Sunrisers Hyderabad
-
విదేశాలకు విస్తరిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బడా వ్యాపారవేత్తలు అప్పట్లో ఎగబడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరిస్తున్నారు. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నమెంట్లలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ లు కడుతున్నారు. తాజాగా ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా పోటీ పడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్' టోర్నమెట్లోకి రంగ ప్రవేశం చేసింది.మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీబుధవారం నార్తర్న్ సూపర్చార్జర్స్ను కొనుగోలు కోసం నిర్వహించిన వేలంలో కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్ గ్రూప్ పాల్గొని మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యొక్క 49 శాతం వాటాను, ఈ క్లబ్ నిర్వాహకులైన యార్క్షైర్ యొక్క 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారాన్ని పొందింది. దీంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో 100% వాటాను పొందిన తొలి ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో వాటాలు చేజిక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లలో సన్రైజర్స్ హైదరాబాద్ మూడో ఫ్రాంచైజీ కావడం విశేషం. సూపర్చార్జర్స్ కొనుగోలు కోసం సన్ గ్రూప్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. నాలుగో స్థానంలో సూపర్చార్జర్స్యార్క్షైర్కు వేదికగా పోటీ పడుతున్న సూపర్చార్జర్స్ గత సీజన్లో పురుషులు మరియు మహిళల టోర్నమెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్చార్జర్స్ పురుషుల జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్లు లో సభ్యుడైన హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ నిర్వాహకులైన ఆర్ పి ఎస్ జి గ్రూప్, ముంబై ఇండియన్స్ నిర్వాహకులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో పోటీ పడుతున్న జట్ల స్టాక్లను కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత సన్ గ్రూప్ కూడా ఈ టోర్నమెంట్ లో పెట్టుబడి పెట్టింది.ప్రారంభంలో లండన్ స్పిరిట్ కొనుగోలు హక్కులను దక్కించుకోవడంలో విఫలమైన ఆర్ పి ఎస్ జి గ్రూప్ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్లో వాటాను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో ది హండ్రెడ్లో మరో ఐపీఎల్ క్లబ్ కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల కథనం.మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ టాటా గ్రూప్ 2024-2028 సంవత్సరానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ను దాదాపు 2,500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది మునుపటి ఒప్పందం కంటే దాదాపు 50 శాతం అధికం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే, 231.0 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీ గా కొనసాగుతోంది. గత సంవత్సరం ఈ క్లబ్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 227.0 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఐపీఎల్ విజేత అయిన కోల్కతా నైట్ రైడర్స్ వ్యాపార వృద్ధి లో 19.3 శాతం పెరుగుదలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ 204.0 మిలియన్ డాలర్లతో బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. తరువాత సన్రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్ (113 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.లాభాల పంటవాణిజ్య ప్రకటనల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టుకు 5 మిలియన్ డాలర్ల నుండి 12 మిలియన్ డాలర్ల వరకు స్పాన్సర్షిప్ ఆదాయం లభించడమే కాక టెలివిజన్ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడేళ్ల ఒప్పందం కోసం ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 175 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసుకుందంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. -
ఎస్ఆర్హెచ్లోకి మహ్మద్ షమీ.. రూ.10 కోట్లకు సొంతం
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై కాసుల వర్షం కురిసింది. మహ్మద్ షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన షమీ కోసం తొలుత కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. అయితే ఆఖరికి కేకేఆర్, సీఎస్కే పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ స్టార్ బౌలర్ను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. కాగా షమీ గతంలో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే అతడిని ఈ మెగా వేలానికి ముందు గుజరాత్ రిటైన్ చేసుకోలేదు.ఈ మెగా వేలంలో అతడిని తిరిగి సొంతం చేసుకోవడానికి ఆర్టీమ్ ఆప్షన్ ఉన్నప్పటకి గుజరాత్ సముఖత చూపలేదు. దీంతో అతడు సన్రైజర్స్ సొంతంమయ్యాడు. ఇక దాదాపు ఏడాది తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన షమీ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
IPL 2025: సన్రైజర్స్ రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి రిటెన్షన్స్ జాబితాను ఇవాళ (అక్టోబర్ 31) విడుదల చేశారు. మెజార్టీ శాతం ఫ్రాంచైజీలు ఊహించిన విధంగానే ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం కెప్టెన్లను వదిలేసి పెద్ద సాహసం చేశాయి.సన్రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే.. ఆరెంజ్ ఆర్మీ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (18 కోట్లు), అభిషేక్ శర్మ (14 కోట్లు), నితీశ్కుమార్ రెడ్డి (6 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (23 కోట్లు), ట్రవిస్ హెడ్ (14 కోట్లు) మరోసారి రిటైన్ చేసుకుంది.ఫ్రాంచైజీలకు కేవలం ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఎస్ఆర్హెచ్ కొందరు స్టార్ ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. ఇందులో ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జన్సెన్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా కెప్టెన్ పాట్ కమిన్స్ కంటే హెన్రిచ్ క్లాసెన్కు అధిక ధర లభించింది. రిటెన్షన్ లిస్ట్లో అత్యధిక ధర లభించింది కూడా క్లాసెన్కే.సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు పాట్ కమిన్స్- రూ. 18 కోట్లుఅభిషేక్ శర్మ- రూ. 14 కోట్లునితీశ్కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లుహెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లుట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లుటోటల్ పర్స్ వాల్యూ- రూ. 120 కోట్లుమిగిలిన పర్స్ వాల్యూ- రూ. 45 కోట్లుసన్రైజర్స్ హైదరాబాద్ వదులుకున్న ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్రాహుల్ త్రిపాఠిఎయిడెన్ మార్క్రమ్మయాంక్ అగర్వాల్అబ్దుల్ సమద్అన్మోల్ప్రీత్ సింగ్వాషింగ్టన్ సుందర్షాబాజ్ అహ్మద్సన్వీర్ సింగ్మార్కో జన్సెన్ఉపేంద్ర యాదవ్జయదేవ్ ఉనద్కత్టి నటరాజన్జఠావేద్ సుబ్రమణ్యన్మయాంక్ మార్కండేభువనేశ్వర్ కుమార్ఫజల్ హక్ ఫారూఖీఆకాశ్ మహారాజ్ సింగ్ఉమ్రాన్ మాలిక్విజయ్కాంత్ వియాస్కాంత్చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్
ప్రతిష్టాత్మక దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడు, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అబ్దుల్ సమద్ చరిత్ర సృష్టించాడు. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్లో సమద్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి, ఈ ఘనత సాధించిన తొలి జమ్మూ అండ్ కశ్మీర్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో 117 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 127 పరుగులు చేసిన సమద్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 108 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సమద్ ట్విన్ సెంచరీస్తో చెలరేగడంతో ఒడిషాతో మ్యాచ్లో జమ్మూ అండ్ కశ్మీర్ పటిష్ట స్థితికి చేరింది. జమ్మూ అండ్ కశ్మీర్ ఒడిషా ముందు 269 పరుగల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి ఒడిషా సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తుంది. ఇవాళే (అక్టోబర్ 21) ఆటకు చివరి రోజు కాగా.. ఒడిషా ఇంకా 230 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. సందీప్ పట్నాయక్ (17), బిప్లబ్ సమంత్రే (4) క్రీజ్లో ఉన్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 2, సాహిల్ లోత్రా, ఉమర్ నజీర్ మిర్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు జమ్మూ అండ్ కశ్మీర్ సెకెండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సమద్ అజేయ సెంచరీతో పోరాడగా.. శుభమ్ ఖజూరియా 43, శుభమ్ పుండిర్ 40 పరుగులు చేశారు. ఒడిషా బౌలర్లలో ప్రధాన్ 3, కార్తీక్ బిస్వాల్ 2, సుమిత్ శర్మ, డి ప్రధాన్ తలో వికెట్ పడగొట్టారు.దీనికి ముందు ఒడిషా తొలి ఇన్నింగ్స్లో 272 పరుగులకు ఆలౌటైంది. ఒడిషా కెప్టెన్ గోవిందా పొద్దార్ అజేయ సెంచరీతో (133) సత్తా చాటాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో ఆబిద్ ముస్తాక్ 4, ఉమర్ నజీర్ 3, ఆకిబ్, యుద్ద్వీర్ సింగ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 270 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ అండ్ కశ్మీర్ ఇన్నింగ్స్లో అబ్దుల్ సమద్ ఒక్కడే సెంచరీతో సత్తా చాటాడు. ఒడిషా బౌలర్లలో సుమిత్ శర్మ ఐదు వికెట్లు తీశాడు. చదవండి: దక్షిణాఫ్రికా బౌలర్ల ఉగ్రరూపం.. 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ -
భారత్లో రూ. 1400 కోట్లు పెట్టుబడి పెట్టనున్న క్రికెట్ దిగ్గజం
స్పిన్ దిగ్గజం, శ్రీలంకన్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ ముత్తయ్య మురళీథరన్ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టనున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో (బడనగుప్పే అనే ప్రాంతంలో) 1400 కోట్ల పెట్టుబడితో బెవరేజ్ యూనిట్ (శీతల పానీయాల తయారీ కేంద్రం) స్థాపించనున్నాడు. ఇందు కోసం కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కర్ణాటక ప్రభుత్వం మురళీ స్థాపించబోయే ‘ముత్తయ్య బెవరేజెస్ అండ్ కన్ఫెక్షనరీస్' సంస్థకు బడనగుప్పేలో 46 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు మురళీ, కర్ణాటక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ దృవీకరించారు. మురళీ శీతల పానీయాల యూనిట్ వచ్చే ఏడాది జనవరి నుంచి పనులను ప్రారంభించాలని భావిస్తుంది. మురళీ ఈ శీతల పానీయాల వ్యాపారాన్ని శ్రీలంకలో విజయవంతంగా నడుపుతున్నాడు. తన వ్యాపారాన్ని భారత్లో విస్తరించడంలో భాగంగా అతను తొలుత కర్ణాటకలో పెట్టుబడులు పెట్టనున్నాడు. కర్ణాటక పరిశ్రమల మంత్రి చెప్పిన ప్రకారం మురళీ త్వరలో తన వ్యాపారాన్ని ధార్వడ్ జిల్లాకు కూడా విస్తరించనున్నాడు. కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో మురళీ ఇటీవల ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ను కలిశారు. ఆ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సెల్వకుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ గుంజన్ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 52 ఏళ్ల మురళీథరన్ ప్రస్తుతం ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు స్ట్రాటజిక్ కోచ్గా సేవలందిస్తున్నాడు. -
షారూఖ్ కంటే కావ్య మారన్ ఆస్తులే నాలుగు రెట్లు ఎక్కువ..!
-
IPL 2024 KKR vs SRH: ఐపీఎల్ విన్నర్లు, రన్నరప్స్ వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కేకేఆర్, సన్రైజర్స్ మధ్య నేడు (మే 26) జరుగబోయే ఫైనల్తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగింది. బ్యాటింగ్కు సంబంధించి ఆల్టైమ్ రికార్డులు బద్దలుకావడంతో పాటు పలు సంచలన బౌలింగ్ ప్రదర్శనలు నమోదయ్యాయి. చెరి ఐదసార్లు ఛాంపియన్లైన ముంబై, సీఎస్కే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు కూడా చేరకుండానే నిష్క్రమించాయి. దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని లేకుండా జరుగుతున్న ఐదో ఐపీఎల్ ఫైనల్ ఇది.ఐపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో విజేతలు, రన్నరప్లపై ఓ లుక్కేద్దాం. ఇప్పటివరకు జరిగిన 16 ఫైనల్స్లో సీఎస్కే (2010, 2011, 2018, 2021, 2023), ముంబై (2013, 2015, 2017, 2019, 2020) చెరి ఐదుసార్లు టైటిల్ కైవసం చేసుకోగా.. కేకేఆర్ రెండు (2012, 2014), సన్రైజర్స్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), గుజరాత్ టైటాన్స్ (2022), డెక్కన్ ఛార్జర్స్ (2009) తలో సారి టైటిల్ నెగ్గాయి. అత్యధికసార్లు రన్నరప్గా నిలిచిన ఘనత సీఎస్కేకు దక్కింది. సీఎస్కే ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్లో ఓటమిపాలైంది.ఆతర్వాత ఆర్సీబీ మూడు సార్లు (2009, 2011, 2016).. ముంబై ఇండియన్స్ (2010), కేకేఆర్ (2021), సన్రైజర్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2022), గుజరాత్ టైటాన్స్ (2023), పంజాబ్ కింగ్స్ (2014), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017) తలో సారి రన్నరప్గా నిలిచాయి.సీజన్ల వారీగా విజేతలు, రన్నరప్స్..2008- రాజస్థాన్ రాయల్స్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2009- డెక్కన్ ఛార్జర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2010- సీఎస్కే (విజేత), ముంబై ఇండియన్స్ (రన్నరప్)2011- సీఎస్కే (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2012- కేకేఆర్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2013- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2014- కేకేఆర్ (విజేత), పంజాబ్ (రన్నరప్)2015- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2016- సన్రైజర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2017- ముంబై (విజేత), పూణే (రన్నరప్)2018- సీఎస్కే (విజేత), సన్రైజర్స్ (రన్నరప్)2019- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2020- ముంబై (విజేత), ఢిల్లీ (రన్నరప్)2021- సీఎస్కే (విజేత), కేకేఆర్ (రన్నరప్)2022- గుజరాత్ (విజేత), రాజస్థాన్ (రన్నరప్)2023- సీఎస్కే (విజేత), గుజరాత్ (రన్నరప్) -
SRH Vs KKR IPL 2024 Final: జై జై రైజర్స్
ఐపీఎల్– 2024లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్ల తర్వాత ఐపీఎల్–17 విజేతను తేల్చే మ్యాచ్కు ఆదివారం చెన్నై వేదికవుతోంది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కు ఆనందాన్ని పంచుతూ ఫైనల్ చేరిన సన్రైజర్స్ టీమ్ ఆఖరి పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్లో తమను దెబ్బ తీసిన కోల్కతా నైట్రైడర్స్ ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థి రూపంలో ఎదురుగా ఉంది. గత మ్యాచ్కు ప్రతీకారం తీర్చుకుంటూ రైజర్స్ చెలరేగితే రెండోసారి లీగ్ చాంపియన్గా సగర్వంగా నిలవవచ్చు. 2016లో ఆఖరిసారిగా టైటిల్ సాధించిన హైదరాబాద్ 2018లో ఫైనల్ చేరి తుది మెట్టుపై తడబడింది. 2012, 2014లలో ఐపీఎల్ గెలుచుకున్న కోల్కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై గురి పెట్టింది. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడంతో మన నగర అభిమానుల మనసంతా అక్కడే ఉందనేది వాస్తవం. హైదరాబాద్ గెలిస్తే సారథిగా మన నగరానికి టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్గా కమిన్స్ నిలుస్తాడు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ ఆదివారం చెన్నైలో జరుగుతున్నప్పటికీ మన నగరంలోనే జరుగుతున్నంత కోలాహలం నెలకొంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్కు సిద్ధమవుతున్నాయి. పలు పబ్స్, లాంజ్లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. మన సొంత జట్టు ఫైనల్కు చేరడంతో మరింత ఆసక్తికరంగా మారిన ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో ఆహా్వనిస్తున్నారు. గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్లోని ఎయిర్లైవ్లో 2 స్క్రీన్స్, మాదాపూర్లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్లో పెద్ద స్క్రీన్, కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్లో 2 బిగ్ స్క్రీన్స్తోపాటు చిన్నపాటి టీవీలు కూడా పూర్తిగా ఐపీఎల్ సందడికి సిద్ధమయ్యాయి. నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. వంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో సభ్యులను ఆహా్వనిస్తున్నాయి. మాల్స్, మలీ్టఫ్లెక్స్లూ, కెఫెలు సైతం స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. పలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. -
Qualifier 1: సన్రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
-
MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఓటమితో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్రేట్ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. -
SRH Vs RCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన సన్రైజర్స్ ఉప్పల్లోనూ ఆ సీన్ను రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) సాధించిన రైజర్స్... హైదరాబాద్లో తమ రికార్డును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది.ప్యాట్ కమిన్స్ బృందం జోరు చూస్తుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చనే అనిపిస్తోంది. మరోవైపు.. ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.The crossover we all love to see 🤩 pic.twitter.com/nLlDlUcH7E— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024ఇదిలా ఉంటే.. ఈ కీలక పోరుకు ముందే సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ను తన మాటలతో ఖుషీ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా? మాస్.. ఊరమాస్.. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’’ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ములేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన ఆరెంజ్ ఆర్మీ.. ‘‘కెప్టెన్ ఓ రేంజు.. మామ మనోడే.. సూపర్ కమిన్స్’’ అంటూ కామెంట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్రైజర్స్ తలరాత మారిపోయింది. గత మూడేళ్లుగా వైఫల్యాలతో చతికిల పడ్డ రైజర్స్ను తన కెప్టెన్సీతో ఈ సీజన్లో హాట్ ఫేవరెట్గా మార్చాడు ఈ పేస్ బౌలర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో తన కెప్టెన్సీ వ్యూహాలకు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్లో సన్రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఎనిమిదింట ఏడు ఓడి అట్టడుగున ఉంది.చదవండి: IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్రైజర్స్ మాత్రమే..!ఓవైపు కెప్టెన్గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩చూడండి#TATAIPLHyderabad v Bengaluru | రేపు 6 PM నుంచిమీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024 -
SRH vs RCB: ఉప్పల్లో 300 కొడతారా..!
సాక్షి, హైదరాబాద్: 266... 277... 287... ఇదంతా ఒకే ఐపీఎల్ సీజన్లో, ఒకే టీమ్, వేర్వేరు మ్యాచ్లలో చేసిన పరుగుల విధ్వంసం. విశేషం ఏమిటంటే ఈ 287 పరుగులే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు. ఈ పరుగుల సునామీ సృష్టించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కాగా... ఇందులో 277 పరుగులు నమోదు చేసింది నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగానే.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈసారి ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ‘ఢీ’ కొట్టనుంది. 10 రోజుల క్రితం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ జట్టు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ (262/7) చేధించినంత పనిచేసింది. ఈ ఇరు జట్లే మళ్లీ నేడు తలపడనుండటంతో క్రికెట్ అభిమానుల చూపంతా ఈ మ్యాచ్పైనే ఉంది. ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకోనుందా? హైదరాబాద్ తన హవాను కొనసాగించనుందా? అనే ఆసక్తికి ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్లో ఓడితే బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ చేరే అవకాశాలు ఆవిరవుతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఆడుతున్న ‘లోకల్ బాయ్’ మొహమ్మద్ సిరాజ్, భారత స్టార్ విరాట్ కోహ్లి ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ చెలరేగితే సన్రైజర్స్ స్కోరు ఈసారి 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సన్రైజర్స్ భీకరమైన ఫామ్లో ఉండటం... కోహ్లిలాంటి దిగ్గజం బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ సీజన్లోని గత మ్యాచ్ల్లాగే ఈసారీ అభిమానులకు టికెట్ల ఇక్కట్లు తప్పట్లేదు. ఆన్లైన్లో టిక్కెట్లు క్షణాల్లో అయిపోవడంతో చేసేదేమిలేక క్రికెట్ అభిమానులంతా బిగ్ స్క్రీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న పలు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి. 🧡❤️ pic.twitter.com/3ho5bxzGSZ— SunRisers Hyderabad (@SunRisers) April 25, 2024 -
ఐపీఎల్లో సన్రైజర్స్ రికార్డులు.. పుష్ప టీమ్ స్పెషల్ ట్వీట్!
