తీ చేసి ఆ ఇంటికి పెద్దగా మారి కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంటుంది ఆత్మాభిమానం గల కూతురు సరిత.. అంతులేని కథ సినిమాలో. ఆ ఇంట్లో తనకంటూ ఓ ప్రత్యేక గది, ప్రత్యేక హోదాను ఏర్పాటు చేసుకున్న సరిత ఇంట్లో వాళ్లందరికీ అహంకారిగా కనిపిస్తూంటుంది. కాని ప్రేక్షకులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూస్తారు. కుటుంబానికి ఆర్థిక వనరుగా ఉన్న పురుషుడికి ఎలాంటి హోదానిస్తారో స్త్రీకి అలాంటి హోదానే ఇవ్వాలి అని చాటిన సినిమా. అందుకే సరిత ఓ పురుషుడిలా తనకు ఓ ప్రత్యేక గదిని, హోదాను తీసుకుంటుంది. ఆర్థిక స్వాతంత్య్రం అంటే వేణ్ణీళ్లకు చన్నీళ్లే కాదు ఇంటిని నడిపించే దిక్కు అని చెప్తుంది. ‘పని నీది ఏటీఎమ్ కార్డ్ నాది’ అనే పురుష భావనకు చెక్ పెడ్తుంది. ఆత్మగౌరవంతో ఇల్లు దాటి ఆత్మవిశ్వాసంతో బయటి ప్రపంచాన్ని నెగ్గుకొచ్చిన తీరును చూపిస్తుంది. శక్తికి ప్రతీకగా నిలబెడుతుంది. ‘అంతులేని కథ’ దర్శకుడు కె. బాలచందర్. సరితగా జయప్రద, వ్యసనపరుడైన అన్న మూర్తిగా రజనీకాంత్ నటించారు. సింగిల్ మదర్ పెళ్లికి ముందు ప్రేమ.. ఏవో కారణాల వల్ల పెళ్లిదాకా రాదు. పెద్దలు కుదిర్చిన వరుడు సుగుణాకర్ రావుతో మూడుముళ్లు వేయించుకుంటుంది సుహాసిని (జయసుధ). మూణ్ణాళ్లలోనే అతనొక శాడిస్ట్ అని రుజువవుతుంది. అప్పటికే ఓ బిడ్డ పుడ్తాడు. ఇక భరించలేక విడాకులు తీసుకొని ఒంటరి తల్లిగా కొత్త జీవితం మొదలుపెడ్తుంది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా! తోడుగా ఆమె అత్తగారూ వస్తుంది. కోడలిని మరో పెళ్లి చేసుకొమ్మని ప్రోత్సహిస్తుంది. సుహాసిని ఆ ప్రయత్నంలో ఉండగా మారిపోయి మంచి మనిషి అయినట్టు మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు సుగుణాకర్రావు కేవలం ఆమె ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే. తర్వాత ఆ విషయం అర్థమైన సుహాసిని మళ్లీ పెళ్లి జోలికి వెళ్లకుండా బిడ్డను తీసుకొని ఆ ఊరు నుంచి వెళ్లిపోవడానికి రైలు ఎక్కుతుంది. వెంట అత్తగారూ వెళ్తుంది. కోడలి చంకలోంచి మనవడిని తన భుజమ్మీదికి తీసుకుంటుంది ఆమె బాధ్యతలో సాయపడ్డానికి. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న నానుడిని, మగ తోడు లేకుంటే మహిళకు జీవితం లేదు అన్న స్టేట్మెంట్ను వెక్కిరించిన సినిమా. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం తోడుంటే ఒంటరిగానే కాదు ఒంటరి తల్లిగా కూడా జీవనయానం చేయొచ్చు అని నిరూపించింది.. ‘ఇది కథ కాదు’. ఇవ్వాళ్టి ఎంతో మంది సింగిల్ మదర్స్కు స్ఫూర్తి. అత్తాకోడళ్ల అనుబంధాలకు ప్రేరణ. ‘ఇది కథ కాదు’ చిత్రం.. మహిళకు ఆత్మవిశ్వాసం అవసరాన్ని ప్రొజెక్ట్ చేసిన వాస్తవం. గుర్తింపుకోసం పోరాటం ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని శారీరక వాంఛ తీర్చుకొని, ఆమెను తల్లిని చేసి ఆ బిడ్డకు తనే తండ్రి అన్న రుజువేంటి అని ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచిన అతని మీద పోరాటం చేసి విజయం సాధించిన ఆమె ఆత్మవిశ్వాసం కథే ‘న్యాయం కావాలి’. ఇక్కడ విజయం అంటే నయానో భయానో తప్పు ఒప్పుకొని ఆమెను పెళ్లి చేసుకోవడం కాదు. ఆత్మవిశ్వాసంతో కోర్టులో నిలబడి అన్ని రకాల పురుషాహంకార పరీక్షలను తిప్పికొట్టి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం. చేసిన తప్పుకి అతను కుంగిపోవడం. ఆమె నా బిడ్డకు తల్లే అని అతని మనసు ఘోష పెట్టడం. పశ్చాత్తాపంతో ఆమె గడప తొక్కి ‘నాకు భార్యగా నీ చేయి అందించు’ అని ఏడ్వడం. చిరునవ్వుతో ఆమె తిరస్కరించి ఆడపిల్ల గౌరవాన్ని కాపాడ్డం. పందొమ్మిది వందల ఎనభైల్లోనే వచ్చిన ఈ చైతన్యంలో ‘ఆమె’ భారతిగా రాధిక, ‘అతను’ సురేశ్గా చిరంజీవి నటించారు. దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి. ‘కొత్త మలుపు’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్. తర్వాత చాన్నాళ్లకు కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘తలంబ్రాలు’ సినిమాదీ ఇంచుమించు ఇలాంటి కథే. ప్రేమించి మోసపోతే ఏడుస్తూ కూర్చోక ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతుంది. అతనికి గుణపాఠం చెప్తుంది. జీవిత, రాజశేఖర్, నందమూరి కళ్యాణచక్రవర్తి నటించారు. పెళ్లే పరమావధి కాదు ‘47 రోజులు’ సినిమా లైన్ ఇది. వైశాలి ఓ పల్లెటూరి అమ్మాయి. ఫ్రాన్స్లో ఉద్యోగం చేస్తున్న కుమార్ ఏరికోరి ఆ పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకొని పారిస్ తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో పై పోర్షన్లో ల్యూసీ అనే ఒక అమ్మాయి ఉంటూంటుంది. ‘‘ఆమె ఎవరు?’’ అని అడిగిన వైశాలికి ‘‘ఫ్రెండ్’’ అని చెప్తాడు. తన వేలికి కుమార్ తొడిగిన వెడ్డింగ్ రింగ్ను సరిచేసుకుంటూ అతణ్ణి అడుగుతుంది ల్యూసి ‘‘ఆమె ఎవరు?’’ అని వైశాలిని ఉద్దేశించి. ‘‘నా పిచ్చి చెల్లెలు’’ అని చెప్తూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు కుమార్. ల్యూసీకి చెప్పినట్టుగా వైశాలినీ తన పిచ్చి చెల్లెలుగా నటింపచేయడానికి తనలోని శాడిస్ట్ను బయటకు తెస్తాడు కుమార్. శారీరకంగా, మానసికంగా ఆమెను చిత్రహింసకు గురిచేస్తాడు. ఈలోపే వైశాలి గర్భవతి అవుతుంది. బండారం ల్యూసీకి తెలియొద్దని నాటు పద్ధతిలో వైశాలికి అబార్షన్ చేయించాలనుకుంటాడు. అక్కడే ఉన్న తెలుగు డాక్టర్ శంకర్ సహాయంతో తప్పించుకుని బయటపడి ఇండియా చేరుకుంటుంది వైశాలి.ఆమె కథను సినిమాగా తీసే క్రమంలో వైశాలిని కలవడానికి వస్తుంది ఆ పాత్ర పోషించనున్న సరిత. ‘‘మళ్లీ పెళ్లెందుకు చేసుకోలేదు మీరు’’ అని ప్రశ్నిస్తుంది సరిత. ‘‘పెళ్లి తప్ప ఆడదాని జీవితానికి ఇంకో అర్థం లేదా?’’ అంటూ అరిచేస్తుంది వైశాలి. అదీ ఆమె ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం. అంతేకాదు ఈ సినిమా బ్రేక్ చేసిన మరో మూస.. సెంటిమెంట్. మోసకారి, శాడిస్ట్ భర్తను కాదనుకున్నాక అతని బిడ్డనూ మోయడానికి ఇష్టపడదు ఆమె. మాతృత్వం అనే సోకాల్డ్ సెంట్మెంట్ను పక్కకునెట్టి అబార్షన్ చేయించుకుంటుంది. కె. బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైశాలిగా జయప్రద, కుమార్గా చిరంజీవి నటించారు. వినిపించిన ఉనికి వినికిడి శక్తిలేని కోకిలమ్మ.. ఒక డొమెస్టిక్ వర్కర్. తనకున్నదాంట్లో పదిమందికి సహాయం చేయాలనుకునే అనాథ. ఆమె ఉంటున్న దిగువ మధ్యతరగతి వాడలోకి గాయకుడవ్వాలనుకునే యాంబీషియస్ కుర్రాడు అద్దెకు వస్తాడు. వినిపించకపోయినా అతని కంఠంలోని హెచ్చుతగ్గుల కదలికల స్పర్శతో అతని పాటకు మంచి విమర్శకురాలిగా మారుతుంది. ఆమె చెప్పినట్టే అతను మంచి గాయకుడవుతాడు. పేరు, డబ్బుకు తగ్గట్టు తన ప్రవర్తననూ మార్చుకుంటాడు. ఆ వాడ వదిలి కలవారింటి అల్లుడవుతాడు. కోకిలమ్మ మనసు గాయపడుతుంది. కన్నీళ్లు రానివ్వకుండా ఆ దుఃఖాన్ని జీవితాన్ని ఈదే శక్తిగా మలచుకుంటుంది. తన పక్కింట్లోనే ఉంటున్న ఓ అవిటి స్నేహితురాలు భర్తను పోగొట్టుకుంటే ఆమెకు అండగా నిలుస్తుంది. ఆ గాయకుడు తన భార్యతో వెళ్తున్న కారు మొరాయిస్తే చేతుల్లేని తన స్నేహితురాలి సహాయంతో ఆ కారుని తోసి అతణ్ణి ముందుకు నడిపించి తన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది.. ఆత్మగౌరవాన్ని వినిపిస్తుంది. ఇవీ.. ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో స్త్రీని శక్తి స్వరూపిణిగా చూపించిన చిత్రాలు. సినిమారంగంలోని విద్యార్థులకు సిలబస్గా స్థిరపడ్డ విజువల్ పుస్తకాలు. – సరస్వతి రమ -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పోస్ట్
కక్ష సాధింపులో భాగంగా పైశాచికానందంతో ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో ఓ యువకుడు పెట్టిన పోస్టు ఇరు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతను రేపింది. ఈ పోస్టు కారణంగా ఆ యువతి, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడడంతో విధ్వంసకర పరిస్థితి చోటుచేసుకుంది. సాక్షి, చెన్నై: ఇటీవల కాలంగా సామాజిక మాధ్యమాల్లో యువతుల ఫొటోలను మార్పింగ్ చేయడం, వారి పరువును బజారు కీడ్చే రీతిలో వ్యవహరించే మృగాళ సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ఇలాంటి పోస్టింగ్ల కారణంగా ఆ యువతులు, ఆ కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురి కావడమే కాదు, బలవన్మరణాలకు పాల్పడ్డ సంఘటనలు వెలుగు చూశాయి. ఈ కేసుల్లో పట్టుబడే వారితో కఠినంగా వ్యవహరించకపోవడం కాబోలు, తప్పుల మీద తప్పులు చేస్తూ యువతుల జీవితాలతో చెలగాటం ఆడే వారి సంఖ్య పెరుగుతున్నదని చెప్పవచ్చు. అలాగే, పోలీసులు సైతం సామాజిక వర్గాల నేతల ఒత్తిళ్లతో పట్టుబడే వారిని మందలించి వదలి పెట్టడం, ఆ తదుపరి తీవ్ర పరిణామాలు ఎదురైన పక్షంలో పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఇందుకు అద్దం పట్టే విధంగా తాజాగా కడలూరులో ఘటన వెలుగుచూసింది. మొదటి నుంచి వేధింపులు.... కడలూరు జిల్లా నైవేలి సమీపంలోని కురవన్కుప్పంకు చెందిన నీలకంఠం కుమార్తె రాధిక (20) కడలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. కళాశాలలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆమెను అదే ప్రాంతానికిచెందిన పన్నీరు కుమారుడు ప్రేమ్కుమార్ టీజింగ్లతో వేధించే వాడు. తొలుత పెద్దగా పట్టించుకోనప్పటికీ, చివరకు అతడి చర్యలు శ్రుతిమించడంతో రాధికకు మనోవేదన తప్పలేదు. ఫేస్ బుక్లోనూ వేధించడం మొదలెట్టడంతో తనలోని ఆగ్రహాన్ని రాధిక బయటపెట్టింది. ఫేస్బుక్ ద్వారానే ప్రేమ్కుమార్కు చీవాట్లు పెట్టింది. అయితే, ప్రేమ్కుమార్ మరింత ఆగ్రహానికిలోనై ఎదురుదాడికి దిగాడు. ఈ ఇద్దరి మధ్య తొలుత ఫేస్బుక్లో పెద్ద సమరమే సాగింది. చివరకు విసిగి వేసారిన రాధిక ఈ వేధింపుల గురించి తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. దీంతో ప్రేమ్కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం అన్నది ఇరు సామాజిక వర్గాల మధ్య సమరం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఓ సామాజిక వర్గానికి చెందిన రాజకీయనేతలు, పెద్దల జోక్యంతో ప్రేమ్కుమార్ను పోలీసులు మందలించి వదలి పెట్టారు. మారుతాడుకుంటే..కక్ష కట్టాడు... పోలీసులు మందలించడంతో ప్రేమ్కుమార్ మారతాడని రాధిక భావించింది. అయితే, ఆమెపై అతగాడు కక్ష పెంచుకోవడమే కాదు, ఆమె పరువు బజారుకీడ్చేందుకు తగ్గ సమయం కోసం వేచి చూసినట్టున్నాడు. ఈ వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో వడలూరు పార్వతీపురంలో ఉన్న మేనత్త కుమారుడు విఘ్నేష్(23) ప్రేమలో రాధిక పడింది. ఈ ఇద్దరు తిరుగుతుండడం కుటుంబీకుల దృష్టికి చేరింది. ఇరు కుటుంబాల పెద్దలు ఆ ఇద్దరికి వివాహం చేయడానికి నిర్ణయించారు. చదువులు పూర్తి అయ్యాక పెళ్లి చేద్దామన్నట్టుగా ముందుకు సాగారు. దీంతో రాధిక, విఘ్నేష్ల ఆనందానికి హద్దే లేదని చెప్పవచ్చు. అయితే, ఈ ఆనందాన్ని ఆవిరి చేయడమే కాదు, ఆ ఇద్దరి పెళ్లి జరగకూడదని, ఇరు కుటుంబాల మధ్య వివాదాన్ని రేపే రీతిలో తనలోని మానవ మృగాన్ని ప్రేమ్కుమార్ బయటకు తీశాడు. సమయం కోసం వేచి ఉన్న ప్రేమ్కుమార్ కక్ష సాధింపులో భాగంగా పైశాచికానందంతో రాధిక ఫొటోలను మార్ఫింగ్ చేసే పనిలో పడ్డారు. అ సభ్యకరంగా ఉన్న ఆ ఫోటోలను ఫేస్బుక్లో పెట్టాడు. ఈ సమాచారం తెలుసుకున్న రాధిక తీవ్ర మనస్తాపానికి గురి అయింది. తన పరువు బజారుకెక్కడంతో కలత చెంది సోమవారం ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణం తెలుసుకున్న కుటుంబీకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రేమ్కుమార్ ఇళ్లు, వారి బంధువుల ఇళ్లపై దాడులకు దిగారు. ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదం భగ్గుమనడంతో పరస్పరం దాడులు సాగాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేయత్నం చేశారు. అదే సమయంలో రాధిక ఆత్మహత్య చేసుకున్న సమాచారం చెవిన పడడంతో విఘ్నేష్ మనోవేదనలో పడ్డారు. రాధిక లేని జీవితం తనకు వద్దు అని భావించినట్టున్నాడు. సెంగం పాళయం వద్ద ఓ చెట్టుకు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు విఘ్నేష్ వేలాడుతుండడాన్ని చూసిన అటు వైపుగా వెళ్లిన వారు ఆందోళనకు లోనయ్యారు. కిందకు దించగా, అప్పటికే మరణించి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ్కుమార్ పెట్టిన పోస్టింగ్ల కారణంగా రాధికా, విఘ్నేష్ ఆత్మహత్య చేసుకోవడం ఆ సామాజిక వర్గంలో ఆగ్రహాన్ని రేపింది. రోడ్డెక్కిన ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ప్రేమ్కుమార్ సామాజిక వర్గానికి చెందిన వారి వాహనాలపై దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కడలూరు జిల్లా యంత్రాంగం బలగాల్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. చివరకు మృత దేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే, ప్రేమ్కుమార్ను అరెస్టు చేసే వరకు మృతదేహాల్ని తీసుకోబోమని తేల్చడంతో అతడి కోసం వేట మొదలెట్టారు. తన కోసం పోలీసులు గాలిస్తుండడంతో మంగళవారం మధ్యాహ్నం కోర్టులో ప్రేమ్కుమార్ లొంగిపోయాడు. దీంతో ఇద్దరి మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆ గ్రామంలో పరిస్థితి మరలా అదుపు తప్పకుండా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాగా, ఈ వ్యవహారంపై పీఎంకే నేత రాందాసు తీవ్రంగానే స్పందించారు. ఇప్పుడు ఎవరు ఎవర్ని వేధిస్తున్నారో అన్నది స్పష్టం అవుతుందన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన బిడ్డలకు భద్రత అన్నది కరువు అవుతోందని, ఇప్పుడు ఇద్దర్నిపొట్టన పెట్టుకున్న ప్రేమ్కుమార్ లాంటి వారితో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా, లేదా అని పరోక్షంగా వీసీకే నేత తిరుమావళవన్ను హెచ్చరించడం గమనార్హం. -
యంజీఆర్ – యంఆర్ రాధల కథేంటి?
తమిళ సినీ చరిత్రలో యంజీఆర్ను యంఆర్ రాధా తుపాకితో కాల్చడం పెద్ద సంచలనంతో పాటు మిస్టరీ. ఈ సంఘటన తమిళ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోనిది, ఎప్పుడూ చర్చ జరిగే టాపిక్. ఈ కాల్పుల్లో యంజీఆర్ తన గొంతును కోల్పోవడం, ఆ తర్వాత మాటల్లో స్పష్టత లోపించడం తమిళ ప్రేక్షకులకు తెలుసు. ఎంజీఆర్ను కాల్చిన సంఘటనలో రాధా అరెస్ట్ కావడం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఘటన వెనక ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని తమిళ ప్రే„ý కులు భావిస్తున్నారు. దానికి కారణం.. యంఆర్ రాధా మీద ఓ బయోపిక్ రూపొందనుండటమే. నటి, యంఆర్ రాధ కుమార్తె రాధిక తన సొంత బ్యానర్ రధన్ మీడియా వర్క్స్పై ఈ బయోపిక్ను నిర్మించనున్నారు. రాధా మనవడు ఐకీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో రాధ పాత్రలో శింబు, యంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేసినట్టు సమాచారం. గత ఏడాదే మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో నవాబ్) సినిమాలో అరవింద స్వామి, శింబు అన్నదమ్ములుగా యాక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ మరోసారి కలసి నటించబోతున్నారన్న మాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మళ్లీ డ్యూయెట్
డ్యూయెట్ అంటే కలిసి పాడక్కర్లేదు. స్టెప్పులు వేయక్కర్లేదు.. ఆడక్కర్లేదు.మళ్లీ ఈ కాంబినేషన్ తెర మీద కనపడితే చాలు.. మన హార్ట్ బీట్ స్టెప్పులేస్తుంది. వెల్కమ్ బ్యాక్. జనం ఒకసారి ఒక హిట్ పెయిర్ను కన్ఫర్మ్ చేశారంటే వాళ్లమాట వాళ్లే వినరు. హిందీలో అలా రాజ్ కపూర్– నర్గీస్ జంటను కన్ఫర్మ్ చేశారు. తెలుగులో అక్కినేని– సావిత్రి జంటను కన్ఫర్మ్ చేశారు. తమిళంలో ఎం.జి.ఆర్–జయలలిత జంటను కన్ఫర్మ్ చేశారు. ఆ మధ్య చిరంజీవి– రాధిక, బాలకృష్ణ–విజయశాంతి, నాగార్జున–అమల, వెంకటేశ్– సౌందర్య హిట్ పెయిర్గా నిలిచారు. ఇటీవల నాగ చైతన్య– సమంత, నితిన్–నిత్యామీనన్, రాజ్తరుణ్–అవికా గోర్ వంటి పెయిర్స్ కూడా జనానికి నచ్చాయి. ఇలా ఒకసారి హిట్ అయితే ఎన్నాళ్ల గ్యాప్ వచ్చినా మళ్లీ ఒకసారి వారు తెర మీదకు వస్తే చూడాలనుకుంటారు. ఈ విషయం కనిపెట్టే చాలా గ్యాప్ తర్వాత తిరిగి శోభన్బాబు–వాణిశ్రీ–శారదల కాంబినేషన్తో ‘ఏమండీ... ఆవిడ వచ్చింది’ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు ఈ.వి.వి. సత్యనారాయణ. సినిమా వారికి కాసులు కావాలి. కనుక పాత మేజిక్ను రిపీట్ చేయడానికి వాళ్లూ ఉత్సాహం చూపుతుంటారు. అలాంటి ‘రీ– యూనియన్లు’ ఈ ఏడాది చాలానే చూడబోతున్నాం. ప్రభు–మధుబాల ‘రోజా’, ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్మేన్’ సినిమాలతో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశారు మధుబాల. ఆ తర్వాత కుటుంబం కోసం టైమ్ కేటాయిస్తూ ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్లో తన పాత కో–స్టార్ ప్రభుతో కలిసి తిరిగి యాక్ట్ చేయనున్నారు. 1996లో వచ్చిన ‘పాంచాలకురుచ్చి’ అనే సినిమాలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఓ రీమేక్ కోసం నటిస్తున్నారు. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కాలేజ్ కుమార్’ సినిమా తమిళ రీమేక్లో వీరిద్దరూ జోడీ కడుతున్నారు. అరుణ్ విజయ్, ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లు. ప్రియదర్శన్ దర్శకుడు. అమితాబ్–రమ్యకృష్ణ కెరీర్ పీక్లో ఉండగా దక్షిణాది భాషల సినిమాలను తన గ్లామర్తో నింపిన రమ్యకృష్ణ హిందీసినిమా రంగాన్ని కూడా ఆకర్షించారు. అంతేనా? ఏకంగా అమితాబ్ పక్కన నటించే చాన్స్ కొట్టేశారు. వీరిద్దరూ కలిసి ‘బడే మియా ఛోటే మియా’లో నటించారు. ఆ సమయంలో ఫ్లాపుల్లో ఉన్న హీరో మోహన్బాబుకు రమ్యకృష్ణ నట భాగస్వామ్యంతో వచ్చిన ‘అల్లుడుగారు’ హిట్ అయినట్టు డౌన్లో ఉన్న అమితాబ్కు ‘బడే మియా చోటే మియా’ కూడా బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బి, రమ్యకృష్ణ ఒక తమిళ సినిమాలో కలసి నటిస్తున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్లో అమితాబ్ తొలిసారిగా ఓకే చేసిన తమిళ చిత్రం ‘ఉయంవర మణిదన్’లో ఆయన పక్కన నటించే అవకాశం రమ్యకు దక్కింది. తమిళవానన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో యస్.జె. సూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శోభన–సురేశ్ గోపి మలయాళ ఇండస్ట్రీలో శోభన–సురేష్ గోపీది హిట్ కాంబినేషన్. ‘మణిచిత్రతాళే’, ‘ఇన్నలే’, ‘కమిషనర్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాలను ఆడియన్స్కు ఈ జంట అందించింది. ‘కమిషనర్’ 2005లో రిలీజ్ అయింది. మళ్లీ పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శోభన–సురేశ్ గోపీ ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్గా రూపొందుతున్న సినిమాలో కలిసి కనిపిస్తారు. జూలైలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రాధిక–శరత్ కుమార్ రాధిక– శరత్ కుమార్ ఆఫ్స్క్రీన్ కపుల్. ఆన్స్క్రీన్ కూడా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘నమ్మ అన్నాచ్చి’, ‘సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్కుమార్, రాధిక నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. 20 ఏళ్ల తర్వాత ‘వానమ్ కొట్టటుమ్’లో జోడీగా కనిపించనున్నారు. విక్రమ్ ప్రభు హీరోగా తెరకెక్కే ఈ చిత్రానికి ధన దర్శకుడు. కథను ధనతోపాటు మణిరత్నం అందిస్తున్నారు. సెట్స్ మీద ఉన్నవే కాదు. ఆల్రెడీ మూడు భారీ రీ యూనియన్లు ఈ ఏడాది జరిగిపోయాయి. ‘కళంక్’ చిత్రం కోసం సంజయ్ దత్–మాధురీ దీక్షిత్ 25 ఏళ్ల తర్వాత కలిశారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలైంది. ‘సాజన్’, ‘ఖల్నాయక్’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. మరో జంట అనిల్ కపూర్, జూహీ చావ్లాది కూడా హిట్ పెయిర్. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వీరి లాస్ట్ చిత్రం. పదకొండేళ్ల తర్వాత ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’ కోసం మళ్లీ çకలిశారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజైంది. అలాగే అనిల్ కపూర్– మాధురి దీక్షిత్లది కూడా మంచి జోడి. ‘ధక్ ధక్ కర్నే లగా’.. పాటలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ల కెమిస్ట్రీని అంత సులువుగా మరచిపోలేం. ఈ ఇద్దరూ సుమారు 18 సినిమాల్లో కలసి నటించారు. పద్ధెనిమిదేళ్ల తర్వాత ‘టోటల్ ధమాల్’లో అనిల్ కపూర్– మాధురీ దీక్షిత్ కలసి యాక్ట్ చేశారు. స్వీట్ కపుల్–గులాబ్ జామూన్ ఈ ఏడాది మరో రీ–యూనియన్ని సిల్వర్ స్క్రీన్ చూడబోతోంది. ఈ జోడీ కలిసి స్క్రీన్ మీద కనిపించి ఎనిమిదేళ్లు అయింది. ఈ రియల్ లైఫ్ స్వీట్కపుల్ అభిషేక్ బచ్చన్–ఐశ్వర్యారాయ్ ఇన్నేళ్ల తర్వాత ‘గులాబ్ జామూన్’ అనే సినిమా కోసం జతకట్టారు. 2010లో నటించిన ‘రావణ్’ ఈ జంట కలిసి నటించిన చివరి చిత్రం. నువ్వు నేను – మరో సినిమా కోలీవుడ్లో సూర్య–జ్యోతికలది సూపర్హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ జోడీగా సుమారు 5 సినిమాల్లో కనిపించారు. వాటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘కాక్క కాక్క’ బ్లాక్బస్టర్. సూర్య కెరీర్ యూటర్న్ తిప్పిన సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనల్లో దర్శక–నిర్మాతలు ఉన్నారని వినిపించింది. ఇందులో సూర్య, జ్యోతికలనే యాక్ట్ చేయించాలని అనుకుంటున్నారట. పదమూడేళ్లయింది వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపించి. ‘సిల్లును ఒరు కాదల్’ (తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’) జంటగా వీరిద్దరి చివరి చిత్రం. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
షాక్లో ఉన్నా
బాంబ్ బ్లాస్టులతో శ్రీలంక వణికిపోయింది. చర్చిలు, హోటల్స్లో ఆదివారం బాంబ్ బ్లాస్టులు జరగడంతో సుమారు 185 మందికిపైగా చనిపోయారు. ఈ భారీ పేలుళ్ల ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు నటి రాధికా శరత్కుమార్. బాంబు పేలుళ్లకు కొద్ది గంటల ముందు వరకూ ఆ హోటల్లోనే బస చేశారట రాధిక. ఈ విషయాన్ని ట్వీటర్లో ఆమె తెలుపుతూ – ‘‘ఓ మై గాడ్.. శ్రీలంకలో వరుస బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. నేను హోటల్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే అక్కడ పేలుడు సంభవించింది. ఇంకా నమ్మలేకపోతున్నాను. షాక్లో ఉన్నాను’’ అని పేర్కొన్నారు. శ్రీలంకలో జరిగిన ఈ విషాదానికి అన్ని సినీ ఇండస్ట్రీల ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. -
జతగా...
