Ravi Shastri
-
భారత తుదిజట్టులో ఓ మార్పు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వారికే!
భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్తో మ్యాచ్లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటు చేసుకోవచ్చని అంచనా వేశాడు. పిచ్ పరిస్థితికి తగ్గట్లుగా టీమిండియా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేశాడు.అయితే, ఎవరిపై వేటు వేస్తారు? ఎవరిని తీసుకువస్తారన్న విషయంపై మాత్రం రవిశాస్త్రి స్పష్టతనివ్వలేకపోయాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్తో ముగుస్తుంది. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ సహా భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్ను ఓడించి రోహిత్ సేన.. సౌతాఫ్రికాను చిత్తు చేసి సాంట్నర్ బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడగా.. కివీస్కు కూడా ఇక్కడ ఓ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి తమకూ పిచ్ పరిస్థితులపై అవగాహన ఉందని కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.భారత తుదిజట్టులో ఓ మార్పుఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు వాడిన పిచ్నే భారత్- కివీస్ ఫైనల్కు తిరిగి ఉపయోగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఫైనల్ మ్యాచ్లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటుచేసుకున్నా ఆశ్చర్యం లేదు. పిచ్ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది.టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన పిచ్ ఈ టోర్నమెంట్లోనే అత్యుత్తమైనది. మళ్లీ అలాంటి హోరాహోరీ చూడాలని ఉంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్స్మెన్కి దాదాపు ఐదు రోజుల విరామం లభించింది. 280- 300 పరుగుల మేర రాబట్టగలిగే పిచ్ తయారు చేసి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికేఇక ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఆల్రౌండర్ ఉండబోతున్నాడని రవిశాస్త్రి ఈ సందర్భంగా అంచనా వేశాడు. ‘‘అక్షర్ పటేల్ లేదంటే రవీంద్ర జడేజా టీమిండియా తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవబోతున్నారు. ఒకవేళ న్యూజిలాండ్కు అవకాశం ఉంటే మాత్రం నేను గ్లెన్ ఫిలిప్స్ వైపు మొగ్గుచూపుతాను. అతడు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. మెరుపు ఇన్నింగ్స్తో 4- 50 పరుగులు రాబట్టగలడు. ఒకటీ లేదా రెండు వికెట్లు తీసి ఆశ్చర్యపరచనూగలడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆసీస్తో సెమీస్ ఆడిన భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ.చదవండి: CT 2025: వరుణ్తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
అదంతా అబద్దం.. మాకంటూ ఓ విధానం ఉంది: మెకల్లమ్ ఫైర్
కామెంటేటర్లు రవి శాస్త్రి(Ravi Shastri), కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon Mccullum) మండిపడ్డాడు. వీరిద్దరు మాట్లాడిన మాటల్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆట విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తమకంటూ ఓ విధానం ఉందని.. ఫలితాలు అనుకూలంగా లేనపుడు ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ సిరీస్లో సూర్యసేన చేతిలో 4-1తో చిత్తైన బట్లర్ బృందం.. రోహిత్ సేనతో వన్డేల్లో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది.తద్వారా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభానికి ముందు గట్టి ఎదురుదెబ్బను చవిచూసింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా భారత్తో ఇంగ్లండ్ మూడో వన్డే సందర్భంగా.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క నెట్ సెషన్ఈ సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో ఇంగ్లండ్ ఒకే ఒక్క నెట్ సెషన్లో పాల్గొన్నదంటూ బట్లర్ బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట పట్ల అంకితభావం లేదంటూ విమర్శలకు దిగారు. ఈ విషయంపై ఇంగ్లండ్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తాజాగా స్పందించాడు.టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘మేము అసలు శిక్షణా శిబిరంలో పాల్గొననేలేదన్న వారి మాటలు పూర్తిగా అవాస్తవం. సిరీస్ ఆసాంతం మేము నెట్ సెషన్స్లో బిజీగా ఉన్నాం.అంతకు ముందు కూడా మా వాళ్లు వరుస సిరీస్లు ఆడారు. ఎదుటివారి విషయంలో ఆధారాలు లేకుండా ఇష్టారీతిన మాట్లాడటం సులువే. ఫలితాలు మాకు అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మాకంటూ ఒక విధానం ఉందిఏ ఫార్మాట్లో ఎలా ఆడాలో మాకంటూ ఒక విధానం ఉంది. దానినే మేము అనుసరిస్తాం. ఇక ఇప్పటికే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. ముందుగా చెప్పినట్లు వాళ్లు మాట్లాడిన మాటలు అబద్దాలు’’ అని మెకల్లమ్ రవిశాస్త్రి, పీటర్సన్ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు.ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం వీరి మాటలను ఖండించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రయాణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఒకటీ రెండు సెషన్లు మాత్రమే మిస్సయ్యామని తెలిపాడు. అంతేతప్ప రవిశాస్త్రి, పీటర్సన్ అన్నట్లుగా తామేమీ పూర్తిగా ప్రాక్టీస్కు దూరంగా లేమని పేర్కొన్నాడు.కాగా టెస్టుల్లో ‘బజ్బాల్’ విధానంతో దూకుడైన ఆటను పరిచయం చేసిన బ్రెండన్ మెకల్లమ్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్గానూ నియమితుడయ్యాడు. అయితే, తొలి ప్రయత్నంలోనే ఘోర పరాజయాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
Jasprit Bumrah: ‘విజయావకాశాలు 35% తగ్గుతాయి’
దుబాయ్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం ఇంకా సందేహంగానే ఉంది. ఆ్రస్టేలియాతో చివరి టెస్టులో వెన్నునొప్పితో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయని బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్లో ఉన్నాడు. అతను ఎంతవరకు కోలుకున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇంగ్లండ్తో చివరి వన్డే ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకుంటాడని చెబుతున్నా దానిపైనా సందేహాలు ఉన్నాయి. భారత జట్టుకు సంబంధించి అతని బౌలింగ్ విలువ ఎంత అమూల్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను చాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే టీమిండియా బలహీనంగా మారిపోవచ్చు. మాజీ ఆటగాడు రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. బుమ్రా గైర్హాజరు చాలా ప్రభావం చూపిస్తుందని అతను వ్యాఖ్యానించాడు. ‘బుమ్రా ఫిట్గా లేకపోతే భారత జట్టు విజయావకాశాలు చాలా తగ్గిపోతాయి. సరిగ్గా చెప్పాలంటే 30–35 శాతం వరకు గెలుపుపై ప్రభావం పడుతుంది. అతను పూర్తి ఫిట్గా ఉండి బరిలోకి దిగితే ఆట స్వరూపమే మారిపోతుంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో అతను కచ్చితంగా చెలరేగి గెలిపించగలడు. అయితే బుమ్రాను ఆడించే విషయంలో తొందర పడవద్దు. లేకపోతే గాయం తీవ్రత మరింత పెరిగిపోతుంది. కెరీర్ కీలక దశలో ఉన్న అతను రాబోయే రోజుల్లో ఎంతో ఆడాల్సి ఉంది. అలాంటివాడిని ఒక్కసారిగా పిలిపించి గెలిపించమని కోరడం సరైంది కాదు. బుమ్రా చాలా విలువైనవాడు.అతనిపై అంచనాలూ భారీగా ఉంటాయి. వచ్చి రాగానే చెలరేగిపోవాని అంతా కోరుకుంటారు. నాకు తెలిసి గాయంనుంచి కోలుకొని వచ్చి అలా ఆడటం సాధ్యం కాదు’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో మొహమ్మద్ షమీపై అందరి దృష్టీ ఉంటుందని...అతని ఫిట్నెస్కు కూడా ఇది పరీక్ష కానుందని కూడా భారత మాజీ కోచ్ అభిప్రాయ పడ్డాడు. -
CT 2025: సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!.. కానీ ఆ టీమ్తో జాగ్రత్త!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ రూపంలో మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ టోర్నీకి తెరలేవనుంది. ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియాతో పాటు.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి.మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. ఈవెంట్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే ఆయా దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(Ricky Ponting) చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు.సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా.. టీమిండియా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఇందుకు పాంటింగ్ బదులిస్తూ.. ‘‘ఇండియా- ఆస్ట్రేలియాను దాటుకుని వేరే జట్లు పైకి వెళ్లడం ఈసారీ కష్టమే.ఎందుకంటే.. ప్రస్తుతం ఇరు దేశాల జట్లలో నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాళ్లు మెండుగా ఉన్నారు. ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో ఈ జట్లు సత్తా చాటిన తీరే ఇందుకు నిదర్శనం. కాబట్టి ఈ రెండు ఫైనల్కు చేరే అవకాశం ఉంది’’ అని అంచనా వేశాడు.కానీ పాకిస్తాన్తో జాగ్రత్తఅయితే, ఆతిథ్య జట్టు పాకిస్తాన్ను కూడా తక్కువ అంచనా వేయవద్దని రిక్కీ పాంటింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘‘ఇటీవలి కాలంలో నిలకడగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. అది పాకిస్తాన్. వన్డే క్రికెట్లో ప్రస్తుతం వారి ప్రదర్శన అద్బుతంగా ఉంది.ఐసీసీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో వారి ఆటతీరు ఒక్కోసారి అంచనాలకు భిన్నంగా ఉంటుంది. ఈసారి మాత్రం ప్రతికూలతలన్నీ అధిగమించే అవకాశం ఉంది’’ అని రిక్కీ పాంటింగ్ మిగతా జట్లను హెచ్చరించాడు. కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరిగింది. నాటి ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్తాన్ టైటిల్ గెలిచింది.ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా రెండుసార్లు చాంపియన్గా నిలిచింది. రిక్కీ పాంటింగ్ సారథ్యంలో 2006, 2009లొ ట్రోఫీని కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియా 2013లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.ఇక పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. ఐసీసీ అనుమతితో హైబ్రిడ్ విధానంలో దుబాయ్ వేదికగా తమ మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో మ్యాచ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. అనంతరం.. మార్చి రెండున న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి. -
వాంఖడే స్టేడియంలో క్రికెట్ దిగ్గజాల కోలాహలం (ఫోటోలు)
-
ఇంకెన్నాళ్లు ఇలా?.. అతడిని ఆస్ట్రేలియా టూర్కి పంపాల్సింది!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం ఎప్పుడు? ఇప్పటికే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు దూరమైన ఈ సీనియర్ బౌలర్.. కనీసం ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు అయినా అందుబాటులోకి వస్తాడా?.. ఇంతకీ షమీకి ఏమైంది? అతడి గాయం తీవ్రత ఎలా ఉంది?.. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు తప్ప జాతీయ జట్టుతో చేరేందుకు అతడు సిద్ధంగా లేడా?..భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవి. అసలు షమీ ఫిట్నెస్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గానీ.. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) గానీ స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని ఈ మాజీ క్రికెటర్ ప్రశ్నిస్తున్నాడు. తానే గనుక బీసీసీఐ నాయకత్వంలో ఉంటే గనుక షమీని కచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటనకు పంపించేవాడినని పేర్కొన్నాడు.అదే ఆఖరుకాగా వన్డే ప్రపంచకప్-2023(ODI World Cup 2023) సందర్భంగా మహ్మద్ షమీ చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. చీలమండ నొప్పి వేధిస్తున్నా బంతితో మైదానంలో దిగి.. ప్రత్యర్థులకు వణుకుపుట్టించాడు. అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ టీ20 టోర్నీతో రీ ఎంట్రీఅయితే, దురదృష్టవశాత్తూ టైటిల్ పోరులో రోహిత్ సేన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి.. రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక ఈ మెగా ఈవెంట ముగిసిన తర్వాత షమీ చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందాడు. దాదాపు ఏడాది తర్వాత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు.ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్లు ఆడిన షమీ.. పదకొండు వికెట్లు తీసి సత్తా చాటాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్గా 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే ఆసీస్తో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ మొదలుపెట్టగా.. కనీసం మూడో టెస్టు నుంచైనా షమీ జట్టుతో చేరతాడనే వార్తలు వచ్చాయి.కొన్నాళ్లు విరామం కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం షమీ గాయంపై స్పష్టత లేదని.. అతడి ఫిట్నెస్ గురించి తమకు పూర్తి సమచారం లేదని పేర్కొన్నాడు. దీంతో షమీ ఆసీస్ టూర్ అటకెక్కింది. ఈ క్రమంలో కొన్నాళ్లు విరామం తీసుకున్న షమీ.. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల మధ్యప్రదేశ్తో మ్యాచ్లో ఈ బెంగాల్ ఆటగాడు బ్యాట్ ఝులిపించడం విశేషం. 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మహ్మద్ సిరాజ్తో పాటు యువ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ పెద్దగా రాణించకపోవడంతో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడింది. ఇక ఈ సిరీస్ను టీమిండియా 1-3తో కోల్పోయిన విషయం తెలిసిందే.ఇంకెన్నాళ్లు ఇలా?ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘అసలు అతడు ఎక్కడ ఉన్నాడు? పూర్తి స్థాయిలో కోలుకునేది ఎప్పుడు? అతడిని ఇంకెన్నాళ్లు ఎన్సీఏలో కూర్చోబెడతారు? అతడి ఫిట్నెస్ గురించి, ప్రస్తుతం అతడి పరిస్థితి గురించి బీసీసీఐ గానీ, ఎన్సీఏ గానీ ఎందుకు సరైన సమాచారం ఇవ్వలేకపోతోంది. నిజానికి అతడికి ఉన్న నైపుణ్యాల దృష్ట్యా.. నేనైతే అతడు పూర్తి ఫిట్గా లేకున్నా ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లేవాడిని’’ అని షమీ గురించి ప్రస్తావించాడు.అతడిని ఆస్ట్రేలియా టూర్కి పంపాల్సింది!ఇందుకు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ బదులిస్తూ.. ‘‘షమీ పూర్తి ఫిట్గా లేకపోయినా.. కనీసం నాలుగైదు ఓవర్లు అయినా బౌల్ చేసేవాడు. బ్యాకప్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా అందుబాటులో ఉండేవాడు. నిజంగా అతడు గనుక టీమిండియాతో ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో సొంతగడ్డపై ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!? -
ICC: జై షా కీలక ముందడుగు.. చిన్న జట్ల పాలిట శాపం?!
టెస్టు క్రికెట్ మనుగడ కోసం సిరీస్లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త తరహా మార్పుల గురించి యోచిస్తోంది. సంప్రదాయ ఫార్మాట్పై మరింత ఆసక్తి పెంచేందుకు, ఎక్కువ సంఖ్యలో హోరాహోరీ సమరాలు చూసేందుకు టెస్టులను.. రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని భావిస్తోంది. టెస్టు మ్యాచ్లు ఎక్కువగా ఆడే మూడు ప్రధాన జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లతో ఒక శ్రేణి... ఇతర జట్లు కలిపి మరో శ్రేణిలో ఉండే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. దీని అమలు, విధివిధానాలపై ఇంకా స్పష్టత లేకున్నా... ఐసీసీ చైర్మన్గా జై షా(Jay Shah) ఎంపికయ్యాక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.సీఏ, ఈసీబీ చైర్మన్లతో చర్చలుఈ అంశంపై చర్చించేందుకు ఈ నెలలోనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ మైక్ బెయిర్డ్, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్లతో జై షా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన భవిష్యత్తు పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2027తో ముగుస్తుంది. ఆ తర్వాతి నుంచి కొత్త విధానాన్ని తీసుకురావాలని ఐసీసీ అనుకుంటోంది. తీవ్రంగా వ్యతిరేకించిన చిన్న జట్లునిజానికి ఇలాంటి ప్రతిపాదన 2016లో వచ్చింది. అయితే ఇలా చేస్తే తమ ఆదాయం కోల్పోవడంతో పాటు పెద్ద జట్లతో తలపడే అవకాశం కూడా చేజారుతుందని జింబాబ్వే, బంగ్లాదేశ్ సహా పలు జట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి.ఈ నేపథ్యంలో ఐసీసీ అప్పట్లో ఈ ఆలోచనను పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఇది ముందుకు వచ్చింది. టాప్–3 జట్ల మధ్యే ఎక్కువ మ్యాచ్లు చూడాలని అభిమానులు కోరుకుంటారని, ఆ మ్యాచ్లే అత్యంత ఆసక్తికరంగా సాగి టెస్టు క్రికెట్ బతికిస్తాయంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri) తదితరులు ఈ తరహా రెండు శ్రేణుల టెస్టు సిరీస్లకు గతంలోనే మద్దతు పలికారు. పెద్ద జట్టు, చిన్న జట్టు మధ్య టెస్టులు జరిగితే ఎవరూ పట్టించుకోరని అతను ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్తాన్ టెస్టుల్లో తొలిసారి ఇలా... బులవాయో: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు రెండు టెస్టులతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ను తొలిసారి దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా అవతల తొలి టెస్టు సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో అఫ్గానిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 205/8తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే అదే స్కోరు వద్ద ఆలౌటైంది.కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (103 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆఖరి రోజు ఆటలో 15 బంతులు ఎదుర్కొన్న జింబాబ్వే ఒక్క పరుగు కూడా జత చేయకుండా రెండు వికెట్లను కోల్పోయింది. ఇరు జట్ల మధ్య భారీ స్కోర్లు నమోదైన తొలి టెస్టు చివరకు ‘డ్రా’ కావడంతో... ఈ విజయంతో అఫ్గానిస్తాన్ 1–0తో టెస్టు సిరీస్ చేజిక్కించుకుంది. కెరీర్ బెస్ట్ (7/66) ప్రదర్శన కనబర్చిన స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 48 పరుగులు చేసిన రషీద్, 11 వికెట్లు పడగొట్టాడు. రహమత్ షాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ను 2–1తో గెలుచుకున్న అఫ్గానిస్తాన్ జట్టు వన్డే సిరీస్ను 2–0తో చేజక్కించుకుంది. ఇప్పుడు టెస్టు సిరీస్ కూడా నెగ్గి... పర్యటనను విజయవంతంగా ముగించింది. ఐసీసీ టెస్టు హోదా సాధించిన అనంతరం 11 టెస్టు మ్యాచ్లు ఆడిన అఫ్గానిస్తాన్... అందులో నాలుగు మ్యాచ్ల్లో నెగ్గింది. ఓవరాల్గా అఫ్గానిస్తాన్కు ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. తటస్థ వేదికగా 2018–19లో ఐర్లాండ్తో భారత్లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో గెలిచిన అఫ్గానిస్తాన్ తొలి సిరీస్ కైవసం చేసుకోగా... 2019లో బంగ్లాదేశ్తో ఏకైక టెస్టులోనూ నెగ్గి అఫ్గానిస్తాన్ సిరీస్ పట్టేసింది. ఈ రెండు ఆసియాలో జరగ్గా... ఇప్పుడు తొలిసారి జింబాబ్వే గడ్డపై అఫ్గాన్ టెస్టు సిరీస్ను గెలుచుకుంది. 2020–21లో అఫ్గానిస్తాన్, జింబాబ్వే మధ్య జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ 1–1తో ‘డ్రా’ గా ముగిసింది. చదవండి: ఆసీస్తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
తప్పుడు నిర్ణయం.. రోహిత్నే పక్కన పెడతారా?
సిడ్నీ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను తప్పించడం పట్ల భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథినే పక్కనపెట్టడం ద్వారా మేనేజ్మెంట్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన మునుపెన్నడూ జరుగలేదంటూ బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో కంగారూ జట్టుతో తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి స్థానంలో భారత జట్టును ముందుండి నడిపించిన బుమ్రా.. పెర్త్ టెస్టులో విజయాన్ని అందించాడు.రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత అయితే, రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత టీమిండియా వరుసగా వైఫల్యాలే ఎదురయ్యాయి. అడిలైడ్లో ఓడిపోయిన భారత్.. బ్రిస్బేన్లో డ్రా చేసుకున్నా.. మెల్బోర్న్లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఫలితంగా సిరీస్లో 1-2తో వెనుకబడింది.బ్యాటర్గానూ విఫలంఇక బ్యాటర్గానూ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. ముఖ్యంగా అనవసరపు షాట్లకు పోయి అతడు వికెట్ పారేసుకున్న తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆసీస్తో ఆఖరిదైన ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట రోహిత్ స్వయంగా తప్పుకొన్నాడని తెలిపాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ వంటి వాళ్లు రోహిత్ నిర్ణయాన్ని సమర్థించగా.. నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం భిన్నంగా స్పందించాడు.తప్పుడు నిర్ణయం.. రోహిత్నే పక్కన పెడతారా?‘‘ఇది చాలా ఆశ్చర్యకరంగా, వింతగా ఉంది. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అతడిని కెప్టెన్ను ఎందుకు చేశారు?.. అయినా సారథిగానే కాకుండా కీలక ఆటగాడిగా భారత క్రికెట్కు అతడు ఇప్పటికే ఎంతో సేవ చేశాడు.అలాంటి ఆటగాడి ఫామ్ బాగున్నా.. లేకున్నా అదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే అతడు కెప్టెన్. జట్టు ప్రయోజనాల కోసం తనను తాను బెంచ్కే పరిమితం చేసుకోవడం ఏమిటి? ఇలా చేయడం ద్వారా టీమిండియా మేనేజ్మెంట్ తప్పుడు సంకేతాలు ఇస్తోంది.అతడిపై వేటు వేయడమో.. లేదంటే తనకు తానుగా తప్పుకొనేలా చేయడమో సరికాదు. జట్టును నిర్మించిన సారథి అతడు. యువ ఆటగాళ్లలో చాలా మంది అతడిని తమ తండ్రి సమానుడిలా భావిస్తారు. వాళ్ల నుంచి అతడు అంతటి గౌరవాన్ని పొందాడు. ఏ కెప్టెన్ అయినా నౌకను మధ్యలోనే వీడి వెళ్లిపోడు. అది మునిగిపోతుందని తెలిసినా గట్టెక్కించే ప్రయత్నమే చేస్తాడు గానీ.. తానే ముంచేయాలని చూడడు. అతడొక గౌరవప్రదమైన వ్యక్తి. కానీ మీరు మాత్రం అతడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సింది. అతడిపై నమ్మకం ఉంచాల్సింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సిడ్నీలో తొలి రోజు ముగిసిందిలాకాగా ఆసీస్తో సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు ఆదిలోనే షాకిచ్చింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి ఆసీస్ తొమ్మిది పరుగులు చేసింది.చదవండి: కొన్స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది! -
రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడు: రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే హిట్మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్నాడు. రోజురోజుకీ రోహిత్ వయసు పెరుగుతోందని.. కాబట్టి తనకు తానుగా రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నాడని అభిప్రాయపడ్డాడు.బ్యాటర్గా.. కెప్టెన్గా వైఫల్యాలుకాగా గత కొంతకాలంగా రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా ఘోర పరాభవాలు చవిచూస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీప్.. తాజాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ వైఫల్యాలు రోహిత్ను వేధిస్తున్నాయి.ఆసీస్ పర్యటనలో రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. ఇప్పటి వరకు కంగారూ జట్టుతో ముగిసిన మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన అతడు.. కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ సారథ్యంలో ఈ మూడు మ్యాచ్లలో రెండింటిలో ఓడిన టీమిండియా.. ఒకటి మాత్రం డ్రా చేసుకోగలిగింది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి, కెప్టెన్సీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరగా అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడుఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ తన కెరీర్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడనిపిస్తోంది. సిడ్నీ టెస్టు తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. రోజురోజుకీ అతడేమీ యువకుడు కావడం లేదు కదా! శుబ్మన్ గిల్ (Shubman Gill)వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది సగటున 40 పరుగులు చేసిన గిల్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. ప్రతిభ ఉన్న యువకులను బెంచ్కే పరిమితం చేయడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. కాబట్టి రోహిత్ వైదొలుగుతాడనే అనిపిస్తోంది. ఒకవేళ సిడ్నీలో టీమిండియా గెలిచి.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరినా.. చేరకపోయినా రోహిత్ మాత్రం తుది నిర్ణయం వెల్లడిస్తాడని.. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికితే యువకులకు మార్గం సుగమమవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.సిడ్నీలో గెలిస్తేనేకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా.. ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో వెనుకబడి ఉంది. పెర్త్లో గెలిచిన భారత్.. అడిలైడ్లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. అయితే, మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇరుజట్ల మధ్య జనవరి 3-7 మధ్య సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
BGT: ఆసీస్తో ఆఖరి టెస్టు.. రోహిత్, కోహ్లిలపై వేటు?!
భారత్ జట్టును తమ భుజస్కంధాలపై నడిపించిన ఇద్దరు బ్యాటింగ్ అతిరథుల టెస్ట్ క్రికెట్ జీవితానికి త్వరలో తెరపడనుందా? ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల బ్యాటింగ్ ప్రదర్శన చూస్తే అది నిజమే అనిపిస్తుంది.పెర్త్లో జగిన తొలి టెస్టులోని రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో అజేయంగా నిలిచిన 36 ఏళ్ళ కోహ్లి ఆ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయాడు. ఇక వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకి దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్లో దారుణంగా విఫలమవుతున్నాడు.వేటు వేయక తప్పదా?అద్భుత బ్యాటింగ్తో జట్టును ముందుంచి నడిపించించల్సిన ఈ ఇద్దరు అగ్రశేణి ఆటగాళ్లు వరుసగా విఫలమవడం, అదీ ఆస్ట్రేలియా వంటి కీలకమైన సిరీస్లో మరీ పేలవంగా ఆడటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరగనున్న ఆఖరిదైన ఐదో టెస్టులో వారిద్దరిని జట్టులో కొనసాగించడం అనుమానాస్పదంగానే కనిపిస్తోంది.నిజానికి... కోహ్లి- రోహిత్(Virat Kohli- Rohit Sharma) దశాబ్దానికి పైగా భారత బ్యాటింగ్ను తమ భుజాలపై మోస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఈ ఇద్దరు సూపర్స్టార్లు టెస్టుల్లో ఆడటం ఇక కష్టమే అనిపిస్తోంది. ఇక సోమవారం మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఓటమితో భారత్ వచ్చే ఏడాది లార్డ్స్లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడం కష్టంగానే కనిపిస్తోంది.తలకు మించిన భారంఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత్ అర్హత సాధించడం దాదాపులేనట్టే. నాలుగో టెస్టులో ఓటమితో భారత్ అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిలను జట్టులో కొనసాగించడం జట్టు మేనేజ్మెంట్కు తలకు మించిన భారం కావచ్చు. కనీసం చివరి టెస్టులో విజయం సాధిస్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడానికి భారత్ కి కొద్దిపాటి అవకాశమన్నా ఉంటుంది.సిడ్నీ టెస్టుకు దూరంఈ పరిస్థితుల్లో ఫామ్లేమితో సతమతమవుతున్న రోహిత్- కోహ్లిలను సిడ్నీ టెస్టుకు దూరంగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ ఆటతీరు మరీ పేలవంగా సాగడం అతడిపై వేటుకు కారణం కావొచ్చని తెలుస్తోంది. మెల్బోర్న్లో రెండో ఇన్నింగ్స్ లో 40 బంతుల్లో 9 పరుగులు చేసిన రోహిత్, ఈ సిరీస్ లో మొత్తం ఐదు ఇన్నింగ్స్లో 6.20 సగటుతో మొత్తం 31 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో రోహిత్పై వేటు తప్పనిసరిగా కనిపిస్తోంది.కోహ్లికి రవి శాస్త్రి మద్దతుఅయితే, కోహ్లికి కొద్దిగా మినహాయింపు కల్పించవచ్చు. భారత్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) ఈ విషయాన్నే చెప్పాడు. రవిశాస్త్రి కోహ్లికి మద్దతు తెలియజేశాడు. "విరాట్ కోహ్లీ మరికొంత కాలం టెస్టుల్లో ఆడతాడనే నేను భావిస్తున్నాను" అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. "విరాట్ కొంతకాలం ఆడతాడు, ఈ రోజు అతను అవుట్ అయిన విధానాన్ని త్వరగా మర్చిపోయి సిడ్నీ టెస్టులో రాణిస్తాడని భావిస్తున్నాను" అని శాస్త్రి అన్నాడు.రోహిత్కు కష్టమే.. ఇదే చివరి సిరీస్!అయితే రోహిత్ని మాత్రం శాస్త్రి సమర్ధించలేకపోయాడు. "ఇక రోహిత్ విషయానికి వస్తే, ఇదే బహుశా అతని చివరి టెస్ట్ సిరీస్ కావచ్చు. ఓపెనింగ్ బ్యాటర్గా వస్తున్న రోహిత్ ఫుట్వర్క్ ఎలా ఉందో చూసాం. అతను క్రీజులో కాస్త మందకొడిగా కదులుతున్నాడు. దీనివల్ల బహుశా కొన్నిసార్లు రోహిత్ బంతిని ఎదుర్కోవడంలో ఒకింత ఆలస్యం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా వంటి బౌలర్లతో ఇది కష్టమే’’ అని శాస్త్రి అన్నాడు.ఇక సిడ్నీ టెస్టులో ఓపెనర్గా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కి వచ్చే అవకాశముంది. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ కి వచ్చిన రాహుల్ చక్కగా రాణించాడు. వీరిద్దరూ ఆ టెస్ట్ లోని రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా తొలి వికెట్ కి ఏకంగా 201 పరుగుల భాగస్వామ్యంతో భారత్ విజయానికి దోహదం చేసారు.రోహిత్ తిరిగి జట్టులోకి రావడంతోఅయితే, రోహిత్ తిరిగి జట్టులోకి రావడంతో అతను గబ్బా టెస్టులో మిడిల్-ఆర్డర్ బ్యాటర్గా విఫలమైన తర్వాత రాహుల్ని మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు. ఈ చర్య రాహుల్ కి మాత్రమే కాక భారత్ జట్టుని కూడా దెబ్బ తీసింది. దీని కారణంగా అడిలైడ్ లో జరిగిన రెండో టెస్ట్లో భారత్ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు మెల్బోర్న్ టెస్టులో కూడా ఓటమి చవిచూడడంతో రోహిత్ సిడ్నీ టెస్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని.. జస్ప్రీత్ బుమ్రాకి జట్టు నాయకత్వం అప్పగిస్తే అది భారత్కు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
బుమ్రా బౌలింగ్లో చితక్కొట్టాడు.. సెహ్వాగ్ను గుర్తుచేస్తున్నాడు: భారత మాజీ క్రికెటర్
ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్(Sam Konstas)పై టీమిండియా మాజీ హెడ్కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. పందొమ్మిదేళ్ల ఈ యువ సంచలనం అద్భుత ఆట తీరుతో తనకు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)ను గుర్తుచేశాడని పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) బౌలింగ్లోనూ చితక్కొట్టిన ఇలాంటి బ్యాటర్ను తాను చూడలేదంటూ కొన్స్టాస్ను రవిశాస్త్రి ఆకాశానికెత్తాడు.మెస్వీనీ స్థానంలోబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై భారత్తో ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్లో జరిగిన మొదటి మ్యాచ్ సందర్భంగా నాథన్ మెక్స్వీనీ ఆసీస్ తరఫున అరంగేట్రం చేయగా.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల తర్వాత అతడిపై వేటు పడింది. వరుస ఇన్నింగ్స్లో విఫలమైన మెక్స్వీనీ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా సామ్ కొన్స్టాస్కు పిలుపునిచ్చింది.ఊహించని రీతిలో దంచికొట్టాడుఈ క్రమంలో మెల్బోర్న్లో గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా పందొమ్మిదేళ్ల ఈ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆరంభంలో భారత బౌలర్లకు ఎదుర్కొనేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత ఊహించని రీతిలో దంచికొట్టాడు.బుమ్రాకే చుక్కలు చూపించాడుముఖ్యంగా బుమ్రాను కొన్స్టాస్ ఎదుర్కొన్న తీరు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2021 సిడ్నీ టెస్టులో చివరిసారిగా బుమ్రా బౌలింగ్లో ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ సిక్స్ కొట్టగా... మూడేళ్ల తర్వాత మెల్బోర్న్ టెస్టులో మళ్లీ కొన్స్టాస్ రివర్స్ స్కూప్ ద్వారా సిక్స్ బాదాడు. తద్వారా తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 60 పరుగులు సాధించాడు.ఈ నేపథ్యంలో రవిశాస్త్రి సామ్ కొన్స్టాస్ ఆట తీరును తనదైన శైలిలో విశ్లేషించాడు. ‘‘కేవలం టెస్టులే కాదు.. వన్డే, టీ20లలోనూ బుమ్రాను ఇలా ట్రీట్ చేసిన బ్యాటర్ను చూడలేదు. విధ్వంసకర షాట్లు ఆడటంలో అతడు తన స్వాగ్ను చూపించాడు. క్రికెట్ నిబంధనలనే మార్చేసేలా అతడి ఆట ఉందనడం అతిశయోక్తి కాదు.వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వచ్చాడుఒకానొక సమయంలో కొన్స్టాస్ను కట్టడి చేసేందుకు తమ వద్ద ప్రణాళికలు లేక టీమిండియా బిక్క ముఖం వేసినట్లు కనిపించింది. ఆరంభంలో అతడు రెండు షాట్లు మిస్ చేసినపుడు కనిపించిన ఆనందం.. కాసేపట్లోనే ఆవిరైంది. అతడు హిట్టింగ్ మొదలుపెట్టగానే నాకు వీరేంద్ర సెహ్వాగ్ జ్ఞప్తికి వచ్చాడు.క్రీజులో కుదురుకున్నాక వీరూ ఎంతగా వినోదం పంచుతాడో.. కొన్స్టాస్ కూడా అలాగే చేశాడు. ఆసీస్ జట్టులో కొన్స్టాస్ గనుక తన స్థానం సుస్థిరం చేసుకుంటే భవిష్యత్తులో అతడికి తిరుగు ఉండదు’’ అని కొన్స్టాస్పై రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో కొన్స్టాస్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజంWHAT ARE WE SEEING! Sam Konstas just whipped Jasprit Bumrah for six 😱#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/ZuNdtCncLO— cricket.com.au (@cricketcomau) December 26, 2024 -
‘నన్ను క్షమించు బుమ్రా.. నాకు దురుద్దేశం లేదు’
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్ మహిళా జట్టు మాజీ కెప్టెన్, కామెంటేటర్ ఇషా గుహా(Isa Guha) క్షమాపణలు చెప్పారు. బుమ్రాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. దక్షిణ ఆసియా సంతతికి చెందిన తాను బుమ్రాను ప్రశంసించే క్రమంలో అలాంటి పదం వాడటం తప్పేనని అంగీకరించారు.బ్రిస్బేన్లో మూడో టెస్టుబోర్డర్- గావస్కర్ ట్రోఫీ 204-25లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో టీమిండియా, అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా విజయం సాధించాయి. తద్వారా ఐదు టెస్టుల సిరీస్లో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్లో శనివారం మూడో టెస్టు మొదలైంది.గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్కు తొలిరోజు వర్షం వల్ల ఆటంకం కలగగా.. రెండో రోజు పూర్తి ఆట కొనసాగింది. ఓవరాల్గా ఆదివారం ఆసీస్ పైచేయి సాధించినప్పటికీ.. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కామెంట్రీ ప్యానెల్లో ఉన్న ఇషా గుహ.. బుమ్రాను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.అతడు మెస్ట్ వాల్యూబుల్ ప్రైమేట్‘‘అతడు MVP కదా! మీరేమంటారు? నా దృష్టిలో అయితే అతడు మెస్ట్ వాల్యూబుల్ ప్రైమేట్(Most valuable primate)’’ అంటూ సహచర కామెంటేటర్ బ్రెట్ లీతో ఇషా గుహ వ్యాఖ్యానించారు. నిజానికి క్రికెట్ పరిభాషలో అత్యంత విలువైన ఆటగాడు అని ప్రశంసించే సందర్భంలో MVP(Most Valuable Player) అని వాడతారు.కోతుల గురించి చెప్పేటపుడుఅయితే, ఇషా గుహ ఇక్కడ ప్రైమేట్(primate) అనే పదం వాడటంతో వివాదం చెలరేగింది. పాలిచ్చే జంతువులు(క్షీరదాలు).. ఎక్కువగా కోతుల గురించి చెప్పేటపుడు ఈ పదాన్ని వాడతారు. అయితే, బుమ్రాను ఉద్దేశించి ఇషా ఇలా అనడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ‘మంకీ గేట్’ వివాదాన్ని గుర్తుచేస్తూ ఇషాపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.నాకు దురుద్దేశం లేదు.. స్పందించిన రవిశాస్త్రిఈ నేపథ్యంలో ఇషా గుహ స్పందిస్తూ.. బుమ్రాకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. తాను ఉపయోగించిన Primate అనే పదానికి మనుషులనే అర్థం కూడా ఉందని.. ఏదేమైనా తాను అలా అని ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు ఎవరినీ కించపరిచాలనే ఉద్దేశం లేదని.. నిజానికి బుమ్రా ఆట అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. తాను భేషరుతుగా క్షమాపణ చెబుతున్నానని ఇషా గుహ లైవ్ కామెంట్రీలో వివరణ ఇచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.. ‘‘ధైర్యవంతురాలైన మహిళ’’ అంటూ ఇషా గుహను కొనియాడాడు.మంకీ గేట్ వివాదం?2007-08లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సిడ్నీలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ సందర్భంగా భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ను మంకీ అని సంబోధించాడనే ఆరోపణలు వచ్చాయి.ఈ విషయం గురించి నాటి కెప్టెన్ రిక్కీ పాంటింగ్ అంపైర్కు ఫిర్యాదు చేయగా.. భజ్జీపై తొలుత మూడు మ్యాచ్ల నిషేధం విధించారు. అయితే, సచిన్ టెండుల్కర్ సహా ఇతర ఆటగాళ్లు భజ్జీ.. హిందీలో.. ‘‘మా...కీ’’ అన్నాడని.. మంకీ అనలేదంటూ విచారణలో తెలిపారు. దీంతో విచారణ కమిటీ హర్భజన్పై నిషేధాన్ని ఎత్తివేసింది.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ Isa Guha apologises on TV for calling Jasprit Bumrah a "primate" during commentary yesterday 🇮🇳#AUSvINDpic.twitter.com/DybT7Nmzzg— Digital Hunt 247 (@digitalhunt247) December 16, 2024 -
‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. బ్రిస్బేన్లో శనివారం మొదలైన ఈ టెస్టులో భారత జట్టు పేలవంగా ఆడుతోంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేన.. ఆసీస్ను కట్టడి చేయలేకపోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో కంగారూ జట్టు 445 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.పెవిలియన్కు క్యూఅయితే, ఆసీస్ స్టార్లు ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాలతో చెలరేగిన గబ్బా మైదానంలో.. టీమిండియా బ్యాటర్లు మాత్రం తేలిపోతున్నారు. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి తాళలేక పెవిలియన్కు క్యూ కడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) విఫలం కాగా.. శుబ్మన్ గిల్(1), విరాట్ కోహ్లి(3) పూర్తిగా నిరాశపరిచారు.48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిఇక వికెట్ కీపర్ రిషభ్ పంత్ సైతం తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. సోమవారం నాటి మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే సమయానికి కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 30 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ సున్నా పరుగులతో ఆడుతున్నాడు. కేవలం 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గబ్బాలో టాస్ గెలిచిన రోహిత్.. తొలుత బౌలింగ్ ఎంచుకోవడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వంటి వాళ్లు తప్పుబట్టారు. చెత్త సెటప్ అంటూ విమర్శలుమరోవైపు.. ఆదివారం నాటి రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ సెట్ చేసిన తీరుపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి రోహిత్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చెత్త సెటప్’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఇక ఆసీస్ మాజీ స్టార్ డేవిడ్ వార్నర్ సైతం రోహిత్ తీరును విమర్శించాడు. హెడ్, స్మిత్లను షార్ట్ బాల్స్తో అటాక్ చేయాల్సిందిపోయి.. వారికి బ్యాట్ ఝులిపించే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీ, ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రోహిత్ తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి‘‘ఇప్పుడు కూడా రోహిత్ శర్మను సమర్థిస్తే అంతకంటే ఘోర తప్పిదం మరొకటి ఉండదు. ఇంత డిఫెన్సివ్గా కెప్టెన్సీ చేస్తారా? ఇప్పటికైనా అతడు వాస్తవాలు అంగీకరించాలి. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.ఈ మ్యాచ్లో టీమిండియా ఓడితే రోహిత్ తప్పుకోవాలి. భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు కోసం మేనేజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకోవాలి. బుమ్రాను టెస్టు జట్టు కెప్టెన్గా నియమించాలి’’ అని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్యాన్స్.బుమ్రా కెప్టెన్సీలో ఆసీస్ గడ్డపై భారత్కు భారీ విజయంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడుతోంది టీమిండియా. అయితే, పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. పితృత్వ సెలవుల కారణంగా అతడు అందుబాటులో లేకపోవడంతో.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు.ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో కంగారూ జట్టును చిత్తు చేసింది. అయితే, అడిలైడ్లో పింక్ బాల్ టెస్టుకు రోహిత్ తిరిగి రాగా.. ఆతిథ్య జట్టు చేతిలో భారత్ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అడిలైడ్ టెస్టులో రోహిత్ బ్యాటింగ్ పరంగా(3, 6)నూ నిరాశపరిచాడు. రోహిత్ కెప్టెన్సీలో చెత్త రికార్డుఇక ఆసీస్ టూర్ కంటే ముందు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో 3-0తో టీమిండియా వైట్వాష్కు గురైంది. భారత క్రికెట్ చరిత్రలో పర్యాటక జట్టు చేతిలో టీమిండియా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్ కావడం అదే తొలిసారి. చదవండి: ‘నా వేలు విరగ్గొట్టేశావు పో’.. సిరాజ్పై మండిపడ్డ జడేజా! -
అశ్విన్, భజ్జీ కాదు!.. టీమిండియా ఆల్టైమ్ అత్యుత్తమ స్పిన్నర్లు వీరే!