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్గా కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా పుష్ప టీమ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ టీమ్ తన రికార్డ్ను తానే అధిగమించింది. ముంబయిపై 277 పరుగుల అత్యధిక స్కోరు చేసిన ఎస్ఆర్హెచ్.. మరోసారి బెంగళూరుపై 287 రన్స్ చేసి తన రికార్డ్ను తానే బద్దలు కొట్టింది. దీంతో మొదటి మ్యాచ్ను పుష్ప పార్ట్-1గా.. రెండో మ్యాచ్ను పుష్ప-2గా పోలుస్తూ పోస్ట్ చేసింది. రెండుసార్లు అత్యధిక స్కోరు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు అభినందనలు తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది చూసిన కొందరు అభిమానులు పుష్ప డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది అనే డైలాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఏ టీమ్ సాధించని రికార్డ్ను రెండుసార్లు సన్రైజర్స్ అధిగమించడం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోనుంది. HUPPPP!!! 💥💥 277/3 - SRH: The Rise 😎 287/3 - SRH: The Rule 🤙 Congratulations on scoring the Highest-ever IPL team totals twice in this season! 🔥 @SunRisers https://t.co/kcfJBj5E0Z pic.twitter.com/co0o1zIw7T — Pushpa (@PushpaMovie) April 16, 2024 -
IPL 2024 RCB VS SRH: ఓడినా ఆల్టైమ్ రికార్డు సెట్ చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్లో నిన్న (ఏప్రిల్ 15) అత్యంత రసవత్తరమైన సమరం జరిగింది. ఆర్సీబీ, సన్రైజర్స్ మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్లో ఎన్నో టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్.. ఓ టీ20 మ్యాచ్లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక స్కోర్ (సన్రైజర్స్ 287 + ఆర్సీబీ 262 = 549 పరుగులు).. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆర్సీబీ-22).. ఓ టీ20 మ్యాచ్లో నమోదైన అత్యధిక బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81).. ఇలా ఈ మ్యాచ్లో చాలావరకు పొట్టి క్రికెట్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇదే మ్యాచ్లో మరో భారీ రికార్డు కూడా నమోదైంది. ఆర్సీబీ మ్యాచ్ ఓడినప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ (262) చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ముంబై ఇండియన్స్ ఇదే సీజన్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ (సన్రైజర్స్తో మ్యాచ్లో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ) 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆర్సీబీ.. మరో రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా.. సెకెండ్ ఇన్నింగ్స్లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా డ్యూయల్ రికార్డు నమోదు చేసింది. 2017 సీజన్లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 49 పరుగులకే ఆలౌటైంది. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్గానూ రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో ఆర్సీబీ.. సన్రైజర్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
నితీశ్ ‘షో’
ముల్లన్పూర్: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇంట గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు రచ్చ గెలిచింది. పంజాబ్ గడ్డపై ఆంధ్ర బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగాడు. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ముందుగా సన్రైజర్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్తో పాటు అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 25; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు. అర్షదీప్ కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, అశుతోష్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడగా ఆడాడు. ఆఖరి ఓవర్లో 29 పరుగులు కావాల్సి ఉండగా బౌలర్ ఉనాద్కట్ పట్టు తప్పాడు. వైడ్లతో పాటు పేలవ బంతులు వేయడంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు పంజాబ్ 3 సిక్స్లు సహా 26 పరుగులే రాబట్టడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. నితీశ్ వీరబాదుడు... ఓపెనర్ ట్రవిస్ హెడ్ (15 బంతుల్లో 21; 4 ఫోర్లు), మార్క్రమ్ (0)లను ఒకే ఓవర్లో అర్షదీప్ అవుట్ చేయగా, అభిషేక్ శర్మ (16)కు సామ్ కరన్ కళ్లెం వేశాడు. 39 పరుగులకే టాప్ 3 వికెట్లను కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి (11) ‘ఇంపాక్ట్’ చూపలేకపోయాడు. సగం (10) ఓవర్లు ముగిసే సరికి జట్టు 66/4 స్కోరు చేసింది. అయితే నాలుగో ఓవర్లోనే క్రీజులోకి వచి్చన నితీశ్ పదో ఓవర్దాకా చేసిన స్కోరు 14! ఒకటే బౌండరీ కొట్టాడు. ఇలా ఆడిన విశాఖ కుర్రాడు ధనాధన్కు స్విచ్చాన్ చేసినట్లుగా 11వ ఓవర్ నుంచి అనూహ్యంగా దంచేశాడు. హర్ప్రీత్ బౌలింగ్లో 4, 6 బాదగా, క్లాసెన్ ఓ ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. రబడ, సామ్ కరన్ ఓవర్లలో చెరో సిక్సర్తో దూకుడు పెంచాడు. క్లాసెన్ (9) అవుటయ్యాక సమద్ రావడంతో దూకుడు ‘డబుల్’ అయింది. హర్ప్రీత్ 15వ ఓవర్నూ పూర్తిగా ఎదుర్కొన్న నితీశ్ 0, 4, 6, 4, 6, 2లతో 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో 32 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. 17వ ఓవర్ వేసిన అర్షదీప్ 3 బంతుల వ్యవధిలో సమద్, నితీశ్లను అవుట్ చేయడంతో రైజర్స్ డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగుల్ని చేయలేకపోయింది. దెబ్బకొట్టిన భువీ... ఓపెనర్ బెయిర్స్టో (0)ను రెండో ఓవర్లోనే కమిన్స్ డకౌట్ చేయగా, భువనేశ్వర్ వరుస ఓవర్లలో ప్రభ్సిమ్రన్ (4)తో పాటు మరో శిఖర్ ధావన్ (14)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 20 పరుగులకే టాపార్డర్ కూలింది. సామ్ కరన్ (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు), సికందర్ రజా (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కాసేపు పోరాడారు. నటరాజన్ పదో ఓవర్లో సామ్ కరన్ బౌండరీ కోసం ప్రయత్నించగా మిడాఫ్లో కమిన్స్ కళ్లు చెదిరే క్యాచ్తో అతని ఆట ముగించాడు. జట్టు స్కోరు 91 పరుగుల వద్ద రజా ని్రష్కమించడంతో సన్రైజర్స్ గెలుపు దాదాపుగా ఖాయమైంది. అయితే ఆఖరి ఓవర్లో ఉనాద్కట్ 3 వైడ్లు వేయడంతో 2 బంతుల్లో 10 పరుగుల సమీకరణం పంజాబ్కు అవకాశమిచ్చింది. అశుతోష్ మరో షాట్ ఆడగా డీప్ మిడ్ వికెట్ వద్ద రాహుల్ త్రిపాఠి క్యాచ్ జారవిడిచాడు. ఒకే పరుగు రావడంతో ఇక ఆఖరి బంతికి 9 పరుగులు అసాధ్యమవడంతో హైదరాబాద్ గెలిచింది. అయితే చివరి బంతిని శశాంక్ సిక్స్ కొట్టడంతో సన్రైజర్స్ 2 పరుగులతో నెగ్గింది. సన్రైజర్స్ జట్టులో విజయకాంత్ శ్రీలంక యువ లెగ్స్పిన్నర్ విజయకాంత్ వియస్కాత్ ఐపీఎల్ టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయంతో టోర్నీకి దూరమైన లంక లెగ్స్పిన్నర్ వనిందు హసరంగ స్థానంలో కనీస విలువ రూ. 50 లక్షలకు రైజర్స్ యాజమాన్యం విజయ్కాంత్ను ఎంచుకుంది. 22 ఏళ్ల విజయ్కాంత్ ఆసియా క్రీడల్లో లంక తరఫున ఒకే ఒక అంతర్జాతీయ టి20 ఆడాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) ధావన్ (బి) అర్షదీప్ 21; అభిషేక్ (సి) శశాంక్ (బి) సామ్ కరన్ 16; మార్క్రమ్ (సి) జితేశ్ (బి) అర్షదీప్ 0; నితీశ్ కుమార్ (సి) రబడ (బి) అర్షదీప్ 64; రాహుల్ త్రిపాఠి (సి) జితేశ్ (బి) హర్షల్ 11; క్లాసెన్ (సి) సామ్ కరన్ (బి) హర్షల్ 9; సమద్ (సి) హర్షల్ (బి) అర్షదీప్ 25; షాబాజ్ నాటౌట్ 14; కమిన్స్ (బి) రబడ 3; భువనేశ్వర్ (సి) బెయిర్స్టో (బి) సామ్ కరన్ 6; ఉనాద్కట్ నాటౌట్ 6; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–39, 4–64, 5–100, 6–150, 7–151, 8–155, 9–176. బౌలింగ్: రబడ 4–0–32–1, అర్షదీప్ 4–0–29–4, సామ్ కరన్ 4–0–41–2, హర్షల్ 4–0–30–2, హర్ప్రీత్ బ్రార్ 4–0–48–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 14; బెయిర్స్టో (బి) కమిన్స్ 0; ప్రభ్సిమ్రాన్ (సి) నితీశ్ (బి) భువనేశ్వర్ 4; సామ్ కరన్ (సి) కమిన్స్ (బి) నటరాజన్ 29; సికందర్ రజా (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 28; శశాంక్ నాటౌట్ 46; జితేశ్ (సి) అభిషేక్ (బి) నితీశ్ 19; అశుతోష్ నాటౌట్ 33; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–2, 2–11, 3–20, 4–58, 5–91, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–32–2, కమిన్స్ 4–0–22–1, నటరాజన్ 4–0–33–1, నితీశ్ కుమార్ 3–0–33–1, ఉనాద్కట్ 4–0–49–1, షహబాజ్ 1–0–10–0. అదరగొట్టాడు ఏడేళ్ల క్రితం...బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్మర్చంట్ ట్రోఫీ..రాజ్కోట్లో నాగాలాండ్తో ఆంధ్ర మ్యాచ్. అద్భుత బ్యాటింగ్తో చెలరేగిన నితీశ్ కుమార్ రెడ్డి 345 బంతుల్లో ఏకంగా 441 పరుగుల స్కోరు సాధించి సంచలనం సృష్టించాడు. ఈ క్వాడ్రపుల్ సెంచరీ మాత్రమే కాకుండా టోర్నీ మొత్తం అదరగొట్టిన అతను 8 ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా 176.71 సగటుతో ఏకంగా 1237 పరుగులు నమోదు చేశాడు. విజయ్మర్చంట్ ట్రోఫీ చరిత్రలో ఒక్క సీజన్లో ఎవరూ చేయని పరుగుల రికార్డు అది. ఆ ఏడాది బీసీసీఐ వార్షిక అవార్డుల్లో ‘బెస్ట్ అండర్–16 క్రికెటర్’గా నిలవడంతో దేశవాళీ క్రికెట్లో అందరి దృష్టీ ఈ కుర్రాడిపై పడింది. ఓపెనర్గా కెరీర్ మొదలు పెట్టిన నితీశ్ అండర్–19 స్థాయి వినూ మన్కడ్ ట్రోఫీ, చాలెంజర్ టోర్నీ వరకు అలాగే కొనసాగించాడు. అయితే మరో వైపు మీడియం పేస్ బౌలింగ్పై కూడా దృష్టి పెట్టిన అతను కొత్త బంతితో బౌలింగ్ చేశాడు. దాంతో భారం ఎక్కువ కావడంతో అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మిడిలార్డర్లోకి మార్చారు. వైజాగ్లో పుట్టిన నితీశ్ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో సత్తా చాటిన తర్వాత 2020–21 సీజన్లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి ఆల్రౌండర్గా జట్టుకు కీలకంగా మారాడు. రెండేళ్ల తర్వాత రంజీ సీజన్లో 25 వికెట్లు పడగొట్టిన నితీశ్ తన బౌలింగ్ పదును కూడా చూపించాడు. తాజా సీజన్ రంజీ ట్రోఫీలో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నితీశ్ బాధిత బ్యాటర్లలో పుజారా, రహానే, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. బ్యాటింగ్లో చెలరేగుతూ మీడియం పేస్ బౌలింగ్ చేసే హార్దిక్ పాండ్యాను అతను అభిమానిస్తాడు. తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్తాన్ జింక్ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవాడు. అయితే రాజస్తాన్కు బదిలీ కావడంతో ఆయన ఉద్యోగంకంటే కొడుకు భవిష్యత్తే ముఖ్యమని భావిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో నితీశ్కు మార్గనిర్దేశం చేసి నడిపించారు. ఇప్పుడు ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్తో నితీశ్ అందరికీ తెలిశాడు. 2023 సీజన్లో సన్రైజర్స్ తరఫున 2 మ్యాచ్లు ఆడినా బ్యాటింగ్ రాకపోగా, వికెట్ కూడా దక్కలేదు. ఈ సీజన్లో చెన్నైతో మ్యాచ్లో 8 బంతుల్లో ఫోర్, సిక్స్తో 14 పరుగులు చేసి ట్రైలర్ చూపించిన నితీశ్ తానేంటే ఈ మ్యాచ్లో అసలు షో ప్రదర్శించాడు. చాలా కాలం తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక స్థానిక ఆటగాడు చెలరేగి జట్టును గెలిపించడం మరో విశేషం. - (సాక్షి క్రీడా విభాగం) -
IPL 2024: సమిష్టిగా రాణించిన టైటాన్స్..సన్రైజర్స్కు శృంగభంగం
అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. ఫలితంగా భీకర ఫామ్లో ఉండిన సన్రైజర్స్కు శృంగభంగం ఎదురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ సిక్సర్ బాది మ్యాచ్ ముగించాడు. సన్రైజర్స్ దూకుడుకు ఆడ్డుకట్ట వేసిన గుజరాత్ బౌలర్లు.. సూపర్ ఫామ్లో ఉన్న సన్రైజర్స్ బ్యాటర్లకు ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి సన్రైజర్స్ను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేశారు. మోహిత్ శర్మ 3, ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. తొలి రెండు మ్యాచ్ల్లో 200 పరుగుల మార్కును క్రాస్ చేసిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కే పరిమితమైంది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29, వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు. ఆడుతూపాడుతూ.. 163 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆది నుంచి నిలకడగా ఆడిన గుజరాత్ బ్యాటర్లు ఒక్కో పరుగు పేర్చుకుంటూ విజయం దిశగా సాగారు. సాహా (25), గిల్ (36), సాయి సుదర్శన్ (45), డేవిడ్ మిల్లర్ (44 నాటౌట్), విజయ్ శంకర్ (14 నాటౌట్) తలో చేయి వేసి గుజరాత్ను గెలిపించారు. సన్రైజర్స్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, మార్కండే, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. -
విధ్వంసకర బ్యాటింగ్..మరోసారి మోత మోగేనా ?
-
సన్ రైజర్స్ విజయోత్సాహం: దటీజ్ కావ్య మారన్, వైరల్ వీడియో
పురుషులకే సొంతమనుకున్న క్రికెట్లో మహిళలు తామేం తక్కువ అన్నట్టు రాణిస్తున్నారు. రిక్డార్డులతో తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు క్రికెట్ ఫ్రాంచైజీ యజమానులుగా కూడా మహిళలు దూసుకుపోతుండటం విశేషం. ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్గా నీతా అంబానీ, ఇంకా శిల్పా శెట్టి, ప్రీతి జింటా ఇప్పటికే స్పెటల్ ఎట్రాక్షన్. తాజాగా కావ్య మారన్ రూపంలో యువకెరటం దూసుకొచ్చింది. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు. ఈ సక్సెస్ కిడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ 2024లో బాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టూడియంలో జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్కు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరీ హోరీగా సాగిన ఈ పోటీ ఆద్యంతం అభిమానులను అలరించింది. తొలి పది ఓవర్లలోనే 100 పరుగులు, మొత్తం మ్యాచ్లో పరుగుల వరద, రికార్డులు వర్షం కురిసింది. ముఖ్యంగా ఎంఐపై జట్టు రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని సాధించడంతో సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆకర్షణీయమైన ఆరెంజ్ కలర్ డ్రెస్లో ఉత్సాహంగా గెంతులు వేసింది. తన జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచిన దృశ్యాలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. "Kavya Maran shines as the happiest person on Earth today! "Exciting #SRHvsMI clash! 🔥 #IPLUpdate with #RohitSharma𓃵 and Travis Head. Keep up with the action on #IPLonJioCinema! 🏏 #HardikPandya #LEAKED #IPLHistory #Klassen #NitaAmbani #SunriseHyderabad #CricketCaptaincy" 🌟… pic.twitter.com/5RmTRRKQlR — Rakesh Yadav 𝕏 (@RAKESHYADAV4) March 28, 2024 నిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్రైజర్స్ ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సౌజన్యంతో ఆతిథ్య జట్టుకు బలమైన ఆరంభం లభించడంతో ఎస్ఆర్హెచ్ సీఈవో ఈ ప్రపంచంలోనే ఇంతకుమించిన ఆనందం లేదన్నట్టుగా ఉద్వేగానికి లోనైంది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్ కొట్టినప్పుడు ఆమె ఆనందం చూసి తీరాల్సిందే. క్లాసెన్ 34 బంతుల్లో నాలుగు ఫోర్లు,ఏడు సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతేనా 64 పరుగులతో ముంబై విజయాన్నివ్వడం ఖాయం అనుకుంటున్న తరుణంలో తిలక్ ఔటవ్వడంతో సన్రైజర్స్ అభిమానులే కాదు కావ్య కూడా ఊపిరి పీల్చుకుంది. తిలక్ మైదానాన్ని వీడుతుంటే ఆమె దండం పెట్టడం వైరల్గా మారింది. Brilliant innings by Tilak 👌 Reaction of Kavya Maran 🙏#SRHvsMi pic.twitter.com/8zpKU6s3Fp — Cricket Uncut (@CricketUncutOG) March 27, 2024 అద్భుతమైన బ్యాటింగ్తో SRH టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఈ మ్యాచ్లో31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2013లో పూణే వారియర్స్పై ముంబై ఇండియన్స్ 263/5 రికార్డును బద్దలు కొట్టింది.SRH కెప్టెన్ కమ్మిన్స్ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 👉: సన్రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప -
IPL 2024 Full Schedule: ఐపీఎల్ 2024 రెండో విడత షెడ్యూల్ విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ రెండో విడత షెడ్యూల్ ఇవాళ (మార్చి 25) విడుదలైంది. తొలి విడతలో 21 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా మిగతా 53 మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించింది. ప్రస్తుత సీజన్లో ఓవరాల్గా 74 మ్యాచ్లు (ప్లే ఆఫ్స్తో కలుపుకుని) జరగాల్సి ఉన్నాయి. సీఎస్కే వర్సెస్ కేకేఆర్.. రెండో విడత షెడ్యూల్ మ్యాచ్లు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమవుతాయి. ఈ విడత ఆరంభ మ్యాచ్లో సీఎస్కే.. కేకేఆర్తో తలపడనుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ను విడతల వారీగా ప్రకటించారు. ఎన్నికల తేదీలు క్లాష్ కాకుండా ఉండేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అన్ని కసర్తులు పూర్తి చేసిన అనంతరం ఇవాళ పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. IPL 2024 SCHEDULE....!!! ⭐ pic.twitter.com/M80vWCBE40 — Johns. (@CricCrazyJohns) March 25, 2024 చెన్నైలో ఫైనల్.. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనుంది. మే 21న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1, మే 22న అదే నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న చెపాక్ వేదికగా క్వాలిఫయర్-2 జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో ఐదు.. రెండో విడతలో హైదరాబాద్లో ఐదు మ్యాచ్లు జరుగనున్నాయి. హైదరాబాద్లో జరుగబోయే మ్యాచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 25- సన్రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ (రాత్రి 7:30 గంటలకు) మే 2- సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (రాత్రి) మే 8- సన్రైజర్స్ వర్సెస్ లక్నో (రాత్రి) మే 16-సన్రైజర్స్ వర్సెస్ గుజరాత్ (రాత్రి) మే 19- సన్రైజర్స్ వర్సెస్ పంజాబ్ (రాత్రి) -
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్రైజర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
KKR Vs SRH: శభాష్ సుయాష్.. సన్రైజర్స్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు..!
ఐపీఎల్ 2024 సీజన్లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్ను అందించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య నిన్న (రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హెన్రిచ్ క్లాసెన్ తొలి బంతికే సిక్సర్ బాది సన్రైజర్స్ శిబిరంలో గెలుపుపై ధీమా పెంచగా.. కేకేఆర్ ఆటగాళ్లు హర్షిత్ రాణా, సుయాష్ శర్మ ఆ ఆనందాన్ని వారికి ఎంతో సేపు నిలబడనీయలేదు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన రాణా వైవిధ్యమైన బంతులు సంధించి సన్రైజర్స్ గెలుపుకు అడ్డుకోగా.. సుయాష్ శర్మ కీలక దశలో (2 బంతుల్లో 5 పరుగులు) మెరుపు క్యాచ్ (క్లాసెన్) పట్టి ఆరెంజ్ ఆర్మీ చేతుల్లో నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ONE OF THE GREATEST CATCHES IN IPL HISTORY...!!! - Take a bow, Suyash Sharma. 🫡pic.twitter.com/CAq18gb8EO — Johns. (@CricCrazyJohns) March 23, 2024 సుయాష్ ఆ క్యాచ్ మిస్ చేసి ఉంటే బౌండరీ లభించి సన్రైజర్స్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేది. ఒకవేళ ఆ క్యాచ్ డ్రాప్ అయ్యి, పరుగు రాకపోయినా అప్పటికే శివాలెత్తి ఉన్న క్లాసెన్ ఆఖరి బంతికి సిక్సర్ బాది సన్రైజర్స్ను గెలిపించేవాడు. సుయాష్ అందుకున్న ఈ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఇందుకే అంటారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆఖర్లో రసెల్ 7 సిక్సర్లు, 3 బౌండరీలతో విరుచుకుపడి కేకేఆర్ 200 పరుగుల మార్కును దాటేందుకు దోహదపడ్డాడు. చివర్లో రమన్దీప్ సింగ్ (35; ఫోర్, 4 సిక్సర్లు), రింకూ సింగ్ (23; 3 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సన్రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్రైజర్స్.. ఆదిలో తడబడినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్తో (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) మ్యాచ్ రూపురేఖల్నే మార్చేశాడు. అయితే గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో అతడు ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్పైపు మలుపు తిరిగింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సన్రైజర్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) ఓ మోస్తరు స్కోర్లతో శుభారంభాన్ని అందించగా.. వన్డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి జిడ్డు బ్యాటింగ్తో (20 బంతుల్లో 20) సన్రైజర్స్ ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ తమ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
బ్రూక్ కి అంత.. ఫిలిప్స్కి ఇంతే ఫైనల్ 4 లో ఎస్ ఆర్ హెచ్
-
ఛల్.. హట్ రే.. కావ్య మారన్ ఆన్ ఫైర్
-
అన్ని విభాగాల్లోనూ సన్రైజర్స్ ఫ్లాప్ షో
-
వచ్చేశారు..ఇక తగ్గేదేలే..SRHకి గుడ్ న్యూస్
-
కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఆ జట్టు స్టార్ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్లు తమ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫోటోలను సన్రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే విధంగా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఎస్ఆర్హెచ్ అభిమానులతో పంచుకుంది. కాగా ఎస్ఆర్హెచ్ తమ పాత జెర్సీలో పూర్తి స్థాయిలో మార్పులు చేయకుండా.. కాషాయానికి కాస్త నల్లరంగును అద్దింది. అదే విధంగా ఆరంజ్ కలర్ లో ఉన్న ట్రాక్ ప్యాంటు స్థానంలో పూర్తి బ్లాక్ కలర్ ప్యాంటు తీసుకొచ్చారు. కాగా ఆరెంజ్ ఆర్మీ కొత్త జెర్సీ.. మొట్టమొదటి సౌతాఫ్రికా20 లీగ్లో టైటిల్ నెగ్గిన సన్రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జెర్సీని పోలి ఉంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ కొత్త కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్కరమ్ను ఎంపిక చేసింది. అతని సారథ్యంలోని సన్ రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జట్టు తొట్ట తొలి సౌతాఫ్రికా20 లీగ్ టైటిల్ను సొంతం చేసుకుంది. Idhi, Orange Fire 🔥 Buy your tickets now to watch your favourite #Risers in this brand new jersey soon 💥 🎟️ - https://t.co/ph5oL4pzDI#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/lRM75Yz6kO — SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023 ℍ𝔼ℝ𝔼. 𝕎𝔼. 𝔾𝕆. 🧡 Presenting to you, our new #OrangeArmour for #IPL2023 😍@StayWrogn | #OrangeArmy #OrangeFireIdhi pic.twitter.com/CRS0LVpNyi — SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023 చదవండి: IPL 2023: శ్రేయస్ అయ్యర్ దూరం..! కేకేఆర్ కొత్త కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్! -
SRH: విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేసేది, సన్రైజర్స్ కెప్టెన్ కూడా అతడే!
