Shahid Kapoor
-
స్టార్ హీరోలపై ప్రశ్న.. మీ ప్రాబ్లం ఏంటంటూ పూజా హెగ్డే ఫైర్!
విలేకరిపై హీరోయిన్ పూజా హెగ్డే ఫైర్ అయింది. అసలు నీ ప్రాబ్లం ఏంటి బాస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్గా ఉండే పూజా ఇంతలా ఫైర్ అవ్వడానికి గల కారణం..విలేకరి ఓ ప్రశ్నను పదే పదే అడగడమే. ఎన్నిసార్లు సమాధానం చెప్పినా.. మళ్లీ అదే ప్రశ్న అడగడంతో పూజా ఫైర్ అయింది. ఇంతకీ విలేకరి అడిగిన ప్రశ్న ఏంటి?అదృష్టం అనుకుంటే అనుకోండివరుస అపజయాలతో సతమతమవుతున్న పూజా హెగ్డే(Pooja Hegde )కి ‘దేవా’ (Deva)మూవీ మంచి ఉపశమనం ఇచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో షాహిద్తో కలిసి పూజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అయితే ఇంటర్వ్యూలో మధ్యలో విలేకరి.. ‘బాలీవుడ్ అగ్ర హీరోలైన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించడాన్ని అదృష్టంగా భావిస్తారా? ఆయా చిత్రాలకు మీరు అర్హులేనని అనుకుంటున్నారా?’ అని అడిగారు. దీనికి పూజా కూల్గానే సమాధానం చెప్పింది. ‘ఆ సినిమాలకు నేను కచ్చితంగా అర్హురాలినే. ఆయా సినిమాల్లో నన్ను ఎంచుకోవడానికి దర్శకనిర్మాతలకు కొన్ని కారణాలు ఉంటాయి. ఒక అవకాశం వచ్చినప్పడు దానికి అనుగుణంగా పని చేసి ఆ పాత్రకు న్యాయం చేయాలి. నేను అదే పని చేశాను. దాన్ని మీరు అదృష్టం అనుకుంటే అనుకోండి. నేను ఏ మాత్రం బాధపడను’ అని పూజా సమాదానం ఇచ్చింది.ఫైర్ అయిన పూజా.. కూల్ చేసిన సాహిద్పూజా సమాధానం చెప్పిన తర్వాత కూడా సదరు విలేకరి ‘మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్ హీరోల చిత్రాలైతేనే చేస్తారా?’అని మళ్లీ అడిగాడు. ఇలా స్టార్ హీరోలపైనే వరుస ప్రశ్నలు వేయడంతో పూజా హెగ్డే సహనాన్ని కోల్పోయింది. ‘అసలు మీ సమస్య ఏంటి? ఏం సమాధానం కావాలి’ అంటూ ఫైర్ అయింది. దీంతో షాహిద్ వెంటనే కలగజేసుకొని మ్యాటర్ని డైవర్ట్ చేశాడు.‘నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలంటే అతడికి ఇష్టం అనుకుంటా. అతడు కూడా ఆ హీరోల పక్కన యాక్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’ అని చెప్పాడు. ‘దేవా’లో హిట్ ట్రాక్ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలలో అలరించింది పూజా హెగ్డే. 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఆమె ఖాతాలో సరైన హిట్టే పడలేదు. అయినా కూడా స్టార్స్ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో పూజాకి ఇక్కడ ఆఫర్స్ తగ్గాయి. దీంతో బాలీవుడ్నే నమ్ముకుంది ఈ పొడుగు కాళ్ల సుందరీ. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. దీంతో పూజా కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ పూజాకి మాత్రం వరుస అవకాశాలు వచ్చాయి. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘దేవా’ మంచి టాక్ని సంపాదించుకుంది. ప్రస్తుతం పూజా రెండు భారీ సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి దళపతి విజయ్ ‘జన నాయగన్’ కాగా, మరొకటి సూర్య హీరోగా నటిస్తున్న 'రెట్రో'. ఈ రెండింటిపై పూజా చాలా ఆశలు పెట్టుకుంది. -
వన్ అండ్ ఓన్లీ దేవా
షాహిద్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవా’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ కపూర్ నటించారు. పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీతో మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ హిందీ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దేవా’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్లో షాహిద్ మాసీ విజువల్స్ మాత్రమే కనిపిం చాయి. కానీ చివర్లో వన్ అండ్ ఓన్లీ దేవా వస్తున్నాడు అని చూపించారు. పావైల్ గులాటి, ప్రవేవ్ రాణా, కుబ్రా సైట్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి విశాల్ మిశ్రా స్వరకర్త. -
దేవా వస్తున్నాడు
ఈ నెలాఖర్లో థియేటర్స్లోకి వస్తున్నాడు దేవా. షాహిద్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘దేవా’. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ ఈ సినిమాతో బాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ‘దేవా’ చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జనవరి 31న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘లాక్ అండ్ లోడ్’ అంటూ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ను షేర్ చేశారు షాహిద్ కపూర్. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాకు విశాల్ మిశ్రా సంగీతం అందించగా, జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. -
మొదటిసారి ప్రెగ్నెన్సీ.. స్టార్ హీరో భార్యకు అలాంటి అనుభవం!
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో కబీర్ సింగ్, జెర్సీ, పద్మావత్, బ్లడీ డాడీ లాంటి చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన దేవా చిత్రంతో ప్రేక్షకుల ముంందుకు రానున్నారు. అయితే తన సినిమాలతో బిజీగా ఉండగానే.. తన ప్రియురాలు మిరా రాజ్పుత్ను 2015లో షాహిద్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆయన భార్య మీరా రాజ్పుత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు మొదటిసారి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో దాదాపు గర్భస్రావం అయినంత పనైందని.. ఏ నిమిషంలోనైనా బిడ్డను కోల్పోవచ్చని చెప్పారని వెల్లడించింది. అయితే వైద్యులు తనకు వెంటనే సోనోగ్రఫీ చికిత్స అందించారని ఆమె పేర్కొంది.దీంతో మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నానని.. లేకపోతే గర్భస్రావం జరిగి ఉండేదని తెలిపింది. ఈ విషయంలో తన భర్త షాహిద్ కపూర్ పూర్తిగా సహకరించాడని వివరించింది. తమ ఇంటినే ఆస్పత్రిగా మార్చేశాడని మీరా తన భర్తపై ప్రశంసలు కురిపించింది. కాగా.. షాహిద్ కపూర్తో వివాహమైన ఏడాది తర్వాత 2016లో మిషా అనే కూతురు జన్మించింది. ఈ జంట 2018లో తమ రెండో బిడ్డ జైన్ను స్వాగతించారు. -
ఇద్దరమ్మాయిలు ప్రేమించి మోసం చేశారు: హీరో
బ్రేకప్కు కారణం కొన్నిసార్లు అమ్మాయి కావొచ్చు, మరికొన్ని సార్లు అబ్బాయి కావచ్చు. లేదా ఏకాభిప్రాయంతో విడిపోవచ్చు. అయితే తన విషయంలో మాత్రం ప్రేమించిన అమ్మాయిలే మోసం చేశారంటున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.ఎన్నిసార్లు మోసపోయావు?ఓ షోలో అతడికి మాజీ ప్రేమ కహానీల గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించేందుకు షాహిద్ ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు. అయినా హోస్ట్ అడుగుతూనే ఉంది.. ప్రేమలో ఎన్నిసార్లు మోసపోయావు?అని! ఇందుకతడు స్పందిస్తూ ఒకసారైతే దారుణంగా మోసపోయాను. మరో లవ్ కహానీలో చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఇద్దరు నన్ను మోసం చేశారు. వారి పేర్లు మాత్రం చెప్పను అని చెప్పుకొచ్చాడు.ఆ ఇద్దరు హీరోయిన్లేనా?వాళ్లిద్దరూ ఫేమస్ సెలబ్రిటీలా? అని అడగ్గా షాహిద్ దానికి సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. ఇది చూసిన నెటిజన్లు ఆ ఇద్దరు సెలబ్రిటీలు మరెవరో కాదు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ అని అభిప్రాయపడుతున్నారు. కాగా రెండుసార్లు ప్రేమలో విఫలమైన షాహిద్ 2015లో మీరా రాజ్పుత్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం.అన్ని పాత్రల్లోనూషాహిద్ సినిమాల విషయానికి వస్తే.. చుప్ చుప్కే సినిమాలో సాఫ్ట్ బాయ్గా కనిపించి మెప్పించాడు. పద్మావత్లో మహారావల్ రతన్ సింగ్గా రాయల్ లుక్లో అలరించాడు. కబీర్ సింగ్లో యాటిట్యూడ్ స్టార్గా అదరగొట్టాడు. ఇటీవలే తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం దేవ అనే సినిమా చేస్తున్నాడు. -
రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రం.. సడన్గా ఓటీటీలోకి!
బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తేరీ బాతోన్ మే ఐజా ఉల్జా జియా'. జాన్వీ కపూర్ అతిథి పాత్రలో మెరిసింది. అమిత్ జోషి, ఆరాధన సాహ్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. మొదట్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆ తర్వాత మంచి వసూళ్లనే రాబట్టింది. దాదాపు రూ.130 కోట్లు రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. సడన్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. ఈ మధ్య చాలా సినిమాలను అమెజాన్ ప్రైమ్ తన ప్లాట్ఫామ్లో ముందుగా అద్దె పద్దతిలోనే తీసుకువస్తోంది. కొన్నాళ్ల తర్వాతే ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ మూవీ చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే! #TeriBaatonMeinAisaUljhaJiya is now available for RENT. Amazon Prime. pic.twitter.com/BMpiUajA55 — Christopher Kanagaraj (@Chrissuccess) March 22, 2024 చదవండి: స్టార్ హీరోహీరోయిన్లు డిప్రెషన్లో.. నాకు అలాంటి లైఫ్ వద్దు! -
Ashwatthama: The Saga Continues: బాలీవుడ్ అశ్వత్థామ
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ టైటిల్ ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్ రవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్ముఖ్ నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక ప్రకటన వెల్లడైంది. సచిన్ రవి మాట్లాడుతూ– ‘‘మహా భారతంలోని అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉంటారని కొందరి నమ్మకం. మహాభారత కాలంనాటి ఓ అమరుడు ఇప్పటి ఆధునిక కాలానికి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో లెజెండ్స్ యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు జాకీ భగ్నాని. -
విజయ్ దేవరకొండకు స్టేజీపైనే ముద్దుపెట్టిన హీరో
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతోనే అతడు రౌడీ స్టార్గా మారిపోయాడు. ఇది బాలీవుడ్లో కబీర్ సింగ్గా రీమేకై అక్కడ కూడా బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రను హిందీలో షాహిద్ కపూర్ నటించాడు. తాజాగా ఈ ఇద్దరు అర్జున్ రెడ్డిలు ఒక్కచోట కనిపించారు. ఓటీటీ ఈవెంట్లో అర్జున్రెడ్డి, కబీర్ సింగ్ మార్చి 19న అమెజాన్ ప్రైమ్ వీడియో.. ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ వీడియోలో రాబోయే సినిమాలు, సిరీస్లివే అంటూ పెద్ద జాబితానే రిలీజ్ చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా థియేటర్లో రిలీజైన తర్వాత అమెజాన్ ప్రైమ్లోకి రానుందని షాహిద్ కపూర్ ప్రకటించాడు. ఈ సమయంలో చిత్రయూనిట్ను వేదికపైకి ఆహ్వానించాడు. విజయ్ను చూసి ఎమోషనల్ విజయ్ను చూసి ఎమోషనలైన షాహిద్ అతడి చేయి పట్టుకుని మాట్లాడాడు. 'నేను విజయ్కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అతడు లేకపోతే అర్జున్ రెడ్డి లేదు. అర్జున్ రెడ్డి లేకపోతే ఈ కబీర్ సింగ్ కూడా ఉండేవాడు కాదు' అంటూ అతడి చెంపపై ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే షాహిద్ కపూర్ అశ్వథ్థామ మూవీ కూడా ప్రైమ్లోనే రిలీజ్ కానున్నట్లు ఈ వేదికపై ప్రకటించారు. #ArjunReddy Meets #KabirSingh#VijayDevarakonda #ShahidKapoorpic.twitter.com/SJid9dq1X2 — GSK Media (@GskMedia_PR) March 19, 2024 చదవండి: అమెజాన్ ప్రైమ్ క్రేజీ అప్డేట్స్: ఒకేసారి 50కి పైగా వెబ్సిరీస్, సినిమాల ప్రకటన.. లిస్ట్ ఇదిగో -
ఎంతో అవమానించారు, ఇక నా వల్ల కాదు: స్టార్ హీరో
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే.. కానీ ఒక అవుట్సైడర్గానే కెరీర్ మొదలుపెట్టాడు. ఆమె తల్లి నటి, రచయిత్రి.. సీరియల్స్, సినిమాల్లో సాధారణ పాత్రలు పోషించేది. తండ్రి నటుడు.. ఈయన కూడా సీరియల్స్లో యాక్ట్ చేశాడు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికీ రాణిస్తున్నాడు. ఈ ఇద్దరి పేర్లు వాడుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు షాహిద్. దీంతో అవుట్సైడర్స్(సినీ బ్యాగ్రౌండ్ లేనివారు)ని ఎలాగైతే చూసేవారో తనను కూడా అలాగే చులకనగా చూసేవారంటున్నాడు షాహిద్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే.. 'ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చినప్పుడు క్లాసులో నన్ను కూర్చోనివ్వలేదు. నా యాస వేరేగా ఉండటంతో నన్ను పరాయివాడిగా, అంటరానివాడిగానే చూశారు. మేము అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. 11 నెలలకోసారి ఇల్లు మారుతూ ఉండేవాళ్లం. ఎవరూ మాతో కలుపుగోలుగా ఉండేవారు కాదు. కాలేజీలో మాత్రం నన్ను యాక్సెప్ట్ చేశారు. నాకంటూ మంచి మిత్రులు దొరికారు. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడుగుపెట్టానో నాకు మళ్లీ నా స్కూలు గుర్తొచ్చింది. ఇక్కడ బయట నుంచి వచ్చేవాళ్లకు అంత ఈజీగా అవకాశాలివ్వరు. హీనంగా చూస్తారు. చాలా ఏళ్లు ఆ సమస్యతో బాధపడ్డాను. అప్పుడంత శక్తి లేదు కానీ.. నేను గుంపు(బాలీవుడ్ గ్యాంగ్)లో తిరిగే రకాన్ని కాదు. అవకాశాల కోసం అలా తిరగడం ఇష్టముండదు కూడా! అలా అని వారు ఇతరులను తొక్కేయాలనుకోవడం, వారిని ఎదగకుండా చేయడం, అవమానించడం సరి కాదు. టీనేజ్లో తిరిగి పోరాడేంత శక్తి నాకు లేకపోయింది. కానీ ఇప్పుడు నన్ను వేధించాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను, తిరగబడతాను. ఇతరుల్ని వేధించి ఆనందించేవాళ్లను నేను కూడా వేధిస్తాను, అదే వారికి తగిన శిక్ష' అని చెప్పుకొచ్చాడు. కాగా షాహిద్ చివరగా 'తేరి బాతోన్ మే ఐసా జియా' అనే సినిమా చేశాడు. ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. చదవండి: మనసు మార్చుకున్న బ్యూటీ.. బోల్డ్ సీన్స్కు పచ్చజెండా.. ఆ సీన్ అందుకే చేశానంటూ.. -
షాహిద్ కపూర్ & కృతి సనన్ తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు
-
ఇండియాలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ ఇదే!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త సిరీస్లు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే స్కామ్-2003, కాలా పానీ లాంటి సిరీస్లు ప్రేక్షకులను అలరించాయి. గతంలో ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, సేక్రెడ్ గేమ్స్, స్కామ్ 1992 లాంటి సూపర్ హిట్ సిరీస్ కూడా వచ్చాయి. అయితే ఓటీటీలో ఇండియాలోనే 4 కోట్ల వ్యూస్తో ఎక్కువ ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్గా షాహిద్ కపూర్ నటించిన ఫర్జీ నిలిచింది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న మృణాల్ మూవీ.. ఏకంగా జైలర్ను వెనక్కి నెట్టి!) ప్రముఖ ఇండస్ట్రీ ట్రాకింగ్ ఏజెన్సీ ఓర్మాక్స్ మీడియా ఒక్క సీజన్లో వచ్చిన వ్యూస్ ఆధారంగా అత్యధికంగా వీక్షించబడిన టాప్ 10 భారతీయ వెబ్ సిరీస్ల జాబితాను విడుదల చేసింది. సేక్రేడ్ గేమ్స్, మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్లను అధిగమించిన ఫర్జీ.. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్లో రిలీజైన ఫర్జీ జూన్ నెల వరకే 3.7 కోట్ల వ్యూస్ సాధించగా.. తాజాగా వీక్షణల సంఖ్య 4 కోట్లకు చేరుకుంది. రెండో స్థానంలో అజయ్ దేవగన్ నటించిన రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ నిలిచింది. దీనికి 3.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న మీర్జాపూర్, పంచాయత్ వరుసగా 3.2 కోట్లు, 2.96 కోట్ల వ్యూస్ సాధించాయి. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోన్న క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ అనే వెబ్ సిరీస్ 2.91 కోట్ల వీక్షణలతో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాప్ 10లో ఉన్న ఇతర సిరీస్లలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, ది నైట్ మేనేజర్, తాజా ఖబర్, ది గ్రేట్ ఇండియన్ మర్డర్, స్కామ్ 1992 ఉన్నాయి. అయితే ఆదరణ ఉన్నప్పటికీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న సేక్రేడ్ గేమ్స్ వెబ్ సిరీస్కు టాప్ 10లో చోటు చేసుకోలేదు. ఎందుకంటే ఇండియాలో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న మృణాల్ మూవీ.. ఏకంగా జైలర్ను వెనక్కి నెట్టి!) -
ప్రస్తుతానికి అందుబాటులో లేను!
పుట్టినరోజు (అక్టోబర్ 13) సందర్భంగా పూజా హెగ్డే తన తాజా చిత్రం గురించి థ్రిల్లింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. షాహిద్ కపూర్ సరసన తొలిసారి ఆమె కథానాయికగా నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించనున్నారు. ఇలా బర్త్ డేకి ఓ థ్రిల్లర్ మూవీకి సైన్ చేయడం పట్ల పూజా హెగ్డే ఆనందంగా ఉన్నారు. ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే కథాంశం కొత్తగా ఉంది. అలాగే నాది చాలా విభిన్నమైన పాత్ర. షాహిద్ కపూర్తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం హ్యాపీగా ఉంది. తను మంచి నటుడు. అందుకే ఈ సినిమా ప్రయాణాన్ని ఆరంభించడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఇక పుట్టినరోజుని ఎలా జరుపుకున్నారంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఉన్నారు. ‘కరెంట్లీ అన్ అవైలబుల్’ (ప్రస్తుతం అందుబాటులో లేను) అంటూ మాల్దీవుల్లో సేద తీరుతున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు పూజా హెగ్డే. -
తెలుగు హీరోతో సినిమా వదులుకున్న స్టార్ హీరోయిన్.. తగిన శాస్తే జరిగింది!
పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ ట్యాగ్ సొంతం చేసుకున్న భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్తా గందరగోళంగా మారింది. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్న తరహాలో రష్మిక పరిస్థితి ఉందటున్నారు నెటిజన్స్. అసలు విషయానికొస్తే కన్నడ చిత్రసీమ నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన ముద్దుగుమ్మ. అక్కడ ఛలో అనే తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత చిత్రం గీతగోవిందంతో అనుహ్యమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక అల్లు అర్జున్తో పుష్ప చిత్రం ఏకంగా రష్మిక దశనే మార్చేసింది. ఈ చిత్రం ఆమెను బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. (ఇది చదవండి: Roopa Koduvayur: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తెలుగు బ్యూటీ ) అలా అక్కడ రెండు, మూడు చిత్రాలు చకచకా చేసేసింది భామ. ఆ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయినా, నటిగా రష్మికకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టాయి. దీంతో మరో రెండు, మూడు చిత్రాలు ఈ బ్యూటీని వరించాయి. అలా రణ్వీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా షాహీద్ కపూర్ జత కట్టే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. ఆ చిత్రం కోసం తెలుగులో టాలీవుడ్ హీరో నితిన్ సరసన నటించే అవకాశాన్ని వదులుకుంది. నిజానికి ఈ జంట భీష్మ చిత్రం సక్సెస్తో హిట్ పెయిర్గా పేరు తెచ్చుకుంది. కాగా ఇప్పుడేమో షాహీద్ కపూర్ సరసన నటించే బాలీవుడ్ చిత్రం బడ్జెట్ కారణంగా ఆగిపోయిందనే విషయం రష్మికకు షాక్ ఇచ్చిందని సమాచారం. దీంతో ఆమె ఊహించింది ఒకటైతే జరిగింది.. మరొకటి అంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రష్మిక హిందీలో యానిమల్ చిత్రం, తెలుగులో పుష్ప –2 చిత్రాలు పైనే ఆశ పెట్టుకుందని సమాచారం. అదే విధంగా రెయిన్బో అనే మరో ద్విభాషా చిత్రం కూడా ఆమె చేతిలో ఉంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!) -
రూ.500కోసం హీరోహీరోయిన్ల వీడియో లీక్ చేశారు!
షాహిద్ కపూర్, కరీనా కపూర్.. ఒకప్పుడు వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్లో క్యూట్ లవ్ బర్డ్స్గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఎన్నో ప్రేమకథల్లాగే వీరి కథ కూడా సుఖాంతం కాలేదు. 2000 సంవత్సరం ప్రారంభంలో మొదలైన వీరి లవ్ కహానీ 2006లో బ్రేకప్తో ముగిసింది. అయితే 2004 సంవత్సరంలో వీరి ప్రైవేట్ వీడియో లీకైంది. ఓ క్లబ్బులో షాహిద్, కరీనా ఈ లోకాన్నే మర్చిపోతూ ముద్దులాటలో మునిగిపోయారు. అయితే ఈ వీడియో నెట్టింట లీకై అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కానీ ఆ సమయంలో ఇద్దరూ దీనిపై స్పందించనేలేదు. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఘటనపై స్పందించాడు షాహిద్. 'అప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఆ ఫోటోలు, వీడియో లీక్ అయ్యేసరికి.. ఏంటి? ఏం జరుగుతోంది? అని షాక్లో ఉన్నాను. అంతా అయిపోయినట్లే అనుకున్నాను. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు మనల్ని ఎంతగానో ఇబ్బందిపెడతాయి. ఆ వయసులో మరీనూ! ఆ కుర్ర ఏజ్లో మన ఫీలింగ్స్ మనకే సరిగా అర్థం కావు. ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో కూడా తెలియదు. పైగా అప్పుడు డేటింగ్లో ఉంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నాకు పెళ్లైంది కాబట్టి అటువంటి విషయాలు ఎవరూ పట్టించుకోరు' అని షాహిద్ చెప్పుకొచ్చాడు. అతడిని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాట్లాడుతూ.. 'ముగ్గురు పిల్లలు మాజీ ప్రేయసితో మీ ముద్దు వీడియోతో ఆఫీసుకు వచ్చారు. రూ.500 ఇచ్చాకే ఈ వీడియో మా చేతికిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. కాగా కరీనా కపూర్ 2012లో హీరో సైఫ్ అలీఖాన్ను పెళ్లి చేసుకుంది. వీరికి తైమూర్ అలీ ఖాన్, జే అలీ ఖాన్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాహిద్ కపూర్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. 2015లో మీరా రాజ్పుత్తో వివాహం జరగ్గా వీరికి మిషా, జైన్ అని ఇద్దరు సంతానం. చదవండి: పార్టీలో పూటుగా తాగారు, తెల్లారేసరికి ఆమిర్ చేతికి బ్రేస్లెట్ -
ఇంపాజిబుల్ లవ్స్టోరీ
షాహిద్కపూర్, కృతీసనన్ జంటగా హిందీలో ఓ రొమాంటిక్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్ జోషి, ఆరాధన షా కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. జియో స్టూడియోస్, దినేష్ విజన్, జ్యోతిదేశ్ పాండే, లక్ష్మణ్ ఉటేకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని బాలీవుడ్ సమాచారం. కాగా ఈ సినిమాను తొలుత అక్టోబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమాను డిసెంబరు 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ సోమవారం ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ, ‘యాన్ ఇంపాజిబుల్ లవ్స్టోరీ’ అనేది ట్యాగ్లైన్. -
ఐశ్వర్య సరే... అతడు ఎవరు?
‘షాహిద్ కపూర్ ఎవరు?’ అనే ప్రశ్నకు ‘బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు’ అని జవాబు చెప్పడానికి అట్టే టైమ్ పట్టదు. హీరో కావడానికి ఎంత టైమ్ పట్టిందో తెలియదుగానీ, బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు షాహిద్. కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ డ్యాన్స్ ట్రూప్లో పని చేస్తున్న కాలంలో సుభాష్ ఘాయ్ ‘తాళ్’ సినిమాలో ఐశ్వర్యరాయ్ నృత్యం చేసిన ‘జంగిల్ మే బోలే కోయల్ కుక్కూ’ పాటలో డ్యాన్సర్లలో ఒకరిగా అవకాశం వచ్చింది. బాలీవుడ్లోకి అడుగు పెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆరోజు గురించి ఆర్జే రోహిణికి ఇంటర్వ్యూ ఇస్తూ ‘వరస్ట్ అండ్ ది బెస్ట్ డే ఆఫ్ మైలైఫ్’ అని చెప్పాడు షాహిద్. అందాలతార పక్కన డ్యాన్స్ చేసే అవకాశం అదృష్టమే కదా...మరి ‘వరస్ట్ డే’ అంటాడు ఏమిటి! అనే డౌట్ రావచ్చు. విషయం ఏమిటంటే ఆరోజు షూటింగ్కు వస్తున్న షాహిద్ బైక్ మీది నుంచి పడ్డాడు. అదీ విషయం. ‘తాళ్’ సినిమా పాటలో ‘షాహిద్ ఎక్కడ?’ అంటూ నెటిజనులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఐశ్వర్యరాయ్ పక్కన ఉన్న అలనాటి షాహిద్ ఫొటో వైరల్ అయింది. -
ఐశ్వర్యరాయ్ సాంగ్.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే: స్టార్ హీరో
బాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షాహిద్ కపూర్.. ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా కూడా చేశారు. సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు షాహిద్. తాజాగా 'బ్లడీ డాడీ' చిత్రంతో బిజీగా ఉన్న షాహిద్ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి. గతంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్ పాటల్లో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా పనిచేసిన రోజులను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు షాహిద్.. ఐశ్వర్య రాయ్ నటించిన తాల్ మూవీలోని 'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాట కాగా, కరిష్మా కపూర్ 'లే గయీ' వంటి పాటలకు డ్యాన్సర్గా పని చేశాడు. (ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఇదే!) కరిష్మా కపూర్ పాటను చెడగొట్టాను: షాహిద్ కపూర్ కరిష్మా కపూర్ పాట గురించి ఇలా చెప్పాడు..'దిల్ తో పాగల్ హైలోని 'లే గయీ' పాట కోసం పనిచేయడం నిజంగా అదో భయానకం... ఆ సినిమాతో నాకు ఇష్టమైన జ్ఞాపకాలు ఏవీ లేవు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో నా జుట్టు చాలా ఎక్కువగా బౌన్స్ అవుతోంది. నేను షాట్ను పాడు చేస్తున్నానని కొరియో గ్రాఫర్ నుంచి తిట్లు కూడా తిన్నాను. నిజంగా ఆ సమయంలో భయపడిపోయాను. అప్పుడు నేను చాలా సమయం పాటు ఆందోళనగానే ఉన్నాను'. అని తెలిపాడు. ఐశ్వర్యరాయ్ కోసం వెళ్తుంటే రోడ్డు ప్రమాదం దిల్ తో పాగల్ హై తర్వాత.. తాల్ సినిమాలోని 'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాటలో కనిపించాడు షాహిద్. అతను ఐశ్వర్యతో కలిసి డ్యాన్సర్గా కనిపించాడు. పాట చిత్రీకరణ రోజు రోడ్డు ప్రమాదానికి గురయినట్లు తెలిపాడు. అయినా, గాయాలతోనే సెట్కి చేరుకున్నట్లు తెలిపాడు. కానీ పాటు కోసం పని చేస్తున్నప్పుడు అందరిలా యాక్టివ్గా పనిచేయలేక పోయానని తెలిపాడు. ఆ సమయంలో చాలా బాధ పడినట్లు అన్నాడు. సినిమా విడుదల అయిన తర్వాత అదే పాట పెద్ద హిట్ కావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని షాహిద్ తెలిపాడు. (ఇదీ చదవండి: నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు: మధుమిత) -
పెళ్లికి సరికొత్త నిర్వచనం చెప్పిన బాలీవుడ్ హీరోపై ట్రోలింగ్
పెళ్లంటే రెండు మనసుల కలయిక.. నూరేళ్లు జంటగా జీవించేందుకు ముందడుగు.. ఇలా బోలెడు కబుర్లు చెప్తారు. కానీ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మాత్రం పెళ్లికి సరికొత్త అర్థం చెప్పాడు. అబ్బాయిని సరైన దారిలో పెట్టేందుకు ఓ అమ్మాయి అతడి జీవితంలోకి రావడమే వివాహం అని పేర్కొన్నాడు. ఇది విన్న ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు. షాహిద్ కపూర్ ప్రస్తుతం బ్లడీ డాడీ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'ఈ వివాహం అనేది ఒకే ఒకదానిపై ఆధారపడి ఉంటుంది. అదేంటంటే.. జీవితంపై ఓ క్లారిటీ లేని అబ్బాయి లైఫ్లోకి అమ్మాయి వచ్చి అతడి సమస్యలను పరిష్కరించి, తనను ఓ దారిలో పెట్టడమే పెళ్లి. ఆ అమ్మాయి వల్లే అతడు బాధ్యత గల వ్యక్తిగా మారతాడు' అని కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు కొందరికి అస్సలు మింగుడుపడటం లేదు. 'ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగడం పెళ్లి కాదా? ఒకరినొకరు సరిదిద్దుకోవడమే పెళ్లా? ఇదెక్కడి విచిత్రం?' అని కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి బాబూ మరోసారి చెప్పు.. అంటే మీ అమ్మ అదే పని చేసిందా? నిన్ను సరిగా పెంచిందా? లేదా? మీకింకా బుర్ర ఎదగలేదు. ఆడవాళ్లు అంటే మిమ్మల్ని పెంచుతూ, మిమ్మల్ని బాగు చేసే నర్సులు అనుకుంటున్నారా?', 'నువ్వు కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి రీమేక్)లో నటించావు, మాకు ఆ విషయం తెలుసు, కానీ నువ్వు ఇంకా ఆ పాత్రలో నుంచి బయటపడలేదా?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ప్రియుడితో నటి బ్రేకప్.. ఓదార్చిన వ్యక్తితో పెళ్లికి రెడీ -
ఆ బాలీవుడ్ హీరోతో పూజాహెగ్డే రొమాన్స్
షాహిద్ కపూర్–పూజా హెగ్డే జోడీ ఒక సినిమాకి సెట్ అయ్యిందన్నది బాలీవుడ్ తాజా ఖబర్. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రా నికి ‘కోయీ షాక్’ అనే టైటిల్ని ఖరారు చేశారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ఆరంభం కావాల్సింది. అయితే ముందుగా ప్రారంభోత్సవం జరిపి, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని షూటింగ్ ప్లాన్ చేస్తారట. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించనున్నారు. కాగా, ఇటీవల పూజా హెగ్డే ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా హిందీలో ఆమె మూడు చిత్రాలు సైన్ చేశారని, వాటిలో ‘కోయీ షాక్’ ఒకటని సవచారం. -
ఓటీటీలో దూసుకెళ్తున్న 'ఫర్జీ'.. ఆల్ టైమ్ రికార్డ్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'. ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్ రాజ్-డీకేలు తెరకెక్కించారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్లో విడుదలై ఓటీటీలో దూసుకెళ్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఇండియన్ ఓటీటీలోనే ఆల్ టైమ్ వ్యూయర్షిప్ను సాధించింది. ఇప్పటివరకు 37 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఓర్మ్యాక్స్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని నటుడు షాహిద్ కపూర్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అజయ్ దేవగణ్ నటించిన రుద్ర 35.2 మిలియన్ల వ్యూస్తో రెండోస్థానంలో నిలిచింది. Thanks for all the love!! 🫶🏼#Farzi #FarziOnPrime pic.twitter.com/zcjqkQyW6x — Raj & DK (@rajndk) March 25, 2023 -
ఆ స్టార్ కిడ్ నా వెంటపడుతోంది, నా వల్ల కాదని: బాలీవుడ్ హీరో
హీరోలను ఇష్టపడటం సహజమే, కొందరైతే అభిమానం హద్దులు దాటి ఆరాధిస్తారు కూడా! కానీ ఈ మితిమీరిన అభిమానం కొన్నిసార్లు స్టార్స్ను ఇబ్బందులపాలు చేస్తుంది. అందుకు ఇప్పుడు చెప్పబోయే సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. కాకపోతే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే పడి చచ్చే లేడీ ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. 'ఇష్క్ విష్క్' సినిమాతో చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్న అతడు తక్కువ కాలంలోనే ఎంతోమంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. అతడు మీరా రాజ్పుత్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతోమంది మహిళా అభిమానుల గుండె ముక్కలైంది. వారిలో దివంగత నటుడు రాజ్ కుమార్ కూతురు వాస్తవిక్త కూడా ఒకరు. ఆమెకు షాహిద్ అంటే పిచ్చి ప్రేమ. అతడు కనిపిస్తే చాలు హీరోనే చూస్తూ తన్మయత్వానికి లోనవుతుంది. షైమక్ డావర్ డ్యాన్స్ క్లాసులో తొలిసారి షాహిద్ను నేరుగా చూసింది. తొలిచూపులోనే అతడు తెగ నచ్చేశాడట. తనకు తెలియకుండానే అతడితో ప్రేమలో కూడా పడిందట! కానీ నటుడు మాత్రం తనకేమీ పట్టనట్లుగా ఉండిపోయేవాడు. ఎంతమందిలో ఉన్నా ఆమె చూపులు మాత్రం షాహిద్పైనే ఉండేవట. పైగా తనను షాహిద్ భార్యగా కూడా చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇది హీరోకు ఇబ్బందికరంగా అనిపించింది. మొదట నచ్చజెప్పి చూశాడు, కానీ ఆమె వినిపించుకోలేదట. పైగా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవడంతో ఓపిక నశించిన హీరో ఏకంగా పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సినిమా సెట్స్కు రావడం, బయటకు వెళ్తే ఫాలో కావడం, ఏకంగా తన ఇంటి పక్క ఇంట్లోకి షఫ్ట్ కావడం.. ఇవన్నీ చిరాకు తెప్పించడంతో 2012లో షాహిద్.. వాస్తవిక్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ ఫిర్యాదు తర్వాత ఆమె మరెన్నడూ షాహిద్ను ఫాలో కాలేదట. ఇకపోతే వాస్తవిక్త 1996లో యాక్టింగ్ కెరీర్ను ప్రారంభించింది. తండ్రి రాజ్కుమార్ అందుకున్న పేరు ప్రతిష్టలు తనకెలాంటి సక్సెస్ తెచ్చిపెట్టలేకపోయాయి. ఫలితంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక సినిమాలకు గుడ్బై చెప్పేసిందీ నటి. చదవండి: అవార్డులే అనుకున్నా ఆస్కార్ కూడా కొనేశారు కదరా! -
మాపై దయ చూపలేదు, నా గుండె ముక్కలయ్యింది: బాలీవుడ్ హీరో
ఒక భాషలో ఏదైనా సినిమా హిట్టయిందంటే చాలు దాన్ని వేరే భాషలో రీమేక్ చేయాలని తహతహలాడిపోతుంటారు సినీతారలు. ఈ క్రమంలో కొన్నిసార్లు సూపర్ హిట్లు తీసినా మరికొన్నిసార్లు మాత్రం చేతులు కాల్చుకుంటారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇలా రీమేక్లు తీసి వరుస ఫ్లాపులు మూటగట్టుకుంటోంది. సౌత్లో హిట్ అయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేసి వదులుతోంది. కానీ ఎందుకో అక్కడ అస్సలు వర్కవుట్ కావడం లేదు. అయినా సరే పట్టు వదలకుండా రీమేక్లు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో విక్రమ్ వేద, హిట్, జెర్సీ, షెహజాదా (అల వైకుంఠపురములో), డ్రైవింగ్ లైసెన్స్(సెల్ఫీ) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అయినా సరే వాటిని లెక్క చేయకుండా బోలెడన్ని సినిమాలు ఇంకా క్యూలో ఉన్నాయి. లవ్ టుడే, సూరరై పోట్రు, ఎఫ్ 2, బ్రోచెవారెవరురా, ఖైదీ, కత్తి, అయ్యప్పనుమ్ కోషియుమ్.. ఇలా చాలా చిత్రాలు రీమేక్ బాటపట్టాయి. హిందీ ప్రేక్షకులు సౌత్ కంటెంట్ను ఇష్టపడటం లేదని కాదు.. దక్షిణాది సినిమాలను చూస్తున్నారు, ఒరిజినల్ కంటెంట్ను మాత్రమే ఇష్టపడుతున్నారు.. రీమేక్లకు మాత్రం నిర్మొహమాటంగా నో చెప్తున్నారు. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాను వ్యతిరేకిస్తే తట్టుకోలేమంటున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. నాని హీరోగా నటించిన జెర్సీ మూవీకి తెలుగులో విశేష స్పందన లభించింది. ఈ సినిమా హిందీ రీమేక్లో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్లో రిలీజవగా ఘోర పరాజయం పొందింది. దీనిపై షాహిద్ మాట్లాడుతూ.. 'నా గుండె పగిలినట్లైంది. ఎంతో మంచి సినిమా అది, కానీ ఈ ప్రపంచం మాపై దయచూపలేదనుకుంటా.. పాటలు విడుదలైన మరో నాలుగు నెలలకు సినిమా రిలీజైంది. జెర్సీతో ఓ విషయం నాకు బాగా అర్థమైంది. సినిమాలు ఫాస్ట్ఫుడ్ వంటివి. అది వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే తినేయాలి.. దాన్ని వాయిదాలు వేసుకుంటూ ఆలస్యం చేస్తే అంత మజా రాదు. అప్పుడు కరోనా టైంలో సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదు. దురదృష్టవశాత్తూ సినిమా ఫ్లాప్ అయింది' అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఫర్జీ వెబ్ సిరీస్తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు షాహిద్ కపూర్. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్లో ప్రసారమవుతున్న ఈ సిరీస్కు మంచి ఆదరణ లభించింది. -
స్టార్ హీరో ఇంట్లో అద్దెకు దిగిన యంగ్ హీరో, రెంట్ ఎంతో తెలుసా?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం 'షెహజాదా' సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే! షెహజాదా ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కార్తీక్.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఇంట్లో అద్దెకు దిగుతున్నాడట! ముంబైలోని జుహులో షాహిద్ కపూర్కు లగ్జరీ అపార్ట్మెంట్ ఉంది. గతేడాది వరకు షాహిద్ తన భార్య మీరా రాజ్పుత్.. పిల్లలు జైన్, మిషాతో కలిసి అక్కడే ఉండేవాడు. ఇటీవలే వీరు వర్లిలోని డూప్లెక్స్ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. దీంతో ప్రానెటా బిల్డింగ్లోని తన అపార్ట్మెంట్ ఖాళీ అయింది. తాజాగా ఈ అపార్ట్మెంట్లోకి కార్తీక్ ఆర్యన్ అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ ఇంటి అద్దె రూ.7.5 లక్షలు కాగా ఏడాది తర్వాత రెంట్ పెరుగుతుందట. రెండో ఏడాది నెలనెలా రూ.8.02 లక్షలు కట్టాల్సి ఉంటుందట. ఇక మూడో సంవత్సరంలో ఏకంగా రూ.8.58 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.45 లక్షలు ముందుగానే అప్పజెప్పాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సంక్రాంతికి ముందే పూర్తైనట్లు బీటౌన్లో ఓ వార్త వైరల్గా మారింది. కాగా కార్తీక్ ఆర్యన్ గతంలో వెర్సోవాలోని ఓ అపార్ట్మెంట్లో నివసించేవాడు. దీన్ని 2019లో రూ.1.60 కోట్లకు కొనుగోలు చేశాడు. చదవండి: రోజూ రాత్రి ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని: రష్మిక డైరెక్టర్కు మెగాస్టార్ ఖరీదైన బహుమతి -
‘మనీ హేస్ట్’ సిరీస్ను తలపిస్తున్న షాహిద్ ‘ఫర్జీ’ ట్రైలర్!