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. భారత్- ఆసీస్ మధ్య జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో రవిశాస్త్రికి ఓ ప్రశ్న ఎదురైంది. భారత క్రికెట్ జట్టులోని ముగ్గురు అత్యుత్తమ స్పిన్నర్ల పేర్లు చెప్పాలని కోరగా.. రవిశాస్త్రి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.కాగా ప్రస్తుతం టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. మరోవైపు.. మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టి లెజెండరీ బౌలర్గా పేరు సంపాదించాడు.ఇక అశ్విన్తో పాటు జట్టులో కొనసాగుతున్న మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా 319(77 టెస్టుల్లో) వికెట్లు పడగొట్టి సత్తా చాటుతున్నాడు.అనిల్ కుంబ్లే ప్రమాదకారిఅయితే, రవిశాస్త్రి ఈ ముగ్గురిలో ఒక్కరి పేరు కూడా చెప్పకపోవడం విశేషం. తన దృష్టిలో బిషన్ సింగ్ బేడి, ఎర్రాపల్లి ప్రసన్న, అనిల్ కుంబ్లే టీమిండియా అత్యుత్తమ స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫాక్స్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఉపఖండ పిచ్లపై అనిల్ కుంబ్లే ప్రమాదకారి. అత్యంత దూకుడుగా ఉంటాడు. అయితే, కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన స్పిన్నర్. 600కు పైగా టెస్టు వికెట్లు తీయడం అంటే మాటలు కాదు.అతడు బంతితో అద్భుతాలు చేయగలడుఇక ప్రసన్న. అతడి కెరీర్ చరమాంకంలో ఉన్నపటి పరిస్థితులను పరిశీలిస్తే.. అతడు జట్టు మేనేజర్గా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాడు. నెట్స్లో బౌలింగ్ కూడా చేశాడు. అతడు బంతితో అద్భుతాలు చేయగలడు. బాల్ను రిలీజ్ చేసే విషయంలో ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు.ఆయన బౌలింగ్ యాక్షన్ సూపర్వీరిద్దరు నా లిస్టులో టాప్-3లో ఉంటే.. టాప్-1లో బిషన్ సింగ్ బేడి ఉంటాడు. ఆయన బౌలింగ్ యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తన అభిప్రాయం ప్రకారం బిషన్ బేడి, ప్రసన్న, కుంబ్లే అత్యుత్తమ భారత స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. కాగా బిషన్ బేడీ తన కెరీర్లో 67 టెస్టుల్లో 266 వికెట్లు పడగొట్టగా.. ప్రసన్న 49 టెస్టుల్లో 189 వికెట్లు తీశాడు. మరోవైపు.. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు కూల్చి టెస్టుల్లో భారత లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఇక 536 వికెట్లతో అశూ రెండోస్థానంలో ఉన్నాడుచదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే! -
కేఎల్ రాహుల్ అవుట్పై రగడ.. స్పందించిన స్టార్క్
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(26) అవుటైన తీరుపై మిచెల్ స్టార్క్ స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్ రెండో బంతికి.. రాహుల్ సందేహాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు.రివ్యూల్లో స్పష్టత రాకపోయినా...ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్గా ప్రకటించగా... క్యాచ్ అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు రీప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ రాహుల్ను అవుట్గా ప్రకటించాడు. అయితే రివ్యూల్లో స్పష్టత రాకపోయినా... థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చడం వివాదాస్పదమైంది.తగిన రుజువు లేకుండా ఇలా చేయడం సరికాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బంతి బ్యాట్ను సమీపించిన సమయంలో అవుట్ సైడ్ ఎడ్జ్పై స్పైక్ కనిపించింది’ అని థర్డ్ అంపైర్ పేర్కొనడం... సరైన నిర్ణయం కాకపోవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. నిర్దిష్టమైన రుజువు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చే ఆధారాలేవీ రీప్లేలో కనిపించలేదు. నా వరకైతే తగిన రుజువు లేకుండా నిర్ణయాన్ని సమీక్షించడం సరైంది కాదు’ అని అన్నాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ‘ఇది వివాదాస్పద నిర్ణయం. స్నికోపై స్పైక్ రావడం వాస్తవమే కానీ అది బంతి బ్యాట్ను తాకినప్పుడు వచ్చిందా లేక ప్యాడ్ తాకినప్పుడా అనేది తేలాలి. దీనిపై నాకు కూడా సందేహాలు ఉన్నాయి’ అని హస్సీ అన్నాడు.ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయంఅయితే, ఆసీస్ మాజీ సారథి మార్క్వా మాట్లాడుతూ... ‘ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం. దీంతో రాహుల్ సంతృప్తిగా ఉండకపోవచ్చు’ అని పేర్కొనడం గమనార్హం. ఇక.. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘మరో కోణం నుంచి చూడా లని థర్డ్ అంపైర్ కోరినా... అది అందుబాటులో లేకపోయింది. మరి ఇలాంటి సందేహాస్పద పరిస్థితిలో అంపైర్ నిర్ణయాన్ని మార్చడం ఎందుకు’ అని ట్వీట్ చేశాడు. అదే విధంగా.. ‘స్పష్టత లేనప్పుడు అవుట్ ఇవ్వకూడదు’ అని ఇర్ఫాన్ పఠాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.స్టార్క్ స్పందన ఇదేఈ నేపథ్యంలో... శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. అయితే, అది సరైందే అనుకుంటున్నా. శబ్దం వచ్చిన మాట నిజం. ఆ వికెట్ సరైందేనని భావిస్తున్నా’’ అని స్టార్క్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శనివారం ఆటలో ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా 46 పరుగుల స్పల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
ఆసీస్ తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే! స్టార్ ప్లేయర్కు నో ఛాన్స్
ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు మొదటి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయిన భారత జట్టు ఆసీస్ పర్యటనను విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. అయితే తొలి టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలో పెర్త్ టెస్టు కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్ను టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంచుకున్నాడు. తొలి టెస్టులో భారత ఓపెనర్గా శుబ్మన్ గిల్ను రవిశాస్త్రి ఎంపిక చేశాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రావాలని అతడు సూచించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్కు సైతం శాస్త్రి చోటిచ్చాడు."తొలి టెస్టులో భారత ఓపెనర్గా శుబ్మన్ గిల్ను ప్రమోట్ చేయాలి. అతడికి ఓపెనర్గా అనుభవం ఉంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతడు టీమిండియా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. ఒకవేళ గిల్ జట్టులో లేకపోయింటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి ఉండేది. రోహిత్ బ్యాకప్గా ఎంపికైన ఈశ్వరన్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన సిరీస్లో ఈశ్వరన్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్ను దాటలేకపోయాడు. అయితే నెట్స్లో ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో జట్టు మేనెజ్మెంట్కే తెలియాలి. తుది జట్టులో అశ్విన్ లేదా జడేజాకు చోటు ఇవ్వాలా అన్న చర్చ నడుస్తోంది. నేను అయితే జడేజాతోనే వెళ్తాను. ఎందుకంటే అతడు ఫీల్డింగ్తో పాటు బ్యాటింగ్ కూడా అద్బుతంగా చేయగలడు. అశ్విన్కు ఓవర్సీస్లో పెద్దగా రికార్డు లేదు" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.రవిశాస్త్రి ఎంచుకున్న భారత తుది జట్టు ఇదేశుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.చదవండి: #Tilak Varma: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్కోచ్ ఘాటు విమర్శలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి విమర్శలు గుప్పించాడు. న్యూజిలాండ్తో రెండో టెస్టులో ఈ ముంబైకర్ కెప్టెన్సీ అస్సలు బాగాలేదంటూ పెదవి విరిచాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తున్నా ఫీల్డింగ్ సెట్ చేయడంలో రోహిత్ విఫలమయ్యాడని విమర్శించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో కివీస్ గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం మొదలైన రెండో టెస్టులోనూ రోహిత్ సేన తడబడుతోంది.బ్యాటింగ్లో మాత్రం మరోసారి విఫలంటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా కివీస్ను 259 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, బ్యాటింగ్లో మాత్రం మరోసారి విఫలమైంది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్కు 103 పరుగుల ఆధిక్యం లభించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్కు ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్ హాఫ్ సెంచరీ(86)తో శుభారంభం అందించాడు. ఇతర బ్యాటర్లు కూడా తమ వంతు సహకారం అందించడంతో మూడు వందలకు పైగా ఆధిక్యంతో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలోకి వెళ్లింది.ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తోటి కామెంటేటర్ మురళీ కార్తిక్తో మాట్లాడుతూ.. ‘‘కాస్త వ్యూహాత్మకంగా ముందుడుగు వేయాలి కదా! న్యూజిలాండ్ను 120 పరుగులకే ఆలౌట్ చేయాలని భావిస్తున్నట్లయితే.. అందుకు తగ్గట్లుగానే ఆడాలి. వికెట్లు కావాలనుకుంటే అటాకింగ్ పొజిషన్లలో ఫీల్డింగ్ సెట్ చేయాలి.మూస పద్ధతిలో వెళ్తే ఎలా? ఒకవేళ ప్రత్యర్థి వికెట్ నష్టపోకుండానే 60 పరుగులు చేసినపుడు కూడా భిన్నంగా గాకుండా మూస పద్ధతిలో వెళ్తే ఎలా? ఫీల్డింగ్ ఇలా సెట్ చేయడం వల్ల మాత్రం మీకు ఎంతమాత్రం వికెట్లు లభించవు’’ అంటూ రోహిత్ శర్మ కెప్టెన్సీని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో బ్యాటర్గానూ రోహిత్ విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని టిమ్ సౌతీ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసే సరికి కివీస్ 53 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టీమిండియా కంటే 301 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్ -
కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ
టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లి, రవిశాస్త్రి తనకు పునర్జన్మను ప్రసాదించారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వారిద్దరి వల్లే తన రెండో ఇన్నింగ్స్ మొదలైందని.. తనను టాపార్డర్కు ప్రమోట్ చేసి ఓపెనర్గా అవకాశమిచ్చింది కూడా వారేనంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా 2013లో కోల్కతా వేదికగా వెస్టిండీస్తో సిరీస్ సందర్భంగా ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో అడుగుపెట్టాడు.అరంగేట్రంలోనే అద్భుత శతకంతొలి మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే అద్భుత శతకం(177)తో ఆకట్టుకున్నాడు. విండీస్తో నాటి సిరీస్లో జరిగిన ఈ తొలి టెస్టులో ధోని సేన ఏకంగా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తన రెండో టెస్టులోనూ శతక్కొట్టి వారెవ్వా అనిపించాడు. కానీ టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు.దాదాపు ఆరేళ్ల పాటు చోటే కరువుఅరంగేట్రం తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు భారత టెస్టు తుదిజట్టులో రోహిత్ శర్మకు స్థానమే కరువైంది. అయితే, 2018-19లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో రోహిత్ చోటు దక్కించుకోగలిగాడు. ఈ సిరీస్లోనూ అతడు ఆరో స్థానంలోనే బరిలోకి దిగాడు.అలా రీఎంట్రీఇక ఆ తర్వాత వన్డే వరల్డ్కప్-2019లో వరుసగా ఐదు సెంచరీలు బాదినా.. టెస్టుల్లో మాత్రం రోహిత్ రాత పెద్దగా మారలేదు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత వెస్టిండీస్తో ఆడిన టెస్టు సిరీస్లో అతడిని బెంచ్కే పరిమితం చేసింది మేనేజ్మెంట్. అయితే, నాడు ఓపెనర్గా ఉన్న కేఎల్ రాహుల్ పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో.. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్కోచ్ రవిశాస్త్రి రోహిత శర్మను ఓపెనర్గా బరిలోకి దించారు. ఓపెనర్గా జట్టులో పాతుకుపోయిన హిట్మ్యాన్అప్పటి నుంచి రోహిత్కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా ఓపెనర్గా జట్టులో పాతుకుపోయిన హిట్మ్యాన్ కెప్టెన్గా ఎదగడమే గాకుండా.. భారత్ను ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)కు చేర్చిన సారథిగానూ ఘనత సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్తో సొంతగడ్డపై టీమిండియాను గెలిపించి.. మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ వేటలో జట్టును నిలిపాడు.వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారుఈ నేపథ్యంలో కామెంటేటర్ జతిన్ సప్రూనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టెస్టు కెరీర్ రెండో ఇన్నింగ్స్లో రవిశాస్త్రి, విరాట్ కోహ్లిలకు నేను చాలా రుణపడిపోయాను. నన్ను టాపార్డర్కు ప్రమోట్ చేసింది వాళ్లే. టెస్టుల్లో నన్ను ఓపెనర్గా పంపడం అంత సులువు కాదు. అయినా, వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారు.తొలి బంతికే అవుటయ్యానునా ఆటను పరిశీలించేందుకు ఓ ప్రాక్టీస్మ్యాచ్ ఆడమని చెప్పారు. అయితే, అప్పుడు నేను తొలి బంతికే అవుటయ్యాను. ఇక నాకు ఓపెనర్గా ఎలాంటి అవకాశం లేదని నిరాశచెందాను. టెస్టుల్లో ఐదు లేదంటే ఆరో స్థానంలోనైనా.. లేదంటే లోయర్ఆర్డర్లోనైనా బ్యాటింగ్కు వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యాను.నమ్మకం నిలబెట్టుకుంటూకానీ రవి భాయ్ టెస్టుల్లో నన్ను ఓపెనర్గా పంపాలని భావించాడు. 2015లోనే నాకు ఈ అవకాశం వస్తే బాగుంటుందని చెప్పాడు. అయితే, అప్పుడు అది సాధ్యం కాలేదు. కానీ తర్వాత రవిభాయ్, కోహ్లి వల్ల టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లి పట్ల ఈ సందర్భంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా రోహిత్ తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్తో బిజీ కానున్నాడు. చదవండి: రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్ శర్మ While @ImRo45 Rohit’s legacy in test cricket is being discussed - Here’s a little story of his comeback into test cricket .. Also a sneak peek into how @RaviShastriOfc and @imVkohli planned India’s ascendancy in tests. pic.twitter.com/LO0jVtqP7O— Jatin Sapru (@jatinsapru) October 1, 2024 -
భారత జట్టును ఒక్క మాట అన్నా ఊరుకోం..
-
మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది.భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2017- 2021 మధ్య టీమిండియా హెడ్ కోచ్గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడంసహా నంబర్ వన్ జట్టుగా ఎదిగింది.అయితే, వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గలేకపోయింది టీమిండియా. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియగా.. కెప్టెన్గా విరాట్ కోహ్లి యుగానికి తెరపడింది. ఈ క్రమంలో కోహ్లి రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతుండగా.. రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్గా మారాడు.ఈ నేపథ్యంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్తో మాట్లాడుతూ రవిశాస్త్రి.. హెడ్కోచ్గా పనిచేయడంపై తనకున్న ఆసక్తిని వివరించాడు. భవిష్యత్తులో తాను ఐపీఎల్ జట్టు కోచ్గా పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేనని తెలిపాడు.భారత్లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారని.. వారిని మెరికల్లా తీర్చిదిద్దే అవకాశం తనకు వస్తే కచ్చితంగా మళ్లీ కోచ్గా మారతానని రవిశాస్త్రి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే సూపర్ స్టార్లుగా ఎదిగిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అయితే, కొత్త టాలెంట్ను ప్రోత్సహించేందుకు తనకు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని స్పష్టం చేశాడు.ఏడేళ్లు టీమిండియాతో పనిచేసిన తర్వాత .. తిరిగి కామెంటేటర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న రవిశాస్త్రి.. తదుపరి ఐపీఎల్ కోచ్గా మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేశాడు. కాగా రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
వామ్మో.. ఒక్క ఫొటోతో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న రవిశాస్త్రి!
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెటర్గా తనకంటూ గుర్తింపు పొందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ వ్యాఖ్యానం చేయడంలో రవిశాస్త్రి దిట్ట. ఇక సోషల్ మీడియాలో ఈ ‘61 ఏళ్ల కుర్రాడు’ చురుగ్గా ఉంటాడు. తాజాగా ఎక్స్.కామ్లో అతడు షేర్ చేసిన ఫొటో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. మిమ్మల్ని ఆకర్షించేలా ఉన్నానా? నావీ బ్లూ నైట్ సూట్లో స్టైలిష్ ఫోజులతో ఫొటోలు దిగిన రవిశాస్త్రి.. ‘‘నేను హాటీ.. నేను నాటీ.. నేను సిక్స్టీ’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. తీక్షణంగా చూస్తున్నట్లుగా ఉన్న మరో ఫొటోకు ‘‘మిమ్మల్ని నా వైపు ఆకర్షించేలా ఉన్నానా’’ అంటూ వేరే లెవల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. ‘‘ఫిట్గా ఉండే టీమిండియా కుర్రాళ్లు కూడా ఒక్క ఫొటోతో ఇలాంటి మాయ చేయలేకపోయారు. కానీ అరవై ఏళ్ల రవిశాస్త్రి అయ్య బాబోయ్ అనిపిస్తున్నాడు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదైనా యాడ్ షూట్ కోసం ఇలా ఫోజులు ఇచ్చి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. లేదంటే రవిశాస్త్రి అకౌంట్ హ్యాక్ అయ్యిందేమో అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. 80లలో టీమిండియాలోకి వచ్చిన ముంబైకర్ మే 27, 1962లో ముంబైలో జన్మించిన రవిశాస్త్రి.. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్లో సత్తా చాటాడు. 17 ఏళ్ల వయసులో నాటి బాంబే రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించాడు. తన నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ మరుసటి ఏడాది టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న రవిశాస్త్రి.. 1981లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. దాదాపు పదకొండేళ్లపాటు కెరీర్ కొనసాగించి.. భారత్ తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3830, 3108 పరుగులు సాధించాడు రవిశాస్త్రి. కోచ్గా ప్రస్థానం 2014లో టీమిండియా డైరెక్టర్గా నియమితుడైన రవిశాస్త్రి.. 2017లో హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. వీరిద్దరి నేతృత్వంలో ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ గెలిచింది. అదే విధంగా నంబర్ వన్ ర్యాంకు సాధించింది. వన్డే వరల్డ్కప్-2019లో సెమీ ఫైనల్కు చేరింది. ఈ టోర్నీ తర్వాత రెండేళ్ల పాటు కోచ్గా ఉన్న రవిశాస్త్రి 2021లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. చదవండి: ముంబైకి గుడ్బై.. ఎవరూ ఊహించని జట్టులో చేరనున్న రోహిత్ శర్మ?! I am hottie, I am naughty, I am sixtyyyy 🥵 pic.twitter.com/oHBQw3WoIf — Ravi Shastri (@RaviShastriOfc) April 10, 2024 -
ఇదేమీ చెత్త జట్టు కాదు.. అతడు కూడా మీలాంటి మనిషే!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు పెరుగుతోంది. అభిమానులు మైదానంలో అతడి పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఇప్పటికే హర్భజన్ సింగ్తో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఇక భజ్జీ అయితే.. ఫ్యాన్స్తో పాటు ముంబై ఆటగాళ్ల తీరును కూడా విమర్శించాడు. జట్టు అనుకున్న ఫలితాలు రాబట్టాలంటే కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను అంగీకరించాల్సిందేనని సూచించాడు. ఇదిలా ఉంటే.. సంజయ్ మంజ్రేకర్ సైతం వాంఖడే స్టేడియంలో పాండ్యాను హేళను చేస్తున్న వారిని ఉద్దేశించి.. ‘మర్యాద పాటించండి’ అని హెచ్చరించాడు. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) తాజాగా రవిశాస్త్రి సైతం హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. ముంబై జట్టు అభిమానులను ఉద్దేశించి.. ‘‘ ఈ జట్టుకు ఎన్నో ఏళ్లుగా మీరు మద్దతుగా నిలుస్తున్నారు. కేవలం 2-3 మ్యాచ్ల ఫలితాల వల్ల ఇదేమీ చెత్త జట్టు కాబోదు కదా! ఐదుసార్లు చాంపియన్గా నిలిచి టీమ్ ఇది. కాకపోతే ఈసారి కొత్త కెప్టెన్ వచ్చాడు. కాస్త ఓపిక పట్టండి. పాపం.. తను కూడా మీలాంటి మనిషే కదా. రోజు ముగిసిన తర్వాత రాత్రి తను కూడా నిద్రపోవాలి కదా. తన స్థానంలో ఉండి ఆలోచించండి. కాస్త నిశ్శబ్దంగా ఉండండి’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అదే విధంగా.. హార్దిక్ను ఉద్దేశిస్తూ.. ‘‘నువ్వు కూడా కాస్త ఓపిక పట్టు హార్దిక్. కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టు. ముంబై ఇండియన్స్ అద్భుతమైన జట్టు. 3-4 మ్యాచ్లు గెలిచిందంటే ఆ తర్వాత ఎవరూ ఆపలేరు. కథ మొత్తం మారిపోతుంది’’ అని రవిశాస్త్రి సలహాలు ఇచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్ తదుపరి ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడనుంది. ముంబై వేదికగా ఏప్రిల్ 7న ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మూడూ ఓడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: రూ.11 కోట్లు టైమ్కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: సన్రైజర్స్ కోచ్గా దూరం.. ఆ ‘టీమ్’లో స్పీడ్గన్!
ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి తరుణం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. దేశంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో 21 మ్యాచ్ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఓవైపు క్రికెటర్లు ఆటతో అలరిస్తుంటే.. వారి ఆటను విశ్లేషిస్తూ మాటల గారడితో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన కామెంటేటర్లు సిద్ధమవుతున్నారు. ఇందులో టీమిండియా మాజీ హెడ్కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి, దిగ్గజం సునిల్ గావస్కర్ సహా భారత్ నుంచి తరలివెళ్లి అమెరికాకు ఆడుతున్న ఉన్ముక్త్ చాంద్ వరకు లిస్టు పెద్దదిగానే ఉంది. ఇక వ్యక్తిగత కారణాల దృష్ట్యా సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా తప్పుకొన్న సౌతాఫ్రికా స్పీడ్గన్ డేల్ స్టెయిన్ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఇంటర్నేషనల్: స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జాక్వెస్ కలిస్, టామ్ మూడీ, పాల్ కాలింగ్వుడ్. ఇంగ్లిష్ కామెంట్రీ: సునిల్ గావస్కర్, రవి శాస్త్రి, బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ క్లార్క్, సంజయ్ మంజ్రేకర్, ఆరోన్ ఫించ్, ఇయాన్ బిషప్, నిక్ నైట్, సైమన్ కటిచ్, డ్యారీ మోరిసన్, క్రిస్ మోరిస్, క్యాటీ మార్టిన్, సామ్యూల్ బద్రి, గ్రేమ్ స్వాన్, దీప్దాస్ గుప్తా, హర్షా భోగ్లే, పుమెలెలో ముబాంగ్వా, అంజుమ్ చోప్రా, మురళి కార్తిక్, డబ్ల్యూవీ రామన్, నటాలీ జెర్మనోస్, డారెన్ గంగ, మార్క్ హొవార్డ్, రోహన్ గావస్కర్. తెలుగు: మిథాలీ రాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి. సుమన్, కళ్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర్రావు, రాకేశ్ దేవా రెడ్డి, డానియల్ మనోహర్, రవి రాక్లే, శశికాంత్ ఆవులపల్లి, ఎం ఆనంత్ శ్రీక్రిష్ణ, వింధ్య మేడపాటి, గీతా భగత్, అంబటి రాయుడు. హిందీ: హర్భజన్ సింగ్ ఇర్ఫాన్ పఠాన్ అంబటి రాయుడు రవిశాస్త్రి సునీల్ గవాస్కర్ వరుణ్ ఆరోన్ మిథాలీ రాజ్ మహ్మద్ కైఫ్ సంజయ్ మంజ్రేకర్ ఇమ్రాన్ తాహిర్ వసీం జాఫర్ గురుకీరత్ మన్ ఉన్ముక్త్ చంద్ వివేక్ రజ్దాన్ రజత్ భాటియా దీప్ దాస్గుప్తా రామన్ భానోట్ పదమ్జెట్ సెహ్రావత్ జతిన్ సప్రు. -
సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్!
టీమిండియా బౌలింగ్ విభాగం మాజీ కోచ్ భరత్ అరుణ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. రవిశాస్త్రి దృష్టిలో సునిల్ గావస్కర్ తర్వాత అంతటి గొప్ప ఓపెనర్ మళ్లీ మురళీ విజయ్ అని పేర్కొన్నాడు. తనకు కూడా మురళీనే అభిమాన క్రికెటర్ అని తెలిపాడు. కాగా 2008లో నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లో వరుసగా 33, 41 పరుగులు సాధించాడు. ఓపెనర్గా సత్తా చాటి టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. కెరీర్లో మొత్తంగా 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 3982, 339, 169 పరుగులు సాధించాడు మురళీ విజయ్. గతేడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా మురళీ విజయ్ గురించి క్రికెట్.కామ్ ఇంటర్వ్యూలో భరత్ అరుణ్ మాట్లాడుతూ.. ‘‘యువకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు మురళీ విజయ్తో పరిచయం ఉంది.కాలేజీలో తనను మొదటిసారి చూశాను. ఫస్ట్ డివిజన్ జట్టుకు అతడి పేరును రికమెండ్ చేశాను. అలా అతడి ప్రయాణం మొదలైంది. రవిశాస్త్రి ఎల్లప్పుడూ నాతో ఓ మాట అంటూ ఉండేవాడు. సునిల్ గావస్కర్ తర్వాత ఆ స్థాయిలో టెస్టుల్లో ఆకట్టుకున్న ఓపెనర్ మురళీ విజయ్ అని చెప్పేవాడు. నా ఫేవరెట్ క్రికెటర్ కూడా మురళీ విజయే’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మలను కాదని.. గావస్కర్ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి మురళీ విజయ్కు ఇవ్వడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్, రాహుల్ భయ్యాకు థాంక్స్: అశూ భార్య -
పుజారా అక్కడ దంచికొడుతున్నాడు.. జాగ్రత్త: మాజీ కోచ్ వార్నింగ్
టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న ఈ కుర్ర బ్యాటర్.. ఇటీవల టెస్టుల్లో మాత్రం తేలిపోతున్నాడు. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఎంట్రీ ఇచ్చి.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పాతుకుపోగా.. గిల్ వన్డౌన్లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఓపెనర్గా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్... మూడో స్థానంలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. తాజాగా ఇంగ్లండ్తో స్వదేశంలోనూ శుబ్మన్ గిల్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలి టెస్టులో మొత్తంగా కేవలం 23 పరుగులు మాత్రమే చేసిన గిల్.. వైజాగ్లో జరుగుతున్న రెండో మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 34 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ హెడ్కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి గిల్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఈ జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా పుజారా నుంచి వారి స్థానానికి కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంటుంది. రంజీ ట్రోఫీలో అద్భుత ఫామ్తో సత్తా చాటుతున్న పుజారా ఎల్లప్పుడూ సెలక్టర్ల దృష్టిలోనే ఉంటాడన్న విషయం మర్చిపోవద్దు. టెస్టు మ్యాచ్ అంటేనే ఓపికగా ఆడాల్సి ఉంటుంది. సహనం లేకుంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఆండర్సన్ వంటి క్లాస్ బౌలర్ బౌలింగ్లో ఆడుతున్నపుడు చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి’’ అంటూ గిల్ పేరెత్తకుండానే.. అతడికి పుజారా రూపంలో పోటీ ఉందంటూ రవిశాస్త్రి హెచ్చరికలు జారీ చేశాడు. కాగా వైజాగ్ టెస్టులో శుబ్మన్ గిల్ ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టుల్లో మూడో స్థానంలో అదరగొట్టిన ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇటీవలే ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇరవై వేల పరుగుల అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ద్విశతకంతోనూ చెలరేగి సత్తా చాటాడు. గత కొంతకాలంగా తనను పక్కన పెట్టిన సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా ఆటతో సత్తా చాటుతున్నాడు ఈ నయావాల్. -
పోప్ సంగతి సరే.. వాళ్ల విషయంలోనూ అలా ఎందుకు?: డీకే విమర్శలు
India vs England, 1st Test : సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పర్యాటక జట్టు చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉప్పల్లో గురువారం మొదలైన టెస్టులో తొలి రెండు రోజులు ఆధిపత్యం కొనసాగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇంగ్లండ్ విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజే తలవంచి ఓటమిని ఆహ్వానించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకబడింది. స్వదేశంలో టీమిండియా ఇలా ఊహించని రీతిలో ఓటమిపాలు కావడంతో రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. వాళ్ల విషయంలోనూ డిఫెన్సివ్గా ఎందుకు? తొలి టెస్టులో భారత్ ఆట తీరు, రోహిత్ శర్మ కెప్టెన్సీపై వెటరన్, మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ స్పందిస్తూ.. ఇంగ్లండ్తో తొలి టెస్టులో భారత్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడిందని విమర్శించాడు. ఒలి పోప్ వంటి బ్యాటర్ విషయంలో డిఫెన్సివ్గా ఉండటంలో తప్పులేదని.. కానీ.. టామ్ హార్లీ వంటి టెయిలెండర్ల విషయంలోనూ అదే తరహాలో ఆడటం సరికాదని డీకే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్ చేసి ఉంటే బాగుండన్నాడు. ఈ మేరకు జియో సినిమా షోలో దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఇంత బేలగా చూడలేదు ఇక భారత జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. సొంతగడ్డపై టీమిండియా ఇంతకు ముందెన్నడూ ఇంత బేలగా చూడలేదన్నాడు. రోహిత్ సేన పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోవడం.. థర్డ్ ఇన్నింగ్స్లో పర్యాటక జట్టుకు 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఇవ్వడం తనని ఆశ్చర్యపరిచిందని అన్నాడు. భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆడుతుంది అసలు మనవాళ్లేనా అన్న సందేహం కలిగిందని వాపోయాడు. కాగా ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ ఈ మ్యాచ్లో 196 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. చదవండి: IND Vs ENG: ఇంట్లోనే తలవంచారు... భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తి వివరాలు -
పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. సరైందేనన్న రవిశాస్త్రి
#INDvENG: ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అవుటైన తీరుపై నెట్టింట చర్చ నడుస్తోంది. జడ్డూను అన్యాయంగా పెవిలియన్కు పంపారని.. థర్డ్ అంపైర్ జో రూట్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా హైదరాబాద్ టెస్టులో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. తొలుత ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో మూడు కీలక వికెట్లు కూల్చిన జడ్డూ.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 87 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆట మొదలయ్యాక కాపేసటికే అవుట్ శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో పట్టుదలగా నిలబడి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన జడేజా.. మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే పెవిలియన్ చేరాడు. 81 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన అతడు మరో ఆరు పరుగులు మాత్రమే జతచేసి అవుటయ్యాడు. 119.3 ఓవర్ వద్ద ఇంగ్లండ్ పార్ట్టైమ్ స్పిన్నర్ జో రూట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయినట్లు కన్పించింది. ఎటూ తేల్చలేక అవుట్ ఇచ్చాడు దీంతో రూట్ గట్టిగా అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ జడ్డూను అవుట్గా ప్రకటించాడు. అయితే, ఈ నిర్ణయంతో ఏకీభవించని జడేజా రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో వివిధ కోణాల్లో బంతిని పరీక్షించిన థర్డ్ అంపైర్.. బాల్ ముందుగా బ్యాట్ను తాకిందా లేదంటే ప్యాడ్ను తాకిందా నిర్ధారించలేకపోయాడు. దీంతో అంపైర్స్ కాల్కే కట్టుబడి జడ్డూను అవుట్గా తేల్చగా.. అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. సరైందేనన్న రవిశాస్త్రి ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా జడేజా అవుటైన తీరును విమర్శిస్తూ అంపైర్లను ట్రోల్ చేస్తున్నారు. బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద జడ్డూను నాటౌట్గా ప్రకటించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. Ravindra Jadeja is unlucky here. - Out or Not out? #INDvsENG #Bigboss17finale #MonkeyMan #Fighter #Djokovic #श्रीराम pic.twitter.com/fK6uiae7En — bhavishya aneja (@AnejaBhavi55798) January 27, 2024 Jadeja that was brutally unlucky Inside edge could not be determined Umpire's call on line Umpire's call on height Basically DRS could not determine anything #INDvsENG — Shreya (@shreyamatsharma) January 27, 2024 ఈ క్రమంలో టీమిండియా- ఇంగ్లండ్ కామెంటేటర్, భారత మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో తాను ఏకీభవిస్తానని స్పష్టం చేశాడు. ఒకవేళ అంపైర్స్ కాల్ నాటౌట్ అయి ఉంటే బ్యాటర్ అయిన జడేజాకు అనుకూల ఫలితం వచ్చేదని... కానీ అతడు అవుట్ ఇచ్చాడు కాబట్టే జడ్డూ మైదానాన్ని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. చదవండి: Ind vs Eng: జో రూట్ మాయాజాలం.. టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే.. -
హైదరాబాద్ బ్యాటర్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ సంచలనం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్తో శుక్రవారం మొదలైన మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. టీ20 మ్యాచ్ తరహాలో దంచికొడుతూ 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కు అందుకుని ఈ మేరకు అరుదైన ఘనత సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 20 సిక్సర్లు ఉండటం విశేషం. ఆల్టైమ్ రికార్డు బ్రేక్ అరుణాచల్ ప్రదేశ్తో అద్భుత ఇన్నింగ్స్ మెరిసిన తన్మయ్ అగర్వాల్ సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో బోర్డర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్కో.. ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 రన్స్ సాధించాడు. తన్మయ్ 147 బాల్స్లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం. రవిశాస్త్రి పేరును చెరిపేసి.. ఇక అరుణాచల్ ప్రదేశ్తో మ్యాచ్లోనే అంతకుముందు తన్మయ్ అగర్వాల్ మరో రికార్డును కూడా సాధించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన భారత బ్యాటర్గా నిలిచాడు. తద్వారా 39 ఏళ్లుగా టీమిండియా మాజీ బ్యాటర్ రవిశాస్త్రి పేరిట చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 119 బంతుల్లోనే 200 పరుగుల మార్కును అందుకుని తన్మయ్ ఈ ఘనత సాధించాడు. కాగా ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ ఆరంభమైంది. చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్! రనౌట్ వల్ల.. -
రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం
-
రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. 1983లో భారత్ నెగ్గిన తొలి వన్డే ప్రపంచకప్ విజేత సభ్యుడైన రవిశాస్త్రి అంతర్జాతీయ కెరీర్ అనంతరం టీవీ వ్యాఖ్యతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. తదనంతరం భారత పురుషుల టీమ్ డైరెక్టర్గా, హెడ్ కోచ్గా విజయవంతమయ్యారు. టెస్టులు, వన్డేలు, టి20ల్లో జట్టును మరో దశకు తీసుకెళ్లారు. ఓ ఆటగాడిగా, కోచ్గా రవిశాస్త్రి దేశానికి చేసిన సేవల్ని గుర్తించిన బీసీసీఐ 2019–20 సీజన్కుగాను ‘సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్’ (జీవిత సాఫల్య) అవార్డుతో సత్కరించింది. ఆయనతో పాటు ఫరూఖ్ ఇంజినీర్కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. పురుషుల విభాగంలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లకు ఇచ్చే ‘పాలీ ఉమ్రీగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల్ని 2019–20 సీజన్కుగాను షమీ, అశి్వన్ (2020–21), జస్ప్రీత్ బుమ్రా (2021–22), శుబ్మన్ గిల్ (2022–23) అందుకున్నారు. మహిళల కేటగిరీలో బెస్ట్ క్రికెటర్ అవార్డుల్ని దీప్తి శర్మ (2019–20, 2022–23), స్మృతి మంధాన (2020–21, 2021–22) గెలుచుకున్నారు. ఓపెనింగ్లో చిచ్చర పిడుగల్లే రాణిస్తున్న యశస్వి జైస్వాల్ 2022–23 సీజన్కు ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు చేజిక్కించుకున్నాడు. ఈ విభాగంలో మయాంక్ అగర్వాల్ (2019, 20), అక్షర్ పటేల్ (2020–21), శ్రేయస్ అయ్యర్ (2021–22)లకు అవార్దులు దక్కాయి. కరోనా మహమ్మారి వల్ల 2019–20, 2020–21, 2021–22, 2022–23 సీజన్లలో బీసీసీఐ వార్షిక అవార్డులు ప్రదానం చేయలేకపోయారు. దీంతో మంగళవారం ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన వేడుకలో నాలుగు సీజన్లకు సంబంధించిన పురుషులు, మహిళల, దేశవాళీ క్రికెటర్లకు అవార్డుల్ని ఒకేసారి ప్రదానం చేశారు. -
బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం.. సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు
NAMAN AWARDS 2024: బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇవాళ (జనవరి 23) హైదరాబాద్లో కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లతో పలువురు భారత మాజీలు కూడా హాజరయ్యారు. Ravi Shastri won the lifetime achievement award. - One of the greatest Indian coach ever. pic.twitter.com/D3oiLmMSCv — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Farokh Engineer said "This Indian team is the finest Indian team I have ever seen. Well done Rohit, Dravid & Ravi Shastri". pic.twitter.com/kSzpNToT0d — Johns. (@CricCrazyJohns) January 23, 2024 ఈ కార్యక్రమంలో భారత పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు, యువ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. గత నాలుగేళ్ల కాలంలో వివిధ విభాగాల్లో సత్తా చాటిన వారికి ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. అలాగే పలువురు మాజీ క్రికెటర్లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. Shubman Gill won the best Indian Men's cricketer for 2022-23 Season. pic.twitter.com/PkKUbnAyki — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Jasprit Bumrah won the Poly Umrigar Award for 2021-22 Season. pic.twitter.com/o0TF83przw — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Ravichandran Ashwin won the Poly Umrigar Award for 2020-21 Season. pic.twitter.com/yDI2Ja4Q43 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Mohammed Shami won the Poly Umrigar Award for 2019-20 Season. - The legend. 🫡 pic.twitter.com/h7XVrC2Qg9 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Jaiswal said "It's incredible to bat with Rohit Bhai - it's a proud moment to learn from him". pic.twitter.com/ecpVkELaGe — Johns. (@CricCrazyJohns) January 23, 2024 Mumbai won the best performance in BCCI domestics in 2019-20. - Rohit Sharma received the award on behalf of Mumbai. pic.twitter.com/rKk2epWGtA — Johns. (@CricCrazyJohns) January 23, 2024 అవార్డులు అందుకున్న వారి వివరాలు.. రవిశాస్త్రి: కల్నల్ సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫారూక్ ఇంజనీర్: కల్నల్ సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు (2019-20) శుభ్మన్ గిల్: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2022-23) జస్ప్రీత్ బుమ్రా: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2021-22) రవిచంద్రన్ అశ్విన్: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2020-21) మొహమ్మద్ షమీ: పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2019-20) స్మృతి మంధన: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (2020-21, 2021-22) దీప్తి శర్మ: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (2019-20, 2022-23) Riyan Parag won the Lala Amarnath Award for best all-rounder in domestic limited overs. - Riyan recieved the award from Rohit Sharma. pic.twitter.com/Bap4wmooLo — Johns. (@CricCrazyJohns) January 23, 2024 అంతర్జాతీయ క్రికెట్లో ఉత్తమ అరంగేట్రం (పురుషులు).. 2019-20: మయాంక్ అగర్వాల్ 2020-21: అక్షర్ పటేల్ 2021-22: శ్రేయస్ అయ్యర్ 2022-23: యశస్వి జైస్వాల్ Sarfaraz Khan's father recieved the award from Rahul Dravid behalf of his son for scoring highest run getter in Ranji Trophy 2021-22. pic.twitter.com/V5wVJfB0AV — Johns. (@CricCrazyJohns) January 23, 2024 అంతర్జాతీయ క్రికెట్లో ఉత్తమ అరంగేట్రం అవార్డులు.. ప్రియా పూనియా: 2019-20 షఫాలీ వర్మ: 2020-21 సబ్బినేని మేఘన: 2021-22 అమన్జోత్ కౌర్: 2022-23 BCCI President said "I would like to congratulate Rohit & Rahul for the fantastic run in World Cup - you made us proud". pic.twitter.com/dq4zSjp6s7 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 దిలీప్ సర్దేశాయ్ అవార్డులు.. అశ్విన్ (2022-23 భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్లో అత్యధిక వికెట్లు) యశస్వి జైస్వాల్ (2022-23 భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్లో అత్యధిక పరుగులు) Indian team in BCCI awards. 🇮🇳 - Picture of the day. pic.twitter.com/e5fbz1VzR4 — Johns. (@CricCrazyJohns) January 23, 2024 వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్లు.. పూనమ్ యాదవ్: 2019-20 ఝులన్ గోస్వామి: 2020-21 రాజేశ్వరి గైక్వాడ్: 2021-22 దేవిక వైద్య: 2022-23 Captain Rohit Sharma has arrived in BCCI awards. pic.twitter.com/T4nt1HRA2i — Johns. (@CricCrazyJohns) January 23, 2024 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్లు.. పూనమ్ రౌత్: 2019-20 మిథాలీ రాజ్: 2020-21 హర్మన్ప్రీత్ కౌర్: 2021-22 జెమీమా రోడ్రిగెజ్: 2022-23 BCCI awards start at 6 pm IST today. - Live on Sports 18 & JioCinema...!!!! pic.twitter.com/9Ddmg8IICA — Johns. (@CricCrazyJohns) January 23, 2024 దేశవాలీ క్రికెట్లో ఉత్తమ అంపైర్లు.. అనంత పద్మనాభన్: 2019-20 వ్రిందా రతి: 2020-21 జయరామన్ మదన్ గోపాల్: 2021-22 రోహన్ పండిట్: 2022-23 దేశవాలీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు.. ముంబై: 2019-20 మధ్యప్రదేశ్: 2021-22 సౌరాష్ట్ర: 2022-23 లాలా అమర్నాథ్ అవార్డు (ఆల్రౌండర్ పరిమిత ఓవర్ల క్రికెట్).. బాబా అపరాజిత్: 2019-20 రిషి ధవన్: 2020-21, 2021-22 రియాన్ పరాగ్: 2022-23 లాలా అమర్నాథ్ అవార్డు (ఆల్రౌండర్ రంజీ ట్రోఫీ).. ముర సింగ్: 2019-20 షమ్స్ ములానీ: 2021-22 సరాన్ష్ జైన్: 2022-23 మాధవరావ్ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక వికెట్లు).. జయదేవ్ ఉనద్కత్: 2019-20 షమ్స్ ములానీ: 2021-22 జలజ్ సక్సేనా: 2022-23 మాధవరావ్ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక పరుగులు).. రాహుల్ దలాల్: 2019-20 సర్ఫరాజ్ ఖాన్: 2021-22 మయాంక్ అగర్వాల్: 2022-23 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
BCCI Awards 2024: రవిశాస్త్రికి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు
రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కనుంది. భారత క్రికెట్కు శాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును అందించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆటగాడిగా, హెడ్ కోచ్గా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన శాస్త్రి ప్రస్తుతం టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. శాస్త్రి హయాంలో (2017-2021) అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ జట్టుగా విరాజిల్లింది. భారత జట్టుకు దూకుడు నేర్పిన కోచ్గా శాస్త్రికి పేరుంది. 61 ఏళ్ల రవిశాస్త్రి 1981-92 మధ్యలో 80 టెస్ట్లు, 150 వన్డేలు ఆడి దాదాపు 7000 పరుగులు చేసి 280 వికెట్లు పడగొట్టాడు. రవిశాస్త్రి తన కెరీర్లో 15సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. రేపు జరుగబోయే బీసీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముంబైకు చెందిన యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీలకు అవార్డులు దక్కనున్నాయి. -
‘ఆ రికార్డు’ కూడా కోహ్లికి సాధ్యమే.. మరో 10 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలు చేస్తాడు..!
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డునూ బద్దలుకొట్టే సత్తా భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లికి ఉందని భారత దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ప్రస్తుతం విరాట్ 50వ శతకంతో వన్డేల్లో సచిన్ (49) సెంచరీల రికార్డును చెరిపేశాడు. ఓవరాల్గా చూస్తే టెస్టుల్లో 29, టి20ల్లో ఒక సెంచరీ కలుపుకుంటే 80 సెంచరీలతో ఉన్నాడు. విరాట్ 50వ వన్డే సెంచరీ పూర్తి చేసిన అనంతరం శాస్త్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సచిన్ వంద సెంచరీలు చేసినపుడు ఇంతటి గొప్ప మైలురాయి దరిదాపుల్లోనే ఎవరూ రారని అనుకున్నాం. ఇప్పుడు కోహ్లి 80 దాకా వచ్చాడు. విరాట్లాంటి బ్యాటర్కు ఏదీ అసాధ్యం కాదు. శతక్కొట్టడం మొదలు పెడితే కొడుతూనే ఉంటారు. చూడండి అతని తదుపరి 10 ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలు గ్యారంటీ! పైగా తను మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. ప్రతి ఫార్మాట్లోనూ అదే నిబద్ధత, అంకితభావాన్ని కనబరుస్తున్నాడు. అతని కెరీర్లో ఇంకా మూణ్నాలుగేళ్ల ఆట మిగిలుంది. ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం, పరిస్థితులకు అలవాటు పడే నైజం, అంతకుమించి పూర్తి ఫిట్నెస్ అతన్ని అసాధారణ క్రికెటర్గా నిలబెడుతోంది’ అని అన్నారు. జట్టుకు తనెంత కీలకమో కోహ్లికి బాగా తెలుసు: బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ భారత జట్టులో తన పాత్ర ఎంత కీలకమో... తన భుజాలపై ఎంతటి గురుతర బాధ్యతలున్నాయో కోహ్లికి బాగా తెలుసని కోచ్లెవరూ అతనికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వివరించారు. ‘విరాట్ సన్నాహాలకు సాయమందిస్తాం. అంతేతప్ప కోచింగ్ పాఠాలు చెప్పాల్సిన పనేం రాదు. అతనికేమైనా కావాలంటే తనే వచ్చి అడుగుతాడు. ప్రాక్టీస్ అయినా... ఆటయినా అతనికే వదిలేస్తాం. ఎప్పుడు ఎలా ఆడాలో కోహ్లికే బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఎన్ని సెంచరీలు చేసినా, ఎన్ని మైలురాళ్లు దాటినా అతని పరుగుల ఆకలి తీరనే తీరదు. బౌలర్లలో షమీ పేస్ అద్భుతం. అందుకే అతను స్పెషల్ బౌలర్. అయినప్పటికీ ఆరంభంలో కొన్ని మ్యాచ్లకు పక్కనబెట్టడానికి కారణం జట్టు కాంబినేషనే తప్ప అతని సమర్థతపై ఏ సంకోచం లేదు’ అని అన్నారు. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్లు రెండో సారి వరల్డ్కప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు వరల్డ్కప్ ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. నాటి ఫైనల్లో ఆసీస్.. టీమిండియాపై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. మరి ఈ సారి ఏమవుతుందో తేలాలంటే నవంబర్ 19 రాత్రి వరకు వేచి చూడాలి. -
హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంది బాబర్.. ముసిముసి నవ్వులు నవ్వుకున్న పాక్ కెప్టెన్
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో యావత్ క్రికెట్ ప్రపంచం వరల్డ్కప్ మత్తులో ఊగిపోతుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లంతా వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్ కోసం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం కొత్త పెళ్లి కూతురులా ముస్తాబైంది. మరో పక్క అహ్మదాబాద్లో ఇవాళ జరిగిన కెప్టెన్ల మీటింగ్ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత ఆనందాన్ని అందించింది. ఆధ్యాంతం ఆహ్లాద భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత రవిశాస్త్రి తనదైన శైలి చమత్కారంతో అందరి మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. ఈ కార్యక్రమంలో విలేకరుల సమావేశం సైతం నవ్వులు పూయించింది. తొలుత రోహిత్ శర్మను ఓ విలేఖరి గత వరల్డ్కప్ ఫైనల్లో బౌండరీల సంఖ్య ఆధారంగా విజేతను నిర్ణయించడం సబబా అని అడిగాడు. ఇందుకు హిట్మ్యాన్ తనదైన శైలిలో.. సర్ విజేతను నిర్ణయించడం నా పని కాదంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. Another Rohit Sharma's press conference moment 😂 pic.twitter.com/TEz0aT3YyW — CricTracker (@Cricketracker) October 4, 2023 ఇదే సమయంలో జర్నలిస్ట్-రోహిత్ మధ్య జరిగిన సంభాషణను పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పక్కనే ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు వివరిస్తూ కనిపించాడు. ఈ చిట్చాట్ జరుగుతుండగానే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ప్రయాణ బడలిక కారణంగా కునుకు తీస్తూ కనిపించాడు. Temba Bavuma during the Captain's Round Table Event. pic.twitter.com/xaxRHTzg4V — Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2023 ప్రశ్నోత్తరాల సమయంలో పాక్ కెప్టెన్ వంతు రాగా.. మధ్యలో వ్యాఖ్యాత రవిశాస్త్రి కలుగజేసుకుని.. బాబర్.. హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉందంటూ ప్రశ్నించాడు. ఇందుకు ముసిముసి నవ్వులు నవ్వుకున్న పాక్ కెప్టెన్.. ఇప్పటికే 100 సార్లు చెప్పాను.. హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుంది.. మా టీమ్ మొత్తానికి బాగా నచ్చింది.. అయితే కరాచీ బిర్యానీతో పోలిస్తే కాస్త స్పైసీగా ఉందని అన్నాడు. బాబర్ హైదరాబాద్ బిర్యానీ గురించి వివరిస్తుండగా అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకున్నారు. Ravi Shastri asks "How is Biriyani". Babar Azam said "Hyderabad Biryani has been so good!!!😅#BabarAzam #icccricketworldcup#CWC23 #NaseemShah pic.twitter.com/blWyeJw1YM — Ahmar. (@Ahmarch84921398) October 4, 2023 కాగా, పాకిస్తాన్ ఏడేళ్ల తర్వాత వరల్డ్కప్ కోసం భారత గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వార్మప్ మ్యాచ్ల కోసం పాక్ టీమ్ హైదరాబాద్ నగరంలో బస చేసింది. పాక్ ఇక్కడే తమ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడి, వరల్డ్కప్లో తమ తొలి మ్యాచ్ కోసం కూడా సిద్దపడుతుంది. బాబర్ సేన నగరంలో స్టే చేస్తున్న క్రమంలో ఇక్కడున్న చాలా ప్రదేశాలను సందర్శించింది. ఈ క్రమంలో పాక్ క్రికెటర్లు పలుమార్లు హైదరాబాదీ బిర్యానీని ఆరగించారు. వారికి ఇక్కడి బిర్యానీతో పాటు హైదరాబాదీ ఆతిథ్యం కూడా బాగా నచ్చింది. ఇక్కడి జనాలు పాక్ క్రికెటర్లను చూసేందుకు ఎగబడటంతో వారు మురిసిపోతున్నారు. -
WC: జట్టు ఎంపిక అద్భుతం.. గెలిచినా.. ఓడినా! వెళ్లండి.. వెళ్లి! ఓవరాక్షన్ వద్దు..