IPL Mini Auction 2023- Sunrisers Hyderabad: ఐపీఎల్ మినీ వేలం-2023కి సమయం దగ్గరపడింది. కొచ్చి వేదికగా శుక్రవారం(డిసెంబరు 23)న ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కొనుగోలు అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్రైజర్స్ జట్టు గతేడాది దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్లకు గానూ ఆరింట మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో కేన్ మామ కోసం గతంలో 14 కోట్ల భారీ పెట్టిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మినీ వేలానికి ముందు అతడితో బంధం తెంచుకుంది. మయాంక్ అగర్వాల్ కేన్ మామ స్థానాన్ని భర్తీ చేసేది అతడే ఈ నేపథ్యంలో విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఇతడేనంటూ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా క్రికెటర్ పేరును సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్ను కొనుగోలు చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్లకు.. దూకుడుగా ఆడగల ఓపెనర్ అవసరం ఎంతగానో ఉంది. అంతేకాదు గతంలో కెప్టెన్గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ కూడా ఇప్పుడు లేడు. అనుభవజ్ఞుడైన, ఓపెనింగ్ బ్యాటర్ కేన్ సేవలను ఎస్ఆర్హెచ్ కచ్చితంగా మిస్సవుతుంది. కాబట్టి కేన్ స్థానంలో మయాంక్ అగర్వాల్ను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఓపెనర్గా తను దూకుడు ప్రదర్శించగలడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడగలడు. బహుశా వాళ్లు అతడిని తమ కెప్టెన్గా చేసే ఆలోచనలో కూడా ఉన్నారేమో!’’ అని చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్ ప్రస్తుతం కోటి రూపాయల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక సారథిగా నియమించిన సమయంలో మయాంక్ కోసం పంజాబ్ 14 కోట్లు వెచ్చించగా.. ఈసారి అతడు ఎంత ధరకు అమ్ముడుపోతాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిజంగానే సన్రైజర్స్ మయాంక్ను కొనుగోలు చేస్తే ఓపెనింగ్ స్థానానికి చక్కటి ఆప్షన్ దొరుకుతుంది. చదవండి: IPL 2023 Mini Auction Players List: వేలంలో 405 మంది ఆటగాళ్లు.. షార్ట్లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలు IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు -
లివింగ్స్టోన్ విధ్వంసం.. చివరి పోరులో పంజాబ్ చేతిలో చిత్తైన సన్రైజర్స్
ముంబై: ఎనిమిది జట్లు పాల్గొన్న గత ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఎనిమిదో స్థానం... పది జట్లు పాల్గొన్న ఈసారి ఐపీఎల్లోనూ అదే స్థానం...అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్! మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తూ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ను పేలవంగా ముగించింది. టోర్నీపరంగా ప్రాధాన్యత కోల్పో యిన చివరి లీగ్ మ్యాచ్లో ఆదివారం పంజాబ్ కింగ్స్ 5 వికెట్లతో హైదరాబాద్ను ఓడించింది. ముందుగా సన్రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (32 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా... రొమారియో షెఫర్డ్ (15 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), మార్క్రమ్ (21), రాహుల్ త్రిపాఠి (20) తలా ఓ చేయి వేశారు. పంజాబ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్ప్రీత్ బ్రార్, ఎలిస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం పంజాబ్ 15.1 ఓవర్లలో 160 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ (22 బంతుల్లో 49 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించగా, శిఖర్ ధావన్ (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఫజల్ హఖ్ ఫారూఖీకి 2 వికెట్లు దక్కాయి. -
ధవన్, రబాడలను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఐపీఎల్ 2022 సీజన్ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారై, సన్రైజర్స్, పంజాబ్ జట్లు ఇదివరకే రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. రికార్డులు ఎలా ఉన్నాయంటే.. క్యాష్ రిచ్ లీగ్లో పంజాబ్పై సన్రైజర్స్ పూర్తి ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన 19 మ్యాచ్ల్లో సన్రైజర్స్ 13, పంజాబ్ 6 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ప్రస్తుత సీజన్ తొలి అర్ధ భాగంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా సన్రైజర్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 7 వికెట్ల తేడాతో పంజాబ్ను మట్టికరిపించింది. నేటి మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే.. - పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్లో మరో బౌండరీ సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో 700 బౌండరీల మార్కును అందుకున్న తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే నేటి మ్యాచ్లో ధవన్ 5 బౌండరీలు బాధితే పంజాబ్ తరఫున 50 బౌండరీలు పూర్తి చేసుకుంటాడు. - పంజాబ్ పేసర్ రబాడ నేటి మ్యాచ్లో మరో 2 వికెట్లు పడగొడితే క్యాష్ రిచ్ లీగ్లో 100 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఐపీఎల్లో 100 వికెట్లు సాధించిన తొలి సౌతాఫ్రికా బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. - పంజాబ్ బౌలర్ రాహుల్ చాహర్ మరో 2 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్ల మార్కును చేరుకుంటాడు. - పంజాబ్ హిట్టర్ లివింగ్స్టోన్ మరో 2 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్లో 4500 పరుగుల మార్కును క్రాస్ చేస్తాడు. - సన్రైజర్స్ డాషింగ్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి మరో 3 బౌండరీలు బాధితే టీ20ల్లో 250 బౌండరీల మార్కును, అలాగే మరో 4 సిక్సర్లు కొడితే 100 సిక్సర్ల క్లబ్లో చేరతాడు. - పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ మరో 3 సిక్సర్లు బాధితే టీ20ల్లో 150 సిక్సర్ల అరుదైన క్లబ్లో చేరతాడు. అలాగే మయాంక్ నేటి మ్యాచ్లో మరో 6 ఫోర్లు కొడితే ఐపీఎల్లో పంజాబ్ తరఫున 150 బౌండరీలను పూర్తి చేసుకుంటాడు. - సన్రైజర్స్ ప్లేయర్ నికోలస్ పూరన్ మరో 6 బౌండరీలు సాధిస్తే టీ20ల్లో 300 బౌండరీల మార్కును అందుకుంటాడు. - సన్రైజర్స్ బౌలర్ శ్రేయస్ గోపాల్ మరో వికెట్ పడగొడితే ఐపీఎల్లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. - సన్రైజర్స్ హిట్టర్ అబ్దుల్ సమద్ మరో 4 సిక్సర్లు కొడితే టీ20ల్లో 50 సిక్సర్ల క్లబ్లో చేరతాడు. చదవండి: సన్రైజర్స్తో తలపడనున్న పంజాబ్.. ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఎవరంటే..! -
IPL 2022: అదరహో హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో ముంబైపై విజయం
ముంబై: ఓడితే ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయే స్థితిలో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సత్తా చాటింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత కీలక విజయంతో తమ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి (44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా... ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్లు), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 2 ఫోర్లు, 4 సిక్స్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. కీలక భాగస్వామ్యాలు... ఓపెనర్ అభిషేక్ శర్మ (9) వైఫల్యం తర్వాత రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు సన్రైజర్స్కు భారీ స్కోరును అందించాయి. త్రిపాఠి ఈ రెండింటిలోనూ భాగంగా ఉన్నాడు. గార్గ్తో రెండో వికెట్కు 78 పరుగులు (43 బంతుల్లో), పూరన్తో మూడో వికెట్కు 76 పరుగులు (42 బంతుల్లో) త్రిపాఠి జోడించాడు. త్రిపాఠి తన ఫామ్ను కొనసాగించగా, సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న గార్గ్ కూడా కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. బుమ్రా ఓవర్లో వరుస బంతుల్లో త్రిపాఠి 6, 4, 4 బాదగా... 10.1 ఓవర్లలోనే సన్రైజర్స్ స్కోరు 100 పరుగులకు చేరింది. పూరన్ కూడా దూకుడు ప్రదర్శించాడు. మెరిడిత్ ఓవర్లో వరుస సిక్సర్లు కొట్టిన అతను, మర్కండే వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. 32 బంతుల్లో త్రిపాఠి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత మరింత చెలరేగిన త్రిపాఠి... స్యామ్స్ ఓవర్లో ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టాడు. అయితే మూడు పరుగుల వ్యవధిలో పూరన్, త్రిపాఠి, మార్క్రమ్ (2) వెనుదిరగడంతో హైదరాబాద్ జోరుకు బ్రేకులు పడ్డాయి. భారీ ఓపెనింగ్... ఛేదనలో ముంబైకి మెరుపు ఆరంభం లభించింది. రోహిత్, ఇషాన్ తొలి వికెట్కు 66 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. అయితే ఆరు పరుగుల తేడాతో రోహిత్, ఇషాన్లను అవుట్ చేసి రైజర్స్ పట్టు బిగించింది. తిలక్ వర్మ (8), స్యామ్స్ (15), స్టబ్స్ (2) విఫలం కావడంతో హైదరాబాద్ గెలుపు సులువే అనిపించింది. ముంబై 35 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన స్థితిలో టిమ్ డేవిడ్ చెలరేగిపోయాడు. నటరాజన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అతను 4 సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు. అయితే స్ట్రయికింగ్ను కాపాడుకునే ప్రయత్నంలో అదే ఓవర్ చివరి బంతికి డేవిడ్ రనౌటవ్వడం ముంబై ఆశలను దెబ్బ తీసింది. 19వ ఓవర్లో ఒక్క పరుగూ ఇవ్వకుండా భువనేశ్వర్ సత్తా చాటాడు. ముంబైకి చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సి ఉండగా, తొలి మ్యాచ్ ఆడుతున్న ఆఫ్గాన్ పేసర్ ఫారుఖీ ఒత్తిడిని అధిగమించి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు: సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మర్కండే (బి) స్యామ్స్ 9; గార్గ్ (సి అండ్ బి) రమణ్దీప్ 42; త్రిపాఠి (సి) తిలక్ వర్మ (బి) రమణ్దీప్ 76; పూరన్ (సి) మర్కండే (బి) మెరిడిత్ 38; మార్క్రమ్ (సి) డేవిడ్ (బి) రమణ్దీప్ 2; విలియమ్సన్ (నాటౌట్) 8; సుందర్ (బి) బుమ్రా 9; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–18, 2–96, 3–172, 4–174, 5–175, 6–193. బౌలింగ్: సామ్స్ 4–0–39–1, మెరిడిత్ 4–0–44– 1, సంజయ్ 2–0–23–0, బుమ్రా 4–0– 32–1, మర్కండే 3–0–31–0, రమణ్దీప్ 3–0–20–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) (సబ్) సుచిత్ (బి) సుందర్ 48; ఇషాన్ (సి) గార్గ్ (బి) ఉమ్రాన్ 43; స్యామ్స్ (సి) గార్గ్ (బి) ఉమ్రాన్ 15; తిలక్ (సి) విలియమ్సన్ (బి) ఉమ్రాన్ 8; డేవిడ్ (రనౌట్) 46; స్టబ్స్ (రనౌట్) 2; రమణ్దీప్ (నాటౌట్) 14; సంజయ్ (సి) (సబ్) సుచిత్ (బి) భువనేశ్వర్ 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–95, 2–101, 3–123, 4–127, 5–144, 6–175, 7–175. బౌలింగ్: ఫారుఖీ 4–0–31–0, భువనేశ్వర్ 4–1–26–1, సుందర్ 4–0–36–1, నటరాజన్ 4–0–60–0, ఉమ్రాన్ 3–0–23–3, అభిషేక్ శర్మ 1–0–10–0. -
ధోని ఈజ్ బ్యాక్... ఎస్ఆర్హెచ్పై సీఎస్కే విజయం
పుణే: సారథ్యం మారేసరికి సర్వస్వం మారిపోయింది. చెన్నై ఆటతీరు అదిరిపోయింది. ధోని కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ మ్యాచ్లో చెన్నై మళ్లీ అచ్చంగా సూపర్ కింగ్స్ అయ్యింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ధోని బృందం 13 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై గెలిచింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 202 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓపెనింగ్లో చెలరేగారు. తర్వాత హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (33 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అందివచ్చిన లైఫ్లతో అర్ధసెంచరీ చేశాడు. రుతురాజ్ సెంచరీ మిస్ చెన్నై బ్యాటింగ్ నింపాదిగా మొదలైంది. రుతురాజ్, కాన్వే తొలి ఐదు ఓవర్లలో బంతిని మూడుసార్లు మాత్రమే బౌండరీ (2 ఫోర్లు, 1 సిక్స్)ని దాటించారంతే! కానీ తర్వాత ఆట రూటే వేరు! ఇదే జోడీ దాదాపు 18 ఓవర్లు (17.5) ఆడేసింది. ఒక్క భువనేశ్వర్ మినహా అందరినీ రుతురాజ్, కాన్వే చితకబాదేశారు. ముఖ్యంగా తన పేస్తో నిప్పులు చెరుగుతున్న ఉమ్రాన్ మలిక్ (0/48) బౌలింగ్ను రుతురాజ్ ఫోర్లు, కళ్లు చెదిరే సిక్సర్లతో తుత్తునీయలు చేశాడు. 8వ ఓవర్లో 50 స్కోరు చేసిన చెన్నై 11వ ఓవర్ (10.5) ముగియక ముందే 100 మార్కు దాటింది. మరో 9 ఓవర్లలో (19.5) 200 పరుగుల్ని అవలీలగా దాటింది. రుతురాజ్ 33 బంతుల్లో, కాన్వే 39 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తిచేసుకున్నారు. పరుగు తేడాతో రుతురాజ్ సెంచరీని చేజార్చుకున్నాడు. ముకేశ్ దెబ్బకు... హైదరాబాద్ లక్ష్యాన్ని ధాటిగా ఛేదించేందుకు ప్రయత్నించింది. ఓపెనర్లు విలియమ్సన్ (37 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆటతో పరుగు పెట్టించారు. దీంతో ఓవర్కు 10 పైచిలుకు పరుగులు వచ్చాయి. అయితే ముకేశ్ ఆరో ఓవర్లో వరుస బంతుల్లో అభిషేక్తో పాటు రాహుల్ త్రిపాఠి (0)ని ఔట్ చేసి దెబ్బ మీద దెబ్బ తీశాడు. తర్వాత మార్క్రమ్ (17; 2 సిక్సర్లు), విలియమ్సన్ క్రీజులో ఉన్నంత వరకు 11 ఓవర్ల దాకా పటిష్టంగా కనిపించినా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. 3 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన ముకేశ్ చౌదరి తన ఆఖరి, ఇన్నింగ్స్ 20వ ఓవర్లో 6, 4, 0, వైడ్, 6, 6, 1లతో ఏకంగా 24 పరుగులు సమర్పించుకోవడంతో ధోని అసహనం వ్యక్తం చేయగా, గెలుపు అంతరం తగ్గింది. -
సీఎస్కే ఆల్రౌండ్ షో.. సన్రైజర్స్కు వరుసగా రెండో ఓటమి
-
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. సన్రైజర్స్ ఖాతాలో నాలుగో విజయం
-
కేకేఆర్ను ఢీకొట్టనున్న సన్రైజర్స్.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?
KKR VS SRH: ఐపీఎల్ 2022 సీజన్లో వరుసగా రెండు విజయాలు సాధించి జోరుమీదున్న సన్రైజర్స్ (4 మ్యాచ్ల్లో 2 విజయాలతో 8వ స్థానం).. ఇవాళ (ఏప్రిల్ 15) టేబుల్ సెకెండ్ టాపర్ కేకేఆర్ను (5 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఢీకొట్టనుంది. ఈ ఆసక్తికర మ్యాచ్ ముంబైలోని బ్రబోర్న్ మైదానం వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గతేడాది రన్నరప్ కేకేఆర్ ప్రస్తుత సీజన్లో సీఎస్కే, పంజాబ్, ముంబైలపై విజయాలు సాధించి ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలవగా, ఎస్ఆర్హెచ్.. రాజస్థాన్, లక్నో జట్ల చేతిలో ఓడి చెన్నై, గుజరాత్ జట్లపై వరుస విజయాలు సాధించింది. ఇరు జట్ల మధ్య గత రికార్డులను పరిశీలిస్తే.. సన్రైజర్స్పై కేకేఆర్ పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది. ఇరు జట్లు ముఖాముఖి తలపడిన 21 సందర్భాల్లో కేకేఆర్ 14, ఆరెంజ్ ఆర్మీ 7 మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేశాయి. గత 4 మ్యాచ్ల్లో అయితే ఎస్ఆర్హెచ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 2020 సీజన్ నుంచి ఆరెంజ్ ఆర్మీ కేకేఆర్పై ఒక్క మ్యాచ్ గెలిచింది లేదు. బలాబలాల ప్రకారం చూస్తే.. ప్రస్తుత సీజన్లోనూ కేకేఆర్ ఆరెంజ్ ఆర్మీ కంటే బలంగా కనిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రసెల్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్ వంటి స్టార్లతో కేకేఆర్ పటిష్టంగా కనిపిస్తుండగా.. విలియమ్సన్, పూరన్, భువనేశ్వర్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్ల మెరుపులపై సన్రైజర్స్ ఆధారపడి ఉంది. చెరో మార్పుతో ఇరు జట్లు.. నేటి మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేసే అవకాశం ఉంది. గుజరాత్తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ స్థానంలో సన్రైజర్స్ శ్రేయస్ గోపాల్ను బరిలోకి దించవచ్చు. కేకేఆర్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అంతగా ఆకట్టుకోని రసిక్ సలామ్కు తప్పించి శివమ్ మావికి ఆడించవచ్చు. ఎస్ఆర్హెచ్ తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, పూరన్, మార్క్రమ్, శ్రేయస్ గోపాల్, శశాంక్ సింగ్, జన్సెన్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ కేకేఆర్ తుది జట్టు (అంచనా): రహానే, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్, సామ్ బిల్లింగ్స్, నితీశ్ రాణా, రసెల్, నరైన్, కమిన్స్, ఉమేశ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి చదవండి: GT VS RR: హార్ధిక్ చేసిన ఆ పని వల్ల జరిగిన నష్టం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రషీద్ ఖాన్ రేంజ్లో మేము లేము.. ఎస్ఆర్హెచ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ను ఉద్దేశించి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీథరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2017 నుంచి 2021 ఐపీఎల్ సీజన్ వరకు ఎస్ఆర్హెచ్లో భాగమైన రషీద్ ఖాన్ను ఆటగాళ్ల రిటెన్షన్లో భాగంగా అట్టిపెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశామని, అయితే అతని రేంజ్లో (రెమ్యునరేషన్) మేము లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందని కీలక కామెంట్స్ చేశాడు. రషీద్ ఖాన్పై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుందని సోషల్మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మురళీథరన్ పై విధంగా స్పందించాడు. రషీద్ ఎస్ఆర్హెచ్ కుటుంబంలో మాజీ సభ్యుడు.. అతనిపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి కానీ తమ అభిమానులకు కానీ ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవు.. రిటెన్షన్లో రషీద్ను దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాము.. అయితే అతను అడిగినంత మేం ఇవ్వలేకపోయామంటూ మురళీథరన్ వివరణ ఇచ్చాడు. కాగా, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్)లో రూ.కోటి 70 లక్షలు మాత్రమే తీసుకునే రషీద్.. ఐపీఎల్ 2022 సీజన్కు ముందు జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్లో ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేశాడని వార్తలు వచ్చాయి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రషీద్ అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన వార్త నిజమేనని స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే, సన్రైజర్స్ వదులుకున్న రషీద్ ఖాన్ను ఐపీఎల్ న్యూ ఎంట్రీ గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్లు వెచ్చించి డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేయగా, ఎస్ఆర్హెచ్.. కేన్ విలియమ్సన్ను రూ.12 కోట్లకు, అన్క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్లకు చెరి 4 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకుంది. సనరైజర్స్ రషీద్ ఖాన్ను 2017లో రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీ తరఫున 76 మ్యాచ్లు ఆడిన అతను 6.35 ఎకానమీతో 93 వికెట్లు పడగొట్టి, ఫ్రాంచైజీ తరఫున రెండో అత్యధిక వికెట్ టేకర్గా రికార్డుల్లో నిలిచాడు. చదవండి: IPL 2022: ఆర్సీబీ టైటిల్ నెగ్గే వరకు ఆ అమ్మడు పెళ్లి చేసుకోదట..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాహుల్ త్రిపాఠి ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు సంచలన క్యాచ్తో మెరిశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఫ్సైడ్ బంతిని శుభ్మాన్ గిల్ కవర్ రీజియన్ ద్వారా బౌండరీ బాదడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో షార్ట్ ఎక్స్ట్రా కవర్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్తో పాటు మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. త్రిపాఠి క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా అద్భుతమైన క్యాచ్ అందుకున్న త్రిపాఠి.. 19 ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఈజీ క్యాచ్ను వదిలేయడం గమనార్హం. చదవండి: IPL 2022: సూర్యకుమార్ యాదవ్ నమస్తే సెలబ్రేషన్స్.. కారణం ఎంటో తెలుసా..? Rahul tripathi stunning catch... #GTvsSRH #SRHvGT pic.twitter.com/UA0focDkgi — Chinthakindhi Ramudu (O- Negitive) (@RAMURAVANA) April 11, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నటరాజన్ బౌలింగ్.. భారీ సిక్స్ బాదిన విలియమ్సన్.. వీడియో వైరల్!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మహా సంగ్రామానికి మరి కొద్ది రోజుల్లో తెర లేవనుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. దీంతో ఆయా జట్లు ప్రాక్టీస్ సెషన్స్లో బీజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలో సన్రైజెర్స్ హైదరాబాద్ జట్టు సైతం తీవ్రంగా శ్రమిస్తోంది. సన్నాహాల్లో భాగంగా చెపాక్ స్టేడియంలో ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ సన్రైజెర్స్ హైదరాబాద్ ఆడింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెండు జట్లుగా విడిపోయింది. అయితే ఆ జట్టు స్టార్ బౌలర్ నటరాజన్ బౌలింగ్ చేయగా.. సన్రైజెర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారీ సిక్స్ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎస్ఆర్హెచ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా గాయం కారణంగా గత కొంత కాలంగా విలియమ్స్ ఏ విధమైన క్రికెట్ ఆడలేదు. అయితే అతడు పూర్తి ఫిట్నెస్ సాధించి ఈ మెగా టోర్నీకు సిద్దమయ్యాడు. ఈ సీజన్లో సన్రైజెర్స్ హైదరాబాద్ జట్టుకు హెడ్ కోచ్గా టామ్ మూడీ, బ్యాటింగ్ కోచ్గా బ్రియాన్ లారా, బౌలింగ్ కోచ్గా డెల్ స్టెయిన్ వ్యవహరించనున్నారు. మరో వైపు ఐపీఎల్ మెగా వేలంలో పూరన్, రొమారియో షెపర్డ్ వంటి స్టార్ ఆటగాళ్లను ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఇక మార్చి 29 న ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్ పంత్.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు pic.twitter.com/glfzpFu3Em — Sports Hustle (@SportsHustle3) March 21, 2022 -
IPL 2022: సన్రైజర్స్ ఆల్రౌండర్కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నేచురల్ స్టార్ నాని
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలుండటంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు ప్రాక్టీస్లో బిజీ అయిపోగా, ఆయా ఫ్రాంచైజీలు సోషల్ మీడియా ప్రమోషన్స్తో హడావుడి షురూ చేశాయి. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ కూడా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్తో అనునిత్యం టచ్లోనే ఉంటుంది. తాజాగా ఎస్ఆర్హెచ్.. ప్రముఖ టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నానిని, తమ జట్టు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో లింక్ చేస్తూ ట్విటర్లో ఓ పోస్ట్ చేసింది. Ante aa Sundaram June lo vastadu, ee Sundar training kuda start chesadu. 💪#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/dxHrqIRswB — SunRisers Hyderabad (@SunRisers) March 18, 2022 నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా జూన్ 10న విడుదల కానున్నట్లు నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో.. ‘అంటే ఆ సుందరం జూన్లో వస్తాడు, ఈ సుందర్ ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు..’ అని సన్రైజర్స్ ట్వీట్ చేసింది. ఇందుకు నేచురల్ స్టార్ నాని స్పందించాడు. ‘ఆల్ ది బెస్ట్ సుందర్, ఫ్రం సుందర్..’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఈ ట్వీట్కు స్పందిస్తూ ‘వచ్చాను గయ్స్’ అంటూ ట్వీటాడు. ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. All the best sundar 👍🏼 From Sundar :) https://t.co/ht6yD6qRup — Nani (@NameisNani) March 18, 2022 ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్.. వాషింగ్టన్ సుందర్ను ఏకంగా రూ.8.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు ఆర్సీబీకి ఆడిన సుందర్ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వేలంలో పట్టుబట్టి మరీ సొంతం చేసుకుంది. కాగా, మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్లో సన్రైజర్స్.. తన తొలి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 29వ తేదీన జరగనుంది. చెన్నై, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్తో టోర్నీ ప్రారంభంకానుంది. Vacchanu guys! 🧡 https://t.co/Bj6DA70NQV — Washington Sundar (@Sundarwashi5) March 18, 2022 చదవండి: కళావతి సాంగ్కు ఎస్ఆర్హెచ్ ఆటగాడి స్టెప్పులు.. నీకంత సీన్ లేదులే! అయినా -
IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్రైజర్స్ కోచ్
ఐపీఎల్ 2022 మెగా వేలంలో అనమాక ఆటగాళ్లను కొనుగోలు చేసి విమర్శలపాలవుతున్నసన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వ్యూహ రచన విషయంలో మాత్రం అందరికంటే ముందున్నట్లు కనిపిస్తోంది. జట్టు కూర్పు విషయంలో ఏ ఫ్రాంచైజీ కూడా ప్రకటన చేయకముందే ఎస్ఆర్హెచ్ తమ ఓపెనింగ్ జోడీ ఎవరనే విషయమై క్లారిటీ ఇచ్చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో సన్రైజర్స్ ఇన్నింగ్స్ను కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు యువ ఆటగాడు అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపాడు. గతంలో మిడిలార్డర్లో ఆడిన లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ అయిన అభిషేక్ శర్మకు ఈసారి ఓపెనర్గా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మురళీధరన్ పేర్కొన్నాడు. మెగా వేలంలో ఈ యువ ఆల్రౌండర్ కోసం ఎస్ఆర్హెచ్ ఏకంగా 6.5 కోట్లు వెచ్చించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అభిషేక్ శర్మ కోసం ఆరెంజ్ ఆర్మీ.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్లతో పోటీ పడి భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 22 మ్యాచ్ల్లో 17.2 సగటుతో 241 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన మెగా వేలంలో సన్రైజర్స్ మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతకుముందు రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే ఎస్ఆర్హెచ్ సభ్యుల సంఖ్య 23కు చేరింది. రిటైన్డ్ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్(14 కోట్లు), కెప్టెన్ అబ్దుల్ సమద్(4 కోట్లు) ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు) మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్(10.75 కోట్లు) వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు) రొమారియో షెపర్డ్(7.7 కోట్లు) అభిషేక్ శర్మ(6.5 కోట్లు) భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు) మార్కో జన్సెన్(4.2 కోట్లు) టి నటరాజన్(4 కోట్లు) కార్తీక్ త్యాగి(4 కోట్లు) ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు) సీన్ అబాట్(2.4 కోట్లు) గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు) శ్రేయస్ గోపాల్(75 లక్షలు) విష్ణు వినోద్(50 లక్షలు) ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు) జె సుచిత్(20 లక్షలు) ప్రియమ్ గార్గ్(20 లక్షలు) ఆర్ సమర్థ్(20 లక్షలు) శశాంక్ సింగ్(20 లక్షలు) సౌరభ్ దూబే(20 లక్షలు) చదవండి ఐపీఎల్ 2022: ఆరెంజ్ ఆర్మీ ఇదే.. ఈసారి దబిడి దిబిడే..! -
ఐపీఎల్ 2022: ఆరెంజ్ ఆర్మీ ఇదే.. ఈసారి దబిడి దిబిడే..!