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ రూపొందింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్ రాజ్-డీకేలు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్లో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. చదవండి: అఫిషియల్: ఓటీటీకి వచ్చేస్తున్న ‘18 పేజెస్’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే! ఈ నేపథ్యంలో సిరీస్ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఫర్జీ తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైం వీడియోస్. ఈ ట్రైలర్ చూస్తుంటే డబ్బు చూట్టు కథ తిరుగనుందని తెలుస్తోంది. ‘నేను ఎంత డబ్బు సంపాదించాలంటే.. ఆ డబ్బు మీద నాకు మోజు పోవాలి’ అంటూ షాహిద్ చెప్పే డైలాగ్ ఆసక్తిగా పెంచుతోంది. దొంగ నోట్లు ముద్రించే యువకుడిగా షాహిద్ ఇందులో కనిపంచనున్నాడు. ఇక ఫర్జీ ట్రైలర్ చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన మనీ హేస్ట్ ఇంగ్లీష్ సిరీస్ను తలపిస్తోంది. చదవండి: ‘బాధపడకమ్మా.. నేను నీ వెనకే ఉన్నా’: సమంత ఎమోషనల్ పోస్ట్ ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకులు రాజ్-డీకే మాట్లాడుతూ తమకు ఇష్టమైన స్క్రిప్ట్ల్లో ఇదీ ఒకటని చెప్పారు. ఎంతో అభిరుచితో ఈ వెబ్ సిరీస్ను రూపొందించామని, ‘ది ఫ్యామిలీమ్యాన్’ సిరీస్లానే ఇది కూడా అందరికి నచ్చుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇందులో విజయ్ సేతుపతి పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు కేకే మేనన్, రాశీఖన్నాలు మరో కీలక పాత్రలు పోషించారు. -
ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా-సిద్దార్థ్, క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుండటంతో వీరద్దరి మధ్య సమ్థింగ్, సమ్థింగ్ నడుస్తోందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో దర్శక-నిర్మాత కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ తమ ప్రేమ గురించి చెప్పకనే చెప్పింది ఈ జంట. ఇటీవల షోకు వచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా కియారాతో డేటింగ్పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. చదవండి: అప్పట్లోనే బిగ్బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్గా కవర్ ఫొటో కెరీర్ ప్లాన్ ఏంటని సిద్ధార్థ్ను కరణ్ ప్రశ్నించగా.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్. తాజాగా హీరో షాహిద్ కపూర్తో కలిసి కియారా ఈ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా తనకు పరిశ్రమలో అంత్యంత క్లోజ్ ఎవరని అడగ్గా షాహిద్ పేరు చెప్పింది కియారా. అనంతరం సిద్ధార్థ్తో ఉన్న బంధం ఏంటని అడగ్గా. అతడు ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటూ ముసిముసిగా నవ్వింది ఆమె. చదవండి: హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ గౌతమ్ రాజు కుమారుడు ఇంతలో షాహిద్ కల్పించుకుని ‘ఈ ఏడాది చివర్లో ఎప్పుడైన బిగ్ అనౌన్స్మెంట్ రావోచ్చు సిద్ధంగా ఉండండి. కానీ అది సినిమాకు సంబంధించినది మాత్రం కాకపోవచ్చు!’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో సిద్ధార్థ్, కియారాలు త్వరలోనే గుడ్న్యూస్ చెప్పబోతున్నారని, ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎట్టకేలక తమ లవ్వీ లవ్బర్డ్స్ పెళ్లి ఒక్కటికాబోతున్నారా? వీరిద్దరు క్యూట్ కపుల్, ఎట్టకేలకు కియార-సిద్ధార్థ్ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారన్నమాట’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కియారా, సిద్ధార్థ్లు ‘షేర్షా’ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్ల తెలుస్తోంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా?
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’. ఈ షో ఎంతటి క్రేజీ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు వచ్చిన సినీ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో చిక్కు ప్రశ్నలు అడిగి ఇబ్బందుల్లో పడేస్తుంటాడు కరణ్. అలా వారి నుంచి ఆసక్తిర విషయాలను బయటపెట్టిస్తూ ఈ టాక్ షోను సక్సెస్ ఫుల్గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షో 6వ సీజన్ను జరుపుకుంటోంది. ఈ సీజన్లో తొలిసారి మన తెలుగు హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండలు సందడి చేశారు. చదవండి: బింబిసార మూవీపై జూ. ఎన్టీఆర్ రివ్యూ.. ఏమన్నాడంటే దీంతో కాఫీ విత్ కరణ్ 6వ సీజన్కు నార్త్లోనే కాదు సౌత్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలో లెటేస్ట్ ఎపిసోడ్లో లాల్ సింగ్ చద్దా హీరోహీరోయిన్లు అయిన ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ సందడి చేశారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, కరీనాను అడిగిన ఓ ప్రశ్న ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రాపిడ్ ఫైర్ రౌండ్లో హోస్ట్ కరణ్ కరీనాను కజిన్ రణ్బిర్ కపూర్, షాహిద్ కపూర్ పార్టీ చేసుకుంటే ఎవరు మిమ్మల్ని ఆహ్వానించరు అని అడగ్గా.. ‘రణ్బిర్ కజిన్ కాబట్టి ఆహ్వానిస్తాడు. కానీ షాహిద్ కపూర్ మాత్రం ఆహ్వానించకపోవచ్చు’ అని వివరించింది. చదవండి: పసి పిల్లలను సైతం చంపే రాక్షస చక్రవర్తి 'బింబిసార'.. మూవీ రివ్యూ ఆ తర్వాత గతంలో ఈ షోలో బేబో ఎన్నోసార్లు పాల్గొంందని, పెళ్లికి ముందు ఒకసారి, పెళ్ల అనంతరం తన భర్త సైఫ్తో.. మాజీ భర్త షాహిద్.. అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో షోకు వచ్చినవారంత ఒక్కసారిగా షాకయ్యారు. కరణ్ మాటలకు కరీనా సైతం అవాక్కైంది. తన తప్పును వెంటనే సవరించుకున్న కరణ్.. కరీనాను క్షమాపణలు కోరాడు. కాగా కరీనా, షాహిద్లు జంటగా నటించిన జబ్ వి మెట్ మూవీ సమయంలో వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లకు ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న వీరిద్దరు. ఆ తర్వాత కరీనా.. సైఫ్ అలీ ఖాన్ను పెళ్లి చేసుకోగా.. షాహిద్ మిరా రాజ్పుత్ను వివాహమాడాడు. -
వావ్ వాట్ ఏ టాలెంట్.. మైకెల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన కార్మికుడు
భారత్లో ప్రతిభావంతులకు కొదవే లేదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ అది నిరూపించుకునేందుకు సరైన సమయం కావాలి. చాలామందిలో టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నప్పటికీ విజయం సాధించలేకపోవచ్చు. ఎన్నో కారణాల వల్ల తమలోని ప్రతిభను పక్కన పెట్టేసి చిన్నా, చితక పనులు చేస్తూ జీవించేస్తుంటారు. అయితే ఎదో ఒక సమయంలో మనలోని టాలెంట్ తప్పకుండా బయటడుతుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడంతో మారుమూల ప్రాంతంలోని ప్రతిభ కలిగిన వ్యక్తులు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించి నలుగురిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. అచ్చం ఇలాగే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తనలోన దాగున్న డ్యాన్స్ టాలెంట్తో మెస్మరైజ్ చేశాడు. తోటి కార్మికులతో కలిసి వర్క్ ప్రదేశంలో పనిచేస్తుండగా డ్యాన్స్ చేసి అబ్బుర పరిచాడు. మైకెల్ జాక్సన్ వలె అద్భుత డ్యాన్స్ స్టెప్పులతో దుమ్ములేపాడు. ఎంతో కష్టమైన డ్యాన్స్ మూమ్స్ను కూడా అలవోకగా చేస్తూ అందరిని మెప్పించాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా దీనిని ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. చదవండి: కొంపముంచిన డెలివరీ ఇన్స్ట్రక్షన్.. రూ.500 చిల్లర తీసుకురమ్మంటే! హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, అల్లు అర్జున్, మాధురీ దీక్షిత్, ప్రభుదేవా, రెమో డీసౌజా వంటి డ్యాన్సర్లు, హీరోలను ట్యాగ్ చేస్తూ పోస్టు చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. నెటిజన్లు అతడి ప్రతిభను ప్రశంసిస్తున్నారు. ఎంతో అద్భుతం, గొప్ప డ్యాన్సర్, ఇంత స్మూత్ డ్యాన్స్ స్టెప్పులను ఎప్పుడూ చూడలేదంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. బాలీడు్ నటుడు షాహిద్ కపూర్ కూడా రీట్వీట్ చేస్తూ..‘చాలా బాగుంది. ప్రతిభ ఎప్పుడూ షైన్ అవుతూనే ఉంటుంది. దానిని అణచివేయలేరు. తెలివైన, ఎంతో స్ఫూర్తిదాయకం.’ అని పేర్కొన్నారు. Please,enjoy this video & respect his talent & skills of dance👍👌👌. @iHrithik @iTIGERSHROFF @aakankshalovely @RaghavJuyalOffi @alluarjun @PDdancing @shahidkapoor @MadhuriDixit @remodsouza . pic.twitter.com/XCls4DTzPv — Ajay Raturi (@AjayRaturi20) July 20, 2022 -
ఓటీటీలో జెర్సీ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
షాహిద్ కపూర్ నటించిన తాజా చిత్రం 'జెర్సీ'. తెలుగు నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీని హిందీలో అదే పేరుతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్ 40 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించి కొడుకు కోరికను నెరవేర్చిన అర్జున్ తల్వార్ అనే తండ్రి పాత్రలో కనిపించాడు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్లో జెర్సీ సినిమా ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో షాహిద్కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ
Rashmika Mandanna Was 1st Choice For Shahid Jersey: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ ఈ నెల 22న విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇందులో షాహిద్ నటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. తెలుగులో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన నేచులర్ స్టార్ నాని జెర్సీకి ఇది హిందీ రీమేక్ అనే విషయం తెలిసిందే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ ఇదే పేరుతో ఈ మూవీని రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్ 40 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించి కొడుకు కోరికను నెరవేర్చిన అర్జున్ తల్వార్ అనే తండ్రి పాత్రలో కనిపించాడు. చదవండి: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: వేదాంత్ షాకింగ్ కామెంట్స్ ఈ క్రమంలో షాహిద్ పోషించిన భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయినప్పటికీ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో షాహిద్ భార్యగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకుర్ నటించింది. అయితే మొదట ఈ పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను సంప్రదించారట చిత్ర బృందం. అయితే తను ఈ ఆఫర్ను తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. ఐఏఎన్ఎస్తో ముచ్చటించిన రష్మిక హిందీ జెర్సీ ఆఫర్పై నోరు విప్పింది. తనకు హిందీ జెర్సీ ఆఫర్ వచ్చిందని, కానీ దాన్ని తిరస్కరించానని తెలిపింది. చదవండి: షాపింగ్ మాల్ ఓపెనింగ్కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్ ‘ఎందుకంటే నేను ఇప్పటి వరకు చేసినవన్ని కమర్షియల్ సినిమాలే. అలాంటి నేను జెర్సీలాంటి చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది. జెర్సీ మంచి సినిమా కాదు అని నేను అనడం లేదు. ఇది రియలిస్టిక్ చిత్రం. జెర్సీ తెలుగు వెర్షన్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు తనకన్న గొప్పగా ఎవరూ నటించలేరని నా ఉద్దేశం. అందుకే ఈ పాత్రకు నేను కరెక్ట్ కాదని అనిపించింది. అనుకుంటే నేను ఈ సినిమాలో నటించేదాన్నే. కానీ నా వల్ల దర్శక-నిర్మాతలు నష్టపోకూడదనుకున్న. ఈ సినిమా కోసం వారికి నాకంటే బెటర్ ఆప్షన్స్ ఎన్నో ఉండోచ్చు కదా. అందుకే ఈ సినిమాకు నో చెప్పాను’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగు పుష్ప 2తో పాటు హిందీలో యానిమల్ చిత్రాలతో బిజీగా ఉంది. -
ఓటీటీలకు తారల గ్రీన్ సిగ్నల్.. ఏకధాటిగా వెబ్ సిరీస్లు, సినిమాలు
Cine Celebrities On OTT Digital Platform: కరోనా లాక్డౌన్లో ఓటీటీల హవా మొదలైంది. స్టార్స్ సైతం ఓటీటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థియేటర్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్కు చాలా మంది యాక్టర్స్ పచ్చ జెండా ఊపుతూనే ఉన్నారు. తాజాగా కొందరు బాలీవుడ్ తారలు యాక్టర్స్ ‘ఓటీటీ.. మేం రెడీ’ అంటూ డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తీసిన ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్ 1’ వెబ్ సిరీస్కి, దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’కి మంచి ఆదరణ దక్కింది. దీంతో కొందరు బాలీవుడ్ తారలు ఈ డైరెక్టర్స్తో వెబ్సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా షాహిద్ కపూర్తో రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే వెబ్ సిరీస్ చేశారు. రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి ఇతర లీడ్ రోల్స్ చేశారు. షాహిద్కు ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్. ఇకపోతే వరుణ్ ధావన్ ఓటీటీ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోని ఓ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ ధావన్ బర్త్ డే (ఏప్రిల్ 24) సందర్భంగా రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో వరుణ్, సమంతల ఫొటోను షేర్ చేసి ‘యాక్షన్ ప్యాక్డ్ ఇయర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వరుణ్ డిజిటల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని బీ టౌన్ టాక్. అదేవిధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లోనే దుల్కర్ సల్మాన్ కూడా డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 1990 బ్యాక్డ్రాప్లో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్లో దుల్కర్తోపాటు రాజ్కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ పూర్తయిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్పై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఇక గత ఏడాది ఆగస్టులో ఓటీటీలో రిలీజైన సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’ చిత్రానికి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరో ఓటీటీ ప్రాజెక్ట్కి సైన్ చేశారు సిద్ధార్థ్. రోహిత్ శెట్టి డైరెక్షన్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్సిరీస్లో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. మరో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్ సైతం ఓటీటీ బాటకే ఓటేశారు. బ్రిటీష్ పాపులర్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ఓటీటీ ప్రాజెక్ట్లో లీడ్ రోల్ చేస్తున్నారు ఆదిత్య. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైంది. ఇందులో అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ప్రాజెక్ట్లో హృతిక్ రోషన్ నటిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా ఫైనల్గా ఆదిత్యారాయ్ కపూర్ రంగంలోకి దిగారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు ఆలియా భట్. టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ ఫిల్మ్లో ఇంగ్లీష్ యాక్టర్స్ గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా ఓటీటీ ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘ది ఫాలెన్’గా వస్తున్న ఈ వెబ్ ఫిల్మ్కు రీమా కాగ్తీ దర్శకురాలు. ఈ ప్రాజెక్ట్లో సోనాక్షి పోలీసాఫీసర్గా కనిపిస్తారు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్తోనే కెరీర్ను స్టార్ట్ చేసే సాహసం చేశారు స్టార్ కిడ్స్ అగస్త్య నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ల చిన్న కుమార్తె), సునైనా ఖాన్ (షారుక్ఖాన్ కుమార్తె). ‘ది ఆర్చీస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ ఫిల్మ్కు జోయా అక్తర్ దర్శకురాలు. ఆల్రెడీ ఊటీలో షూటింగ్ మొదలైంది. బాలీవుడ్లోని మరికొంతమంది యాక్టర్స్ ఓటీటీ బాటపడుతున్నారని లేటెస్ట్ టాక్. ఇక.. కొందరు సీనియర్ యాక్టర్స్లో అక్షయ్ కుమార్ ‘ది ఎండ్’ అనే భారీ ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. కానీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ‘సేక్రెడ్ గేమ్స్’తో సైఫ్ అలీఖాన్, ‘రుద్ర’తో అజయ్ దేవగన్ వంటి సీనియర్స్ డిజిటల్ వ్యూయర్స్ ముందుకు వచ్చారు. సీనియర్ హీరోయిన్స్లో ‘ఆర్య’తో సుష్మితాసేన్, ‘మెంటల్హుడ్’తో కరిష్మా కపూర్, ‘ది ఫేమ్ గేమ్’తో మాధురీ దీక్షిత్ ఇప్పటికే డిజిటల్లోకి వచ్చేశారు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో శిల్పాశెట్టి, కరీనా కపూర్ (సుజోయ్ ఘోష్ దర్శకత్వంలోని సినిమా..), ‘చక్ ద ఎక్స్ప్రెస్’తో (మహిళా క్రికెటర్ జూలన్ గోస్వామి బయోపిక్) అనుష్కా శర్మ వంటివారు డిజిటల్ వ్యూయర్స్ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
నాకెప్పటికీ ఆ స్కూల్ డేస్ అంటే అసహ్యం: షాహిద్ కపూర్
Shahid Kapoor Says He Hates His School Days: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. కబీర్ సింగ్తో ఫాంలోకి వచ్చిన షాహిద్ ఈ మూవీతో ఎలాగైన మరో హిట్ కొట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 22న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. చదవండి: ‘ఆచార్య’ హిందీ వెర్షన్పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ అయినప్పటికీ ఈ చిత్రంలో షాహిద్ పాత్రకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. క్రికెట్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో కొడుకు కోరికను నేరవెర్చే తండ్రిగా షాహిద్ ఒదిగిపోయాడు. ఈ క్రమంలో షాహిద్ పోషించిన భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ నేషనల్ చానల్తో ముచ్చటించిన షాహిద్ వ్యక్తిగతం జెర్సీ కథకు బాగా కనెక్ట్ అయ్యానన్నాడు. అనంతరం ఈ సినిమాలో తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక తన వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడుతూ ముంబైలోని తన స్కూలింగ్ డేస్ను గుర్తు చేసుకున్నాడు. చదవండి: రాజమౌళి గురించి ఈ విషయం 12 ఏళ్ల క్రితమే చెప్పా: భాను చందర్ ఈ సందర్భంగా ముంబైలో తను చదివిన స్కూల్ అంటే అసహ్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘నా పదేళ్ల వయసు వరకు ఢిల్లీలో చదివాను. అక్కడ స్కూల్స్ అంటే నాకు చాలా ఇష్టం. టీచర్లంతా స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. విషయం ఏదైనా అర్థమయ్యేలా వివరించేవారు. ఇక అమ్మ జాబ్ నేపథ్యంలో మేం ముంబైకి వచ్చాం. దీంతో నేను ముంబై స్కూళ్లో చేరాను. ఆ స్కూల్ అంటే నాకెప్పటికీ అసహ్యం. ఎందుకంటే ఆ స్కూల్ టీచర్లు తరచూ నన్ను వేధించేశారు. వాళ్లు నాతో సరిగ్గా ఉండేవాళ్లు కాదు. అందుకే ఆ స్కూల్ డేస్ నాకెప్పటికీ నచ్చవు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అల్లు అరవింద్ సమర్పణలో దిల్రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్గిల్ నిర్మించిన హిందీ జెర్సీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, గంటల వ్యవధిలోని ఆన్లైన్లో లీక్
Shahid Kapoor Jersey Movie Leaked Online: షాహిద్ కపూర్ తాజా చిత్రం జెర్సీ మూవీ టీంకు షాక్ తగిలింది. ఎన్నోసార్లు వాయిదా పుడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు నేడు(ఏప్రిల్ 22న) విడుదలైంది. ఇప్పటికే తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’తో హిట్ కొట్టిన షాహిద్ ఈ మూవీతో మరో హిట్కొట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో జెర్సీ విడుదలైన గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో లీకవడంతో మూవీ టీం, హీరో షాహిద్ ఆందోళనకు గురవుతున్నారు. ఈ మూవీ విడులైన గంట వ్యవధిలోనే తమిళ్రాక్స్, టెలిగ్రామలో లీకైంది. అయితే ఈ సినిమా పైరసి పట్ల చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికి లీకువీరులు తమ చేతివాటం చూపించారు. చదవండి: సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్ కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ చిత్రాలు గట్టి పోటి ఇస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాగా వచ్చిన జెర్సీ తొలి రోజే ఆన్లైన్లోకి లీకవడం మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో షాహిద్ ఎమోషనల్గా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో అతడి పాత్రపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీని హిందీలో అదే పేరుతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ పరంపర మ్యూజిక్ అందించారు. చదవండి: హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే.. -
హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే..