India’s 15-member squad for 2023 ODI World Cup: వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టుపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. సెలక్టర్ల ఎంపిక అద్భుతంగా ఉందంటూ కొనియాడాడు. కాగా ఆసియా కప్-2023 ముగిసిన తర్వాత మరో మెగా క్రికెట్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ జరుగనుంది. ఈ క్రమంలో బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఏడుగురు బ్యాటర్లతో పాటు నలుగురు బౌలర్లు, నలుగురు ఆల్రౌండర్లకు ఇందులో స్థానం కల్పించింది. అప్పుడు చోటు లేదు.. ఈసారి కెప్టెన్గా.. ఇక సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్-2011లో జట్టులో చోటు కూడా దక్కని రోహిత్ శర్మ ఈసారి ఏకంగా కెప్టెన్గా బరిలోకి దిగనుండగా.. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా అవకాశం దక్కించుకున్నాడు. ఆసియా వన్డే టోర్నీ జట్టులో ఉన్న తిలక్ వర్మ, ప్రసిద్ కృష్ణలకు తప్ప ప్రధాన జట్టులోని మిగతా 15 మంది ఐసీసీ ఈవెంట్ ఆడనున్నారు. అతడు ఎందుకు? ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. కొత్తగా ఇషాన్ కిషన్ కూడా మిడిలార్డర్లో రాణిస్తుండగా.. వన్డేల్లో మెరుగైన రికార్డులేని సూర్యకుమార్ యాదవ్ ఎంపిక విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే విధంగా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ను విస్మరించడం కూడా హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లకు అసహనం తెప్పిస్తోంది. అద్భుతమైన ఎంపిక ఈ క్రమంలో 1983 విజేత, మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి మాత్రం భిన్నంగా స్పందించాడు. జట్టు ఎంపిక సూపర్ అంటూ సెలక్టర్లను ఆకాశానికెత్తాడు. ఈ మేరకు.. ‘‘అద్భుతమైన టీమ్ను ఎంపిక చేశారు. వెళ్లండి... ప్రత్యర్థి జట్లను మట్టికరిపించండి. ఏదేమైనా.. గెలిచినా.. ఓడినా.. అనుభవం గడించడంలో ఇదంతా భాగమే. ఆటను పూర్తిగా ఆస్వాదించండి. మనసులు గెలుచుకోండి. దేశానికి గర్వకారణం కండి’’ అంటూ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఇందుకు స్పందనగా.. ‘ఓవరాక్షన్ వద్దు రవిభాయ్.. ఈ జట్టుతో వరల్డ్కప్ గెలవడం కాదు కదా.. సెమీస్ చేరడం కూడా కష్టమే’’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రవిశాస్త్రి హెడ్కోచ్గా ఉన్నపుడు కాగా వరల్డ్కప్-2019 సమయంలో రవిశాస్త్రి మార్గదర్శనంలో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా సెమీస్లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాడు కివీస్తో.. ఫైనల్లో బెన్స్టోక్స్ అద్బుత ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. చదవండి: వన్డే వరల్డ్కప్కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా చిచ్చరపిడుగులు Excellent team picked. Come on Guys get out there and kick some butt. Win. Lose. Part and Parcel. Bottom line. ENJOY. Respect 🇮🇳 https://t.co/KOlNlVaXDN — Ravi Shastri (@RaviShastriOfc) September 5, 2023 -
ఇంతకంటే చెత్త ఆలోచన మరొకటి లేదు: రవిశాస్త్రిని ఏకిపారేసిన గంభీర్
Absolutely rubbish: Gautam Gambhir: మెగా టోర్నీలలో భారత తుది జట్టులో ముగ్గురు లెఫ్లాండర్లు ఉండాలన్న ఆలోచనను టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కొట్టిపారేశాడు. ఇంతకంటే చెత్త సలహా మరొకటి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్ది ఎడమచేతి వాటమా, కుడిచేతి వాటమా అన్న అంశంతో సంబంధం లేదని.. అత్యుత్తమ ఫామ్లో ఉన్న వాళ్లనే ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించాడు. కనీసం ముగ్గురు లెఫ్టాండర్లు ఉండాలన్న రవిశాస్త్రి కాగా ఆసియా కప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘తుది జట్టులో కనీసం ముగ్గురు లెఫ్టాండర్లు ఉంటే బాగుంటుంది. గత ఎనిమిది నెలలుగా ఇషాన్ కిషన్ ఆట తీరును గమనించండి. బ్యాటింగ్ చేయడంతో పాటు అతడు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. అతడితో పాటు మరో ఇద్దరు.. జడ్డూను కూడా కలిపితే టాప్-7లో మొత్తం ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవుతారు’’ అని పేర్కొన్నాడు. జట్టుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పుకొచ్చాడు. ఇషాన్ కిషన్ ఇంతకంటే చెత్త ఆలోచన మరొకటి లేదు అయితే, రవిశాస్త్రి ఐడియాపై పరోక్షంగా స్పందించిన గంభీర్.. ‘‘ఆటగాడు లెఫ్టాండరా లేదంటే రైట్ హ్యాండరా అన్న దానితో పనిలేదు. జట్టులో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండాలన్నది చెత్త ఆలోచన. జట్టులో ఎందరు లెఫ్టాండర్లు ఉండాలన్నది ముఖ్యం కాదు. ఎవరు ఎలా ఆడుతున్నారు? అతడు జట్టుకు ఉపయోగపడతాడా? అన్నదే చూడాలి. పరిస్థితులకు అనుకూలంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేవాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆటగాళ్లకు అదే ముఖ్యం ప్లేయర్లు ఫామ్లో ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. అంతేకానీ.. సరిగ్గా ఆడకపోయినా సరే లెఫ్టాండర్లకు చోటివ్వాలి కాబట్టి సెలక్ట్ చేయాలనడం తప్పు’’ అని పేర్కొన్నాడు. రవిశాస్త్రికి దిమ్మతిరిగేలా ఈ మేరకు గౌతీ కౌంటర్ ఇచ్చాడు. సహచర ఆటగాళ్ల అభినందనల నడుమ తిలక్ వర్మ కాగా ఆసియా కప్-2023 నేపథ్యంలో బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు లెఫ్టాండర్లు రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, తిలక్ వర్మకు చోటు దక్కింది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ వన్డే ఈవెంట్కు పాకిస్తాన్, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. వీళ్ల నుంచే వరల్డ్కప్నకు ఇక అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్ జట్టు జాబితా నుంచే ప్రపంచకప్నకు ఆటగాళ్లను ఎంపిక చేస్తామని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా 2011 వరల్డ్కప్ గెలిచిన జట్టులో గౌతం గంభీర్ సభ్యుడన్న విషయం తెలిసిందే! ఆసియా వన్డే కప్-2023- భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్. చదవండి: సచిన్ టెండుల్కర్కు కీలక బాధ్యతలు! ఇకపై.. వరల్డ్కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. అందుకే తిలక్ను సెలక్ట్ చేశాం.. వరల్డ్ కప్ టీమ్లో: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ -
ఆసియా కప్లో టీమిండియా ఓపెనర్గా ఇషాన్ కిషన్..?
మెగా టోర్నీలైన ఆసియా కప్, వన్డే ప్రపంచకప్లకు ముందు టీమిండియాను చాలా సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వీటిలో తుది జట్టు కూర్పు ప్రధానమైన సమస్యగా ఉంది. మరి ముఖ్యంగా ఓపెనర్ల సమస్య టీమిండియా మేనేజ్మెంట్ను ఎక్కువగా వేధిస్తుంది. రోహిత్కు జతగా ఎవరిని బరిలోకి దించాలని యాజమాన్యం పెద్దలు తలలుపట్టుక్కూర్చున్నారు. ఈ విషయమై స్టార్స్పోర్ట్స్ ఛానల్ ఎక్స్పర్ట్స్ ప్యానెల్లో డిస్కషన్ జరగ్గా ఇద్దరు భారత మాజీల మధ్య వాడివేడి చర్చ సాగింది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. రోహిత్కు జతగా ఇషాన్ కిషన్కు పంపాలని ప్రతిపాదించగా.. భారత మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ శుభ్మన్ గిల్కు వత్తాసు పలికాడు. తాజాగా విండీస్తో ముగిసిన సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసి అద్భుత ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ను ఆసియా కప్ తుది జట్టులో ఓపెనర్గా ఆడించాలని రవిశాస్త్రి వాధిస్తే.. మూడు ఫార్మాట్లలో ఫామ్ను, అలాగే కంసిస్టెన్సీని పరిగణలోకి తీసుకుని శుభ్మన్ గిల్కు ఆ స్థానంలో అవకాశం ఇవ్వాలని సందీప్ పాటిల్ సూచించాడు. శాస్త్రి లెక్క ప్రకారం లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతుందని అంటే.. రోహిత్ లెఫ్ట్ హ్యాండర్తో అంత కంఫర్టబుల్గా ఉండడని సందీప్ అన్నాడు. ఇందుకు ప్రతిగా స్పందించిన శాస్త్రి.. గిల్ను పూర్తిగా జట్టును తప్పించమని చెప్పట్లేదని, అతన్ని 3 లేదా 4 స్థానాల్లో ఆడిస్తే మంచిదని తెలిపాడు. శాస్త్రి ఈ ప్రతిపాదనను తెరపైకి తెస్తూనే ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలో ఎవరి స్థానాలు పర్మనెంట్ కాదని పరోక్షంగా కోహ్లి, రోహిత్ల బ్యాటింగ్ స్థానాలపై కామెంట్ చేశాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని డిస్కషన్ను ముగించాడు. రాహుల్, శ్రేయస్లతోనే తలనొప్పి.. కాగా, గాయాల నుంచి కోలుకుని ప్రస్తుతం ఫిట్నెస్ సాధించేందుకు బెంగళూరులోని ఎన్సీఏలో శ్రమిస్తున్న భారత స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. వీరిద్దరు ఆసియా కప్ టీమ్ సెలెక్షన్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తారా లేదా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. వీరి లేని లోటు ప్రస్తుతం భారత బ్యాటింగ్ ఆర్డర్పై స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ వీరిరువురు ఆసియాకప్ టీమ్ సెలెక్షన్ సమయానికి కూడా పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోతే జట్టు కూర్పులో కీలక మార్పులు చేయాల్సి వస్తుంది. వీరికి ప్రత్యామ్నాయంగా సెలెక్టర్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్లను పరిశీలించవచ్చు. ఒకవేళ ఇషాన్ను ఫైనల్ చేస్తే, అతన్ని ఓపెనర్గా పంపాలా లేక మిడిలార్డర్లో ఆడించాలా అన్నది మరో సమస్యగా మారుతుంది. ఈ ప్రస్తావన నేపథ్యంలోనే రవిశాస్త్రి, సందీప్ పాటిల్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. -
ఆసియా కప్లో రాహుల్ వద్దు.. తిలక్ను తీసుకోండి.. టీమిండియా మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు
గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉండి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో జరుగనున్న ఆసియా కప్లో రాహుల్ను తుది జట్టులో చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న ఆటగాడికి నేరుగా తుది జట్టులో స్థానం కల్పించాలని అనుకుంటే, అది అతని నుంచి అతిగా ఆశించినట్లవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇది చాలదన్నట్లు మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆటగాడికి వికెట్కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలనుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ అవుతుందని అన్నాడు. గాయాల నుంచి కోలుకునే ఆటగాళ్ల విషయంలో బీసీసీఐకి అంత తొందర అవసరం లేదని తెలిపాడు. ఇలా చేస్తే ఆటగాళ్ల నుంచి దీర్ఘకాల ఫలితాలు పొందలేమని, వారి కెరీర్లకు అర్ధాంతరంగా పుల్స్టాప్ పడుతుందని హెచ్చరించాడు. బుమ్రా విషయంలో ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్లే, అతను 14 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడని గుర్తు చేశాడు. రాహుల్ విషయంలో అంత తొందరేమీ లేదని, వరల్డ్కప్ సమయానికి అతను 100 శాతం ఫిట్గా ఉంటే చాలని.. ఆసియా కప్లో తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించాడు. టాప్-7లో తాను ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను చూడాలనుకుంటున్నానని, తిలక్ తుది జట్టులో ఉంటే, అది సాధ్యపడుతుందని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో జరిగిన ఓ ప్యానెల్ డిస్కషన్ సందర్భంగా శాస్త్రి ఈ మేరకు అభిప్రాయపడ్డాడు. కాగా, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆసియాకప్-2023తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. జట్టులోకి తీసుకుంటే ఈ ఇద్దరిని తప్పక బరిలోకి దించాల్సి ఉంటుంది. అందులో టీమిండియాకు రెగ్యులర్ వికెట్కీపర్ కూడా లేడు కాబట్టి, రాహుల్కు మించిన బెటర్ ఆప్షన్ కెప్టెన్కు ఉండదు. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి తన అభిప్రాయాలను వెల్లడించాడు. -
బతుకు పండుగ
లోకంలో దుఃఖం మాత్రమే ఉందా? లేదు, సంతోషం కూడా ఉంది. శత్రుత్వపు చేదు మాత్రమే ఉందా? లేదు, ఆపదలో ఆదుకునే స్నేహమాధుర్యమూ ఉంది. సమరమే కాదు, శాంతీ; సంఘర్షణే కాదు, సామరస్యమూ; భయబీభత్సాలే కాదు; కరుణారౌద్రాలూ ఉన్నాయి. ఒక్కోసారి ప్రళయ తాండవంతో భయపెట్టే ప్రకృతిలోనే, సేదదీర్చే అందాలూ, ఆహ్లాదాలూ ఉన్నాయి. కానీ ఎంత సేపూ పెద్ద పెద్ద కష్టాలనే ఊహించుకుంటూ చిన్న చిన్న సంతోషాలను విస్మరిస్తాం. జీవితాన్ని ముళ్ళకంపగా భావించుకుంటూ పక్కనే ఉన్న మల్లెపొదల గుబాళింపును గమనించలేకపోతాం. జీవించడం కోసం చేసే ప్రయత్నంలో మనసారా జీవించడాన్ని మరచిపోతాం. మన పక్కనే ఉన్న మంచినీ, మానవత్వాన్నీ గుర్తించడంలో ఎలా విఫలమవుతామో ఒక చక్కని కథలో రావిశాస్త్రి చిత్రిస్తాడు. ఆ కథలో ఇద్దరు మిత్రులుంటారు. ఒకతను ఎప్పుడూ ఏదో కష్టంలో చిక్కుకుని కుంగిపోతూ ఉంటాడు; నిరాశానిస్పృహలకు ప్రతిరూపంగా మారి జీవితంపై విరక్తుడ వుతుంటాడు. రెండో వ్యక్తి ప్రతిసారీ అతనికి చేయందించి సమస్య నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు. అలా అతను తేరుకున్న ఓ రోజున తన ఖర్చుతో సినిమాకు తీసుకెడతాడు. ఆ సినిమాలోని ప్రతి నాయకుడు నాయికానాయకులను పెడుతున్న ముప్పుతిప్పలు చూసి, లోకంలో ఎక్కడా మంచి తనం, మానవత్వమే లేవంటూ అతను భారంగా నిట్టూర్చుతాడు. పక్కనే ఉన్న మిత్రుడు అతని వైపు ఒకసారి వింతగా చూసి మనసులోనే నవ్వుకుంటాడు. ఇప్పుడు కొంత మారి ఉండచ్చు కానీ, నిన్నమొన్నటివరకు పెళ్లి అనగానే కట్నాలు, కయ్యాలు, అలకలు, మాటపట్టింపులు, మనస్పర్థలే గుర్తుకొచ్చేవి. గుండె బరువెక్కించే ఇలాంటి అలవాటు పడిన చిత్రణకు భిన్నంగా అడుగడుగునా ఆహ్లాదం నింపేలా ఎవరైనా పెళ్లి కథను నడిపిస్తే అది మండువేసవిలో హఠాత్తుగా వీచిన మలయానిలంలా అలరిస్తుంది. ‘వసుంధర’ రాసిన ‘పెళ్ళిచేసి చూడు’ అనే నవల అలాంటి ఓ అరుదైన ఆశ్చర్యం. అందులో ముగ్గురు అన్నదమ్ములు, వారి భార్యలు ఆడబడచు పెళ్లిని తలకెత్తుకుంటారు. అన్ని విషయాలూ కలసి చర్చించుకుంటారు, సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు, సమానంగా బరువు బాధ్యతలు పంచుకుంటారు, సంఘ టితంగా అడుగులు వేస్తారు. మగపెళ్ళివారి నుంచి సాధారణంగా ఎదురయ్యే సమస్యలే వస్తాయి. జయప్రదంగా పెళ్లి చేయడం ఒక్కటే లక్ష్యంగా వాటిని తెలివిగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఎలాంటి క్లిష్టపరిస్థితిలోనూ ఆందోళనకు లోనుకారు; ఒకరిపై ఒకరు లోక్తులు విసురుకుంటూ, ఒకరి నొకరు ఆటపట్టించుకుంటూ పరిసరాలను సంతోషభరితం చేసుకుంటారు. కల్యాణాన్నే కాదు, కల్యాణం చేయించిన తీరునూ కమనీయం చేస్తారు. ఈ ‘పెళ్ళిచేసిచూడు’ నమూనా పెళ్లికే కాదు; తమలో తమకున్న అన్ని విభేదాలనూ పక్కన పెట్టి పదిమందీ ఉమ్మడిగా నిర్వర్తించాల్సిన ఏ బాధ్యతకైనా వర్తిస్తుంది. ఉదాహరణకు, దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమన్న ఉమ్మడి లక్ష్యం దిశగా విజయవంతంగా నడిపించడంలో అధికారపక్షానికీ, ప్రతిపక్షాలకూ కూడా చక్కని ఒరవడి అవుతుంది. గొప్ప తాత్విక గాంభీర్యమూ, బహిరంతర్ఘర్షణా, జీవితం గురించిన చిక్కు ప్రశ్నలూ, ఒడుదొ డుకులూ ఉన్న రచనల్లోనూ, బరువైన పాత్రల సరసనే, వాతావరణాన్ని తేలిక చేసి ఉల్లాసపరిచే పాత్రలూ కనిపిస్తూ ఉంటాయి. అవి జీవితం తాలూకు అన్ని పార్శ్వాలనూ స్పృశించే రచయిత దృష్టివైశాల్యాన్ని పట్టి చూపుతాయి. బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ నవలలోని జగన్నాథం అలాంటి పాత్ర. సమస్యలకు అతీతంగా, దేనిమీదా ఎలాంటి ఫిర్యాదూ లేకుండా, సరదాగా, స్నేహంగా, హాస్యంగా ప్రవర్తించే జగన్నాథం చిన్నపాత్రే అయినా నాయకుడు దయానిధితో సమా నంగా గుర్తుండిపోతాడు. గమనించే చూపే ఉండాలి కానీ, అలాంటి వ్యక్తులు మన నిజజీవితంలోనూ మన చుట్టుపక్కల తారసపడుతూనే ఉంటారు. తను రచయితా, గొప్ప చదువరీ కాక పోయినా ప్రతి సాహిత్యసమావేశంలోనూ, రచయితల గోష్ఠుల్లోనూ విలక్షణమైన వాక్చాతుర్యంతో తన ఉనికిని ప్రముఖంగా చాటుకునే సంకు పాపారావు అనే రావిశాస్త్రి మిత్రుని గురించి వైజాగ్ లోనూ, బయటా కూడా సాహితీ ప్రముఖులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. తమ ఉజ్జ్వల వ్యక్తిత్వంతో శత్రుమిత్రుల తేడా లేకుండా అందరి మధ్యా సమానంగా తళుకులీనే పాత్రలూ ఆ యా విశిష్ట రచనల్లో కనిపిస్తాయి. అమెరికా అంతర్యుద్ధం నేపథ్యంగా మార్గరెట్ మిచెల్ రచించిన ‘గాన్ విత్ ద విండ్’ నవలలోని మెలనీ పాత్ర అలాంటిది. చాలా అర్భకంగా, అమాయకంగా ఉండే మెలనీ, ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియని తన ఉదాత్త వ్యక్తిత్వంతో ఆ నవలలోని ఇతర ప్రధాన స్త్రీ, పురుషపాత్రలను మించి ఎంతో ఎత్తుకు ఎదిగిపోతుంది. అభద్రత, అల్లకల్లోలం, ఉద్రిక్తత, స్థానభ్రంశం, లేమి నిండిన ఆ యుద్ధ వాతావరణం వజ్రం లాంటి ఆమె వ్యక్తిత్వానికి మరింత సానపట్టి కొత్త కాంతుల్ని ఆవిష్కరింపజేస్తుంది. యుద్ధం వరకే శత్రుత్వమని చెప్పి స్వపక్షంతో ఒంటరి పోరాటం చేసి, శత్రు సైనికుల సమాధుల వద్ద కూడా మెలనీ పుష్ప గుచ్ఛాలు ఉంచి వస్తుంది. ఇలాంటి పాత్రలూ, వ్యక్తులూ ప్రపంచాన్ని మరింత ఆశావహంగానూ, వాసయోగ్యం గానూ రూపిస్తారు. బతుక్కి ఓ అర్థాన్ని, పరమార్థాన్ని సంతరిస్తారు. ప్రేమనూ, స్నేహాన్నీ ఇచ్చి పుచ్చుకుని జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోడానికి స్ఫూర్తినిస్తారు. మిట్టపల్లాల చీకటిదారిలో దీపస్తంభాలవుతారు. -
బుమ్రాను ఆడిస్తే, మీకు పాకిస్తానుకు తేడా లేదు
-
వరల్డ్కప్ కోసం తొందరపడ్డారో అతను మరో నాలుగు నెలలు ఇంటి దగ్గరే కూర్చోవాల్సి వస్తుంది..!
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను వన్డే వరల్డ్కప్ సమయానికంతా సిద్ధంగా ఉంచాలన్న విషయంలో బీసీసీఐ ప్రణాళిలను మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఐర్లాండ్ సిరీస్ కోసమని తొందరపడి బుమ్రాను టీమిండియాకు ఎంపిక చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. వరల్డ్కప్ జరుగనున్న ఏడాదిలో బుమ్రాను హడావుడిగా జాతీయ జట్టులోకి తీసుకురావడం మానుకోవాలని సూచించాడు. ప్రిపరేషన్లో భాగమని బుమ్రాను ఐర్లాండ్ సిరీస్ బరిలోకి దించితే.. అతను మరో నాలుగు నెలల పాటు ఇంటి దగ్గరే కూర్చోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. ఈ సమయంలో బుమ్రా మరోసారి గాయం బారిన పడితే టీమిండియాకు తీవ్రనష్టం జరుగుతుందని, అందుకే బీసీసీఐ తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలని అన్నాడు. పాకిస్తాన్ స్పీడ్స్టర్ షాహీన్ అఫ్రిది విషయంలో పీసీబీ సైతం ఇలాగే తొందరపడిందని, దాని కారణంగా అతను చాలాకాలం పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉండటాన్ని మనం చూశామని చెప్పుకొచ్చాడు. పేసర్ల విషయంలో మేనేజ్మెంట్ ఆచితూచి అడుగులు వేస్తేనే బాగుంటుందని, ఈ విషయంలో నిర్ణయాలు మిస్ ఫైర్ అయితే అవి జట్టును దారుణంగా దెబ్బకొడతాయని తెలిపాడు. కాగా, వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా ఆగస్టులో ఐర్లాండ్తో జరుగనున్న సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి పై పేర్కొన్న కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే, జాతీయ సెలెక్టర్లు కొద్దిరోజుల కిందటే వెస్టిండీస్ పర్యటన నిమిత్తమం టీమిండియాను ప్రకటించారు. విండీస్ పర్యటనలో టెస్ట్, వన్డేల కోసం వేర్వేరు జట్లను ఎంపిక చేశారు. జులై 12 నుంచి ప్రారంభంకానున్న విండీస్ టూర్లో తొలుత టెస్ట్లు, అనంతరం వన్డే, టీ20 సిరీస్లు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. విండీస్తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. -
కనీసం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు.. యశస్వి, తిలక్ వర్మ..!
ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే వరల్డ్కప్లో టీమిండియా ఎలా ఉండాలనే దానిపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాప్-6లో కనీసం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను చూడాలనుకుంటున్నానని అన్నాడు. టీమిండియాలో సీనియర్లను (రైట్ హ్యాండ్) రీప్లేస్ చేసేంత లెఫ్ట్ హ్యాండ్ టాలెంట్ మన వద్ద ఉందని, ఇప్పటి నుంచే వారిలో కొందరిని సాన పెడితే ప్రపంచకప్ సమయానికంతా మెరికల్లా తయారవుతారని తెలిపాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్తో జట్టు సమతూకంగా మారుతుందని, వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీలో ఈ ఈక్వేషన్ ఫాలో అవ్వకపోతే టీమిండియాకు చాలా నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్లే కానక్కర్లేదు.. వన్డే వరల్డ్కప్లో భారత జట్టు బ్యాటింగ్ టాపార్డర్లో కనీసం ఇద్దరు లెఫ్ట్ బ్యాటర్లను చూడాలనుకుంటానన్న రవిశాస్త్రి.. ఆ ఇద్దరూ ఓపెనర్లే కానక్కర్లేదని తెలిపాడు. టాప్-4లో ఒకరు, టాప్-6లో ఇద్దరు అయితే జట్టు సమతూకంగా మారి, ప్రత్యర్ధి బౌలర్లకు ఇబ్బంది అవుతుందని అభిప్రాయపడ్డాడు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్.. యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లని.. ఐపీఎల్లో వారిదివరకే ప్రూవ్ చేసుకున్నారని, వీరికి సీనియర్ల స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వీరే కాక నేహల్ వధేరా, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లు కూడా లైన్లో ఉన్నారని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీరిని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తే టీమిండియా బెంచ్ స్ట్రెంగ్త్ పటిష్టంగా ఉంటుందని అన్నాడు. -
కొలీగ్స్ మాత్రమే అన్న అశ్విన్! రవిశాస్త్రి స్పందన మామూలుగా లేదు! నాకైతే..
Ravi Shastri- Ashwin: టీమిండియా డ్రెసింగ్ రూం వాతావరణం గురించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. కొలీగ్సే ఒక్కోసారి ప్రాణ స్నేహితుల్లా మారతారని.. అయినా ఒకరి జీవితంలో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారని ప్రశ్నించాడు. కాగా అనూహ్య రీతిలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023 తుది జట్టులో అశూకు అవకాశం ఇవ్వలేదు మేనేజ్మెంట్. విదేశీ గడ్డ మీద అశూకు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వైపే మొగ్గు చూపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుకావడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పుడు స్నేహితులు.. ఇప్పుడు కొలీగ్స్ ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం అశ్విన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా మెదిలేవారని.. ఇప్పుడు మాత్రం కేవలం కొలీగ్స్లా ఉంటున్నారని వ్యాఖ్యానించాడు. సహచర ఆటగాళ్లతో మాట్లాడే తీరిక ఎవరికీ ఉండటం లేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో ది వీక్తో మాట్లాడిన టీమిండియా మాజీ హెడ్కోచ్, అశ్విన్తో కలిసి పనిచేసిన రవిశాస్త్రిని అశ్విన్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో.. ‘‘నాకైతే ఎల్లప్పుడూ కొలీగ్స్ మాత్రమే ఉండేవారు. నిజానికి మన స్నేహితులే కొలీగ్స్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అయినా ఒక వ్యక్తికి ఎంత మంది బెస్టీస్ ఉంటారు? 4-5 మంది అంతేకదా! వాళ్లతో నేను సంతోషంగా ఉన్నా నాకైతే ఐదుగురు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్లతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతకు మించి నాకేమీ అవసరం లేదు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే.. కొలీగ్స్ స్నేహితులు కావొచ్చు. కాకపోవనూవచ్చు. ప్రస్తుతం నాకైతే కామెంటరీ బాక్స్లో చాలా మంది కొలీగ్స్ ఉన్నారు’’ అంటూ సరదాగా బదులిచ్చాడు. కాగా 2021లో హెడ్కోచ్ పదవి నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. తిరిగి కామెంట్రీ మొదలుపెట్టాడు. ఇటీవల ఇంగ్లండ్లో టీమిండియా- ఆసీస్ మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ కామెంటేటర్గా వ్యవహరించాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో అశూకు అవకాశం ఇవ్వని మేనేజ్మెంట్.. జూలై 12 నుంచి మొదలుకానున్న వెస్టిండీస్తో టెస్టు సిరీస్ జట్టుకు ఎంపిక చేసింది. విండీస్తో రెండు మ్యాచ్ల సిరీస్లో అశ్విన్ భాగం కానున్నాడు. చదవండి: లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్పై అశ్విన్ విసుర్లు! -
WTC Final: టీమిండియాతో జాగ్రత్త.. ఒక్క సెషన్ చాలు..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ అని విశ్లేషకులంతా ముక్తకంఠంతో వాదిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్తో సరిసమానమైన విజయావకాశాలు టీమిండియాకు కూడా ఉన్నాయని ఆయన బలంగా వాదిస్తున్నాడు. అందరూ అనుకుంటున్నట్లుగా ఆసీస్ విజయం సాధించేందుకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతున్నది ఆస్ట్రేలియాలో కాదని, ఈ మ్యాచ్ జరుగుతున్నది ఇంగ్లండ్లో అన్న విషయాన్ని విశ్లేషకులు గమనించాలని గుర్తు చేశాడు. ఓవల్ లాంటి మైదానంలో టీమిండియాతో పోలిస్తే ఆసీసే ఎక్కువ జాగ్రత్త వహించాలని, అంచనాలు తప్పేందుకు ఒక్క సెషన్ ఆట చాలని హెచ్చరించాడు. టీమిండియాతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. గత పదేళ్ల కాలంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడంపై శాస్త్రి స్పందిస్తూ.. ఈ మధ్య కాలంలో టీమిండియా అద్భుతమైన క్రికెట్ ఆడిన్నప్పటికీ, చాలా సందర్భాల్లో లక్ కలిసి రాలేదని, ఐసీసీ ట్రోఫీ సాధించాలంటే మంచి క్రికెట్తో పాటు కాస్త లక్ కూడా ఉండాలని అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో ప్రస్తుత టీమిండియా చాలా పటిష్టమైందని, ఈ జట్టుకు ఐసీసీ ట్రోఫీ గెలిచే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. కాగా, రవిశాస్త్రి హెడ్ కోచ్గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ను న్యూజిలాండ్కు కోల్పోయింది. సౌథాంప్టన్ వేదికగా జరిగిన నాటి ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: 93 ఏళ్ల కిందటి బ్రాడ్మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ -
కేఎస్ భరతా.. ఇషాన్ కిషనా..? డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్కీపర్ ఎవరు..?
జూన్ 7న ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరనే అంశంపై ఇప్పటి నుంచి డిబేట్లు మొదలయ్యాయి. కేఎస్ భరతా లేక ఇషాన్ కిషనా అన్న విషయంపై బెట్టింగ్లు సైతం జరుగుతున్నాయి. టీమిండియా యాజమాన్యం.. కాస్తో కూస్తో అనుభవం (4 టెస్ట్లు) ఉన్న కేఎస్ భరత్వైపు మొగ్గు చూపుతుందా లేక ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయని ఇషాన్ కిషన్కు అవకాశం ఇస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వికెట్కీపింగ్ వరకు పర్వాలేదని ఇదివరకే నిరూపించుకున్న భరత్ను తుది జట్టులో ఆడిస్తారా లేక వన్డేల్లోనే డబుల్ సెంచరీ (గతేడాది బంగ్లాదేశ్పై) సాధించిన ఇషాన్ కిషన్కు తొలి అవకాశం ఇస్తారా అనే అంశంపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ అంశంపై ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెబుతుండగా.. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం తన మనసులో మాటను బయటపెట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 మొత్తం ఆడిన భరత్కే డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కుతుందని జోస్యం చెప్పాడు. అదనపు బ్యాటర్ కావాలనిపించినా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉంటే మంచిదనిపించినా ఇషాన్ కిషన్కు అవకాశం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. ఆఖరి నిమిషంలో సమీకరణలు ఎలా ఉన్నా తన ఫస్ట్ ఛాయిస్ మాత్రం కేఎస్ భరతేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. చదవండి: చెన్నైని ‘ఢీ’కొట్టేదెవరు? -
గుజరాత్లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: మహ్మద్ షమీ
IPL 2023 GT Vs SRH- Mohammed Shami: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్బౌలర్ మహ్మద్ షమీ. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రైజర్స్ ఓపెనర్ అన్మోల్ప్రీత్ సింగ్(5), కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్(10), రాహుల్ త్రిపాఠి (1), హెన్రిచ్ క్లాసెన్ (64) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పర్పుల్ క్యాప్ అందుకున్న షమీ టాపార్డర్ను కకావికలం చేసిన షమీ.. ఈ మ్యాచ్లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి మొత్తంగా 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. తద్వారా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ప్లే ఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్లో అద్బుత ప్రదర్శనతో అదరగొట్టిన షమీ.. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో 23 వికెట్లు తీసిన ఈ టీమిండియా పేసర్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం షమీ.. కామెంటేటర్ రవిశాస్త్రితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. నువ్వేం తింటావు? గుజరాత్లో ఉన్నాను కదా! నువ్వేమి తింటావు? షమీ అంటూ రవిశాస్త్రి షమీని అడుగగా.. ‘‘గుజరాత్లో ఉన్నాను కదా! నాకు ఏది ఇష్టమో అది తినలేకపోతున్నా!’’ అని సరదాగా బదులిచ్చాడు. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుకున్నారు. కాగా షమీకి బిర్యానీ అంటే ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లో తన ఫేవరెట్ బిర్యానీని మిస్ అవుతున్నానంటూ షమీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఇక తన బౌలింగ్ గురించి చెబుతూ.. ‘‘సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌల్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా బలం అదే! కొత్త బంతిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుంటా. వాళ్లు సైతం నేటి మ్యాచ్లో మిడిల్ ఓవర్లలో మోహిత్ శర్మ అద్భుతం చేశాడు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కూడా తమ వంతు పాత్ర పోషించారు’’ అని మహ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. కాగా సన్రైజర్స్తో మ్యాచ్లో శుబ్మన్ గిల్ సెంచరీ సాధించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. షమీ, మోహిత్ శర్మ నాలుగేసి వికెట్లతో చెలరేగగా.. యశ్ దయాల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. టైటాన్స్ బౌలర్ల విజృంభణతో 154 పరుగులకే పరిమితమైన సన్రైజర్స్ ఓటమిపాలై ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చదవండి: గెలుపు జోష్లో ఉన్న గుజరాత్కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! ఆరోజు నైట్ పార్టీకెళ్లా.. ఔటయ్యా..! అప్పటి నుంచి: విరాట్ కోహ్లి .@MdShami11 with the new ball is a MOOD 🔥🔥 #TATAIPL | #GTvSRH | @gujarat_titans Relive his lethal start with the ball here 🎥🔽 pic.twitter.com/2Na7SBcDu8 — IndianPremierLeague (@IPL) May 15, 2023 -
ఈ టీ20ల నుంచి రోహిత్ అవుట్...? ఫుల్ టైం కెప్టెన్గా హార్దిక్
-
హార్దిక్ పాండ్యా విషయంలో రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్స్గా నిలిపి కెప్టెన్గా పేరు సంపాదించిన హార్దిక్ అదే టెంపోను ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్లోనూ వరుస విజయాలతో గుజరాత్ను పాయింట్ల పట్టికలో మరోసారి టాప్లో ఉంచాడు. మరి పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ కొడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ జట్టుకు దూరమైనప్పుడల్లా పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరిస్తూ తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో హార్దిక్ కెప్టెన్సీలో టీమిండియా దూసుకెళ్తోంది. గతేడాది టి20 వరల్డ్ కప్ సెమీస్లో భారత్ పరాజయం చెందినప్పటి నుంచి హార్దిక్ పొట్టి ఫార్మాట్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టి20లకు హార్దిక్ను రెగ్యులర్ కెప్టెన్ చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. "హార్దిక్ పాండ్యా ఇప్పటికే టి20ల్లో భారత స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఫిట్గా ఉన్నంత కాలం అతడే కెప్టెన్గా కొనసాగాలి. సెలక్టర్లు కూడా ఇదే విషయం ఆలోచిస్తున్నారనుకుంటా. ప్రస్తుతం యువకుల్లో చాల మంది ప్రతిభావంతులున్నారు. కాబట్టి కొత్త జట్టును తీసుకురావచ్చు. ఐపీఎల్లో సత్తా చాటుతున్న యువ ప్రతిభావంతులను చూస్తున్నారు. కాబట్టి బీసీసీఐ 2007లో అనుసరించిన మార్గంలోనే వెళ్తుందని అనుకుంటున్నా. అప్పుడు కూడా యువకులకు అవకాశం కల్పించారు. పాండ్యా ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడి ఐడియాలు విభిన్నంగా ఉంటాయి. ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరిస్తూ ఇతర ఆటగాళ్లను కూడా గమనిస్తున్నాడు. "అక్టోబరు-నవంబరులో జరగనున్న ఐసీసీ ఈవెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో అతడు టెస్టు జట్టులో లేనందుకు అతడిపై ఎలాంటి వర్క్ లోడ్ ఉండదు. ఈ రోజుల్లో ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడట్లేదు. టెస్టు సిరీస్ సమయంలో అతడికి ఓ నెల విశ్రాంతి దొరుకుతుంది" అని పేర్కొన్నాడు. చదవండి: సిక్సర్ల విషయంలో రోహిత్ అరుదైన రికార్డు -
చావు చిల్లర
రావిశాస్త్రి ‘కార్నర్ సీట్’ కథ సుప్రసిద్ధం. అందులో ఒకతను రైలు ప్రయాణం చేయబోయి కంపార్ట్మెంట్లోని కార్నర్ సీట్ ఆశిస్తాడు. కూచునే లోపల ఒక ఆకుపచ్చకోటు వాడు ఆ సీటును ఆక్రమిస్తాడు. అప్పట్నించి ఇతను ఆ ఆకుపచ్చకోటు వాణ్ణి తిట్టుకుంటూనే ఉంటాడు. ఆ ఆకుపచ్చకోటు వాడు ఇదంతా పట్టకుండా ఎటో చూస్తుంటాడు. ఏదో ఆలోచిస్తుంటాడు. మధ్యలో ఒకచోట రైలు ఆగుతుంది. తిరిగి బయలుదేరబోతుంటుంది. ఒక్క క్షణం. ఆకుపచ్చకోటు వాడు ఒక్క ఉదుటున కంపార్ట్మెంట్ దిగేస్తాడు. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ముక్కలైపోతాడు. రెప్పపాటు. అంతవరకూ అతణ్ణి తిట్టుకున్న ఇతను నిశ్చేష్టుడవుతాడు. అతనికీ ఇతనికీ ఏ సంబంధమూ లేదు– కార్నర్ సీటుతో తప్ప. కాని ఇతనికి ఏడుపు వస్తుంది. దుఃఖం కలుగుతుంది. ఈ లోకంలో ఎంతో ఎండా నీడా గాలి నీరూ వర్షం ఉన్నాయి. వాటిని అనుభవించకుండా ఏదో ఒక సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసి ఊరట చెందకుండా ఏ కష్టానికి ఎందుకు చనిపోయాడో అని వెక్కివెక్కి ఏడుస్తాడు. ఎదుటివాడి చావు పట్ల మనకు ఉండాల్సిన వేదన, సహానుభూతి గురించి రావిశాస్త్రి రాసిన గొప్ప కథ అది. ఆర్.కె.నారాయణ్ ‘మిస్సింగ్ మెయిల్’ కథ కూడా సుప్రసిద్ధమే. వినాయక్ మొదలి వీధిలో ఇంటింటికీ ఉత్తరాలు అందించే పోస్ట్మేన్ తానప్పకు ఆ వీధిలోని అందరి కష్టసుఖాలు తెలుసు. రామానుజమ్ గారి కుమార్తె కామాక్షికి చాలా రోజులుగా సంబంధాలు కుదరడం లేదని తెలుసు. ఇప్పుడు కుదిరిన ఢిల్లీ సంబంధం ఈ ముహూర్తం దాటితే తిరిగి మూడేళ్ల వరకు అబ్బాయికి వీలు కాదనీ తెలుసు. రామానుజమ్ ఇంట్లో ఒకవైపు పెళ్లి పనులు జరుగుతుండగా మరోవైపు తానప్పకు టెలిగ్రామ్, ఉత్తరం అందుతాయి. వాటిలో రామానుజమ్ మేనమామ మరణవార్త ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఈ కబురు రామానుజమ్కు తెలిస్తే వెంటనే బయల్దేరాలి. పెళ్లి ఆగిపోవాలి. మళ్లీ మూడేళ్ల వరకూ పోస్ట్పోన్ చేయాలి. అందుకే తానప్ప ఆ టెలిగ్రామ్, ఉత్తరం దాచి పెడతాడు. పెళ్లయ్యి అమ్మాయిని సాగనంపాక మెల్లగా ఆ సంగతి తెలియచేస్తాడు. మరణవార్త ఎప్పుడు, ఎలా చెప్పాలో తెలిసి సంస్కారం పాటించిన తానప్పను పాఠకుడు గుండెల్లో పెట్టుకుంటాడు. చావును గౌరవించడం ప్రతి నాగరికతలో ఉంది. చనిపోయిన వ్యక్తికి ‘అంతిమ సంస్కారం’ నిర్వహించడం సాటి మనిషి సంస్కారం. జననంతో మొదలయ్యే మనిషి జీవనవృత్తం మరణంతో ముగుస్తుందని అందరికీ తెలిసినా మరణం తెచ్చే శూన్యం, వెలితి ఆ కుటుంబానికి, సంబంధీకులకు, స్నేహితులకు చాలా తీవ్రమైనవిగా జనులు భావిస్తారు. అందుకే నిన్న మొన్నటి వరకూ పల్లెల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఎత్తుబడి అయ్యేంత వరకూ ఊరు ఊరంతా పొయ్యి ముట్టించేది కాదు. చావుఇంటి దగ్గర చేరి ధైర్యం చెప్పడం, జరగవలసిన పనులు చూడటం చేసేవారు. మనిషి చనిపోవడం అంటే ‘కూకటి వేళ్లతో సహా చెట్టు కూలిపోవడం’గా గాథా సప్తశతి వ్యాఖ్యానిస్తుంది. చెట్టు ఆధారంగా ఎంత జీవం పెనవేసుకుని ఉంటుందో మనిషి ఆధారంగా కూడా అనేక జీవనాలు పెనవేసుకుని ఉంటాయి. ఇప్పటికీ కొన్ని గిరిజన సముదాయాలైతే తమ సమూహంలోని ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే ఆ ఆవాసాన్ని, గూడేన్ని ఏకంగా ఖాళీ చేసి వెళ్లిపోతాయి జ్ఞాపకాలను తట్టుకోలేక. అందుకే మనిషి పోయినప్పుడు పోయిన వ్యక్తిని గౌరవించడంతో పాటు అతని చుట్టూ ఉన్న వ్యక్తుల వేదనను కూడా గౌరవించి మెలగాలి. ఈ దేశం విన్న అత్యంత విషాదకరమైన మరణవార్త గాంధీ గారి హత్య. రేడియోలో ఈ వార్త విన్న ఒక బాలిక పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి ‘అమ్మా... గాంధీ గారు చనిపోయారట’ అంటే ఆ తల్లి ఉలిక్కిపడి లేచి కూతురి చెంప మీద లాగి పెట్టి ఒక్కటి వేస్తుంది– ‘ఏమిటా పాడు మాటలు’ అని! ఆ తర్వాత ఆ వార్త నిజం అని తెలిసి కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. ఇంద్రగంటి జానకీబాల ‘కనిపించే గతం’ నవల ఈ సంఘటనతోనే మొదలవుతుంది. గాంధీ గారి మరణవార్త విని ఎక్కడికక్కడ కూలబడి విలపించినవాళ్లు, సినిమా హాళ్లలో సగం నుంచి లేచి ఏడ్చుకుంటూ బయటపడినవాళ్ళు, మూడు రోజులు లంకణం చేసినవారు ఎందరో ఉన్నారు. మహనీయులు, కళాకారులు, నాయకులు, ఆపద్బాంధవులు... జనులతో మమేకమై ఉంటారు. అందువల్ల వారి మరణ వార్తల పట్ల ఇంకా గౌరవం పాటించాలి. నిర్థారణలు చేసుకోవాలి. అప్పుడే చెప్పాలి. కాని ఇవాళ ఒక వికృతమైన సంస్కృతి ఎల్లెడలా కనిపిస్తూ ఉంది. దానిని పైశాచిక సంస్కృతి అనవచ్చు. చిల్లర సంస్కృతి అనవచ్చు. సోషల్ మీడియా సంస్కృతి అని కూడా అనవచ్చు. వ్యక్తుల చావు వార్తలను సత్యాసత్యాలతో సంబంధం లేకుండా పుకార్ల స్థాయికి దిగజార్చడం. బతికున్నవారిని చంపడం. వైద్యం తీసుకుంటూ పోరాడుతున్నవారికి చావు ముహూర్తం లిఖించడం. దీనికి హతాశులైన ఆ సజీవులు తామే ముందుకొచ్చి ‘బతికున్నాం మొర్రో’ అని చెప్పడం. బంధువులు దిగ్భ్రాంతితో ‘అవన్నీ అబద్ధాలు’ అని చెప్పాల్సి రావడం. జవాబుదారీతనం లేని వ్యవస్థ డ్రైనేజీలాంటిది. ఆ డ్రైనేజీతో మనకెందుకు అని నలుగురూ ఊరుకోవడం వల్లే అందులో కంపుతోపాటు ఇంపు కూడా కొట్టుకొనిపోవాల్సి వస్తోంది. ఫేక్ఐడిలు, ఆనవాలు లేని వాట్సప్లతో తప్పుడు చావువార్తలు వ్యాప్తి చేసి సైకిక్ స్టిమ్యులేషన్ పొందుతున్న వారు ఎంతటి మానసిక రోగులో అనుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వాళ్లు మన ఇళ్లలో కూడా ఉండొచ్చు. చావును గౌరవిద్దాం. చావుపై చిల్లర ఏరుకునే వ్యవస్థను చావగొడదాం. -
గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ..
IPL 2023 RCB Vs DC: ఐపీఎల్-2023 సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్కు అస్సలు కలిసి రావడం లేదు. క్యాష్ రిచ్ లీగ్ పదహారో సీజన్ ఆరంభానికి ముందే ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో పగ్గాలు చేపట్టిన డేవిడ్ వార్నర్ బ్యాటర్గా పర్వాలేదనిపిస్తున్నా.. సారథిగా మాత్రం విజయవంతం కాలేకపోతున్నాడు. ఐదో‘సారీ’ వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓటమి పాలైన ఢిల్లీ.. బెంగళూరులో ఆర్సీబీతో శనివారం నాటి మ్యాచ్లోనూ పాత కథే పునరావృతం చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ బృందం చేతిలో 23 పరుగుల తేడాతో పరాజయం పాలై తమ ఓటముల సంఖ్యను ఐదుకు పెంచుకుంది. ఈ ఎడిషన్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా నమోదు చేయకుండా పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. స్థాయి మరింత పెరిగిందేమో! కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఢిల్లీ హెడ్కోచ్గా ఉండగా.. భారత మాజీ స్టార్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఆర్సీబీతో ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి గంగూలీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఢిల్లీ ఓటమికి చేరువవుతున్న తరుణంలో కామెంట్రీ చేస్తూ.. ‘‘బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ఈ పదవితో తన స్థాయి మరింత పెరిగింది అనుకుంటున్నాడేమో!’’ అని వ్యాఖ్యానించాడు. డైరెక్టర్ పదవి పేరుకే పెద్దది కానీ.. అధికారం ప్రదర్శించే వీలు ఉండదన్న అర్థంలో సెటైర్ వేశాడు. శుభ పరిణామం కాదు అదే విధంగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వరుస ఓటములకు కారణాలు విశ్లేషించుకోవాలని.. పాంటింగ్, వార్నర్వంటి దిగ్గజాలు ఉన్నా ఒక్క విజయం కూడా సాధించకపోవడం ఏమిటని రవిశాస్త్రి ప్రశ్నించాడు. స్వల్ప తేడాతో ఓడినా పర్వాలేదని.. కానీ కనీస పోరాటం లేకుండా ప్రత్యర్థి చేతిలో చిత్తు కావడం మంచి పరిణామం కాదని విమర్శించాడు. భలే చెప్పావు రవి భాయ్! ఇదిలా ఉంటే.. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా కోహ్లి మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గంగూలీ వైపు సీరియస్గా చూసిన దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలు కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ‘‘భలే చెప్పావు రవి భాయ్. కోహ్లిని అవమానకరరీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన దాదాకు ఇప్పుడు పెద్ద పదవే దక్కింది. దానితో పాటే గౌరవం కూడా’’ అంటూ కింగ్ కోహ్లి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లి, రవిశాస్త్రిల మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: 38 సార్లు అరెస్ట్! జైలర్ చొరవతో ఇలా! వివాహేతర సంబంధాలు.. ఈ ‘హీరో’ విలన్ కూడా! IPL 2023: మా ఓటమికి కారణం అదే..! అవునా.. ఓర్వలేకే చెత్త కామెంట్లు! Back to winning ways 🙌@RCBTweets register a 23-run win at home and clinch their second win of the season 👏👏 Scorecard ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/5lE5gWQm8H — IndianPremierLeague (@IPL) April 15, 2023 -
'కోచ్గా ఉన్నప్పుడు'.. రవిశాస్త్రిపై రోహిత్ శర్మ ఆగ్రహం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ క్రికెటర్ రవిశాస్త్రిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓవర్ కాన్ఫిడెన్స్ టీమిండియా కొంప ముంచిందంటూ రవిశాస్త్రి కామెంటేటరీ బాక్స్ నుంచి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మకు ఆగ్రహం తెప్పించింది. అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టుకు సిద్ధమవుతున్న వేళ మీడియాతో మాట్లాడిన రోహిత్ పరోక్షంగా రవిశాస్త్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ''నిజాయితీగా చెప్పాలంటే మేం రెండు మ్యాచ్లు గెలిచాం. బయటి వ్యక్తులేమో అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. వాస్తవానికి ఆ వ్యాఖ్యలు చాలా చెత్తగా ఉన్నాయి. ఎందుకంటే ఆడే ప్రతీ మ్యాచ్లోనూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నిస్తాం. రెండు మ్యాచ్లు గెలవడం ద్వారా అంతా అయిపోలేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించుకుంటే మంచిది. ఒకప్పుడు ఆయన కూడా ఆరేళ్ల పాటు జట్టుకు కోచ్గా ఉన్నారు. మరి అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడా కనిపించలేదా?. అయినా బయట ఉండే వ్యక్తులకు డ్రెస్సింగ్ రూమ్లో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి. అందుకే బయటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోము. నిజానికి మాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. కనికరం లేకుండా ప్రత్యర్థి జట్లకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ఆడాలనే మైండ్సెట్లో ఉండడం జరుగుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. గెలవగానే మెచ్చుకునే నోర్లు ఒక్క మ్యాచ్ ఓడిపోగానే విమర్శలు చేస్తుంటాయి. ఇవన్నీ పట్టించుకునే సమయం లేదు.. మ్యాచ్పై దృష్టి సారించాలి'' అంటూ పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి(గురువారం) జరగనున్న నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ ఓడినా.. డ్రా చేసుకున్న ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియగా.. తొలి రెండు టీమిండియా గెలవగా.. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. చదవండి: సర్జరీ విజయవంతం.. బుమ్రా రీఎంట్రీ అప్పుడే! Rahul Dravid: డబ్ల్యూటీసీ వల్లే ఇదంతా.. -
IND VS AUS 3rd Test: ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణమా..?