20 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత శరత్ కుమార్, రాధిక దంపతులు ఆన్ స్క్రీన్ కూడా జోడీగా నటించనున్నారు. గతంలో ‘నమ్మ అన్నాచ్చి, సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్కుమార్, రాధిక కలసి నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇద్దరూ జంటగా విక్రమ్ ప్రభు హీరోగా ధన దర్శకత్వంలో ‘వానమ్ కొట్టటుమ్’ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మడోనా సెబాస్టియన్ కథానాయిక. ఈ చిత్రానికి కథ– మాటలు మణిరత్నం, ధన సమకూర్చారు. జూలైలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. -
చిన్నితెర పెద్ద రికార్డ్!
పెద్ద తెర మీద ఎంత పాపులారిటీ సంపాదించారో బుల్లి తెర మీదా అంతే సంఖ్యలో అభిమానులను అలరించారు సీనియర్ నటి రాధిక. తాజాగా బుల్లితెర మీద పెద్ద రికార్డ్ నెలకొల్పారు. సుమారు 3430 గంటలు సీరియల్స్లో కనిపించారట. ‘‘టెలివిజన్ సీరియల్స్లో సుమారు 6850 ఎపిసోడ్స్లో నటించాను. అంటే 3430 గంటలు. ఇలాంటి ఫీట్ సాధించినందుకు నటిగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రెండు నెలలు షార్ట్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. మళ్లీ జూన్ నుంచి సరికొత్త అవతారంలో సన్టీవిలో రాత్రి 9.30 అలరిస్తూనే ఉంటాను. నాకు ఎల్లప్పూడు ప్రేమను పంచే అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాథిక. -
ద్వేషం స్థానంలో ప్రేమ నిండాలి
‘‘ఇలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాం మనం (ఆగ్రహావేదన). అవును.. మా నాన్నగారు సూపర్ బ్లెస్డ్. అద్భుతమైన భార్య దొరికారు. నలుగురు సంతానం ఉన్నారు. ఒక మనవడు ఉన్నాడు. ఆయన్ను ఎంతగానో ప్రేమించే కుటుంబం ఉంది. మాది మిక్స్డ్ ఫ్యామిలీ. మమ్మల్ని ట్రోల్ (విమర్శించే) చేసే వారి మనసుల్లోని ద్వేషం స్థానంలో ప్రేమ నిండుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రేయాన్. ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? నటిరాధిక మొదటి కుమార్తె రేయాన్. కాగా, శరత్కుమార్, రాధికలు 18 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఇటీవల శరత్ కుమార్, రాధికల పెళ్లిరోజు సందర్భంగా రేయాన్ తన కొడుకుతో శరత్–రాధికలు ఉన్న ఫోటోను ‘లవ్బర్డ్స్. హ్యాపీ యానివర్సరీ’ అనే ట్యాగ్తో సోషల్మీడియాలో షేర్ చేశారు. రేయాన్ చేసిన ఈ పోస్ట్ను కొందరు నెటిజన్లు ‘‘శరత్కుమార్ ఈజ్ బ్లెస్డ్. రెండో భార్య రాధిక మొదటి కుమార్తె (రేయాన్) కొడుకుతో శరత్ కుమార్’’ అని హేళన చేసే విధంగా పేర్కొన్నారు. ఈ కామెంట్కే రేయాన్. పైవిధంగా స్పందించారు. రేయాన్ చేసిన పోస్ట్ను రాధిక ట్యాగ్ చేసి...‘‘రేయాన్.. మన బాధ ఎవరికీ తెలీదు. కానీ మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాలను చూడటానికి అర్హత లేని గుడ్డివారు ట్రోల్ చేస్తున్నారు. వారిని అలాగే వదిలేయ్. అలాగే వేదనతో బతకనివ్వు. మనం మనలాగే హ్యాపీగా ఉందాం’’ అని అన్నారు రాధిక. -
మౌంట్ ఎస్పీ
రెండేళ్ల క్రితం రెండు శిఖరాలు, రెండువేల పదిహేడులో మూడు, రెండువేల పద్దెనిమిదిలో రెండు శిఖరాలు.. పద్ధతిగా పాఠాలు విని పరీక్షలు రాసినట్లు, ఒద్దిగ్గా దేశ పతాకాన్ని ఆరుచోట్ల ఆవిష్కరించారు ఆక్టోపస్ ఎస్పీ రాధిక. శిఖరాలను అధిరోహించిన రికార్డులతోపాటు ఆక్టోపస్ ఉద్యోగమూ ఓ రికార్డే. ఆక్టోపస్ విభాగంలో తొలి మహిళా పోలీస్ అధికారి ఆమె.పర్వతారోహణల్లోనూకొన్ని తొలి రికార్డులు సాధించిన రాధిక... ఈ శిఖరాలన్నింటికంటే తండ్రి కోరుకున్న శిఖరాన్ని చేరుకున్నప్పుడే ఎక్కువ సంతోషాన్ని పొందానంటారు! ఏపీ ‘ఆక్టోపస్’ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాధిక పుట్టింది అనంతపూర్, పెరిగింది కడప. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో. తండ్రి కోరిక ప్రకారం ఎం.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్ చదివారు. ఐదున్నరేళ్లు లెక్చరర్గా ఉద్యోగం చేశారు. తండ్రి కోరిక ప్రకారమే గ్రూప్ వన్ అధికారి కావాలనుకున్నారు, పోలీసు అధికారి అయ్యారు. బంగారంలాంటి లెక్చరర్ ఉద్యోగం వదులుకుని పోలీసు ఉద్యోగానికి వెళ్తానంటావా!, ఆడపిల్లకు అంత రిస్క్ ఎందుకు, పైగా మంచి ఉద్యోగం వదులుకుని మరీ రిస్క్ ఎక్కువగా ఉండే ప్రొఫెషన్లోకి పోతారా ఎవరైనా!.. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు ఇవన్నీ. ‘‘నాన్నకు నేను గ్రూప్ వన్ ఆఫీసర్ని కావడం ఇష్టం. లైఫ్ చాలెంజింగ్గా ఉండటం నాకిష్టం. పోలీస్ ఉద్యోగంతో ఇద్దరి ఇష్టాలు నెరవేరుతాయి’ ఇదీ రాధిక సమాధానం. మౌంటనియరింగ్ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకుంటూ.. ‘ఎన్ని శిఖరాగ్రాలు చేరినా నేలకు దిగాల్సిందే, ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాల్సిందే’ అన్నారు రాధిక. అన్నింటికంటే నాన్న కోరుకున్నట్లు గ్రూప్ వన్కి సెలెక్ట్ అయినప్పుడు నిజంగా శిఖరాన్నధిరోహించిన సంతోషాన్ని పొందాను. నాన్నయితే తాను ఎవరెస్టు ఎక్కినంతగా సంతోషపడ్డారు. ఆయనకు అంత సంతోషాన్నిచ్చిన దేవుడు.. నన్ను యూనిఫామ్లో చూసే వరకు ఆయన్ని ఉంచలేదు. నా అచీవ్మెంట్స్ను చూస్తున్న అమ్మ... తాను సంతోష పడుతూ నాన్న చూడలేకపోయాడని బాధ పడుతుంటుంది’’ అని ఉద్వేగంగా చెప్పారు రాధిక. భక్తిగా తొలి పర్వతం రాధిక తొలి పర్వతారోహణ హిమాలయాల్లో మానస సరోవర్ యాత్ర. హిమాలయాల మీద ఇష్టంతో ఒక భక్తురాలిగా మాత్రమే మానస సరోవర్ పరిక్రమ చేశానన్నారు. ఆ పరిక్రమకు చాలా మంది పోనీ (పొట్టి గుర్రాలు), పోర్టర్ల సహాయం తీసుకుంటారు. రాధిక తన సామాను తానే మోసుకుంటూ కాలి నడకన పరిక్రమ పూర్తి చేయడం చూసిన తోటి ప్రయాణికురాలు దీప్తి (ముంబయిలో అడ్వొకేట్) ‘ఫిట్నెస్ బాగుంది, మౌంటనియరింగ్ కోర్సు చేయవచ్చు కదా’ అన్న మాటలే రాధికను పర్వతాల బాట పట్టించాయి. మానస సరోవర్ యాత్ర పూర్తి చేసుకుని డ్యూటీకి వచ్చిన తర్వాత రాధిక తన పై అధికారులను పర్వతారోహణకు అనుమతి అడిగినప్పుడు వాళ్లు సంతోషంగా అంగీకరించారు. ‘డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ను ఎంకరేజ్ చేస్తుంటాం. అడ్వెంచర్ స్పోర్ట్ అయిన మౌంటనియరింగ్లోనూ రాణించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు నో అంటాం’ అని తెలంగాణ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ త్రివేది ప్రోత్సహించారు. అలా 2013లో కశ్మీర్ రాష్ట్రం, పెహల్గామ్లో మౌంటనియరింగ్ కోర్సులు చేశారు రాధిక. శిక్షణలో భాగంగా గోలప్ కాంగ్రి శిఖరాన్నీ అధిరోహించారు. ఎవరెస్టు అధిరోహణకు ముందు ఐఎమ్ఎఫ్ ఆల్ ఉమెన్ ఎక్స్పెడిషన్లో మౌంట్ మెంటోసా శిఖరాన్ని చేరుకున్నారు. ఆ శిఖారోహణ చేసిన తొలి దక్షిణ భారత మహిళ రాధిక. తర్వాత కార్గిల్లో మౌంట్ కున్ శిఖరాన్ని చేరారు. ఈ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఆమె. ఇవన్నీ ఎవరెస్టు అధిరోహణ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి తనకు తాను పెట్టుకున్న పరీక్షలు. ఇక నెక్స్›్ట గోల్ ఎవరెస్టే! హిమాలయాల్లో తరచూ మారే వాతావరణానికి అనుగుణంగా బాడీ తట్టుకోవడం కోసం స్కీయింగ్ కోర్సు కూడా చేశారామె. ‘‘మూడు దశల కోర్సు(బేసిక్, ఇంటర్మీడియెట్, అడ్వాన్స్డ్) కోసం ఆరు వారాల పాటు గడ్డకట్టే చలిలో ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ప్రాక్టీస్ చేయడంతో ఎవరెస్ట్ను ఎక్కగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’’ అన్నారు రాధిక. అమ్మా.. నీ కేదయినా అయితే! ‘‘ఎవరెస్టు అధిరోహణకు అవసరమైన ఫైనాన్షియల్ సపోర్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకుంటున్నప్పుడు మా చిన్నవాడు నా దగ్గరగా వచ్చి ‘‘అమ్మా! నీకేదైనా అయితే’’ అన్నాడు. అప్పటికేదో సర్ది చెప్పాను. ఎవరెస్టు ఎక్కే వరకు కూడా ఆ మాట గుర్తు రాలేదు. దిగి వచ్చేటప్పుడు మృతదేహాలు కనిపిస్తాయి. అప్పుడు మా చిన్నవాడి మాటలు గుర్తొచ్చాయి. నిజానికి యుద్ధం ఎలాంటిదో మౌంటనియరింగ్ కూడా అలాంటిదే. యుద్ధరంగంలో అడుగు పెట్టే వరకే ఆలోచించాల్సింది. ఆ తర్వాత యుద్ధం చేయడం ఒక్కటే మన ముందుండే ఆప్షన్. చిన్నప్పటి నుంచి ఆటలు, సైక్లింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం. ప్రతి రోజూ చాలెంజింగ్గానే ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ని, మౌంటనియరింగ్నీ అంతగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఏడు శిఖరాల కోరిక ఆదిలాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్సూచనతో మౌంట్ కిలిమంజారోకి వెళ్లాను. అది పూర్తయిన తర్వాత ఏడు ఖండాలు, ఏడు శిఖరాలను అధిరోహించాలనే కోరిక కలిగింది. ఆస్ట్రేలియాలో ఎల్తైన శిఖరం కోసియోస్కోతో కలిపి ‘టెన్ అస్సీ పీక్ చాలెంజ్’కి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఫండింగ్ ఇచ్చింది. తర్వాత విభజన క్రమంలో ఏపీకి మారాను. చిత్తూరు అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఓఎన్జీసీ సహకారంతో యూరప్లోని ఎల్బ్రస్, దక్షిణ అమెరికాలోని అంకాకాగువాకి వెళ్లాను. మిగిలిన రెండింటికీ ఏపీ ప్రభుత్వం సహకరించింది. ప్రకృతిదే పై చేయి అలాస్కాలో మౌంట్ దేనాలి పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు ప్రకృతి విషమ పరీక్ష పెట్టింది. ఇరవై రోజుల పాటు పాతిక కేజీల బ్యాగ్ మోసుకుంటూ, తాడు పట్టుకుని అరవై డిగ్రీల కోణంలో పర్వతాన్ని ఎక్కిన తర్వాత, ఇక కేవలం 338 మీటర్లు ఎక్కితే సమ్మిట్ పూర్తవుతుందనగా విధిలేక ఆపేయాల్సి వచ్చింది. రాళ్లతో చాచి ముఖం మీద కొట్టినట్లు చిమ్ముతోంది మంచు. వాతావరణం సహకరించే వరకు ఆగక తప్పని స్థితి అది. అప్పుడు కలిగింది మాటల్లో చెప్పలేనంత బాధ. రెండున్నర గంటలు వెదర్ సహకరిస్తే ఆరోహణ పూర్తయ్యేది. మేము విరామం తీసుకున్నప్పుడు మంచు తుపాను రాలేదు. మళ్లీ కదిలిన రోజు వెదర్ వికటించింది. రెండు రోజులు ఉండి ప్రయత్నిద్దామా అంటే... మమ్మల్ని పికప్ చేసుకోవాల్సిన ఫ్లయిట్ వచ్చేసింది. ప్రైవేట్ ఎక్స్పెడిషన్ అయితే మరొక చాన్స్ కోసం ఎదురు చూడవచ్చు. కానీ అది చాలా ఖరీదవుతుంది. మాకున్న ఫండింగ్ సరిపోదు. ప్రకృతి నిర్ణయానికి తలవంచాల్సిన పరిస్థితి అది. అప్పుడు వెళ్లిన టీమ్లన్నీ వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. మనమెంత చిన్నవాళ్లమో ‘మౌంటనియరింగ్ వల్ల ఏం సాధిస్తారు’ అనే ప్రాథమిక ప్రశ్న దాదాపుగా ప్రతి మౌంటనియర్కీ ఎదురవుతుంది. పర్వతాన్ని అధిరోహించినప్పుడు మనం ఎంత చిన్న వాళ్లమో తెలుస్తుంది. ఇంత పెద్ద చరాచర జగత్తులో మనం పిపీలికంతో సమానమనే వాస్తవాన్ని తెలుసుకుంటాం. అన్నింటికంటే ప్రధానంగా మనలోని ఇగో తొలగిపోతుంది. మనం ఎందులోనూ అధికులం కాదని తెలుసుకుంటాం. ఇది సమ్మిట్ విఫలమైనప్పుడు కలిగే భావన కాదు, సక్సెస్ అయినప్పుడు కూడా నేర్చుకునే పాఠం ఇదే. ఇలాంటి ప్రతికూల పరిస్థితి గత నెలలో చేసిన ఆరవ ఎక్స్పెడిషన్ అంటార్కిటికా విన్సన్లోనూ జరిగింది. అయితే పీక్ను చేరుకుని తిరిగి బేస్ క్యాంపుకి వచ్చిన తర్వాత వాతావరణం సహకరించకపోవడంతో ఫ్లయిట్ రాలేదు. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది రోజులు ఎదురుచూశాం. మాతో తీసుకెళ్లిన రేషన్.. మరో రెండు మూడు రోజులకే వస్తుంది. పది రోజులు రావాలంటే ఉన్నదే సర్దుకుంటూ తిన్నాం. నీటి కోసం మంచు కరిగించుకున్నాం. ఆ ఫ్యూయెల్ కూడా మరీ ఎక్కువేమీ ఉండదు. రోజుకు ఒకటిన్నర– రెండు లీటర్ల నీటితో సరిపెట్టుకున్నాం. వయసు అడ్డంకి కాదు నాతోపాటు అంటార్కిటికాలో విన్సన్ పర్వతారోహణకు వచ్చిన వారిలో నార్వే నుంచి వచ్చిన లీస్జెత్కి 61 ఏళ్లు. కెనడా సిల్వీకి 54, మొరాకో బుష్షాకు 48. మా టీమ్లో నేనే చిన్నదాన్ని. నన్ను నలభై దాటాక, ఈ వయసులో పర్వతాలెక్కడానికి వెళ్లడమా అన్న వాళ్లున్నారు. తీరా దేశం బయట అడుగు పెడితే నేను పెద్దదాన్ని కాదు చిన్నదాన్ని అనిపించింది. ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడం చాలా అవసరం. ‘ఎ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ’ అనేది అన్ని కాలాలకూ అన్ని ప్రదేశాలకూ వర్తిస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి, జీవితం ఆరోగ్యకరంగా ఉంటుందని నమ్ముతాను. ఇక నా ఫ్యామిలీ అంటారా.. మాది లవ్ కమ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. కాబట్టి మా వారు (వేణుగోపాల్రెడ్డి) దేనికీ అడ్డు చెప్పరు. అన్నింటిలోనూ మంచి సపోర్టును ఇస్తారు’’ – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటో : వి. రూబిన్ బెసాలియల్ పెద్ద గీత ముందు అన్నీ చిన్న గీతలే ప్రకృతి పెట్టే పరీక్షలకు ఓర్చి పర్వతాలెక్కి సాధించేదేమిటంటే... మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భూమ్మీద ఎదురయ్యే కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని, చీర కొనివ్వలేదని, లవ్ బ్రేకప్ అయిందని ఆత్మహత్యకు పాల్పడే వాళ్లకు, అది ఎంత అవివేకమైన పనో తెలియజెప్పాలనిపిస్తుంది. జీవితాన్ని ఉపయుక్తంగా మలచుకోవాలి. సాధించగలిగిన గోల్స్ను నిర్దేశించుకోవాలి, వాటిని నెరవేర్చుకోవడానికి ఎంత శ్రమ అవసరమో అంతగా శ్రమించాలని అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాం. ఇంకా ముఖ్యంగా అమ్మాయిలకు పరిధులు గీయవద్దని తల్లిదండ్రులకు నచ్చ చెప్పడానికి నన్ను నేను ఉదాహరణగా చూపించుకోగలుగుతున్నాను. – జి.ఆర్. రాధిక, ఎస్.పి, ఆక్టోపస్ విభాగం, ఆంధ్రప్రదేశ్ సప్త పర్వత ఆరోహణ ►మౌంట్ ఎవరెస్ట్ 2016 మే 20 ►మౌంట్ కిలిమంజారో 2016 ఆగస్టు 14 ►మౌంట్ కోసియోస్కో 2017 మార్చి 17 ►మౌంట్ ఎల్బ్రస్ 2017 సెప్టెంబర్ 8 ►మౌంట్ అకాంకాగువా 2017 డిసెంబర్ 30 ►మౌంట్ దేనాలి 2018 జూలై 4 (వాతావరణం సహకరించక శిఖరాన్ని చేరలేదు) ►మౌంట్ విన్సన్ 2018 డిసెంబర్ 16 -
బాల్కొండ బరిలో వేముల ప్రశాంత్ సోదరి?
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రసవత్తర పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డికి టీఆర్ఎస్ ఇప్పటికే టికెట్ కేటాయించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అనూహ్యమైన అభ్యర్థిని తెరపైకి తెస్తోంది. ప్రశాంత్రెడ్డి సొంత చెల్లెలు, దివంగత నేత వేముల సురేందర్రెడ్డి కుమార్తె రాధికారెడ్డిని బరిలో దింపాలని పావులు కదుపుతోంది. జౌళిశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న రాధికతో ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరిపారని, అన్నపై పోటీ చేసేందుకు ఆమెను దాదాపు సంసిద్ధురాలిని చేశారని సమాచారం. నిజానికి పార్టీ ఎన్నికల కమిటీ సిద్ధం చేసిన జాబితాలో రాధికారెడ్డి పేరు ఎక్కడా లేదు. ఇటీవల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్దాస్ బృందం రాష్ట్ర పర్యటన సందర్భంగా అనూహ్యంగా రాధికారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పార్టీలోని కొందరు సీనియర్ నేతలే ఆమె అభ్యర్థిత్వాన్ని కమిటీ దృష్టికి తెచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రశాంత్రెడ్డిని బాల్కొండలో ఓడించాలంటే, అదే నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ, వేల్పూర్, భీంగల్లో దివంగత సురేందర్రెడ్డి అనుచరవర్గంతో సాన్నిహిత్యం ఉన్న రాధికను నిలబెట్టాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో రాధికారెడ్డిని బాల్కొం డ బరిలో నిలిపే అంశమై పార్టీ పెద్దలు, జిల్లా నేతల నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాలు సేకరిం చింది. ఆమె అభ్యర్థిత్వంపై సానుకూలత రావడంతో పార్టీ పెద్దలు కొందరు నేరుగా రంగంలోకి దిగి ఆమె తో చర్చలు జరిపారు. పోటీ అంశమై ఆమె అభిప్రాయాన్ని తీసుకున్నారు. తన తండ్రి ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నానని తెలిపిన ఆమె, టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చినట్లుగా తెలిసింది. అధికారికంగా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన ఈరవత్రి అనిల్ సైతం టికెట్ రేసులో ఉన్నా రు. రాధికను నిలబెట్టాలని భావిస్తే అనిల్కు పార్టీ ఎలాంటి హామీ ఇస్తుంది, అందుకు ఎలా ఒప్పిస్తారన్నది కీలకంగా మారింది. ఒకవేళ రాధికను బరిలోకి దింపితే మాత్రం బాల్కొండలో అన్నాచెల్లెళ్ల మధ్య ఆసక్తికర పోరు తప్పదనే వాదన వినిపిస్తోంది. -
విపత్తు ఏంటి?
చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా, రాధిక హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘గండభేరుండ’. సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. శ్రీసాయిదేవ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను, ట్రైలర్ని దర్శక–నిర్మాత సాయివెంకట్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ హైదరాబాద్లో విడుదల చేశారు. ‘గండభేరుండ’ సినిమా మంచి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. సూర్యన్ మాట్లాడుతూ– ‘‘గండభేరుండ’ అనే పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్ని అత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే కథాంశంతో రూపొందిన సోషియో ఫ్యాంటసీ హారర్ ఎంటర్టైనర్ చిత్రమిది. మలేసియాలో చేయించిన 17 నిమిషాల నిడివి గల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 5న విడుదల కానున్న మా సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు చల్లమళ్ల రామకృష్ణ. రాధిక, పవన్ కుమార్, విలన్ పాత్రధారి రవికిరణ్ శొంఠి, డైరెక్టర్ సుచరిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్. -
అన్నయ్యతో కలిసి...
తమిళనాట ఎంతో పాపులారిటీ సంపాదించిన నటుడు, రాజకీయ నాయకుడు ఎం.ఆర్. రాధా. ఆయన వారసుడు రాధారవి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇక రాధిక అప్పట్లో కథానాయికగా, ఇప్పుడు క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా సంపాదించుకున్న పేరు గురించి తెలిసిందే. 1980లలో ఎన్నో సినిమాల్లో ఈ అన్నాచెల్లెళ్లు ఆన్ స్క్రీన్ కూడా అన్నాచెల్లెళ్లుగా నటించారు. లేటెస్ట్గా ఓ తమిళ సినిమా కోసం ఈ ఇద్దరూ మళ్లీ స్క్రీన్పై బ్రదర్ అండ్ సిస్టర్గా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అధర్వ మురళీ హీరోగా శ్రీ గణేష్ తెరకెక్కించనున్న ‘కురుది అట్టమ్’లో రాధిక, రాధారవి చాలా గ్యాప్ తర్వాత కలిసి యాక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు తెలియజేస్తూ – ‘‘రాధిక, రాధారవి మా సినిమాకు కచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. ఆ క్యారెక్టర్స్ రాసుకున్నప్పటి నుంచీ వీళ్లను తప్ప వేరే వాళ్లను ఊహించుకోలేదు. ఇద్దరికీ నా కథ నచ్చి ఒప్పుకోవడం నాకు చాలా గ్రేట్ మూమెంట్’’ అని పేర్కొన్నారు. -
ఆన్ స్క్రీన్.. ఆన్ సెట్స్
ఏడాది తిరగక ముందే తమిళ హీరో శివకార్తీకేయన్తో హీరోయిన్ నయనతార మళ్లీ జోడీ కట్టారు. గతేడాది ‘వేలైక్కారన్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజేష్ దర్వకత్వంలో ఈ జంట నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. రాధిక, సతీష్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా మొదలైన 25 రోజుల తర్వాత సెట్లో జాయిన్ అయ్యారు నయనతార. యాక్షన్ ఎలిమెంట్స్తో కామెడీ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం సాగనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ రేపు స్క్రీన్కి రానుంది. అలాగే శివ కార్తీకేయన్ నెక్ట్స్ రిలీజ్ ‘సీమరాజా’. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కానుంది. -
లవ్లీ టీమ్తో...
సౌత్ లాంగ్వేజెస్లోనే కాదు హిందీ భాషలోనూ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు అలనాటి కథానాయిక రాధిక. 1980లలో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. రీసెంట్గా తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో తల్లి పాత్రలో కనిపించారామె. ఇప్పుడు శివకార్తీకేయన్ హీరోగా రాజేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ తమిళ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు రాధిక. ‘లవ్లీ టీమ్తో జాయిన్ అయ్యాను’ అని ఆమె షూటింగ్ స్పాట్ ఫొటోను షేర్ చేశారు. నయతనార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో హాస్యనటులు యోగిబాబు, సతీష్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. -
కోలీవుడ్కు మరో శాండిల్వుడ్ బ్యూటీ
తమిళసినిమా: శాండిల్వుడ్ వర్ధమాన నటి రాధిక ప్రీతి కోలీవుడ్లో పేరు తెచ్చుకోవాలని ఆశ పడుతోంది. ఈమె తండ్రి కన్నడిగుడైనా, తల్లి మాత్రం తమిళనాడుకు చెందినవారేనట. కర్ణాటకలోని కోలార్లో పుట్టి పెరిగిన రాధికప్రీతి తమిళభాషను సరళంగా మాట్లాడగలదట. అంతేకాదు తమిళ భాష అన్నా, తమిళ చిత్రాలు అన్నా చాలా ఇష్టం అంటోంది. ఈ అమ్మడు ఇటీవల నటించిన కన్నడ చిత్రం రాజా లవ్స్ రాధే చిత్రం విడుదలై మూడవ వారం విజయవంతంగా ప్రదర్శింపబడుతోందట. తాజా కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ బ్యూటీ నటించిన ఎంబిరాన్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. నినైత్తది యారో చిత్రం ఫేమ్ రెజీత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా కృష్ణన్ పాండి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మహిళ్ తిరుమేని శిష్యుడన్నది గమనార్హం. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ థ్రిల్లర్తో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఎంబిరాన్ చిత్రం ఉంటుందన్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, జూలైలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. పంజవర్ణం ఫిలింస్ పతాకంపై పంజవర్ణం నిర్మిస్తున్న ఈ చిత్రంపై నటి రాధిక ప్రీతి చాలా ఆశలు పెట్టుకుందట. దీని గురించి ఆమె తెలుపూ ఎంబిరాన్ చిత్రం నటిగా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని, తమిళంలో పలు చిత్రాలు చేయాలని ఆశ పడుతున్నట్లు అంటోంది. మోడ్రన్ పాత్రల్లో నటించడం తనకు ఇష్టమేనని, అయితే ఆ పేరుతో అందాలారబోతకు మాత్రం అంగీకరించనని అంది. మంచి కథలతో వచ్చే దర్శకుల కోసం ఎదురు చూస్తున్నట్లు రాధికా ప్రీతి చెప్పింది. ఎంబిరాన్ చిత్రానికి ప్రసన్ బాలా సంగీతాన్ని అందించారు. ఈయన ఇంతకు ముందు యాగవరాయినుం నా కాక్క చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించారన్నది గమనార్హం. పుహళేంది ఛాయాగ్రహణం అందించారు. -
సౌర విద్యుత్ను విస్తరిద్దాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్.. పేరు వినడానికి సింపుల్గానే అనిపిస్తుంది. ప్రాక్టికల్గానే కాసింత కష్టం. కారణం.. ఇన్స్టలేషన్, నిర్వహణ, పనిచేసే విధానం అంత సులువుగా అర్థం కావు! ఈ రంగంలోని బడా కంపెనీలేమో మెట్రోలకే పరిమితమయ్యాయి. గ్రామీణ, ఎంఎస్ఎంఈలకు సౌర వెలుగులు అందటంలేదు. దీనికి పరిష్కారం కనుగొంది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ఫ్రెయర్ ఎనర్జీ. ‘సన్ ప్రో’ యాప్ ఆధారంగా కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా సౌర ఏర్పాట్లు చేస్తోంది. దీంతో కంపెనీలకు ఎలాంటి పెట్టుబడి లేకుండానే గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించినట్టవుతుంది. పైగా బ్యాంక్లతో ఒప్పందం చేసుకొని కస్టమర్లకు రుణాలనూ అందిస్తుంది. మరిన్ని వివరాలను ‘ఫ్రెయర్’ కో–ఫౌండర్ రాధిక చౌదరి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది హైదరాబాద్. ఉస్మానియాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. అమెరికాలో న్యూక్లియర్ ఎనర్జీలో మాస్టర్స్ చేశా. తర్వాత జీఈ కంపెనీలో పవన విద్యుత్ విభాగంలో చేరా. అక్కడి నుంచి ఎస్కేఎఫ్ బేరింగ్స్లో చేరా. పెళ్లయి, పిల్లలు పుట్టడంతో 2008లో ఇండియాకు తిరిగి వచ్చేశా. హైదరాబాద్లో ల్యాంకో ఇన్ఫ్రాలో సోలార్ విభాగ డీజీఎంగా చేరా. ఆర్థిక సంక్షోభంతో కంపెనీ ఢిల్లీకి మారింది. ఢిల్లీకి వెళ్లటం ఇష్టం లేక నేను హైదరాబాద్లోనే ఉన్నా. అప్పుడే మరో మిత్రుడు సౌరభ్ మర్ధాతో కలిసి రూ.కోటి పెట్టుబడితో 2014లో ఫ్రెయర్ ఎనర్జీని ఆరంభించాం. నెలకు రూ.5 కోట్ల ఆర్డర్లు.. రూఫ్ టాప్స్, బోర్వెల్స్, పెంట్రోల్ బంక్లు, మైక్రో గ్రిడ్ నాలుగు విభాగాల్లో సౌర విద్యుత్ను అందిస్తున్నాం. రూ.5 కోట్ల విలువైన ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి ఆర్డర్పై మాకు 10 శాతం లాభం ఉంటుంది. ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ వంటి విద్యుత్ విభాగాలతో పాటు యాక్సిస్ బ్యాంక్ వంటి పలు కమర్షియల్ ప్రాజెక్ట్లనూ నిర్వహిస్తున్నాం. త్వరలోనే తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సౌర విద్యుత్ ఏర్పాట్లకు ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. మా మొత్తం సౌర విద్యుత్ నిర్వహణలో ఎంఎస్ఎంఈ 40 శాతం, రూఫ్ టాప్ 20 శాతం వరకూ ఉంది. 14 రాష్ట్రాలు, విదేశాల్లోనూ సేవలు.. ప్రస్తుతం ఫ్రెయర్ ఎనర్జీతో 10 వేల మంది చానల్ పార్టనర్స్ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో 500 మంది యాక్టివ్గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, చంఢీగఢ్, ఢిల్లీ వంటి 14 రాష్ట్రాల్లో 900 పైగా సోలార్ సిస్టమ్స్ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 6 మెగావాట్ల సౌర విద్యుత్ను నిర్వహిస్తున్నాం. మన దేశంతో పాటూ ఆఫ్రికా దేశాల్లోనూ చానల్ పార్టనర్స్ ఉన్నారు. వచ్చే రెండేళ్లలో 15 దేశాలకు విస్తరణ, 8 మెగావాట్ల సోలార్ విద్యుత్ నిర్వహణకు చేరాలని లకి‡్ష్యంచాం. 2 నెలల్లో రూ.20 కోట్ల సమీకరణ.. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.12 కోట్లు ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.80 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే టెక్నాలజీ విభాగంలో మరో 15 మందిని తీసుకోనున్నాం. గత 18 నెలల్లో పలువురు సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్లు మా సంస్థలో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు. రాబోయే 2 నెలల్లో 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనున్నాం. యూరప్, సింగపూర్లకు చెందిన ఇన్వెస్టర్లతో చర్చలు ముగిశాయి’’ అని రాధిక వివరించారు. -
ఆమే.. ఆ నలుగురు
ఒకరి ప్రాణం పోయినప్పుడు కుటుంబానికి శ్వాస ఆడదు. బాధను దిగమింగుకోవాలా? నలుగురితో నిట్టూర్చాలా? మనకెవరికైనా రాకూడని అలాంటి కష్టమే వస్తే.. చుట్టూ నలుగురుంటారు. మరి లేని వారికో? రాధ ఉంది. ఆమే.. ఆ నలుగురు. ఒక దెబ్బకే పొడి పొడి అయి రాలిపోయే బలహీనమైన శిలకు ఎప్పటికీ ఏ రూపమూ రాదు. ఉలి దెబ్బలను కాచుకోగలిగిన గండశిలలే శిల్పాలు అవుతాయి. కర్ణాటక రాష్ట్రం, మంగళూరులోని అంబులెన్స్ డ్రైవర్ రాధిక జీవితమే ఇందుకు సాక్ష్యం. జీవితం కొట్టిన దెబ్బలకు ఆమె తట్టుకుని నిలబడ్డారు. ఆ దెబ్బలు ఆమెను చక్కటి బతుకు శిల్పంగా మలిచాయి. 2002లో అంబులెన్స్ డ్రైవర్గా స్టీరింగ్ పట్టుకున్న రాధిక ఇప్పుడు ‘కావేరీ అంబులెన్స్ సర్వీసెస్’ పేరుతో పన్నెండు అంబులెన్స్లను నడుపుతున్నారు. ఆరవ తరగతితో చదువు ఆపేసిన రాధిక, పెళ్లి చేసుకుని హసన్ జిల్లా నుంచి భర్తతో పాటు మంగళూరుకు వచ్చింది. ఇద్దరు బిడ్డలకు తల్లిగా ఇంటిని దిద్దుకుంటూ గడిపిన రాధిక ఈ రోజు ప్రపంచానికి ఇలా పరిచయం కావడానికి వెనుక ఉన్న కథే ఆమె జీవితం. అది ఆమె సాధించిన విజయం కూడా. బతుకుబండి తిరగబడింది రాధిక భర్త సురేశ్ మంగళూరులో అంబులెన్స్ నడిపేవాడు. ఆ కుటుంబానికి అన్నం పెట్టేది ఆ అంబులెన్సే. అయితే అది అరకొరగానే కడుపు నింపేది. కర్ణాటక ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం రాగానే అంబులెన్స్ను వదిలి పెట్టి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిపోయాడు సురేశ్. ఖాళీగా ఉన్నప్పుడు రాధికకు డ్రైవింగ్ నేర్పించడానికి తప్ప ఆ అంబులెన్స్ను వాడటం మానేశాడు. జీవితం హాయిగా గడుస్తుందనుకునే లోపు సురేశ్ని లంగ్ కేన్సర్ కబళించింది. అప్పటికి రాధికకు 30 ఏళ్లు. పెద్దమ్మాయి భూమికకు ఏడేళ్లు, భార్గవికి నాలుగేళ్లు. అంబులెన్స్ నిలబెట్టింది భర్త చెయ్యి పట్టుకుని మంగళూరుకి వచ్చినప్పుడు రాధికకు బతుకు మీద ఒక భరోసా ఉండేది. అయితే అది భర్త ఉన్నాడన్న ఆ ఒక్క భరోసా మాత్రమే. భర్తతో పాటే అది గతించిపోయింది. గడవాల్సిన వర్తమానం ప్రశ్నార్థకమై నిలిచింది. పెళ్లికి ముందు హసన్ జిల్లాలో చిన్న హాస్పిటల్లో పనిచేసిన అనుభవం తప్ప రాధికకు మరే పనీ చేతరాదు. భర్త సరదాగా నేర్పించిన డ్రైవింగ్ గుర్తుకు వచ్చింది. అంబులెన్స్ డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకుంది. సురేశ్ ఉన్నప్పుడు రాధిక అంబులెన్స్ నడుపుతుంటే సురేశ్ కూడా ఒక చేతిని స్టీరింగ్ మీదనే ఉంచేవాడు ఎప్పుడు పొరపాటు చేస్తుందోననే జాగ్రత్తతో. ప్రమాదం జరక్కుండా ఆపడం కోసం ఆ చేయి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. ఇప్పుడా చెయ్యి లేదు. తనను తానే రక్షించుకోవాలని ఆ క్షణమే ఆమె మనసు హెచ్చరించింది. సరిగ్గానే నడుపుతున్నానని నిర్ధారించుకుని డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లయ్ చేసింది. గతంలో హాస్పిటల్లో పనిచేసిన అనుభవమూ కలిసొచ్చింది. పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఆక్సిజన్ పెట్టడం వంటి పనులు వచ్చి ఉండటంతో హాస్పిటల్కు అంబులెన్స్ సర్వీస్కి అనుమతి వచ్చింది. వందల కి.మీ. ప్రయాణం అంబులెన్స్ సర్వీస్లో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా ఉండదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పనిలోకి దిగాలి. అర్ధరాత్రి ఫోన్ కాల్ వస్తే ఇద్దరు పిల్లలను అత్తగారికి అప్పచెప్పి డ్యూటీలో దిగేది రాధిక. ఏకబిగిన వందల కిలోమీటర్లు వాహనం నడిపేది. కర్ణాటక నుంచి కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అంబులెన్స్ నడిపింది. ‘ప్రాణం పోయిన వారిని సొంత ప్రదేశాలకు చేర్చడం చాలా భావోద్వేగాలతో నిండిన బాధ్యత. చనిపోయిన వ్యక్తి చుట్టూ సొంత వాళ్లు ఉంటారు, కానీ దుఃఖంలో ఉంటారు. అందుకే మార్చురీ నుంచి ఐస్బాక్స్ రెడీ చేసుకోవడం, బాడీని అమర్చుకోవడంలో చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. హాస్పిటల్ ఫార్మాలిటీస్ ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయేమో కనుక్కుని వాళ్లను బయలుదేరదీయాలి. సొంతవాళ్లకు కాలూచెయ్యి ఆడని స్థితి అది. హాస్పిటల్ వాడుక భాష ప్రకారం బాడీ అంటే భరించలేకపోతారు కొందరు. అలాంటప్పుడు నా భర్త పోయిన క్షణాలు గుర్తుకు వస్తుంటాయి. మనిషి మీద ఉండే బంధం అలాంటిది’’ అంటారు రాధిక. ఆడవాళ్లు మానసికంగా బలహీనంగా ఉంటారని, పార్థివ దేహానికి జరిగే అంతిమ సంస్కారాలను చూసి తట్టుకోలేరని అనుకుంటాం. రాధిక ప్రాణం పోయిన దేహాన్ని స్వస్థలం చేర్చడానికి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. గమ్యానికి చేర్చాల్సిన వృత్తి బాధ్యతను గౌరవప్రదంగా మోస్తోంది. ‘నలుగురు’ మనుషుల పెట్టుగా మోస్తోంది. పిల్లలతోపాటు తనూ ఎదిగింది! అంబులెన్స్ సర్వీస్లో నిలదొక్కుకున్న తరవాత బ్యాంకు లోన్తో మరో అంబులెన్స్ కొని డ్రైవర్ని నియమించింది. కావేరీ అంబులెన్స్ సర్వీస్కు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఆమె 12 అంబులెన్స్లను నడుపుతోంది. మరణించిన వారిని సొంత ఊళ్లకు చేర్చడం కోసం ఆమె అనేక రాష్ట్రాలు ప్రయాణించి ఉండటంతో ఆయా ప్రదేశాల మీద పట్టు వచ్చింది. టూర్ బస్, వ్యాన్లను కూడా నడుపుతోంది. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో రాధికకు సహాయంగా ఉంటున్నారు. భార్గవి కామర్స్లో డిగ్రీ చేస్తోంది. భూమిక బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతోంది. అంబులెన్స్ సర్వీస్ని తన బతుకుతెరువుగా మొదలు పెట్టినప్పటికీ అందులో ఆమె ఇచ్చే సర్వీస్ చాలా మానవీయంగా ఉంటుంది. ఆమెలోని ఆ లక్షణాన్ని గుర్తించిన మంగళూరు ప్రెస్ క్లబ్ ఆమెను అవార్డుతో సత్కరించింది. – మంజీర -
రాధిక ఆత్మహత్యపై దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: వీ6 న్యూస్ రీడర్ వెంకన్నగారి రాధిక ఆత్మహత్య కేసులో కూకట్పల్లి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. రాధిక తన ఫోన్ ద్వారా నెల రోజులుగా ఎవరెవరితో సంభాషించిందనే కాల్ డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుందా..? లేక మరే ఇతర ఒత్తిళ్లయినా ఉన్నాయా? అనే కోణంలో దృష్టి సారించారు. రాధిక ఇంటి సమీపంలో ఉండే స్నేహితులు, పరిచయస్తులతో పాటు కార్యాలయంలో తోటి ఉద్యోగులతో ఎలా ఉండేదనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. మూసాపేటలో శ్రీసువిల అపార్ట్మెంట్లో ఐదేళ్లుగా రాధిక తన తండ్రి, కుమారుడు, సోదరితో ఉంటోంది. ఆరు నెలల క్రితం భర్త నుండి విడాకులు పొందిన రాధిక ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. రాధిక గత కొద్దిరోజులుగా ముభావంగా ఉంటోందని సహ ఉద్యోగులు పేర్కొన్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాధిక రాత్రి 10.40 నిమిషాల సమయంలో అపార్ట్మెంట్ ఆరో అంతస్తుపైకి వెళ్లింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసిన వాచ్మన్ అపార్ట్మెంట్లోని వారికి సమాచారమిచ్చాడు. ముఖం ఛిద్రం కావడంతో తొలుత మృతురాలు ఎవరనేది గుర్తించలేకపోయారు. రాధిక సోదరి వచ్చి మృతురాలిని గుర్తించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ‘నా బ్రెయినే నా శత్రువు’అంటూ రాధిక రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం ఉదయం ఈఎస్ఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు. కాగా, రాధిక మృతదేహానికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు నివాళులర్పించారు. -
ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రముఖ న్యూస్ చానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్నవెంకన్నగారి రాధిక (36) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. డిప్రెషన్లో ఉన్న రాధిక ఆదివారం రాత్రి 10.40 సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చి, అపార్టుమెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పలువురు టీవీ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై యాంకర్ రష్మీ గౌతమ్ కూడా స్పందించింది. ఆత్మహత్యతో బాధలు పోవని, జీవితాన్ని బాగుచేసుకునే అవకాశాన్ని ఆత్మహత్య దూరం చేస్తుందని రష్మీ ట్వీట్ చేసింది. ఆమెను ఎప్పుడూ కలవలేదని.. కానీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపింది. శారీరక విశ్లేషణే కాదు మానసిక విశ్లేషణ కూడా ముఖ్యం... మానసిక వైద్యుడిని కలిసినంత మాత్రాన మనం పిచ్చివాళ్లమైపోయినట్టు కాదు.. మానసిక ఒత్తిడే ఈ రోజుల్లో మనిషి ప్రాణాలు తీస్తోంది.. డిప్రెషన్ అనిపించినప్పుడు స్నేహితులతో, కుటుంబ సభ్యలతో మన బాధలు పంచుకోవాలి.. అంతేకానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. నిద్ర లేవగానే ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదని రష్మీ ట్వీట్లో పేర్కొంది. -
న్యూస్ రీడర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : వీ6 చానల్ న్యూస్ రీడర్ వెంకన్నగారి రాధిక (36) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. మూసాపేట్లోని గూడ్స్షెడ్ రోడ్డు శ్రీవీలా అపార్టుమెంట్ రెండో ఫ్లోర్ 204 ఫ్లాట్లో నివసిస్తుంది. ఆమె ఆదివారం రాత్రి 10.40 సమయంలో విధులు ముగించుకుని ఇంటికొస్తూనే అపార్టుమెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బ్యాగులో సూసైడ్ లెటర్ లభ్యమైంది. ‘కేవలం నా డిప్రెషన్ వల్ల మాత్రమే చనిపోతున్నాను. నా మెదడు నా శత్రువు’ అని నోట్లో రాసి ఉంది. ఆరు నెలల కిందట భర్త నుంచి రాధిక విడాకులు తీసుకుంది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న తన 14 ఏళ్ల కుమారుడు, తల్లిదండ్రులతో కలసి ఆమె అపార్ట్మెంట్లో నివాసముండేది. రాధిక ఆత్మహత్య సమాచారం అందిన వెంటనే కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాళ్లు కడుక్కుని