Nani Interesting Comments on Shahid Kapoor: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన హీరో స్టార్ నాని జెర్సీని హిందీలో షాహిద్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం ఈ రోజు(ఏప్రిల్ 22) థియేటర్లో విడుదలైంది. ఇందులో షాహిద్ పాత్రకు సినీ సెలబ్రెటీల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అలాగే ఈ సినిమా చూసిన నాని కూడా చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపించాడు. చదవండి: కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే.. హిందీ జెర్సీలో తన రోల్ పోషించిన షాహిద్ను పొగడ్తలతో ముంచెత్తాడు.ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ అర్జున్ పాత్రకు షాహిద్ పూర్తి న్యాయం చేశాడని పేర్కొన్నాడు. ‘జెర్సీ సినిమా చూశాను. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టేనట్టే. షాహిద్కపూర్ అర్జున్ పాత్రను మనస్సు పెట్టి చేశాడు. మృణాళ్ ఠాకూర్, పంకజ్ కపూర్ సర్, మై బాయ్ రోనిత్ (చైల్డ్ యాక్టర్) కూడా చాలా బాగా చేశారు.. నిజమైన మంచి సినిమా ఇది. చిత్రయూనిట్కు నా శుభాకాంక్షలు’ అంటూ నాని రాసుకొచ్చాడు. చదవండి: జెర్సీ సినిమా భరించలేకున్నానంటూ కేఆర్కే రివ్యూ ఇక నాని ట్వీట్కు షాహిద్ సమాధానం ఇచ్చాడు. ‘థాంక్యూ మై ఫ్రెండ్(అర్జున్ నుంచి మరోక అర్జున్). మీది చాలా పద్ద మనసు అందుకే జెర్సీకి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మోర్ పవర్ టూ యూ’ అంటూ రీట్వీట్ చేశాడు. కాగా ఇప్పటివరకు స్క్రీనింగ్ అయిన షోల వరకు ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇందులో షాహిద్కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ పరంపర మ్యూజిక్ అందించారు. Thank you. From one Arjun to another. Big love my friend. You have a big heart and that’s what jersey is all about. More power to you. https://t.co/mMOkevCH5T — Shahid Kapoor (@shahidkapoor) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జెర్సీ సినిమా భరించలేకున్నానంటూ కేఆర్కే రివ్యూ
తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన జెర్సీ హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే! షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం నేడు (ఏప్రిల్ 22న) థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాపై బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ రివ్యూ ఇచ్చాడు. 'జెర్సీ సినిమాను చూసి భరించలేకపోతున్నాను. ఇదేం సినిమారా బాబు. కబీర్ సింగ్లో షాహిద్ ఎలా హింసాత్మకంగా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే ఉన్నాడు. ఈ సినిమా చేసేందుకు షాహిద్కు ఇదొక్కటి సరిపోతుందేమో!' అని ట్వీట్ చేశాడు కేఆర్కే. మరో ట్వీట్లో 'కేవలం క్రికెట్ చూడటానికి నేను జెర్సీ సినిమా ఎందుకు చూడాలో నాకైతే అర్థం కావడం లేదు. అంతగా కావాల్సి వస్తే ఐపీఎల్ చూస్తాను. జెర్సీ నిర్మాతలు సినిమా క్రికెట్ గురించి కాదని ప్రతిచోటా చెబుతూ వచ్చారు. వారి మాటలను నమ్మి నేను సినిమా చూడాలని నిర్ణయించుకున్నాను. తీరా సినిమా చూశాక ఆరు గంటల క్రికెట్ను వారు జెర్సీ ద్వారా మూడు గంటల్లో చూపించినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు మినహా అంతా క్రికెట్ చుట్టూనే సాగుతోంది' అంటూ కేఆర్కే వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మరోపక్క ఇషాన్ ఖట్టర్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, కునాల్ కెమ్ము తదితరులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Ye Film #Jersey Mujhse Jheli Nahi Jaa Rahi. Ye Kaya Hai Bhai? Film Ka Hero #KabirSingh main mental and violent tha. Waisa Hi Yahan hai. Toh Bas Shahid Ke Liye Itna Hi Kafi tha Film Karne Ke Liye. These actors are really Big Jhandu. — KRK (@kamaalrkhan) April 21, 2022 I really can’t understand that why should I watch film #jersey to watch cricket. If I have to watch cricket only then better I will watch #IPL. — KRK (@kamaalrkhan) April 21, 2022 Makers of #Jersey are saying everywhere that the film is not about cricket. So I decided to watch the film on their words. After watching the film, I can say that makers must be thinking to show 6hours cricket in 3hours film. Coz This film is all about cricket except few scenes. — KRK (@kamaalrkhan) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఓటీటీలో అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ మూవీ, ఎక్కడో తెలుసా? 'కేజీయఫ్-2' విజయంపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
వివాదంలో జెర్సీ మూవీ, విడుదల ఆపాలంటూ రచయిత డిమాండ్
Shahid Kapoor Jersey Movie In Trouble: షాహిద్ కపూర్ జెర్సీకి వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. తెలుగు నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కేజీఎఫ్ 2, బీస్ట్ చిత్రాల కారణంగా ఏప్రిల్ 22కు మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీని ఓ వివాదంలో చూట్టుముట్టుంది. బాలీవుడ్ సినీ రచయిత రూపేశ్ జైశ్వల్ జెర్సీ విడుదలను ఆపాలంటూ తాజాగా కోర్టును ఆశ్రయించాడు. చదవండి: యశ్, విజయ్ ఎఫెక్ట్, వెనక్కి తగ్గిన షాహిద్ కపూర్ జెర్సీ స్క్రిప్ట్ తనదంటూ కాపీరైట్ కింద కేసు నమోదు చేశాడు. ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘‘ది వాల్’ అనే పేరుతో ఈ కథకు సంబంధించిన కాపీరైట్స్ను ఫిలిం రైటర్స్ అసోసియేషన్లో 2007లోనే రిజిస్టర్ చేయించాను. తెలుగుతో పాటు హిందీ జెర్సీ సినిమా కథ నాదే. నా కథలో ఎన్నో మార్పులు చేసి నాకు తెలియకుండా స్క్రిప్ట్ తీసుకున్నారు’ అని తన పిటిషన్లో ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు ఏప్రిల్ 22న విడుదల కాబోతోన్న ఈమూవీని వెంటనే ఆపివేయాలని కోర్టును కోరాడు. థియేటర్లతో సహా మరే ఇతర ఓటీటీల్లో కూడా ఈ మూవీ విడుదల కాకుండా చూడాలన్నాడు. చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది కనీసం ఈ కేసు తీర్పు వచ్చేవరకైనా ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశాడు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో వేచి చూడాలి. తెలుగు జెర్సీని నిర్మాతలైన అల్లు అరవింద్, నాగవంశీలు హిందీ జెర్సీ కూడా నిర్మాతలుగా వ్యవహించారు. అయితే ఈ సినిమా షూటింగ్కు కరోనా లాక్డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా సెకండ్ లాక్ డౌన్ వచ్చి సినిమా రిలీజ్ను ఆపేసింది. సంక్రాంతి సమయంలో ఈ మూఏవీరి రిలీజ్ చేయాలనుకోగా కరోనా భయంతో థియేటర్స్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి జెర్సీని వాయిదా పడేలా చేసింది. ఇక ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని కెజిఎఫ్ 2 సినిమా రావడంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు. -
యశ్, విజయ్ ఎఫెక్ట్, వెనక్కి తగ్గిన షాహిద్ కపూర్
Shahid Kapoor Jersey Postponed New Release Date Here: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదలకు ఇంకా 3 రోజులు ఉందనగా మరోసారి జెర్సీని పోస్ట్పోన్ చేస్తూ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. చదవండి: స్టార్ హీరో అయ్యుండి ఇలా చేస్తారనుకోలేదు: విజయ్పై పూజా కామెంట్స్ ఇదే వారం పాన్ ఇండియా చిత్రాలు కేజీఎఫ్ 2, బీస్ట్లు విడుదల అవుతోన్న నేపథ్యంలో జెర్సీ టీం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జెర్సీ పోస్ట్పోన్ అయిందని, ఏప్రిల్ 22కు ఈ మూవీని వాయిదా వేసినట్లు తాజాగా సినీ విశ్లేషకుడు తరణ్ అదర్శ్ ట్వీట్ చేశాడు. ‘ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్.. జెర్సీ మరో వారానికి వాయిదా పడింది. నిన్న(ఆదివారం) రాత్రి మేకర్స్ ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 22 ఏప్రిల్ 22న జెర్సీ థియేటర్లోకి రానుంది’ అంటూ తరణ్ ఆదర్శ్ రాసుకొచ్చాడు. కాగా క్రికెటర్గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే ఎమోషనల్ అంశాలతో తెరకెక్కించిన సినిమా జెర్సీ. #Xclusiv... BREAKING NEWS... #Jersey POSTPONED by one week... Will arrive in *cinemas* on 22 April 2022... The stakeholders arrived at the decision late last night. pic.twitter.com/7ZY5JU4zQV — taran adarsh (@taran_adarsh) April 11, 2022 చదవండి: RK Roja: కామెడీ షో జబర్దస్త్కు ఆర్కే రోజా గుడ్బై -
3-4 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్కి దూరమైన స్టార్ హీరోలు, ఎందుకంటే..
కోవిడ్కి రెండేళ్లు.. ఈ రెండేళ్లల్లో లాక్డౌన్ కారణంగా సినిమాల విడుదల వాయిదా పడింది. ఈ వాయిదాల వల్ల కొందరు స్టార్ హీరోలు దాదాపు రెండేళ్లు స్క్రీన్పై కనిపించలేదు. బాలీవుడ్లో ఆమిర్, షారుక్, హృతిక్, షాహిద్, రణ్బీర్ అయితే వెండితెరపై కనిపించి మూడు నాలుగేళ్లవుతోంది. ఎందుకింత గ్యాప్? ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్’ అని తండ్రి పాత్రధారి అంటే.. హీరో అల్లు అర్జున్ ‘ఇవ్వలా.. వచ్చింది’ అంటాడు. ఈ ఐదుగురి హీరోల విషయం కూడా అంతే.. ‘గ్యాప్ఇవ్వలా... వచ్చింది’. ఆ గ్యాప్కి కారణం, ఈ ఏడాది ఈ ఐదుగురూ కనిపించనున్నసినిమాల గురించి తెలుసుకుందాం. ఫైటర్ కాదు... వేరే! హృతిక్ రోషన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు కావొస్తోంది. టైగర్ ష్రాఫ్తో కలిసి హృతిక్ చేసిన ‘వార్’ సినిమా 2019 అక్టోబరులో రిలీజైంది. ఈ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తోనే ‘ఫైటర్’ సినిమా కమిటయ్యారు హృతిక్.. ఈ ఏడాది డిసెంబరులో వెండితెరపైకి రావాల్సిన ‘ఫైటర్’ కాస్త లేట్గా వచ్చే ఏడాది సెపె్టంబరుకు షిఫ్ట్ అయ్యాడు. అయితే వేరే సినిమా ద్వారా హృతిక్ ఈ ఏడాది తెరపై కనిపిస్తారు. తమిళంలో హిట్ సాధించిన ‘విక్రమ్ వేదా’ చిత్రంలో వేదగా నటిస్తున్నారు హృతిక్. విక్రమ్గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రి ద్వయమే హిందీ రీమేక్ను తీస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. హృతిక్ రోషన్ తండ్రి, దర్శక – నటుడు రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడి కోలుకుంటుండటం, కోవిడ్ ఎఫెక్ట్ వంటి అంశాలు హృతిక్ షూటింగ్ షెడ్యూల్స్కి కాస్త గ్యాప్ పడేలా చేశాయి. మరో వారంలో... ఒక హిట్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా ఇంకో హిట్ ఇవ్వాలనే పట్టుదలతో షాహిద్ కపూర్ ‘జెర్సీ’ రీమేక్ అంగీకరించారు. తెలుగులో మంచి విజయం సాధించిన ‘అర్జున్రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్సింగ్’లో టైటిల్ రోల్ చేసి, అద్భుతమైన హిట్ అందుకున్నారు షాహిద్ కపూర్. 2019లో ఈ సినిమా విడుదలైంది. వెంటనే మరో తెలుగు హిట్ మూవీ ‘జెర్సీ’కి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు షాహిద్. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ పడుతూ ఫైనల్గా మరో వారంలో ఈ నెల 14న రిలీజ్కు రెడీ అయ్యింది. తెలుగు ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరియే హిందీ రీమేక్కి కూడా దర్శకత్వం వహించారు. లాల్ వచ్చేస్తాడా? ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ (2018)... అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కాంబినేషన్లో రూపొందిన తొలి సినిమా ఇది. అది కూడా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో.. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఎన్నో అంచనాలతో ఆమిర్ ఈ సినిమా చేశారు. రిజల్ట్ షాక్ ఇవ్వడంతో తన తదుపరి చిత్రానికి ఆమిర్ ఖాన్ కాస్త టైమ్ తీసుకున్నారు. కొన్ని కథలు విన్న తరువాత ఫైనల్గా ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’ను హిందీ (‘లాల్సింగ్ చద్దా’) లో రీమేక్ చేయాలని ఆమిర్ నిర్ణయించుకున్నారు. 2019లో ఈ సినిమా షూటింగ్ ఆరంభించారు. 2020లో కోవిడ్ ఆరంభమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కరీనా కపూర్ తల్లి కావడం, కీలక పాత్ర చేయాల్సిన విజయ్ సేతుపతి తప్పుకోవడం వంటివి కూడా షూటింగ్కి ఆటంకం కలిగించాయి. విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్రను నాగచైతన్య చేశారు. ఎట్టకేలకు షూటింగ్ పూర్తయ్యాక విడుదల చేయాలనుకున్న ప్రతిసారీ లాక్డౌన్ వల్ల లాల్ రావడానికి కుదరలేదు. ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నామని ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. మరి... ఈసారి చెప్పిన తేదీకి లాల్ వచ్చేస్తాడా చూడాలి మరి. జీరో ఎఫెక్ట్ ఆమిర్లానే షారుక్ ఖాన్ది కూడా సేమ్ స్టోరీ. షారుక్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘జీరో’ (2018) చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ ఎఫెక్ట్తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఫైనలైజ్ చేయడం కోసం చాలా ఎక్కువ టైమే తీసుకున్నారు షారుక్. కథ నిర్ణయించుకునే విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకున్నారు. ఎందరో దర్శకుల దగ్గర కథలు విని, ఫైనల్గా ‘వార్’లాంటి హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్కు చాన్స్ ఇచ్చారు షారుక్. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘పటాన్’ చిత్రం రిలీజ్ ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాది జనవరి 23కి వాయిదా పడింది. ‘‘బాగా ఆలస్యం అవుతోందని నాకు తెలుసు. కానీ ఈసారి జనవరి 23ని గుర్తుపెట్టుకోండి’’ అంటూ ‘పటాన్’ రిలీజ్ డేట్ సందర్భంగా షారుక్ అన్నారు. ఇదిలా ఉంటే.. మాధవన్ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’(జూలై 1 రిలీజ్), రణ్బీర్ కపూర్ ‘బ్రహ్మస్త్ర’ (సెప్టెంబర్ 9న రిలీజ్) చిత్రాల్లో షారుక్ అతిథిగా వెండితెరపై కనిపించనున్నారు. ఇది ఆయన అభిమానులు కాస్త హ్యాపీ ఫీలయ్యే విషయం. బ్రహ్మాస్త్రం అంటూ... 2018లో సంజయ్దత్ బయోపిక్ ‘సంజు’తో మంచి హిట్టే అందుకున్నారు రణ్బీర్ కపూర్. కానీ ఇప్పటివరకు అంటే నాలుగు సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్పై రణ్బీర్ మిస్సయ్యారు. ‘సంజు’ తర్వాత రణ్బీర్ చేసిన ‘బ్రహ్మస్త్ర’ మైథాలజీ ట్రయాలజీ ఫిల్మ్ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఎక్కువ టైమ్ పట్టింది. 2020లో రణ్బీర్ తండ్రి, ప్రముఖ నటులు రిషి కపూర్ మరణించడం, ఇదే సమయంలో కోవిడ్ ఎఫెక్ట్ వంటి అంశాలతో ‘బ్రహ్మస్త్ర’ షెడ్యూల్స్ తారుమారయ్యాయి. ఫైనల్గా ఈ సినిమా తొలి భాగం ‘బ్రహ్మస్త్ర’ : శివ’ ఈ సెప్టెంబరు 9న విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు చేశారు. అలాగే ‘బ్రహ్మాస్త్రం’ అంటూ తెలుగులో వస్తున్న ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి సమర్పకులు కావడం విశేషం. (చదవండి: మానసిక వేదన, సూసైడ్ చేసుకుందామనుకున్నా) ఈ ఐదుగురే కాదు.. కోవిడ్ కారణంగా, వేరే కారణాల వల్ల మరికొందరు బాలీవుడ్ హీరోలు సిల్వర్ స్క్రీన్కు మూడు నాలుగేళ్లపాటు దూరమయ్యారు. ఇప్పుడు కోవిడ్ పోయిందోచ్ అంటున్నారు. సో... గ్యాప్ కూడా పోతుందనుకోవచ్చేమో! -
రాఖీభాయ్తో పోరుకు విజయ్, షాహిద్ సై.. విజయం ఎవరిది?