Matthew Hayden: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో పర్యాటక ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, ఊహకందని విధంగా మెలికలు తిరుగుతూ, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న హోల్కర్ మైదానం పిచ్పై ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ జరుగుతుండగానే లైవ్లో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణంగా టర్న్ అవుతుందని ధ్వజమెత్తాడు. ఈ పిచ్ జనరేట్ చేస్తున్న టర్న్ చూస్తే భయమేస్తుందని అన్న హేడెన్.. స్పిన్నింగ్ కండీషన్స్ను తూర్పారబెట్టాడు. టెస్ట్ క్రికెట్లో తొలి రోజు ఆరో ఓవర్లోనే స్పిన్ బౌలర్ తన ప్రతాపం చూపితే.. మ్యాచ్ ఎన్ని గంటల పాటు సాగుతుందని ప్రశ్నించాడు. ఇలాంటి పిచ్లకు తన మద్దతు ఎప్పుడూ ఉండదని అసహనం వ్యక్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్లకు పిచ్లను తొలి రెండు రోజులు బ్యాటర్లకు అనుకూలించేలా తయారు చేయాలని సూచించాడు. తొలి రోజు భారత బ్యాటింగ్ సందర్భంగా కామెంటరీ బాక్స్లో ఉన్న హేడెన్ ఈ వ్యాఖ్యలు చేయగా.. పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి రెండే రెండు ముక్కల్లో "హోమ్ కండీషన్స్" అంటూ హేడెన్ కామెంట్స్ను బదులిచ్చాడు. కొద్ది సేపు ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయని శాస్త్రి.. ఆతర్వాత మైక్ పట్టుకుని, ఇది హోమ్ కండీషన్స్ కంటే చాలా అధికంగా ఉందని, మున్ముందు మ్యాచ్ మరింత టఫ్గా మారుతుందని జోస్యం చెప్పాడు. అయితే ఒక్క మంచి భాగస్వామ్యం మ్యాచ్ను మలుపు తిప్పుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, 4 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్ల్లో టీమిండియా రెండింటిలోనూ విజయాలు సాధించి సిరీస్లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో కూడా ఎలాగైనా గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉండిన రోహిత్ సేనకు తొలి రోజు పిచ్ వ్యవహరించిన తీరు మింగుడుపడని విషయంగా మారింది. -
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు! అవునంటూ ఆసీస్ దిగ్గజానికి రవిశాస్త్రి కౌంటర్
Ind Vs Aus 3rd Test Indore Day 1: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బుధవారం (మార్చి 1) ఆరంభమైన మూడో టెస్టులో ఆది నుంచే బంతి స్పిన్కు టర్న్ అవుతోంది. ఇండోర్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన లంచ్ సమయానికి 84 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్లో బౌలింగ్ అటాక్ ఆరంభించిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్.. కెప్టెన్ రోహిత్ శర్మ(12) వికెట్తో ఖాతా తెరిచాడు. చెలరేగిన ఆసీస్ స్పిన్నర్లు తర్వాతి రెండో ఓవర్లో మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(21)ను అవుట్ చేశాడు. తర్వాత వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ రంగంలోకి దిగి ఛతేశ్వర్ పుజారా(1), రవీంద్ర జడేజా(4) వికెట్లు కూల్చగా.. కుహ్నెమన్ శ్రేయస్ అయ్యర్(0)ను డకౌట్ చేశాడు. వీరికి తోడు మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీ విరాట్ కోహ్లి(22)ని ఎల్బీడబ్ల్యూ చేసి బ్రేక్ ఇచ్చాడు. తర్వాత లియోన్ శ్రీకర్ భరత్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగవు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఇండోర్ పిచ్ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో కామెంట్రీలో భాగంగా.. ‘‘ప్రపంచంలో ఎక్కడా కూడా టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో స్పిన్నర్ ఆరో ఓవర్లో బౌలింగ్కు రానేరాడు. ప్రస్తుతం ఇంత జరుగుతున్న భారత శిబిరంలో మరీ అంత చిరాకు లేకపోవడానికి కారణం వాళ్లు తొలి రెండు టెస్టుల్లో గెలవడమే! కానీ ఇక్కడ బంతి ఎలా టర్న్ అవుతోందో చూడండి. అందుకే నాకు ఈ పిచ్లపై కంప్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడేమంటావు రవి? ముందుగా చెప్పినట్లు ప్రపంచంలో ఏ టెస్టు మ్యాచ్లోనూ ఆరో ఓవర్ స్పిన్నర్తో వేయించరు. అస్సలు ఆ అవకాశమే లేదు. ఇండోర్లో మూడో రోజు నుంచి బంతి టర్న్ అవుతుందని అంచనా వేశాం. బ్యాటర్లకు కూడా అవకాశం రావాలి కదా రవి. ఒక్క మాటతో అదుర్స్ అనిపించిన రవి! ఇప్పుడు మీ ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఏం చెబుతావో చెప్పు! మొదటి, రెండో రోజు బ్యాటింగ్కు కాస్త అనుకూలించాలి కదా!’’ అని బ్యాటింగ్ ఆల్రౌండర్ హెడెన్ వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా రవిశాస్త్రి ఒక్క మాటతో.. ‘‘హోం కండిషన్స్’’ అంటూ హెడెన్కు అదిరిపోయే రీతిలో జవాబు ఇచ్చాడు. ‘‘స్వదేశంలో మ్యాచ్ అంటే మామూలుగా జరిగేదే ఇది! కానీ ఇక్కడ ఇంకాస్త కఠినంగా ఉంది పరిస్థితి. ఒక్కటంటే ఒక్క మెరుగైన భాగస్వామ్యం నమోదైతేనే కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది’’అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై జట్లకు కాస్త అనుకూలమైన పిచ్లే రూపొందిస్తారని, అందుకు ఎవరూ అతీతులు కారన్న అర్థంలో హెడెన్కు కౌంటర్ ఇచ్చాడు. చదవండి: Ind Vs Aus 3rd Test: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత.. అగ్రస్థానంలో.. Rohit Sharma: సున్నా దగ్గరే రెండుసార్లు.. ఉపయోగించుకోవడంలో విఫలం -
'ఆసీస్ను క్లీన్ స్వీప్ చేస్తే.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియాదే'
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాపై తొలి రెండో టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా.. ఈ సిరీస్లో 2-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇండోర్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో టీమిండియా గెలుపొందితే.. నేరుగా ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఇక ఇప్పటికే మూడో టెస్టు కోసం ఇరు జట్లు ఇండోర్కు చేరుకున్నాయి. మార్చి 1 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. కాగా ఇండోర్ టెస్టుకు ముందు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0తో క్లీన్ స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ టైటిల్ను కూడా అందుకుంటుందని రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. అయితే ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పేసర్లు చెలరేగే అవకాశం ఉంది అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా 2021లో జరిగిన మొట్టమొదటి టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్ను టీమిండియా తృటిలో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. "బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0 క్లీన్ స్వీప్ చేస్తే.. అది ఖచ్చితంగా ప్రత్యర్ధి జట్టును మానసికంగా దెబ్బతీస్తుంది. కానీ ఇంగ్లండ్ పరిస్ధితులు ఇక్కడికి భిన్నంగా ఉంటాయి. ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ సమయానికి గాయపడిన ఆసీస్ పేసర్లందరూ తిరిగి జట్టులో కి చేరుతారు. కాబట్టి లండన్లో ఆసీస్ పేసర్లు నిప్పులు చేరిగే అవకాశం ఉంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్లీన్స్వీప్ విజయం.. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఆసీస్ను ఓడిస్తామన్న నమ్మకం ఇస్తుంది" అని ఐసీసీకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్స్ పట్టిక ప్రకారం ఫైనల్లో ఆసీస్, భారత్ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వేళ చివరి రెండు టెస్టుల్లో భారత్ ఓడి.. న్యూజిలాండ్పై రెండు టెస్టుల సిరీస్ను శ్రీలంక విజయం సాధిస్తే అప్పుడు లంకేయులు ఫైనల్కు చేరే ఛాన్స్ ఉంది. చదవండి: Team india: హెడ్ కోచ్గా ద్రవిడ్ వద్దు.. వారిద్దరే సరైనోళ్లు! సెహ్వాగ్ అయితే? -
BGT 2023: ఆసీస్తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఇషాన్ కిషన్..!
Ravi Shastri Prediction: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి టెస్ట్ కోసం టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తన ప్లేయింగ్ ఎలెవెన్ను(భారత్) ప్రకటించాడు. ఐసీసీ రివ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి టెస్ట్లో భారత తుది జట్టు ఇలా ఉండబోతుందంటూ తన అంచనాను వెల్లడించాడు. రవిశాస్త్రి పిక్ చేసిన 11 మందిలో రెండు అనూహ్య ప్రతిపాదనలు ఉన్నాయి. వికెట్కీపర్గా శ్రీకర్ భరత్ బదులు ఇషాన్కిషన్ను ఎంచుకున్న అతను.. అక్షర్ పటేల్ను కాదని కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గు చూపాడు. ఓపెనింగ్ స్థానం కోసం శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంచనా వేశాడు. అఖరి నిమిషంలో కెప్టెన్, కోచ్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. గిల్ రాహుల్ మధ్య పోటీ ఉంటుందని చెప్పిన రవిశాస్త్రి ఐదో స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్కు కన్ఫర్మ్ చేసి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పై పేర్కొన్న ప్రతిపాదనలు మినహాయించి అందరూ ఊహించినట్లుగానే జట్టును ఎంచుకున్నాడు. ఇదే సందర్భంగా రవిశాస్త్రి మరో ప్రిడిక్షన్ కూడా చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0తో క్లీన్స్వీప్ చేస్తుందని చెప్పాడు. కీలకమైన ఓపెనింగ్ మ్యాచ్లో గెలిస్తే.. టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తద్వారా సిరీస్ను క్లీన్ చేయడం సులువవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, రేపటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. తమతమ శిక్షణా శిబిరాల్లో భారత్, ఆసీస్ ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. భారత్, ఆసీస్లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్ మ్యాచ్ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్లు గెలిచాయి. 5 సిరీస్లు డ్రాగా ముగిసాయి. రవిశాస్త్రి అంచనా వేసిన తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్/శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, సూర్యకుమర్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
Virat vs Rohit: రోహిత్, విరాట్ మధ్య గొడవలు నిజమే.. చక్కదిద్దింది అతడే!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుత భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లగా ఉన్నారు. రోహిత్ కెప్టెన్గా వ్యవహరిస్తుంటే.. విరాట్ కీలక సభ్యుడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ఇక చాలా మ్యాచ్ల్లో వీరిద్దరూ తమ ప్రదర్శనలతో అద్భుతవిజయాలను అందించారు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ అనంతంరం వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని అప్పటిలో ఊహాగానాలు వినిపించాయి. డ్రెసింగ్ రూంలో ఆటగాళ్లు రెండు వర్గాలగా విడిపోయారని.. రోహిత్ గ్రూప్, విరాట్ గ్రూప్ ఉన్నయాని తెగ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఇదే విషయంపై భారత మాజీ మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి, రోహిత్ మధ్య మనస్పర్థలున్న మాట నిజమేనని శ్రీధర్ సృష్టం చేశాడు. అయితే వీరిద్దరి మధ్య అప్పటి భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కరమైంది అని శ్రీధర్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు. "2019 వన్డే ప్రపంచ కప్ అనంతరం కాస్త గందరగోళం నెలకొంది. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి పెద్దు ఎత్తున చర్చ జరిగింది. అప్పటికే మేము సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై ఉన్నాం. అటువంటి సమయంలో విరాట్, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్త మమ్మల్ని మరింత కలవరపెట్టింది. డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ క్యాంప్, విరాట్ క్యాంప్ ఉన్నాయని మాకు తెలిసింది. అదే విధంగా సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లి ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ప్రపంచకప్ ముగిసిన 10 రోజుల తర్వాత మేమే వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోసం యునైటెడ్ స్టేట్స్కి వెళ్లాం. అక్కడికి వెళ్లిన వెంటనే రవిశాస్త్రి కోహ్లి, రోహిత్ను తన గదికి పిలిచాడు. భారత క్రికెట్ ఆరోగ్యం ఉండాలంటే.. ఇద్దరి మధ్య విభేదాలను తుడిచిపెట్టేయాలని అతడు సూచించాడు. వారిద్దరి ఎంతోగానే రవి నచ్చచెప్పాడు. సోషల్ మీడియాలో ఏం జరిగిందో వదిలేయండి. మీరిద్దరూ చాలా సీనియర్ క్రికెటర్లు కాబట్టి ఇటువంటి మనస్పర్థలు మీ మధ్య ఉండకూడదు అని రవి చెప్పాడు. ఇవన్నీ విడిచిపెట్టి జట్టును ముందుకు నడిపించడంలో కృషి చేయండి అని రోహిత్, విరాట్కు శాస్త్రి సలహా ఇచ్చినట్లు శ్రీధర్ తన తన ఆటోబయోగ్రఫీ ''కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్''లో రాసుకొచ్చాడు. చదవండి: BBL 2023: చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై .. ప్రపంచంలోనే తొలి బౌలర్గా! -
'అతడు పదేళ్లపాటు భారత్కు ఆడతాడు.. టీ20ల్లో కూడా అవకాశం ఇవ్వండి'
టీమిండియా యవ ఆటగాడు శుబ్మాన్ గిల్పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్రి ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ తన బ్యాటింగ్ స్కిల్స్ను బాగా మెరుగుపరుచుకున్నాడని అతడు కొనియాడాడు. అదే విధంగా గిల్కు మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉంది రవిశాస్రి అభిప్రాయడ్డాడు. కాగా గిల్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఉన్నాడు. తొలి వన్డేలో అర్దసెంచరీతో ఆకట్టుకున్న గిల్.. వర్షం కారణంగా రద్దైన రెండో వన్డేలో కూడా 45 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది 11 వన్డేలు ఆడిన గిల్.. 625 పరుగులు పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్లో గిల్ అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైమ్ వీడియోతో రవిశాస్రి మాట్లాడుతూ.. "గిల్ ప్రస్తుతం బాల్ను సరిగ్గా టైమింగ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు ఆటగాళ్లు తమ ఫామ్ను కోల్పోయినప్పడు బంతిని గట్టిగా కొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ గిల్ మాత్రం కంట్రోల్గా షాట్లు ఆడుతున్నాడు. గిల్ తన బ్యాటింగ్ స్కిల్స్ చాలా మెరుగుపరుచుకున్నాడు. గిల్కు అద్భుతమైన ఫుట్వర్క్ ఉంది. గిల్ మరో పదేళ్ల పాటు భారత జట్టుకు ఆడుతాడు. ఎందుకంటే అతడికి కష్టపడే సత్తా ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్లో శుబ్మాన్ స్ట్రైక్ రేట్ మెరుగైంది. అతడు సగటు కూడా 70కిపైగా ఉంది. కాబట్టి గిల్ వంటి అద్భుతమైన ఆటగాడికి టీ20ల్లో కూడా అవకాశం ఇవ్వాలి. గిల్కు మూడు ఫార్మాటాల్లో రాణించే సత్తా ఉంది." అని అతడు పేర్కొన్నాడు. -
ద్రావిడ్ కు అండగా అశ్విన్.. రవిశాస్త్రి వ్యాఖ్యలకు కౌంటర్
-
ధావన్కు అన్యాయం జరుగుతూనే ఉంది: రవిశాస్త్రి
టీమిండియా గబ్బర్గా పేరు పొందిన శిఖర్ ధావన్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్కు మాత్రమే పరిమితమయ్యాడు. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో కీలక బ్యాటర్గా రాణించిన ధావన్ను కేవలం వన్డేలకే మాత్రమే పరిమితం చేసింది బీసీసీఐ. అయితే ధావన్ మాత్రం అందుకు ఏం బాధపడకుండా తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే వచ్చాడు. ఇక 2023 వన్డే వరల్డ్కప్ దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ధావన్కు ఎక్కువగా వన్డేల్లోనే అవకాశాలు ఇస్తూ వస్తోంది. దీనికి తోడు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో ధావన్ స్టాండింగ్ కెప్టెన్ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. అటు కెప్టెన్గా.. ఇటు బ్యాటర్గా తనదైన శైలిలో రాణిస్తూ వరల్డ్కప్కు సన్నద్ధమవుతున్నాడు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైనప్పటికి ధావన్ మాత్రం బ్యాటింగ్లో అదరగొట్టాడు. 77 బంతుల్లో 72 పరుగులు చేసి తన ఫామ్ను చూపెట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి మాత్రం శిఖర్ ధావన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధావన్కు రావాల్సినంత గుర్తింపు రాలేదని పేర్కొన్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోతో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ''ధావన్కు రావాల్సినంత పేరు రాలేదు. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మీదనే అందరి దృష్టి ఉండడమే అందుకు కారణం. ధావన్కు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లు చాలామంది ఉన్నప్పటికీ ధావన్కు వన్డేల్లో ఉన్న అనుభవం చాలా విలువైనది. అతను యంగ్స్టర్స్ను గైడ్ చేయగలడు. రానున్న వన్డే వరల్డ్కప్లో ధావన్ది కచ్చితంగా కీలకపాత్ర ఉంటుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. మొదటి వన్డేలో శిఖర్ ధావన్ 77 బంతుల్లో 72 రన్స్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి వన్డేలో న్యూజిలాండ్ టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ధావన్తో పాటు ఓపెనర్ శుభ్మన్ గిల్ (50), శ్రేయర్ అయ్యర్ (80) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. టామ్ లాథమ్ (148) సెంచరీతో చెలరేగగా.. అతనికి కెప్టెన్ విలియమ్సన్ (94 పరుగులు) అండగా నిలబడ్డాడు. -
రోహిత్ మెడపై కత్తి పెట్టి, హార్ధిక్కు పట్టం కట్టి.. ఇవన్నీ జై షా వ్యూహాలేనా..?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐలోకి అడుగుపెట్టాక అనూహ్య మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం గంగూలీతో పాటు బీసీసీఐ కార్యవర్గంలో చేరిన షా.. నాటి నుంచే చక్రం తిప్పడం ప్రారంభించాడు. 2020లో బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన షా.. తనకున్న రాజకీయ అండదండలతో బీసీసీఐని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు బోర్డు కీలక నిర్ణయాల్లో తన మార్కు ఉండేలా అధ్యక్షుడు (గంగూలీ) సహా సభ్యులందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. రవిశాస్త్రి, కోహ్లిల హవాకు చెక్.. షా బాధ్యతలు చేపట్టడానికి ముందు బీసీసీఐలో నాటి టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లి హవా కొనసాగేది. బోర్డు ప్రతి నిర్ణయంలో వీరి పాత్ర కీలకంగా ఉండేది. అయితే షా ఎంట్రీతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బోర్డు కీలక నిర్ణయాల్లో రవిశాస్త్రి, కోహ్లిల ప్రమేయాన్ని సహించని షా.. వారిద్దరికి చెక్ పెట్టడం ప్రారంభించాడు. ప్లాన్లో భాగంగానే రవిశాస్త్రి, కోహ్లిలను క్రమక్రమంగా తమ బాధ్యతలకు దూరం చేశాడు. ఇందుకు గంగూలీని పావుగా వాడుకున్న షా.. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి బీసీసీఐ బాస్కు కెప్టెన్ను మధ్య ఉన్న విభేదాలే కారణమని అందరూ నమ్మేలా వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. రోహిత్ను కెప్టెన్ చేయడంలోనూ షా మార్కు.. అనంతరం రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడంలోనూ చక్రం తిప్పిన షా.. బీసీసీఐపై తన మార్కును మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. గంగూలీతో విభేదాలకు బీజం అక్కడే.. ఆతర్వాత కొన్ని రోజుల వరకు అన్నీ బాగానే జరిగినప్పటికీ.. గంగూలీ బెంగాల్ రాజకీయాలకు నో చెప్పడం, రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాలని కోరుకోవడం షాకు అస్సలు సహించలేదు. వీరిద్దరి మధ్య బయటకు కనిపించని విభేదాలకు ఇక్కడే బీజం పడింది. గంగూలీని ఐసీసీ అధ్యక్ష పదవి బరిలో నిలిపి, తాను బీసీసీఐ బాస్ అవ్వాలని భావించిన షా.. గంగూలీ తిరగబడటంతో ప్లాన్-బిని అమలు చేసి, తన కంట్రోల్లో ఉండే రోజర్ బిన్నీ పేరును ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి తెచ్చాడు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల బోర్డు పెద్దలను ఒప్పించి బీసీసీఐ బాస్గా బిన్నీకి పట్టం కట్టాడు. షా ఉద్దేశం బయటపడటంతో, అప్పటి దాకా ఐసీసీ బరిలో నిలవాలని భావించిన గంగూలీ మెల్లగా ఆ రేసు నుంచి కూడా తప్పుకున్నాడు. సెలెక్షన్ కమిటీపై వేటు.. రోహిత్ మెడపై కత్తి ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, తాజాగా చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని సమాచారం కూడా లేకుండా అవమానకర రీతిలో తప్పించడం, టీ20ల్లో వైఫల్యాలను సాకుగా చూపి రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎసరు పెట్టడం వంటి కీలక పరిణామాలు చకచకా జరిపోయాయి. జట్టు ఎంపికలో తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని, బీసీసీఐ కొత్త బాస్ బిన్నీతో సెలెక్టర్లపై వేటు వేయించిన షా.. పనిలో పనిగా మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు అనే అంశాన్ని తెరపైకి తెచ్చి తన రాష్ట్రానికి చెందిన హార్ధిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ పగ్గాలు కట్టపెట్టేందుకు సర్వం సిద్ధం చేశాడు. ప్లాన్లో భాగంగా అతి త్వరలో టీమిండియాలో భారీ మార్పులు బీజం వేశాడు. తనకు నచ్చని, తన మాట వినని సీనియర్లపై నిర్ధాక్షిణ్యంగా వేటు వేసేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశాడని సమాచారం. కెప్టెన్గా హార్ధిక్ ప్రమోషన్.. గత సీజన్లో గుజరాత్కు సంబంధించిన ఫ్రాంచైజీ ఐపీఎల్ అరంగేట్రం చేయడం, గుజరాత్కు చెందిన ఆటగాడే ఆ జట్టు కెప్టెన్ (హార్ధిక్) కావడం, ఏమాత్రం అంచనాలు లేని ఆ జట్టే ఛాంపియన్ కావడం, దీని ఆధారంగా కెప్టెన్గా పెద్దగా అనుభవం లేని హార్ధిక్ను టీమిండియా కెప్టెన్గా ప్రమోట్ చేస్తుండటం.. ఇవన్నీ అలా జరిగిపోయాయి/పోతున్నాయి. ఈ మొత్తం తంతులో షా పాత్ర ఉందని క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. బీసీసీఐపై ఉన్న పట్టును సహించలేక కోచ్ రవిశాస్త్రిని, వైఖరి నచ్చక కోహ్లిని, రాజకీయ కారణాల (బెంగాల్కు సంబంధించినవి) చేత గంగూలీని, వైఫల్యాలను సాకుగా చూపి రోహిత్ను పదవులకు దూరం చేసిన షా.. ప్రస్తుతం హార్ధిక్ను టీమిండియా కెప్టెన్గా ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..! -
అప్పుడు కూడా నరాలు తెగే ఉత్కంఠ! బంగ్లా ఒక్క పరుగుతో.. టాయ్లెట్కి వెళ్లి
ICC Mens T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022లో భారత్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం పంచిందనడంలో సందేహం లేదు. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ల మధ్య పోరు కంటే కూడా ఈ మ్యాచ్ ఎక్కువ మజాను అందించనడం అతిశయోక్తి కాదు. అసలే సెమీస్ రేసులో నిలిచేందుకు పోటీ.. టీమిండియా మెరుగైన స్కోరు.. ధీటుగా బదులిస్తూ జోష్ మీదున్న బంగ్లాదేశ్కు వరణుడి ఆటంకం.. డక్వర్త్ లూయీస్ పద్ధతిలో ఓవర్ల కుదింపు.. వెరసి ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. టీ20 మ్యాచ్ను వీక్షిస్తున్న ప్రేక్షకుడికి ఇంతకంటే వినోదం ఎక్కడా దొరకదు. ఇదే తరహాలో.. అభిమానులను మునివేళ్ల మీద నిలబెట్టిన మ్యాచ్ ఒకటి గతంలో జరిగింది.. అది కూడా టీ20 వరల్డ్కప్ టోర్నీలో.. మ్యాచ్ కూడా భారత్- బంగ్లాదేశ్ మధ్యే! అప్పుడు కూడా ఇలాగే టీ20 ప్రపంచకప్-2016లో భాగంగా సూపర్-10లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడ్డాయి. నాటి మ్యాచ్లో బంగ్లా బౌలర్లు రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సురేశ్ రైనా 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 35 పరుగులతో శుభారంభం అందించగా.. సబ్బీర్ రెహమాన్ 26, షకీబ్ అల్ హసన్ 22, సౌమ్య సర్కార్ 21 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో బంగ్లా విజయ సమీకరణం 11 పరుగులుగా మారింది. దీంతో ఇరు జట్లు.. మ్యాచ్ను వీక్షిస్తున్న ప్రేక్షకుల్లోనూ టెన్షన్.. టెన్షన్.. సరిగ్గా అప్పుడే మిస్టర్ కూల్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. తన వ్యూహాన్ని అమలు చేశాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చేతికి బంతినిచ్చాడు. నరాలు తెగే ఉత్కంఠ మొదటి మూడు బంతుల్లో బంగ్లాకు 9 పరుగులు వచ్చాయి. అయితే, ఆ తర్వాత పాండ్యా మ్యాజిక్ చేశాడు. వరుసగా రెండు వికెట్లు కూల్చాడు. బంగ్లా గెలవాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. స్టంప్స్ వెనుక ధోని చురుగ్గా కదులుతుండగా అది సాధ్యమయ్యే పనేనా? చివరి బాల్కు ముస్తాఫిజునర్ రహ్మాన్ను ధోని రనౌట్ చేయడంతో బంగ్లా కథ ముగిసింది. ఒక్క పరుగు తేడాతో విజయం టీమిండియా సొంతమైంది. ఒత్తిడి భరించలేక టాయిలెట్లోకి సూపర్-12లో భాగంగా భారత్- బంగ్లా మధ్య బుధవారం నాటి మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి 2016 నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. ఈ విషయం గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ధోని హార్దిక్ చేతికి బంతినివ్వడం చూశాను. ఆఖరి ఓవర్లో నేను టెన్షన్ భరించలేకపోయాను. ఆటగాళ్లందరితో బాల్కనీలో సమావేశమయ్యాను. కానీ ఒత్తిడిని భరించలేకపోయాను. అక్కడి నుంచి టాయ్లెట్కు వెళ్లాను’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్.. అంపైర్లు సహకరించారు.. వరుణుడు కాపాడాడు..! అంటూ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సూర్యకు టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. దుమ్ము రేపుతాడు'
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యదవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో సూర్య విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో సూర్య కేవలం 25 బంతుల్లోనే 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టే సత్తా సూర్యకు ఉంది అని రవిశాస్త్రి కొనియాడాడు. "సూర్యకు మూడు ఫార్మాట్లలో రాణించే సత్తా ఉంది. సూర్యకుమార్ యాదవ్ టెస్టు అరంగేట్రం కోసం ఎవరూ మాట్లాడరు. కానీ సూర్య టెస్టు క్రికెట్ కూడా అద్భుతంగా ఆడగలడని నేను భావిస్తున్నాను. అతడిని టెస్టుల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ పంపండి. అందరనీ అతడు ఆశ్చర్యానికి గురి చేస్తాడు" రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో సూర్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్ డే ఉన్నా.. 667లో ఒక్కటే రద్దైనా.. ఫైనల్ ‘బెంగ’! -
వరల్డ్కప్ కామెంటేటర్ల జాబితా విడుదల.. వివాదాస్పద వ్యాఖ్యాతకు దక్కని చోటు
టీ20 వరల్డ్కప్-2022లో కామెంట్రీ చెప్పబోయే వ్యక్తుల జాబితాను ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్కు చోటు దక్కకపోగా.. భారత్ నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. మొత్తంగా ఈ జాబితాలో వివిధ దేశాలకు చెందిన 29 మందికి చోటు లభించింది. ఐసీసీ వరల్డ్కప్-2022 కామెంటేటర్ల ప్యానెల్లో ఈ సారి ఏకంగా ముగ్గురు మహిళా వ్యాఖ్యాతలకు చోటు దక్కడం విశేషం. ఇంగ్లండ్కు చెందిన ఇషా గుహ, మెల్ జోన్స్, నథాలీ జెర్మానోస్ వరల్డ్కప్లో మహిళా వాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. వరల్డ్కప్ వ్యాఖ్యాతల ప్యానెల్లో భారత్కు చెందిన రవిశాస్త్రి, హర్షా భోగ్లే, న్యూజిలాండ్కు చెందిన డానీ మారిసన్, సైమన్ డౌల్, వెస్టిండీస్కు చెందిన ఇయాన్ బిషప్, ఇంగ్లండ్కు చెందిన నాసిర్ హుసేన్ వ్యాఖ్యానం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలువనుంది. What an elite commentary line-up for #T20WorldCup 2022 😍 Details 👉 https://t.co/sCOReFrnTH pic.twitter.com/CuTJlwBeOk — ICC (@ICC) October 16, 2022 వరల్డ్కప్-2022 కోసం ఎంపిక చేసిన కామెంటేటర్ల వివరాలు.. ఆడమ్ గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా), అథర్ అలీ ఖాన్ (బంగ్లాదేశ్), బాజిద్ ఖాన్ (పాకిస్తాన్), బ్రియాన్ ముర్గత్రయోడ్ (నమీబియా), కార్లోస్ బ్రాత్వైట్ (వెస్టిండీస్), డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా), డానీ మారిసన్ (న్యూజిలాండ్), డిర్క్ నానెస్ (ఆస్ట్రేలియా), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్), హర్షా భోగ్లే (ఇండియా), ఇయాన్ బిషష్ (వెస్టిండీస్), ఇయాన్ స్మిత్ (న్యూజిలాండ్), ఇషా గుహా (ఇంగ్లండ్), మార్క్ హోవర్డ్ (ఆస్ట్రేలియా), మెల్ జోన్స్ (ఆస్ట్రేలియా), మైఖేల్ అథర్టన్ (ఇంగ్లండ్), మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా), నాసిర్ హుస్సేన్ (ఇంగ్లండ్), నథాలీ జెర్మానోస్ (గ్రీస్), నీల్ ఓబ్రెయిన్ (ఇంగ్లండ్), పోమి ఎంబాంగ్వా (జింబాబ్వే), ప్రెస్టన్ మోమ్సేన్ (స్కాట్లాండ్), రవిశాస్త్రి (ఇండియా), రసెల్ ఆర్నాల్డ్ (శ్రీలంక), సామ్యూల్ బద్రి (వెస్టిండీస్), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా), షాన్ పొలాక్ (సౌతాఫ్రికా), సైమన్ డౌల్ (న్యూజిలాండ్), సునీల్ గవాస్కర్ (ఇండియా) -
గంగూలీపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీలు రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ.. ఒకరంటే ఒకరికి పడదన్న విషయం బహిర్గతమే. ఇద్దరి మధ్య ఎప్పటినుంచో కోల్డ్వార్ సాగుతూనే ఉంది. ఒక సందర్భంలో తనకంటే జూనియర్ అయిన సౌరవ్ గంగూలీ ముందు టీమిండియా హెడ్ కోచ్గా ఇంటర్వ్యూకు వెళ్లడానికి తనకు మనసొప్పలేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అంతేగాక గంగూలీ అధ్యక్షుడిగా బీసీసీఐ తీసుకొచ్చిన కొన్ని పాలనాపరమైన నిర్ణయాలను కూడా శాస్త్రి బాహటంగానే విమర్శించేవాడు. తాజాగా బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ రావడంపై రవిశాస్త్రి స్పందించాడు. రోజర్ బిన్నిని ప్రశంసిస్తూనే గంగూలీకి పరోక్షంగా చురకలంటించాడు. జీవితంలో ఏది శాశ్వతం కాదు.. కొన్ని పనులు మాత్రమే చేయగలరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. ''బీసీసీఐ అధ్యక్షుడి రేసులో రోజర్ బిన్నీ పేరు ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను అతడితో కలిసి ఆడాను.1983 వన్డే ప్రపంచకప్ బిన్నీ నా సహచర ఆటగాడు.కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు బీసీసీఐకి వస్తున్నాడు ఒక ప్రపంచకప్ విన్నింగ్ జట్టులోని సభ్యుడు బీసీసీఐ అధ్యక్షుడవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి బీసీసీఐ అధ్యక్ష పదవిలో ప్రపంచకప్ విజేత కూర్చోనుండటం ఇదే తొలిసారి. బిన్నీ రాకతో అయినా దేశవాళీ క్రికెట్ లో వసతులు మెరుగుపడతాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే బిన్నీ కూడా ఒక క్రికెటరే. అతడు కచ్చితంగా బోర్డులో ఇతర వ్యవహారాల కంటే క్రికెట్ గురించే ఎక్కువ ఆలోచిస్తాడని నేను భావిస్తున్నా. కింది స్థాయిలో గ్రౌండ్స్ లో వసతులు సరిగా లేవు. కొత్త పాలకవర్గం దాని మీద దృష్టి సారించాలి. నేను చదివిన ప్రకారం బీసీసీఐకి ఎవరూ రెండోసారి అధ్యక్షుడు కాలేదు. ఈ రకంగా చూస్తే ఒకరు రావాలంటే ప్రస్తుతం ఉన్నవారు పదవి నుంచి తప్పుకోవాల్సిందే. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. అన్ని చేయాలనుకున్నప్పటికీ చివరికి కొన్ని పనులు మాత్రమే చేయగలరు.'' అని తెలిపాడు. రవిశాస్త్రి కామెంట్స్ విన్న అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ఒక రకంగా రవిశాస్త్రికి ఇది సంతోషకరమైన విషయం కావొచ్చు.. బిన్నీని పొగడుతూనే దాదాకు చురకలంటించాడు. అంటూ పేర్కొన్నాడు. ఇక దాదా అభిమానులు మాత్రం.. ''ఎప్పుడో జరిగిన దానిని మనసులో పెట్టుకొని కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు.'' అని చురకలంటించారు. చదవండి: జర్నలిస్టు తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ బీసీసీఐ అధ్యక్ష పదవి కోల్పోవడంపై నోరు విప్పిన గంగూలీ -
వరల్డ్కప్ తర్వాత టీమిండియాలో భారీ మార్పులు..!
మాజీ కోచ్ రవిశాస్త్రి టీమిండియాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్కప్ తర్వాత భారత జట్టులో భారీ మార్పులు తధ్యమని జోస్యం చెప్పాడు. ప్రస్తుత జట్టులో సగానికి పైగా స్థానాలు గల్లంతవుతాయని సంచలన కామెంట్స్ చేశాడు. 2021 టీ20 ప్రపంచకప్ జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు ఇంచుమించు అలాగే ఉందని, ఈ ప్రపంచకప్ తర్వాత జట్టు అలా ఉండదని, ఊహించని మార్పులు జరుగుతాయని అన్నాడు. మొత్తంగా అతి త్వరలో కొత్త టీమిండియాను చూస్తామని తనదైన స్టయిల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. శాస్త్రి.. ఓ పక్క టీమిండియాలో మార్పులు తప్పవని చెబుతూనే, ప్రస్తుత భారత బ్యాటింగ్ లైనప్పై ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్, వన్డౌన్లో విరాట్, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5,6 స్థానాల్లో హార్ధిక్, పంత్/డీకేలతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని ఆకాశానికెత్తాడు. ఇదే సందర్భంగా భారత్ ఫీల్డింగ్లో మరింత మెరుగు పడాల్సి ఉందని హెచ్చరించాడు. ఈ విభాగంలో భారత్ మెరుగు పడితే ఫలితాలు తప్పక మనకు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. ఫైనల్గా దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ఇదే చివరి టీ20 వరల్డ్కప్ కావచ్చని బాంబు పేల్చాడు. -
T20 WC: టీమిండియా ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే కష్టమే: మాజీ హెడ్కోచ్
T20 World Cup 2022: టీ20 వరల్డ్కప్-2022 టోర్నీ ఆరంభం నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రోహిత్ సేనను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యాలను అధిగమించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. భారత్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉందని.. ఫీల్డింగ్ లోపాన్ని సరిచేసుకుంటే జట్టుకు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా.. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో అక్టోబరు 23న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇటీవలి కాలంలో రోహిత్ సేన టీ20 క్రికెట్లో వరుస సిరీస్లు గెలిచినప్పటికీ.. బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలు కలవరపెట్టే అంశాలుగా పరిణమించాయి. ముఖ్యంగా కీలక సమయాల్లో క్యాచ్లు జారవిడవటం ఆసియా కప్-2022 టోర్నీలో తీవ్ర ప్రభావం చూపింది. ఆ 15- 20 పరుగులే ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘టీమిండియా ముందుగా ఫీల్డింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాల్సి ఉంది. కఠినంగా శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్తో ఆరంభ మ్యాచ్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫీల్డర్లు సేవ్ చేసే 15-20 పరుగులే మ్యాచ్ ఫలితాన్ని మార్చివేసేంతగా ప్రభావం చూపగలవు. నిజానికి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి జట్లు ఫీల్డ్ను సెట్ చేసే విధానం క్రేజీగా ఉంటుంది. అంతెందుకు ఆసియా కప్లో శ్రీలంక ఎలా ఫీల్డింగ్ చేసిందో.. ఎలాంటి ఫలితాలు పొందిందో మనం చూశాం. ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన విధానం అందరికీ గుర్తుండిపోతుంది. ఇటీవలి కాలంలో ఫీల్డింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. కాబట్టి ఆ విషయంలో కచ్చితంగా మెరుగుపడాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. వాళ్లు అద్భుత ఆటగాళ్లు ఇక బ్యాటింగ్ ఆర్డర్ గురించి చెబుతూ.. ‘‘గత ఆరేడేళ్ల పాటు నేను టీమిండియాతో ప్రయాణం చేశాను. అయితే, మునుపెన్నడూ లేని విధంగా టీ20 క్రికెట్లో భారత బ్యాటింగ్ లైనప్ మరింత దృఢంగా తయారైంది. నాలుగో స్థానంలో సూర్య, ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంలో రిషభ్ పంత్ లేదంటే దినేశ్ కార్తిక్ ఉన్నారన్న ధీమాతో టాపార్డర్ మరింత దూకుడుగా ఆడేందుకు వీలు కలిగింది’’ అంటూ మిడిలార్డర్పై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. కాగా రవిశాస్త్రి మార్గదర్శనంలో విరాట్ కోహ్లి సారథ్యంలో గతేడాది ప్రపంచకప్ ఆడిన టీమిండియా కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. చదవండి: T20 WC- Semi Finalists Prediction: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ T20 Tri Series: నరాలు తెగే ఉత్కంఠ.. పాక్కు చెమటలు పట్టించిన బంగ్లా! చివరికి -
గిల్ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్కు పయనం కానున్న భారత ఓపెనర్!
టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందకు సిద్దమయ్యాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2022లో గ్లామోర్గాన్ తరపున గిల్ ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్కు వెళ్లేందుకు గిల్కు ఇంకా వీసా మంజూ కాలేదు. అయితే, వీసా సమస్య క్లియర్ అయిన వెంటనే గిల్ ఇంగ్లండ్కు పయనం కానున్నాడు. కాగా గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవలం జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో గిల్ దుమ్ము రేపాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో గిల్ 245 పరుగులు సాధించాడు. మూడో వన్డేలో కెరీర్లోనే తొలి శతకం నమోదు చేసి సత్తా చాటాడు. ఆరో భారత ఆటగాడిగా! ఒకవేళ గిల్ ఇంగ్లండ్కు పయనమైనట్లైతే.. ప్రస్తుత సీజన్లో కౌంటీ ఛాంపియన్షిప్లో ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇప్పటికే ఛతేశ్వర్ పుజారా (ససెక్స్), వాషింగ్టన్ సుందర్ (లంకాషైర్), మహ్మద్ సిరాజ్ (వార్విక్షైర్), ఉమేష్ యాదవ్ (మిడిల్సెక్స్), నవదీప్ సైనీ (కెంట్) ఆయా జట్లకు ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఇక ఇంగ్లండ్ కౌంటీల్లో గ్లామోర్గాన్ జట్టుకు ఆడే మూడో భారత ఆటగాడిగా గిల్ నిలిచే అవకాశం ఉంది. అంతకుముందు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (1987-91) కాలంలో గ్లామోర్గాన్కు ప్రాతినిధ్యం వహించగా.. 2005లో ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 2005లో ఇదే క్లబ్ తరపున ఆడాడు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం! -
Asia Cup 2022: పాక్తో మ్యాచ్లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి!
Asia Cup 2022 India Vs Pakistan- Virat Kohli: ‘‘ఈ మధ్య విరాట్ కోహ్లితో నేను మాట్లాడలేదు. అయితే, గొప్పవాళ్లుగా పేరొందిన ఆటగాళ్లు సరైన సమయంలో కచ్చితంగా తామేంటో నిరూపించుకుంటారు. కోహ్లి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆసియా కప్ రూపంలో మంచి అవకాశం వచ్చింది. పాకిస్తాన్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొడితే చాలు. అతడిని విమర్శిస్తున్న నోళ్లన్నీ మూత పడతాయి’’ అని టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి అన్నాడు. సెంచరీ చేసేదెన్నడు! టీమిండియా మాజీ కెప్టెన్, ‘రన్మెషీన్’ విరాట్ కోహ్లి ఇటీవలి కాలంలో ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. పరుగుల యంత్రంగా పేరుగాంచిన ఈ స్టార్ ఆటగాడు సెంచరీ సాధించి వెయ్యి రోజులు దాటి పోయింది. ఈ నేపథ్యంలో అతడి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు విదేశీ కెప్టెన్లు, మాజీ ఆటగాళ్లు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. విమర్శకులకు రవిశాస్త్రి చురకలు ఇక ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో కోహ్లి కచ్చితంగా ఫామ్లోకి వస్తాడని అభిమానులు భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2021లో పాక్తో మ్యాచ్లో కోహ్లి అర్ధ శతకాన్ని బాదిన విషయాన్ని గుర్తు చేస్తూ.. దాయాది జట్టుపై అతడు చెలరేగి ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. కోహ్లిని విమర్శిస్తున్న వారికి చురకలు అంటించాడు. పాక్పై చెలరేగితే.. ‘‘కోహ్లి కంటే ఫిట్గా ఉండే క్రికెటర్ భారత జట్టులో ఒక్కరూ లేరు. తను ఒక యంత్రం.. ఒక్కసారి తను సాధించాలని గట్టిగా ఫిక్స్ అయితే తిరుగు ఉండదు. తను తిరిగి ఫామ్లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు! తను ఇప్పుడు పరుగుల దాహంతో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆసియా కప్ ఆడే అవకాశం వచ్చింది. పాక్తో మ్యాచ్లో అర్ధ శతకం బాదితే ఈ నోళ్లన్నీ మూతపడతాయి’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. కాగా రవిశాస్త్రి, కోహ్లి సన్నిహితులన్న విషయం తెలిసిందే. వీరిద్దరి నేతృత్వంలో టీమిండియా పలు చిరస్మరణీయ విజయాలు అందుకున్నప్పటికీ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. మరింత రసవత్తరంగా.. ఇదిలా ఉంటే.. ఆగష్టు 27 నుంచి ఆసియా కప్ ఈవెంట్ ఆరంభం కానుంది. శ్రీలంక- అఫ్గనిస్తాన్ మ్యాచ్తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆ మరుసటి రోజే.. క్రికెట్ ప్రపంచమమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత దాయాదులు తొలిసారిగా తలపడటం.. గత పరాభవం నేపథ్యంలో టీమిండియా బదులు తీర్చుకునేందుకు సిద్ధం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. చదవండి: Asia Cup 2022: యూఏఈ చేరుకున్న టీమిండియా.. కోహ్లి ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ Asia Cup 2022: పాక్తో మ్యాచ్కు ముందు భారత్కు ఎదురుదెబ్బ! Shubman Gill: అరుదైన ఘనత.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన శుబ్మన్ గిల్! అంతేకాదు.. -
కొత్త కోచ్ వేటలో పంజాబ్ కింగ్స్.. కుంబ్లేకు మంగళం పాడనుందా!
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ షాకివ్వనున్నట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్ కోచ్గా అనిల్ కుంబ్లే స్తానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ సెప్టెంబర్తో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కుంబ్లేతో ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ పదవికి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ సహా హైదరాబాద్ మాజీ కోచ్ ట్రెవర్ బెలిస్ పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి పేరు కూడా పరిశీలినలో ఉంది. మరో వారంలో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ ఎవరనే దానిపై సందిగ్దం వీడనుందని ఫ్రాంచైజీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక కుంబ్లే హయాంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో 42 మ్యాచ్ల్లో 19 విజయాలు అందుకుంది. అనిల్ కుంబ్లే కోచింగ్లో వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు. అందుకే కుంబ్లేని సాగనంపి, కొత్త హెడ్ కోచ్ని నియమించుకునేందుకు పంజాబ్ కింగ్స ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఐపీఎల్ ప్రారంభం నుంచి పంజాబ్ కింగ్స్ 2014 మినహా ఒక్కసారి కూడా ఫైనల్ చేరిన దాఖలాలు లేవు. ఎంతమంది కెప్టెన్లు, కోచ్లు, ఆటగాళ్లు మారినా ఆ జట్టు ఆట తీరు మాత్రం మెరుగపడడం లేదు. అంతేకాదు జట్టు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మెగావేలంలోనూ దూకుడు కనబరిచింది పంజాబ్ కింగ్స్. వేలంలో శిఖర్ ధావన్, లియామ్ లివింగ్స్టోన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబడా లాంటి పేరున్న ఆటగాళ్లను తీసుకుంది. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా వెళ్లిపోవడంతో.. శిఖర్ ధావన్ను కాదని మయాంక్ అగర్వాల్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్సీ ఒత్తిడిలో పడి మయాంక్ తన బ్యాటింగ్ను పూర్తిగా మరిచిపోయాడు. సీజన్లో కొన్ని మంచి విజయాలు అందుకున్నప్పటికి పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్ల్లో ఏడు విజయాలు.. ఏడు పరాజయాలతో ఆరో స్థానంలో నిలిచి మరోసారి లీగ్ దశకే పరిమితమయింది. మరి కొత్త కోచ్ రాకతో పంజాబ్ కింగ్స్ దశ వచ్చే సీజన్లోనైనా మారుతుందేమో చూడాలి. -
అలా చేస్తేనే టెస్టుకు ఆదరణ పెరుగుతుంది
-
వన్డే క్రికెట్ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..!