‘దెయ్యం అని పేపర్ మీద రాయండి’ రాసింది. ‘ఇప్పుడు దానిని చింపండి’ చింపింది. ‘కసిగా. గట్టిగా. పరాపరా’ కసిగా. గట్టిగా. పరాపరా చింపుతూనే ఉంది. చింపుతుంటే లోపలేదో జరుగుతూ ఉంది. కండరాలకు ఏదో శక్తి పెరుగుతూ ఉంది. పెదాలు అదురుతున్నాయ్. చేతులు వణుకుతున్నాయి. పరాపరా... చింపుతూ ఉంది. ‘గుడ్. ఇప్పుడు సగం చచ్చింది. అలా వదిలేయండి. దానిని పూర్తిగా చంపుదాం’ దళసరి అద్దం ఉన్న టేబుల్ మీద ఆ కాగితం ముక్కలు అలా పడి ఉన్నాయ్. ‘రిలీఫ్గా ఉందా?’ ‘ఊ’ ‘కొంచెం ఏడ్వాలని ఉందా?’ ‘ఉంది. రావట్లేదు. నా పన్నెండవ ఏట నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఏడ్వలేదు డాక్టర్’ ‘సంతోషంతో?’ ‘సంతోషంతో కూడా’ ‘ఏం... మీ హస్బెండ్ మీకు హ్యాపీనెస్ ఇవ్వడం లేదా? హరాస్ చేస్తున్నాడా?’ ‘ఏమంటున్నారు? అతనంటే నాకు ప్రాణం. ఈ లోకంలో నేను ఎవర్నయినా నమ్మితే అది అతన్నే. అంత మంచి మగవాడు, స్నేహితుడు మరొకడు లేడు. కాని రాత్రయితేనే’....‘అయితేనే?’...‘దగ్గరకు తీసుకుంటాడు. చేతిని ముద్దాడతాడు. బుగ్గను ముద్దాడతాడు.భుజం మీద చెయ్యేస్తుంటే... నాకు దెయ్యం కనబడి... దెయ్యం... దెయ్యం’... ఒక్కసారిగా వికృతంగా అరవడం మొదలుపెట్టింది. ‘కూల్.. కూల్... అదిగో దెయ్యం... చచ్చిపడుంది’ కాగితాల వైపు చూపించాడు. శ్వాసను నెమ్మదింప చేస్తూ మెల్లగా శాంతించింది. ‘మొదటిసారి దెయ్యాన్ని ఎప్పుడు చూశారు?’ మంచినీళ్ల గ్లాసును ముందుకు తోస్తూ అడిగాడు. ‘పదీ పదకొండేళ్లప్పుడు అనుకుంటాను. నానమ్మ ఊళ్లో ఉండేదాన్ని. పక్కింట్లో ఒక రాత్రి పెద్ద గోల అయ్యింది. అందరూ మూగారు. ఆమెకు దెయ్యం పట్టిందట. కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఏదో భాష మాట్లాడుతుండింది. నానమ్మ కొంగు పట్టుకుని భయంగా చూస్తూ నిలబడ్డాను. ఆమెకు పాతిక ముప్పై ఉంటాయి. భర్తకు అరవై దాటిపోయాయి. గతి లేక చేశారట. ఆయన రాత్రయితే పొలానికి వెళ్లిపోయేవాడు పడుకోవడానికి. ఈమె ఒక్కత్తే ఉండేసరికి దెయ్యాలు గోడ దూకి వస్తున్నాయట. ఆ దెయ్యాలను అదిలించలేక బెదిరించలేక వాటి బారిన పడలేక రక్షించుకోలేక తానే దెయ్యంలా మారిపోయింది. చాలా భయం వేసింది.’ వింటూ ఉన్నాడు. ‘ఆ రాత్రి నానమ్మను అడిగాను. నన్ను కూడా దెయ్యం పట్టుకుంటుందా అని. దగ్గరకు తీసుకొని గుండెలకు అదుముకుని నేనున్నంత కాలం పట్టదమ్మా అంది. కాని దెయ్యం నన్ను పట్టుకునే తీరింది’ ‘ఎక్కడా... వీధిలోనా.. స్కూల్లోనా... ఆడుకునే చోటా.. పొలాల్లోనా?’ ‘ఇంట్లో’ ‘ఇంట్లో?’ ‘అవును. ఇంట్లో’ ‘ఒక్క నిమిషం’ అని సొరుగులాగి లైటర్ బయటకు తీశాడు. ‘ఇప్పుడు శ్రద్ధగా ధ్యాస మరల్చకుండా తగబెడుతున్న సంగతి మీలో రిజిస్టర్ అయ్యేలాగా ఒక్కో కాగితాన్ని కాలుస్తూ చెప్పండి’ లైటర్ వెలిగించాడు.మొదటి కాగితం ముక్క తగలబడి నుసి రాలింది.‘నాన్న ఏం పని చేసేవాడు కాదు. తాగడం ఆయన పనిగా ఉండేది. పగలంతా బలాదూరు తిరిగేవాడు. పేక ఆడేవాడు. ఎవరైనా ఏమన్నా అంటే కొట్లాట పెట్టుకునేవాడు. మురికి బట్టలు... మాసిన గడ్డం... వాసన... సారాయిలో నంచుకోవడానికి ఉబ్బెత్తుగాఉండే రేగుపళ్ల జేబు’...ఇంకో కాగితం కాలి నుసి అయ్యింది. ‘కాని నాన్నకు ఉండి ఉండి దెయ్యం పట్టేది. రాత్రి పూట ఆమ్మను జుట్టు పట్టి గదిలోకి ఈడ్చేవాడు. తలుపేసేవాడు. దెయ్యం దిగేదాకా తలుపు తెరుచుకునేది కాదు. అమ్మకు ఇష్టం లేదు ఆ దెయ్యం అంటే. తిట్టేది. కొట్టేది. రక్కేది. ఊహూ. వినేవాడు కాదు. దెయ్యం దించుకోవాల్సిందే. ఏమనుకున్నాడో ఏమో... నానమ్మ ఊరి నుంచి నన్ను తీసుకొచ్చేశాడు. పన్నెండేళ్లుంటాయి. బొద్దుగా పుష్టిగా ఉండేదాన్ని. ఆ రాత్రి నాన్నలో దెయ్యం లేచింది. అది అమ్మ గదిలోకి వెళ్లలేదు. నా గదిలోకి వచ్చింది’... కాగితం తగలడుతూ ఉంటే రెండు కళ్ల చివర నీటి బిందువులు పొంగాయి. ‘దెయ్యం వచ్చి... దెయ్యం వచ్చి’... కాగితాలు కాల్చే వేగం పెరిగింది. కళ్లు తడుస్తున్నాయి. ‘అయ్యో వద్దు... ఛీ దెయ్యమా వద్దూ... అరుస్తున్నాను... బయట అమ్మ తలుపు బాదుతూ ఏడుస్తూ... దెయ్యం మింగేస్తుందేమో అన్నంతలో తలుపు పగలగొట్టి దెయ్యం తల చిట్లగొట్టి’... కళ్లు కారుతున్నాయి. పెదాలు బిగిసి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా చేతులు కాగితాలను తగలబెడుతున్నాయి. నుసి. రాలు. నుసి. నశించు. నుసి. నీకిదే శాస్తి.‘ఆ రోజు ఏడ్వడం మానేశాను. మళ్లీ ఇవాళ’... ఒక్కసారిగా రెండు కళ్లను చేతుల్లో దాచుకుంది. మలినాలు... తెట్టు... కల్మషం... మరొకరి చర్య వల్ల ప్రమేయం లేకపోయినా చేరుకుపోయిన మురికి... అన్నీ కారిపోతున్నాయి... పూర్తిగా... సంపూర్ణంగా... మరేమీ మిగలనట్టుగా... అతడు లేచి ఆ నుసినంతా ఒక కాగితం మీదకు సర్దాడు.‘దీనిని ఫ్లష్ చేస్తే మళ్లీ జీవితంలో దీనిని మీరు చూడగలరా?’తల అడ్డంగా ఆడించింది. ‘అయితే ఫ్లష్ చేసి రండి’చేతుల్లోకి తీసుకుని ఆ నుసినే చూస్తూ ఆ నుసినే సింక్లో వేసి ఆ నుసి పైకి ట్యాప్ తిప్పితే ఆ నుసి చురుగ్గా కదలుతూ చీకట్లోకి జారిపోతూ మళ్లీ ఎప్పుడూ తనకెప్పుడూకనిపించడానికి వీల్లేకుండా అగాధంలోకి వెళ్లిపోయింది.ముఖం కడుక్కుంది.‘రిలీఫ్గా ఉందా?’ అడిగాడు.‘ఊ’బజర్ నొక్కితే హజ్బెండ్ లోపలికొచ్చాడు.‘తీసుకెళ్లండి. ఎంజాయ్ లైఫ్.’...ఆమె వైపు తిరిగి అన్నాడు...‘ఏమండీ... దారిలో పూలు తీసుకుంటారుగా’నవ్వింది. అది ఎంత బాగుంది.కథ ముగిసింది.రాధిక రాసిన ‘అపచ్ఛాయ’ కథ ఇది.ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా నడిచినా ఎన్ని ముళ్లను రాళ్లను తప్పుకుని నడిచినా అశుద్ధం ఎక్కడో చోట అంటుతూనే ఉంటుంది. అక్కడ శిలలా బంధింపబడరాదు. కాళ్లు కడుక్కోవాలి. రుద్ది రుద్ది ఆ పీడ జ్ఞాపకాలను వదిలించుకోవాలి. ముందు చాలా జీవితం ఉంటుంది. అది ఎప్పుడూ మంచి జీవితమే అయి ఉంటుంది. సత్యం. పునః కథనం: ఖదీర్ - రాధిక -
నటుడు అమిత్పై ఫిర్యాదు
బొమ్మనహళ్లి : శాండిల్వుట్ నటుడు అమిత్పై ఓ సహాయ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఇక్కడి ఆర్ఆర్ నగర పోలీసులకు బుల్లితెర నటి రాధిక శెట్టి ఫిర్యాదు చేసింది. వివరాలు... బుల్లితెర సహాయ నటిగా గుర్తింపు పొందిన రాధికకు గతంలోనే పెళ్లి జరిగింది. ఈమెకు 17 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భర్తతో విడాకులు తీసుకున్న రాధిక అమిత్ను పెళ్లి చేసుకుంది. అయితే ప్రస్తుతం అమిత్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని రాధిక ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. 2013 మేలో వివాహం చేసుకున్నామని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. 2017 నవంబర్ వరకు కలిసి ఉన్నామని, అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని, విషయం తెలిసి ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. ఈ విషయంపై అమిత్ ఇంతవరకు స్పందించలేదు. ఈ విషయంపై అమిత్ తల్లి స్పందిస్తూ తన కుమారుడికి రాధికతో వివాహం కాలేదని, సినిమా ఫొటోలు తీసుకుని డబ్బుల కోసం బ్లాక్మొయిల్ చేస్తోందని ఆమె ఆరోపించింది. -
మా సహనం కోల్పోయిన మరుక్షణం.
-
మా సహనం కోల్పోయిన మరుక్షణం..
గుంటూరు : 'మేము సహనం కోల్పోయిన మరుక్షణం నీ సీటు గల్లంతవుతుంది' అని సీఎం చంద్రబాబు నాయుడును రోహిత్ వేముల తల్లి రాధిక హెచ్చరించారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ దళితులపై దాడులు జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. ప్రమోషన్ ఇవ్వకుండా వేధిస్తే గుంటూరులో రవికుమార్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు. పెందుర్తిలో దళిత మహిళను నడిరోడ్డుపై వివస్త్ర చేసి కొట్టారని రాధిక నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లాలో దళితుల భూములు లాక్కుని వేధించారని రాధిక అన్నారు. తమ సహనాన్ని పరీక్షించొద్దన్నారు. ఎన్నికల సమయంలో మాత్రం తాను దళిత పక్షపాతినంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటారన్నారు. అధికారంలోకి రాగానే అణచివేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక మీ ఆటలు సాగవని, ప్రజాసంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని తెలిపారు. -
కథ విని శరత్కుమార్గారు ఏడ్చారు – రాధిక
‘‘విజయ్ ఆంటోని సినిమాలు చూడలేదు కానీ, ఆయన నటించిన ‘పిచ్చైకారన్’ను తెలుగులో రీమేక్ చేయాలను కుంటుండగానే ‘బిచ్చగాడు’ పేరుతో అనువాదమై, హిట్ అయింది. అప్పుడు ‘మంచి సినిమా వదులుకున్నామే’ అనుకున్నా’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ ప్రధాన పాత్రల్లో జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంద్రసేన’. ఈ చిత్రాన్ని తెలుగులో నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో రాజశేఖర్, జీవిత రిలీజ్ చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నేను మిస్ చేసుకున్న ‘బిచ్చగాడు’ సినిమా చూస్తే ఇంకా బాధపడతానని చూడలేదు. ఆ సినిమాలో అమ్మ పాట నాకు ఎంతో నచ్చుతుంది. దాని కోసమైనా సినిమా చూస్తా. ‘ఇంద్రసేన’ మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. నటి–నిర్మాత రాధిక మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా లను ఆదరించే ప్రేక్షకుల్లో మొదటి స్థానం తెలుగు వారిదే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారు. నన్ను ఆదరిస్తున్న తెలుగువారికి రుణపడి ఉంటా. ఈ కథ విని, శరత్కుమార్గారు ఏడ్చారు. నేను అడగ్గానే సినిమా చేయడానికి ఓకే అన్నారు విజయ్ ఆంటోని. ‘ఇంద్రసేన’ తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ రోజు ఇక్కడ నిలబడటానికి కారణం విజయ్ ఆంటోనిగారు. ఈ అవకాశాన్నిచ్చిన రాధిక, ఫాతిమా ఆంటోనిలకు థ్యాంక్స్’’ అన్నారు జి. శ్రీనివాసన్. ‘‘పదిహేనేళ్ల క్రితం రాధికగారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేశారు. ఇప్పుడు నటించే అవకాశం ఇచ్చినందుకు రాధిక, శరత్కుమార్గారికి థ్యాంక్స్’’ అన్నారు విజయ్ ఆంటోని. నటి జీవిత, చిత్రనిర్మాత నీలం కృష్ణారెడ్డి, ‘బిచ్చగాడు’ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, రచయిత భాష్యశ్రీ, సినిమాటోగ్రాఫర్ దిల్రాజ్, నిర్మాత సురేశ్ కొండేటి పాల్గొన్నారు. -
ప్రియురాలు కఠినం!
‘‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ టైటిల్ చక్కగా ఉంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. పాటలు చాలా బాగున్నాయి. గోవర్ధన్కి ఈ సినిమా మంచి పేరు తీసుకురావడం ఖాయం’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) అన్నారు. చంద్రకాంత్ హీరోగా, రాధిక, పల్లవి డోరా హీరోయిన్లుగా గోవర్ధన్ గజ్జల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. రఘురామ్ రొయ్యూరు, శ్రీకాంత్ పద్మనాభం, గోవర్ధన్ గజ్జల నిర్మాతలు. నేడు విడుదలవుతోన్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ‘‘అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. షూటింగ్ మొత్తం అమెరికాలో జరిగింది. మా చిత్రంలో నటించినవారు, పని చేసినవారు అమెరికాలోని తెలుగువారే కావడం విశేషం’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి సబ్జెక్ట్. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు చంద్రకాంత్. -
‘బావలు సయ్యా..’ గాయని మృతి
‘బావలు సయ్యా.. హే మరదలు సయ్యా...’ పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయని రాధిక మృతిచెందారు. ఈ పాట ఘనవిజయం సాధించినా.. తెలుగునాట ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. తెలుగులో ఎన్నో పాటలు పాడిన రాధిక 47ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. తిరుపతిలో జన్మించిన ఈ గాయని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 200కు పైగా పాటలు పాడారు. 2004 నుంచి సినీరంగానికి దూరంగా ఉంటున్నఆమె చెన్నై పాలవాక్కంలో నివసిస్తున్నారు. శుక్రవారం దయం 6.30 సమయంలో ఆమె మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల సంగీత దర్శకులు కోటి, మణిశర్మ గాయకులు మనో సంతాపం తెలిపారు. శనివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఏఎస్పి ఎట్ ఎల్బ్రస్!
ఆమె లక్ష్యం ముందు ‘ఆడదానివి నువ్వేం చేస్తావ్’ అంటూ చిన్నబుచ్చే మాటలు చిన్నబోయాయ్. ‘ఆడపిల్లవి... నీకు పర్వతారోహణలెందుకు లేమ్మా... చక్కగా ఉద్యోగం చేసుకో’’ అనే తరహా మాటలు ఆమె పట్టుదల ఎదుట తడారిపోయాయ్. ఆమే చిత్తూరు జిల్లా ఏఎస్పీ జీఆర్ రాధిక. వృత్తి జీవితమైనా, వ్యక్తిగతమైనా వందశాతం శక్తియుక్తులని వెచ్చించడమే ఆమె విజయరహస్యం. లక్ష్యం చేరుకోవడం ఆలస్యం కావొచ్చు... ప్రయత్నమంటూ చేస్తూ ఉంటేనే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామని చెబుతారు చిత్తూరు ఏఎస్పీ రాధిక. ఆమెది కడప. తండ్రి కాలేజీ అధ్యాపకుడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకే. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే. స్నేహితులతో కలిసి చిన్నప్పుడు సెలవుల్లో చుట్టుపక్కల కొండల్నీ గుట్టల్నీ ఎక్కడం ఆమెకు ఇష్టం. ఇదే ఇప్పుడు అభిరుచి అయింది. ‘రాళ్లూ రప్పల్లో ఏముంటాయ్ నీ పిచ్చిగానీ..’ అనే వాళ్లు చుట్టుపక్కల వాళ్లు. చిన్నగా నవ్వి వాటిని వదిలేసేదాన్ని’’ అని చెబుతారు ఏఎస్పీ రాధిక. ఇంగ్లిష్లో పీజీ పూర్తిచేసి కొంతకాలం అధ్యాపకురాలిగా పని చేశారు. అప్పట్లోనే అనంతపురానికి చెందిన వేణుగోపాల్రెడ్డితో పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. భర్త వ్యాపారరీత్యా అనంతపురంలో ఉంటారు. అప్పుడే ఆమెకు ఐపీఎస్పై ఆసక్తి పెరిగింది. విజయం తృటిలో చేజారింది. నిరాశ చెందలేదు. పట్టువీడలేదు. పోలీసుశాఖలోకి వెళ్లే ఇతర అవకాశాలపై దృష్టిసారించారు. గ్రూప్వన్ పరీక్ష రాసి 2007లో డీఎస్పీగా ఎంపికయ్యారు. గ్రేహౌండ్స్లో కొన్నాళ్లు పనిచేశారు. తరువాత నెల్లూరు పట్టణ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్తోపాటు హైదరాబాద్లోని అప్పాలో సేవలందించారు. అనంతరం పదోన్నతిపై ఆదిలాబాద్ ఏఎస్పీగా, తరువాత చిత్తూరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు. పోలీసులకు పర్వతారోహణ... కెరీర్తోపాటూ ఆమె పర్వతారోహణ ఆసక్తీ అంతకంతకూ పెరుగుతోంది. ఐదేళ్ల కిందట మానససరోవర్ యాత్రకు వెళ్లారు. అక్కడ రాధికతోపాటు వచ్చిన వారందరూ గుర్రాలెక్కినా ఈమె మాత్రం కాలినడకతోనే 5100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆమెతోపాటు పెరుగుతూ వచ్చిన పర్వతారోహణ ఆసక్తికి తగ్గట్టు అప్పుడే ఓ గొప్ప అవకాశం దొరికింది. ఆమెతోపాటు నడుచుకుంటూ వచ్చిన ముంబైకి చెందిన దీప్తి పర్వతారోహణ గురించి.. దానికి ఇచ్చే ట్రైనింగ్ గురించి వివరించింది. దీంతోపాటు నాటి అడిషనల్ డీజీపీ పోలీసు అధికారుల కోసం ప్రత్యేక పర్వతారోహణ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపారు రాధిక. ఆమె ప్రతిభను డీజీపీ రాజీవ్ త్రివేది ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. జమ్మూకశ్మీర్లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ వింటర్ స్పోర్ట్స్ సంస్థలో శిక్షణకు పంపారు. శిక్షణ అందుకున్నాక తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. హిమాలయాల్లోని జన్స్కార్ రేంజ్లో ఉన్న 5380 అడుగులున్న గోలెస్కాగ్రి పర్వతాన్ని వారంరోజుల్లో అధిరోహించారు. ‘ఆ పర్వతారోహణే నాపై నాకు నమ్మకం కుదిర్చింది’ అంటారు రాధిక. కున్ సైతం తలవంచింది. అదే ఉత్సాహంతో 7077 మీటర్ల ఎత్తున్న కున్ పర్వతారోహణకు వెళ్లాలనుకున్నారు. ‘ఎంత పోలీసైనా ఇద్దరు పిల్లలున్న ఆడవాళ్లకు సాధ్యమా’ అన్నారు చుట్టుపక్కలవారంతా. ఎప్పటిలాగే ఓ చిరునవ్వు విసిరి, పట్టించుకోకుండా వదిలేశారు. పట్టువిడవకుండా అధిరోహణకు కావాల్సిన వ్యాయామాలు చేయడం మొదలు పెట్టారు. విపరీతమైన గాలులు, సున్నాకంటే తక్కువ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, మామూలు కంటే సగం పడిపోయిన ప్రాణవాయువు.. సహచరులందరూ మధ్యలోనే చేతులెత్తేస్తున్నారు.. ఇవేమీ ఆమె పట్టుదలను ఆపలేకపోయాయి. కనీసం సవాల్ విసరలేకపోయాయి. ఆమె మాత్రం శిఖరాగ్రానికి చేరుకున్నారు. తెలుగురాష్ట్రాల నుంచి ఆ ఘనతను అందుకున్న తొలిమహిళగా రికార్డును నెలకొల్పారు. ప్రపంచంలోని అన్ని పర్వతాలను ఎక్కాలనుంది.. ఎవరెస్ట్ ముగిసింది.. వాట్ నెక్ట్స్ అనే కొశ్చన్. తరువాత యూరప్, రష్యాలోని అతిపెద్ద శిఖరమైన ఎల్బ్రస్. లక్ష్యం అదే. దాని కోసం మరింత కష్టపడింది. మొత్తం 15 మంది సిబ్బందితో ప్రయాణం మొదలు. మొదట రష్యా చేరుకుంది. శిఖరం ఉత్తరం వైపు నుంచి అనుమతి లేదంది ప్రభుత్వం. దక్షిణం వైపు నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా పర్వతాన్ని అధిరోహించలేదని చాలామంది చెప్పారామెకు. కొంచెం కష్టంతో కూడుకున్న పని. అయినా ఆమె తల వంచలేదు. అనుకున్నది సాధించింది. ఈ సెప్టెంబర్ 8న ఎల్బ్రస్పై భారత పతాకం రెపరెపలాడించింది. ఆమె ధైర్యానికి ఎవరెస్ట్ దాసోహమంది! కున్ పర్వతారోహణ తరువాత ఎవరెస్టే తన లక్ష్యంగా పెట్టుకున్నారు రాధిక. మొదట్లో సొంత ఖర్చులతో పర్వతారోహణకు వెళ్లేవారు రాధిక. తరువాత ఆమె పట్టుదల, కృషి చూసి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఆ సాయంతోనే ఎవరెస్ట్ ప్రయాణం మొదలు పెట్టారామె. తొలుత నేపాల్ రాజధాని కాఠ్మాండూకు వెళ్లారు. అక్కడ భూకంపం రావడంతో పర్వతారోహణకు రెండు రోజుల పాటు అనుమతించలేదు. ఆ తరువాత టిబెట్లోని లాసా మీదుగా చైనాలోని తొలి బేస్ క్యాంప్కు చేరుకున్నారు. అక్కడ చైనా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎలాగోలా అనుమతి సాధించుకున్నాక 8850 అడుగుల ఎవరెస్ట్ను గత సంవత్సరం మే 20న అధిరోహించారు. సుమారు 36 రోజులు పట్టింది ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకునేందుకు. యాత్రలో అడుగడుగునా ప్రతికూల వాతావరణం. రోజుల తరబడి మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చేది. అడుగడుగునా తీవ్రగాలులతో పోరాడాల్సి వచ్చేది. - గాండ్లపర్తి భరత్రెడ్డి, సాక్షి, చిత్తూరు -
కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. తోడ్దే దుష్మన్ కి హడ్డీ!
కబడ్డీ... కబడ్డీ... ఆటగాళ్లు, వీక్షకులతో ఓ ఇండోర్ స్టేడియంలో సందడి నెలకొంది. ఆ ఆటగాళ్లలో రాజా (రవితేజ) ఒకడు. ‘కబడ్డీ.. కబడ్డీ..’ అంటూ కూత పెడుతూ ప్రత్యర్థి కోర్టులోకి అడుగు పెడతాడు. అప్పటివరకు అది ఆటే అనుకుంటారంతా! కానీ, రాజా అడుగుతో వేటగా మారుతుంది. ‘కబడ్డీ.. కబడ్డీ..’ అనే కూత ‘తోడ్దే దుష్మన్ కి హడ్డీ’ (దుష్టుల/విలన్స్ ఎముకలు విరగొట్టేయ్) అనేలా వినబడుతుంది అందరికీ! అప్పుడు తను అంధుడనే సంగతి ఎవ్వరికీ గుర్తు రానంతగా రాజా ఆడిన ఆట... కాదు.. కాదు.. సాగించిన వేట ‘రాజా ది గ్రేట్’ సిన్మా హైలైట్స్లో ఒకటిగా నిలుస్తుందట! రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాజా ది గ్రేట్’. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయినా... ప్రేక్షకులు ఆశించే యాక్షన్ సీక్వెన్సులకు ఏమాత్రం లోటు ఉండదట. ముఖ్యంగా కబడ్డీ ఫైట్ చాలా బాగుంటుందని సమాచారం. ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రస్తుతం రవితేజ, రాధిక, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీత దర్శకుడు. -
సెంచరీకి రహానే భార్య ఫిదా..