ఏప్రిల్ 14న తుపాన్ వేగంతో వస్తున్నాడు రాఖీభాయ్. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ అభిమానులను అదే రోజు పలకరించనున్నాడు. మొదటి భాగాన్ని మించి రెండో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పడం.. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ఉండడంతో కేజీఎఫ్2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే రాఖీభాయ్ని ఢీ కొట్టేందుకు ఇటు విజయ్, అటు షాహిద్ కపూర్ రెడీ అవుతున్నారు. కేజీఎఫ్ 2 విడుదలకు ఒక్క రోజు ముందే.. అంటే ఏప్రిల్ 13న విజయ్ కొత్త చిత్రం ‘బీస్ట్’ థియేటర్స్లోకి రాబోతుంది. పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రంలోని ‘అరబిక్ కత్త’సాంగ్ బ్లాక్ బస్టర్ కావడం, ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా బంపర్ హిట్ కొట్టడంతో రాఖీభాయ్ వసూళ్లకు బీస్ట్ పెద్ద ఎత్తున గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు బాలీవుడ్ లో రాఖీభాయ్ స్పీడ్ కు గట్టిగానే బ్రేకులు వేస్తానంటున్నాడు షాహిద్ కపూర్. గతంలో నాని నటించిన సూపర్ హిట్ ఫిల్మ్, అతని కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసాడు షాహిద్ కపూర్.తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని ఇంకాస్త బెటర్ గా, బాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించే విధంగా తెరకెక్కించాడు.రీసెంట్ గా రిలీజైన న్యూ ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేస్తోంది. కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతున్న రోజే(ఏప్రిల్ 14) జెర్సీ కూడా థియేటర్స్ లోకి వస్తోంది.కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ కనిపిస్తున్న సినిమా కావడంతో, కేజీఎఫ్ 2 కలెక్షన్స్ కు ఈ చిత్రం కూడా కొంత కోత పెట్టే అవకాశాలు బాగానే ఉన్నాయి. చదవండి: ఆన్సర్ షీట్లో 'పుష్ప' డైలాగ్స్ రాసిన టెన్త్ స్టూడెంట్ విజయ్ బీస్ట్ గా మారినా,షాహిద్ కపూర్ బ్యాట్ తో క్రికెట్ ఆడినా తాను సృష్టించే విధ్వంసం ముందు తక్కువే అంటున్నాడు రాఖీభాయ్.ప్రశాంత్ నీల్ లాంటి మెగా మేకర్ అండతో,కనివిని ఎరుగని వయలెన్స్ తో కేజీఎఫ్ 2 ఆడియెన్స్ ను మైండ్ బ్లాక్ చేస్తోందనే నమ్మకంగా ఉన్నాడు హీరో యశ్. పైగా అధీర పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తుండటం తనకు అదనపు బలంగా చెప్పుకొస్తున్నాడు రాఖీభాయ్. మరి ఈ బాక్సాఫీస్ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. -
నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్
Shahid Kapoor Recalls Wife Mira Reaction After Watching Udta Punjab: విభిన్న సినిమాలు, నటనతో అలరిస్తున్నాడు బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్. తాజాగా షాహిద్ నటిస్తున్న చిత్రం 'జెర్సీ'. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో బిజీగా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ భార్య మీరా రాజ్పుత్ తనను ఓ సినిమా చూసి వదిలేద్దామనుకుందంటూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. 'ఉడ్తా పంజాబ్' చిత్రంలో తన నటనను చూసి తను రాంగ్ పర్సన్ని పెళ్లి చేసుకున్నానని మీరా భావించినట్లు షాహిద్ పేర్కొన్నాడు. 'మీరా సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మాకు వివాహం జరిగిన ప్రారంభంలో నా ఉడ్తా పంజాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్కు ముందు నటీనటుల కోసం ఎడిటింగ్ గదిలో ప్రత్యేక షో వేశారు. నేను నాతోపాటు మీరాను కూడా తీసుకెళ్లాను. సినిమా చూస్తున్నంతా సేపు మీరా మాములుగానే ఉంది. కానీ మూవీ ఇంటర్వెల్ సీన్ వచ్చాకా మీరా ప్రవర్తన చూసి షాక్ అయ్యాను. తను నా పక్క నుంచి లేచి దూరంగా వెళ్లి నిల్చుంది. నేను ఏమైందని అడిగా. దానికి తను 'నువ్ ఇలాంటి వాడివా ? నీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా ? నువ్ ఆ టామీ సింగ్లాంటివాడివా? నీతో నేనింకా కలిసి ఉండను. నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నేను వెళ్లిపోతా.' అని చెప్పింది. తన మాటలకు ఒక్కసారిగా షాకయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. తర్వాత తనకు అదంతా సినిమా. అందులోనే అలా నటిస్తారని అర్థమయ్యేలా చెబితే గానీ మీరా కుదుటపడలేదు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను.' అని షాహిద్ చెప్పుకొచ్చాడు. షాహిద్, మీరా 2015లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కుమార్తె మిషా, కుమారుడు జైన్ ఉన్నారు. -
విలాసవంతమైన కారు కొన్న స్టార్ హీరో.. ధర ఎంతంటే ?
బాలీవుడ్ చాక్లెట్ బాయ్, కబీర్ సింగ్ షాహిద్ కపూర్ కొత్త కారును కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలను, వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. షాహిద్ కొన్న కొత్త కారు మెర్సిడెస్ మేబాచ్ ఎస్-580. దీని విలువ సుమారు రూ. 3 కోట్ల దాకా ఉంటుందని అంచనా. మెర్సిడెస్ కారులో డ్రైవ్ చేస్తున్న వీడియోను ఇన్స్టా గ్రామ్లో షేర్ చేశాడు షాహిద్. దీనికి 'ఫాలింగ్ బ్యాక్ బ్యాచ్' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Auto Hangar Mercedes-Benz (@autohangar) అనేక మంది బీటౌన్ తారలు, అభిమానులు, నెటిజన్లు ఈ పోస్ట్కు కామెంట్ పెడుతూ అభినందనలు తెలుపుతున్నారు. 'ఏప్రిల్లో మేబాచ్' అని ర్యాప్ సింగర్ బాద్ షా కామెంట్ చేశాడు. షాహిద్ వద్ద ఇదివరకే అనేక విలాసవంతమైన కార్లు ఉన్నాయి. జాగ్వార్, రేంజ్ రోవర్, మెర్సిడెస్, పోర్షే వంటి తదితర బ్రాండ్లు ఉన్నాయి. కాగా షాహిద్ కపూర్ ప్రస్తుతం జెర్సీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం తెలుగు 'జెర్సీ' సినిమాకు రీమేక్గా తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) -
బాలీవుడ్ నుంచి బేబమ్మకి పిలుపు.. ఆ స్టార్ హీరోతో ఛాన్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కృతీ శెట్టికి బాలీవుడ్ నుంచి కబురొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. నాని హీరోగా, కృతీ శెట్టి, సాయిపల్లవి హీరోయిన్స్గా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 24న విడుదలై మంచి విజయం సాధించింది. కాగా ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందని బాలీవుడ్ టాక్. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారట. ఒరిజినల్లో కృతీ శెట్టి చేసిన పాత్రనే హిందీ రీమేక్లోనూ చేయాలని షాహిద్ అండ్ కో ఆమెను సంప్రదించారట. హిట్మూవీకి రీమేక్ కావడం, పైగా షాహిద్ వంటి స్టార్తో బాలీవుడ్ ఎంట్రీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కృతి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
స్టార్ హీరో ఇంట పెళ్లి సందడి, ఫొటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అతడి సోదరి సనా కపూర్ కొత్త పెళ్లికూతురిగా ముస్తాబైంది. నటుడు మనోజ్- సీమ దంపతుల కుమారుడు మయాంక్తో శుక్రవారం ఏడడుగులు నడిచింది. ఈ సందర్భంగా కొత్త జంట సనా- మయాంక్ల ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇందులో మెహందీ ఫొటోల్లో సనా ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. సంగీత్లో డ్యాన్సులు చేస్తూ పెళ్లి సందడిని రెట్టింపు చేసింది కపూర్ ఫ్యామిలీ. షాహిద్- మీరా రాజ్పుత్ల హడావుడి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా సుప్రియ పాఠక్, పంకజ్ కపూర్ల గారాల కూతురు సనా గతంలో షాందార్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన సోదరుడు షాహిద్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటించారు. View this post on Instagram A post shared by Sanah Kapur (@sanahkapur15) View this post on Instagram A post shared by Vivaan Shah (@thesurrealvivaanshah) View this post on Instagram A post shared by Vivaan Shah (@thesurrealvivaanshah) View this post on Instagram A post shared by Mayank Pahwa (@mayankpahwa_13) View this post on Instagram A post shared by Vivaan Shah (@thesurrealvivaanshah) -
కొత్త కారు కొన్న బ్యూటీఫుల్ కపుల్.. దాని విలువ కోట్లలోనే
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. దీంతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది షాహిద్, మీరా. ఇటీవల షాహిద్ పుట్టినరోజు సందర్భంగా తన ఇన్స్టా అకౌంట్లో మీరా బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టింది. ఈ జంట పెట్టె పోస్ట్లను అభిమానులు #కప్గోల్స్గా పిలుస్తారు. అలాగే వారిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉంటుందని ఫ్యాన్స్ పొగుడుతూ ఉంటారు. అయితే సోమవారం (ఫిబ్రవరి 28) షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్ ఒక కారు నుంచి దిగిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే షాహిద్, మీరా దిగిన కారు విలువ సుమారు రూ. 2.77 కోట్లు ఉంటుందని అంచనా. వారు ఈ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ కారును కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త మెర్సిడెస్ ఎస్-క్లాస్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.11 కోట్ల నుంచి రూ. 2.79 కోట్ల వరకు ఉంటుంది. రాయల్ లుక్లో కనిపించిన ఈ బ్లాక్ మెర్సిడేస్ను డెలీవరి చేసేందుకు కంపెనీ నిర్వాహకులు వచ్చారు. ఈ కారును తీసుకునేందుకు షాహిద్, మీరా వచ్చే క్రమంలో ఫొటోగ్రాఫర్లకు చిక్కారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలి.. హీరో భార్య
Shahid Kapoor Wife Mira Rajput Birthday Wishes To Him: విభిన్న సినిమాలు, నటనతో అలరిస్తోన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ఫిబ్రవరి 25న షాహిద్ పుట్టిన రోజు సందర్భంగా బీటౌన్ తారల నుంచి శుభాకాంక్షల జల్లులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా షాహిద్ భార్య మీరా రాజ్పుత్ ప్రేమతో కూడిన విషెస్ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేసింది. మీరా తన ఇన్స్టాగ్రామ్లో 'ఇలాంటి సాయింత్రాలు మనిద్దరం కలిసి మరెన్నో జరుపుకోవాలి' అని క్యాప్షన్ రాస్తూ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలలో షాహిద్ తెల్లటి టీషర్ట్, డెనిమ్ టాప్ వేసుకోగా, మీరా ఫ్లోరల్ ప్రింట్తో బ్లాక్ ఆఫ్ షోల్డర్ దుస్తులను ధరించింది. మీరా అందంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటే షాహిద్ ఆమెను ప్రేమగా చూస్తున్నాడు. అలాగే సూర్యుడు అస్తమిస్తుండగా దిగిన మరో ఫొటోను పంచుకుంది మీరా. షాహిద్ బర్త్డే సెలబ్రేషన్స్ను తన ఇంట్లో నిరాడంబరంగా జరుపుకున్నాడు. ఈ సెలబ్రేషన్స్కు ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వానీ హాజరైనట్లు సమాచారం. View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) -
ఏప్రిల్ 14న రాఖీభాయ్ తో షాహిద్ బాక్సాఫీస్ ఫైట్
-
'జెర్సీ' విడుదల ఇప్పట్లో లేనట్లే.. సినిమా మళ్లీ వాయిదా
Jersey Movie Again Postponed From December 31: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదల తేదిని డిసెంబర్ 31, 2021కి ఖరారు చేశారు. అయితే తాజాగా డిసెంబర్ 31న కూడా జెర్సీ చిత్రం విడుదలకు నోచుకోనట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడినట్లు ప్రముఖ చిత్ర పరిశ్రమ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్లో తెలిపాడు. 'ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్.. జెర్సీ చిత్రం డిసెంబర్ 31 విడుదల కావట్లేదు. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వినిపిస్తున్న మాటల్లో నిజం లేదు.' అని ట్వీట్ చేశారు. క్రికెటర్గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే ఎమోషనల్ అంశాలతో తెరకెక్కించిన సినిమా జెర్సీ. #Xclusiv... #BreakingNews... #Jersey POSTPONED... WON'T RELEASE ON 31 DEC... New date will be announced shortly... Industry talk that #Jersey will be Direct-to-OTT release is FALSE. pic.twitter.com/1MBwsSdWCC — taran adarsh (@taran_adarsh) December 28, 2021 ఇదీ చదవండి: 83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు -
సెట్లో గాయపడ్డ యంగ్ హీరో, 25 కుట్లు, 2 నెలలు షూటింగ్కు బ్రేక్..
Shahid Kapoor Opens Up On His Horrific Lip Injury In Jersey Shooting Set: షూటింగ్స్లో ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటివల్ల కథానాయకులు తీవ్రంగా గాయపడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువడా యాక్షన్ చిత్రాల్లో పోరాట సన్నివేశాల సమయంలో హీరోలు గాయపడటం సహజమే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా ఇటీవల షూటింగ్ సెట్లో గాయపడినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చదవండి: శివన్న అని పునీత్ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తోంది: శివ రాజ్కుమార్ హిందీ ‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్ ప్రాక్టిస్ చేస్తుండగా తీవ్రంగా గాయపడినట్లు షాహిద్ పేర్కొన్నారు. గ్రౌండ్ క్రికెట్ ఆడుతుండగా తన కింది పెదవికి బాల్ బలంగా తాకడంతో 25 కుట్లు పడ్డాయని చెప్పాడు. కాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలని తపించే క్రికెటర్గా షాహిద్కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా తాలూకు ప్రయాణం గురించి ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షాహిద్ కపూర్ ముచ్చటించాడు. చదవండి: నాగ్ సరసన మెహరీన్ ఈ సందర్భంగా ‘క్రికెటర్ పాత్ర కోసం సన్నద్ధమవుతున్న సమయంలో ఓ రోజు బాల్ బలంగా తాకడంతో నా క్రింది పెదవి చిట్లింది. 25 కుట్లు పడ్డాయి. ఈ గాయం వల్ల నా పెదవి ఎప్పటికీ పనిచేయదని భయపడ్డా. కదిలించడమే కష్టమైంది. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఈ ప్రమాదం కారణంగా రెండు నెలల పాటు షూటింగ్ను ఆపివేశాం’ అని గుర్తుచేసుకున్నారు. నాని కథానాయకుడిగా తెలుగులో రూపొందిన ‘జెర్సీ’కి రీమేక్ ఇది. హిందీలో అల్లు అరవింద్ సమర్పణలో దిల్రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్గిల్ నిర్మిస్తున్నారు. చదవండి: ఆ సినిమా తర్వాత బిచ్చగాడినయ్యా: స్టార్ హీరో View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) -
బాలీవుడ్లోకి బన్నీ.. మల్టీస్టారర్కు గ్రీన్ సిగ్నల్!
టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంతవరకు మల్టీస్టారర్ మూవీ చేయలేదు. కాని బాలీవుడ్ లో మార్కెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తుండటంతో అక్కడ ఒక మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ బీటౌన్ ను షేక్ చేస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో హిందీ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో బన్నితో పాటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ తో జెర్సీ హిందీ రీమేక్ నిర్మించాడు అల్లు అరవింద్. ఈ మూవీని డిసెంబర్ 31న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. షాహిద్ కపూర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లోనే డెడ్లీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట. రాబోయే రెండు మూడు ఏళ్లలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఒక వైపు కబీర్ సింగ్ , మరోవైపు పుష్ప రాజ్ స్క్రీన్ పై ఎలాంటి సినిమాలో కనిపించనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. -
ఆ సినిమా తర్వాత బిచ్చగాడినయ్యా: స్టార్ హీరో
Shahid Kapoor: 200-250 కోట్ల బడ్జెట్తో సినిమాలు తీసే పలువురు చిత్ర నిర్మాతల వద్దకు వెళ్లి తనతో ఓ సినిమా నిర్మించాలని ఓ బిచ్చగాడివలే అడుకున్నానని బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తెలిపారు. షాహిద్ నటించిన హింది ‘జెర్సీ’ మూవీ ట్రైలర్ను చిత్ర బృందం మంగళవారం రిలీజ్ చేసింది. అయితే ఈ సందర్భంగా ‘బాలీవుడ్ లైఫ్’ అనే మీడియాతో షాహిద్ మాట్లాడుతూ.. తాను కబీర్ సింగ్ మూవీ విడుదలైన తర్వాత పలువురు నిర్మాతల దగ్గరకు రోజూ వెళ్లానని తెలిపాడు. వారంతా 200-250 కోట్ల బడ్జెట్తో సినిమాలు నిర్మించే పెద్ద నిర్మాతలని అన్నాడు. అయితే గతంలో తాను అటువంటి భారీ బడ్జెట్ క్లబ్లోకి చేరలేదని, కానీ ప్రస్తుతం జెర్సీతో ఆ ఫీట్ సాధించడంతో.. అది చాలా కొత్తగా అనిపిస్తోందని తెలిపాడు. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15-16 ఏళ్లు అవుతున్నా.. భారీ బడ్జెట్ మూవీ చేయలేదని అన్నాడు. చివరికి ఇలా సాధ్యమైందని తెలిపాడు. ఇది ఎక్కడివరకు వెళుతుందో తెలియదని.. కానీ తనకు చాలా కొత్తగా ఉందని పేర్కొన్నాడు. షాహిద్ నటించిన తెలుగు రీమేక్ ‘జెర్సీ’ డిసెంబర్ 31న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాను కూడా రూపొందించారు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మంగళవారం విడుదలైన ‘జెర్సీ’ మూవీ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. -
ట్రెండింగ్లో 'జెర్సీ' ట్రైలర్.. మరో హిట్టు గ్యారెంటీ!