పొట్టి క్రికెట్ ప్రభావం కారణంగా నానాటికీ శోభ తగ్గిపోతున్న వన్డే ఫార్మాట్పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డేలు అంతరించిపోకుండా మనుగడ సాగించాలంటే ఓ కీలక మార్పు చేయాలని సూచించాడు. వన్డేలు 50 ఓవర్ల పాటు సాగుతుండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని.. ఈ ఫార్మాట్ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఆసన్నమైందని, లేకపోతే వన్డే క్రికెట్ అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు. ఓవర్లను కుదించడం వల్ల వన్డేలకు మునపటి కంటే అధికమైన ఆదరణ లభిస్తుందని తెలిపాడు. గతంలో 60 ఓవర్లుగా సాగే వన్డే ఫార్మాట్ను 50 ఓవర్లకు కుదించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇటీవలి కాలంలో చాలామంది క్రికెటర్ల వన్డేలకు గుడ్బై చెబుతున్నందున ఈ మార్పుపై ఐసీసీ దృష్టి సారించాలని కోరాడు. 50 ఓవర్ల పాటు ఆట సాగడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలవుతుంటే, ఆటగాళ్లు తీవ్ర అలసటకు లోనై ఒత్తిడికి గురవుతున్నారని అన్నాడు. ఈ విషయంలో ఐసీసీ ఇకనైనా మేల్కొనకపోతే వన్డే ఫార్మాట్ చచ్చిపోతుందని తెలిపాడు. ఇదే విషయాన్ని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా ప్రతిపాదించాడు. మరోవైపు వసీమ్ అక్రమ్ లాంటి దిగ్గజ ఆల్రౌండర్ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో నుంచి వన్డే ఫార్మాట్ను తొలగించాలని వాదిస్తుండటం ఆసక్తికరంగా మారింది. చదవండి: 'అతడు డెత్ ఓవర్ల స్పెషలిస్టు.. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్కు ఎంపిక చేయండి' -
ప్రపంచకప్ తర్వాత హార్ధిక్ రిటైర్ అవడం ఖాయం
-
రవిశాస్త్రికి షాంపైన్ బాటిల్ గిఫ్ట్ ఇచ్చిన పంత్.. వీడియో వైరల్..!
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన అఖరి వన్డేలో భారత్ విజయం సాధించన సంగతి తెలిసిందే. కాగా టీమిండియా విజయంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. తొలత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 72 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్ధితుల్లో పంత్ హార్ధిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్కి 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం పాండ్యా ఔటైనప్పటికీ.. పంత్ మాత్రం అఖరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో పంత్ 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో సాయంతో 125 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనకు గాను పంత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అవార్డు ప్రజేంటేషన్ సమయంలో పంత్కు నగదుతో పాటు షాంపైన్ బాటిల్ని కూడా నిర్వాహకులు అందజేశారు. అయితే షాంపైన్ బాటిల్ అందుకున్న పంత్ ఎవరూ ఊహించని పని చేశాడు. ఈ మ్యాచ్కు కామెంటర్గా వ్యవహరిస్తున్న భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి షాంపైన్ బాటిల్ పంత్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా భారత హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఉన్న సమయంలోనే పంత్ జట్టలోకి ఎంట్రీ ఇచ్చాడు. పంత్ తన తొలి దశలో చాలా మ్యాచ్ల్లో విఫలమైన్పటకి.. అతడికి అవకాశాలు తరుచగా ఇస్తూ రవిశాస్త్రి సపోర్టుగా నిలిచాడు. చదవండి: ENG vs IND: సెంచరీతో చెలరేగిన పంత్..వన్డేల్లో అరుదైన రికార్డు..! Pant offering his champagne to Ravi Shastri#INDvENG #OldTrafford #Pant #TeamIndia pic.twitter.com/n9HguNNuID — Tejesh R. Salian (@tejrsalian) July 17, 2022 -
Ind Vs Ire: అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు పరుగెడుతుంది: రవిశాస్త్రి
India Vs Ireland T20I Series: మహారాష్ట్ర బ్యాటర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు పరిగెడుతూనే ఉంటుందంటూ కొనియాడాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడతాంటూ ఆకాశానికెత్తాడు. కాలం కలిసి రాలేదు! కానీ ఇప్పుడు.. కాగా ఐపీఎల్-2022లో సన్రైజర్స్కు ప్రాతినిథ్యం వహించిన రాహుల్ త్రిపాఠి 14 మ్యాచ్లలో కలిపి 413 పరుగులు చేశాడు. సగటు 37.5. స్ట్రైక్ రేటు 158.23. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్కు ఎంపికవుతాడనే విశ్లేషణలు వినిపించినా సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. అయితే, టీమిండియా ఐర్లాండ్ పర్యటన రూపంలో రాహుల్ త్రిపాఠికి అదృష్టం కలిసి వచ్చింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఐర్లాండ్తో ఆడనున్న రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడు ఎంపికయ్యాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే చాలు! ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డులో అంకెలు మారుతూనే ఉంటాయి. బంతిని సరిగ్గా అంచనా వేసి షాట్ సెలక్షన్ విషయంలో పక్కాగా ఉంటాడు. ప్రత్యర్థి జట్టుకు గానీ, బౌలర్లకు గానీ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వడు. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి ఇన్నింగ్స్ ఆడే విధానం చూడముచ్చటగా ఉంటుంది’’ అని రాహుల్ త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉంటే.. భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా 31 ఏళ్ల రాహుల్ త్రిపాఠి.. ‘‘నాకు దక్కిన గొప్ప అవకాశం. ఇన్నాళ్లకు కల నిజమైంది. నా హార్డ్వర్క్ను గుర్తించి సెలక్టర్లు ఈ ఛాన్స్ ఇచ్చారు. తుది జట్టులో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తాను’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! That feeling when your first series as a #TeamIndia player begins in 3️⃣ days 🧡@tripathirahul52 | #OrangeArmy pic.twitter.com/BBXMKH58Oc — SunRisers Hyderabad (@SunRisers) June 23, 2022 -
'టీ20 ప్రపంచకప్కు ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేయద్దు'
ఐపీఎల్లో అదరగొట్టిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్కు భారత జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న టీ20 సిరీస్లో భారత జట్టులో ఉమ్రాన్ భాగంగా ఉన్నాడు. అయితే ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు తుది జట్టులో ఉమ్రాన్కు చోటు దక్కలేదు. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత్ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో బీసీసీఐ యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఆర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్లను ప్రోటిస్ సిరీస్కు బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ను ఉద్దేశించి భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్కు మాలిక్ను భారత జట్టులోకి తీసుకోకూడదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. "ఉమ్రాన్కు ఇంకా టీ20ల్లో అంత అనుభవం లేదు. ఉమ్రాన్ను మరింత తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీ20 ప్రపంచకప్కు అతడిని భారత జట్టుకు ఎంపిక చేయవద్దు. అతడిని వైట్-బాల్ క్రికెట్ క్రికెట్లో కొన్నాళ్లపాటు ఆడనివ్వండి. అదే విధంగా టెస్టులో కూడా ఉమ్రాన్కు అవకాశం ఇవ్వాలి. అతడు రెడ్ బాల్ క్రికెట్లో ఎలా రాణిస్తాడో చూడాలి" అని రవిశాస్త్రి అని పేర్కొన్నాడు. చదవండి: David Miller Birthday: 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం -
Rafael Nadal: ‘సెల్యూట్ ఫరెవర్’.. నాదల్పై సచిన్, సెహ్వాగ్ ప్రశంసలు
టెన్నిస్ దిగ్గజం, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్పై భారత మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా పద్నాలుగవసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన ‘మట్టి కోర్టు మహారాజు’కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ‘‘36 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ఓపెన్లో రికార్డు స్థాయిలో 14వ టైటిల్.. 22వ గ్రాండ్స్లామ్ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతం.. అసాధారణ విజయం. కంగ్రాట్స్ నాదల్’’ అంటూ ట్విటర్ వేదికగా విష్ చేశారు. To go out there and win a record 14th @rolandgarros & 22nd Grand Slam at the age of 36 is an incredible achievement. Congratulations @RafaelNadal! 🏆🎾 pic.twitter.com/MAxsEklfFQ — Sachin Tendulkar (@sachin_rt) June 5, 2022 ఇక భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం.. ‘‘మట్టి కోర్టు రాజు.. గొప్ప ఆటగాడు.. చాంపియన్.. నాదల్.. ఫ్రెంచ్ఓపెన్లో 14వ టైటిల్’’ అంటూ నాదల్ ఫొటోను ట్వీట్ చేస్తూ అతడికి అభినందనలు తెలిపాడు. అదే విధంగా ప్రజ్ఞాన్ ఓజా, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, రాబిన్ ఊతప్ప ట్విటర్ వేదికగా నాదల్పై ప్రశంసల జల్లు కురిపించారు. నాదల్ను గ్రీక్ గాడ్ హెర్క్యులస్తో పోల్చిన రవిశాస్త్రి.. ఎర్రమట్టి కోర్టులో అతడు 15వ టైటిల్ కూడా గెలవాలని ఆకాంక్షించాడు. సెల్యూట్ ఫరెవర్ అంటూ అతడిని ఆకాశానికెత్తాడు. A modern day Hercules who just will not melt in the hottest Claypot. Starts favourite to make it 15 only. Just insane. Salute forever @RafaelNadal @rolandgarros #Nadal #FrenchOpen pic.twitter.com/XXfMHRgmku — Ravi Shastri (@RaviShastriOfc) June 5, 2022 కాగా ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాదల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి కాస్పర్ రూడ్ (నార్వే)ను 6–3, 6–3, 6–0తో ఓడించాడు. తద్వారా తద్వారా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను 14వసారి గెలిచిన నాదల్.. తన ఖాతాలో 22వ గ్రాండ్స్లామ్ టైటిల్ను జమ చేసుకున్నాడు. మట్టి కోర్టుకు తాను మకుటం లేని మహారాజునని మరోసారి నిరూపించుకుని కితాబులు అందుకుంటున్నాడు. ✅ Rafa 🆚 Ruud ✅ Double delight for France 🇫🇷 ✅ 1️⃣4️⃣ for @RafaelNadal Look back at Day 15 with the Best Moments of the Day by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoments pic.twitter.com/IPfdgyMB2w — Roland-Garros (@rolandgarros) June 5, 2022 చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! -
రవిశాస్త్రి, మియాందాద్ల గొడవకు కారణమైన 'ఆడి' కారు.?!
టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అందరికి సుపరిచితమే. మంచి ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి.. ఆటకు గుడ్బై చెప్పిన తర్వాత కామెంటేటర్గా, టీమిండియా హెడ్కోచ్గానూ సేవలందించాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్ లిస్టులోనూ తనది ప్రత్యేక స్థానం. ఇక గొప్ప ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. 1983 వరల్డ్కప్ గెలిచిన టీమిండియా జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నాడు. విషయంలోకి వెళితే.. 1985లో ఆస్ట్రేలియా వేదికగా బెన్సన్ అండ్ హెడ్జెజ్ వరల్డ్ చాంపియన్షిప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో భారత్, పాకిస్తాన్లు తలపడ్డాయి. చిరకాల ప్రత్యర్థి పాక్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా కప్ను ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్తో టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన రవిశాస్త్రి 182 పరుగులతో పాటు 8 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన రవిశాస్త్రి ఆడి కారును సొంతం చేసుకున్నాడు. విజయం అనంతరం ఆడి కారును రవిశాస్త్రి ఎంతో ఇష్టంగా డ్రైవ్ చేయగా.. తోటి టీమిండియా ఆటగాళ్లు కారు మీద కూర్చోని సెలబ్రేషన్స్ చేసుకోవడం అప్పట్లో ట్రెండింగ్గా మారింది. ఈ నేపథ్యంలో అదే ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ తనను అవమానించిన ఒక సంఘటనను.. ఆడి కారు గెలుచుకోవడం వెనుక ఉన్న కథను తాజాగా రివీల్ చేశాడు. ''1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడానికి మాకు మరో 15-20 రన్స్ అవసరం ఉంది. ఆ సమయంలో జావెద్ మియాందాద్ సెట్ చేసిన ఫీల్డ్ ను తెలుసుకోవడానికి స్క్వేర్ లెగ్ వైపు చూస్తున్నాను. అప్పుడు మిడ్ వికెట్ లో ఉన్న మియాందాద్ నా దగ్గరికి వచ్చి.. నువ్వు మళ్లీ మళ్లీ అక్కడేం చూస్తున్నావ్ అని తనదైన స్టైల్లో అన్నాడు. కారును ఎందుకు చూస్తున్నావ్.. అది నీకు దక్కదు అంటూ వెటకారంగా మాట్లాడాడు. దీనికి కౌంటర్గా అవును జావెద్.. నేను అటు వైపు చూడడం లేదు.. ఆ కారే నా వైపు చూస్తుంది.. నా ఇంటికి వస్తుంది అని పేర్కొన్నా'' అంటూ తెలిపాడు. ఇక 1983 వరల్డ్ కప్ గెలిచిన రెండేళ్లకే వరల్డ్ సిరీస్ గెలవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. తన జీవితంలో తాను చేసిన ఎన్నో పనుల కంటే ఆడి కారు టాప్ స్థానంలో ఉంటుందని పేర్కొన్నాడు. ఆరు సిక్స్లు కూడా ఎప్పటికీ గుర్తొచ్చేదే అయినా.. తన కెరీర్లో మాత్రం 1985లో సాధించిన ఆడి కారుకే ఎక్కువ విలువుంటుందని తెలిపాడు. అప్పుడప్పుడే వన్డే క్రికెట్ లోకి రంగులు రావడం, డే నైట్ మ్యాచ్ లు, రంగుల దుస్తులు తొలిసారి ఇండియాకు రావడం లాంటివి ప్రత్యేకమైనవి. ఇక ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడం అంటే అది పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్గా రాణిస్తున్నాడు. టీమిండియా హెడ్ కోచ్గా పనిచేసిన రవిశాస్త్రి కొన్ని అద్భుత విజయాల్లో భాగంగా నిలిచాడు. రవిశాస్త్రి హెడ్కోచ్గా టీమిండియా 43 టెస్టుల్లో 25 విజయాలు సాధించింది. ఇందులో రెండుసార్లు ఆసీస్ గడ్డపై సాధించిన టెస్టు సిరీస్ విజయాలు ఉండడం విశేషం. ఇక రవిశాస్త్రి 76 వన్డేల్లో 51 వన్డేలు, 65 టి20ల్లో 43 మ్యాచ్లు గెలిచింది. చదవండి: Arjun Tendulkar: తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా! Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక -
నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు
‘‘వినమ్రంగా వ్యవహరించిన తీరు.. సాటి ఆటగాడి పట్ల సహృదయ భావం నాదల్ను మరింత ప్రత్యేకంగా మార్చాయి’’ అంటూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్పై ప్రశంసలు కురిపించారు. అతడి క్రీడాస్ఫూర్తిని కొనియాడారు. కాగా ఫ్రెంచ్ ఓపెన్-2022 గ్రాండ్స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి సెమీస్లో నాదల్- మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) తలపడ్డారు. ఈ క్రమంలో నాదల్ తొలి సెట్ గెలవగా.. రెండో సెట్లో నాదల్ రిటర్న్ షాట్ను అందుకునే క్రమంలో దురదృష్టవశాత్తూ జ్వెరెవ్ జారిపడ్డాడు. నొప్పి తీవ్రతరం కావడంతో మళ్లీ కోర్టులో అడుగుపెట్టలేకపోయాడు. దీంతో నాదల్ను విన్నర్గా ప్రకటించారు. అయితే, చక్రాల కుర్చీలో బయటకు వెళ్లిన జ్వెరెవ్ మళ్లీ ‘క్రచెస్’ సాయంతో కోర్టులోకి వచ్చి ప్రేక్షకులను చూస్తూ అభివాదం చేసి వెళ్లాడు. అతడి నిష్క్రమణతో అభిమానులు నిరాశలో మునిగిపోగా.. నాదల్ సైతం జ్వెరెవ్కు ఇలా జరిగినందుకు విచారంగా కనిపించాడు. ప్రత్యర్థి ఆటగాడి పట్ల సానుభూతి చూపించాడు. భావోద్వేగానికి గురైన జ్వెరెవ్ను ఓదార్చాడు. ఇక జ్వెరెవ్ క్రచెస్ సాయంతో నడుస్తుండగా.. నాదల్ అతడి పక్కనే బాధగా ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సచిన్ నాదల్ను కొనియాడాడు. ఇక టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సైతం.. ‘‘ఇలాంటివి చూసినపుడే కదా హృదయం ద్రవిస్తుంది. నువ్వు త్వరలోనే తిరిగి వస్తావు జ్వెరెవ్. ఇక నాదల్ క్రీడాస్ఫూర్తికి చేతులెత్తి నమస్కరించాలి. అన్ని రకాలుగా గౌరవం అందుకునేందుకు అతడు అర్హుడు’’ అని ట్వీట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో విజయంతో నాదల్ ఏకంగా 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కు చేరుకున్నాడు. The humility and concern shown by Nadal is what makes him so special.#RolandGarros pic.twitter.com/t7ZE6wpi47 — Sachin Tendulkar (@sachin_rt) June 3, 2022 This is why sport can make you cry. You will be back @AlexZverev. @RafaelNadal - Sportsmanship, humility. Just brilliant and respect 🙏🙏🙏 #FrenchOpen2022 #RolandGarros pic.twitter.com/n5JFNFK7r1 — Ravi Shastri (@RaviShastriOfc) June 3, 2022 ⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points! Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v — Roland-Garros (@rolandgarros) June 3, 2022 -
ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక
ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఫైనల్ పోరుకు తెర లేచింది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ విషయం పక్కనబెడితే టాస్కు ముందు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కాగా ఫైనల్ మ్యాచ్కు రవిశాస్త్రి ప్రెజంటేటర్గా వ్యవహరించాడు. టాస్ వేసిన తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కాగా హార్దిక్ను రవిశాస్త్రి ఎంతగానో ప్రోత్సహించాడు. టీమిండియా హెడ్కోచ్గా ఉన్నప్పుడు హార్దిక్కు సపోర్ట్ ఇస్తూ రాటుదేలేలా చేశాడు. అందుకే వీరిద్దరి భేటీ ఆసక్తిని కలిగించింది. కాగా హార్దిక్ మాట్లాడుతూ.. ''టాస్ గెలిచి రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుండడంతో మేం బౌలింగ్ చేయబోతున్నాం. అయితే ఫైనల్ మ్యాచ్కు సొంత గడ్డపై జరగడం మాకు సానుకూలాంశం. దీనికి తోడు మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఎక్కువశాతం మాకు మద్దతు ఇస్తుండడం మరింత బూస్టప్ను ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్ అయినప్పటికి ఒక సాధారణ మ్యాచ్లానే భావిస్తున్నాం. ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. మా జట్టు మొత్తం పూర్తి సంతోషంగా ఉంది.'' అంటూ పేర్కొన్నాడు. కాగా పాండ్యా వెళ్లబోతూ శాస్తిని చూస్తూ..''మిమ్మల్ని ఇక్కడ చూడడం సంతోషంగా ఉంది'' అని పేర్కొన్నాడు. దీనికి రవిశాస్త్రి పాండ్యాను హగ్ చేసుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. చదవండి: Hardik Pandya: 'ఫైనల్ మ్యాచ్లు నాకు కలిసొచ్చాయి.. గుజరాత్ టైటాన్స్దే కప్' -
అతడు టీమిండియా లీడింగ్ ఆల్రౌండర్ అవుతాడు: రవిశాస్త్రి
IPL 2022- SRH Vs PBKS: సన్రైజర్స్ హైదరాబాద్ యువ క్రికెటర్, టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్పై భారత జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. టీమిండియాలో కీలక ఆల్రౌండర్గా ఎదుగుతాడని, అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతాడని కొనియాడాడు. తను ఆటను తేలికగా తీసుకోడని, సీరియస్ క్రికెటర్ అని కితాబిచ్చాడు. ఐపీఎల్-2022లో ఆఖరి లీగ్ మ్యాచ్ సందర్భంగా రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. లీగ్ ముగింపు దశలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఆదివారం(మే 22) పంజాబ్ కింగ్స్తో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులు చేశాడు. అదే విధంగా 2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ టీమిండియా లీడింగ్ ఆల్రౌండర్లలో ఒకడిగా ఎదుగుతాడు. భవిష్యత్తు ఆశాకిరణం అతడే. జడేజా ఫిట్గా ఉండి ఇంకొన్నేళ్లు ఆడగలిగినా.. అక్షర్ పటేల్ జట్టులో ఉన్నప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ ప్రీమియర్ ఆల్రౌండర్ అవుతాడు. అన్ని ఫార్మాట్లలోనూ తన మార్కు చూపిస్తాడు. అతడు సీరియస్ క్రికెటర్. యువకుడే అయినప్పటికీ ఆట పట్ల అతడికి ఉన్న అవగాహన అమోఘం. ముఖ్యంగా షాట్ సెలక్షన్ విషయంలో తను తానే సాటి. అయితే, ఫిట్నెస్పై దృష్టి సారించాలి. రానున్న మూడేళ్లలో టీమిండియాలో కీలక ఆల్రౌండర్ అవుతానని అద్దంలో చూసుకుంటూ తనను తాను చెప్పుకోగల అర్హత కలిగిన ఏకైక ఆటగాడు అతడు’’ అంటూ వాషింగ్టన్ సుందర్పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2022లో వాషింగ్టన్ సుందర్ సన్రైజర్స్ తరఫున ఏడు ఇన్నింగ్స్లో కలిపి 101 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 40. 8 ఇన్నింగ్స్లలో అతడు పడగొట్టిన వికెట్ల సంఖ్య 6. గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు సుందర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ పంజాబ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. చదవండి👉🏾IND Vs SA: డీకేను సెలక్ట్ చేసినపుడు ధావన్ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు చదవండి👉🏾Ind Vs SA: వాళ్లందరికీ అవకాశం.. మీరు పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ బ్యాటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 70 as @PunjabKingsIPL end their campaign on a winning note. Win by 5 wickets in 15.1 overs. Scorecard - https://t.co/MmucFYpQoU #SRHvPBKS #TATAIPL pic.twitter.com/ujbQsZaUMz — IndianPremierLeague (@IPL) May 22, 2022 -
పంత్ను ఏకి పారేసిన రవిశాస్త్రి.. బ్రెయిన్ దొబ్బిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు
ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక సమరంలో ఓడి, ప్లే ఆఫ్స్కు చేరే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ పంత్ ఉదాసీనంగా వ్యవహరించి ముంబైని దగ్గరుండి మరీ గెలిపించాడని ధ్వజమెత్తాడు. టిమ్ డేవిడ్ డీఆర్ఎస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంత్.. ఆర్సీబీకి (ప్లే ఆఫ్స్కు చేరేందుకు)పరోక్షంగా సహకరించాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. Dehli Capital didn't review this against mighty Tim David and that could have cost them the play-off spot, oh dear! #MIvDC #DCvMI #IPL2022 pic.twitter.com/zv1Cu5Os2M — Ahmad Haseeb (@iamAhmadhaseeb) May 21, 2022 అవకాశమున్నా పంత్ సమీక్షను తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. 2 సమీక్షలు మిగిలి ఉన్నా పంత్ కామన్ సెన్స్ ఉపయోగించలేకపోయాడని, అతని మైండ్ దొబ్బిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ సరైన నిర్ణయం తీసుకోలేకపోతే పక్కనున్న ఆటగాళ్లైనా సలహా ఇవ్వాల్సిందని, కానీ వారు కూడా తమకేమీ పట్టలేదన్నట్లుగా వ్యవహరించారని దుయ్యబట్టాడు. ఢిల్లీ ఆటగాళ్లంతా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్తును బంగారు పళ్లెంలో పెట్టి అందించారని అన్నాడు. కాగా, ముంబైతో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ తొలి బంతికే క్యాచ్ ఔట్ కావాల్సింది. కానీ, రిషబ్ పంత్ డీఆర్ఎస్ తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంతో టిమ్ బయటపడ్డాడు. అనంతరం టిమ్ సుడిగాలి ఇన్నింగ్స్ (11 బంతుల్లోనే 34 పరుగులు) ఆడి ఢిల్లీ చేతుల్లోనుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. ఫలితంగా ఢిల్లీ ఇంటికి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరాయి. చదవండి: టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్ -
కోహ్లి అభిమానులంతా రోహిత్ వెంటే.. హిట్మ్యాన్ రెచ్చిపోవడం ఖాయం..!
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ (మే 21) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ నాలుగో స్థానాన్ని ఖరారు చేసే ఈ బిగ్ ఫైట్లో ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్ను ఢీకొట్టనుంది. 13 మ్యాచ్ల్లో 10 పరాజయాలతో ముంబై ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. 13 మ్యాచ్ల్లో 7 విజయాలు (14 పాయింట్లు, 0.225 రన్రేట్) సాధించిన ఢిల్లీ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలుపొంది, ఆర్సీబీ (16 పాయింట్లు, -0.253 రన్రేట్)ని వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్కు చేరుకోవాలని పట్టుదలగా ఉంది. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక సమరం కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబైతో ఢిల్లీ సమరం ఆర్సీబీ ఫేట్ను డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో కోహ్లి, ఆర్సీబీ అభిమానులంతా ముంబై ఎలాగైనా గెలవాలని ప్రార్ధిస్తున్నారు. ఇందు కోసం వారు ఈగోలను పక్కకు పెట్టి రోహిత్ శర్మ, అతని జట్టు ముంబై ఇండియన్స్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరుకోనుంది. ఒకవేళ ఢిల్లీ గెలిచిందా ఆర్సీబీ అవకాశాలు ఆవిరవుతాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. విరాట్, ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా రోహిత్ శర్మ వెంటే ఉన్నారని, హిట్ మ్యాన్ సీజన్ లాస్ట్ మ్యాచ్లో చెలరేగిపోతాడని, ఆర్సీబీకి అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో అతను భారీ స్కోర్ సాధించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. రోహిత్కు కోహ్లి, ఆర్సీబీ అభిమానుల మద్దతు కూడా ఉంటుంది కాబట్టి అతన్ని ఆపడం ఎవరితరం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డీసీతో మ్యాచ్లో రోహిత్ కనీసం అర్ధసెంచరీ సాధిస్తాడా అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో లో జరిగిన డిబేట్ సందర్భంగా రవిశాస్త్రి ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా, ఐపీఎల్ ప్రారంభం నుంచి ప్రతి సీజన్లో కనీసం ఓ హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ప్రస్తుత సీజన్లో ఆ రికార్డును కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. రోహిత్ ఈ సీజన్లో ఆడిన 13 మ్యాచ్ల్లో 48 అత్యధిక స్కోర్తో కేవలం 266 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ హాఫ్ సెంచరీ కాకుండా ఏకంగా శతకం బాది తన జట్టును గెలిపించాలని ఆర్సీబీ, కోహ్లి అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: IPL 2022: గుజరాత్ బ్యాటర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్ -
'అర్థం పర్థం లేని ట్వీట్స్.. మాకేదో తేడా కొడుతోంది'
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి శుక్రవారం ఎప్పుడు లేనంత కొత్తగా కనిపించాడు. ఎక్కువగా క్రికెట్ సంబంధిత అంశాలపై చర్చలు జరిపే రవిశాస్త్రి ఉన్నట్లుండి తన లుక్ను పూర్తిగా మార్చేశారు. ఫ్లెష్ జాకెట్.. కూలింగ్ గ్లాసెస్.. మెడలో గోల్డ్ చైన్.. స్వాగ్లుక్ దుమ్మురేపాడు. అయితే ఈ ఫోటోలు షేర్ చేయడం వరకు ఓకే.. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. హుందాగా కనిపించే రవిశాస్త్రిలో ఇన్ని వేరియషన్స్ ఉన్నాయా అన్న అనుమానం క్రికెట్ ఫ్యాన్స్కు కలిగింది. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి ట్విటర్ అకౌంట్ హ్యాక్కు గురైందంటూ పేర్కొన్నారు. ఎప్పుడు లేనంతగా రవిశాస్త్రి సింగిల్ లైన్ క్యాప్షన్స్ ఎక్కువగా జత చేశారు. మూడు ఫోటోలు షేర్ చేసిన ఆయన.. మూడు విభిన్నమైన లైన్స్ను క్యాప్షన్గా పెట్టారు. చివరగా..''నేను చిల్ అవ్వాలంటే ఏమి చెయ్యాలి''.. ''మంచి మూడ్లో ఉన్నా.. నన్ను ఏమైనా అడగొచ్చు'' అంటూ శాస్త్రి నుంచి ట్వీట్ వచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ''అర్థం పర్థం లేని ట్వీట్స్.. కచ్చితంగా రవిశాస్త్రి అకౌంట్ హ్యాక్ అయినట్లే'' అంటూ కన్ఫర్మ్ చేశారు. కాగా రవిశాస్త్రి ప్రస్తుతం ఐపీఎల్ 2022(ఇండియన్ ప్రీమియర్ లీగ్) బ్రాడ్కాస్ట్ డ్యూటీ నిర్వహిస్తున్నాడు. ఆటగాళ్ల బ్యాటింగ్, ఆటతీరు, ఫామ్ తదితర అంశాలపై చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నాడు. కాగా గతేడాది టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్కోచ్గా వ్యవహరించాడు. అయితేఘా టోర్నీలో టీమిండియా సూపర్-12 దశను దాటలేక చతికిలపడింది. అందునా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా అతని హయాంలో టీమిండియా మేజర్ టోర్నీల్లో గెలవనప్పటికి స్వదేశంలో, విదేశాల్లో చారిత్రాక సిరీస్లు గెలిచింది. ఇక టీమిండియా తరపున మంచి ఆల్రౌండర్గా పేరు పొందిన రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్లు ఆడాడు. చదవండి: Ravi Shastri New Look: న్యూలుక్స్తో దుమ్మురేపుతున్న టీమిండియా మాజీ కోచ్ Mujhe kya mein toh chill hun 🍻 — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 I’m in a good mood today, ask me anything. #AskRavi — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 -
న్యూలుక్స్తో దుమ్మురేపుతున్న టీమిండియా మాజీ కోచ్
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి శుక్రవారం కొత్త లుక్లో దర్శనమిచ్చాడు. ఈ మధ్య కాలంలో క్రికెట్ అంశాలు తప్ప రవిశాస్త్రి గురించి పెద్దగా చర్చించుకోవాల్సింది ఏం లేదు. అయితే తాజాగా ట్విటర్ వేదికగా రవిశాస్త్రి రిలీజ్ చేసిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. క్రికెటర్ రవిశాస్త్రిలా కాకుండా స్వాగ్లుక్తో అదరగొడుతున్నాడు. తొలి ఫోటోలో ఫ్లాషీ జాకెట్తో.. మెడల్ గోల్డ్ చైన్.. కూలింగ్ గ్లాసెస్.. ఎవరికో చేతులు ఊపుతూ రస్టిక్ లుక్లో కనిపించాడు. ''నా ఫ్యామిలీ ముంబైలో ఉంది.. నేను ఈ క్షణంతో గడుపుతున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక రెండో ఫోటోలో గుడ్మార్నింగ్ చెబుతూ.. ''నిద్రపోని వారికి గుడ్ మార్నింగ్ అనేది ఆప్షనల్గా కనిపిస్తుంది.'' అని పేర్కొన్నాడు. ఇక చివరగా మూడో ఫోటోను రిలీజ్ చేశాడు. ఆ ఫోటోలో ఒకావిడతో చాట్ చేస్తూ కనిపించిన రవిశాస్త్రి.. ''నేను ఆమె కలలో ఉన్నాను.. అయితే ఆమె మాత్రం నా వీఐపీ గెస్ట్లిస్ట్లో ఒకరు'' అంటూ క్యాప్షన్ పేర్కొన్నాడు. రవిశాస్త్రి ప్రస్తుతం ఐపీఎల్ 2022(ఇండియన్ ప్రీమియర్ లీగ్) బ్రాడ్కాస్ట్ డ్యూటీ నిర్వహిస్తున్నాడు. ఆటగాళ్ల బ్యాటింగ్, ఆటతీరు, ఫామ్ తదితర అంశాలపై చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నాడు. కాగా గతేడాది టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్కోచ్గా వ్యవహరించాడు. అయితేఘా టోర్నీలో టీమిండియా సూపర్-12 దశను దాటలేక చతికిలపడింది. అందునా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా అతని హయాంలో టీమిండియా మేజర్ టోర్నీల్లో గెలవనప్పటికి స్వదేశంలో, విదేశాల్లో చారిత్రాక సిరీస్లు గెలిచింది. ఇక టీమిండియా తరపున మంచి ఆల్రౌండర్గా పేరు పొందిన రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్లు ఆడాడు. చదవండి: Babar Azam: నిబంధన తుంగలో తొక్కిన పాక్ కెప్టెన్.. పీసీబీ సీరియస్ My family lives in Mumbai and I live in the moment. pic.twitter.com/22BBncYoDL — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 ‘Good mornings’ are optional if you haven’t slept at all. pic.twitter.com/4OhSYEg3Ln — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 You’re in her DMs. She’s on my VIP guestlist. pic.twitter.com/eJTzoVKMz3 — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 -
'ఇలాగే ఉంటే 156.. 256 అవుతుంది'.. ఎస్ఆర్హెచ్ బౌలర్కు వార్నింగ్
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఎస్ఆర్హెచ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్కు తనదైన శైలిలో హెచ్చరికలు పంపాడు. సీజన్ ఆరంభం నుంచి అత్యంత వేగవంతమైన బంతులు సంధించడంతో పాటు కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రతీ మ్యాచ్లోనూ గంటకు 150 కిమీ వేగంపైనే ఉమ్రాన్ బంతులు వేస్తున్నాడు. ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన డెలవరీ ఉమ్రాన్ పేరిటే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఉమ్రాన్ ఒక బంతిని దాదాపు 157 కిమీ వేగంతో విసిరాడు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్లోనూ మరోసారి 156 కిమీ వేగంతో బంతులను సంధించాడు. ఈ సీజన్లో ఏడుసార్లు అత్యంత ఫాస్ట్ డెలివరీ అవార్డును అందుకున్న ఉమ్రాన్ మాలిక్పై ప్రశంసలు కురిశాయి. రానున్న టి20 ప్రపంచకప్కు ఉమ్రాన్ను ఎంపిక చేయాలని.. బుమ్రాకు సరైన జోడి అంటూ పలువురు మాజీలు సహా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే గత మూడు మ్యాచ్ల నుంచి చూసుకుంటే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ గాడి తప్పినట్లనిపిస్తుంది. వరుసగా మూడు మ్యాచ్లు(సీఎస్కేపై 4 ఓవర్లలో 48, ఢిల్లీ క్యాపిటల్స్పై 4 ఓవర్లలో 52, ఆర్సీబీపై 2 ఓవర్లలో 25) కలిపి 125 పరుగులు ఇవ్వడమేగాక ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.కాగా వరుసగా బౌలింగ్లో విఫలమవుతున్న ఉమ్రాన్పై రవిశాస్త్రి స్పందించాడు. ''ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ బాగుంది. ప్రతీ మ్యాచ్లో గంటకు 156, 157 కిమీవేగంతో బంతులు విసరడమనేది మాములు విషయం కాదు. అలా చేయాలంటే కచ్చితమైన ఫిట్నెస్ ఉండి తీరాల్సిందే. ఈ సీజన్ ఆరంభం నుంచి అతను మంచి లైన్ అండ్ లెంగ్త్తో పాటు గుడ్పేస్తో బౌలింగ్ కొనసాగిస్తున్నాడు. మనకు మరో భవిష్యత్తు ఆశాకిరణం కనిపిస్తున్నాడని.. మంచి బౌలర్గా తయారవుతాడని అందరు మెచ్చుకున్నారు. కానీ అదే ఉమ్రాన్ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్ల్లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇలాగే ఉంటే 156 కచ్చితంగా 256 అవుతుంది.. దీనర్థం మిగతా మ్యాచ్ల్లోనూ అతను వికెట్లు తీయలేక ఎక్కువ పరుగులు ఇవ్వడమే. దీనిని ఉమ్రాన్ వీలైనంత తొందరగా కరెక్ట్ చేసుకోవాలి.. లేదంటే అతనికి భారీ నష్టమే మిగులుతుంది. మంచి స్పీడ్ ఒక్కటే కాదు.. లైన్ అండ్ లెంగ్త్ కూడా ముఖ్యమే.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఆరంభంలో రెండు మ్యాచ్ల్లో ఓడినప్పటికి.. ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. ఏడు మ్యాచ్లు పూర్తయ్యేసరికి టాప్-2లో ఉన్న ఎస్ఆర్హెచ్.. గుజరాత్తో మ్యాచ్లో ఓటమి చవిచూసింది. అక్కడి నుంచి మళ్లీ హ్యాట్రిక్ పరాజయాలు చూసిన ఎస్ఆర్హెచ్ మొత్తంగా 11 మ్యాచ్ల్లో ఐదు విజయాలు.. ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక ప్లే ఆఫ్కు చేరాలంటే ఎస్ఆర్హెచ్ తన చివరి మూడు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. చదవండి: IPL 2022: ధోని.. బ్యాట్ కొరకడం వెనుక అసలు కథ ఇదే! SRH Vs RCB: కోహ్లి గోల్డెన్ డక్.. జగదీశ సుచిత్ అరుదైన రికార్డు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: విఫలమవుతున్న కోహ్లి.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు!
IPL 2022: Ravi Shastri Comments On VIrat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్-2022 సీజన్ అస్సలు కలిసి రావడం లేదు. తాజా ఎడిషన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బ్యాటర్గా బరిలోకి దిగిన కోహ్లి ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్లలో అతడు సాధించినవి 128 పరుగులు(అత్యధిక స్కోరు 48). ఇక ఆయుష్ బదోని వంటి అరంగేట్ర ఆటగాళ్ల స్కోరు(7 ఇన్నింగ్స్లో 134 పరుగులు- అత్యధికం 54) కంటే కూడా కోహ్లి స్కోరు తక్కువ కావడం గమనార్హం. గత కొన్ని రోజులుగా ఫామ్లేమితో సతమవుతున్న ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం(ఏప్రిల్ 27) మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగినా ఆటతీరు మాత్రం మారలేదు. ఈ మ్యాచ్లో.. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 9 పరుగులు(2 ఫోర్లు) మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో కోహ్లి ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టులో నుంచి తీసేయాలంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్, కోహ్లికి సన్నిహితుడిగా పేరొందిన రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని సూచించాడు. అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదని అభిప్రాయపడ్డాడు. కోహ్లికి మాత్రమే తన సలహా పరిమితం కాదని, అతడిలా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న వాళ్లు బ్రేక్ తీసుకుంటే మంచిదని సూచించాడు. ఈ మేరకు రవిశాస్త్రి ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ..‘‘గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి నిర్విరామంగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. తనకు బ్రేక్ అత్యవసరం. ఈ ఏడాది తను ఎలాగో ఐపీఎల్ ఆడుతున్నాడు. పర్లేదు. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో ఆరేడేళ్ల పాటు తన మార్కు చూపించాలనుకుంటే ఐపీఎల్ నుంచి వైదొలగడమే మంచిది. తనొక్కడే కాదు తనలా ఇబ్బంది పడుతున్న ఇతర ఆటగాళ్లు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మేలు’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి👉🏾 IPL 2022: ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ అతడే: టీమిండియా మాజీ క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 39.@rajasthanroyals take this home by 29 runs. Scorecard - https://t.co/fVgVgn1vUG #RCBvRR #TATAIPL pic.twitter.com/9eGWXFjDCR — IndianPremierLeague (@IPL) April 26, 2022 -
'కొన్ని శక్తులు నాశనం చేయాలనుకున్నాయి.. దృఢంగా నిలబడ్డా'
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''హెడ్కోచ్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు కొన్ని తెలియని శక్తులు గ్యాంగ్గా ఏర్పడి నన్ను నాశనం చేయాలని చూశారు.. నా మనోబలం గొప్పది. విమర్శలు తట్టుకునే శక్తి కలది'' అని పేర్కొన్నాడు. ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘'నా దగ్గర కోచింగ్ బ్యాడ్జీలు లేవు... లెవెన్ 1? లెవన్ 2? అలా ఏ బ్యాడ్జీలు లేవు. మన దేశంలో ఒకడు ఎదుగుతున్నాడంటే కొంతమంది దాన్ని చూసి తట్టుకోలేరు... మనం ఓడిపోవాలని కోరుకుంటుంటారు. నా విషయంలో అదే జరిగింది. నేను హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మేం ఓడిపోవాలని చాలామంది కోరుకున్నారు. అయితే నా సంకల్పం చాలా దృఢమైనది. డ్యూక్ బాల్స్కి వాడే తోలు కంటే నా చర్మం బలంగా ఉంటుంది. అంత తేలిగ్గా నేను ఎవరికి లొంగను. ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడను. ఇక్కడ మనం ఏం చేసినా, దాన్ని విమర్శించడానికి, తప్పులు వెతకడానికి చాలామంది ఖాళీగా ఉంటారు. దేశవాళీ క్రికెట్లో ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే పని కంటే మాటలు పడుతూ, చాలామందికి ఏం చేస్తున్నామో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్లేయర్లను అర్థం చేసుకుని, వారిని ముందుగా మనం నమ్మి, వారిపై వారికి నమ్మకం కలిగిస్తే చాలు.. విజయాలు వాటంతట అవే వస్తాయి. టీమ్ కల్చర్ పాడుకాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆస్ట్రేలియాలో కమ్మిన్స్, స్టార్క్, హజల్వుడ్ వంటి పేస్ అటాకింగ్ని తట్టుకుని, అది కూడా 1-0 తేడాతో వెనకబడిన తర్వాత సిరీస్ గెలుస్తామని ఎవరైనా ఊహించి ఉంటారా... కానీ మేం చేసి చూపించాం..ఇంగ్లండ్లోనూ అంతే. ఇలాంటి విజయాలు ఏ జట్టుకైనా అంత తేలిగ్గా దొరకవు. ఇండియా సాధించిన విజయాలను రిపీట్ చేయడానికి చాలా టైం పడుతుంది’' అంటూ పేర్కొన్నాడు. కాగా 2017 నుంచి 2021 వరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్కోచ్గా పనిచేశాడు. కోచ్గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా విదేశాల్లో అసాధ్యమైన విజయాలు సాధించాడు రవిశాస్త్రి. కోహ్లీతో పాటు రహానే, రోహిత్ శర్మ కెప్టెన్సీలో.. రవిశాస్త్రి కోచింగ్లో టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియాలో ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాభవం తర్వాత ఊహించని రీతిలో ఫుంజుకున్న టీమిండియా 1-2 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుని ఔరా అనిపించింది. రవిశాస్త్రి కోచ్గా ఉన్న సమయంలోనే ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల్లోనూ అద్భుత విజయాలు సాధించింది. చదవండి: Max Verstappen: 'స్పోర్ట్స్మన్ ఆఫ్ ది ఇయర్'గా ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ బుడగ లేకుండానే భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ -
'మానసికంగా అలసిపోయాడు.. రెండు నెలలు పక్కనబెడితే సర్దుకుంటుంది'
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి మానసికంగా అలసిపోయాడని.. అతనికి రెండు నెలల విశ్రాంతి ఇస్తే అంతా సర్దుకుంటుందని పేర్కొన్నాడు. మంగళవారం స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్య్వూలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. ''కోహ్లి మానసికంగా బాగా అలసిపోయాడు. అది అతని ఆటపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కనీసం అతనికి రెండు నెలలైనా విశ్రాంతినిస్తే బాగుంటుంది. 2019 నవంబర్ తర్వాత కోహ్లి మళ్లీ సెంచరీ చేయలేదు. అతని సెంచరీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్తోనైనా ఆ కొరత తీరుస్తాడనుకుంటే నిరాశే మిగులుతుంది. దీంతో సెంచరీ అందుకోవాలనే తాపత్రయంలో ఒత్తిడిలో నలిగిపోతున్నాడు. ఆటగాళ్లు విఫలమైనప్పుడు వారిపట్ల సానభూతితో ఉండాలి.. అనవసర ంగా ఒత్తిడి తెస్తే ప్రయోజనం ఉండదు. దీనికి ఒకటే మార్గం ఉంది. అదే విశ్రాంతి. అయితే ఇంగ్లండ్ పర్యటనకు ముందన్న లేక తర్వాతైనా కోహ్లికి విశ్రాంతి ఇస్తే బాగుంటుంది. కోహ్లిలో ఇంకా 6-7 ఏళ్ల క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడితో ఆడించి ఆటకు దూరం చేయకూడదు. ఇది ఒక్క కోహ్లి పరిస్థితి మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్లో ఇలాంటి సమస్య ఎదుర్కొన్న క్రికెటర్లు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. అసలు సమస్య ఏంటో గుర్తిస్తే మంచిది'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకున్న కోహ్లి బ్యాట్స్మన్గా ఇరగదీస్తాడనుకుంటే నిరాశే మిగులుతుంది. ఐపీఎల్ 2022 సీజన్లో కోహ్లి ఇప్పటివరకు ఏడు మ్యాచ్ల్లో 19.83 సగటుతో 119 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో కోహ్లిని దురదృష్టం కూడా వెంటాడుతుంది. అనవసర రనౌట్లు, అంపైర్ నిర్ణయాలకు బలవ్వడం జరిగాయి. ఇక లక్నోతో మ్యాచ్లో కోహ్లి ఏకంగా గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చదవండి: Surya Kumar Yadav: 'కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్.. తలదించుకొనే బ్యాటింగ్ కొనసాగించా' కోహ్లి గోల్డెన్ డక్ ఎక్స్ప్రెషన్పై ఆసక్తికర ట్వీట్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ -
'తమాషానా.. అలాంటి క్రికెటర్పై జీవితకాల నిషేధం విధించాలి'
టీమిండియా ఆటగాడు.. రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజ్వేంద్ర చహల్ ఒక విదేశీ క్రికెటర్ నుంచి ఎదురైన చేదు అనుభవం గురించి ఇటీవలే పంచుకున్న సంగతి తెలిసిందే. జట్టు సహచర ఆటగాళ్లు రవిచంద్ర అశ్విన్, కరుణ్ నాయర్లకు తన జీవితంలో జరిగిన దుర్ఘటనను, అందులో నుంచి బయటపడిన తీరును చహల్ వివరించాడు. తాగిన మైకంలో సహచర క్రికెటర్ తనను 15వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు తోసేయబోయాడంటూ.. తృటిలో ప్రాణాలు కాపాడుకున్నాని చహల్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ట్విటర్లో షేర్ చేయగా వైరల్గా మారింది. అయితే చహల్ ఆ క్రికెటర్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా చహల్కు జరిగిన చేదు అనుభవంపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇలాంటి పిచ్చి పని చేసిన ఆ క్రికెటర్ను జీవితకాలం నిషేధించడమే సరైనదని పేర్కొన్నాడు. ‘'ఈ ఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలి. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అలా చేయడం ఆందోళనకరం. ఇది ఫన్నీ విషయం కానే కాదు. ఇలాంటి విషయం వినడం నాకైతే ఇదే మొదటిసారి. ఈరోజు గనక అలాంటి ఘటన జరిగితే సదరు ఆటగాడిపై జీవితకాలం నిషేధం విధించాలి. వీలైనంత త్వరగా ఆ వ్యక్తిని మానసిక పునరావికాస కేంద్రానికి పంపించాలి. సదరు ఆటగాడిని క్రికెట్ మైదానం దగ్గరికి రానివ్వకపోవడమే మంచిది. ఇదే సమయంలో ఆటగాళ్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు త్వరగా రిపోర్టు చేయాలి. ఇది తమాషా విషయం కాదు. అవినీతి నిరోధక శాఖకు అవినీతి అధికారుల గురించి చెప్పినట్టు.. ఇలాంటి మానసిక రోగుల గురించి కూడా తెలియజేయాలి.'’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇదంతా 2013లో చోటుచేసుకుంది. అప్పుడు యజ్వేంద్ర చాహల్ ముంబై జట్టులో ఉన్నాడు. చాహల్ ను తోసేయబోయింది విదేశీ ప్లేయర్ అని అతడు హింట్ ఇచ్చాడు. ఆ సమయంలో ముంబైలో ఉన్న విదేశీ ఆటగాళ్లలో ఏడెన్ బ్లిజర్డ్, జేమ్స్ ఫ్రాంక్లిన్, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, మిచెల్ జాన్సన్, డ్వేన్ స్మిత్ లు ఉన్నారు. మరి వీరిలో చాహల్ ను బాల్కనీ నుంచి తోసేయాలనుకున్నది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: Yuzvendra Chahal: ఆ క్రికెటర్ తాగిన మైకంలో నన్ను... చహల్ షాకింగ్ కామెంట్స్.. చచ్చేవాడిని! Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV — Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022 -
ఆ వెటరన్ ప్లేయర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయం..!
ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న ఆర్సీబీ ఆటగాడు దినేశ్ కార్తీక్కు భారత టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కడం ఖాయమని జోస్యం చెప్పాడు. మ్యాచ్ ఫినిషర్ పాత్రలో డీకే టీమిండియాకు ఎంపికవుతాడని అభిప్రాయపడ్డాడు. టీమిండియాలో ధోని తర్వాత ఆ స్థాయి ఫినిషర్ కనబడలేదని, దినేశ్ కార్తీక్ ధోనిలా ఫినిషర్ పాత్రను తప్పక న్యాయం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. డీకే ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే టీమిండియాకు ఎంపిక కావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని, అతని వయసును భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవచ్చని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ల రూపంలో భారత వికెట్కీపింగ్ విభాగం బలంగానే ఉన్నప్పటికీ.. ఫినిషర్గా డీకేకు లభించి అవకాశాలను కొట్టిపారేయలేమని పేర్కొన్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్లతో పాటు నాలుగేళ్ల క్రితం నిదాహాస్ ట్రోఫీలో కార్తీక్ ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లను సగటు భారతీయ అభిమాని ఎప్పటికీ మరువలేడని అన్నాడు. కాగా, శ్రీలంకతో జరిగిన నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో కార్తీక్ 8 బంతుల్లో 29 పరుగులు సాధించడంతో పాటు ఆఖరి బంతికి సిక్సర్ బాది టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఆర్సీబీ ఆడిన 3 మ్యాచ్ల్లో డీకే 204.55 స్ట్రయిక్ రేట్తో 90 పరుగులు సాధించి, ఆ జట్టు సాధించిన రెండు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. చదవండి: బోణీ విజయం కోసం తహతహలాడుతున్న ఎస్ఆర్హెచ్, సీఎస్కే.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..? -
అతనిది వేరే లెవెల్.. ఉమ్రాన్ మాలిక్పై టీమిండియా మాజీ కోచ్ ప్రశంసల వర్షం
IPL 2022: సన్రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ కశ్మీరీ బౌలర్ది టీమిండియా స్థాయి అని కొనియాడాడు. మాలిక్పై టీమిండియా సెలెక్టర్లు ఓ కన్నేసి ఉంచాలని, అతనికి జాతీయ జట్టులో చోటు కల్పిస్తే అద్భుతాలు చేస్తాడని జోస్యం చెప్పాడు. గత కొంత కాలంగా మాలిక్ భీకరమైన పేస్తో బంతులను సంధిస్తున్నాడని, అతనిలో నిత్యం ఏదో ఒకటి నేర్చుకునే తత్వం కనబడుతుందని, ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణాల్లా మారతారని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న భారత యువ పేసర్లలో మాలిక్ అత్యద్భుతమని కితాబునిచ్చాడు. బంతిని ల్యాండ్ చేసే విషయంలో కొద్దిగా సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ, సరైన శిక్షణతో ఆ లోపాన్ని అధిగమించవచ్చని సలహా ఇచ్చాడు. కాగా, ఉమ్రాన్ మాలిక్ రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి అందరి దృష్టినీ మరోసారి ఆకర్షించాడు. గతేడాది ఐపీఎల్లో మాలిక్ ఏకంగా 153 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి.. తొలిసారి వార్తల్లో నిలిచాడు. ఈ ప్రదర్శన కారణంగానే సన్రైజర్స్ అతన్ని ఈ ఏడాది రిటైన్ చేసుకుంది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో మిగతా పేసర్లందరూ బౌలింగ్ చేసేందుకు ఇబ్బందిపడినప్పటికీ మాలిక్ మాత్రం అద్భుతమైన పేస్తో బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుని 2 కీలక వికెట్లు పడగొట్టాడు. గత సీజన్ తరహాలోనే ఐపీఎల్ 2022 తొలి మ్యాచ్లోనూ ఎస్ఆర్హెచ్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ రాజస్థాన్ చేతిలో 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. చదవండి: 'అతడు ఫుల్ ఫిట్గా ఉన్నాడు.. ప్రపంచకప్ భారత జట్టులో చోటు ఖాయం' -
'అతడు ఫుల్ ఫిట్గా ఉన్నాడు.. ప్రపంచకప్ భారత జట్టులో చోటు ఖాయం'
టీమిండియా స్టార్ ఆల్రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాను పాండ్యా పూర్తి చేశాడు. అయితే 4 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా.. 37 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే బ్యాటింగ్లో మాత్రం అద్భుతమైన షాట్లు ఆడుతూ అలరించాడు. ఈ మ్యాచ్లో 27 బంతులు ఆడిన పాండ్యా 33 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో పాండ్యాకు కచ్చితంగా చోటు దక్కుతుందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. "హార్ధిక్ పాండ్యా ఫుల్ ఫిట్గా కన్పిస్తున్నాడు. అతడు ఫిట్నెస్ సాధించడానికి చాలా కష్టపడ్డాడు. హార్ధిక్ ఫిట్నెస్ సాధించడం భారత్కు కలిసొచ్చే అంశం. హార్ధిక్ లాంటి ఆటగాడు ఫుల్ ఫిట్నెస్గా ఉన్నప్పుడు మరింత చేలరేగి ఆడుతాడు. అదే విధంగా హార్ధిక్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ను కలిగి ఉన్నాడు. అతడు మ్యాచ్ విన్నర్, అద్భుతమైన ఫీల్డర్. అతడు ఇదే ఫిట్నెస్ కొనసాగిస్తే.. ఈ ఏడాది ఆక్టోబర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో కచ్చితంగా ఉంటాడు"అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: సంజు శాంసన్ ఖాతాలో అరుదైన రికార్డు.. -
Ravi Shastri: నేను వేలంలో బరిలో ఉంటే కనీసం 15 కోట్లు కొల్లగొట్టేవాడిని..!
టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత క్రికెట్ వ్యాఖ్యానంలో బిజీ అయిపోయిన రవిశాస్త్రి.. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య సోమవారం (మార్చి 28) జరిగిన మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన ఆయన.. ఐపీఎల్ వేలానికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జమానాలో ఐపీఎల్ ఉండివుంటే కనీసం 15 కోట్లు కొల్లగొట్టేవాడినంటూ వ్యాఖ్యానించాడు. ఒకవేళ తాను ఏ జట్టుకైనా నాయకత్వం వహించాల్సి వచ్చివుంటే అంతకుమించి ధర పలికి ఉండేవాడినంటూ గొప్పలు పోయాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా కెరీర్ మొదలు పెట్టిన రవిశాస్త్రి.. ఆ తర్వాత ఓపెనర్గా మారి, నాటి టీమిండియాలో కీలక ఆల్రౌండర్గా ఎదిగిన అందరికీ సంగతి తెలిసిందే. టీమిండియా తరఫున 80 టెస్ట్లు, 150 వన్డేలు ఆడిన ఆయన.. 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. రవిశాస్త్రి తన టెస్ట్ కెరీర్లో 11 సెంచరీలు, 12 అర్ధ సెంచరీల సాయంతో 3830 పరుగులు, వన్డేల్లో 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 3108 పరుగులు సాధించాడు. అలాగే శాస్త్రి.. టెస్ట్ల్లో 151 వికెట్లు, వన్డేల్లో 129 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022 GT vs LSG: అరె తమ్ముడు.. సారీ రా! పర్లేదు మేము మ్యాచ్ గెలిచాం కదా! -
టీమిండియా కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
టీమిండియాకు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. అతని నాయకత్వంలో టీమిండియా స్వదేశంలో వరుసగా సిరీస్లు గెలిచింది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మహా అయితే రెండు, మూడేళ్లు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆ తర్వాతైనా టీమిండియాకు కొత్త కెప్టెన్ అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. రానున్న ఐపీఎల్ 15వ సీజన్ ఎడిషన్లో చాలా మంది ఆటగాళ్లు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్గా పనిచేసేందుకు తమను తాము నిరూపించుకునేందుకు చక్కని అవకాశం. ఇప్పటికే కోహ్లి కెప్టెన్గా పనిచేశాడు. ప్రస్తుతం రోహిత్ టీమిండియాకు ఉత్తమ కెప్టెన్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్లు భవిష్యత్తు టీమిండియా కెప్టెన్లుగా కనబడుతున్నారు. ఒక రకంగా ఈ ఐపీఎల్ సీజన్ అందుకు పునాది అవుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నా. ప్రతీ ఐపీఎల్ సీజన్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తోంది. గత సీజన్ ద్వారా వెంకటేశ్ అయ్యర్ గురించి తెలిసింది. అప్పుడు అతని గురించి ఎవరు మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు టీమిండియాకు ఆడుతున్నాడు. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా.. అదే ఐపీఎల్కు ఉన్న బ్యూటీ..'' అంటూ స్టార్స్స్పోర్ట్స్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలపై అభిమానులు స్పందించారు. ''ఇప్పటికైతే రోహిత్ ఉన్నాడుగా.. ఈ సమయంలో ఇది అవసరమా''.. అంటూ కామెంట్ చేశారు. టీమిండియాకు కోచ్గా పనిచేసిన రవిశాస్త్రి ఐపీఎల్ 2022 సీజన్లో కామెంటేటర్ అవతారం ఎత్తనున్నాడు. రవిశాస్త్రితో పాటు రైనా కూడా కామెంటేటర్గా వ్యవహరించనున్నాడు. ఇక మార్చి 26న సీఎస్కే, కేకేఆర్ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ 15వ సీజన్కు తెరలేవనుంది. Here's your chance to interact with box-office gold!✨ Send in your questions for @ImRaina and @RaviShastriOfc using #AskStar!#YehAbNormalHai pic.twitter.com/rLNiRi1TJm — Star Sports (@StarSportsIndia) March 22, 2022 -
IPL 2022: రైనా ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్లో ఎంట్రీ!
IPL 2022- Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తిరిగి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి ఆటగాడిగా కాకుండా కామెంటేటర్గా కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడైన రైనా.. గతేడాది చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎస్కే అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో ఐపీఎల్-2022లో రూ.2 కోట్ల కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ ఏ జట్టు కూడా రైనా పట్ల ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. కనీసం వివిధ కారణాల వల్ల జట్లకు దూరమైన ఆటగాళ్ల స్థానంలోనైనా ఎంట్రీ ఇస్తాడనుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో క్రికెట్ కామెంటేటర్గా అవతారం ఎత్తేందుకు రైనా సిద్దమైనట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం. ఇక రైనాతో పాటు టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సైతం వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ‘‘ఈసారి రైనా ఐపీఎల్లో భాగం కావడం లేదని అందరికీ తెలుసు. అయితే, మేము అతడిని తిరిగి లీగ్లో చూడాలనుకుంటున్నాం. రైనాకు అభిమానులు ఎక్కువ. ముద్దుగా తనని మిస్టర్ ఐపీఎల్ అని పిలుచుకుంటారు. అతడు తిరిగి వస్తే బాగుంటుంది. ఇక శాస్త్రి ఒకప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లింష్ కామెంటరీ టీమ్లో ఉన్నాడు. వీరిద్దరు ఐపీఎల్ వ్యాఖ్యాతలుగా ఉంటే బాగుంటుందనుకుంటున్నాం’’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపినట్లు జాగరన్ మీడియా పేర్కొంది. కాగా రైనా, రవిశాస్త్రి ఐపీఎల్ హిందీ కామెంటేటర్లుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా సురేశ్ రైనా గతంలో గుజరాత్ లయన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. చదవండి: Ruturaj Gaikwad - IPL 2022: సీఎస్కేకు బిగ్షాక్.. ఆరంభ మ్యాచ్లకు స్టార్ ఆటగాడు దూరం! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
హైదరాబాద్లో రవిశాస్త్రి.. సిరాజ్, విహారిలపై కీలక వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం (మార్చి 3) హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన లోకల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత క్రికెట్లో నడుస్తున్న పలు అంశాలపై స్పందించాడు. బీసీసీఐ-విరాట్ కోహ్లి వివాదంపై ఆయన మాట్లాడుతూ.. సమస్య తలెత్తినప్పుడు కాయిన్కి ఒక వైపే చూడకూడదని, సమస్యను అలాగే చూస్తూ పోతే అద్భుతాలు సాధించలేమని కోహ్లికి పరోక్షంగా మద్దతు పలికాడు. విరాట్ చాలా గొప్ప ఆటగాడని, అతనితో సుదీర్ఘ ప్రయాణంలో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించామని గుర్తు చేసుకున్నాడు. కోహ్లి వందో టెస్ట్ కోసం యావత్ భారతంతో పాటు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. 100 టెస్ట్లు ఆడటం ఆషామాషీ విషయం కాదని, కోహ్లికి మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడగల సత్తా ఉందని, ఈ క్రమంలో అతను మరిన్ని అద్భుతాలు చేయగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టంగా ఉందని, వచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్లు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చాడు. తెలుగు రాష్ట్రాల నుంచి హనుమ విహారి, మహ్మద్ సిరాజ్లకు మంచి భవిష్యత్తు ఉందని, వారిరువురు ఇదివరకే వారి మార్కు ప్రభావం జట్టుపై చూపారని కొనియాడాడు. ఎంతటి ఆటగాడైనా టీమిండియాలో కొనసాగలంటే మంచి పర్ఫార్మెన్స్ చూపాల్సిందేనని, యువ క్రికెటర్లు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలంటే పట్టుదల, శ్రమ, క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించాడు. చదవండి: IND VS SL 1st Test: ఒత్తిడిలో విరాట్..? ప్రాక్టీస్ సెషన్స్లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్..! -
"కోహ్లి మూడు నెలల పాటు ఆటకు బ్రేక్ ఇవ్వాలి.. ఆ తర్వాతే"
విరాట్ కోహ్లిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వాఖ్యలు చేశాడు. కోహ్లి రెండు లేదా మూడు నెలల పాటు క్రికెట్కు బ్రేక్ ఇవ్వాలని రవిశాస్త్రి సూచించాడు. కోహ్లి ఇంకా ఐదేళ్ల పాటు క్రికెట్లో కొనసాగతాడని భావిస్తున్నాను అని అతడు తెలిపాడు. "ఇంకా అతడికి 33 ఏళ్లే. కోహ్లికి ఇంకా మరో ఐదేళ్ల పాటు క్రికెట్లో మంచి భవిష్యత్తు ఉంది. అతడు ప్రస్తుతం బ్యాటింగ్పై దృష్టి పెట్టగలిగితే బాగా రాణించగలడు. ఇటువంటి సమయంలో అతడు ప్రశాంతంగా ఉండాలి, అంతే కాకుండా అతడికి రెండు లేదా మూడు నెలలపాటు విశ్రాంతి అవసరం. అనంతరం కోహ్లి చెలరేగి ఆడుతాడని నేను భావిస్తున్నాను. మరో ఐదేళ్ల పాటు క్రికెట్లో అతడు రాణించగలడు. నేను ఒకప్పటి విరాట్ను చూడాలి అనుకుంటున్నాను" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో భారత్ ఓడిపోవడంతో టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక వెస్టిండీస్తో త్వరలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో కోహ్లి భాగమై ఉన్నాడు. చదవండి: పీటర్సన్ సునామీ ఇన్నింగ్స్.. 9 ఫోర్లు, 7 సిక్స్లు.. కేవలం 38 బంతుల్లోనే -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. ఒక్క మ్యాచ్ కూడా చూడలేదు.. అయినా: రవిశాస్త్రి
Ind Vs Sa ODI Series: ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా- టీమిండియా వన్డే సిరీస్ను ఫాలో కాలేదని భారత జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. అయినప్పటికీ... కెప్టెన్గా ఉన్నా లేకపోయినా విరాట్ కోహ్లి ఆట తీరులో పెద్దగా మార్పులేమీ ఉండవని చెప్పగలనన్నాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందుకు కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మకు ఆ పగ్గాలు అప్పగించగా... అతడు గాయం కారణంగా దూరం కావడంతో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక అంతకుముందు టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత ఆ ఫార్మాట్ సారథ్యానికి కోహ్లి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం తర్వాత కెప్టెన్ అన్న ట్యాగ్ లేకుండా కోహ్లి తొలిసారిగా వన్డే సిరీస్ ఆడాడు. మూడు మ్యాచ్లలో వరుసగా 79, 0, 65 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్సీ నుంచి వైదొలగడం అతడి ఛాయిస్. తన నిర్ణయాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది. ప్రతి విషయానికి కాలమే సమాధానం చెబుతుంది. బ్యాటింగ్పై దృష్టి సారించే క్రమంలో గతంలో ఎంతో మంది క్రికెటర్లు కెప్టెన్సీ వదులుకున్నారు. సచిన్ టెండుల్కర్, గావస్కర్, ధోని.. ఇలా ఎవరైనా సరే. వాళ్లకు సరైన సమయం అనిపించినపుడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు కోహ్లి కూడా అంతే! నిజానికి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా నేను చూడలేదు. కానీ... కోహ్లి ఆట తీరులో పెద్దగా తేడా ఏమీ ఉండదని చెప్పగలను’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు భంగపాటు నేపథ్యంలో... .. గత ఐదేళ్లుగా నంబర్ 1 గా జట్టు స్థాయి ఒక్కసారిగా పడిపోయిందనడం అవివేకమే అవుతుందని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతోంది. చదవండి: India New Test Captain: అసలు.. కేఎల్ రాహుల్ ఏ కోశాన్నైనా కెప్టెన్లా అనిపిస్తున్నాడా: బీసీసీఐ అధికారి -
Virat Kohli: నాకిది విచారకరమైన రోజు.. విరాట్..: రవిశాస్త్రి ఎమోషనల్
Ravi Shastri Reacts To Kohli Decision: ‘‘విరాట్... నువ్వు తలెత్తుకుని సగర్వంగా ముందుకు వెళ్లవచ్చు. కెప్టెన్గా నీలాంటి అద్బుత విజయాలు కొంతమంది మాత్రమే సాధించగలరు. భారత జట్టు అత్యంత విజయవంతమైన, దూకుడైన సారథివి కచ్చితంగా నువ్వే. అయితే, వ్యక్తిగతంగా నాకిది విచారకరమైన రోజు. మనిద్దరం కలిసి ఈ జట్టును శక్తిమంతంగా తీర్చిదిద్దాం కదా కోహ్లి’’ అంటూ టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి భావోద్వేగాని లోనయ్యాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతడితో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లి తాను భారత జట్టు టెస్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కోహ్లి నిర్ణయం క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇది కోహ్లి వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశాడు. కాగా 68 టెస్టు మ్యాచ్లకు కోహ్లి కెప్టెన్గా వ్యవహరించగా.. 40 విజయాలు అందుకున్నాడు. ఇక టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సందర్భంగా... మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిల పేర్లను కోహ్లి ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. భారత టెస్టు క్రికెట్ అత్యున్నత స్థాయికి చేరడంలో రవి భాయ్ కీలకంగా వ్యవహరించాడని తనతో ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక ధోని తనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి.. తనను ప్రోత్సహించాడని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లి నిర్ణయం విని షాకయ్యాను.. రోహిత్ శర్మ పోస్టు వైరల్ -
ODI Captaincy: కోహ్లి తాను చెప్పాల్సింది చెప్పాడు.. ఇక గంగూలీ వంతు: రవిశాస్త్రి
Ravi Shastri Comments On ODI Captaincy Saga: గత కొన్ని రోజులుగా భారత క్రికెట్లో జరుగుతున్న పరిణామాల గురించి టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ- కెప్టెన్ విరాట్ కోహ్లిలలో ఎవరు నిజం చెబుతున్నారన్న విషయం అప్రస్తుతమని.. కాస్త పరిణతితో ఆలోచించి దీనిని పరిష్కరించుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కాగా పరిమిత ఓవర్ల కెప్టెన్గా రోహిత్ శర్మ నియామకం నేపథ్యంలో.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని గతంలో తాను కోహ్లికి నచ్చజెప్పినా వినలేదని గంగూలీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందుకు స్పందించిన కోహ్లి తనతో దాదా ఎలాంటి సంప్రదింపులు జరుపలేదని స్పష్టం చేశాడు. బీసీసీఐ ,అధ్యక్షుడి నుంచి ఇలాంటివి ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే, గంగూలీ మాత్రం ఇంతవరకు కోహ్లి కామెంట్లపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి.. ‘‘విరాట్ తను చెప్పాల్సింది తాను చెప్పాడు. ఇప్పుడు బోర్డు అధ్యక్షుడు తన వాదన వినిపించాలి. ఎవరు అబద్ధం ఆడుతున్నారు.. ఎవరు నిజం చెబుతున్నారు అనేది ఇక్కడ సమస్య కాదు. నిజానికి వారి మధ్య జరిగిన సంభాషణ పూర్తిగా తెలిసేంతవరకు మనదైన భాష్యాలు చెప్పకూడదు. ఇద్దరి మధ్య సమన్వయలోపం లేకుంటే... సమస్య ఇంతదూరం వచ్చేది కాదు’’ అని పేర్కొన్నాడు. ఇక వన్డే, టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మ నియామకాన్ని సమర్థించిన రవిశాస్త్రి.. టెస్టుల్లో కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ కెప్టెన్గా ఉన్నాడని కొనియాడాడు. ‘‘కోహ్లిలా అంకితభావంతో జట్టును ముందుండి నడిపించే కెప్టెన్లు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కోహ్లితో కలిసి చాలాకాలం ప్రయాణం చేశాను. తనతో అనుబంధం అత్యద్భుతం. తనలో ఆత్మవిశ్వాసం మెండు. జట్టును గెలిపించాలనే కసితో ఆడతాడు’’ అని కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. చదవండి: SA Vs IND: భారత ఆటగాళ్లకు ద్రవిడ్ స్పెషల్ క్లాస్.. ఎందుకో తెలుసా? -
భారత్లో బెట్టింగ్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Calls For Legalisation Of Sports Betting: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి బెట్టింగ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్లో స్పోర్ట్స్ బెట్టింగ్ను చట్ట బద్ధం చేస్తే దేశ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల బెట్టింగ్పై నిఘా పెట్టే వీలు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు బెట్టింగ్కు చట్ట బద్ధత కల్పించాయని.. భారత్లో కూడా అలా చేస్తే పన్ను రూపేనా భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని అన్నాడు. దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ చాలా కాలంగా జోరుగా సాగుతుందని, ముఖ్యంగా క్రికెట్పై భారీ స్థాయిలో బెట్టింగ్లు నడుస్తాయని, మరి ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో వందల కోట్లలో చేతులు మారుతుంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్ను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగముండదని, ఇందుకు చట్ట బద్ధత కల్పించడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డాడు. రవి చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్గా మారాయి. రవిశాస్త్రి కంటే ముందు పలువురు ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన కమిటీకి నేతృత్వం వహించిన విశ్రాంత జస్టిస్ ముకుల్ ముద్గల్ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021 అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2022లో ఓ ప్రముఖ జట్టు తరఫన కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్గా మనీశ్ పాండే..? -
Ravi Shastri: అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ..
Ravi Shastri: Had No Say Dropping Ambati Rayudu In 2019 World Cup Squad: రవిశాస్త్రి... 2017లో టీమిండియా హెడ్ కోచ్గా పగ్గాలు చేపట్టాడు. ఆయన హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించింది. రవిశాస్త్రి హెడ్కోచ్గా ఉన్న సమయంలో 43 టెస్టులు ఆడిన భారత జట్టు 25 గెలవగా.. ఐదింటిని డ్రా చేసుకుంది. ఇక 76 వన్డేల్లో సాధించిన విజయాలు 51. పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే... అరవై ఐదింట.. 43 విజయాలు. మొత్తంగా 184 మ్యాచ్లలో 119 గెలుపొందింది. విజయాల శాతమే ఎక్కువగా ఉన్నా... ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా 2019లో వన్డే వరల్డ్కప్లో ఎన్నో అంచనాలతో బరిలోకి టీమిండియా కనీసం ఫైనల్కు కూడా చేరకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. అంతేగాక జట్టు సెలక్షన్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును కాదని.. విజయ్ శంకర్ను ఎంపిక చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇక టీ20 వరల్డ్కప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత హెడ్కోచ్ పదవి నుంచి తప్పుకొన్న రవిశాస్త్రి తాజాగా ఈ విషయాల గురించి మాట్లాడారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో సంభాషించిన ఆయన... ‘‘2019 వరల్డ్కప్... జట్టు ఎంపిక విషయం గురించి నాకు పెద్దగా ఫిర్యాదులు లేవు. అయితే, ప్రపంచకప్ కోసం ముగ్గురు వికెట్ కీపర్లను సెలక్ట్ చేయడం సరికాదనిపించింది. నిజానికి అంబటి(అంబటి రాయుడు) లేదంటే శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావాల్సింది. ఎంఎస్ ధోని, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్.. వికెట్ కీపర్ బ్యాటర్లు ఇంతమంది ఎందుకు అనిపించింది. కానీ సెలక్టర్ల నిర్ణయంలో నేను ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. సాధారణ చర్చల్లో భాగంగా... ఫీడ్బాక్ అడిగినపుడు మాత్రమే కొన్ని విషయాలు చెప్పేవాడిని’’ అని పేర్కొన్నాడు. కాగా 2019లో జరిగిన వన్డే వరల్డ్కప్ సమయంలో... అద్భుత ఫామ్లో ఉన్న అంబటి రాయుడి కాదని, విజయ్ శంకర్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో విమర్శలు రాగా.... విజయ్ త్రీ డైమన్షనల్ ఆటగాడని అందుకే అతన్ని సెలెక్ట్ చేసినట్లు(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి.. ఆనక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. చదవండి: IPL 2022 Auction- Avishka Fernando: 23 బంతుల్లో 53 పరుగులు.. సిక్సర్ల కింగ్.. ఐపీఎల్ వేలంలోకి వచ్చాడంటే! -
Ravi Shastri: కొత్త అవతారంలో రవిశాస్త్రి.. తొలి సీజన్ జనవరిలో..
Ravi Shastri: New Role Legends League Cricket Commissioner: భారత హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన రవిశాస్త్రి మరో కొత్త పాత్రలో కనిపించనున్నాడు. రిటైర్డ్ ప్లేయర్ల కోసం ఏర్పాటు చేసిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) కమిషనర్గా రవిశాస్త్రి వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని లీగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా తెలిపారు. ఎల్ఎల్సీ తొలి సీజన్ వచ్చే ఏడాది జనవరిలో గల్ఫ్లో ఆరంభం కానుంది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు పాల్గొంటారు. చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్! -
మిగిలిన ఫార్మాట్స్లోనూ కెప్టెన్గా గుడ్బై చెప్పే అవకాశం!
Ravi Shastri Reveals Virat Kohli Might Give Up Captaincy Other Formats.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి.. త్వరలోనే వన్డే, టెస్టుల్లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడంటూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్పై దృష్టి పెట్టేందుకు కోహ్లి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు. '' గత ఐదేళ్లలో కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా టెస్టుల్లో నెంబర్వన్ స్థానంలో ఉంది. కేవలం తన బ్యాటింగ్పై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో మానసిక ఒత్తిడిని అధిగమించాలని కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పట్లో జరగకపోవచ్చు. ఇక పరిమిత ఓవర్ల విషయంలోనూ కోహ్లి ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంతకముందు కూడా క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్పై మరింత ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీ వదులుకున్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు.'' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కోహ్లి న్యూజిలాండ్తో జరగనున్న టి20 సిరీస్కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత జరగనున్న తొలి టెస్టులో కూడా ఆడడం లేదు. దీంతో కోహ్లి గైర్హాజరీలో రహానే తొలి టెస్టుకు నాయకత్వం వహించనున్నాడు. చదవండి: కోచ్గా ఉన్న సమయంలో టీమిండియాకు కప్ లేదు.. బాధగా ఉంది -
కోచ్గా ఉన్న సమయంలో టీమిండియాకు కప్ లేదు.. బాధగా ఉంది
Ravi Shastri Disoppointment Team India Not Winning ICC Trophy.. టీమిండియా హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఇటీవలే తప్పుకున్న సంగతి తెలిసిందే. టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా ఆట సూపర్ 12లోనే ముగియడంతో ఆయన సేవలు అక్కడితో ముగిశాయి. అయితే టీమిండియాకు కోచ్గా పనిచేయడం తన అదృష్టమని రవిశాస్త్రి ఇప్పటికే పేర్కొన్నాడు. తాజాగా తాను కోచ్గా ఉన్న సమయంలో టీమిండియా కప్ సాధించకపోవడంతో ఏదో వెలితిగా ఉందని పేర్కొన్నాడు. రాజ్దీప్ సర్దేశాయ్తో జరిగిన ఇంటర్య్వూలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. చదవండి: Rohit-Rahane: రోహిత్, రహానే.. మనకు తెలియకుండా ఇన్ని పోలికలా! ''టీమిండియా హెడ్కోచ్గా ఐదేళ్ల ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు చూశా. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై వరుసగా రెండు టెస్టు సిరీస్ల్లో ఓడించడం ఎన్నటికి మరిచిపోను. దాదాపు 70 సంవత్సరాలు తర్వాత ఇలాంటి ఫీట్ నమోదు చేయడం సంతోషం కలిగించింది. అంతేగాక ఇటీవలే ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో 2-1తేడాతో ఆధిక్యంలో ఉండడం కూడా ఒక గొప్ప ఎచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. కోచ్ ఉన్న ఈ ఐదేళ్లలో టీమిండియా బైలెటరల్ సిరీస్లు ఎన్నో గెలిచింది. కానీ ఒక్కటి మాత్రం తీరలేదు. నా హయాంలో టీమిండియా ఆడిన మూడు ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోవడం బాధ కలిగించింది. అయితే ఈ మూడు సందర్భాల్లో టీమిండియా ప్రదర్శన గొప్పగానే ఉండడం విశేషం. 2019 వన్డే వరల్డ్కప్లో గ్రూప్ టాపర్గా సెమీస్లో అడుగుపెట్టిన టీమిండియా సెమీస్లో న్యూజిలాండ్తో ఓడిపోయింది. ఇక ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ అదే ఫలితం పునరావృతం అయింది. తాజాగా టి20 ప్రపంచకప్ 2021లో మరోసారి నిరాశే ఎదురైంది. ఇదొక్కటి మినహాయిస్తే మిగతావన్ని సక్రమంగానే జరిగాయి'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ravi Shastri: గంగూలీతో విభేదాలు నిజమే.. కోచ్ పదవి నుంచి వైదొలిగాక సంచలన వ్యాఖ్యలు -
"గంగూలీతో విభేదాలు నిజమే.." రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Opens Up On His Alleged Spat With Ganguly In 2016: టీ20 ప్రపంచకప్-2021 నుంచి టీమిండియా నిష్క్రమించిన అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన రవిశాస్త్రి ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2016లో తనకు నాటి క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీకి మధ్య మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశాడు. నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం జరిగిన ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ సీఏసీ సభ్యులుగా ఉన్నారని, ఆ ఇంటర్వ్యూకి వెళ్లేముందు తాను హెడ్ కోచ్గా అయితే ఏమేం చేయగలనో ఓ లెటర్ రాసి పెట్టుకున్నానని తెలిపాడు. అయితే సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి ఆ లెటర్ మిస్ అయ్యిందని, కమిటీ ముందు ఆ విషయం చెప్పడం నాకు చిన్నతనంగా అనిపించిందని, అందుకే ఉన్న విషయం కమిటీ ముందు చెప్పగా నా గురించి బాగా తెలిసిన గంగూలీకి అది నచ్చలేదని తెలిపాడు. ఇది చాలా చిన్న విషయమే అయినప్పటికీ మీడియా దాన్ని ఎక్కువ చేసి ప్రచారం చేసిందన్నాడు. గంగూలీది, తనది చాలా పాత పరిచయమని, గంగూలీ తనకు జూనియర్ అని, గతంలో దాదా.. టైమ్స్ షీల్డ్ టోర్నీలో టాటా స్టీల్కి ఆడుతున్నప్పుడు తాను కెప్టెన్గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. కాగా, 2019లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక టీమిండియాపై కోచ్ రవిశాస్త్రి ప్రభావం తగ్గిందన్న వార్తలు చాలాకాలం వరకు వినిపించాయి. తాజాగా రవి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ వార్తలు వాస్తవమేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచ కప్-2021తో టీమిండియా కోచ్గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో.. గంగూలీ తన ఆప్తుడైన రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు -
'ఆ విషయంలో' రవిశాస్త్రి వ్యాఖ్యలను సమర్ధించిన పాకిస్థాన్ కెప్టెన్
Babar Azam Supports Ravi Shastri Comments On Bio Bubble: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా ప్రస్థానం ముగిసిన అనంతరం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి వీడ్కోలు పలికిన రవిశాస్త్రి బయోబబుల్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా బయోబబుల్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఫిజికల్గా, మెంటల్గా అలసిపోయారని.. ఆటగాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని క్రికెట్ బోర్డులు, అభిమానులు గుర్తించాలని.. పెట్రోల్ పోసి నడపడానికి టీమిండియా ఆటగాళ్లు యంత్రాలు కాదని రవిశాస్త్రి చేసిన సంచలన వ్యాఖ్యలపై పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్ స్పందించాడు. Sometimes the most productive thing you can do is relax. 🧘 pic.twitter.com/gKgJv6PWif — Babar Azam (@babarazam258) November 9, 2021 బయోబబుల్లో ఆటగాళ్లు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి విషయంలో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధిస్తానని అన్నాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఇలాంటి హెచ్చుతగ్గులు సాధారణమే అయినప్పటికీ.. ఎక్కువ కాలం బయో బుడగలో ఉండటం వల్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు అసౌకర్యానికి గురవుతారని పేర్కొన్నాడు. ఒత్తిడిని అధిగమించేందుకు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలని.. క్రికెట్ బోర్డులు ఈ విషయంలో పునరాలోచించాలని, బిజీ షెడ్యూల్ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించాడు. క్రికెటర్లకు విశ్రాంతి తీసుకోవడం కంటే గొప్ప పని మరొకటి ఉండదని అభిప్రాయపడ్డాడు.పాక్ ఆటగాళ్లు సైతం గతేడాది కాలంగా నిరంతర బయో వాతావరణంలో ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయారని.. అయితే తామంతా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందామని తెలిపాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో సెమీస్ సమరానికి ముందు మీడియా ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో పాక్ సారధి ఈ మేరకు స్పందించాడు. చదవండి: 'సెమిఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించడం అంత సులభం కాదు' -
Rahul Dravid: హెడ్కోచ్గా ముందున్న పలు సవాళ్లు.. ఏం చేయబోతున్నాడు?
Team India New Coach Rahul Dravid Challenges: ‘ది వాల్’, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన ఈ మాజీ కెప్టెన్ ఇప్పుడు సరికొత్త అవతారంలో ముందుకు రాబోతున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా ఎంతో మంది యువ ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దిన రాహుల్ ద్రవిడ్... ఇకపై టీమిండియాకు హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నాడు. భారత జట్టు ప్రధాన శిక్షకుడిగా రవిశాస్త్రి పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమైనప్పటికీ.. ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో కోహ్లి సేన కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక ఈ ఈవెంట్ తర్వాత రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ బాధ్యతలు చేపట్టనుండగా... భారత టీ20 జట్టు సారథిగా విరాట్ కోహ్లి స్థానంలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ పగ్గాలు అందుకోబోతున్నాడు. ఈ మార్పుల నేపథ్యంలో వివాద రహితుడిగా పేరొందిన ద్రవిడ్ హెడ్కోచ్గా ఎలా ముందుకు వెళ్లబోతున్నాడు? టీమిండియాను ఎలా సిద్ధం చేయబోతున్నాడు? ఐసీసీ టోర్నీల్లో గత కొంతకాలంగా రాణించలేకపోతున్న భారత్ను ముందుకు తీసువెళ్లేందుకు ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నాడు? సీనియర్లు, యువ ఆటగాళ్లను ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగబోతున్నాడు? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇక న్యూజిలాండ్తో సిరీస్తో హెడ్కోచ్గా ద్రవిడ్ ప్రస్థానం మొదలుకాబోతుంది. చదవండి: Ravi Shastri: రవిశాస్త్రి భావోద్వేగం.. టీమిండియా హెడ్ కోచ్గా అతడి రికార్డులు ఇవే! -
Virat And Rohit: అపురూప కానుకలతో రవిశాస్త్రికి ఘనంగా వీడ్కోలు
Rohit Sharma And Virat Kohli Gift Their Bats To Ravi Shastri: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా పదవీకాలం పూర్తి చేసుకున్న రవిశాస్త్రికి టీమిండియా సారధి, ఉప సారధి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అపురూప కానుకలతో ఘనంగా వీడ్కోలు పలికారు. విరాట్, రోహిత్లు వారు సంతకాలు చేసిన బ్యాట్లను రవిశాస్త్రికి కానుకగా అందజేసి సెండాప్ ఇచ్చారు. డ్రెసింగ్ రూమ్లో రవిశాస్త్రి వీటిని పట్టుకుని దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్గా రవిశాస్త్రి శకం టీ20 ప్రపంచకప్-2021తో ముగిసిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో భాగంగా నవంబర్ 8న నమీబియాతో జరిగిన మ్యాచ్కు రవిశాస్త్రి చివరిసారిగా కోచింగ్ సేవలను అందించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా పసికూన నమీబియాపై ఘన విజయం సాధించి హెడ్ కోచ్గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లికి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లకు ఘనంగా వీడ్కోలు పలికింది. కోచింగ్ సిబ్బందికి, కెప్టెన్గా విరాట్కు చివరి రోజు కావడంతో భారత డ్రెసింగ్ రూమ్లో భావోద్వేగ వాతావరణం నెలకొని ఉండింది. Must Watch: A stirring speech to sign off as the #TeamIndia Head Coach 👏 👏 Here's a snippet from @RaviShastriOfc's team address in the dressing room, reflecting on the team's journey in the last few years. 👍 👍 #T20WorldCup #INDvNAM Watch 🎥 🔽https://t.co/x05bg0dLKH pic.twitter.com/IlUIVxg6wp — BCCI (@BCCI) November 9, 2021 చదవండి: Ravi Shastri: టీమిండియా ఆటగాళ్లేమైనా యంత్రాలా, పెట్రోల్ పోసి నడపడానికి..? -
Ravi Shastri: టీమిండియా ఆటగాళ్లేమైనా యంత్రాలా, పెట్రోల్ పోసి నడపడానికి..?
Ravi Shastri Slams BCCI And ICC, Says Players Do Not Run On petrol: టీమిండియా హెడ్ కోచ్గా రవిశాస్త్రి శకం టీ20 ప్రపంచకప్-2021తో ముగిసింది. మెగా టోర్నీలో భాగంగా నవంబర్ 8న నమీబియాతో జరిగిన మ్యాచ్కు రవిశాస్త్రి చివరిసారిగా కోచింగ్ సేవలను అందించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా పసికూన నమీబియాపై ఘన విజయం సాధించి కోచ్గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలికింది. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన రవిశాస్త్రి.. బీసీసీఐ, ఐసీసీలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్లో టీమిండియా వైఫల్యాలపై మాట్లాడుతూ.. అందుకు పరోక్ష కారణమైన బీసీసీఐ, ఐసీసీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గత ఆరు నెలలుగా బయోబబుల్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఫిజికల్గా, మెంటల్గా అలసిపోయారని.. ఆటగాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని క్రికెట్ బోర్డులు, అభిమానులు గుర్తించాలని అన్నాడు. ఊపిరి సడలనంత బిజీ షెడ్యూల్ను ప్రిపేర్ చేసి ఐసీసీ, బీసీసీఐలు టీమిండియా వైఫల్యాలకు పరోక్ష కారణమయ్యాయని ధ్వజమెత్తాడు. ప్రపంచకప్కు ముందు ఏ జట్టైనా తాజాగా ఉండాలని కోరుకుంటుంది. కానీ, భారత ఆటగాళ్ల విషయంలో అలా జరగలేదని, టోర్నీ షెడ్యూల్ చేయడానికి ముందు ఐసీసీ ఈ ఆలోచన చేసి ఉండాల్సిందని ఆగ్రహించాడు. పెట్రోల్ పోసి నడపడానికి టీమిండియా ఆటగాళ్లు యంత్రాలు కాదని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇదిలా ఉంటే, రవిశాస్త్రి 2014లో తొలిసారి టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతని ఆధ్వర్యంలో భారత జట్టు 2019 వన్డే ప్రపంచ కప్లో సెమీ ఫైనల్కు, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్స్కు చేరుకుంది. రవిశాస్త్రి హయాంలో ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్ట్ సిరీస్లు గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఆసీస్తో పాటు సేన(SENA) దేశాలైన సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను టీమిండియా వారి స్వదేశాల్లో మట్టికరిపించింది. చదవండి: మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు.. -
గర్వంగానే.. రవిశాస్త్రి భావోద్వేగం; టీమిండియా హెడ్ కోచ్గా అతడి రికార్డులు ఇవే!
Ravi Shastri Gets Emotional Comments On Rahul Dravid Rohit Sharma: ‘‘డ్రెస్సింగ్ రూమ్కు దూరమవుతున్నందుకు భావోద్వేగానికి లోనవుతున్నాను. కానీ చాలా గర్వంగా నిష్క్రమిస్తున్నా. నేను కోచ్గా మారేందుకు శ్రీనివాసనే కారణం. నాపై నాకంటే ఆయన ఎక్కువ నమ్మకముంచారు. జీవితంలో సాధించిన ఘనతల గురించే మాట్లాడవద్దు. అడ్డంకులను ఎలా అధిగమించామనేది కూడా ముఖ్యం. గత ఐదేళ్లుగా మా కుర్రాళ్లు ప్రపంచంలో అన్ని మూలలా అద్భుతంగా ఆడారు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ జట్లలో ఇదొకటి. ఐసీసీ ట్రోఫీ ఒకటి లోటుగా ఉండిపోయింది కానీ కొత్త హెడ్ కోచ్ ద్రవిడ్ నేతృత్వంలో అది దక్కాలని కోరుకుంటున్నా. టి20ల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ అన్ని విధాలా సమర్థుడు’’ అని టీమిండియా హెడ్కోచ్గా సేవలు అందించిన రవిశాస్త్రి ఉద్వేగానికి గురయ్యాడు. భారత జట్టుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. కాగా టీ20 వరల్డ్కప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత తన పదవి నుంచి తప్పుకొంటానని రవిశాస్త్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్ తర్వాత టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లి గుడ్బై చెప్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. దీంతో అతడికి డిప్యూటీగా వ్యవహరించిన రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. కొత్త కోచ్, టీ20 కొత్త కెప్టెన్కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో నమీబియాతో నామమాత్రపు మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా గెలుపుతో ఈవెంట్ను ముగించింది. టీమిండియా హెడ్ కోచ్గా రవిశాస్త్రి రికార్డు(Ravi Shastri Record As Team India Head Coach) ఫార్మాట్ ఆడినవి గెలిచినవి ఓడినవి ‘డ్రా’ టెస్టులు 43 25 13 5 వన్డేలు 76 51 22 – టి20లు 65 43 18 – మొత్తం 184 119 53 5 Must Watch: A stirring speech to sign off as the #TeamIndia Head Coach 👏 👏 Here's a snippet from @RaviShastriOfc's team address in the dressing room, reflecting on the team's journey in the last few years. 👍 👍 #T20WorldCup #INDvNAM Watch 🎥 🔽https://t.co/x05bg0dLKH pic.twitter.com/IlUIVxg6wp — BCCI (@BCCI) November 9, 2021 .@ImRo45 & @klrahul11 score fifties as #TeamIndia seal a clinical 9⃣-wicket win over Namibia. 👏 👏#T20WorldCup #INDvNAM Scorecard ▶️ https://t.co/kTHtj7LdAF pic.twitter.com/4HgbvFAyWJ — BCCI (@BCCI) November 8, 2021 -
కోహ్లితో ధోని, రవిశాస్త్రి సుదీర్ఘ చర్చ.. పాండ్యాను పక్కనపెట్టే అవకాశం
Dhoni And Ravi Shastri Intense Discussion With Kohli During Practice.. టి20 ప్రపంచకప్లో టీమిండియా.. అఫ్గానిస్తాన్తో కీలక మ్యాచ్ ఆడనుంది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న టీమిండియా అఫ్గాన్తో మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే అవకాశాలు ఉంటాయి. ఇక మంగళవారం ప్రాక్టీస్ సమయంలో కోహ్లితో రవిశాస్త్రి, ధోనిలు సుధీర్ఘ చర్చ జరపడం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాదాపు 20 నుంచి 30 నిమిషాలు పాటు ఈ ముగ్గురి మధ్య మ్యాచ్కు సంబంధించి సీరియస్ చర్చ నడిచినట్లు తెలుస్తోంది. అయితే కొద్దిసేపటి తర్వాత రవిశాస్త్రి అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ.. కోహ్లి, ధోనిలు చాలాసేపు మాట్లాడుకున్నారు. వరుస రెండు పరాజయాలతో డీలా పడిన టీమిండియా అఫ్గాన్తో మ్యాచ్లో ఏం చేస్తుందనేది కీలకంగా మారింది. చదవండి: IND Vs AFG: ప్రాక్టీస్ బాగానే ఉంది.. అసలు మ్యాచ్లో మాత్రం ఇక అంతకముందు ప్రాక్టీస్ సమయంలో కోహ్లి.. సూర్యకుమార్తో చాలాసేపు మాట్లాడాడు. కాగా కివీస్తో మ్యాచ్లో వెన్నునొప్పితో సూర్యకుమార్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. ఇక కోహ్లితో భేటీకి ముందు ధోని, రవిశాస్త్రి మధ్య జరిగిన సంభాషణలో సూర్యకుమార్ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే సూర్యకుమార్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సూర్యతో పాటు ఇషాన్ కిషన్ కూడా జట్టులో ఉంటాడని సంకేతాలు రావడంతో.. మ్యాచ్కు హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక జట్టులోకి అశ్విన్ రాక కూడా దాదాపు ఖరారైనట్లే. వరుణ్ చక్రవర్తి స్థానంలో అశ్విన్ తుదిజట్టులోకి వస్తాడా లేక అదనపు స్పిన్నర్గా ఉంటాడా అనేది తుది జట్టు ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే. చదవండి: IND VS NZ: వార్నీ ఇది ధోని ఐడియానా.. అందుకే రవిశాస్త్రి?! ఇక అఫ్గానిస్తాన్ను తక్కువ అంచనా వేస్తే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అఫ్గాన్ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచి.. ఒక మ్యాచ్లో ఓడి మంచి ఆత్మవిశ్వాసంతో కనబడుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు అఫ్గానిస్తాన్తో మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. That's some hitting, @imjadeja ! 👌 👌#TeamIndia #T20WorldCup #INDvAFG pic.twitter.com/Yf89bCRlB1 — BCCI (@BCCI) November 3, 2021 -
వార్నీ ఇది ధోని ఐడియానా.. అందుకే రవిశాస్త్రి?!