కొలంబో: టెస్టుల్లో నిలకడలేమి ఆటతో సతమతమైన భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఎట్టకేలకు గాడిన పడ్డాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం బాది తన సత్తా చాటాడు. టెస్టుల్లో17 ఇన్నింగ్స్ల అనంతరం కెరీర్లో తొమ్మిదో సెంచరీ నమోదు చేశాడు. ఈ వైస్ కెప్టెన్సీ అడదడఫా అర్ధ శతకాలు సాధించినా సెంచరీ మాత్రం చేయలేదు. ఇక ఈ శతకంతో అతని భార్య రాధిక అనందానికి అవధులు లేవు. సెంచరీ అనంతరం ఆమె కెరీంతలు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోను బీసీసీఐ అధికారిక ట్వీటర్లో ‘ఇక ఆమె అజింక్యా టెస్టు కెరీర్లో అద్భుత సెంచరీ సాధించడాని చెప్పుకుంటుందని’ క్యాప్షన్గా ట్వీట్ చేసింది. రహానే తన చివరి 17 ఇన్నింగ్స్లో కేవలం మూడు సార్లు మాత్రమే అర్ధ సెంచరీకిపైగా పరుగులు చేసాడు. Finally! She said, after @ajinkyarahane88 gets to a well-made 9th Test century #TeamIndia #SLvIND pic.twitter.com/l1HlAM95x2 — BCCI (@BCCI) 3 August 2017 -
హాట్ సమ్మర్... బల్గేరియన్ బటర్మిల్క్!
ఇంకెక్కడి సమ్మర్? ప్రతిరోజూ చిన్నగా కురుస్తున్న చినుకులకు చలి పెడుతోంటే... వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తోంది. ఇంకా చల్ల మిర్చీ, బటర్ మిల్కులు ఏంటండీ! అనుకుంటున్నారా? ఇండియాలో వర్షాలు పడుతున్నాయి. బల్గేరియాలో మాత్రం ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎవ్రీడే మినిమమ్ 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటోందట! అంత ఎండలో ‘ధృవ నక్షత్రం’ టీమ్ షూటింగ్ చేస్తోంది. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిన్మా కోసం ప్రస్తుతం బల్గేరియాలో స్టంట్ సీక్వెన్స్, ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కట్ చెప్పగానే... బటర్మిల్క్ బకెట్ల దగ్గరకు చేరుతున్నారంతా. ఓ గ్లాసు బల్గేరియన్ బటర్మిల్క్ తాగి సేద తీరుతున్నారు. ఇందులో తెలుగమ్మాయి రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. సీనియర్ హీరోయిన్లు రాధికా శరత్కుమార్, సిమ్రన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. -
చైనాలో చిరు సందడి
80లలో టాప్ స్టార్లుగా వెలిగిన సీనియర్లు ప్రతీ ఏడాది ఓ గెట్టు గెదర్ పార్టీలో కలుస్తుంటారు. ఇప్పటి వరకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ తొలిసారిగా విదేశాల్లో సీనియర్లందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్టీ కోసం ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్స్ ఖుష్బూ, సుహాసినీ, రాధికా, దర్శకుడు భాగ్యరాజ చైనా చేరుకున్నారు. ఇక్కడ తమ ఫాలోయింగ్ కారణంగా బయట ప్రశాంతంగా తిరగలేని మన తారలు చైనా వీదుల్లో చక్కర కొడుతున్నారు. అక్కడి పర్యాటక ప్రదేశాల్లో ఫోటోలు, సెల్పీలు దిగుతూ సందడి చేస్తున్నారు. తాజాగా బీజింగ్ లో మెగాస్టార్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. రైల్వే స్టేషన్ తో పాట, బీజింగ్ నేషనల్ స్టేడియం ముందు మన సీనియర్ స్టార్స్ దిగిన ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. -
రాజాతో రచ్చ రచ్చ!
మార్నింగ్ టు మిడ్–నైట్ షూటింగ్ చేసినా... రవితేజలో ఎనర్జీ వన్ పర్సెంట్ కూడా డ్రాప్ కాదు తెలుసా! ఆయనతో నటిస్తే ఓ కిక్ వస్తుందని పలువురు నటీనటులు చెబుతుంటారు. ఇప్పుడా కిక్లో ఉన్నారు రాధిక. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మిస్తున్న ‘రాజా.. ది గ్రేట్’లో రాధిక పోలీస్గా నటిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ, రాధిక, సంపత్రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ స్పాట్లో రవితేజతో కలసి దిగిన సెల్ఫీను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘మ్యాడ్నెస్ ఆన్ సెట్స్’ అని రాధిక పేర్కొన్నారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ‘దిల్’ రాజు. -
మంత్రులపై ఐటీ పంజా
► బెదిరించారని పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు ► ఐటీ కార్యాలయంలో శరత్కుమార్,రాధిక దంపతులు ► మంత్రి విజయభాస్కర్కు పదవీగండం? ఐటీ సాలెగూడులో చిక్కుకున్న మంత్రి విజయభాస్కర్ సహా ఏడుగురు మంత్రులు బైటకు వచ్చేదారిని వెతుకుతుండగా మరో ఇద్దరు మంత్రులపై ఐటీ పంజా విసిరింది. ఐటీ దాడుల సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరంలపై చెన్నై పోలీస్ కమిషనర్కు బుధవారం ఫిర్యాదు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ తరఫున కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఎన్నికల కమిషన్కు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నగదు బట్వాడాకు మంత్రి విజయభాస్కర్ నాయకత్వం వహించినట్లు గ్రహించిన ఐటీ అధికారులు ఈనెల 7వ తేదీన దాడులు నిర్వహించారు. మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్లర్ గీతాలక్ష్మి ఇళ్లపై దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. దాడులు జరుగుతున్న సమయంలో బందోబస్తులో ఉన్న సాయుధ పోలీసులు అడ్డుకుంటున్నా మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరం దౌర్జన్యంగా విజయభాస్కర్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. అంతేగాక తనిఖీలు చేస్తున్న ఒక మహిళా అధికారిణిని వారు బెదిరించి విధులను అడ్డుకున్నట్లు ఆరోపించారు. ఈ ముగ్గురిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులు పోలీస్ కమిషనర్కు బుధవారం ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేశారు. ఐటీ కార్యాలయంలో శరత్కుమార్, రాధిక: సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్కుమార్, రాడాన్ సంస్థ అధినేత్రి నటి రాధిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్కుసన్నిహితురాలైన ఎంజీఆర్ వైద్య వర్సిటీ వైస్చాన్సలర్ గీతాలక్ష్మి బుధవారం చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చి అధికారుల ముందు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి దినకరన్ను ఈ నెల 6వ తేదీన శరత్కుమార్ కలిసి మద్దతు ప్రకటించగా, ఆ మరుసటి రోజునే ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఓటర్లకు పంపిణీ చేయాల్సిన నగదులో రూ.10 లక్షలు శరత్కుమార్ ఇంట్లో దొరికినట్లు తెలిసింది. ఆయన సతీమణి రాధికకు చెందిన కార్యాలయంలో సైతం కొన్ని ఆధారాలు దొరకవచ్చని రాడాన్ కార్యాలయంలో దాడులు జరిపారు. ఈనెల 11వ తేదీన శరత్కుమార్ ఇంట్లో రెండోసారి, నటి రాధికు చెందిన రాడాన్ టీవీ సీరియల్ సంస్థ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐటీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా శరత్కుమార్, రాధిక దంపతులకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ మేరకు వారు బుధవారం అధికారుల ముందు హాజరయ్యారు. వీరద్దరిని వేర్వేరుగా విచారించారు. అలాగే, మంత్రి విజయభాస్కర్కు సన్నిహితురాలైన గీతాలక్ష్మి ఇంట్లో ఈనెల 7,8 తేదీల్లో తనిఖీలు నిర్వహించి ఐటీ సమన్లు జారీచేయగా ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే ఐటీ ఆదేశాలు పాటించాలని కోర్టు అక్షింతలు వేయడంతో గీతాలక్ష్మి సైతం బుధవారం ఉదయం హాజరయ్యారు. స్వపక్షంలోనే విపక్షం: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీలో పాత్రధారి దినకరన్కాగా సూత్రధారిగా వ్యవహరించిన మంత్రి విజయభాస్కర్ ఐటీ అధికారులకు చిక్కి చిక్కుల్లో పడ్డారు. ఈ సమయంలో ఆయనకు అండగా నిలవాల్సిన స్వపక్షీయులే విపక్షీయులుగా మారిపోయారు. ఐటీ దాడుల్లో మొత్తం రూ.89 కోట్ల పంపిణీకి మంత్రి బాధ్యుడిగా భావిస్తున్నారు. అంతేగాక ఆయన ఇంటి నుంచి రూ.5.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన క్వారీల్లో మంగళవారం నాడు 13 గంటలపాటు తనిఖీలు చేశారు. ఐటీ అధికారుల ముందు మంత్రి విజయభాస్కర్ ఒక దోషిగా నిలబడ్డారు. ఈ అవినీతి భాగోతంలో పలువురు మంత్రులకు భాగస్వామ్యం ఉన్నా ఐటీ దృష్టిలో విజయభాస్కర్ మాత్రమే నిందితుడుగా తేలాడు. దీన్ని అవమానంగా భావిస్తున్న అన్నాడీఎంకే నేతలు మంత్రిపై కారాలు మిరియాలు నూరడం ప్రారంభించారు. అన్నాడీఎంకే ప్రతిష్టను దిగజార్చిన మంత్రి విజయభాస్కర్ను కేబినెట్ నుంచి తప్పించాలంటూ కొందరు నేతలు సీఎం ఎడపాడిపై ఒత్తిడి చేశారు. ఐటీ అధికారులు విజయభాస్కర్ను మరోసారి విచారించనున్న దృష్ట్యా వెంటనే పదవి నుంచి తప్పించాలని పట్టుపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన మంత్రి విజయభాస్కర్పై సీబీఐ విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు సుందర్ లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. డీఎంకే సహా ప్రతిపక్షాలన్ని తనపై దుమ్మెత్తిపోస్తుండగా సొంత పార్టీ నేతలే సీఎంకు ఫిర్యాదులు చేయడంతో మంత్రి విజయభాస్కర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. మంత్రికి పదవీగండం తప్పదని ప్రచారం జరుగుతోంది. -
రాడాన్ గ్రూపులో ఐటీ దాడులు
-
రాధిక.. ఎదురులేదిక!
⇒ ఆస్ట్రేలియాలో ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ పూర్తి ⇒ రెండు రోజుల్లో పది పర్వతాల అధిరోహణ ⇒ ఈ ఘనత సాధించిన తొలి పోలీసు అధికారిగా రికార్డు సాక్షి, హైదరాబాద్: అంబర్పేట పోలీసు ట్రైనింగ్ కాలేజీ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న జీఆర్ రాధిక అరుదైన రికార్డు సృష్టించారు. శుక్ర, శనివారాల్లో ఆస్ట్రేలియాలో ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ పూర్తి చేశారు. దేశంలో ఈ రికార్డు సాధించిన తొలి పోలీసు అధికారి రాధిక కావడం గమనార్హం. ఆ దేశంలో ఉన్న 10 ఎల్తైన పర్వత శ్రేణుల్ని ఏకబిగిన అధిరోహించడాన్ని ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ అంటారు. శుక్రవారం ఆరు పర్వతాల్ని అధిరోహించిన రాధిక శనివారం మరో నాలుగింటిని ఎక్కారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మౌంట్ కొసిఉజ్కో అధిరోహించడంతో ఈ చాలెంజ్ పూర్తయింది. 2015లో మౌంట్ కున్ ఎక్కిన రాధిక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. గత ఏడాది మేలో ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి మహిళా పోలీసు అధికారిణిగా రికార్డుల్లోకి ఎక్కారు. గత ఏడాది ఆగస్టులో టాంజానియాలో ఉన్న మౌంట్ కిలిమంజారో ఎక్కారు. ఇప్పుడు 2 రోజుల్లో ఆస్ట్రేలియాలో ఉన్న 10 పర్వతాలను అధిరోహించి మరో రికార్డు సృష్టించారు. -
చక్రం తిప్పుతోన్న రాధిక!
ఆడవాళ్లు ద్విచక్ర వాహనం నడిపితే విచిత్రంగా చూస్తారు. కారు నడిపినా అంతే. ఏకంగా బస్సు నడిపితే అదో పెద్ద వింతలా చూస్తారు. ఈ మధ్య నటి రాధికను చాలామంది అలానే చూశారు. గిర గిరా స్టీరింగ్ తిప్పుతూ రాధిక బస్సు నడిపారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఇప్పడి వెల్లుమ్’. ఇందులో రాధిక బస్సు డ్రైవర్ పాత్రలో కనిపిస్తారు. ఉదయనిధి స్టాలిన్, మంజిమా మోహన్ జంటగా గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం నిర్మిస్తోంది. బస్సు నడపడమంటే ఆషామాషీ వ్యవహారం కాదుగా. అందుకని, సినిమా చిత్రీకరణ ప్రారంభానికి ముందే నిపుణుల సమక్షంలో రాధికా బస్సు నడపడంలో శిక్షణ తీసుకున్నారు. ఎంతో పట్టుదలగా రెండు వారాల్లో నేర్చేసుకున్నారు. తక్కువ టైమ్లో మేడమ్ బస్సు నడపడం చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యానికి లోనయ్యారట. మరి.. రాధికా మజాకా! -
చేయి కాల్చుకోవాలనుకున్నా: రోహిత్ తల్లి
-
చేయి కాల్చుకోవాలనుకున్నా: రోహిత్ తల్లి
గుంటూరు ఎడ్యుకేషన్ : ‘‘ బీజేపీకి ఓటు వేసి గెలిపించి తప్పు చేసినందుకు నా చేతిని మంటల్లో కాల్చుకోవాలనుకున్నా. అధికారం కట్టబెట్టిన దళితులను నిండా మోసగించారు. నా కొడుకు చనిపోయి ఏడాది దాటినా ఇప్పటివరకూ ఏ ఒక్క దోషికి శిక్షపడలేదు. ప్రతిభావంతుడైన నా కొడుకు రోహిత్ను మానసికంగా వేధింపులకు గురి చేసి బలవన్మరణానికి ప్రేరేపించిన దోషులు సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. రోహిత్ మృతి కారకులకు శిక్ష పడే వరకూ, దళిత విద్యార్థుల భద్రత కోసం రోహిత్ పేరుతో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే వరకూ పోరాటం చేస్తాం’’ ఇవి ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ తల్లి వేముల రాధిక అన్న మాటలు. వేముల రోహిత్ స్మృత్యర్ధం గుంటూరు నగరంలో మంగళవారం ప్రజా, విద్యార్థి, పౌర, దళిత సంఘాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ‘‘ఐ యామ్ రోహిత్’’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ముఖాలకు రోహిత్ చిత్రంతో ఉన్న మాస్క్లను ధరించిన ఆయా సంఘాల నాయకులు రోహిత్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రదర్శనలో రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాధిక ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కొడుకు చనిపోయిన బాధ కంటే అతనిపై వేసిన నిందలు తమను ఎంతగానో బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు లేఖల ఆధారంగా వీసీ అప్పారావు రోహిత్ను వర్సిటీ నుంచి బహిష్కరించారని, మానసిక వేదనకు గురైన తన కొడుకు ఆత్మహత్మ చేసుకున్నాడని చెప్పారు. కేసులో అగ్రవర్ణాలకు చెందిన పెద్ద మనుషులు ఉన్నందునే వారిపై కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేసి మోదీని ప్రధానిని చేసినందుకు తమకు తగిన శాస్తి చేశారని మండిపడ్డారు. దళితులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని శిక్షించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న మోదీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రోహిత్ చనిపోయింది హైదరాబాద్లో అని సీఎం చంద్రబాబు, రోహిత్ ఆంధ్ర విద్యార్ధి అని కేసీఆర్ రాజకీయాలు చేస్తూ కేసు గురించి పట్టించుకోలేదని విమర్శించారు. విచారణ పేరుతో ఆర్డీవో వేధించారు.. రోహిత్ ఎస్సీ అని గుంటూరు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించగా దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని రాధిక చెప్పారు. కుల విచారణ పేరుతో గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు తమను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. గతేడాది నవంబర్ 2న గురజాల ఆర్డీవో కార్యాలయంలో విచారణ పేరుతో తనను పిలిపించిన ఆర్డీవో మురళి తనతో అసభ్యకరంగా మాట్లాడారని వాపోయారు. భర్తతో కాపురం చేయకుండా వదిలివేసిన దానిని పిల్లలను ఏ విధంగా పెంచుతున్నావంటూ అభ్యంతరకరమైన మాటలతో తనను వేధించారని మీడియా సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. తానూ ఆత్మహత్యకు పాల్పడితే కేసు నీరుగారిపోతుందనే భావనతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో దోషులకు శిక్షపడి, తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. ప్రదర్శనలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సీనియర్ న్యాయవాది వైకే, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, పీడీఎస్యూ, దళిత, ప్రజా సంఘాల నాయకులు, హెచ్సీయూ విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
క్రితిక దర్శకత్వంలో విజయ్ఆంటోని
సంగీత దర్శకుడు విజయ్ఆంటోని వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు.సంగీతదర్శకుడుగా, కథానాయకుడిగా జోడు గుర్రాల సక్సెస్ స్వారీ చేస్తున్న ఈయన పిచ్చైక్కారన్ చిత్రంతో అసాధారణ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నటించిన సైతాన్ ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం యమన్ గా తెరపైకి రావడానికి రెడీ అవుతున్న విజయ్ఆంటోని తదుపరి రెండు చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ స్వంత నిర్మాణ సంస్థలోనే నటించిన ఈయన తొలిసారిగా బయట సంస్థల్లో నటించనున్నారు.అందులో ఒకటి రాధిక, శరత్కుమార్ నిర్మించనున్న చిత్రం. ఇది త్వరలో సెట్పైకి వెళ్లనుందని సమాచారం. తాజాగా మరో చిత్రానికి విజయ్ఆంటోని సైతాన్ చేశారని తెలిసింది.ఇంతకు ముందు శివ, ప్రియఆనంద్ జంటగా వణక్కంచెన్నై వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన క్రితిక ఉదయనిధిస్టాలిన్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.ఇందులో విజయ్ఆంటోని కథానాయకుడిగా నటించనున్నారట.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
హెచ్సీయూ గరం గరం
-
హెచ్సీయూ గరం గరం
► రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా వర్సిటీలో ఉద్రిక్తత ► హెచ్సీయూలోకి వెళ్లేందుకు విద్యార్థులు, పలు సంస్థల నాయకుల యత్నం ► అడ్డుకున్న పోలీసులు.. రోహిత్ తల్లి రాధికకూ అనుమతి నిరాకరణ ► ఆగ్రహంతో విద్యార్థుల ధర్నా.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ► తాళం పగలగొట్టి లోనికి... అరెస్టు చేసిన పోలీసులు ► విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కుల నిర్ధారణ: రాధిక సాక్షి, హైదరాబాద్ రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్లో జరిగిన ఈ కార్యక్రమానికి బయటి వ్యక్తులను అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బలగాల మోహరింపు.. తనిఖీలు వర్సిటీలో వివక్ష ఎదురవుతోందంటూ ఏడాది కింద రోహిత్ వేముల అనే పరిశోధక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏడాది కింద ఈ ఘటన ఎంతో సంచలనం సృష్టించింది. మంగళవారం హెచ్సీయూలో రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి.. ఐడీ కార్డులు చూపించిన విద్యార్థులను, వర్సిటీ సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించారు. రోహిత్ తల్లి రాధిక సహా ఎవరినీ లోపలికి పంపించలేదు. దీంతో పలు పార్టీలు, సంస్థలు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హెచ్సీయూ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. కొందరు విద్యార్థులు గేటు తాళాన్ని పగలగొట్టి రాధికను, మరికొందరిని లోనికి తీసుకువచ్చారు. గేటు వద్దే రోహిత్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రోహిత్ స్తూపానికి పూలమాల వేసేందుకు క్యాంపస్ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. చివరికి రాధికతోపాటు ఏపీ ఏఎస్ఎ కన్వీనర్ గుమ్మడి ప్రభాకర్, సుధీప్తో మండల్ (హిందుస్థాన్ టైమ్స్), విజయ్ పెదపూడి, ప్రమీల, కావ్య, రియాజ్, రాజా వేముల తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే విద్యార్థి క్రిశాంక్ సహా 18 మందిని అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పారావును అరెస్టు చేయాల్సిందే.. రోహిత్ ఆత్మహత్యకు పాల్పడి ఏడాది గడిచినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని హెచ్సీయూ జేఏసీ కన్వీనర్ వెంకటేష్ చౌహాన్ పేర్కొన్నారు. రోహిత్ చట్టం తీసుకొచ్చే వరకు పోరాటం చేస్తామని... కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, అప్పారావులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రోహిత్ వర్ధంతి కార్యక్రమానికి వెళ్లేవారిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని రిటైర్డ్ ప్రొఫెసర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పీఎల్ విశ్వేశ్వర్రావు పేర్కొన్నారు. విలేకరిపై కేసు నమోదు హెచ్సీయూ క్యాంపస్లోకి బయటి వ్యక్తులు వెళ్లవద్దన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. క్యాంపస్లో సంచరించిన ఫ్రంట్లైన్ స్పెషల్ కరస్పాండెంట్ కునాల్æ శంకర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హెచ్సీయూ భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశంలో దళితులకు రక్షణ కరువైంది ‘‘నేను దళితురాలినైనా నా కుమారుడిని బీసీగా ఎలా ప్రకటిస్తారు? అధికారులు నా బిడ్డ కులం విచారణకని పిలిచి నా నైతికతకు భంగం కలిగించేలా మాట్లాడారు. నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని అగౌరవపరిచారు. నా ప్రవర్తనను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు..’’అని రోహిత్ తల్లి రాధిక మండిపడ్డారు. రోహిత్ వర్ధంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తన బిడ్డ కలెక్టరై కార్లలో తిరుగుతాడని కష్టపడి చదివించానని... కానీ వర్సిటీ వీసీ అప్పారావు తన బిడ్డను చంపేశాడని ఆరోపించారు. ఉద్యమానికి కారణం అప్పారావు అయితే ఆయనను వదిలిపెట్టి తన బిడ్డ కులాన్ని ధ్రువీకరించే పనిపెట్టుకున్నారని మండిపడ్డారు. విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ పని చేశారని ఆరోపించారు. రోహిత్ తల్లి రాధికను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు ఏపీ సర్కారు అవమానించింది.. గుంటూరులో విచారణకని పిలిచి తనను, తన పిల్లలను ఏపీ ప్రభుత్వం అవమానించిందని రాధిక ఆరోపించారు. ‘‘నీ బిడ్డని నువ్వే పెంచావా? నీకు డబ్బెక్కడిది? ఎవరిచ్చారు అంటూ ఆర్డీవో అవమానించారు. అనేకసార్లు మమ్మల్ని బెదిరించారు. మాకు ఎక్కడికెళ్లినా భద్రత లేదు. చివరికి గుజరాత్లోని ఉనాకు వెళ్లినా మాకు ఆశ్రయమిచ్చిన వారు భయపడ్డారు..’’అని చెప్పారు. తన కుమారుడి ఆత్మహత్య వెనుక బీజేపీ మంత్రులున్నారు కనుకనే తన కులంపై చర్చ జరుగుతోందన్నారు. తాము దొంగలం, గూండాలం, తీవ్రవాదులం, ఉగ్రవాదులం కాదని... ఇలాగే విద్యార్థులపై నిర్బంధాన్ని కొనసాగిస్తే దళితులంతా ఏకమై పాలకులకు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కాగా వైవా పేరుతో దళితులకు మార్కుల్లో కోతవేస్తే ప్రశ్నించినందుకు తమను రస్టికేట్ చేశారని.. ఇప్పటికీ అది కొనసాగుతోందని రోహిత్తోపాటు సస్పెండైన విద్యార్థి రాహుల్ చెప్పారు. గుజరాత్లో ఊచకోత కోస్తున్నారు గుజరాత్లోని ఉనాలో జరిగిన ఘటనలో దళిత బాధితులు పీయూష్ సర్వయ్య, రమేష్ సర్వయ్య, జీతూ సర్వయ్య తదితరులు రోహిత్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్లో దళితులను రక్తపుటేరుల్లో ముంచుతున్నారని, అయినా రోహిత్ లాంటి ఉద్యమాలు తమకు కొత్త ఊపిరి పోస్తున్నాయని వారు చెప్పారు. ఎన్ని అడ్డంకులైనా ఎదురిస్తామని, దళితుల ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటాలన్నింటికీ మద్దతిస్తామని పేర్కొన్నారు. దాద్రీ ఘటనలో మరణించిన అఖ్లాక్ సోదరుడు జాన్ మహ్మద్ మాట్లాడుతూ... తమ ఇంట్లో ఆవు మాంసం దొరికిందన్న నెపంతో తన అన్నను చంపారని, అదేమీ లేదని తరువాత తేలిందని చెప్పారు. దళితులపై అత్యాచారాలు, అవమానాలు, అసమానతలు పోయే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. -
అట్టహాసంగా యశ్, రాధిక వివాహం
బొమ్మనహళ్లి (బెంగళూరు) : శాండిల్ ఉడ్లో హిట్ పెయిర్గా గుర్తింపు పొందిన రాకింగ్ స్టార్ యశ్, నటి రాధిక పండిత్ శుక్రవారం కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో జరిగిన వివాహ వేడుకలు నభూతో నభవిష్యతి అన్న చందంగా సాగాయి. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో కళాదర్శకుడు అరుణ్ సాగర్ నేతృత్వంలో చూడచక్కని కల్యాణ వేదికను నిర్మించారు. వేదిక ముందు శివపార్వతుల విగ్రహం సాక్షిగా యశ్ మధ్యాహ్నం 12.35 గంటలకు రాధిక మెడలో మూడు ముళ్లు వేశారు. యువ జోడిని ఆశీర్వదించడానికి ఆది చుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడు నిర్మలానంద స్వామిజీ, మాజీ సీఎం ఎ.ఎం. కృష్ణ, మాజీ మంత్రులు వీ.సోమన్న, చెలువరాయస్వామి, జమీర్ ఆహ్మద్ఖాన్, కన్నడ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటులు రవిచంద్రన్, శివరాజ్ కుమార్, రాఘవేంద్ర, రాజ్కుమార్, సుదీప్తో పాటు శాండిల్ ఉడ్ తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. శ్రీనాథ్ దంపతులు, దొడ్డణ్ణ, సీనియర్ నటి భారతి విష్ణువర్ధన్, దర్శకుడు పవన్ ఒడెయార్, ఏ.పి. అర్జున్, మహేష్రావు, నిర్మాత జయణ్ణ, మంజు, జయ కర్ణాటక అధ్యక్షుడు ముత్తప్ప రైతో పాటు పలువురు పెద్దలు కొత్త దంపతులను ఆశీర్వదించారు. అంతకు ముందు రాధిక పండిత్ తండ్రి కృష్ణకుమార్ పండిత్ యశ్ను కల్యాణ మంటపానికి తీసుకువచ్చారు. అక్కడ వినాయకుడికి ప్రత్యేక పూజలు అనంతరం ఆదిచుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడు నిర్మలానంద స్వామి వద్ద యశ్ ఆశీర్వాదం పొందారు. అనంతరం రాధిక పండిత్ను కూడా తండ్రి కృష్ణకుమార్ పండిత్ కల్యాణ మండపానికి తీసుకు వచ్చారు. అంతకు ముందు గౌరీపూజ నిర్వహించారు. -
గుండెకు మేలు చేసే ఆహారం
► సాల్మన్ ఫిష్, ట్యూనా, హెర్రింగ్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్నూ తగ్గించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే బెటరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ► ఓట్ మీల్ తింటే మంచిది. పీచు పదార్థం ఉండే ఈ ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్లా పనిచేసి, కొలెస్ట్రాల్ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే. ► స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, ఆ పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. ► డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరిగే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం లేదు. అయితే వీటిని కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి. ► విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్ళీ అతిగా పంచదార కలుపుకోకూడదు. ► సోయా పాలు, సోయా జున్ను (తోఫూ) తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. సోయా ప్రొటీన్లు ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ► బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదకరం కావు. పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది. ► టొమాటోలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. ఇందులోని విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ►గుప్పెడన్ని నట్స్ అంటే బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ►బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి. ►దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. దానిమ్మ పండు గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే అడ్డంకులు (ప్లాక్స్)నూ శుభ్రం చేస్తాయి. యాపిల్ పండ్లు కూడా. ►అవిశె గింజలలో (ఫ్లాక్ సీడ్స్) పీచు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటిని రోజుకు 20 గ్రాములు తింటే మేలు. - రాధిక చీఫ్ డైటీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడి
పెదనందిపాడు: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు మీద నుంచి నడిచి వెళ్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జిల్లాలోని పెదనందిపాడు మండలం కట్రపాడులో సోమవారం జరిగింది . గ్రామానికి చెందిన రాధిక రోడ్డు పై నుంచి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
రాధిక మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకే..
