billionaire
-
'కృతజ్ఞత' అంటే ఇదే కదా..!
మనం ఎవరి వల్ల అయినా సాయం పొందితే దాన్ని తిరిగి చెల్లించగలిగే స్థాయి చేరుకున్నాక గుర్తుపెట్టుకుని తిరిగి ఇవ్వాలంటారు పెద్దలు. అయితే అందరూ ఇలా గుర్తించుకుని కృజ్ఞతను చాటుకోరు. కొందరూ మాత్రం అంతకు మించి అన్నట్లుగా దాతృత్వ కార్యక్రమాలతో ఆశ్చర్యపరుస్తారు. పొందిన సాయం అణువంతా అయినా ఆకాశంతా స్థాయిలో కృతజ్ఞత చూపి గుండెల్లో నిలిచిపోతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఈ చైనాకు చెందిన మాజీ సీఈవో.చైనా(China) ఈ-కామర్స్ దిగ్గజం జేడీ డాట్ కామ్(e-commerce giant JD.com) వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో(former CEO ) బిలియనీర్(billionaire ) రిచార్డ్ లియు క్వియాంగ్డాంగ్(Richard Liu Qiangdong) చైనా నూతన ఏడాది ప్రారంభానికి ముందు తన స్వస్థలంలోని నివాసితులకు లక్షల్లో ఖరీదు చేసే బహుమతులను అందించి వార్తల్లో నిలిచారు. 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి గ్రామస్తుడికి సుమారు లక్ష రూపాయలకు పైనే విలువ చేసే నగదుని బహుమతిగా అందజేశారు. దీంతోపాటు ప్రతి ఇంటికి ఆహారం, బట్టలు, గృహోపకరణాలను అందజేశారు. అతను ఇలా 2016 నుంచి దాతృత్వ కార్యక్రమాలను చేస్తూ కృతజ్ఞతను చాటుకుంటున్నాడు. ఆ గ్రామమే ఎందుకంటే..గ్వింగ్మింగ్ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబంలో జన్మించాడు రిచార్డ్. 1990ల సమయంలో చైనా రెన్మిన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం బీజింగ్ వెళ్లేందుకు తగిన డబ్బు లేక ఇబ్బంది పడ్డాడు. అప్పుడు గ్రామస్తులంతా సమావేశమై అతని ట్యూషన్ ఫీజులకు నిధులు సమకూర్చారు. దీంతో అతడు ఉన్నత చదువులను చదువుకోగలిగాడు. ఆ గ్రామస్తులంతా కలిసి క్వియాంగ్డాంగ్కి ఆనాడు ఇచ్చిన మొత్తం సుమారుగా రూ. 5 వేలు. కానీ ఆ చిన్న మొత్తం ఆ రోజు ఇచ్చేందుకు వారంతా ముందుకురాకపోయి ఉంటే ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదంటాండు మాజీ సీఈవో రిచార్డ్. అది గుర్తించుకునే ఆ గ్రామానికి ఇలా ప్రతి ఏటా విలువైన నగదు, గృహపకరణాల రూపంలో సాయం అందిస్తుంటారు. ఈ దాతృత్వ సేవను కొనసాగించేందుకు తన బృందాన్ని ఆగ్రామంలోకి పంపించి గ్రామస్తుల గృహ రిజిస్ట్రీ, గుర్తింపు పత్రాలను సేకరించి వారు ఆ గ్రామానికి చెందిన వారని నిర్థారించుకుని రిచార్డ్ సాయం అందేలా మార్గం సుగమం చేస్తారు. అలాగే ఆ గ్రామస్తులు కూడా అతడి దాతృత్వాన్ని మర్చిపోలేమని, మా పట్ల అతడు చూపించే దయ అపారమైందంటూ రిచార్డ్పై ప్రశంసలజల్లు కురిపించారు. అతడు ఈ సేవలను భవిష్యత్తులో కొనసాగించకపోయినా కూడా..అతడు ఇప్పటి వరకు చేసిన సాయాన్ని, కృజ్ఞతను మర్చిపోమని భావోద్వేగంగా చెబుతున్నారు గ్రామస్తులు. (చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
తల్లి బాటలో కూతురు.. వేలకోట్లకు వారసురాలు!
భారతదేశంలో అత్యంత సంపన్నులైన వ్యాపారవేత్తల జాబితాలో 'లీనా తివారీ' ఒకరు. బహుశా ఈ పేరు కొంతమందికి పరిచయమే అయినా.. ఈమె కుమార్తె 'అనీషా గాంధీ తివారీ' (Aneesha Gandhi Tewari) గురించి బహుశా తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆమె గురించి తెలుసుకుందాం.అనీషా గాంధీ బ్రౌన్ యూనివర్శిటీ నుంచి బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి మాలిక్యులర్ బయాలజీలో పీహెచ్డీ(PhD) పట్టా పొందారు. చదువు పూర్తయిన తరువాత అనీషా యూఎస్వీ బోర్డ్కు డైరెక్టర్లలో ఒకరుగా చేరారు.యూఎస్వీ (USV) అనేది పార్మాస్యుటికల్ కంపెనీ. దీనిని లీనా తివారీ తన తండ్రి 'విఠల్ గాంధీ' 1961లో రెవ్లాన్ సహకారంతో ప్రారంభించారు. ఇది లీనా సారథ్యంలో గణనీయమైన వృద్ధి సాధించింది. నేడు, ఈ కంపెనీ కార్డియోవాస్కులర్, డయాబెటిక్ ఔషధాల విభాగంలో భారతదేశంలోని మొదటి ఐదు సంస్థలలో ఒకటిగా నిలిచింది.లీనా తివారీముంబై యూనివర్సిటిలో గ్రాడ్యుయేట్, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన 'లీనా తివారీ' USV ఇండియాకు నాయకత్వం వహిస్తున్నారు. ఈమె రూ. 11వేలకోట్ల కంటే ఎక్కువ నికర విలువతో.. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరుగా నిలిచారు. ఈమె అనేక దాతృత్వ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ఇందులో భాగంగానే వెనుకబడిన మహిళలకు సాధికారత కల్పించే విద్యా కార్యక్రమాలపై దృష్టి సారించారు. -
మస్క్ మంచి మనసు.. భారీ విరాళం
ప్రపంచ కుబేరుడు, టెస్లా చీప్ ఎగ్జిక్యూటివ్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. కొత్త ఏడాది ప్రారంభం కావడానికి ముందే భారీ విరాళం అందించినట్లు సమాచారం.టెస్లా బాస్ ఇటీవల వివిధ ఛారిటీలకు 2,68,000 టెస్లా షేర్ల (Tesla Shares)ను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ 108 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 926 కోట్ల కంటే ఎక్కువ). టెస్లాలో దాదాపు 12.8 శాతం వాటా కలిగిన మస్క్.. తన షేర్లను దానం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 నుంచి భారీ మొత్తంలో విరాళాలను అందిస్తూనే ఉన్నారు.వందల కోట్లు విరాళంగా ఇచ్చిన 'మస్క్' మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే మస్క్ ఏ ఛారిటీలకు విరాళం ఇచ్చారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2021లో కూడా ఈయన మస్క్ ఫౌండేషన్ (Musk Foundation)కు సుమారు 5.74 బిలియన్ డాలర్ల విరాళం అందించారు.పలు ఛారిటీలకు లెక్కకు మించిన డబ్బు విరాళంగా ఇవ్వడమే కాకుండా.. మానవాళికి ప్రయోజనం చేకూరేలా, దానికి తగిన కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడానికి కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.మస్క్ సంపదబ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. -
ప్రియురాలితో బెజోస్ పెళ్లి.. ఖర్చు అన్ని వేలకొట్లా?
అమెజాన్ ఫౌండర్, ప్రపంచ ధనవంతులలో రెండో వ్యక్తి 'జెఫ్ బెజోస్' మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రేయసి 'లారెన్ శాంచెజ్'ను త్వరలోనే పెళ్లిచేసుకోనున్నారు. ఈ పెళ్ళికి ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న ఆస్పెన్లో లారెన్ శాంచెజ్ను వివాహం చేసుకోనున్నారు. కాగా 2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో ఈమెకు బెజోస్ సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో జరగనున్న వీరి పెళ్ళికి.. పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.2018 నుంచి బెజోస్, లారెన్ డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయం 2019లో నిజమని తెలిసింది. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన 55 ఏళ్ల లారెన్ అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంది. 60 ఏళ్ల జెఫ్ బెజోస్ తన భార్య 'మెకంజీ స్కాట్'కు 2019లోని విడాకులు ఇచ్చారు. అప్పటికే వీరిద్దరికి నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల తరువాత బెజోస్, లారెన్ బంధం బయటపడింది. లారెన్కు కూడా గతంలో పెళ్లైంది. ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇల్లు ఇంద్రభవనం.. కుబేరుడిలాంటి భర్త: ఎవరీ ఫ్యాషన్ ఐకాన్?జెఫ్ బెజోస్ నికర విలువప్రపంచ కుబేరుడైన ఇలాన్ మస్క్ తరువాత, రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ నికర విలువ 244 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. దీని విలువ భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువ. -
'జెఫ్ బెజోస్' జీతం ఇంతేనా..
ప్రపంచంలోని కుబేరుల జాబితాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే 241 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడైన ఈయన జీతం ఎంత ఉంటుందనేది బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.జెఫ్ బెజోస్ సంపద భారీగా ఉన్నప్పటికీ.. కంపెనీలో అతని వార్షిక వేతనం 80000 డాలర్లు (సుమారు రూ.67 లక్షలు) మాత్రమే అని సమాచారం. 1998 నుంచి కూడా అతని బేసిక్ శాలరీలో ఎలాంటి మార్పు లేదని తెలిసింది.నేను సంస్థ వ్యవస్థాపకుడిని, కాబట్టి ఇప్పటికే కంపెనీలో పెద్ద వాటా కలిగి ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎక్కువ జీతం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని నిర్ణయించుకున్నాను, అందుకే తక్కువ జీతం తీసుకుంటున్నా అని బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.కంపెనీలోని వాటాల ద్వారానే మిలియన్ల సంపాదిస్తున్నారు. 2023 - 24 మధ్య.. సంవత్సరంలో గంటకు 8 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. కంపెనీ సీఈఓగా వైదొలగిన తరువాత.. బెజోస్ తన అమెజాన్ స్టాక్లోని చాలా భాగాన్ని క్రమంగా విక్రయించారు. 2025 చివరి నాటికి 25 మిలియన్ షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ నుంచి వచ్చిన ఒక నివేదిక ద్వారా తెలిసింది.కంపెనీ నుంచే తనకు భారీ లాభాలు వస్తున్న సమయంలో.. తనకు సంస్థ నుంచి అదనపు ప్రోత్సాహకాలు అవసరం లేదని, అలాంటివి అందకుండా చూడాలని అమెజాన్ కమిటీని కోరినట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కువ జీతం తీసుకుంటే.. అసౌకర్యంగా ఉంటుందని బెజోస్ వివరించారు.ఇదీ చదవండి: గుకేశ్ ప్రైజ్మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?నిజానికి బిలియనీర్లు తక్కువ జీతం తీసుకుంటే.. తక్కువ పన్నులు చెల్లించాలి. ప్రోపబ్లిక 2021 నివేదిక ప్రకారం, బెజోస్ 2007, 2011లో ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లించలేదు. ఎందుకంటే ఈయన తన జీతం కంటే ఎక్కువ నష్టాలను చూపించారు. కాబట్టి ఆ సంవత్సరాల్లో భారీ ట్యాక్స్ చెల్లించకుండానే బయటపడ్డారు. -
వెలుగులోకి రాని వేల కోట్ల వ్యాపారాధిపతి.. ఎవరీ బిలియనీర్?
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లోకి వచ్చే వ్యాపారవేత్తలు భారత్లో అనేక మంది ఉన్నారు. అయితే సంబంధిత వ్యాపార రంగాలలో ప్రముఖంగా ఉన్నప్పటికీ లో ప్రొఫైల్లో ఉండడానికి ప్రయత్నించేవారూ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi). బాలీవుడ్ నటిని వివాహం చేసుకున్నప్పటికీ, ప్రజల దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు.ఎవరీ వికాస్ ఒబెరాయ్?వికాస్ ఒబెరాయ్.. ఒబెరాయ్ రియాల్టీకి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆయన తండ్రి రణవీర్ ఒబెరాయ్ ఈ రియల్-ఎస్టేట్ కంపెనీని స్థాపించారు. ఇది వికాస్ నాయకత్వంలో దేశంలోని అగ్రశ్రేణి రియల్-ఎస్టేట్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఆతిథ్యం, రిటైల్, కార్పొరేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్తో సహా విభిన్న రంగాలలోకి ప్రవేశించింది.ముంబైలో హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లు, వాణిజ్య స్థలాలనెన్నో అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రధాన పేరుగా మారింది. ఒబెరాయ్ రియాల్టీకి అధిపతి మాత్రమే కాకుండా వికాస్ ఒబెరాయ్ ముంబైలోని ఫైవ్ స్టార్ వెస్టిన్ హోటల్ను కూడా కలిగి ఉన్నారు. ప్రస్తుతం నగరంలోని మొదటి రిట్జ్-కార్ల్టన్ హోటల్తోపాటు విలాసవంతమైన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నారు.వికాస్ ఒబెరాయ్ నేపథ్యంముంబైలో పుట్టి పెరిగిన వికాస్ ఒబెరాయ్ నగరంలోని జై హింద్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తరువాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఓనర్/ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను పూర్తి చేశారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, వివేక్ శిక్షణ పొందిన పైలట్ కూడా. ఆయనకు పైలట్ లైసెన్స్ కూడా ఉంది.ప్రముఖ బాలివుడ్ నటి గాయత్రీ జోషిని వికాస్ ఒబెరాయ్ వివాహం చేసుకున్నారు. మోడల్ నుండి నటిగా మారిన ఆమె షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రంలో గీత పాత్రను పోషించారు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట అప్పటి నుండి అందరి దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి విహాన్ ఒబెరాయ్, యువన్ ఒబెరాయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గతేడాది అక్టోబర్లో వీరు ఇటలీలోని సార్డినియాలో విహారయాత్ర చేస్తుండగా కారు ప్రమాదంలో చిక్కుకుని అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు.చదవండి: అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ జీతం ఇంతేనా?వికాస్ ఒబెరాయ్ నెట్వర్త్ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోని అత్యంత ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలలో ఒకరైన వికాస్ ఒబెరాయ్ నెట్వర్త్ 6.5 బిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు). -
బ్యాంకులో ఉద్యోగం.. రోజూ ఒకటే సూట్: మస్క్ తల్లి ట్వీట్
'ఇలాన్ మస్క్' (Elon Musk).. ఈ పేరుకు పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఈయన దిగ్గజ కంపెనీల సారధిగా మాత్రమే కాదు.. ప్రపంచ కుబేరుడు కూడా. ఇటీవలే మస్క్ 400 బిలియన్ డాలర్లను దాటేసి.. సంపదలో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. నేడు లక్షల కోట్ల సంపదకు అధినేత అయిన మస్క్ ఒకప్పుడు కేవలం ఓ సూట్ మాత్రమే కలిగి ఉండేవారని 'మాయే మస్క్' పేర్కొన్నారు.కొడుకు 400 బిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరిన సందర్భంగా మస్క్ తల్లి మాయే మస్క్.. తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఒకప్పుడు తాము ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను గురించి ప్రస్తావించారు. 1990లో మస్క్ బ్యాంకులో ఉద్యోగం చేసే సమయంలో రోజూ ఒకే సూట్ ధరించేవాడు. ఎందుకంటే అప్పట్లో నేను రెండో సూట్ కొనే స్తోమతలో లేదని మాయే మస్క్ పేర్కొన్నారు. ఆ సూట్ ధర 99 డాలర్లు. ఆ సూట్లో మస్క్ తీసుకున్న ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.నా పిల్లల చిన్న తనంలో కొత్త బట్టలు కొనివ్వడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు, అందుకే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనిచ్చేదాన్ని అని.. మాయే మస్క్ వెల్లడించారు. తినడానికి ఆహారం లేని సమయంలో.. కేవలం బ్రేడ్ మాత్రమే పెట్టాను. దాన్నే వారు ఇష్టంగా తినేవారు. అయితే తన తెలివితో నేడు ప్రపంచ కుబేరుడుగా ఎదిగాడు. మస్క్ను ధనవంతుడు అనడం కంటే.. మేధావి అంటే చాలా సంతోషిస్తాను అని ఆమె పేర్కొన్నారు.మాయె మస్క్ తన భర్త ఎర్రోల్ మస్క్ (Errol Musk) నుంచి విడాకులు తీసుకున్న తరువాత ముగ్గురు పిల్లలను చాలా కష్టపడి పెంచినట్లు వెల్లడించారు. ఎన్నో సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటూ.. ముగ్గురు పిల్లలను గొప్పవారిగా తీర్చిదిద్దారు. మస్క్ ఫ్యామిలీ మొదట సౌత్ ఆఫ్రికా నుంచి కెనడాకు వెళ్ళింది. ఆ తరువాత అమెరికాలో స్థిరపడింది.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!400 బిలియన్ డాలర్లు దాటేసిన మస్క్బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం. అంతే కాకుండా టెస్లా షేర్లు బుధవారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇది మస్క్ ఆర్థిక స్థితిని మరింత పెంచింది.This photo was taken in our rent-controlled apartment in Toronto, with my mom‘s painting on the wall. The suit cost $99 which included a free shirt, tie and socks. A great bargain! He wore this suit every day to his bank job in Toronto. I couldn’t afford a second suit. We were… https://t.co/jh2SHOXwpe— Maye Musk (@mayemusk) December 12, 2024 -
నేటి సిద్ధార్థుడు!
రాబిన్ శర్మ బెస్ట్ సెల్లర్ ‘ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’నవలలో కథా నాయకుడు జూలియన్ మాంటిల్ తిరుగులేని క్రిమినల్ లాయర్. తృప్తిలేని తన జీవన విధానంతో విసిగి అపారమైన ఆస్తులన్నింటినీ అమ్మేసి తనను తాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. మలేషియాకు చెందిన వెన్ అజాన్ సిరిపన్నోదీ అలాంటి కథే. ఏకంగా 500 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదులుకుని మరీ బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. ఆయన తండ్రి ఆనంద కృష్ణన్ అలియాస్ ఏకే మలేషియాలో మూడో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి రూ.42,000 కోట్ల పైమాటే. టెలికాం, శాటిలైట్స్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం ఆయనది. అలాంటి ఏకేకు సిరిపన్నో ఏకైక కుమారుడు. అంతటి ఆస్తినీ వద్దనుకుని బుద్ధం శరణం గచ్ఛామి అన్నాడు. బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. బౌద్ధాన్ని నమ్మే తండ్రి కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని గౌరవించడం విశేషం. ఇదంతా జరిగి 20 ఏళ్లయింది. నాటినుంచీ సిరిపన్నో దాదాపుగా అడవుల్లోనే గడుపుతున్నారు. థాయ్లాండ్–మయన్మార్ సరిహద్దులో తావో దమ్ బౌద్ధారామంలో అబాట్ (ప్రధాన సన్యాసి)గా ఉన్నారు. పూర్తిగా భిక్ష మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడో ఓసారి తండ్రిని చూడటానికి వచ్చిపోతుంటారు. మార్చింది ఆ ప్రయాణమే సిరిపన్నో జీవితంలోనే భిన్న సంస్కృతులున్నాయి. ఆయన తల్లి మోమ్వాజరోంగ్సే సుప్రిందా చక్రబన్ థాయ్ రాజ కుటుంబీకురాలు. ఆయన తన ఇద్దరు సోదరీమణులతో కలిసి లండన్లో పెరిగారు. అక్కడే చదువు పూర్తి చేశారు. ఇంగ్లిష్తో పాటు ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగలరు. 18 ఏళ్ల వయసులో తల్లితో కలిసి థాయ్లాండ్ వెళ్లారు. సరదాగా ఓ బౌద్ధారామానికి రిట్రీట్కు వెళ్లారు. అక్కడే ఆయనను బౌద్ధం ఆకర్షించింది. అది బలపడి, చూస్తుండగానే జీవన విధానంగా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంబానీ వారసుల గురించేనా?.. ఇలాంటి వారి గురించి కూడా తెలియాలి
ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ఓ వ్యక్తి చేసే ప్రయాణం కథాంశంగా రాబిన్ శర్మ రాసిన పుస్తకం The Monk Who Sold His Ferrari ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అదే చరిత్రలో.. గౌతమ బుద్ధుడు ఇలా రాజభోగాలను వదిలేసి సన్యాసం తీసుకున్నాడని చదువుకున్నాం. కానీ.. నిజ జీవితంలో ఇలా కోట్ల సంపదను వదిలేసి సన్యాసి జీవితం గడుపుతారా?. అయితే.. ఈ మోడ్రన్ డే సిద్ధార్థుడి కథ చదవాల్సిందే. శ్రీలంక- తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్. మలేషియాలో బిలియనీర్. ఆ దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఆయన ఒక్కగానొక్క కొడుకే పైన ఫొటోలో ఉన్న వెన్ అజన్ సరిపన్యో.👉మలేషియాలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న తండ్రిని.. ఆయనకున్న టెల్కాం, శాటిలైట్స్, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాదనుకున్నారు అజన్ సరిపన్యో. ఒకానొక టైంలో సీఎస్కే టీంకు స్పాన్సర్ చేసిన ఎయిర్సెల్ కంపెనీకి ఓనర్ ఈయన తండ్రే.👉రెండు పదుల వయసొచ్చేదాకా రిచ్చెస్ట్ పర్సన్ కొడుకుగానే తన ఇద్దరు సోదరీమణులతో లండన్లో పెరిగాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలపై అనర్గళంగా పట్టు సాధించారు. ఇక్కడ మరో విషయం.. ఈయన తల్లి మామ్వాజారోగీస్ సుప్రిందా చక్రబన్ థాయ్లాండ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తే. అయితే ఈ మూలాలే అతని జీవితాన్ని మార్చిపడేసింది.👉తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు థాయ్లాండ్ వెళ్లాడు అజన్ సరిపన్యో. వెళ్లేముందు ఆ ట్రిప్ సరదాగా సాగుతుందని భావించాడు. కానీ, అది అతని జీవితంలో ఊహించని మార్పు తెచ్చింది. అక్కడ ఆధ్యాత్మికత అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదే తన జీవిత పరమార్థం అనుకుని.. భోగభాగ్యాలను వదులుకుని సన్యాసం పుచ్చేసుకున్నాడతను.👉గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్ అవన్నీ వదులుకుని సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. వేల కోట్ల సంపదలో ఈ ఆనందం దొరకదంటాడాయన. మయన్మార్-థాయ్లాండ్ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ ఓ మఠాధిపతిగా ఉంటూనే.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ అభినవ బుద్ధుడు.👉తన ఆస్తులన్నీ అజన్ సరిపన్యోకు అప్పగించాలనుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుని భావించాడు ఆనంద్ కృష్ణన్. కానీ, అజన్ మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు. ఆ నిర్ణయం బాధించేదే అయినా అజన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆ తండ్రి గౌరవించాడు. 👉తండ్రి బాటలో అడుగులు వేసి వ్యాపారరంగంలో రాణిస్తున్న అంబానీ వారసుల గురించే కాదు.. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్న అజన్ గురించి కూడా ఈ ప్రపంచానికి తెలియాల్సిందే కదా. -
దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్.. ఎట్టకేలకు మరో ఖరీదైన 'బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్' కొనుగోలు చేశారు. దీని ధర రూ.9 కోట్లు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న ఈ బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్ కారును చాలా తక్కువ మంచి మాత్రమే కొనుగోలు చేశారు. ఈ జాబితాలో నటుడు రణబీర్ కపూర్ ఉన్నారు. ఇది 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఈ కారులోని 6 లీటర్ డబ్ల్యు 12 ఇంజిన్ 650 Bhp పవర్, 900 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ కారులో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: జస్ట్ నిద్రపోయాడంతేగా.. ఉద్యోగిని తీసేసిన కంపెనీకి రూ.41 లక్షల ఫైన్దీపిందర్ గోయల్ గ్యారేజిలో ఇప్పటికే రూ. 6 కోట్ల విలువైన బెంట్లీ కారును కలిగి ఉన్నారు. ఇది కాకుండా.. ఆస్టన్ మార్టిన్ డీబీ12, ఫెరారీ రోమా, పోర్స్చే 911 టర్బో ఎస్, పోర్స్చే 911 కారెరా ఎస్, లంబోర్ఘిని ఉరుస్, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్ వంటి కార్లు గోయల్ గ్యారేజిలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
ఐరన్ మ్యాన్ డ్రెస్లో మస్క్: ఫోటో వైరల్
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఒక ఫోటో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇందులో మస్క్ ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్నట్లు చూడవచ్చు.ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న మస్క్ ఫోటో షేర్ చేస్తూ.. శత్రువులను ఓడించడానికి అని పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఓహ్ మిమ్మల్ని మీరు జోకర్ అని పిలుచుకుంటున్నారా?.. అయితే జోక్ ఎందుకు జోక్ చెప్పడం లేదు.. ఇదెంత హాస్యాస్పదం అని కూడా అన్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మస్క్ని తదుపరి ఐరన్ మ్యాన్గా ఊహించారు. మరికొందరు ఐరనీ మ్యాన్: మీమ్ వార్ త్వరలో థియేటర్లలోకి రానుంది అని కామెంట్ చేశారు. ఇంకొకరు కామెంట్ చేస్తూ నువ్వెప్పుడూ ఒక్క జోక్ కూడా చెప్పలేదు అని అన్నారు.అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తరువాత.. మస్క్ సంపద భారీగా పెరిగింది. టెస్లా స్టాక్ కూడా ఏకంగా 40 శాతం పెరిగిందని, దీంతో ఆయన సంపద 70 బిలియన్ డాలర్లు పెరిగి.. మొత్తం మీద 340 బిలియన్ డాలర్లు దాటినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో కూడా మస్క్ షేర్ మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.I will use the power of irony to defeat villains!“Oh you call yourself “The Joker”, then why can’t you tell a joke! How ironic …” pic.twitter.com/6HZ1sLkBAj— Elon Musk (@elonmusk) November 24, 2024 -
మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..