Jersey Trailer Is Out: ‘అర్జున్రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్సింగ్’ అనంతరం షాహిద్ కపూర్ చేస్తున్న మరో తెలుగు రీమేక్ జెర్సీ. నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మూవీని అదే పేరుతో బాలీవుడ్లోనూ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాను కూడా రూపొందించారు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా జెర్సీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా వేస్తే వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్31న థియేటర్స్లో సందడి చేయనుంది. -
ఒక్క రాత్రికి మూడు లక్షలు.. ఊహల్లో తేలిపోతున్న స్టార్ హీరో భార్య
Shahid Kapoor Wife Mira Rajput Share Video: బాలీవుడ్ అర్జున్ రెడ్డి షాహిద్ కపూర్ భార్య సతీమణి మీరా రాజ్పుత్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. నాకెంతో ఇష్టమైన మాల్దీవుల్లో మా విహార యాత్రను చూసేయండి అంటూ వారి హాలీడే ట్రిప్ విశేషాలను పంచుకుంది. ఈ వీడియోలో తీరంలోని అందమైన విల్లాను చూపిస్తూ తాము బస చేసింది అక్కడేనని చెప్పకనే చెప్పింది. అలాగే తీరం తనకు ఎంతో దూరంలో లేదని చెప్తూ సముద్ర అలలను సైతం షూట్ చేసింది. ఈ వీడియోలో ఆమె చూపించిన విల్లాలో ఉండాలంటే ఒక్క రాత్రికే సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చవుతుందట! ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ మళ్లీ ఆ రోజులు కావాలని, ఆ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్లాలని ఉందంటూ ఊహల్లో తేలిపోయింది మీరా. కాగా గత నెలలో షాహిద్ కుటుంబం మాల్దీవులను చుట్టేసిన విషయం తెలిసిందే. ట్రిప్ను ఎంజాయ్ చేసి తిరిగి వచ్చినప్పుడు మీరా డ్రెస్సింగ్పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇదిలా వుంటే షాహిద్, మీరా 2015లో జూలై 7న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016 ఆగస్టు 26న కూతురు మిషా జన్మించగా 2018 సెప్టెంబర్ 5న కొడుకు జైన్ జన్మించాడు. View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) -
బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ భార్యపై ట్రోలింగ్
నెట్ వాడకం పెరిగి సోషల్ వాడకం విస్తృతమైన ఈ తరుణంలో ఏ పని చేసిన ట్రోలింగ్ గురవుతున్నారు సెలబ్రిటీలు. తాజాగా బాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసిన బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్ విపరీతంగా ట్రోలింగ్ గురైంది. ఇటీవలే ఈ జంట పిల్లలతో కలిసి మాల్దీవులలో ఎంజాయ్ చేసింది. తాజాగా వారు ఆ టూర్ నుంచి తిరిగి వస్తూ ముంబై విమానాశ్రయంలో మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో తీసిన వీడియోని ఓ మీడియా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అందులో షాహిద్, పిల్లలు పుల్ డ్రెస్లో ఉన్నారు. అయితే మీరా మాత్రం డెనిమ్ షార్ట్ వేసుకొని ఉంది. దీంతో భర్త, చివరికి చిన్న పిల్లలు కూడా పూర్తిగా బట్టలు ధరించారు కానీ భార్య మాత్రం పొట్టి బట్టలు వేసుకుంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘నాకు పురుషులపై రోజు రోజుకి గౌరవం పెరిగిపోతోంది. ఎందుకంటే వారు పూర్తిగా దుస్తులు ధరించి సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. పురుషులందరికీ వందనాలు’ అంటూ తీవ్రంగా కామెంట్ పెట్టాడు మరో నెటిజన్. అయితే బాలీవుడ్ స్టార్ భార్య అయిన మీరాకి ఇన్స్టాగ్రామ్లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ట్రోలింగ్ గురవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ స్టార్ వైఫ్ని ట్రోల్ చేశారు నెటిజన్లు. అయినప్పటికీ ఎప్పుడూ స్పందించలేదు మీరా. ఈసారి ట్రోలింగ్పై రెస్పాండ్ అవుతుందో లేక ఎప్పటిలాగే ఏం పట్టించుకోకుండా ఉండిపోతుందో.. చూడాలి. చదవండి: శృంగారం గురించి మాట్లాడాలంటే ఇక్కడి జనాలు భయపడతారు: దంగల్ నటి View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
రోడ్డుపై కుప్పలుకుప్పలుగా రూ.2 వేల నోట్లు.. షాహిద్పై నెటిజన్స్ ఫైర్
రోడ్డుపై డబ్బులు కనిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా? టక్కున వెళ్లి గమ్మున జేబులో వేసుకొని వెళ్లిపోతారు. అలాంటిది రోడ్డుపై కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు.. అది కూడా రూ.2000 నోట్ల కట్టలు పడి ఉంటే..? ఎవరు ఊరుకుంటారు? అంతా పరుగెత్తుకొచ్చి ఆ నోట్లను ఏరుకునే పనిని మొదలు పెడతారు. సరిగ్గా ఇలాంటి సంఘటననే ముంబైలోని ఓ ప్రాంతంలో జరిగింది. రోడ్డుపై కుప్పలుకుప్పలుగా రూ.2 వేల నోట్లు పడి ఉండడంతో.. వాటిని ఏరుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. తీరా అవన్ని నకిలీ నోట్లు అని తెలియడంతో నిరాశతో వెనుదిరిగారు. కొంతమంది మాత్రం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్పై ఫైర్ అయ్యారు. (చదవండి: సోనుసూద్ ట్వీట్, మండిపడుతున్న నెటిజన్లు) నోట్ల కట్టలకు షాహిద్కు సంబంధం ఏంటనేగా మీ అనుమానం? ఆ నకిలీ డబ్బంతా షాహిద్ కపూర్ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘సన్నీ’షూటింగ్ కోసం ఉపయోగించినదే. ‘ఫ్యామిలీ మేన్’సిరీస్ తర్వాత రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ ‘సన్నీ’.ఈ సిరీస్లో హీరోగా షాహిద్ కపూర్ నటించగా, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. (చదవండి: అన్ని భయాలను జయించా.. తన అరుదైన వ్యాధి గురించి నటి వెల్లడి) ఈ సిరీస్ షూటింగ్లో భాగంగా ఓ యాక్సిడెంట్ సన్నివేశం ఉంది. ఆ సమయంలో రూ. 2 వేల నోట్లు రోడ్డుపై పడిపోవాలి. దీని కోసం నకిలీ నోట్లను ఉపయోగించింది చిత్ర యూనిట్. కానీ షూటింగ్ అయిపోయాక వాటిని తీసేయడం మర్చిపోయారు. దీంతో ఆ ప్రాంతంలోకి కొంతమంది అవి నిజమైన డబ్బులే అనుకొని ఏరుకునేందుకు ఎగబడ్డారు. తర్వాత అసలు విషయం తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీ మహాత్ముడు ఫొటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. షూటింగ్కి చిత్రబృందం అనుమతి తీసుకుందని, అయితే గాంధీజీకి అవమానం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. చిత్ర యూనిట్ మాత్రం తాము వినియోగించిన నకిలీ నోట్లను అక్కడ నుంచి తొలగించామని, ఇప్పుడున్న నోట్లు ఎలా వచ్చాయో తెలియదని చెప్పినట్లు సమాచారం. -
Samantha: ఆమెతో కలిసి నటించడమే నా కల: బాలీవుడ్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ టాలీవుడ్ హీరోయిన్ సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం ట్విటర్లో లైవ్ సెషన్ నిర్వహించి అభిమానులతో ముచ్చటించాడు షాహిద్. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో షాహిద్ రాజ్ అండ్ డీకేలతో కలిసి చేసిన తన వెబ్ సిరీస్, జెర్సీ మూవీలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ గురించి అడిగాడు. దీంతో షాహిద్ ఈ వెబ్ సిరీస్ తనకు బాగా నచ్చిందని ముఖ్యంగా ఇందులో సమంత నటనకు ఫిదా అయ్యానని చెప్పాడు. చదవండి: పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్పై పోసాని సంచలన వ్యాఖ్యలు అంతేగాక ‘ఈ సిరీస్ చూస్తున్నంత సేపు తనతో, తన నటనతో ప్రేమలో పడిపోయాను. చెప్పాలంటే ఈ షో మొత్తంలో సమంత నటన నన్ను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి పెరిగింది. ఇప్పుడు తనతో ఓ సినిమా చేయడమే నా కల’ అంటూ సామ్పై షాహిద్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా రాజ్-డీకే దర్శకత్వలో క్రైం థ్రిల్లర్గా తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత నెగిటివ్ షెడ్స్ ఉన్న రాజీ పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ కూడా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక షాహిద్ కపూర్ సినిమాల విషయానికొస్తే.. రాజ్ అండ్ డీకేలతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ షూటింగ్ను కూడా పూర్తి చేసుకుంది. అలాగే అతడు నటించి జెర్సీ మూవీ రీమేక్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుందని, ఈ ఏడాది డిసెంబర్ 31 విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు షాహిద్ తెలిపాడు. చదవండి: మందు గ్లాస్తో పూరికి బర్త్డే విషెస్ తెలిపిన చార్మీ -
అర్జున్కపూర్-షాహిద్తో సోనాక్షి బ్రేకప్ స్టోరీ
థప్పడ్ సే డర్ నహీ లగ్తా సాబ్.. ప్యార్ సే లగ్తా హై! (చెంప దెబ్బంటే భయం లేదు సర్.. ప్రేమంటేనే భయం!) డైలాగ్తో పాపులర్ అయిన కథానాయిక.. అర్థమైపోయి ఉంటుంది ఎవరో?! అవును.. సోనాక్షీ సిన్హా. ఈ వారం ‘మొహబ్బతే’కి నాయిక కూడా! ఆమె ప్రేమ జీవితం.. అందులో వైఫల్యం.. సాక్ష్యాధారాలతో ఎక్కడా లేవు. హిందీ, ఇంగ్లిష్ పత్రికలు, వెబ్ మీడియాలో వచ్చిన వార్తలు.. వంటి రూమర్స్ని కూర్చి ఇస్తున్న కథనం ఇది. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్. రాజ్కుమార్’ సినిమా గుర్తుందా? అందులో సోనాక్షీ సిన్హా, షాహిద్ కపూర్ హీరోహీరోయిన్లు. ఆ సెట్స్లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పుకారు. ‘నా జీవితంలో ఇద్దరే ఇద్దరిని ప్రాణప్రదంగా ప్రేమించాను’ అని షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఇద్దరిలో ఒకరు కరీనా.. ఇంకొకరు సోనాక్షీ అనే నిర్ధారణకొచ్చారు షాహీద్, సోనాక్షీ జంటను అభిమానించే కొంతమంది. ఇందుకు కారణం లేకపోలేదు. ‘కాఫీ విత్ కరణ్ షో’లో ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి షాహిద్ కపూర్ ఆ సమయంలో తను ఎవరితోనైతే రిలేషన్లో ఉన్నాడో ఆ సహచరితో వచ్చేవాడని.. అలా సెకండ్ సీజన్లో కరీనా కపూర్, థర్డ్ సీజన్లో ప్రియాంక చోప్రా, ఫోర్త్ సీజన్లో సోనాక్షీ సిన్హా, చివరకు భార్య మీరా రాజ్పుత్తో వచ్చాడని కామెంట్ చేశాడు షో హోస్ట్ కరణ్ జోహార్. ఇదే విషయమై షాహిద్ను అడిగాడు కూడా.. ‘నువ్వు కరీనా, ప్రియాంకతో డేట్ చేశావ్ కదా.. సోనాక్షీతో కూడా డేటింగ్లో ఉన్నావని రూమర్స్ వినిపిస్తున్నాయి’ అని. కాదని తోసిపుచ్చలేదు షాహిద్ కపూర్. అంతేకాదు ‘ఆర్. రాజ్కుమార్’ సెట్స్లో షూటింగ్ తర్వాత సోనాక్షీ, షాహిద్ సరదాగా షికారుకెళ్లేవారని, పార్టీలూ చేసుకున్నారనీ బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. దీనికి ఉదాహరణగా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ‘షాహిద్ను ముద్దు పెట్టుకుంటున్న సోనాక్షీ సిన్హా’ ఫొటోను చూపిస్తారు. ఇదంతా నిజమే అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు ఎందుకు రాలేదో.. వాళ్లెందకు విడిపోయారో తెలియదు. కానీ వాళ్లిద్దరు మాత్రం విడివిడిగా ‘మేం మంచి స్నేహితులం.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ’ అని చెప్తారు మీడియా ఎప్పుడు ప్రశ్నించినా! ప్యాకప్ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్ సోనాక్షీ సిన్హా, అర్జున్ కపూర్ జంట కలసి నటించిన ‘తేవర్’ సినిమా షూటింగ్ అప్పుడే వాళ్లు ప్రేమలో పడ్డారని బాలీవుడ్ సినిమా పత్రికల కథనం. షూటింగ్ ప్యాకప్ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్, ముంబై శివారులోని థియేటర్లలో సినిమాలకూ వెళ్లేవారట. ఆ టైమ్లో పాపరాజీ కెమెరాలకూ చిక్కారనీ మీడియా కవరేజ్. అయితే ‘తేవర్’ సినిమా పూర్తవడంతోనే వీళ్ల ప్రేమా ముగిసిపోయిందనీ బాలీవుడ్ మాట. ఈ ఇరువురి మనస్తత్వాల్లోని వైరుధ్యమే ఆ బ్రేకప్కి రీజన్ అని ఇద్దరి సన్నిహితులు చెప్తారు. సోనాక్షీది అలాంటి తత్వమే.. ‘సోనాక్షీ చాలా ఎమోషనల్. ఏ ఫీలింగ్స్నూ దాచుకోలేదు. బేషరతుగా ప్రేమిస్తుంది. అర్జున్ కపూర్ ఇందుకు కాస్త భిన్నం. అతను గుంభనంగా ఉంటాడు. సోనాక్షీ స్ట్రాంగ్ ఎమోషన్స్ను సంభాళించలేకపోయాడు’ అని ఒక సోర్స్ కామెంట్. ‘ప్రేమ విషయంలో సోనాక్షీది సాధారణ అమ్మాయిల తత్వమే. అర్జున్ చుట్టే తన ప్రపంచాన్ని అల్లుకుంది. ఇది అర్జున్ను ఊపిరాడనివ్వకుండా చేసింది. ఏమైనా వాళ్ల బ్రేకప్కు ఆ ఇద్దరిలో ఎవరినీ బ్లేమ్ చేయలేం.. అదలా జరిగిపోయింది అంతే!’ అంటూ ఇంకో సోర్స్ విశ్లేషణ. సోనాక్షీ మాత్రం.. ‘సినిమా రంగంలోని అబ్బాయిని కాకుండా కాస్త మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిని చూసుకోమని మా పేరెంట్స్ చెప్తుంటారు. చూద్దాం.. అలాంటి వ్యక్తి తారసపడితే తప్పకుండా నా ప్రేమ విషయాన్ని ముందు మీకే షేర్ చేస్తాను’ అంటూ మీడియా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంటూ ఉంటుందెప్పుడూ! ∙ఎస్సార్ -
పదేపదే అదే కామెంట్.. అందుకే షాహిద్కి విద్యాబాలన్ గుడ్బై
షా హిద్ కపూర్.. బాలీవుడ్ లవర్ బాయ్. తను కలిసి నటించిన కథానాయికలు అందరి (దాదాపుగా)తో ప్రేమలో పడ్డాడు.. కరీనా కపూర్తో అతని లవ్ స్టోరీ మినహా మిగిలినవన్నీ వదంతులుగానే ప్రచారమయ్యాయి. అందులో ఒకటే విద్యాబాలన్తో ఇష్క్. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా కిస్మత్ కనెక్షన్. దాంతోనే వీళ్ల పరిచయం మొదలైంది. ఆ షూటింగ్ జరుగుతుండగానే ఆ స్నేహం ప్రేమగా మారింది. ఎప్పటిలాగే ఆ ప్రేమ కబుర్లు పుకార్లుగా షికార్లు చేశాయి. వాటిని మీడియా కూడా క్యాచ్ చేసింది. వాటి కోసం పత్రికలు, చానెళ్లలో ప్రముఖ స్థానాన్ని, ప్రైమ్ టైమ్నూ కేటాయించింది. ఆ ప్రచారానుసారం షాహిద్, విద్యల ప్రేమ కిస్మత్ కనెక్షన్ విడుదల తర్వాత కొన్ని నెలల వరకూ సాగింది. ఇంక అది పెళ్లితో పదిలం కానుందని షాహిద్ సన్నిహితులు అనుకునేలోపే వాళ్ల బ్రేకప్ వార్త వినిపించింది. కారణం.. షాహిద్ దుందుడుకుతనం, దురుసు ప్రవర్తన అని తేల్చారు ఆ ఇద్దరి సన్నిహితులు. విద్యా బాలన్ వెయిట్ గురించి కామెంట్ చేశాడట షాహిద్. ఒక్కసారి కాదు పదేపదే. గౌరవం లేని ప్రేమ మనజాలదు.. అదెప్పటికైనా ఇద్దరి దారులను వేరు చేయక తప్పదు అని గ్రహించింది విద్యా. మారు మాట్లాడకుండా షాహిద్కు గుడ్ బై చెప్పింది... కెరీర్ మీద ప్రేమను పెంచుకుంది. ‘మనం ఇష్టపడేవారు మనల్ని చులకనగా చూస్తుంటే మనసు విరిగి పోతుంది. ఆ చనువును మన చేతకానితనంగా తీసుకుంటే తట్టుకోలేం. నా విషయంలో అదే జరిగింది. ఆ వ్యక్తి .. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు.. అతని పట్ల నాకున్న ఇష్టాన్ని అలుసుగా తీసుకొని నాలో లోపాలు వెదుకుతూ, వెటకారమాడుతుంటే భరించలేకపోయా. ఆ బంధం కన్నా నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం ముఖ్యమనుకున్నా. అందుకే ఆ రిలేషన్లోంచి బయటకు వచ్చేశా’ అని చెప్పింది విద్యాబాలన్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఆమె అలా అతని అహంకారాన్ని ప్రశ్నించినా షాహిద్కేమీ పట్టలేదు. ఆ బ్రేకప్ను చాలా తేలికగా తీసుకున్నాడు. అతనూ ఒక ఇంటర్వ్యూలో ‘నా కోస్టార్ట్స్లో ఇద్దరిని అమితంగా ఇష్టపడ్డాను. అందులో ఒకరు ఇష్టపడ్డ మనిషిని మోసం చేయడంలో ప్రసిద్ధులు’ అంటూ పేర్కొన్నాడు. ఆ ఇద్దరిలో ఒకరు కరీనా కపూర్, ఇంకొకరు ప్రియాంక చోప్రానా? లేక విద్యా బాలనా? ఈ ఇద్దరిలో ఆ రెండో వ్యక్తి ఎవరో మీడియాకు అంతుచిక్కలేదు. కాఫీ విత్ కరణ్లో... షాహిద్ కపూర్తో ఉన్న స్నేహం గురించి విద్యా బాలన్ను అడిగాడు కరణ్ జోహార్ తన ‘కాఫీ విత్ కరణ్’ షోలో. ‘కొంత కాలంగా ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న. ఆ పేరుతో నన్ను జత పర్చడం వినీ వినీ విసుగెత్తిపోయా. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలతో నటించా.. ఇంకెవరి పేరుతోనైనా జత చేయండి. అంటే నిప్పు లేందే పొగరాదని కాదు నా ఉద్దేశం.. ఆ నిప్పు రాజేసిన వాళ్ల పేరు చెప్పను అంటున్నానంతే’ అని కౌంటర్ ఇచ్చింది విద్యా బాలన్. ఆ తర్వాత ఇంకేదో సందర్భంలో ఇంకేదో పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎస్.. మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం ఒకప్పుడు. అది ఫ్రెండ్షిప్. అతను నా కోస్టార్’ అని బదులిచ్చింది. విద్యాబాలన్ ఇచ్చిన ఈ జవాబుతో షాహిద్ దగ్గర ఇంకేదో రాబట్టాలని చూసిన మీడియాకు నిరాశే ఎదురైంది ‘ఆమెకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ కూడా లేదు.. భవిష్యత్లో ఆమెతో నటించేదీ లేదు’ అన్న షాహిద్ సమాధానంతో. దీనికీ విద్యా కౌంటర్ ఇచ్చింది.. ‘ఫ్రెండ్షిప్కు అతను ఇచ్చే నిర్వచనమేంటో నాకు తెలీదు కానీ ‘కిస్మత్ కనెక్షన్’ సినిమా టైమ్లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మి. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉండింది.. అయితే అది ప్రేమ కాదు.. అందులో రొమాన్స్ లేదు. నాతో నటించకూడదు అనుకోవడం అతని ఇష్టం. అతని ఆ నిర్ణయంతో నాకేం ఇబ్బంది లేదు.. ఇండస్ట్రీలో అతనొక్కడే హీరో అయితే తప్ప’ అంటూ. ‘హమారీ అధూరీ కహానీ’ సినిమా ప్రమోషన్ సమయంలో విద్యా ‘నా కెరీర్లోనే కాదు జీవితంలోనే స్పెషల్ మూవీ ఇది. షూటింగ్ పూర్తయ్యాక ఒకరకమైన ప్రశాంతతను.. మనశ్శాంతినీ పొందాను. నా ప్రేమ కథ పూర్తయినట్టనిపించింది’ అని చెప్పింది. ఆ మాటలు షాహిద్ గురించేననే కథనాన్ని అల్లేసింది మీడియా. ఏమైనా షాహిద్కు విద్యా పట్ల ప్రేమ ఉండిందో లేదో తెలియదు కానీ విద్యా మాత్రం షాహిద్ను మనసారా ప్రేమించింది. దీనికి నిదర్శనం.. మీరా రాజ్పుత్ షాహిద్తో పెళ్లి నిశ్చయం కాగానే విద్యా గురించి ఆరా తీసిందట ఇంకా ఆమె మనసులో అతను ఉన్నాడేమోననే సందేహ నివృత్తి కోసం! కరీనా, విద్యా బాలన్తోనే కాదు షాహిద్ పేరు, ప్రేమ సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రా, అమృతా రావుతోనూ వినిపించాయి. ఎవరితోనూ సీరియస్గా లేడు షాహిద్.. అనే నిందా వినిపించింది.. కనిపించింది.. మీరా రాజ్పుత్ను జీవితభాగస్వామిగా చేసుకోవడంతో. -ఎస్సార్ -
ముంబైలో ఖరీదైన ఇల్లు కొన్న షాహిద్ దంపతులు, ధర ఎంతంటే!