Who Took Decision Revealed To Demote Rohit Sharma As Opener Vs NZ.. టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ కాకుండా వన్డౌన్లో రావడం అందర్ని ఆశ్చర్యపరించింది. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ ఆ మ్యాచ్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మ్యాచ్లో రోహిత్ బ్యాటింగ్ డిమోషన్ వెనుక ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. రెండురోజులుగా రోహిత్ బ్యాటింగ్ డిమోషన్కు కారణం కోహ్లి, రవిశాస్త్రి, రోహిత్ శర్మ అని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే.. టీమిండియా మెంటార్ ఎంఎస్ ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . చదవండి: ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా! మ్యాచ్ ప్రారంభానికి ముందు సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ కారణాలతో ఆడడం లేదని తేలింది. దీంతో రంగంలోకి దిగిన ధోని ఇషాన్ కిషన్ను తుదిజట్టులో చోటు కల్పిస్తే.. ఓపెనర్గా పంపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్గా ఇషాన్ న్యాయం చేయగలడని.. ప్రాక్టీస్ మ్యాచ్లో ఇదే రుజువయిందని ధోని పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఓపెనర్గా ఉన్న రోహిత్ శర్మను బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ చేయాలనే నిర్ణయం ధోనిదే. ఈ నిర్ణయంతో కోహ్లి, రవిశాస్త్రి ముందు ఆలోచించినా.. ధోనిపై నమ్మకంతో ఏకీభవించారు. కానీ కివీస్తో మ్యాచ్లో ప్లాన్ బెడిసికొట్టింది. ఓపెనర్గా వచ్చిన ఇషాన్ కిషన్ 4 పరుగులకే ఔటయ్యాడు. ఇక రవిశాస్త్రి, ధోని మధ్య సీరియస్ సంభాషణకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అయితే ధోని, రవిశాస్త్రి మధ్య రోహిత్ బ్యాటింగ్ డిమోషన్పైనే సీరియస్ చర్చ నడిచినట్లు అభిమానులు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అభిమానులు తమదైన శైలిలో స్పందించారు. రోహిత్ బ్యాటింగ్ డిమోషన్ వెనుక కారణం ధోనినా.. వార్నీ.. ఇది ధోని ఐడియానా.. అందుకే రవిశాస్త్రి అతనితో సీరియస్ చర్చ చేశాడా అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: రోహిత్కు కూడా తెలుసు... అందుకే ఇషాన్ను పంపాం ఇక సూపర్ 12 దశలో వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన టీమిండియా బుధవారం అఫ్గానిస్తాన్తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే సెమీస్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే సెమీస్పై ఆశలు ఉంటాయి. -
పాపం కెప్టెన్, కోచ్ అని మరిచిపోయుంటారు.. అందుకే
Mohammed Azharuddin Slams Virat Kohli And Ravi Shastri.. న్యూజిలాండ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రెస్ కాన్ఫరెన్స్కు రాకుండా బుమ్రాను పంపించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ గెలిచినా.. ఓడినా కెప్టెన్ ప్రెస్మీట్కు రావడం ఆనవాయితీ. కెప్టెన్తో పాటు కోచ్ రావడం కూడా సహజంగా కనిపిస్తుంది. ఆటలో ఏం తప్పులు చేశాము.. అవి తర్వాతి మ్యాచ్లో రిపీట్ చేయకుండా ఉండేందుకు ఏం చేయాలనేది ప్రణాళిక రచించుకోవాలి. ఒకవేళ కోహ్లి ప్రెస్మీట్ రావాలా వద్ద అనేది వదిలేద్దాం. కనీసం కోచ్ పాత్రలో రవిశాస్త్రి అయినా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే బాగుండేది. పాపం కోహ్లి, రవిశాస్త్రి తాము కెప్టెన్, కోచ్ అని మరిచిపోయుంటారు అంటూ కామెంట్ చేశాడు. చదవండి: ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా! ఇక టీమిండియా న్యూజిలాండ్, పాకిస్తాన్తో మ్యాచ్ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్తో జరిగే మ్యాచ్లో భారీ తేడాతో గెలిచినప్పటికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా!
Heat Argument Between Dhoni And Ravi Shastri Viral After NZ Match.. టీమిండియా మెంటార్ ఎంఎస్ ధోని, కోచ్ రవిశాస్త్రి మధ్య జరిగిన సీరియస్ సంభాషణకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్నది తెలియదు గానీ దీనిపై అభిమానులు మధ్య మాత్రం కొత్త చర్చ నడిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ధోని, రవిశాస్త్రి మధ్య అంతా బాగానే ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా న్యూజిలాండ్తో మ్యాచ్లో ఓటమి అనంతరం ధోని తన కూల్నెస్ను కోల్పోయాడని సమాచారం. ఇందులో భాగంగానే ధోని, రవిశాస్త్రి మధ్య సీరియస్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఫోటోల్లో కూడా ధోని లుక్స్ సీరియస్గా ఉండడంతో ఆ వార్తలు నిజమేననిపిస్తుంది. చదవండి: Rohit Sharma: వన్డే, టి20 కెప్టెన్గా రోహిత్.. కోహ్లి టెస్టులకే పరిమితం..?! అయితే ధోని కోపానికి పరోక్షంగా కోహ్లినే కారణమా అని కొందరు పేర్కొంటున్నారు. వరుణ్ చక్రవర్తి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఎంపికచేయకపోవడం.. హార్దిక్ పాండ్యాను వద్దన్నా ఎందుకు ఆడించాడనేదానిపై ధోని రవిశాస్త్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేగాక రోహిత్ శర్మను బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ చేయడం వెనుక కూడా ధోని సీరియస్ అయినట్లు సమాచారం. మరోవైపు మెంటార్గా తన సలహాలు కోహ్లి వినడం లేదని బీసీసీఐకి ధోని ఫిర్యాదు చేసినట్లు మరో వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు గానీ అభిమానులు మాత్రం ఎవరికి వారు ఏవేవో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Virat Kohli On India Loss: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం.. ఇక సూపర్ 12 దశలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన టీమిండియా రేపు(నవంబర్ 3న) అఫ్గనిస్తాన్తో మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసింది. ఇక సెమీస్ అవకాశాలు దాదాపు కోల్పోయిన టీమిండియా మరో మూడు మ్యాచ్ల్లో భారీ విజయాలు అందుకున్నప్పటికీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
ఆమె కోసం షూటింగ్ సెట్స్కి వెళ్లేవాడు..రవి శాస్త్రి బ్రేకప్ స్టోరీ
ఆల్రౌండర్ రవి శాస్త్రి.. సినిమా హీరోకున్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు! అతని ఆటతోపాటు అపియరెన్స్నూ ఆరాధించారు అమ్మాయిలు! అతను బాలీవుడ్ నటి అమృతా సింగ్ను ప్రేమించాడు.. ఆమె కూడా రవి శాస్త్రి తోడును కోరుకుంది.. కానీ ఆ ప్రేమ .. పెళ్లి ఆహ్వానాన్ని పంపలేదు..ఆ బ్రేకప్కు కారణమేంటో తెలుసుకోవాలంటే ఇంకో బ్రేకప్ దగ్గర మొదలైన ఈ లవ్స్టోరీ చదవాలి.. పెళ్లయిందన్న విషయాన్ని దాచిపెట్టి తనతో ప్రేమ నటించిన సన్నీ డియోల్ మోసాన్ని తట్టుకోలేకపోయింది అమృతా సింగ్. కాస్త కటువుగానే అతనితో తెగతెంపులు చేసేసుకుంది. ఆ బాధను, దిగులును మరచిపోవడానికి కెరీర్ మీద ఏకాగ్రతను పెంచుకుంది. ఏ కాస్త వీలు దొరికినా స్నేహితులతో కలసి పార్టీలకు వెళ్లి సేద తీరేది. అలాంటి ఓ సందర్భంలోనే రవి శాస్త్రి పరిచయమయ్యాడు. అప్పటికి రవి శాస్త్రి గురించి కాస్తయినా అమృతాకు తెలుసు కానీ.. అమృతా గురించి ఆ క్రికెటర్కు ఏమీ తెలీదు. అయినా అమృతా నచ్చింది అతనికి.. తొలి చూపులోనే. మొదటి పరిచయంలోనే ఇద్దరూ చాలా సన్నిహితులైపోయారు. టెలిఫోన్ నంబర్లూ ఇచ్చిపుచ్చుకున్నారు. తెల్లవారి నుంచి టెలిఫోన్ సంభాషణలూ స్టార్ట్ చేశారు. తీరిక వేళల్లో.. అమృతా సింగ్ నటించిన సినిమాలు చూడకపోయినా.. ఆమె షూటింగ్ సెట్స్కి వెళ్లేవాడు రవిశాస్త్రి. అమృతా అంతే.. క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా రవిశాస్త్రి కోసం అతనితో కలసి క్రికెట్ టూరింగ్ చేసింది. కాఫీ డేట్లు, డిన్నర్ మీట్లు సాధారణమయ్యాయి. వీళ్ల తీరుకి అది ప్రేమే అని గ్రహించిన మీడియా కథనాలు రాయసాగింది. అవునని కానీ.. కాదని కానీ కామెంట్ చేయలేదు ఆ జంట. చూసీ చూడనట్టే ఉండిపోయింది. కొన్నాళ్లకు జంటగా ‘సినీ బ్లిట్జ్’ మ్యాగజైన్ కవర్ మీద కనిపించింది ఆ జంట.. తమ మధ్య ప్రేమానుబంధం నిజమే అని ప్రకటిస్తూ! ‘చూశారా మేం చెప్పింది నిజమే’ అంటూ పేజ్త్రీ కాలమ్స్ థమ్స్ అప్ చేశాయి. నిశ్చితార్థం కూడా అయిపోయిందని చెప్పాయి. దీని గురించి కూడా మీడియా రాసింది.. ‘న్యూయార్క్లోని ఓ హోటల్లో రవిశాస్త్రి.. అమృతాకు ఉంగరం తొడిగాడు.. బహుశా అది ఎంగేజ్మెంట్ రింగ్ కావచ్చు’ అని. ఎవరు చెబితేనేం .. ఆ ఇద్దరి ప్రేమ నిజం.. వాళ్లిద్దరూ ఒక్కింటివాళ్లవ్వబోతున్నది మాత్రం అబద్ధంగా తేలింది. ఎందుకలా? వాళ్ల నిశ్చితార్థం సమయానికి ఇంకా చెప్పాలంటే ఆ జంట ఇష్క్లో ఈదుతున్నప్పటికీ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. అమృతా క్యాలెండర్ ఖాళీ లేనంత బిజీ. అదే రవి శాస్త్రికి ఇబ్బంది అనిపించింది. పెళ్లి కానంత వరకు అమ్మాయిలకు ఉద్యోగాలు ఉండొచ్చు కానీ పెళ్లయ్యాక ఇల్లాలికి ఇల్లే ప్రపంచం కావాలనే స్థిరమైన అభిప్రాయం అతనిది. అడిగాడు అమృతాను సినిమాలు మానేయమని. అప్పుడప్పుడే సక్సెస్ను.. స్టార్డమ్ను ఆస్వాదిస్తున్న ఆమెకు అతని డిమాండ్ సమంజసమనిపించలేదు. అందుకే ‘సారీ’ అంది. అతనూ ‘సారీ’ అన్నాడు పెళ్లికి. అలా బ్రేక్ అయిపోయింది ఆ బంధం. ఎవరి దారిలో వారు.. అమృతాను కాదనుకున్నాక 1990లో రీతూ సింగ్ను పెళ్లి చేసుకున్నాడు రవి శాస్త్రి. సరిగ్గా ఏడాదికి అంటే 1991లో సైఫ్ అలీ ఖాన్ ఇల్లాలైంది అమృతా సింగ్. అయితే తమ పెళ్లయిన 22 ఏళ్లకు రీతూకు విడాకులిచ్చాడు రవి శాస్త్రి. తమ పెళ్లయిన పదమూడేళ్లకు అంటే 2004లో సైఫ్ అలీ ఖాన్తో వివాహబంధాన్ని రద్దు చేసుకుంది అమృతా సింగ్. రీతూ విడిపోయాక.. బాలీవుడ్ నటి.. లంచ్ బాక్స్ ఫేమ్ నిమ్రత్ కౌర్తో ప్రేమలో పడ్డాడని సోషల్ మీడియా మాట. దాన్నీ నిజంగా సమర్థించలేదు.. వదంతిగానూ కొట్టి పారేయలేదు ఆ ఇద్దరూ! జీవిత భాగస్వామి విషయంలో నాక్కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాస్త పురుషాహంకారిని కూడా. పెళ్లయ్యాక భార్యకు ఇల్లే లోకం కావాలని బలంగా నమ్ముతాను. అందుకే సినీ నటిని నా భార్యగా నేనాడూ ఊహించలేదు. – రవి శాస్త్రి క్షణం తీరికలేకుండా కెరీర్ సాగుతున్న టైమ్లో దాన్ని వదులుకునేందుకు నేనూ సిద్ధపడలేదు. కొన్నాళ్లు వేచిచూస్తే తెలిసేది.. భార్యగా.. తల్లిగా నేను సిద్ధమో..కాదో! – అమృతా సింగ్ - ఎస్సార్ -
బాబర్ అజమ్ బ్యాటింగ్.. రెప్పవాల్చని టీమిండియా ఆటగాళ్లు.. నీకు చెక్పెడతాం కదా!
T20 World Cup 2021 IND vs PAK.. టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా-పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరగనుండడంతో హాట్టాపిక్గా మారిపోయింది. ఎక్కడ చూసిన అభిమానులు ఈ మ్యాచ్పై చర్చలు జరుపుతున్నారు. ఈసారి మ్యాచ్లో ఎవరు పైచేయి సాధించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సోమవారం వెస్టిండీస్తో వార్మప్ మ్యాచ్ ఆడింది. టీమిండియా కూడా ఇంగ్లండ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup: ఇండియా- పాక్ మ్యాచ్ రద్దు చేసే వీలు లేదు.. ఆడాల్సిందే! అయితే టీమిండియా- ఇంగ్లండ్ మ్యాచ్కు ముందు పాకిస్తాన్- విండీస్ మ్యాచ్ జరగడంతో టీమిండియా కోచ్ రవిశాస్త్రి సహా భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్లు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ బ్యాటింగ్ చూస్తూ కనిపించడం వైరల్గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విండీస్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో బాబర్ అజమ్ క్లాస్ హాఫ్సెంచరీతో మెరిశాడు. అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. పైగా బాబర్ అజమ్ ప్రస్త్తుతం వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ బ్యాటర్గా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా బాబర్ అజమ్ అత్యధ్బుతమైన ఫామ్లో ఉండడంతో టీమిండియాతో మ్యాచ్లో కీలకంగా మారాడు. అతని క్లాస్ బ్యాటింగ్ను రవిశాస్త్రి సహా మిగతా ఆటగాళ్లు రెప్పవాల్చకుండా చూశారు. అయితే అక్టోబర్ 24న టీమిండియా-పాకిస్తాన్ మధ్య ఫైట్లో భాగంగా బాబర్ అజమ్ను ఎలా కంట్రోల్ చేయాలనేదానిపై రవిశాస్త్రి భువీ, శార్దూల్, దీపక్ చహర్లకు వివరించినట్లు కొందరు అభిమానులు పేర్కొన్నారు. ఇక వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించగా.. ఇటు ఇంగ్లండ్పై వార్మప్ మ్యాచ్లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ అర్థ శతకాలతో మెరవడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. కాగా టీమిండియా రేపు(అక్టోబర్ 20న) ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. చదవండి: T20 World Cup: సంభాషణలు ఇలాగే ఉంటాయి మరి.. కోహ్లి, ధోని ఫొటో వైరల్! FANS FROM INDIA COMES TO WATCH BABAR AZAM'S BATTING 😅😅#BabarAzam #T20WorldCup #Pakistan #PAKvIND pic.twitter.com/OsQZ9Zl0ER — Aiman Fatima 🏏 (@Cric_crazy_girl) October 18, 2021 -
టీమిండియా కోచ్ రేసులో 'ఆ ముగ్గురు'.. విదేశీయులకు నో ఛాన్స్ అన్న బీసీసీఐ..!
BCCI Unlikely To Appoint Foreign Coach For Team India : టీ20 ప్రపంచకప్తో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో అతని వారసుడు ఎవరనే అంశంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ వర్గాలు ఓ క్లారిటీ ఇచ్చాయి. టీమిండియా తదుపరి కోచ్గా విదేశీయులకు ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పాయి. కోచ్ రేసులో భారత మాజీ ఆటగాళ్లే ఉంటారని సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి అత్యంత సన్నిహితులైన ముగ్గురు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న రాహుల్ ద్రవిడ్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్వచ్చంధంగా కోచ్ పదవిపై నిరాసక్తత కనబర్చడంతో వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ల పేర్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరు ముగ్గురికి ఐపీఎల్లో వివిధ ఫ్రాంఛైజీల తరఫున కోచింగ్ అనుభవం కూడా ఉండడంతో.. ఎవరో ఒకరికి రవిశాస్త్రి వారసుడిగా పట్టం కట్టడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కోచ్ పదవికి విదేశీ కోచ్ ఫార్ములా వర్కవుట్ కాదని, అందులోనూ బోర్డు పరిశీలనలో ఉన్న రికీ పాంటింగ్, మహేల జయవర్దనే, టామ్ మూడీ లాంటి వాళ్లు ఫుల్ టైమ్ కోచ్గా పని చేసేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గతంలో నలుగురు విదేశీయులు టీమిండియా కోచ్లుగా పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత జాన్ రైట్, ఆతర్వాత గ్రెగ్ ఛాపెల్, గ్యారీ కిర్స్టెన్, డంకన్ ఫ్లెచర్ భారత జట్టు హెడ్ కోచ్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. చదవండి: కోల్కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్కు బంపర్ ఆఫర్.. -
Ravi Shastri: పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని ఏం సాధించలేదో చెప్పండి?!
Ravi Shastri Comments On MS Dhoni: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనిపై భారత జట్టు హెడ్కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్గా మిస్టర్ కూల్కు ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. ఐసీసీ ఈవెంట్లు, మేటి లీగ్ మ్యాచ్లు.. ఇలా ఎక్కడ చూసినా తనకు అద్భుత రికార్డు ఉందని కొనియాడాడు. ధోనిని కింగ్ కాంగ్గా అభివర్ణిస్తూ ఆకాశానికెత్తేశాడు. కాగా టీమిండియా కెప్టెన్గా ధోని ఖాతాలో అద్భుత విజయాలు ఉన్న సంగతి తెలిసిందే. భారత జట్టుకు ఐసీసీ టీ20 వరల్డ్కప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 అందించాడు. ఇక ఐపీఎల్లోనూ చెన్నై సూపర్కింగ్స్ సారథిగా జట్టును మూడు సార్లు విజేతగా నిలిపాడు. ఈ సీజన్లోనూ మరోసారి టైటిల్ సాధించే దిశగా ధోని సేన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన చెన్నై... తొమ్మిదింటిలో విజయం సాధించి ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్కోడ్తో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని అత్యంత గొప్ప కెప్టెన్. ఐసీసీ టోర్నమెంట్లలో అతడి రికార్డు చూడండి. అతడు ఏం గెలవలేదో చెప్పండి? ఐపీఎల్, చాంపియన్స్ లీగ్, ఐసీసీ టోర్నమెంట్లు, రెండు వరల్డ్కప్లు. ఈ ఫార్మాట్లో తన రికార్డులకు ఎవరూ చేరువగా వెళ్లలేరు. తను గ్రేటెస్ట్ కెప్టెన్. ఆట పట్ల అతడికి ఉన్న నిబద్ధతను చూసి ది కింగ్ కాంగ్ అనొచ్చు’’ అని ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్కప్ టోర్నీ నేపథ్యంలో టీమిండియాకు ధోని మెంటార్గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ధోని విలువైన సలహాలు, అనుభవం ఉపయోగించుకునేందుకు బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత హెడ్కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కళ్లు చెదిరే షాట్.. ఏంటి పృథ్వీ బంతి కనపడలేదా -
వాళ్లిద్దరూ కోచ్, మెంటార్లుగా ఉంటే.. టీమిండియాకు వరం: ఎమ్మెస్కే ప్రసాద్
MSK Prasad Comments On Rahul Dravid And Dhoni: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నాడన్న వార్తల నేపథ్యంలో... కొత్త కోచ్ ఎవరన్న అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు.. కుంబ్లే పేరును బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రతిపాదించినప్పటికీ.. తనకు ఈ పదవిపై ఆసక్తి లేదని కుంబ్లే చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. బీసీసీఐ విదేశీ కోచ్ను సంప్రదించే పనిలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్ అయితే బాగుంటుందని పేర్కొన్నాడు. స్పోర్ట్స్తక్తో అతడు మాట్లాడుతూ.. ‘‘ద్రవిడ్ కోచ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రవి భాయ్ యుగం ముగిసిన తర్వాత.. ఎంఎస్ ధోని మెంటార్గా, ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారని నా సహచర కామెంటేటర్లతో ఛాలెంజ్ చేశా. ఐపీఎల్ కామెంట్రీ చేస్తున్న సమయంలో ఈ విషయాలు చర్చకు వచ్చాయి. కోచ్గా ద్రవిడ్, మెంటార్గా ధోని ఉంటే భారత క్రికెట్కు అదొక వరంలా మారుతుంది. ఇద్దరూ కూల్గా ఉంటారు. అందులో ఒకరు(ద్రవిడ్) మరీ హార్డ్ వర్కర్. ఇండియా ఏ జట్టులో చాలా మంది ఇప్పటికే ఆయన శిక్షణలో రాటుదేలుతున్నారు. నేను అనుకున్నట్లుగా ధోని మెంటార్, ద్రవిడ్ కోచ్ కాకపోతే నేను నిరాశచెందుతాను’’ అని చెప్పుకొచ్చాడు. 2017లో భారత జట్టు హెడ్ కోచ్గా నియమితుడైన రవిశాస్త్రి హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించిన సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ మాత్రం గెలవలేదు. చదవండి: Chris Gayle: అందుకే నేను తప్పుకొంటున్నా... -
ఆర్నెళ్ల క్రితమే 'ఆ' సలహా ఇచ్చాడు.. అయినా పట్టించుకోని కోహ్లి..!
Ravi Shastri Advised Kohli To Quit Captaincy From Two Formats: టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి, ఐపీఎల్-2021 తర్వాత ఆర్సీబీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల సంచలన ప్రకటన చేసిన విరాట్ కోహ్లి క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆరు మాసాల క్రితమే ఓ కీలక సలహా ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఆ సలహాను అప్పట్లో అంతగా పట్టించుకోని కోహ్లి.. ఆలస్యంగా తేరుకుని కోచ్ సలహాలోని ఓ భాగాన్ని మాత్రమే అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ కోహ్లికి రవిశాస్త్రి ఇచ్చిన ఆ సలహా ఏంటా అని అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆసీస్ను వారి సొంతగడ్డపై మట్టికరింపించిన అనంతరం టీమిండియా కోచ్ రవిశాస్త్రి.. కెప్టెన్ కోహ్లికి ఓ కీలక సూచన చేశాడు. బ్యాటింగ్పై పూర్తి దృష్టి కేంద్రీకరించేందుకు వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్బై చెప్పాలని, టెస్ట్ క్రికెట్లో మాత్రం సారధిగా కొనసాగాలని సలహా ఇచ్చాడు. అప్పటికే అడపాదడపా ఫామ్తో నెట్టుకొస్తున్న కోహ్లి మంచి కోరే రవిశాస్త్రి ఈ సలహా ఇచ్చాడట. అయితే, రవిశాస్త్రి మాటలను పెడచెవిన పెట్టిన కోహ్లి కేవలం టీ20 కెప్టెన్సీకి మాత్రమే గుడ్బై చెబుతానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి.. కోహ్లికి ఇచ్చిన సలహాపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కోచ్ సలహా మేరకు కోహ్లి ఈ పనిని ఆర్నెళ్ల క్రితమే చేసుంటే.. ఆటతీరు మరింత మెరుగ్గా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లికి కెప్టెన్సీపై ఇంకా యావ తగ్గలేదని, అందుకే కోచ్ చెప్పినా వినకుండా వన్డే సారధ్య బాధ్యతలను అట్టిపెట్టుకున్నాడని మరికొందరు చురకలంటిస్తున్నారు. చదవండి: ‘కివీస్ జట్టుకు బెదిరింపులు భారత్ కుట్రే’... పాక్ మంత్రి సంచలన ఆరోపణ -
అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాను!
లండన్: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా రవిశాస్త్రి పదవీకాలం వచ్చే టి20 ప్రపంచకప్తో ముగియనుంది. ఆ తర్వాత కొనసాగించేందుకు అతను ఆసక్తి చూపించడం లేదు. కోచ్గా ఎంతో సాధించానని, గడువు పూర్తయిన తర్వాత ఆగిపోయే మనస్తత్వం తనది కాదని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటికే కోచ్గా నేను అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాను. టెస్టుల్లో ఐదేళ్లు నంబర్వన్గా ఉండటం, ఆ్రస్టేలియాలో రెండుసార్లు సిరీస్ సాధించడం, కరోనా సమయంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టులు గెలిచి సిరీస్లో ఆధిక్యంలో నిలవడంలాంటివి అద్భుతం. నా నాలుగు దశాబ్దాల క్రికెట్లో ఇది ఎంతో సంతృప్తికర క్షణం. వీటికి తోడు టి20 ప్రపంచకప్ కూడా గెలిస్తే అది అదనపు ఆనందాన్నిస్తుంది. గెలవగల సత్తా మా టీమ్కు ఉంది కూడా. మనకు ఇచ్చిన సమయంకంటే అదనంగా ఒక్క క్షణం కూడా ఆగవద్దని నేను నమ్ముతాను. అందుకే సరైన సమయంలోనే తప్పుకుంటున్నాను’ అని రవిశాస్త్రి వివరించాడు. -
ఒక్కటి ఓడినా కాల్చుకుతింటారు.. ఇమేజ్ డ్యామేజ్.. ఇంకా: రవిశాస్త్రి
Ravi Shastri To Step Down As Team India Head Coach: టీమిండియా ప్రధాన కోచ్ పదవి అంటే కత్తి మీద సాములాంటిదని రవిశాస్త్రి అన్నాడు. అభిమానుల అంచనాలు అందుకుంటే అంతా సవ్యంగా సాగుతుందని, లేనిపక్షంలో విమర్శల జడి కురుస్తుందని పేర్కొన్నాడు. జట్టు విజయం తప్ప ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేరని, వరుస పరాజయాల తర్వాత కనీసం ఒక్కసారైనా గెలవకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 2017లో భారత జట్టు హెడ్ కోచ్గా నియమితుడైన రవిశాస్త్రి హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఆస్ట్రేలియా టూర్, ఇంగ్లండ్ ఇండియా పర్యటన, ఇండియా ఇంగ్లండ్ టూర్లోనూ కోహ్లి సేన విజయాలు సాధించడం ఇందుకు తాజా నిదర్శనం. ఇక ఇదిలా ఉంటే.. టి20 వరల్డ్కప్ తర్వాత తన పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ వరకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ కోరినా, ఆయన అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ది గార్డియన్’కు రవిశాస్త్రి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా బుక్ లాంచ్ చేసిన రవిశాస్త్రికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఇతర కోచ్లు ఐసోలేషన్కు వెళ్లడం, ఐదో టెస్టుకు ముందు టీమిండియా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్కు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో మ్యాచ్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో రవిశాస్త్రిని ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ.. ‘‘మనకు కోవిడ్ సోకిందా లేదా అన్న విషయం గురించి వాళ్ల(అభిమానుల)కు అనవసరం. ఎప్పుడూ జట్టు గెలుపొందడమే వాళ్లకు కావాల్సింది. భారత జట్టుకు కోచ్గా ఉండటం అంటే బ్రెజిల్ లేదా ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టుకు కోచ్గా ఉన్నట్లే. అంచనాలు ఆ స్థాయిలో ఉంటాయి. ఆరు నెలల పాటు జట్టు మంచి విజయాలు సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఒక్క ఓటమి ఎదురైనా మనల్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి మనకు అప్పటికప్పుడు గెలుపు అవసరం. లేదంటే మనల్ని కాల్చుకుతింటారు. ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు వెనుకాడరు. అలాంటి సమయంలో ఇదిగో ఇలా నాలాగా దాక్కోవాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నాడు. గెలిచే అవకాశాలు ఉన్నాయి.. అయితే అదొక్కటే బాధ! ఇక అక్టోబరులో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్నకు సన్నద్ధం కావడం గురించి రవిశాస్త్రి చెబుతూ.. ‘‘మా శాయశక్తులా కృషి చేస్తాం. మా స్థాయికి తగ్గట్లు ఆడితే గెలుపు ఖాయం. నిజానికి టెస్ట్ మ్యాచ్ అంటే ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. అదే టీ20 మ్యాచ్లను ఎంజాయ్ చేస్తూ ఆడవచ్చు. కప్ గెలిచే విధంగా అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం’’ అని వెల్లడించాడు. ఇక ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో పనిచేశానని, డ్రెసింగ్ రూంలో మంచి వాతావరణం ఉంటుందన్న రవిశాస్త్రి.. ఈ మెగా టోర్నీ తర్వాత కాస్త బాధపడాల్సి వస్తుందని కోచ్ పదవి నుంచి తప్పుకునే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. కాగా రవిశాస్త్రి స్థానంలో అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం -
టీమిండియా ప్రధాన కోచ్గా మరోసారి ఆయనే!
Anil Kumble As Team India Coach.. టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ రవిశాస్త్రిని దక్షిణాఫ్రికా పర్యటన వరకు అందుబాటులో ఉండాలని కోరినా అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ అన్వేషణలో పడింది. దీనికి సంబంధించి బీసీసీఐ టి20 ప్రపంచకప్ తర్వాత దరఖాస్తులను కోరనుంది. కాగా రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్లలో ఎవరో ఒకరిని ప్రధాన కోచ్ పదవి వరించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తాజాగా అనిల్ కుంబ్లే మరోసారి టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాలంటూ బీసీసీఐ అతన్ని కోరినట్లు అనధికారిక రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. ఇంతకముందు అనిల్ కుంబ్లే టీమిండియాకు కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లి, కుంబ్లే మధ్య విభేదాలు బయటపడ్డాయి. కుంబ్లే ఆలోచన విధానంతో కోహ్లికి పొసగలేదు. జట్టు ఎంపికలో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. దీంతో ఏడాది కాంట్రాక్ట్ కన్నా ముందే కుంబ్లే అర్థంతరంగా కోచ్ పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. చదవండి: కోహ్లి వారసుడి ఎంపికపై చాయిస్ను వెల్లడించిన లిటిల్ మాస్టర్ ఇక 2016లో ధోని కెప్టెన్గా ఉన్న సమయంలో అనిల్ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలను స్వీకరించాడు. ఏడాది కాలానికి గానూ కుంబ్లే కోచ్ పదవిలో ఉంటారని బీసీసీఐ మేనేజ్మెంట్ తెలిపింది. అయితే 2017 జనవరిలో ధోని పరిమిత ఓవర్ల నుంచి కెప్టెన్గా వైదొలిగాడు. ఆ తర్వాత కోహ్లి కెప్టెన్ అవడం జరిగింది. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు బహిరంగంగానే వెలుగుచూశాయి. కాగా కుంబ్లే, కోహ్లి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో అప్పటి బీసీసీఐ సభ్యుడు వినోద్ రాయ్ కుంబ్లే వెస్టిండీస్ టూర్ వరకు ఆ పదవిలో ఉంటాడని తెలిపాడు. కాగా 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. తన కాంట్రాక్ట్కు ఇంకా సమయమున్నప్పటికీ 2017 జూన్ 20న కుంబ్లే టీమిండియా కోచ్ పదవికి అర్థంతరంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కోహ్లి రవిశాస్త్రిని ప్రధాన కోచ్ పదవి ఇవ్వాలని బీసీసీఐని కోరడం.. వెంటనే టీమిండియా కోచ్గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది. చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్కప్ గెలవాలి ఇప్పటికైతే కుంబ్లే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ.. కోహ్లీతో విభేదాల కారణంగానే పదవికి రాజీనామా చేశాడు. మరి ఇప్పుడు కోహ్లి జట్టులోనే ఉన్నాడు.. టి20 ప్రపంచకప్ తర్వాత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి పరిమిత, టెస్టు జట్టుకు మాత్రం కెప్టెన్గా కొనసాగనున్నాడు. మరి కుంబ్లే కోచ్ పదవికి ఆసక్తి చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కుంబ్లేతో పాటు వివిఎస్ లక్ష్మణ్ కూడా టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే టి20 ప్రపంచకప్ ముగిసేంతవరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఇప్పటికైతే రోహిత్.. మరి తర్వాత ఎవరు? -
టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్!
Ravi Shastri Step Down Team India Coach: టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నాడని సమాచారం. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి కోచ్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం రవిశాస్త్రిని దక్షిణాఫ్రికా పర్యటన వరకు కోచ్ పదవిలో ఉండాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రవిశాస్త్రి మాత్రం టి20 ప్రపంచకప్ తర్వాతే వైదొలిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక రవిశాస్త్రి తర్వాత టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టేది ఎవరనే దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చదవండి: T20 World Cup 2021: ఆ ఫలితాన్ని రిపీట్ చేస్తాం.. టీమిండియాపై పాక్ బౌలర్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం మాత్రం కోచ్ పదవి రాహుల్ ద్రవిడ్నే వరిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే టీమిండియా-ఏ జట్టు రాటు దేలడం.. ఆపై సీనియర్ టీమ్ గైర్హాజరీలో టీమిండియా రెండో టీమ్ శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేగాక టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ జట్టుకు ఎంతో ఉపయోగపడతాడని.. అతని సలహాలతో జట్టు మంచి ప్రదర్శన ఇస్తుందనేది చాలా మంది అభిప్రాయం. ఇక టీమిండియాకు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత విజయవంతమైన కోచ్గా గ్యారీ కిర్స్టెన్ నిలిచాడు. 2011 వన్డే వరల్డ్కప్తో పాటు.. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ టీమిండియా గెలవడంతో కోచ్గా కిర్స్టన్ పాత్ర కీలకం. 2017లో కిర్స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాకా రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్గా నియామకమయ్యాడు. ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం.. కోహ్లి కెప్టెన్ కావడం.. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి టీమిండియాకు మంచి విజయాల్ని కట్టబెట్టారు. రవిశాస్త్రి కోచ్గా వచ్చిన తర్వాత కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను స్వదేశంతో పాటు వారి గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది. దీంతోపాటు ఎన్నో సిరీస్ల్లోనూ వీరి జోడి పర్ఫ్టెక్ట్గా కనిపించింది. కోహ్లి కూడా రవిశాస్త్రి నిర్ణయాలతో ఏకీభవిస్తూ.. అతనికి మద్దతుగా నిలుస్తూ వచ్చాడు. అయితే ఐసీసీ మేజర్ టోర్నీలకు వచ్చేసరికి మాత్రం రవిశాస్త్రి కోచ్గా సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి. 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్.. తాజాగా ఐసీసీ టెస్టు చాంపియన్ ఫైనల్లోనూ టీమిండియా అపజయాలే చూసింది. కేవలం ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లోనే కోచ్గా విఫలమయ్యాననే కారణంతో రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘రవిశాస్త్రి, టీమిండియా ఆటగాళ్లు.. ఒక్కరంటే ఒక్కరు కూడా..!’ అయితే, కోచ్గా రవిశాస్త్రి తప్పుకుంటున్నాడనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే.. టి20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ను తాత్కాలిక కోచ్గా నియమించే అవకాశం ఉంటుంది. అయితే ద్రవిడ్ మాత్రం ఎన్సీఏ చీఫ్ కోచ్గా ఉండడానికి ఈ మధ్యనే మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని గమనిస్తే.. టీమిండియా హెడ్ కోచ్గా పనిచేయడానికి ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే రవిశాస్త్రి కోచ్గా వైదొలిగిన తర్వాత అతని టీమ్లోని బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్లకు కూడా బీసీసీఐ ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. ఒకవేళ టీమిండియాకు కొత్త కోచ్ వస్తే గనుక కొత్త టీమ్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టి20 ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్కు ద్రవిడ్ను తాత్కాలిక కోచ్గా ఉంచి.. ఆ తర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో సిరీస్ జరిగే నాటికి కోచ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఒకవేళ ద్రవిడ్ ఫుల్టైం ప్రధాన కోచ్గా ఉండేందుకు అంగీకరిస్తే మాత్రం బీసీసీఐకి ఇబ్బంది తొలగినట్టే. ఇక టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టి20 ప్రపంచకప్ అనంతరం టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో రోహిత్ టెస్టు కెప్టెన్ అని రూమర్లు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని బీసీసీఐ ఖండించింది. -
‘రవిశాస్త్రి, టీమిండియా ఆటగాళ్లు.. ఒక్కరంటే ఒక్కరు కూడా..!’
ముంబై: ఇంగ్లండ్ తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ అర్ధంతరంగా రద్దయిన నేపథ్యంలో.. మ్యాచ్ రద్దుకు దారి తీసిన కారణాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు శిక్షణ సిబ్బంది కూడా కరోనా బారిన పడటంతో ఈ మ్యాచ్ రద్దయిన తెలిసిందే. నాలుగో టెస్టు ముందు బయో బబుల్ నిబంధనలు బేఖాతరు చేస్తూ రవిశాస్త్రి తన 'స్టార్ గేజర్' పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే నాలుగో టెస్ట్ ముందు రవిశాస్త్రి వైరస్ బారిన పడ్డాడు. దీంతో మ్యాచ్ రద్దుకు రవిశాస్త్రి కారణమంటూ విమర్శలు కూడా వచ్చాయి. కాగా, ఈ పుస్తకావిష్కరణకు హాజరు కావడానికి భారత జట్టు అనుమతి తీసుకోలేదని బీసీసీఐ కూడా పేర్కొంది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన భారత మాజీ ఆటగాడు దిలీప్ దోషి కొన్ని ముఖ్యమైన వివరాలను తాజాగా వెల్లడించాడు. కోచ్ రవిశాస్త్రితో కలిసి బుక్ లాంచ్ ఈవెంట్కి హాజరైన భారత క్రికెటర్లు కనీసం మాస్క్ కూడా ధరించలేదని అతడు తెలిపాడు. "నేను పుస్తకావిష్కరణకు హాజరయ్యాను. నన్ను తాజ్ గ్రూప్ ఆహ్వానించింది. చాలా మంది ప్రముఖులు, టీమిండియా ఆటగాళ్లు కొద్దిసేపు అక్కడ ఉన్నారు.. వారెవరూ మాస్కు ధరించకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను" అని దిలీప్ దోషి తెలిపాడు. మస్కు ధరించడం తప్పనిసరి చేయాలని.. భారత జట్టు జాగ్రత్తలు తీసుకోవాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ICC Mens T20I Rankings: టాప్- 10లో భారత్ నుంచి వాళ్లిద్దరే! -
నా వల్లే కోవిడ్ వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోను.. ఆఖరి టెస్ట్ రద్దుపై రవిశాస్త్రి
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి జరగాల్సిన ఐదో టెస్ట్ కరోనా కారణంగా అర్దంతరంగా రద్దైన విషయం తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు ఇతర ఆటగాళ్లు ఓ బుక్ లాంచ్ ఈవెంట్కు వెళ్లడమే. వీరు బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల అనుమతి తీసుకోకుండా ఆ ఈవెంట్కు వెళ్లడంతో తొలుత రవిశాస్త్రి, ఆతర్వాత వరుసగా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, సీనియర్ ఫిజియో నితిన్ పటేల్లు కరోనా బారిన పడ్డారు. ఐదో టెస్ట్కు ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్కు సైతం కరోనా నిర్ధారణ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఈ పరిస్థితి రావడానికి హెడ్ కోచ్ రవిశాస్త్రినే కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన తొలిసారి స్పందించాడు. తాజాగా ఆయన ఓ ప్రముఖ వార్తా పత్రికతో మాట్లాడుతూ.. యూకే మొత్తం బార్లా తెరిచుండగా నా వల్లే కోవిడ్ వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోనని తనను విమర్శించే వారిపై ఎదురుదాడికి దిగాడు. ఆంక్షలు పూర్తిగా సడలించారు.. ప్రజలంతా స్వేచ్చగా తిరుగుతున్నారు. జరిగేది ఉంటే తొలి టెస్ట్ నుంచే ఏదైనా జరిగి ఉండవచ్చుంటూ తన చర్యను సమర్ధించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన టీమిండియా ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం టీమిండియా ఇంగ్లండ్పై దాదాపు గెలిచినంత పనిచేసిందన్నాడు. గతంలో ఇదే పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటనలో కూడా భారత జట్టు అద్భుతంగా రాణించిందని కొనియాడాడు. కోవిడ్ సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో ఏ ఇతర జట్టు కూడా టీమిండియాలా ఆడలేదని ఆకాశానికెత్తాడు. చదవండి: కోవిడ్ బూచి చూపించి టీమిండియా డ్రామాలాడింది.. అంతా ఐపీఎల్ కోసమే..! -
ట్రోఫీతో వస్తారనుకుంటే.. ఇలా చేశారేంటి.. మరీ ఇంతగా..
Ind Vs Eng 5th Test Called Off: భారత్- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక ఐదో టెస్టు రద్దైన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఆటగాళ్లపై ఇంగ్లిష్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బుక్లాంచ్ ఈవెంట్కు హాజరై బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి కీలక మ్యాచ్ జరగకుండా అడ్డుపడ్డారంటూ దుమ్మెత్తిపోస్తోంది. కాగా ఈ ఈవెంట్లో పాల్గొన్న రవిశాస్త్రికి కరోనా సోకగా కోచ్లు భరత్ అరుణ్, శ్రీధర్ ఐసోలేషన్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదో టెస్టుకు ముందు ఫిజియోథెరపిస్ట్ యోగేశ్ పర్మార్కు పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో ఆటగాళ్లందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగటివ్గా తేలినప్పటికీ మ్యాచ్ ఆడేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓవల్ ట్రఫోర్డ్ మైదానంలో శుక్రవారం జరగాల్సిన చివరి మ్యాచ్ను కరోనా భయాల కారణంగా రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ క్రమంలో స్థానిక మీడియా భారత కోచ్లు, ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ‘‘గురువారం రాత్రి పీసీఆర్ టెస్టుల్లో ఫలితం నెగటివ్గా తేలగానే అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఓ పీడకల ముగిసింది. అయితే, ఇదంతా చూస్తుంటే.. గేమ్ ఆడకుండా తప్పించుకునేందుకే వాళ్లు ఇలా చేశారా అనిపిస్తోంది. బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి ఇండియా కోచ్లు, ఆటగాళ్లు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావడం ఎంత వరకు సమంజసం. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యం. నాలుగో టెస్టుకు రెండు రోజుల ముందుకు బుక్లాంచ్ ఈవెంట్కు వీరు వెళ్లినట్లు స్పోర్ట్స్మెయిల్ వెల్లడించింది’’ అని డైలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది. కాగా నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు రవిశాస్త్రి సహా కెప్టెన్ విరాట్ కోహ్లి, మరికొందరు టీమిండియా సభ్యులు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విషయంపై బీసీసీఐ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోవిడ్ కారణంగా ఐదో మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియా తీరుపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఇండియన్ ఫ్యాన్స్ సైతం.. ‘‘ఇదొక్కటి గెలిచేసి.. సిరీస్ కైవసం చేసుకుని ట్రోఫీతో తిరిగి వస్తారనుకుంటే ఇలా చేశారేంటి. రవిశాస్త్రి, కోహ్లి ఇలాగేనా ప్రవర్తించేది. ఎందుకిలా చేశారు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా వచ్చే ఏడాది టీమిండియా ఇంగ్లండ్లో పర్యటించనున్న నేపథ్యంలో అప్పుడు ఈ మ్యాచ్ ఆడించి.. సిరీస్ విజేతను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మ్యాచ్ రీషెడ్యూల్ గురించి ఈసీబీ- బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 5th test match cancelled. Ashwin to Kohli & Shastri: pic.twitter.com/qPBzMcd2qV — Keh Ke Peheno (@coolfunnytshirt) September 10, 2021 #ManchesterTest Indian fans to Ravi Shastri and Kohli for going to that book launch event: pic.twitter.com/FjTi1TA7oO — Rajneesh Chaudhary (@Rajneesh_16) September 10, 2021 చదవండి: India Tour Of South Africa: ఈసారైనా నెగ్గుకొచ్చేనా..? -
మ్యాచ్ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్పై బీసీసీఐ ఆగ్రహం
లండన్: 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఓవల్ మైదానంలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ జట్టు సారధి విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్కు ముందు వీరు బయో బబుల్ నిబంధనలను ఉల్లఘించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లితో పాటు మరికొందరు టీమిండియా సభ్యులు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే తొలుత రవిశాస్త్రి, ఆతర్వాత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లు కరోనా బారిన పడినట్లు నిర్దారణ అయ్యింది. ఈ ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలినా కోహ్లి సహా ఇతర ఆటగాళ్లకు మాత్రం నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే ఈ బుక్ లాంచ్ ఈవెంట్కు వెళ్లడానికి(బయో బబుల్ నిబంధనలకు విరుద్ధంగా) భారత బృందం.. బీసీసీఐ అనుమతి కోరలేదని తెలిసింది. దీంతో ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్న బోర్డు.. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లిలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వీరి వివరణ కోరిన బీసీసీఐ.. కోహ్లిని సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ కరోనా బారిన పడిన తర్వాత బోర్డు సెక్రటరీ జై షా ఆటగాళ్లను అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినప్పటికీ భారత బృందం బయో నిబంధనలు ఉల్లంఘించి అజాగ్రత్తగా వ్యవహరించడంతో బీసీసీఐ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, 50 ఏళ్ల తర్వాత ఓవల్లో భారత్కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆతిధ్య జట్టుపై 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్నైట్ స్కోరు 77/0తో అయిదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 210 పరుగులకే ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్లో సూపర్ శతకంతో రాణించిన రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో 5 టెస్ట్ల సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. చదవండి: థాంక్యూ బుమ్రా.. బెయిర్స్టోను డకౌట్ చేశావ్: జార్వో సంబరం -
కరోనా అని తెలియగానే ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్!