రెండు రోజుల పాటు(ఫిబ్రవరి 12, 13) ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం నిన్నటితో ముగిసింది. లీగ్లో పాల్గొనబోయే 10 జట్లు తమతమ పర్స్లలోని డబ్బులకు సరిపడా ఆటగాళ్లను కొనుగోలు చేసి ఐపీఎల్ 2022 మెగా ఫైట్కు ఇప్పటినుంచే కత్తులు నూరుతున్నాయి. ఈ సారి వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ మిగిలిన జట్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తమ వద్ద ఉన్న 68 కోట్లతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం యువ క్రికెటర్ల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా తెలిసింది. కేన్ విలియమ్సన్(14 కోట్లు), అబ్దుల్ సమద్(4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు)లను రిటైన్ చేసుకున్న ఎస్ఆర్హెచ్.. మెగా వేలంలో 67.9 కోట్లు వెచ్చించి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 2022 ఐపీఎల్ ఫైట్లో తలపడబోయే ఎస్ఆర్హెచ్ పూర్తి జాబితా ఇదే.. రిటైన్డ్ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్(14 కోట్లు), కెప్టెన్ అబ్దుల్ సమద్(4 కోట్లు) ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు) మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్(10.75 కోట్లు) వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు) రొమారియో షెపర్డ్(7.7 కోట్లు) అభిషేక్ శర్మ(6.5 కోట్లు) భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు) మార్కో జన్సెన్(4.2 కోట్లు) టి నటరాజన్(4 కోట్లు) కార్తీక్ త్యాగి(4 కోట్లు) ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు) సీన్ అబాట్(2.4 కోట్లు) గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు) శ్రేయస్ గోపాల్(75 లక్షలు) విష్ణు వినోద్(50 లక్షలు) ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు) జె సుచిత్(20 లక్షలు) ప్రియమ్ గార్గ్(20 లక్షలు) ఆర్ సమర్థ్(20 లక్షలు) శశాంక్ సింగ్(20 లక్షలు) సౌరభ్ దూబే(20 లక్షలు) చదవండి: ‘మాకు అనామకులే కావాలి’.. సన్రైజర్స్ తీరే వేరు -
ఎటూ తేల్చుకోలేకపోతున్న సన్రైజర్స్.. రషీద్ ఖాన్కు గుడ్బై.. అదే జరిగితే!
Rashid Khan not willing to be SRHs second retained player ahead of IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ కోసం రిటైన్ ప్లేయర్స్ లిస్ట్ను సమర్పించడానికి సమయం ఆసన్నమవుతోంది. ఆ క్రమంలో ఆయా జట్లు తుది జాబితా సిద్దం చేసుకొనే పనిలో పడ్డాయి. ప్రతీ జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశముంది. అందులో ఒక విదేశీ ఆటగాడు తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఆజట్టు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ను వదులుకోవాలని సన్రైజర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ను రిటైన్ చేసుకొనే యోచనలో సన్ రైజర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. విలియమ్సన్, రషీద్ ఖాన్లో ఎవరని రిటైన్ చేసుకోవాలోనే సందిగ్ధంలో పడ్డ సన్రైజర్స్.. చివరగా విలియమ్సన్ వైపే మెగ్గు చూపునట్లు సమాచారం. ఒక వేళ రషీద్ ఖాన్ను సన్ రైజర్స్ వదులు కున్నట్లయితే.. అతడికి ఈ మెగా వేలంలో భారీ ధర దక్కనుంది. ఎందుకంటే చాలా ఫ్రాంచైజీలు అతడి సేవలు పొందాలని భావిస్తున్నాయి. ఒకవేళ రషీద్ వేలంలో పాల్గొంటే.. తిరిగి మళ్లీ అతడిని దక్కించుకోవడం సన్రైజర్స్కు చాలా కష్టం అవుతుంది. ఇక ఐపీఎల్-2022లో లక్నో, అహ్మదాబాద్ రూపంలో కొత్త జట్లు చేరడంతో ఈ లీగ్ మరింత రసవత్తరంగా జరగనుంది. కాగా వచ్చే సీజన్ కోసం మెగా వేలం డిసెంబర్లో ప్రారంభం కానుంది. చదవండి: IPL 2022 Auction: అప్పుడు 8 కోట్లు... ఇప్పుడు 14 కోట్లకు ఓకే అన్నాడట.. కెప్టెన్గానే! -
MS Dhoni: చాలు సామీ.. చాలు.. ఫినిషర్ ఇంకా బతికే ఉన్నాడు!
Dhoni finishes With Mammoth Six: ఐపీఎల్ గత సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్కింగ్స్.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్-2021లో ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి సగర్వంగా ముందడుగు వేసింది. ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్పై విజయం సాధించింది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ ముఖ్యంగా.. మిస్టర్ కూల్, కెప్టెన్ ధోని అభిమానులు మస్తుగా ఖుషీ అవుతున్నారు. తనదైన శైలిలో సిక్సర్తో ఇన్నింగ్స్ను ముగించడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో.. తనలో అసలైన ఫినిషర్ ఇంకా మిగిలే ఉన్నాడంటూ తలా నిరూపించాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఈ మ్యాచ్కు ఇదే హైలెట్ అని.. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. విమర్శకులకు ధోని బ్యాట్తోనే సమాధానం చెబుతాడంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం.. ‘‘చాలా రోజుల తర్వాత కనీసం ఇప్పుడైనా మంచి షాట్ ఆడావు. చాలు సామీ.. చాలు’’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఎన్నో మ్యాచ్లలో తనదైన స్టైల్లో షాట్లు బాది.. బెస్ట్ ఫినిషర్గా ధోని గుర్తింపు పొందిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నిన్నటి(సెప్టెంబరు 30) మ్యాచ్లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని.. ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సిద్దార్థ్ కౌల్ బౌలింగ్లో సిక్సర్ బాది చెన్నై విజయాన్ని ఖరారు చేశాడు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ధోని అరుదైన రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో చెన్నై వికెట్ కీపర్గా 100 క్యాచ్లు అందుకున్న ఘనత సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ ఆటగాడు వృద్దిమాన్ సాహా క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. స్కోర్లు: సన్రైజర్స్ హైదరాబాద్- 134/7 (20) చెన్నై సూపర్కింగ్స్- 139/4 (19.4) చదవండి: MS Dhoni: ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్.. హెడ్కోచ్గా.. లేదంటే! The finisher is still alive...❤️❤️#Dhoni #CSKvsSRH pic.twitter.com/Y2ZyruS620 — A𝖓𝖎𝖑💛🌊 (@AnilMSDian07) September 30, 2021 #Dhoni finished off by Six 💥❣️ | Lions 🦁 are Back 💯 😎#Csk won & First team to Entry into #Playoffs ..😍💛@GautamGambhir @sanjaymanjrekar pic.twitter.com/96FydutsCj — Karthik (@karthis_) September 30, 2021 Not finished #SRHvsCSK ||• #Dhoni ||• #Msdhoni pic.twitter.com/hL0kbMMsAb — MAHIYANK ™🦁 2.0 (@Mahiyank_78) September 30, 2021 Chalu Saami @msdhoni 🥺❤🔥#Dhoni #WhistlePodu pic.twitter.com/WZ1b0uwinG — K.Rishi Kumar (@K_Rishi_kumar) September 30, 2021 Best 10 year challenge#Dhoni #maahi pic.twitter.com/q0WR2xcpbN — Mohit Singhania♻️ (@Mohit_chandler) September 30, 2021 -
జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
Jagadeesha Suchith Stunning Catch: ఐపీఎల్ 2021లో వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆప్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అయితే శనివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్తో అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్లో ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ బౌలింగ్లో దీపక్ హుడా మిడాన్ దిశగా కొట్టిన షాట్ను మెరుపు వేగంతో గాల్లోకి ఎగురుతూ సుచిత్ సింగిల్ హ్యాండ్తో క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: హోల్డర్ మెరిసినా... సన్రైజర్స్ అవుట్ pic.twitter.com/jvRijSA0pS — Sardar Khan (@SardarK07004661) September 25, 2021 -
PBKS Vs SRH: ఉత్కంఠ పోరులో పంజాబ్దే విజయం
ఉత్కంఠ పోరులో పంజాబ్దే విజయం 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ విజయం పంజాబ్నే వరించింది. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో రెండో బంతికే సిక్సర్ బాదిన హోల్డర్(29 బంతుల్లో 47; 5 సిక్సర్లు) పంజాబ్ శిబిరంలో టెన్షన్ పుట్టించాడు. అయితే ఆఖరి ఓవర్ బౌల్ చేసిన నాథన్ ఇల్లీస్ అద్భుతంగా బౌల్ చేసి హోల్డర్ను కట్టడి చేయడంతో పంజాబ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన(3/19, 47 నాటౌట్) చేసిన హోల్డర్ శ్రమ వృధా అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా, ఛేదనలో తడబడిన సన్రైజర్స్ అదే 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. రషీద్ ఖాన్(3) ఔట్ 12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన తరుణంలో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రషీద్ ఖాన్(4 బంతుల్లో 3) అర్షదీప్ సింగ్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా ఎస్ఆర్హెచ్ 105 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో హోల్డర్(37), భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. సాహా(31) రనౌట్ 24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో సన్రైజర్స్ జట్టు ఒత్తిడికి లోనైంది. అనవసర పరుగుకు ప్రయత్నించి సాహా(37 బంతుల్లో 31; ఫోర్) రనౌటయ్యాడు. 16.1 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 91/6. క్రీజ్లో హోల్డర్(14 బంతుల్లో 27; 3 సిక్సర్లు), రషీద్ ఖాన్ ఉన్నారు. రవి బిష్ణోయి మాయాజాలం.. 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ రవి బిష్ణోయి స్పిన్ మాయాజాలానికి సన్రైజర్స్ హైదరాబాద్ తడబడుతుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ రెండో బంతికి కేదార్ జాదవ్(12 బంతుల్లో 12)ను క్లీన్ బౌల్డ్ చేసిన బిష్ణోయి.. అదే ఓవర్ ఆఖరి బంతికి అబ్దుల్ సమద్(2 బంతుల్లో 1)ను బోల్తా కొట్టించాడు. సమద్.. షార్ట్ థర్డమెన్లో ఫీల్డింగ్ చేస్తున్న గేల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా ఎస్ఆర్హెచ్ 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్లో సాహా(26), హోల్డర్ ఉన్నారు. 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్.. మనీశ్ పాండే(13) ఔట్ 32 పరుగులకే ఎస్ఆర్హెచ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్లో మనీశ్ పాండే(23 బంతుల్లో 13; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 8 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 32/3. క్రీజ్లో సాహా(13), కేదార్ జాదవ్ ఉన్నారు. షమీ ఆన్ ఫైర్.. వరుస ఓవర్లలో రెండు వికెట్లు ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వార్నర్ వికెట్ పడగొట్టిన షమీ.. 3వ ఓవర్ రెండో బంతికే విలియమ్సన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 2.2 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 10/2. క్రీజ్లో సాహా(7), మనీశ్ పాండే ఉన్నారు. మరోసారి నిరాశపర్చిన వార్నర్(2).. సన్రైజర్స్ తొలి వికెట్ డౌన్ ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(3 బంతుల్లో 2) వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. రెండో దశ తొలి మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగిన ఆయన.. రాజస్థాన్తో మ్యాచ్లో 2 పరుగులకే ఔటయ్యాడు. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మూడో బంతికే తొలి వికెట్ను కోల్పోయింది. షమీ విసిరిన వైడ్ బాల్ను కట్ షాట్ ఆడబోయిన వార్నర్.. వికెట్కీపర్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో 2 పరుగులకే ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్లో సాహా, విలియమ్సన్ ఉన్నారు. Photo Courtesy: IPL పంజాబ్ నామమాత్రపు స్కోర్.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 126 సన్రైజర్స్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పంజాబ్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్(32 బంతుల్లో 27; 2 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్ జేసన్ హోల్డర్(3/18) రాహుల్ సేనను దారుణంగా దెబ్బకొట్టగా, సందీప్ శర్మ, భువీ, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్ తలో వికెట్ పడగొట్టారు. పంజాబ్ ఏడో వికెట్ డౌన్.. నాథన్ ఇల్లీస్(12) ఔట్ 19.2 ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన నాథన్ ఇల్లీస్(12 బంతుల్లో 12; సిక్స్) ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. ఫలితంగా 118 పరుగుల వద్ద పంజాబ్ 7వ వికెట్ను కోల్పోయింది. క్రీజ్లో హర్ప్రీత్ బ్రార్(12), మహ్మద్ షమీ ఉన్నారు. సుచిత్ సూపర్ క్యాచ్.. పంజాబ్ ఆరో వికెట్ డౌన్ జేసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 15.4 ఓవర్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో దీపక్ హూడా(13 బంతుల్లో 10; ఫోర్) వెనుదిరిగాడు. దీంతో 96 పరుగులకే పంజాబ్ 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో హర్ప్రీత్ బ్రార్(4), నాథన్ ఇల్లీస్ ఉన్నారు. 88 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్.. మార్క్రమ్(27) ఔట్ అబ్దుల్ సమద్ విసిరిన ఫుల్ టాస్ బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో లాంగ్ ఆఫ్లో ఉన్న ఫీల్డర్ మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్(32 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఔటయ్యాడు. 14.4 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 88/5. క్రీజ్లో దీపక్ హూడా(13), హర్ప్రీత్ బ్రార్ ఉన్నారు. సందీప్ శర్మ సూపర్ రిటర్న్ క్యాచ్.. పూరన్(8) ఔట్ సందీప్ శర్మ బౌలింగ్లో సిక్సర్ బాది మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన పూరన్(4 బంతుల్లో 8; సిక్స్).. ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. సందీప్ శర్మ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ అందుకోవడంతో పూరన్ వెనుదిరగక తప్పలేదు. 11.4 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 66/4. క్రీజ్లో మార్క్రమ్(16), దీపక్ హూడా ఉన్నారు. డేంజర్ మ్యాన్ గేల్(14) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ ఒక్క పరుగు వ్యవధిలో ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయిన పంజాబ్కు 11వ ఓవర్లో మరో షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(17 బంతుల్లో 14; ఫోర్)ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. 11. 4 బంతికి రషీద్ ఖాన్ బౌలింగ్లో గేల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 57 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో మార్క్రమ్(15), పూరన్ ఉన్నారు. Photo Courtesy: IPL ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన హోల్డర్.. ఓపెనర్లిద్దరు ఔట్ ఐపీఎల్-2021 రెండో దశలో తొలి మ్యాచ్ ఆడుతున్న ఎస్ఆర్హెచ్ బౌలర్ జేసన్ హోల్డర్ చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్ను పెవిలియన్కు పంపిన ఆయన.. అదే ఓవర్ ఐదో బంతికి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(6 బంతుల్లో 5)ను కూడా ఔట్ చేశాడు. దీంతో పంజాబ్ జట్టు 4. 5 ఓవర్లకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయి 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. హోల్డర్ బౌలింగ్లో విలియమ్సన్ క్యాచ్ పట్టడంతో మయాంక్ వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్లో గేల్(1), మార్క్రమ్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. కేఎల్ రాహుల్(21) ఔట్ టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బరిలోకి దిగిన పంజాబ్కు 5వ ఓవర్ తొలి బంతికే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, కెప్టెన్ కేఎల్ రాహుల్(21 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను జేసన్ హోల్డర్ పెవిలియన్కు పంపాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్.. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4.1 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 26/1. క్రీజ్లో మయాంక్(5), గేల్ ఉన్నారు. Photo Courtesy: IPL షార్జా: ఐపీఎల్-2021 రెండో దశ తొలి డబుల్ హెడర్ మ్యాచ్లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 17 మ్యాచ్ల్లో తలపడగా.. సన్రైజర్స్ 12 మ్యాచ్ల్లో, పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు పంజాబ్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. తుది జట్లు: సన్రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్. పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, రవి బిష్ణోయి, హర్ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, నాథన్ ఇల్లీస్. చదవండి: రద్దైన టెస్ట్ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..? -
వృద్ధిమాన్ సాహా ఓపెనర్గా పనికిరాడు: దక్షిణాఫ్రికా కోచ్
Mark Butcher Comments On Wriddhiman Saha: ఐపీఎల్ 2021 లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచింది. దీంతో ఫ్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసాయి. అయితే ఐపీఎల్ సెకెండ్ ఫేజ్కు ఆ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్స్టో దూరమయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్తో కలిసి వృద్ధిమాన్ సాహా హైదరాబాద్ ఇన్నింగ్స్ను ఆరంభించాడు. అయితే వృద్ధిమాన్ సాహా ఇన్నింగ్స్ను ఆరంభించడంపై దక్షిణాఆఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో ఓపెనర్గా వచ్చిన సాహా వరుసగా 7,1,18, పరుగుల మాత్రమే సాధించాడు. "వృద్ధిమాన్ సాహా వాస్తవానికి మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాట్సమన్. అయితే సాహా ఓపెనింగ్లో ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. తన బ్యాటింగ్ ఆర్ఢర్లో మార్పు చేస్తే అతడు అధ్బుతంగా ఆడగలడు" అని ఓ క్రికెట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు. చదవండి: Gautam Gambhir: చెన్నై ప్లేఆఫ్స్ చేరాక ధోని ఆ స్థానంలో బ్యాటింగ్కు రావాలి! -
నటరాజన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్...
Umran Malik to replace Natarajan: ఐపీఎల్2021 ఫేజ్2లో భాగంగా జమ్మూ కశ్మీర్ ఫాస్ట్బౌలర్ ఉమ్రాన్ మాలిక్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒప్పందం కుదర్చుకుంది. కరోనా బారిన పడి లీగ్కు దూరమైన స్టార్ బౌలర్ నటరాజన్ స్థానంలో మాలిక్ను ఎంపిక చేసింది. నిబంధన 6.1 (సి) ప్రకారం అతడని జట్టులోకి తీసుకుంది. ఉమ్రాన్ మాలిక్ ఆ జట్టు నెట్బౌలర్లో ఒకడుగా ఉన్నాడు. అయితే వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో ఉన్న హైదరాబాద్ ప్లేఆఫ్ ఆవకాశాలు గల్లంతయ్యాయి. చదవండి: IPL 2021: సన్రైజర్స్కు బిగ్ షాక్.. ఇంటి దారి పట్టిన స్టార్ ఆల్రౌండర్ -
సన్రైజర్స్కు బిగ్ షాక్.. ఇంటి దారి పట్టిన స్టార్ ఆల్రౌండర్
Sherfane Rutherford Returns Home From IPL: వరుస పరాజయాలతో ప్లే ఆఫ్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్కు(ఎస్ఆర్హెచ్) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జానీ బెయిర్స్టో స్థానంలో ఇటీవలే (ఐపీఎల్-2021 రెండో దశ) జట్టులోకి వచ్చిన విండీస్ స్టార్ ఆల్రౌండర్ షెర్ఫాన్ రూథర్ఫర్డ్.. తన తండ్రి కన్నుమూయడంతో స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఈ సీజన్లో ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్కు ఇది గట్టి ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, రెండో దశ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎస్ఆర్హెచ్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు లీగ్కు దూరమయ్యారు. కరోనా బారిన పడడంతో స్టార్ బౌలర్ నటరాజన్ జట్టుకు దూరం కాగా, అతనితో సన్నిహితంగా మెలిగిన విజయ్ శంకర్ కూడా ఐసొలేషన్లోకి వెళ్లాడు. తాజాగా రూథర్ఫర్డ్ కూడా లీగ్కు దూరం కావడంతో ఈ ముగ్గురి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారోనని ఎస్ఆర్హెచ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, రెండో దశ తొలి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా.. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు మాత్రమే నష్టపోయి మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా డీసీ జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. కాగా, శనివారం(సెప్టెంబర్ 25) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. చదవండి: అలా జరిగితే అఫ్గాన్ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్ -
ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్: ఈ మ్యాచ్లో విజేత ఆజట్టే..
Aakash Chopra Predicts Who Win The DCvsSRH Match: ఐపీఎల్ ఫేజ్2లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు తలపడనుంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా నేటి మ్యచ్లో ఎవరు విజయం సాధిస్తారన్నది అంచనా వేశాడు.ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ఆకాష్ చోప్రా థీమా వ్యక్తం చేశాడు. సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నందున రాబోయే మ్యాచ్ను గెలవడానికి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒక వేళ ఈ మ్యాచ్లలో సన్రైజర్స్ ఓడిపోతే వాళ్ల ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారుతాయిని చోప్రా పేర్కొన్నాడు. "ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఢిల్లీ ఈ సీజన్లో అత్యత్తుమ ఫామ్లో ఉంది. ఈ ఏడాది లీగ్లో హైదరాబాద్ పేలవమైన ఫామ్ కారణంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఒకవేళ హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఓడిపోతే, ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారుతాయి . కాబట్టి విజయం సాధించడానికి జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంటుంది" అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో వెల్లడించాడు. మరో వైపు ఐపీఎల్ సెకండ్ ఫేజ్లో హైదరాబాద్ విధ్వంసక ఓపెనర్ జానీ బెయిర్స్టో సీజన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండవ స్థానంలో ఉండగా, హైదరాబాద్ చివరి స్ధానంలో ఉంది. చదవండి: T. Natarajan SRH: పాపం నటరాజన్కే ఎందుకిలా ? -
నటరాజన్కు కరోనా.. అయితే ఫ్యాన్స్కు మాత్రం ఓ గుడ్ న్యూస్
దుబాయ్: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్కు కొద్ది గంటల ముందు ఎస్ఆర్హెచ్ క్యాంప్లో కోవిడ్ కలకలం రేపింది. సన్రైజర్స్ బౌలర్ నటరాజన్కు కరోనా నిర్ధారణ కావడంతో అతనితో సన్నిహితంగా మరో ఆటగాడు విజయ్ శంకర్ సహా మరో ఐదుగురిని(టీమ్ మేనేజర్ విజయ్కుమార్, ఫిజియో శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి) ఐసోలేషన్కు తరలించారు. అయితే ఎస్ఆర్హెచ్ క్యాంప్లోని మిగతా ఆటగాళ్లందరికీ నెగటివ్ రావడంతో నేటి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేయడం విశేషం. మహమ్మారి బారిన పడిన నటరాజన్కు ఎలాంటి లక్షణాలూ లేవని, అతను ప్రస్తుతం జట్టు సభ్యులకు దూరంగా మరో చోట ఐసోలేషన్లో ఉంటున్నాడని పేర్కొంది. కాగా, ఎస్ఆర్హెచ్ బృందం మొత్తానికి ఇవాళ ఉదయం 5 గంటలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది. చదవండి: ఐపీఎల్లో మళ్లీ కరోనా కలకలం.. నటరాజన్కు పాజిటివ్! -
SRH Vs PBKs: హైదరాబాద్ గెలిచిందోచ్!