కొందరు మన కళ్లముందే బిలియనీర్ సీఈవోలుగా అత్యున్నతస్థాయికి ఎదుగుతుంటారు. ఆ క్రమంలో వాళ్లు ఎంతో కష్టపడటమే గాక ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. అయినా కూడా ఫ్యామిలీని, వృత్తిపర జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. రెండింటికీ పూర్తి న్యాయం చేసి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలానే చేశారు ఈ బిలియనీర్ సీఈవో. అతడు విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలదొక్కుకునేందుకు ఎంతలా కష్టపడ్డాడో వింటే ఆశ్చర్యపోతారు. మరి దాంతోపాటు కుటుంబ జీవితాన్ని కూడా విజయవంతంగా ఎలా బ్యాలెన్స్ చేశాడంటే..రైజింగ్ కేన్స్ చికెన్ ఫింగర్స్ సహ-వ్యవస్థాపకుడు టాడ్ గ్రేవ్స్ బిలియనీర్ సీఈవో. అతను దాదాపు 800 రెస్టారెంట్లు నిర్వహిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు. అయితే తాను ప్రారంభదశలో వారానికి 90 గంటలకు పైగా పనిచేసి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆనందాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు 52 ఏళ్ల గ్రేవ్స్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రోజూ 12 నుంచి 16 గంటల వరకు కష్టపడేవాడినని అన్నారు. అయితే వృత్తిపరమైన జీవితం తోపాటు కుటుంబ ఆనందాన్ని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుని అందుకోసం సమయం కేటాయించేలా తన విధులను సెట్ చేసుకునే వాడినని అన్నారు. అలా తన వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితాన్ని పూర్తి న్యాయం చేసేలా బ్యాలెన్స్ చేసికోగలిగానని అన్నారు సీఈవో గ్రేవ్స్. అన్ని గంటలు పనిచేస్తూ కూడా ఇదెలా సాధ్యమయ్యిందో కూడా వివరించారు గ్రేవ్స్. తనకు గనుక ఆఫీస్లో పనిభారం ఎక్కువగా ఉంటే..తన భార్య పిల్లలను ఆపీసుకి తీసుకువచ్చి తనతో గడిపేలా ప్లాన్ చేస్తుందట. అలాగే తాను కూడా సెలవు రోజుల్లో పొద్దున్నే 4.30 గంటల కల్లా నిద్రలేచి పిల్లలతోనూ, తన తల్లిదండ్రులతోనూ గడిపేలా ప్లాన్ చేసుకునేవాడట. అలా తన కుటుంబ సభ్యులకు ప్రేమానుబంధాలను పంచుతూ వారిని సంతోషంగా ఉండేలా చేయడమే గాక మంచి వ్యాపారవేత్తగా రాణించేలా పాటుపడటంలో రాజీకి తావివ్వకుండా ఆహర్నిశలు శ్రమించానని చెప్పుకొచ్చాడు గ్రేవ్స్. ఓ బిజినెస్మ్యాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసేలా అత్యున్నత స్థాయికి చేరాలంటే అంకితభావంతో పనిచేయాలి సమయంతో సంబంధం లేకుండా కష్టపడాలని అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో 1996 ఆ టైంలో కాలిఫోర్నియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో వారానికి తొంభై గంటలకు పైగా పనిచేశానని, అలాగే లూసియానాలోని బాటన్ రూజ్లో చికెన్ ఫింగర్ రెస్టారెంట్ల నెట్వర్క్ను ప్రారంభించేందుకు అలస్కాలో సాల్మన్ చేపలు పట్టేవాడినని అన్నారు. అంతలా కష్టపడి దాదాపు 800 చికెన్ ఫిగర్ రెస్టారెంట్లు నిర్వహించే స్థాయికి చేరుకున్నాడు గ్రేవ్స్. వాటి ద్వారా ఏడాదికి ఏకంగా రూ. 500 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. అంతేగాదు అతడు ఉద్యోగులును నియమించుకునేటప్పడూ అతడిలో ఉన్న నిబద్ధత, కష్టపడేతత్వం ఎంతమేర ఉన్నాయో గమనించి నియమించుకుంటాడట. ఇక్కడ గ్రేవ్స్ వృత్తిని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడమే గాక మంచి సక్సెస్ని అందుకున్నాడు. మాటిమాటికి టైం లేదు అని చెప్పేవాళ్లకు ఈ బిలియనీర్ సీఈవో జీవితమే ఓ ఉదాహరణ కదూ..!. (చదవండి: వీల్ఛైర్తో విల్ పవర్కి అసలైన అర్థం ఇచ్చాడు!) -
రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..
భారతదేశంలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మాదిరిగానే.. పాకిస్థాన్లో అత్యంత సంపన్నుడు 'షాహిద్ ఖాన్' (Shahid Khan). బహుశా ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ జాక్సన్విల్లే జాగ్వార్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో ఫుల్హామ్ ఎఫ్సీ వంటి వాటిని సొంతం చేసుకుని బాగా ఫేమస్ అయ్యారు. ఈయన కుమారుడు టోనీ ఖాన్, కుమార్తె షన్నా ఖాన్. కొడుకు తండ్రి బాటలో నడుస్తుంటే.. కుమార్తె మాత్రం దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.షన్నా ఖాన్ (Shanna Khan) అమెరికాలోని ఇల్లినాయిస్లో.. సోదరుడు టోనీతో కలిసి పెరిగింది. ఈమె ప్రత్యేకమైన ప్యాకేజింగ్ డిజైన్ ఆర్గనైజేషన్ 'యునైటెడ్ మార్కెటింగ్ కంపెనీ'ని కూడా నిర్వహిస్తోంది. అటు వ్యాపారం, ఇటు సామజిక సేవ రెండింటిలోనూ తన నిబద్ధతను చాటుకుంటోంది.షన్నా ఖాన్.. జాగ్వార్స్ ఫౌండేషన్ ద్వారా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంటుంది. ఈమె తన కుటుంబంతో కలిసి గత ఏడాది యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ వెటర్నరీ టీచింగ్ హాస్పిటల్కు ఏకంగా రూ.123 కోట్లు విరాళంగా అందించింది. ఇది యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.పక్కన వాళ్లకు రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచించే వ్యక్తులున్న ఈ రోజుల్లో ఏకంగా రూ. 123కోట్లు దానం చేశారంటే.. వారి ఉదారత అనన్య సామాన్యం. దీన్ని బట్టి చూస్తే వారి దాతృత్వం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది.ఇదీ చదవండి: 300 అప్లికేషన్స్.. 500 ఈమెయిల్స్: కట్ చేస్తే టెస్లాలో జాబ్షన్నా ఖాన్.. వోల్ఫ్ పాయింట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'జస్టిన్ మెక్కేబ్'ను వివాహం చేసుకుంది. ఈమె ఆస్తుల విలువ 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఈమె షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ లక్ష కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. షన్నా ఖాన్ నికర విలువ, విరాళాలు మొత్తం కలిపినా అంబానీ ఫ్యామిలీ అంత ఉండకపోయినా.. ఉదారంగా విరాళాలు అందించడంలో వీరికి వీరే సాటి. -
కళ్లు చెదిరే ఈ భవనం కొనగలరా?
అమెరికన్ వ్యాపారవేత్త డార్విన్ డీసన్కు చెందిన లా జోల్లా ఎస్టేట్ 'ది శాండ్కాజిల్' రికార్డ్ ధరకు అమ్మకానికి వచ్చింది. 108 మిలియన్ డాలర్లు (సుమారు రూ.907 కోట్లు)కు లిస్టయింది. ఇది శాన్ డియాగో కౌంటీ రియల్ ఎస్టేట్కు రికార్డ్-బ్రేకింగ్ ధర.లిస్టింగ్లో పెట్టిన ధరకు అమ్ముడుపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో డెల్ మార్ ఓషన్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన బిలియనీర్ ఎగాన్ డర్బన్ పేరిట ఉన్న 44 మిలియన్ డాలర్ల ప్రస్తుత రికార్డును ఇది అధిగమిస్తుంది. అఫ్లియేటెడ్ కంప్యూటర్ సర్వీసెస్ (తర్వాత జిరాక్స్ సంస్థకు విక్రయించారు) స్థాపకుడు డార్విన్ డీసన్ 2009లో ఈ ఎస్టేట్ను, దాని పక్కనున్న స్థలాన్ని 26 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. తర్వాత దాని నిర్మాణం కోసం 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ ప్రైవేట్ ఎలివేటెడ్ బీచ్ను కలిగి ఉంది. అలనాటి ఐరోపా శైలిలో బంగారు పరదాలు, పాలరాతి ఫ్లోర్లు, ఆకృతులతో ఇంటీరియర్ను తీర్చిదిద్దారు. హాలీవుడ్ ప్రముఖులు, రాజ కుటుంబాల ఇళ్లకు డిజైన్ చేసిన ప్రఖ్యాత డిజైనర్ తిమోతీ కొరిగాన్ ఈ భవనానికి ఇంటీరియర్లను రూపొందించారు.ఇందులోని ఫర్నిచర్ ఫ్రెంచ్ సొగసుతో ఆకట్టుకుంటుంది. 16 మంది కూర్చునేందుకు వీలుగా రాజసమైన డైనింగ్ రూం, నాటికల్ నేపథ్యంతో తీర్చిదిద్దిన బార్ ఇందులో ఉన్నాయి. ఇక భవనం లోగిలిలో ఒక పూల్, ఫిట్నెస్ సెంటర్, చైనా స్లేట్ రూఫ్ టైల్స్తో కూడిన బీచ్ ఫ్రంట్ బోట్హౌస్ ఉన్నాయి. అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ సిగ్నేచర్ వైట్ షేడ్ లాంటి లుక్ కోసం 40 వేల డాలర్లతో దిగుమతి చేసుకున్న ఇసుక ఈ భవనానికి వినిగియోగించారు. ఇంత విలాసవంతంగా భవనం నిర్మించుకున్నప్పటికీ దీన్ని పెద్దగా ఉపయోగించలేదని డీసన్ చెబుతున్నారు. -
మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..
సొంతిల్లు కొనడం మంచిదా? అద్దె ఇంట్లోనే ఉండటం మంచిదా? అంటే.. ఇప్పటి వరకు అద్దె ఇల్లే బెస్ట్ అని బిలియనీర్ & జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను సొంత ఇల్లు కొనుగోలు చేశాను అంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామత్ వెల్లడించారు.డబ్ల్యుటీఎఫ్ ఈజ్ విత్ నిఖిల్ కామత్.. లేటెస్ట్ ఎపిసోడ్లో కామత్, ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ ఇర్ఫాన్ రజాక్, బ్రిగేడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరూపా శంకర్, వీవర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ అద్దె ఇల్లు vs కొనుగోలు చేసిన ఇల్లు అంశం మీద చర్చ మొదలు పెట్టారు.అద్దె ఇల్లు అన్ని విధాలుగా బాగానే ఉన్నపటికీ.. ఒక సమస్య ఉంది. అద్దె ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామనేది ఖచ్చితంగా తెలియదు. ఎక్కువకాలం అద్దె ఇంట్లోనే ఉండాలనుకుంటే కుదరదు. నేను అద్దె ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేశానని నిఖిల్ కామత్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనేను ఒకే ఇంట్లో చాలా కాలం ఉండటానికి ఇష్టపడతాను. అయితే రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్ అని, అది తనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. బంగారం మీద నాకు ఆసక్తి ఉంది. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో అమ్మకాలు, కొనుగోలు కొంత కష్టమని అన్నారు. అంతే కాకుండా స్టాంప్ డ్యూటీ చెల్లించడం మీద కూడా నిఖిల్ కామత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయడం, అద్దెకు ఇవ్వడంలో ఎవరూ ఎక్కువ డబ్బు సంపాదించలేరని ఆయన అన్నారు. దీనికంటే స్టాక్ మార్కెట్ చాలా ఉత్తమమని పేర్కొన్నారు. -
కుమార్తె కోసం నెయిల్ ఆర్టిస్ట్గా జుకర్బర్గ్ - వీడియో
కూతుళ్ళ కోసం తండ్రులు ఎంత దూరమైనా వెళ్తారు. కోతి కావాలంటే కొండ మీదకు ట్రెకింగ్ చేస్తారు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కోసం ఆకాశమెత్తు చెట్టునైనా సునాయాసంగా ఎక్కేస్తారు. జుకర్బర్గ్ కూడా అంతే! ఆయనెంత టెక్నాలజీ కింగ్ అయినా కూతురి దగ్గర ఒక మామూలు తండ్రే. మానవాళి కలలకు రంగులు అద్దటానికి ప్రపంచం నిరంతరం అప్డేట్లతో పరుగులు తీస్తుండే మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' కూతురి గోళ్లకు రంగు వేయడం కోసం ఎలా కుదురుగా కూర్చున్నారో చూడండి. మొత్తానికి టాస్క్ ఫినిష్ చేసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.జుకర్బర్గ్ టేబుల్పైకి వంగి, తన కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేసి నెయిల్ ఆర్టిస్ట్ అయ్యారు. చిన్నారి తన నెయిల్ ఆర్ట్ని ప్రదర్శించడంతో క్లిప్ ముగుస్తుంది. నెటిజన్లు ఈ వీడియో చూసి తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఇప్పటికే 20వేల కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ వీడియో 6,25,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. తన కుమార్తె కోసం సీఈఓ నుంచి స్టైలిస్ట్గా మారారని ఒకరు కామెంట్ చేశారు. ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని ఇంకొకరు చమత్కరించారు.క్వెస్ట్ 3ఎస్కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేయడానికంటే ముందు జుకర్బర్గ్ 'క్వెస్ట్ 3ఎస్'లో మల్టిపుల్ స్క్రీన్స్ చూసారు. క్వెస్ట్ 3ఎస్ అనేది వర్చువల్ రియాలిటీ హెడ్సెట్. దీనిని మెటా 2024 సెప్టెంబర్ 25న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రారంభించింది. దీని ధర రూ. 25,210 నుంచి రూ. 33,610 వరకు ఉంది.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!మెటా క్వెస్ట్ 3ఎస్ హెడ్సెట్.. సినిమా సైజ్ స్క్రీన్పై మీకు ఇష్టమైన షోలను చూడటానికి మాత్రమే కాకుండా, మీరు ఎక్కడికెళ్లినా మీతో పాటు తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గేమ్స్ వంటివి ఆడటానికి కూడా అనుమతిస్తుంది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
మిడిల్ క్లాస్ అబ్బాయి.. నేడు బిలియనీర్ కుర్రాడు
అత్యంత పోటీ ఉండే వ్యాపార రంగంలో కొంతమంది సంచలనంగా దూసుకొస్తారు. అలాంటివారిలో ఒకరే పెరల్ కపూర్. ఎన్నో ఏళ్లు వ్యాపారంలో తలలు పండితేగానీ రాని గుర్తింపు, ఘనతలు ఈయన చిన్న వయసులోనే సొంతం చేసుకున్నారు. 27 ఏళ్ల వయసుకే బిలియన్ డాలర్ల సంపదను ఆర్జించారు. పెరల్ కపూర్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్గా నిలిచారు.ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన బిజినెస్మెన్లలో ఒకరైన పెరల్ కపూర్కు అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అలాగే బ్లాక్చెయిన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీలో అగ్రగామి సంస్థ అయిన జైబర్ 365 గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్గా ఉన్నారు. మరిన్ని వ్యాపారాలు స్థాపించే యోచనలో ఉన్న పెరల్ కపూర్ ప్రస్తుత నెట్వర్త్ 1.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 9,243 కోట్లు.మధ్యతరగతి కుటుంబం నుంచి..పెరల్ కపూర్ ప్రయాణం అంత సునాయాసంగా సాగలేదు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కపూర్ ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే కసితో ఉండేవాడు. కంప్యూటర్ సైన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో రాణించిన పెరల్కు చిన్ననాటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఉండేది. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత కపూర్ ప్రతిష్టాత్మకమైన క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్లో సీటు సాధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఎంఎస్ఈ చేశారు. లండన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా తన వృత్తిని ప్రారంభించి బ్లాక్చెయిన్ ఎడ్యుకేషన్, సైబర్సెక్యూరిటీలో సంచలనాత్మక వెంచర్ను స్థాపించారు.ఇంటర్న్షిప్లతో ప్రారంభంపెరల్ కపూర్ కెరియర్ దేశ, విదేశాలలోని ప్రముఖ టెక్ సంస్థలలో ఇంటర్న్షిప్లతో చాలా సాంప్రదాయ మార్గంలో ప్రారంభమైంది. లండన్లోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలోనూ ఆయన ఇంటర్న్షిప్లు చేశారు. అయినప్పటికీ ఆయనలో ఉన్న వ్యవస్థాపక స్ఫూర్తి అనతికాలంలోనే బయటపడింది. 2019లో లండన్లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 2023 మేలో జైబర్ (Zyber) 365 గ్రూప్ని స్థాపించి సాహసోపేతమైన అడుగు వేశారు.జైబర్ 365 గ్రూప్ వెంచర్ క్యాపిటల్ ప్రపంచం దృష్టిని తక్కువ రోజుల్లోనే ఆకర్షించింది. పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకువచ్చారు. ప్రీ రెవెన్యూ నిధుల సేకరణలో జైబర్ 365 గ్రూప్ విశేషమైన ప్రయాణం టెక్ పరిశ్రమలో ఒక కొత్త ఉదాహరణను నెలకొల్పింది. కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతున్న ట్రెండ్ను ప్రతిబింబిస్తుంది. ఉత్పత్తులు ఇంకా మార్కెట్కు సిద్ధంగా లేకపోయినా వినూత్న ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు.నిరాడంబర జీవనశైలి పెరల్ కపూర్ ప్రస్తుతం మొనాకోలో నివసిస్తున్నారు. ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యే పెరల్ విలాసవంతమైన జీవితానికి కాస్త దూరంగానే ఉంటారు. అంత సంపద ఉన్నప్పటికీ నిరాడంబరమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. కొత్త వ్యాపార వెంచర్లతో కొత్త ఆలోచనలను తీసుకురావడానికి తన టీమ్తో కలిసి పని చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతారు. చదవడం, ప్రయాణించడంతోపాటు కొత్త సాంకేతిక పోకడలను అన్వేషించడాన్ని ఆనందిస్తారు. బుగట్టి సెంటోడీసి, కోయినిగ్సెగ్ వంటి సూపర్ కార్లంటే ఆయనకు ఇష్టం. సంగీతం వినడం, క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడటాన్ని కూడా ఇష్టపడతారు. -
200 బిలియన్ డాలర్ల క్లబ్లోకి...!
సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్మీడియాలతోపాటు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి. – వాషింగ్టన్ -
ఇటలీ ప్రధానితో డేటింగ్? స్పందించిన మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇటీవల వీరు ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇద్దరు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో నెట్టింట్లో రూమర్లు గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వీరు డేట్కు వెళ్తారని అనుకుంటున్నారా?’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో మస్క్ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. తమ మధ్య డేటింగ్ జరగడం లేదంటూ ఆయన పోస్టు చేశారు.Do you think They’ll date? 🤣 pic.twitter.com/XXs1U45kjb— Tesla Owners Silicon Valley (@teslaownersSV) September 24, 2024కాగా మంగళవారం న్యూయార్క్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో.. అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ మెలోనీకి అందజేశారు. మస్క్ ఆమెకు పురస్కారాన్ని అందజేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటలీ ప్రధానికి అవార్డును అందజేయడం గర్వంగా భావిస్తున్నట్లు మస్క్ అన్నారు. కనిపించే అందం కన్నా..ఆమె మనసు మరింత అందమైందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకుల గురించి కొన్ని పదాలను ఎప్పుడూ చెప్పలేం. కానీ, మెలోనీ అలా కాదని, ఆమె నిజాయతీ గల విశ్వసనీయమైన వ్యక్తిగా ప్రశంసించారు. -
సల్మాన్ చేతికి ఖరీదైన రూ.42 కోట్ల వాచ్..
-
Jared Isaacman: మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్వాక్
కేప్ కెనావెరాల్: ప్రైవేట్ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్లి, స్పేస్వాక్ చేసిన మొట్టమొదటి నాన్–ప్రొఫెషనల్ వ్యోమగామిగా బిలియనీర్, టెక్నాలజీ వ్యాపారవేత్త జేర్డ్ ఐజాక్మాన్(41) రికార్డు సృష్టించారు. గురువారం భూమి నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల ఎగువన ‘డ్రాగన్’ స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వచి్చ, దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించారు. అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించారు. పరిపూర్ణమైన ప్రపంచాన్ని కళ్లారా దర్శించానని ఆయన పేర్కొన్నారు. ఐజాక్మాన్ తర్వాత స్పేస్ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిస్ స్పేస్వాక్ చేశారు. అనంతరం మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. స్పేస్ఎక్స్ తలపెట్టిన ‘పోలారిస్ డాన్’ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్–9 రాకెట్ ద్వారా మంగళవారం ఐజాక్మాన్ సహా మొత్తం నలుగురు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరారు. గురువారం తమ లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన స్పేస్వాక్ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ వ్యాపారాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎలాన్ మస్క్తోపాటు ఐజాక్మాన్ భారీగా∙పెట్టుబడి పెట్టారు. ఆయన పెట్టుబడి ఎంత అనేది బహిర్గతం చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్ అంతరిక్ష యాత్రలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వైకల్యాన్ని జయించి.. బిలియనీర్గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీ
అనుకున్నది సాధించాలనే అకుంఠిత దీక్ష, పట్టుదల అవసరం. ''సక్సెస్''.. వినటానికి చిన్న పదమే అయినా సాధించాలంటే సంవత్సరాలు పడుతుందని ఎంతోమంది నిజ జీవితంలో నిరూపించి చూపించారు. అయితే విజయం సాధించాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'లీ థియామ్ వా' (Lee Thiam Wah). ఇంతకీ ఈయనెవరు? ఈయన సాధించిన సక్సెస్ ఏంటనేది ఇక్కడ చూసేద్దాం..మలేసియాకు చెందిన 'లీ థియామ్ వా' 99 స్పీడ్ మార్ట్ వ్యవస్థాపకులు, యజమాని. నిజానికి ఈయనకు చిన్నతనంలోనే పోలియో వ్యాధి కారణంగా రెండు కాళ్ళూ చచ్చుబడిపోయాయి. తల్లిదండ్రుల ఆర్ధిక స్తోమత అంతంత మాత్రంగా ఉండటం చేత.. లీను ఆరేళ్ళు మాత్రమే పాఠశాలలో చదివించగలిగారు. ఆ తరువాత లీ చదువుకోలేకపోయారు.చిన్నతనం నుంచే ఏదో ఒకటి సాధించాలానే తపనతో లీ థియామ్ వా.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని రోడ్డు పక్కన ఓ చిన్న దుకాణం స్టార్ట్ చేశారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఓ కిరాణా దుకాణం ప్రారంభించడానికి కావాల్సిన డబ్బు పొదుపు చేసారు. ఆ తరువాత అనుకున్న విధంగానే కిరాణా దుకాణం మొదలుపెట్టారు. అదే అనతి కాలంలో '99 స్పీడ్ మార్ట్'గా అవతరించింది. ఎంతో శ్రమించి ఈ స్టోర్లను మలేషియా మొత్తం విస్తరించగలిగారు.వైకల్యం కారణంగా నాకు ఎవరూ పని ఇవ్వరు, నాకు నేనే సహాయం చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన లీ ప్రయాణం నేడు ధనవంతుణ్ణి చేసింది. విజయం సాధించాలంటే అంగవైకల్యం అడ్డుకాదని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన లీ.. ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.60 ఏళ్ల లీకు చెందిన 99 స్పీడ్ మార్ట్ రిటైల్ హోల్డింగ్స్ బీహెచ్డీ, కౌలాలంపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో అరంగేట్రం చేసింది. ఏడు సంవత్సరాలలో ఇదే ఏకంగా 531 మిలియన్ డాలర్లను సేకరించింది. ఐపీవో స్టాక్ మొదటిరోజే 15 శాతం పెరగడంతో లీ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈయన మలేషియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరుగా నిలిచారు.ఇదీ చదవండి: ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు.. అదీ చేతకాకపోతే పాకుతూ పో, అంతేకానీ ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు అన్న మహాకవి శ్రీ శ్రీ మాటలు నిజం చేసి ఎంతోమందికి ఆదర్శనంగా నిలిచిన వ్యక్తులలో మలేసియా కుబేరుడు 'లీ థియామ్ వా' ఒకరు. ఈయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. -
అయోధ్యకు అందిన విరాళాల మొత్తం ఎంతంటే?