లండన్: భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో టీమిండియా ఆటగాళ్లు అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ చెప్పారు. నాలుగోరోజు ఆట ముగిసిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''రవిశాస్త్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆదివారం బీసీసీఐ ప్రకటించంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్లను ఐసోలేషన్కు తరలించారు. వాస్తవానికి మేము వీరి సేవలను భారీగా కోల్పోతున్నాముని'' తెలిపారు. గత 5-6 సంవత్సరాలలో భారత జట్టు బాగా రాణించడంలో వారు ముగ్గురు ప్రధాన పాత్ర పోషించారు అని ఆయన వెల్లడించారు. ''కానీ నిజం ఏంటింటే వారు ఈ సమయంలో ఇక్కడ లేరు. అందుకే ఆటగాళ్లు కలత చెందారు. తర్వాత మాలో మేము మాట్లడుకుని నాల్గవ రోజు ఆటపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాము. దానికే తగ్గట్టే కుర్రాళ్లు కూడా బాగా ఆడారు. శనివారం రాత్రి రవిశాస్త్రి కొంత అసౌకర్యానికి గురయ్యారు. దీంతో వైద్య బృందం రవిశాస్త్రికి కోవిడ్ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది'' అని విక్రమ్ రాథోర్ పేర్కొన్నారు. చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు కాగా భారత్ ఖాతాలో మరో విజయం చేకూరాలంటే నాలుగో టెస్టులో చివరి రోజు బౌలర్లు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది.ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. చదవండి: Shardul Thakur: ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా శార్దూల్ కొత్త చరిత్ర -
టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా
ఓవల్: ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ వార్త తెలిసింది. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్లను ఐసోలేషన్కు తరలించారు. బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి తదుపరి సమాచారం అందేవరకు వీరంతా వేర్వేరుగా ఐసోలేషన్లో ఉంటారని జై షా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ వార్త తెలిసి టీమిండియా సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్పై పైచేయి సాధిస్తున్న తరుణంలో ఈ వార్త టీమిండియాపై ఏమేరకు ప్రభావం చూపుతోందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ టెస్ట్లో ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మరో ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్లో కోహ్లి(22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్లో రోహిత్(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చదవండి: వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’ -
టీమిండియా తదుపరి కోచ్ అతడేనా?
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనుండటంతో అతని వారసుడు ఎవరనే అంశంపై గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఈ విషయమై తాజాగా ఓ క్లారిటీ వచ్చినట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ కోచ్గా పని చేస్తున్న విక్రమ్ రాథోడ్.. తదుపరి చీఫ్ కోచ్గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా బీసీసీఐ పెద్దలు సైతం రాథోడ్తో చర్చించినట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా టీమిండియా కోచ్ పదవి రేసులో రాహుల్ ద్రవిడ్ ముందున్నాడనే వార్తలు వినిపించినా.. అతను నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కే పరిమితం కావాలని నిర్ణయించుకోవడంతో రాథోడ్కు లైన్ క్లియర్ అయినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మతోనూ రాథోడ్ సత్సంబంధాలు కలిగి ఉండటం అతనికి ప్లస్ పాయింట్గా మారింది. మరోవైపు కోచ్ పదవి రేసులో రాథోడ్ సహా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు కూడా వినిపిస్తుండటం విశేషం. ఏదిఏమైనప్పటికీ.. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే దాకా టీమిండియా హెడ్ కోచ్ పదవిపై సస్పెన్స్ కొనసాగనుంది. చదవండి: లార్డ్స్ టెస్ట్ మాకో గుణపాఠం.. ఇకపై వివాదాల జోలికి వెళ్లం: రూట్ -
ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయానికి 50 ఏళ్లు
సాక్షి, వెబ్డెస్క్: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా తొలి టెస్టు సిరీస్ విజయం సాధించి నేటితో 50 ఏళ్లు . అజిత్ వాడేకర్ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లీష్ గడ్డపై తొలి టెస్టు విజయంతో పాటు టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది. తాజాగా బీసీసీఐ ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేస్తూ తన ట్విటర్లో ఒక వీడియోను షేర్ చేసుకుంది. 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Mark Boucher: 'నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా.. క్షమించండి' ఈ సందర్భంగా మరోసారి ఆ మ్యాచ్ విశేషాలను గుర్తుచేసుకుందాం. తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియడంతో ఓవల్ వేదికగా జరిగిన మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. అలన్ నాట్, జాన్ జేమ్సన్, రిచర్డ్ హట్టన్ రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 355 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియా 284 పరుగులకు ఆలౌట్ అయింది. ఫరూక్ ఇంజనీర్ 59, దిలీప్ సర్దేశాయ్ 54 పరుగులతో రాణించారు. అనంతరం 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్కు టీమిండియా లెగ్ స్పిన్నర్ బి. చంద్రశేఖర్ చుక్కులు చూపించాడు. తన లెగ్స్పిన్ మ్యాజిక్తో 6 వికెట్లతో సత్తా చాటిన చంద్రశేఖర్ దెబ్బకు 101 పరుగులకు ఆలౌట్ అయింది. 173 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సునీల్ గావస్కర్ డకౌట్గా వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ వాడేకర్ 45 నాటౌట్, దిలీప్ సర్దేశాయ్ 40 పరుగులతో రాణించడంతో టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై తొలి విజయంతో పాటు టెస్టు సిరీస్ను గెలుచుకుంది. అంతేకాదు 26 టెస్టు వరుస టెస్టు విజయాలతో జోరు మీదున్న ఇంగ్లండ్ జట్టుకు అడ్డుకట్ట వేసింది. కాగా 1932 నుంచి చూసుకుంటే విదేశాల్లో భారత్కు ఇది రెండో టెస్టు సిరీస్ విజయం.. అంతకముందు 1971లోనే వెస్టిండీస్పై టెస్టు సిరీస్ను గెలుచుకుంది. చదవండి: రనౌట్ కోసం థర్డ్ అంపైర్కు అప్పీల్; స్క్రీన్పై మ్యూజిక్ ఆల్బమ్ A special series win 👏 A new chapter in Indian cricket history 🙌 As we celebrate 5⃣0⃣ years of #TeamIndia's historic 1971 Test series win in England, Head Coach @RaviShastriOfc reminisces his memories of that epic series. 🔝 👍 Full video 🎥 👇https://t.co/64rke20QF6 pic.twitter.com/PJghyG9mTQ — BCCI (@BCCI) August 24, 2021 -
లండన్లో టీమిండియా 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు; వీడియో వైరల్
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా బ్రిటీష్ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆడుతున్న టీమిండియా ఆదివారం తాము బస చేస్తున్న హోటల్ వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిలు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జట్టు సభ్యులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు, వారి కుటుంబసభ్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. కాగా శ్రీలంక పర్యటన నుంచి ఇంగ్లండ్కు చేరుకున్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్లు కూడా ఈ వీడియోలో కనిపించారు. ఈ ఇద్దరు తమ ఐసోలేషన్ పీరియడ్ను పూర్తిచేసుకుని జట్టుతో కలిసి ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే మూడవ టెస్ట్ సెలెక్షన్స్ కోసం అందుబాటులో ఉండనున్నారు. ఇక ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆటలో టీమిండియా రెండో ఇన్నింగ్స్లో తడబడుతుంది. 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ప్రస్తుతం 29 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్కు తొలి ఇన్నింగ్స్లో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. On the occasion of India's Independence Day, #TeamIndia members came together to hoist the flag 🇮🇳 🙌 pic.twitter.com/TuypNY5hjU — BCCI (@BCCI) August 15, 2021 -
రవిశాస్త్రి ఎలెవెన్తో మ్యాచ్లు నిర్వహించండి.. బీసీసీఐకి ఫ్యాన్స్ విజ్ఞప్తి
కొలొంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న గబ్బర్ సేన తొలి వన్డేలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో భారత క్రికెట్ అభిమానులు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు.. ద్రవిడ్ పర్యవేక్షణలోని భారత యువ జట్టుకు మధ్య మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంగ్లండ్లో ఉన్న భారత రెగ్యులర్ జట్టుకు రవిశాస్త్రి హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి ఎలెవెన్-ద్రవిడ్ ఎలెవెన్ మధ్య పరిమిత ఓవర్ల మ్యాచ్లు ప్లాన్ చేయాలని బీసీసీఐని కోరుతున్నారు. అవసరమైతే ప్రస్తుత లంక పర్యటనను రద్దు చేసైనా ఈ మ్యాచ్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. Bro @bcci get rid of this Sri Lanka tour, we want a match "Dravid XI vs Shastri XI" now.— Neeche Se Topper (@NeecheSeTopper) July 18, 2021 అయితే కోహ్లీ సేనలో ఉన్న రోహిత్ శర్మను ద్రవిడ్ జట్టులోకి తీసుకొచ్చి.. ప్రస్తుతం ధవన్ అండ్ కో లో ఉన్న పడిక్కల్ను వారికి ఇవ్వాలని ఆసక్తికర ప్రతిపాదనలు చేస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు చేస్తున్న ఈ సరికొత్త ప్రతిపాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలోనే గబ్బర్ సేన 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. పేరుకు ద్వితీయ శ్రేణి జట్టయినా ఊహించినట్టుగానే పూర్తి ఆధిపత్యం చలాయించింది. శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.4 ఓవర్లలోనే చేధించి ఔరా అనిపించింది. Just one change will be there... Send Rohit to dravid xi and padikkal to shashtri xi— Shashanka Sekhar🇮🇳 (@sekhar31086) July 18, 2021 బర్త్ డే బాయ్ ఇషాన్ కిషన్(42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో వన్డే కెరీర్ను ప్రారంభించగా.. ఓపెనర్ పృథ్వీ షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) ధనాధన్ బ్యాటింగ్తో సెహ్వాగ్ను తలపించాడు. ఈ ఇద్దరికి శిఖర్ ధవన్ (95 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో భారత యువ జట్టు చిరస్మరణీయ విజయాన్నందుకుంది. మూడు వన్డేల సిరీస్లో ప్రస్తుతం ధవన్ సేన 1-0 ఆధిక్యంలోకి ఉండగా, ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. -
రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ అతనే..
ముంబై: గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా తొలిసారి రెండు దేశాల్లో వేర్వేరు జట్లతో తలపడుతుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో సీనియర్లతో కూడిన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధవన్ కెప్టెన్సీలో యువ భారత జట్టు శ్రీలంకకు వెళ్లింది. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో.. టీమిండియా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ లంకకు వెళ్లిన బృందానికి కోచ్గా నియమించబడ్డాడు. ఇదిలా ఉంటే, రెగ్యులర్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్తో ముగియనున్న నేపథ్యంలో అతని తర్వాత కోచ్ ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ రేసులో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అందరి కంటే ముందు ఉంటాడని భారత మాజీ ఆల్రౌండర్ రితేందర్ సింగ్ సోధి జోస్యం చెప్పాడు. ఎన్సీఏ డైరెక్టర్గా, అండర్-19 కోచ్గా మంచి సక్సెస్ రేట్ కలిగిన ద్రవిడ్కే కోచ్ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీలంక పర్యటన నిమిత్తం ద్రవిడ్ను కోచ్గా పంపించడంలో బీసీసీఐ ఉద్దేశం క్లియర్గా ఉందని, దీంతో రవిశాస్త్రి తర్వాత కోచ్గా ద్రవిడ్కు గ్రీన్ సిగ్నల్ అందినట్టేనని పేర్కొన్నాడు. వాస్తవానికి రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే సత్తా కేవలం ద్రవిడ్కే ఉందని తెలిపాడు. మరోవైపు రవిశాస్త్రి టీమిండియా కోచ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాడని కొనియాడాడు. కాగా, సోధి భారత్ తరఫున 18 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. -
WeWantANewCaptain: సమయం ఆసన్నమైంది కోహ్లీ.. దిగిపో!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలవడంతో కెప్టెన్సీ మార్పు అంశం మరో సారి తెరపైకి వచ్చింది. బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గి విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా చెత్త ప్రదర్శనకు కోహ్లీ కెప్టెన్సీనే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీపై వేటు వేసి రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. తుది జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించే వ్యూహాలు.. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్, బౌలింగ్ మార్పులు ఇలా అన్నింటిలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని, చెత్త బ్యాటింగ్తో జట్టు ఓటమికి కారణమయ్యాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Kohli should step down . #Captaincy #WTC2021Final #Rahane #ICCWorldTestChampionship #WTCFinal pic.twitter.com/vtgrueryy2 — Supreme Leader (@tHeMantal) June 23, 2021 Now the time has come to make a new coach and a new captain.#T20WC #captaincy #INDvNZ #WTC21 #ViratKohli #RohitSharma pic.twitter.com/AIfWn8eDIJ — Dinesh LiLawat (@imDL45) June 23, 2021 అలాగే టీమిండియా ఘోర ప్రదర్శనకు హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా మరో ప్రధాన కారణమని అభిమానులు భావిస్తున్నారు. దీంతో కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రిపై కూడా వేటు వేయాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ఓ అన్ లక్కీ కెప్టెన్ అని, టాస్ నుంచి వాతావరణ పరిస్థితుల వరకు ఏదీ అతనికి కలిసిరావడం లేదంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్గా కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మను నియమిస్తే కనీసం టీ20 ప్రపంచకప్ అయినా గెలుస్తామని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. అలాగే కోచ్ రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ను కొత్త కోచ్గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ఆ జాబితాలో నంబర్ వన్ స్థానం -
కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్..
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైంది. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిన్ ఫైనల్కు ముందు టీమిండియా అనుసరించాల్సిన వ్యూహాలపై కెప్టెన్, కోచ్ డిస్కస్ చేసిన అంశాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇంగ్లండ్కు బయల్దేరే ముందు ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ మాట్లాడారు. అయితే, ఈ సమావేశానికి కొన్ని నిమిషాల ముందు రవిశాస్త్రితో కోహ్లీ మాట్లాడిన మాటలు లీకయ్యాయి. లైవ్ ఇంకా స్టార్ట్ కాలేదని భావించిన కోహ్లీ.. డబ్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లను ఎలా ఔట్ చేయాలనే అనే అంశంపై రవిశాస్త్రితో చర్చించాడు. 🗣️ Happy to have the opportunity to play the World Test Championship Final: #TeamIndia Captain @imVkohli ☺️ pic.twitter.com/jjFEwEisrD — BCCI (@BCCI) June 2, 2021 ఈ క్రమంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్లను రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేయించడం ద్వారా కట్టడి చేయబోతున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. అందుకు రవిశాస్త్రి కూడా అంగీకారం తెలిపాడు. అయితే, ఈ మాటలు డైరెక్ట్గా లైవ్లో వచ్చేయడంతో తమ ప్లాన్ బహిర్గతమైందని కోహ్లీ, రవిశాస్త్రి నాలుక కరుచుకున్నారు. కాగా, బుధవారం రాత్రి ముంబై నుంచి ఇంగ్లండ్కు బయల్దేరిన భారత జట్టు.. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్తో ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. అనంతరం ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు 20 మందితో కూడిన భారత జంబో జట్టు, ముంబైలో 14 రోజుల క్వారంటైన్ను ముగించుకుని స్పెషల్ ఛార్టెర్ ప్లైట్లో లండన్కు బయల్దేరింది. చదవండి: కచ్చితంగా ఐదు వికెట్లు తీస్తావని ధైర్యం నింపాడు.. -
ఐదు వికెట్లు తీస్తావన్నాడు, అలాగే జరిగింది..
ముంబై: తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి తనను ఓదార్చడమే కాకుండా, కచ్చితంగా ఐదు వికెట్లు తీస్తావని తనలో ధైర్యం నింపాడని టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. ఆ బాధాకర సమయంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్తో కలిసి రవి సర్ తనకు అండగా నిలిచారని, వారే లేకపోయుంటే ఆసీస్ పర్యటన నుంచి వైదొలిగేవాడినని చెప్పుకొచ్చాడు. తండ్రి మరణవార్త తెలియగానే విరాట్ భాయ్ తనను కౌగిలించుకుని ఓదార్చడని, కోచ్ రవి సర్ ఆ సమయంలో తనతో మాట్లాడిన మాటలను జీవితాంతం మర్చిపోలేనని వెల్లడించాడు. "నువ్వు దేశం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాలని నీ తండ్రి కలగన్నాడని, ఆ అవకాశం ఇప్పుడు నీకు వచ్చిందని, ఈ సమయంలో నీ తండ్రి లేకపోయినా అతని ఆశీర్వాదం నీతో ఉంటుందని" ఆయన నాలో స్పూర్తిని రగిల్చారని గుర్తు చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసాక రవి సర్ తనను ప్రశంసలతో ముంచెత్తిన విషయాన్ని తలచుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం లండన్కు బయల్దేరిన సిరాజ్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా నవంబర్ 20న తండ్రిని కోల్పోయాడు. క్వారంటైన్ ఆంక్షలు ఉండటం, టెస్ట్ క్రికెట్ ఆడాలన్న తండ్రి కల నెరవేర్చేండం కోసం అతడు అక్కడే ఉండిపోయి, తండ్రి అంత్యక్రియలకు సైతం హాజరు కాలేకపోయాడు. తండ్రి కలను నెరవేర్చేందుకు దుఃఖాన్ని దిగ మింగి బరిలోకి దిగిన ఈ హైదరబాదీ క్రికెటర్కు, ఆసీస్తో టెస్ట్ సిరీస్ మరపురాని అనుభూతులను మిగిల్చింది. చదవండి: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు.. -
సన్నాహాలు లేకపోతేనేమి...
స్వదేశంలో రెండు వారాల క్వారంటైన్... ఇంగ్లండ్ చేరిన తర్వాత మరో పది రోజుల క్వారంటైన్... హోటల్ గదుల్లో గడపడం మినహా సాధనకు అవకాశమే లేదు... భిన్నమైన వాతావరణంలో ఆడబోయే ఆరు టెస్టులకు ముందు కనీసం ఒక్క వార్మప్ మ్యాచ్ కూడా లేదు. క్వారంటైన్ ముగిసిన తర్వాత అసలు ఆటకు ముందు ఎన్ని ప్రాక్టీస్ సెషన్లకు అవకాశం లభిస్తుందో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కరోనా నేపథ్యంలో ఆంక్షల నడుమ కీలకపోరుకు ముందు భారత జట్టుకు సరైన సన్నాహాలే లేవు. అయితే ఇది తమకు సమస్య కాదని భారత కెప్టెన్ కోహ్లి చెబుతున్నాడు. గతంలో ఇంతకంటే ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయాలు సాధించామని కోహ్లి గుర్తు చేశాడు . ముంబై: న్యూజిలాండ్తో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఆపై ఇంగ్లండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్... సుమారు మూడున్నర నెలల పాటు సాగే ఈ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు ప్రత్యేక విమానంలో బయలుదేరింది. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలిసారి జరుగుతుండగా... 2018 తర్వాత ఇంగ్లండ్లో టీమిండియా టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్కు వెళ్లే ముందు బుధవారం జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ పర్యటన కోసం మేం సరిగా సన్నద్ధం కాలేదనే అంశం గురించి ఎలాంటి ఆందోళన లేదు. సిరీస్ ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందు ప్రత్యర్థి దేశంలో అడుగు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అలా వెళ్లి కూడా సిరీస్లో హోరాహోరీగా తలపడ్డాం. కాబట్టి ఇదంతా మాకు తెలుసు. ఇంగ్లండ్లో మొదటిసారి ఆడటం లేదు. అక్కడి పరిస్థితుల గురించి బాగా తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నా సరైన మానసిక దృక్పథంతో మైదానంలోకి అడుగు పెట్టడం ముఖ్యం. లేదంటే తొలి బంతికే అవుట్ కావచ్చు లేదా వికెట్లు తీయడం అసాధ్యంగా మారిపోవచ్చు. మ్యాచ్కు ముందు నాలుగు ప్రాక్టీస్ సెషన్లకు మాత్రమే అవకాశం లభించినా ఫిర్యాదు వినిపించం. ఎందుకంటే ఒక జట్టుగా మేం ఏం చేయగలమో మాకు బాగా తెలుసు. సీనియర్ లేదా ‘ఎ’ జట్టు సభ్యులుగా అందరికీ ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. టెస్టు క్రికెట్ బాగా ఆడితే పరిస్థితులు పెద్ద సమస్య కాదు. ఆస్ట్రేలియా గడ్డపై అంతా వారికి అనుకూలంగా ఉంటే మేం గెలవలేదా. మాకన్నా ముందు న్యూజిలాండ్ అక్కడ టెస్టులు ఆడుతోంది కాబట్టి వారికి అనుకూలత ఉందంటే నేను నమ్మను. అలా గనక భావిస్తే మేం ఇక్కడి నుంచి విమానం ఎక్కడమే అనవసరం. నా దృష్టిలో ఇద్దరికీ సమానావకాశాలు ఉన్నాయి. బయో బబుల్ ఆటగాళ్లపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే దేశపు రెండు జట్లు ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల ఆడటం తప్పనిసరిగా మారిపోవచ్చేమో. మైదానంలో తీవ్రమైన ఒత్తిడి మధ్య ఆడి వచ్చిన తర్వాత హోటల్ గదికే పరిమితం కావడం, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండిపోవడం మానసికంగా చాలా ఇబ్బందికరం. ఆటకు దూరంగా కొద్దిసేపు ప్రశాంతంగా గడిపి కొత్త ఉత్సాహంతో రావడం అసాధ్యంగా మారింది. ఈ జట్టుకు గొప్పగా తీర్చిదిద్దడంలో మేం ఎంతో శ్రమించాం. అలాంటిది మానసిక సమస్యలతో ఆటగాళ్లు కుప్పకూలిపోవడం లాంటివి చూడలేం. నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి కొంత విరామం కావాలని ఆటగాడు అడిగితే మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. –కోహ్లి, భారత కెప్టెన్ మున్ముందు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ను ‘బెస్టాఫ్ త్రీ’ విధానంలో మూడు టెస్టుల సిరీస్గా నిర్వహిస్తే బాగుంటుందని నా సూచన. ఒక జట్టు రెండున్నరేళ్ల శ్రమ ఫలితం తర్వాత అలా చేయడమే సరైన విధానం. దానికి అనుగుణంగా ఎఫ్టీపీ సిద్ధం చేయాలి. ప్రస్తుతానికి మాత్రం ఏకైక టెస్టులోనే పోరాటం. ఒకవేళ ఓడినా మేం ఇప్పటివరకు సాధించినదాని విలువ తగ్గిపోదు. మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఇక్కడికి వచ్చారు. రాత్రికి రాత్రే ఈ టీమ్ గొప్పగా మారిపోలేదు. మొదటిసారి జరుగుతోంది కాబట్టి ఈ ఫైనల్కు ఎంతో ప్రత్యేకత ఉంది. మీ అసలు సత్తా టెస్టులే పరీక్ష పెడతాయి కాబట్టి ఈ మ్యాచ్ స్థాయి చాలా పెద్దది. క్వారంటైన్ నిబంధనలు ఆటగాళ్ల పరిస్థితిని ఇంకా కఠినంగా మారుస్తున్నాయి. తక్కువ వ్యవధిలో ఆరు టెస్టులు ఆడాల్సి రావడం సాధారణ విషయం కాదు. ఎంతో ఫిట్గా ఉన్నవారికి కూడా మానసికంగా విరామం అవసరం. ఆటలో విఫలమైన రోజు వస్తే ఇక కోలుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది. కరోనా వల్ల ఇప్పుడు భారత్నుంచి రెండు జట్లు ఒకేసారి వేర్వేరు చోట్ల ఆడబోతున్నాయి. అయితే మున్ముందు టి20 క్రికెట్కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు, ఎక్కువ జట్లు ఆడేందుకు దీనిని కొనసాగించాల్సి రావచ్చు కూడా. –రవిశాస్త్రి, హెడ్ కోచ్ -
Ravi Shastri : కుర్రాళ్లు కష్టపడ్డారు.. అందుకే ఈ ఫలితం
ముంబై: ''మన కుర్రాళ్లు సరైన సమయంలో కష్టపడ్డారని అందుకే ఈరోజు టెస్టుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామంటూ'' టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఐసీసీ గురువారం విడుదల చేసిన వార్షిక టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా 121 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రవిశాస్త్రి తన ఆనందాన్ని పంచుకున్నాడు.'టీమిండియా ధృడమైన సంకల్పం, స్థిరమైన ప్రదర్శన వల్లే సుదీర్ఘ ఫార్మాట్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగాం. ర్యాంకింగ్స్కు సంబంధించి నిబంధనలను ఐసీసీ మధ్యలో మార్చింది. అయినప్పటికీ.. సవాళ్లను అధిగమిస్తూ తిరిగి నంబర్ వన్ ర్యాంకును పొందాం. ఆటగాళ్లు కఠిన పరిస్థితుల్లో కఠిన క్రికెట్ ఆడారు. జట్టు విజయాల పట్ల.. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. మన కుర్రాళ్లు కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఈ ఫలితం ' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో 120 రేటింగ్తో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్ (109 రేటింగ్) మూడో స్థానంలో నిలిచింది. మే 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లకు 100 శాతం... అంతకుముందు రెండేళ్లలో జరిగిన మ్యాచ్లకు 50 శాతం పాయింట్ల ఆధారంగా జట్లకు ఐసీసీ రేటింగ్స్ను కేటాయించింది. ఇందులో భారత్ 24 మ్యాచ్ల్లో 2,914 పాయింట్లు సాధించగా... రెండో స్థానంలో నిలిచిన కివీస్ 18 మ్యాచ్ల్లో 2,166 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. జూన్ 18 నుంచి 22 వరకు టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక 2017 నుంచి భారత జట్టుకు రవిశాస్త్రి హెడ్ కోచ్గా సేవలందిస్తున్నాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత మరోసారి అతని పదవికాలాన్ని పొడిగించారు. చదవండి: ICC Rankings: టాప్లో టీమిండియా.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు టీమిండియా చీటింగ్ చేసి సిరీస్ గెలిచింది: పైన్ -
'మ్యాచ్ చూశాక ఆశలు చిగురించాయి.. కొత్త విజేతను చూస్తా'
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒత్తిడిలో చివరి ఓవర్ వేసిన ఆర్సీబీ బౌలర్ సిరాజ్ అద్బుతంగా బౌలింగ్ చేసి విజయాన్ని అందించాడు. కాగా మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ట్విటర్ వేదికగా స్పందించాడు. కోహ్లి, పంత్ల ఫోటోను షేర్ చేస్తూ ఈసారి ఐపీఎల్ టైటిల్ను ఎప్పుడు గెలవని జట్లే గెలవనున్నాయనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ ఎవరు చూసుకున్నా ఐపీఎల్ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిన్నటి మ్యాచ్ అద్భుతం.. ఆ మ్యాచ్ల నాలో కొత్త ఆశలు రేకెత్తాయి. ఈసారి ఐపీఎల్లో కచ్చితంగా కొత్త విజేతను చూస్తాం.. అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్తో పాటు రెండు సార్లు చాంపియన్ కేకేఆర్ ఈ సీజన్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమతున్నాయని తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (42 బంతుల్లో 75 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... రజత్ పటిదార్ (22 బంతుల్లో 31; 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేయగలిగింది. రిషభ్ పంత్ (48 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు), షిమ్రాన్ హెట్మైర్ (25 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కాగా ఢిల్లీపై విజయంతో ఆర్సీబీ 10 పాయింట్లతో టాప్ స్థానానికి చేరుకోగా.. ఆరు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో నిలిచింది. చదవండి: అందుకే ఆఖరి ఓవర్ స్టోయినిస్ చేతికి: పంత్ ఏబీడీ అరుదైన ఘనత; నా ఐడల్ అన్న వార్నర్! Brilliant game last night. Seeds being sowed for a potentially new winner to emerge #IPL2021 @IPL pic.twitter.com/A0RKnI0y4S — Ravi Shastri (@RaviShastriOfc) April 28, 2021 -
రవిశాస్త్రి.. నీకంటే తోపు ఎవడూ లేడు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటివరకూ టీమిండియాకు కోచ్ల పరంగా చూస్తే రవిశాస్త్రి కంటే అత్యుత్తమ కోచ్ ఎవరూ తనకు కనిపించలేదంటూ గావస్కర్ ప్రశించాడు. ప్రత్యేకంగా యువ క్రికెటర్లలో రవిశాస్త్రి నింపుతున్న విశ్వాసం వెలకట్టలేనిదన్నాడు. ఇది తాను కూడా నమ్మలేకపోతున్నానన్నాడు. భారత క్రికెట్ జట్టు ప్రారంభకాలంలో ఘనతలను తెలుపుతూ రూపొందించిన వెబినార్ ‘1971’ ఆవిష్కరణ కార్యక్రమంలో గావస్కర్.. రవిశాస్త్రిని ప్రత్యేకంగా కొనియాడాడు. ఇక భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సూచనలు కూడా ఎంతగానో యువ బౌలర్లకు సహకరిస్తున్నాయన్నాడు. ఈరోజు మన భారత సీమ్ బౌలర్ల గురించి మాట్లాడుతున్నామంటే అది భరత్ అరుణ్ ఘనతేనన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన సెకాండాఫ్ మన బౌలింగ్ మరింత రాటుదేలడానికి కారణం అరుణ్ పర్యవేక్షణేనని గావస్కర్ తెలిపాడు. -
ఫ్యాన్స్.. వారిద్దరు ఏం మాట్లాడుకుంటారో వినండి
ముంబై: వాంఖడే వేదికగా కాసేపట్లో సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో లీగ్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన వాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ట్విటర్ వేదికగా రవిశాస్త్రి స్పందిస్తూ.. గురు(ధోని).. అతని శిష్యుడు రిషబ్ పంత్ ఒకరినొకరు ప్రత్యర్థులుగా ఎదురుపడుతున్నారు. బ్యాటింగ్ లేదా బౌలింగ్ సమయంలో ఈ గురు శిష్యులు ఏం మాట్లాడుకుంటున్నారనేది ఫ్యాన్స్ వినాలని కోరుకుంటున్నా.. కాబట్టి మైదానంలో ఉన్న స్టంప్ మైక్ సౌండ్ను జాగ్రత్తగా గమనించండి. అంటూ క్యాప్షన్ జత చేశాడు. మరోవైపు మ్యాచ్కు ముందు పంత్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ''తన గురువు టీంతోనే తొలి మ్యాచ్లో ఎదుర్కోబోతున్నందుకు ఉత్సాహంతో ఉన్నా. ఇప్పటికే మహీ బాయ్ నుంచి విలువైన సూచనలతో పాటు ఎంతో అనుభవం నేర్చకున్నా. ఒకవైపు ధోనితో తలపడుతున్నందుకు ఉత్సాహంగా ఉన్నా.. సీఎస్కే గేమ్ ప్లాన్ను అర్థం చేసుకునేందుకు మా ప్రయత్నాలు మాకుంటాయి. ఏదైమైనా మ్యాచ్ గెలవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: రనౌట్ అయితే అయ్యావు.. కానీ మనసులు గెలుచుకున్నావ్ #CaptionThis 💙#YehHaiNayiDilli #VIVOIPL #IPL2021 #CSKvDC @RishabhPant17 @msdhoni pic.twitter.com/Li3rmj69KA — Delhi Capitals (@DelhiCapitals) April 10, 2021 -
MS Dhoni World Cup 2011: ఆ అద్భుతానికి దశాబ్దం!
‘ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ ఎ మాగ్నిఫిసెంట్ స్ట్రైక్ ఇన్ టు ద క్రౌడ్. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్’... రవిశాస్త్రి కామెంటరీ సగటు భారత క్రికెట్ అభిమాని చెవుల్లో ఇప్పటికీ మారు మోగుతూనే ఉంటుంది. సరిగ్గా పదేళ్ల క్రితం ఏప్రిల్ 2న ముంబై వాంఖడే మైదానం టీమిండియా గెలుపుతో హోరెత్తింది. ఉత్కంఠ, ఉత్సాహం, సంతోషం, భావోద్వేగం, ఆనంద భాష్పాలు... ఒకటేమిటి, ఇలా అన్ని రకాల భావనలు ఆ సమయంలో కనిపించాయి. అటు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకపోగా, అభిమానుల సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కులశేఖర వేసిన 49వ ఓవర్ రెండో బంతిని లాంగాన్ మీదుగా ధోని సిక్స్గా మలచిన షాట్ అందరి మనసుల్లో పదేళ్లుగా అలా ముద్రించుకుపోయింది. క్వార్టర్స్లో ఆసీస్ను, సెమీస్లో పాక్ను చిత్తు చేసిన జట్టు ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాకేమీ అనిపించడం లేదు: గంభీర్ ఫైనల్లో 97 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన గౌతం గంభీర్ మాత్రం భిన్నంగా స్పందిస్తూ... ‘మేం గెలిచి పదేళ్లయింది. గతం గురించి ఎక్కువగా గుర్తు చేసుకునే తత్వం కాదు నాది. ప్రపంచకప్ గెలిచి మేం ఎవరికీ ఎలాంటి మేలు చేయలేదు. మెగా టోర్నీ కోసం జట్టులోకి ఎంపికై నందుకు బాగా ఆడి గెలిచేందుకు ప్రయత్నించడం మా బాధ్యత. అభిమానులు సం తోషించారు. గర్వపడే క్షణం అనేది వాస్తవమే కానీ అతిగా చర్చించడం మాని భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. పదే పదే 1983, 2011 గురించే ఆలోచిస్తుంటే ఇక ముందుకు వెళ్లేదెప్పుడు’ అని అంటున్నాడు. చదవండి: ‘అంపైర్స్ కాల్’ కొనసాగింపు -
క్వారంటైన్ కలిపింది ఆ ఇద్దరినీ...
ముంబై: గత రెండేళ్లుగా ఇద్దరు భారత టాప్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నట్లు పలుమార్లు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా అభిమానుల మధ్య చాలాసార్లు రచ్చ జరిగింది. అయితే ఈ విషయాన్ని వీరిద్దరు అంగీకరించడం కానీ ఖండించడం గానీ ఎప్పుడూ చేయలేదు. మైదానంలో, జట్టు కోసం ఆడుతున్న సమయంలో కూడా అలాంటిది ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. వ్యక్తిగత అంశాల గురించి ఆలోచనే రాకుండా టీమ్ గెలుపు కోసం పరస్పర గౌరవంతోనే ఆడుతూ వచ్చారు. అయితే ‘విభేదాలు’ వాస్తవమేనని తేలింది. పైగా హెడ్ కోచ్ రవిశాస్త్రి జోక్యం చేసుకొని దీనిని చక్కబెట్టినట్లు కూడా తెలిసింది. ముఖ్యంగా కరోనా కాలంలో క్వారంటైన్లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో కోహ్లి, రోహిత్ శర్మ పరస్పరం పలు అంశాలపై మాట్లాడుకునేందుకు తగినంత తీరిక దొరిగింది. తమ మధ్య పెరుగుతున్న అంతరానికి కారణమైన వేర్వేరు విషయాలపై వీరిద్దరు చర్చించుకున్నారని... ఈ విషయంలో రవిశాస్త్రిదే కీలకపాత్ర అని సమాచారం. ‘రెండు పెద్ద సిరీస్లలో విజయం సాధించడంతోపాటు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కు సంబంధించి మరో మేలు జరిగింది. కొన్ని వారాలుగా కోహ్లి, రోహిత్ మధ్య వ్యక్తిగత బంధం దృఢంగా మారింది. జట్టు గురించి, తమ బాధ్యతలు, రాబోయే సవాళ్ల గురించి వారు బాగా చర్చించుకున్నారు. తామిద్దరం పరస్పరం సమన్వయంతో కలిసి పని చేస్తే జట్టుకు ఎలాంటి మంచి జరుగుతుందో వారికి అర్థమైంది. గత నాలుగు నెలల్లో జట్టుకు దీనివల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. తామిద్దరి గురించి బయట ప్రచారం ఉన్న పలు విషయాలు వారి మధ్య దూరాన్ని పెంచాయి. చదవండి: (ఐపీఎల్ 2021: పంజాబ్ పదునెంత?) జట్టులో నేను ఎవరికంటే తక్కువ కాదు అనే భావనతో ఇద్దరూ ఉన్నారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉంటే మిగతావారు దానిని దుర్వినియోగం చేయడం ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్లో ఉన్నదే. ఒకేచోట పని చేసే ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు ఏ రంగంలోనైనా ఉంటాయి. అవి అభిప్రాయభేదాలు మాత్రమే. అయితే ఇంతకాలం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని వారు అనుకోలేదు. ఇప్పుడు ఇద్దరికీ చాలా స్పష్టత వచ్చింది. ఇటీవల జరిగిన మ్యాచ్లు చూస్తే వీరి మధ్య బంధం బలపడినట్లు మనందరికీ అర్థమవుతుంది. బయో బబుల్ చేసిన మేలు ఇది’ అని బీసీసీఐలోని కీలక వ్యక్తి ఒకరు ఈ పరిణామాలను వెల్లడించారు. -
పంత్ మంచి బేబీ సిట్టర్.. నువ్వు కూడా ప్రాక్టీసు మొదలెట్టావా!
పుణె: రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా వికెట్కీపర్ రిషభ్ పంత్- ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మధ్య జరిగిన మాటల యుద్ధం గుర్తుండే ఉంటుంది. ‘బాక్సింగ్ డే’ టెస్టు సందర్భంగా పంత్ క్రీజులో ఉన్నపుడు, ‘నేను, నా భార్య సినిమాకెళ్లి చాలా రోజులైపోయింది. మా ఇంట్లో నువ్వు బేబీ సిట్టర్గా ఉన్నావనుకో, మేమిద్దరం సరదాగా సినిమాకి వెళ్లాం ఎంజాయ్ చేస్తాం’ అంటూ పైన్ స్లెడ్జింగ్ చేశాడు. ఇందుకు పంత్ బదులిస్తూ.. ‘ఈ రోజు మనం ఓ ప్రత్యేక అతిథిని చూస్తున్నాం. పెద్దగా బాధ్యతలేని పని. అదే తాత్కాలిక కెప్టెన్. ఎపుడైనా ఇలాంటి తాత్కాలిక కెప్టెన్ను చూశామా? దాని గురించి విన్నామా?’ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తన నివాసంలో ఆసీస్- టీమిండియాకు ఆత్మీయ విందు ఏర్పాటు చేయగా, పంత్ నిజంగానే పైన్ మాటల్ని నిజం చేసి చూపించాడు. పైన్ భార్య బోని తన ఇద్దరి పిల్లల్ని అక్కడికి తీసుకుని రాగా, వారిలో ఒకరిని పంత్ ఎత్తుకున్నాడు. ఆ ఫొటోను బోని తన ఇన్స్ట్రాగామ్లో సరదాగా ‘పంత్ బెస్ట్ బేబీ సిట్టర్’ అనే క్యాప్షన్తో పోస్ట్ చేయగా, పంత్పై పైన్ సెటైర్లు వేస్తే, అతడి భార్య మాత్రం ఇలా కితాబు ఇచ్చిందంటూ నెటిజన్లు ఆసీస్ కెప్టెన్ను ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. టీమిండియా మరో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ సైతం బేబీ సిట్టర్(తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేనపుడు పసిపిల్లల ఆలనాపాలన చూసే సంరక్షకులు అని అర్థం)గా అవతారమెత్తాడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో భారీ విజయం సాధించిన అనంతరం భారత జట్టు అంతా ఒక్కచోట చేరి సరదాగా సమయం గడిపింది. ఈ క్రమంలో.. ‘‘బబుల్ ఉన్నా లేకపోయినా సరే, ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటాం. ఫలితాలు వస్తూనే ఉంటాయి. పుణెలో అందమైన రోజు’’ అంటూ టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశాడు. ఇందులో, హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్యను కేఎల్ రాహుల్ ఎత్తుకుని ఉన్నాడు. ఇంకేముంది, అప్పటి నుంచి నెటిజన్లు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, కేఎల్ రాహుల్ను ట్రోల్ చేస్తున్నారు. ఇక మరో ఫోటోలో, పంత్ దగ్గరికి వెళ్లేందుకు అగస్త్య ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాడు. దీంతో.. ‘‘ఏంటి రాహుల్.. భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీసు చేస్తున్నావా. నీ కంటే పంత్ మంచి బేబీ సిట్టర్ అవుతాడేమో. ఎందుకంటే, తనకు కాస్త అనుభవం ఎక్కువ. అగస్త్యకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే తన దగ్గరికి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నాడు’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ సైతం.. ‘‘చూడండి. బేబీ అగస్త్యను కేఎల్ ఎత్తుకున్నాడు. నిజం చెప్పాలంటే భారత వికెట్ కీపర్లు మంచి, నమ్మకమైన బేబీ సిట్టర్లు’’ అంటూ చెణుకులు విసిరాడు. చదవండి: ప్రసీద్ కృష్ణపై ప్రశంసలు.. రాహుల్ ద్రవిడ్కు కితాబు See KL holding baby Agastya there. Indian WK bats are always reliable babysitters 😉 #INDvsENG https://t.co/3PCrEuepTh — Wasim Jaffer (@WasimJaffer14) March 24, 2021 -
ఆ విషయంలో సుందర్ నాకంటే సమర్ధుడు: టీమిండియా కోచ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి టెస్టులో టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొలి ఇన్నింగ్స్లో అజేయమైన 96 పరుగులు సాధించడంతో అతనిపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు అతను ప్రదర్శించిన పరిణితిని టీమిండియా మాజీలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అయితే సుందర్ను తనతోనే పోల్చుకుంటూ ఆకాశానికెత్తేశాడు. సుందర్ తనకంటే బాగా రాణించగల సమర్ధుడని, ఆ సత్తా సుందర్ వద్ద ఉందని ఇదివరకే నిరూపితమైందని పేర్కొన్నాడు. సుందర్ తన బౌలింగ్పై ఇంకా దృష్టి సారించాల్సి ఉందని ఆయన సూచించాడు. అతను బౌలర్గా కూడా రాణించగలిగితే ఆల్రౌండర్ ఖాతాలో జట్టులో స్థానానికి ఢోకా ఉండదని పేర్కొన్నాడు. జట్టు ఓ ఆల్రౌండర్ నుంచి కనీసం 50 పరుగులను, 20కు పైబడి ఓవర్లు వేయాలని ఆశిస్తుంది. ప్రస్తుత ఆల్రౌండర్లలో సుందర్ ఆ పాత్రను సమర్ధవంతంగా పోశిస్తున్నాడని కితాబునిచ్చాడు. ఎడమ చేతి బ్యాటింగ్, కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ వేసే సుందర్.. ఇటీవల జరిగిన నాలుగు టెస్ట్ల్లో మూడు అర్ధశతకాలు, 6 వికెట్లు పడగొట్టాడు. కీలకమైన ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్న సుందర్ అప్పట్లో రవిశాస్త్రి తరహాలోనే బంతితో పాటు బ్యాట్తోనూ రాణిస్తున్నాడు. కాగా, 80 దశకంలో భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి.. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అదరగొట్టేవాడు. భారత్ తరఫున 80 టెస్ట్లకు ప్రాతినిధ్యం వహించిన రవిశాస్త్రి.. 11 శతకాలు, 12 అర్ధ శతకాల సాయంతో 3830 పరుగులు, 151 వికెట్లు సాధించాడు. -
ఇలాంటి ప్లేస్లో 5 రోజులు ఉంటానా!
అహ్మదాబాద్: టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి ట్రోల్స్ బారీన పడ్డాడు . భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ విజయం వెనకు అందరూ మొటేరా పిచ్పై విమర్శలు గుప్పించారు. కానీ ఇండియన్ కాలమిస్ట్ శోభా డే మాత్రం ఫన్నీగా రవిశాస్త్రిపై ఓ మీమ్ని తయారు చేసి తన ట్విటర్లో షేర్ చేశారు. 'నేను ఈ డ్రై స్టేట్లో ఐదు రోజులు ఉంటానని అనుకున్నారా..? అంటూ రవిశాస్త్రి అడుగుతున్నట్లుగా ఒక పాత ఫొటోను షేర్ చేసింది. దీనిని ఫన్నీగా తీసుకున్న రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. 'ఈ కఠిన సమయాల్లో ఈ ఫోటో కాస్త నవ్వు తెప్పించడం బాగుంది. మీ పరిహాసం నాకు నచ్చింది’ అంటూ రిప్లై ఇచ్చాడు. అంతేకాదు గుజరాత్లో మద్యపాన నిషేధం అమలులో ఉన్న విషయాన్ని అంతర్లీనంగా శోభా డే తన ట్వీట్లో ప్రస్తావించింది. అయితే రవిశాస్త్రి ఫన్నీగానే తీసుకున్నా.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం రవిశాస్త్రిపై ఫన్నీ ట్రోల్స్తో రెచ్చిపోయారు. సాధారణంగా రవిశాస్త్రి విదేశీ పర్యటనల్లో బహిరంగంగానే మద్యం తాగుతూ చాలాసార్లు కనిపించాడు.కొన్నిసార్లు మ్యాచ్ల సమయాల్లో డ్రెస్సింగ్ రూములో నిద్రపోతుండటం.. మ్యాచ్లు ముగిసిన తర్వాత మద్యం మత్తులో వచ్చి మీడియాతో మాట్లాడటం చేసేవాడు. కాగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ మార్చి 4వ తేదీ నుంచి జరగనుంది. చదవండి: 'థ్యాంక్స్ పీటర్సన్.. అర్థం చేసుకున్నందుకు' మేమంతా ఏడ్చేశాం: సూర్యకుమార్ -
థ్యాంక్స్ మోదీ జీ.. టీమిండియా ఎమోషనల్ ట్వీట్
ఢిల్లీ: మన్ కీ బాత్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ టీమిండియాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. గబ్బాలో చారిత్రక విజయాన్ని నమోదు చేయడంపై భారత జట్టు ప్రతిభను కొనియాడారు. ' ఈ నెలలో మనకు క్రికెట్ ఒక శుభవార్త అందించింది. ఆసీస్ గడ్డపై ఆదిలో భారత జట్టు ఒడిదొడుకలకు లోనైనా.. చివరలో మాత్రం టెస్టు సిరీస్లో అదరగొట్టి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. మన జట్టు కృషి, సమిష్టి పోరాటం అందరికి స్పూర్తిదాయకం' అని పేర్కొన్నారు. తాజాగా మోదీ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ,టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, సహా పలువురు ఆటగాళ్లు స్పందించారు. 'థ్యాంక్యూ మోదీ జీ.. మీ మాటలు మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. స్పూర్తిని నింపే మీ వాఖ్యలతో భారతీయ జెండాను మరింత ఎత్తులో ఎగరడానికి మా వంతు కృషి చేస్తాం. రాబోయే మ్యాచ్ల్లో మరింత ప్రతిభను చూపి సిరీస్లు గెలిచేందుకు సాధ్యమైనంత వరకు పోరాడుతాం. జై హింద్' అంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మోదీ చేసిన వ్యాఖ్యలను రీట్వీట్ చేస్తూ జాతీయ జెండాను ట్వీట్ చేశాడు. చదవండి: కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది 'థ్యాంక్యూ సార్.. మీ మాటలు మాకు ఎంకరేజింగ్ అనిపించాయి. మీలాంటి వ్యక్తులిచ్చే సందేశం మాలాంటి వారికి ఎంతో గౌరవాన్ని కల్పిస్తాయి.' అంటూ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ట్వీట్ చేశాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. 'ఆసీస్ గడ్డపై టీమిండియా వీరోచిత ప్రదర్శనను గుర్తించినందుకు మోదీ జీ.. మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నాడు. చదవండి: ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా!