Vijay Kumar
-
సనాతన ధర్మం గురించి నాతో చర్చించే దమ్ముందా..?
-
హెచ్సీఎల్ టెక్ లాభం అప్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్ క్యూ2లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 4,235 కోట్లుగా నమోదైంది. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రెవెన్యూ వృద్ధితో పాటు లాభదాయకత కూడా మెరుగ్గా ఉందని సంస్థ సీఈవో సి. విజయ్ కుమార్ తెలిపారు. వార్షికంగా ఆదాయ వృద్ధి 3.5–5.0 శాతంగా ఉంటుందని హెచ్సీఎల్ టెక్ గైడెన్స్ ఇచి్చంది. క్యూ2లో 780 మంది ఉద్యోగులను తగ్గించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,621కి చేరింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి గాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 12 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సోమవారం బీఎస్ఈలో హెచ్సీఎల్ టెక్ షేరు స్వల్పంగా ఒక్క శాతం పెరిగి రూ. 1,856 వద్ద క్లోజయ్యింది. -
పెనుమూరులో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
కార్వేటినగరం: చిత్తూరు జిల్లా పెనుమూరు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కామసాని విజయకుమార్రెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఇంటి ఆవరణలోని రెండు కార్లను ధ్వంసం చేశారు. విజయకుమార్రెడ్డిని చంపుతామని బెదిరించారు. విజయకుమార్రెడ్డి పెనుమూరు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రపోతుండగా పెనుమూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పి.సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు పి.అనంత్రెడ్డి, పి.హేమాద్రినాయుడు కుమారుడు పి.ప్రదీప్, కె.బాబు కుమారుడు కె.రాజేష్ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి ఆ ఇంటిపై దాడిచేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కారు అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు.వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలున్న కారు నంబరు ప్లేట్లను పెరికి ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న పెనుమూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి కమలాకరరెడ్డి కారు నంబర్ ప్లేటు తీసి పగులగొట్టారు. అనంతరం ఇంట్లో నిద్రపోతున్న విజయకుమార్రెడ్డికి ఫోన్చేసి బయటకు రమ్మని పిలిచారు. నిద్రలో ఉన్న విజయకుమార్రెడ్డి భార్యాపిల్లలతో బయటకు రాగా చంపుతామంటూ బెదిరించారు. భయంతో విజయకుమార్రెడ్డి కుటుంబ సభ్యులతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వీరి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన సోమవారం ఉదయం పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుమూరు ఎస్ఐ లోకేష్ సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు.నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి అర్ధరాత్రి ఇంటి పైకి వచ్చి కార్లు ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్రెడ్డి డిమాండ్ చేశారు. వారు సోమవారం విజయకుమార్రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన నారాయణస్వామి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
శాంతి వద్దు రక్త పాతమే ముద్దు అంటున్న టీడీపీ నేతలు చంపుతాం అంటూ బెదిరింపులు
-
నటుడి మనవరాలి పెళ్లి.. హాజరైన సూపర్ స్టార్ రజినీకాంత్!
కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా చెన్నైలో సందడి చేశారు. సీనియర్ నటుడు విజయకుమార్ మనవరాలు దియా పెళ్లికి ఆయన హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. బంధువులు, సినీ ప్రముఖుల సమక్షంలో విజయ్ కుమార్ కూతుర్లలో ఒకరైన అనితా కుమార్తె దియా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ వివాహా వేడుకలో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని ఓ ఖరీదైన హోటల్లో ఈ వివాహా వేడుక జరిగింది. కాగా.. రజనీకాంత్, విజయకుమార్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. నటుడిగా విజయకుమార్ తమిళ చిత్రసీమలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందారు. కోలీవుడ్తో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో దాదాపు 400కి పైగా చిత్రాలలో కనిపించారు. ఆయన ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో కూడా నటించారు. కాగా.. రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు టీజే జ్ఞానవేల్ చిత్రం'వెట్టయన్' షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి'తలైవర్ 170' అనే సినిమా చేయనున్నారు. View this post on Instagram A post shared by Anitha Vijayakumar (@anits1103) -
యాక్టర్ విజయ కుమార్ మనవరాలి పెళ్లి.. వీడియో వైరల్
టాలీవుడ్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ప్రముఖ నటుడు విజయ కుమార్. ఆయన మనుమరాలి పెళ్లి ఈ నెలలో జరగనుంది. ఆ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విజయ కుమార్కు రెండు వివాహాలు జరిగాయి. ఆయన మొదటి భార్య ముత్తులక్ష్మి, రెండవ భార్య సినీనటి మంజుల. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు. మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు కవిత, అనిత ఉన్నారు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లతో పాటు కుమారుడు అరుణ్ ఉన్నాడు. అతను నటుడిగా స్థిరపడితే ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత, శ్రీదేవి కొన్ని సినిమాలలో నటించారు. వీరందరికీ వనిత విజయ కుమార్ మాత్రం ఒంటరిగా దూరంగా ఉన్నారు. (భర్త గోకుల్ కృష్ణన్తో అనిత విజయ కుమార్) విజయ్ కుమార్ పిల్లలు అందరూ సినిమా పరిశ్రమకు దగ్గర్లో ఉన్న వారే.. కానీ ఆయన మొదటి భార్య కుమార్తె అయిన అనిత మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె కూతురు ధియాకు వివాహం కానుంది. 1973లో జన్మించిన అనితా విజయకుమార్ ప్రముఖ డాక్టర్గా ఉన్నారు. గోకుల్ కృష్ణన్ అనే వైద్యుడిని పెళ్లి చేసుకుని ఖతార్లో ఆమె స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అనిత కూతురు థియా కూడా డాక్టర్గా స్థిరపడింది. గతేడాదిలో తిలాన్ అనే యువకుడితో థియా నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో థియా- తిలాన్ జంట ఈ నెలలో ఒకటి కానున్నారు. వారి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లి తేదీ తెలియాల్సి ఉంది. ఈ పెళ్లికి అనిత తన తండ్రి విజయకుమార్, సోదరి కవితతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఆ విధంగా రజనీ, సూర్య, ధనుష్ కుటుంబాలను అనిత స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె విడుదల చేశారు. తాజాగా తన కూతురు ఖతార్ నుంచి చెన్నైకి వచ్చింది. ఆ వీడియోను అనిత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అందులో థియా అమ్మమ్మ హారతి ఇవ్వడం చూడొచ్చు. View this post on Instagram A post shared by Anitha Vijayakumar (@anits1103) -
రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: మెట్రోనగరాల్లో తన నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ స్టాన్లీ ఉదోకాఇయూలను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ నాబ్) అధికారులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.8 కోట్ల విలువైన ఎనిమిది రకాలైన మాదకద్రవ్యాలు స్వాదీనం చేసుకున్నట్టు పశ్చిమ మండల డీసీపీ ఎం.విజయ్కుమార్ చెప్పారు. ఎస్పీ కేసీఎస్ రఘువీర్, ఏసీపీఎస్.మోహన్కుమార్, ఇన్స్పెక్టర్ పి.రాజేష్ తో కలిసి పంజగుట్ట ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బిజినెస్ వీసాపై ముంబై వచ్చి... గోవాలో స్థిరపడి నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009 నవంబర్లో బిజినెస్ వీసాపై ముంబైకి వచ్చాడు. తొలినాళ్లలో రెడీమేడ్ వ్రస్తాల వ్యాపారం చేశాడు. వ్యాపార విస్తరణలో భాగంగా 2012లో తన మకాం గోవాకు మార్చాడు. అక్కడి కండోలిమ్ ప్రాంతంలో కొందరు స్నేహితులతో కలిసి ఉంటూ రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేశాడు. పాస్పోర్టు పోగొట్టుకొని, వీసా గడువు ముగిసినా అక్రమంగా తిష్టవేశాడు. ఈ విషయం పసిగట్టిన గోవా పోలీసులు అరెస్టు చేయడంతో ఆరు నెలలు జైలులో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కండోలిమ్లోనే ఉండే రాజస్తానీ యువతి ఉషాచండేల్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే తన భర్త నుంచి వేరుపడిన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి స్టాన్లీ గ్రోసరీ పేరుతో కిరాణ దుకాణం ఏర్పాటు చేశారు. అక్కడకు సరుకులు ఖరీదు చేయడానికి వచ్చే ఇద్దరు నైజీరియన్లతో స్టాన్లీకి పరిచయమైంది. ఓ దశలో ఆర్థిక నష్టాల్లో చిక్కుకున్న స్టాన్లీకి ఈ ఇద్దరూ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కువ లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో డ్రగ్స్ దందా మొదలెట్టాడు. సేల్స్ నుంచి సప్లై చైన్ వరకు... తొలినాళ్లలో స్టాన్లీ ఆ ఇద్దరు నైజీరియన్ల నుంచి డ్రగ్స్ తీసుకొని స్థానికంగా విక్రయించేవాడు. వస్త్ర వ్యాపారంలో కంటే ఎక్కువ లాభాలు వస్తుండటంతో దీనినే కొనసాగించాడు. ఇద్దరు మిత్రులు నైజీరియాకు వెళ్లడంతో వారి డ్రగ్స్ వ్యాపారాన్నీ స్టాన్లీ టేకోవర్ చేశాడు. విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించడం, స్థానికంగా ఉన్న పెడ్లర్స్కు సప్లై చేయడం... ఇలా ఓ డ్రగ్స్ చైన్ ఏర్పాటు చేశాడు. 2017లో ఇదే ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. బయటకు వచ్చాక డ్రగ్స్ దందాను మరింత విస్తరించాడు. నైజీరియాతోపాటు నెదర్లాండ్స్లో ఉన్న డ్రగ్ సప్లయర్స్తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆర్డర్లు ఇస్తూ కొరియర్తో పాటు విమానాల్లో వివిధ రకాలైన డ్రగ్స్ తెప్పించుకునేవాడు. ఆయా దేశాల నుంచి కొందరు ట్రాన్స్పోర్టర్లు పెద్ద క్యాప్సూల్స్ రూపంలో కడుపులో దాచుకొని, బ్యాగుల్లోని రహస్య అరల్లో సర్దుకుని తీసుకొచ్చేవారు. మాదకద్రవ్యాలు ముంబై టు గోవా మాదకద్రవ్యాలు తొలుత ముంబై వచ్చేవి. అక్కడ ఉన్న సప్లయర్స్ ద్వారా గోవాకు తెప్పించుకునేవాడు. వీటిని కస్టమర్లతో పాటు ఇతర పెడ్లర్స్కు సరఫరా చేయడానికి ముగ్గురు దళారులను ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ప్రయాణ ఖర్చులతో పాటు ఒక్కో గ్రాము డెలివరీ చేసినందుకు రూ.2 వేల కమీషన్ ఇచ్చేవాడు. నైజీరియా వెళ్లిన ఇద్దరు మిత్రులు సైతం తమ పాత కస్టమర్ల ద్వారా వారికి వచ్చే ఆర్డర్స్ను వాట్సాప్ ద్వారా ఇతడికి పంపేవారు. ఇలా చేసినందుకు వారికీ గ్రాముకు రూ.2 వేలు కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తన వ్యాపారాన్ని విస్తరించిన స్టాన్లీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 511 మంది కస్టమర్లు ఉండగా, వారిలో ఏడుగురు నగరానికి చెందిన వారు. ఆర్థిక లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీ లేదా హవాలా రూపంలో చేస్తుంటాడు. ముంబైలో వస్త్రవ్యాపారం చేస్తుండగా పరిచయమైన నెట్వర్క్నే వాడుకుంటున్నాడు. స్టాన్లీ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోవాలో రూ.కోటి ఖరీదైన అపార్ట్మెంట్లో నివసిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఎస్ఆర్ నగర్లో దొరికిన తీగ లాగితే... టీఎస్ నాబ్ అధికారులు గత నెల 18న ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 38 ఎక్స్టసీ పిల్స్ స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కీలక నిందితుడైన బాబూసోను లోతుగా విచారించగా, డ్రగ్స్ స్టాన్లీ ద్వారా వస్తున్నాయని తేలింది. దీంతో గోవా వెళ్లిన టీఎస్ నాబ్ పోలీసులు నెల రోజులు శ్రమించి స్టాన్లీ ఆచూకీ కనిపెట్టారు. అతడి కదలికలపై నిఘా ఉంచిన అధికారులు మంగళవారం డ్రగ్స్ డెలివరీ ఇవ్వడానికి పంజగుట్టకు వచ్చినట్టు తెలుసుకున్నారు. అక్కడ వలపన్ని స్టాన్లీని పట్టుకోవడంతో పాటు అతడి నుంచి 557 గ్రాముల కొకైన్, 902 ఎక్స్టసీ మాత్రలు, 21 గ్రాముల హెరాయిన్, 45 గ్రాముల ఓజీ వీడ్, 105 ఎల్ఎస్డీ బోల్ట్స్, 215 గ్రాముల చరస్, 7 గ్రాముల యాంఫెటమైన్, 190 గ్రాముల గంజాయి, 8 సెల్ఫోన్లు, రూ.5.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సిటీలోని ఏడుగురు కస్టమర్ల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్ దందా వివరాలు తెలిసిన వారు 8712671111కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్ట్
-
ఈ కేసులో ఎంతటివారినైనా వదినే ప్రసక్తిలేదు: వెస్ట్ జోన్ డిసిపి విజయ్కుమార్
-
ఓ తండ్రి తీర్పు సినిమా ట్రైలర్ లాంచ్
-
సంఘటితంగా రైతుల ప్రకృతి సాగు
-
అడిషనల్ డీజీ విజయ్కుమార్కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ: పోలీస్శాఖలో విశిష్ట సేవలకుగాను సీనియర్ ఐపీఎస్ అధికారి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, సంగారెడ్డి ఎస్పీ మదాడి రమణకుమార్లకు కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పోలీస్ పతకాలు దక్కాయి. ఈ ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్ట్వ్ గిష్డ్ సర్విస్) కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 954 మందికి పోలీస్ పతకాలు సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీటిలో ఒకరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతకం, 229 మందికి పోలీస్ శౌర్యపతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు దక్కాయి. విజయ్కుమార్ : తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో పోలీస్ పతకాలు దక్కిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ 1997 బ్యాచ్ ఐపీఎస్కు చెందినవారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అ డిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన గతంలో కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్పై ఇంటెలిజెన్స్లో పదేళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్ సిటీ, మాదాపూర్ డీసీపీగా, కడప, నల్లగొండ జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు. రమణకుమార్: రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం దక్కిన మరో అధికారి మదాడి రమణకుమార్ ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలంపాటు ఏసీబీలో పనిచేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో పనిచేస్తున్న ఎస్పీ భాస్కరన్కు పోలీస్ శౌర్య పతకం దక్కింది. భాస్కరన్ సహా మొత్తం 22 మందికి పోలీస్ శౌర్య పతకాలు(పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ–పీఎంజీ) , ఉత్తమ ప్రతిభా పోలీస్ పతకాలు (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పది మందికి దక్కాయి. నలుగురు జైలు అధికారులకు కూడా... నలుగురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీ.హెచ్.కైలాశ్, హెడ్వార్డర్ జి.మల్లారెడ్డిలు ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు. జహీరాబాద్ ఫైర్స్టేషన్కు చెందిన లీడింగ్ ఫైర్మ్యాన్ శ్రీనివాస్కు ఫైర్ సర్విస్ ప్రతిభా పురస్కారం దక్కింది. హోంగార్డులు కె.సుందర్లాల్, చీర్ల కృష్ణ సాగర్లకు హోమ్గార్డ్స్ – సివిల్ డిఫెన్స్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిద్దరూ బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించడంతో ఈ అవార్డుకు ఎంపిక చేశారు. -
సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని కోయంబత్తూరుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ (డీఐజీ) విజయ్ కుమార్ ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని డీఐజీ అధికారిక నివాసంలో శుక్రవారం ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్ర మానసిక ఒత్తిడితోనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల కారణలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా 45 ఏళ్ల విజయ్ కుమార్ రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్లోని క్వార్టర్స్లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గన్ పేలిన శబ్దం విన్న ఆయన ఇంటి భద్రతా సిబ్బంది.. వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే విజయకుమార్ తీవ్ర డిప్రెషన్లో ఉన్నారని, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నారని, అతన్ని కుటుంబాన్ని కొన్ని రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు కాగా విజయ్ కుమార్ 2009 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన పోలీస్ అధికారి. ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్లకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా(ఎస్పీ) అన్నానగర్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. డీఐజీ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రిత్వ శాఖ అధిపతి అయిన సీఎం.. ట్విటర్లో స్పందిస్తూ ‘ పోలీస్ అధికారి విజయకుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి గురయ్యాను. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించింది. జిల్లా ఎస్పీతోపాటు హా వివిధ హోదాల్లో పనిచేసిన విజయ్ కుమార్ మరణం తమిళనాడు పోలీస్ శాఖకు తీరని నష్టం. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’అని పేర్కొన్నారు. ఉన్నది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మిల్లెట్స్తో మెరిసిన చిత్రాలు
విశాఖ (ఏయూ క్యాంపస్): గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురి పారిశ్రామిక దిగ్గజాల ఛాయాచిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవన్నీ చిరుధాన్యాలతో తీర్చిదిద్దినవి కావడమే ఇక్కడ విశేషం. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలపై ప్రజల్లో ఆసక్తి, అవగాహన పెంచేందుకు విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్కుమార్ విభిన్నంగా ఛాయాచిత్రాలను రూపొందించారు. భారతీయ రైల్వేలో టెక్నీషియన్–1గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన చిరుధాన్యాలతో దేశం గర్వించే నాయకులు, దిగ్గజ పారిశ్రామికవేత్తల చిత్రాలను తయారు చేశారు. జీఐఎస్, జీ–20 సదస్సులలో ప్రదర్శించడంతో పాటు ప్రముఖులకు, పారిశ్రామిక దిగ్గజాలకు వాటిని బహూకరించే విధంగా నెలల పాటు శ్రమించారు. జొన్నలు, గంట్లు, అరికలు, రాగులు, నల్ల నువ్వులు వంటి వాటితో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు బిర్లా, అంబానీ, అదానీ, ఆనంద్ మహీంద్రా తదితరుల చిత్రాలను రూపొందించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారిలకు గురువారం ఈ చిత్రాలను విజయ్కుమార్ చూపించారు. జీఐఎస్కు విచ్చేసే అతిథులు, ప్రముఖులకు వీటిని బహూకరించాలని కోరారు. వీటిని పరిశీలించిన మంత్రి అమర్నాథ్ చిత్రకారుడు విజయ్కుమార్ను అభినందించారు. వీటిని శుక్రవారం జరిగే సమ్మిట్లో హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు బహూకరిస్తామని చెప్పారు. -
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకీరామిరెడ్డి మరోసారి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి ఉప్పుటూరు వేణుగోపాలరావుపై 20 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రతి రౌండ్లో నువ్వా, నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు విజయం జానకీరామిరెడ్డిని వరించింది. మొత్తం 1,438 ఓట్లు పోల్ కాగా.. జానకీరామిరెడ్డికి 703, వేణుగోపాలరావుకు 683, మరో అభ్యర్థి డీఎస్ఎన్వీ ప్రసాద్బాబుకు 38 ఓట్లు వచ్చాయి. కొన్ని ఓట్లు చెల్లలేదు. వేణుగోపాలరావు విజయావకాశాలను ప్రసాద్బాబు ప్రభావితం చేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి గెలుపొందడం ఇది వరుసగా రెండోసారి. ఇప్పటి వరకు సంఘం చరిత్రలో వరుసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి ఎవరూ లేరు. కాగా ఉపాధ్యక్షుడిగా పీఎస్పీ సురేష్కుమార్ గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి తుహిన్ కుమార్పై 52 ఓట్ల తేడాతో గెలిచారు. సురేష్కు 739 ఓట్లు రాగా తుహిన్కు 687 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్ ఎన్నికయ్యారు. ఆయన టి.సింగయ్య గౌడ్పై 142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంయుక్త కార్యదర్శిగా సాల్మన్ రాజు గెలుపొందారు. ఆయన వై.సోమరాజుపై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి 75 ఓట్లతో, గ్రంథాలయ కార్యదర్శిగా జ్ఞానేశ్వరరావు 4 ఓట్లతో, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా చంద్రశేఖర్రెడ్డి పితాని 213 ఓట్లతో గెలిచారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా అన్నం శ్రీధర్, మారుతి విద్యాసాగర్, కాశీ అన్నపూర్ణ, షేక్ ఆసిఫ్, శాంతికిరణ్, శరత్, అచ్యుతరామయ్య విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా విజయ్కుమార్ వ్యవహరించారు. ఎన్నికల్లో జానకీరామిరెడ్డి వర్గం ఓవైపు నిలవగా, ఆయన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు ఏకమయ్యాయి. -
Arun Vijay: ప్లీజ్.. వదంతులను ప్రచారం చేయొద్దు.. అదంతా అబద్ధం
వదంతులను ప్రచారం చేయొద్దని నటుడు అరుణ్ విజయ్ కోరారు. ఆయన సీనియర్ నటుడు విజయ్కుమార్ వారసుడన్న విషయం తెలిసిందే. ఎంజీఆర్, శివాజీ గణేషన్ కాలం నుంచి నేటి తరం నటీనటుల వరకు నటిస్తున్న విజయ్కుమార్ మొదట్లో హీరోగా, విలన్గా నటించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తున్నారు. ఇటీవల తన కొడుకు అరుణ్ విజయ్ కథానాయకుడిగా సినం అనే చిత్రాన్ని నిర్మించారు. విజయ్కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నటుడు అరుణ్ విజయ్ తన తండ్రి విజయకుమార్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, వదంతులను ప్రచారం చేయవద్దని తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన యానై, సినమ్ చిత్రాలు ఇటీవల విడుదలై మంచి ప్రజాదరణ పొందాయి. అదే విధంగా తమిళ రాకర్స్ అనే వెబ్సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రశంసలు అందుకుంటోంది. కాగా ప్రస్తుతం ఈయన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో నటి అమీజాక్సన్ హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది. దీనికి అచ్చం యంబదు ఇల్లయే అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు 20న ప్రారంభమైంది. -
పగడ్బందీ వ్యూహంతో వీరప్పన్ను హతమార్చాం
సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): పగడ్బందీ ప్రణాళికలు, స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం నేర్పుతో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను హతమార్చామని తమిళనాడు స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్)కి నాయకత్వం వహించిన మాజీ ఐపీఎస్ అధికారి కె.విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం చెన్నై తరమణిలోని ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో జరిగిన కార్యక్రమంలో.. మాజీ ఐపీఎస్ అధికారి విజయకుమార్ రాసిన (వీరప్పన్ ఛేజింగ్ ది బ్రిగాండ్) పుస్తకం ఆధారంగా 20 ఎపిసోడ్ల ఆడియో రికార్డులను ఆసియావిల్లే వ్యవస్థాపకుడు, సీఈఓ తుహిన్ ఆవిష్కరించారు. మాట్లాడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ఈ సందర్భంగా థ్రిల్లింగ్ ట్రూ–క్రైమ్ పై ఆడిబుల్ ఒరిజినల్ పాడ్కాస్ట్ సర్వీస్ను ప్రారంభించారు. ఇందులో 1952లో గోపీనాథంలో పుట్టినప్పటి నుంచి 2004లో మరణించే వరకు వీరప్పన్ జీవితానికి సంబంధించిన అంశాలు మాజీ ఐపీఎస్ కె. విజయ్ కుమార్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించామని వివరించారు. అనంతరం ఇందులో పాల్గొన్న విజయకుమార్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్ను ఎలాగైనా మట్టికరిపించాలనే లక్ష్యంతో పక్కా వ్యూహంతో హతమార్చగలిగామన్నారు. ఇందులో ఏకే 47 గన్ను వినియోగించామని చెప్పారు. ఎంతో మంది పోలీసులను, సాధారణ ప్రజలను కిరాతకంగా వీరప్పన్ చంపారని గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్కు ఎవరూ భంగం కలిగించినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందే విషయాన్ని ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేశాం.. అని ఆయన పేర్కొన్నారు. -
ఉగ్రవాద లెక్కలు పరమ సత్యాలా?
ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు భావిస్తుండవచ్చు. దీనికి మంచి సాక్ష్యం కశ్మీర్లో తీవ్రవాదుల సంఖ్య గురించిన సమాచారం. కశ్మీర్ లోయలో ఇప్పుడు 81 మంది ఉగ్రవాదులు ఉన్నారనీ, వీరిలో 29 మంది స్థానికులు కాగా, 52 మంది విదేశీ ఉగ్రవాదులనీ డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అంత కచ్చితంగా ఆయన ఎలా చెప్పగలిగారు? వాళ్లు ఏమైనా వస్తూపోతున్నప్పుడు ఒక రిజిస్టర్లో సంతకాలు ఏమైనా పెడుతున్నారా? లేక వారి గురించిన సమస్త వివరాలనూ వాసన పట్టేసే మార్గాలు అక్షరాలా మనవద్ద ఉన్నాయా? వీళ్ల ఆనుపానులు కూడా ఇంత కచ్చితంగా తెలిసినప్పుడు మరి వాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదు? ఉగ్రవాదుల గురించిన వివరాలపై మనం ఇలాంటి మామూలు ప్రశ్నలు కూడా వేయలేమా? పైగా వాటిని నిలదీయడానికి వీల్లేని పరమ సత్యాలుగా భావిస్తుండటం మరీ విషాదం. ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులకు చాలావరకు మనలాంటి సాధారణ ప్రజలు ఏది చెప్పినా సరే మందమతుల్లాగ తలా డించేస్తుంటారని గట్టినమ్మకం. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా లేక ఆఫీసులో ఉంటున్న ఏ అధికారి విషయంలోనైనా ఇది నిజమనే చెప్పాలి. కానీ అప్పుడప్పుడూ వాళ్లు ఇచ్చే సమాచారం ప్రతిదీ నమ్మేసేవాళ్లను కూడా ఆలోచనలో పడేస్తుంది. జమ్మూ కశ్మీర్లోని ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినంత వరకూ ఇది చాలా తరచుగా నిజమేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. గత శనివారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) విజయ్ కుమార్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికకు నివ్వెరపరచే వివరాలు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కశ్మీర్ లోయలో 81 మంది యాక్టివ్ ఉగ్రవాదులు ఉన్నారు. వీరిలో 29 మంది స్థానికులు కాగా, 52 మంది విదేశీ ఉగ్రవాదులు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలరు? ఉగ్రవాదులు వచ్చి సంతకాలు పెట్టిపోయేలా మనం ఏమైనా ఒక రిజిస్టర్ నిర్వ హిస్తున్నామా? పైగా వారి మూలం, నేపథ్యం గురించి మనకేమైనా చెప్పారా? లేక వారి గురించిన సమస్త వివరాలనూ వాసన పట్టేసే మార్గాలు అక్షరాలా మనవద్ద ఉన్నాయా? అంకెలు సరిపోతున్నాయా? అంతమాత్రమే కాదు. డీజీపీ ఇంకా చాలా నిర్దిష్టంగా ఉన్నారు. ‘‘బందీపుర్, కుప్వారా, గాందర్బల్ జిల్లాల్లో స్థానిక ఉగ్రవాదులు అసలు లేరు. కాగా అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా, బడ్గావ్ జిల్లాల్లో ఒక్కో ఉగ్రవాది మాత్రమే చురుగ్గా పనిచేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల సంఖ్య విషయంలో ఆయన అంత నిర్దిష్టంగా, కచ్చితంగా ఎలా చెప్పగలిగారు అనే ప్రశ్నను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు విదేశీ ఉగ్రవాదుల అంశం ముందుకు తెద్దాం. తొలి మూడు జిల్లాల్లోనే విదేశీ తీవ్రవాదులు పనిచేస్తున్నారని డీజీపీ సూచిస్తున్నారా? రెండవది, ఆయన పేర్కొన్న చివరి నాలుగు జిల్లాల్లో ఒకే ఒక స్థానిక ఉగ్రవాది ఉంటున్నాడా? వారి ఉనికిని ఇంత కచ్చితంగా మనం తెలుసుకుంటున్నప్పుడు, అంటే వారు ఉన్న ప్రదేశం కూడా మనకు తెలిసిపోయినప్పుడు వారిని మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వాస్తవానికి ఈ ప్రశ్నలు డీజీపీ విజయ్ కుమార్ని ఇబ్బంది పెట్టవు. ఆయన్ని తన మార్గం నుంచి వైదొలిగేలా చేయవు కూడా! పైగా ప్రతి సంవత్సరం ఎంతమంది స్థానిక కశ్మీరీలు తీవ్రవాదుల్లో చేరుతున్నారు అనేది కూడా ఆయనకు తెలిసినట్లే కనబడుతోంది. బహశా వారు తమ వివరాలు ఆయనకు తెలిపి ఉండవచ్చు లేదా వారికి అత్యంత విశ్వసనీయమైనవారు, సన్నిహితమైనవారు డీజీపీ చెవిలో ఊది ఉండవచ్చు. 2018లో 201 మంది స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా ఈ సంవత్సరం వారి సంఖ్య 99కి పడిపోయిందని డీజీపీ ప్రకటించారు. ఇంత కచ్చితమైన వివరాలు ఆయనకు ఎలా తెలిశాయి అని ఎవరూ డీజీపీని అడగలేరు. లేదా ఆయన బహుశా చెప్పరు కూడా! నిజానికి తనను వైరుద్ధ్యాల్లోకి లాగుతున్న ఈ 99 సంఖ్యను తాను బయటపెట్టినప్పటికీ తనను ఎవరూ నిలదీయరని ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నట్లున్నారు. ఈ సంవత్సరం కశ్మీర్ లోయలో 99 మంది స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో 64 మంది హతమై పోయారనీ, 17 మందిని అరెస్టు చేయగా 18 మంది ఉగ్రవాదులు మాత్రమే క్రియాశీలంగా ఉన్నారనీ డీజీపీ వివరించి చెప్పారు. అయితే పైన చెప్పిన వివరాలకేసి చూస్తే, 29 మంది స్థానిక ఉగ్రవాదులు మాత్రమే లోయలో ఉన్నారని ఆయన చెప్పి ఉన్నారు. మరి మిగతా 11 మంది ఉగ్రవాదులు ఎక్కడ తప్పిపోయారు? ఇవి కేవలం వివరాలు మాత్రమే కాబట్టి వీటికి పెద్ద ప్రాధాన్యం ఉండకపోవచ్చని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే డీజీపీ మరింత ముఖ్యమైన విషయం ప్రకటించారు. అదేమిటంటే, చనిపోయిన 64 మంది ఉగ్రవాదుల్లో 57 మంది వారు చనిపోవడానికి సరిగ్గా నెల ముందే ఉగ్రవాద సంస్థల్లో చేరారన్న సంగతి! ఈ విషయం కూడా ఆయనకు ఎలా తెలుసు? వారు ఎప్పుడు చేరిందీ ఆయనకు తెలిసి ఉంటే, వారిని ఎందుకు ఆపలేకపోయారు లేదా కనీసం వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? అయితే ఈ ప్రశ్నలను నేను అడగలేదు. మొత్తం మీద ఉగ్రవాదులకు చెందిన ఇంత సున్నితమైన వివరాలు డీజీపీ చేతివేళ్లపై అంత కచ్చితంగా ఆడుతున్నప్పుడు నాకు ఒకే సందేహం ఉంది. కొంప దీసి డీజీపీ విజయ్ కుమార్ ఈ ఉగ్ర వాదుల జీవిత చరిత్రలు త్వరలో రాసినా నేనేమీ ఆశ్చర్యపోను. ప్రశ్నించరనే ధీమానా? ఇప్పుడు, కశ్మీర్ లోయలో పోలీసుల కచ్చితత్వం గురించి మూగ పోయేవారిలో నేనే మొదటివాణ్ణి కాదు. 2000 సంవత్సరపు ప్రారంభంలోకి వెళ్లి చూద్దాం. పాకిస్తాన్ నుంచి నెలకు ఎంతమంది జిహాదీలు వాస్తవాధీన రేఖను దాటి వస్తున్నారో నాటి పోలీసులు మాకు నిత్యం వివరాలు చెబుతున్నప్పుడు, ఈజిప్ట్ రాయబారి గెహాద్ మాది తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయారు. ‘‘ఈ నెలలో 241 మంది వాస్తవాధీన రేఖను దాటి వచ్చారు. గత నెలలో 225 మంది, అంతకు ముందు నెలలో 230 మంది భారత్ భూభూగంలోకి వచ్చారు అని చెబుతున్నారు. ఇంత కచ్చితంగా వారు ఎలా చెప్పగలరు? వాస్తవాధీన రేఖను దాటి భారత్లోకి అడుగుపెట్టే ముందు జిహాదీలు రిజిస్టర్లో సంతకం పెట్టివచ్చే కార్యాలయం ఏమైనా ఉందా?’’ అని ఈజిప్టు రాయబారి వ్యంగ్యంగా ప్రశ్నించారు. గెహాద్ తన దౌత్య పరిధులను దాటి బహిరంగంగా తన సందేహాలను లేవనెత్తి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన సంధించిన ప్రశ్నలకు ఎవరూ సమాధానం ఇచ్చి ఉండరు. కానీ ఇప్పుడు ఉగ్రవాదుల గురించి డీజీపీ విజయ్ కుమార్ చెప్పిన వివరాలపై కొన్ని మామూలు ప్రశ్నలు కూడా మనం వేయలేమా? డీజీపీ ఎవరి వద్దనయితే ఈ వివరాలు చెప్పారో ఆ జర్నలిస్టులు ఆయనను ఏమాత్రం ప్రశ్నించకపోవడం విషాదకరమైన విషయం. వారు ఏమీ అడగలేరని ఆయనకు తెలియడమూ, పైగా ఆయన చెప్పిన వివరాలు నిలదీయడానికి వీల్లేని పరమ సత్యాలుగా మనం కూడా ఆమోదిం చాలని డీజీపీ భావిస్తుండటమూ మరింత విషాదం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వీరప్పన్ను మట్టుబెట్టిన పోలీసు అధికారి రాజీనామా
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్, కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్ను పక్కా ప్రణాళికలతో మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి కే విజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత హోంశాఖ అధికారులకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన విజయ్ కుమార్.. ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నట్లు వెల్లడించారు. ‘వ్యక్తిగత కారణాలతో హోంశాఖలో నిర్వర్తిస్తున్న నా బాధ్యతలకు స్వస్తి చెప్పి.. ప్రస్తుతం చెన్నైకి మారాను.’ అని విజయ్ కుమార్ తెలిపారు. మరోవైపు.. హోంశాఖ భద్రతా సలహాదారుగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, సహకారం అందించిన హోంశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఆయన సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానే ఉపయోగపడ్డాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 1975 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన విజయ్ కుమార్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ హోదాలో 2012లో పదవీ విరమణ చేశారు. అనంతరం హోంశాఖ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గవర్నర్కు భద్రతా సలహాదారుగా విజయ్కుమార్ను కేంద్రం నియమించింది. అంతకుముందు తమిళనాడులో స్పెషల్ టాస్క్ఫోర్స్ చీఫ్గా పని చేశారు. ఆ సమయంలోనే 2004లో పక్కా ప్రణాళికతో కిల్లర్ వీరప్పన్ను మట్టుబెట్టారు. చెన్నై పోలీస్ కమిషనర్గానూ, జమ్ముకశ్మీర్లో బీఎస్ఎఫ్ ఐజీగానూ విజయ్కుమార్ విధులు నిర్వర్తించారు. ఇదీ చదవండి: పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్కే ముచ్చెమటలు పట్టించి.. -
ఏపీ వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది: విజయ్కుమార్
-
బెట్టువీడిన బీజేపీ నేత.. ఎట్టకేలకు రాజీనామా
పాట్నా: బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా.. ఎట్టకేలకు బెట్టువీడారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్న ఆయన.. చివరికి తగ్గాడు. బుధవారం మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వ బలనిరూపణ కంటే ముందే.. అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారాయన. రాజీనామా సమర్ఫణకు ముందుగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా సమర్పించిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా, అసంబద్ధంగా ఉందని, రూల్స్ ప్రకారం తీర్మానం సమర్పించలేదని సభ్యులను ఉద్దేశించి తెలిపారు. అయితే.. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను రాజీనామా చేయాల్సి ఉందని, కానీ, తనపై తప్పుడు ఆరోపణల నేపథ్యంలో తాను ఆ పని చేయకూడదని నిర్ణయించుకున్నానని సభకు తెలిపారు. ఇదీ చదవండి: బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్ -
అవిశ్వాసం పెట్టినా.. రాజీనామా చెయ్యను
పాట్నా: బీహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామంపై జోరుగా చర్చ నడుస్తోంది. నితీశ్ కుమార్ సర్కార్కు బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా ఝలక్ ఇచ్చారు. మొదటి నుంచి నితీశ్కు కొరకరాని కొయ్యగా తయారైన విజయ్.. తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు వ్యతిరేకంగా మహాఘట్బంధన్ కూటమి నుంచి 55 ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. నేనొక పక్షపాతినని, నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నానని అందులో వాళ్లు ఆరోపించారు. అవన్నీ ఉత్తవే. అలాంటి ఆరోపణల నేపథ్యంతో రాజీనామా చేయాల్సి వస్తే.. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే అంశమే. అందుకే నేను రాజీనామా చేయదల్చుకోలేదు అని విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. బీజేపీ నేత అయిన విజయ్ కుమార్ సిన్హా వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. జేడీయూతో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన నిర్ణయాలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేవి. సభాముఖంగా నితీశ్ను ఎన్నోసార్లు మందలించారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన్ని మార్చేయాలంటూ బీజేపీ అధిష్టానానికి నితీశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకుండా పోయింది. సాధారణంగా.. ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో స్పీకర్ పదవి నుంచి సదరు వ్యక్తి వైదొలగాల్సి ఉంటుంది. కానీ, మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు గడుస్తున్నా విజయ్ కుమార్ సిన్హా రాజీనామాకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ వ్యవహారాల నిబంధనల్లో రూల్ నెంబర్ 110 ప్రకారం సిన్హా పదవి నుంచి తప్పుకోవాలంటూ ఆగస్టు 10వ తేదీనే 55 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటేరియెట్కు అందించింది కూటమి ప్రభుత్వం. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై గప్చుప్గా ఉంటోంది. మరోవైపు ఆయన స్వచ్ఛందంగా వైదొలిగితే బాగుంటుందని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 24న(ఇవాళ) నుంచి రెండు రోజులపాటు బీహార్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే బలనిరూపణతో పాటు స్పీకర్ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ కుమార్ సిన్హా గనుక ఈ సమావేశాలకు గైర్హాజరు అయితే డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారి(జేడీయూ) సభా వ్యవహారాలను చూసుకుంటారు. ఇదీ చదవండి: బీజేపీ మాకు భయపడుతోంది -
ఆ నిర్మాణ సంస్థలో రెండోసారి విజయ్ సినిమా..
Uriyadi Vijay Kumar New Movie With Reel Good Films: 'ఉరియడి' చిత్రంతో ఆ పేరునే ఇంటి పేరుగా గుర్తింపు పొందిన నటుడు విజయ్ కుమార్. ఆ తర్వాత సూర్య, జ్యోతికల నిర్మాణా సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై 'ఉరియడి-2' చిత్రం చేసిన ఈయన తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. రీల్ గుడ్ ఫిలీంస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఇది ఈ సంస్థలో ఆయన చేస్తున్న రెండో చిత్రం. ప్రీతి అస్రాణి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి 'సేతుమాన్' చిత్రం ఫేమ్ తమిళ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్రన్ జయ రాజ్ ఛాయగ్రహణం, వసంత గోవింద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ.. సామాజిక రాజకీయ సంఘటనలతో పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. షూటింగ్ను ఏకధాటిగా నిర్వహించి 60 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. -
షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ కుమార్
ఉరియడి చిత్రంతో దర్శకుడిగా, నటుడిగా పరిచయమైన నటుడు విజయ్ కుమార్ ఆ తరువాత ఉరియడి 2 మూవీ తీసి హిట్ కొట్టారు. ఆ తరువాత సూర్య కథానాయకుడిగా నటించి, నిర్మించిన సూరరై పోట్రు చిత్రానికి సంభాషణలను అందించారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ను పూర్తి చేశారు. రీల్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అబ్బాస్ ఏ.రహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. చదవండి: బాలీవుడ్ స్టార్ హీరోకు విలన్గా విజయ్ సేతుపతి? విలన్గా విజయ్ సేతుపతి? కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్ -
ఆరికెలు: బలవర్ధకమైన, ఔషధ గుణాలున్న ఆహారం.. పండించడం ఎలా?
ఆరిక అన్నం ఇంటిల్లపాదికీ అత్యంత బలవర్ధకమైన, ఔషధ గుణాలున్న ఆహారం. ఖరీఫ్లో మాత్రమే సాగయ్యే చిరుధాన్య పంట ఆరిక మాత్రమే. ఆరిక 160–170 రోజుల పంట. విత్తిన తర్వాత దాదాపు 6 నెలలకు పంట చేతికి వస్తుంది. ఆరికలు విత్తుకోవడానికి ఆరుద్ర కార్తె (జూలై 5 వరకు) అత్యంత అనువైన కాలం. మొలిచిన తర్వాత 40–50 రోజులు వర్షం లేకపోయినా ఆరిక పంట నిలుస్తుంది. ఇతర పంటలు అంతగా నిలవ్వు. చిరుధాన్యాల్లో చిన్న గింజ పంటలు (స్మాల్ మిల్లెట్స్).. ఆరిక, కొర్ర, సామ, ఊద, అండుకొర్ర. ఆరిక మినహా మిగతా నాలుగు పంటలూ 90–100 రోజుల్లో పూర్తయ్యేవే. చిరుధాన్యాల సేంద్రియ సాగులో అనుభవజ్ఞుడు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్ ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో ఆరికల సాగులో మెలకువలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరుస్తున్నాం... ఆరిక విత్తనాలు ఒక్క వర్షం పడి తేమ తగలగానే మొలుస్తాయి. ఒక్కసారి మొలిస్తే చాలు. గొర్రెలు తిన్నా మళ్లీ పెరుగుతుంది ఆరికె మొక్క. మొలిచిన తర్వాత దీర్ఘకాలం వర్షం లేకపోయినా తట్టుకొని బతకటం ఆరిక ప్రత్యేకత. మళ్లీ చినుకులు పడగానే తిప్పుకుంటుంది. అందువల్ల సాధారణ వర్షపాతం కురిసే ప్రాంతాలతో పాటు అత్యల్ప వర్షపాతం కురిసే ప్రాంతాలకూ ఇది అత్యంత అనువైన పంట. నల్ల కంకి సమస్యే ఉండదు. ఆరిక పంటకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు అవసరం లేదు. పొలాన్ని దుక్కి చేసుకొని మాగిన పశువుల దిబ్బ ఎరువు ఎకరానికి 4–5 ట్రాక్టర్లు(12 టన్నులు) వెదజల్లాలి. లేదా గొర్రెలు, మేకలతో మందగట్టడం మంచిది. గొర్రెలు, మేకలు మూత్రం పోసిన చోట ఆరిక అద్భుతంగా దుబ్బు కడుతుంది. శ్రీవరి సాగులో మాదిరిగా 30–40 పిలకలు వస్తాయి. పొలాన్ని దుక్కి చేసి పెట్టుకొని.. మంచి వర్షం పడిన తర్వాత ఆరికెలను విత్తుకోవాలి. వెదజల్లటం కన్నా గొర్రుతో సాళ్లుగా విత్తుకోవడం మంచిది. గొర్రుతో విత్తితే విత్తనం సమాన లోతులో పడుతుంది. ఒకరోజు అటూ ఇటుగా మొలుస్తాయి. ఒకేసారి పంటంతా కోతకు వస్తుంది. 8 సాళ్లు ఆరికలు విత్తుకొని, 1 సాలు కందులు, మళ్లీ 8 సాళ్లు ఆరికలు, ఒక సాలు ఆముదాలు విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆరిక విత్తనం కావాలి. కంది విత్తనాలు ఎకరానికి ఒకటిన్నర కిలోలు కావాలి. కిలోన్నర కందుల్లో వంద గ్రాములు సీతమ్మ జొన్నలు, 50 గ్రాములు తెల్ల / చేను గోగులు కలిపి విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆముదం విత్తనాలు కావాలి. ఎకరానికి పావు కిలో నాటు అలసందలు /బొబ్బర్లు, అర కిలో అనుములు, వంద గ్రా. చేను చిక్కుళ్లు ఆముదాలలో కలిపి చల్లుకోవాలి. ఆరికలు విత్తుకునేటప్పుడు కిలో విత్తనానికి 4 కిలోల గండ్ర ఇసుక కలిపి విత్తుకోవాలి. ఆరికల విత్తనాలు ఎంత సైజులో ఉంటాయో అదే సైజులో ఉండే ఇసుక కలిపి గొర్రుతో విత్తుకోవాలి. కందులు, ఆముదం తదితర విత్తనాలను అక్కిలి / అక్కిడి కట్టెలతో విత్తుకోవాలి. ఆరికలను మిశ్రమ సాగు చేసినప్పుడు పెద్దగా చీడపీడలేమీ రావు. కషాయాలు పిచికారీ చేయాల్సిన అవసరం రాదు. ఐదారు రకాల పంటలు కలిపి సాగు చేయడం వల్ల చీడపీడలు నియంత్రణలో ఉంటాయి. రైతు కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల పంటలూ చేతికి వస్తాయి. ఆహార భద్రత కలుగుతుంది. కంది, సీతమ్మ జొన్న తదితర పంట మొక్కల పిలకలు తుంచేకొద్దీ మళ్లీ చిగుర్లు వేస్తూ పెరుగుతాయి. పక్షి స్థావరాలుగా కూడా ఇవి ఉపయోగపడతాయి. ఆరికలు ఎకరానికి ఎంత లేదన్నా 6–8 క్వింటాళ్లు, కందులు 3 క్వింటాళ్లు, ఆముదాలు 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సందేహాలుంటే విజయకుమార్ (98496 48498)ను ఆంధ్రప్రదేశ్ రైతులు ఉ. 6–9 గం. మధ్యలో, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య సంప్రదించవచ్చు. చదవండి: ఏనుగుల నుంచి రక్షించే నిమ్మ చెట్ల కంచె! -
టీడీపీతో విజయ్కుమార్ కుమ్మక్కు.. జన సైనికుడు కిరణ్ ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: నాడు ప్రజారాజ్యం పార్టీ నుంచి నేడు జనసేన పార్టీ వరకు మెగా ఫ్యామిలీ అభిమానిగా, గ్రామ నాయకుడిగా సేవలందిస్తున్న తనపై జనసేన ముసుగులో ఉన్న టీడీపీ నాయకుడు సుందరపు విజయ్కుమార్, అతడి అనుచరులు దాడి చేసినా అధిష్టానం స్పందించ లేదని ఎర్రిపల్లి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. జనసేన పార్టీని టీడీపీకి తాకట్టు పెడుతున్న అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల విశాఖకు వచ్చిన జనసేన ముఖ్య నాయకుడు నాగబాబు దృష్టి తీసుకెళ్లినందుకు దాడి చేశారన్నారు. విజయ్కుమార్ లాంటి వారి వల్ల పార్టీ నాశనమవుతోందన్నారు. జనసైనికులుగా పార్టీపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, ఇలాంటి వారు భ్రష్టుపట్టిస్తున్నారని వాపోయారు. గతంలోనూ అతడి ఆగడాలను జనసేన అధ్యక్షుడికి, పార్టీ ప్రధాన కార్యాలయానికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశానన్నారు. అయినా వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. యలమంచిలి నియోజవర్గ ఇన్చార్జి సుందరపు విజయ్కుమార్, సుందరపు సతీష్కుమార్, గాజువాకకు చెందిన ఏడిద భార్గవ శ్రీనివాసరావు, కాశీందేవుల సతీష్, కోఠారి నరేష్, కాళ్ల చంద్రమోహన్, ప్రకాష్, భాస్కరరావు, శివశంకర్, బొద్దపు శ్రీనివాస్ తనను గదిలో ఆరు గంటలపాటు బంధించి దాడి చేశారన్నారు. వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. చదవండి: (సీఎం జగన్ను కలిసిన సివిల్ సర్వీసెస్ విజేతలు) -
ఉగ్రవాదులు మరో ఘాతుకం.. కుల్గామ్లో బ్యాంకు మేనేజర్ హత్య
-
నాకు నేను కనిపించలేదు!
‘‘జయమ్మ పంచాయితీ’కు కేటాయించిన సమయాన్ని టీవీ షోలు, ప్రీ రిలీజ్లకు హోస్ట్గా చేయడం వంటి వాటికి వినియోగించినట్లయితే మరిన్ని డబ్బులు వచ్చి ఉండేవేమో. కానీ నన్ను నేను ప్రపంచానికి ఎక్స్ప్లోర్ చేసుకోవాలను కున్నప్పుడు లాభ నష్టాల గురించి ఆలోచించకూడదు. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ సినిమా చేసినందుకు నాకు నేను శెభాష్ చెప్పుకుంటున్నా’’ అని ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల అన్నారు. విజయ్ కుమార్ దర్శకుడిగా సుమ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సుమ చెప్పిన విశేషాలు.... ‘జయమ్మ పంచాయితీ’ బౌండ్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ సినిమాలో జయమ్మ క్యారెక్టర్ నిడికి తక్కువ ఉంటుందేమోనని ఊహించి, చదవడం మొదలుపెట్టాను. కానీ కథ మొత్తం ఆ పాత్రతోనే నడుస్తోందని స్క్రిప్ట్ చదువుతున్న కొద్దీ అర్థం అయ్యింది. అయితే టెలివిజన్ షోలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఫ్యామిలీ బాధ్యతలను పక్కన పెట్టి ఈ సినిమా చేయాలా? అని ఒకటికి పదిసార్లు ఆలోచించాను. కానీ చాలెంజ్గా తీసుకుని చేశాను. అవి నచ్చి ఈ సినిమా చేశా! కులాలకు సంబంధించిన అంశాలు, మూఢనమ్మకాలు, మహిళల పట్ల వివక్ష వంటి అంశాలను విజయ్గారు ఈ చిత్రంలో ప్రస్తావించారు. ఆ అంశాలు నచ్చి నన్ను ఈ సినిమా చేసేలా చేశాయి. మన ఊర్లో ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ జరిగితే మనం ఈడ్లు (చదివింపులు) వేస్తాం. జయమ్మకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య పరిష్కారం కావాలంటే జయమ్మ ఎవరికైతే ఈడ్లు వేసిందో వారందరూ తిరిగి వేయాలి. కానీ జయమ్మ ఈడ్లు తీసుకున్నవారికీ కొన్ని సమస్యలు ఉంటాయి. మరి.. జయమ్మ సమస్య ఎలా తీరింది? అన్నదే ఈ చిత్రకథ. ఎవరూ నిరుత్సాహపడరు సుమ బాగా యాక్ట్ చేసిందని మెచ్చుకుంటారే కానీ నిరుత్సాహపడరనే నమ్మకం ఉంది. ఒకసారి సినిమా స్టార్ట్ అయ్యాక అందరూ క్యారెక్టర్స్తో ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే సుమ గురించి ఊహించకుండా విజయ్ రాసిన స్టోరీ ఇది. సినిమా చూస్తున్నప్పుడు నాకు నేనే కనిపించలేదు. జయమ్మే కనిపించింది. ఓ ప్రయోగాత్మక సినిమా చేçస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదు. అందుకే శ్రీకాకుళం స్లాంగ్ కోసం చాలా ప్రాక్టీస్ చేశాను. ఈ జయమ్మ పంచాయితీ హిట్ అయితే మరో పంచాయితీ ఉంటుంది. నా తర్వాతి ప్రాజెక్ట్ కోసం రెండు కథలు ఉన్నాయి. రోషన్ లాంచ్ ఈ ఏడాదే.. నా కుమార్తెకు ఏడెనిమిదేళ్లు ఉన్న సమయంలో చాలా బిజీగా ఉండి వరుసగా మూడు రోజులు నేను తనకు కనిపించలేదు. ఆ సమయంలో ‘నిన్ను టీవీలోనే చూడాలా అమ్మా..’ అని నా కూతురు అడిగింది. ఆ రోజు గుండె పిండేసినట్లయింది. ఇప్పుడు తనకు 16 ఏళ్లు. తన ఆలోచనా ధోరణిలో పరిణతి వచ్చింది. నా కొడుకు రోషన్కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఆసక్తి. ఈ ఏడాది తనని లాంచ్ చేస్తాం. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో శ్రీకాకుళంలోని పాలకొండ, చెన్నైపేట, అక్కడి అటవీ ప్రాంతం.. ఈ లొకేషన్స్ను ఎవరూ ఎక్స్ప్లోర్ చేయలేదు. బహుశా.. ఈ లొకేషన్స్లోకి యూనిట్ వెళ్లడం, సామాగ్రిని తీసుకుని వెళ్లడం కష్టమని భావించి ఎవరూ ప్రయత్నించలేదేమో కానీ ఈ లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. మా ‘జయమ్మ పంచాయితీ’ సినిమా సెకండాఫ్లోని కొన్ని సీన్ల కోసం ట్రెక్కింగ్ చేసి మరీ ఆ లొకేషన్స్కు వెళ్లాం. అక్కడ కొన్ని జలపాతాలూ ఉన్నాయి. శ్రీకాకుళంలో ఎంత అందం ఉందో! -
యాంకర్ సుమపై ఆ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Director Vijay Kumar Kalivarapu Comments On Suma Kanakala: ‘‘జయమ్మ పంచాయితీ’లో జయమ్మ పాత్రలో రమ్యకృష్ణగారి లాంటి నటి అయితే బాగుంటుందనుకున్నాను. అయితే నాకు తెలిసినవారు సుమగారి పేరును సజెస్ట్ చేయడంతో ఆమెకి కథ చెప్పాను. ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పారు. కానీ ఆమె నటనపై సందేహం కలిగింది. టెస్ట్ షూట్ చేశాక నమ్మకం వచ్చింది’’ అన్నారు విజయ్ కుమార్ కలివరపు. యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. స్టార్ హీరోలతో పని చేయాలనుకున్నాను. అయితే అది అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి చాలా సమయం పట్టింది. కొందరు వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది రాసుకున్న కథే ‘జయమ్మ పంచాయితీ’. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన జయమ్మ తన గ్రామంలో ఇబ్బందులకు గురవుతుంది. ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది. అది ఏంటి? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించలేదు. లొకేషన్లలో సింక్ సౌండ్ వాడాం. కీరవాణిగారు మా చిత్రానికి సంగీతం అందించడం సినిమా విజయంపై నాకు మరింత నమ్మకాన్నిచ్చింది’’ అన్నారు. చదవండి: రాజీవ్తో విబేధాలపై స్పందించిన యాంకర్ సుమ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అమెజాన్ ప్రైమ్లో 'ఓ మై డాగ్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాస్టర్ ఆర్ణవ్కు అవార్డు రావడం ఖాయమని దర్శకుడు సరోవ్ షణ్ముగం అన్నారు. ఈయన దర్శకత్వం వహించిన 'ఓ మై డాగ్' చిత్రాన్ని నటి జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా ద్వారా నటుడు అరుణ్విజయ్ కొడుకు ఆర్ణవ్ బాలనటుడిగా ప్రధాన పాత్రలో పరిచయం అయ్యాడు. ఇందులో అరుణ్విజయ్, ఆయన తండ్రి సీనియర్ నటుడు విజయ్కుమార్ ముఖ్యపాత్రలు పోషించగా, మహిమ నంబియార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కుక్కపిల్ల కీలకపాత్రలో నటించడం మరో విశేషం. నివాస్ కే.ప్రసన్న సంగీతం, గోపీనాథ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈ నెల 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ టైంలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిన తన కొడుకు సూర్య నటుడిగా, నిర్మాతగా ఈస్థాయికి ఎదగడం గర్వంగా ఉందన్నారు. తన కొడుకు, మనవడితో కలిసి ఈ చిత్రంలో నటించడం మధురమైన అనుభవం అని నటుడు విజయ్కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో నటనకు మాస్టర్ ఆర్ణవ్కు అవార్డు రావడం ఖాయమని దర్శకుడు సరోవ్ షణ్ముగం తెలిపారు. Witness the epic and un-fur-gettable tale of Arjun & Simba in 5 Days! 🐾 Watch #OhMyDogOnPrime, April 21 @PrimeVideoIN@Suriya_offl #Jyotika @SarovShanmugam @2D_ENTPVTLTD #VijayaKumar #ArnavVijay #VinayRai #MahimaNambiar @gopinath_dop @nivaskprasanna @rajsekarpandian #MichealRaj pic.twitter.com/1DjIbjbNTr — ArunVijay (@arunvijayno1) April 16, 2022 -
ఆ తర్వాతే కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలు: విజయ్కుమార్
సాక్షి, విజయవాడ: ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించస్తారని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 26 జిల్లాల ఏర్పాటుకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. ప్రజల నుండి 17,500కి పైగా సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 284 అంశాలపై ప్రజలు వినతులు వచ్చాయి. 90 శాతం అంశాలకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా పరిష్కరించారు. కొన్ని మండలాలను ప్రజల డిమాండ్ మేరకు జిల్లాలు మార్చాం. పూర్తి శాస్త్రీయంగా ప్రజల సౌకర్యార్థం పునర్విభజన చేశాం. ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. అదనంగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన సాధించేలా జిల్లాల పునర్విభజన జరిగింది. ఏప్రిల్ 4 తర్వాత కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలను పంపుతామని ప్రణాళిక కార్యదర్శి విజయ్కుమార్ అన్నారు. చదవండి: (ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం జగన్) -
ఉగాది రోజున కొత్త జిల్లాల ఏర్పాటు
-
వ్యవసాయ రంగంలో 14.5% ప్రగతి నమోదు: ఏపీ ప్రణాళికశాఖ కార్యదర్శి
-
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ
-
ఈ నెలాఖరులోపు తుది నోటిఫికేషన్: విజయ్ కుమార్
సాక్షి, విజయవాడ: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయసేకరణ గడువు గురువారంతో ముగియనున్నట్లు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు 7,500 సలహాలు కలెక్టర్లకు అందజేశారు. ఒక్క విజయనగరం జిల్లా నుంచే 4,500 సలహాలు, సూచనలు వచ్చాయి. తర్వాత అధికంగా కృష్ణా జిల్లా నుంచి సూచనలు అందాయి. అన్నిజిల్లాల సమీక్షలు ఈ రోజుతో ముగిశాయి. వీటన్నిటిని పరిశీలించి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద తుది నిర్ణయం జరుగుతుంది. మార్చి నెలాఖరులోపు తుది నోటిఫికేషన్ ఇస్తాం. కొత్త జిల్లాలకు అధికారులు, ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం. మొత్తం 60 అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చాయని' ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
AP: కీలక దశకు కొత్త జిల్లాల ఏర్పాటు.. ఏప్రిల్ 2 నుంచి పాలన
సాక్షి, అనంతపురం: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతుందని.. మార్చి 3 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని.. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందని పేర్కొన్నారు. AP: సమయానికి రాకపోతే ‘సెలవే’ ఆర్డర్ టూ వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు వచ్చాయన్నారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని విజయ్కుమార్ తెలిపారు. అనంతపురంలో పర్యటించిన ఉన్నతస్థాయి కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటు కీలక దశకు చేరింది. ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ శనివారం అనంతపురంలో పర్యటించింది. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారుల బృందం భేటీ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల నుంచి అందిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలకు సంబంధించిన వివరాలు.. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే మౌలిక సదుపాయాలపై రాయలసీమ జిల్లాల కలెక్టర్లు నివేదికలను అందజేశారు. -
త్వరలో కొత్త జిల్లాలపై సూచనల పరిశీలన
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను రాష్ట్ర స్థాయి కమిటీ రెండు రోజుల్లో పరిశీలించనుంది. మార్చి 3 వరకు గడువున్నా కూడా.. ఈలోపే ఒకట్రెండు సార్లు సూచనలు, అభ్యంతరాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కార్యదర్శి, జిల్లాల కలెక్టర్లు బుధవారం సమావేశం కానున్నారు. వచ్చిన సలహాలు, అభ్యంతరాలను తొలుత స్కూృటినీ చేయనున్నారు. ఆ తర్వాత వాటిపై కలెక్టర్లు రాసిన రిమార్కులను పరిశీలిస్తారు. అభ్యంతరాలు, సూచనల్లోని ప్రామాణికత, ఇతర అంశాలను అధ్యయనం చేసి.. చివరిగా వాటిని సీఎస్ నేతృత్వంలోని కమిటీకి సిఫారసు చేయనున్నట్లు ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. అనంతపురం నుంచి అత్యధికంగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,400కు పైగా సూచనలు, అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. వాటిలో అనంతపురం జిల్లా నుంచే 700 సూచనలు వచ్చాయని సమాచారం. పుట్టపర్తిని వ్యతిరేకిస్తూ.. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ పోస్టుకార్డుల్లో ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల ద్వారా ఈ అభ్యంతరాలు పంపించినట్లు సమాచారం. అనంతపురం తర్వాత నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా సలహాలు, అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటిలో సమంజసమైన అభ్యంతరాలు, ప్రామాణికత ఉన్న సూచనలను పరిశీలించనున్నారు. -
ప్రతి సూచనా పరిగణనలోకి..
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలపై అందే ప్రతి సూచన, అభ్యంతరాన్ని పరిశీలిస్తామని ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్ తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చామని, ఎవరైనా తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలను జిల్లా కలెక్టర్లకు తెలియచేయవచ్చన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుపై ఆదివారం ఆయన విజయవాడలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రతి అంశాన్ని ఎంతవరకు ఆమోదయోగ్యం? ప్రజలకు ఏమేరకు ఉపయోగకరంగా ఉంటుంది? అనే కోణంలో పరిశీలిస్తామన్నారు. ప్రణాళికా శాఖ, సీసీఎల్ఏ కార్యదర్శి, కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. అక్కడ వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. సుహృద్భావ వాతావరణంలో.. జిల్లాల విభజనను సుహృద్భావ వాతావరణంలో, ప్రజాస్వామ్యయుతంగా చేపట్టాలన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మార్చి మూడో వారంలో తుది నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం సూచించినట్లు తెలిపారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతులకు సంబంధించి తొలుత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వాటిపై దృష్టి పెడతామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయాలతో కలిపి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలనే అంశం సీఎం పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. జిల్లాల ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన జరగడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. -
కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: విజయ్ కుమార్
సాక్షి, విజయవాడ: కొత్త జిల్లాలపై మార్చి 3 వరకు సూచనలు తీసుకోనున్నట్లు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 3 వరకు జిల్లా కలెక్టర్లకు సూచనలు ఇవ్వొచ్చు. అన్నింటినీ పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు. మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఇస్తాం. ఏప్రిల్ 2 ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభమవుతుంది. మార్చి నెలలో అన్ని జిల్లాల్లో ఉద్యోగుల విభజన చేపడతాం. ఉద్యోగుల ప్రమోషన్లు, సర్వీస్కి ఇబ్బందులు ఉండవు. వర్క్ టు సెర్వ్ కింద ఉద్యోగులను కేటాయిస్తాం. రెండు చోట్ల మాత్రమే ఉద్యోగుల జోనల్ సమస్యలు ఉంటాయి. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తాం. ఎస్పీ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేస్తాం. 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్లు నిర్మాణం జరుగుతుంది. జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తాం. కేంద్రం అనుమతి జిల్లాల ఏర్పాటుకు అవసరం లేదు. జిల్లాలను ఏర్పాటు చేసి కేంద్రానికి పంపిస్తే నోటిఫై చేస్తుంది' అని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. చదవండి: (అన్నమయ్య జిల్లాపై పచ్చ పాలిట్రిక్స్) -
ఆ పేద తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి..
సాక్షి, ఆలూరు (కర్నూలు): రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో ఇద్దరిని దూరంగా ఉంచారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఆలూరులో చోటు చేసుకుంది. పట్టణంలోని స్థానిక గోవర్ధన్ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న నాగేంద్ర, అనిత దంపతుల కుమారుడు విజయ్ కుమార్ (18), అదే కాలనీలో నివాసం ఉండే రమణ, అనిత దంపతుల కుమార్తె మధుప్రియ(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విజయ్ కుమార్ ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఆలూరు ఐటీఐ కళాశాలలో డీజల్ మెకానికల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మధుప్రియ ఆలూరులోని మోడల్ స్కూల్లో ఇంటర్ వరకు చదివి పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్ చదివే సమయంలో వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మధుప్రియను వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల కళాశాలలో బీటెక్ చేర్పించారు. అప్పుడప్పుడు సెల్ ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునే వారని తెలిసింది. అయితే వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని శుక్రవారం రాత్రి 7.30 గంటలకు విజయ్ కుమార్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: (ప్రియుడిని కలవడానికి భర్త అడ్డు.. ఏం చేయాలా అని ఆలోచించి..) ఈ విషయం మధుప్రియకు తెలిసి అదే రోజు హాస్టల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు హాస్టల్ నిర్వాహకులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థినిని అనంతపురం జిల్లా కదిరిలో ఉంటున్న పెదనాన్న ఇంటికి తీసుకొచ్చారు. విజయ్ మరణాన్ని జీర్ణించుకోలేక మధుప్రియ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. విద్యార్థిని మృతదేహాన్ని ఆదివారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. తమ పిల్లలు ఉన్నతంగా చదివి ప్రయోజకులవుతారని ఆశించిన పేద తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి. ప్రేమికుల ఆత్మహత్యతో ఆలూరులో విషాదం అలుముకుంది. చదవండి: (భర్త పుణెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. నవ్య అనారోగ్యంతో గుంటూరులో..) -
పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: విజయ్ కుమార్
సాక్షి, విజయవాడ: కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనేదానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయ్ కుమార్ గురువారం ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని విజయ్ కుమార్ తెలిపారు. చదవండి: ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు.. 63కు చేరిన మొత్తం.. పూర్తి వివరాలు ‘అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నాం. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధిలో ఉంది. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం ఆలోచించి రెండు జిల్లాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పేరున్న ఇన్స్టిట్యూట్లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయి. అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపాం. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాంను ఆ జిల్లాలో కలిపాం. విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశాం. పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాం ఉంది. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేశాం. రంపచోడవరం అభివృద్ధి కోసమే అల్లూరి జిల్లాలో కలిపాం’ అని తెలిపారు. -
Hyderabad: వేగం పెరిగింది.. ప్రమాదాలు తగ్గాయి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర మహా నగరాలకు భిన్నంగా హైదరాబాద్ రోడ్లపై వాహనాల సరాసరి వేగం పెరుగుతోందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. దీన్ని మరింత పెంచడంతో పాటు ప్రమాదాలు తగ్గించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు తిరుమలగిరిలో నేరం నిరోధించడంలో, కోఠిలో ఓ ప్రాణం కాపాడటంతో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ట్రాఫిక్ చీఫ్ విజయ్కుమార్తో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ►నగరంలో వాహనాల సరాసరి వేగం 2016లో గంటకు 19 కిమీ, 2019లో గంటకు 22 కిమీ ఉండగా.. ఈ ఏడాది అది 25 కిమీకి చేరింది. 2022లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ ఏడాది సిటీ ట్రాఫిక్ పోలీసులు 36 సందర్భాల్లో లైవ్ ఆర్గాన్లు రవాణా చేయడానికి గ్రీన్ ఛానల్ ఇవ్వడం ద్వారా సహకరించారు. ఈ ఆపరేషన్లు అన్నీ విజయవంతం అయినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారు. ►టూ వీలర్పై ప్రయాణించే భర్తలతో పాటు భార్యలూ హెల్మెట్ ధరించడం పెరుగుతోంది. ఈ కారణంగా ఈ ఏడాది నాలుగు ప్రమాదాల్లో మహిళలు గాయాలతో బయటపడ్డారు. ►హెల్మెట్ ధరించని వాహనచోదకులపై 2015లో 1.3 లక్షల కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 39 లక్షలకు చేరింది. స్టాప్ లైన్ దాటిన వారిపై గతేడాది 43 వేల కేసులు, ఈ ఏడాది 75 వేల కేసులు నమోదయ్యాయి. చదవండి: టీఆర్ఎస్, ఎంఐఎం సఖ్యత: ఎప్పటివలెనె.. మమ అనిపించారు! ►ఈ ఏడాది ఓవర్ స్పీడింగ్పై 76 వేలు, నో ఎంట్రీ ఉల్లంఘనపై 17,359, సిగ్నల్ జంపింగ్పై 40,274, సెల్ఫోన్ డ్రైవింగ్పై 34 వేలు, నెంటర్ ప్లేట్ ఉల్లంఘనపై 28,300, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 21,041 కేసులు నమోదయ్యాయి. ►ఈ ఏడాది మృతులతో కూడిన రోడ్డు ప్రమాదాల్లో సరుకు రవాణా వాహనాల వల్ల 43, ద్విచక్ర వాహనాల వల్ల 24, కార్లతో 14, ఆటోలతో 8, అంబులెన్స్లతో 2 జరిగాయి. అంబులెన్స్ డ్రైవర్లనూ అప్రమత్తం చేయనున్నారు. ►మృతులతో కూడిన ప్రమాదాల కారణాలను విశ్లేషిస్తే... ఓవర్ స్పీడ్ వల్ల 178, మద్యం మత్తులో డ్రైవింగ్ వల్ల 13, రాంగ్సైడ్ డ్రైవింగ్ వల్ల 10, మైనర్ డ్రైవింగ్ వల్ల 6, నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్ల 24 జరిగాయి. -