హ్యాట్రిక్ పరాజయాల నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తేరుకుంది. నాలుగో మ్యాచ్తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో పంజాబ్ కింగ్స్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి... అనంతరం ఛేజింగ్లో బెయిర్స్టో, వార్నర్, విలియమ్సన్ నిలకడగా ఆడటంతో సన్రైజర్స్ తమ ఖాతాలో తొలివిజయాన్ని వేసుకుంది. చెన్నై: వరుస పరాజయాలకు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఫుల్స్టాప్ పెట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో తొలి విజయాన్ని అందుకుంది. ఇక్కడి చెపాక్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్లతో పంజాబ్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (17 బంతుల్లో 25; 2 సిక్స్లు), మయాంక్ అగర్వాల్ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఖలీల్ అహ్మద్ (3/21), అభిషేక్ శర్మ (2/24) బంతితో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి 121 పరుగులు చేసి సీజన్లో బోణీ కొట్టింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్స్టో (56 బంతుల్లో 63 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... వార్నర్ (37 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగాడు. అతడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆడుతూ పాడుతూ... గత మూడు మ్యాచ్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న వార్నర్, బెయిర్స్టో ఈసారి ఎటువంటి తడబాటుకు గురి కాలేదు. స్వల్ప లక్ష్యమే కావడంతో నింపాదిగా ఇన్నింగ్స్ను ఆరంభించారు. తొలి ఓవర్లో వార్నర్ పాయింట్ దిశగా ఫోర్ కొట్టగా... ఆ మరుసటి ఓవర్లో బెయిర్స్టో 4, 6 సాధించాడు. ఆ తర్వాత కూడా ఈ జంట బౌండరీలు రాబట్టడంతో హైదరాబాద్ స్కోరు బోర్డు సాఫీగా సాగింది. బౌండరీలతో పాటు వీరు సింగిల్స్, డబుల్స్కు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో పవర్ప్లేలో రైజర్స్ 50/0తో నిలిచింది. పేసర్లతో లాభం లేదనుకున్న పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పిన్నర్లను బరిలోకి దించాడు. పిచ్పై బంతి టర్న్ అవుతుండటంతో జాగ్రత్త పడ్డ వార్నర్, బెయిర్స్టో మూడు ఓవర్ల (7, 8, 9) పాటు బౌండరీ బాదలేకపోయారు. అయితే పదో ఓవర్ మూడో బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్ కొట్టిన వార్నర్... అలెన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దాంతో 73 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వార్నర్ అవుటయ్యే సమయానికి హైదరాబాద్ విజయ సమీకరణం 60 బంతుల్లో 48గా ఉంది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న కేన్ విలియమ్సన్ (19 బంతుల్లో 16 నాటౌట్)... బెయిర్స్టోతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హుడా బౌలింగ్లో ఫోర్ కొట్టిన బెయిర్స్టో 48 బంతుల్లో ఆర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీజన్లో బెయిర్స్టోకి ఇది రెండో అర్ధ సెంచరీ కావడం విశేషం. విలియమ్సన్, బెయిర్స్టో మరో వికెట్ పడకుండా ఇంకో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లాంఛనం పూర్తి చేశారు. టపటపా... అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ను హైదరాబాద్ బౌలర్లు ఏ దశలోనూ క్రీజులోకుదురుకోనివ్వలేదు. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ (4) భువనేశ్వర్ బౌలింగ్లో మిడ్వికెట్ దగ్గర ఉన్న కేదార్ జాదవ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఖాతా తెరవకముందే తాను ఇచ్చిన క్యాచ్ను రషీద్ ఖాన్ నేలపాలు చేయడంతో బతికిపోయిన మయాంక్ అగర్వాల్ రెండు ఫోర్లు కొట్టి టచ్లో ఉన్నట్లే కనిపించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన గేల్ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు)... సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఒక్కో బౌండరీ సాధించాడు. దాంతో పవర్ప్లేలో పంజాబ్ 32/1గా నిలిచింది. అయితే ఇక్కడే హైదరాబాద్ ఫీల్డర్లు మెరిశారు. ఖలీల్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతిని మయాంక్ పుల్ షాట్ ఆడగా... మిడ్వికెట్ దగ్గర ఉన్న రషీద్ ఖాన్ కుడి వైపునకు డైవ్ చేస్తూ బంతి నేలను తాకేలోపు చక్కటి క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్యాచ్పై ఫీల్డ్ అంపైర్లు టీవీ అంపైర్ను సంప్రదించారు.. రీప్లేలో బంతి కింద రషీద్ ఖాన్ వేళ్లు ఉండటంతో క్లీన్ క్యాచ్గా పరిగణించిన టీవీ అంపైర్ తన నిర్ణయాన్ని అవుట్గా ప్రకటించాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (0) ఒక్క బంతిని కూడా ఆడకుండానే రనౌట్ అయ్యాడు. ఎనిమిదో ఓవర్ తొలి బంతికి గేల్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా... వార్నర్ ఒక చక్కటి త్రోతో నేరుగా వికెట్లను గిరాటేసి పూరన్ (0)ను డగౌట్కు చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లో రషీద్ ఖాన్ గేల్ను వికెట్ల ముందు దొరకబ్చుకున్నాడు. దాంతో పంజాబ్ 10 ఓవర్లు ముగిసేసరికి 53/4తో కష్టాల్లో పడింది. క్రీజులో ఉన్న దీపక్ హుడా (13), హెన్రిక్స్ (14)లను తన వరుస ఓవర్లలో అభిషేక్ శర్మ అవుట్ చేయడంతో పంజాబ్ మూడంకెల స్కోరును చేరుకోవడం కూడా కష్టంగానే కనిపించింది. అయితే యువ ప్లేయర్ షారుఖ్ ఖాన్ మరోసారి పంజాబ్ పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచాడు. రెండు సిక్సర్లు బాది జట్టు స్కోరును 100 దాటించాడు. చివర్లో మరోసారి కమ్బ్యాక్ చేసిన సన్రైజర్స్ షారుఖ్ ఖాన్తో పాటు మురుగన్ అశ్విన్ (9), షమీ (3)లను అవుట్ చేయడంతో పంజాబ్ 20 ఓవర్లను కూడా పూర్తిగా ఆడకుండానే ఆలౌటైంది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) జాదవ్ (బి) భువనేశ్వర్ 4; మయాంక్ అగర్వాల్ (సి) రషీద్ ఖాన్ (బి) ఖలీల్ అహ్మద్ 22; క్రిస్ గేల్ (ఎల్బీ) (బి) రషీద్ ఖాన్ 15; నికోలస్ పూరన్ (రనౌట్) 0; దీపక్ హుడా (ఎల్బీ) (బి) అభిషేక్ శర్మ 13; హెన్రిక్స్ (స్టంప్డ్) బెయిర్స్టో (బి) అభిషేక్ శర్మ 14; షారుఖ్ ఖాన్ (సి) అభిషేక్ శర్మ (బి) ఖలీల్ అహ్మద్ 22; అలెన్ (సి) వార్నర్ (బి) ఖలీల్ అహ్మద్ 6; మురుగన్ అశ్విన్ (సి) బెయిర్స్టో (బి) సిద్దార్థ్ కౌల్ 9; షమీ (రనౌట్) 3; అర్‡్షదీప్ సింగ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–15, 2–39, 3–39, 4–47, 5–63, 6–82, 7–101, 8–110, 9–114, 10–120. బౌలింగ్: అభిషేక్ శర్మ 4–0–24–2, భువనేశ్వర్ 3–0–16–1, ఖలీల్ అహ్మద్ 4–0–21–3, సిద్ధార్థ్ కౌల్ 3.4–0–27–1, విజయ్ శంకర్ 1–0–6–0, రషీద్ ఖాన్ 4–0–17–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మయాంక్ (బి) అలెన్ 37; బెయిర్స్టో (నాటౌట్) 63; విలియమ్సన్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 121. వికెట్ల పతనం: 1–73. బౌలింగ్: షమీ2–0–16–0, ఫాబియన్ అలెన్ 4–1–22–1, అర్‡్షదీప్ సింగ్ 3.4–0–31–0, హెన్రిక్స్ 1–0–7–0, మురుగన్ అశ్విన్ 4–0–22–0, దీపక్ హుడా 4–0–22–0. -
'ఈ పిచ్పై మాకు మొదటి మ్యాచ్.. అందుకే'
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 121 పరుగులు లక్ష్యాన్ని ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. బెయిర్ స్టో (63* పరుగులు) కడవరకు నిలిచి జట్టును గెలిపించగా.. విలియమ్సన్ 16 పరుగులతో అతనికి సహకరించాడు. కాగా మ్యాచ్ విజయం అనంతరం ప్రెజంటేషన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ''చెన్నైలో మాకు ఇది మొదటి మ్యాచ్.. పిచ్ పరిస్థితి మాకు కొత్త కావడంతో ఇలా ఆడుతామని ఊహించలేదు. కానీ మేము చేసిన స్కోరుకు అదనంగా మరో 10-15 పరుగులు జతచేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఎస్ఆర్హెచ్ గెలుపుకు వారి బౌలింగ్ ఒక కారణం కావొచ్చు.. ఎందుకంటే వాళ్లు ఇప్పటికే మూడు మ్యాచ్లు ఆడడంతో పిచ్పై అవగాహన వచ్చేసింది. ఇక మా బ్యాటింగ్ ఈరోజు అనుకున్నంత బాలేదు. చేసింది తక్కువ స్కోరైనా మా బౌలర్ల ప్రదర్శన తక్కువ చేయలేము. అయితే వరుసగా మూడు మ్యాచ్లు పరాజయం చెందడం తో ఒత్తిడి పెరిగినా.. రానున్న మ్యాచ్లపై దాని ప్రభావం లేకుండా చూసుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు. అంతకముందు మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. దీంతోపాటు అత్యంత వేగంగా 5000 పరుగుల మార్కును అందుకున్న రెండో క్రికెటర్గా కూడా చరిత్ర పుటల్లోకెక్కాడు. సన్రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో సింగల్ తీయడంతో రాహుల్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. రాహుల్ పొట్టి ఫార్మాట్లో 143 ఇన్నింగ్స్లలో 5000 పరుగులు పూర్తి చేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి 167 ఇన్నింగ్స్ల్లో, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా 173 ఇన్నింగ్స్ల్లో ఆ మార్కును అందుకున్నారు. ఇక ఓవరాల్ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 5000 పరుగులు పూర్తి చేసిన రికార్డు విండీస్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ కేవలం 132 ఇన్నింగ్స్ల్లోనే ఆ మార్కును చేరుకోగా, రాహుల్ 143 ఇన్నింగ్స్ల్లో, న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్ 163 ఇన్నింగ్స్ల్లో 5000 పరుగులు పూర్తి చేసి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.ఇదిలా ఉంటే, సన్రైజర్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ నిర్ధేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఎస్ఆర్హెచ్ 9 వికెట్ల తేడాతో పంజాబ్పై ఘన విజయం సాధించింది. చదవండి: అలాంటి పరిస్థితుల్లో గంభీర్లా ఆడాలని ఉంటుంది: పడిక్కల్ -
ఆ జట్టుకు గెలిచే అర్హతే లేదు: మంజ్రేకర్
చెన్నై: ముంబైతో శనివారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ తుది జట్టు ఎంపికపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. తుది జట్టులో ముగ్గురు అన్క్యాప్డ్ ఆటగాళ్లకు(అభిషేక్ శర్మ, విరాట్ సింగ్, అబ్దుల్ సమద్) ఒకేసారి అవకాశం కల్పించడంపై జట్టు యాజమాన్యానికి చురకలంటించాడు. ప్రత్యర్ధిని తక్కువ స్కోర్కే(150 పరుగులు) కట్టడి చేయగలిగినా బలహీనమైన మిడిలార్డర్ కారణంగా మ్యాచ్ చేజార్చుకున్న వైనంపై అసహనాన్ని వ్యక్తం చేశాడు. అసలు సన్రైజర్స్కు గెలిచే అర్హతే లేదని మండిపడ్డాడు. కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు వార్నర్(34 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్స్టో(22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) శుభారంభాన్ని అందించినా సన్రైజర్స్ మిడిలార్డర్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని ధ్వజమెత్తాడు. Sorry to say, but anyone that picks Abhishek Sharma, Virat Singh and Abdul Samad all together in one playing XI does not deserve to win. — Sanjay Manjrekar (@sanjaymanjrekar) April 17, 2021 కొత్త కుర్రాళ్లు విరాట్ సింగ్(12 బంతుల్లో 11; ఫోర్), అభిషేక్ శర్మ(4 బంతుల్లో 2), అబ్దుల్ సమద్(8 బంతుల్లో 7; ఫోర్) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, దాని ప్రభావం జట్టుపై పడందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ముంబైతో మ్యాచ్ను చేజార్చుకోవడానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యమే ప్రధాన కారణమని, తుది జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని, లేకపోతే ఆ జట్టు బోణీ కొట్టడానికి కూడా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. 2016 సీజన్ ఛాంపియన్స్గా నిలిచిన ఎస్ఆర్హెచ్.. 3 మ్యాచ్ల తర్వాత కూడా గెలుపు పట్టాలెక్కలేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే నిన్న చెన్నై వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు 13 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ముంబై నిర్ధేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్ 19.4 ఓవర్లలో 137 పరగులకే చాపచుట్టేసింది. ఓపెనర్లు వార్నర్(36), బెయిర్స్టో(43), విరాట్ సింగ్(11), విజయ్ శంకర్(28) మినహా మిగిలిన ఆటగాళ్లెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ను కూడా చేరుకోలేకపోయారు. కాగా, ఎస్ఆర్హెచ్ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్లో ఓటమిపాలవ్వగా, తొలి మ్యాచ్లో తగిలిన ఎదరుదెబ్బ నుంచి కోలుకున్న ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చదవండి: ఆ కారణంగానే విలియమ్సన్ను ఆడించట్లేదు: ఎస్ఆర్హెచ్ కోచ్ -
సన్రైజర్స్ యాజమాన్యంపై సానియా మీర్జా తండ్రి ఫైర్..
హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ జట్టులో స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే హైదరాబాద్ ఈ సీజన్లో ఎక్కువ విజయాలు నమోదు చేసే అవకాశాలు కనిపించట్లేదన్నాడు. సన్రైజర్స్ వరుస పరాజయాలపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన.. టీం మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు. తుది జట్టులో ఆడేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆటగాడు కూడా కనిపించలేదా అని ప్రశ్నించాడు. గత సీజన్లో భావనక సందీప్ను తీసుకున్నా.. అతనికి తుది జట్టులో ఆడే అవకాశం ఇవ్వకపోగా.. ఈ సీజన్లో ఏకంగా వదిలించుకోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగు రాష్ట్రాల నుంచి మహ్మద్ సిరాజ్ ఆర్సీబీకి ఆడుతుంటే.. అంబటి రాయుడు, హరిశంకర్ రెడ్డి చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని ఆయన గర్తు చేశారు. అంతే కాకుండా ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్కు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా విజృంభిస్తున్న వేళ అత్యంత సురక్షితమైన హైదరాబాద్లో మ్యాచ్లు నిర్వహించకపోవడం ఏంటని ఆయన నిలదీశాడు . సన్రైజర్స్ ఆటతీరు చూస్తుంటే ప్లేఆఫ్స్కు అర్హత సాధించేలా కనిపించట్లేదని, దీని వల్ల సొంత అభిమానులు దూరమవుతున్నారని పేర్కొన్నాడు. ఈ విషయమై సన్రైజర్స్ యాజమాన్యం ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 6 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఓ దశలో 16 ఓవర్లలో 115/2 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేయడంతో హైదరాబాద్ మ్యాచ్ను చేజార్చుకుంది. చదవండి: అరుదైన క్లబ్లో చేరికకు వికెట్ దూరంలో.. -
ఐపీఎల్ 2021: ఒత్తిడిలో సన్రైజర్స్ చిత్తు
సన్రైజర్స్ ఒత్తిడిలో పడి చిత్తయ్యింది. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్ను ఛేదించలేక చతికిలబడింది. గెలవాల్సిన మ్యాచ్ను తీసుకెళ్లి ఆర్సీబీ చేతిలో పెట్టింది. ఆరు పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి పాలైంది. 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడంతో సన్రైజర్స్ తిరిగి తేరుకోలేకపోయింది. ఓ దశలో రషీద్ ఖాన్(17) గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్నా రనౌట్ కావడంతో సన్రైజర్స్ ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైన సన్రైజర్స్ పరాజయం చెందింది. సన్రైజర్స్ ఓపెనర్లలో వృద్దిమాన్ సాహా(1) నిరాశపరిచినా డేవిడ్ వార్నర్ ఆకట్టుకున్నాడు. . 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 54 పరుగులతో మెరిశాడు. వార్నర్కు మనీష్ పాండే నుంచి కూడా సహకారం లభించింది. వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. దాంతో సాధారణ స్కోరును సైతం ఛేదించలేక వరుసగా రెండో ఓటమిని మూట గట్టుకుంది. కాగా, ఓటమి అంచుల నుంచి ఆర్సీబీ తేరుకుని విజయం సాధించింది. ఇది ఆర్సీబీకి వరుసగా రెండో విజయం. ఆర్సీబీ బౌలర్లలో షెహబాజ్ అహ్మద్ మూడు వికెట్లు సాధించగా, హర్షల్ పటేల్, సిరాజ్లు తలో రెండు వికెట్లు సాధించారు. జెమీసన్కు వికెట్ దక్కింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్(59; 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి(33; 29 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రమే రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు, టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ను కోహ్లి, పడిక్కల్లు ఆరంభించారు. కాగా, పడిక్కల్(11) నిరాశపరిచాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి నదీమ్కు క్యాచ్ ఇచ్చిన పడిక్కల్ పెవిలియన్ చేరాడు. ఆపై షహబాజ్ అహ్మద్(14) ఔట్ కావడంతో ఆర్సీబీ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో ఆర్సీబీ ఇన్నింగ్స్ను మ్యాక్స్వెల్-కోహ్లిలు మరమ్మత్తు చేశారు. ఈ జోడి 44 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత కోహ్లి ఔటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో ఏబీ డివిలియర్స్(1)పెవిలియన్ చేరాడు. కాసేపటికి వాషింగ్టన్ సుందర్(8) కూడా ఔట్ కావడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. కాగా, మ్యాక్స్వెల్ కడవరకూ క్రీజ్లో ఉండటంతో ఆర్సీబీ 150 పరుగుల టార్గెట్ను ఉంచింది. సన్రైజర్స్ బౌలర్లలో హెల్డర్ మూడు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. నదీమ్, నటరాజన్, భువనేశ్వర్లు తలో వికెట్ తీశారు. సన్రైజర్స్ టపాటపా సన్రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను నష్టపోయింది. బెయిర్ స్టో వికెట్ మొదలు వరుసగా కీలక వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్ మూడు వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్.. ఆపై మరుసటి ఓవర్లో ఒక వికెట్ను, ఆ తర్వాత ఓవర్లో మరొక వికెట్ను నష్టపోయింది. 8 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు సన్రైజర్స్ హైదరాబాద్ 8 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది.115 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయిన సన్రైజర్స్.. 123 పరుగుల స్కోరు బోర్డుపై వచ్చేసరికి ఆరో వికెట్ను నష్టపోయింది. విజయ్ శంకర్(3) ఆరో వికెట్గా ఔటయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన 18 ఓవర్ ఆఖరి బంతికి విజయ్ శంకర్ ఆడిన షాట్ కాస్తా పైకి లేవడంతో కోహ్లి క్యాచ్ తీసుకున్నాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు షెహబాజ్ వేసిన ఒకే ఓవర్లో మూడు వికెట్లు సాధించాడు. ముందు బెయిర్ స్టోను, ఆపై మనీష్ పాండే, అబ్దుల్ సామద్లను బోల్తా కొట్టించి సన్రైజర్స్ క్యాంప్ను టెన్షన్లో పెట్టాడు., ఒకే ఓవర్లో మూడు వికెట్లు రావడంంతో ఆర్సీబీ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. దాంతో 116 పరుగుల వద్ద ఐదో వికెట్ను కోల్పోయింది సన్రైజర్స్. బెయిర్ స్టో విఫలం.. ఆపై వెంటనే మనీష్ బెయిర్ స్టో విఫలమయ్యాడు. బెయిర్ స్టో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజ్లోకి వచ్చిన వెంటనే ఫోర్ కొట్టి మంచి టచ్లో కనిపించిన బెయిర్ స్టో.. షెహబాజ్ అహ్మద్ బౌలింగ్లో డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే మనీష్ పాండే(38) పెవిలియన్ చేరాడు. 17 ఓవర్ తొలి బంతికి బెయిర్ స్టో ఔటైతే, తర్వా బంతికి మనీష్ పెవిలియన్ బాట పట్టాడు., షాట్ ఆడబోయి హర్షల్ నటేల్ క్యాచ్ పట్టడంతో మనీష్ పెవిలియన్ చేరాడు. వార్నర్(54) ఔట్, ఎస్ఆర్హెచ్ 98/2 డేవిడ్ వార్నర్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 54 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. జెమీసన్ వేసిన 14 ఓవర్ రెండో బంతికి షాట్కు యత్నించిన వార్నర్.. క్రిస్టియన్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. దాంతో 98 పరుగుల వద్ద సన్రైజర్స్ రెండో వికెట్ను కోల్పోయింది. వార్నర్ బాధ్యతాయుతమైన ఫిఫ్టీ ఓవరాల్ టీ20 కెరీర్లో 300వ మ్యాచ్ ఆడుతున్న వార్నర్(31 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్) ఐపీఎల్ కెరీర్లో 49వ ఫిఫ్టీ నమోదు చేశాడు. 13 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 96/1. మనీశ్ పాండే(34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడగా ఆడుతున్నాడు. నిలకడగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్, 10 ఓవర్ల తర్వాత 77/1 లూజ్ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డ్ను పరుగులు పెట్టిస్తున్న ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు నిలకడైన ఆటతీరును కనబరుస్తూ, గెలుపు దిశగా సాగుతున్నారు. మనీశ్ పాండే(27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్(24 బంతుల్లో 28; 5 ఫోర్లు, సిక్స్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆర్సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించింది. ఎస్ఆర్హెచ్ గెలుపునకు 60 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉంది. 6 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 50/1 ఆదిలోనే సాహా వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మనీశ్ పాండే(14 బంతుల్లో 14; ఫోర్, సిక్స్) నిలకడైన బ్యాటింగ్కు కెప్టెన్ వార్నర్(13 బంతుల్లో 28; 4 ఫోర్లు, సిక్స్) మెరుపులు తోడవ్వడంతో 6 ఓవర్లు ముగిసే సమాయానికి ఎస్ఆర్హెచ్ 50 పరుగుల స్కోర్ను చేరుకోగలిగింది. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్, సాహా(1) ఔట్ సింగల్ తీసేందుకు కూడా ఇబ్బంది పడ్డ వృద్ధిమాన్ సాహా 9 బంతులను ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించి సిరాజ్ బౌలింగ్లో మ్యాక్సీకి సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. తొలి ఓవర్ మెయిడిన్ వేసిన సిరాజ్.. రెండో ఓవర్లో సాహా వికెట్ పడగొట్టి కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సమాయానికి ఎస్ఆర్హెచ్ స్కోర్ 15/1. క్రీజ్లో వార్నర్(5 బంతుల్లో 7), మనీశ్ పాండే(4 బంతుల్లో 1) ఉన్నారు. మ్యాక్సీ ఫిఫ్టీ.. ఆర్సీబీ 149/8 గ్లెన్ మ్యాక్స్వెల్ హాఫ్ సెంచరీ సహాకారంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ సాహా చేతికి క్యాచ్ ఇచ్చిన మ్యాక్సీ(41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎనిమిదో వికెట్గా వెనుదిరిగాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 2, భువీ, షాబాజ్, నటరాజన్లకు తలో వికెట్ దక్కింది. జేమీసన్(12) ఔట్ హోల్డర్ బౌలింగ్లో మనీశ్ పాండే క్యాచ్ అందుకోవడంతో జేమీసన్(9 బంతుల్లో 12; 2 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్, క్రిస్టియన్(1) ఔట్ నటరాజన్ బౌలింగ్లో బాటమ్ ఎడ్జ్ తీసుకోవడంతో వికెట్ కీపర్ సాహా చేతికి క్యాచ్ ఇచ్చి డేనియల్ క్రిస్టియన్(2 బంతుల్లో 1) వెనుదిరిగాడు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 110/6. క్రీజ్లో మ్యాక్సీ(35), జేమీసన్(1) ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ, సుందర్(8) ఔట్ ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆర్సీబీని కోలుకోలేని దెబ్బకొట్టాడు. వరుసగా డివిలియర్స్, సుందర్(11 బంతుల్లో 8; ఫోర్)ల వికెట్లు తీసి ఆర్సీబీని కష్టాల్లోకి నెట్టాడు. రషీద్ బౌలింగ్లో మనీశ్ పాండే అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో సుందర్ పెవిలియన్ చేరాడు. 16 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 106/5. క్రీజ్లో మ్యాక్సీ(33), డేనియల్ క్రిస్టియన్(0) ఉన్నాడు. ఆర్సీబీకి మరోషాక్.. డివిలియర్స్(1) ఔట్ 13వ ఓవర్ తొలి బంతికి కెప్టెన్ కోహ్లి వికెట్ను కోల్పోయిన ఆర్సీబీ, ఆ మరుసటి ఓవర్ నాలుగో బంతికే డేంజరస్ బ్యాట్స్మెన్ డివిలియర్స్(5 బంతుల్లో 1) వికెట్ను కూడా చేజార్చుకుని కష్టాల్లో చిక్కుకుంది. రషీద్ ఖాన్ బౌలింగ్లో షార్ట్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోవడంతో ఏబీ పెవిలియన్ బాట పట్టాడు. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 96/4. క్రీజ్లో మ్యాక్సీ(30), సుందర్(1) ఉన్నారు. కోహ్లి(33) అవుట్ నిలకడగా ఆడుతున్న ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి(29 బంతుల్లో 33; 4 ఫోర్లు).. హోల్డర్ బౌలింగ్లో విజయ్ శంకర్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్కు చేరాడు. బంతిని ఫ్లిక్ చేసే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ తీసుకోవడంతో బంతి గాల్లోకి లేచింది. దీంతో కోహ్లి పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. డ్రసింగ్ రూమ్లోకి వెళ్లిన అనంతరం కోహ్లి బ్యాట్ను కుర్చీ కేసి కొట్టి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లి అవుటయ్యాక జట్టు స్కోర్ 91/3. క్రీజ్లో మ్యాక్సీ(28), ఏబీ డివిల్లియర్స్(0) ఉన్నారు. నదీమ్కు చుక్కలు చూపించిన మ్యాక్సీ షాబాజ్ నదీమ్ వేసిన 11వ ఓవర్లో మ్యాక్స్వెల్ విరుచుకుపడ్డాడు. వరుసగా 6,4,6 పరుగులు పిండుకున్నాడు. అనంతరం సింగల్ తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇవ్వగా అతను కూడా మరో బౌండరీ బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. దీంతో 11 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 85/2. క్రీజ్లో కోహ్లి(23 బంతుల్లో 29; 4 ఫోర్లు), మ్యాక్స్వెల్(20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నారు. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 58/2 రెండు వికెట్లు కోల్పోయాక ఆర్సీబీ స్కోర్ నెమ్మదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(18 బంతుల్లో 22; 3 ఫోర్లు) సింగల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేస్తున్నా మ్యాక్స్వెల్(13 బంతుల్లో 7; ఫోర్) పరుగులు సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 9 ఓవర్ల అనంతరం ఆర్సీబీ స్కోర్ 58/2. ఆర్సీబీ రెండో వికెట్ డౌన్, షాబాజ్(14) ఔట్ మంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన షాబాజ్ అహ్మద్(10 బంతుల్లో 14; సిక్స్).. ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ అందించి రెండో వికెట్గా వెనుదిరిగాడు. 7 ఓవర్ల అనంతరం ఆర్సీబీ స్కోర్ 48/2. క్రీజ్లో విరాట్(15 బంతుల్లో 20; 3 ఫోర్లు), మ్యాక్స్వెల్(0) ఉన్నారు. 5 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 36/1 తొలి వికెట్ కోల్పోయాక ఆర్సీబీ ఆచితూచి ఆడుతుంది. పడిక్కల్ అవుటయ్యాక క్రీజ్లోకి వచ్చిన షాబాజ్ అహ్మద్(7 బంతుల్లో 13; సిక్స్) వచ్చి రాగానే అద్భుతమైన సిక్సర్ బాది మంచి టచ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మరో ఎండ్లో కెప్టెన్ విరాట్(10 బంతుల్లో 10; ఫోర్) సింగల్స్పైనే ఎక్కువగా కాంసంట్రేట్ చేస్తూ స్ట్రయిక్ రొటేట్ చేస్తున్నాడు. దీంతో 5 ఓవర్ల తర్వాత ఆర్సీబీ వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. పడిక్కల్(11) ఔట్ లీగ్లో తొలి మ్యాచ్ ఆడుతున్న దేవ్దత్ పడిక్కల్(13 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. భువనేశ్వర్ వేసిన 3వ ఓవర్లో మిడ్ వికెట్లో షాబాజ్ నదీమ్ అద్భుతమైన లో క్యాచ్ అందుకోవడంతో అతను పెవిలియన్ బాట పట్టాడు. 3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 20/1. క్రీజ్లో కోహ్లి(4 బంతుల్లో 6; ఫోర్), షాబాజ్ అహ్మద్(1) ఉన్నారు. ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను బోల్తా కొట్టించి ఉరకలేస్తున్న ఆర్సీబీ.. నేడు సన్రైజర్స్తో జరుగబోయే మ్యాచ్లో కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు లీగ్లో తమ తొలి మ్యాచ్లో కేకేఆర్ చేతిలో ఖంగుతిన్న సన్రైజర్స్.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ జట్ల మధ్య చెపాక్ వేదికగా ఆసక్తికరపోరు జరగనుంది. ఇక ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచ్ల్లో తలపడగా.. ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్ల్లో విజయం సాధించగా, 7 మ్యాచ్ల్లో బెంగళూరు గెలుపొందింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఐపీఎల్లో బెంగళూరుపై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 231 పరుగులు కాగా.. హైదరాబాద్పై బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 227 పరుగులుగా ఉంది. గత సీజన్లో(ఐపీఎల్ 2020) ఇరు జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇందులో రెండు లీగ్ మ్యాచ్లు కాగా, ఒకటి ప్లేఆఫ్ మ్యాచ్గా ఉంది. ఇందులో తొలి మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుపొందింది. ప్లేఆఫ్లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుపై హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, ఇరు జట్లు ఐపీఎల్ 2016 సీజన్ టైటిల్ పోరులో తలపడగా.. వార్నర్ సేన బెంగళూరుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. ఇక ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే.. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు బెయిర్ స్టో, మనీష్ పాండేలు గత మ్యాచ్లో దుమ్మురేపారు. వీరికి తోడుగా డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్లో ఫాంలోకి వస్తే ఆ జట్టుకు తిరుగే ఉండదు. గత మ్యాచ్కు దూరమైన కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. ఇక భువీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మలతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఆల్రౌండర్ విజయ్ శంకర్ ఫాంలో లేకపోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగించే అంశం. ఇక బెంగళూరులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పవర్ హిట్టర్లు గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ మంచి టచ్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆల్రౌండర్ డేనియల్ క్రిస్టియన్ గత మ్యాచ్లో విఫలమయ్యాడు. దాంతో.. ఆ జట్టు లోయర్ మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. బౌలింగ్లోనూ ఆర్సీబీ అంత బలంగా లేదు. జేమిసన్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగా.. చహల్ మొదటి మ్యాచ్లో 4 ఓవర్లలో 41 పరుగులిచ్చేశాడు. సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కించుకోలేకపోయాడు. తుది జట్లు: ఎస్ఆర్హెచ్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), మనీష్ పాండే, విజయ్ శంకర్, జేసన్ హోల్డర్, జానీ బెయిర్ స్టో, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టి నటరాజన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవ్దత్ పడిక్కల్, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీషన్, చాహల్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్ -
సన్రైజర్స్, బెంగళూరు మ్యాచ్కు వర్షం అంతరాయం..?
చెన్నై: నిన్నటి నుంచి చెన్నై నగరంలోని పలు చోట్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు నగరంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ జరుగనున్న చిదంబరం స్టేడియం పరిసరాల్లో అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి అక్కడ ఆకాశం మేఘావృతమై ఉండటంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ భారీ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.అయితే ప్రస్తుతానికి చిరు జల్లులు మాత్రమే కురుస్తున్నాయి కాబట్టి.. మ్యాచ్ ఆరంభ సమయానికి వరణుడు కరుణిస్తే మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలున్నాయి. -
సన్రైజర్స్కు డబుల్ ధమాకా.. జట్టులో చేరిన స్టార్ ఆటగాళ్లు
చెన్నై: ఐపీఎల్ 2021 కోసం సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్లు శుక్రవారం చెన్నైలో ల్యాండయ్యారు. వీరితోపాటు ఆ జట్టు సహాయ కోచ్ బ్రాడ్ హడిన్ కూడా చెన్నైకు వచ్చాడు. ఈ విషయాన్ని సన్రైజర్స్ యాజమాన్యం తమ ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. "ఈగిల్స్ ల్యాండ్ అయ్యాయి.. కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, బ్రాడ్ హడిన్లకు స్వాగతం" అంటూ సన్రైజర్స్ ట్వీట్ చేసింది. 🚨The eagles have landed🚨 We repeat, the eagles have landed! Welcoming skipper @davidwarner31, Kane and Brad Haddin to Chennai. Let’s go Risers! #OrangeOrNothing #ReturnOfTheRisers #OrangeArmy pic.twitter.com/jgclaoQLLB — SunRisers Hyderabad (@SunRisers) April 2, 2021 ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న 14వ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ జట్టు తమ తొలి ఐదు మ్యాచ్లను చెన్నైలోనే ఆడనుంది. ఈ నెల 11న తమ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఐదు మ్యాచ్ల అనంతరం హైదరాబాద్ జట్టు.. ఢిల్లీలో నాలుగు మ్యాచ్లు, ఆతరువాత కోల్కతాలో మూడు, బెంగళూరులో రెండు మ్యాచ్లు ఆడనుంది. కాగా, కొద్ది రోజుల కిందటే స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ లీగ్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో సన్రైజర్స్ యాజమాన్యం ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ను తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: ప్రముఖ మోడల్తో పంత్ డేటింగ్.. పాత గర్ల్ఫ్రెండ్తో బ్రేకప్..? -
సన్రైజర్స్కు గుడ్న్యూస్..
హైదరాబాద్: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 సీజన్లో పాల్గొనేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ సారధి డేవిడ్ వార్నర్ స్వదేశం నుండి బయలుదేరాడు. వార్నర్.. ఈ సీజన్ తొలి విడత మ్యాచ్లకు దూరమవుతాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో, లీగ్లో పాల్గొనేందుకు బయలుదేరానని ఆయన గుడ్న్యూస్ చెప్పడంతో సన్రైజర్స్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందు వార్నర్ తన కుటుంబ సభ్యులతో గడిపాడు. తన పిల్లలతో కలిసి విందును ఆరగించి ఎంజాయ్ చేశాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) కాగా, క్యాష్ రిచ్ లీగ్లో పాల్గొనేందుకు ఆటగాళ్లందరూ ఒక్కొక్కరుగా తమతమ జట్లతో చేరుతున్నారు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం లీగ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. చెన్నై వేదికగా జరిగే సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది. ఏప్రిల్ 11న ఇదే వేదికగా జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. చదవండి: డక్వర్త్ కన్ఫ్యూజన్: కివీస్, బంగ్లా రెండో టీ20లో హైడ్రామా -
సెంచరీతో చెలరేగిన వార్నర్.. సన్రైజర్స్కు గుడ్ న్యూస్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్ లభించింది. గాయం కారణంగా టీమిండియాతో జరిగిన సిరీస్కు పూర్తి స్థాయిలో అందుబాటులోలేని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఐపీఎల్లో ఆడతాడో లేదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో రంగప్రవేశం చేసి, సెంచరీతో కదం తొక్కాడు. మార్ష్ కప్లో భాగంగా న్యూసౌత్ వేల్స్ తరఫున బరిలోకి దిగిన అతను.. టస్మానియా టైగర్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో అలరించడమే కాకుండా వరుసగా 87, 24, 69, 108 పరుగులు సాధించి సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇది సన్రైజర్స్ అభిమానులకు కచ్చితంగా గుడ్న్యూసనే చెప్పాలి. కాగా, గాయం కారణంగా వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్కు దూరమవుతాడన్న ఊహాగానాల నేపథ్యంలో అతను తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడమే కాకుండా శతక్కొట్టడంతో సన్రైజర్స్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఐపీఎల్ మ్యాచ్లు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానుండగా, సన్రైజర్స్ తన తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా ఏప్రిల్ 11న జరుగనుంది. -
సన్రైజర్స్కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా!
సిడ్నీ: ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ దెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు కెప్టెన్.. ప్రధాన బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఆసీస్, టీమిండియా సిరీస్ మధ్యలో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. భారత్తో జరిగిన వన్డే సిరీస్లో గజ్జల్లో గాయం అవడంతో మూడో వన్డేతో పాటు టీ 20 సిరీస్కు దూరమయ్యాడు. ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్ మొదటి రెండు మ్యాచ్లకు దూరమైన వార్నర్ను మూడు, నాలుగు టెస్టులకు మాత్రం ఎంపికయ్యాడు. అతను పూర్తి ఫిట్గా లేకున్నా కూడా సీఏ అతన్ని బరిలోకి దింపిందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే తాను వంద శాతం ఫిట్గా ఉన్నానని.. అందుకే మిగిలిన టెస్టులకు ఎంపిక చేశారంటూ వార్నర్ అప్పట్లో చెప్పుకొచ్చాడు. అయితే చివరి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్లు ఆడిన వార్నర్ 5,13, 1,48 పరుగులు చేశాడు. తాజాగా వార్నర్కు గజ్జల్లో గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దాంతో పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించేందుకు కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని వార్నరే స్వయంగా వెల్లడించాడు. దీంతో ఏప్రిల్ మొదటివారం నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 2021 సీజన్లో డేవిడ్ వార్నర్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఐపీఎల్లోపూ పూర్తి స్తాయిలో కోలుకుంటే కచ్చితంగా పాల్గొంటానని స్పష్టం చేశాడు. ఐపీఎల్లో పాల్గొనాలంటే సీఏ జారీ చేసిన ఎన్వోసీ తప్పనిసరిగా ఉండాలి. వార్నర్ ఫిట్గా లేకుంటే మాత్రం సీఏ ఎన్వోసీ ఇవ్వదు.. దీంతో ఎన్వోసీ లేకుండా అతను ఐపీఎల్లో ఆడలేడు. అలా చూసుకుంటే వార్నర్ ఐపీఎల్ 14వ సీజన్కు దూరమైతే మాత్రం ఎస్ఆర్హెచ్కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. వార్నర్ దూరమైతే అతని స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ వ్యహరించే అవకాశం ఉంది. 2018లో బాల్ టాంపరింగ్ కారణంగా డేవిడ్ వార్నర్పై ఏడాది నిషేధం పడగా.. అప్పుడు హైదరాబాద్ కెప్టెన్గా కేన్ విలియమ్సన్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 142 మ్యాచ్లాడిన డేవిడ్ వార్నర్.. 5,254 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016లో వార్నర్ సారధ్యంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: 'ఓడిపోయుండొచ్చు.. కోహ్లి మనసు గెలిచాం' అశ్విన్ అవసరం తీరిపోయింది.. కమ్బ్యాక్ కష్టమే -
ఘనంగా భారత క్రికెటర్ విజయ్ శంకర్ వివాహం
చెన్నై: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గురువారం వివాహం చేసుకున్నాడు. గతేడాది ఆగస్ట్లో నిశ్చితార్థం చేసుకోగా తాజాగా గురువారం వైశాలి విశ్వేశ్వరను పెళ్లాడాడు. అయితే ఎలాంటి హడావుడి లేకుండా కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య చెన్నెలో పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విజయ్ శంకర్ ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టు ఆటగాడు. దీంతో విజయ్ శంకర్కు సన్రైజర్స్ బృందం శుభాకాంక్షలు తెలిపింది. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను విజయ్ శంకర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వివాహం చేసుకున్న విజయ్ శంకర్కు భారత జట్టు ఆటగాళ్లు రాహుల్, చాహల్తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ శంకర్ 2018లో భారత క్రికెట్ జట్టులోకి ప్రవేశించాడు. తొలిమ్యాచ్ శ్రీలంకతో జరిగిన టీ- 20లో ఆడాడు. 2019 వరల్డ్ కప్ భారత జట్టులో విజయ్ ఉన్నాడు. ఇప్పటివరకు విజయ్శంకర్ 12 వన్డేలు, 9 టీ-20 మ్యాచ్లు ఆడాడు. -
సన్రైజర్స్కు షాక్.. ఫైనల్లో ఢిల్లీ
ఢిల్లీ నిరీక్షణ ఫలించింది. ఐపీఎల్ చరిత్రలో ఎట్టకేలకు ఆ జట్టు తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఎక్కడ విఫలమైందో తెలుసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ రెండో క్వాలిఫయర్లో వాటిని అధిగమించింది. ఆఖరి అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుంది. ధావన్ మెరుపు ఇన్నింగ్స్... స్టొయినిస్ ఆల్రౌండ్ ప్రదర్శన... రబడ వైవిధ్యభరిత బౌలింగ్... ఢిల్లీని ఫైనల్ మెట్టుపై పడేసింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో సన్రైజర్స్ ఐపీఎల్–13ను మూడో స్థానంతో ముగించింది. అబుదాబి: ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదోసారి టాప్–2 జట్లే టైటిల్ పోరుకు అర్హత పొందాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ‘సై’ అంటోంది. ఆదివారం జరిగిన రెండో క్వాలిఫయర్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ 17 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టొయినిస్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్), హెట్మైర్ (22 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. తర్వాత లక్ష్యఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసి ఓడింది. కేన్ విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్లు) పరువు నిలిపే పోరాటం చేశాడు. స్టొయినిస్ (3/26), రబడ (4/29) హైదరాబాద్ను దెబ్బ తీశారు. విలియమ్సన్ పోరాటం.... 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు అనుభవజ్ఞుడైన అశ్విన్ తొలి ఓవర్లోనే 12 పరుగులు చేసింది. సన్రైజర్స్ జోరు ఇక షురూ అనుకుంటున్న తరుణంలోనే రబడ రెండో ఓవర్ తొలి బంతికే వార్నర్ (2)ను క్లీన్బౌల్డ్ చేశాడు. ఐదో ఓవర్ వేసిన స్టొయినిస్... ప్రియమ్ గార్గ్ (17; 2 సిక్స్లు)ను బౌల్డ్ చేశాడు. రెండు బంతుల వ్యవధిలో మనీశ్ పాండే (14 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను ఔట్ చేశాడు. దీంతో 44 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయిన హైదరాబాద్ కష్టాల్లో పడింది. కేన్ విలియమ్సన్, హోల్డర్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. క్రీజులో కుదురుకున్నాక విలియమ్సన్ చెలరేగాడు. హోల్డర్ (11) ఔటయ్యాక... అబ్దుల్ సమద్ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి లక్ష్యాన్ని అందుకునేందుకు విలియమ్సన్ విఫలయత్నం చేశాడు. జట్టు స్కోరు 12.1 ఓవర్లలో వంద పరుగులకు చేరింది. ఈ దశలో పరుగుల వేగం పెరగడంతో ఢిల్లీ శిబిరం లో కలవరం మొదలైంది. 19 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన తరుణంలో విలియమ్సన్ను స్టొయినిస్ ఔట్ చేశాడు. రబడ ఒకే ఓవర్లో సమద్, రషీద్ ఖాన్లను పెవిలియన్ చేర్చాడు. ఐదో బంతికి శ్రీవత్స్ గోస్వామి (0) కూడా అవుట్ కావడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. గతంలో ఆ జట్టు నాలుగుసార్లు (2008, 2009–సెమీఫైనల్; 2012, 2019–ప్లే ఆఫ్స్ మూడో స్థానం) ప్రయత్నించి విఫలమైంది. ఓపెనర్ల మెరుపులు... అంతకుముందు ఢిల్లీ ఆరంభం నుంచే ధనాధన్కు శ్రీకారం చుట్టింది. తొలుత స్టొయినిస్... ఆ తర్వాత ధావన్ దంచేశారు. నాలుగో ఓవర్ వేసిన హోల్డర్ను స్టొయినిస్ చితగ్గొట్టాడు. 4, 0, 4, 0, 6, 4లతో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో 4.5 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. కాసేపటికి స్టొయినిస్ను రషీద్ఖాన్ బౌల్డ్ చేశాడు. 9వ ఓవర్లో ధావన్ ఫిఫ్టీ, జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత ఢిల్లీ ఆట చూస్తే వేగం తగ్గినట్లనిపించింది. 4 ఓవర్ల పాటు (11 నుంచి 14) 24 పరుగులే చేయగలిగింది. అయ్యర్ (21) ఔటయ్యాక వచ్చిన హెట్మైర్ చెలరేగడంతో ఢిల్లీ స్కోరు మళ్లీ పుంజుకుంది. హోల్డర్ 18వ ఓవర్లో హెట్మైర్ 3, ధావన్ ఒక బౌండరీ బాదడంతో 18 పరుగులొచ్చాయి. నటరాజన్ ఆఖరి ఓవర్ను నియంత్రించి 7 పరుగులే ఇచ్చాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: స్టొయినిస్ (బి) రషీద్ ఖాన్ 38; ధావన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 78; అయ్యర్ (సి) మనీశ్ పాండే (బి) హోల్డర్ 21; హెట్మైర్ (నాటౌట్) 42; పంత్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–86, 2–126, 3–178. బౌలింగ్: సందీప్ 4–0–30–1, హోల్డర్ 4–0–50–1, నదీమ్ 4–0–48–0, రషీద్ ఖాన్ 4–0–26–1, నటరాజన్ 4–0–32–0. సన్రైజర్స్ ఇన్నింగ్స్: ప్రియమ్ గార్గ్ (బి) స్టొయినిస్ 17; వార్నర్ (బి) రబడ 2; మనీశ్ పాండే (సి) నోర్జే (బి) స్టొయినిస్ 21; విలియమ్సన్ (సి) రబడ (బి) స్టొయినిస్ 67; హోల్డర్ (సి) ప్రవీణ్ దూబే (బి) అక్షర్ 11; సమద్ (సి) (సబ్) కీమో పాల్ (బి) రబడ 33; రషీద్ ఖాన్ (సి) అక్షర్ (బి) రబడ 11;గోస్వామి (సి) స్టొయినిస్ (బి) రబడ 0; నదీమ్ (నాటౌట్) 2; సందీప్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–12, 2–43, 3–44, 4–90, 5–147, 6–167, 7–167, 8–168. బౌలింగ్: అశ్విన్ 3–0–33–0, రబడ 4–0–29–4, నోర్జే 4–0–36–0, స్టొయినిస్ 3–0–26–3, అక్షర్ 4–0–33–1, ప్రవీణ్ దూబే 2–0–14–0. ► శిఖర్ ధావన్ తన ఐపీఎల్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఈ సీజన్లో అతను 16 మ్యాచ్లు ఆడి 603 పరుగులు చేశాడు. 2012లో ధావన్ అత్యధికంగా 569 పరుగులు సాధించాడు. ► ఐపీఎల్లో ఢిల్లీ జట్టు తరఫున ఒకే సీజన్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా రబడ నిలిచాడు. ఈ సీజన్లో రబడ 29 వికెట్లు పడగొట్టాడు. మోర్నీ మోర్కెల్ (2012లో 25 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు. -
సూపర్: 3 బంతులు, 2 పరుగులు, 2 వికెట్లు
దుబాయ్: సన్రైజర్స్తో ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో కోల్కత నైట్రైడర్స్ జట్టు సూపర్ విజయం సాధించింది. కోల్కత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన లాకీ ఫెర్గూసన్ సూపర్ ఓవర్లో డేవిడ్ వార్నర్ వికెట్ తీయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తొలుత 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్యాట్స్మెన్ను ఫెర్గూసన్ తన పదునైన బంతులతో హడలెత్తించాడు. నాలుగు ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 15 పరుగులే ఇచ్చాడు. అటు తర్వాత సూపర్ ఓవర్లోనూ సత్తా చాటాడు. 3 బంతుల్లో 2 పరుగులుచ్చి 2 వికెట్లు తీసిన ఈ న్యూజిలాండ్ పేసర్ సన్రైజర్స్ హైదరాబాద్కు చుక్కలు చూపించాడు. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్లో మోర్గాన్ 1, దినేష్ కార్తీక్ 2 పరుగులు చేసి లాంఛనాన్ని పూర్తి చేశారు. కేకేఆర్కు అద్భుతమైన గెలుపునందించిన ఫెర్గూసన్ కేకేఆర్ తరపున తొలి మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. (చదవండి: షమీ నిర్ణయంపై ఆశ్చర్యపోయాం: రాహుల్) తొలి బంతికి వార్నర్ క్లీన్ బౌల్డ్ సూపర్ ఓవర్ తొలి బంతికి ఫుల్ లెంగ్త్ డెలివరీతో వార్నర్ను క్లీన్ బౌల్డ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి రెండు పరుగులిచ్చాడు. మూడో బంతికి చక్కని యార్కర్తో సమద్ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. సూపర్ ఓవర్ మొదటి బంతికి వార్నర్ను ఔట్ చేయడం మరచిపోలేని అనుభూతి అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్లో ఫెర్గూసన్ చెప్పుకొచ్చాడు. అది తన ఫేవరెట్ వికెట్లలో ఒకటి అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్లో తన బౌలింగ్ విషయానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తనకే వదిలేశాడని ఫెర్గూసన్ వెల్లడించాడు. అటు మ్యాచ్లోనూ, ఇటు సూపర్ ఓవర్లోనూ మెరుగ్గా రాణించి జట్టుకు విజయాన్నందించిన ఫెర్గూసన్పై కెప్టెన్ మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. గత కొన్ని మ్యాచ్ల్లో పోరాడి ఓడిన కేకేఆర్ తాజా మ్యాచ్తో పోటీలోకి వచ్చిందని అన్నాడు. (చదవండి: సూపరో... సూపరు) -
సూపరో... సూపరు