• రూపన్వాల్ కమిషన్ నివేదికపై మండిపడ్డ విద్యార్థులు • ఆ రిపోర్టు నిరాధారం.. విద్యార్థుల అభిప్రాయాలు పరిశీలించలేదు • రోహిత్తోపాటు రస్టికేషన్కు గురైన విద్యార్థుల ఆరోపణ సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు సం బంధించి నియమించిన జస్టిస్ రూపన్వాల్ కమిషన్ రోహిత్ తల్లి రాధిక మనో నిబ్బరాన్ని దెబ్బతీసేందుకు కులాన్ని ఉపయోగించుకుందని హెచ్సీయూ విద్యార్థులు ఆరోపించారు. రిజర్వేషన్ల కోసమే రాధిక కులాన్ని ఉపయోగించుకున్నారనడాన్ని వారు ఖండించారు. రూపన్వాల్ కమిషన్ రిపోర్టుని వ్యతిరేకిస్తూ శుక్రవారం హెచ్సీయూలో విద్యార్థులు ప్రదర్శన, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాధిక రిజర్వేషన్ల కోసమే కులాన్ని ఉపయోగించుకున్నారని కమిషన్ వ్యాఖ్యానించడం దుర్మార్గమైన చర్య అని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరో దళిత తల్లుల పక్షాన నిలిచి పోరాడుతున్న రాధికను మానసికంగా కుంగదీసేందుకే కమిషన్ ఇటువంటి రిపోర్టునిచ్చిందన్నారు. కమిషన్ రిపోర్టు నిరాధారమైనదని, అందులో ఎక్కడా విద్యార్థుల అభిప్రాయాలుగానీ, రోహిత్ మరణానికి కారణాలను కానీ పరిశీలించినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పరిధిని మించి వ్యవహరించిందని, మొత్తంగా రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి కాపాడేందుకు చేసిన కుట్రలో భాగమే ఈ నివేదిక అని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల రస్టికేషన్ని సైతం కమిషన్ సమర్థించడం నేరపూరిత వ్యాఖ్యానమని అభిప్రాయపడ్డారు. రోహిత్ దళితుడో కాదో తేల్చమని హెచ్ఆర్డీ శాఖ కమిషన్ను కోరలేదని, అటువంటప్పుడు రోహిత్ కులంపై కమిషన్ అత్యంత ఆసక్తి ప్రదర్శించడానికి కారణాలేమిటో తమకు అర్థం కావడం లేదని ప్రొఫెసర్ శ్రీపతిరాముడు వ్యాఖ్యానించారు. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర.. రూపన్వాల్ కమిషన్ ముమ్మాటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రని రోహిత్తో పాటు రస్టికేట్ అయిన దొంత ప్రశాంత్, వేల్పుల సుంకన్న, విజయ్, శేషు పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్సీయూలో జరిగిన విద్యార్థుల సభలో వారు ఓ ప్రకటన విడుదల చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వీసీ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలను కాపాడేందుకు కమిషన్ పేరిట కుట్ర చేశారన్నారు. రోహిత్ మరణానంతరం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ క్యాంపస్లో వివక్షని ఎత్తిచూపిందని, హెచ్సీయూలోని విద్యార్థి వ్యతిరేక పరిణామాలను, రస్టికేషన్ను తప్పుపట్టిందని గుర్తుచేశారు. అయితే విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులు అనుభవిస్తున్న వివక్షని, ఆత్మహత్యలకు కార ణాలను విస్మరించి రూపన్వాల్ కమిషన్ విద్యార్థి వ్యతిరేక రిపోర్టును ఇచ్చిందన్నారు. హాస్టల్స్ నుంచి వెలివేతను సమర్థించ డాన్ని బట్టే కమిషన్ గుట్టు బట్టబయలైందని ఆరోపించారు. బీజేపీ, ఏబీవీపీకి కొమ్ముగాస్తున్న వీసీ అప్పారావును, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారందరినీ తక్షణమే అరెస్టు చేయాలని, అప్పటి వరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. -
నలుగురూ స్నేహితులే!
నటనలో, అందంలో ఈ నలుగురూ నలుగురే. సుమారు ముప్ఫై ఏళ్లుగా దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా సినిమాలు చేశారు. అప్పట్లో అగ్ర హీరోయిన్లు ఎవరు? అనడిగితే... ఊర్వశి, రాధిక, ఖుష్బూ, సుహాసిని.. ఈ నలుగురి పేర్లూ తప్పకుండా వినిపించేవి. వీళ్ల మధ్య పోటీ సినిమాల వరకే. మేకప్ తీసేసిన తర్వాత నలుగురూ స్నేహితులే. హెల్దీ కాంపిటీషన్ అనమాట. ఎయిటీస్ రీ-యూనియన్ పేరుతో ప్రతి ఏడాది గెట్ టుగెదర్ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడీ నలుగురి గురించి ప్రస్తావన ఎందుకంటే... వీళ్లంతా కలసి ఓ సినిమాలో నటించనున్నారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. నలుగురు సీనియర్ హీరోయిన్లు ఓ సినిమాలో నటించడం వింతేముంది? అనుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే.. ఈ నలుగురూ కలసి నటిస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఇంకొకటి.. నిజ జీవితంలో స్నేహితులైన వీళ్లు సినిమాలోనూ స్నేహితులుగానే నటించనున్నారు. జేమ్స్ వసంతన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా హిందీ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ తరహాలో ఫన్నీ ఎంటర్టైనర్గా ఉంటుందట. ఈ నలుగురి క్యారెక్టరైజేషన్లను 90వ దశకంలో వాళ్లు నటించిన హిట్ సినిమాల్లోని క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్తో డిజైన్ చేశారట. వచ్చే వారమే ఆస్ట్రేలియాలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని, సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ అంతా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రియల్ లైఫ్లో ఈ నలుగురూ స్నేహితులు కావడంతో సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
కుమార్తె సంగీత్ వేడుకలో ఇరగదీసిన రాధిక
తమిళసినిమా(చెన్నై): సినీనటి రాధిక కూతురు రెయాన, మిథున్ల వివాహ సంగీత్ వేడుక కార్యక్రమం శుక్రవారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని తాజ్హోటల్లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి దక్షిణాది సినీ ప్రముఖులు పులువురు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. లతారజనీకాంత్, భాగ్యరాజ్ పూర్ణిమ, సుహాసిని, త్రిష, రమ్యకృష్ణ, శోభన, మధుబాల, స్నేహ, ప్రసన్న, నమిత, ఐశ్వర్యాధనుష్, దర్శకుడు సుందర్.సి, కుష్బు, జయం రవి, లక్ష్మి మంచు, వెంకటేశ్, శ్రీకాంత్, వందన, శాంత కార్యక్రమానికి హాజరయ్యారు. సంగీత్ వేడుకలో భాగంగా పలువురు సినీతారలు ఉత్సాహంగా డాన్సులు చేశారు. ముఖ్యంగా పెళ్లికూతురి తల్లి రాధిక చేసిన నృత్యాలు అలరించాయి. -
రమ్య చట్టాన్ని తీసుకురావాలి : రమ్య తల్లి
-
రమ్య చట్టాన్ని తీసుకురావాలి : రమ్య తల్లి రాధిక
హైదరాబాద్: పంజాగుట్ట కారు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య చట్టాన్ని తీసుకురావాలని ఆమె తల్లి రాధిక డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ....తమ కుటుంబానికి జరిగిన అన్యాయం వేరే కుటుంబానికి జరగకూడదన్నారు. హైదరాబాద్లోని అన్ని స్కూళ్లలో బుధవారం ప్రార్థనా సమయంలో రెండు నిమిషాలు మౌనం పాటించాలని విద్యాసంస్థలను కోరినట్లు రాధిక తెలిపారు. విద్యార్థులందరూ రమ్య చట్టం తీసుకురావాలని ప్లకార్డులను ప్రదర్శిస్తారని ఆమె చెప్పారు. గత నెలలో పంజాగుట్ట ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందపడిన ప్రమాదంలో చిన్నారి రమ్యతో పాటు ఆమె బాబాయి, తాతయ్య మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో నిందితుడు శ్రావెల్ బెయిల్ పిటిషన్ను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. -
ఇలాంటి రోదన ఎవ్వరికీ రాకూడదు
-
తీవ్ర విషాదం నింపిన ప్రమాదం
హైదరాబాద్: మందుబాబుల ర్యాష్ డ్రైవింగ్కు 9 రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందిన చిన్నారి రమ్యను చూసి తల్లి రాధిక కన్నీటిపర్యంతమయ్యారు. అదే ప్రమాదంలో కాలు విరిగి, యశోద అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం కేర్ ఆసుపత్రికి చేరుకొని.. కూతురు మృతదేహాన్ని చూసి స్పృహకోల్పోయారు. చిన్నారి మృతితో రమ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోస్టుమార్టం కోసం రమ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రమ్య మృతికికారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రాధిక డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన ఆరుగురు విద్యార్థులు నా కూతురిని మళ్లీ తీసుకొస్తారా అని ఆమె విలపించారు. ఇలాంటి రోదన ఏకుటుంబానికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్-3లో పీకలదాకా తాగిన బీటెక్ విద్యార్థులు వేగంగా కారునడిపి.. డివైడర్ను ఢీకొని, రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై పడటంతో చిన్నాన్న రాజేష్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. తప్పతాగిన విద్యార్థుల మూలంగా జరిగిన ప్రమాదంలో కటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదకారకులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో రమ్య కుటుంబసభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ పరామర్శించారు. రమ్య మృతి బాధాకరం అన్న ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
బిలియనీర్ కు బెదిరింపులు
మెల్ బోర్న్: భారతీయ బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ పై ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ (ఏఎన్జెడ్) అధికారి దాడి చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. ఏఎన్జెడ్ కు చెందిన చీఫ్ రిస్క్ ఆఫీసర్ క్రిస్ పేజ్.. ఓస్వాల్ పై దాడి చేయడమే కాకుండా ఆయనను బెదిరించారని తెలిపింది. 2009లో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొంది. రుణాల చెల్లింపుల కోసం ఓస్వాల్ పై సమావేశమైన క్రిస్ ఆయుధంతో ఓస్వాల్ ను బెదిరించాడు. ఓస్వాల్ మెడపై ఆయుధం పెట్టి 'సంతకం పెట్టు లేకపోతే నిన్ను నాశనం చేస్తా' అని హెచ్చరించాడని పంకజ్ భార్య రాధిక తరపు ప్రతినిధి గ్యారీ రిచ్ తెలిపారు. పంకజ్ కు ప్రాణాపాయం ఉందని ఆమె ఆందోళన చెందుతున్నట్టు వెల్లడించారు. మూసివేయబడిన వెస్ట్ ఆస్ట్రేలియన్ ఫెర్జిలైజేషన్ కంపెనీలో తమ షేర్లను తక్కువ ధరకు అక్రమంగా విక్రయించారని ఆరోపిస్తూ ఏఎన్జెడ్ పై ఓస్వాల్ దంపతులు దాదాపు రూ. 6733 కోట్లకు విక్టోరియా సుప్రీంకోర్టులో దావా వేశారు. పంకజ్, రాధిక మోసానికి పాల్పడ్డారని ఏఎన్జెడ్ వాదిస్తోంది. 900 మిలియన్ డాలర్లు బకాయి పడ్డారని, అప్పు చెల్లించకుండా నాటకాలు ఆడుతున్నారని ఆరోపించింది. -
ఆత్మ తపన!
మరణం తర్వాత కూడా తన స్నేహితుల కోసం తపించే ఓ వ్యక్తి ఆత్మ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కమిట్మెంట్’. విజయ్శ్రీరామ్, నవీన్, రాధిక ముఖ్యపాత్రల్లో స్వామిచంద్ర దర్శకత్వంలో రాంబాబు పట్నాల నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘స్నేహం నేపథ్యంలో సాగే చిత్రమిది. సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. -
ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాధిక
నటి రాధిక వేలూరు: రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని తాను ఎన్నికల్లో పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోలేదని సినీ నటి రాధిక తెలిపారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో గురువారం సాయంత్రం సినీ నటి రాధిక తన కుమార్తె రేయాన్, కుమారుడు రాహుల్ శరత్తో కలిసి స్వామి దర్శించుకున్నారు అనంతరం స్వామి స్వామి సన్నధి, అమ్మన్ సన్నధిలోని స్వామి వారిని మొక్కుకున్నారు. అనంతరం నవగ్రహ సన్నధిలో నెయ్యి దీపాలను వెలిగించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన కుమార్తె వివాహం త్వరలో జరుగనుందని అందువల్ల తన కుమార్తె, కుమారుడితో కలిసి స్వామి దర్శనం చేసుకున్నానన్నారు. ఎన్నికలు, రాజకీయాల సంబంధమైన ప్రశ్నలకు శరత్కుమార్ను అడగాలన్నారు. సమత్తవ మక్కల్ పార్టీ ద్వారా తాను పోటీ చేసేందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇందుకు ఇంకా సమయం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని, మంచి ప్రభుత్వం ఏర్పాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆమెకు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. -
మాకు రక్షణ కల్పించండి
సాక్షి, బెంగళూరు : తమకు రక్షణ కల్పించాల్సిందిగా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన ప్రేమజంట రాధిక(19), నాగరాజు వేడుకుంటున్నారు. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ గ్రామం వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి రాధిక బంధువులు నాగరాజు అమ్మతో పాటు బంధువులను ఇబ్బందులు పెడుతున్నారని వీరు చెబుతున్నారు. నాగరాజు తల్లితో పాటు అతని బంధువులపై కూడా భౌతిక దాడులకు దిగుతున్నారని ప్రేమికులు ఇద్దరూ బెంగుళూరులో ‘సాక్షి’తో వాపోయారు. ఈ విషయమై రాధిక మాట్లాడుతూ...‘మా అమ్మనాన్నలకు మా వివాహం ఇష్టమే. అయితే బంధువుల ఒత్తిడితో వారు మా పెళ్లికి అంగీకరించడం లేదు. ముఖ్యంగా టీడీపీ వారి అండతో మా చిన్నాన్న నాగభూషణం, పెదనాన్న గోపాల్ నాయుడు, మరో పెదనాన్న, సర్పంచ్ రామానాయుడుతో పాటు మామ ధనుంజయ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాగరాజు ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు స్థానిక పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. నాగరాజుతో పాటు వాళ్ల అమ్మ, చెల్లెలు, బావమరిదితో పాటు నాకు ఎటువంటి హాని జరిగినా వీరే కారణమవుతారు’ అని తెలిపింది. తాను మేజర్నని, తన ఇష్టపూర్వకంగానే నాగరాజుతో కలిసి ఇంటి నుంచి వచ్చేశానని చెప్పింది. నాగరాజును తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని రాధిక తన తల్లిదండ్రులు, బంధువులను కోరింది. -
మాకు రక్షణ కల్పించండి
బెంగళూరు: తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన ప్రేమజంట రాధిక(19), నాగరాజులు వేడుకుంటున్నారు. వివరాలు... జంతులూరు గ్రామానికి చెందిన రాధిక, నాగరాజులు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి రాధిక తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు అంగీకరించకపోవడంతో వీరిరువురూ గ్రామం వదలి వచ్చేశారు. అప్పటి నుంచి రాధిక బంధువులు నాగరాజు తల్లిని, ఆమె బంధువులను ఇబ్బందులు పెడుతున్నారని వీరు చెబుతున్నారు. నాగరాజు తల్లితో పాటు అతని బంధువులపై కూడా భౌతిక దాడులకు కూడా దిగుతున్నారని ప్రేమికులు ఇద్దరూ ‘సాక్షి’తో వాపోయారు. ఈ విషయమై రాధిక మాట్లాడుతూ...‘మా అమ్మనాన్నలకు మా వివాహం ఇష్టమే, అయితే బంధువల ఒత్తిడితో వారు మా పెళ్లికి అంగీకరించడం లేదు. ముఖ్యంగా అధికార టీడీపీ పార్టీ అండతో మా చిన్నాన్న నాగభూషణం, పెదనాన్న గోపాల్ నాయుడు, మరోపెదనాన్న, సర్పంచ్ రామానాయుడుతో పాటు మామ ధనుంజయ్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాగరాజు ప్రాణాలు తీయడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు స్థానిక పోలీసులు కూడా ఒత్తాసు పలుకుతున్నారు. నాగరాజుతో పాటు వాళ్ల అమ్మ, చెల్లెలు, బావమరదితో పాటు నాకు ఎటువంటి హాని జరిగినా వీరే కారణమవుతారు.’ అని పేర్కొన్నారు. తాను మేజర్నని తన ఇష్టపూర్వకంగానే నాగరాజుతో కలిసి ఇంటి నుంచి వచ్చేశానని రాధిక తెలిపారు. నాగరాజును తాను మనస్పూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని ఈ విషయాన్ని ఇంతటితో వదిలి వేయాలని రాధిక తన తల్లిదండ్రులు, బంధువులను కోరారు. -
కులాన్ని దోచుకునే కుట్రా?