నాన్న అందం చూసి వాళ్లు బాగా దూరం పెట్టారు
ఇంద్రుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు, జనకుడు, దశరథుడు వంటి పౌరాణిక పాత్రలు.. అనేక జానపద, సాంఘిక, చారిత్రక పాత్రలతో తెలుగు తెరను సుసంపన్నం చేశారు.. తెలంగాణ సాయుధ పోరాటం కోసం మా భూమి నాటకాన్ని ప్రదర్శించారు.. సాధారణ జీవితం గడుపుతూ, వెండితెర మీద వెలుగులు చిందించారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి.. సైకిల్ మీదే తన ప్రయాణాన్ని ప్రారంభించిన తండ్రి గురించి కుమారుడు విజయ్ కుమార్ పంచుకున్న అనుబంధ ప్రయాణం.. నాన్నగారు కృష్ణాష్టమి రోజున, కృష్ణా తీరంలో మేనమామ ఇంట్లో పుట్టడం వల్ల రాధాకృష్ణమూర్తి అని పేరు పెట్టారు. కోలవెన్ను స్వగ్రామం. వెంకయ్య, సౌభాగ్యమ్మ దంపతులకు నాన్న రెండో సంతానం. పెద్దాయన బలరామకృష్ణయ్య. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు పేరయ్య, రామమోహన్రావు, ఇద్దరు చెల్లెళ్లు లక్ష్మి, సరస్వతి. నాన్నకు ముగ్గురు పిల్లలం. అక్క మాలతి, చెల్లి రేణుక, నేను. నాన్న ఆ రోజుల్లో ప్రజానాట్యమండలి తరఫున తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ‘మా భూమి’ నాటకంలో నాన్నతో పాటు నటించిన సీతారత్నమ్మను ప్రేమవివాహం చేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీలో నాలుగైదు సార్లు జైలుకి కూడా వెళ్లారు. నాన్న పునాదిపాడులో చదువుకునే రోజుల్లోనే పాటలు, పద్యాలు పాడుకుంటూ చదువును నిర్లక్ష్యం చేశారంటారు. కోలవెన్ను లైబ్రరీలో ఉద్యోగం చేసే రోజుల్లో పుస్తకాలు చదవటం వల్ల మంచి భాష అలవడింది. చాలా బాగా రాసేవారు. ఆయనతో అరవై సంవత్సరాలు గడిపినా మాకు అబ్బలేదు. రూపాయి టికెట్తో... నాన్న ‘గాలి మేడలు’ నాటకం ప్రదర్శించారు. టికెట్ వెల రూపాయి. నాన్నే విశాలాంధ్రలో పోస్టర్లు వేయించి, లైట్ స్తంభాలకు అంటించారు. థియేటర్ అంతా శుభ్రం చేసి, కుర్చీలు నాన్నే వేశారు. ఆ రోజుల్లో ఆ నాటకం హౌస్ఫుల్. విజయవాడ రామా టాకీస్లో ‘మా భూమి’ నాటకాన్ని రెండు షోలు అర్ధరాత్రి వరకు వేశారు. ఇంటికి సుమారు 40 రూపాయలు వచ్చేవి. ఆకాశవాణిలో వేసే నాటకాలకు 20 రూపాయలు వచ్చేవి. మాకు కొద్దిగా పొలం ఉంది. అందువల్ల ఏ ఇబ్బందులూ లేకుండా కుటుంబం నడిచిపోయేది. మంచి స్నేహితులు.. అప్పటికే మంచి నిర్మాతగా పేరున్న కె.ఎస్. ప్రకాశరావుగారు, నాన్న మంచి స్నేహితులు. ఆయనతో పాటు, పోతిన బెనర్జీ, వీరమాచనేని సంతాన గోపాలరావుల ప్రోత్సహంతో నాన్న చెన్నై చేరుకున్నారు. చిన్న వేషం వేసినా, పెద్ద వేషం వేసినా అందరితో చాలా మంచిగా ఉండేవారు. నాన్న అందం, పొడవు చూసి కొత్త నటులకు ఇబ్బందిగా ఉండేది. ఈయన వస్తే ఎలా ఉంటుందోనని బాగా దూరం పెట్టారు. సైకిల్ మీదే... మద్రాసులో ఏ మూలకైనా సరే నాన్న సైకిల్ మీదే వెళ్లేవారు. ఆ సైకిల్ నాన్నకు చాలా రకాలుగా ఉపయోగపడింది. ఇంటికి రాగానే సైకిల్ని లోపల దాచేసేవాడిని. నిరంతరం ఆ సైకిల్కి నేను కాపలా ఉండేవాడిని. నాన్న చాలా సింపుల్గా ఉండేవారు. పైజమా, లాల్చీ ధరించేవారు. దూరం నుంచి నాన్నను చూసి మిక్కిలినేని బ్రాండ్ అనుకునేవారు. విలన్గా స్థిరపడదామని, స్టంట్ మాస్టర్ని పెట్టుకుని కత్తి యుద్ధాలు నేర్చుకున్నారు. కాని సాత్విక పాత్రలకు నిలబడిపోయారు. నాన్నగారి కారు ఆయనే తుడుచుకునేవారు. సాధారణంగా ఉండేవారు.. నాన్న చాలా మితంగా మాట్లాడేవారు. ఆయన భోజన ప్రియులే కానీ, భోజనం చాలా క్లుప్తంగా ఉండేది. సినిమా మోజుతో పాటు, నాన్నను చూడటానికి చాలామంది వచ్చేవారు. మోసపోయిన ఆడవాళ్లు, బ్యాగులు పోగొట్టుకున్న వారికి అన్నం పెట్టి, సురక్షితంగా వారివారి ఇళ్లకు పంపేవారు. నేనే రైల్వేస్టేషన్కి తీసుకువెళ్లి, టికెట్ కొని, ఎక్కించి రావాలి. ఎవరైనా ఉండిపోతామంటే, వాళ్లవాళ్లకి ఉత్తరం రాసి, వాళ్లు స్థిరపడేవరకు సహకరించేవారు. ఫ్యాన్ మెయిల్ వస్తే, అక్షరాలు పోకుండా ఉండేలా, జాగ్రత్తగా కత్తెరతో కట్ చేసేవారు. వాటికి సమాధానాలు స్వయంగా రాసి ఇస్తే, నేను డబ్బాలో వేసేవాడిని. ఇష్ట చతుష్టయం.. పద్మనాభం, ఎస్. పి. కోదండపాణి, నాన్న, నేను బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. నాన్న స్విమింగ్కి వెళ్లేవారు. సినారె సినీ పరిశ్రమకు వచ్చిన తరవాత, ఇంచుమించు ప్రతి శుక్రవారం సాయంత్రానికి ఆయన మా ఇంటికి వచ్చేవారు. నాన్న, సి. నారాయణరెడ్డిగారు, నేరెళ్ల వేణుమాధవ్గారు, గుమ్మడి గారు నలుగురూ చాలా స్నేహంగా ఉండేవారు. వాళ్ల నలుగురి స్నేహం చూసి అందరూ ముచ్చటపడేవారు. సి. నారాయణరెడ్డిగారు వారి నలుగురి స్నేహానికి ‘ఇష్ట చతుష్టయం’ అని పేరు స్థిరపరిచారు. నాన్నని సినారె అగ్రజా అంటే, నేరెళ్ల సినారెను అగ్రజా అనేవారు. తగ్గించుకున్నారు.. నాన్న 1998లో విజయవాడ వచ్చేశారు. నాన్నకు సన్మానం జరగని ఊరే లేదు. ఒకసారి విజయదశమి నాడు మండపేటలో దేవాలయానికి వెళ్లివచ్చారు. పండుగ పూట నగలు తీయటం ఎందుకని, అమ్మ, చెల్లాయిలు నగలు ఉంచుకునే పడుకున్నారు. తెల్లవారేసరికి మొత్తం దొంగతనం చేసేశారు. ఇక అప్పుడు నాన్నను ప్రయాణాలు తగ్గించుకోమన్నాను. నగలు పరవాలే, ఎవరైనా అఘాయిత్యం చేస్తే కష్టం కదా అనే ఆలోచనతో. నాన్న తన 95 ఏట కన్ను మూశారు. అమ్మనాన్నలు కాలం చేసేవరకు దగ్గరుండి చూసుకోగలిగాను. నాకు ఎనిమిది పదులు నిండినా ఇంకా నాకు ఆయన జ్ఞాపకాలు మదిలో మెదలాడుతూనే ఉంటాయి. నా భార్య ప్రజాకవి కోగంటి గోపాలకృష్ణ గారి కుమార్తె సరళ. మా నాన్నగారి బాటలోనే నడుస్తున్నారు నా ఇద్దరు ఆడపిల్లలు అనుపమ, అనూరాధ. బాధ్యత అనుకున్నాను మధ్యాహ్నం భోజనం చేశాక మడత మంచం మీద పడుకుని, కాళ్లు నొక్కమనేవారు. చేతులు నొప్పిగా ఉన్నాయని చెబితే, ఎక్కి తొక్కమని, తొక్కించుకునేవారు. అదొక ఆనందం. ఆయన నిద్ర పోతున్నప్పుడు ఇత్తడి బిందె మీద మూత తీసినా ‘ఊ...’ అని గంభీరంగా అనేవారు. అందుకని మాకు దాహం వేసినా మంచినీళ్లు తాగేవాళ్లం కాదు. ఎప్పుడైనా అమ్మకి అలసటగా ఉండి పడుకుంటే, నేను మెలకువగా ఉండి, వడ్డించేవాడిని. ఆ తరవాత చదువుకునేవాడిని. అది నా బాధ్యత అనుకునేవాడిని. – మిక్కిలినేని విజయ్కుమార్ (మిక్కిలినేని కుమారుడు) సంభాషణ: వైజయంతి పురాణపండ -
కీచకుడిగా మారిన ప్రజాప్రతినిధి
-
ఐటీ కంపెనీల్లో అత్యధిక వేతనం ఈయనకే
సాక్షి, వెబ్డెస్క్: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అత్యధిక శాలరీ ఇస్తున్న ఐటీ సంస్థగా హెచ్సీఎల్ రికార్డు సృష్టించింది. మిగిలిన ఐటీ సంస్థలను వెనక్కి నెట్టిన కంపెనీ తమ సీఈవో వియజ్కుమార్కి అత్యధిక వేతనం కట్టబెట్టింది. ఇటీవల ఆ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. సీఈవో విజయ్ కుమార్ నోయిడా కేంద్రంగా ఐటీ సర్వీసులు అందిస్తోన్న హెచ్సీఎల్ దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ సంస్థగా గుర్తింపు పొందింది. ఆ సంస్థకు 2016 అక్టోబరు నుంచి సీఈవోగా విజయ్కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివకుమార్నాడర్ బోర్డు బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఎండీగా కూడా విజయ్కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హయ్యస్ట్ శాలరీ ఇటీవల హెచ్సీఎల్ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ కంపెనీ సీఈవో విజయ్ కుమార్ మూల వార్షిక వేతనాన్ని రెండు మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కలిపితే మొత్తం వేతనం 4.38 మిలియన్ డాలర్లుకు చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ 32.54 కోట్లుగా ఉంది. వార్షిక వేతనంతో పాటు 31.50 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు సైతం కట్టబెట్టింది. దీంతో ఆయన వార్షిక వేతనం దాదాపు 10.80 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియన్ కరెన్సీలో ఈ వేతనం రూ.80.19 కోట్లగా ఉంది. 2026 మార్చి వరకు ఆయన ఈ వేతనం పొందుతారు. విప్రోని దాటి ఐటీ కంపెనీలకు సంబంధించి ఇప్పటి వరకు విప్రో సీఈవో థైరీ డెలాపోర్టే 8.8 మిలియన్ డాలర్ల వార్షిక వేతనమే హయ్యస్ట్. తాజాగా హెచ్సీఎల్ సీఈవో దీన్ని అధిగమించారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం 6.78 మిలియన్ డాలర్లు, టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథ్ వేతనం 2.8 మిలియన్ డాలర్లుగా ఉంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం 2,962 కోట్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో రూ. 2,962 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 6 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 3,154 కోట్లు ఆర్జించింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం ఆదాయం దాదాపు 6 శాతం పుంజుకుని 19,642 కోట్లను తాకింది. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 5 శాతం క్షీణించి 41 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. ఆదాయం 6 శాతం పెరిగి 270 కోట్ల డాలర్లకు చేరింది. రికార్డ్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్సీఎల్ టెక్ నికర లాభం 17.6% పుంజుకుని రూ. 13,011 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6.7 శాతం బలపడి రూ. 75,379 కోట్లకు చేరింది. డాలర్ల రూపేణా నికర లాభం 13% పెరిగి 176 కోట్ల డాలర్లను తాకగా.. ఆదాయం 1,017.5 కోట్ల డాలర్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 6 డివిడెండును ప్రకటించింది. దీనికి జతగా.. ఆదాయం తొలిసారి 10 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడంతో మరో రూ. 10ను ప్రత్యేక మధ్యంతర డివిడెండుగా ప్రకటించింది. వెరసి వాటాదారులకు షేరుకి రూ. 16 చొప్పున చెల్లించనుంది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 26 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. షేరు ఫ్లాట్: మార్కెట్లు ముగిశాక హెచ్సీఎల్ టెక్ ఫలితాలు విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 0.6% నీరసించి రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.975–950 మధ్య ఊగిసలాడింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ4లో ఆదాయం 2.5 శాతం పుంజుకుంది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ లభించాయి. విభిన్న విభాగాల నుంచి మొత్తం 19 భారీ డీల్స్ను కుదుర్చుకున్నాం. తద్వారా కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగుపెట్టాం. – సి.విజయ్కుమార్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ప్రెసిడెంట్, సీఈవో -
సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ రాజీనామా!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో) గటిక విజయ్కుమార్ బుధవారం రాజీనామా చేశారు. సీఎం పీఆర్వో పోస్టుతోపాటు ట్రాన్స్కో జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పోస్టుకు కూడా ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించింది. ఈ రాజీనామాలు తక్షణమే ఆమోదం పొందాయి. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన విజయ్కుమార్.. అకస్మాత్తుగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతోనే కేసీఆర్ ఆగ్రహానికి గురైనట్టు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కారణాలతో సీఎం పీఆర్వో పోస్టుకు రాజీనామా చేసినట్టు విజయ్కుమార్ బుధవారం ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. గొప్ప స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు, ఉన్నతాధికారుల్లో అసంతృప్తితో.. విజయ్కుమార్ కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుగా పెట్టుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో ఆధిపత్య ధోరణిలో వ్యవహరించేవారన్న ఆరోపణలున్నాయి. దీనిపై వారు చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. గతంలో వివిధ న్యూస్ చానళ్లలో రిపోర్టర్గా పనిచేసిన విజయ్కుమార్.. ఔట్ సోర్సింగ్ విధానంలో సీఎం పీఆర్వోగా నియమితుడై.. కొద్దికాలంలోనే కేసీఆర్కు దగ్గరయ్యారు. ప్రగతి భవన్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. విజయ్కుమార్ కోసమే ట్రాన్స్కో యాజమాన్యం మూడేళ్ల కింద జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పోస్టును సృష్టించి, ఆయనను ఎంపిక చేసింది. ఇలా ప్రాధాన్యత పెరిగిపోవడంతో విజయ్కుమార్ పలు వ్యవహారాల్లో కల్పించుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళకు సంబంధించిన కుటుంబ తగాదా కేసులో విజయ్కుమార్ జోక్యం చేసుకుని, పోలీసులపై ఒత్తిడి తెచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఇసుక రీచ్ను సైతం తన వ్యక్తులకు ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి. వీటికితోడు ప్రగతిభవన్ నుంచి రాజకీయ అంశాలపై కొందరికి లీకులు ఇచ్చేవారన్న ప్రచారం ఉంది. వరంగల్ జిల్లాలో పలు భూవివాదాల్లో జోక్యం చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ నుంచి సీఎంకు నివేదిక అందినట్టు సమాచారం. ఈ ఆరోపణలతోనే రాజీనామా చేయాల్సి వచ్చినట్టు తెలిసింది. దీనిపై ‘సాక్షి’వివరణ కోరగా విజయకుమార్ స్పందించలేదు. చదవండి: నెల రోజులుగా సీఎం కేసీఆర్ బిజీబిజీ -
‘126 ఎన్ఓసిలపై విచారణ జరుపుతున్నాం’
సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విశాఖ భూ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చైర్మన్ విజయ్కుమార్ తెలిపారు. రూరల్ మండలాల్లో తహశీల్దార్లు నుంచి 431 నివేదికలు కోరామని, వీటిలో 140 వరకు రిపోర్ట్స్ వచ్చాయన్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయ్కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జారీ చేసిన 126 ఎన్ఓసిలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నాం. అదే విధంగా గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనేది కూడా విచారిస్తున్నాం. ఎన్ఓసి విషయంలో ఉన్నతాధికారులు తప్పిదాలపై సిట్ నివేదికలో అన్ని అంశాలు పొందుపరుస్తాం. 22/A నిషేధిత భూముల విషయంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సిట్ కాలపరిమితి ఈనెల 28 వరకు ఉంది. ఈ మధ్యలో సిట్ మిడ్ టర్మ్, ఫ్రీ ఫైనల్ నివేదిక ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నాం’’ అని స్పష్టం చేశారు. చదవండి: ప్లాంట్పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్ -
ఎంపీ ఇంటిపై బాంబు దాడి..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్ కుటుంబీకులు పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్ నివాసం కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్లోని కలెక్టరేట్ సమీపంలో ఉంది. ప్రతిరోజూ వేకువ జామున ఆయన ఇంటి నుంచి కారులో బయటకు వచ్చి, సమీపంలోని క్రీడా మైదానంలో వాకింగ్ చేస్తారు. దీనిని పరిగణలోకి తీసుకుని గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడికి వ్యూహ రచన చేశారు. (కీచక ఇన్స్పెక్టర్.. మైనర్ను వ్యభిచారకూపంలోకి ఆపై..) మంగళవారం ఉదయాన్నే ఆయన కారుపై బాంబు దాడి జరిగింది. అదృష్టవశాత్తు పేల లేదు. ఇంటివద్దకు వచ్చిన కారు డ్రైవర్ బాంబును గుర్తించి, ఇంట్లో ఉన్న ఎంపీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ వేణుగోపాల్ బృందం రంగంలోకి దిగింది. ఎంపీ ఇంట్లో ఉన్నట్టుగా ఆగుర్తుతెలియని వ్యక్తులు భావించినట్టున్నారు. సోమవారం ఎంపీ తన కారును ఇంటి వద్దే వదలి ఢిల్లీకి బయలు దేరి వెళ్లడంతో ఈ గండం నుంచి బయటపడ్డారు. ఒక వేళ ఆ బాంబు పేలి ఉన్న పక్షంలో కారు, ఆ పరిసరాలు కొన్ని మీటర్ల దూరం మేరకు దెబ్బతిని ఉండేది. ఆ బాంబును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసిన పోలీసులు ఆ గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. (చెన్నైకు‘నివర్’ ముప్పు!) -
సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 16,802 సచివాలయ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 2 వేల పరీక్ష కేంద్రాల్లో పరీక్షల కోసం ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఒక్కో గదిలో కేవలం 16 మందినే అనుమతిస్తాం. కోవిడ్ ఉన్నవారి కోసం ప్రత్యేక ఐసోలేషన్ పరీక్ష కేంద్రాలు పెట్టాం. అభ్యర్థుల కోసం విశాఖ, విజయవాడలో సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇస్తున్నాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. పరీక్షకు వచ్చేవారికి స్క్రీనింగ్, శానిటేషన్ ఏర్పాటు చేస్తున్నాం' అని మున్సిపల్శాఖ కమిషనర్ విజయ్కుమార్ వివరించారు. (రేపటి నుంచి ‘సచివాలయ’ ఉద్యోగ రాత పరీక్షలు) -
ఆయనకు కాళ్లు, ఒళ్లు పట్టాలి..
బేస్తవారిపేట: రాజ్యాలు పోయాయి.. రాజులు పోయారు..రాచరికం అంతమైంది..కానీ అదే రాచరికపు పోకడలను గుట్టుగా కొనసాగిస్తున్నాడు ఓ ఉన్నతాధికారి. ఉన్నత ఉద్యోగం చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి తనకింది స్థాయి సిబ్బందితో ఊడిగం చేయించుకుంటున్నాడు. రాచరికపు పోకడలను అనుసరిస్తూ తనను తాను రాజులా భావించుకుంటున్నాడు. సిబ్బందితో చెయ్యకూడని పనులు చేయించుకుంటూ హీనాతి హీనంగా చూస్తుండటంతో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఆ అటెండర్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన ప్రవర్తనతో విసుగు చెందిన సిబ్బంది కలెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదీ..కథ బేస్తవారిపేట మండలం చింతలపాలెం వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఐదుగురు అటెండర్లు ఉన్నారు. ఎస్డీసీ ఎన్.విజయ్కుమార్ వారిని హీనంగా చూస్తున్నారు. ప్రభుత్వ నుంచి హౌస్ రెంట్, టీఏ, డీఏ పొందుతూ కార్యాలయంలోనే నివాసం ఉంటున్నాడు. కంభంలో నివాసం ఉండే అటెండర్ అనిల్ ఉదయం ఐదు గంటలకే వేడినీళ్లు, కాఫీ తీసుకురావాలి. అటెండర్లు కాళ్లు పట్టాలి అవసరమైతే ఆయన ఒంటికి మసాజ్ చేయాలి. అంతేకాదు ఆయన దుస్తులను సైతం ఉతికి శుభ్రం చేసి పెట్టాలి. ఇవి చేయకుంటే బూతు పురాణం మొదలు పెడతాడు. ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తుండటంతో ఏడాదిగా అటెండర్లు మనసు చంపుకుని చాకిరీ చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే ఓ చిరుద్యోగి రోజూ మధ్యాహ్నం భోజనం ఉచితంగా పట్టుకు రావాల్సిందే. కార్యాలయంలోనే నివాసం ఉంటుండటంతో టీవీ ఒకరు, సన్ డైరెక్ట్ ఒకరు తెచ్చి పెట్టే వరకు ఒప్పుకోలేదు. వెహికిల్ అలవెన్స్లు తీసుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ దొర కోసం కోళ్లు పెంచాలి క్యాంపుకు వెళ్లివచ్చేటప్పుడు సదరు ఉన్నతాధికారి రైతుల నుంచి కోళ్లు పట్టుకొస్తాడు. మీరు ఏం పెట్టి పెంచుతారో తనకు తెలియదని, పది రోజుల్లో మంచి సైజు రావాలంటూ ఆయన అటెండర్లను ఆదేశిస్తాడు. కోడిని కార్యాలయంలోనే కట్టేసి పెంచాల్సిన దుస్థితి. బాగా పెరిగిన తర్వాత ఆయన ఇంటికి పంపాల్సిన బాధ్యత కూడా అటెండర్లదే. నెల్లూరు వెళ్లి బాత్రూమ్లు శుభ్రం చేయాల్సిందే అటెండర్గా పనిచేసే మురళికి డ్రైవింగ్ కూడా వచ్చు. ఆయన్ను తన కారుకు డ్రైవర్గా ఉపయోగించుకుంటున్నాడు. నెల్లూరు, విజయవాడ, కడప ప్రాంతాల్లో తన సొంత అపార్ట్మెంట్లకు మురళిని తీసుకెళ్తాడు. మూడు.. నాలుగు రోజులు అక్కడే ఉండాల్సి రావడంతో కరోనా సమయంలో ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రుల ఆలనపాలన చూసుకోలేక మురళి తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. నెల్లూరు అపార్ట్మెంట్లో ఎవరైనా ప్లాట్ ఖాళీ చేస్తే దానిలో టాయిలెట్స్, లెట్రిన్ క్లీన్ చేయాలి. గృహాల్లో బూజు దులపాలి. ఉన్నత ఉద్యోగం చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్ను సైతం సదరు అధికారి కాజేశాడు. ఫ్యాన్లు, బాత్రూమ్ షింక్లు నెల్లూరులోని తన సొంత ఇంటికి చేర్చుకున్నాడు. కలెక్టర్కు ఫిర్యాదు వ్యక్తిగత పనులు చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానని వెలిగొండ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్కుమార్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదును కలెక్టర్, సీఏం కార్యాలయానికి బాధితులు పంపారు. సొంత పనులు చేస్తూ రాత్రి పూట కూడా కాపాలాగా ఉండాల్సిన పరిస్థితి ఉందని, కాళ్లు పట్టించుకోవడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించుకోవడం వంటి పనులు చేస్తున్నాడని వారి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అవసరానికి మించి అక్కర లేని మందులు
-
ఈఎస్ఐ స్కామ్కు ఆయనే ‘డైరెక్టర్’?