అయోధ్యలో రామాలయ నిర్మాణపనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనుల్లో మొదటిదశ పూర్తయ్యింది. 2024 జనవరి 22న బాల రాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు భక్తులు ప్రతిరోజూ విరాళాలు అందజేస్తున్నారు.రామ్లల్లా ఆలయానికి భూమి పూజ 2020, ఆగస్టు 5న జరిగింది. అప్పటి నుండి రామభక్తులు ఆలయ నిర్మాణానికి రూ. 55 వేలకోట్లకు పైగా నిధులను విరాళాల రూపంలో అందజేశారు. 2021లో నిర్వహించిన ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్లో రామమందిర్ ట్రస్ట్ దాదాపు రూ. 3500 కోట్ల విరాళాలను అందుకుంది. గడచిన 10 నెలల్లో రామాలయ నిర్మాణానికి విదేశాల్లో ఉంటున్న రామ భక్తులు సుమారు 11 కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు.రామమందిర్ ట్రస్ట్ 2021లో 42 రోజుల పాటు ఆలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ట్రస్టు 10 వేల రసీదులను ముద్రించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి 3,500 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి. 2024 జనవరి 22న రామాలయంతో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అప్పటి నుంచి రామ భక్తులు ప్రతిరోజూ భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు కోట్ల మందికి పైగా రామ భక్తులు ఆలయాన్ని సందర్శించారు. వీరు విరాళాలతో పాటు బంగారు, వెండి కానుకలను కూడా అందజేస్తున్నారు.శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ క్యాంపు కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం రామభక్తులు ఇప్పటి వరకు ఐదువేల కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు. విదేశాలలో ఉంటున్న రామభక్తులు కూడా ఉత్సాహంగా విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రామమందిర్ ట్రస్ట్ విదేశాల నుంచి వచ్చిన విరాళాల మొత్తాన్ని లెక్కించింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి దాదాపు 11 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. -
ముంబైలో 'యోహాన్ పూనావాలా' కొత్త ఇల్లు: ఎన్ని కోట్లో తెలుసా?
బిలియనీర్, ప్రముఖ పారిశ్రామికవేత్త యోహాన్ పూనావాలా, అతని భార్య మిచెల్ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ. 500 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వెచ్చించి ఓ ఇల్లు కొనుగోలు చేశారు. ఈ ఖరీదైన భవనం విస్తీర్ణం 30,000 చదరపు అడుగులు. ఈ విశాలమైన.. విలాసవంతమైన భవనం ఇటీవలి కాలంలో అత్యంత ఖరీదైన నివాసాలలో ఒకటి. దీనిని 'పూనావాలా మాన్షన్' అని పేరు పెట్టారు.యోహాన్ పూనావాలా.. పూనావాలా ఇంజినీరింగ్ గ్రూప్ ఛైర్మన్. ఈయన తండ్రి జవరాయ్ పూనావల్లా.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కో ఫౌండర్. కాబట్టి యోహాన్ వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. యోహన్ భార్య మిచెల్ పూనావల్ల ఇంజనీరింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్.రూ.500 కోట్లతో కొనుగోలు చేసిన కొత్త భవనం విశాలమైన లేఅవుట్స్, విశాలమైన డాబాలను కలిగి ఉంది. ఇందులో కొంత భాగాన్ని పూనావాలా ప్రైవేట్ ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. ఇందులో మిచెల్ ఆయిల్ పెయింటింగ్లు, ఇతర విలువైన మొక్కలు ఉంటాయి.ముంబైలో ఆస్తులను కలిగి ఉన్న ప్రముఖులుదక్షిణ ముంబైలో సెలబ్రిటీలు ఎక్కువగా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఉన్నారు. విరాట్ కోహ్లీ వర్లీ 'ఓంకార్ 1973' ప్రాజెక్ట్లో 34 కోట్ల విలాసవంతమైన అపార్ట్మెంట్ను, రోహిత్ శర్మ వర్లీలోని అహుజా టవర్స్లో రూ 30 కోట్ల ఆస్తిని & యువరాజ్ సింగ్ అదే పరిసరాల్లో రూ.64 కోట్ల ఆస్తిని కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: ఫలించిన ఆలోచన.. 150 రోజుల్లో రూ.268 కోట్లు - ఎవరీ 'రాహుల్ రాయ్'?క్రికెటర్లు మాత్రమే కాకుండా సినీ నిర్మాత, డైరెక్టర్ 'దినేష్ విజన్' కూడా ముంబైలోని 9,000 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. సుహానా ఖాన్ అలీబాగ్లోని 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని, అలియా భట్ ప్రొడక్షన్ హౌస్ బాంద్రాలోని 2,497 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. -
ముకేశ్ అంబానీ ఫ్రెండ్.. 'ఆనంద్ జైన్' గురించి తెలుసా?
అంబానీ రిలయన్స్ కంపెనీ ఎదగటానికి కారకులైన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి 'మనోజ్ మోడీ'. ఈయన మాత్రమే కాకుండా సంస్థ ఎదుగుదలకు పాటుపడిన వ్యక్తి, ముకేశ్ అంబానీ స్నేహితుడు ఒకరు ఉన్నారు. ఆయనే 'ఆనంద్ జైన్'. ధీరూభాయ్ అంబానీ మూడవ కొడుకుగా పిలువబడే ఆనంద్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.1975లో జన్మించిన ఆనంద్ జైన్.. జై కార్ప్ లిమిటెడ్ ఛైర్మన్గా ఉన్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఈయనను అందరూ ముద్దుగా ఏజే అని పిలుచుకుంటారు. ఆనంద్ జైన్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో విడదీయరాని అనుబంధం ఉంది. వీరిరువురు చిన్నపాటి ఫ్రెండ్స్ కావడం గమనార్హం. ముంబైలోని హిల్ గ్రాంజ్ హైస్కూల్లో వీరు కలిసి చదువుకున్నారు.నిజానికి ఆనంద్ జైన్ ఒకప్పటి బిలినీయర్. 2007లో ఈయన 4 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో 11వ సంపన్న భారతీయుడిగా ఉన్నారు. 2023 మార్చి నాటికి జైన్ ఆదాయం రూ. 600.7 కోట్లు. ఈయన కంపెనీ సుమారు 13 ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆర్జిస్తోంది.ఇదీ చదవండి: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?జైన్ ముఖేష్ అంబానీకి వ్యూహాత్మక సలహాదారుగా.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో, ప్రధాన క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అతను ముంబై పోర్ట్ ట్రస్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టీల బోర్డులో కూడా పనిచేశారు.ఆనంద్ జైన్ ముంబై యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ఈయన భార్య సుష్మ. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫారమ్ డ్రీమ్11 కో-ఫౌండర్ 'హర్ష్ జైన్'. ఆనంద్ జైన్ మంచి స్నేహితుడిగా, వ్యాపారవేత్తగా అన్ని రంగాల్లోనూ రాణించారు. -
బిలియనీర్ అయిపోయిన దీపిందర్ గోయల్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ బిలియనీర్స్ క్లబ్లోకి చేరారు. గతేడాది నుంచి జొమాటో షేర్లలో రికార్డు ర్యాలీతో దీపిందర్ బిలియనీర్ అయ్యారు. 2023 జూలై కనిష్ట స్థాయి నుంచి కంపెనీ స్టాక్ 300 శాతానికి పైగా పెరిగింది.జొమాటో స్టాక్ బీఎస్ఈలో రూ.230 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది రోజులో 2 శాతం లాభపడింది. దాని మార్కెట్ క్యాప్ రూ.1.8 ట్రిలియన్లకు చేరుకుంది. దీంతో గోయల్ నెట్వర్త్ రూ.8,300 కోట్లకు చేరుకోవడంతో భారతదేశపు అత్యంత ధనిక ప్రొఫెషనల్ మేనేజర్గా నిలిచాడు. ప్రస్తుతం గోయల్కు కంపెనీలో 36.95 కోట్ల షేర్లు లేదా 4.24 శాతం వాటా ఉంది.జొమాటో క్విక్ కామర్స్ వ్యాపారం బ్లింకిట్ తోటి కంపెనీలను అధిగమించి ఊహించిన దాని కంటే ముందుగానే లాభదాయకంగా మారవచ్చు అనే అంచనాల మధ్య గతేడాది ప్రారంభం నుంచి జొమాటలో స్టాక్ గణనీయంగా పెరుగుతూ చ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్లింకిట్ ఇబీట ఆదాయం బ్రేక్ ఈవెన్గా మారవచ్చని కంపెనీ ఇంతకు ముందు పేర్కొంది. ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయకమైన యూనిట్ కావడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్ను పెంచింది.మధ్యతరగతి కుటుంబం నుంచి..మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దీపిందర్ ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆహారం పట్ల తనకున్న మక్కువతో స్ఫూర్తి పొంది ఫుడ్ ఆర్డర్ చేయడానికి యాప్ను రూపొందించారు. బెయిన్& కంపెనీలో ఉన్నప్పుడే FoodieBay.comని స్థాపించారు. దీన్ని తరువాత Zomato.com అని పేరు మార్చారు. 2011లో ఇన్ఫో ఎడ్జ్ నుంచి నిధులు లభించడంతో గోయల్, ఆయన బృందం తమ ఉద్యోగాలను వీడి జొమాటో వృద్ధిపై పూర్తిగా దృష్టి పెట్టారు. జొమాటో 2018లో యునికార్న్గా మారింది. -
మస్క్ మూడో భార్య.. ఎవరీ 'శివోన్ జిలిస్'?
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇటీవల మరో బిడ్డకు తండ్రి అయ్యారు. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్.. మస్క్ మూడో భార్య శివోన్ జిలిస్ (Shivon Zilis) ఇటీవల బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మస్క్ ఇప్పుడు 12మంది పిల్లలకు తండ్రయ్యారు. ఇంతకీ జిలిస్ ఎవరు? ఈమెకు భారతదేశానికి సంబంధం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.మస్క్, జిలిస్ బిడ్డకు జన్మనివ్వడం రహస్యంగా జరిగిందని కొన్ని వార్తలు తెరమీదకు వచ్చాయి. దీనికపైన మస్క్ స్పందిస్తూ.. ఇదేమీ రహస్యం కాదని నా సన్నిహితులకు అందరికి ఈ విషయం తెలుసనీ, పేపర్ ప్రకటన ఇవ్వకపోతే అదేమీ రహస్యం కాదని అన్నారు. నవంబర్ 2021లో మస్క్, జిలిస్ కవలలకు (స్ట్రైడర్, అజూర్) జన్మనిచ్చారు. కాగా ఇప్పుడు వీరు మరో బిడ్డకు జన్మనిచ్చారు.ఎవరీ శివోన్ జిలిస్?ఇటీవల మూడో బిడ్డకు జన్మనిచ్చిన శివోన్ జిలిస్ కెనడాలో జన్మించినప్పటికీ ఆమె తల్లి శారద భారతదేశానికి చెందిందని 2015లో యూఎస్ఏ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జిలిస్ అమెరికాలోని యేల్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. జిలిస్ మస్క్ బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్లో టాప్ ఎగ్జిక్యూటివ్. అంతకు ముందు ఈమె సుదీర్ఘకాలం ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ హోదాలో పనిచేసినట్లు తెలుస్తోంది. -
బర్త్డే స్పెషల్.. 30 ఏళ్ల ఫోటో షేర్ చేసిన మస్క్
ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఇలాన్ మస్క్ నేటితో 53ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మస్క్ తన 30వ ఏట తీసుకున్న ఒక ఫోటోను తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.టెస్లా అండ్ స్పేస్ఎక్స్ సీఈఓ ఇలాన్ మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో మే మస్క్ & ఎర్రోల్ మస్క్లకు జన్మించారు. ఈయన తన పుట్టినరోజు సందర్భంగా 1994 నాటి ఫోటో షేర్ చేస్తూ.. '30 సంవత్సరాల క్రితం' అని ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు టెస్లా చీఫ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.30 years ago pic.twitter.com/y8MDRQYY32— Elon Musk (@elonmusk) June 28, 2024ఇలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ కూడా తన చిన్నప్పటి ఫోటో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్డే @elonmusk అంటూ.. మీ అత్త లిన్ నీ కోసం తయారు చేసిన కేక్ని చూసి.. 4వ పుట్టినరోజున నవ్వినట్లుగా ఈ రోజు కూడా నవ్వుతారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.Happy Birthday @elonmusk Thank you for 53 years of joy and excitement. Hoping you smile today as much as you did on your 4th birthday, after seeing the cake your Aunt Lynne made for you 🎂🎉Proud of you. 🥰🥰🥰 pic.twitter.com/FhI4ZgJ98h— Maye Musk (@mayemusk) June 28, 2024 -
సౌందర్య లహరి– ది స్టార్ ఇన్ యూ
పెద్ద వ్యాపార కుటుంబంలో పుట్టింది ఇమాన్ అల్లానా. కుటుంబ వ్యాపారంతో నిమిత్తం లేకుండా ఎంటర్ప్రెన్యూర్గా సొంతంగా విజయం సాధించాలనేది ఆమె కల. ఆరోతరం ఎంటర్ప్రెన్యూర్గా బ్యూటీ బ్రాండ్ ‘బాలీ గ్లో’తో చిన్న వయసులోనే పెద్ద విజయం సాధించింది 26 సంవత్సరాల ఇమాన్.‘సాధించాలనే తపన ఉంటే తెలియని దారులు కూడా పరిచయం అవుతాయి. కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. విజయాలకు దగ్గర చేస్తాయి’ అంటున్న ఇమాన్ అల్లానా గురించి...బంగారు చెంచాతో పుట్టింది ఇమాన్ అల్లానా. తల్లిదండ్రులు ఇర్ఫాన్, లుబ్నా దుబాయిలో బిలియనీర్లు. రీజెంట్స్ యూనివర్శిటీ లండన్లో ‘బ్రాండ్ మేనేజ్మెంట్’లో మాస్టర్స్ చేసిన ఇమాన్కు ఎంటర్ప్రెన్యూర్గా తనను తాను నిరూపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. స్కూలు తరువాత అమ్మానాన్నల ఆఫీసుకు వచ్చేది. అక్కడ తమ వ్యాపారానికి సంబంధించిన ఎన్నో మాటలు వినేది. ముఖ్యమైన మీటింగ్ ఉంటే బడికి బంక్ కొట్టి మరీ ఆ మీటింగ్లో పాల్గొనేది. మీటింగ్లో జరిగే చర్చలను శ్రద్ధగా వినేది... అలా వ్యాపార విషయాలపై ఇమాన్కు చిన్న వయసులోనే ఆసక్తి మొదలైంది.ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలని తపించే ఇమాన్కు చిన్న చిన్న ఎడ్యుకేషనల్ కోర్సులు చేయడం అంటే ఇష్టం. ఎంటర్ప్రెన్యూర్షిప్కు సంబంధించి చిన్న కోర్సులు ఎన్నో చేసింది. ‘సొంతంగా బిజినెస్ స్టార్ చేసి రిస్క్ చేయడం ఎందుకు! మన బిజినెస్ చూసుకుంటే సరి΄ోతుంది’ అని ఇమాన్ తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఎంటర్ప్రెన్యూర్గా తనను తాను నిరూపించుకునే అవకాశాన్ని,ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వారి ప్రోత్సాహ బలంతో ఆరోతరం కుటుంబ సభ్యురాలిగా ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది ఇమాన్.బాలీవుడ్, బ్యూటీ మేళవింపుగా వచ్చిన ‘బాలీ గ్లో’ బ్యూటీ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే గుర్తింపు సాధించింది. ΄్యాకేజింగ్ నుంచి మార్కెటింగ్ వరకు తనదైన ప్రత్యేకత చాటుకుంది. ప్రోడక్ట్కు సంబంధించిన ఇన్గ్రేడియెంట్స్ను ప్రపంచం నలుమూలల నుంచి సేకరిస్తారు. ఇదే సమయంలో పర్యావరణానికి హానికరమైన వాటిని దూరం పెడతారు.ప్రోడక్ట్కు సంబంధించి ‘ది స్టార్ ఇన్ యూ’ ట్యాగ్లైన్ హిట్ అయింది. ‘ఇన్నర్ హెల్త్కు చర్మం అద్దం పడుతుంది’ అంటున్న ఇమాన్ చర్మసౌందర్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తరచుగా చెబుతుంటుంది. వ్యాపార పనుల్లో భాగంగా లండన్–దుబాయ్–ముంబై నగరాల మధ్య తిరుగుతూ ఉంటుది ఇమాన్.ఎంటర్ప్రెన్యూర్గానే కాదు సామాజిక కార్యకర్తగా... ఇన్వెస్టర్గా కూడా రాణిస్తోంది. ‘ఫ్యాషన్ అనేది కళారూపం. సృజనాత్మక వ్యక్తీకరణ’ అంటున్న ఇమాన్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలకు ్రపాధాన్యత ఇస్తుంది.‘ఇప్పుడు కస్టమర్లు ప్రోడక్ట్ తళుకు బెళులు మాత్రమే చూసి ఓకే చెప్పడం లేదు. ప్రోడక్ట్స్కు సంబంధించి ఇన్గ్రేడియెంట్స్పై కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మా బ్రాండ్ పర్యావరణ హిత, క్రుయాల్టీ–ఫ్రీ ఇన్గ్రేడియెంట్స్కు ్రపాధాన్యత ఇస్తోంది’ అంటుంది ఇమాన్.బ్యూటీ ప్రోడక్స్పై మాత్రమే కాకుండా మహిళా సాధికారతకు సంబంధించిన విషయాలపై కూడా దృష్టి పెడుతోంది బాలీ గ్లో.కష్టఫలంబిజినెస్ స్కూలులో చదివినంత మాత్రాన, రకరకాల మేనేజ్మెంట్ కోర్సులు చేసినంత మాత్రాన ఎంటర్ప్రెన్యూర్గా రాణించలేం. అది పూర్తిగా మన ఆసక్తి, అధ్యయనం, కష్టం, అంకితభావంపై ఆధారపడి ఉంటుంది. బిజినెస్ అనేది బేబీలాంటిది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.– ఇమాన్ అల్లానా -
మస్క్కు జాక్పాట్ తగలింది.. రూ.4.5 లక్షల కోట్ల వేతనం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్!
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ జాక్ పాట్ కొట్టేశారు. రూ.4.5లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) పారితోషికం ఇచ్చేందుకు ఆ సంస్థ వాటా దారులు మస్క్కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆనందానికి అవదుల్లేని మస్క్ తన డ్యాన్స్తో సందడి చేశారు. టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో వాటా దారులు మస్క్కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతనం ఇవ్వాలా? వద్ద అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. ప్రాథమిక ఓట్ల ఫలితాల ఆధారంగా మస్క్కు 56 బిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేలా పెట్టుబడి దారులు మద్దతు ఇచ్చారని కార్పొరేట్ సెక్రటరీ బ్రాండన్ ఎర్హార్ట్ తెలిపారు.ఎలోన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన డెలావర్ కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా సీఈవోకి భారీ వేతనాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. తాజాగా, టెస్లా వాటాదారులు మస్క్కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో నెంబర్ వన్గా కొనసాగుతున్నారు. Elon Musk dance is 🔥. Tesla shareholders have spoken. pic.twitter.com/GiLWOtt8ZI— Tesla Owners Silicon Valley (@teslaownersSV) June 13, 2024 -
బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్ అరెస్ట్
కెనడా బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్ను అరెస్ట్ అయ్యారు.1980 నుంచి 2023 వరకు బిలియనీర్ ఫ్రాంక్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. దీంతో టొరంటో శివారు ప్రాంతం అరోరాలో వ్యాపారవేత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాంక్పై మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. ఫ్రాంక్ స్ట్రోనాచ్ కెనడా మ్యాగ్నా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు. ఆ కంపెనీ ఆటోమొబైల్ పార్ట్స్ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు. కొద్ది సేపటికే విడుదలయ్యారు. ఆంటారియో కోర్టులో హాజరుకానున్నారు. స్ట్రోనాచ్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని అతని తరపు లాయర్ బ్రియాన్ గ్రీన్స్పాన్ తెలిపారు. -
గోల్డెన్ వర్డ్స్.. ఎవరు పాటించినా విజయం తథ్యం!
కొడుకు జీవితంలో ఉన్నత స్థాయికి చేరటంలో తండ్రి పాత్ర చాలా ప్రధానం. ఈ రోజుకి కూడా ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది దిగ్గజాలు తమ తండ్రుల మాటలను తు.చ తప్పకుండా అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు నెట్ఫ్లిక్స్ కో-ఫౌండర్ 'మార్క్ రాండోల్ఫ్'.చదువు పూర్తయిన తరువాత 21 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరాల్సి వచ్చినప్పుడు నా తండ్రి ఒక నోట్ తన స్వహస్తాలతో రాసి ఇచ్చారని.. దానికి సంబంధించిన ఫోటోను కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ నోట్నే తన పిల్లలకు కూడా ఇచ్చానని మార్క్ రాండోల్ఫ్ పేర్కొన్నారు.మార్క్ రాండోల్ఫ్ తండ్రి నోట్లోని అంశాలుఅడిగిన దానికంటే 10 శాతం ఎక్కువ చేయితెలియని విషయాలపైన ఎవరికీ, ఎప్పుడూ నీ అభిప్రాయాలను అందించవద్దుఎప్పుడూ మర్యాదగా వ్యవహరించు, శ్రద్ధగా ఉండుతీవ్రమైన విమర్శలనైనా ఎదుర్కో.. కానీ ఫిర్యాదులు చేయవద్దునిజాయితీగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో భయపడవద్దుఅవసరమైన చోట లెక్కలు వేసుకోప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించు, ఓపెన్ మైండెడ్గా ఉండుఏ విషయం మీద అయినా.. వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉండుWhen I was twenty-one years old, fresh out of college and about to start my first job, my father gave me a handwritten list of instructions.Here are my dad's rules for success:• Do at least 10% more than you are asked.• Never, ever, to anybody, present as fact, opinions… pic.twitter.com/JOEIYxctcG— Marc Randolph (@mbrandolph) June 1, 2024 -
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో సుబ్బమ్మ జాస్తి భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్గా నిలిచారు. సుబ్బమ్మ గత నెలలో ఫోర్బ్స్ జాబితాలో అరంగేట్రం చేశారు. ఆమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.91.9 వేల కోట్లు) చేరుకుంది.ఎవరీ సుబ్బమ్మ..?సువెన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వరులు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఈమె కుమారుడు వెంకటేశ్వరులు 1970, 1980లలో యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్ నడిపేవారు. ఫోర్బ్స్ ప్రకారం, 2022లో సువెన్ ఫార్మాస్యూటికల్స్లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్కు గణనీయమైన వాటాను విక్రయించడం ద్వారా ఆమెకు అతిపెద్ద భాగం వచ్చింది.సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను వారసత్వంగా పొందారు. ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఆమె 2,653 స్థానంలో ఉన్నారు. భారతీయ మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే సావిత్రి జిందాల్ 34.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె జిందాల్ గ్రూప్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. -
సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్గా సుందర్ పిచాయ్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గాగూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.సీఈఓ అనే సింహాసనం మీదఅందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్ డాక్లలో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్ పిచాయ్కు గూగుల్ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్ పిచాయ్ ఆదాయం భారీగా పెరిగింది. త్వరలో బిలీయనీర్పలు నివేదికల ప్రకారం.. గూగుల్తో పాటు గూగుల్ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్ ఏఐ టూల్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. -
ఈజిప్టులో మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ (ఫోటోలు)
-
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్ ఏప్రిల్ 26న ఈజిప్ట్లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్, అంకుర్కు ఫిజికల్ ట్రైనర్గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్నెస్ కోచ్గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్ కూడా స్టార్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ankur Jain (@ankurjain) -
19 ఏళ్లకే బిలియనీర్గా స్టూడెంట్..ఆమె ఆస్తి అన్ని కోట్లా?
కొందరు అత్యంత చిన్న వయసులోనే కోటీశ్వరులుగా అవతరిస్తారు. తరతరాల నుంచే వచ్చే ఆస్తుల కారణంగా ఒక్కసారిగా చిన్న వయసులోనే ధనవంతులుగా అయిపోతుంటారు. చెప్పాలంటే కోటీశ్వరులు తమ ఆస్తులను వృద్ధి చేస్తూ మనవళ్లు లేదా మనవరాళ్ల పేర్ల మీద రాయడం వల్ల లేదా మరణం కారణంగానో వాళ్ల వారసులు ఇలా ధనవంతులుగా అయిపోతారు. అలానే ఇక్కడొక విద్యార్థి చిన్నవయసులోనే బిలీయనీర్గా అవతరించింది. ఇంతకీ ఎవరంటే ఆమె..? 19 ఏళ్ల బ్రెజిలియన్ విద్యార్థి లివియా వోయిగ్ట్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్గా ఈ ఏడాది ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఆ జాబితాలో 33 ఏళ్ల వయసున్న దాదాపు 25 మంది యువ బిలియనీర్లు ఏకంగా రూ. 11000 కోట్లు సంపదను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఈ లివయా వోయిగ్ట్ ఎవరంటే.. ఈ ఏడాది 2024లో ప్రపంచంలోనే అత్యంత చిన్న పిన్నవయస్కురాలిగా టైటిల్ని గెలుచుకుంది లివయా వోయిగ్ట్. ఇంతకుమునుపు ఆ టైటిల్ని అందుకున్న ఎస్సిలర్ టుక్సోటికా వారసుడు డెల్ వెచియా నుంచి లివయా ఆ టైటిల్ని అందుకోవడం విశేషం. ఇక ఈ డెల్ వెచియా లివియా కంటే జస్టే రెండు నెలలే పెద్దవాడు. అమెరికాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ మోటార్ల తయారీ కంపెనీ వెగ్(WEG)ని ఆమె తాత వెర్నర్ రికార్డో వోయిగ్ట్, దివగంత బిలియనీర్లు ఎగ్గాన్ జోవో డా సిల్వా, గెరాల్డో వెర్నింగ్హాస్లతో కలిసి స్థాపించారు. ఆ కంపెనీలో లివియా అతి పెద్ద వాటాదారు. ఇక లివియా సంపద నికర విలువ ఏకంగా రూ. 9 వేల కోట్లు. అలాగే ఆమె అక్క డోరా వోగ్ట్ డి అస్సిస్ కూడా ఫోర్బ్స్ అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ లిస్ట్లో ఒకరిగా ఉన్నారు. ఇక డోరా 2020లో ఆర్కిటెక్చర్ డిగ్రీని పూర్తి చేసింది కాగా, లివియా వెగ్(WEG) కంపెనీ బహుళ జాతి కంపెనీగా దాదాపు 10కి పైగా దేశాల్లో కర్మాగారాలు ఉన్నాయి. ఆమె కంపెనీ 2022లో సుమారు రూ. 50 వేల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అయితే లివియా ప్రస్తుతం బ్రెజిల్లోని విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఇంకా ఆమె WEGలో బోర్డు లేదా ఎగ్జిక్యూటివ్ హోదాలో సాగకపోయినా అందులో అతిపెద్ద వాటాదారు కావడంతో బిలియనీర్గా అవతరించింది. ఇక ఈ బిలియనీర్ ర్యాంకులో చాలామంది యువ వారసులు చేరారు. అందులో ఇద్దరు ఐర్లాండ్ మిస్త్రీ సోదరులు కూడా ఉన్నారు. (చదవండి: మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!) -
ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ మహిళ.. ఎవరీ రేణుకా జగ్తియాని?
భారతీయుల ఆస్తులు అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మరో 25 మంది చేరారు. వారిలో ల్యాండ్మార్క్ గ్రూప్ సీఈఓ రేణుకా జగ్తియాని ఒకరు. ఆమె నికర విలువ సుమారు 4.8 బిలియన్లు రేణుకా జగ్తియాని ఎవరు? భారతి సంతతికి చెందిన రేణుకా జగ్తియాని భర్త మిక్కి జగ్తియాని ల్యాండ్మార్క్ గ్రూప్ను స్థాపించారు. అయితే గతేడాది మిక్కి జగ్తియాని మరణించడంతో కంపెనీ ఛైర్ ఉమెన్ అండ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థలో మొత్తం 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రేణుకా జగిత్యాని ఆర్ట్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి పూర్తి చేశారు. రేణుకా జగిత్యాని జనవరి 2007లో ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ మిడిల్ ఈస్ట్లో అత్యుత్తమ ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత జనవరి 2012లో గల్ఫ్ బిజినెస్ ఇండస్ట్రీ అవార్డ్స్లో బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా, 2014లో వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫోరమ్ ఆమెను ప్రపంచ వ్యాపార వేత్తగా గౌరవించింది. 2015లో ఆమె ఇండియన్ సీఈఓ అవార్డ్స్లో స్ట్రాటజిక్ లీడర్ ఆఫ్ ది ఇయర్గా, 2016లో స్టార్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్ నుండి ఆమె కెప్టెన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవార్డును, 2017లో ఆమె వరల్డ్ రిటైల్ కాంగ్రెస్లో 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చేర్చబడింది. రేణుకా జగిత్యాని ఇటీవలే ఫోర్బ్స్ ‘న్యూ బిలియనీర్స్’లో 4.8 బిలియన్ల నికర విలువతో కొనసాగుతున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఆర్తి, నిషా, రాహుల్లు ల్యాండ్ మార్క్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 నివేదిక ప్రపంచవ్యాప్తంగా 2,781 బిలియనీర్లను గుర్తించింది. ఈ ఏడాది 265 మంది కొత్త బిలియనీర్లు చేరగా.. గత ఏడాది 150 మందితో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగింది. -
క్రిప్టో కింగ్కు 25 ఏళ్ల జైలు శిక్ష: కారణం ఇదే..
బ్లాక్ చెయిన్ ఆధారంగా పనిచేసే క్రిప్టో కరెన్సీల గురించి చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది. ప్రభుత్వం, బ్యాంకుల జోక్యం లేకుండా జరుగుతాయి. దీని విలువ.. డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంటుంది. క్రిప్టో కరెన్సీల ద్వారా కుబేరులు కూడా ఒక్కోసారి భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇందులో దివాళా దీసిన బిలియనీర్లలో ఒకరు FTX ఫౌండర్, సీఈఓ, అమెరికా యువ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ 'శామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్'. ఎఫ్టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు శామ్ బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్కు మార్చి 29న (గురువారం) 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. FTX కస్టమర్లు డబ్బును పోగొట్టుకోలేదని బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ చేసిన వాదనను తిరస్కరించిన తర్వాత ఈ శిక్షను విధించారు. అమెరికా చరిత్రలోనే ఆర్థిక మోసాలలో ఒకటిగా FTX అని, బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ 2022 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అది తప్పు అని తెలిసినప్పటికీ.. మోసాలకు పాల్పడ్డాడని న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్టీఎక్స్ కస్టమర్లు బాధపడ్డారని 20 నిమిషాల విచారణ తరువాత బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ తరువాత సహోద్యోగులకు క్షమాపణలు చెప్పాడు. FTX కస్టమర్లు 8 బిలియన్ డాలర్లు, ఈక్విటీ పెట్టుబడిదారులు 1.7 బిలియన్ డాలర్లను కోల్పోయారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్ రుణదాతలు కూడా 1.3 బిలియన్ డాలర్లను కోల్పోయారు. దీంతో ఇతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎవరీ శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ అమెరికాకు చెందిన శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ పూర్తి పేరు 'శామ్యూల్ బెంజమిన్ బ్యాంక్మ్యాన్-ఫ్రైడ్'. ఈయన 2014లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ (డిగ్రీ) పూర్తి చేశారు. ఆ తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్లో మూడేళ్ల పాటు ట్రేడర్గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్టీఎక్స్ను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీగా అవతరించింది. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. -
Pearl Kapur మూడు నెలల్లోనే రూ. 9800 కోట్లు : ఎలా బ్రో..?!
భారతదేశం వందలాది బిలియనీర్లకు నిలయం. అంతేకాదు ది ల్యాండ్ ఆఫ్ స్టార్టప్స్ కూడా. కొత్త పరిశ్రమలకు, ప్రతిభావంతులకు కొదవ లేదు. కొత్త వ్యాపారాలతో బిలియనీర్లుగా అవతరిస్తున్న యువ పారిశ్రామికవేత్తలు చాలామందే ఉన్నారు. అయితే 27 ఏళ్ల యువకుడి సక్సెస్ విశేషంగా నిలుస్తోంది.వ్యాణిజ్య దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది. బిలియనీర్లు అనగానే తక్షణమే గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, టాటా లాంటి వ్యాపార దిగ్గజాలు గుర్తొస్తారు. వీరికి వ్యాపార కుటుంబ నేపథ్యంతోపాటు ఎన్నో ఏళ్ల శ్రమ ద్వారా ఈ స్థాయికి ఎదిగారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిచ్చారు. ఆశ్చర్యకరంగా చిన్న వయస్సులోనే వారి సక్సెస్ స్టోరీలను తిరగరాశాడో యువ పారిశ్రామికవేత్త. అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడయ్యాడు పెరల్ కపూర్. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన బిలియనీర్గా తన పేరును లిఖించుకున్నాడు. గుజరాత్కు చెందిన పెరల్ కపూర్ Zyber 365 అనే కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీలో కపూర్ వాటా 90 శాతం. అలాగే స్రామ్ & మ్రామ్ గ్రూప్ 8.3 శాతం పెట్టుబడి పెట్టింది. తొలి పెట్టుబడుల సమీకరణలో భాగంగా 100 మిలియన్ డాలర్లను సంపాదించింది. అలా ఇండియా యునికార్న్ ర్యాంకింగ్లో 109వ స్థానాన్ని పొందింది. గత ఏడాది మే నెలలో ఆవిర్భవించిన ఆ కంపెనీ కేవలం 90 రోజుల్లోనే రూ. 9,840 కోట్ల స్థాయికి ఎదిగింది. ఇది వెబ్3 , AI-ఆధారిత OS స్టార్ట్-అప్. ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీని యునికార్న్ అంటారు. కేవలం మూడు నెలల్లో యునికార్న్గా ఆవిర్భవించింది. లండన్లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ భారతదేశం, ఆసియాలో అత్యంత వేగవంతమైన యునికార్న్గా ప్రశంసలందుకుంటోంది. త్వరలోనే ఇండియా ప్రధాన కేంద్రంగా పనిచేయాలని భావిస్తోంది. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి MSC ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (CFA పాత్వే) గ్రాడ్యుయేట్ అయిన కపూర్, Web3 టెక్నాలజీ రంగంలో గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. జైబర్ 365కి ముందు, కపూర్ AMPM స్టోర్లో ఆర్థిక సలహాదారుగా, యాంటీయర్ సొల్యూషన్స్ బిజినెస్ సలహాదారుగానూ పనిచేశారు. సొంత కంపెనీ పెట్టాలన్న అతని బలమైన కోరిక 2022, ఫిబ్రవరిలో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి నాంది పలికింది. అలా మొదలైన ప్రయాణం స్టార్టప్ Zyber 365, బిలియనీర్ హొదా దాకా ఎదిగింది. -
అప్పట్లో గూగుల్లో అత్యధిక జీతం.. ఇప్పుడు ఏకంగా బిలియనీర్
నేటి రోజుల్లో బిలియనీర్ అవడం అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు.. పాలో ఆల్టో నెటవర్క్స్ సీఈవో నికేష్ అరోరా (Nikesh Arora)నే అందుకు ఉదాహరణ. ఒకప్పుడు గూగుల్లో అత్యధిక జీతం అందుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా బిలియనీర్ అయ్యారు. గూగుల్లో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పనిచేసిన నికేష్ అరోరా అత్యధిక వేతనం అందుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ ఆయన్ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ చెల్లించి నియమించుకుంది. ప్రస్తుతం పాలో ఆల్టో నెట్వర్క్స్లో చేరిన ఆయన బిలియనీర్ల జాబితాలోకి అడుగుపెట్టాడు. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ పరిశ్రమ బూమ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. నికేష్ అరోరా నెట్వర్త్ ఇప్పుడు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12 వేల కోట్లు)గా ఉంది. అరుదైన టెక్ సీఈవో బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. వ్యవస్థాపకుడు కాకుండా బిలియనీర్ అయిన అరుదైన టెక్ సీఈవోగా నికేష్ అరోరా నిలిచారు. పాలో ఆల్టో నెట్వర్క్స్ 2018లో నికేష్ అరోరాను నియమించుకున్నప్పుడు 125 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్లను ఆయనకు అందించింది. హై-ప్రొఫైల్ హ్యాకింగ్లు ఎక్కువవుతన్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఆవశ్యకత పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర నాలుగు రెట్లు పెరిగింది. దీంతో అరోరా వాటా 830 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకంతకూ పెరిగిన సంపద ఈ స్టాక్లు, వేతనం, సంస్థలో చేరినప్పుడు లభించిన 3.4 మిలియన్ డాలర్లు ఇలా అన్ని కలుపుకొని నికేష్ అరోరా నెట్వర్త్ ఇప్పుడు సుమారు 1.5 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా అరోరా 2023లో దాదాపు 300 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. పాలో ఆల్టో నెట్వర్క్స్లో అరోరా గతేడాది అందుకున్న పరిహారంలో అత్యధికంగా 7.5 లక్షల స్టాక్లు ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతం 220 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. -
ప్రపంచంలోకెల్లా సంపన్నురాలు.. ‘లో రియాల్’ వైస్ ప్రెసిడెంట్ రికార్డు
న్యూఢిల్లీ: కాస్మటిక్స్ దిగ్గజం లో రియాల్ వ్యాపార సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే ఏకంగా 100 బిలియన్ డాలర్ల పై చిలుకు సంపదను ఆర్జించిన తొలి మహిళగా కూడా ఆమె నిలిచారు. అంతేగాక ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, అమానికో ఓర్టెగా వంటి వ్యాపార దిగ్గజాలను వెనక్కు నెడుతూ 12వ స్థానానికి ఎగబాకారని బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకటించింది. 70 ఏళ్ల మేయర్స్ 268 బిలియన్ డాలర్ల విలువైన లో రియాల్ వ్యాపార సామ్రాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఆమె కుటుంబానికి కంపెనీలో 35 శాతం దాకా వాటాలున్నాయి. 2017లో మేయర్స్ తల్లి మరణానంతరం అపారమైన ఆస్తి, కంపెనీ వాటాలు ఆమెకు వారసత్వంగా దక్కాయి. తాజాగా కంపెనీ వాటాల విలువ ఒక్కసారిగా చుక్కలనంటడంతో మేయర్స్ సంపద బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మీడియాకు దూరంగా రోజూ గంటల తరబడి పియానో వాయిస్తూ గడుపుతుంటారామె. -
బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత
భారతదేశంలో కుబేరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో ఇండియన్ పేరు నమోదైంది. ఎనిమిది పదుల వయసులో కుబేరుల జాబితాలోకి చేరిన వ్యక్తి ఎవరు.. అయన సంపద ఎంత.. ఏ కంపెనీ నడిపిస్తున్నారు.. ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మద్యం వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటి. మద్యం వ్యాపారం చేస్తూ ధనవంతుల జాబితాలో చేరిన 'లలిత్ ఖైతాన్' (Lalit Khaitan) 1972-73లలో కంపెనీ స్వాధీనం చేసుకున్న తరువాత దానిని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఈయన అనుదినం కృషి చేసేవారు. అనుకున్న విధంగానే సక్సెస్ సాధించి ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. లలిత్ ఖైతాన్ సారథ్యంలో ముందుకు సాగుతున్న 'రాడికో ఖైతాన్' (Radico Khaitan) ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 పీఎం విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, రాంపూర్ సింగిల్ మాల్ట్ లాంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది కంపెనీ షేర్లు 50 శాతం పెరిగి సంస్థ విలువ బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో లలిత్ ఖైతాన్ బిలియనీర్ల జాబితాలోకి చేరిపోయారు. ఖైతాన్.. అజ్మీర్ మాయో కాలేజ్, కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువు పూర్తి చేసుకుని, బెంగుళూరులోని BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజిరియల్ ఫైనాన్స్ & అకౌంటింగ్ కోర్సును అభ్యసించారు. రాడికో ఖైతాన్గా పిలువబడుతున్న కంపెనీని గతంలో రాంపూర్ డిస్టిలరీ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్గా పిలిచేవారు. ఆ సంస్థను ఖైతాన్ తండ్రి జీఎన్ ఖైతాన్ 1970 ప్రారంభంలో నష్టాల్లో నడుస్తున్న సమయంలో సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఈ కంపెనీ క్రమంగా వృద్ధి చెందుతూ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కంపెనీ బ్రాండ్లను సుమారు 85 దేశాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన మద్యం రంగంలో అతి తక్కువ కాలంలోనే గొప్ప పురోగతి కనపరిచిన లలిత్ ఖైతాన్ 2008లో 'ఇన్స్పిరేషనల్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు', 2017లో ఉత్తర ప్రదేశ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ ద్వారా 'లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు' వంటి వాటిని సొంతం చేసుకుని.. ఇప్పడూ ఫోర్బ్స్ జాబితాలో ఒకరుగా స్థానం సంపాదించారు. -
కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత భారతదేశంలో ఒక వ్యక్తి బిలియనీర్ జాబితాలోకి చేరాడు. ఇంతకీ ఈయన ఎవరు? ఇతని వల్ల చంద్రయాన్-3కు ఉపయోగం ఏమిటి? నెట్ వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం. కేన్స్ టెక్నాలజీ ఇండియా ఫౌండర్ 'రమేష్ కున్హికన్నన్' (Ramesh Kunhikannan) చంద్రయాన్-3 మిషన్లో కీలక పాత్ర పోషించారు. రోవర్, ల్యాండర్ రెండింటికీ అవసరమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్లను అందించి చంద్ర మిషన్ విజయంలో భాగస్వామి అయ్యారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి కేన్స్ షేర్లు విపరీతంగా పెరిగాయి. కేన్స్ షేర్లు భారీగా పెరగటం వల్ల కంపెనీలో 64 శాతం వాటా కలిగిన కున్హికన్నన్ ఆస్తులు తారాస్థాయికి చేరి బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచాడు. ఈయన మొత్తం సంపద 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. వంద కోట్లు కంటే ఎక్కువ. కేన్స్ టెక్నాలజీ ఇండియా తన 137 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంలో సగానికి పైగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీలను తయారు చేయడం ద్వారా పొందుతుందని ఫోర్బ్స్ నివేదించింది. ఈ సంస్థ ఆటోమోటివ్, ఏరోస్పేస్, మెడికల్ అండ్ డిఫెన్స్ పరిశ్రమలకు ఎలక్ట్రానిక్ సిస్టమ్లు సరఫరా చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా వల్ల లాభం మైసూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన కున్హికన్నన్ 1988లో ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారుగా కేన్స్ను స్థాపించారు. అతని భార్య సవిత రమేష్ 1996లో కంపెనీలో చేరి ప్రస్తుతం సంస్థ చైర్పర్సన్గా ఉంది. స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం కేన్స్ ఇండియాకు చాలా ఉపయోగపడింది. ఇదీ చదవండి: భవిష్యత్తు అంతా ఇందులోనే.. లింక్డ్ఇన్ సంచలన రిపోర్ట్! భారతీయ పరిశ్రమలలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ వినియోగం కారణంగా, కంపెనీ వార్షిక ఆదాయం 2020 ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2024 మార్చి నాటికి కంపెనీ ఆదాయం సుమారు 208 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
19 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!
ప్రతి ఏటా మాదిరిగానే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా బిలియనీర్స్ కాబితాలో ఎక్కువగా సీనియర్ పారిశ్రామిక వేత్తలు ఉంటారని అందరికి తెలుసు. కానీ ఈ ఏట మాత్రం అందరి దృష్టి 'క్లెమెంటే డెల్ వెచియో' (Clemente Del Vecchio) పై పడింది. ఇంతకీ ఇతడెవరు? ఇతని సంపద ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. క్లెమెంటే డెల్ వెచియో వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇతడు బిలియనీర్ల కాబితాలో చేరిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేసాడు. నిజానికి క్లెమెంటే తండ్రి ఇటాలియన్ బిలియనీర్ 'లియోనార్డో డెల్ వెచియో'. ఇతడు ప్రపంచంలోనే అతిపెద్ద ఐ-గ్లాసెస్ (కళ్లద్దాలు) సంస్థ 'EssilorLuxottica' మాజీ చైర్మన్. ఈయన గతేడాది జూన్లో 87వ ఏట కన్నుమూశారు. ఆ తరువాత ఇతని ఆస్తి (25.5 బిలియన్ డాలర్లు) అతని భార్య, ఆరుగురు పిల్లలకు సంక్రమించింది. తండ్రి ఆస్తిలో సుమారు 12.5 శాతం వాటాను వారసత్వంగా పొందిన క్లెమెంటే డెల్ వెచియో తన 18 సంవత్సరాల వయస్సులో బిలియనీర్ అయ్యాడు. ఫోర్బ్స్ ప్రకారం.. ఇతని సంపద 4 బిలియన్ డాలర్లుగా ఉంది (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30వేల కోట్ల కంటే ఎక్కువ). ఇదీ చదవండి: ఆదాయమే కాదు అప్పు కూడా లక్షల కోట్లు.. అగ్రగామిగా అంబానీ కంపెనీ! క్లెమెంటే డెల్ వెచియో ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నప్పటికీ.. చదువు మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆసక్తి ఉన్న ఇతడు రాబోయే రోజుల్లో ఈ రంగంలోనే ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. క్లెమెంటే డెల్ వెచియో ఇటలీలో అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో లేక్ కోమోలోని విల్లా, మిలన్లోని అపార్ట్మెంట్ వంటివి ప్రధానంగా చెప్పుకోదగ్గవి. -
అమెరికా కోటీశ్వరుడు సింఘంకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: న్యూస్క్లిక్ ఆన్లైన్ పోర్టల్పై నమోదైన మనీల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అమెరికన్ బిలియనీర్ నెవిల్లె రాయ్ సింఘంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. భారత్లో చైనాకు అనుకూలంగా కథనాలు రాసేందుకు న్యూస్క్లిక్కు డ్రాగన్ దేశం నుంచి నిధులు అందుతున్నట్లు గతంలో న్యూయార్క్టైమ్స్, తదితర పత్రికల్లో కథనాలు వచ్చాయి. నెవిల్లె రాయ్ సింఘం, ఆయనకు చెందిన న్యూస్క్లిక్ను అత్యంత ప్రమా దకరమైనవని పేర్కొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ఈడీ..న్యూస్క్లిక్ ఫౌండర్, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థకు చెందిన ఢిల్లీలోని రూ.4.52 కోట్లు విలువ చేసే భవనాన్ని, రూ.41 లక్షల బ్యాంకు డిపాజిట్లను అటాచ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సింఘం ప్రస్తుతం చైనాలోని షాంఘైలో ఉన్నారు. దీంతో, ఆయ నకు విదేశాంగ శాఖ ద్వారా నోటీసులు పంపింది. కాగా, ఈడీ ఆరోపణలను సింఘం ఖండించారు. దర్యాప్తు చేపట్టిన ఈడీ మొదటిసారిగా 2021లో సింఘంకు నోటీసు పంపింది. -
బిలియనీర్ జాబితాలో ఎంట్రీ.. రూ.8వేల కోట్ల సంపద.. ఎలా సాధ్యమైందంటే
మంచి బిజినెస్ ఐడియా ఉంటే కోటీశ్వరులు కావడం సులువేనని చాలా మంది నిరూపిస్తున్నారు. స్టార్టప్ కంపెనీ స్థాపించి లాభాలు పొందుతున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఐపీఓ ద్వారా స్టాక్మార్కెట్లో లిస్ట్ అయి కోట్లు గడిస్తున్నారు. దాంతో ఏళ్లుగా మార్కెట్లో ఉంటున్న సంపన్నుల సరసన కొత్త బిలియనీర్లు చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా భారత బిలియనీర్ల జాబితాలో కొత్తగా ప్రదీప్ రాథోడ్ స్థానం సంపాదించారు. అసలు ఈయన ఎవరు? ఏ వ్యాపారం చేస్తుంటారు.. వంటి అంశాల గురించి తెలుసుకుందాం. వంట గదుల్లో ఉపయోగించే వస్తువులు, థర్మోవేర్ ఉత్పత్తులను తయారుచేసే కంపెనీ సెల్లో వరల్డ్ ఛైర్మన్గా ప్రదీప్ రాథోడ్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. మార్కెట్లోని డిమాండ్ వల్ల పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ స్టాక్ను కొనుగోలు చేయడంతో స్టాక్ ధర అమాంతం పెరిగింది. దాంతో తన సంపద కూడా పెరిగి బిలియనీర్గా మారిపోయారు. ఆయనకు కంపెనీలో 44 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ప్రదీప్ రాథోడ్ వద్ద రూ.8,300 కోట్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. ఆయన బడామియా చారిటబుల్ ట్రస్ట్కు ట్రస్టీగా కొనసాగుతున్నారు. జేఐటీఓ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సెల్లోవరల్డ్ కంపెనీ కిచెన్ వేర్, థర్మోవేర్, పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. 2017లో గాజు ఉత్పత్తుల తయారీలోకి కంపెనీ ప్రవేశించింది. 1974లో ఈ కంపెనీని స్థాపించారు. కంపెనీ తయరుచేస్తున్న ఉత్పత్తులు, కంపెనీ రాబడులు, వ్యాపార విస్తరణ వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల మార్కెట్లో లిస్ట్ చేశారు. ప్రస్తుతం కంపెనీ డామన్, హరిద్వార్, చెన్నై, కలకత్తాల్లో కలిపి 13 తయారీ కేంద్రాలు కలిగి ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 30 శాతం పెరిగి రూ.285 కోట్లుగా నమోదైంది. ఇదీ చదవండి: పసితనంలోనే పొదుపు పాఠాలు.. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రదీప్ రాథోడ్ కుమారుడు గౌరవ్, తమ్ముడు పంకజ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. రాథోడ్ కుటుంబం విమ్ప్లాస్ట్ లిమిటెడ్ కంపెనీకి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది సెల్లో బ్రాండ్కు అనుబంధంగా ఉంటూ అనేక ప్లాస్టిక్ ఫర్నిచర్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇది గతంలోనే బీఎస్ఈలో లిస్ట్ అయింది. ఈ కంపెనీ రూ.700 కోట్ల మార్కెట్ క్యాపిటల్ను కలిగి ఉంది. -
అందుకే కొనను: అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ గుట్టు విప్పిన బిలియనీర్
అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ గుట్టు విప్పారు ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath). భారతదేశ యంగెస్ట్ బిలియనీర్ అయిన ఆయన.. తన పాడ్కాస్ట్ 'WTF ఈజ్ విత్ నిఖిల్ కామత్' తాజా ఎపిసోడ్లో మాట్లాడుతూ తాను అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ కొనడం ఆపేనట్లు చెప్పారు. హెర్మేస్, లూయిస్ విట్టన్ వంటి బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహాన్ని నిఖిల్ కామత్ తప్పుపట్టారు. అది ఒకరకంగా కస్టమర్లను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. అల్ట్రా-లగ్జరీ బ్రాండ్లు కస్టమర్లకు ఉత్పత్తిని నేరుగా విక్రయించకుండా "సంబంధాన్ని పెంచుకునేలా" చేస్తాయన్నారు. అంతిమంగా కస్టమర్లకు ఉత్పత్తులు చేరేలోపు వారిని రకరకాల ఛట్రాల్లో ఇరికిస్తాయన్నారు. ఇదంతా తమ ఉత్పత్తులకు విలువను పెంచుకునే ఎత్తుగడలో భాగమేనన్నారు. “గత 3-4 సంవత్సరాలుగా నేను హెర్మేస్, లూయిస్ విట్టన్ వంటి అల్ట్రా-లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తులు కొనడం పూర్తిగా ఆపేశాను. ఎందుకంటే వారు కస్టమర్లతో ఆడుకుంటున్నారు. కస్టమర్లను ఊరించి ఫలితం పొందడమే వారి మార్కెటింగ్ వ్యూహం” అని కామత్ తన పోడ్కాస్ట్లో అన్నారు. తప్పుడు వ్యూహం! ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అహంకారంతో కూడిన వ్యూహంగా నిఖిల్ కామత్ భావిస్తున్నారు. “వారు ఈ బ్యాగ్లు, వస్తువులను మిలియన్ల కొద్దీ తయారు చేయగలరు. కానీ అహంకారంతో కూడిన వ్యూహంతోనే ఇలా పరిమితంగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నారు. కస్టమర్లు దీన్ని గమనించాలి” అన్నారు. హెర్మేస్ వంటి అల్ట్రా-లగ్జరీ బ్రాండ్లు వాటి ప్రత్యేకత, పరిమిత లభ్యతకు ప్రసిద్ధి చెందాయి. కస్టమర్లు హెర్మేస్ హ్యాండ్బ్యాగ్ను కొనుగోలు చేయాలంటే ముందుగా అనేక చిన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. -
అదే నిజమైతే బిలియనీర్కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే?
ఇటలీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్ నటి గాయత్రి జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ లంబోర్ఘిని కారు ప్రమాదంలో చిక్కుకుందని, ఈ సంఘటనలో వారు గాయపడగా, ఒక ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుని అందులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ సంఘటన మీద విచారణ జరుగుతోంది. నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో ఒబెరాయ్ దోషిగా తేలితే సుమారు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగంలో కోట్లు సంపాదిస్తున్న బిలియనీర్ వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తున్న కారుని.. ఫెరారీ కారు క్రాష్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. రోడ్డుపై అనేక సూపర్ కార్లు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఒబెరాయ్ తన భార్యతో లంబోర్ఘిని కారులో ముందు వెళ్తున్న ఒక ట్రక్కుని ఓవర్టేక్ చేయడానికి వెళ్తాడు, అదే సమయంలో వెనుక వస్తున్న ఫెరారీ కారు లంబోర్ఘినిని ఓవర్టేక్ చేయడానికి వెళ్ళింది. ఈ సందర్భాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. ఈ ప్రమాదంలో ఫెరారీ కారులోని ఇద్దరు స్విస్ వ్యక్తులు మరణించారు, కాగా ఒబెరాయ్ అతని భార్య గాయత్రి జోషి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒబెరాయ్ వేగవంతమైన ఫెరారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వికాస్ ఒబెరాయ్పై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
ప్లేన్ క్రాష్.. బిలియనీర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. ఒక్కరూ మిగల్లేదు!
జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదం భారత్కు చెందిన మైనింగ్ దిగ్గజం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులలో ఒక భారతీయ బిలియనీర్, ఆయన కుమారుడు ఉన్నట్లు స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలిసింది. బంగారం, బొగ్గుతోపాటు నికెల్, రాగిని వెలికితీసి శుద్ధి చేసే ‘రియోజిమ్’ అనే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ యజమాని హర్పాల్ రంధావా, ఆయన కొడుకుతో పాటు మరో నలుగురు మషావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మృతిచెందినట్లు జింబాబ్వేకు చెందిన ఓ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. తమ వజ్రాల గని వద్దే ప్రమాదం రియోజిమ్ కంపెనీకి చెందిన ‘సెస్నా 206’ విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ కంపెనీకి చెందిన చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలోనే ఈ సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోవడం గమనార్హం. ఒక్కరూ మిగల్లేదు.. జ్వామహండే ప్రాంతంలోని పీటర్ ఫామ్లోకి దూసుకెళ్లే ముందు విమానం సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలుస్తోంది. గాల్లోనే విమానం పేలిపోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారని మీడియా నివేదిక పేర్కొంది. మృతుల్లో నలుగురు విదేశీయులు కాగా, మిగిలిన ఇద్దరు జింబాబ్వే దేశీయులు అని పోలీసులను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్యంలోని దినపత్రిక హెరాల్డ్ పేర్కొంది. మృతుల పేర్లను పోలీసులు ఇంకా విడుదల చేయలేదు. అయితే రంధావా స్నేహితుడైన పాత్రికేయుడు, చిత్రనిర్మాత హోప్వెల్ చినోనో ఆయన మరణాన్ని ధ్రవీకరించారు. రంధావా 4 బిలియన్ డాలర్ల (రూ.33 వేల కోట్లకు పైగా) ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జెమ్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు. -
నేటి తరానికి ఆదర్శం.. బిల్ కమ్మింగ్స్ సక్సెస్ స్టోరీ!
Bill Cummings Success Story: మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ధనవంతులు కావాలని కలలు కంటారు. ఆ కలలు నిజం కావాలంటే అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి పైకొచ్చినవారిలో ఒకరు 'బిల్ కమ్మింగ్స్' (Bill Cummings). ఈ కథనంలో ఈయన ఎలా సక్సెస్ సాధించాడు, ప్రారంభంలో ఏమి చేసేవాడు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలో నివసిస్తున్న బిల్ కమ్మింగ్స్ ప్రస్తుతం బిలినీయర్స్ జాబితాలో ఒకరు. ఈయన 50 సంవత్సరాల క్రితమే బిలియన్ డాలర్స్ కంపెనీ ప్రారంభించి బోస్టన్ రియల్ ఎస్టేట్ రాజుగా నిలిచాడు. ఇదంతా ఒక్క రోజులో వచ్చిన సక్సెస్ కాదు. చిన్న ఇంట్లో.. బిల్ కమ్మింగ్స్ పుట్టుకతోనే కుబేరుడు కాదు, ఒకప్పుడు తల్లిదండ్రులు, సోదరితో ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్నాడు. ఆ తరువాత వ్యాపార రంగంలో అడుగు పెట్టి దినదినాభివృద్ధి చెందిన బిలినీయర్స్ జాబితాలోకి చేరిపోయాడు. బిల్ కమ్మింగ్స్ జీవితం నేటికీ ఎంతోమందికి ఆదర్శం. నేడు కుబేరుడైనప్పటికీ డబ్బును ఊరికే వృధాకానివ్వడు, అతని భార్య కూడా పెద్దగా విలాసవంతమైన జీవితం ఆశించదు. ఇప్పటికి కూడా వారు తమ ఖర్చును తగ్గించుకోవడానే చూస్తారు. దీనికి ప్రధాన కారణం చిన్నప్పుడు తల్లిదండ్రులు తక్కువ ఖర్చుపెట్టాలని అతని నేర్పిన పాఠమే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం & వెండి ధరలు ఇప్పటికి కూడా విజయం సాధించడానికి ప్రయత్నించాలి, కష్టపడి పనిచేయడానికి వెనుకాడకూడదని విశ్వసిస్తాడు. అంతే కాకుండా హార్డ్ వర్క్, సాధించాలనే కోరిక, అంకిత భావం చాలా ముఖ్యమని చెబుతాడు. ఒక రంగంలో అడుగుపెట్టిన తరువాత ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించాలి, వాటిని పరిష్కరించుకోవాలి. ఇది సక్సెస్ సాధించడానికి చాలా ముఖ్యమైన అంశం. ఇదీ చదవండి: వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో వెనుక పడిన భారత్ ఎనిమిది పదుల వయసు దాటిన తరువాత కూడా ఇప్పటికీ బిల్ కమ్మింగ్స్ తన సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడడు. తన రంగంలో విజయాన్ని కొనసాగిస్తూ ఒక బుక్ కూడా రాసారు. ఇది నేటి తరం యువతకు తప్పకుండా ఉపయోగపడుతుంది. -
ఖాళీ ప్రిజ్జు ... కోటీశ్వరుడిని చేసింది!
ఖాళీ రిఫ్రిజిరేటర్ను చూస్తే ఏమొస్తుంది? అదృష్టం బాగుంటే అద్భుతమైన ఐడియా వస్తుంది. అపూర్వ మెహతా తన ఇంట్లో ఖాళీగా ఉన్న రిఫ్రిజిరేటర్ను చూడడంతో గ్రాసరీ డెలివరీ స్టార్టప్ ‘ఇన్స్టాకార్ట్’ ఐడియా వచ్చి 37 సంవత్సరాల వయసులోనే కోటీశ్వరుడిగా మారాడు. తన ఇన్స్పిరేషన్ గురించి అపూర్వ మెహతా లింక్డ్ ఇన్లో షేర్ చేశాడు. అమెజాన్లో సప్లై చైన్ ఇంజనీర్గా పని చేçస్తున్న మెహతాకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలలు ఉండేవి. అయితే ఒకటి రెండు వ్యాపారాలు స్టార్ట్ చేసి విఫలం అయ్యాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో కూర్చున్న మెహతాకు ఎదురుగా ఖాళీ రెఫ్రిజిరేటర్ కనిపించింది. తాను తినడానికి అందులో ఏమీ లేవు. అలా ఖాళీ రిఫ్రిజిరేటర్ను చూస్తున్నప్పుడు ‘ఇన్స్టాకార్ట్’ స్టార్టప్కు ఐడియా పుట్టింది. -
తల్లి పనిమనిషి, కూలీపనులు చేసిన కొడుకు.. ఇప్పుడు ముఖేష్ అంబానీకంటే..
'సక్సెస్'.. ఈ పదం రాసుకోవడానికి చిన్నగా ఉన్నా.. సాధించడానికి చాలా సమయం పడుతుంది. అహర్నిశలు అంకిత భావంతో పనిచేస్తేనే విజయం వరిస్తుంది. ఈ కోవకు చెందిన ఒక వ్యక్తి గురించి మనం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. బెంగుళూరుకు చెందిన బిలియనీర్ బార్బర్ 'రమేష్ బాబు' అంటే ఈ రోజు అందరికి తెలుసు. ముఖేష్ అంబానీ కంటే కూడా ఎక్కువ కార్లను కలిగి ఉన్న ఈయన ప్రస్తుతం ధనవంతుల జాబితాలో ఒకరు. అయితే ఈయన బాల్యం కడలిలో మునిగిన నావలాంటిదని బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. చిన్నప్పుడే తండ్రి మరణం.. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడంతో క్వారికున్న బార్బర్ షాప్ అక్కడితో ఆగింది. తల్లి పనిమనిషిగా చేరింది, రమేష్ బాబు తల్లికి సహాయంగా ఉండాలని కూలిపనులు చేసేవాడు. తండ్రి మరణంతో ఒక్కసారిగా కటిక పేదరికంలో పడిపోయారు. మూడు పూటల ఆహరం కోసం కూడా చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆ తరువాత తండ్రి మార్గంలో నడవాలని నిర్ణయించుకుని మళ్ళీ బార్బర్ షాప్ ప్రారంభించాడు. తండ్రి బార్బర్ షాప్ ప్రారభించిన అతి తక్కువ కాలంలో వృద్ధిలోకి రావడం ప్రారంభమైంది. బార్బర్షాప్ను స్టైలిష్ హెయిర్ సెలూన్గా మార్చాడు. రమేష్ బాబుకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అంతే కాకుండా తన వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుని కార్లను అద్దెకివ్వాలని నిర్ణయించుకుని మొదటి మారుతి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు. ట్రావెల్ కంపెనీ.. 1994లో ప్రారంభమైన ఈ బిజినెస్ ఆ తరువాత ట్రావెల్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఈయన వద్ద సుమారు 400కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో మెర్సిడెస్ ఈ క్లాస్ సెడాన్, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్ ఘోస్ట్, జాగ్వార్, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. రమేష్ బాబు కార్ రెంటల్ కంపెనీలో 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్! రమేష్ బాబు బిలినీయర్ అయినప్పటికీ తన మూలలను మాత్రం మరచిపోలేదు, దీంతో ఈయన అప్పుడప్పుడు సెలూన్కి చాలా సమయం వెచ్చిస్తాడు. మొత్తం మీద భారతదేశంలో బిలియనీర్లైన ముఖేష్ అంబానీ (సుమారు 168 కార్లు), గౌతమ్ అదానీ (10అల్ట్రా లగ్జరీ కార్లు) కంటే ఎక్కువ కార్లను కలిగిన సంపన్నుడిగా రికార్డ్ సృష్టించాడు. కాగా ప్రస్తుతం రమేష్ బాబు నికర ఆస్తుల విలువ రూ. 1200కోట్లు అని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. -
మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్
అపర కుబేరుడు & టెస్లా కంపెనీ అధినేత 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలియని వారు ఉండరు. అయితే త్వరలోనే ఈయన జీవిత చరిత్రకు సంబంధించిన బుక్ ఒకటి విడుదలకానున్నట్లు సమాచారం. అందులో మస్క్ గురించి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఆయన కుమార్తె 'జెన్నా'తో ఉన్న విభేదాలను గురించి వెల్లడించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఎలాన్ మస్క్ మాజీ భార్య 'జస్టిస్ విల్సన్' ద్వారా ఇద్దరు కుమారులు జన్మించారు. వారు 'జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్'. అయితే మస్క్ 2008లో జస్టిస్కి విడాకులిచ్చాడు. ఆ తరువాత జేవియర్ అలెగ్జాండర్ లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారి 'వివియన్ జెన్నా విల్సన్'గా మారింది. తండ్రి మీద ఉన్న కోపంలో ఇలా చేసుకున్నట్లు గతంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మస్క్ జెన్నాను కలుసుకోవడానికి చాలా సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఆమెకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండటం. దీంతో డబ్బున్నవారందరూ చెడ్డవాళ్లే అని దృడంగా నమ్మి తనకు దూరంగా ఉంటోంది. జెన్నా ఎప్పుడూ నాతో కొంచెం సమయం కూడా గడపడానికి ఇష్టపడలేదు, ఇది తనను ఎంతో బాధకు గురిచేసినట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: మొదటి సారి నా భార్యను అక్కడే కలిసాను - ఆనంద్ మహీంద్రా ఇది నా మొదటి కుమార్తె 'నెవాడా' (Nevada) మరణం కంటే కూడా చాలా బాధించిందని తెలిపాడు. ఇవన్నీ కూడా మస్క్ జీవిత చరిత్ర పుస్తకంలో ఉన్నట్లు సమాచారం. ఈ బుక్ ఈ నెల 12న (2023 సెప్టెంబర్ 12) విడుదలయ్యే అవకాశం ఉంది. -
రతన్ టాటాను చంపాలనుకుంది ఎవరు?
మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. ఈ నాలుగు లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటాం. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో టాటా గ్రూప్ ఛైర్మన్గా రతన్ టాటా తన తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ బెదిరించాడని, ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్కు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. శాంతి మంత్రమే అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు.రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్ స్టర్ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్ స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్స్టర్ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది. ఎక్కడా తలవంచలేదు ఇలా, లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో.. దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. టాటాను చంపేందుకు కుట్ర జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన కాంపిటీటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. టాటా మోటార్స్ లేబర్ ఎన్నికలు సజావుగా జరిగేలా గ్యాంగ్స్టర్తో వ్యవహరించేటప్పుడు రతన్ టాటా కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నా..శాంతి యుతంగా తాను ఆ సమస్య నుంచి బయటపడిన విధానం, తీసుకున్న నిర్ణయాల పట్ల తానెప్పుడు చింతించలేదని రతన్ టాటా ఆ వీడియోలో మాట్లాడారు. చదవండి👉 మహీంద్రాతో పాక్ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి? -
అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు!
World Biggest Palace Istana Nurul Iman: ఇప్పటి వరకు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాల జాబితాలో 'యాంటిలియా' ఉన్న విషయం తెలిసిందే. ఈ భవనం కంటే కూడా ఇంకా ఖరీదైన.. విశాలమైన & విలాసవంతమైన ప్యాలెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇస్తానా నూరుల్ ఇమాన్.. నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం 'ఇస్తాన నూరుల్ ఇమాన్'. ఇది ఇండోనేషియాకు సమీపంలో ఉన్న చిన్న దేశం బ్రూనైలో ఉంది. దీని యజమాని బ్రూనై సుల్తాన్ 'హసనల్ బొల్కియ'. ఈయన ఆ దేశ ప్రధాన మంత్రి కావడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. నిజానికి బోల్కియా దేశానికి సుల్తాన్గా పట్టాభిషేకం చేసినప్పటి నుంచి చాలా దశాబ్దాలుగా ఆ రాజప్రసాదంలో నివసిస్తున్నారు. ఇది కేవలం అంబానీ యాంటిలియాకి మాత్రమే కాదు భారతదేశంలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కంటే కూడా చాలా పెద్దది. దీని విస్తీర్ణం సుమారు 2.15 మిలియన్ చదరపు అడుగుల వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు.. ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్.. అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ భావనాన్ని 'ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్' (The Light Of Faith) అని కూడా పిలుస్తారు. ఇందులో చాలాభాగం తెలుపు రంగులో, గోపురాలు బంగారు రంగులో ఉంటాయి. అంతే కాకుండా ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ బంగారంతో ఉన్నట్లు సమాచారం. ఇందులోని పైకప్పులు బ్రూనై ఇస్లామిక్ సంస్కృతి & మలయ్ సంప్రదాయాల ప్రకారం నిర్మించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. ఇస్తాన నూరుల్ ఇమాన్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కించుకుంది. ఈ భవన నిర్మాణానికి అయిన ఖర్చు అంచనా ప్రకారం రూ. 2,550 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. హస్సనల్ బోల్కియా ఇందులో చాలా సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. వీరి వద్ద 7000 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 41,600 కోట్లు. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్డ్రా చేసుకోవచ్చు ఇస్తాన నూరుల్ ఇమాన్ 1,788 గదులను కలిగి ఉన్నట్లు, ఇందులో 257 బాత్రూమ్లు, 5,000 మంది అతిథులకు సరిపోయే హాల్, ఐదు స్విమ్మింగ్ పూల్స్, హెలిప్యాడ్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవనం కూడా అని చెబుతారు. -
ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్
భారతీయ సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్న రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'గౌతమ్ సింఘానియా' (Gautam Singhania) గత కొన్ని రోజులకు ముందు రూ. 4 కోట్లు విలువైన 'మసెరటి ఎమ్సీ20' కూపే కొనుగోలు చేశారు. అయితే ఈ కారు మీద ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బహుశా నా జీవితంలో నేను నడిపిన చెత్త కారు మసెరటి ఎమ్సీ20. మసెరటి కారును కొనుగోలు చేసే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అంటూ గౌతమ్ సింఘానియా ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజానికి మనదేశంలో చాలా మంది ప్రముఖులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో మసెరటి బ్రాండ్ ఒకటి. ఇది 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 630 హార్స్ పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్డ్రా చేసుకోవచ్చు వేగంలో కూడా అద్భుతమైన పనితీరుని కనపరిచే ఈ కారుని ఎందుకు గౌతమ్ సింఘానియా ఇలా అన్నారు, బహుశా ఈయన వద్ద ఉన్న ఇతర కార్ల కంటే బహుశా ఇదే తక్కువ పనితీరుని కనపరించిందా, లేదా ఇంకేమైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇతని వద్ద రూ. 6.37 కోట్ల విలువైన ఫెరారీ 296 జీటీబీ సూపర్కార్, లంబోర్ఘిని, పోర్స్చే, ఆస్టన్ మార్టిన్, రోల్స్ రాయిస్ వంటి హై ఎండ్ మోడల్ కార్లు ఎన్నో ఉన్నాయి. ఇదీ చదవండి: ఇలాంటి మోసాలు జరుగుతున్నాయ్! ఆదమరిస్తే అకౌంట్లో డబ్బు మాయం! The MC20 @Maserati_HQ has probably been the worst car i have driven in my life. Anybody buying a Maserati car should think twice.@aSuperCarDriver @ibvsupercarclub @fmsupercarclub@autovivendi @thedriversunion @prestigecarclub@freedomsupercar @mrchensta #SuperCarClubGarage… — Gautam Singhania (@SinghaniaGautam) August 15, 2023 -
పెళ్లికాని శ్రీమంతుడు.. రెడీ టూ మింగిల్ అంటున్నా పట్టించుకోని అమ్మాయిలు
అతనో బిలియనీర్.. అమెరికాలోని సంపనుల్లో అతడొకడు. పేరు బ్రియాన్ జాన్సన్. కండలు తిరిగిన దేహంతో చూడటానికి కూడా చాలా అందంగానే ఉంటాడు. పైగా ఆల్కహాల్ కూడా ముట్టుకోడు పక్కా హెల్తీ డైట్ను ఫాలో అవుతాడు. అయినా అతనికి ఇప్పటివరకు పెళ్లి కాలేదు. జీవితంలో ఓ తోడు కోసం బ్రియాన్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. కానీ ఏం చేస్తాం.. ఇప్పటికీ పెళ్లికాని కోటీశ్వరుడిగానే మిగిలిపోయాడు.ఇన్ని మంచి అలవాట్లు ఉన్న జాన్సన్ ఇంకా సింగిల్గానే ఉన్నాడు. చాలా సార్లు డేటింగ్కు పిలిచినా అమ్మాయిలు నో చెప్పి పారిపోతున్నారట. ఇంతకీ ఈ బిలియనీర్ పెళ్లి కహానీ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. బ్రియాన్ జాన్సన్.. అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. అందంగా ఉంటాడు, మద్యం కూడా తాగడు. కాలిఫోర్నియాకు చెందిన ఈ బిజినెస్మ్యాన్ వందల కోట్లకు అధిపతి. వయసు 45. పెళ్లీడు ఎప్పుడో వచ్చి వెళ్లిపోయింది కూడా. కానీ జాన్సన్కు ఇంకా పెళ్లి కాలేదు. భాగస్వామి కోసం అతను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడట. వందల కోట్లున్నా తన జీవితంలో ఇంకా అమ్మాయి లేదని తెగ ఫీల్ అవుతున్నాడు. వయసు మీద పడుతున్నా యంగ్గా కనిపించేందుకు బ్రియాన్ జాన్సన్ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కూడా. దీనికోసం ఏడాదికి ఏకంగా రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అయినా నో యూజ్.. అమ్మాయిలు ఇతను చెప్పే కండిషన్స్ విని దూరంగా పారిపోతున్నారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో జాన్సన్.. పెళ్లికోసం తను పడుతున్న ఇబ్బందులను వివరించాడు. కోట్లున్నా తనకింకా పెళ్లి కాలేదని, భాగస్వామి దొరకడం కష్టమైపోయిందని ఆవేదన చెందాడు. అతను ఏమన్నాడంటే.. ''నేను రాత్రి 8.30 గంటలకే నిద్రపోతాను. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపు కేవలం 2250 కెలోరీలనిచ్చే ఆహార పదార్థాలనే తీసుకుంటాను. రోజుకు ఐదు గంటలు ఏకాగ్రత, మంచి లైఫ్స్టైల్ కోసమే కేటాయిస్తాను. పక్కా న్యూటిషియన్లు చెప్పిన డైట్నే ఫాలో అవుతాను. దీంతో పాటు ముడుచుకొని పడుకోవడం నాకు అలవాటు. ఇదే విషయాల గురించి అమ్మాయిలతో ప్రస్తావిస్తే వాళ్లు షాకవుతున్నారు.మొదట డేట్కు వస్తామని చెప్పిన వాళ్లు నా కండిషన్స్ లిస్ట్ చూసి నో చెబుతున్నారు.అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకుముందు మద్యం తాగే అలవాటు కూడా ఉండేది. కానీ దానివల్ల అదనపు క్యాలరీలు వచ్చి బరువు పెరుగుతానని దీనికి కూడా దూరంగా ఉంటున్నా. అందం కోసం రోజుకు 111 ట్యాబ్లెట్స్ వేసుకుంటా. ఇన్ని చేస్తున్నా నాకింకా పెళ్లి కాలేదు'' అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు జాన్సన్. -
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ఝన్వాలా: హాట్ టాపిక్గా ఆ చెక్
బిలియనీర్ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా'గా పాపులర్ అయిన బిలియనీర్ రాకేష్ ఝన్ఝన్వాలా కన్నుమూసి నేటితో సంవత్సరం. ఇప్పటికీ ఇప్పటికీ, దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు ఆయనంటే ఎనలేని ప్రేమ, అభిమానం. అంతేకాదు మార్కెట్ నిపుణులు అతని పెట్టుబడి సూత్రాలను, సక్సెస్మంత్రాను కథలు కథలుగా గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసిన సమయంలో కూడా ఆయన బుల్లిష్గా ఉన్నారు. స్టాక్మార్కెట్లో షేర్ల కొనడం, అమ్మడం అనేది తెలివికి సంబంధించిన చర్యలు కాదు జ్ఞానానికి సంబంధించి అంటారాయన. తాజాగా ఆయనకు సంబంధించి ఒక విషయం విశేషంగా మారింది. రాకేశ్ ఝన్ఝన్ వాలా రాసిచ్చిన అతిపెద్ద చెక్ ఇపుడు హాట్టాపిక్గా మారింది. రేర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ ఉత్పల్ షేత్ ప్రకారం, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కోకి రూ.1,500 కోట్ల చెక్కును రాసిచ్చారట.. అయితే ఇది పోర్ట్ఫోలియోలో 10శాతం కూడా కాదు ఆయన పెట్టుబడులను వివిధ షేర్లలో పెట్టేవారని కూడా ఆయన చెప్పారు. చార్టర్డ్ అకౌంటెంట్, రాకేష్ ఝన్ఝన్వాలా తన స్టాక్ మార్కెట్ పెట్టుబడులను 1980ల ప్రారంభించారు. కేవలం రూ. 5,000తో ప్రారంభించి, అద్భుతమైన విశ్లేషణతో పోర్ట్ఫోలియోను విస్తరించుకుని భారీ లాభాలను ఆర్జించారు. 2002 తర్వాత దశాబ్దం తర్వాత, ఆయన సంపాదన బిలియన్ల డాలర్లకు చేరింది.బిగ్ బుల్ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎలా ఎంపిక చేసుకుంటారనే విషయంపై 'ది బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్: హౌ రాకేష్ జున్జున్వాలా మేడ్ హిస్ ఫార్చ్యూన్' పుస్తకంలో కొన్ని కీలక అంశాలను చర్చించారు. తన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ రేర్ (రాకేష్, భార్య రేఖా పేర్లలోని లోని తొలి అక్షరాలను కలిపి) ఎంటర్ప్రైజెస్ ద్వారా ఆగస్ట్ 14, 2022 నాటికి ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సుమారు రూ. 46,000 కోట్లు పెరిగింది.ఐదు పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థలతో పాటు రేర్ ఈక్విటీ ప్రైవేట్ లిమిటెడ్, రేర్ ఫ్యామిలీ ఫౌండేషన్ మరియు హోప్ ఫిల్మ్ మేకర్స్ అనే మూడు సంస్థలలో డైరెక్టర్గా ఉన్నారు.ఫోర్బ్స్ జాబితా 2022లో 438వ బిలియనీర్గా ర్యాంక్ను సాధించారు. 2021 జాబితా ప్రకారం అతను భారతదేశంలో 36వ అత్యంత సంపన్నుడు. కాగా 1960 జులై 5న పుట్టిన రాకేష్ ఝన్ఝన్వాలా 62 ఏళ్ల వయసులో గత ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసారు. మరణానంతరం ఆయనకు వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చేసిన కృషికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ లభించింది. ఈ అవార్డును రేఖా ఝన్ఝన్ వాలా అందుకున్నారు -
డీఎల్ఎఫ్ షేర్లు విక్రయించిన సింగ్
న్యూఢిల్లీ: బిలియనీర్ కేపీ సింగ్సహా.. ప్రమోటర్ సంస్థలు మల్లికా హౌసింగ్ కంపెనీ, బెవర్లీ బిల్డర్స్.. రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ షేర్లను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 1,087 కోట్ల విలువైన వాటాను మంగళవారం అమ్మివేశాయి. మల్లికా హౌసింగ్లో సింగ్ కుమార్తెలు పియా సింగ్, రేణుకా తల్వార్ ప్రధాన వాటాదారులుకాగా.. బెవర్లీ బిల్డర్స్లో సింగ్ ప్రధాన వాటాదారుగా ఉన్నారు. డీఎల్ఎఫ్లో 0.24 శాతం వాటాకు సమానమైన 60 లక్షల షేర్లను మల్లికా హౌసింగ్, 0.04 శాతం వాటాకు సమానమైన 10.99 లక్షల షేర్లను బెవర్లీ బిల్డర్స్ విక్రయించాయి. బీఎస్ఈ గణాంకాల ప్రకారం కేపీ సింగ్ దాదాపు 1.45 కోట్ల షేర్ల(0.59 శాతం వాటా)ను విక్రయించారు. షేరుకి రూ. 504.21 ధరలో విక్రయించిన వీటి విలువ రూ. 1,087 కోట్లు. జూన్కల్లా కంపెనీలో ప్రమోటర్లు 74.95 శాతం వాటా కలిగి ఉన్నారు. బల్క్ డీల్స్ వార్తల నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేరు బీ ఎస్ఈలో 1% నీరసించి రూ. 494 వద్ద ముగిసింది. -
క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్కేసులో డెడ్బాడీ ముక్కలు
Fernando perez algaba: అర్జెంటీనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఇన్ప్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా (41) అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. గత వారం రోజులకు ముందు తప్పిపోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక సూట్ కేసులో ఆయన మృతదేహానికి చెందిన కొన్ని భాగాలను పోలీసులు కనుగొన్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లోని ఒక ప్రవాహం సమీపంలో సూట్కేస్లో అల్గాబా అవశేషాలను పోలీసులు కను గొన్నారు. అనుమానాస్పద ఎర్రటి సూట్కేస్ని కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా గుర్తించారు. దీంతో పెద్దల సాయంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా సూట్కేసులో అల్గాబా కాళ్లు, ముంజేతులు కనుగొన్నారని పోస్ట్ పేర్కొంది. అతని మరో చేయి ప్రవాహంలో కనిపించింది. చివరికి బాధితుడి మొండెం, కత్తిరించిన తల వంటి మరిన్ని శరీర భాగాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని బాడీ మీద ఉన్న వివిధ రకాల టాటూలు , వేలిముద్ర విశ్లేషణ ద్వారా అతని గుర్తించారు. అప్పుల కారణంగానే హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ, శవపరీక్షలో ఫెర్నాండో పెరెజ్ అల్గాబా శరీరం మూడు బుల్లెట్ గాయాలున్నట్టు తేలింది. ఇదొక ఒక ప్రొఫెషనల్ నేరగాడి పని అని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అతను చాలా అప్పుల్లో ఉన్నాడని, మోసం ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఫెర్నాండో పెరెజ్ అల్గాబా మరణానికి కారణాలను పోలీసుల విచారిస్తున్నారు. కాగా అల్గాబా విలాసవంతమైన వాహనాలను అద్దెకు ఇవ్వడం, క్రిప్టోకరెన్సీని విక్రయించడం ద్వారా భారీ సంపదను ఆర్జించాడు. ఇన్స్టాగ్రామ్లో దాదాపు మిలియన్ ఫాలోయర్లు ఉన్నరు. విలాసవంతమైన జీవనశైలిని అనుసరించే ఈ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ ఎల్లప్పుడూ ‘ రాగ్స్ టు రిచెస్ స్టోరీ’ ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. అతనికి అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. 24 ఏళ్లకే అల్గాబా విలాసవంతమైన కార్లు, మోటార్సైకిళ్లు, జెట్ స్కీ లాంటి ఆస్తులున్నాయి. వీటిపై కూడా చాలా వివాదాలు ఉన్నట్టు సమాచారం. జూలై 19 నుంచి కనిపించకుండా పోయాడు. -
లండన్లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్
యూకే రాజధాని నగరంలో అతిపెద్ద రెసిడెన్షియల్ డీల్ను భారత దేశానికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ సొంతం చేసుకున్నారు.ఎస్సార్ గ్రూప్కు సహ-యజమాని రవి రుయా ఇంద్ర భవనం లాంటి ఇంటిని కొనుగోలు చేశారు. రష్యన్ ప్రాపర్టీ ఇన్వెస్టర్ ఆండ్రీ గోంచరెంకోకు సంబంధించిన ఈ ప్రాపర్టీ విలువ దాదాపు రూ. 1200 కోట్లు. (145 మిలియన్ డాలర్లు) . 150 పార్క్ రోడ్లోని రీజెంట్స్ పార్క్కి ఎదురుగా ఉన్న హనోవర్ లాడ్జ్ మాన్షన్ను ఇంటిలోని జిబ్రాల్టర్-ఇన్కార్పొరేటెడ్ హోల్డింగ్ కంపెనీ విక్రయం ద్వారా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భవనం ఇటీవలి రెండేళ్ల క్రితం రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థ అనుబంధ సంస్థ గాజ్ప్రోమ్ ఇన్వెస్ట్ యుగ్ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోంచరెంకో యాజమాన్యంలో ఉంది. 2012లో కన్జర్వేటివ్ పార్టీ పీర్ రాజ్కుమార్ బగ్రీ లీజుకు తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ నిర్మాణంలో ఉందనీ, ఇది కుటుంబ కార్యాలయానికి ఆకర్షణీయమైన పెట్టుబడిగా చేసే ధరకు అందుబాటులోకి వచ్చింద ని రుయా ఫ్యామిలీ ఆఫీస్ ప్రతినిధి విలియం రెగో ఒక ప్రకటనలో తెలిపారని పలు మీడియా సంస్థలు నివేదించాయి. గత ఏడాది లండన్లో విదేశీ సంస్థల రిజిస్టర్ విధానంలో పారదర్శకతను తీసుకు రావడానికి ప్రయత్నించిన తర్వాత కూడా లండన్ అల్ట్రా-ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్లో ఇప్పటికీ గోప్యంగానే ఉండటం విశేషం. అయితే ఈ ఆంక్షల ఫలితంగా ఇప్పటిదాకా చాలా రహస్యంగా జరిగే విలాస వంత గృహాలు క్రయ విక్రయాల్లో కాస్త మార్పు వచ్చింది. బ్రోకర్ హాంప్టన్స్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత ఏడాది చివరి మూడు నెలల్లో లండన్ ఇళ్ల విక్రయాలు భారీగానే నమోదైనాయి. -
వందల కోట్లు వదిలి.. సన్యాసిగా మారిన బిలియనీర్!
Billionaire to Monk: సాధారణంగా ఎవరైనా కడు పేదరికం నుంచి సంపన్న జీవితం గడపాలని కలలు కంటారు. సంపన్న జీవితం వదిలి సన్యాసిగా బతకాలని మాత్రం ఎవరూ అనుకోరు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారిని వేళ్ళమీద లెక్కపెట్టేయొచ్చు. 'భన్వర్లాల్ రఘునాథ్ దోషి' (Bhanwarlal Raghunath Doshi) ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాజస్థాన్లో చిన్న వస్త్ర వ్యాపారి అయిన తన తండ్రి నుంచి రూ.30,000 తీసుకుని ప్లాస్టిక్ వ్యాపారం ప్రారంభించాడు భన్వర్లాల్. కొన్ని సంవత్సరాలలోనే వ్యాపారంలో గణనీయమైన వృద్ధి సాధిస్తూ ఢిల్లీ కింగ్గా పేరుతెచ్చుకున్నాడు. క్రమంగా ఎంతో నేర్పుతో తన వ్యాపారాన్ని రూ. 600 కోట్లకు విస్తరించాడు. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) జైన మతాన్ని స్వీకరించాలని, మత బోధకుడిగా మారాలనే కోరికతో కోట్ల సామ్రాజ్యం త్యజించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం తెలిసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు. అనుకున్న విధంగానే అహ్మదాబాద్లో జరిగిన భారీ వేడుకలో, లక్షలాది మంది ప్రజల సమక్షంలో దోషి జైన్ ఆచార్య శ్రీ గుణరత్న సురిష్వరాజ్ జీ మహారాజ్ నుంచి శిష్యరికం పొందాడు. ఈ వేడుకకు హాజరైన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దోషిని సత్కరించారు. (ఇదీ చదవండి: బైక్కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!) ఎప్పటినుంచో సన్యాసి కావాలని అనుకుంటున్న దోషి.. కుటుంబం, వ్యాపార లావాదేవీల వల్ల 1982లో తన ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేశాడు. అనుకున్నది సాధించిన తర్వాత జైన మతం స్వీకరించారు. ఈ వేడుక 3.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో వైభవంగా జరిగింది. మొత్తానికి కోట్లు వదులుకుని జైన మతాన్ని స్వీకరించి ఎంతోమందికి ఆదర్శనీయుడయ్యాడు. -
కోటీశ్వరుడి కూతురు.. జాగింగ్ వెళ్లడమే శాపమైంది..
కోటీశ్వరుని కూతురు.. వృత్తిరీత్యా టీచర్.. గౌరవప్రదంగా సాగిపోతున్న జీవితం. దానికి తోడు ఎంత తిన్నా.. తరగని సంపదలు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచే వ్యక్తిత్వం ఆమెది. అందిరినీ కలుపుకుపోయే తత్వం.. శత్రుత్వం అనే మాటే తెలియదు. ఉదయాన్నే 4 గంటలకే వ్యాయామం వెళ్లడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు. కానీ ఓ రోజు ఉదయం.. అదే చివరి వ్యాయామం అయింది. అంత మంచి ఆవిడకు ఏమైంది? ఆవిడను ఎవరు హతమార్చారు? ఆమె పేరు ఎలిజా ఫ్లెచర్(34). ఆవిడ తండ్రి కోటీశ్వరుడు. వారు అమెరికాలోని టెన్నిసీ నగరంలో నివసిస్తున్నారు. ఫ్లెచర్ వృత్తిరీత్యా టీచర్గా పనిచేస్తున్నారు. ఇటు తల్లిగా.. టీచర్గా తన విధిని చక్కగా నిర్వర్తిస్తున్నారు. కావాల్సినంత డబ్బు.. జీవితం సుఖంగా సాగుతుంది. అయితే.. ఫ్లెచర్కు ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగు గంటలకే వ్యాయామానికి వెళ్లే అలవాటు ఉంది. ఆ రోజు అలాగే వ్యాయామానికి వెళ్లింది. అనుకోని అతిథి.. ఫ్లెచర్ రోడ్డు వెంట జాకింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎదురయ్యాడు ఓ కరుడుగట్టిన నేరస్తుడు. యూనివర్శిటీ ఆఫ్ మెంఫీస్ క్యాంపస్ వద్ద ఆమె మార్గానికి అడ్డుతగిలాడు. చీకటిగా ఉన్న కొండ ప్రాంతానికి లాక్కెళ్లాడు. గన్తో తలపై కాల్చేశాడు. బాధితురాలు ఫ్లెచర్ మృతదేహాన్ని ఓ కొండ ప్రాంతంలో గుర్తించామని పోలీసులు తెలిపారు. అటాప్సీ నివేదికల ప్రకారం బాధితురాల్ని గన్తో తల వెనక భాగంలో కాల్చినట్లు తేలింది. ఎలా పట్టుబడ్డాడంటే.. ఆ మరుసటి రోజే క్లియోథా అబ్స్టన్ అనే నిందితున్ని అరెస్టు చేశారు పోలీసులు. ఆమె మృతదేహం లభ్యమైన సమీప ప్రాంతంలోనే సర్వేలెన్స్ ఆధారంగా అబ్స్టన్ను పట్టుకున్నట్లు చెప్పారు. అయితే.. ఫ్లెచర్పై దాడి జరిగిన ప్రాంతంలో వదిలిన చెప్పుల జోడు ఆధారంతో డీఎన్ఏ రిపోర్టుల ద్వారా నిందితున్ని గుర్తించామని వెల్లడించారు. మరణశిక్ష విధించాలని డిమాండ్.. గత ఏడాది సెప్టెంబర్ 2న ఈ ఘటన జరిగగా.. ప్రస్తుతం కోర్టు విచారణ జరుపుతోంది. దోషికి మరణశిక్ష విధించాలని బాధితురాలు తరుపు న్యాయవాది న్యాయమూర్తిని కోరారు. నేరస్తుడు బాధితురాలిపై వ్యవహరించిన తీరు హేయమైనదని చెప్పారు. ఫ్లెచర్ కుటుంబ సభ్యులు కూడా దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటి కేసుల్లో చట్టాన్నే అనుసరించి శిక్ష విధించాల్సి వస్తుందని న్యాయమూర్తి తెలిపారు. నేర చరిత్ర.. గతంలోనే అబ్ట్సన్కు చాలా నేర చరిత్ర ఉంది. అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో ఓ మర్డర్ కేసులో ఇప్పటికే 20 ఏళ్ల శిక్షను అనుభవించాడు. కాగా.. 2021 ఆగష్టులో అబ్ట్సన్ తనపై దాడి చేశాడని అలిసియా ఫ్రాంక్లిన్ అనే మహిళ ఆరోపించారు. తనను గన్తో బెదిరించి ఖాలీగా ఉండే అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లాడని తెలిపారు. అనంతరం తన కళ్లకు గంతకు కట్టి.. కారు వెనక భాగంలో పడేసి అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఈ ఘనటపై ఆమె పోలీసులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. కానీ పోలీసులు సరిగా వ్యవహరించలేదని ఆరోపించారు. ఇదీ చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు -
40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?
సత్యాన్వేషణలో రాజ్యాన్ని భార్యా బిడ్డల్నీ త్యజించిన సిద్ధార్థుడి గురించి చదువుకున్నాం. ప్రజలకోసం వేల ఎకరాల సొంత ఆస్తిని వదులుకున్న కమ్యూనిస్టు నేతల గురించి విన్నాం. ఇపుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా మారే అవకాశాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్న బౌద్ధ సన్యాసి గురించి తెలుసుకుందాం. ఆయనే బుద్ధిస్ట్ మాంక్ వెన్ అజాన్ సిరిపన్యో. బిలియనీర్ ఆనంద కృష్ణన్ ఏకైక కుమారుడు. సిరిపన్యో గురించి తెలుసుకునేముందు అతని తండ్రి ఆనంద కృష్ణన్ గురించి తెలుసుకోవాలి. రూ. 40,000 కోట్ల సంపద మలేషియా-తమిళ వ్యాపారవేత్త బిజినెస్టైకూన్. తత్పరానందం ఆనంద కృష్ణన్ను ఏకే అని కూడా పిలుస్తారు. టెలికాం, మీడియా, ఉపగ్రహాల్లో వ్యాపారం, అయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్ లాంటి వాప్యారాల్లో ఆరితేరిన దిగ్గజం. దీంతోపాటు కృష్ణన్కి కలిపి కనీసం 9 కంపెనీల్లో వాటాలున్నాయి. ఈ భారీ సంపద మలేషియా టాప్ బిలియనీర్లలో మూడోవాడిగా ఆనంద్ కృష్ణన్ను నిలిపింది. అంతేకాదు ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు స్పాన్సర్ చేసిన భారతీయ ఫోన్ కంపెనీఎయిర్సెల్ యజమాని. సిరిపన్యోతోపాటు, కృష్ణన్కి ఇద్దరు కుమార్తెలున్నారు. (వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) 18 ఏళ్లకే సన్యాసం మలేషియాలో విద్య, కళలు, క్రీడలు తదితర విషయాల్లో భూరి విరాళాలిచ్చిన గొప్ప పరోపకారి. ఆనంద కృష్ణన్ కూడా బౌద్ధుడే కావడం గమనార్హం. బహుశా ఈ నేపథ్యమే ఆయన కుమారుడు సిరిపన్యో కేవలం 18 సంవత్సరాల వయస్సులో బౌద్ధ సన్యాసిగా మారడానికి దారి తీసి ఉంటుంది. సరదా కోసం సన్యాసం స్వీకరించిన అతను చివరికి శాశ్వత సన్యాసిగా మారిపోయినట్టు తెలుస్తోంది. అలా తండ్రినుంచి వచ్చిన కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని వదులుకొని ఆధ్యాత్మిక శాంతికోసం దాదాపు రెండు దశాబ్దాలుగా పైగా సిరిపన్యో భిక్షాటన చేస్తూ జీవించడం ప్రముఖంగా నిలుస్తోంది. సిరిపన్యో తల్లి థాయ్ రాజ కుటుంబానికి చెందిన వారట. యూకేలో తన 2 సోదరీమణులతో పెరిగిన సిరిపన్యో ఇంగ్లీష్, తమిళం, థాయ్ పాటు దాదాపు 8 భాషలు మాట్లాడ గలడని ప్రతీతి. అతని కదలికలు, వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. కానీ ఒకసారి ఇటలీలో తండ్రి 70వ పుట్టినరోజు సందర్భంగా కృష్ణన్ను కలవడానికి ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తుండగా గుర్తించినట్టు చెబుతారు. "నా సంపదతో నా స్వంత కొడుకును పోషించే స్తోమత కూడా లేదు" అని తన కుమారుడు సన్యాసిగా మారిపోయిన వైనాన్ని గుర్తించిన కృష్ణన్ వ్యాఖ్యానిచారట. -
టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే..
వాషింగ్టన్: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ అవశేషాలను సందర్శించడానికి వెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్ వాహనం విస్ఫోటం చెందడంతో అందులో ప్రయాణిస్తోన్న అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే జలాంతర్గామి శకలాలను కూడా వెలికితీశారు. ఈ సందర్బంగా మృతులలో ఒకరైన పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ భార్య భర్త, కుమారుడు చివరి రోజుల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన బిలియనీర్ షాహ్జాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్ ఈ నాలుగు గంటల సాహస యాత్రకు ముందు మానసికంగా చాలా సిద్ధపడ్డారని తెలిపారు షాహ్జాదా భార్య క్రిస్టీన్ దావూద్. మా అబ్బాయి అయితే టైటానిక్ చూడటానికి వెళ్తున్నానని తెలియగానే చాలా సంబరపడ్డాడు. వాస్తవానికి నేను కూడా వారితో వెళ్లాల్సి ఉండగా అనుకోని పరిస్థితుల్లో ఈ ట్రిప్ వాయిదా పడటంతో నాకు బదులుగా మా అబ్బాయి అందులో ప్రయాణించాడు. ఈ ట్రిప్ జరిగిన రోజున కూడా ఫ్లైట్ ఆలస్యం కావడంతో పోలార్ ప్రిన్స్ (టైటాన్ జలాంతర్గామి మొదలైన చోటు) చేరుకోవడానికి ఆలస్యమైంది. ఆరోజు ఫ్లైట్ మరింత ఆలస్యమైనా బాగుండేది. ఓషన్ గేట్ సంస్థ వారు దీని వలన ఏ ప్రమాదం ఉండడదని చెబుతూ రావడంతో మాకు దాని పనితీరుపై కొంచెమైనా అనుమానం కలగలేదు. కానీ అందులో ప్రయాణం ఇంజిన్ సరిగా పనిచేయని ఫ్లైట్లో ఎగరడమేనని ఆరోజు గ్రహించలేకపోయాము. షాహ్జాదా , సులేమాన్ ఇద్దరూ చివరి రోజుల్లో బంక్ బెడ్ ల మీద పడుకోవడం, బఫెట్ తరహా భోజనాలు అలవాటు చేసుకోవడం, తరచుగా టైటానిక్ సినిమాను చూసేవారని చెప్పుకొచ్చారు. జలాంతర్గామి నీటిలోపలికి వెళ్ళగానే అందులోని లైట్లన్నిటిని ఆర్పేస్తారని మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ చిన్న వెలుతురులో చుట్టూ ఉన్న చేపలను మాత్రం చూడవచ్చని ఓషన్ గెట్ సంస్థ చెప్పినట్లు తెలిపారు క్రిస్టీన్. ఏదైతేనేం సరైన ప్రమాణాలు పాటించని ఈ ట్రిప్ నిర్వాహకుల అజాగ్రత్త, ప్రయాణికుల అవగాహనలేమి కలగలిసి విహారయాత్ర కాస్తా విషాద యాత్రగా ముగిసింది. ఇది కూడా చదవండి: రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్.. -
యంగెస్ట్ బిలియనీర్.. తర్వాతి ఎలాన్ మస్క్ ఇతడేనా?