కొత్త కోణం కొడుకు పెరిగి పెద్దవాడై విశ్వవిద్యాలయాల్లోని కుల జాడ్యానికి బలై, ఎస్సీ, ఎస్టీలపై అత్యా చారాల నిరోధక చట్టం కింద కేంద్ర మంత్రులపై కేసు పెట్టాల్సి వస్తుందని రాధిక ముందే దూరదృష్టితో చూసి మాలవాడకు చేరలేదు. రోహిత్ కులంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో ‘పరిశోధించింది’. రోహిత్ను బలిగొన్న కుల వివక్షను కప్పిపుచ్చాలనే ఈ ఆరాటం తగదు. ప్రభుత్వం ఇప్పటికైనా రాధిక కులం ‘ఆరాలు’ ఆపి, దోషులను కాపాడే యత్నం మానాలి. లేకపోతే చంద్రబాబు ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలవాల్సి వస్తుంది. రోహిత్... మూడక్షరాలు భారత పాలకులకు ముచ్చెమటలు పట్టించాయి. ఇవే మూడక్షరాలు ఏమార్పుగా ఉన్న విద్యార్థి యువజనోద్యమానికి మార్గ నిర్దేశనం చేశాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రాజుకున్న విద్యార్థి ఉద్యమ జ్వాలలు ఢిల్లీని చుట్టుముట్టాయి. కులం నాగు కోరలు పెరికే విద్యార్థి శక్తిని అడ్డుకోలేని శక్తులు అదే కులాన్ని పావుగా మలుచుకొని రోహిత్ తల్లి రాధిక పోరాట పటిమను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఓ దళిత స్త్రీ... అందులోనూ కడుపున పుట్టిన మహా మేధావిని పోగొట్టుకున్న తల్లి కుప్పకూలిపోకుండా. దృఢంగా నిలిచి, పోరాడింది. గుండెను చిక్కబట్టుకొని, ఎన్ని అడ్డంకులెదురైనా తన దారి పోరు దారేనని విద్యార్థి ఉద్యమంలో భాగమైంది. ఇదే ప్రత్యర్థులకు మింగుడు పడనిది. నయానా భయానా లొంగదీసుకోవాలని, ఉద్యమాన్ని అణచెయ్యాలని ఎన్నో కుయుక్తులు పన్నారు. ఏదీ సాధ్యం కాకపోగా, అమాత్యుల మెడలకే ఉచ్చు బిగుస్తుం డటంతో పాత పాచికలు మరోసారి బయటకు తీశారు. రాధిక దళితురాలు కాదని నిరూపించి, సత్యాన్ని మరుగుపర్చే యత్నం మొదలెట్టారు. ఇటీవల పార్లమెంటు ఉభయసభల్లో కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ చేసిన కుట్ర పూరిత ప్రసంగం అభాసుపాలైంది. ఆగ్రహావేశాలతో ఉపన్యసించిన స్మృతీ ఇరానీ ‘‘నేను ఇచ్చిన వివరణతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే నా తల తీసి ఇస్తాన’’ని సవాలు విసిరారు. ‘‘నేను మీ వివరణతో సంతృప్తి చెందలేదు, మీ తల తీసివ్వండి’’ అంటూ బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి నిలదీయడంతో నిజంగానే స్మృతీ ఇరానీ తల తీసేసినంత పనయ్యింది. రోహిత్ కులాన్ని వివాదాస్పదం చేసి పాలకులు తమ తలలేని తనాన్ని బయటపెట్టుకుంటున్నారనిపిస్తోంది. తిమ్మిని బమ్మిచేస్తే తప్పు ఒప్పయ్యేనా? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, చైతన్యవంతమైన విద్యార్థి ఉద్యమంపై కుల దురహంకారులు ద్వేషం వెళ్లగక్కారు. పథకం ప్రకారం రాజకీయ అండదండలతో రోహిత్ సహా ఐదుగురు దళిత విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి వెలివేశారు. తదనంతర పరిణామాలను జీర్ణించుకోలేని రోహిత్ ఆత్మహత్య చేసుకొని దేశాన్ని, ప్రత్యేకించి దళిత ఉద్యమకారులను నిద్రలేపాడు. అంతేకాదు, కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, వైస్ చాన్స్లర్ అప్పారావు తదితరుల మీద రోహిత్ను ఆత్మహత్యకు పురికొల్పిన అభియోగంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదైంది. దీంతో వారు తొలుత రోహిత్ అసలు ఎస్సీ కాదని నిరూపించాలని శతవిధాలా యత్నించారు. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వం తన మిత్రపక్షమైన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడాలని రకరకాల ప్రచారాలు, తప్పుడు వాదనలు ప్రచారంలోకి రావడానికి ఆస్కారం కల్పించింది. ఈ వివాదం పథకం ప్రకారం పన్నిన కుట్ర. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైన వెంటనే రోహిత్ వేముల తండ్రిని తెరపైకి తెచ్చి, అతని చేత రోహిత్ వడ్డెర కులస్తుడని చెప్పించి నమ్మించాలని ప్రయత్నిం చారు. ఎన్నడో తల్లిని పిల్లలను వీడి, ఎన్నడూ పిల్లల ఆలనా పాలనా చూడని ఆ తండ్రి కులాన్ని రోహిత్కి అంటగట్టాలని చూశారు. రోహిత్ తల్లి రాధిక ఎస్సీ ‘మాల’ కనుక రోహిత్ ఆమె కులస్తుడే అవుతాడని తెలిసి వెనక్కి తగ్గారు. ఇప్పుడు రాధికే ఎస్సీ కాదనే కొత్త వాదన మొదలు పెట్టి, రకరకాల రుజువులు చూపడం ప్రారంభించారు. తిరుగులేని వాస్తవాలనూ కాదంటారా? రోహిత్ తల్లి రాధిక జీవితాన్ని మొదటి నుంచి పరిశీలిస్తే వాస్తవాలు తేటతెల్లమవుతాయి. ఫిబ్రవరి మొదటి వారంలో గుంటూరు జిల్లా అధికారులు రాధిక పెంపుడుతల్లి అంజనీదేవి స్టేట్మెంట్ను నమోదు చేశారు. దాని ప్రకారం రాధిక, కూలి పని చేసుకునే ఓ వలస కూలీల జంటకు పుట్టిన బిడ్డ. అప్పటికే ఒక పాపను కోల్పోయిన అంజనీదేవి చక్కగా ఉన్న ఈ పాప(రాధిక)ను తనకివ్వమని కోరగా, పేదరికంలో ఉన్న ఆ జంట ఆ పసిపాపను ఆమెకు అప్పగించి వెళ్లిపోయారు. రాధిక మాల కులస్తురాలనే విషయాన్ని కావాలనే తాము దాచిపెట్టి, తమ కులస్తురాలనే చెప్పామని అంజనీదేవి తెలిపారు. 14వ ఏటనే రాధికను తమ వడ్డెర కులస్తుడైన మణి కుమార్కిచ్చి పెళ్ళి చేశారు. పెళ్ళిలో కూడా రాధిక ఎస్సీ అని బయట పడనివ్వ లేదని ఆమె మీడియాకు చెప్పారు. రాధిక ముగ్గురు పిల్లల తల్లి అయ్యాక ఆమె మాల అని భర్తకు తెలిసింది. దీంతో మణికుమార్ రాధికను హింసించడంతో పాటూ, అంజనీదేవితో సైతం గొడవపడేవాడట. ఈ హింస తట్టుకోలేకే రాధిక విడాకులు తీసుకుందని మణికుమార్ తాత చెప్పారు. రాధిక తన ముగ్గురు పిల్లలతో వచ్చి కొంత కాలం అంజనీదేవి వద్దే ఉన్నా, తర్వాత గుంటూరుకు...అది కూడా తన కులంవారు నివసించే మాలవాడకు చేరింది. రాధికను పెంచుకోవడం మొదలు పెట్టాక అంజనీదేవికి నలుగురు పిల్లలు పుట్టారు. వారంతా మంచి చదువులు చదివి, మంచి వృత్తులలో బాగా బతుకుతున్నవారే. అంజనీదేవి సైతం ఎంఏ, ఎంఈడీ చదివి, మున్సిపల్ హైస్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేశారు. ఆమె భర్త ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. ఈ విషయాలను ప్రస్తావించడానికి బలమైన కారణమే ఉంది. పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్న ఆ జంట సొంత పిల్లలను చదివించి వృద్ధిలోకి తెచ్చినా, రాధికను మాత్రం చదివించకుండా బాల్య వివాహం చేసి పంపేసింది. భర్తతో విడాకులు తీసుకుని వచ్చిన రాధికను, ఆమె పిల్లలను అంజనీదేవి దంపతులే గాక, ఇంట్లో వారంతా పనివాళ్లకంటే హీనంగా చూసేవారని ప్రత్యక్ష సాక్షి అయిన రోహిత్ ప్రాణమిత్రుడు రియాజ్ చెప్పారు. రాధిక గుంటూరుకు చేరాక వారు తమకు ఎలాంటి సాయం చేయలేదని, రోహిత్ సోదరుడు రాజా చక్రవర్తి తెలిపారు. అనాథ అయినా రాధిక వడ్డెర కులస్తురాలై ఉంటే అంజనీదేవి కుటుంబం నుంచి తగు సాయం అందేది. అందరితో సమానంగా చూసేవారు. రాధిక వడ్డెర కులంలో పుట్టలేదనడానికి రెండు రుజువులున్నాయి. ఒకటి అంజనీదేవి స్టేట్మెంట్, రెండవది రాధిక విడాకుల గురించి ఆమె భర్త మణికుమార్ బంధువు చెప్పిన విషయాలు. రాధిక మాలవాడలో నివసిం చాలని నిర్ణయించుకోవడం కూడా కీలకమైనది. దళితేతరులెవ్వరూ మాల, మాదిగలుగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. రాధిక మాల కులస్తురాలు కాకపోతే ఏరికోరి దళిత కాలనీకి వెళ్ళే అవకాశమే లేదు. ‘‘మాల మాదిగలుగా ఎవ్వరూ పుట్టాలనుకోరు. అది యాదృచ్ఛికం. రాజులుగానో, మహారాజులు గానో ఉండాలనుకుంటారు’’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారు! రాధిక తమది వడ్డెర కులమని చెప్పుకుని ఉంటే, కుల వివక్ష కూడా అంతగా ఉండేది కాదు. తన కొడుకు పెరిగి పెద్దవాడై విశ్వవిద్యాలయాల్లోని కుల జాడ్యానికి బలై, ముగ్గురు కేంద్ర మంత్రులపై ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కేసు పెట్టాల్సి వస్తుందని రాధిక ముందే దూరదృష్టితో చూసి మాలవాడకు చేరుకోలేదు. రోహిత్ కులమేమిటని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో శ్రద్ధగా ‘పరిశోధించింది’. ఎలాగైనా వాస్తవాలను మసిపూసి మారేడు కాయగా మార్చాలనీ చూస్తున్నది. ఓ ఒంటరి దళిత స్త్రీ కులంపై ఇంతటి ‘పరిశోధనా’? ఒక ఒంటరి దళిత స్త్రీ రాధిక కులం నేడు దేశవ్యాప్త చర్చనీయాంశం ఎందుకయ్యింది? గత కొన్నేళ్ళుగా నకిలీ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని పలు ఆరోపణలు ప్రభుత్వాలకు అందాయి. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈ విషయంపై విచారణలు, క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ నివేదికలను అందించింది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిపిన పరిశీలనలో హైదరాబాద్లోని ఆదాయం పన్ను శాఖలో 31 మంది, టెలికమ్యూనికేషన్స్లో 8 మంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో 10 మంది, విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో 13 మంది, హిందుస్థాన్ షిప్యార్డ్లో 7 మంది, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో 33 మంది, మొత్తం 102 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్టు కమిషన్ తేల్చింది. కానీ ఇంతవరకు ఎవ్వరి మీదా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఐఏఎస్, ఐపీఎస్ల్లో సైతం నకిలీ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది, ఉన్నత పదవులు అనుభవించి రిటైరైన వారున్నారని ఫిర్యాదులున్నాయి. అయినా చర్యలు శూన్యం. కానీ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, ఆత్మబలిదానం చేసుకున్న రోహిత్ కులం గురించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని ఆతృత, ఆసక్తి, ప్రత్యేక శ్రద్ధ చూపి ఏం తేల్చదల్చుకున్నారు? విచారణ ద్వారా ఏ వాస్తవాలను అవాస్తవాలని చలామణి చేయాలనుకుంటున్నారు? అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓ దళిత స్త్రీ కుల హక్కుని సైతం దోచుకోవాలని ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? రోహిత్ బలిదానం ఎలుగెత్తి చాటిన ఉన్నత విద్యాలయాల్లోని కుల వివక్షను కాదా? ఒక్క హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే ఇప్పటి వరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రస్తావిస్తే... కేంద్ర మంత్రి స్మృతీఇరానీ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగాయని ఆవేశంగా మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో వివక్ష జరిగింది కాంగ్రెస్ హయాంలోనా, బీజేపీ హయాంలోనా? అనేది ప్రశ్నే కాదు. కేంద్రానికే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ, ఇతర అణగారిన వర్గాల పిల్లలు ఎదుర్కొంటున్న వివక్ష మీద విచారణ జరపాలి, నివారణకు పరిష్కార మార్గాలను ఆలోచించాలి. అంతేకానీ, రోహిత్ ప్రాణాలను బలిగొన్న కుల వివక్షను కప్పిపుచ్చాలనుకుంటే ఒక తప్పుని కప్పిపెట్టడానికి మరో తప్పు చేయడమే అవుతుంది. దుష్పర్యవసానాలూ తదనుగుణంగానే ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం వివేచనతో వ్యవహరించి, రోహిత్ తల్లి రాధిక కులంపై ఆరాను ఆపి, దోషులను కాపాడే ప్రయత్నం మానుకోవాలి. రోహిత్ సమస్యను మరింత జటిలం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందన్నది వాస్తవం. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య ) మొబైల్: 97055 66213 -
రోహిత్ తల్లికి గుంటూరులో ఇల్లు ఇవ్వండి
- ముఖ్యమంత్రికి ఎంపీ వీహెచ్ లేఖ న్యూఢిల్లీ ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికకు గుంటూరులో ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడికి మంగళవారం ఒక లేఖ రాశారు. దళితులపై వివక్ష కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎంత పరిహారం ఇచ్చినా ఆ మాతృమూర్తికి జరిగిన నష్టాన్ని భర్తీచేయలేమని తెలియజేశారు. అందువల్ల మానవీయ కోణంలో ఆమెకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. -
రోహిత్ చట్టం రావాలి - తల్లి రాధిక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అనంతర పరిణామాలు ఉద్వేగభరితం అవుతున్నాయి. విద్యార్థి నాయకులు రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలన్నిటికీ బస్సు యాత్రలు చేపడుతున్నారు. 23న ఢిల్లీ వెళుతున్నారు. మరోవైపు ‘నా బిడ్డ చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకు విశ్రమించేది లేదు’ అని రోహిత్ తల్లి రాధిక అంటున్నారు. రోహిత్ వేముల. ఇప్పుడతనొక చైతన్య కెరటం. సామాజిక ఉద్యమ కాంతి విస్ఫోటనం. వేనవేల సంవత్సరాల వెలివేతల వెతలకి మరణవాంగ్మూలం. రోహిత్కి కోటి ఆశలున్నాయి. ఆ ఆశల నక్షత్ర స్ఫూర్తి ఎవరో తెలుసా? గోరుముద్దలతో కొడుకు గుండెల్లో తెగువ నింపిన అమ్మ.. రాధిక. అమ్మే.. అతనికి రోల్మోడల్. అంటరాని దానివని సమాజం వెలివేసేవరకు.. ముగ్గురు బిడ్డల తల్లిని చేసి కట్టుకున్నవాడు కాలదన్ని వెళ్లే వరకు... అడుగడుగునా ఆంక్షల సంకెళ్లతో సమాజం తన మనసును కుళ్ల పొడిచే వరకు.. రెప్పలమాటున కన్నీటిని దిగమింగుకొని నిశ్శబ్దంగా భరించిన రోహిత్ వేముల తల్లి రాధిక ఏనాడూ పన్నెత్తి మాట్లాడలేదు! తనను వెలివేసిన ఈ సమాజాన్ని నిలదీయనూ లేదు. పట్టెడన్నం కోసం పదిమందినీ చేయి చాచకుండా పిల్లలకు నాలుగక్షరాలు నేర్పడమే సరియైన దారనుకుంది. రెక్కలకు మిషన్ కట్టుకొని పాతబట్టలను కుట్టుకుని, పాచిపనితో పాటు వెంటవచ్చే తిట్లను తుడిచేసుకొని బతకడం మొదలు పెట్టింది. తన బిడ్డల కోసమే బతకడం మొదలు పెట్టింది రాధిక. రోహిత్ తల్లి రాధిక ఈ సమాజంపై చేసిన నిశ్శబ్ద యుద్ధమే రోహిత్కి తిరుగుబాటు నేర్పింది. ఆ మాతృమూర్తితో సాక్షి సంభాషణ. చుక్కలంటే రోహిత్కి చాలా ఇష్టమట కదా! చిన్నప్పుడు రోహిత్ కి చీకటంటే భయం. అమ్మమ్మతో (రాధికను పెంచిన తల్లి) ఆ విషయం చెబితే చీకటంటే భయమెందుకు చీకటి వెనుక నక్షత్రాల వెలుతురుంది చూడమందట. అప్పట్నుంచి చీకట్లోకి వెళ్లాలంటే నక్షత్రాలను తలచుకునేవాడు. నిత్యం నా గాజులతో ఆటాడుకునే రోహిత్.. పగిలిన గాజులతో నక్షత్రాలను చేసి అందులో రంగుల హరివిల్లుని చూపేవాడు. ఇంట్లో బకెట్లను అడ్డం పెట్టి క్రికెట్ ఆడుతుంటే వచ్చే శబ్దానికి రోహిత్ ఇంట్లో ఉన్నట్టు చుట్టుపక్కల వాళ్లు గ్రహించేవాళ్లే తప్ప రోహిత్ అలికిడి ఎవ్వరికీ తెలిసేది కాదు. ఒంటరి జీవితం, పేదరికం, అస్పృశ్యత ఎలా ఉండేది? మీ పిల్లల మనోభావాలు ఏమిటి? నాకు నా కుటుంబ సభ్యుల తోడు ఉన్నా, ఒంటరిగానే జీవితాన్ని ఈదటం నేర్చుకున్నాను. పిల్లలకూ అదే నేర్పాను. అన్నింటికీ పరిష్కారం చదువొక్కటే అనుకున్నా. కానీ చదువును అంటి పెట్టుకొని వివక్ష నా బిడ్డని వెంటాడుతోందని తెలుసుకోలేకపోయాను. అదే వివక్ష నా బిడ్డని నాకు దూరం చేస్తుందని అస్సలూహించలేదు. అలా ఊహించి వుంటే నా బిడ్డని భద్రంగా దాచిపెట్టుకొందును. చిన్నప్పుడు తమ్ముడు ఫిజిక్స్ ట్యూషన్కెళితే అగ్రవర్ణాలవాళ్లంతా మాష్టారు గది లోపలుంటే, గడపను ఆనుకొని తమ్ముణ్ణి, తమ్ముడి దళిత మిత్రులను, సాయిబుల పిల్లలను బయటే కూర్చోబెడుతున్నారని తెలిసి రోహిత్ ఊరడించాడు. ఎక్కడకూర్చున్నా మనకు చదువు అబ్బుతుంది. అందరికన్నా మరింత కష్టపడితే అందరికన్నా మనమే ముందుంటాం. మంచి స్థానంలో ఉంటాం. అన్నింటికీ పరిష్కారం అదేనని తమ్ముడికి చెప్పేవాడు. మాది కటిక పేదరికం. నేను రోహిత్ చదువుకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అన్ని చోట్ల జనరల్ క్యాటగిరీలోనే సీట్లు సంపాదించాడు. ఎంఎస్సీ ఎంట్రన్స్లో ఆలిండియాలో ఆరో స్థానాన్ని సంపాదించి కన్నతల్లిని గర్వపడేలా చేశాడు. అప్పుడే నా కష్టం వృథా పోలేదని అర్థం అయ్యింది. చిన్నప్పట్నుంచి స్కూల్ కి కానీ, కాలేజీకి కానీ బాక్స్ తీసుకెళ్లే వాడు కాదు. నిజానికి ఇంట్లో ఏమీ ఉండేది కాదు. అందుకే మధ్యాహ్నం కూడా ఇంటికే వచ్చేవాడు. ఉంటే తినేవాడు. లేకుంటే పస్తులుండేవాడు. డిగ్రీలో సైతం పస్తులున్న విషయం నాకింకా గుర్తుంది. స్కూల్లో అయితే టీచర్లే వాళ్ల బాక్సుల్లోది పెట్టేవాళ్లు. అంతటి పేదరికం కూడా రోహిత్ ని కుంగదీయలేదు. అంబేడ్కర్ పుస్తకాలెక్కువగా చదివేవాడు. కన్నా మాష్టారి బడిలో చదువుకునేప్పుడు ఉపన్యాస పోటీల్లో కుల వివక్షలేని సమాజం అవసరమని మాట్లాడినట్లు మాష్టారు చెప్పారు. రోహిత్ మిమ్మల్ని ఏదైనా కావాలని అడిగేవాడా? ఇది కావాలని నన్నేనాడూ అడగలేదు. బట్టలు కూడా నేను తెచ్చి కొలతలిచ్చి రమ్మంటే టైలర్ దగ్గరికెళ్లేవాళ్లు రోహిత్, రాజు. చివరకు నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్న రోహిత్కి హైదరాబాద్లోనే ఒకమ్మాయిని తీసుకొచ్చి చూపించాను. దూరంగా చెట్టుకింద కూర్చున్న అమ్మాయి దగ్గరికి తన మిత్రుడితో కలిసి వెళ్లి నాకు వేరే ఆలోచనలున్నాయని, ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని సున్నితంగా చెప్పి వచ్చాడు రోహిత్. రోహిత్ని టైస్టని, దేశ విద్రోహి అని అంటున్నారు..! అందరూ సమానంగా ఉండాలనడం దేశ ద్రోహమా? అవమానిస్తే సహిస్తూ కూర్చోక పోవడం టైజమా? నేను పెద్దగా చదువుకోలేదు. కానీ నా బిడ్డలను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చి దిద్దాను. ఎవరికీ ద్రోహం చేసి ఎరుగరు. అన్నింటినీ సహిస్తూ ఉండేవాళ్లు. రోహిత్ ఎప్పుడూ లైబ్రరీల చుట్టూ తిరిగేవాడు. ఏవేవో పుస్తకాలు చదివేవాడు. అతని చదువే అతనికి తెగింపు నేర్పింది. అందుకే అన్యాయాన్ని ప్రశ్నించాడు. బహుశా అదే నా బిడ్డ చేసిన ద్రోహం కాబోలు. అందుకే నా బిడ్డను సాంఘిక బహిష్కరణ చేసి, యూనివర్శిటీ బయటకు, రోడ్డు మీదికి చేర్చారు. మీ భర్త ఎప్పుడైనా బిడ్డల ఆలనా, పాలనా చూశారా? నా భర్త ఏనాడూ నా బిడ్డల గురించి ఆలోచించలేదు. ఆలోచిస్తే నేనొక్కత్తినే ఎందుకు బిడ్డలను పెంచుకుంటాను. అసలు నా బిడ్డల మొహం కూడా అతనికి సరిగ్గా తెలియదు. మేమిద్దరం విడిపోయిన తర్వాత కూడా నా వెంటపడి వీధి రౌడీలా వేధించేవాడు. నా పేరు చెప్పి చుట్టుపక్కల అప్పులు చేసేవాడు. ఆ అప్పులన్నీ తీర్చుకోలేక నేనూ, నా బిడ్డలూ అష్టకష్టాలు పడేవాళ్లం. టెన్త్లో ఉండగా పరీక్ష ఫీజుకి డబ్బుల్లేక మట్టిపనికి వెళ్లిన రోహిత్ని అతని క్లాస్మేట్ చూడటంతో తట్టుకోలేక మట్టితట్ట అక్కడే పడేసి వచ్చి బోరున ఏడ్చాడు. మీరు దళితులు కాదంటూ మీ గురించి జరుగుతున్న చర్చపై మీరేమనుకుంటున్నారు? నాకూ, నా బిడ్డలకూ కూడు పెట్టని కులం ఇప్పుడు నా గురించి ఆరా తీస్తోంటే బాధగా వుంది. నా భర్త నా బిడ్డల మూతి కూడా తుడిచి ఎరగడు. అతనికి నా కులం గురించి చర్చించే అర్హత లేదు. ఒక దళిత బిడ్డగా అన్ని అవమానాలను భరిస్తూ, అన్ని అణచివేతలను సహిస్తూ నా బిడ్డలు పెరిగారు. అదీ దళిత వాడలోనే. ఆ దళిత వాడే మమ్మల్ని గుండెలకు హత్తుకుంది. అవే ఆచారాలు, అలవాట్లూ నా బిడ్డలకూ ఉన్నాయి. ఏనాడూ మా గురించి ఆలోచించకుండా, మా ఆలనా పాలనా చూడకుండా ఇప్పుడు నా బిడ్డలు తన కులమేనంటూ నా భర్త మాట్లాడటంలో అర్థం లేదు. నన్ను పెంచింది వడ్డెర కులస్థులే అయినా నా పుట్టుక మూలాలు దళితులవే. రోహిత్ మరణం నేటికీ దేశాన్ని కుదిపేస్తోంది. మీరేం కోరుకుంటున్నారు. మొన్ననే నా బిడ్డ అిస్థికలు నదిలో కలిపొచ్చాము. మనసు ముక్కలైంది. చెట్టంత బిడ్డను కోల్పోవడం ఎంత నరకమో అనుభవిస్తున్నాను. కానీ అతను ఊరికినే చనిపోలేదు. ఎందుకు చనిపోయాడో యూనివర్సిటీ వాళ్లు నాకు చెప్పాలి. రోహిత్ ఆత్మహత్యకు కారకులెవ్వరో ముందు తేలాలి. ఆమెవరో (స్మృతీ ఇరానీ, సుష్మాస్వరాజ్ అంటూ చిన్న కొడుకు రాజా అందించాడు) నా బిడ్డ దళితుడు కాదని మాట్లాడ్డం కాదు. నా బిడ్డ ఎందుకు చనిపోయాడో చెప్పాలి. నా బిడ్డనే కాదు ఎంతో మంది దళిత బిడ్డల్ని చంపేసి డబ్బులిచ్చి పంపేద్దామనుకుంటున్నారు. కానీ నాకు ఒక్కనయాపైసా కూడా అక్కర్లేదు. నాలాంటి తిరగబడే తల్లులుంటారని వీసీ అప్పారావుకి అర్థం కావాలి. నా బిడ్డ చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకు నా బిడ్డ ఆత్మకు శాంతి లేదు. న్యాయం జరిగే వరకు నేను ఊరుకోను. - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి రాజకీయ నాయకులు, ఇతర సంఘాలు మీ పక్షాన నిలబడ్డాయి కదా. వారికి మీరేం చెప్పదల్చుకున్నారు? నా దగ్గరికొచ్చిన మొట్టమొదటి నాయకులు వైఎస్ జగన్. నా ఇంటికొచ్చి ధైర్యం చెప్పారు. ఆయనే అధికారంలో ఉంటే నేను దళిత స్త్రీనన్న నిజాన్ని ఒక్కముక్కలో తేల్చిపడేసేవారు. ఒక్కపైసా కూడా ఇవ్వకుండా నాకు 5 లక్షలిచ్చినట్టు తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. నాకూ, నా చిన్న కొడుకు రాజా కి ఉద్యోగం కూడా ఇచ్చామంటున్నారు. కానీ ఎప్పుడిచ్చారో, ఎక్కడిచ్చారో వాళ్లే చెప్పాలి. వైఎస్ఆర్ మరణం తరువాత నా బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదేమోనని బెంగపడ్డాను. పెద్దాయన చనిపోయినప్పుడు నేను అన్నం కూడా ముట్టలేదు. నాకు మద్దతిచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు. నా బిడ్డకు న్యాయం జరిగే వరకు నా వెంట ఉండండి. నా లాంటి దళిత బిడ్డలపై వేధింపులు ఆగాలంటే రోహిత్ చట్టం చేయాలి. అందుకు పార్లమెంటులో నా పక్షాన పోరాడండి. ఇదే నేను చెప్పగలిగింది. -
హెచ్సీయూలో ఉద్రిక్తత.. ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్: హెచ్సీయూ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్సిటీ గేట్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాహుల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేపట్టి రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ హైదరాబాద్ రాక నేపథ్యంలో శనివారం తెలంగాణ వ్యాప్తంగా కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నేడు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా వర్సిటీ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ నుంచి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్సిటీకి వచ్చి విద్యార్థులు చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులకు సంఘీభావంగా ఆయన దీక్ష చేపట్టారు. నేటి సాయంత్రం ఆరు గంటల వరకు రాహుల్ దీక్ష కొనసాగించనున్నట్లు సమాచారం. రోహిత్ తల్లి రాధిక కూడా రాహుల్ చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. -
హెచ్సీయూ విద్యార్థులకు కాంగ్రెస్ నేతల మద్దతు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థికి న్యాయం జరగాలంటూ పోరాడుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులకు తమ మద్దతు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ తల్లి రాధికను నేతలు పరామర్శించారు. -
నా కులం గురించి ఇప్పుడెందుకు?