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ అత్యధికంగా సంపాదిస్తున్న నటులలో ఒకడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న షాహిద్ ముంబైలో కొంత ఇంటిని కొనుగోలు చేశాడు. షాహిద్, అతడి భార్య మీరా రాజ్పుత్లు కలిసి కొంత ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నారట. ముంబై జూహులోని సముంద్ర సమీపంలోని ఓ అపార్టుమెంటులో విశాలవంతమైన ప్లాట్ను దాదాపు 56 కోట్ల రూపాయలకు ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. ఇది బాలీవుడ్ స్టార్ హీరోలైన అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ ఇంటికి సమీపంలోనే ఉండటం విశేషం. View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) ఈ అపార్టుమెంటులో 42, 43వ అంతస్థులో డూప్లెక్స్ ప్లాట్, సీ ఫెషింగ్ వారి ఇంటికి ప్రత్యేక ఆకర్షణ. తమ కొంత ఇటిని ఈ రోజు తన సోదరుడు ఇషాన్ ఖట్టర్, భార్య మీరాతో కలిసి సందర్శించిన ఫొటోలను షాహిద్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. కాగా తెలుగు అర్జున్ రీమేక్ కబీర్ సింగ్తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న షాహిద్ ప్రస్తుతం తెలుగు జెర్సీ రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం షాహిద్ రోహిత్ శర్మ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ను జరుపుకుంటోంది. View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) -
నా డిజిటల్ ఎంట్రీ గురించి భయంగా ఉంది: షాహిద్ కపూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ త్వరలో తన డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా సోమవారంతో షాహిద్ ‘కబీర్ సింగ్’ మూవీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అతడు ఇన్స్టాగ్రామ్లో లైవ్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో డిజిటల్ ఎంట్రీపై స్పందించాడు. ఓ అభిమాని తన ఓటీటీ ఎంట్రీపై ప్రశ్నించగా.. రాజ్, డీకేలతో కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం పనిచేయడం సంతోషంగా ఉన్నా అదే సమయంలో చాలా భయంగా కూడా ఉందంటూ సమాధానం ఇచ్చి షాహిద్ ఆశ్చర్యపరిచాడు. ‘నిజంగా నా డిజిటల్ ఎంట్రీపై భయపడుతున్న. ఎందుకంటే బిగ్ స్క్రీన్పై ప్రేక్షకుల ప్రేమ, అభిమానాన్ని అందుకున్న ప్రతి నటీనటులంతా ఓటీటీలో వారి ప్రశంసలు అందుకోవచ్చు లేదా అందుకోకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అలాగే సినిమాల్లో వచ్చిన సక్సెస్ ఓటీటీలో రాకపోవచ్చు. సినిమాలకు అక్కడ ఆదరణ ఉంటుందన్న గ్యారంటీ లేదు’ అంటూ వివరణ ఇచ్చాడు. కాగా రాజ్, డీకే దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్ సిరీస్తో షాహిద్ కపూర్ ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో షాహిద్ ‘ఆమెజాన్ ప్రైంలో తనకు ఇష్టమైన ఇండియన్ షో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్’. అదే సిరీస్ డైరెక్టర్స్తో నా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వారు నాకు కథ వివరించగానే నాకు నచ్చి ఒకే చెప్పాను. ఆ కథతో త్వరలోనే మీ ముందుకు వస్తున్నాను. అప్పటి వరకు వేచి ఉండలేక పోతున్న అంటూ రాజ్, డీకేలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. -
విద్యాబాలన్ వల్ల కరీనా, షాహిద్ విడిపోయారా?
కరీనా కపూర్, షాహిద్ కపూర్లకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. నటీనటులుగా ఎంత ఫేమసో ప్రేమికులుగానూ అంతే పాపులర్.. కిస్మత్ కనెక్షన్ ఫెయిలయ్యి ఈ ‘మొహబ్బతే’కు నాయికా, నాయకులుగా మారారు... కరీనా, షాహిద్.. ఇద్దరివీ పరస్పర విరుద్ధ మనస్తత్వాలు. ఆమె కొంచెం అహంభావి.. అతను కాస్త ఆకతాయి. ఆమెలోని ఆ అహం ఆత్మవిశ్వాసంగా అతణ్ణి ఆకర్శించింది. అతనిలోని ఆకతాయి తనం హీరోయిజమ్గా ఆమె మనసును దోచుకుంది. అలా ఆ ప్రేమ కథ మొదలైంది. సినిమాల్లో కరీనా.. షాహిద్ కన్నా సీనియర్. షాహిద్ తొలి సినిమా ‘ఇష్క్ విష్క్’చూసి అతనికి ఫ్యాన్ అయింది. ఎలాగైనా ఆ అబ్బాయిని కలవాలని ఉవ్విళ్లూరింది. కలిసింది. తొలి పరిచయంలోనే ఒకరినొకరు ఆకట్టుకున్నారు. వారం తర్వాత వాళ్ల డేటింగ్ మొదలైంది. ‘నువ్వంటే ఇష్టం’ అని తొలుత కరీనానే చెప్పింది షాహిద్తో. ‘నాకూ ఇష్టమే’ అని చెప్పాడు. షూటింగ్ ప్యాకప్ చెప్పగానే చట్టాపట్టాల్తోనే సాయంకాలాలు గడిచిపోయేవి. బాలీవుడ్లో ఈ ముచ్చట భలే సందడి చేసింది. అది కరీనా వాళ్లమ్మ బబిత, అక్కయ్య కరిష్మానూ చేరింది. కెరీర్ పట్ల కరీనా సీరియస్గా లేదని అర్థమైంది వాళ్లకు. ఆమె మెదడులోంచి షాహిద్ను తప్పించే ఆలోచనలు చేయసాగారు. అతనే హీరో.. తన ప్రేమను స్క్రీన్ మీదకూ తెచ్చింది కరీనా... తను చేసే సినిమాల్లో హీరోగా షాహిద్ను తీసుకొమ్మని నిర్మాతలను కోరుతూ. ఆమెకున్న డిమాండ్ దృష్ట్యా కాదనలేకపోయారు నిర్మాతలు. అలా వాళ్లిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ ‘ఫిదా’ విడుదలైంది. ఫ్లాప్ అయింది. అయినా కరీనా పట్టు వీడలేదు. ‘36 చైనా టౌన్’, ‘మిలేంగే మిలేంగే’, ‘చుప్ చుప్ కే’ చిత్రాలూ వచ్చాయి ఈ ఇద్దరి కాంబినేషన్లోనే. తెర మీద ఆ జంట ప్రేక్షకులను మెప్పించలేకపోతోందని గ్రహించారు దర్శకనిర్మాతలు. కరీనా తీరు బబిత, కరిష్మాకూ నచ్చలేదు. వ్యక్తిగతాన్ని కెరీర్తో ఎందుకు ముడిపెడుతున్నావ్? అది అన్ప్రొఫెషనల్’ అని బబిత కూతురిని హెచ్చరించింది కూడా. షాహిద్తో ప్రేమ బంధం తెంచుకొమ్మని అక్క కరిష్మా సలహా ఇచ్చింది చెల్లెలికి. జబ్ వి మెట్ నిజ జీవితంలోని వాళ్ల ప్రేమను తెర మీద ఎలా ప్రెజెంట్ చేయాలో.. ఆ జంటను ప్రేక్షకులు ప్రేమించేలా ఎలా చూపించాలో దర్శకుడు ఇమ్తియాజ్ అలీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. చక్కటి స్క్రీన్ ప్లేనూ అల్లుకున్నాడు. ‘జబ్ వి మెట్’ సినిమా రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది. తెర మీద ఆ జంటకు క్రేజ్ పెరిగింది. దాన్ని క్యాచ్ చేసుకుంది మీడియా.. ఆ రియల్ లవ్ స్టోరీని మళ్లీ ఒకసారి ప్రచురించి.. ప్రసారం చేసి. కానీ.. జబ్ వి మెట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే షాహిద్, కరీనాల ప్రేమ బంధం బలహీనపడసాగింది. ఇంట్లో కరీనాకు షాహిద్తో తెగతెంపులు చేసుకొమ్మనే పోరు ఎక్కువైంది. అదే సమయంలో షాహిద్ .. విద్యాబాలన్తో చనువుగా మెదులుతున్నాడనే వార్తలూ కరీనా చెవిన పడ్డాయి. షాహిద్ను నిలదీసింది. సమాధానం చెప్పలేదు. ఆమె మనసు ముక్కలైంది. ‘జబ్ వి మెట్’ సినిమా టైమ్లోనే కరీనా తషన్ సినిమా కూడా చేస్తోంది. ఆ సెట్స్లో సైఫ్ అలీఖాన్తో తన బాధను పంచుకుంది. షాహిద్తో దూరం పెరిగింది. జబ్ వి మెట్ సెట్స్లో ఆ ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. ఆ సినిమా క్రూ కూడా పసిగట్టింది ‘ఏదో జరిగింది’ అని. అయినా ఆ జంట సినిమా షూటింగ్కు అంతరాయం కలిగించకుండా చాలా ప్రొఫెషనల్గా వ్యవహరించి సినిమానూ పూర్తి చేశారని జబ్ వి మెట్ టెక్నీషియన్స్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. విధి భలే విచిత్రమైంది.. కరీనా, షాహిద్ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడ్డన్నాళ్లు తెర మీద వాళ్ల జంట ఫెయిల్ అయింది. తెర మీద యాక్సెప్టెన్స్ వచ్చేప్పటికి నిజ జీవితంలో వాళ్ల మధ్య ప్రేమ లేకుండా పోయింది. ఆ బ్రేకప్ వాళ్లిద్దరినీ చాన్నాళ్లపాటు వేధించింది. ఆ బాధను చూసి కాలానికీ జాలేసిందేమో.. ఆ జ్ఞాపకాల్లోంచి ఇద్దరినీ బయటపడేసింది. మావి డిఫరెంట్ పర్సనాలిలిటీస్. ఆ డిఫరెన్సే మా ఇద్దరిలో ఉన్న ఖాళీని పూరించింది. – షాహిద్ షాహిద్, నేను ఇంచుమించు ఒకే వయసువాళ్లవడం వల్ల త్వరగా కనెక్ట్ అయ్యాం. ఆ సేమ్ టెంపర్మెంటే బ్రేకప్కి కారణమై ఉండొచ్చు. – కరీనా కపూర్ - ఎస్సార్ చదవండి: పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధు ప్రియ -
అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక
రష్మిక మందన్నా..ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ల కంటే ముందే ఈ అమ్మడికి బీటౌన్ నుంచి ఓ మంచి ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన జెర్సీ రీమెక్లో నటించేందుకు మొదట రష్మికనే సంప్రదించారట. బాలీవుడ్ పిలుపు కోసం హీరోయిన్లు తహతహలాడుతుంటే.. రష్మిక మాత్రం ఈ ఆఫర్ను తిరస్కరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక తాను ఈ ప్రాజెక్ట్ను ఎందుకు రిజెక్ట్ చేసిందో చెప్పుకొచ్చింది. 'జెర్సీ' మూవీలో నాని సరసన హీరోయిన్గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించిందని,ఆ పాత్రకు తనకన్నా గొప్పగా ఎవరూ న్యాయం చేయలేరని భావించిందట. అందుకే తాను ఈ సినిమా ఒప్పుకోలేదని తెలిపింది. ఇక తెలుగులో జెర్సీని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరే బాలీవుడ్లోనూ రీమేక్ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో షాహిద్కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. చదవండి : ఆరోజు నా పేరెంట్సే నన్ను నమ్మలేదు : రష్మిక రష్మిక కోరిక త్వరలోనే నెరవేరుస్తానన్న బన్నీ -
బాలీవుడ్ హీరోతో రాశీ ఖన్నా రొమాంటిక్ పాటలు!
సెట్లో పాటలు పాడుకుంటున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా, షాహిద్కపూర్. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్లో షాహిద్ కపూర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షాహిద్, రాశీ కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఇద్దరిపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. సన్నివేశాలతో పాటు పాటలు కూడా చిత్రీకరిస్తున్నారట. వచ్చే ఏడాది ఈ వెబ్సిరీస్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... రాశీ ఖన్నా నటిస్తున్న తొలి వెబ్సిరీస్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు రాశీఖన్నా. లొకేషన్లో షాహిద్ కపూర్తో... -
డివిలియర్స్పై మనసుపడ్డ షాహిద్ భార్య!
ముంబై: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్ తరచూ తన కుటుంబానికి సంబంధించిన విషయలను, ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆమె ఇన్స్టాగ్రమ్లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెస్షన్లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు మీరా తనదైన శైలి సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో మీ క్రష్ ఎవరని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. ‘నాకు దక్షిణాఫ్రియా క్రికెటర్ ఏబి డివిలియర్స్ అంటే క్రష్, ఐ లవ్ హిమ్’ అంటూ మీరా సమాధానం ఇచ్చారు. క్షణం ఆలోచించకుండా ఓపెన్గా ఆమె చెప్పిన ఈ సమాధానికి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఇక దీనికి షాహిద్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా తన ఇష్టమైన నెట్ఫ్లిక్స్ సిరీస్ ఏంటని అడిగిన ప్రశ్నకు.. ప్రముఖ కామెడీ షో ‘షిట్స్ క్రీక్’ అంటే ఇష్టమని ఆమె చెప్పారు. కాగా షాహిద్-మీరాలు 2015లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి కూతురు మిష, కొడుకు జైన్లు ఉన్నారు. షాహిద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగు రీమేక్ ‘జెర్సీ’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించిన షాహిద్ భార్య రౌడీగా మారిన అభిషేక్.. సీఎం అవుతాడట! ‘అలా నటించడం ఆనందంగా ఉంది’ -
మ్యాచ్కి డేట్ ఫిక్స్
నాని హీరోగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది ఏప్రిల్లో విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అయింది. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. తెలుగు ‘జెర్సీ’ని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీలోనూ తెరకెక్కించారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘దిల్’ రాజు, అమన్ గిల్, ఎస్. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 5న ‘జెర్సీ’ సినిమాను విడుదల చేస్తున్నామని షాహిద్ కపూర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘ఫెంటాస్టిక్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులనూ అలరిస్తుందనే నమ్మకం ఉంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ను షేక్ చెయ్యడం ఖాయం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
నటి న్యూడ్ ఫోటో.. నెటిజనుల ప్రశంసలు
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. షాహీద్ కపూర్, కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో ఇంట్లో పని మనిషి పాత్ర చేసిన నటి గుర్తుందా. ఆమె పేరు వనితా ఖరత్. సినిమాలో కూడా ఇదే పేరుతో నటించిన ఈ నటి తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చారు. న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసినప్పటికి ఆమె ఉద్దేశం మంచిది కావడంతో అభిమానులు ప్రశంసిస్తున్నారు. బాడీ పాజిటివిటీ పేరుతో వనితా ఖరత్ తన ఇన్స్టాగ్రామ్లో న్యూడ్ ఫోటోని పోస్ట్ చేశారు. ఇక ఆమె ముందు భాగంలో నీలి రంగు గాలి పటం మాత్రమే ఉంది. (‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’) ఇక వనితా ఖరత్ ‘నా ప్రతిభ పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను.. నా పాషన్, నా నమ్మకం, నా శరీరం పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే నేనంటే నేనే గనుక’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను అలరిస్తుంది. ‘మన పట్ల మనకు నమ్మకం, ప్రేమ ఉండటం ఎంత ముఖ్యమో చాలా బాగా చెప్పారు’.. ‘ఫోటో అసభ్యతకు తావు లేకుండా అందంగా ఉంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇక వనితా ఖారత్ బాలీవుడ్లోనే కాక పలు మరాఠీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by @vanitakharat19 -
సిరీస్ కోసం సీరియస్
వచ్చే ఏడాదిని చాలా సీరియస్గా స్టార్ట్ చేయనున్నారట బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్. జనవరి నెల ప్రారంభంలో ఆయన తాజా వెబ్ సిరీస్ చిత్రీకరణ ఆరంభం కానుంది. రాజ్, డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సిరీస్ ఫుల్ యాక్షన్తో నిండి ఉంటుందట. ఇందులో షాహిద్ పాత్ర చాలా సీరియస్గా ఉంటుందని సమాచారం. ఈ సిరీస్లో రాశీ ఖన్నా కథానాయికగా కనిపిస్తారు. అలానే తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ చిత్రీకరణను ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుపుతారు. ఏప్రిల్ కల్లా షూటింగ్ పూర్తవుతుందట. ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్లో నటిస్తున్నారు షాహిద్. దీని తర్వాత కరణ్ జోహార్ నిర్మాణంలో ‘యోధ’ అనే యాక్షన్ సినిమా కూడా కమిట్ అయ్యారు. -
ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించిన షాహిద్ భార్య
బాలీవుడ్ కబీర్ సింగ్ షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్ తరచూ సోషల్ మీడియాలో అభిమానులను ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఏవైనా ప్రశ్నలు సంధించమని కోరగా నెటిజన్ల లెక్కలేనన్ని సందేహాలు ఆమె ముందు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. వీటిలో పలు ప్రశ్నలకు ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చింది. మీరు గర్భవతా? అన్న ప్రశ్నకు ఆమె లేదని చెప్పింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అన్న ప్రశ్నకు సైతం కుదరదని జవాబిచ్చింది. దీంతో త్వరలోనే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఉండబోతుందన్న ఊహాగానాలకు తెరదించినట్లైంది. ఇక మీరా 2018లో ఓ యాడ్ షూటింగ్లో మొదటిసారి పాల్గొన్నారు. పలు ఉత్పత్తులకు ఆమె తన సోషల్ మీడియా పేజీ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. (చదవండి: 2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది) కాగా షాహిద్, మీరా 2015లో జూలై 7న పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కూతురు మిషా, కొడుకు జైన్ ఉన్నారు. ఇక షాహిద్ సినిమాల విషయానికొస్తే.. ఆయన క్రికెట్ ప్లేయర్గా నటిస్తున్న జెర్సీ రీమేక్ షూటింగ్ ఇటీవలే పూర్తైంది. మృణాల్ థాకూర్ కథానాయికగా నటించారు. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ హిందీ రీమేక్ను డైరెక్ట్ చేశారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు దర్శక ద్వయం రాజ్, డీకే ఓ యాక్షన్ ప్రధానమైన వెబ్ సిరీస్ను రూపొందించనున్నారట. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ కనిపిస్తారని సమాచారం. థ్రిల్లర్ జానర్లో ఈ సిరీస్ రెండు సీజన్లుగా తెరకెక్కనుంది. (చదవండి: నా పని గిన్నెలు కడగటం: షాహిద్) -
షాహిద్ను ఆట పట్టించిన మీరా..