మనం ఎందరో మిలియనీర్లు, బిలియనీర్ల గురించి తెలుసుకున్నాం.. కొందరు ఉన్నత వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందినవారైతే.. ఎటువంటి నేపథ్యం లేకుండా స్వయం కృషితో ఎదిగినవారు మరికొందరు. 25 ఏళ్ల వయస్సులో స్థిరమైన సంకల్పం, మేధస్సుతో బిలియనీర్ అయ్యాడు అలెగ్జాండర్ వాంగ్. సాంప్రదాయ విద్య పరిమితులను అధిగమించి ఆవిష్కరణ శక్తితో సాంకేతిక ప్రపంచంలో ఎదిగి బిలియనీర్గా అవతరించిన ఇతన్ని తదుపరి ఎలోన్ మస్క్గా పిలుస్తున్నారు. చిన్నప్పటి నుంచే గణితంలో విశేషమైన ప్రతిభ ఉన్న అలెగ్జాండర్ వాంగ్ గణిత, కోడింగ్ పోటీలలో పాల్గొనడానికి ఇష్టపడేవాడు. 25 ఏళ్ల వయసులో 2022వ సంవత్సరంలో వాంగ్ ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్గా అవతరించాడు. ఫోర్బ్స్ 2022 నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా వాంగ్ స్థాపించిన ‘స్కేల్ ఏఐ’ సంస్థ అమెరికా వైమానిక దళం, సైన్యానికి ఆర్టిఫీషియల్ వినియోగంలో సహకారం అందిస్తోంది. దీనికి సంబంధించి 110 మిలియన్ డాలర్ల విలువైన మూడు ఒప్పందాలను ఆ సంస్థ కలిగి ఉంది. చిన్న వయసు నుంచే.. అలెగ్జాండర్ వాంగ్ తల్లిదండ్రులు భౌతిక శాస్త్రవేత్తలు. యూఎస్ మిలిటరీ ఆయుధాల ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. వాంగ్ విద్యార్థిగా ఉన్నప్పుడే కెరియర్ను ప్రారంభించాడు. 17 ఏళ్ల వయసులో తోటి విద్యార్థులు ఉన్నత సిద్ధమవుతున్న సమయంలో వాంగ్.. అడేపర్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. అదే సంవత్సరం 2014లో కోరా సంస్థకి మారాడు. అక్కడ అతను టెక్, స్పీడ్ లీడ్గా పనిచేశాడు. కాలేజీ డ్రాపౌట్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ (మిట్)లో బీఎస్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేసిన వాంగ్ మొదటి సంవత్సరం పూర్తయ్యాక చదువును, హడ్సన్ రివర్ ట్రేడింగ్లో చేస్తున్న అల్గారిథమ్ డెవలపర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి స్నేహితుడు వాంగ్ లూసీ జియోతో కలిసి ‘స్కేల్ ఏఐ’ కంపెనీని ప్రారంభించాడు. కోరాలో పనిచేస్తున్నప్పుడు వాంగ్, జియో కలుసుకున్నారు. యూఎస్ స్టార్టప్ యాక్సిలరేటర్ వై కాంబినేటర్ నుంచి పెట్టుబడితో ‘స్కేల్ ఏఐ’ని స్థాపించారు. వేసవి సెలవుల్లో భాగంగా ఈ స్కేల్ ఏఐని స్థాపించినట్లు తన తల్లిదండ్రులకు చెప్పినట్లుగా వాంగ్ ఫోర్బ్స్తో తెలిపాడు. అయితే అనుకోకుండా తాను మళ్లీ కాలేజీకి వెళ్లలేక పోయానని పేర్కొన్నాడు. వాంగ్ కంపెనీ 2021లో 350 మిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. ఈ ఆర్థిక తోడ్పాటుతో మరింత ఎదిగిన స్కేల్ ఏఐ కంపెనీ 100 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ సంస్థ విలువను 7.3 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. ప్రస్తుతం అలెగ్జాండర్ వాంగ్ నికర సంపద విలువ 1 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. Today, @scale_AI is launching our 2 major platforms to bolster government and enterprise: 🎖 Scale Donovan, the AI copilot for defense 🏙 Scale EGP, full-stack generative AI for global enterprise 👇 See Donovan in action below 🧵 on our platforms and why they are so critical pic.twitter.com/RcdtnL0Btj — Alexandr Wang (@alexandr_wang) May 10, 2023 ఇదీ చదవండి: Virji Vohra: బ్రిటిషర్లు, మొఘల్ చక్రవర్తులకే అప్పు.. నాటి సంపన్న భారతీయ వ్యాపారి గురించి తెలుసా? -
అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్ టైకూన్ విషాద గాథ
టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రమాదం తీవ్ర విషాదాన్నినింపింది. అట్లాంటిక్ మహాసముద్రంలో వందేళ్ల క్రితం మునిగిన టైటానిక్ షిప్ శిథిలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన టైటాన్ సబ్మెర్సిబుల్లోని ఐదుగురూ మరణించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ గురువారం ధృవీకరించింది. చనిపోయిన వారిలో ఓషన్గేట్ ఎక్స్పెడిషన్స్ సీఈఓ స్టాక్టన్ రష్, బ్రిటీష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్ పాకిస్థాన్ బిలియనీర్ షహజాద్ దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నారు. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన ఈ ప్రమాదంలో తండ్రీ కుమారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారనే అంచనా మరింత విషాదాన్ని నింపింది. అయితే చనిపోయారని భావిస్తున్న దావూద్కి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. పాకిస్తానీ టైకూన్ షాజాదా దావూద్, భార్య ప్రకారం భయంకరమైన విమాన ప్రమాదం నుండి బయట పడ్డారు. ది డైలీ బీస్ట్ రిపోర్ట్ మేరకు క్రిస్టీన్ దావూద్ జనవరి 2019లో జరిగిన సంఘటన గురించి బ్లాగ్ పోస్ట్లోరాశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. విమానం అటూ ఇటూ ఊగిపోవడంతో క్యాబిన్ మొత్తం ఒక్కసారిగా కేకలు పెట్టింది. బాక్సర్ని అన్ని దిక్కుల నుండి పంచ్లు కొట్టినట్లుగా అనిపించింది. చివరకు సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు ఆ క్షణాలు ఎలా గడిచాయో తెలియదని క్రిస్టీన్ వెల్లడించింది. ఈ ఫ్లైట్ నా జీవితంలో మరచిపోలేని భయకంరమైన వాటిలో ఒకటి అని చెప్పుకొచ్చారు. అయితే ఏ విమానంలో, ఎక్కడికి పోతుండగా జరిగిందనేది ఆమె వివరించలేదు. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) అంతేకాదు ఈ యాత్రకు సులేమాన్ వెళ్లాలని అనుకోలేదని, బలవంతంగా వెళ్లాడని హజాద్ సోదరి, సులేమాన్ అత్తయ్య అజ్మే దావూద్ ప్రమాదానికి ముందు చెప్పుకొచ్చారు. అసలు టైటాన్లో సముద్రగర్భంలోకి వెళ్లడానికి సులేమాన్ బాగా భయపడ్డాడని కూడా తెలిపారు. అయితే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి యాత్ర చాలా ముఖ్యం కావడం తోనే తాను వెళ్లడానికి అంగీకరించాడట. చివరకు వీరి సాహస ప్రయాణం విషాదాంతమైంది. (అపుడు కరోడ్పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) -
గల్లంతైన టైటాన్లో బ్రిటిష్ బిలియనీర్.. ఏవరీ హమీష్ హార్డింగ్?
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శకలాల్ని చూడటానికి వెళ్లిన పర్యాటక జలంతర్గామి (Submarine)ఆదివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో అందులో ముగ్గురు టూరిస్ట్లతోపాటు మరో ఇద్దరు ఉన్నారు. సబ్ మెర్సిబుల్ గల్లంతై మూడు రోజులు దాటినా ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. దీంతో అంట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన జలాంతర్గామిని గుర్తించేందుకు అమెరికా, కెనాడా కోస్ట్గార్డ్ దళాలు ముమ్మరంగా జల్లెడపడుతున్నాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న జలగర్భాల్లో ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను, పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలో దించారు. కాగా మిస్సైన జలంతర్గామి ‘టైటానిక్ సబ్మెర్సిబుల్’లో పాకిస్థాన్కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్, బ్రిటిష్ సంపన్నుడు, వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ పైలట్ పాల్ హెన్రీ నార్జిలెట్ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. చదవండి: టైటాన్ మిస్సింగ్.. ఎలాన్ మస్క్కు బిగ్ ఫెయిల్యూర్..? బ్రిటిష్ బిలియనీర్ అయితేబ్రిటన్కు చెందిన 58ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్కు చెందిన యాక్షన్ ఏవియేషన్స్ కంపెనీ చైర్మన్గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్ బెజోస్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. పాక్ సంపన్నులు బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. ఈ మేరకు వారి కుటుంబం ధృవీకరించింది. షాజాదా.. పాక్లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్కు వైస్ ఛైర్మన్. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. చదవండి: Titanic Sub: ఆక్సిజన్ అయిపోతోంది.. టైటాన్ జాడేది? కాగా ఓషియన్ గేట్ అనే సంస్థ టైటానిక్ శకలాల సందర్శన యాత్రను నిర్వహిస్తోంది. ఇందుకు ‘టైటాన్’ పేరుతో 21 అడుగుల పొడవైన మినీ జలంతర్గామిని వాడుతోంది. ఈ ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.2 కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి ఈ సాహసయాత్ర ప్రారంభం కాగా.. రెండు గంటల్లోనే జలంతార్గామితో పోలార్ ప్రిన్స్కు సంబంధాలు ఎతగిపోయాయి. దీంతో టైటాన్ ఆచూకీ కనుగునేందుకు కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో 13,000 అడుగుల (4,000 మీటర్లు) నీటి లోతున ఉన్న ఉత్తర అట్లాంటిక్లో కోస్ట్గార్డ్లు గాలిస్తున్నారు. ఇక విలాసవంతమైన టైటానిక్ షిప్ 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. అక్కడి శిథిలాలను చూసేందుకు వెళ్తున్నప్పడే జలాంతర్గామి అదృశ్యమైంది. ఇక జలాంతర్గామిలో కొద్ది గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉండటంతో సమయం గడుస్తున్నా కొద్దీ వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. -
భారతదేశంలో ఫస్ట్ బిలీనియర్ ఇతడే.. సంపద ఎంతో తెలుసా?
India First Billionaire Mir Osman Ali Khan: ఈ రోజు భారతదేశంలో అత్యంత సంపన్నులుగా ముకేశ్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, లక్ష్మీ మిట్టల్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇండియాలో చెప్పుకోదగ్గ బిలీనియర్ ఉండేవాడు. ఆయన గురించి బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. క్వీన్ ఎలిజబెత్కు సైత బహుమతులు అందించిన ఆ బిలీనియర్ ఎవరు? అతని సంపద ఎంత ఉండేది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటీష్ పాలిత భారతదేశం ఒకప్పుడు సంపదలతో తులతూగుతూ ఉండేదని చరిత్రకారులు రాసిన గ్రంధాల ద్వారా తెలుస్తోంది. మన దేశంలో తొలి బిలియనీర్ 'మీర్ ఉస్మాన్ అలీ ఖాన్' (Mir Osman Ali Khan). 1886లో జన్మించిన అలీ ఖాన్ హైదరాబాద్ చివరి నిజాం రాజు. ఈయన 1911 నుంచి 1948 వరకు భారతదేశం విలీనం అయ్యే వరకు పాలించాడు. నిజానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటీష్ వారికీ విధేయుడని, విభజన సమయంలో పాకిస్థాన్లో చేరాలని అక్కడే స్వాతంత్య్ర రాజ్యాన్ని పాలించాలని కలలు కన్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. 1980 - 90లలో ప్రపంచంలో ఉన్న పది మంది అత్యంత ధనవంతుల జాబితాలో ఈ నిజాం రాజు కూడా ఒకరు. ఆయన సంపదకు సంబంధించిన అధికారిక వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ 2 బిలియన్ డాలర్లు (1940లో) ఉంటాయని అంచనా. ఈ సంపద విలువ ఇప్పటి కరెన్సీ ప్రకారం సుమారు 35.8 బిలియన్లతో సమానం. ఇంత సంపద అప్పట్లో ఎవరికీ లేకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: 46 శాతం డిస్కౌంట్తో ప్రీమియం మొబైల్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే ఇలా చేయండి!) ఆధునిక హైదరాబాద్ వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందిన నిజాం భారతదేశపు మొదటి విమానాశ్రయం రూపొందించినట్లు చెబుతున్నారు. ఆయన హయాంలోనే హైదరాబాద్ రోడ్లు, రైల్వేలు అభివృద్ధి చేయడంతోపాటు విద్యుత్తును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా హైదరాబాద్ హైకోర్టు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్తో సహా అనేక ప్రభుత్వ సంస్థలను స్థాపించిన ఘనత కూడా నిజాం వంశానిదే అని చెబుతున్నారు. (ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?) నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఇతర నిజం రాజుల మాదిరిగా దుస్తులకు, ఇతరత్రా విషయాలకు డబ్బుని ఎక్కువగా ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అయితే ఈయన వద్ద పేపర్ వెయిట్ ఉండేదని అది 185 క్యారెట్ల వజ్రాలతో తయారు చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ వివాహం సమయంలో ఆమెకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చిన ఘనత కూడా నిజాం రాజు సొంతమే. దానిని క్వీన్ ఎలిజబెత్ మరణించే వరకు కూడా ఉపయోగించిందని సమాచారం. -ఎన్. కుమార్ -
పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!
Ajay Singh Tanwar: భారతదేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో 'అజయ్ సింగ్ తన్వర్' కూడా ఒకరు. పాతికేళ్ళు కూడా నిండని ఈ యువకుడు ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తులలో కూడా ఒకరుగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ఉపయోగించే కార్లలో చాలా వరకు ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉండటం గమనార్హం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నిజానికి అజయ్ తన్వర్ ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడుగా ఎదిగిన 'కన్వర్ సింగ్ తన్వర్' మనవడు. ఢిల్లీకి చెందిన సంపన్న పారిశ్రామికవేత్త అజయ్ సింగ్ తన్వర్ రాజకీయ, వ్యాపారం రంగాలకు చెందిన కుటుంబంలో జన్మించారు. ఇతడు ప్రపంచములోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లను కలిగి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి ఖరీదైన కార్లను కూడా చూడవచ్చు. అజయ్ గ్యారేజీలో మూడు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు, మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ లగ్జరీ సెడాన్ వంటివి ఉన్నాయి. ఈ మెర్సిడెస్ బెంజ్ కారు ధర రూ. 2.79 కోట్లని తెలుస్తోంది. దీనితో పాటు కస్టమైజ్డ్ వైట్ ఫోర్డ్ ముస్టాంగ్ సెడాన్, మెర్సిడెస్ బెంజ్జి 63 AMG వంటివి కూడా ఇతని గ్యారేజిలో ఉండటం గమనార్హం. భారతీయ రోడ్ల మీద అరుదుగా కనిపించే 'హమ్మర్ హెచ్2' కూడా ఇతని వద్ద ఉంది. దీనిని భారతదేశానికి ప్రైవేట్గా దిగుమతి చేసుకోవడం జరిగింది. (ఇదీ చదవండి: వాట్సాప్లో అదిరిపోయే 'ఎడిట్ మెసేజ్ ఫీచర్'.. దీన్నెలా వాడాలో తెలుసా?) రూ. 3 కోట్ల విలువైన లెక్సస్ LX530, రూ. 1.94 కోట్ల విలువైన బిఎండబ్ల్యు ఎక్స్5 ఎమ్, రూ. 1.5 కోట్ల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, రూ. 2.30 విలువైన ఆడి ఆర్8 స్పోర్ట్స్, ఆడి ఆర్ఎస్5, లంబోర్ఘిని గల్లార్డో కార్లు మాత్రం కాకుండా DC రూపొందించిన రూ. 2 కోట్ల విలువైన కారవ్యాన్ కూడా ఉంది. కార్లు మాత్రమే కాకుండా రెండు హెలికాఫ్టర్లు కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ) నివేదికల ప్రకారం, అజయ్ చత్తర్పూర్లో ఉన్న ఓషన్ పెరల్ గార్డెనియా, కింగ్స్ ఫోర్త్ అనే రెండు హోటళ్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. వ్యాపారం అనేది కుటుంబం నుంచి వారసత్వంగా లభించినట్లు గతంలోనే వెల్లడించారు. వ్యాపారంలో ఇతని కృషికి ఎలైట్ మ్యాగజైన్ 'మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ 2020' అవార్డును కూడా అందించింది. -
మదర్ థెరిసా వ్యక్తిగత వైద్యుడు.. రిచెస్ట్ డాక్టర్
బిలీనియర్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది వ్యాపారవేత్తలే, కానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒక డాక్టర్ కూడా చోటు సంపాదించుకున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఆయన సంపాదన ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డాక్టర్ దేవి శెట్టి (Dr. Devi Shetty) అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. 'నారాయణ హృదయాల' మాత్రం దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. 1984లో మదర్ థెరిసాకి మొదటి సారి గుండెపోటు వచ్చినప్పుడు ఆమెను సంప్రదించిన డాక్టర్ దేవి శెట్టి ఆ తరువాత దాదాపు ఐదు సంవత్సరాలు ఆమె వ్యక్తిగత వైద్యుడిగానే ఉన్నారు. ప్రముఖ కార్డియాక్ సర్జన్ అయిన దేవి శెట్టి బిలినియర్ మాత్రమే కాదు పరులకు ఉపకారం చేసే పరోపకారి కూడా. ఈయన 2001లో నారాయణ హృదయాలయను స్థాపించారు. ఆ తరువాత ఇది నారాయణ్ హెల్త్గా మారింది. ప్రస్తుతం ఇది 47 హెల్త్కేర్ సెంటర్లతో, రూ. 15,000 కోట్ల మార్కెట్ క్యాప్తో భారతదేశంలోని అతిపెద్ద హాస్పిటల్ చెయిన్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 'నారాయణ హృదయాల స్థాపించడం వెనుక మదర్ థెరిసా ఒక స్పూర్తిదాయకమైన శక్తి' అని ఒక కాలమ్లో రాసుకున్నట్లు సమాచారం. ఆమె పేద ప్రజలకు ఎలా సేవ చేసేదో అది చూసి తాను కూడా తన వంతు సేవ చేయాలనే సంకల్పంతో ఈ హాస్పిటల్ ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఒక గ్రామంలో జన్మించిన డాక్టర్ శెట్టి చిన్నతనంలోనే హార్ట్ సర్జన్ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే ఈ దిశవైపు అడుగులు వేస్తూ అనుకున్నది సాధించి 'హార్ట్ సర్జన్' అయ్యాడు. నిరంతర కృషితో దేశంలో ఆరోగ్య సంరక్షణకు గణనీయమైన కృషి చేసిన డాక్టర్ శెట్టి ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగాడు. (ఇదీ చదవండి: కియా నుంచి మరో నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?) డాక్టర్ శెట్టి మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి ఆ తరువాత యూకే, అమెరికాలో అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ విధానంలో గొప్ప అనుభవం పొందాడు. చదువు పూర్తయిన తర్వాత కార్డియాక్ సర్జన్గా ఉద్యోగం ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే ఈ రంగంపై ఆయనకున్న ఆసక్తి కారణంగా మరింత రాణించాడు. (ఇదీ చదవండి: విడుదలకు ముందే బుకింగ్స్ షురూ.. లాంచ్ అయితే రచ్చ.. రచ్చే!) ప్రస్తుతం భారతదేశంలో 30 కంటే ఎక్కువ ఆసుపత్రులతో 7,000 పడకలను కలిగి ఉన్న నారాయణ హృదయాల పేదలకు సరసమైన ధరలలోనే సేవలు అందిస్తూ తరిస్తోంది. భారతదేశంలో ఉన్న అతి గొప్ప డాక్టర్లలో ఒకరైన డాక్టర్ శెట్టి ఆస్తుల విలువ సుమారు రూ. 9,800 కోట్లు అని సమాచారం. ఈయన భారతదేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్ కైవసం చేసుకున్నాడు. అంతే కాకుండా టైమ్ మ్యాగజైన్ చేత ఆరోగ్య సంరక్షణలో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తులలో ఒకడుగా రికార్డు బద్దలు కొట్టాడు. -
అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్..
రూ.9 వేల కోట్ల నెట్వర్త్తో దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. రూ. 1 లక్షతో చిన్న కంపెనీని ప్రారంభించిన ఆయన రూ. 11వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్తో వి-గార్డ్ ఇండస్ట్రీస్, దాదాపు రూ. 2,500 కోట్లతో వండర్లా హాలిడేస్ వంటి కంపెనీలను స్థాపించి అభివృద్ధి చేశారు. వ్యాపారపరంగా ఇంత ఎత్తుకు ఎదిగిన కోచౌసెఫ్ను ప్రత్యేకంగా నిలబెట్టింది దశాబ్దం ఆయన క్రితం చేసిన నిస్వార్థ చర్య. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన కోచౌసెఫ్ 61 ఏళ్ల వయసులో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది తన కిడ్నీని దానం చేయడం. అది కూడా అపరిచితుడైన ఒక పేద ట్రక్కు డ్రైవర్కు. ఇందుకు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. వైద్యులు వారించినా లెక్క చేయలేదు. తాను ఇలా చేసింది.. శరీరం ఫిట్గా ఉంటే కిడ్నీలో ఒకదానిని దానం చేసినా ఫర్వాలేదని చాటి చెప్పడానికేనని తర్వాత ఓ ప్రముఖ దినపత్రికతో తెలిపారు. ఎవరీ కోచౌస్ఫ్ కోచౌసెఫ్ చిట్టిలపిల్లి? కేరళలోని త్రిస్సూర్ శివారులో 1950లో జన్మించారు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. స్థానిక చర్చి పాఠశాలలో చదువుకున్నారు. తరువాత త్రిసూర్లోని సెయింట్ థామస్ కళాశాల నుంచి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1973లో తిరువనంతపురంలోని ఎలక్ట్రానిక్స్ కంపెనీలో వోల్టేజ్ స్టెబిలైజర్లు, ఎమర్జెన్సీ ల్యాంప్లను తయారు చేయడం ప్రారంభించారు. మూడేళ్లపాటు అక్కడ సూపర్వైజర్గా పనిచేసిన కోచౌసెఫ్ ఉద్యోగం వదిలేసి రూ. 1 లక్ష మూలధనంతో 1977లో వి-గార్డ్ ఇండస్ట్రీస్ను స్థాపించారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన వి-గార్డ్ నేడు దేశంలోనే అతిపెద్ద స్టెబిలైజర్ బ్రాండ్. తన వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ కోచౌసెఫ్ 2000 సంవత్సరంలో కేరళలో మొట్టమొదటి వాటర్ థీమ్ పార్క్ను ప్రారంభించారు. అలాగే బెంగళూరులో వండర్లా పార్కును ఏర్పాటు చేసింది కూడా ఈయనే. ఇక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే.. కె. చిట్టిలపిల్లి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వెయ్యి నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. స్ట్రే డాగ్ ఫ్రీ ఉద్యమానికి అధ్యక్షత వహించారు. అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరిగా భారత ప్రభుత్వం నుంచి రాష్ట్రీయ సమ్మాన్ అవార్డుతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రాక్టికల్ విజ్డమ్ సిరీస్, తన ఆత్మకథ ‘ఒర్మక్కిలివాథిల్’తో సహా పలు పుస్తకాలను రచించారు. కోచౌసెఫ్ సతీమణి పేరు షీలా. వీరికి అరుణ్, మిథున్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు వి-గార్డ్, వండర్లా వ్యాపారాలను చూసుకుంటున్నారు. -
92 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు విడాకులిచ్చిన కోటీశ్వరుడు
వాషింగ్టన్: అమెరికా బిలియనీర్, మీడియా మొగల్గా ప్రఖ్యాతి గాంచిన రుపర్ట్ ముర్డోచ్ 92 ఏళ్ల వయసులో తన నాలుగో భార్య జెర్రీ హాల్(65)కు విడాకులు ఇచ్చారు. కేవలం 11 పదాల సందేశాన్ని ఈమెయిల్ చేసి ఆమెకు కటీఫ్ చెప్పారు. ఈ సమయంలో ఆమె ఇంట్లోనే ముర్డోచ్ కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం. 'మనమిద్దరం కచ్చితంగా మంచి సయమం గడిపాం. కానీ నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. నా న్యూయార్క్ లాయర్ తక్షణమే వచ్చి నిన్ను కలుస్తారు' అని జెర్రీకి ముర్డోచ్ విడాకుల సందేశం పంపారు. ఈ జంట దాదాపు 6 ఏళ్లు కలిసి ఉంది. ఇది ముర్డోచ్కు నాలుగో వివాహం కాగా.. జెర్రీకి మాత్రం మొదటిది. అయితే ఆమె అంతకుముందు రాక్స్టార్ మిగ్ జాగర్తో కొంతకాలం పాటు రిలేషన్లో ఉన్నారు. గతేడాది జూన్లో వీరి విడాకులు ఎలా జరిగాయనే విషయాన్ని జెర్రీ స్నేహితులు తాజాగా వెల్లడించారు. ముర్డోచ్ సందేశం చూసి జెర్రీ హాల్ మైండ్ బ్లాంక్ అయిందని వాపోయారు. ఆమెకు ఏం చేయాలో తెలియలేదని పేర్కొన్నారు. అంతేకాదు విడాకుల విషయం చెప్పిన అనంతరం కాలిఫోర్నియాలోని తన మ్యాన్షన్ హౌస్ విడిచి పెళ్లిపోవాలని జేర్రీకి ముర్డోచ్ 30 రోజులే గడువు ఇచ్చాడని తెలిపారు. ముర్డోచ్ 14.5 బిలియన్ డాలర్లకు అధిపతి. ఆయనకు మొత్తం ఆరుగురు సంతానం. వీరిలో ఒక్కరు కూడా జెర్రీ సంతానం కాదు. దీంతో అతని ఆస్తిలో ఆమెకు వాటా వచ్చే అవకాశం లేదు. 2016లో సెంట్రల్ లండన్లో ముర్డోచ్, జెర్రీల వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. ఈ ప్రపంచంలో తాను అత్యంత అదృష్టవంతుడినని, సంతోషమైన వ్యక్తిని అని ముర్డోచ్ రాసుకొచ్చారు. ఇక ట్విట్టర్లో ఎలాంటి పోస్టులు పెట్టొబోనని కూడా ఈ సందర్భంగాప్రకటించారు. మరో పెళ్లి అని ప్రకటించి.. అయితే జేర్రీకి విడాకులిచ్చి ఏడాది కూడా గడవక ముందే తాను ఐదో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత నెలలోనే ప్రకటించారు ముర్డోచ్. అన లెస్లే స్మిత్ను మనువాడుతానని చెప్పాడు. ఈమె ఏడు నెలలక్రితమే పరిచయమైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరు పెళ్లి ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. దీంతో ఐదో పెళ్లి అనుకోకుండా రద్దయింది. ది సన్, ది టైమ్స్ వంటి న్యూస్పేపర్లు, ఫాక్స్ న్యూస్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి మీడియా సంస్థలకు ముర్డోచ్ యజమాని. ఆస్ట్రేలియాలో జన్మించిన ఈయన అమెరికాలో స్థిరపడ్డారు. మీడియా మొగల్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారు. చదవండి: ఇదేందిరా అయ్యా.. పెళ్లి వేడుకలో వధువుకు చేదు అనుభవం -
ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!