రాజమహేంద్రవరం క్రైం : ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ గాడి విజయకుమార్ను ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన ఏసీబీ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూనిట్ శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకొని విజయకుమార్ను ఆయన స్వగృహంలో అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు సరఫరా చేసే మందులు, పరికరాల భారీ కుంభకోణం ఈయన డైరెక్టర్గా ఉన్నప్పుడే జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తగా.. ఏసీబీ అధికారుల దర్యాప్తులో నిర్ధారణ కావడంతో విజయకుమార్ను అరెస్ట్ చేశారు. కాకినాడకు చెందిన విజయకుమార్ రాజమహేంద్రవరం ఈఎస్ఐ హాస్పిటల్లో రేడియాలజిస్ట్గా విధులలో చేరారు. ఇక్కడే ఎక్కువ కాలం విధులు నిర్వహించి ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విజయవాడలో ఈఎస్ఐ హాస్పిటల్స్ ఇన్చార్జ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మందులు, పరికరాల కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణలో పలు విషయాలు వెలుగు చూడడంతో విజయకుమార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.(అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్) రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించడంతో లబ్ధి విజయకుమార్ రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో వివిధ హోదాలలో పనిచేశారు. రాజమహేంద్రవరంలోని కంబాలచెరువు వద్ద అపోలో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే రోగులను తన స్వంత స్కానింగ్ సెంటర్కు తరలించి లబ్ధి పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎక్కువ సమయం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉండకుండా స్కానింగ్ సెంటర్లో ఉండడంతో అప్పట్లో సహోద్యోగులతో విభేదాలు వచ్చాయని వినికిడి. జిల్లాలో ఒక ఈఎస్ఐ ఆసుపత్రి, ఎనిమిది ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా, చికిత్స కోసం వచ్చే రోగులను 14 ప్రైవేటు క్లీనిక్లకు, 11 ప్రైవేటు ప్యానల్ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. రోగులకు ఇచ్చే మందులు, మెడకు వేసే నెక్ కాలర్, ఎముకలు విరిగిన సమయంలో కట్లు వేసేందుకు ఉపయోగించే పరికరాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈయన ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో కుంభకోణాలు వ్యతిరేకించే వారు ఒక వర్గంగాను, సమర్ధించేవారు మరో వర్గంగా విభేదాలు వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. -
సీఎం జగన్ ఏడాది పాలన సందర్బంగా ప్రత్యేక సదస్సులు
-
కశ్మీర్లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత
శ్రీనగర్ : ఈ ఏడాది జనవరి నుంచి భద్రతాబలగాలు జరిపిన మొత్తం 27 ఆపరేషన్లలో 64 మంది ఉగ్రవాదులను ఏరివేశామని కశ్మీర్ రేంజ్ పోలీస్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. యాక్టివ్గా ఉన్న మరో 25 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశామని చెప్పారు. గత ఆరునెలలుగా కరడుగట్టిన ఉగ్రవాది, ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్లో కమాండర్ రియాజ్ నైకూ(32) కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన రియాజ్ నైకూ చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే బుధవారం హతమయిన విషయం తెలిసిందే. నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు. నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపును, జమ్మూకశ్మీర్ పోలీసులను ఈ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, గత నెల రోజులుగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో ఒక కల్నల్, ఒక మేజర్తోపాటూ మొత్తం 18మంది భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు. నైకూ చరిత్ర ఇది.. మొదట్లో లెక్కల టీచర్గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. -
ఎస్ఈసీతో మున్సిపల్ కమిషనర్, డీజీపీ భేటీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్ను శనివారం మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్ఈసీకి నివేదించారు. నగర పాలకసంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుత స్థితి గురించి ఆయన వివరించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంపై నివేదికను అందజేశారు. (ఏపీ ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్) ఎస్ఈసీని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్ను డీజీపీ గౌతమ్ గౌతం సవాంగ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్ఈసీతో సుమారు అరగంట పాటు భేటీ అయిన డీజీపీ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఎస్ఈసీ కనగరాజ్ను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. -
కరోనా వైరస్: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రాణాంతకమైన కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నామని విజయవాడ మున్సిపల్ శాఖ కమీషనర్ విజయ్ కుమార్ అన్నారు. ఆయన మీడియతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 96 శాతం ఇళ్లను సర్వే చేశామని వెల్లడించారు. 1.43 కోట్ల ఇళ్లు ఉంటే ఇప్పటికే 1.37 కోట్ల ఇళ్లల్లో సర్వే పూర్తైందన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంలు ఉన్నారని.. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి సర్వే చేశామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు. 2.80 లక్షల మంది వాలంటీర్లు, 1.18 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి 2 వేల మందికి ఎక్కడా లేని విధంగా ఏఎన్ఎన్లు ఉన్నారని ఆయన తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 6,379 మంది వచ్చినట్టు కేంద్రం జాబితా విడుదల చేసిందని ఆయన అన్నారు. కానీ వాలంటీర్లు, ఆశ వర్కర్ల సర్వేలో మరో ఆరు వేల మంది విదేశాల నుంచి వచ్చినట్టు తేలిందని విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కి అన్ని పట్టణాల్లో, నగరాల్లో ప్రజలను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి ముందుగానే అన్ని చర్యలు చేపడుతున్నామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్)ను జయించాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. ఒక్క క్షణం ఆలోచించాలి అన్నారు. యువతీ యువకులైనా, వ్యాధి నిరోధక శక్తి ఉన్నా, ఎవరైనా సరే ఇంట్లోనే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ఉండకూడదని ఆయన తెలిపారు. ఎవరి నుంచైనా కోవిడ్-19 సంక్రమించవచ్చని జవహర్రెడ్డి సూచించారు. -
వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర
సాక్షి, ఏలూరు (ఆర్ఆర్పేట): రంగస్థలంపై ఆయనను ఎవరైనా చూస్తే అరే ఎన్టీఆర్ గానీ వచ్చాడా అనుకునేవారు. ఎన్టీఆర్ పోలికలతో పాటు నటనా చాతుర్యం కూడా ఆయన సొంతం. సరదాగా నాటకాల రిహార్సల్స్ చూడటానికి వెళ్లిన యువకుడు వాటిపై ఆసక్తితో తానూ నాటక రంగంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. వెళ్లినా నటునిగా 45 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తానని ఊహించలేదు. 1975లో తొలిసారి ముఖానికి రంగు వేసుకున్న ఆ యువకుడు ఇప్పటివరకూ రంగస్థలంపై తన సత్తా చాటుతూనే ఉన్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం అనే తేడా లేకుండా వందలాది పాత్రలు, వేలాది నాటకాలు ఆడుతూ రంగస్థలంపై అలుపెరుగని ప్రస్థానం కొనసాగిస్తున్నారు నగరానికి చెందిన పస్తుల విజయ్కుమార్. కుస్తీ, శరీర సౌష్టవాల్లోనూ సత్తా విజయ్కుమార్ 1951లో ఏలూరులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా దాదాపు ఏలూరులోనే కొనసాగింది. యువకునిగా ఉండగా నగరంలోని కోరాడ నాగన్న తాలింఖానాలో శరీర సౌష్టవంపై మరాఠీ మల్లేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఈక్రమంలో 1969లో సరదాగా కుస్తీ పోటీలు చూసేందుకు వెళ్లిన ఆయన ప్రత్యేక కారణాలతో పోటీల్లో పాల్గొనాల్సి వచ్చింది. కుస్తీలో ఎటువంటి మెలకువలు తెలియకపోయినా పోటీల్లో గెలిచి జిల్లా విజేత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అదేస్ఫూర్తితో శరీర సౌష్టవ అంశంలో మరింత శిక్షణ పొంది 1971లో మిస్టర్ సీఆర్ఆర్ కళాశాల, 1971 నుంచి 1973 వరకూ వరుసగా నాలుగేళ్ల పాటు మిస్టర్ పశ్చిమగోదావరిగా ఆయన నిలిచారు. అనంతరం ఆయన వ్యాపారావకాశం రావడంతో ఏలూరు విడిచి కొయ్యలగూడెం వెళ్లి స్థిరపడ్డారు. 1975లో రంగస్థల ప్రవేశం 1975లో తొలిసారి సాంఘిక నాటకంతో రంగస్థల అరంగేట్రం చేసిన విజయ్కుమార్ అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. 45 ఏళ్లుగా వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మొదట్లో ఏడాదికి 150 నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇప్పటివరకూ ఆయన దాదాపు 4,500 నాటకాలు ఆడి రికార్డు సృష్టించారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు, నారదుడు, దుష్యంతుడు, నహుష చక్రవర్తి వంటి పౌరాణిక పాత్రలు, వేలాది చారిత్రక, సాంఘిక పాత్రలు చేస్తూ, పలు జానపద పాత్రలు చేస్తూ తనలోని నటుడిని సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. 1977లో విజయభారతి నాట్య మండలి సంస్థను ప్రారంభించి దాని ద్వారా అనేక ప్రదర్శనలు ఇవ్వడమే కాక తోటి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. 3 నందులు.. 8 గరుడలు.. రంగస్థల యాత్రలో ఆయన కీర్తి కిరీటంలోకి నాటకరంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారంగా భావించే ప్రభుత్వ పురస్కారం నంది బహుమతులు మూడు వచ్చి చేరాయి. దీంతో పాటు తిరుపతికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ గరుడ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొన్న విజయ్కుమార్ వాటిలో ఎనిమిది సార్లు ఉత్తమ నటునిగా నిలిచి ఎనిమిది గరుడ అవార్డులు అందుకున్నారు. దీంతో పాటు నాటక రంగానికి చేసిన విశేష కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కందుకూరి పురస్కారంతో గౌరవించింది. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక పరిషత్ల్లో ఆయన ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర విజయ్కుమార్ నట చరిత్రలో మైలురాయిగా నిలిచే పాత్ర ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చలన చిత్రంలో నందమూరి తారక రామారావు పాత్ర. దర్శకుడు రాంగోపాల్వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిర్మించడానికి సిద్ధమైన తరుణంలో ఎన్టీ రామారావు పాత్ర కోసం దాదాపు 300 మందికి మేకప్లు వేయించి చూసినా ఆయనకు సంతృప్తి కలగలేదు. ఈ క్రమంలో విజయ్కుమార్ గురించి తెలిసిన వర్మ ఆయన్ను తన వద్దకు రప్పించుకుని ఆడిషన్లు పూర్తి చేసి ఎన్టీఆర్ పాత్రకు ఎంపిక చేశారు. షూటింగ్ ప్రారంభమైన 20 రోజుల్లో ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణ పూర్తిచేయడంలో విజయ్కుమార్ నటనా పటిమను గుర్తించిన వర్మ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఆ పాత్రకన్నా ముందే విజయ్కుమార్ సుమారు పది సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి వెండితెరపై కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. (చదవండి: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) కళాకారుని కారణంగానే ప్రజాదరణ దూరం ప్రస్తుతం నాటకరంగానికి ప్రజాదరణ దూరం కావడానికి కళాకారుడే కారణం. పాత్ర ఔచిత్యం, పాత్ర గాంభీర్యం, ఆహార్యం, రంగాలంకరణ వంటి అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు ఆకర్షితులు కాలేకపోతున్నారు. ఇటీవల నాటక రంగంలోకి దళారులు కూడా ప్రవేశించడంతో అసలైన కళాకారుడు నష్టపోతున్నాడు. ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే నాటకరంగానికి తిరిగి జవసత్వాలు వస్తాయి. – పస్తుల విజయ్కుమార్, రంగస్థల నటుడు -
ఆంధ్ర ఘనవిజయం
సాక్షి, ఒంగోలు: తమ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ ఈ రంజీ ట్రోఫీ సీజన్లో ఆంధ్ర క్రికెట్ జట్టు మూడో విజయం నమోదు చేసింది. హైదరాబాద్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆంధ్ర ఇన్నింగ్స్ 96 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 45/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు 74.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటై ఓడి పోయింది. ఆంధ్ర పేస్ బౌలర్ పైడికాల్వ విజయ్ కుమార్ కేవలం 25 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి హైదరాబాద్ను హడలెత్తించాడు. మరో ఇద్దరు పేసర్లు యెర్రా పృథీ్వరాజ్ (3/53), శశికాంత్ (2/25) కూడా ఆకట్టుకున్నారు. హైదరాబాద్ జట్టులో టి.రవితేజ (144 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 225 పరుగులకు ఆలౌటవ్వగా... ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 489 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. విజయ్ కుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇన్నింగ్స్ విజయం సాధించినందుకు ఆంధ్రకు బోనస్తో కలిపి ఏడు పాయింట్లు వచ్చాయి. దాంతో 18 జట్లున్న ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్లో ఆంధ్ర ప్రస్తుతం 21 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకింది. పంజాబ్ (18 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా... విదర్భ, కర్ణాటక 17 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. లీగ్ దశ ముగిశాక ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్లో టాప్–5లో ఉన్న జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్లో ఈనెల 27 నుంచి కేరళతో ఆడుతుంది. విజయ్ వీడ్కోలు... ఈ మ్యాచ్తో ఆంధ్ర సీనియర్ పేస్ బౌలర్, 33 ఏళ్ల డేవిడ్ పైడికాల్వ విజయ్ కుమార్ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. 2006లో బరోడాతో మ్యాచ్ ద్వారా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన విజయ్... హైదరాబాద్తో మంగళవారం ముగిసిన మ్యాచ్లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. కెరీర్లో 71 రంజీ మ్యాచ్లు ఆడిన విజయ్ మొత్తం 248 వికెట్లు తీశాడు. షాబుద్దీన్ (75 మ్యాచ్ల్లో 242 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును విజయ్ బద్దలు కొట్టాడు. హైదరాబాద్తో మ్యాచ్ ముగిశాక విజయ్ను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధికారులు సన్మానించారు. సహచరులు బ్యాట్లు ఎత్తి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’తో గౌరవించారు. -
'కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టావ్'
సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్ అధికారి విజయ్కుమార్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకటరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు మొదటి నుంచి ఉద్యోగులంటే చులకన భావం అని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు ప్రెస్టేషన్లో ఉన్న చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. విజయ్కుమార్ను విమర్శించడం ద్వారా తన కుల దురహంకారాన్ని చంద్రబాబు మరోసారి బయట పెట్టుకున్నారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: చంద్రబాబు క్షమాపణ చెప్పాకే.. బయటకు కదలాలి ఏసీబీతో ఉద్యోగ సంఘాల నేతలను సీఎం బెదిరిస్తున్నారని దేవినేని ఉమా అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులను బెదిరించిన చరిత్ర ఎవరికైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారిని ఇంటికి పిలిపించి పోటీ చేయొద్దని బెదిరించిన చిల్లర మనిషి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారుల మీద దాడి జరిగితే దాడి చేసిన వారిని వెనకేసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. భగ్గుమన్న దళిత సంఘాలు: చంద్రబాబు వ్యాఖ్యలపై కాకినాడలో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. నలభై ఏళ్ళ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు కుల అహంకారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి. చంద్రబాబు వ్యాఖ్యలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు బత్తు భీమారావు, ఎం డేవిడ్, ప్రసాద్, శ్రీను పాల్గొన్నారు. చదవండి: ఇవేం మాటలు బాబూ చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్దం చేయడానికి యత్నం ఒక దళిత ఐఏఎస్ అధికారిని ఇష్టానుసారంగా మాట్లాడిన చంద్రబాబు దిష్టిబొమ్మ దహనానికి ఎస్సీ కుల సంఘాలు ప్రయత్నించాయి. మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విజయకుమార్ను అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడును వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. చదవండి: విజయకుమార్గాడు మాకు చెబుతాడా! -
అందుకే వస్తోంది.. ఆస్తమా..
సాక్షి, హైదరాబాద్ : ఒకప్పుడు బయటి వాతావరణ కాలుష్యం ఆస్తమాకు కారణమని అంతా భావించేవారు. ఇప్పుడీ ముప్పు నేరుగా ఇంట్లోనే తిష్టవేసుక్కూర్చుంది. ఇండోర్ పొల్యూషన్ (దుప్పట్లు, తలదిండ్లు, పర్ఫ్యూమ్లు, మస్కిటోకాయిల్స్, అగరొత్తులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల నుంచి వెలువడే వాయువులు, దుమ్ముధూళి) ఆస్తమాకు ఎక్కువ కారణమవుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సర్వేలో తేలింది. ఇంటా, బయటా కాలుష్య సమస్య వల్ల పట్టణాల్లో 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం మంది ఆస్తమాతో బాధపడుతుండగా, బాధితుల్లో 10–12 శాతం మంది చిన్నపిల్లలే ఉన్నట్లు సర్వే తేల్చింది. శుక్రవారం హోటల్ తాజ్కృష్ణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ సుదర్శన్రెడ్డి, ఛాతీ వైద్యనిపుణుడు డాక్టర్ విజయ్కుమార్ ఆస్తమాకు కారణమవుతున్న అంశాలను వివరించారు. ఇంటా బయటా తంటానే.. ►గ్రేటర్లో 15 ఏళ్ల క్రితం ఉన్న 11 లక్షల వాహనాలు, 2019 నాటికి 55 లక్షలకు చేరాయి. వీటిలో పదిహేనేళ్ల సర్వీసు దాటినవి 10 లక్షలు. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. ►40 వేల వరకు ఉన్న పరిశ్రమలు వదిలే పొగ, వ్యర్థాల వల్ల క్యూబిక్ మీటర్ గాలిలో 130–150 మైక్రోగ్రాముల వరకు వివిధ కాలుష్య స్థాయిలు నమోదవుతున్నాయి. ►సల్పర్డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్మోనాక్సైడ్తో కూడిన గాలిని పీల్చడం వల్ల శ్వాస నాళాలు దెబ్బతింటున్నాయి. ►ఇంట్లో వాడే మస్కిటోకాయిల్స్, పర్ఫ్యూమ్స్, పరుపు, తలదిండ్లలో పేరుకుపోయిన దుమ్ము ఆస్తమా కలిగిస్తున్నాయి. ► పోతపాలు, జంక్ఫుడ్, అతిగా యాంటీబయాటిక్స్ వాడటం వంటివి ఐదేళ్లలోపు చిన్నారుల శ్వాసనాళాలను దెబ్బతీస్తున్నాయి. వ యసుతో పాటే తెరుచుకోవాల్సిన శ్వాసనాళాలు మూసుకుపోతున్నాయని తేలింది. ►ప్రసవం తర్వాత చాలామంది తల్లులు బిడ్డలకు డబ్బా పాలు పడుతున్నారు. సాధారణ జ్వరానికీ ఖరీదైన యాంటిబయాటిక్స్ వాడుతున్నారు. ఇది పిల్లల్లో ఆస్తమాకు కారణమవుతోంది. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువుపై ప్రభావం చూపుతోంది. నాడీ వ్యవస్థపై ప్రభావం – డాక్టర్ పి.సుదర్శన్రెడ్డి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఆస్తమాకు బయట ఉండే వాహన, పారిశ్రామిక కాలుష్యం, ధూమపానం వంటి వాటి కంటే ఇండోర్ పొల్యూషన్ (మస్కిటో కాయిల్స్, పర్ఫ్యూమ్స్, అగరొత్తులు, పెట్స్, దుప్పట్లు, దిండ్లు) ఎక్కువ ప్రమాదకరం. ఆస్తమా వల్ల శ్వాసనాళాలు మూసుకుపోయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు, కిడ్నీల పనితీరు మందగిస్తుంది. ఇన్హేలర్తో ఉపశమనం – డాక్టర్ విజయ్కుమార్, ఫల్మనాలజిస్ట్, అపోలో ఆస్పత్రి ఇంట్లో ఇన్హేలర్ ఉండాలి. టాబ్లెట్స్, ఇంజక్షన్లు, నెబ్లైజర్తో పోలిస్తే ఇన్హేలర్తోనే ప్రయోజనం ఎక్కువ. వైద్య పరీక్షలతో పని లేకుండా క్లినికల్గానూ ఆస్తమాను నిర్ధారించవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి తొమ్మిది మాసాలు మందులు వాడితే చాలు. ఆస్తమా లక్షణాలివీ.. తరచూ దగ్గడం.. ఆయాసం.. కడుపు ఉబ్బరంగా ఉండటం. వీటికి దూరంగా ఉండాలి.. ఐస్క్రీమ్లు, శీతల పానీయాలు, కూలర్, ఏసీ, సిగరెట్, సిమెంట్, ఫ్లెక్సీ ప్రింటర్స్, పారిశ్రామిక, వాహన కాలుష్యం.. -
నేటి నుంచి ‘సచివాలయ’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సచివాలయ పోస్టుల భర్తీకి చకచకా అడుగులు పడుతున్నాయి. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆన్లైన్లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంచగా.. నేటి నుంచి (మంగళవారం) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టుగా మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్ పేర్కొన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఎస్సీ (డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను నిర్వహిస్తుందని తెలిపారు. కేటగిరీల వారీగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడుతామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు అర్హత, కుల ధృవీకరణ, రెసిడెన్షియల్, క్రిమీలేయర్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సర్టిఫికెట్లన్నింటినీ డీఎస్సీ వెరిఫికేషన్ చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో మెరిట్ లిస్టులు పూర్తి చేశామని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తవ్వగానే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేస్తామని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దు నిబంధన ప్రకారం పనిచేసిన ఏఎన్ఎంలకు సచివాలయ పోస్టుల్లో దక్కాల్సిన వెయిటేజీపై ఆందోళన చెందవద్దని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. వెయిటేజీ ఇవ్వని వారి సర్టిఫికెట్లను సంబంధిత డీఎంఅండ్హెచ్ఓ(జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి) ఆఫీసులో మంగళవారం అంజేయాలని సూచించారు. వాటిని పరిశీలించిన తర్వాత వెయిటేజీ ఇస్తారని ఆయన తెలియజేశారు. సర్టిఫికెట్ పరిశీలన కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మంగళశారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్... ఆంధ్ర లయోలా కాలేజీలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని 11,025 పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికెషన్ రెండు రోజుల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. అయిదు శాఖలకు సంబంధించి అర్హత సాధించిన వారికి నేడు సర్టిఫికెట్స్ పరిశీలన చేపడుతారని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఇంతియాజ్ పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాఖల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకుగానూ తొలి రోజు 250 మంది అధికారులు విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన పత్రాలతో అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. అక్టోబర్ రెండవ తేదీ కల్లా అభ్యర్థులు కొత్త కొలువుల్లో చేరేలా ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంతియాజ్ అన్నారు. అనంతపురం: సచివాలయ ఉద్యోగాల భర్తీ సజావుగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. కాల్లెటర్స్ అందినవారంతా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. కాల్ లెటర్స్ అందనివారికి త్వరలోనే పంపుతామని స్పష్టం చేశారు. ఇక జిల్లావ్యాప్తంగా 8545 పోస్టులు మంజూరయ్యాని ఆయన పేర్కొన్నారు. -
'సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్లు సిద్ధం’
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్లు సిద్ధం చేశామని మున్సిపల్శాఖ కమిషనర్ విజయ్కుమార్ తెలిపారు. మెరిట్ లిస్ట్ను జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు వెల్లడించారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఎంపికైనన అభ్యర్థులకు కాల్ లెటర్ పంపిస్తామని, అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని, ధరఖాస్తులో చెప్పిన అర్హత, కుల ధృవీకరణ, క్రీమిలేయర్, నివాస సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, ఈ నెల 27న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 20 బృందాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక ఏ అభ్యర్థి ఎక్కడ ఉద్యోగం చేయాలన్నది నిర్ణయిస్తామని, 60 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. -
సీఎం జగన్ ఇచ్చిన స్వేచ్ఛతోనే అది సాధ్యమైంది
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం అన్నారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పరీక్షలకు మొత్తం 89.83 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించాలని, ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగుల నియామకానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు (2, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు) ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. (చదవండి : సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు) పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా అజేయకల్లం సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఒకే సారి లక్షా 34వేల ఉద్యోగాలు భర్తీ చేయడం రికార్డ్ అన్నారు. గత 20 ఏళ్లలో ఏడాదికి 1000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ.. రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనడానికి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు. 20లోగా ఫలితాలు : గిరిజా శంకర్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు మొత్తంగా 89.83శాతం అభ్యర్థులు హాజరయ్యారని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. పరీక్షలకు ఎటువంటి ఇబ్బది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 21.69లక్షల దరఖాస్తులు వచ్చాయని, మొత్తంగా 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. అభ్యర్థుల రవాణ సౌకర్యం కోసం 6వేల బస్సులను ఉపయోగించామన్నారు. జవాబు పత్రాలను స్ట్రాంగ్రూంలలో భద్రపరిచామని, జిల్లా కేంద్రాలలో ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ చేపడతామన్నారు. ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తామని గిరిజా శంకర్ పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఇంత పెద్ద టాస్క్ పూర్తి చేశాం : విజయ్కుమార్ అందరి సహకారం వల్లే సచివాల పరీక్షలను ప్రశాంతంగా ముగిశాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్ అన్నారు. తమపై నమ్మకంలో ప్రభుత్వం అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. 25శాతం టఫ్ ప్రశ్నలు ఉన్నాయి : ద్వివేది ఏపీపీఎస్సీ ప్రమాణాలను పాటించి సచివాల ఉద్యోగాల పరీక్షలను నిర్వహించామని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ప్రశ్నాపత్రం 25శాతం టఫ్గా ఉందన్నారు. అత్యంత వేగంగా ప్రశ్నాపత్రాల స్కానింగ్ చేపట్టామని, ఈనెల 20లోపు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. జిల్లాలవారిగా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, 1500 చోట్ల సచివాలయ భవనాలను నిర్మిస్తామని ద్వివేది పేర్కొన్నారు. -
కశ్మీర్ ఎల్జీగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ నియమకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోన్నట్లు సమాచారం. ఎన్కౌంటర్లు చేయడంలో స్పెషలిస్ట్గా గుర్తింపు పొందిన విజయ్ నియమానికి రాష్ట్రపతి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు రేపోమాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో కశ్మీర్ తొలి ఎల్జీగా నియామకమైన అధికారిగా విజయ్ గుర్తింపు పొందనున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్రం తరఫున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లఢక్ వ్యవహారాలను గవర్నర్ సత్యపాల్ మాలిక్ చూస్తున్నారు. ఇప్పుడు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పాలనను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు ఆయన నియమకానికి సంబంధించి అధికారిక ప్రకటన రాకముందే సోషల్ మీడియాలో విజయ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుత్తున్నాయి. ఎవరీ విజయ్!? విజయ్ కుమార్ తమిళనాడుకు చెందిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయనకు పెద్ద సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డే ఉంది. కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటిలో నలుసులో మారిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను 2004 అక్టోబర్లో అంతమొందించిన తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్గా వ్యవహరించారు. వీరప్పన్ను పట్టుకున్న తర్వాత విజయ్ పేరు ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు చెన్నై పోలీస్ కమిషనర్గా పనిచేసిన సమయంలో.. ఎంతోమంది నేరస్థులను ఎన్కౌంటర్ చేశారు. 2008లో హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్గా నియమితులయ్యారు. 2010నాటి దంతెవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా 2010-2012 మధ్య కాలంలో మావోయిస్టుల ఏరివేత, అటు జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఆటకట్టించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో కశ్మీర్ గవర్నర్కు భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ట్రాక్ రికార్డ్!! హైదరాబాద్ నగరంతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. గతంలో హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి అధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత డీజీ, సీఆర్పీఎఫ్ డీజీగా పనిచేసి పదవీ విరమణ అయ్యారు. ఆ తర్వాత కూడా వామపక్ష తీవ్రవాద ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖకు సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం, హోమ్, ఫారెస్ట్, ఎకాలజీ & ఎన్విరాన్మెంట్, హెల్త్ & మెడికల్ ఎడ్యుకేషన్, యూత్ సర్వీసెస్ & స్పోర్ట్స్, హాస్పిటాలిటీ & ప్రోటోకాల్, సివిల్ ఏవియేషన్, ఎస్టేట్స్, ఇన్ఫర్మేషన్ పోర్ట్ఫోలియోలతో జమ్ముకశ్మీర్ గవర్నర్కు సలహాదారుగా ఉన్నారు. అందుకే ఇంతటి రికార్డ్ ఉన్న విజయ్ను కశ్మీర్కు పంపితే సమర్థవంతంగా చూసుకుంటారని కేంద్రం భావిస్తోంది. ఇదిలావుండగా.. తెలంగాణ గవర్నర్గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పంపుతారంటూ ప్రచారం కూడా జరిగిన విషయం తెలిసిందే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు మిత్రుడు కావడంతో నరసింహన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, తాజాగా నరసింహన్ కాకుండా విజయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. -
బ్యాగు మోతకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గింపుపై విద్యా శాఖ ఆలోచనలు మొదలు పెట్టింది. గతంలోనే బ్యాగు బరువు తగ్గించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. గతంలోనే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల బ్యాగు బరువుపై అధ్యయనం చేసిన విద్యా శాఖ బ్యాగు బరువు కారణంగా విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్నారని గుర్తించింది. వారు మోస్తున్న బ్యాగు బరువు అంచనా వేసి, తరగతులవారీగా ఎన్ని పాఠ్య పుస్తకాలు ఉండాలి.. ఎన్నినోటు పుస్తకాలు ఉండాలి.. బ్యాగు బరువెంత ఉండాలన్న అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటి అమలు పక్కాగా జరగలేదు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ బ్యాగు బరువు తగ్గించే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాగు బరువు తగ్గింపుపై పాఠశాల విద్య కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలల యాజమాన్యాలకు నచ్చజెప్పే ధోరణితో ముందుకు సాగాలన్న ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం కావాలని భావిస్తున్నారు. వీలైతే అంతకంటే ముందే విద్యా శాఖ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేసి పలు స్కూళ్లలో ఉన్న ఏర్పాట్లు, బ్యాగు బరువుపై మరోసారి పరిశీలన జరపాలని యోచిస్తున్నారు. బ్యాగు బరువు తగ్గించేందుకు ఒక్కొక్కటిగా నిబంధనలు అమల్లోకి తేనున్నారు. విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాలు మినహా ఇతర పుస్తకాలను పాఠశాలల్లోనే ఉంచేలా యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలని సూచించనున్నారు. తద్వారా విద్యార్థులపై బ్యాగు బరువు సగం వరకు తగ్గించొచ్చని విద్యా శాఖ భావిస్తోంది. స్టేట్ సిలబస్ అమలుపైనా దృష్టి రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో స్టేట్ సిలబస్ పుస్తకాలే వినియోగించేలా చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖ సిద్ధం అవుతోంది. విద్యా శాఖ నిర్దేశిత సిలబస్ ఉన్న సేల్ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉండట్లేదని, అందుకే తాము ప్రైవేటు సిలబస్ పుస్తకాలను వినియోగిస్తున్నామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యా శాఖకు తెలియజేశాయి. దీంతో ముందుగా మార్కెట్లో విక్రయించే పాఠ్య పుస్తకాల ముద్రణను పక్కాగా చేపట్టేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ప్రైవేటు పబ్లిషర్లు నిర్ణీత పాఠ్య పుస్తకాల ముద్రణ కోసం అనుమతి తీసుకొని, వాటికి విద్యా శాఖకు రాయల్టీ చెల్లిస్తున్నా, నిర్ణీత పుస్తకాలు ముద్రించడం లేదన్న ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు సేల్ పుస్తకాల ముద్రణను పక్కాగా చేసేలా, ఆయా పుస్తకాలకు సీరియల్ నంబర్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. తద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలను మార్కెట్లో అందుబాటులో ఉంచి పాఠశాలలు వాటిని అమలు చేసేలా చూసేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాఠశాల విద్య కమిషనర్ విజయ్కుమార్ గుర్తింపు పొందిన ప్రైవేటు యాజమాన్య సంఘంతో (ట్రస్మా) చర్చించారు. వారు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు కచ్చితంగా పాఠశాల విద్యా శాఖ నిర్దేశిత పుస్తకాలనే వినియోగిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అదే విధానం కొనసాగించడం ద్వారా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగం తగ్గించి, విద్యా ర్థుల బ్యాగు బరువును నియంత్రించొచ్చని భావిస్తోంది. ఆర్థిక భారం లేని చర్యలపై దృష్టి బ్యాగు బరువు తగ్గింపులో భాగంగా ముం దుగా ఆర్థిక భారం లేని అంశాలపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది పాఠశాలల్లో ఏ రోజు ఏ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు తీసుకురావాలో ముందే చెప్పడం, బ్యాగు బరువును సమానంగా పంచేలా వెడల్పాటి పట్టీలు కలిగిన బ్యాగులను ఎంపిక చేసుకునేలా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించడం వంటి చర్యలు చేపట్టే ఆలోచనలు చేస్తోంది. పుస్తకాలను పాఠశాలల్లోనే ఉంచేలా ర్యాక్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై పాఠశాలల యాజమాన్యాలను ఒప్పించాలని భావిస్తోంది. -
టెన్త్ ఫలితాల విడుదల ఆలస్యం
హైదరాబాద్: టెన్త్ ఫలితాల విడుదల కాస్త ఆలస్యం అవుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయకుమార్ శనివారం తెలిపారు. హైదరాబాద్లో విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. టెన్త్ ఫలితాలు విడుదల చేశాక ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్ లాగిన్లతో విద్యార్థుల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి గ్రేడ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఏ సబ్జెక్లోనైనా సున్నా వస్తే.. రీ చెక్ చేసిన తర్వాతే ఫైనల్ చేస్తామని చెప్పారు. ఐదు అంచెలుగా పేపర్ చెక్ చేసి ఫైనల్ చేస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆలస్యం ఐనా పక్కాగా ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పేపర్ వాలువేషన్ పూర్తి అయింది.. కానీ రీచెక్ చేస్తున్నాం.. అందుకే ఫలితాల విడుదల ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఇంటర్ ఫలితాల విషయంలో పెద్ద గందరగోళం నెలకొనడంతో టెన్త్ ఫలితాల విడుదలలో ప్రభుత్వం కాస్త జాగ్రత్తపడుతున్నట్లుగా కనపడుతోంది. -
మాజీ ఎమ్మెల్యే మృతి
సాక్షి, బెంగళూరు : బీదర్ జిల్లా భాల్కి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ విజయ్ కుమార్ ఖండ్రే(60) కన్నుమూశారు. కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రే పెద్ద అన్న అయిన విజయ్ కుమార్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఆ ప్రశంసను మరచిపోలేను
‘‘నాటకాల్లో నేను అచ్చం ఎన్టీఆర్గారిలా చేస్తానని ఎవరో రామ్గోపాల్ వర్మగారికి చెప్పారు. అప్పుడు వర్మగారు నాకు ఓ డైలాగ్ పంపించి ఎన్టీఆర్గారిలా చేసి పంపమన్నారు. పంపిన వీడియో చూసి ఎన్టీఆర్గారి పాత్రకు తీసుకున్నారు’’ అన్నారు విజయ్కుమార్. యజ్ఞాశెట్టి, శ్రీతేజ్, విజయ్ కుమార్ ముఖ్య తారలుగా రామ్గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా మార్చి 29న ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్లో నటించిన విజయ్ కుమార్ (ఎన్టీఆర్), యజ్ఞాశెటి ్ట(లక్ష్మీ పార్వతి), శ్రీతేజ్ (బాబు) హైదరాబాద్లో సోమవారం విలేకరులతో ముచ్చటించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘నాకు 45ఏళ్ల నాటకానుభవం ఉంది. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్లో ఉంటున్నాను కానీ సరైనవి రాలేదు. ఎన్టీఆర్గారి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన వర్మగారికి థ్యాంక్స్. సినిమాలకు పునాది నాటకాలు. నాటకాలకు ఇప్పుడు కూడా ప్రజాదరణ ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో వందలకొద్దీ కళా పరిషత్లు ఉన్నాయి. నాటకానుభవం ఉండటంతో సినిమాలో నటించడం కష్టం అనిపించలేదు. రెండు మూడు రోజులు కొత్తగా అనిపించిందంతే. ఓసారి నా నాటకం చూసిన సి.నారాయణరెడ్డిగారు ‘మా అన్నగారు (ఎన్టీఆర్) కనిపించారు’ అన్నారు. ఆ ప్రశంస మరచిపోలేను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేస్తున్నప్పుడు వర్మగారితో మాట్లాడుతుంటే నటరాజుతో మాట్లాడినట్టు అనిపించింది. ‘ఎన్టీఆర్గారి పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేసుకోవడంతో చాలామంది నన్ను తప్పుబట్టారు. నేను చెప్పినదాంట్లో మీరు కనీసం 50 శాతం నటిస్తే చాలనుకున్నా. కానీ 100 శాతం చేశారు’ అని వర్మగారు చెప్పడం నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్. నటులకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గానే చూడాలి’’ అన్నారు. శ్రీతేజ్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నేను కెరీర్ స్టార్ట్ చేసి 13ఏళ్లయినా సరైన బ్రేక్ రాలేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా నా కెరీర్కి టర్నింగ్ పాయింట్. ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడుగారి పాత్ర చాలా బాగా చేశావంటూ అందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంది. ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూగారి పాత్ర, ‘యన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిగారి పాత్ర, ఈ సినిమాలో చంద్రబాబుగారి పాత్ర చేశా. వరుసగా బయోపిక్ చిత్రాల్లో నటిస్తుండటం ఎగై్జటింగ్గా ఉంది. నేను రెగ్యులర్ యాక్టర్గా ఉండకూడదనుకుంటున్నా. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, నాగభూషణం, ప్రకాశ్రాజ్, రావు రమేశ్గార్లలా విలక్షణమైన పాత్రలు చేయాలని ఉంది. ఈ తరంలో మేము వారిలా గొప్ప పాత్రలు చేయడం లేదు. బాలీవుడ్ నుంచి ఇర్ఫాన్ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి విలక్షణమైన నటులను టాలీవుడ్కి తెచ్చుకుంటున్నాం. వారిలా విలక్షణమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది మార్చి 29వ తేదీ శుక్రవారం నా భవిష్యత్ని మార్చేసింది. ఇందుకు వర్మగారికి, అగస్త్యమంజుగారికి ధన్యవాదాలు. కొన్ని సినిమాలకు చర్చలు జరగుతున్నాయి’’ అన్నారు. యజ్ఞాశెట్టి మాట్లాడుతూ– ‘‘వర్మగారితో ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా చేశా. ఆ తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ చేసి, ఓకే చేశారు. ఇందులో లక్ష్మీ పార్వతిగారి పాత్ర నాకు ఓ చాలెంజ్. కథ చాలా సెన్సిటివ్. నాకు తెలుగు రాదు. కానీ, తెలుగు లిటరేచర్ని పెట్టుకుని డైలాగ్స్ నేర్చుకున్నాను. ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి. ప్రస్తుతం బాలాజీ దర్శకత్వంలో ‘9 డైరీస్’ అనే ద్విభాషా చిత్రం (తెలుగు, కన్నడ) చేస్తున్నా’’ అన్నారు. హరికృష్ణ పాత్రధారి గంగాధర్ పాల్గొన్నారు. -
వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది
‘‘అవకాశం వచ్చినప్పుడే మనలో ఉన్న సామర్థ్యం బయటకు తెలుస్తుంది. నా పదిహేనేళ్ల కెరీర్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి బ్లాక్బస్టర్ కోసమే ఎదురుచూస్తున్నాను. సంగీతదర్శకునిగా ఇది నా 16వ సినిమా. వర్మగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశాను. నా కెరీర్ను బిఫోర్ ఆర్జీవీ (రామ్గోపాల్ వర్మ).. ఆఫ్టర్ ఆర్జీవీ అని చెప్పేంత స్పందన వచ్చింది ఈ సినిమాకు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను మెచ్చుకుంటున్నారు’’ అన్నారు కల్యాణీ మాలిక్. విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ ముఖ్య తారలుగా రామ్గోపాల్వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’. ఏ జీవీ, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన కల్యాణీ మాలిక్, గీత రచయిత సిరాశ్రీ హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా సంగీత దర్శకుడిని అయ్యాను. మా అన్నయ్య (యం.యం. కీరవాణి), నేను ఇద్దరం మ్యూజిక్ డైరెక్టర్స్ విభాగంలోనే ఉన్నాం. క్రిష్ ‘యన్.టీ.ఆర్’కి అన్నయ్య సంగీత దర్శకునిగా చేశారు. నేను వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రానికి సంగీతం అందించాను. ఎవరి సృజనాత్మక శైలి వారికి ఉంటుంది. ఆయనతో నాకు పోలిక పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పోలికలు పెట్టడం కామనే. కానీ ఆయన స్థాయికి నేను అస్సలు సరిపోను. ఆయనతో నేను సరితూగుతానా? అన్న భయం నాకు జీవితాంతం ఉంటుంది. కానీ ట్రావెల్లో ముందుకు వెళ్లాలి. రాజమౌళి సినిమాలకు సౌండ్ సూపర్ విజనింగ్ చేస్తుంటాను. అన్నయ్య ప్రతి సినిమాకు నేను పని చేయలేదు. వర్మగారితో తొలిసారి పని చేయడం హ్యాపీ. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా ఈ సినిమాకు నాకు పేరు వచ్చింది. ఈ సినిమాకు ముందు రామ్గోపాల్వర్మగారితో నాకు పరిచయం లేదు. రచయిత సిరాశ్రీ వల్లే ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకు వచ్చింది. సిరాశ్రీగారితో కూడా నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మేము. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం డెస్టినీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు ‘నేను సంగీతం అందించగలనా?’ అనే భయం వేసింది. వర్మగారు నా పై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ఇలాంటి పాటలు చేయలేదు. నా కెరీర్కు బాగా ఫ్లస్ అయ్యింది. వివాదాలను మా వరకు రానివ్వరు వర్మగారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉంటుంది. నా కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కల్యాణీ మాలిక్ మంచి సంగీతం ఇవ్వగలడనే పేరును నిలబెట్టుకోవాలి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘అస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం నేను పేర్లు మార్చుకోలేదు. ఇక కెరీర్లో కల్యాణీ మాలిక్గానే కొనసాగుతాను. కీర్తీసురేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఫైనల్ స్టేజ్లో సౌండ్ సూపర్ విజనింగ్లో నా పని మొదలవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన ఆంచనాలకు అందరు సిరాశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు దాదాపు 150 పాటలు రాశాను. అందులో 50కి పైగా పాటలు వర్మగారి చిత్రాలకు రాశాను. ఆయన పిలిస్తే ఇండస్ట్రీలో చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు. కానీ ఆయన నాకే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వర్మగారిని నేను ఒక ఈవెంట్గా చూస్తాను. మన మైండ్సెడ్తో ఆయన్ను అర్థం చేసుకోలేం. ఫిలసాఫికల్ ఔట్లుక్ వస్తుంది. వర్మగారు అంచనాలకు అందనివారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ్యూజిక్ డిస్కషన్స్లో ‘ఇది ఆర్జీవీ మ్యూజిక్లా ఉండకూడదంటే ఏం చేయాలి. ‘శంకరాభరణం, మేఘ సందేశం’లా బెంచ్మార్క్ క్లాసిక్ సంగీతంలా ఉండాలి’’ అని నాతో ఆర్జీవీగారు అన్నారు. వెంటనే నాకు కల్యాణీ మాలిక్గారి పేరు మైండ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని పాటను వినిపించాను. వెంటనే ఆర్జీవీగారు కల్యాణి మాలిక్ను తీసుకుందాం అన్నారు. వర్మగారికి సాహిత్యంపై పట్టు ఉంది. ఆయనకు ఎన్టీఆర్గారంటే విపరీతమైన అభిమానం. అగస్త్య మంజు ఈ సినిమాకు చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పడిన కష్టానికి దర్శకత్వంలో అర్ధభాగం ఇచ్చారు వర్మగారు. జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. నా కెరీర్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఖాళీ లేకుండానే పని చేస్తున్నాను’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ‘లక్ష్మీస్ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రం విడుదల కాకపోవడం చాలా బాధగా ఉంది. బాగా నిరుత్సాహపడ్డాను. ఆంధ్రప్రదేశ్లో విడుదల కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ కూడా విడుదలైతే... ఇంత మంచి పేరు అక్కడ కూడా వచ్చి ఉండేదనే ఫీలింగ్ ఉంది. నా పరంగానే కాదు నిర్మాత కూడా చాలా నష్టపోయి ఉంటారు. నా సొంత ఊరు కొవ్వూరు. నా సొంత ఊరు కొవ్వూరులో నేను పని చేసిన సినిమా విడుదల కాలేదు. -