ముంబై: బాలీవుడ్ ‘కబీర్ సింగ్’ షాహిద్ కపూర్ ప్రస్తుతం ‘జెర్సీ’ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భార్య మీరా రాజ్పుత్ను మిస్ అవుతున్నానంటూ సోమవారం సోషల్ మీడియాలో వారిద్దరి ఫొటోను షేర్ చేశాడు. మీరా భుజంపై తల వాల్చి ఉన్న బ్లర్ ఫొటోను షాహిద్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ‘మిస్ యూ’ అనే హ్యాష్ ట్యాగ్ను జత చేశాడు. అయితే దీనికి మీరా తనదైన శైలిలో సరదాగా షాహిద్ను ఆటపట్టించింది. (చదవండి: ఆట ముగిసింది) షాహిద్ పోస్టుకు మీరా.. ‘మీరు అంతగా సంతోషంగా లేరు.. కాబట్టి నేను మిస్ యూ టూ అని పెట్టను’ అంటూ సరదాగా కామెంట్ పెట్టింది. 2015లో వివాహం చేసుకున్న ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరూ పిల్లలు ఉన్నారు. అయితే ప్రస్తుతం షాహిద్ నటిస్తున్న తెలుగు రీమేక్ ‘జెర్సీ’ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో క్రికెట్ ప్లేయర్గా కనిపించడానికి షాహిద్ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. View this post on Instagram #imissyou ❤️ A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Nov 2, 2020 at 12:52am PST -
ఆట ముగిసింది
నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో రీమేక్ అయింది. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ హిందీ రీమేక్ను డైరెక్ట్ చేశారు. నాని పాత్రను షాహిద్ కపూర్ పోషించారు. కోవిడ్ వల్ల చాలా సినిమాల్లానే ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. అయితే ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను ఉత్తరాఖండ్లో తిరిగి ప్రారంభించి, పూర్తి చేశారు. ఈ సినిమాలో క్రికెట్ ప్లేయర్గా కనిపించడానికి పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నారు షాహిద్. మృణాల్ థాకూర్ కథానాయికగా నటించారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
యాక్షన్ మోడ్
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ సూపర్ సక్సెస్తో ఫుల్ ఫామ్లోకి వచ్చారు షాహిద్ కపూర్. వెంటనే మరో తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్లో నటిస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు షాహిద్. తెలుగు దర్శక ద్వయం రాజ్, డీకే ఓ యాక్షన్ ప్రధానమైన వెబ్ సిరీస్ను రూపొందించనున్నారట. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ కనిపిస్తారని సమాచారం. థ్రిల్లర్ జానర్లో ఈ సిరీస్ రెండు సీజన్లుగా తెరకెక్కనుంది. ఆల్రెడీ ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్తో సూపర్ సక్సెస్లో ఉన్నారు దర్శకులు రాజ్, డీకే. వచ్చే ఏడాదిలో షాహిద్తో చేయబోయే వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుంది. -
డీల్ కుదిరింది
లాక్డౌన్ వల్ల థియేటర్స్ మూతబడటంతో ఓటీటీ ప్లాట్ఫామ్స్కు పాపులారిటీ మరింత పెరిగింది. సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. చాలా మంది స్టార్స్ వెబ్ సిరీస్లోనూ నటించడానికి సై అంటున్నారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్నారని తెలిసింది. ఈ డీల్లో భాగంగా షాహిద్ నటించబోయే మూడు సినిమాలు నేరుగా నెట్ఫ్లిక్స్లోనే విడుదలవుతాయి. ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్లో నటిస్తున్నారు షాహిద్. ఈ సినిమా తర్వాత చేయబోయే ‘ఆపరేషన్ క్యాక్టస్’ చిత్రం నేరుగా నెట్ఫ్లిక్స్లో రానుంది. భారీ బడ్జెట్తో నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆ తర్వాత ఈ ప్లాట్ఫామ్ కోసం మరో రెండు సినిమాలు చేయబోతున్నారు షాహిద్. -
టైమ్స్ నౌ జాబితాలో విజయ్ దేవరకొండ
ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆన్లైన్ ద్వారా 'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా' పోటీని నిర్వహించింది. దీనిలో భారతీయ చిత్ర సీమకు చెందిన హీరోలతో పాటు క్రికెట్ స్టార్ల వరకు అవకాశం కల్పించింది. 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారి జాబితాను ఆన్లైన్లో ఉంచి వీరిలో మోస్ట్ డిజైరబుల్ మెన్కు ఆన్లైన్ ద్వారా ఓట్లు వేయాలని కోరింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇంకా మరికొంత మంది హీరోలు కూడా ఉన్నారు. తమిళ, కన్నడ ఇలా సౌత్ ఇండియాకు చెందిన స్టార్లు నివీన్ పౌలీ, దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. ఇక క్రీడల విషయానికి వచ్చే సరికి విరాట్కొహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్లు మొదటి, రెండవ స్థానాలలో నిలిచారు. మూడో స్థానంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు. ఈ జాబితాలోని టాప్ 10లో టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ మాత్రమే ఉండటం గమనార్హం. విజయ్ దేవరకొండకు తప్ప మరే తెలుగు హీరో టాప్ 10లో స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. ఇటీవల కాలంలో నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి వరుస పరాజయాలను చవిచూసినప్పటికి విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. చదవండి: విజయ్ @ 80 లక్షలు -
ఏం పర్లేదు, చెంప చెళ్లుమనిపించు
ముంబై: బాలీవుడ్ నటి అమృతా రావు తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉండాలి. అప్పుడెప్పుడో 'అతిథి' చిత్రంలో సూపర్స్టార్ మహేశ్బాబుకు జోడీగా నటించారు. ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించలేరు. బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోలతో జత కడుతూ సినిమాలు చేసుకుంటూ పోయారు. అయితే ఈ మధ్య కాస్త వెనకబడ్డ అమృతా రావు తన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన "ఇష్క్ విష్క్" చిత్రం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్ను లాగి పెట్టి కొట్టే సీన్ ఉంటుంది. ఈ సీన్ పూర్తి చేసేందుకు తల ప్రాణం తోక్కొచ్చిందంటున్నారు. మరోవైపు దర్శకుడు కెన్ ఘోష్.. షాహిద్ను కొట్టినట్లు అతడి మొహంలో రియాక్షన్ కనిపించాలని మరింత ఒత్తిడి తెచ్చారు. (గురుశిష్యులు) ప్రేక్షకులు ఈ సీన్లో లీనమవాలన్నారు. అయితే అంతకు ముందెన్నడూ ఎవరినీ ఒక్క దెబ్బ కూడా వేయని అమృతా రావుకు ఈ సీన్ తన వల్ల కాదేమోనని తెగ భయపడిపోయారు. సరిగ్గా అప్పుడే షాహిద్ తల్లి నీలిమ అజీమ్ కనిపించారు. ఆమే స్వయంగా తన కొడుకును ఎలా కొట్టాలో చెప్తూ ఎంకరేజ్ చేశారు. షూటింగ్ ఆన్ అవగానే ఆమె పక్కనుంచి "నువ్వు చేయగలవు, కొట్టు, గట్టిగా చెంప చెళ్లుమనిపించు" అంటూ ప్రోత్సహించింది. వెంటనే అమృత కూడా షాహిద్ను కోపంగా ఒక్క దెబ్బ వేసింది. స్క్రీన్పై అది అనుకున్నదానికన్నా బాగా రావడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. (నా సినిమాలు ఫ్లాప్.. అందుకే: నటుడు) -
‘తనే విడాకులు కోరుకున్నాడు’
విడాకుల ఆలోచన నాది కాదు.. తనదే అంటున్నారు నటి, షాహీద్ కపూర్ తల్లి నీలిమ అజీమ్. బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ పంకజ్ కపూర్ - నీలీమలకు 1975లో వివాహం అయ్యింది. అయితే అభిప్రాయబేధాలు రావడంతో 1984లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో నీలిమ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో విడాకుల విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను విడాకులు కోరుకోలేదు. ఇది నిజం. తనే విడిపోవాలనుకున్నాడు. ఈ నిర్ణయం నన్ను ఎంతో బాధించింది. కానీ తన కారణాలు తనకున్నాయి. నా 15వ ఏట తొలిసారి నాకు పంకజ్తో పరిచయం ఏర్పడింది. మాది సుదీర్ఘమైన స్నేహ బంధం. తను విడాకులు అడిగినప్పుడు నేను చాలా బాధ పడ్డాను’ అన్నారు. అంతేకాక ‘ఇద్దరు వ్యక్తులు విడిపోయినప్పుడు.. అది కూడా విడాకుల వల్ల అయితే దాని ఫలితం ఇద్దరికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం, స్నేహం ఉంటాయి. కానీ తప్పదు. జరిగిందేదో జరిగింది. తను తన కుటుంబంతో బాగా స్థిరపడ్డాడు. తను బాగుండాలని కోరుకుంటున్నాను’ అన్నారు నీలిమ. (నా పని గిన్నెలు కడగటం: షాహిద్) బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ పంకజ్ కపూర్, నీలిమ అజీమ్ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరు విడిపోయేనాటికి షాహీద్ వయసు మూడున్నర ఏళ్లు మాత్రమే. విడాకుల అనంతరం పంకజ్ కపూర్ సుప్రియా పఠాక్ను వివాహం చేసుకున్నాడు. (‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’) -
నా పని గిన్నెలు కడగటం: షాహిద్
లాక్డౌన్ వేళ సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. ఇక తమ అభిరుచులు, కళలను మెరుగుపరుచుకుంటున్నారు. సినిమా చిత్రీకరణలు వాయిదా పడినప్పటికీ సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు తమ పాత ఫొటోలు, వీడియోలు, లాక్డౌన్లో ఇంట్లో చేస్తున్న పనులకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహిస్తూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తన ట్విటర్ ఖాతాలో ‘ఆస్క్ మీ’ లైవ్ చాట్ను నిర్వహించారు. దీనిలో భాగంగా కబీర్సింగ్ సినిమా, ప్రస్తుతం తాను నటిస్తున్న ‘జెర్సీ’ మూవీకి సంబంధించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని లాడ్డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూ..‘ తినటం, గిన్నెలు కడగటం, బట్టలు ఉతకటం వంటి పనుల్లో వీరు ఏ పని చేస్తున్నారు’ అని అడగ్గా.. ‘నాది ఇంట్లో గిన్నెలు కడిగే పని మాత్రమే’ అని షాహిద్ సమాధానం ఇచ్చారు. Mera department bartan ka hai. Tumhara? https://t.co/KMeKGlaqSf — Shahid Kapoor (@shahidkapoor) May 12, 2020 అదేవిధంగా ‘కబీర్సింగ్ మూవీకి అవార్డులు రాలేదని నిరాశ చెందుతున్నారా? అని మరో ప్రశ్న అడగ్గా.. ‘మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు, మీ వల్లనే నేను ఇలా ఉన్నాను’ అని షాహిద్ అన్నారు. ఇక షాహిద్ ‘జెర్సీ’ చిత్రాకి సంబంధించి మాట్లాడుతూ.. ‘ఓ మంచి సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాము. నాకు ‘జెర్సీ’ చిత్రయూనిట్తో పని చేయటం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. ఇక షాహిద్ లాక్డౌన్లో భాగంగా పంజాబ్లో తన కుటుంబసభ్యులతో గడుపుతున్న విషయం తెలిసిందే. Just trying our best to make a good film. But I am very happy with whatever we have done so far. Really enjoying the journey and the team. https://t.co/wsCYinUNK6 — Shahid Kapoor (@shahidkapoor) May 12, 2020 -
అల.. బాలీవుడ్ తెరపైకి!
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ అనూహ్య విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు హిట్ ‘అర్జున్రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్ వార్దే ‘అల.. వైకుంఠపురములో..’ హిందీ రీమేక్ రైట్స్ను దక్కించుకున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. హీరోగా అక్షయ్ కుమార్ లేదా షాహిద్ కపూర్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. -
‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’
నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమా అత్యంత ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను హిందీ రిమేక్లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఇక హిందీ ‘జెర్సీ’లో షాహిద్కు జోడిగా పలు హీరోయిన్లను దర్శక నిర్మాతలు సంప్రదించినట్లు వార్తలు రావడంతో.. షాహిద్ సరసన నటించే ఆ హీరోయిన్ ఎవరబ్బాని అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చుశారు. ఇక చివరకూ మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. (రోహిత్ కోచ్తో షాహిద్ ట్రైనింగ్) అయితే మొదట్లో ఈ సినిమా కోసం దక్షిణాది భామ రష్మికా మందన్నాను సంప్రందించగా ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రిపబ్లిక్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్యూలో రష్మీక దీనిపై స్పందించారు. ‘జెర్సీ’ అవకాశాన్ని వదులుకోవడానికి గల కారణాలను చెబుతూ.. ‘అవును నేను జెర్సీలో నటించాడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పటీ వరకూ సినీ కేరీర్లో నేను ఎంపీక చేసుకునే సినిమాల ద్వారానే నాకు అవకాశాలు వచ్చాయి. అలా అని ‘జెర్సీ’ మంచి సినిమా కాదని కాదు. ఇప్పటి వరకూ నేను నటించినవన్ని కమర్షియల్ చిత్రాలే. షాహిద్ ‘జెర్సీ’ రియలిస్టిక్ చిత్రం. అందుకే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. ప్రస్తుతం నేను కమర్షియల్ చిత్రాల్లోనే నటించాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. (షూటింగ్లో గాయపడ్డ హీరో) View this post on Instagram #jersey #prep A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Nov 20, 2019 at 9:18pm PST అదే విధంగా ‘’ఒకవేళ నేను ఈ సినిమాకు సైన్ చేసి ఉంటే. ‘జెర్సీ’లోని నా పాత్ర ఎలాంటిదైనా దానికి న్యాయం చేసేదానిని కాదేమో. ఒక సినిమాలో నటిస్తున్నామంటే పూర్తిగా అందులో నిమగ్నమైపోవాలి. అంతే కాదు నా వల్ల ఆ సినిమాకు చెడ్డపేరు రావద్దని కూడ అనుకుంటాను. అందుకే ‘జెర్సీ’లో నటించడానికి ఒప్పుకోలేదు’’ అని వివరించారు. కాగా ఈ సినిమాలో షాహిద్ అత్యుత్తమ క్రికెటర్గా కనిపించడానికి విశేషంగా కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ కోచ్ దినేష్ లాడ్ దగ్గర బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. -
కరోనా: నిబంధనలు ఉల్లంఘించిన హీరో!
ముంబై: చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజురోజుకీ దీని ప్రభావం మరింతగా ప్రబలుతోంది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రజలకు సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను ఆయన ఉల్లంఘించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, జిమ్లను మూసి వేయాలని నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే షాహిద్ కపూర్ ఆ నిబంధనలకు విరుద్ధంగా బాంద్రాలోని యాంటీ గ్రావిట్ క్లబ్లో మూసి ఉన్న జిమ్ను తెరిచి మరీ వ్యాయామం చేశారు. ఆ సమయంలో భార్య మీరా కూడా ఆయనతో పాటు ఆ జిమ్లో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మూసివేసిన జిమ్ను సాయంత్ర సమయంలో తెరిచి ఈ హీరో వ్యాయామం చేసినట్లు పేర్కొంది. కాగా ఈ విషయం మీడియాకు తెలియడంతో జిమ్ వెనకవైపు ఉన్న డోర్ నుంచి వారు వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయం గురించి జిమ్ యజమాని జయసింగ్ మాట్లాడుతూ.. షాహిద్ కపూర్ తనకు మంచి స్నేహితుడని.. జిమ్ దగ్గరకి షాహిద్ వర్క్ చేయానికి రాలేదని అన్నారు. షాహిద్ తనతో మాట్లాడటానికే జిమ్కు వచ్చాడని జయసింగ్ తెలిపాడు. -
రోహిత్ కోచ్తో షాహిద్ ట్రైనింగ్
క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా టాలీవుడ్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అత్యుత్తమ క్రికెటర్గా కనిపించడానికి షాహిద్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యుత్తమ బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ కోచ్ దినేష్ లాడ్ దగ్గర బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. అతని దగ్గర బ్యాటింగ్ నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణను తీసుకుంటున్నారు. కేవలం దినేష్ లాడ్నే కాకుండా రాష్ట్ర స్థాయి రంజీ ట్రోఫీ శిక్షకులు, ఎనిమిది మంది సర్టిఫైడ్ శిక్షకులు షాహిద్కు శిక్షణ ఇస్తున్నారు. ఇది వరకు కళాశాల, క్లబ్ స్థాయిలో షాహిద్కు క్రికెట్ ఆడిన అనుభవం ఉండటంతో అది ఈ సినిమాకు కలిసొస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హర్యాణాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. హర్యాణాకు చెందిన రాష్ట్ర స్థాయి కోచ్లు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. షాహిద్ కపూర్ నటించిన ‘కబీర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. కాగా తెలుగు ‘జెర్సీ’లో నేచురల్ స్టార్ నాని నటించగా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో నాని క్రికెటర్ పాత్రలో ఆకట్టుకున్నారు. చదవండి: బ్యాట్తో గ్రౌండ్లోకి దిగిన షాహిద్! -
ఆపరేషన్ కాక్టస్
రెండు రీమేక్ సినిమాల (‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశారు, ‘జెర్సీ’ని అదే టైటిల్తో హిందీలో రీమేక్ చేస్తున్నారు) తర్వాత ఓ స్ట్రయిట్ ప్రాజెక్ట్ ఓకే చేశారు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్. మాల్దీవుల్లో జరిగిన ఓ రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని టాక్. ఈ సినిమాలో షాహిద్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘ఆపరేషన్ క్యాక్టస్’ అనే పేరుని పరిశీలిస్తున్నారట. ఆదిత్య నింబల్కర్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించనున్నారు. గతంలో కరణ్ నిర్మాణంలో ‘షాందార్’ అనే సినిమాలో నటించారు షాహిద్. -
షూటింగ్లో గాయపడ్డ హీరో