ఉత్కంఠకు రూపం ఉంటే అది కూడా ఊపిరి బిగపట్టుకుని ఆస్వాదించేది. బంతి బంతికీ తారుమారవుతున్న ఆధిపత్యాన్ని చూసి అబ్బురపడేది. ప్రతి యేటా మండే ఎండలో అభిమానులకు క్రికెట్ వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి వర్షా కాలంలో జరుగుతున్నా అభిమానులు మాత్రం చివరి బంతి వరకు తుది ఫలితం ఎలా ఉంటుందోనని ఆలోచిస్తూ, అనుక్షణం చోటు చేసుకుంటున్న మలుపులకు మురిసిపోతూ తన్మయత్వంతో తడిసి ముద్దవుతున్నారు. ఇప్పటివరకు 12 ఐపీఎల్ సీజన్లు జరిగినా ఏ సీజన్లోనూ జరగని అత్యద్భుతం ఆదివారం చోటు చేసుకుంది. ఒకే రోజు రెండు ఐపీఎల్ మ్యాచ్లు ‘సూపర్ ఓవర్’కు దారి తీశాయి. తొలుత అబుదాబి వేదికగా జరిగిన ‘సూపర్’ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను కోల్కతా నైట్రైడర్స్ ఓడించగా... దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత కూడా ‘సూపర్ ఓవర్’లోనే తేలింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం ఒక సూపర్ ఓవర్లో కాకుండా రెండు సూపర్ ఓవర్లలో తేలడం విశేషం. గతంలో సూపర్ ఓవర్లోనూ రెండు జట్ల స్కోర్లు సమమైతే ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించేవారు. గతేడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ‘సూపర్ ఓవర్’ కూడా టై కావడం... ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఫలితంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమైతే ఏదో ఒక జట్టు గెలిచేవరకు సూపర్ ఓవర్ను ఆడించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధన తెచ్చింది. ఐపీఎల్లో ఆదివారం ఈ నిబంధనను అమలు చేశారు. అబుదాబి: బంతితో అంతా తానై ఆడించిన లాకీ ఫెర్గూసన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టును గట్టెక్కించాడు. ముందు 15 పరుగులకు 3 వికెట్లు... ఆ తర్వాత సూపర్ ఓవర్లో 3 బంతుల్లో 2 పరుగులుచ్చి 2 వికెట్లు తీసిన ఈ న్యూజిలాండ్ పేసర్ సన్రైజర్స్ హైదరాబాద్కు చుక్కలు చూపించాడు. వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సన్రైజర్స్ను గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ ఒత్తిడిలో తడబడి ఓటమివైపు నిలబడ్డాడు. ఆద్యంతం టన్నులకొద్దీ వినోదాన్ని పంచిన ఈ మ్యాచ్లో చివరకు గెలుపు కోల్కతావైపే నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (37 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ మోర్గాన్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుతో జట్టు మంచి స్కోరు అందుకుంది. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 163 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయ్యింది. కెప్టెన్ వార్నర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు), బెయిర్స్టో (28 బంతుల్లో 36; 7 ఫోర్లు), విలియమ్సన్ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఫెర్గూసన్ (3/15) ఈ ఐపీఎల్లో తాను ఆడిన తొలి మ్యాచ్లోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం అందుకున్నాడు. నిదానంగా మొదలై.... దూకుడుగా ముగిసి మండే ఎండలో కోల్కతా ఇన్నింగ్స్ నెమ్మదిగానే సాగింది. తొలి మూడు ఓవర్లలో 15 పరుగులే చేసింది. తర్వాత రాహుల్ త్రిపాఠి 6, 4... గిల్ వరుసగా మూడు బౌండరీలు బాదడంతో పవర్ప్లేలో 48 పరుగులు చేసిన కోల్కతా త్రిపాఠి వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్ కోసం బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. నితీశ్ రాణా (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్))తో కలిసి గిల్ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో 10 ఓవర్లకు కోల్కతా 77/1తో నిలిచింది. అప్పటికే కుదురుకున్న గిల్, రాణా వరుస ఓవర్లలో... ప్రియమ్ గార్గ్ అద్భుత ఫీల్డింగ్కు పెవిలియన్ బాట పట్టారు. కాసేపటికే రసెల్ (11 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా వెనుదిరగడంతో కోల్కతా 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులే చేయగలి గింది. ఈ దశలో మోర్గాన్, కార్తీక్ చెలరేగి చివరి ఐదు ఓవర్లలో 58 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్లో మోర్గాన్ 4, 6 సహాయంతో 16 పరుగులు చేసి చివరి బంతికి అవుటయ్యాడు. విలియమ్సన్ పట్టుదల... ఫీల్డింగ్లో గాయపడిన విలియమ్సన్ ఓపెనర్గా వచ్చి ఆశ్చర్యపరిచాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతో సింగిల్స్ కోసం ఆరాటపడకుండా బౌండరీల ద్వారా పరుగులు సాధించాడు. బెయిర్స్టో కూడా విలియమ్సన్కు అండగా నిలవడంతో పవర్ప్లేలో సన్రైజర్స్ 58 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇందులో 46 (10 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు బౌండరీల ద్వారా రావడం విశేషం. పవర్ప్లే తర్వాతి తొలి బంతికే విలియమ్సన్ను అవుట్ చేసి ఫెర్గూసన్ రైజర్స్ జోరుకు కళ్లెం వేశాడు. ఫెర్గూసన్ వైవిధ్యం... వార్నర్ పోరాటం విలియమ్సన్ ఔటయ్యాక హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడింది. అద్భుత బంతితో ప్రియమ్ గార్గ్ (4)ను బౌల్డ్ చేసిన ఫెర్గూసన్ జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. మరుసటి ఓవర్లోనే బెయిర్స్టోను వరుణ్ అవుట్ చేశాడు. ఈ దశలో మరోసారి బంతి అందుకున్న ఫెర్గూసన్ చక్కటి యార్కర్తో మనీశ్ పాండే (6)ను పెవిలియన్ చేర్చి రైజర్స్ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా వార్నర్ పోరాటం ఆపలేదు. విజయ్ శంకర్ (7)తో కలిసి స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో 15 ఓవర్లకు 109/4తో నిలిచింది. సమద్ (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) వచ్చాక ఆటలో వేగం పెరిగింది. ఉన్నంత వరకు ధాటిగా ఆడిన సమద్... కెప్టెన్పై భారాన్ని తగ్గించాడు. అప్పటివరకు బౌలింగ్తో బెంబేలెత్తించిన ఫెర్గూసన్ తెలివైన ఫీల్డింగ్తో సమద్ను అవుట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక్కడే మ్యాచ్ పూర్తి మలుపు తిరిగింది. చివరి ఓవర్లో ఉత్కం‘టై’... చివరి ఓవర్లో సన్రైజర్స్ విజయానికి 18 పరుగులు కావాలి. బౌలర్ రసెల్ బంతి అందుకున్నాడు. అనుభవాన్నంతా రంగరించి ఆడుతున్న వార్నర్, అప్పుడే వచ్చిన రషీద్ ఖాన్ క్రీజులో ఉన్నారు. రసెల్ తొలి బంతిని నోబాల్ వేశాడు. ఆ తర్వాత ‘ఫ్రీ హిట్’ బంతిపై రషీద్ ఒక్క పరుగు తీసి వార్నర్కు స్ట్రయిక్ ఇచ్చాడు. వార్నర్ జూలు విదిల్చి వరుసగా మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో సన్రైజర్స్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. మూడు ఫోర్లు కొట్టి జోరుమీదున్న వార్నర్ ఆఖరి బంతికి గురి తప్పాడు. రసెల్ వేసిన బంతి వార్నర్ ప్యాడ్ లకు తగిలి ఆఫ్సైడ్ కు వెళ్లిపోయింది. వార్నర్, రషీద్ ఒక పరుగు మాత్ర మే పూర్తి చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. రెండు జట్లు సూపర్ ఓవర్కు సిద్ధమయ్యాయి. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) గార్గ్ (బి) రషీద్ 36; త్రిపాఠి (బి) నటరాజన్ 23; రాణా (సి) గార్గ్ (బి) శంకర్ 29; రసెల్ (సి) శంకర్ (బి) నటరాజన్ 9; మోర్గాన్ (సి) పాండే (బి) థంపి 34; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 29; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–48, 2–87, 3–88, 4–105, 5–163. బౌలింగ్: సందీప్శర్మ 4–0– 27–0, థంపి 4–0–46–1, నటరాజన్ 4–0– 40–2, విజయ్ శంకర్ 4–0–20–1, రషీద్ ఖాన్ 4–0–28–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బెయిర్స్టో (సి) రసెల్ (బి) వరుణ్ 36; విలియమ్సన్ (సి) రాణా (బి) ఫెర్గూసన్ 29; గార్గ్ (బి) ఫెర్గూసన్ 4; వార్నర్ (నాటౌట్) 47; మనీశ్ పాండే (బి) ఫెర్గూసన్ 6; శంకర్ (సి) గిల్ (బి) కమిన్స్ 23; సమద్ (సి) గిల్ (బి) శివమ్ మావి 23; రషీద్ ఖాన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–58, 2–70, 3–70, 4–82, 5–109, 6–146. బౌలింగ్: కమిన్స్ 4–0–28–1, మావి 3–0– 34–1, వరుణ్ 4–0–32–1, రసెల్ 2–0– 29–0, ఫెర్గూసన్ 4–0–15–3, కుల్దీప్ 3–0– 18–0. ► లీగ్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి (186 మ్యాచ్ల్లో 5,759 పరుగులు), రైనా (193 మ్యాచ్ల్లో 5,368 పరుగులు), రోహిత్ శర్మ (197 మ్యాచ్ల్లో 5,158 పరుగులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు సూపర్ ఓవర్లో విజయం సాధించడం ఇదే ప్రథమం. గతంలో మూడుసార్లు ఆ జట్టు సూపర్ ఓవర్లో ఓడింది. ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి విదేశీ క్రికెటర్గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 2009లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వార్నర్ ఇప్పటివరకు 135 మ్యాచ్లు ఆడి 5,037 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ► టోర్నీ చరిత్రలో ‘టై’ అయిన మ్యాచ్లు ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో నాలుగు మ్యాచ్లు ‘టై’గా ముగియడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో ఢిల్లీ –పంజాబ్; ముంబై –బెంగళూరు; ముంబై–పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్లు ‘టై’గా ముగిసి తుది ఫలితం సూపర్ ఓవర్లో వచ్చింది. -
సన్రైజర్స్ జట్టులో ఆంధ్ర బౌలర్
అబుదాబి: ఆంధ్ర రంజీ జట్టు పేస్ బౌలర్ యెర్రా పృథ్వీరాజ్ ఐపీఎల్ –13లో గాయపడిన సన్రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ స్థానంలోకి వచ్చాడు. ఈ మేరకు ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో 19వ ఓవర్ వేస్తుండగా భువీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో తదుపరి మ్యాచ్కే కాకుండా గాయం తీవ్రత దష్ట్యా ఏకంగా లీగ్కే దూరమయ్యాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల పృథ్వీరాజ్కు ఐపీఎల్ కొత్తేం కాదు. గతేడాది కోల్కతా నైట్రైడర్స్ తరఫున రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. అలాగే 11 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన ఈ పేసర్ 39 వికెట్లు పడగొట్టాడు. (‘సూర్య’ ప్రతాపం) -
ఆటపై దృష్టిపెట్టు: ప్రియమ్ గార్గ్కు కేన్ సలహా
దుబాయ్: చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండ్ ప్రదర్శనతో వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఆటగాడు ప్రియామ్ గార్గ్ కారణంగా విలియమ్సన్ రనౌట్ అయ్యాడు. దీనిపై గార్గ్ స్పందిస్తూ.. విలియమ్సన్ మంచి బ్యాట్స్మన్. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగల ఆటగాడు. ఆ రనౌట్ నా పొరపాటు వల్లే జరగింది అని అన్నాడు. ఇన్సింగ్స్ విరామ సమయంలో ఇదే విషయాన్ని గార్గ్ విలియమ్సన్ వద్ద ప్రస్తావించగా.. రనౌట్ గురించి చింతించవద్దు. దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆటపై దృష్టిపెట్టమని కేన్ సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా.. 11వ ఓవర్ చివరి బంతిని షార్ట్ మిడ్వికెట్ వైపు ఆడి వెంటనే కేన్ పరుగు కోసం ముందుకు రాగా అవతలి వైపు నుంచి గార్గ్ స్పందించలేదు. (‘ప్రియ’మైన విజయం) దీంతో చెన్నై ఫీల్డర్ అంబటి రాయుడు బంతిని వేగంగా కీపర్ ఎంఎస్ ధోనీకి విసరగా.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రనౌట్ చేశాడు. అయితే విలియమ్సన్ ఔట్ కావడంతో గార్గ్ చివరి వరకు క్రీజులో ఉండి 23 బంతుల్లో 51 పరుగులు చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 7 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. -
రైజింగ్కు వేళాయె...
దుబాయ్: అనుకున్నట్లే ఐపీఎల్ హంగామా మొదలైంది. కరోనా నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ సాఫీగా ఫ్రాంచైజీలన్నీ ఆటలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల ఆటను చూసి సంతోషించిన హైదరాబాద్ అభిమానులు ఇక తమ సొంత జట్టును మైదానంలో చూసుకునేందుకు సిద్ధమయ్యారు. స్టార్లతో కూడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో సోమవారం జరుగనున్న మ్యాచ్తో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఈ సీజన్ ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇరు జట్లకూ ఇదే తొలి మ్యాచ్ కావడం... విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేకపోవడంతో అభిమానులకు అసలైన ఐపీఎల్ మజా అందనుంది. రైజింగ్కు సిద్ధం... బ్యాట్స్మెన్ జోరు కొనసాగే ఐపీఎల్లో... బౌలర్ల ఉనికి కనబడే జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. చాప కింద నీరులా ఎస్ఆర్హెచ్ లీగ్లో తన పని తను చేసుకుపోతుంటుంది. తక్కువ లక్ష్యాలు కాపాడుకోవడం ఎస్ఆర్హెచ్కు బంతితో పెట్టిన విద్య. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ రూపంలో జట్టును నడిపించే అద్భుతమైన నాయకులున్నారు. ఓపెనర్గా, కెప్టెన్గా, అత్యధిక పరుగుల వీరుడిగా లీగ్లో వార్నర్ను మించిన వారు లేరు. మరో ఓపెనర్ జానీ బెయిర్స్టో ఎంత ప్రమాదకారో అందరికీ తెలిసిందే. ఈ జంట గత సీజన్లో బెంగళూరుపైనే రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరితో పాటు మనీశ్ పాండే, మిచెల్ మార్‡్ష, ఫాబియాన్ అలెన్ సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. ఇక వైవిధ్యమైన బౌలింగ్ సన్రైజర్స్ సొంతం. అఫ్గాన్ బౌలర్లు రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీలతో పాటు భువనేశ్వర్, షాబాజ్ నదీమ్ తమ స్థాయికి తగినట్లు రాణిస్తే ఎంతటి బ్యాట్స్మెన్ అయినా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగడం ఖాయం. అమితోత్సాహంలో కోహ్లి సేన... దుబాయ్ చేరినప్పటి నుంచి కచ్చితమైన ప్రణాళిక ప్రకారం సన్నద్ధమవుతోన్న జట్టు ఆర్సీబీ. మిగతా జట్లు క్వారంటైన్ కాలంలో ఏదో ఒక రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటుంటే ఆర్సీబీ శిబిరం మాత్రం ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంది. తొలి మ్యాచ్ విజయంతో ఈ ఆనందాన్ని పదిలం చేసుకోవాలని కెపె్టన్ కోహ్లి భావిస్తున్నాడు. ఈ సీజన్లో తమ జట్టు రాత మార్చాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. అంతా తానై నడిపించే కోహ్లికి ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు ఆరోన్ ఫించ్ తోడయ్యాడు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. (పంజాబ్ సూపర్ ఫ్లాప్...) వీరికి తోడు ‘మిస్టర్ 360’ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్ బ్యాట్ ఝళిపిస్తే చూస్తుండగానే భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. బౌలింగ్లో ఎప్పటిలాగే స్పిన్నర్ యజువేంద్ర చహల్ కీలకం కానున్నాడు. వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, ఆడమ్ జంపా, మొయిన్ అలీ స్పిన్ బాధ్యతల్ని మోయనున్నారు. అయితే డెత్ ఓవర్లలో తేలిపోయే బలహీనతను అధిగమించకపోతే ఆర్సీబీ ఎంత పోరాడినా వృథాయే. జట్టు నిండా స్టార్లతో కూడిన ఆర్సీబీకి ఆవగింజంత అదృష్టం తోడైతే టైటిల్ సాధించడం కష్టమేమీ కాదు. -
'నన్ను చాలా దారుణంగా అవమానించారు'
జమైకా : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి వర్ణ వివక్షతపై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్కు ఆడినప్పుడు తనపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని మండిపడ్డాడు. అమెరికాలో జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన జార్జి ప్లాయిడ్కు మద్దతుగా అక్కడి స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన సామి ఇలాంటివి జరగడం దారుణమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తాను కూడా వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా సామి పేర్కొన్నాడు.('ఆరోజు రితికా అందుకే ఏడ్చింది') 'నేను ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టుకు ఆడేటప్పుడు నాతో పాటు శ్రీలంక ఆటగాడు తిసార పెరీరాను 'కలు' అనే పదంతో పిలిచేవారు.అప్పట్లో కలు అంటే బలమైన నల్ల మనిషి అని అనుకున్నా. ఆ సమయంలో వారు నన్ను పొగుడుతున్నారని భావించాను. కానీ ఇప్పుడు ఆ పదానికి అసలైన అర్థం ఏంటో తెలుసుకున్నా. తనతో పాటు పెరీరాపై జట్టులోని ఆటగాళ్లు జాత్యహంకార పదం ఉపయోగించారు. వారు నన్ను చాలా దారుణంగా అవమానించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వారిపై చాలా కోపంగా ఉంది.' అంటూ చెప్పుకొచ్చాడు. (షికారుకని వచ్చి షార్క్కు చిక్కాడు) అంతకుముందు ట్విటర్ వేదికగా అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ ఐసిసి, ఇతర క్రికెట్ బోర్డులకు సామి విజ్ఞప్తి చేశాడు. 'ఐసిసితో పాటు ఇతర బోర్డులకు ఒక విజ్ఞప్తి.. నాలాంటి నల్లజాతి వారికి ఏమి జరుగుతుందో మీరు చూడడం లేదా? ఈరోజు అమెరికాలో జరిగిన సంఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు నిశబ్ధంగా ఉండాల్సిన సమయం మాత్రం కాదు. సామాజిక అన్యాయంపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అంటూ పేర్కొన్నాడు. కాగా విండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ కూడా ఫ్లాయిడ్ మరణానికి సంతాపం తెలిపాడు .తాను కూడా జాత్యహంకారానికి గురయ్యాడని ఒక ప్రకటనలో తెలిపాడు. క్రికెట్లో జాత్యహంకారం లేదనేది ఒక అపోహ మాత్రమే అని గేల్ చెప్పుకొచ్చాడు. -
అచ్చం స్మిత్ను దింపేశావ్గా..
ఢిల్లీ : అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్రౌండర్, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ను కాఫీ చేయడానికి ప్రయత్నించాడు. అదేంటి రషీద్ స్మిత్ బ్యాటింగ్ను కాఫీ చేయడం ఏంటని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. అసలు విషయానికి వస్తే నిన్న(మంగళవారం) ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. కాగా అతని బర్త్డే సందర్భంగా పలువురు ఆటగాళ్లు అతనికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రషీద్ ఖాన్ కూడా తనదైన స్టైల్లో స్మిత్కు విషెస్ తెలిపాడు. అచ్చం స్మిత్ తరహాలో బ్యాట్ పట్టుకొని అతన్ని కాఫీ చేయడానికి ప్రయత్నించాడు. అతనికి విసిరిన బంతులను అచ్చం స్మిత్ తరహాలో కొట్టేందుకు ప్రయత్నించాడు. కాగా ఈ వీడియోను సన్రైజర్స్ టీం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ' స్మిత్ బర్త్డే సందర్భంగా అతన్ని ఆకట్టుకోవడానికి రషీద్ అతని బ్యాటింగ్ స్టైల్ను ప్రయత్నించాడు. ఈరోజు నువ్వు(స్మిత్) సంతోషంగా ఉండాలి.. ఫ్రమ్ ఆరెంజ్ ఆర్మీ..' అంటూ క్యాప్షన్ జత చేశారు.(40 ఏళ్లకు ఇంకా ఏడాదే బ్రదర్: విరాట్) కాగా రషీద్ ఖాన్ 2015లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు అఫ్గానిస్తాన్ తరపున 71 వన్డేలాడి 4.16 ఎకానమీతో 133 వికెట్లు తీశాడు. అలాగే తన తొలి టెస్టును భారత్ మీద ఆడడం ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన రషీద్ 4 టెస్టుల్లో 23 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 2017లో వేలంలోకి వచ్చిన రషీద్ ఖాన్ను సన్రైజర్స్ యాజమాన్యం రూ. 4 కోట్లకు దక్కించుకుంది. కాగా 2019లో రూ. 9 కోట్లకు మళ్లీ సన్రైజర్స్ యాజమాన్యమే రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో 46 మ్యాచులాడిన రషీద్ 55 వికెట్లు తీశాడు.(హార్దిక్ మాటల్లో ఆంతర్యం ఏమిటి?) View this post on Instagram @rashid.khan19 doing his best @steve_smith49 impression on the Aussie's birthday today! 👌 Have a good one, Steve! 😊 #OrangeArmy #SRH A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) on Jun 2, 2020 at 5:37am PDT -
సన్రైజర్స్ కెప్టెన్గా మరోసారి వార్నర్
న్యూఢిల్లీ : ఐపీఎల్ 2020 సీజన్కు సంబంధించి సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా మరోసారి డేవిడ్ వార్నర్ను నియమిస్తున్నట్లు జట్టు యాజమాన్యం గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో 2018, 2019 ఐపీఎల్ సీజన్లకు నాయకత్వం వహించిన కేన్ విలియమ్సన్ స్థానంలో వార్నర్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టునున్నాడు. ఇదే విషయాన్ని దృవీకరిస్తూ సన్రైజర్స్ తన ఫేస్బుక్ పేజీలో వార్నర్నుద్ధేశించి వీడియో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా వార్నర్ స్పందిస్తూ.. ' నా మీద నమ్మకంతో జట్టు యాజమాన్యం మరోసారి తనను కెప్టెన్గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్ 2020లో సన్రైజర్స్కు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నా. 2018 ఐపీఎల్ సీజన్కు నేను అందుబాటులో లేనప్పుడు కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించిన కేన్ విలియమ్సన్తో పాటు భువనేశ్వర్ కుమార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరోసారి కెప్టెన్గా జట్టును ముందుండి నడుపుతున్నా.. అందుకు మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నా. నాపై నమ్మకంతో టీమ్ మేనేజ్మెంట్ మరోసారి నన్ను కెప్టెన్ను చేసింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జట్టును ముందుకు నడుపుతా. తనకు ఇంతకాలం మద్దతుగా ఉన్న సన్రైజర్స్ అభిమానులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా' అంటూ తెలిపాడు. (మార్చి 2న మైదానంలోకి ధోని) 2018లో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో క్రికెట్ ఆస్ర్టేలియా వార్నర్తో పాటు అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్పై ఏడాది నిషేదం, బౌలర్ బెన్క్రాఫ్ట్పై తొమ్మిది నెలల నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 ఐపీఎల్ సీజన్కు కేన్విలియమ్సన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.అయితే 2019లో పునరాగమనం తర్వాత వార్నర్ ఐపీఎల్ 2019 సీజన్లో ఒక ఆటగాడిగా కొనసాగుతూ తన ప్రదర్శనతో దుమ్మురేపాడు. మొత్తం 12 మ్యాచుల్లో 692 పరుగులు సాధించి లీగ్ టాపర్గా నిలవడం విశేషం. అందులో ఒక శతకం, 8 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా ఇంతకుముందు వార్నర్ నాయకత్వంలోనే 2016లో సన్రైజర్స్ జట్టు టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ('నేను ఇంతలా మారడానికి నా భార్యే కారణం') (‘డ్యాన్స్ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’) -
‘సన్’ బెర్త్ వారి చేతుల్లోనే...