వర్మచెప్పిన ఎన్టీఆర్ కథ
ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోట్ల వెనుక ఉన్న కథను ప్రేక్షకులకు చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తాను అనుకున్నది చేసి చూపించాడు. ఎన్టీఆర్ జీవితంలో అందరికీ తెలియాల్సిన క్రూరపథకాలు ఉన్నాయని ఈ సినిమాతో చెప్పాడు. పత్రికలు ఈ విషయాలను ఎప్పుడూ రాయలేదని తొక్కిపెట్టాయని చాటింపు వేశాడు. నిజం నివురుకప్పి ఉన్నా ఎప్పుడో ఒకసారి అగ్నిని వెదజల్లుతుందని ఈ సినిమాతో తేల్చి చెప్పేందుకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న కష్టకాలాన్ని, దుఃఖకాలాన్ని, ఆయనను క్షోభకు గురి చేసిన కాలాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో తెర మీదకు తీసుకువచ్చి గతకాలపు జర్నీ చేయించాడు. వర్తమానం పట్ల ప్రేక్షకులకు ఆలోచన కలిగించాడు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో మినహా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీ ఓపెనింగ్స్తో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (ట్యాగ్ లైన్ అసలు కథ) విడుదలైంది. ఏపీలో విడుదల కోర్టు పరిధిలో ఉంది. కథ విషయానికొస్తే... ఇది ఎన్టీఆర్ కథనా లేదా లక్ష్మీ పార్వతి కథనా లేదా లక్ష్మీపార్వతికి తెలిసిన ఎన్టీఆర్ కథనా లేక లోకానికి తెలియని ఎన్టీఆర్ కథనా అనేది సినిమా చూశాకనే ప్రేక్షకులకు తెలుస్తుంది. నిన్నమొన్న వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు) వదిలిపెట్టిన అనేక విషయాలు ఈ సినిమాలో కనిపించాయని ప్రేక్షకులు అనుకుంటారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అనే అభిమాని ఎంటరైనప్పటి నుంచి ఎన్టీఆర్ మరణించే వరకు జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ప్రధాన కథ. సినిమా కథ ప్రకారం ‘మనదేశం’ పార్టీ స్థాపించి తెలుగువారి విజేతగా నిలిచిన ఎన్టీఆర్ (సినిమాలో నటుడు విజయకుమార్) 1989లో మొదటిసారి ఓడిపోయినప్పుడు చేదు పరిస్థితులు ఎదుర్కొంటాడు. సొంత కుటుంబం, తను నిర్మించుకున్న రాజకీయ కుటుంబం ఒక్కసారిగా దూరం కావడంతో పలకరించే దిక్కు లేక ఇక రాజకీయాలు వద్దు, జీవితాన్ని ఏదో ఒకలా బతికేస్తానని అనుకుంటాడు. ఆ సమయంలో ఆయన జీవితంలోకి వస్తుంది లక్ష్మీపార్వతి (నటి యజ్ఞా శెట్టి). ఆయన జీవిత చరిత్రను రాయడమే తన జీవితాశయమని చెప్పి ఎన్టీఆర్ మనసు ఆకట్టుకుంటుంది. ‘మీరు మామూలు మనిషి కాదు స్వామీ, మీలో చాలా గొప్ప శక్తి ఉంది’ అని ఆయన్ని ఉత్తేజపరుస్తుంది. అలా అడుగుపెట్టిన ఆమె రోజురోజుకూ∙ఆయన జీవితానికి ఎంత దగ్గరయిందీ ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ కథలో చూపిస్తారు. ఇదంతా ఫస్ట్హాఫ్లో ఉంటుంది. అయితే వారి బంధాన్ని అప్పటి మీడియా సహకారంతో ఎన్టీఆర్ అల్లుడైన బాబు (సినిమాలో శ్రీతేజ్) లక్ష్మీపార్వతిపై విషం చిమ్మడంతో కథపై పట్టు బిగియటం సెకండ్ హాఫ్లో మొదలవుతుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల తరపున రాయబారిలా ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన బాబు మీరు చేస్తున్నది తప్పు అని ఎన్టీఆర్ను హెచ్చరిస్తాడు. అప్పటి నుంచి బాబుని దూరం పెడతాడు ఎన్టీఆర్. ఆ టైమ్లో ఎన్టీఆర్ని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా చేయమని అడుగుతాడు ఒక ఆత్మీయ నటుడు. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఆ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో భారీగా చేస్తున్నానని ఆ నటుడు ఆహ్వానితుల జాబితాని ఎన్టీఆర్కి చూపిస్తాడు. ఆ జాబితాలో లేని లక్ష్మీపార్వతి పేరుని ఎన్టీఆర్ స్వయంగా రాస్తాడు. అది తెలుసుకున్న బాబు ఎలాగైనా ఆ సభకి ఆమె రాకుండా అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులందర్నీ ఎన్టీఆర్ వద్దకు తీసుకొచ్చి, ఆమె సభకి వచ్చినా ఫర్వాలేదు కానీ, స్టేజ్పైకి రానివ్వద్దని ఆంక్షలు విధిస్తాడు. సరేనన్న ఎన్టీఆర్ తిరుపతి సభలో ఆమె గురించి ప్రస్తావించడమే కాక ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తాడు. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అందరూ నివ్వెరపోతారు. అక్కడి నుంచి బాబు తన రాజకీయ చదరంగాన్ని ప్రారంభిస్తాడు. ఆమెను అనేకసార్లు దూషించిన బాబు ఆమెకే ఫోను చేసి, సంధి చేసుకుని ఎన్టీఆర్కి మళ్లీ దగ్గరవుతాడు. 1994లో మళ్లీ ఎన్టీఆర్ తన చరిష్మాతో అత్యధిక సీట్లు గెలుచుకుని సీఎంగా పగ్గాలు చేపడతాడు. ఇది ఓర్వలేని బాబు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి కుట్రలు పన్నాడు? ఎంతమందిని పావులుగా వాడుకున్నాడు? మీడియాని ఎలా హస్తగతం చేసుకున్నాడు? సీఎంగా ఉన్న ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోటు పొడిచాడనేది ప్రీ క్లైమాక్స్. సినిమాలో వైశ్రాయ్ ఉదంతాన్ని ఎమోషనల్గా చూపించాడు వర్మ. 74 ఏళ్ల వయస్సులో ఒక సీఎం పదవిలో ఉండి ఎంతో జీవితాన్ని చూసిన ఎన్టీఆర్ ఏడుస్తూ ఉండే సంఘటన చూసిన ఎవరైనా చలించిపోతారు. ‘సొంత కొడుకులు, సొంత కూతుళ్లు, అల్లుళ్లు, నా బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు నన్ను వెన్నుపోటు పొడిచారు. చెప్పులతో దాడి చేశారు. ఆ సంఘటన జరిగిన రోజునే నేను చచ్చిపోయాను లక్ష్మీ’ అని ఎన్టీఆర్ అంటారు. విశ్లేషణ ఇది దర్శకుడు వర్మ తాను పరిశోధించి తాను యదార్థమని తలిచి చెప్పిన కథ. ఎన్టీఆర్ వంటి ఓ గొప్పనాయకుడు ఎందుకు ఒంటరివాడయ్యారు? ఆ సమయంలో లక్ష్మీ పార్వతికి ఎలా దగ్గర అయ్యారు? వారి మధ్య ప్రేమ చిగురించడానికి దారితీసిన సంఘటనలు ఏంటి? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది? ఆ కుట్రలకు ముఖ్య కారకులు ఎవరు? ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? వంటి అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టేట్టు చూపించారు. ఎవరెలా చేశారంటే... పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర చేసిన రంగస్థల నటుడు పి.విజయ్ కుమార్ ఆహార్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అచ్చం ఎన్టీఆర్ను తలపించింది. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పట్ల ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం.. ఇలా అన్ని భావాలను అద్భుతంగా పలికించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్గా నిలిచాడు. వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించే లా ఉన్నాయి. సాంకేతిక నిపుణుల పనితీరు... నిజజీవిత కథలను తెర మీద మలచడం వర్మకు బాగా తెలుసు. అందుకు నిదర్శనం ఆయన తీసిన ‘రక్తచరిత్ర‘, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ తదితర చిత్రాలు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. పకడ్బందీ స్క్రీన్ప్లేతో వర్మ ఈ కథను నడిపారు. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం, నేపథ్య సంగీతం మరో ప్లస్ పాయింట్. రమ్మీ అందించిన ఫోటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. డైలాగులు... ► నా 70 ఏళ్ల జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం.. ► పాముకు పాలుపోసి పెంచినా అది విషంతోనే కాటేస్తుంది.. వాడూ అంతే... ► జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు ► మీరు నా పిల్లలు అయ్యుండి కూడా వాడితో చేరారా సిగ్గు లేకుండా ఛీ.. ► తమ్ముళ్లూ.. వాడి మాట వినకండి.. మీకు నేనున్నా.. ధైర్యంగా బయటకు రండి ► ఇక పార్టీలో ఏ నిర్ణయమైనా నాకు తెలీయకుండా జరగడానికి వీల్లేదు. ► అబద్ధానికి నోరు పెద్దది.. అన్యాయానికి చేతులు పెద్దవి. తారాగణం: విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్ దర్శకత్వం: రామ్గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంగీతం: కల్యాణీ మాలిక్ -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ
టైటిల్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ జానర్ : బయోగ్రాఫికల్ మూవీ తారాగణం : విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్ సంగీతం : కల్యాణీ మాలిక్ దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత : రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో బయోగ్రాఫికల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వర్మ చెప్పినట్టుగా నిజంగా నిజాలనే తెరకెక్కించాడా..? ఎన్టీఆర్ అసలైన బయోపిక్ ఈ సినిమానేనా..? కథ : లక్ష్మీస్ ఎన్టీఆర్ కొత్త కథేం కాదు, తెలుగు ప్రజలందరికి తెలిసిన కథే. 1989లో ఎన్టీఆర్ (విజయ్ కుమార్) అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతికి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి గురించి కొద్ది రోజుల్లొనే దుష్ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం ఎన్టీఆర్ దాకా రావటంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్ ప్రకటిస్తాడు. ఎన్టీఆర్ అల్లుడైన బాబు రావ్ ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న బాబు రావు కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను బెదిరించి తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్పై వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయటంతో కుమిలి కుమిలి చనిపోతాడు. ఇదే లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ. నటీనటులు : ఈ సినిమా కోసం వర్మ ఎంచుకున్న ప్రధాన పాత్రదారులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్ అయితే సినీరంగానికే కొత్త. రంగస్థల నటుడిగా ఉన్న విజయ్ కుమార్ను ఎన్టీఆర్ లాంటి పాత్రకు ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే వర్మ తన మీద పెట్టుకున్న నమ్మకానికి విజయ్ కుమార్ పూర్తి న్యాయం చేశాడు. ఎన్టీఆర్ హావభావాలను, డైలాగ్ డెలివరినీ చాలా బాగా తెర మీద చూపించాడు. మరో కీలక పాత్రలో నటించిన యజ్ఞశెట్టి నటన సినిమాకు హైలెట్గా నిలిచింది. నిష్కల్మశమైన ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం ఇలా అన్ని భావాలను తెరమీద అద్భుతంగా పలికించారు యజ్ఞ. బాబు రావు పాత్రలో శ్రీతేజ్ జీవించాడనే చెప్పాలి. కుళ్లు, కుతంత్రం, వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా శ్రీ తేజ్ నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలో అంతా కొత్తవారే కనిపించిన ఎవరికి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : ముందు నుంచి చెపుతున్నట్టుగా వర్మ ఈ సినిమాలో అసలు నిజాలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ అనే మహానాయకుడు ఎలా ఒంటరి వాడయ్యాడు.? ఆ సమయంలో లక్ష్మీకి ఎలా దగ్గరయ్యాడు.? వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది.? ఆ కుట్రల వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు? చివరకు ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అన్న విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. వర్మ మార్క్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఎన్టీఆర్, లక్ష్మీల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా కాస్త కథనం నెమ్మదించినట్టుగా అనిపించినా ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్ అయ్యాడు. ప్రతీ నటుడు తన పాత్రలో లీనమై సహజంగా నటించాడు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ కల్యాణీ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ సన్నివేశాల స్థాయిని పెంచాడు కల్యాణీ మాలిక్. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సంగీతం సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనాలు ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
సూర్య నిర్మాతగా ఉరియడి 2
ఉరియడి–2 చిత్రం మిమ్మల్ని సంతోషపరచకపోవచ్చునేమో గానీ కచ్చితంగా అందరినీ నవ్విస్తుందని ఆ చిత్ర నిర్మాత నటుడు సూర్య అన్నారు. వర్ధమాన నటుడు, దర్శకుడు విజయకుమార్ చేసిన తొలి ప్రయత్నం ఉరియడి. ఆ చిత్రం మంచి విమర్శనలతో పాటు, కమర్శియల్గానూ హిట్ అయి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో దానికి సీక్వెల్గా ఉరియడి–2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులోనూ తనే కథానాయకుడిగా నటించారు. నిర్మాణ బాధ్యతలను మాత్రం నటుడు సూర్య చేపట్టారు. ఆయన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి గోవింద్వసంత సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక సత్యం సినీ థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను ఆవిష్కరించిన నటుడు సూర్య మాట్లాడుతూ ఉరియడి చిత్రం విడుదలై నాలుగైదేళ్లు కావస్తున్నా విజయకుమార్ తదుపరి చిత్రం ఇంత వరకూ తెరపైకి రాకపోవడానికి కారణం ఏమటనే ప్రశ్న తలెత్తవచ్చునన్నారు. తను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఈ రంగంలోకి వచ్చి విజయం సాధించారని అన్నారు. అందుకు కారణం ఆయనలోని నిజాయితీ అని పేర్కొన్నారు. ఈ ఉరియడి 2 చిత్రం కూడా విజయకుమార్ నిజాయితీగా తీసిన కథా చిత్రం అని అన్నారు. చిత్రంలోనూ తను వాస్తవాలనే చర్చించారని చెప్పారు. అలాంటి చిత్రానికి తాను నిర్మాత కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ఎవరినీ సంతోషపరచకపోయినా, కచ్చితంగా అందరినీ నవ్విస్తుందని సూర్య చెప్పారు. దీనికి ఆనంద్వసంత సంగీతాన్ని అందించారని, ఇందులో ఆయన రెండు పాటలను కూడా పాడడం విశేషం అన్నారు. ఇకపైకూడా ఆయన పనయనం తమ సంస్థలో కొనసాగుతుందని అన్నారు. ఉరియడి–2 చిత్రం సమకాలీన రాజకీయాలను చర్చించే కథాంశంతో కూడినదిగా తెలుస్తోంది. సమాజంలో సామాజిక న్యాయం మరుగున పడినప్పుడు అన్ని అవకతవకలు జరుగుతాయని, మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతుందని, హక్కుల కోసం పోరాడడం మన బాధ్యత. రాజకీయాల్లో మన ప్రమేయం ఉండాలని, లేకుంటే రాజకీయాలు తమ జీవితంలో తలదూరుస్తాయని చెప్పే చిత్రంగా ఉరియడి–2 చిత్రం ఉంటుందని తెలిసింది. ఈ చిత్రాన్ని మే 5న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
బాబు ఓడితేనే భవిత
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికలు అబద్ధానికి..నిబద్ధతకు మధ్య జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన జరిగిన గత ఎన్నికల్లో కేవలం సీనియర్ అని మాత్రమే చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. ఆ విలువ నిలుపుకోలేకపోయారు. ఐదేళ్లలో చంద్రబాబు కృష్ణ, గుంటూరు, చిత్తూరు జిల్లాలకే ముఖ్యమంత్రిగా వ్యవహరించాడే తప్ప ఉత్తరాంధ్రకి కాదు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ఉత్తరాంధ్రను కాపాడుకుంటామని సామాజిక శాస్త్రవేత్త, ఏయూ సోషయాలజీ ప్రొఫెసర్ విజయ్కుమార్ స్పష్టం చేశారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేకఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సాక్షి: సంక్షేమ పథకాలతో ఓటర్లను చంద్రబాబు మభ్యపెడుతున్నారా..? విజయ్కుమార్ : ఔను. ఐదేళ్ల పాటు గుర్తు రాని సంక్షేమ పథకాలు ఎన్నికలు రెండు నెలలుండగా ఎందుకు గుర్తొస్తున్నాయి. అంటే ప్రజలు పట్టించుకోరనే ఆలోచనలో ఈ రాజకీయనాయకులున్నారు. పవిత్రమైన ‘పసుపు–కుంకుమ’ పేరుతో ఎన్నికలకు ముందు మహిళలకు గాలం వేస్తున్నారు. సాక్షి: ఉత్తరాంధ్ర వాసులను మోసం చేస్తున్నారనుకుంటున్నారా..? విజయ్కుమార్ : శాఖపట్నం దేశంలోనే అద్భుతమైన నగరం. అంతర్జాతీయ సదస్సులు ఇక్కడ నిర్వహించి..ఆ ఇమేజ్తో విదేశీ పెట్టుబడులను అమరావతికి తరలించుకుపోతున్నారు. విశాఖలో పాలు తాగి విషం చిమ్మి తన నైజాన్ని చంద్రబాబు చాటుకుంటున్నాడు. సాక్షి: రాష్ట్రాన్ని పాలించే నాయకుడు ఎలా ఉండాలనుకుంటున్నారు.? విజయ్కుమార్ : నిస్వార్థ సేవకుడు, మాట తప్పని నాయకుడు కావాలి. సాక్షి: రాజధాని ఎంపికలో విశాఖకు అన్యాయం జరిగిందంటారా..? వంద శాతం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ సంస్థలన్నీ హైదరాబాద్ నుంచి విశాఖకు తరలివచ్చేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖకు రావల్సిన కార్పొరేట్ సంస్థలన్నీ విజయవాడ, తిరుపతి, చిత్తూరు, గుంటూరు నగరాలకు తరలించుకుపోయారు. 2014లో హుద్హుద్ తుఫాన్ వస్తే అప్పుడు నష్టపోయిన ప్రజలకు సహాయం చేయలేదు కానీ..దాన్ని బూచిగా చూపి రాజధానికి విజయవాడ అనుకూలమని చంద్రబాబు ప్రజలను నమ్మించాడు. సాక్షి: తెలంగాణ ప్రజలు తిరస్కరించినట్టు ఏపీ ప్రజలూ సిద్ధంగా ఉన్నారా...? విజయ్కుమార్ : తెలంగాణ ప్రజలు చంద్రబాబు కుతంత్ర రాజకీయాలను ముందుగానే పసికట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చంద్రబాబు అసలు నైజాన్ని తెలుసుకున్నారు. కచ్చితంగా టీడీపీకి ఈ ఎన్నికలు బుద్ధి చెబుతాయి. సాక్షి: పవన్ కల్యాణ్ గురించి..? పవన్ చెప్పిన మాట వేరు. చేస్తోంది వేరు. విశాఖ ఎంపీగా జేడీ లక్ష్మీనారాయణను పోటీ చేయించకూడదు. గతేడాది జూన్ 28న ఇదే పవన్కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోతూ వ్యాపారం కోసం వలసదారులు ఉత్తరాంధ్రలో చొరబడి ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారని ఘాటుగా విమర్శించారు. మరి ఇప్పుడు ఆయన చేస్తోంది ఏంటీ?. సాక్షి: ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణం? విజయ్కుమార్ : ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ నాయకులను ఎదగనివ్వకపోవడం మొదటి కారణం. వలసలు వచ్చి ఉత్తరాంధ్రలో గెలిచి వారి సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారే తప్ప ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థపై ఆలోచించిన నాయకుడే కరువయ్యాడు. ఉత్తరాంధ్రలో విద్యా పరిశోధకలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎనిమిదో తరగతి చదివే విద్యార్థి మేదస్సు మూడో తరగతి చదివే విద్యార్థి సామర్థ్యానికి సమానంగా ఉందని సర్వేల్లో వెల్లడించారు. ఇదంతా డొల్ల విద్యా విధానాలకు ప్రతీక. -
వైశ్రాయ్ ఘటనే పెద్ద కుట్ర
‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 29న విడుదల చేస్తున్నాం. సెన్సార్ సమస్య వల్ల విడుదల వాయిదా పడలేదు. మా సినిమా విడుదలకు కోర్టు, ఎలక్షన్ కమిషన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి. ఎన్నికలు అయిపోయేవరకూ మా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వరంటూ మాకు సమాచారం అందడంతో బోర్డుపై కేసు పెట్టాలనుకున్నాం. అయితే అలాంటిదేమీ లేదని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నాం’’ అని రామ్గోపాల్ వర్మ అన్నారు. విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి లీడ్ రోల్స్లో రామ్గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో వర్మ పంచుకున్న విశేషాలు... బాలకృష్ణకి అంకితం ఎన్టీఆర్గారి బయోపిక్ చేద్దామని బాలకృష్ణ అన్నారు. పొలిటికల్ విషయాలు తెలుసుకునేందుకు ఆయనే కొందరు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశారు. ఎన్టీఆర్గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక జరిగిన ఘటన లేకుండా చేద్దామని బాలకృష్ణ అన్నారు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో మా కాంబినేషన్లో సినిమా ఆగిపోయింది. అయితే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే మాత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. అందుకే గతంలో ప్రెస్మీట్లో చెప్పినదే మళ్లీ చెబుతున్నా.. ఈ సినిమా బాలకృష్ణకే అంకితం. నా కెరీర్లో చాలా ప్రత్యేకం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అని ఎందుకు అంటున్నానంటే.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన తెలుగు వ్యక్తి ఎన్టీఆర్గారు. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారాయన. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన ఎక్స్ట్రీమ్ ట్రాజెడీని తెరకెక్కించడం డిఫికల్ట్, ఎమోషనల్ టాస్క్. దాన్ని జస్టిస్ చేయడం చాలా పెద్ద బాధ్యత. దాన్ని గుర్తు పెట్టుకునే ఎన్టీఆర్గారి వ్యక్తిత్వానికి ఏమాత్రం అగౌరవం కలగకుండా ఈ సినిమా తీశా. నేను నమ్మిన నిజంతో... ‘వైశ్రాయ్ హాటల్’ సంఘటన జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. 25ఏళ్ల కిందట జరిగిన ఆ ఘటనలో వాస్తవం ఏంటన్నది నాకు తెలియదు. ఆ సంఘటన జరిగినప్పుడు రాజకీయాల్లో ఉండి, ప్రస్తుతం లైమ్లైట్లో లేని దాదాపు 35మందిని కలిసి ఏం జరిగిందన్నది తెలుసుకుని, నేను నిజమని నమ్మిన దాంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తీశా. నా మాటను నమ్మని వాళ్లకు సినిమాటిక్గా అనిపించవచ్చు. ఈ సినిమా చూశాక ‘ఇలా జరగలేదు’ అనుకుంటే వారు నమ్మినదాన్ని సినిమా తీసుకోవచ్చు. నిజం బయటకు వస్తుందని భయం మాఫియా నేపథ్యంలో బాలీవుడ్లో సినిమాలు తీసినా వివాదాలు లేవు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో మాత్రం వివాదాలు రావడానికి కారణం నిజం బయటకు వస్తుందని, ఇంతకు ముందెప్పుడూ తెలియని నిజాలు ఇప్పుడు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయేమోననే భయం. అందుకే సినిమా విడుదల కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అవతలివారి దగ్గరే నిజం ఉంటే, సినిమాని ఆపడానికి ఎందుకు ప్రయత్నించాలి? లక్ష్మీపార్వతిగారు వచ్చాకే... ఈ సినిమాని లక్ష్మీపార్వతిగారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు. ఎన్టీఆర్గారి జీవితంలోకి ఆమె వచ్చినప్పటి నుంచే సినిమా తీశా. ఆమె పైన చాలా అభియోగాలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్గారిలాంటి సూపర్స్టార్కి మామూలు వాళ్లు దగ్గరవలేరు కదా? అంటే ఆమెలో ఏదో ప్రత్యేకం ఉందనేగా? ఈ చిత్రంలో నాదెండ్ల భాస్కరరావుగారి ఎపిసోడ్ ఉండదు. అందుకే కొత్తవారితో... రియలిస్టిక్ క్యారక్టర్లను పెద్దగా ఫేమస్ కానివారు చేసినప్పుడు ఆ పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయని నా నమ్మకం. అందుకే ‘వీరప్పన్, వంగవీటి’ చిత్రాలను కూడా కొత్తవాళ్లతోనే చేశా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో విజయ్కుమార్ చక్కగా ఒదిగిపోయారు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆయన రెండు నెలలు వర్క్షాప్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్గారిని మనం సినిమాల్లోనూ, పొలిటికల్ స్పీచుల్లోనే చూశాం. కానీ, ఆయన లివింగ్ రూమ్లో, బెడ్రూమ్లో వ్యవహరించిన తీరు పట్టుకోవడమంటే ఏ నటుడికైనా ఒక ట్రెమండస్ ఎమోషనల్ డెప్త్ను కేప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆయన చాలా బాగా చేశారు. యజ్ఞాశెట్టి కన్నడ నటి. ఏ పార్టీకీ సపోర్ట్ కాదు ఈ సినిమా వైఎస్సార్కాంగ్రెస్పార్టీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనడం అవాస్తవం. మనం ఏం చెప్పినా అవతలివాళ్లు ఏది నమ్మాలనుకుంటే దాన్నే నమ్ముతారు. నిర్మాత రాకేష్రెడ్డి వైసీపీ అని ముందు నాకు తెలియదు.. తెలిసినా నేను ఏమీ అనేవాడిని కాదు.. అది వేరే విషయం. 25 ఏళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎలా ఉంటుంది? అవి అవాస్తవాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఆపేస్తే రూ. 50 కోట్లు ఇస్తామని నిర్మాతకి ఆఫర్ వచ్చిందనేమాట అవాస్తవం. నేను సినిమా మేకర్ని. కష్టపడి ఓ సినిమా చేసినప్పుడు దాన్ని రిలీజ్ చేయాలనే అనుకుంటా. అంతేకానీ విడుదల చేయకూడదనుకోను. సినిమాను విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్లకు బెదిరింపులు వచ్చాయనడం కూడా తప్పు. అవన్నీ యూట్యూబ్ చానళ్లలో వచ్చిన విషయాలు. ఏది అబద్ధమో? నాకు చంద్రబాబు మూలాన నష్టం జరగలేదు.. వైఎస్ జగన్ వల్ల లాభం కూడా లేదు. అటువంటప్పుడు బాబుగారికి వ్యతిరేకంగా ఈ సినిమా తీయాల్సిన అవసరం ఏముంది?. ఎన్టీఆర్గారి బయోపిక్ గురించి నేను బాలకృష్ణని కలిశాను. కానీ, ఆయన నన్ను కలవలేదంటున్నారంటే.. ఆయన చెప్పింది అబద్ధమై ఉండాలి. లేదంటే నేను చెప్పిందైనా అబద్ధం అయి ఉండాలి. దేన్ని నమ్ముతారో మీ ఇష్టం (నవ్వుతూ). చంద్రబాబుగారే విడుదల చేయిస్తారు ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకరి భావ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు మరొకరికి లేదు. మా సినిమాని ఆపడం 100శాతం ఎవరి వల్లా కాదు. చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రి కనుక లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా మా సినిమాని ఏపీలో ఆయనే విడుదల చేయిస్తారు. నాకు చాలా వ్యసనాలున్నాయి వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీ నాకు వ్యసనం అయిపోయిందనే మాట ఉంది. నాకు ఉన్న చాలా వ్యసనాల్లో ఇది కూడా ఓ వ్యసనమైనా పర్వాలేదు. నా కెరీర్లో 90శాతం ఔట్ ఆఫ్ ద బాక్స్ కాంట్రవర్శీలను తీసుకునే సినిమాలు చేశా. ‘సర్కార్, రక్తచరిత్ర, వంగవీటి’... ఇలా ఏదైనా అలాంటిదే. ‘కథానాయకుడు’ చూశా బాలకృష్ణ ‘కథానాయకుడు’ సినిమా చూశా. అందులో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పడానికి నేనెవరిని? అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా సీన్లను పేర్చారనిపించింది. అది కరెక్ట్ కాదు ఆడియన్స్ ఎక్కువగా నెగటివిటీని ఇష్టపడతారనడం కరెక్ట్ కాదు. సినిమాలో ఫండమెంటల్గా ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది మెయిన్. గాంధీ సినిమా చేస్తున్నామని చెప్పి బ్రిటీష్ని అందులో నుంచి తీసేస్తే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? సినిమా అంటే ఆయన ఎప్పుడు పుట్టారు? ఏ స్కూల్కి వెళ్లారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అన్నది కాదు. బ్రిటీషర్ల రాకతో సినిమా ఆపేస్తే ఎలా ఉంటుంది? ఓటర్లకు అవగాహన ఉంటుంది నాయకులు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చిన విధానంపై ఓటర్లకు ఓ అవగాహన ఉంటుంది. ఆ నమ్మకంతోనే వారికి ఇష్టమైన వ్యక్తికి ఓటు వేస్తారు. వారు బాగా నమ్మిన వ్యక్తి గురించి సడన్గా ఏదో తెలిసి నమ్మకం పోగొట్టుకున్నారనుకోండి.. ఏ మేరకు సాధ్యమవుతుంది? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుందనే విషయం నాకు తెలియదు. ముందుపోటు పొడుస్తా... నేను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు. ఎప్పుడూ ముందుపోటే పొడుస్తా. నేను జ్యోతిష్కుడిని కాదు ఆంధ్రప్రదేశ్కి కొత్త ముఖ్యమంత్రి ఎవరని చెప్పడానికి నేను జ్యోతిష్కుడిని కాదు. కాకపోతే ఎవరు వచ్చినా ఫరక్ పడదు. మార్పు అనేది ప్రాసెస్లో రావాలేగానీ, ఎన్నికలతో జరుగుతుందని అనుకోను. కాకపోతే సీఎంగా ఒక చాయిస్ పవన్ కల్యాణ్, మరో చాయిస్ కేఏ పాల్. పవన్ కల్యాణ్ మంచి అందగాడు. తనొస్తే అందమైన ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు మధ్యలోని సినిమా పేజీల్లో చూసే అతని ఫొటో ముఖ్యమంత్రి అయితే రోజూ మొదటి పేజీలో చూడొచ్చు. కేఏ పాల్ ముఖ్యమంత్రి అయితే ప్రతి రోజూ కామెడీనే. రూ.200 పెట్టి కామెడీ సినిమా చూడాల్సిన అవసరం ప్రజలకు రాదు. ఆయన గతంలో నన్ను ముంబైలో కలిశారు. మనిషి పుట్టి దాదాపు 60వేల ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేఏ పాల్ అంత అబద్ధాలు చెప్పేవారిని నేనెప్పుడూ చూడలేదు. కేసీఆర్ బయోపిక్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్గారి బయోపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నా. ఇందులో వివాదాలేమీ ఉండవు. త్వరలోనే వివరాలు చెబుతా. నేను తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్లో ఒకటి సెప్టెంబరులో విడుదల అవుతుంది. చంద్రబాబుగారే ఓ సినిమా తీసుకోవచ్చు ఎన్టీఆర్గారి వైపు నుంచి చూస్తే వైశ్రాయ్ హోటల్ ఘటనలో 100శాతం కుట్ర దాగి ఉంది. నాదెండ్ల భాస్కరరావుగారు పార్టీ కోసం తప్ప ఎన్టీఆర్గారిని పెద్దగా కలిసింది లేదు. సీబీఎన్ (చంద్రబాబునాయుడు), రక్తసంబంధీకులు, దగ్గరివాళ్లు చేసిన ‘వైశ్రాయ్’ కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనదే నిజమైనప్పుడు బాబుగారే ఒక సినిమా తీసుకోవచ్చు. వార్నింగ్ ఇచ్చారు ఈ సినిమా తీస్తున్న టైమ్లో ‘ఇ లాంటి వ్యవహారాలు నీకెందుకు? సినిమా తీయకపోవడమే మంచిది’ అంటూ నాకు కొందరు సలహాలు ఇచ్చారు. కానీ, నేనెవరి సలహాలు పాటించను (నవ్వుతూ).. సినిమా పూర్తయ్యాక విడుదల ఆపాలంటూ టీవీ డిబేట్లో ఉన్నప్పుడు వార్నింగ్లు ఇచ్చారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మనం లీగల్గా కరెక్ట్గా చేస్తున్నప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ఏదీ కష్టం కాదు. -
సూర్య పూర్తి స్వేచ్ఛనిచ్చారు
సూర్య తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఉరియడి–2 చిత్ర దర్శక, నటుడు విజయ్కుమార్ అంటున్నారు. ఈయన ఇంతకు ముందు ఉరియడి చిత్రాన్ని లోబడ్జెట్లో తెరకెక్కించి మంచి ప్రశంసలను అందుకున్నారు. తాజాగా దానికి సీక్వెల్గా తెరకెక్కిస్తున్న చిత్రమే ఉరియడి–2. ఈ చిత్రం గురించి విజయ్కమార్ తెలుపుతూ ఉరియడి చిత్రంలో చర్చించిన జాతి, మత రాజకీయాలనే ఉరియడి–2లో మరింత బలంగా చెబుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సమాజంలో కుల, మతాలే పెద్ద సమస్యలన్నారు. వాటిని చర్చించేదే ఉరియడి–2 చిత్రం అని చెప్పారు. తనకు కమ్యూనిస్ట్ల భావజాలమో, పుస్తకాలు చదివే అలవాటో లేదన్నారు. తనకు నచ్చింది సినిమా అని అన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా చేయడమే తనలోని ప్రతిభకు తాను ఇచ్చే గౌరవం అని పేర్కొన్నారు. రంగంలోకి దిగి తాను ప్రజలకు చేసిందేమీ లేదని, అయితే వారిని చేరడానికి అనువైన మార్గం సినిమా అని అన్నారు. ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్, ఫర్ అజ్ సినిమా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని లెనిన్ చెప్పారన్నారు. అదేవిధంగా కళల్లో సినిమా ప్రధానం అని ఒక కళాకారుడు అన్నారన్నారు. కాగా తప్పో ఒప్పో తనకు సరైనదనిపించింది సినిమా ద్వారా చెప్పాలనుకున్నాన్నారు. అదే సమయంలో తనలోని కళాకారుడిని అది తృప్తి పరచాలన్నారు. ఉరియడి–2 చిత్రాన్ని నటుడు సూర్య తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకాంపై నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇక రోజు ఆ సంస్థ నిర్వాహకుడు రాజశేఖర్ను కలిసి ఈ చిత్ర కథ గురించి చెప్పానన్నారు.ఆయనకు కథ నచ్చడంతో పూర్తి కథను చెప్పానన్నారు. ఆ తరువాత నటుడు సూర్యకు కథ చెప్పానన్నారు. పూర్తి వెర్షన్ విన్న తరువాత ఆయన కొన్ని సందేహాలను అడిగారని, వాటిని వివరించడంతో బాగుంది కచ్చితంగా చిత్రం చేద్దాం అని అన్నారన్నారు. దీంతో తనకు చాలా నమ్మకం కలిగిందని చెప్పారు. కారణం ఉరియడి చిత్ర నిర్మాణం సమయంలో ఆర్థిక సమస్యల కంటే మానసికంగా చాలా బాధింపునకు గురైయ్యానని అన్నారు. అలాంటిది ఉరియడి–2 చిత్రానికి సూర్య లాంటి నిర్మాత లభించడం చాలా మనశ్శాంతిగా ఉందన్నారు. ఆయన తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, ఎలాంటి ఒత్తిడి లేకుండా చిత్రాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు విజయ్కుమార్ తెలిపారు. దీనికి గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తుండగా, ఉరియడి చిత్ర యూనిట్నే ఈ చిత్రానికి పని చేస్తోందని చెప్పారు. -
ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లోని పాఠశాలల కు ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను అమలు చేయాలని ఆర్జేడీలు, డీఈవోలను పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్కుమార్ ఆదేశించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మ«ధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు అందించాలని స్పష్టం చేశారు. అలాగే హైస్కూళ్లకు ఆప్షనల్ హాలిడేస్ అమలు చేయాలని పేర్కొన్నారు. ఒంటిపూట బడులను పాఠశాలలకు చివరి పనిదినం అయిన ఏప్రిల్ 12 వరకు కొనసాగించాలని, ఆ తరువాత వేసవి సెలవులు వర్తిస్తాయని వివరించారు. దీంతో తిరిగి పాఠశాలలు జూన్ 1న ప్రారంభం కానున్నాయి. -
మూసిన తలుపులు
ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించాడు. అదొక పడకగది. అందులోని సామాన్లన్నీ పొందికగానే ఉన్నాయి. గది మధ్యలోని మంచంపై ఇంటి యజమాని చలపతిరావు వెల్లకిలా పడుకుని ఉన్నాడు. కాని ఆయన నిద్రపోవడం లేదు. శాశ్వత నిద్రలో ఉన్నాడు. చలపతిరావుకి డెబ్బయ్యేళ్లు ఉంటాయి. నగరంలో ఆయనకు రెండు రెడీమేడ్ బట్టల షాపులు ఉన్నాయి. నగర శివార్లలో ఉన్న ఈ ఇల్లు ఆయన స్వార్జితం.చలపతిరావు భార్య రెండేళ్ల కిందటే క్యాన్సర్తో చనిపోయింది. భార్య పోయాక ఆయన తన రెండు షాపుల్నీ ఇద్దరు కొడుకులకు అప్పగించి, తాను ఇంటికే పరిమితమయ్యాడు. పెద్దకొడుకు రాజేష్కి ఐదేళ్ల కిందట పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్కి తాగుడు అలవాటు ఉంది. ఇదే విషయమై తండ్రీ కొడుకుల మధ్య నెల్లాళ్ల కిందట పెద్ద గొడవే జరిగింది. రాజేష్ తండ్రి మీద అలిగి, ఇల్లు వదిలేసి భార్యాపిల్లలతో అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. చిన్నకొడుకు రమేష్కి ఇంకా పెళ్లి కాలేదు. ప్రస్తుతం తండ్రికి తోడుగా అతనొక్కడే ఉన్నాడు. ఆ రోజు ఉదయం ఏడుగంటలకు చలపతిరావు ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి, చలపతిరావు అనుమానాస్పద స్థితిలో మరణించాడని చెప్పడంతో ఇన్స్పెక్టర్ విజయ్ సిబ్బందితో సహా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.మృతదేహాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తుండగా, ఓ మూల కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తున్న రమేష్ని ఇన్స్పెక్టర్ విజయ్ పలకరించాడు. ఏం జరిగిందో చెప్పమన్నాడు. ‘‘సార్! నిన్న రాత్రి పనిమనిషి వంట చేసి వెళ్లిపోయాక నేను, నాన్నగారు భోజనాలు చేశాం. నాన్నగారు పది గంటలకల్లా తన గదిలోకి వెళ్లి పడుకున్నారు. నేనొక అరగంట టీవీ చూసి నా గదిలోకి వెళ్లి పడుకున్నాను. తెల్లవారాక పనిమనిషి వచ్చి కాలింగ్ బెల్ కొడితే నేను లేచి వెళ్లి తలుపు తెరిచాను. నిజానికి రోజూ నాన్నగారే తలుపు తెరిచేవారు. ఆయన ఎందుకు లేవలేదో చూడ్డానికి నేను ఆయన గదిలోకి వెళ్లాను. నాన్నగారిని ఎంత లేపినా లేవలేదు. నేను ఆందోళన చెంది మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయన వచ్చి పరీక్షించి, నాన్నగారు పోయారన్నారు. తర్వాత ఆయనే ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచారు. ’’ అన్నాడు రమేష్.అక్కడే ఉన్న డాక్టర్, పనిమనిషి రమేష్ మాటల్ని సమర్థించారు. ‘‘మృతుని శరీరం కొద్దిగా రంగు మారింది. ఆయనపై విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానంతో నేను మీకు ఫోన్ చేశాను’’ అన్నాడు డాక్టర్. విజయ్కి ఒక విషయం అర్థం కాలేదు. ఇంటి ముఖద్వారానికీ, పెరటి వాకిలికీ లోపలి నుంచి గొళ్లెం వేసి ఉంది. అలాంటప్పుడు హంతకుడు ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? హత్య చేసి బయటకు ఎలా వెళ్లాడు? అసలిది హత్య కాదేమో! చలపతిరావు గుండెపోటు వల్ల మరణించి ఉంటాడేమో అనుకున్నాడు. తండ్రి మరణవార్త తెలియగానే చలపతిరావు పెద్దకొడుకు రాజేష్ తన భార్యతో కలసి అక్కడకు వచ్చాడు. తండ్రి శవం పక్కన కూర్చుని భోరున ఏడవసాగాడు. తర్వాత తమ్ముడు రమేష్ని చూడగానే కోపంగా లేచాడు. ‘‘ఈ దుర్మార్గుడే నా తండ్రిని చంపాడు. వీడు నా సొంత తమ్ముడు కాదు. వీడొక అనాథ. నాన్నగారు జాలిపడి వీణ్ణి దత్తత తీసుకున్నారు. పెంచిన తండ్రినే పొట్టన పెట్టుకున్నాడు. వీణ్ణి ప్రాణాలతో వదలను’’ అంటూ రాజేష్ రమేష్ని కొట్టబోయాడు. పోలీసులు జోక్యం చేసుకుని రాజేష్ని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఫోరెన్సిక్ నిపుణులు శవాన్ని పరీక్షించడం ముగించి, విషప్రయోగం వల్ల చలపతిరావు మరణించాడని ధ్రువీకరించారు. ఇన్స్పెక్టర్ విజయ్ ఇల్లంతా గాలించాడు. స్టోర్రూమ్లో ఒక క్లోరోఫాం బాటిల్తో పాటు దూది, విషం సీసా, వాడిన సిరంజీ దొరికాయి. హత్య ఎలా జరిగిందో విజయ్కి బోధపడింది. హంతకుడెవరో అర్థమైంది. వెంటనే రమేష్ని అదుపులోకి తీసుకున్నాడు.∙∙ పోస్ట్మార్టం రిపోర్టులో హత్య రాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది. ముందుగా క్లోరోఫాంతో స్పృహ తప్పించి, తర్వాత సిరంజ్తో విషాన్ని ఇంజెక్ట్ చెయ్యడం వల్ల మరణం సంభవించింది. సంఘటనా స్థలంతో పాటు ఇంట్లోని మిగతా చోట్ల చలపతిరావు, రమేష్, పనిమనిషి వేలిముద్రలు తప్ప ఇంకెవరి వేలిముద్రలూ లభించలేదు. మరోపక్క ఇన్స్పెక్టర్ విజయ్ ఇన్వెస్టిగేషన్లో రమేష్ నిజంగానే చలపతిరావు దత్తపుత్రుడని తెలిసింది. ఒకప్పుడు రమేష్ తల్లిదండ్రులు చలపతిరావు ఇంట్లో పనిచేసేవారు. రమేష్ చిన్నతనంలో వారిద్దరూ కరెంట్ షాక్ వల్ల మరణించారు. అనాథగా మిగిలిన రమేష్ని చలపతిరావు దత్తత తీసుకున్నాడు. తన సొంత కొడుకు రాజేష్తో సమానంగా రమేష్ని చదివించాడు. తన భార్య పోయాక తనకు ఉన్న ఆస్తుల్ని ఇద్దరికీ చెరిసగం చెందేట్లు వీలునామా రాశాడు. ఇన్స్పెక్టర్ విజయ్ రమేష్పై ఎంత బలప్రయోగం చేసినా అతడు నేరాన్ని అంగీకరించలేదు. ‘‘నాలాంటి అనాథకి జీవితాన్ని ప్రసాదించిన దేవుడులాంటి మనిషిని నేనెందుకు చంపుతాను సార్! పైగా హత్య చేశాక అంత నిర్లక్ష్యంగా ఆధారాలు వదులుతానా?’’ అని వాదించాడు. విజయ్కి రమేష్ మాటల్లో నిజాయతీ కనిపించింది. ఎక్కడో పొరపాటు జరిగింది. మరోసారి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఏదైనా క్లూ దొరకొచ్చు అనుకుని మళ్లీ చలపతిరావు ఇంటికి వెళ్లాడు. ఇల్లంతా పరిశీలించాక పెరటి వాకిలి దగ్గరకొచ్చాడు. ఆ వాకిలి పక్కన ఒక పెద్ద కిటికీ ఉంది. పెరట్లోకి వెళ్లి ఆ కిటికీని పరిశీలించాడు. కిటికీకి ఉన్న చెక్కల ఫ్రేమ్ మధ్య మెటల్ గ్రిల్ బిగించి ఉంది. ఆ గ్రిల్కి నాలుగు మూలల్లో నాలుగు బోల్టులు ఉన్నాయి. విజయ్ కానిస్టేబుల్ చేత స్పానర్ తెప్పించి ఆ బోల్టుల్ని విప్పించాడు. బోల్టులు విప్పగానే గ్రిల్ మొత్తం కిటికీ ఫ్రేమ్ నుంచి వేరయిపోయింది. ఇప్పుడా ఫ్రేమ్ మధ్యలోంచి ఒక మనిషి సునాయాసంగా లోపలికి దూరవచ్చు. హంతకుడు ఇంట్లోకి ఎలా దూరాడో విజయ్కి ఇప్పుడు బోధపడింది. హంతకుడు ఎవరో కూడా తెలిసిపోయింది. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే రాజేష్ని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. దెబ్బలకు తాళలేక రాజేష్ నిజం కక్కేశాడు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి రమేష్ అంటే ద్వేషం. వాడు పెంపుడు కొడుకు అయినా నాన్న వాణ్ణి నాతో సమానంగా ప్రేమించేవాడు. చివరికి తన ఆస్తిపాస్తుల్లో సగం వాడికి చెందేలా వీలునామా రాశాడు. దాంతో నాకు రమేష్ని చంపాలన్నంత కోపం వచ్చింది. రమేష్ని చంపితే ఆస్తి మొత్తం నాకే వచ్చేస్తుంది. కానీ వాణ్ణి చంపితే పోలీసులు ముందు నన్నే అనుమానిస్తారు. అందుకే నాన్నని చంపేసి ఆ నేరం రమేష్ మీదపడేలా పథకం పన్నాను. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు రమేష్ హత్యానేరంపై జైలుకెళితే నా పగ చల్లారుతుంది. ఆస్తి మొత్తం నాకే వచ్చేస్తుంది. అందుకే పథకం ప్రకారం విషప్రయోగంతో నాన్నని చంపేశాను. నిజానికి మా ఇంటి వెనుక కిటికీ గ్రిల్ని నేను చాలా కాలం కిందటే బోల్టులతో విప్పడానికి అనువుగా మార్పించాను. నేను తాగి ఆలస్యంగా ఇంటికెళ్లినప్పుడు నాన్న నన్ను చెడామడా తిట్టేవాడు. ఆ బాధ పడలేక ఆ కిటికీని అలా మార్పించి, రాత్రిళ్లు రహస్యంగా కిటికీ తెరిచి, ఇంట్లోకి వచ్చేవాణ్ణి. ఈ రహస్యం నా భార్యకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆ రోజు రాత్రి ఆ కిటికీలోంచే ఇంట్లోకెళ్లి క్లోరోఫాంతో నాన్నకు స్పృహ తప్పించి, ఆయనకు విషాన్ని ఇంజెక్ట్ చేశాను. తర్వాత విషం సీసా, సిరంజిని స్టోర్రూమ్లో ఉంచి, వచ్చిన దారిలోనే వెళ్లిపోయాను. నా చేతులకు గ్లౌజ్ ఉండటం వల్ల ఎక్కడా నా వేలిముద్రలు పడలేదు. మూసిన తలుపుల వెనుక జరిగిన ఈ హత్యా రహస్యాన్ని పోలీసులు ఎన్నటికీ ఛేదించలేరనుకున్నాను. కానీ మీరు ఆ రహస్యం తెలుసుకున్నారు’’ నిరాశగా అన్నాడు రాజేష్? -
స్నేహితున్ని చంపి.. పూలతొట్టెలో పాతి..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రెండేళ్ల మిస్టరీ వీడింది. అనుమానమే పెనుభూతమై స్నేహాన్ని అంతం చేసింది. బంధువని కూడా చూడకుండా ఓ వ్యక్తిని చంపేసింది. మెదక్కు చెందిన జయప్రకాశ్(27), విజయ్కుమార్(30) సమీపబంధువులు, స్నేహితులు. బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి ఓ అద్దె ఇంట్లో నివసించారు. అపార్థంతో జయప్రకాశ్పై కక్షకట్టిన విజయ్ మూడేళ్ల క్రితం అతడిని అంతం చేశాడు. మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి హైదరాబాద్కు పారిపోయి వచ్చాడు. యాదృచ్ఛికంగా జయప్రకాశ్ అస్థిపంజరం బయటపడటంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం విజయ్ను హైదరాబాద్లో అరెస్టు చేసి తీసుకువెళ్లారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లి... జయప్రకాశ్, విజయ్కుమార్ విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగాన్వేషణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే 2015లో ఢిల్లీకి వలసవెళ్లి దాబ్రీ ప్రాంతంలో ఉన్న చాణక్యప్లేస్లో విక్రమ్సింగ్ అనే వ్యక్తికి చెందిన అపార్ట్మెంట్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అనేక ప్రయత్నాల తర్వాత ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు పొందారు. విజయ్ తన ప్రేయసికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు జయప్రకాశ్కు చెప్తుండేవాడు. అనేకసార్లు జయప్రకాశ్ ఆమెతో ఫోన్ ద్వారా, నేరుగా మాట్లాడాడు. దీంతో జయప్రకాశ్పై విజయ్ అనుమానం పెంచుకున్నాడు. తన ప్రేయసితో సన్నిహితంగా ఉంటూ దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని భావించి జయప్రకాశ్ను అంతం చేయడానికి పథకం వేశాడు. మరమ్మతుల నేపథ్యంలో వెలుగులోకి... జయప్రకాశ్, విజయ్లు నివసించిన తర్వాత ఆ గదిలో మరికొందరు అద్దెకు ఉండి వెళ్లారు. అధ్వానంగా మారడంతో గత ఏడాది అక్టోబర్ 8న ఆ గదికి యజమాని మరమ్మతులు చేపట్టారు. అందులో భాగంగా పూలకుండీల తొట్టెను కూలీలు తొలగిస్తుండగా ఓ అíస్థిపంజరం బయటపడింది. యజమాని ఇచ్చిన సమాచారం మేరకు అక్కడి పోలీసులు గత ఏడాది అక్టోబర్ 9న హత్య కేసు నమోదైంది. అస్థిపంజరం నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించిన పోలీసులు మెదక్ నుంచి జయప్రకాశ్ కుటుంబీకుల్ని రప్పించి నమూనాలు తీసుకున్నారు. ఒకటేనంటూ నివేదిక రావడంతో... డీఎన్ఏ నమూనాలనూ విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ అస్థిపంజరం జయప్రకాశ్దేనంటూ ఇటీవల నిర్ధారించారు. దీంతో ఈ కేసులో విజయ్ను ప్రధాన అనుమానితుడిగా చేర్చిన ఢిల్లీ పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలించారు. హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి, వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. విచారణ నేపథ్యంలో హత్యకు కారణాలను బయటపెట్టాడు. చంపేసిన తర్వాత తానే ఉద్దేశపూర్వకంగా జయప్రకాశ్ సెల్ఫోన్ను ధ్వంసం చేసి పారేశానని, ఆపైనా పదేపదే అతడి సెల్ఫోన్కు కాల్స్ చేయడం, ఎస్సెమ్మెస్లు పెట్టానని చెప్పాడు. వాటికి స్పందించట్లేదంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశానని వెల్లడించాడు. ఫ్యాన్ మోటార్తో కొట్టి హత్య... అదను కోసం ఎదురు చూసిన విజయ్ 2016 ఫిబ్రవరి 12న తన పథకాన్ని అమలు చేశాడు. ఉద్దేశపూర్వకంగా జయప్రకాశ్తో వాగ్వాదానికి దిగి తమ గదిలో ఉన్న ఫ్యాన్ మోటారు భాగంతో తలపై మోది హత్య చేశాడు. మూడో అంతస్తు బాల్కనీలో ఓ తొట్టె లాంటిది నిర్మించి శవాన్ని అందులో పూడ్చేశాడు. అదేరోజు స్థానిక పోలీసుస్టేషన్కు వెళ్లి జయప్రకాశ్ అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేశాడు. ఇంటి యజమానికీ ఇదే విషయం చెప్పిన విజయ్ కొన్నిరోజులకు ఢిల్లీ వదిలి హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.