హైదరాబాద్ : ఇటీవల హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ కుల ప్రస్తావనపై వస్తున్న వార్తలను తల్లి రాధిక ఖండించారు. తాను మాల సామాజిక వర్గంలో జన్మించానని, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో తన వివాహం జరిగిందని ఆమె తెలిపారు. తనకు మగ్గురు సంతానమని... మూడో బిడ్డ పుట్టిన అనంతరం, కుటుంబ కలహాల నేపథ్యంలో తాము విడాకులు తీసుకున్నట్లు రాధిక తెలిపారు. తన కులం గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. మరోవైపు రోహిత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయిదు రోజుల తర్వాత స్పందించడాన్ని రోహిత్ సోదరుడు తప్పుబట్టారు. భరతమాత ఓ బిడ్డను కోల్పోయిందని ప్రధానికి ఇప్పుడు అర్థమైందా అని అన్నారు. తన తమ్ముడు చావును కులంతో ముడిపెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
వీసీ దొంగచాటుగా ఎందుకొచ్చారు?
అప్పారావు తమ నివాసానికి రావడంపై రోహిత్ తల్లి రాధిక సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా భద్రతతో హెచ్సీయూ వీసీ అప్పారావు తమ ఇంటికి రావడాన్ని రోహిత్ తల్లి రాధిక తీవ్రంగా తప్పుబట్టారు. ఏ తప్పు చేయనప్పుడు అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఆయన యూనివర్సిటీకి ఎందుకు రావడం లేదని నిలదీశారు. తన కుమారుడి మరణానంతరం ఆమె మీడియా ముంగిటకొచ్చి తొలిసారిగా వర్సిటీలో మాట్లాడారు. కుమారుడిని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వీసీ తమ నివాసానికి వచ్చి తనతో మాట్లాడడానికి ప్రయత్నించగా... తాను తిరస్కరించినట్లు చెప్పారు. వీసీ ఏం చెప్పాలకున్నా తన కుమారుడి తోటి విద్యార్థుల ఎదుట వర్సిటీలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వర్సిటీకి రాకున్నా.. తాను వర్సిటికి వెళ్లాక ఫోన్లో విద్యార్థుల నడుమ మాట్లాడాలని సూచించాననన్నారు. తన కుమారుడిని వర్సిటీ నుంచి ఎందుకు బహిష్కరించారో ఇప్పటికీ చెప్పలేదని పేర్కొన్నారు. బహిష్కరించిన సమయంలో కనీస బాధ్యతగా గార్డియన్ అయిన తల్లికి చెప్పాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. ‘‘నా బిడ్డ చేసిన తప్పేమిటో చెప్పాలి. మరో తల్లికి నాలా జరగకూడదు. నా కుమారుడి ఆత్మహత్య వెనుక ఎవరున్నారో తెలియాలి. వారికి శిక్షపడాలి. నా కుమారుడి ఆశయాలు నెరవేరే దాకా దీక్షలో కూర్చుంటా..’ అని రాధిక స్పష్టం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని, అవసరమైతే ఢిల్లీకైనా వెళతానని చెప్పారు. ఎస్సీయే..: రోహిత్ కులంపై వస్తున్న భిన్న వాదనలను అతని సోదరుడు రాజా కొట్టిపారేశారు. ‘‘మా అన్న మెరిట్ స్టూడెంట్. అతను కులం ఆధారంగా వర్సిటీలో ప్రవేశం పొందలేదు. మెరిట్ ప్రాతిపదికన సీటు సాధించాడు. అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా నేనే అందజేశా. మాది ఎస్సీ సామాజిక వర్గమే. కుల విషయాన్ని పక్కనబెట్టి.. రోహిత్ ఎందుకు చనిపోయారో తేల్చాలి..’’ అని డిమాండ్ చేశారు. తమది నిరుపేద కుటుంబమని, అన్నయ్యే తమకు ఆధారమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి'
-
'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి'
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు స్వయంగా వచ్చి తన కుమారుడు చేసిన తప్పేంటో చెప్పాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. రోహిత్ చనిపోయాక తమ ఇంటికి వచ్చి ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆమె తెలిపారు. వీసీ తప్పు చేయకుంటే దొంగతనంగా వచ్చి తమను కలిసేందుకు ఎందుకు ప్రయత్నించారో చెప్పాలని రాధిక ప్రశ్నించారు. తమ కుమారుడు రోహిత్ ఆశయసాధనే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. సస్పెన్షన్కు గురైన మిగిలిన నలుగురి విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ గురువారం మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మనస్తాపంతో ఆదివారం నాడు యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
తేనిలో తమన్నా
నేను మదురై సమీపంలోని తేని గ్రామానికి వచ్చానని తమన్న ట్విట్టర్లో పేర్నొన్నారు. కొన్ని చిత్రాలు కొందరి జీవితాల్లో మైలురాయిగా నిలిచిపోతాయి.ఆ విధంగా నటి తమన్నా నట జీవితం బాహుబలి చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పుకోవచ్చు. దాదాపు దశాబ్దం తరువాత బాహుబలి చిత్రం ఈ గుజరాతీ భామకు అనూహ్య హైప్ను తెచ్చిపెట్టింది. అవంతికగా తన అభినయం అమితంగా అలరించింది. అంతకు ముందు తమన్నా పనైపోయింది అన్న ఇప్పుడు ఔరా తమన్నా అంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగు, తమిళం భాషల్లో బిజీ కథానాయకి అని చెప్పవచ్చు. తమిళంలో ఇటీవల ఆమె నటించిన వాసువుమ్ శరవణనుమ్ చిత్రం పెద్దగా ఆడకపోయినా వరుసగా అవకాశాలు రావడం విశేషం. తాజాగా శీను రామసామి దర్శకత్వంలో విజయ్ సేతుపతికి జంటగా ధర్మదురై అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రం ఇటీవలే మదురై జిల్లా సమీపంలో తేని గ్రామంలో ప్రారంభమైంది. దీని గురించి తమన్నా ట్విట్టర్లో పేర్కొంటూ నేనిప్పుడు ధర్మదురై చిత్రం కోసం తేని గ్రామానికి వచ్చాను.శీను రామసామి దర్శకత్వంలో నటించడం సూపర్ ఎగ్జైటింగ్గా ఫీలవుతున్నాను. ఇది సోషల్ డ్రామాతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రం. ఇందులో నాతో పాటు శివద , ఐశ్వర్యారాజేశ్, శ్రుష్టి డాంగే నటిస్తున్నారు. ముఖ్య పాత్రను నటి రాధిక పోషిస్తున్నారు. యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందిస్తున్న ధర్మదురై చిత్రం జూన్లో తెరపైకి రానుంది అని తెలిపారు. తమన్నా ఈ చిత్రంతో పాటు నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న ద్విభాషా చిత్రం ఊపిరి(తమిళంలో దోస్త్) చిత్రం, బాహుబలి-2 చిత్రంలో నటిస్తున్నారు. -
శ్రీవారి సేవలో రాధిక శరత్కుమార్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాధిక, శరత్కుమార్ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ వీరామ సమయంలో వారు స్వామి దర్శనం చేసుకున్నారు. వారికి టీటీడీ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. -
పిల్లలకు విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం కాలనీ సాయిబాబానగర్లో ఆర్థిక ఇబ్బందులతో ఒక కుటుంబం గురువారం ఉదయం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు పిల్లలు మృత్యువుతో పోరాడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మెదక్జిల్లా గజ్వేల్కు చెందిన రవీంద్రాచారికి రంగారెడ్డి జిల్లా మేడ్చెల్కు చెందిన రాధికతో వివాహమైంది. రవీంద్రాచారి హైదరాబాద్ వచ్చి సాయిబాబా కాలనీలో అద్దెఇంట్లో ఉంటూ బంగారు నగల తయారీ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం, అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి పెరిగింది. దీంతో గురువారం ఉదయం ఇద్దరు ఆడపిల్లలకు విషయం ఇచ్చి తనూ విషం తాగాడు. రవీంద్రాచారి విషం తాగిన కాసేపటికే మృతిచెందగా కుమార్తెలు జయశ్రీ(10), అపర్ణ(9) కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఉదయం రవీంద్రాచారి భార్య రాధిక చిన్నకొడుకు సూర్యప్రసాద్ను తీసుకుని పాలు తెచ్చేందుకు బయటికి వెళ్లి సమయంలో ఇంట్లో వంటరిగా ఉన్న రవీంద్రాచారి విషంతాగి పిల్లలకూ విషం తాగించాడు. ఇంటికి వచ్చిన రాధిక భర్త, పిల్లలు పడి ఉండడం చూసి కేకలు పెట్టింది. ఇరుగు పొరుగువారు వచ్చి ప్రాణంతో ఉన్న పిల్లలను సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జయశ్రీని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘఠనా స్థలాన్ని పరిశీలించి రవీంద్రాచారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాధిక కూతురు రెయాన్ నిశ్చితార్థం
తమిళసినిమా: ప్రముఖ నటుడు శరత్కుమార్, రాధిక దంపతుల కూతురు రెయాన్, అభిమన్యు మిథున్ వివాహ నిశ్చితార్థం బుధవారం ఉదయం చెన్నైలో ఆడంబరంగా జరిగింది. ఈ వేడుకకు నటుడు ప్రభు, రామ్కుమార్, రాధారవి, కే.భాగ్యరాజ్, మోహన్, శివకుమార్, అరవింద్సామి, రాంకీ,పృథ్వీ, జిత్తన్మ్రేశ్, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్,శోభా దంపతులు,సముద్రకని, బాలాజీమోహన్,హరి,నిర్మాత కలైపులి ఎస్.థాను,ఆర్బీ.చౌదరి,టీజీ.త్యాగరాజన్,అన్భుసెళియన్,టీ.శివ,శ్రీప్రియ,అంభిక,మీనా,నళిని,సీమ,సరిత,జ్యోతిక, సీత,కుష్భూ, నిరోషా,సంగీత విజయ్, సుహాసిని, ఆర్తి జయంరవి సినీ ప్రముఖులు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి శుభాకాంక్షలు ముఖ్యమంతి జయలలిత అభిమన్యు మిథున్, రెయాన్ల వివాహ నిశ్చితార్థ వేడుక సందర్భంగా లేఖ ద్వారా వారికి శుభాకాంక్షలు అందించారు.అందులో వివాహ నిశ్చితార్థ వేడుకకు శరత్కుమార్,రాధికతనను ఆహ్వానించడం సంతోషకరం.అయితే ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా తాను రాలేని పరిస్థితి. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు నా శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. -
కిడ్నాప్ కాదు.. హైడ్రామా..!
{పియుడితో కలసి వెళ్లిపోయి కిడ్నాప్ డ్రామా ఆడిన మహిళ రాజేంద్రనగర్లో మహిళ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన రాజేంద్రనగర్లో మహిళ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో కలసి ఆ మహిళే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్పల్లికి చెందిన మహేశ్కుమార్, రాధిక అలియాస్ అరుణజ్యోతి(23) భార్యాభర్తలు. ఈ నెల 6న గుడికి వెళుతున్నట్లు చెప్పి వెళ్లిన రాధిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో మహేశ్ 7వ తేదీన రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే 10వ తేదీన మహేశ్ మొబైల్ ఫోన్కు వాట్సప్లో రాధికను హింసిస్తున్న ఫొటోలు వచ్చాయి. రాధికను కి డ్నాప్ చేశామని, రూ. మూడు లక్షలు ఇస్తే ఆమెను వదిలేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి మహేశ్కు మెసేజ్ పంపాడు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులకు మహేశ్ సమాచారం అందించడంతో సెల్ నంబర్ ఆధారంగా నిందితుడు రిజ్వాన్ అని గుర్తించారు. అతను కోల్కతాలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి రిజ్వాన్తో పాటు కిడ్నాప్ డ్రామా ఆడిన రాధికను కూడా అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చారు. పాత పరిచయంతోనే: రాధికకు 2011లో సోషల్ నెట్వర్క్ ద్వారా బిహార్కు చెందిన రిజ్వాన్(20)తో పరిచయం ఏర్పడింది. అతడు ఖైరతాబాద్లోని ఓ హోటల్లో పనిచేసేవాడు. ఈ నెల 6న రిజ్వాన్ రాధికకు ఫోన్ చేయడంతో అతడిని కలిసేందుకు అత్తాపూర్ కాలహనుమాన్ ఆలయం వద్దకు వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరు కలసి ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, అక్కడి నుంచి కోల్కతాకు పారిపోయారు. రిజ్వాన్ వద్ద ఉన్న డబ్బు ఖర్చయిపోవడంతో మహేశ్ దగ్గర నుంచి డబ్బు గుంజాలనే ఉద్దేశంతో ఇద్దరూ కలసి కిడ్నాప్ డ్రామాకు తెరతీశారు. రాధిక చేతులు కట్టిపడేసి, సింధూరం నీళ్లు ఆమెపై చల్లి చిత్రహింసలు పెడుతున్నట్లుగా వీడియో తీసిన రిజ్వాన్ దానిని మహేశ్కు పంపించాడు. రాధికను విడిచిపెట్టాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సెల్ నంబర్ ఆధారంగా కేసును చేధించిన పోలీసులు ఇద్దరినీ కోల్కతాలో అదుపులోకి తీసుకున్నారు. రాధికపై కూడా కేసు నమోదు చేసినట్లు శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. -
'షారూఖ్, సల్మాన్ ఫొటోలతో ఎర'
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న చాలా రకాల సోషల్ వెబ్సైట్ల ద్వారా అమ్మాయిలను మోసగాళ్లు ట్రాప్ చేస్తున్నారని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వివాహిత రాధిక కిడ్నాప్ కేసును ఛేదించిన సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడారు. ప్రొఫైల్ పిక్చర్స్గా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సినిమా హీరోల ఫొటోలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. ఇలా అమ్మాయిలను తేలికగా మభ్య పెడుతున్నారని చెప్పారు. పెళ్లి అయిన పెద్దవాళ్లే ఇలాంటివారి వలలో పడుతుంటే ఇంకా పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అమ్మాయిల తల్లిదండ్రులకు సూచించారు. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈనెల 6న రాజేంద్రనగర్లో కిడ్నాపైన వివాహిత రాధిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సోషల్ వెబ్సైట్ల ద్వారా 2011లో నిందితుడు రిజ్వాన్ తో రాధికకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ పెళ్లి చేసుకోడానికే ఇంటి నుంచి పారిపోయారని డీసీపీ పేర్కొన్నారు. రాధికది కిడ్నాప్ కాదని, ప్రియుడు రిజ్వాన్తో కలిసి కోల్కతాకు వెళ్లారని పోలీసులు తెలిపారు. -
కిడ్నాప్ కాదు..ప్రియుడితోనే వెళ్లింది
-
కిడ్నాప్ కాదు..ప్రియుడితోనే వెళ్లింది
హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్లో కిడ్నాపైన వివాహిత రాధిక విషయంలో గుట్టు రట్టైంది. ఈనెల 6న రాజేంద్రనగర్లో కిడ్నాపైన రాధిక కేసును పోలీసులు ఛేదించారు. రాధికది కిడ్నాప్ కాదని, ప్రియుడు రిజ్వాన్తో కలిసి కోల్కతాకు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిపారు. డబ్బుల కోసమే ప్రియుడుతో కలిసి రాధిక వాట్సాప్ ద్వారా భర్తను బ్లాక్ మెయిల్ చేసిందని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా 2011లో నిందితుడు రిజ్వాన్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరు వివాహం చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయారని డీసీపీ పేర్కొన్నారు. కాగా వివాహిత మహిళ కిడ్నాప్ విషయం కలకలం రేపింది. రాధికను కిడ్నాప్ చేసి చిత్రహింసలు చేస్తున్నట్లు వాట్సప్ లో ఫోటోలు.. భర్తకు పంపి రిజ్వాన్ డబ్బు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
రాధిక కిడ్నాప్ నిందితుడు ఒడిశాలో..
అత్తాపూర్ (హైదరాబాద్) : వివాహిత రాధిక కిడ్నాప్ కేసు దర్యాప్తును రాజేంద్రనగర్ పోలీసులు వేగవంతం చేశారు. ఈనెల 6 వ తేదీన అదృశ్యమైన రాధికను రూ.3 లక్షలు ఇవ్వకపోతే ముంబైలో అమ్మేస్తానని దుండుగుడు చేసిన వాట్సాప్ కాలింగ్ ఆధారంగా ఏ ప్రాంతంలో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సెల్ ఫోన్ స్నిగ్నల్స్ ఆధారంగా నిందితుడు ఒడిశాలో ఉన్నట్లుగా గుర్తించారు. బాధితురాలిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆదివారం ఉదయం ఎస్ఓటీ పోలీసు బృందాలు విమానంలో ఒడిశాకు బయలుదేరాయి. కాగా ఈనెల 6న గుడికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన రాధికను కిడ్నాప్ చేసిన దుండగుడు వాట్సాప్ ద్వారా ఆమె భర్తను రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితురాలి భర్తకు డబ్బు డిపాజిట్ చేయమని ఇచ్చిన బ్యాంక్ ఖాతా ఆధారంగా అతను భవానీనగర్కు చెందిన మహమ్మద్ అజర్ఖాన్గా పోలీసులు గుర్తించారు. అయితే, ఆ చిరునామాకు వెళ్లి విచారించగా ఆ పేరుతో ఎవరూ లేరని తెలిసింది. కాగా రాధికను నిర్బంధించిన దుండగుడు ఆమె శరీరం నుంచి రక్తం కారుతున్న చిత్రాన్ని వాట్సాప్లో పంపడం కలకలం సృష్టించింది. -
వివాహిత కిడ్నాప్ కేసు దర్యాప్తు ముమ్మరం
అత్తాపూర్ : వివాహిత రాధిక కిడ్నాప్ కేసు దర్యాప్తును రాజేంద్రనగర్ పోలీసులు వేగవంతం చేశారు. ఈనెల 6న అదృశ్యమైన రాధికను రూ.3 లక్షలు ఇవ్వకపోతే ముంబైలో అమ్మేస్తానని దుండుగుడు చేసిన వాట్సాప్ కాలింగ్ ఆధారంగా ఏ ప్రాంతంలో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుండగుడు బాధితురాలి భర్తకు ఫోన్ చేసి ఏమి మాట్లాడాడనే విషయాలు తెలుసుకున్నారు. అలాగే ఈనెల 6న గుడికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన రాధికను దుండగుడు ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంటాడనే విషయాలు తెలుసుకునేందుకు ఆ మార్గాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. అలాగే రాధిక ఫోన్ నంబర్, దుండగుడి ఫోన్ నంబర్ కాలింగ్ డేటాను కూడా సేకరించే పనిలో పడ్డారు. దుండగుడు బాధితురాలి భర్తకు డబ్బు డిపాజిట్ చేయమని ఇచ్చిన బ్యాంక్ ఖాతా ఆధారంగా అతను భవానీనగర్కు చెందిన మహమ్మద్ అజర్ఖాన్గా పోలీసులు గుర్తించారు. అయితే, ఆ చిరునామాకు వెళ్లి విచారించగా ఆ పేరుతో ఎవరూ లేరని తెలిసింది. కాగా, రాధికను నిర్బంధించిన దుండగుడు ఆమె శరీరం నుంచి రక్తం కారుతున్న చిత్రాన్ని వాట్సాప్లో పంపడం కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో పలు అనువూనాలు వ్యక్తవువుతున్నారుు. భిన్న కథనాలు వినిపిస్తున్నారుు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసం ఉన్మాదం
తల్లి, భార్య, కూతురిని గొంతుకోసి హత్య చేసిన వ్యక్తి బాలాపూర్లో ఘోరం హైదరాబాద్: ఆస్తిపై పెంచుకున్న మమకారం ముందు రక్త సంబంధం ఓడింది. ఈ క్రమంలోనే ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి తన తల్లి, భార్య, కూతురి గొంతుకోసి ముగ్గురినీ దారుణంగా హత్యచేశాడు. మరో కుమార్తె త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంత బాలాపూర్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు సంరెడ్డి బల్వంత్రెడ్డి, సుభద్ర(65) దంపతుల కుమారులు గోవింద్రెడ్డి, రాంరెడ్డి. 2013లో సాయినగర్లో నిర్మించిన కొత్త భవనంలోకి వీరంతా మకాం మార్చారు. మొదటి అంతస్తులో రాంరెడ్డి తన భార్య రాధిక (36), కుమార్తెలు ప్రత్యూష (16), అక్షయ (14)లతో నివాసముంటుండగా రెండో అంతస్తులో ఉంటున్న గోవింద్రెడ్డి తల్లిదండ్రులనూ తనవద్దే ఉంచుకున్నాడు. ఇల్లు నచ్చలేదంటూ... ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే రాంరెడ్డి తనకు ఇల్లు నచ్చడం లేదని, వేరే ఇల్లు కట్టుకుంటానంటూ అందరికీ తరచూ చెప్పేవాడు. వారు అతని ప్రతిపాదనను వ్యతిరేకించేవారు. ఇలా అతని ధోరణిలో మార్పు రాకపోవడంతో పాటు ఆస్తికోసం వేధింపులు పెరగడంతో తండ్రి బల్వంత్రెడ్డి తనకున్న ఆస్తులన్నింటినీ తన ఇరువురి కోడళ్ల పేరిట రాశాడు. ఇది వారి మధ్య విభేదాలను తీవ్రతరం చేశాయి. సొంత కుటుంబీకులూ అతని తీరును వ్యతిరేకించ డంతో అందరిపైనా రాంరెడ్డి కక్షపెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారు జామున 3.05 గంటలకు నిద్రపోతున్న భార్య రాధిక గొంతును కత్తితో కోసి చంపాడు. అదే విధంగా నిద్రలో ఉన్న తల్లినీ హత్య చేశాడు. ఆమె పక్కనే పడుకున్న కూతుళ్లు అక్షయ, ప్రత్యూషలు పరిస్థితిని గమనించి పారిపోయేందుకు యత్నించగా అక్షయను వెంబడించి వంటగదిలో అంతమొందించాడు. ప్రత్యూష మాత్రం బాత్రూంలోకి వెళ్లి గడియపెట్టుకుని కేకలు వేసింది. దీంతో అదే ఇంట్లో పై పోర్షన్లో ఉన్న గోవింద్ కిందికి రాగానే రాంరెడ్డి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు, ఏసీపీ సుదర్శన్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా బయటకు వెళ్లిన నిందితుడు సాయిహోమ్స్కాలనీలోని ఓ బావిలోకి దూకి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో రాంరెడ్డి తనకు కారు కొనివ్వాలంటూ రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుస్తోంది. -
నూరేళ్లు కలిసున్నారు.. కలిసే వెళ్లిపోయారు!
లఖీం పురా: ప్రాణంలో ప్రాణంగా.. శ్వాసలో శ్వాసగా దాదాపు నూరేళ్లు కలిసి బతికిన ఓ జంట, మరణంలోనూ తోడుగానే ఉంటామంటూ ఈ లోకాన్ని వీడడంతో గ్రామస్తులంతా కన్నీరు మున్నీరయ్యారు. కులమతాలకతీతంగా గ్రామస్తులంతా ఏకమై ఆ అరుదైన జంటకు చాలా గౌరవమైన, ఘనమైన వీడ్కోలు పలికారు. లక్ష్మీపూర్ ఖేరి గ్రామానికి చెందిన రాధిక, ఫకీరా దాదాపు నూరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇపుడు వారి వయస్సు ఒకరికి 107, మరొకరికి 103 . నిండు నూరేళ్ల సావాసంలా దాదాపు వందేళ్ల వైవాహిక జీవితాన్ని సాగించిన ఆ జంట శనివారం మరణించారు. భార్య రాధిక గుండెపోటుతో మరణించడడంతో.. తట్టుకోలేని భర్త ఫకీరా కూడా తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆ శతాధిక వృద్ధ దంపతుల దహన సంస్కారాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.