ఐపీఎల్ లీగ్ దశ ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించాయి. చివరిదైన నాలుగో బెర్త్ కోసం రసవత్తర పోరు జరగనుంది. అయితే మెరుగైన రన్రేట్తో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకే ప్లే ఆఫ్ బెర్త్ పొందే అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయి. ఒకవేళ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్నకు అర్హత సాధించకపోతే మాత్రం అది స్వీయ తప్పిదమే అవుతుంది. ఈ సీజన్లో పలుమార్లు గెలిచే దశ నుంచి ఓటమి వైపునకు వెళ్లిన హైదరాబాద్ సరైన కూర్పును ఎంచుకోవడం లేదు. బెయిర్స్టో, డేవిడ్ వార్నర్లాంటి స్టార్ ఆటగాళ్ల సేవలు కీలకదశలో ఆ జట్టుకు అందుబాటులో లేకపోయినా... వారిద్దరు ఎప్పుడు వెళ్లిపోతున్నారనే విషయం జట్టు యాజమాన్యానికి ముందే తెలిసిన నేపథ్యంలో సరైన ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాల్సింది. వార్నర్ లేని లోటు భర్తీ చేయలేకపోయినా దేశీయ ఆటగాళ్ల ఎంపిక కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. కొందరైతే ఫామ్లో ఉన్నట్లు కనిపించడంలేదు. మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ జట్టు వరుసగా ఆరు పరాజయాల తర్వాత మళ్లీ విజయాలబాట పట్టింది. విధ్వంసకర బ్యాట్స్మన్ రసెల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించి తెలివైన నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన ఫామ్లో ఉన్న రసెల్ వీరవిహారం చేసి కోల్కతా పరువు కాపాడాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ 2012 తర్వాత ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. ప్రస్తుతం తమ అద్వితీయ ప్రదర్శనతో ఆ జట్టు టైటిల్ ఫేవరెట్స్లో ఒకటిగా కనిపిస్తోంది. తర్వాతి మ్యాచ్ల్లోనూ శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మలాంటి అనుభవజ్ఞులతోపాటు యువ ఆటగాళ్లు కూడా తమవంతు పాత్రను పోషించాలి. మొత్తానికి ఈ వారాంతం క్రికెట్ అభిమానులకు పసందుగా గడవనుంది. -
వార్నర్ మాట నిలబెట్టుకున్నాడు!
హైదరాబాద్ : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మెన్, ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మాట నిలబెట్టుకున్నాడని ఆ జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. వార్నర్ ఈ సీజన్లో 500 పరుగులు చేస్తానని మాటిచ్చాడని, అన్నట్లుగానే 12 మ్యాచ్ల్లో 692 పరుగులు చేసాడని పేర్కొన్నాడు. ఓ ఆంగ్లపత్రికకు రాసిన కథనంలో లక్ష్మణ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘హైదరాబాద్లో మేమంతా ఓ షూటింగ్ మధ్యలో ఉండగా.. హెడ్ కోచ్ టామ్ మూడికి డేవీ(వార్నర్) ఓ సందేశాన్ని పంపించాడు. ఈ సీజన్లో 500 పరుగులు చేస్తానని ప్రామిస్ చేస్తున్నట్లు ఆ మెసేజ్లో పేర్కొన్నాడు. అతను అన్నట్లుగా తన లక్ష్యాన్ని చేరుకుంటూ ఆడిన తీరు అద్భుతం. వాస్తవానికి సీజన్ ప్రారంభంలో మేం కొంత ఆందోళనకు గురయ్యాం. గడ్డుకాలాన్ని ఎదుర్కొని వార్నర్ అప్పుడే క్రికెట్లోకి పునరాగమనం చేయడం.. పైగా మోచేతి గాయంతో బాధపడుతుండటంతో అతనిపై అంతగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ అతను అద్భుతంగా ఆడాడు. అతని విపరీతమైన మానసిక ఆందోళనను అధిగమించాడు. అతని భార్య క్యాండీ అతని బలం.’ లక్ష్మణ్ పేర్కొన్నాడు. బాల్ట్యాంపరింగ్ ఉదంతంతో గత సీజన్ ఐపీఎల్కు దూరమైన వార్నర్.. ఈ సీజన్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 12 మ్యాచ్ల్లో 8 హాఫ్ సెంచరీలు 1 సెంచరీతో 692 పరుగులు చేసి టాప్స్కోరర్గా నిలిచాడు. ఇక ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా వార్నర్ స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వార్నర్ తర్వాత కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ 520 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. -
స్వింగ్ కింగ్కు సెల్యూట్!
సాక్షి, హైదరాబాద్ : డెత్ఓవర్ స్పెషలిస్ట్, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతూ 100 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ఔట్ చేసి భువీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఐపీఎల్ తమ అధికారిక ట్వీటర్లో భువీకి అభినందనలు తెలియజేశాయి. ఇక భువనేశ్వర్పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘స్వింగ్ కింగ్కు సెల్యూట్.. 100వ మ్యాచ్ 100 వికెట్ శభాష్ భువీ’ అంటూ కొనియాడుతున్నారు. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 109 మ్యాచ్లు ఆడిన భువీ..125 వికెట్లు పడగొట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్ కన్నా ముందు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణెవారియర్స్ జట్లకు అతను ప్రాతినిథ్యం వహించాడు. దురదృష్టవశాత్తు సన్రైజర్స్ ఈ మ్యాచ్లో 39 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 15 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోయి మరో 13 బంతులు మిగిలి ఉండగానే అనూహ్యంగా ఆలౌట్ అయింది. -
ఏ అశ్విన్.. నేను క్రీజులోనే ఉన్నా!
మొహాలి : ఐపీఎల్-12లో కింగ్స్పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన మన్కడింగ్ ఔట్ అత్యంత వివాదస్పద ఘటనగా మిగిలిపోయంది. రాజస్తాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో అశ్విన్ ఆ జట్టు బ్యాట్స్మన్ జోస్ బట్లర్ను ఈ తరహాలో ఔట్ చేసి తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఇది జరిగి చాలా రోజులు అవుతున్నా.. ఈ మన్కడింగ్ వివాదం మాత్రం అశ్విన్ను ఇప్పట్లో వదిలేలా లేదు. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు బ్యాట్స్మన్ డెవిడ్ వార్నర్.. మన్కడింగ్ వివాదాన్ని గుర్తు చేసేలా అశ్విన్ను టీజ్ చేశాడు. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేశాడా? లేక అశ్విన్ మన్కడింగ్కు బలికాకుండా జాగ్రత్త వ్యవహరించాడా? అనేది వార్నర్కే తెలియాలి. కానీ తాను వ్యవహరించిన తీరుపై కామెంటేటర్స్ మాత్రం కామెడీ చేశారు. ‘ఏ అశ్విన్ నేను క్రీజులోనే ఉన్నా’ అని డేవిడ్ వార్నర్ చూపిస్తున్నాడని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఫోటో క్లిప్ కూడా మనకు అలానే అనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో వార్నర్ (62 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ రాణించినప్పటికి హైదరాబాద్ 6 వికెట్లతో పరాజయం పాలైంది. No, Warner doesn't want to get 'Mankaded' https://t.co/DUSt66yf3I via @ipl — Utkarsh Bhatla (@UtkarshBhatla) April 8, 2019 -
హైదరాబాద్ చిత్తుగా...
ఏమైంది హైదరాబాద్కు! వారం క్రితం ఇక్కడే ఉప్పెనలా చెలరేగింది. ఇద్దరు ఓపెనర్లే (వార్నర్, బెయిర్ స్టో) 200 పైచిలుకు భాగస్వామ్యం చేశారు. తర్వాత అద్భుతమైన బౌలింగ్తో కోహ్లి సేనను చిత్తుగా ఓడించింది.కానీ ఇప్పుడు ఓ సులభసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ముంబై ఇండియన్స్ను చక్కగా కట్టడి చేసినా... బ్యాటింగ్లో మాత్రం చేతులెత్తేసింది. ఒక్కడి (జోసెఫ్ అల్జారి) బౌలింగ్కు కకావికలమైంది. మూడు వరుస విజయాల తర్వాత సన్ జోరుకు చుక్కెదురైంది. సాక్షి, హైదరాబాద్: విండీస్ బౌలర్ అల్జారి జోసెఫ్... ఐపీఎల్కు కొత్త. ఈ మ్యాచ్తోనే అరంగేట్రం చేశాడు. 12 పరుగులే ఇచ్చి ఏకంగా 6 వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేకులేశాడు. దీంతో సొంతగడ్డపై స్వల్పలక్ష్యాన్ని ఛేదించలేక హైదరాబాద్ పరాజయం పాలైంది. శనివారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 40 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పొలార్డ్ (26 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే వెన్నెముకగా నిలబడ్డాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. దీపక్ హుడా చేసిన 20 పరుగులే టాప్ స్కోర్. అల్జారి జోసెఫ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రోహిత్ మళ్లీ విఫలం... ముంబై ఇండియన్స్ జట్టులో ఒక్కడు మినహా మిగతా బ్యాట్స్మెన్ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ నుంచి పాండ్యా బ్రదర్స్ దాకా అందరూ రైజర్స్ బౌలింగ్కు తలొగ్గారు. ఓపెనర్ డికాక్ 19 పరుగులు చేశాడు. టాస్ నెగ్గిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట ముంబై ఇండియన్స్ పరుగుల ఆట ప్రారంభించింది. రోహిత్ శర్మ (11)ను నబీ ఔట్ చేయడంతో మొదలైన వికెట్ల పతనం 65 పరుగులకే సగం వికెట్లను కూల్చేసింది. సూర్యకుమార్ (7)ను సందీప్ ఎల్బీగా పంపాడు. పవర్ ప్లేలో ఈ రెండు వికెట్లను కోల్పోయి 30 పరుగులు చేసిన ముంబై 10 ఓవర్లు ముగిసేసరికి మరో వికెట్ (డికాక్)ను చేజార్చుకొని 51 పరుగులే చేసింది. ఆఖర్లో పొలార్డ్ మెరుపులు ముంబై ఇన్నింగ్స్కు పొలార్డ్ ఆపద్బాంధవుడయ్యాడు. 8 పరుగుల వద్ద రషీద్ క్యాచ్ మిస్చేయడంతో బతికిపోయిన పొలార్డ్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా (14; 1 సిక్స్) 17వ ఓవర్దాకా క్రీజులో ఉన్నా చేసేదేమీ లేకపోయింది. 18 ఓవర్లు ముగిశాయి. ముంబై వంద పరుగులైనా చేయలేదు. ఇక మిగిలింది 12 బంతులే! ఈ దశలో సిద్ధార్థ్ కౌల్ 19వ ఓవర్లో పొలార్డ్ 3 సిక్సర్లు బాదడంతో 20 పరుగులొచ్చాయి. భువీ ఆఖరి ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో 19 పరుగులు లభించాయి. సన్రైజర్స్దీ తడబాటే.. స్వల్ప లక్ష్యమే అయినా హైదరాబాద్ తడబడింది. మూడో ఓవర్లో వార్నర్ ఒక బౌండరీ, బెయిర్ స్టో 2 ఫోర్లు కొట్టారు. 27/0 స్కోరుతో బాగానే ఉన్న ఆ తర్వాతి ఓవర్ నుంచి కష్టాలు మొదలయ్యాయి. మూడు బంతుల వ్యవధిలో బెయిర్ స్టో (10 బంతుల్లో 16; 3 ఫోర్లు), వార్నర్ (13 బంతుల్లో 15; 2 ఫోర్లు) ఔటయ్యారు. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ తొలి బంతికే అల్జరి జోసెఫ్... వార్నర్ వికెట్ తీశాడు. అప్పటికి జట్టు స్కోరు 33/2. ఇక ఇక్కడి నుంచి హైదరాబాద్ ఇన్నింగ్స్ గతితప్పింది. తొలి సగం ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 59 పరుగులు చేసింది. మనీశ్ పాండే (16), యూసుఫ్ పఠాన్ (0) ఔట్ కావడంతో పరాజయం దిశగా పయనించింది. ►6/12 ఐపీఎల్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. సొహైల్ తన్వీర్ (6/14) రికార్డును అల్జారి సవరించాడు. ►96 ఐపీఎల్లో సన్రైజర్స్కు ఇదే అత్యల్ప స్కోరు. 2015లో హైదరాబాద్లోనే ముంబై చేతిలో 113 పరుగులకు ఆలౌటైంది. -
భారత దిగ్గజాన్ని అవమానిస్తున్నారు!
గత కొద్ది రోజులుగా భారత మీడియాలో వస్తున్న వార్తలు నన్ను చాలా బాధపెడుతున్నాయి. ఒక రనౌట్ను ‘మన్కడ్’ పేరుతో జత చేసి మన దిగ్గజ క్రీడాకారుడిని అవమానిస్తున్నారు. ఎప్పుడో 70ల్లో జరిగిన మ్యాచ్లో నాన్స్ట్రైకర్గా ఉన్న ఆస్ట్రేలియన్ క్రీజ్ వదలి బాగా ముందుకు వెళ్లటంతో వినూ మన్కడ్ అతడిని ఔట్ చేశాడు. ఒక బద్ధకస్తుడైన విదేశీ జర్నలిస్ట్ ‘మన్కడెడ్’ అని రాస్తే ఇప్పటికీ అదే స్థిరపడిపోయింది.బ్రౌన్ను అప్పటికే రెండు సార్లు మన్కడ్ హెచ్చరించినా కూడా అతను మారలేదు. మన్కడ్ చేసిన పనిలో తప్పేమీ లేదని సర్ డాన్బ్రాడ్మన్ కూడా అభిప్రాయపడినా దానిని ఇప్పటికీ మన్కడింగ్గానే పిలుస్తున్నారు. బ్యాట్కు బంతి తగిలిందని తెలిసినా క్రీజ్ వదలకుండా నిలబడే ఆటగాడిని ‘డబ్ల్యూజీ’ పేరుతో గుర్తు చేసుకోవడం లేదు కదా! అలాగే బ్రియాన్ లారా ఇచ్చిన క్యాచ్ను నేలకు తాకిన తర్వాత అందుకొని ఔట్గా అప్పీల్ చేసినప్పుడు దానిని ‘స్టీవ్ వా’ పేరుతో పిలవడం లేదు కదా! అలాంటప్పుడు హద్దు దాటిన నాన్స్ట్రైకర్ను రనౌట్ చేస్తే దానికి మన్కడ్ పేరు ఎందుకు తగిలించాలి. అలాంటప్పుడు పైన చెప్పిన ఘటనలను ఎలా చూడాలి. అవి క్రీడా స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయా. కనీసం ఇప్పుడు భారత మీడియా అయినా అలాంటి ఔట్ను ‘బ్రౌన్డ్’ పేరుతోనన్నా పిలవాలి లేదా మామూలుగా రనౌట్ అని చెబితే చాలు. ఈ రోజు మ్యాచ్లు ఆడబోతున్న నాలుగు జట్లకు కూడా ఇవి కీలక సమరాలు అనడంలో సందేహం లేదు. ముంబై చేతిలో ఓటమినుంచి కోలుకున్నామని చెన్నై చూపించాల్సి ఉంది. అదే విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్రైజర్స్ను కూడా నిలువరించాలని ముంబై కోరుకుంటోంది. రైజర్స్ ఓపెనర్లు వార్నర్, బెయిర్స్టో పవర్ప్లేలోనే ప్రత్యర్థినుంచి మ్యాచ్ను లాక్కుంటున్నారు. వారిద్దరిని తొందరగా ఔట్ చేయడం ముఖ్యం. ఎందుకంటే తర్వాత వచ్చేవారికి ఇప్పటి వరకు పెద్దగా ఆడే అవకాశం రాలేదు కాబట్టి ఒత్తిడిలో కుప్పకూలిపోవచ్చు. చెన్నై టాపార్డర్ బాగా తడబడుతోంది. ధోని జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించగలడని భావించినా...అది ప్రతిసారీ సాధ్యం కాదని వాంఖడేలో రుజువైంది. -
అదే మా కొంపముంచింది : పాంటింగ్
న్యూఢిల్లీ : సొంతగడ్డపై జరిగిన మూడు మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి చెందడంపై ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అసహనం వ్యక్తం చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే పిచ్పై తమ అంచనా తప్పిందని, దీంతోనే మ్యాచ్ చేజార్చుకోవాల్సి వచ్చిందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘కోట్లా పిచ్పై హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ స్పందించిన తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. మ్యాచ్కి ముందు గ్రౌండ్స్మెన్తో మాట్లాడితే.. ఈ పిచ్ బెస్ట్ అంటూ చెప్పారు కానీ.. అది చెత్త పిచ్ అని మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే అర్థమైంది. పిచ్ నెమ్మదిగా స్పందించడమే కాకుండా.. అనూహ్యమైన బౌన్స్ కూడా లభించింది. హైదరాబాద్ బౌలర్లకు ఈ పిచ్ సరిగ్గా సరిపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని.. పిచ్కు తగ్గట్లుగా బౌలింగ్తో చెలరేగారు. నకుల్ బాల్స్, స్లో బాల్స్తో మా బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. దురదృష్ణవశాత్తు మా జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఈ విషయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మా సొంతమైదానంలో ప్రత్యర్థుల కంటే మెరుగ్గా ఎలా ఆడాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మూడు మ్యాచ్లు జరగ్గా.. రెండు మ్యాచ్ల్లో మా ప్రత్యర్థులు మాకంటే మెరుగ్గా రాణించి విజయం సాధించారు. ఈ విషయంలో మేం మెరగువ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పిచ్లున్నప్పుడు జట్టు కూర్పుపై కూడా ఒకసారి ఆలోచించాలి. మా బౌలర్లుకు ఈ తరహా పిచ్ సరైంది కాదు. మేం పిచ్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. గ్రౌండ్స్మెన్ చెప్పినట్లు కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోవడం మావంతైంది. ఇక మా బ్యాట్స్మెన్ చెత్త షాట్లు కూడా మా కొంప ముంచింది. పృథ్వీ షా చెత్త షాట్తో వెనుదిరిగాడు. కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా అలానే ఆడి మూల్యం చెల్లించుకున్నారు. మేం 160-165 పరుగులు చేస్తామనుకున్నాం. ఈ విషయాలపై చర్చించి మా తప్పులును తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్లో బౌలర్లను నిందించదల్చుకోలేదు. వారి శక్తి మేరకు అద్భుతంగా రాణించారు. స్వల్పస్కోర్తోనే 19వ ఓవర్ వరకు పోరాడటం అద్భుతం. బ్యాటింగ్ వల్లే ఓడిపోవాల్సి వచ్చింది’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే హైదరాబాద్ 131/5తో ఛేదించింది. -
ఓటమికి కారణం అదే : శ్రేయస్ అయ్యర్
న్యూఢిల్లీ : వరుసగా రెండు మ్యాచ్లలో ఓటమి చెందడం పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విచారం వ్యక్తం చేశాడు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లను చేజార్చుకోవడం తనను నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 12 సీజన్లో భాగంగా సొంత గడ్డపై సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గురువారం నాటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేయగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడు మాత్రమే కాస్త మెరుగ్గా ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో రైజర్స్ బౌలర్లు అందరూ వికెట్లు పడగొట్టి తమ జట్టుకు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘గత రెండు మ్యాచ్ల ఫలితాలు నన్ను నిరాశకు గురిచేశాయి. ముందుగా బౌలింగ్ చేయడం వల్ల వికెట్ను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు పూర్తిగా అర్థం చేసుకోగలిగారు. బ్యాటింగ్లో వైఫల్యమే మా ఓటమికి కారణమైంది. కనీసం 150 పరుగులైనా చేసి ఉంటే ముగ్గురు స్పిన్నర్లలతో బరిలోకి దిగినందుకు కాస్తైనా పోరాడే అవకాశం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు స్వల్ప వ్యవధిలోనే చాలా వికెట్లు కోల్పోయాం. టాప్ ఆర్డర్ విఫలమైంది. నాకు ఒక్కరైనా సపోర్టుగా నిలిచి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. బాధ్యతగా ఆడుతున్న నన్ను..రషీద్ పెవిలియన్కు చేర్చాడు. రానున్న మ్యాచ్లలో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని చెప్పుకొచ్చాడు. కాగా మంగళవారం పంజాబ్ కింగ్స్తో గెలవాల్సిన మ్యాచ్ను కూడా ఢిల్లీ చేజార్చుకోవడంతో..‘ కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో మళ్లీ ఢిల్లీ డేర్ డెవిల్స్ను చూసినట్టుంది’ దిగ్గజ ఆటగాళ్లు సహా నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్లో ఇప్పటివరకు ఢిల్లీ మాత్రమే ఫైనల్కు చేరలేదు. అయితే ఈ సీజన్లో కొత్త జెర్సీ.. జట్టు పేరు మార్పు తో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ ఆట తీరు మారడం లేదంటూ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
ఏడోసారి కూడా కేకేఆర్ గెలిచేనా?
కోల్కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం స్థానిక ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)- సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలిస్తే అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. 2013 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ తొలి మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోలేదు. దీంతో ఈ విజయపరంపరను కొనసాగించాలని కార్తీక్ సేన ఆరాటడపడుతుండగా.. ఈ రికార్డును బ్రేక్ చేయాలని సన్ రైజర్స్ ఆలోచిస్తుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ సారథి చేజింగ్కే మొగ్గు చూపాడు. గాయం కారణంగా సన్రైజర్స్ రెగ్గులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కావడంతో.. పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్లో కేకేఆర్ ప్రారంభపు మ్యాచ్ విజయాలు 2013లో ఢిల్లీ డేర్డెవిల్స్పై ఆరు వికెట్ల తేడాతో విజయం 2014లో ముంబై ఇండియన్స్పై 41 పరుగుల తేడాతో విజయం 2015లో ముంబై ఇండియన్స్పై ఏడు వికెట్ల తేడాతో విజయం 2016లో ఢిల్లీ డేర్డెవిల్స్పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం 2017లో గుజరాత్ లయన్స్పై పది వికెట్ల తేడాతో ఘన విజయం 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం -
మే 12న ఐపీఎల్ ఫైనల్
ముంబై: ఐపీఎల్–2019 తుది పోరుకు చెన్నై వేదిక కానుంది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో మే 12న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. దేశంలో ఎన్నికల దృష్ట్యా గత నెల 19న తొలి రెండు వారాల షెడ్యూల్ను (17 మ్యాచ్లు) మాత్రమే ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం అన్ని వేదికల్లో మ్యాచ్ల నిర్వహణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ లీగ్ దశలో మిగిలిన 39 (మొత్తం 56) మ్యాచ్ల తేదీలను వెల్లడించింది. దీని ప్రకారం మే 5 వరకు లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఎప్పటిలాగే ఇంటా, బయటా పద్ధతిలో ప్రతీ జట్టు 14 మ్యాచ్లు ఆడుతుంది. ప్లే ఆఫ్ తేదీలను బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... మే 7, 8, 10 తేదీల్లో జరగవచ్చని బీసీసీఐలోని విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏదైనా వేదికలో ఏవైనా అనుకోని కారణాల వల్ల మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారితే ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్ను నిర్వాహకులు ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. మ్యాచ్ల సమయాల్లో కూడా ఎలాంటి మార్పు లేకుండా సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయి. ఈ నెల 23న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు మధ్య మ్యాచ్తో ఐపీఎల్ 12వ సీజన్ మొదలవుతుంది. హైదరాబాద్లో జరిగే మ్యాచ్లివే... సన్రైజర్స్ హోం గ్రౌండ్ హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఎప్పటిలాగే 7 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. సన్రైజర్స్తో మిగిలిన ఏడు జట్లు ఈ మ్యాచ్లలో తలపడతాయి. -
రైజింగ్ స్టార్స్