బెంగళూరు రమేష్ బాబు లేదా ‘ఇండియన్ ' బిలియనీర్ బార్బర్’. 600 కార్ల కలెక్షన్ను గమనిస్తే ఎవరైనా ఔరా అనక తప్పదు. అందులోనూ అన్నీ ఖరీదైన కార్లే. ఎక్కువ భాగం బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్ రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ బ్రాండ్సే.బిలియనీర్ బాబుగా పాపులర్ అయిన రమేష్ బాబు ఒకప్పుడు కడు పేదవాడే. ఒక పూట తింటే రెండోపూటకు కష్టమే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూలిపనులకెళ్లాడు. జీవితం గడవడానికి అమ్మకు తోడుగా చాలా ఉద్యోగాలు చేశాడు. మరి బిలియనీర్గా ఎలా అవతరించాడు..? రమేష్ బాబు తండ్రి గోపాల్ బెంగళూరులో క్షురకుడుగా పని చేసేవారు. రమేష్ ఏడేళ్ల వయస్సులోనే తండ్రి కన్నుమూశారు. దీంతో తల్లి ముగ్గురు పిల్లలున్న కుటుంబానికి బెంగళూరులోని బ్రిడ్జ్ రోడ్లోని చిన్న బార్బర్ షాప్ ఒక్కటే జీవనాధారం. కేవలం 40-50 రూపాయలతో పిల్లల్ని పోషించేది. పిల్లల్ని చదివించింది. బట్టలు, పుస్తకాలు, ఫీజులు, అన్నింటికీ వినియోగించేది. మరోవైపు బార్బర్షాప్ను నిర్వహించలేక రోజుకు రూ.5 అద్దెకు ఇచ్చేయడంతో పరిస్థితి మరింత దుర్భరమైంది. ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకునే వారు. 13 సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్ డెలివరీ,మిల్క్ హోమ్ డెలివరీలాంటి ఎన్నో పనులు చేసిన కుటుంబ పోషణలో తల్లి ఆసరాగా ఉండేవాడు. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ 10వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి, చివరికి తండ్రి పాత దుకాణం 'ఇన్నర్ స్పేస్' లో బార్బర్గా పని చేయడం ప్రారంభించాడు. పట్టుదలతో కష్టించి పనిచేశాడు. అది త్వరలోనే ట్రెండీ స్టైలింగ్ అవుట్లెట్గా మారిపోయింది. హెయిర్స్టయిలిస్ట్గా బాగా పేరు గడించాడు. ఆ తర్వాత రమేష్ బాబు 1993లో తన మామ దగ్గర కొంత డబ్బు తీసుకుని మారుతీ ఓమ్నీ వ్యాన్ కొనుగోలు చేశాడు. ఈ కారు ఈఎంఐ చెల్లించేలేక ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాడు. అలా తన తల్లి పనిచేసే కుటుంబానికి చెందిన ఇంటెల్ కంపెనీ ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చే పని తీసుకుని ట్రావెల్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అది లాభసాటిగా ఉండటంతోపాటు, పర్యాటక రంగానికి ప్రభుత్వంప్రోత్సాహంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని లాంచ్ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ముప్పై ఏళ్లుగా సేవలందిస్తూ, ఖరీదైన కార్లను సేకరిస్తూనే ఉన్నాడు. అలా 600కు పైగా కార్లు అతని గారేజ్లో ఉన్నాయి.దాదాపు అన్నీ బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లంటేనే అతని వ్యాపారాన్ని అర్థం చేసుకోవచ్చు. వీటితోపాటు వ్యాన్లు, మినీబస్సులు కూడా ఉన్నాయి. తొలి లగ్జరీ కారు మెర్సిడెస్ ఈ కాస్ల్ సెడాన్ అతని తొలి లగ్జరీ కారు. దీని ధర రూ.38 లక్షలు. ప్రస్తుతం 3 కోట్ల ఆర్ఆర్ ఘోస్ట్, 2.6 కోట్ల ఖరీదైన మేబ్యాచ్ అతని ట్రావెల్స్లో ఉన్నాయి. రమేష్ బాబు కంపెనీ ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో నడుస్తుంది. అదే సమయంలో, అతని వ్యాపారం కొన్ని ఇతర దేశాలలో కూడా విస్తరించింది. దాదాపు 300 పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. బిగ్బీ, ఆమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీ కస్టమర్లు రమేష్ అన్ని కార్లను డ్రైవ్ చేయగలడు. అతని క్లయింట్ల జాబితా అంతా సెలబ్రిటీలు, బిలియనీర్లే. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు కూడా వారు పట్టణంలో ఉన్నప్పుడు కార్లను అద్దెకు తీసుకుంటారట. రోజుకు వసూలు చేసే అద్ద 50వేల రూపాయలకు పై మాటే. అన్నట్టు ఇప్పటికీ తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. బిలియనీర్ బాబు మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్లోని తన దుకాణానికి వెళ్తాడు. నిజంగా రమేష్ బాబు కథ స్ఫూర్తిదాయకం. 2 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్గా ఫోర్బ్స్ గుర్తించింది. -
రూ. 30వేల కోట్ల సంపదకు అధిపతి - ఎవరీ లీనా తివారీ?
ఫోర్బ్స్ (Forbes) యాన్యువల్ బిలినియర్స్ జాబితాను 2023 ఏప్రిల్ 04న విడుదల చేసింది. ఇందులో రిలయన్స్ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. ఈ లిస్ట్లో మొత్తం 16 మంది భారతీయలు ఉండటం గమనార్హం. ఫోర్బ్స్ జాబితా ప్రకారం, భారతదేశంలో అత్యంత సంపన్నులైన మహిళలుగా ఐదు మందిని గుర్తించారు. వీరిలో సావిత్రి జిందాల్, రోహికా సైరస్ మిస్త్రీ, రేఖా జున్జున్వాలా, వినోద్ రాయ్ గుప్తాతో పాటు 'లీనా తివారీ' కూడా ఉన్నారు. భారతదేశంలోని సంపన్న మహిళల జాబితాలో ఒకరుగా నిలిచినా 'లీనా' గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె ప్రముఖ ఫార్మా కంపెనీకి వారసురాలు. అంతే కాకుండా ఈమె ప్రైవేట్ కంపెనీ USV ఇండియా చైర్పర్సన్ కూడా. లీనా ప్రస్తుత నికర సంపద విలువ 3.7 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 30,000 కోట్లకంటే ఎక్కువ). (ఇదీ చదవండి: చిన్న గ్రామం.. చెట్ల కింద చదువు: ఇప్పుడు అమెరికాలో సంపన్న భారతీయుడు!) కార్డియోవాస్కులర్ అండ్ డయాబెటిక్ మెడిషన్స్ విభాగాలలో లీనా ఫార్మా కంపాంట్ భారతదేశంలో మొదటి ఐదు స్థానాల్లో ఒకటిగా ఉంది. ఇది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్, ఇంజెక్టబుల్స్ అండ్ బయోసిమిలర్ ఔషధాలను కూడా తయారు చేస్తుంది. గ్లైకోమెంట్ అని పిలువబడే USV యాంటీ-డయాబెటిక్ ఫార్ములేషన్ దేశీయ పరిశ్రమలో టాప్-3లో ఉంది. ముంబై యూనివర్సిటీ నుంచి బీకామ్, బోస్టన్ యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేసిన లీనా తివారీ ఎక్కువగా బుక్స్ చదవటానికి ఆసక్తి చూపుతారు. అంతే కాకుండా ఈమె 'బియాండ్ పైప్స్ & డ్రీమ్స్ - ది లైఫ్ ఆఫ్ విఠల్ బాలకృష్ణ గాంధీ' పేరుతో బుక్ కూడా రాసింది. లీనా యుఎస్వి ఎండి ప్రశాంత్ తివారీని వివాహం చేసుకుంది. ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యుఎస్లోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చదివారు. వీరికి అనీషా గాంధీ తివారీ అనే కుమార్తె కూడా ఉంది. -
ఇదే చివరిది.. ఐదో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ వ్యాపారవేత్త!
గతంలో పెళ్లికి వెళ్లిన బంధువులు, సన్నిహితులు వధూవరులను నిండు నూరేళ్లు కలిసి జీవించమని ఆశీర్వదించేవాళ్లు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మాత్రం.. అలా చెప్పరేమో అనిపిస్తుంది. ఎందుకంటే వివాహ మండపంలో జీవితాంతం చేయి వదలనన్న ప్రమాణాన్ని వధూవరులు మరుస్తున్నారు. ఏదో ఒక కారణంతో దాంపత్య జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టి విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల ఈ ట్రెండ్ నడుస్తుందనే చెప్పాలి. తాజాగా ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఏకంగా తన ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. మరి అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే లాస్ట్ అనుకుంటా.. ప్రముఖ ఆస్ట్రేలినయన్-అమెరికన్ వ్యాపారవేత్త రూపర్ట్ మార్దొక్ మీడియా మొఘల్ గా గుర్తింపు పొందారు. ఈయనకు వ్యాపారం రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 92 ఏళ్ల వ్యాపారవేత్త తన ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్ని నెలల కిందటే శాన్ ఫ్రాన్సిస్కో మాజీ పోలీసు చాప్లిన్ ఆన్ లెస్లీ స్మిత్తో ప్రేమలో పడ్డాడు. పెళ్లి విషయాన్ని స్మిత్కు చెప్పగా.. ఆమె కూడా అంగీకరించింది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, మార్దొక్ ఇదే తన చివరి వివాహమని పేర్కొన్నారు. వీళ్లిద్దరి వ్యక్తిగత విషయాలను చూస్తే.. స్మిత్ ఇంతకుముందు దేశీయ గాయకుడు, రేడియో టీవీ ఎగ్జిక్యూటివ్ చెస్టర్ స్మిత్ను వివాహం చేసుకుంది. అతను ఆగస్టు 2008లో మరణించాడు. ఇటీవలే ఆన్ లెస్లీ స్మిత్ కు రూపర్ట్ తో పరిచయం ఏర్పడి, అది కాస్త పెళ్లికి వరకు వెళ్లింది. ఇక రూపర్ట్ మార్దోక్కి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యి.. ఆరుగురు పిల్లలు ఉన్నారు. ముర్డోక్ తన నాల్గవ భార్య, మాజీ టాప్ మోడల్ అయిన జెర్రీ హాల్కు గతేడాది ఆగస్టులో విడాకులు ఇచ్చని సంగతి తెలిసిందే. మర్డోక్ వ్యాపార సామ్రాజ్యంపై ఓ లుక్కేస్తే.. యూఎస్లోని ఫాక్స్ న్యూస్, యూకేలోని రైట్వింగ్ టాబ్లాయిడ్ ది సన్ ఉన్నాయి. అతను న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, పబ్లిషింగ్ హౌస్ హార్పర్ కాలిన్స్లకు న్యూస్ కార్పొరేషన్ అధిపతిగా కొనసాగుతున్నాడు. -
Ravi Pillai: ఒకప్పుడు పేద రైతు కొడుకు.. ఈ రోజు బిలినీయర్
'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు' అనే మాటలకు నిలువెత్తు నిదర్శనం 'రవి పిళ్లై'. పేదరికంతో పోరాడుతున్న రైతు కుటుంబంలో జన్మించిన ఈయన ఈ రోజు కేరళలో మాత్రమే కాకుండా మిడిల్ ఈస్ట్లోని అత్యంత సంపన్నులైన భారతీయులలో ఒకరుగా ఉన్నారు. కేరళ కొల్లాం తీరప్రాంత పట్టణానికి చెందిన ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రవి పిళ్ళై కష్టాలు ఎన్ని ఎదురైనా చదువు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. తరువాత చిట్-ఫండ్ కంపెనీతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే నష్టాలపాలయ్యాడు. ఆ తరువాత 150 మందితో కన్స్ట్రక్షన్ (construction) కంపెనీ ప్రారంభించాడు, క్రమంగా తన ఎదుగుదల ప్రారంభమైంది. ఈ రోజు ఇందులో ఏకంగా 70,000 కంటే ఎక్కువమంది పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ది రావిజ్ అష్టముడి, ది రవిజ్ కోవలం మరియు ది రవిజ్ కడవు వంటి 5 స్టార్ హోటళ్లను నడుపుతున్నాడు. (ఇదీ చదవండి: Keerthy Suresh: వామ్మో.. మహానటి ఆస్తులు అన్ని కోట్లా?) పిళ్లై ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనేక గృహాలు కూడా ఉన్నట్లు సమాచారం, ఇందులో ఒకటి పూణేలోని ట్రంప్ టవర్ లగ్జరీ కాండో. కొల్లాంలో RP మాల్, 300 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని కలిగి ఉన్నాడు. నిరంతర కృషి, పట్టుదలతో సక్సెస్ సాధించిన రవి పిళ్ళైకి భారత ప్రభుత్వం 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్, 2010లో పద్మశ్రీ అవార్డులు అందించింది. అంతే కాకుండా న్యూయార్క్ ఎక్సెల్సియర్ కాలేజీ నుంచి డాక్టరల్ డిగ్రీ కూడా అందుకున్నారు. పేదరికంతో పోరాడుతున్న రైతు కొడుకుగా జన్మించిన రవి పిళ్లై RP గ్రూప్ సామ్రాజ్యాన్ని నిలబెట్టి, ప్రస్తుతం 7.8 బిలియన్ డాలర్లు సంపాదించారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 64,000 కోట్లు కంటే ఎక్కువ. లగ్జరీ హోటల్స్ మాత్రమే కాకుండా స్టీల్, గ్యాస్, ఆయిల్, సిమెంట్, షాపింగ్ మాల్స్ వంటి వ్యాపారాల్లో కూడా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నారు. (ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా 'ఆఫ్లైన్ ట్రాన్సక్షన్'.. మీకు తెలుసా?) దాదాపు 100 కోట్లు ఖరీదైన ఎయిర్బస్ హెచ్145 హెలికాప్టర్ను చేసుకున్న మొదటి భారతీయుడిగా పిళ్లై కావడం గమనార్హం. ఈయన వద్ద ఆధునిక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ గోస్ట్, మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600, బిఎండబ్ల్యు 520 డి, ఆడి ఎ 6 మ్యాట్రిక్స్, మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 500, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఉన్నాయి. -
Thomas Lee: ప్రముఖ బిలియనీర్, ఫైనాన్షియర్ ఆత్మహత్య
అమెరికన్ బిలియనీర్, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి, పరపతి కొనుగోళ్లలో అగ్రగామిగా పేరుగాంచిన థామస్ లీ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 23) తన మాన్హట్టన్ కార్యాలయంలో 78 ఏళ్ల వయస్సులో థామస్ లీ ఆత్మహత్య చేసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. ఫిఫ్త్ అవెన్యూ మాన్హట్టన్లోని తన ప్రధాన కార్యాలయం థామస్లీ చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. తనను తాను తుపాకీ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. లీ ఈక్విటీ సంస్థకు చైర్మన్ అయిన థామస్లీ ఆ సంస్థను 2006లో స్థాపించారు. అలాగే 1974లో స్థాపించిన థామస్ హెచ్ లీ పార్ట్నర్స్ సంస్థకు గతంలో చైర్మన్గా, సీఈవోగా పనిచేశారు. ది లింకన్ సెంటర్, ది మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్, హార్వర్డ్ యూనివర్సిటీ, బ్రాండీస్ విశ్వవిద్యాలయం, మ్యూజియం ఆఫ్ జ్యూయిష్ హెరిటేజ్ వంటి వాటిలో ట్రస్టీగా, బోర్డ్ సభ్యుడిగా సేవలు అందించారు. (ఇదీ చదవండి: ఇంకెన్నాళ్లు వెయిట్ చేయిస్తారు..? ఐటీ కంపెనీ ఫ్రెషర్ల ఆవేదన) థామస్లీ గత 46 సంవత్సరాలుగా వార్నర్ మ్యూజిక్ స్నాపిల్ బెవరేజెస్ వంటి ప్రసిద్ధ బ్రాండ్ల కొనుగోలు, ఆ తర్వాత అమ్మకాలతో సహా వందలాది డీల్స్లో 15 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) -
George Soros: ఎవరీయన.. ప్రధాని మోదీని ఏమన్నాడంటే..
జార్జ్ సోరోస్.(92). ఈ పేరు వింటే చాలూ బీజేపీ మండిపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు కేంద్రం తరపున మంతత్రి స్మృతి ఇరానీ సైతం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.ఇంతకీ ఈయనెవరూ? ప్రధాని మోదీని ఏమన్నారంటే.. ► జార్జ్ సోరోస్.. హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ఈయన సంపద విలువ 8.6 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో 32 బిలియన్ డాలర్లను దానం చేస్తున్నట్లు ప్రకటించి.. 15 బిలియన్డాలర్లు ఇప్పటికే ఇచ్చేశాడు కూడా. ప్రపంచంలోకెల్లా ‘అత్యంత ఉదార దాత’ అనే బిరుదును ఈయనకు కట్టబెట్టింది ఫోర్బ్స్. అయితే.. ► మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్(జర్మనీ--ఫిబ్రవరి 17-19 తేదీల నడుమ జరగనుంది) దరిమిలా.. జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అదానీ గ్రూప్ సంక్షోభాన్ని లేవనెత్తిన ఆయన.. విదేశీ పెట్టుబడిదారులు, భారత పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ► ‘మోదీ, అదానీకి దగ్గరి సంబంధాలున్నాయి. హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడింది. మోదీ బలహీన పడే అవకాశముంది. ‘‘ఈ పరిణామం కచ్చితంగా భారత సమాఖ్య ప్రభుత్వంపై ఆ దేశ ప్రధాని మోదీకి ఉన్న పట్టును గణనీయంగా బలహీనపరుస్తుంది.సంస్థాగత సంస్కరణల కోసం తలుపులు తెరవాల్సి వస్తుంది. నాకు అక్కడి(భారత్) విషయాలపై పెద్దగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ, భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణను నేను ఆశిస్తున్నాను" అని మిస్టర్ సోరోస్ పేర్కొన్నారు. ► ఈ బిలియనీర్ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పుడు మండిపడుతోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోరోస్ వ్యాఖ్యలను ‘భారత్పై సహించరాని దాడి’గా అభివర్ణించారామె.విదేశీ శక్తులంతా మూకుమ్మడిగా భారత ప్రజాస్వామ్య విధానంలో జోక్యం చేసుకునే యత్నం చేస్తున్నాయని.. దేశప్రజలంతా కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపు ఇచ్చారు.అంతేకాదు సోరోస్ను ఆర్థిక యుద్ధ నేరగాడిగా అభివర్ణించారామె. ఆయన కేవలం ప్రధాని మోదీపైనే కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను దోచుకున్న సోరోస్ను ఆర్థిక నేరగాడిగా ఆ దేశం ప్రకటించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే తన కోరికను బయటపెట్టారు. ఇలాంటి వారు ఇతర దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తమకు నచ్చిన వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతారు. గతంలోనూ మన అంతర్గత వ్యవహారాల్లో ఇలాగే విదేశీ శక్తులు జోక్యం చేసుకోగా.. వారిని మనం ఓడించాం. ఈసారి కూడా అలాగే చేస్తాం అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. Whether the PM-linked Adani scam sparks a democratic revival in India depends entirely on the Congress, Opposition parties & our electoral process. It has NOTHING to do with George Soros. Our Nehruvian legacy ensures people like Soros cannot determine our electoral outcomes. — Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2023 ► జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అదానీ వ్యవహారం భారత్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందా? అనేది పూర్తిగా కాంగ్రెస్, ఇతర ప్రతిపకక్షాలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఇందులో జార్జ్ సోరోస్ కు ఎలాంటి సంబంధం లేదు. సోరోస్ లాంటి వ్యక్తులు మన ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ► ప్రపంచ ధనికుల్లో ఒకరైన జార్జ్ సోరోస్.. హంగేరీలో ఓ జూయిష్ ఫ్యామిలీలో పుట్టారు. నాజీల రంగ ప్రవేశంతో.. ఆయన కుటుంబం లండన్కు వలస వెళ్లింది. అక్కడే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. ఆపై లండన్లోనే ఓ ప్రముఖ బ్యాంక్లో కొంతకాలం పని చేసి.. 1956లో ఆయన న్యూయార్క్కు వెళ్లి యూరోపియన్ సెక్యూరిటీస్ అనలిస్ట్గా పని చేయడం ప్రారంభించారు. ► 1973లో హెడ్గే ఫండ్(పూల్ ఇన్వెస్ట్మెంట్) అనే సాహసోపేతమైన అడుగుతో ఆర్థిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించారాయన. ఆపై ఎన్నో సంచలనాలకు ఆయన నెలవయ్యాడు. ► బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. ఆయన దగ్గరి సంపద 8.5 బిలియన్ డాలర్లు. అలాగే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో ఛారిటీ పనులు చేస్తున్నారాయన. ప్రజాస్వామ్య పరిరక్షణ, పాదర్శకత, వాక్ స్వేచ్ఛ నినాదాలతో ఈ ఫౌండేషన్ నిధులను ఖర్చు చేస్తోంది. ► రష్యా, చెకోస్లోవేకియా, పోలాండ్, రష్యా, యుగోస్లేవియా.. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు తర్వాత ఈ దేశాల్లోనూ ఫౌండేషన్ కార్యకలాపాలు నిర్వహించారాయన. ప్రస్తుతం 70కి పైగా దేశాల్లో జార్జ్ సోరోస్ ‘ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్’ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ► రాజకీయంగానూ ఆయన అభిప్రాయాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో గతంలో.. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్లకు ఆయన మద్దతు ప్రకటించారు. అలాగే.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్లకు బద్ధ వ్యతిరేకి. ఇప్పుడు అదానీ గ్రూప్-హిండెన్బర్గ్ వ్యవహారంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది.