counting of votes
-
ఈవీఎంలలో అవకతవకలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి మరిన్ని ఫిర్యాదులు చేసింది. దాదాపు 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్తో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిగతా ఈవీఎంల బ్యాటరీల్లో 80 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉందన్నారు. 99 శాతం చార్జింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తమ పార్టీ ఫిర్యాదులపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవీఎంలను తారుమారు చేశారని వారు అనుమానిస్తున్నారు. అందుకే న్యాయం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. -
కశ్మీరంలో కూటమి
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్లో ఆర్టీకల్ 370 రద్దయ్యి, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మూడు పార్టీ లతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమికే పట్టంగట్టారు. శాసనసభలో మొత్తం 90 స్థానాలకు గాను ఆ కూటమి 49 స్థానాలు సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, సీపీఎం ఒక స్థానం దక్కించుకున్నాయి. మూడు పార్టీ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.జమ్మూకశ్మీర్లో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ బలం పెరిగింది. ఆ పార్టీ ఓట్లశాతం 2014లో 20.77 ఉండగా, ఇప్పుడు 23.43 శాతానికి చేరుకుంది. మరో ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఈ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ ఓట్ల శాతం 22.67 నుంచి 8.87కు పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ మెరుగైన ఫలితాలే సాధించింది. సొంతంగా 29 సీట్లలో జెండా ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 25 స్థానాలు దక్కగా, ఈసారి మరో నాలుగు స్థానాలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా ఓట్ల శాతం 23 శాతం నుంచి 25.64 శాతానికి పెరిగింది. కానీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా ఓటమి పాలయ్యారు. మహిళలు ముగ్గురే తమ కూటమికి అధికారం దక్కినప్పటికీ కాంగ్రెస్కు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. పదేళ్ల క్రితం ఆ పార్టీ 12 సీట్లు గెలుచుకోగా, ప్రస్తుతం కేవలం ఆరు సీట్లు దక్కాయి. కశ్మీర్ లోయలో ఐదు స్థానాలు, జమ్మూ ప్రాంతంలో కేవలం ఒక స్థానం లభించింది. ఓట్ల శాతం కూడా 18 నుంచి 12 శాతానికి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఒక స్థానంలో పాగా వేసింది. జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్(జేపీసీ)కు ఒక స్థానం లభించింది. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 90 మంది నూతన ఎమ్మెల్యేల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సకీనా మసూద్, షమీమా ఫిర్దోస్, బీజేపీ నుంచి షగున్ పరిహర్ గెలిచారు. జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. -
కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు
చండీగఢ్: హరియాణా, జమ్మూకశ్మీర్ల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుందని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో మొత్తం మూడు విడతలుగా, హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే. -
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
కౌంటింగ్లో ఓట్ల తేడాలపై అధ్యయనం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో తేడాలపై అధ్యయనం చేస్తున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పోలింగ్ అక్రమాలపై కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. ఆయన గురువారం ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావు లేకుండా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించిందని చెaప్పారు.ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని విద్య, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని, ప్రజల తలసరి ఆదాయాన్ని, వారి కొనుగోలు శక్తినీ పెంచామని వివరించారు. అంతకన్నా మెరుగ్గా సంక్షేమ పథకాలను అందిస్తామన్న కూటమిని నమ్మి ఈ ఎన్నికల్లో ప్రజలు వారిని గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూటమి ఆ హామీలన్నీ అమలు చేయాలని కోరారు. ప్రాజెక్టుల్లో కొద్దిపాటి మిగులు పనులనూ పూర్తి చేసి ప్రజలకు వాటి ఫలాలను అందించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందన్నారు.ఏమాత్రం తేడా చేసినా నష్టపోయేదీ ప్రజలేనని అభిప్రాయపడ్డారు. ప్రజలు నష్టపోకూడదని, వారికి అన్నివిధాలా మేలు జరగాలని పార్టీ తరఫున ఆశిస్తున్నామన్నారు. ఐదేళ్ల పాటు ప్రజాసేవకు అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇకపైన కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా, ప్రత్యర్థులు ఇబ్బందులకు గురిచేసినా ఏమాత్రం వెరవకుండా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.వారికి అన్నివేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సురే‹Ùబాబు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి 4 హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లపై ఉంచి 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్గా కట్టే ప్రక్రియను మొదట ప్రారంభించారు. ఆ బండిళ్లు కట్టే ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 5 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటినా కూడా మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడికాలేదు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 4 రౌండ్ల తర్వాత మొదటి ప్రాధాన్యత ఫలితం పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4,63,839 ఓట్లుండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగు రౌండ్లలో ఈ లెక్కింపు పూర్తవుతుంది. నాలుగు హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లలో ఒక టేబుల్కు ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. అంటే ప్రతి రౌండ్లో 96 వేల చొప్పున 4వ రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. మొదటి రౌండ్కు 6 గంటల సమయం: మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపునకు దాదాపు 6 గంటల సమయం పట్టింది. మిగతా మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు సమయంలోనే ఆయా అభ్యర్థులకు బ్యాలెట్ పేపర్లు చూపి ఏ అభ్యరి్థకి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారో చూపించి, ఆ అభ్యర్థి డబ్బాలో వేస్తున్నారు. ఒక వేళ ఏదేని ఓటు చెల్లకపోతే అది ఏజెంట్లకు చూపి చెల్లని ఓట్ల డబ్బాలో వేస్తున్నారు. ఇలా ప్రతి రౌండ్లోనూ కౌంటింగ్ సందర్భంగా చెల్లిన, చెల్లని ఓట్లు లెక్కిస్తున్నారు. పూర్తయిన మొదటి రౌండ్ కౌంటింగ్ బుధవారం రాత్రి 12 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి రౌండ్ లెక్కింపునకు ఆరు గంటల సమయం పట్టింది. అయితే మిగతా మూడు రౌండ్లకు అంత సమయం పట్టదని, వాటికి తక్కువ సమయమే పడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నాలుగు రౌండ్లలో జరిగే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. -
ఎన్నికల అధికారులకు అభినందనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తిచేసినందుకు, మొత్తం ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించినందుకు జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా అభినందనలు తెలిపారు. ఇటువంటి ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా అనుసరించిన మంచి పద్ధతులను భవిష్యత్తు తరాలవారికి ఎంతో ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక కరదీపిక రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అనుసరించిన వినూత్న పద్ధతులను భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు మూడు రోజుల్లో తమ కార్యాలయానికి నివేదికలు పంపాలని కోరారు. అన్ని జిల్లాల నివేదికల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించి భారత ఎన్నికల సంఘానికి పంపుతామని చెప్పారు. ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విమర్శలకు ఆస్కారం లేకుండా రూపొందించిన శుద్ధమైన ఓటర్ల జాబితా మొత్తం ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు నాందిపలికిందని చెప్పారు. ఈ జాబితా రూపొందించేందుకు కృషిచేసిన అధికారులకు, సిబ్బందికి, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసేంతవరకు రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, మండలస్థాయి వరకు ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించినట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అవిరళ కృషిచేసిందన్నారు. కొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తం ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహంచడంలో సహకరించిన రాజకీయపక్షాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
ఈవీఎంనే మార్చేశారు
మడకశిర (శ్రీసత్యసాయి జిల్లా): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అధికారులు ఈవీఎంనే మార్చేశారు. ఇందులోనూ ఓట్లు తప్పులతడకగా చూపాయి. ఓట్లలో తేడా ఉండటంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అభ్యంతరం చెప్పారు. చివరకు ఈ ఈవీఎం పార్లమెంట్ నియోజకవర్గానిదని తేలడంతో అందరూ నివ్వెరపోయారు. దీంతో అధికారులు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించారు. ఇది బయటపడిన సంఘటన మాత్రమే. బయటకు తెలియని ఇటువంటి ఈవీఎం మారి్పడి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని జరిగాయోనన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. మంగళవారం మడకశిర అసెంబ్లీ, హిందూపురం ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు హిందూపురం బిట్ కళాశాలలో జరిగింది. ఒక గదిలో లోక్సభ ఓట్లు, పక్క గదిలోనే అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం పిల్లిగుండ్లు 131 పోలింగ్ బూత్ పార్లమెంట్ ఓట్ల ఈవీఎంను అధికారులు అసెంబ్లీ ఓట్లు లెక్కిస్తున్న టేబుల్ వద్దకు తీసుకొచ్చారు. ఇందులో బీఎస్పీ అభ్యర్థికి 414, వైఎస్సార్సీపీ అభ్యర్థికి 5, టీడీపీ అభ్యర్థికి 349 ఓట్లు వచ్చినట్లు చూపింది. వైఎస్సార్సీపీకి బలమున్న గ్రామంలో ఓట్లు మరీ తక్కువగా రావడంతో అనుమానం వచి్చన రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ద్వారా ఆర్వోకు ఫిర్యాదు చేయించారు. దీంతో దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి చివర్లో పరిష్కారం చూపుతామని ఆర్వో చెప్పారు. కౌంటింగ్ చివరలో టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో పక్కన పెట్టిన ఈవీఎం సంగతి తేల్చాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్కప్ప పట్టుబట్టారు. దీంతో ఆ ఈవీఎంను అధికారులు పరిశీలించగా పార్లమెంట్కు సంబంధించినదిగా తేలింది. తప్పును గుర్తించిన అధికారులు తీరిగ్గా ఆ పోలింగ్ బూత్కు సంబంధించి అసెంబ్లీ ఈవీఎం తీసుకువచ్చారు. అది అసలు ఓపెనే కాలేదు. దీనిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం చెప్పడంతో చివరకు వీవీ ప్యాట్ స్లిప్పులు తీసుకొచ్చి లెక్కించారు. అందులో టీడీపీకి 349 ఓట్లు, వైఎస్సార్సీపీకి 414 ఓట్లు వచ్చాయి. చివరకు స్వల్ప ఆధిక్యంతో టీడీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఒకవేళ ఈవీఎం మారిన సంగతి బయటపడకుండా, పార్లమెంటు ఈవీఎం ఓట్లే లెక్కించి ఉంటే వైఎస్సార్సీపీ అభ్యర్థికి 414 ఓట్లకు బదులు 5 ఓట్లే వచ్చి ఉండేవి. ఎంతో పకడ్బందీగా జరగాల్సిన ఓట్ల లెక్కింపులో ఈవీఎం మారిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పట్టుబట్టిన తర్వాత అసెంబ్లీ ఈవీఎం తెచ్చారు. అది కూడా ఓపెన్ కాకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇలా ఈవీఎం మారిన ఘటన ఒక్కటే బయటపడింది. ఎవరికీ తెలియకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని ఈవీఎంలు మారిపోయాయి, వాటిలో ఎన్ని లెక్కలు తేడాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎం మారిపోవడం, అసెంబ్లీ ఈవీఎం తెరుచుకోకపోవడంపై ఈసీని ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్కప్ప చెప్పారు. ఇలా ఈవీఎంలపై అనుమానం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏ అభ్యర్థి నుంచైనా ఫిర్యాదు వస్తే 5% వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలి. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచి్చంది. ఈ ఎన్నికల్లో ఆది నుంచి పలు వివాదాలు చోటు చేసుకోవడం, ఇప్పుడు మడకశిరలో ఈవీఎంనే మార్చేసిన తీరుతో ఓట్ల లెక్కింపుపై అనుమానాలున్న అభ్యర్థులు ఈసీకి ఫిర్యాదులు చేయడానికి సిద్ధపడుతున్నారు. -
సంబరాలు... సవాళ్ళు...
దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. వరుసగా మూడోసారి కూడా మోదీ సారథ్యంలోని బీజేపీయే పగ్గాలు చేపడుతుందని అంచనాలు వినిపిస్తున్న వేళ ఓట్ల లెక్కింపుతో అసలైన ఫలితాలు ఇవాళ రానున్నాయి. అయితే, ఎన్నికలు ముగింపు దశలో ఉండగానే జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గత శుక్రవారం వెలువరించిన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఆసక్తికరమైన చర్చ రేపుతున్నాయి. జీడీపీ వృద్ధి దాదాపు 7.8 శాతం ఉండవచ్చని తొలుత అందరూ భావించినా, వాస్తవంలో అది 8.2 శాతానికి చేరింది. అంతకు ముందు ఏడాది (2022–23) సాధించిన 7 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. పైగా, వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ 7 శాతం, అంతకు మించి పెరిగిందన్న మాట. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని నిపుణుల మాట. ఇది విశేషమే... కాదనలేం. కానీ, ఈ ఏడాది కూడా ఇదే పురోగతిని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? అలాగే, దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం తదితర సమస్యల మాటేమిటి?నిజానికి, దేశ వాస్తవిక జీడీపీ ఇటు అధికారిక, అటు ప్రైవేట్ అంచనాలన్నిటినీ అధిగమించి ఆశ్చర్యపరిచింది. కోవిడ్ దెబ్బ కొట్టిన తర్వాత, అందులోనూ ప్రపంచమంతా నత్తనడక నడుస్తున్నప్పుడు వృద్ధిలో ఈ రకమైన గణాంకాలు వచ్చాయంటే, అనేక ఆటుపోట్లను భారతీయ గృహవ్యవస్థ, వ్యాపారాలు తట్టుకొని దృఢంగా నిలబడడమే కారణం. అలాగే, ప్రధానంగా నిర్మాణ, వస్తూత్పత్తి రంగాల పుణ్యమా అని కూడా గడచిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థికవ్యవస్థ అనుకున్న దాని కన్నా మెరుగైన వృద్ధిని సాధించినట్టు విశ్లేషణ. ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకోకున్నా, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వృద్ధిలో సింహభాగానికి కారణమని చెబుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సర్కారుకు ఈ అంకెలు, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ బదలాయించిన మిగులు నిధుల లాంటివి కొంత సౌకర్యాన్నిచ్చే అంశాలు. అక్కడ నుంచి సమతూకం నిండిన ఆర్థికాభివృద్ధి వైపు ఎలా నడిపించాలన్నది కీలకమైన అంశం. గమనిస్తే... ఆర్థిక వృద్ధిలో మెరుగుదల ఏడేళ్ళ పాటు నిదానంగా సాగింది. దానికి కొత్త ఊపునిచ్చేందుకు మోదీ సర్కార్ ఏటా రైల్వే, రోడ్లు, పట్టణ రవాణా, వాటర్వర్క్స్, రక్షణ ఉత్పత్తులపై ఏటా రూ. 11 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు రావాలి. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటికీ ప్రబలంగా కనిపిస్తోంది. దానికి తోడు ఆర్థిక వ్యత్యాసం, ద్రవ్యోల్బణం సామాన్యుల్ని వేధిస్తున్నాయి. ఉదాహరణకు భవన నిర్మాణ రంగంలో నూటికి 80 మంది ఉండే నైపుణ్య రహిత కార్మికుల సగటు రోజు వారీ కూలీ సైతం అనేక రాష్ట్రాల్లో జాతీయ సగటు కూలీ కన్నా తక్కువే ఉందని విశ్లేషణలు తేల్చాయి. మహిళా శ్రామికుల కూలీలైతే మరీ కనాకష్టం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే... మన దేశ తలసరి ఆదాయం, మరో మాటలో నికర జాతీయ ఆదాయం 2014–15లో రూ.72,805 ఉండేది. అది కేవలం 3.83 శాతం వార్షిక చక్రవృద్ధి రేటుతో 2022–23లో రూ.98,374కు చేరింది. వాస్తవిక ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే, ఈ వృద్ధి రేటు అసలైతే ఇంకా తక్కువే ఉంటుంది. అది అటుంచితే – విద్య, ఆరోగ్యం, ప్రజారవాణా, కాలుష్యం వగైరా అంశాల్లో సగటు జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. సరికదా ఇంకా దిగజారాయి. అదే విషాదం. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోని అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ అనే నినాదంలో గర్వించడానికి తగిన అంశాలు కొన్నే కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల తలసరి ఆదాయం జాబితాలో 2018లో మనం 153వ స్థానంలో ఉండేవాళ్ళం. అప్పటితో పోలిస్తే, మనం మెరుగుపడి 144వ స్థానానికి చేరాం. కానీ, ఇప్పటికీ మనం అడుగునే ఉన్నామని మర్చిపోలేం. సాధించిన కొద్దిపాటి మెరుగుదల దేశ ప్రజల్ని దారిద్య్రం నుంచి బయటపడేయడానికి చాలదు. నాణ్యమైన జీవన ప్రమాణాలకూ సరిపోదు. 2029 నాటికి గానీ మన దేశం తలసరి ఆదాయంలో ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూ గినియా, అంగోలా లాంటి దేశాలను అధిగమించలేదని గుర్తించాలి. కాబట్టి, కొత్త ప్రభుత్వానికి తన ముందున్న సవాలేమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భారత జనాభాలో ఇప్పటికీ అధిక శాతం గ్రామీణ, బస్తీ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. వారి కష్టనష్టాలు, జీవన పరిస్థితులు స్టాక్ మార్కెట్ల విజృంభణను చూసి చప్పట్లు కొట్టే వర్గాలకు పెద్దగా తెలియవు. తాజా ఎన్నికల దయతో నిరుద్యోగం, ఆర్థిక అసమతౌల్యం, ద్రవ్యోల్బణం లాంటివి మళ్ళీ కనీసం చర్చకైనా వచ్చాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లోని దురవస్థల’ ప్రస్తావన జరిగింది. అందుకే, గడచిన నాలుగు త్రైమాసికాలను కలిపి తీసిన ఆఖరి లెక్కలు పైకి సంతోషం రేపుతున్నా, క్షేత్రస్థాయిలోని ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే కష్టమే. ఇప్పటి లెక్కలతో తృప్తిపడి, ఉదాసీనంగా వ్యవహరించకుండా సవాళ్ళను ఎదుర్కొంటూ ముందడుగు వేయాలి. అందుకోసం ఆర్థిక విధానాలను నిర్ణయించే ప్రభుత్వ యంత్రాంగం దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి. ప్రజల నైపుణ్యాలను పెంచి, వారిని మరింత ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టాలి. అందుకు తగ్గ సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ఏటికేడు ఈ వృద్ధి అంకెలు స్థిరపడతాయి. సామాన్యుల జీవితాలు నిలబడతాయి. లేదంటే ‘వికసిత భారత్’ మాటల్లో, లెక్కల్లోనే మిగిలిపోతుంది. -
లోక్సభ ఓట్ల లెక్కింపుపై ‘డబుల్’ ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ జరిగిన 22 రోజుల తర్వాత జరుగుతున్న ఓట్ల లెక్కింపు కో సం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ను బ ట్టి.. రాష్ట్రంలో పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యే జరిగిందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మెజార్టీ సీట్లు త మకంటే తమకేనని.. డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కచ్చితంగా పది స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్.. పది కంటే ఎక్కువే గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తామన్న దానిపై క చ్చితమైన లెక్కలు చెప్పకపోయినా.. కనీస స్థానా ల్లో విజయం దక్కుతుందని ఆశిస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్న దానిపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. 12 సీట్లు కూడా రావొచ్చంటున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉంది. కనీసం తొమ్మిది, పది స్థానాల్లో గెలుస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే మరో రెండు, మూడు సీట్లు కూడా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్తోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి పట్టు సాధించిన వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైనా.. విజయ తీరం చేరుతామనే అంచనాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బలహీనపడటం, బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికలు రావడంతో పెద్దగా ప్రజా వ్యతిరేకత లేకపోవడం, గ్రామీణ స్థాయిలో పార్టీకి ఉన్న పట్టు వంటివి అనుకూలిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ మేజిక్తో బీజేపీదే హవా అంటున్న కమలనాథులు మోదీ మేజిక్తో తెలంగాణలోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలిచి సత్తా చాటుతామని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్లో వెలువడిన అంచనాలను మించి సీట్లు సాధిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు ఎంపీ సీట్లకు అదనంగా మరో ఆరేడు సీట్లు గెలుస్తామని అంటున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలే ప్రభావం చూపాయని కమలనాథులు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాలు తమకు ఉపకరించాయని.. ఈ ఎఫెక్ట్తో పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని అంచనా వేస్తున్నారు. ఎగ్జాక్ట్ పోల్స్ తమకే అనుకూలమంటూ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేకుండా ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నా.. బీఆర్ఎస్ మాత్రం అంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్ఎస్ ఆధిక్యత కనబర్చిందని.. అదే తరహాలో ఇప్పుడు ఫలితాలు ఉంటాయని అంచనా వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల ఓటింగ్ జరగలేదని.. అదే సమయంలో బీజేపీ భారీగా ఏమీ పుంజుకోలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే ఎక్కువగా గండి పడిందని పేర్కొంటున్నారు. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ 17 రోజుల పాటు చేసిన బస్సుయాత్ర కూడా ప్రభావం చూపిందని.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసినవారిలో కొంత మేర తిరిగి అనుకూలంగా మారారని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో జరిగిన ముక్కోణపు పోటీ బీఆర్ఎస్కు అక్కడక్కడా అనుకూలిస్తుందనే అంచనా వేస్తున్నారు.ఢిల్లీ పీఠం ఎవరిదో..?లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈసారి కూడా మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం ఓవైపు.. ఎగ్జిట్ పోల్స్ ఫెయిలవుతాయని, ఇండియా కూటమి గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన కామెంట్స్ మరోవైపు ఉత్కంఠ రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం ఎలా ఉంటుంది?ఇండియా కూటమికి ఉన్న సానుకూలతలేంటి? ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది.ఆ స్థానాలపై మరింత ఆసక్తితెలంగాణలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన దానం నాగేందర్ తలపడుతున్న సికింద్రాబాద్ ఫలితంపై అందరి ఫోకస్ ఉంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి.. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయ్యే చాన్స్ ఉందంటున్న బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు పోటీ చేస్తున్న జహీరాబాద్, నాగర్కర్నూల్, వరంగల్ తదితర స్థానాల్లో ఫలితాలపైనా ఆసక్తి ఉంది. -
రాష్ట్రంలో రూ.483.15 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం: ముఖేష్కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లతోపాటు ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా చేపట్టిన చర్యలను సోమవారం సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా రూ.170 కోట్ల నగదు, రూ.61.66 కోట్ల విలువైన లిక్కర్, రూ.35.97 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.29.34 కోట్ల విలువైన ఉచితాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటన్నింటికీ సంబంధించి 11,249 కేసులను, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 1,270 కేసులను నమోదు చేసినట్లు మీనా తెలిపారు. ఇక ఎన్నికల హింసలో ఇద్దరు మృతిచెందగా 912 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ హింస సందర్భంగా రూ.1,19,13,650 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందన్నారు. 1,03,461 మందిని బైండోవర్ చేశామని.. అలాగే, సమస్యలు, అల్లర్లు సృష్టించే 551 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.తొలిసారిగా 1,985 ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్..ఇదిలా ఉంటే.. సి–విజిల్ ద్వారా 24,557 ఫిర్యాదులు రాగా అందులో 95 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ముఖేష్కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ అనంతరం హింసను నివారించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కార్టన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించామని.. సమస్యాత్మకమైన 1,985 ప్రాంతాలను గుర్తించి అక్కడ సోదాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1,200 సోదాలు నిర్వహించడం ద్వారా 4,595 వాహనాలను, 1,269 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 153 మందిపై కేసులు నమోదుచేశామని ఆయన వివరించారు. పోలింగ్ అనంతరం సమస్యలను, అల్లర్లను సృష్టించే 12,639 మందిని గుర్తించి సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు మీనా తెలిపారు. -
21 రోజుల నిరీక్షణ.. ఉత్కంఠకు నేడే తెర
సాక్షి, అమరావతి: ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి. గత నెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురంరాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో ఈవీఎంల ద్వారా 3.33 కోట్ల మంది, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 5.15 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు అ్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా రికార్డు స్థాయలో 81.8 శాతం ఓటింగ్ నమోదైంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు కోసం 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చేటు చేసుకోవడంతో, ఓట్ల లెక్కింపు సందర్భంగా అటువంటి సంఘటలను పునరావృతం కాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 111 అసెంబ్లీ స్థానాల్లో 5 – 6 గంటల్లోనే పూర్తి కానుంది. 61 నియోజకవర్గాల్లో 6 – 8 గంటలు, మూడు నియోజకవర్గాల్లో 9 – 10 గంటల సమయం పట్టనుంది. పార్లమెంటు ఫలితాలకు సంబంధించి 13 రౌండ్లు ఉన్న రాజమండ్రి, నరసాపురం ఫలితాలు తొలుత వెల్లడి కానుండగా, 27 రౌండ్ల లెక్కింపు ఉన్న అమలాపురం ఫలితం ఆలస్యంగా రానుంది. అసెంబ్లీ విషయానికి వస్తే కేవలం అయిదు గంటలలోపే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం ఫలితాలు.. ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఒంటరిగా సిద్ధంవైఎస్సార్సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో జట్టు కట్టి కూటమిగా పోటీలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరుతో ముందస్తుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోగా, తెలుగుదేశం పార్టీ సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై సిగపట్లు పడుతూ ప్రచారంలో వెనుకబడ్డారు. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో, భారతీయ జనతాపార్టీ ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ.. జనసేన రెండు పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టగా, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకొని తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బీజేపీ, జనసేనల్లోకి పంపి అభ్యర్థులుగా నిలబెట్టింది.ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు..ఎన్నికల సరళిని, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కింపులో ఒక రౌండు పూర్తి కాగానే ఆ ఫలితాలను కౌంటింగ్ సెంటర్ వద్ద మైక్లో వెల్లడించడంతో పాటు, మీడియా ప్రతినిధులకు కనపడే విధంగా డిస్ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి రౌండు ఫలితాలను సువిధా యాప్లో అప్లోడ్ చేయనున్నారు. నియోజకవర్గ ఫలితాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను, యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://results.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు ‘ఓటర్స్ హెల్ప్¬లైన్’ అనే యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. 25,209 మంది సిబ్బంది : ముఖేష్ కుమార్ మీనారాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 2,387 మంది, 25 పార్లమెంటు స్థానాల్లో 454 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారన్నారు. పార్లమెంటు స్థానాలకు తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించి, 8.30 తర్వాత ఈవీంఎల లెక్కింపును కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లో డిక్లరేషన్ ఫారంపై రిటర్నింగ్ అధికారి నియమించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుందని, దీనిపై ఇక ఎటువంటి అభ్యంతరాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఈసారి అత్యధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడంతో 25 చోట్ల నాలుగు రౌండ్లు కూడా లెక్కింపు జరగనుందన్నారు. ప్రతి 500 ఓట్లు ఒక రౌండ్గా లెక్కిస్తామని, ఇది సుదీర్ఘ పక్రియ కావడంతో ఒకొక్క రౌండ్ పూర్తి కావడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుందని చెప్పారు. అదే ఈవీఎంల లెక్కింపులో ప్రతి రౌండు సగటున 25 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుందన్నారు. లెక్కింపు ప్రారంభమైన అయిదు గంటల్లోనే మెజార్టీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 పోలీసు సిబ్బందితో పాటు 67 కంపెనీల సాయుధ బలగాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా పెట్టామని, లోపల ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. ఏజెంట్లు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, దురుసుగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధన 54 కింద కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. రీ కౌంటింగ్ కోరితే దానికి గల స్పష్టమైన కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు. ఆ కారణాలతో ఆర్వో ఏకిభవిస్తేనే రీ కౌంటింగ్కు అనుమతిస్తారని చెప్పారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరని స్పష్టం చేశారు. కౌంటింగ్ తర్వాత అభ్యర్థి గెలిచినట్లు ఫారం 20 ఇవ్వడానికి కనీసం గంట– గంటన్నర పడుతుందని, అప్పటి వరకు అభ్యర్థి వేచి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలపై నిషేధం విధించామని తెలిపారు. -
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ బోగస్ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్ నౌ, దైనిక్ భాస్కర్ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్ పూర్తయి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ తీసుకునే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయపడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్ హాల్ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్లో కౌంటింగ్ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా కౌంట్ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్గా పార్టీ అకౌంట్లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు మలసాని మనోహర్రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి
సాక్షి, అమరావతి: కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఉ.6 గంటలకల్లా ఏజెంట్లు కౌంటింగ్ హాల్ దగ్గర ఉండాలి. ఫారం–17 సీ కాపీని తీసుకెళ్లాలి. ⇒ పోటీలో ఉన్న అభ్యర్థులందరి ప్రతి ఓటు కరెక్టుగా నోట్ చేసుకోవాలి. ఏదైనా తప్పు కన్పిస్తే వెంటనే అక్కడే ఉన్న ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ అనారోగ్యం, ఇతర కారణాలతో బయటకు వచ్చేవారు రిటర్నింగ్ అధికారికి చెప్పి బయటకు రావాలి. ఒకసారి బయటకొస్తే లోపలికి రానివ్వరని గమనించాలి. ⇒ స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ⇒ ఏజెంట్లు ప్రతి రౌండ్ తర్వాత షీట్పై సంతకం చేసే ముందు మన పార్టీ అభ్యర్థి ఓట్లు మాత్రమే కాకుండా, టీడీపీ–జనసేన–బీజేపీ, ఇతర అభ్యర్థులకు పోలైన ఓట్లను స్పష్టంగా సరిచూసుకోవాలి. తేడా ఉన్నట్లుగా గుర్తిస్తే మరొక మారు కౌంటింగ్ చేయమని కోరాలి. అన్ని సరిపోయినప్పుడే సంతకం చేయాలి. ⇒ కౌంటింగ్ ఏజెంట్లతో అభ్యర్థి టచ్లో ఉంటూ అక్కడ ఏదైనా అవాంతరాలు ఎదురైతే, కౌంటింగ్ ఏజెంట్తో కానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్తో కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. ⇒ ఏదైనా తప్పు జరుగుతోంది అని కౌంటింగ్ కేంద్రంలో గుర్తిస్తే చక్కటి లాజిక్తో ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ రిజెక్ట్ అయిన పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ మార్జిన్ వచ్చి ఉంటే మళ్లీ పోస్టల్ బ్యాలెట్స్ని లెక్కించమని కోరే అధికారం అభ్యర్థికి, కౌంటింగ్ ఏజెంట్కి ఉంది. ⇒ పోస్టల్ ఓట్లను సంబంధిత ఫారంలో నింపి అభ్యర్థి, అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తర్వాత ఆ రౌండ్ ఫలితం ప్రకటిస్తారు. ⇒ కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేవరకు కౌంటింగ్ హాల్లో అభ్యర్థి ఉండాలి. -
కౌంటింగ్ ముంగిట మరో కుట్ర
సాక్షి, అమరావతి: కీలకమైన ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు శాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఒత్తిడికి ఎన్నికల కమిషన్ (ఈసీ), రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి వ్యవహరిస్తున్నారన్నది మరోసారి స్పష్టమైంది. అత్యంత వివాదాస్పద పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) ఎస్పీ ఏఆర్ దామోదర్కు హఠాత్తుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అదీ పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆయన పోలింగ్ ముగిసిన తరువాత వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న దామోదర్ను హఠాత్తుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని.. కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీచేయడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. టీడీపీకి వీర విధేయుడు.. 2007 గ్రూప్–1 బ్యాచ్కు చెందిన ఏఆర్ దామోదర్ అత్యంత వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరడంలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారి మధ్య బంధుత్వం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు అండతో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. పశి్చమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక నాన్ కేడర్ ఎస్పీ అయినప్పటికీ దామోదర్ను 2019 సంవత్సరంలో ఎన్నికల కోసమని విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించారు. వైఎస్సార్సీపీ పటిష్టంగా ఉన్న విజయనగరం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే ఆయనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే 2019 ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులతో బీభత్సం సృష్టించి కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని బంధించాయి.దాదాపు నాలుగు గంటలపాటు టీడీపీ రౌడీమూకలు స్వైర విహారం చేసినా పోలీసులు, ఎస్పీగా ఉన్న దామోదర్ సైతం పట్టించుకోలేదు. సరికదా అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించలేదు. అప్పట్లో విశాఖపట్నం డీఐజీ స్పందించి అదనపు బలగాలను కురుపాం పంపించడంతో నాలుగు గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదీ దామోదర్ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ట్రాక్ రికార్డ్.అలాంటి అధికారికి కంట్రోల్ రూమ్ బాధ్యతలా?ఎన్నికల విధుల్లో ఉద్దేశపూర్వకంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్ దామోదర్కు ప్రస్తుతం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించారు. డీజీపీ హరీశ్కుమార్ గుప్తా, ఈసీకి నోడల్ అధికారిగా ఉన్న అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబాత్ర బాగ్చీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా విధ్వంసకర సంఘటనలు జరిగితే వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, అందుకోసం జిల్లా ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీచేయడం ఆయన బాధ్యత. అంటే.. డీజీపీ తరఫున జిల్లా ఎస్పీలకు ఆయనే ఆదేశాలు జారీచేస్తారు.2019 ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో విఫలమైన ఆయన ప్రస్తుతం కంట్రోల్ రూమ్ బాధ్యతలను ఎలా నిర్వహించగలరని డీజీపీ, అదనపు డీజీ భావించారో అర్థంకావడంలేదు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే దామోదర్కు ఈ బాధ్యతలు అప్పగించారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇటీవల పోలింగ్ రోజున పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ గూండాలు విధ్వంసానికి పాల్పడ్డాయి.అదే రీతిలో కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యానికి కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయినాసరే.. టీడీపీకి అనుకూల అధికారిగా గుర్తింపు పొందిన దామోదర్కు కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసేందుకు.. టీడీపీ గూండా మూకలపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎస్పీలను నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్కుమార్ మీనా
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించొద్దని.. నిర్దాక్షిణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమ ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటు దానికి ముందు, తర్వాత రోజుల్లో భావోద్వేగాలు అదుపుతప్పే అవకాశం ఉందన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, వాటి ప్రభావం ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై ఉండకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా కఠినంగా వ్యవహరించాలని మీనా సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..కౌంటింగ్ పూర్తికాగానే ఈవీఎంలను భద్రపర్చాలి..ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే వాయిదా వేయకుండా అదేరోజు ప్రతి ఈవీఎంకు సీల్వేసి భద్రపర్చాలి. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు ఓట్ల లెక్కింపు పూర్తయిన మరుసటి రోజే ఈసీఐకి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీచేశాం. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఇండెక్స్ కార్డులో ఎలాంటి తప్పులకు ఆస్కారంలేకుండా ఎంతో జాగ్రత్తగా ఆ కార్డును పూరించాలి. ఆయా కార్డులు అన్నీ ఈనెల 8లోపు మా కార్యాలయానికి అందజేయాలి. ప్రతి టేబుల్ వద్ద ఒక్కో ఏజెంట్..ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలి. అయితే, ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్కు అవకాశం కల్పించాలి. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫారం–17సి, పెన్ను లేక పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలిజ అంతకుమించి ఏమున్నా అనుమతించొద్దు. అథారిటీ లెటర్లు కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలి. వారు సెల్ఫోన్ కలిగి ఉన్నప్పటికీ అభ్యంతరం చెప్పొద్దు. కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్ఫోన్తో వారిని అనుమతించడానికి వీల్లేదు.కౌంటింగ్కు పటిష్ట చర్యలు..ఓట్ల లెక్కింపు కేంద్రాలు అన్నీ ఫైర్సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందుకు తగ్గట్లుగా అగ్నిమాపక శాఖ నుండి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశం, నిష్క్రమణ ప్రణాళికను పటిష్టంగా ఏర్పాట్లుచేసుకోవాలి. ఈ ప్రణాళికకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అదే విధంగా ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్నిచోట్లా ఏర్పాటుచేయాలి. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి.అదనపు సీఈఓలు పి. కోటేశ్వరరావు, సీఈఓ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ సీఈఓ ఎస్. వెంకటేశ్వరరావుతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు వారి జిల్లాల నుండి ఈ వీడియో కాన్షరెన్స్లో పాల్గొన్నారు. -
ఏజెంట్లే కీలకం
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు ముహూర్తం సమీపించడంతో కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర కీలకం కానుంది. ఈ ప్రక్రియపై పూర్తి అవగాహనతో పాటు నిబంధనలపై పట్టున్న వ్యక్తులను ఎంపిక చేసి రాజకీయ పార్టీలు శిక్షణ ఇస్తున్నాయి. కౌంటింగ్ హాళ్లలో టీడీపీ ఘర్షణలకు దిగి ఉద్రిక్తత రేకెత్తించే ప్రణాళికలు రూపొందించినట్లు స్పష్టమవుతున్నందున వైఎస్సార్సీపీ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు అవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించాలని పేర్కొంటున్నారు. టీడీపీ ఏజెంట్లు పదేపదే అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కౌంటింగ్ సూపర్వైజర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లదే కాబట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లు పరిస్థితులను నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏవైనా అభ్యంతరాలు, అనుమానాలుంటే కౌంటింగ్ ఏజెంట్లు కచ్చితంగా లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు అందజేసి అక్నాలెడ్జ్మెంట్ (ధ్రువీకరణ) పత్రం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. నోటిమాటగా అభ్యంతరం తెలిపితే అది చట్టం ముందు నిలబడదు కాబట్టి ప్రతీది లిఖితపూర్వకంగా తెలియచేయడం తప్పనిసరి. వీవీ ప్యాట్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున లాటరీ ద్వారా ఎంపిక చేసి లెక్కిస్తారు. ఈవీఎంలలో పడిన ఓట్లకు, వీవీ ప్యాట్లలో ఉన్న ఓట్లకు తేడా ఉంటే ఫైనల్గా వీవీ ప్యాట్లలోని ఓట్లనే పరిగణించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.రీ కౌంటింగ్ హక్కు లెక్కింపు ప్రారంభంలోనే ఈవీఎంల సెక్యూరిటీని ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ప్రతి రౌండ్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచి చిట్ట చివరి వరకూ ఏజెంట్లు కేంద్రంలోనే ఉండాలి. లెక్కింపు పూర్తయి గెలిచిన అభ్యర్థి ధ్రువీకరణ పత్రం తీసుకున్న తర్వాతే బయటకు రావాలి. ఈవీఎంలలో ఓట్ల వివరాలు కౌంటింగ్ సిబ్బంది ద్వారా స్పష్టంగా వినిపించకపోతే ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి.కౌంటింగ్లో అనుమానాలు తలెత్తితే రీ కౌంటింగ్ కోరే హక్కు ఏజెంట్లకు ఉంటుంది. మంగళవారం ఉదయం 8 గంటల కల్లా లెక్కింపు ప్రారంభం కానున్నందున ఏజెంట్లు ఉదయం 6 గంటల లోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. ఏజెంట్గా ఉంటున్న వ్యక్తులు భారత ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం రెండూ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. కౌంటింగ్ కేంద్రంలోకి ఫారం–17 సీ, పెన్ను లేదా పెన్సిల్, తెల్ల కాగితాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, ఇతర వస్తువులను అనుమతించరు. -
పోస్టల్ బ్యాలెట్లపై భద్రం
సాక్షి, అమరావతి: పెద్ద ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పోలింగ్ శాతం పెరగడం, పోస్టల్ బ్యాలెట్లు 4.97 లక్షలకు పైగా పోల్ అయిన నేపథ్యంలో జూన్ 4 జరిగే ఓట్ల లెక్కింపుల్లో అత్యంత కీలకం కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎన్నికల సంఘం చివరి నిమిషంలో నిబంధనలు మార్చినందున లెక్కింపు విషయంలో ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా ఒక ఏజెంట్ పర్యవేక్షించాలని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు, లెక్కింపు విధానంపై ఏజెంట్లు ముందస్తు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.చెల్లనివిగా ఎప్పుడు పరిగణిస్తారంటే?» బ్యాలెట్ పేపరుపై ఓటు ఎవరికి నమోదు కాకపోవడం, ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా తిరస్కరిస్తారు.» బ్యాలెట్ పేపరు చిరిగినా, గుర్తు పట్టలేనంతగా మారినా, ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా ఏమైనా గుర్తులు లేదా ఏదైనా రాసి ఉన్నా తిరస్కరిస్తారు.» నకిలీ బ్యాలెట్ పేపర్లను తిరస్కరిస్తారు.» ఇలా తిరస్కరించిన ఓట్లన్నీ ఆర్వో పక్కన పెడతారు.» ప్రతీ దశలో చెల్లని ఓట్లను ఆర్వో విడివిడిగా కట్టలు కట్టి ఉంచాలి» ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు కంటే తక్కువ ఉంటే వాటిని ఆర్వో తిరిగి పరిశీలిస్తారు.» తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్వో, అబ్జర్వర్లు ఒకొక్కటే పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. డిక్లరేషన్ 13 ఏ అత్యంత కీలకం» ఓటరు తన ఓటును కవర్ ‘ఏ’లో పొందుపరచి దానికి డిక్లరేషన్ 13 ఏ జత చేసి ఈ రెండింటినీ కవర్ ‘బీ’లో ఉంచి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు.» బ్యాలెట్ బాక్స్ నుంచి కవర్ బీ తెరవగానే ముందుగా బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ ‘ఏ’ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.» కవర్ బీ తెరవగానే అందులో ఫారం 13 సీలో రెండు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్ పేపర్ (ఫారం 13 బీ) ఉండే కవర్ ఏ, ఓటరు ఇచ్చిన డిక్లరేషన్ 13 ఏ ఫారం ఉండాలి» ఈ రెండూ విడివిడిగా లేకపోతే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించి పక్కన పెట్టాలి.» ఆ తర్వాత 13 ఏ డిక్లరేషన్ సరిగా ఉందా? లేదా? అన్నది పరిశీలించాలి.» ఈ డిక్లరేషన్ ఫారంపై ఓటరు సంతకంతోపాటు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీల్ ఉందో లేదో పరిశీలించాలి.» ఒకవేళ అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, సీల్ లేకపోయినా ఆ ఓటును తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.» అటెస్టింగ్ అధికారి సంతకంపై అనుమానం ఉంటే ఏజెంట్లు తమ అభ్యంతరాన్ని ఆర్వోకు తెలియచేయాలి.» ఆర్వో తమ వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారి సంతకంతో సరి పోల్చి ఒకే విధంగా ఉంటే ఆమోదిస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు.» ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం మొదలవుతుంది.» తొలుత కవర్ ఏ ఓపెన్ చేసి అందులోని ఫారం 13 బీ బ్యాలెట్ పేపర్ను ఓపెన్ చేస్తారు.» 13 ఏపై ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్, 13 బీ మీద ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ సరిపోలాలి.» ఈ రెండు నెంబర్లలో తేడా ఉంటే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించాలి.» ఏజెంట్లు తమ ఫిర్యాదులు ప్రతీది లిఖిత పూర్వకంగా ఇవ్వాలిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇలా» జూన్ 4 ఓట్ల లెక్కింపు తొలుత పోస్టల్ బ్యాలెట్లతోనే మొదలవుతుంది. ఉదయం 8 గంటల కల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో ఏజెంట్లు ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. కౌటింగ్ కేంద్రంలో మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఒకవైపు ఏడు మరో వైపు ఏడు చొప్పున అమర్చి చుట్టూ కంచె వేస్తారు. ఈ రెండు వరుసల మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం టేబుల్ ఉంటుంది. ఆర్వో పర్యవేక్షణలోనే మొత్తం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. » పోస్టల్ బ్యాలెట్లలో రెండు రకాలుంటాయి. మిలటరీలో సేవలందించే వారు ఎలక్ట్రానిక్ రూపంలో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోగా 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులు, పోలింగ్ రోజు విధులు నిర్వహించిన ఉద్యోగులు సాధారణ విధానంలో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. ఈ రెండు విధానాల్లోనూ ఓట్ల లెక్కింపు ఒకే రకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేసిన వారి క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకుంటారు. » పోస్టల్ బ్యాలెట్లో రెండు రకాల కవర్లు ఏ, బీతో పాటు మూడు రకాల ఫారమ్స్ 13 ఏ, 13 బీ, 13 సీ ఉంటాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు వినియోగించుకున్నారా? లేదా? అనేది పరిశీలించి లెక్కింపు అర్హతను నిర్థారిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఇదే అత్యంత ప్రధానమైనది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందా? లేదా? ఎలాంటి సందర్భాల్లో ఏజెంట్లు అభ్యంతరం చెప్పవచ్చో ఇప్పుడు చూద్దాం.. -
ఎల్లుండే ‘లోక్సభ’ కౌంటింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10వేల మంది సిబ్బందిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. 4న జరిగే లోక్సభ ఓట్ల లెక్కింపుతోపాటు 2న జరిగే ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు, 5న జరిగే ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్ల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాస్రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10 వేల మంది సిబ్బందిని ఎంపిక చేశామని.. ఇందులో 50 శాతం సిబ్బంది రిజర్వ్లో ఉంటారని చెప్పారు. ర్యాండమైజేషన్ పద్దతిలో సిబ్బందిని ఎంపిక చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. మూడంచెల భద్రత మధ్య ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి ఒక కౌంటింగ్ కేంద్రం ఉంటుందని.. ఒక కేంద్రంలో 24 టేబుల్స్ ఉంటాయని వికాస్రాజ్ తెలిపారు. అయితే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 28 టేబుల్స్ అవసరమవడంతో.. రెండు హాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రం లోపలికి అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు సహా ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. ఇప్పటివరకు 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని.. ఇంకా ఈటీపీబీఎస్ (ఎ ల్రక్టానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం)లు వస్తున్నాయని, కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలలోపు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ లెక్కన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యపై కౌంటింగ్ రోజే స్పష్టత వస్తుందన్నారు. చొప్పదండి, దేవరకొండ, యాకుత్పురా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు 24 రౌండ్లు పడుతుందని.. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లకు సంబంధించి 13 రౌండ్లలోనే పూర్తవుతుందని వివరించారు. సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ర్యాండమ్గా ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్ రసీదులను లెక్కిస్తామని తెలిపారు. 2,414 మంది సూక్ష్మ పరిశీలకులులోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,414 మంది సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లను) నియమించినట్టు వికాస్రాజ్ తెలిపారు. ఒక్కో టేబుల్కు ఒక అబ్జర్వర్ ఉంటారని చెప్పారు. లెక్కింపు కోసం ఒక టేబుల్కు ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు ఉంటారన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వా ల్సి ఉంటుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు, పటిష్ట భద్రత మధ్య తరలిస్తామని.. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని వివరించారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలను మూసివేస్తామన్నారు. ఆ రోజున ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు. ఒకవేళ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చన్నారు. ఎప్పటికప్పుడు పరిశీలకుల అను మతి తర్వాత ఫలితాలు వెల్లడిస్తారని.. కౌంటింగ్ హాల్లో, మీడియా సెంటర్ వద్ద ప్రకటిస్తామని, వెబ్సైట్లోనూ అప్లోడ్ చేస్తా మని తెలిపారు. ఆదివారం జరిగే ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దుప్పలపల్లిలోని తెలంగాణ వేర్హౌజ్ కార్పొరేషన్ గోదాం ఆవరణలో జరుగుతుందని వికాస్రాజ్ వెల్లడించారు. -
తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం
సాక్షి, అమరావతి: వచ్చే జూన్ 4న కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే తేలిపోనుండగా.. మరికొన్ని నియోజకవర్గాల తుది ఫలితం కోసం రాత్రి వరకు వేచిచూడాల్సి ఉంటుంది. పోలైన ఓట్లు, కౌంటింగ్ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుళ్ల ఆధారంగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు అవసరమైన రౌండ్లను నిర్ధారించింది.దీని ప్రకారం.. రాష్ట్రంలో అన్నింటికంటే ముందుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఫలితాలు మధ్యాహ్నంలోపే ప్రకటించే అవకాశముందని ఎన్నికల సంఘ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఇదే సమయంలో రంపచోడవరం (ఎస్టీ), చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత పాణ్యం, భీమిలి నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తుది ఫలితాల వెల్లడికి రాత్రి 7 గంటల వరకు వేచిచూడాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 111 చోట్ల 20, అంత కంటే తక్కువ రౌండ్లలోనే పూర్తి రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీని ప్రకారం.. కౌంటింగ్ హాళ్లల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. ఎటువంటి గందరగోళం లేకుండా అందరి అనుమతితోనే సువిధ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాతే ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సీ, 21ఈలను అదేరోజు ఫ్లైట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. -
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
సాక్షి, మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జూన్ 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఏజెంట్లు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి గురువారం వచ్చిన ఆయన కృష్ణా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు.. భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ చేసిన, చేయనున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆస్మిలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాల వారిగా లెక్కింపు కేంద్రాలు, టెబుళ్లు, రౌండ్ల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా వారి ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని కౌంటింగ్ హాల్ నుండి బయటకు పంపేస్తామన్నారు. కౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ముఖేష్కుమార్ మీనా అధికారులకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల అంశం సీఈసీ పరిధిలో ఉంది..పోస్టల్ బ్యాలెట్లపై వైఎస్సార్సీపీ చేసిన విన్నపాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, అది సీఈసీ పరిధిలో ఉందని ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు. నేడో, రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, గన్నవరం రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ, డీఆర్ఓ కె.చంద్రశేఖరరావు, పలువురు రిటర్నింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి షాహిద్ బాబు, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడీ మనీషా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్షాప్, జూమ్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సందేహాల నివృత్తికి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రతి ఓటూ విలువైనదేనని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని, దానికి సంబంధించి ఆదేశాలు రాగానే తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో ఈసీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నందున, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి అనుమానమూ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సమావేశానికి హాజరైన వారికి విశ్రాంత ఆర్డీవో ముదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఏజెంట్ల సందేహాలు నివృత్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జి, శాసన మండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.పోస్టల్ బ్యాలెట్ లెక్కించే విధానం⇒ ఎన్నికల అధికారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదట విధిగా పోస్టల్ బ్యాలెట్లని లెక్కించాలి⇒ మొదటి కవరు–బి పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రెస్సు, ఓటరు సంతకం ఉండాలి. (ఓటరు సంతకం తప్పనిసరికాదు).⇒ మొదటి కవరు–బి (ఫారం – 13సి) తెరిచి చూసినప్పుడు అందులో 13 – ఏ డిక్లరేషన్, ఫారం 13–బి (కవరు – ఏ) విడివిడిగా ఉండాలి. లేకపోతే అది చెల్లుబాబు కాదు. అందులో కవరు – ఏ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద ఓటరు సంతకం లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద పోస్టల్ బ్యాలెట్ క్రమ సంఖ్య నమోదు చేయకపోయినా, నమోదు చేసినట్లయితే అది 13–బి (పోస్టల్ బ్యాలెట్ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్యతో సరిపోలక పోయినా, 13 – ఏ డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి హోదా తెలియజేసే స్టాంప్ లేదా హోదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లనిదిగా పరిగణించాలి.⇒ 13– ఏ డిక్లరేషన్లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13 – బి పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న కవరు(కవరు – ఏ)ను పరిశీలించాలి. 13– ఏ డిక్లరేషన్లో పేర్కొన్న బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య, 13 – బి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న క్రమసంఖ్య ఒకటి కాకపోయినా, ఓటరు ఎవ్వరికీ ఓటు వేయకపోయినా, ఓటరు తమ ఓటుని ఒకరికంటే ఎక్కువ మందికి వేసినా, బ్యాలెట్ పేపరు చిరిగిపోయి పూర్తిగా సమాచారం కనిపించకపోయినా, ఓటరు ఓటుని ఎవరికి వేశారో పూర్తి సందిగ్ధంగా ఉన్నప్పుడు, ఓటరు తనే ఓటు వేసినట్లుగా గుర్తించినప్పుడు (ఉదాహరణకు ఓటరు పేరు రాసినా, సంతకం చేసినా) దానిని చెల్లని ఓటుగా పరిగణించాలి. ప్రతి బ్యాలెట్ పేపర్లో నమోదు చేసిన అంశాలను పోటీ చేసే అభ్యర్థుల ప్రతినిధిగా ఉన్న ఏజెంట్/అభ్యర్థికి విధిగా సంబంధిత ఎన్నికల అధికారి చూపించి నిర్ణయం తీసుకోవాలి. బ్యాలెట్ పేపరు లెక్కించిన తరువాత రిజల్ట్ షీట్ (ఫారం–20)లో నమోదు చేయాలి. -
మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి
సాక్షి, అమరావతి: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు సాయంత్రం 4 గంటల్లోపు వస్తాయన్నారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రం 6.00 గంటల్లోపు వీటి ఫలితాలు రావొచ్చని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు టేబుళ్లను పెంచి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాత్రి 8 – 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కౌంటింగ్కు చేపట్టిన ఏర్పాట్లను సీఈవో మీనా వివరించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్ అమలుతో పాటు ఆ జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డిజీపీతో పాటు తాను కూడా పల్నాడు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపులో లోపాలు జరగకూడదు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎటువంటి లోపాలు, జాప్యం జరగడానికి వీల్లేదని, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ రాష్ట్ర అధికారులకు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21 సీ, 21ఈలను అదే రోజు ఫ్లైట్లో ఈసీకి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా లెక్కింపు ప్రక్రియపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల్లో కూలీల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని చెప్పారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగినందున, ఈ జిల్లా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్ బాగ్చీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేశామని, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు చేపడుతున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు నితీష్ వ్యాస్కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో హరేంధిర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తదితరులు వారి నియోజకవర్గాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశాం
నరసరావుపేట/బాపట్ల: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) ముఖేష్కుమార్ మీనా తెలిపారు. మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేటతో పాటు బాపట్లలో ఆయన పర్యటించారు. నరసరావుపేట మండలం కాకాని సమీపంలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన మీనా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక జిల్లా అయినా పల్నాడులో రీపోలింగ్కు అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ అధికారులను అభినందించారు. వెబ్కాస్టింగ్ వంటి ఏర్పాట్లు చేసినా కొన్ని బూత్లలో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కఠిన చర్యలు తీసుకుందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించి.. ఎన్నికల కమిషన్పై ప్రజలకు నమ్మకం తీసుకొస్తామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే సంబంధిత రిటరి్నంగ్ అధికారి వెంటనే స్పందించాలని ఆదేశించారు. మద్యం అమ్మకాలను నిషేధించాలి డీజీపీ హరీ‹Ùకుమార్గుప్తా మాట్లాడుతూ.. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ శ్రీకేశ్ మాట్లాడుతూ.. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు 700 మందికి పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో పాటు ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,196 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడు ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో 59 మందిని అరెస్టు చేశామని చెప్పారు. సమావేశంలో పోలీస్ అధికారులు గోపినాథ్ జెట్టి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్, జేసీ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించొద్దు అలాగే బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను సీఈవో ముఖే‹Ùకుమార్ మీనా మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ సీహెచ్ శ్రీధర్, ఆర్వోలతో మీనా సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాస్లున్న వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆయన ఆదేశించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, ఆర్వోలు ఉన్నారు. -
కౌంటింగ్ ఏజెంట్లే కీలకం
సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్నికల నిబంధనలు–1961 ప్రకారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ ఆమోదంతో కౌంటింగ్ ఏజెంట్లను నియమిస్తారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థి తరఫున ప్రతినిధిగా వ్యవహరించే కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కౌంటింగ్కు మూడు రోజుల ముందు సాయంత్రం 5గంటల్లోపు కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించిన ఫారం–18ను సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ఆర్వోలు కౌంటింగ్ ఏజెంట్లకు ఐడీ కార్డులు తయారు చేసి పంపుతారు. కౌంటింగ్కు గంట ముందు అపాయింట్మెంట్ లెటర్, ఐడీ కార్డ్ ఆర్వోలకు సమర్పించాల్సి ఉంటుంది. ఫారం–19 ద్వారా కౌంటింగ్ ఏజెంట్ అపాయింట్మెంట్ను రద్దు చేసే అధికారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్కు ఉంటుంది. ఏజెంట్లకు అవగాహన అవసరం సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సీ పార్ట్–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం–17సీలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రంలో వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఆ ఫారంలోనే నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. టెండర్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపర్ సీళ్లు (ఓటరుకు పోలింగ్ కేంద్రంలో ఇచ్చే రెండు రంగుల స్లిప్లు), సీరియల్ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు, వినియోగించని పేపర్ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి, పాడైపోయిన పేపర్ సీళ్లు, సీరియల్ నంబర్ల వంటి వివరాలు ఇందులో ఉంటాయి.ట్యాంపరింగ్ జరిగితే..కంట్రోల్ యూనిట్ టేబుల్పైకి రాగానే అభ్యర్థి సీలింగ్ సెక్షన్ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్ ఏజెంట్లు, పరిశీలకులు చూసుకోవాలి. రిజల్ట్ సెక్షన్పై స్ట్రిప్ సీల్, గ్రీన్ పేపర్ సీల్ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్ నంబర్లు ఫారం–17సీలో నమోదు చేసినవే ఉండాలి. కంట్రోల్ యూనిట్ పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్ల ట్యాంపరింగ్ జరిగాయని గుర్తిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ట్యాంపరింగ్ జరగని కంట్రోల్ యూనిట్లను మాత్రమే లెక్కించాలి.మార్గదర్శకాలు ఇవీ..అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండిన వారిని ఏజెంట్లుగా నియమించుకుంటే వారు కౌంటింగ్ సక్రమంగా వీక్షించేందుకు వీలుంటుంది. సాయుధ రక్షణ కలిగిన వ్యక్తులను కౌంటింగ్ హాల్లోకి అనుమతించరాదని ఈసీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మునిసిపల్, జెడ్పీ చైర్మన్లు, పబ్లిక్రంగ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఏజెంట్లుగా కూర్చునేందుకు అనర్హులు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందేవారు, ప్రభుత్వ–ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే పార్ట్ టైమ్ ఉద్యోగులు, పారామెడికల్ స్టాఫ్, రేషన్ డీలర్లు, అంగన్వాడీ ఉద్యోగులు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 సెక్షన్ 134 (ఏ) ప్రకారం శిక్షార్హులవుతారు. వీరికి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. సర్పంచ్లు, పంచాయతీ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. భారత పౌరసత్వం కలిగిన ఎన్నారైలు కూడా కూర్చోవచ్చు. ప్రభుత్వ గన్మెన్ సౌకర్యం ఉన్నవారు ఎన్నికల ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంట్గా ఉండకూడదు. అలాంటి వ్యక్తి సెక్యూరిటీతో గాని, సెక్యూరిటీ లేకుండా గానీ కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించకూడదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తనకున్న సాయుధ రక్షణను స్వచ్ఛందంగా వదులుకుంటే కౌంటింగ్ హాల్లో కూర్చునేందుకు అనుమతిస్తారు. ఒక కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు, ఒక ఆర్వో టేబుల్ కలిపి మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఆ మేరకు అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్లు, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీ పీబీఎస్) లెక్కింపునకు అదనపు టేబుళ్లు అవసరం అని భావిస్తే అందుకోసం వేరే కౌంటింగ్ హాల్లో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అభ్యర్థులు అక్కడ అదనంగా మరో కౌంటింగ్ ఏజెంట్ను నియమించుకోవచ్చు. -
ఓట్ల లెక్కింపు ఇలా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజేషన్ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతోపాటు 200 మంది రిటరి్నంగ్ ఆఫీసర్లను నియమించారు. ఈవీఎంల తరలింపు మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపర్చారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలుపెట్టడం మొదలు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్ నంబర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్ టేబుళ్లపైకి చేరుస్తారు. కౌటింగ్ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్ యూనిట్ మాత్రమే తీసుకువస్తారు. ఓటు వేసిన ఈవీఎం మెషీన్తో అవసరం లేదు. కౌంటింగ్ హాల్లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్కు సంబంధించిన కంట్రోల్ యూనిట్ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్ అన్నది లెక్కించి.. దాని ప్రకారం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా.. లేదా.. అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్గా మూడు వీవీప్యాట్లు ఎంపిక చేసి మూడింటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న (క్లోజ్ రిజల్ట్ క్లియర్–సీఆర్సీ) ఓటింగ్ యంత్రాలతో పాటు మాక్ పోలింగ్ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజార్టీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతీ రౌండ్ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. -
AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
విశాఖపట్నం : జూన్ 4వ తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గం,అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన సిబ్బంది నియామకం,రౌండ్లు వివరాలు,టేబుల్స్ ఏర్పాటు తదితర విషయాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున రిటర్నింగ్ అధికారులతో చర్చించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు టేబుల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.ఈటీíపీఎస్ ఓట్లు(సర్వీసెస్) ఓట్లు లెక్కింపు మొదలవుతుంది.ఆ తర్వాత ఉద్యోగులు వేసిన ఓట్లు లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు ఈవీఎంలను లెక్కింపు మొదలు పెడతారు. జిల్లాలో నాలుగు వేల మంది వరకు పోస్టల్ బ్యాలెట్ ఉండగా, శుక్రవారం నాటికి 891 కలెక్టరేట్కు చేరుకున్నాయి. మొత్తం పోస్టల్ బ్యాలెట్స్,ఉద్యోగుల ఓట్లు లెక్కింపును మూడు రౌండ్లులో పూర్తి చేయవలసి ఉంది. పశ్చమదే తొలి ఫలితం మొదటి ఫలితం విశాఖ పశ్చమ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉంది. పోలైన ఓట్లు ఆధారంగా 16 రౌండ్లు విభజించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దక్షిణం 17 రౌండ్లకు విభజించారు. ఆ ఫలితం కూడా 3.30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా భీమిలి ఫలితం వెలువడనుంది. ఇక్కడ 26 రౌండ్లు వచ్చాయి. దీని వల్ల రాత్రి 7.30 గంటలకు ఫలితం వస్తుందని అంచనా వేశారు. -
ట్రెండ్ తెలియాలంటే నిరీక్షించాల్సిందే
సాక్షి, అమరావతి: భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో ఈదఫా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 4న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా తొలి అంచనాల సరళి తెలుసుకునేందుకు నిరీక్షించక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తైన తరువాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నందున చాలా చోట్ల తొలి రౌండ్ ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా ఈసారి 4.97 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లేశారు. 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతోపాటు అత్యవసర సేవల సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, కెమెరా అసిసెంట్లు, ప్రైవేట్ డ్రైవర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలి్పంచారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 4.44 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు.వీరే కాకుండా తొలిసారిగా రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ విధానం ద్వారా 85 ఏళ్లు దాటిన 13,700 మంది వృద్ధులు, 12,700 మంది దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటేయగా అత్యవసర సేవలందించే మరో 27,100 మంది కూడా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865, నంద్యాల జిల్లాలో 25,283, వైఎస్ఆర్ కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు అధికంగా నమోదు కావడంతో లెక్కించేందుకు అదనపు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే.. ఈవీఎంలతో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కవర్ తెరిచి ఏజెంట్లకు చూపించి ఆ ఓటు అర్హమైనదో కాదో గుర్తించాలి. కవర్ ‘ఏ’తో పాటు ఓటరు డిక్లరేషన్ ఫారం విడిగా లేకుంటే పరిగణలోకి తీసుకోరు. గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును పరిగణించరు. ప్రతి ఫెసిలిటేషన్ కేంద్రంలో గెజిటెడ్ అధికారిని అందుబాటులో ఉంచినా చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని సమాచారం.పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటరి్నంగ్ అధికా>రి సీల్, సంతకం లేకుంటే ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు. ఇలా పలు అంశాలను పరిశీలించాకే అర్హత పొందిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. 2019 ఎన్నికల్లో 56 వేల పోస్టల్ బ్యాలెట్లు (21.37 శాతం) చెల్లకుండా పోయాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అందువల్ల ఉదయం తొమ్మిదిన్నర పది గంటల తర్వాతే తొలి అంచనాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు. -
అంతకు మించి అరాచకం!
సాక్షి, అమరావతి: ఎన్నికల హింసకు తెగబడ్డ పచ్చ ముఠాలు ఈ కుట్రలకు పదును పెడుతుండటం పోలీసు శాఖకు సవాల్గా మారింది. పోలింగ్ సందర్భంగా యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ రౌడీ మూకలు ఓట్ల లెక్కింపు రోజు మరింత బరి తెగించేందుకు పథకం రూపొందించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారితోపాటు అదుపులోకి తీసుకున్న వారిలో 75% మంది టీడీపీకి చెందినవారే కావడం ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలకు అద్దంపడుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అలజడులు రేకెత్తించడం, జూన్ 4న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బీభత్సం సృష్టించేందుకు భారీ కుట్రలకు తెర తీశాయి. పచ్చ ముఠాలు, అల్లరి మూకలు విసురుతున్న సవాల్ను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ సందర్భంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు కార్డన్ – సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు శాఖసోదాలు నిర్వహిస్తోంది. నేర చరితులను అదుపులోకి తీసుకుంటోంది. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలను, రికార్డులు లేని వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టింది. బదిలీలతో అల్లరి మూకల అరాచకం..రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకలు యథేచ్చగా విధ్వంస కాండకు తెగబడ్డాయి. చంద్రబాబు, పురందేశ్వరిఈసీపై ఒత్తిడి తెచ్చి పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని నియమించుకుని పన్నాగాన్ని అమలు చేశారు. ప్రధానంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులు, రాడ్లతో విరుచుకుపడటంతోపాటు బాంబు దాడులకు కూడా తెగబడి బీభత్సం సృష్టించాయి.గూండాగిరీ అంతా పచ్చముఠాదేపోలింగ్కు ముందు, అనంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినవారిని గుర్తించి పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఎన్నికల ముందు నమోదైన కేసులతో ప్రమేయం ఉన్న 1,522 మందిని గుర్తించి కొందరిని అరెస్ట్ చేసింది. మిగిలిన వారికి 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. వీరితో దాదాపు 1,300 మంది టీడీపీ వర్గీయులే కావడం గమనార్హం. ఇక పోలింగ్ రోజు దాడులు, ఘర్షణల కేసుల్లో ప్రమేయం ఉన్న 2,790 మందిని గుర్తించగా కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికి 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. పోలింగ్ రోజుల అరాచకాలకు తెగబడ్డ వారిలో దాదాపు 2,400 మంది టీడీపీకి చెందిన వారే కావడం ఆ పార్టీ కుట్రలను బట్టబయలు చేస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 85 మందిపై హిస్టరీ షీట్లను తెరవగా వీరిలో 58 మంది టీడీపీ వర్గీయులే ఉన్నారు. టీడీపీకి చెందిన ముగ్గురిపై పీడీ యాక్ట్ను ప్రయోగించగా మరో ఇద్దరిని జిల్లాల నుంచి బహిష్కరించారు. పోలీసుశాఖ గత మూడు రోజులుగా 301 సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ – సెర్చ్ ఆపరేషన్ల ద్వారా విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎటువంటి పత్రాలు లేని 1,104 వాహనాలను జప్తు చేసింది. 482 లీటర్ల సారాయి, 3,332 లీటర్ల అక్రమ మద్యం, 436 లీటర్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద టీడీపీ మూకలు అరాచకాలకు తెగబడే ప్రమాదం ఉన్నందున పటిష్ట బందోబస్తు కల్పించారు. 350 స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలకు కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు 24/7 మూడంచెల భద్రతతో పహరా కాస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలను సమకూర్చారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద వెయ్యికి పైగా అధునాతన ఫేస్ రికగ్నైజేషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్), ఎస్పీ/ పోలీస్ కమిషనర్లు పాసులు జారీ చేసిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు వచ్చిన అధికారులు, సిబ్బంది వివరాలను నమోదు చేస్తున్నారు. వీడియోగ్రఫీ ద్వారానే లోపలికి అనుమతిస్తున్నారు. అన్ని స్ట్రాంగ్రూమ్లను అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పటిష్ట నిఘా కోసం స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ ఫ్లడ్ లైట్లను అమర్చారు. స్ట్రాంగ్రూమ్లు ఉన్న ప్రదేశానికి 2 కి.మీ. పరిధిని రెడ్ జోన్గా ప్రకటించి డ్రోన్లు, బెల్లూను ఎగురవేయడాన్ని నిషేధించారు. స్ట్రాంగ్రూమ్ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించే ప్రక్రియను ఖరారు చేశారు.అమలులో నిషేధాజ్ఞలుస్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలున్న నగరాలు, పట్టణాల్లో ఓట్ల లెక్కింపు ముగిసేవరకూ వరకూ పోలీసు శాఖ నిషేధాజ్ఞలను విధించింది. 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమలులో ఉంటాయని ప్రకటించింది. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. కర్రలు, కత్తులు, రాడ్లు, ఇతర ఆయుధాలతో సంచరించకూడదని హెచ్చరించింది. పెట్రోల్ బంకుల్లో విడిగా పెట్రోల్, డీజిల్ విక్రయించకూడదని ఆదేశించింది. అసత్య వార్తలు, ఫేక్ న్యూస్ను సోషల్ మీడియాలో వైరల్ చేయకూడదని పేర్కొంది.ప్రజలు సహకరించాలి: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాఅసాంఘిక శక్తులను కఠినంగా అణచివేస్తాం. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అందుకు ప్రజలు కూడా సహకరించాలి. ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. సంయమనం పాటించాలి. చట్టవ్యతిరేక, అసాంఘిక శక్తుల కదలికల గురించి టోల్ ఫ్రీ నంబర్లు 100, 112లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమివ్వాలి.కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టంఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశంపై ఈసీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. రాష్ట్రంలో 33 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. లెక్కింపు త్వరగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ప్రతిపాదించారు. పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత 15 రోజుల వరకు 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే కొనసాగనున్నాయి. -
వివాద రహితంగా ఎన్నికల ప్రక్రియ
సాక్షి, అమరావతి: వివాదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుంటూ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. మీనా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి అందే ఫిర్యాదుల పరిష్కారం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. అలాగే దినపత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తాంశాలపై చర్యలు తీసుకుని, సంబంధిత వివరాలను ప్రతివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో వివరించాలన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేయాల్సిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ అంశాలకు సంబంధించి ప్రతివారం సంబంధిత జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం యాప్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఆ యాప్ ట్రయల్ రన్ను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. ఆ యాప్ను అధికారులు డౌన్లోడ్ చేసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీమ్లు, జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సభ్యులు లాగిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అదనపు సీఈవోలు కోటేశ్వరరావు, హరెంధిర ప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బంగ్లా పీఠంపై మళ్లీ హసీనాయే
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే పాలక అవామీ లీగ్ నెగ్గింది. ఆదివారం పోలింగ్ జరగ్గా రాత్రికల్లా తొలి దశ ఫలితాలు వెలువడ్డాయి. 300 స్థానాలకు గాను ఇప్పటికే 200 చోట్ల నెగ్గి అవామీ లీగ్ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. దాంతో ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు విపక్షాలన్నీ బహిష్కరించిన ఈ ఎన్నికలపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో కేవలం 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించారు. సాయంత్రం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. బంగ్లాదేశ్లో 2018 సాధారణ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈసారి అది ఏకంగా సగానికి పడిపోవడం గమనార్హం. మొత్తం 300 నియోజకవర్గాలకు గాను 299 చోట్ల పోలింగ్ నిర్వహించారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 436 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. హసీనా 2009 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. భారత్ పొరుగుదేశం కావడం అదృష్టం ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్ట–జమాత్–ఇ–ఇస్లామీ కూటమికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని ప్రధాని షేక్ హసీనా విమర్శించారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించామని చెప్పారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని చెప్పారు. భారత్ లాంటి దేశం పొరుగున ఉన్నందుకు తాము చాలా అదృష్టవంతులమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి భారత్ ఎంతగానో సహకరించిందని చేశారు. 1975 ఆగస్టులో తన తండ్రిని, తల్లిని, ముగ్గురు సోదరులను, ఇతర కుటుంబ సభ్యులను సైనికాధికారులు దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే... ఓ ఎమ్మెల్యే!
అధికారికంగా ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఫలితాలపై కామెంట్ చేయడం న్యాయం కాకపోవచ్చు. కాకపోతే దేశంలో ఎగ్జిట్ పోల్ అనే ప్రక్రియ క్రమంగా శాస్త్రీయతను సంతరించు కుంటున్నది. చిన్నాచితకా ఔత్సాహిక సంస్థలను, రాజకీయ ప్రయోజనం కోసం చేయించుకునే సర్వేలను మినహాయిస్తే, దేశంలో ప్రముఖ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ సంద ర్భాల్లో నిజమయ్యాయి. అలా నిజమైన సందర్భాల్లో కూడా ట్రెండ్ను మాత్రమే సూచించగలుగుతున్నాయి కానీ సీట్ల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడంలో ఇంకా పరిపూర్ణత రాలేదు. మెజారిటీ స్థానిక ఏజెన్సీలతో పాటు ప్రముఖ జాతీయ ఏజెన్సీలు కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజ యాన్ని సంశయాతీతంగా ప్రకటిస్తున్నాయి. ఏబీపీ – సీ వోటర్, జన్ కీ బాత్లు 60 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేస్తే, ఇండియాటుడే – మై యాక్సిస్, టైమ్స్ నౌ– ఈటీజీ, ఇండియా టీవీ – సీఎన్ఎన్, టుడేస్ చాణక్య తదితర సంస్థలు ఈ సంఖ్య 70 దాకా వెళ్లొచ్చని ఊహిస్తున్నాయి. సమా జంలో గొంతు విప్పే స్వభావం వున్న ప్రభావ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత గత కొంతకాలం నుంచి స్పష్టంగానే కనిపిస్తూ వచ్చింది. అయితే ఈ వ్యతిరేకత పాటక వర్గాల్లో, కింది సెక్షన్లలో ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉండేది. రైతుబంధు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందుకు కారణం కావచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంకేతాల ప్రకారం ప్రభావ వర్గాలు, పాటక వర్గాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత అంతటా ఆవరించినట్టు అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఓటర్లు మార్పు కోరుకున్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా నలభై శాతం కంటే తక్కువ మంది, వ్యతిరేకంగా అరవై శాతం కంటే ఎక్కువ మంది ఓటేసినట్టు అంచనాలు వెలువ డ్డాయి. ఈ అంచనాలు ఎంతమేరకు వాస్తవమో ఆదివారం మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది. గడిచిన కొంతకాలంగా ప్రభావ వర్గాల్లో బహిరంగంగా వ్యక్తమవుతున్న అసమ్మతికి, పాటక వర్గాల్లో మౌనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సామాన్య జనం సంగతి దేవుడెరుగు, ప్రజాప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రి దర్శనం దుర్లభమన్న ప్రచారం బాగా వ్యాపించింది. ప్రజాస్వామ్య ప్రియులెవరికీ ఇది రుచించలేదు. రాష్ట్రంలో పరిపాలనంతా ఒక్క కుటుంబం చేతిలోనే కేంద్రీకృతమైందన్న ఆరోపణలను జనం బాగా నమ్ముతున్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యాధికులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకు తాయని బలహీన వర్గాలకు చెందిన వారు బాగా ఆశలు పెట్టు కున్నారు. వారి ఆంకాంక్షల మేరకు ప్రభుత్వం కొలువుల్ని భర్తీ చేయలేదనే అసంతృప్తి చాలా కాలంగా వ్యక్తమవుతున్నది. ధరణి పోర్టల్ వలన క్షేత్రస్థాయిలో ఏర్పడిన ఇబ్బందులను, సమస్య లను గుర్తించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఇటువంటి సమస్యలు ఒక ఎత్తయితే, క్షేత్రస్థాయిలో అవి నీతి, ఎమ్మెల్యేల ‘విశ్వరూపం’ మరో ఎత్తు. ముప్పయ్ మందికి పైగా ఎమ్మెల్యేలపై (వారిలో కొందరు మంత్రులు) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనే సమాచారాన్ని విస్మరించి వారందరికీ టిక్కెట్లను కేటాయించడం వల్ల పాలక పార్టీకి భారీ నష్టం జరిగి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీరంతా వరసగా రెండోసారి ఎన్నికయ్యారు. తొలివిడత పదవీకాలంలో ఇంత తీవ్రస్థాయి ఆరోపణలు రాలేదు. రెండోసారి ఎన్నికైన తర్వాత వారు జూలు విదిల్చారు. మండలస్థాయి ఉద్యోగులు, అధికా రుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే! కొందరు ఘనాపాఠీలు జిల్లాస్థాయి పోస్టింగుల్లోనూ చక్రాలు, బొంగరాలు తిప్పగలిగారు. ఈ పోస్టింగులకు ఒక రేట్ల పట్టిక కూడా ఉంటుందనేది బహిరంగ రహస్యంగా మారింది. పైగా సదరు అధికారులందరూ ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే పని చేయాల్సి ఉంటుంది. వారి పైన ఉండే శాఖాసంబంధిత ఉన్నతాధికారులందరూ నిమిత్తమాత్రులుగా మిగిలారు. అధికారులు జేబుల్లో ఉండటంతో ఈ ప్రజా ప్రతినిధులు భూ వివాదాల్లో తలదూర్చారు. కారుచౌకగా కాజేసి బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వేశారు. మంజీరా నుంచి మూసీ దాకా దేన్నీ వదలకుండా వందల కోట్ల విలువైన ‘తైలాన్ని’ పిండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ దందాలు, రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాలు, కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని భోంచేయడం వగైరా వ్యాపకాలను కొందరు ఎమ్మెల్యేలు చేపట్టారు. చివరికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన ‘దళిత బంధు’ పథకంలోనూ బహిరంగంగానే కమీషన్లు కొట్టేసిన ప్రబుద్ధులున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ధరణిలోని లోటుపాట్లను ఆసరా చేసుకొని నిషేధిత జాబితాలోని భూములు, అసైన్డు భూము లను భారీగా కొనుగోలు చేశారు. చెరువుశిఖం భూములు, కాందిశీకుల భూములను కూడా కొల్లగొట్టి కళ్లముందే కోట్లకు పడగెత్తారు. దేశంలో అతి కొద్దిమంది శ్రీమంతుల దగ్గర ఉండే విలాసవంతమైన వాహనాలను కొందరు ప్రజాప్రతినిధుల లగ్జరీ విల్లాల్లో మనం చూడవచ్చు. కొండలను అక్రమంగా పిండి చేసుకున్న అమాత్యుడొకరు, బండలను అక్రమంగా తరలించు కున్న అమాత్యుడొకరు, భూదందాలకు సహకరించని ఇద్దరు కలెక్టర్లనే శంకరగిరి మాన్యాలు పట్టించిన అమాత్యులు, కొత్త జిల్లాలకు కార్యాలయాల పేరుతో భూ దందాలు చేసిన అమా త్యులు... వీరికి ఏమాత్రం తీసిపోని ఇంకో పాతికమందికి పైగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసినట్టు వినిపిస్తున్నది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే లందరికీ మళ్లీ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించడం కేసీఆర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా పరిశీలకులు భావిస్తున్నారు. కనీసం 30 స్థానాల్లో కొత్తవారినీ, యువతరాన్నీ, క్లీన్ ఇమేజ్ గలవారినీ పరిచయం చేసి ఉన్నట్లయితే కచ్చితంగా మెరుగైన ఫలితాలను అధికార పార్టీ సాధించి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండుసార్లు గెలిస్తేనే తరాలకు సరిపోయేంత పోగేసిన వాళ్లను మూడోసారి ఎన్నుకోవడం పట్ల ప్రజలు విముఖత చూపినట్టు ట్రెండ్ను బట్టి అర్థమవుతున్నది. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఇది వ్యక్తమైంది. అసలు ఎమ్మెల్యేలకున్న అధికారాలేమిటి? విధులేమిటి అన్న అంశంపై విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఏర్ప డింది. రాజ్యాంగం ప్రకారం కేంద్రానికీ, రాష్ట్రాలకూ చట్టాలు చేసే అంశాలపై రెండు ప్రత్యేక జాబితాలున్నాయి. ఒక ఉమ్మడి జాబితా ఉన్నది. రాష్ట్ర జాబితాలోని అంశాలు, లేదా ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసన సభలు చట్టాలు చేస్తాయి. ఈ క్రమంలో సదరు అంశంపై క్షుణ్ణమైన అధ్యయనం చేసి ఎమ్మె ల్యేలు చర్చలో పాల్గొనాలి. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకొంటే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రపతి ఎన్నికలో కూడా ఎమ్మెల్యే వోటర్గా ఉంటారు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకు ఇంతకు మించిన అధికారాల్లేవు. తన నియోజకవర్గంలోని ప్రజా సమస్య లను శాసనసభ ద్వారా మంత్రివర్గం దృష్టికి తీసుకొని వెళ్లవచ్చు. అధికార యంత్రాంగం ద్వారా ఆ సమస్య పరిష్కారం కావాలి. ఒక వంతెనగానీ, రోడ్డును గానీ ప్రభుత్వం మంజూరు చేస్తే ప్రభుత్వం తన శాఖల ద్వారా దానిని నిర్మించే ఏర్పాటు చేయడం విధాయకం. కానీ ప్రస్తుతం మన ఎమ్మెల్యేలు పనిని శాంక్షన్ చేయించుకోవడం దగ్గర్నుంచి కాంట్రాక్టర్ను నియమించి కమీషన్ వసూలు చేసుకునే వరకు దూసుకొని పోతు న్నారు. సంతకాలు చేయడం వరకే అధికారుల పని! కళ్ల ముందు రాజకీయ అవినీతి కనిపిస్తున్నప్పుడు అధికారుల సంతకాలు ఊరికే రావు కదా! ఆ సంతకాలకూ ఓ లెక్కుంటుంది!! ఎమ్మెల్యే నియోజక వర్గాలకు సమాంతరంగా ఉన్న పంచా యితీ సమితుల స్థానంలో ఐదారు చిన్న చిన్న మండలాలు రావడం కూడా ఎమ్మెల్యేలకు కలిసొచ్చింది. నియోజక వర్గంలో ఓ మినీ ముఖ్యమంత్రిగా అవతరించాడు. తన పరిధిలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నా ఆ శాఖ అత్యున్నత అధికారి డీజీపీ మాట కంటే ఎమ్మెల్యేమాటే చెల్లుబాటు అవుతున్నది. ఇది ఆరోగ్యకరమైన సంప్రదాయ మేనా? వ్యవస్థలు నిర్వీర్యం కావా? ధర్మోరక్షతి రక్షితః అంటారు. ఎమ్మెల్యేలనైనా, ఇంకెవరినైనా వారి చట్టబద్ధమైన అధికారాలకు, విధులకు పరిమితం చేస్తేనే వ్యవస్థలు ప్రజలకు నిష్పాక్షిక సేవలు అందించగలుగుతారు. రాజకీయ పార్టీలు వాటి రాజకీయ అవసరాల కోసం ఎమ్మెల్యేలను శక్తిమంతులుగా మార్చి ఉండవచ్చు. సర్వాధికారాల అండతో ఆ వ్యక్తి చెలరేగిపోయి పదవిని తన వంశపారంపర్య హక్కుగా భావిస్తున్నారు. దాన్ని నిలుపు కోవడం కోసం కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన ప్రజాసేవకులు రాజకీయాల్లో నిలబడగలరా? కోట్లు వెదజల్లినవాడు ప్రజాకంటకునిగా మార కుండా ఉంటాడా? అలాంటి వారికి మూడోసారి నాలుగోసారి టిక్కెట్ ఇస్తే సదరు పార్టీకి గుదిబండగా మారడమే కాదు, ప్రజాస్వామ్యానికీ ప్రమాదకరంగా తయారవుతారు. అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు ఈసారి అధికార పార్టీని ముంచు తారో, గట్టెక్కిస్తారో ఆదివారం మధ్యాహ్నానికి తేలిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Chhattisgarh Election Results 2023: ఛత్తీస్గఢ్లో బీజేపీ ఘన విజయం
Updates.. 54 చోట్ల గెలిచిన బీజేపీ 35 స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఒక సీటు గెలిచిన గోండ్వానా గణతంత్ర పార్టీ 54 స్థానాల్లో బీజేపీ ముందంజ 49 చోట్ల గెలిచిన బీజేపీ, మరో 5 చోట్ల ఆధిక్యం 33 స్థానాల్లో కాంగ్రెస్ విజయం, 2 చోట్ల ముందంజ ఒక సీటు గెలిచిన గోండ్వానా గణతంత్ర పార్టీ 55కు చేరిన బీజేపీ ఆధిక్యం 12 చోట్ల బీజేపీ గెలుపు. మరో 42 స్థానాల్లో ఆధిక్యం. 7 స్థానాల్లో కాంగ్రెస్ విజయం. మరో 28 చోట్ల ముందంజ. ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఆధిక్యంలో బీజేపీ బీజేపీ-53 కాంగ్రెస్-36 ఇతరులు-1 ►ఛత్తీస్గఢ్లో బీజేపీ సగం మార్కును దాటింది. ఈసీ ట్రెండ్స్ ప్రకారం 50 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 38 స్థానాల్లో కొనసాగుతోంది. BJP crosses the halfway mark in Chhattisgarh; leads on 50 seats as official ECI trends; Congress - 38 pic.twitter.com/3nwc7kjU8M — ANI (@ANI) December 3, 2023 ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ-46 కాంగ్రెస్-40 ఇతరులు-1 Assembly election results 2023: BJP, Congress in close fight in Chhattisgarh Read @ANI Story | https://t.co/5qa7sIWm8r#ChhattisgarhElection2023 #Chhatisgarh #BJP #Congress pic.twitter.com/PfSEFuDabk — ANI Digital (@ani_digital) December 3, 2023 ►ఛత్తీస్గఢ్లో బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ కో-ఇన్చార్జ్ నితిన్ నబిన్ అన్నారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ఇదీ ప్రజలు గ్రహించారన్నారు. స్పష్టమైన మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Bihar BJP MLA and Chhattisgarh BJP Co-in charge, Nitin Nabin says, "...BJP will form government in Chhattisgarh...The people of Chhattisgarh have realised that the Congress government is corrupt and they have cheated the people. BJP will form the government with a clear… pic.twitter.com/rKlcGnFMHp — ANI (@ANI) December 3, 2023 ►ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ-39, కాంగ్రెస్-35 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. Update | Assembly elections 2023 | BJP leading on 39 seats, Congress on 35 in Chhattisgarh, say ECI https://t.co/XPv0B1D71f pic.twitter.com/OwTxHgaR5v — ANI (@ANI) December 3, 2023 ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ-27 కాంగ్రెస్-24 ఇతరులు-2 Assembly results: BJP leading on 23 seats in Chhattisgarh Read @ANI Story |https://t.co/CFLP1TPfQ1#ChhattisgarhElections2023 #Chhattisgarh #Congress #BJP #ElectionCommissionOfIndia pic.twitter.com/E2FlQ6As6H — ANI Digital (@ani_digital) December 3, 2023 ►మొదటి రౌండ్ కౌంటింగ్లో కాంగ్రెస్ 15, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యం ►అంబికాపూర్ స్థానంలో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ డియో ముందంజ ►పటాన్ నియోజకవర్గంలో సీఎం భూపేష్ బఘేల్ వెనుకంజ Congress - 11, BJP- 11 in 90-seat assembly of Chhattisgarh pic.twitter.com/6Q8Frk0jKn — ANI (@ANI) December 3, 2023 ►బీజేపీ మాజీ మంత్రి అమర్ అగర్వాల్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శైలేష్ పాండేపై 3000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ 45 , బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ►ఛత్తీస్గఢ్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మాట్లాడుతూ, మా అంచనాల కంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రెండింటిలోనూ మేము అధికారాన్ని నిలుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని, తెలంగాణలో అధికారం చేపడతామన్నారు. #WATCH | Counting of votes begins, Congress leader Pawan Khera says, "The results will be better than our hopes and expectations. We are retaining power in both Rajasthan and Chhattisgarh. We will reclaim power in Madhya Pradesh and claim power in Telangana." pic.twitter.com/nRXevzQcdp — ANI (@ANI) December 3, 2023 ►ఛత్తీస్గఢ్లో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ►రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి సీఎం భూపేశ్ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్సింగ్ తదితర ప్రముఖులున్నారు. ఛత్తీస్గఢ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 90 మెజారిటీ మార్కు:46 -
ఎడతెగని మథనం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు కొద్దిగంటల్లో వెలువడనుండగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భవిష్యత్ కార్యాచర ణపై దృష్టి సారించారు. ప్రగతిభవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావు, పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, ఇతర నేతలతో రెండో రోజూ ఎడతెగని మంతనాలు జరిపారు. పార్టీ వార్రూమ్ నివేదికలతోపాటు ఎగ్జిట్పోల్స్, వివిధ సంస్థలు, నిఘా వర్గాలు, పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు అందించిన నివేదికలను లోతుగా విశ్లేషించారు. ఆదివారం వెలువడే ఫలితాలు బీఆర్ఎస్కు సానుకూలంగా ఉంటాయని గట్టిగా విశ్వసిస్తున్న కేసీఆర్.. మళ్లీ మన ప్రభుత్వమే ఏర్పడుతుందంటూ పార్టీ నేతలకు భరోసా కల్పిస్తున్నారు. సొంతంగానే మేజిక్ ఫిగర్ను అందుకుంటామని చెప్తున్నారు. అవసరమైతే ఎంఐఎంతో కలసి.. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేజిక్ ఫిగర్ అయిన 60 సీట్లు దక్కించుకునే అవకాశం లేదని బీఆర్ఎస్ శిబి రం లెక్కలు వేస్తోంది. ఒకవేళ హంగ్ ఫలితాలు వస్తే, అవసరమైతే మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ శిబిరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్కు చేరుకోవాలని ఆదేశించారని తెలిపాయి. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియను పార్టీపరంగా సమన్వయం చేసే బాధ్యతను కేటీఆర్ ఆధ్వర్యంలోని వార్రూమ్కు.. పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చేరుకునేలా చూడాల్సిన బాధ్యతను కేటీఆర్, హరీశ్రావులకు అప్పగించారు. గెలిచే చాన్స్ ఉన్నవారి జాబితా సిద్ధం చేసి.. వివిధ వర్గాల నుంచి అందిన నివేదికల ఆధారంగా గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాలు, అభ్యర్థులతో బీఆర్ఎస్ ఓ ప్రాథమిక జాబితాను సిద్ధం చేసుకుంది. మరోవైపు స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశమున్న (ఉత్కంఠ పోటీతో) నియోజకవర్గాల పరిస్థితిని మదింపు చేసి మరో జాబితాను రూపొందించుకున్నట్టు సమాచారం. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశమున్న స్థానాలపైనా బీఆర్ఎస్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో వారి మద్దతు అవసరమయ్యే పక్షంలో సంప్రదింపులకు సిద్దంగా ఉండాలని పార్టీ కీలక నేతలను ఆదేశించినట్టు తెలిసింది. ఉమ్మడి నల్గొండ మినహా ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలో గణనీయంగా సీట్లు సాధిస్తామని... ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పైచేయి బీఆర్ఎస్దే ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్లలో బీజేపీ బలంగా ఓట్లు చీల్చుతుందని.. దీనితో ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ మిశ్రమ ఫలితాన్ని సాధిస్తుందనే అంచనా వేసుకుంటున్నట్టు వివరిస్తున్నాయి. కౌంటింగ్ జాగ్రత్తలపై కేటీఆర్ సూచనలు ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏజెంట్ల నియామకం, కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్లతోనే గెలుపోటములు మారే అవకాశం ఉందని.. చివరి నిమిషం వరకు ఏజెంట్లు లెక్కింపు కేంద్రంలోనే ఉండాలని, అభ్యర్థులు కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు. -
నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది. ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం ఆదివారం వెల్లడి కానుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాయి. నెలన్నరకు పైగా ప్రచారంలో నిరంతరాయంగా చెమటోడ్చి విశ్రాంతి తీసుకుంటున్న అభ్యర్థులు, నేతల్లో ఫలితాలపై చెప్పలేనంత ఉత్కంఠ నెలకొంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. వీటిని కీలకమైన 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మూడుచోట్ల ముఖాముఖి మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు సాగింది. మధ్యప్రదేశ్లో బీజేపీ, మిగతా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్, అదే ఊపులో తాజా ఎన్నికల్లో మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తానని ఆశాభావంతో ఉంది. ఈసారి రాజస్తాన్, ఛత్తీస్గఢ్లు తమ వశమవుతాయని బీజేపీ భావిస్తోంది. ఈసారి మధ్యప్రదేశ్లో బీజేపీకి బాగా మొగ్గుందని, రాజస్తాన్లో ఆ పార్టీ ముందంజలో ఉందని గురువారం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణలో కాంగ్రెస్కే విజయావకాశాలున్నట్టు తేల్చాయి. హోరాహోరీ పోటీ నేపథ్యంలో హంగ్ వచ్చే చోట ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించేందుకు రెండు పారీ్టలూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఉదయం ఎనిమిదికి షురూ ► నాలుగు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ► తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ► అనంతరం 8.30గంటలకు నుంచి ఓటింగ్ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సాగుతోంది. ఇక్కడ 2,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గురువారం నాటి ఎగ్జిట్ పోల్స్లో మూడు బీజేపీకి ఘనవిజయం ఖాయమని పేర్కొన్నాయి. 2018 మాదిరిగా రెండు పార్టీలూ విజయానికి దగ్గరగా వస్తాయని మరికొన్ని అంచనా వేశాయి. ఒకట్రెండు కాంగ్రెస్ విజయాన్ని సూచించాయి. భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుని తీరుతుందని ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ శనివారం ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఈసారి మార్పుకే ఓటేశారని పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా బీజేపీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230 మెజారిటీ మార్కు: 116 రాజస్తాన్ ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం రాజస్తాన్ ప్రజల అలవాటు. ఈ ఆనవాయితీ ఈసారీ కొనసాగుతుందని, మోదీ మేనియా తోడై తమకు అధికారం కట్టబెడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎం గెహ్లోత్ మాత్రం ఈసారి ఆనవాయితీ మారుతుందని నమ్మకం పెట్టుకున్నారు. తన సంక్షేమ పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన నాటినుంచీ గెహ్లోత్పై కారాలూ మిరియాలూ నూరుతూ వస్తున్న కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ ప్రచార పర్వంలో మాత్రం సంయమనం పాటించారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 200 మెజారిటీ మార్కు: 101 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సాగుతోంది. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది సహాయ రిటరి్నంగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి సీఎం భూపేశ్ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్సింగ్ తదితర ప్రముఖులున్నారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 90 మెజారిటీ మార్కు:46 -
కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జ రగనున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీ య ఘటనలకు తావులేకుండా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండా లని పోలీస్ అధికారులు, సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహణపై పోలీస్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థుల గెలుపోటముల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలతో పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యా లీల సందర్భంగా దాడులు, ప్రతిదాడులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించారని, మరో రెండురోజులు ఇదే స్ఫూర్తితో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ కోరారు. -
ఊరూవాడా.. రిజల్ట్పై అటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జనం దృష్టి అంతా ఫలితాలపైనే పడింది. ఊరూవాడా పల్లెపట్నం ఎక్కడ చూసినా.. చిన్నాపెద్దా ఎవరిని కదిలించినా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎవరెవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు? కేసీఆర్, కేటీఆర్, రేవంత్, ఈటల వంటి ప్రముఖ నేతల్లో ఎవరెవరికి ఎలాంటి ఫలితం ఎదురవుతుందన్న చర్చ కూడా సాగుతోంది. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీల నుంచి హోటళ్లలో, బస్టాండ్లలో పిచ్చాపాటీ దాకా ఎక్కడ నలుగురు కలసినా ఇదే తీరు. చివరికి ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో పరిచయస్తులు కనిపించినా ఎలక్షన్ల ప్రస్తావన రాకుండా ఉండటం లేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులపై విస్తృత విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల హీట్ కనిపిస్తోంది. పందెం కాస్తావా? పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చలు సాగుతుంటే.. వివిధ పార్టీల అభిమానుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కనిపిస్తున్నాయి. మేం గెలుస్తామంటే, మేం గెలుస్తామంటూ అభ్యర్థులు, పార్టీల తరఫున సరదా పందేలూ జరుగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయని, ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన బుకీలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సోషల్మీడియా గ్రూపుల్లో హడావుడి చేస్తున్నారని తెలిసింది. సీఎం ఎవరవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై రూ.లక్షల్లోనే బెట్టింగులు సాగుతున్నాయి. కర్ణాటక, ఏపీ వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అక్కడి వారూ బెట్టింగ్లు కడుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో జోరుజోరుగా.. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎన్నికల ఫలితాల అంచనాలు, విశ్లేషణలు పోటెత్తుతున్నాయి. ఎక్కడ ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాలు, ఊహాగానాలు క్షణం తీరిక లేకుండా పోస్టు అవుతున్నాయి. ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చిందంటే చాలు చేతిలోకి తీసుకుని చెక్చేసుకుంటున్నారు. రాజకీయ పోస్టులను చదవడమే కాదు.. వాటిపై తమ అభిప్రాయాలు, అంచనాలనూ రిప్లైలో ఇస్తున్నారు. తమకు నచ్చినవాటిని ఆయా ప్లాట్ఫామ్లపై, గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్నది, ఎవరు ఓడుతారన్నది గందరగోళంగా మారిపోయింది. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్నిమాపకశాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అగ్నిప్రమాదం సంభవించినా వెంటనే అప్రమత్తం అయ్యేలా అగ్నిమాపక శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 119 నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఫైర్ టెండర్లు, మిస్ట్ బుల్లెట్లు, మంటలు ఆర్పే పరికరాలతో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచినట్టు అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలను తనిఖీ చేసుకున్నారని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలిపారు. -
జడ్జిమెంట్ డే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏమిటో మరికొన్ని గంటల్లో వెల్లడికానుంది. దాదాపు రెండు నెలల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీపడిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? అందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయా? ఎవరెవరు గెలుస్తారు? ఎవరికి దెబ్బపడుతుంది? అధికారంలోకి వచ్చేది ఎవరన్న దానిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్రాజ్ శనివారం ప్రకటించారు. 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాల్లోని 31 ప్రాంతాల్లో, హైదరాబాద్లో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు, పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా ఒక్కో సెంటర్లో కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు. దీని ప్రకారం అతి తక్కువగా షాద్నగర్ స్థానానికి సంబంధించి 12 టేబుళ్లనే ఏర్పాటు చేశారు. 99 స్థానాలకు 14 టేబుళ్లు చొప్పున, 4 స్థానాలకు 16 టేబుళ్ల చొప్పున, 6 స్థానాలకు 18 టేబుళ్ల చొప్పున, మూడు స్థానాలకు 30 టేబుళ్ల చొప్పున.. 500కిపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి టేబుళ్లకు అదనంగా.. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కోసం మరో టేబుల్ ఉంటుంది. మొత్తం 1,798 టేబుల్స్ ఏర్పాటు కాగా.. వాటిలో ఆర్వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ వినియోగిస్తారు. తొలి ఫలితం.. భద్రాచలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 26 రౌండ్లలో, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే భద్రాచలం నియోజకవర్గం ఫలితాలు తొలుత వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 119 స్థానాల్లో కలిపి 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి రౌండ్ కౌంటింగ్ ముగిశాక.. ఆ రౌండ్లో ప్రతి అభ్యర్థికి పడిన ఓట్లను నోట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు, ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ సమయంలో ఈవీఎంలకు ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే పరిష్కరించడం కోసం 119 మంది ఇంజనీర్లను నియమించారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడు (మైక్రో అబ్జర్వర్), సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన టేబుళ్లపై ఏక కాలంలో జరిపే లెక్కింపును ఒక రౌండ్గా లెక్కిస్తారు. ఆ రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేస్తారు. ఓట్ల సంఖ్యను మరోసారి పరిశీలించి నిర్ధారించుకుంటారు. తర్వాత మైక్రో అబ్జర్వర్ పరిశీలనకు పంపుతారు. మైక్రో అబ్జర్వర్ ఆమోదించాక.. తదుపరి రౌండ్ లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తయిన కొద్దీ స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఆ ఫలితాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మూడంచెల భద్రత లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పరిశీలకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, పాసులు కలిగిన మీడియా ప్రతినిధులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలుండదు. అధికారంపై ఎవరి ధీమా వారిదే.. శాసనసభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారంలోకి వస్తామని అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి హాట్రిక్ కొడతామని బీఆర్ఎస్.. తెలంగాణలో తొలిసారి అధికారం చేపడతామని కాంగ్రెస్ అంటున్నాయి. హంగ్ ఏర్పడితే ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుందని బీజేపీ, ఎంఐఎం ఆశలు పెట్టుకున్నాయి. తుది ఫలితాలు ఎలా ఉన్నా తొలి రెండు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్లే ఉంటాయని.. మూడో స్థానం కోసం ఎంఐఎం, బీజేపీ తలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయగా.. కాంగ్రెస్ 118 చోట్ల, పొత్తులో సీపీఐ ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. మరో కూటమిలో బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీచేశాయి. బీఎస్పీ 107, ఎంఐఎం 9, సీపీఎం 19, సీపీఐఎల్ (న్యూడెమోక్రసీ) ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. ఆ స్థానాలపైనే అందరి దృష్టి! సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీలో ఉండగా.. ఆయనపై గజ్వేల్లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బరిలోకి దిగి సవాల్ విసిరారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు నియోజకవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్రావు (సిద్దిపేట), ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి), సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(వనపర్తి), ఇంద్రకరణ్రెడ్డి (నిర్మల్), స్పీకర్ పోచారంశ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ)ల ఎంపికపైనా అంతటా ఆసక్తి నెలకొంది. ► కాంగ్రెస్ తరఫున సీఎం ఆశావాహులు/సీనియర్లు అయిన టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి (కొడంగల్), భట్టి విక్రమార్క (మధిర), ఉత్తకుమార్రెడ్డి(హుజూర్నగర్), దామోదర రాజనర్సింహ (ఆందోల్), కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (నల్లగొండ), టి.జీవన్రెడ్డి (జగిత్యాల), దుద్దిళ్ల శ్రీధర్బాబు (మంథని), సీతక్క (ములుగు), తుమ్మల నాగేశ్వర్రావు (ఖమ్మం)ల జయాపజయాలపై చర్చ నడుస్తోంది. ► బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (హుజూరాబాద్), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(సిర్పూర్) తదితరులు సాధించనున్న ఫలితాలపైనా ఆసక్తి కనిపిస్తోంది. ► నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్ నుంచి పోటీచేస్తున్న శిరీష (బర్రెలక్క) ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెద్దగా లేవని, అయినా ఆమెకు ఎన్ని ఓట్లు పడతాయి, అక్కడ ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై చర్చ జరుగుతోందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఉదయం 10.30కల్లా ఆధిక్యతపై స్పష్టత ఆదివారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత అంటే 8.30 గంటలకు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎక్కువ సమయం కొనసాగినా, ఈవీఎం ఓట్ల లెక్కింపును సమయానికే ప్రారంభిస్తారు. చాలా నియోజకవర్గాల్లో ఉదయం 10.30 గంటలకల్లా ఏ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నదీ దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా పోలింగ్ సరళి ద్వారా పార్టీల గెలుపోటములపై స్పష్టత రావొచ్చని పేర్కొంటున్నారు. ఎక్కడైనా పోటీ ఎక్కువగా ఉండి, రౌండ్ రౌండ్కు ఆధిక్యతలు మారిపోతూ ఉంటే.. లెక్కింపు పూర్తయ్యేదాకా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుందని అంటున్నారు. ఓట్ల లెక్కింపు సరళిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https:// results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
మిజోరంలో ఓట్ల లెక్కింపు 4న
న్యూఢిల్లీ: íఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఒకే రోజు మొదలవుతుందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మిజోరంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు శుక్రవారం ఈసీ తెలిపింది. క్రైస్తవులు మెజారిటీ కలిగిన ఈ రాష్ట్రానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు 3వ తేదీ, ఆదివారం తమకు ఎంతో ప్రత్యేకమైనది అయినందున ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని కోరినట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కౌంటింగ్ను ఒక రోజు అంటే 4వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించింది. -
16 ఓట్లతో గెలుపు తారుమారు.. కన్నీటి పర్యంతమైన సౌమ్యారెడ్డి
30 వేలు, 40 వేల ఓట్లతో ఓడిపోవడం వేరు. రాష్ట్రమంతటా ఎదురుగాలి వీచినప్పుడు అందరితో పాటు ఓటమి పాలైతే పెద్ద బాధ ఉండదు. కానీ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్రమంతా హస్తం పవనాలు వీచాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి 160 ఓట్లతో గెలిచి హమ్మయ్య అనుకున్నారు. కానీ బీజేపీ డిమాండ్తో పదే పదే రీకౌంటింగ్ జరిపి చివరకు 16 ఓట్లతో ప్రత్యర్తిని గెలుపు వరించింది. బెంగళూరు జయనగర నియోజకవర్గంలో అతి స్వల్ప ఓట్లు అభ్యర్థుల రాతను తారుమారు చేశాయి. బెంగళూరు: ఐటీ సిటీలో జయనగర నియోజకవర్గంలో నాటకీయ పరిణామాల మధ్య విజేత మారిపోయారు. తొలుత ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించడంతో సంబరాలు మిన్నంటాయి. అంతలోనే బీజేపీ నాయకులు పట్టుబట్టి రీకౌంటింగ్ చేయించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి సీకే.రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు అధికారులు తెలిపారు. దీంతో క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేవరకూ ఏకధాటిగా హైడ్రామా టెన్షన్ పుట్టించింది. పోటాపోటీగా రౌండ్లు జయనగర ఎస్ఎస్ఎంఆర్వీ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ఆరంభమైంది. ప్రతి రౌండ్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే సౌమ్యారెడ్డి 160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ప్రకటించగానే ఆమెతో పాటు కార్యకర్తల సంతోషానికి హద్దుల్లేవు. కానీ ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్ చేయాలని బీజేపీ అభ్యర్థి రామూర్తి డిమాండ్ చేయడంతో మళ్లీ రీకౌంటింగ్ ప్రారంభించారు. చదవండి: ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య భేటీ? గెలుపు ప్రకటన జిల్లా ఎన్నికల అధికారి తుషార్ గిరినాథ్ రీకౌంటింగ్ చేసిన విధానం గురించి నేతలకు వివరించి, సీకే రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. బీజేపీకి 57,797 ఓట్లు, కాంగ్రెస్కు 57,781 ఓట్లు వచ్చాయని తెలిపారు. కార్యకర్తల ధర్నా దీంతో కాంగ్రెస్ నేతలు గత్యంతరం లేక ఇంటి ముఖం పట్టారు. గెలుపు దక్కి మళ్లీ ఓటమి పాలు కావడంతో సౌమ్యారెడ్డి విలపించారు. 16 ఓట్ల మెజారిటీతో సీకే రామూర్తి గెలుపు సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌంటింగ్లో గోల్మాల్ జరిగిందంటూ అర్దగంటకు పైగా ధర్నాకు దిగారు. కాగా, ఫలితాలపై కోర్టును ఆశ్రయించాలని సౌమ్యారెడ్డి నిర్ణయించారు. పదేపదే ఓట్ల లెక్కింపు మొదటిసారి నిర్వహించిన రీకౌంటింగ్ను ఇద్దరు అభ్యర్థులు ఒప్పుకోలేదు. దీంతో వరుసగా మూడుసార్లు రీకౌంటింగ్ చేశారు. ఈ సమయంలో ఓట్ల లెక్కింపు సమయంలో గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగడంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి, ఎంపీ డీకే.సురేశ్, కేపీసీసీ చీఫ్ డీకే.శివకుమార్, ఇక బీజేపీ నేతలు ఆర్.అశోక్, ఎంపీ తేజస్విసూర్య మకాం పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
కాంగ్రెస్ గెలుపు..! ఇద్దరిలో సీఎం ఎవరు?
-
దెబ్బకొట్టిన వారంతా ఓడిపోయారు.. తగిన శాస్తి జరిగింది: సిద్ధరామయ్య
సాక్షి, కర్ణాటక: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో తను చెప్పిందే జరిగిందని, మా అంచనాల మేరకు విజయం సాధించామన్నారు. ‘‘మోదీ వచ్చినా ఏమీ కాదని ముందే చెప్పా. కాంగ్రెస్కు 130 సీట్లు వస్తాయని ముందే చెప్పాం. కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్గా ఉంది. వ్యక్తిగతంగా నాకు మద్దతుదారులు లేరు. 2008, 2018లో బీజేపీకి ప్రజలు అధికారం ఇవ్వలేదు. రెండు సందర్భాల్లోనూ ఆపరేషన్ కమల నిర్వహించారు. భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేసి అధికారంలోకి వచ్చారు’’ అని ఆయన మండిపడ్డారు. ‘‘జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారు. గతంలో కాంగ్రెస్కు దెబ్బకొట్టిన ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. మా పార్టీ తరపున గెలిచి మాకు చేయిచ్చారు. పార్టీ ఫిరాయించినందుకు వారికి శాస్తి జరిగింది. వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. కర్ణాటక ప్రజలు లౌకిక రాజ్యాన్నే కోరుకుంటారు మతతత్వ పార్టీ బీజేపీని ప్రజలు దూరం పెట్టారు’’ అని సిద్ధరామయ్య అన్నారు. #WATCH | It is a mandate against Narendra Modi, Amit Shah and JP Nadda. PM came to Karnataka 20 times; No PM in the past campaigned like this: Congress leader Siddaramaiah on his party's victory in Karnataka elections pic.twitter.com/bNk1HMLk4y — ANI (@ANI) May 13, 2023 చదవండి: అంచనాలకు మించి.. కాంగ్రెస్ను గెలిపించిన ఆరు మంత్రాలు ఇవే.. -
ఊహించని మెజారిటీ దిశగా కాంగ్రెస్.. సీఎం రేసులో ఎవరెవరున్నారంటే?
సాక్షి, కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో అంచనాలకు మించి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్దే పైచేయిగా నిలిచింది. ఏ ఎగ్జిట్పోల్ ఊహించని మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బీజేపీ, జేడీఎస్ కలిసినా వంద స్థానాలకు చేరే అవకాశం లేదు. ఫలితాల్లో జేడీఎస్ దారుణంగా దెబ్బతింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాలకు నుంచి ఈ సారికి 21కి జేడీఎస్ పడిపోయింది. కుమారస్వామి కొడుకు నిఖిల్ సైతం ఓటమి చెందారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. రేపు(ఆదివారం) బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యానిదే విజయం అని ఖర్గే అన్నారు. అధికారం,డబ్బు ప్రభావం పనిచేయలేదన్నారు. సీఎం అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. కాగా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: అంచనాలకు మించి.. కాంగ్రెస్ను గెలిపించిన ఆరు మంత్రాలు ఇవే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 -
కాంగ్రెస్దే విజయం..! కర్ణాటక ప్రజల నాడి
-
గాలి జనార్దన్ రెడ్డి ఎఫెక్ట్.. బీజేపికి పెద్ద దెబ్బ..!
-
130 స్థానాలు పైనే..! కాంగ్రెస్ తిరుగులేని విజయం?
-
సెంట్రల్ కర్ణాటక, మైసూరులోనూ కాంగ్రెస్ ముందంజ
-
ఆధిక్యంతో దూసుకుపోతున్న కాంగ్రెస్.. షాక్లో బీజేపీ...
-
Karnataka Election Result 2023: ముందంజలో సిద్ధరామయ్య, శివకుమార్..!
-
Karnataka Election Result 2023: కర్ణాటక ఫలితాలు మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్
-
Karnataka Election Result 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు అడ్వాంటేజ్..
-
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..
Time: 9:03 PM ►రేపు సాయంత్రం 5:30 గంటలకు బెంగళూరులో సీఎల్పీ సమావేశం ►సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య Time: 7:50 PM ►సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం సాధ్యమైందని, కాంగ్రెస్ని గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలుపుతూ.. కర్ణాటక గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత నాది అని 'ఖర్గే' వ్యాఖ్యానించారు. Time: 6:38PM ►కర్ణాటకలో 43 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్ ►2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 5% ఓట్లు ఎక్కువ ►36 శాతం ఓట్లకు పరిమితమైన బీజేపీ ►2018 ఎన్నికలతో పోలిస్తే తగ్గిన జేడీఎస్ ఓట్లు Time: 6:10 PM ►బెంగళూరు సిటీ(28): కాంగ్రెస్ 13, బీజేపీ 15, జేడీఎస్ 0 ►సెంట్రల్ కర్ణాటక(25): కాంగ్రెస్ 19, బీజేపీ 5, జేడీఎస్ 1 ►కోస్టల్ కర్ణాటక(19): కాంగ్రెస్ 6, బీజేపీ 13, జేడీఎస్ 0 ►హైదరాబాద్ కర్ణాటక(41): కాంగ్రెస్ 26, బీజేపీ 10, జేడీఎస్ 3 ►నార్త్ కర్ణాటక(50): కాంగ్రెస్ 33, బీజేపీ 16, జేడీఎస్ 1 ►ఓల్డ్ మైసూర్(61): కాంగ్రెస్ 39, బీజేపీ 6, జేడీఎస్ 14 Time: 5:50 PM ►కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations. — Narendra Modi (@narendramodi) May 13, 2023 Time: 5:35 PM ►కర్ణాటక ప్రజలకు ప్రియాంక గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఖర్గే, రాహుల్ నేతృత్వంలో ఘన విజయం సాధించామని, భారత్లో జోడో యాత్ర ప్రజల్లో జోష్ నింపిందన్నారు. దుష్టపరిపాలనను కర్ణాటక ప్రజలు అంతమొందించారని, ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామని ప్రియాంక గాంధీ ప్రస్తావించారు. Time: 5:05 PM ►కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం ►ఐదేళ్ల తర్వాత అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ►136 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ►65 స్థానాలకు పరిమితమైన బీజేపీ ►19 స్థానాల్లో సరిపెట్టుకున్న జేడీఎస్ Time: 4:55 PM ►సోనియా, రాహుల్కి ఫోన్ చేసి అభినంధనలు తెలిపిన తమిళనాడు సీఎం స్టాలిన్ ►ప్రజలకిచ్చిన హామీలను మొదటి రోజు నుంచే అమలు చేస్తాం - రాహుల్ Time: 4:35 PM ►ప్రజల తీర్పుని గౌరవిస్తాం, కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన పనిలేదు, అభివృద్ధి చేసినా ఓటమిపాలయ్యాం - యడియూరప్ప ►ప్రజా తీర్పుని గౌరవిస్తాం, ఓటమిని విశ్లేషించుకుని ముందుకెళ్తాం - కుమార స్వామి Time: 4:15 PM ►కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన డీకే.శివకుమార్ ►ప్రజాస్వామ్యానిదే విజయం, బీజేపీ దృష్టంతా కర్ణాటక మీదే పెట్టింది - ఖర్గే ►రాజీనామా లేఖను గవర్నర్కు ఇవ్వనున్న బొమ్మై Time: 3:05 PM ► కర్ణాటకలో ఏ ఎగ్జిట్పోల్ ఊహించని మెజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం 137 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 62 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జేడీఎస్ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. Time: 2:28 PM ► అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అంచనాలకు మించి దూసుకుపోతోంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం 136 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 64, జేడీఎస్ 20 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉన్నాయి. #KarnatakaElectionResults | Congress at 136 including 10 seats that the party has won so far and 126 seats where it is leading. BJP continues to lead in 60 seats. (Source: ECI) pic.twitter.com/GxwL8HgfpP — ANI (@ANI) May 13, 2023 Time: 1:18 PM ► రెండు చోట్ల ఓడిపోయిన బిజెపి మంత్రి సోమన్న వరుణ: కాంగ్రెస్ అగ్రనేత సిద్ధ రామయ్య చేతిలో ఓటమి చామరాజ నగర్: కాంగ్రెస్ అభ్యర్థి పుట్టరంగ శెట్టి చేతిలో ఓటమి Time: 1:15 PM ► కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr — ANI (@ANI) May 13, 2023 Time: 12:50 PM ► కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. విజయోత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. Time: 12:45 PM ► చల్లకేరే నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ గణాంకాల ప్రకారం కాంగ్రెస్ ప్రస్తుతం 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతోంది. బీజేపీ 67 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ కేవలం 22 స్థానాల్లోనే ముందంజలో ఉంది. Congress wins in Challakere constituency, leads in 128 seats in Karnataka BJP ahead in 67 seats and Janata Dal (Secular) leading in 22 constituencies pic.twitter.com/mPOjg3mKOY — ANI (@ANI) May 13, 2023 Time: 12:40 PM ► బీదర్ జిల్లా ఓవరాల్ 1. ఔరాద్లో బీజేపీ ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి భీం సేన్ షిండేపై 9126 ఓట్ల ఆధిక్యంలో మంత్రి ప్రభు చౌహన్ 2. బీదర్ సిటీలో కాంగ్రెస్ ముందంజ 12 రౌండ్లు ముగిసే సరికి JDS అభ్యర్థి సూర్యకాంత్ పై 9184 ఓట్ల ఆధిక్యంలో రహీం ఖాన్ 3. బీదర్ సౌత్ లో కాంగ్రెస్ ముందంజ 12 రౌండ్లు ముగిసేసారికి బిజెపి అభ్యర్థి శైలేంద్రపై 1756 ఓట్ల ఆధిక్యంలో అశోక్ ఖేని 4. బాల్కిలో కాంగ్రెస్ ముందంజ బిజెపి అభ్యర్థి ప్రకాష్ ఖండ్రేపై 14054 ఓట్ల ఆధిక్యంలో ఈశ్వర్ ఖండ్రే 5. హుమ్నా బాద్ లో కాంగ్రెస్- బిజెపి మధ్య తీవ్ర పోటీ 15 రౌండ్లు ముగిసే సరికి బిజెపి అభ్యర్థి సిద్దు పాటిల్ పై 484 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి రాజశేఖర్ పాటిల్ 6. బసవ కళ్యాణ్ లో బిజెపి ముందంజ మాజీ సీఎం కొడుకు విజయ్ సింగ్ పై 4418 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి శరణు తల్గర్ ఆధిక్యం Time: 12:31 PM ►బళ్లారి రూరల్లో శ్రీరాములు(బీజేపీ) ఓటమి ►శ్రీరాములుపై కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర గెలుపు ►వరుణ నుంచి సిద్ధరామయ్య విజయం ►చిత్తాపూర్ నుంచి ప్రియాంక్ ఖర్గే విజయం ►కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జగదీష్ శెట్టర్ ఓటమి Time: 12:15 PM ► రామనగరలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ వెనుకంజ ► చిక్కమగళూరులో బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి వెనుకంజ ► హుబ్లీ ధార్వాడ్లో మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ వెనుకంజ Time: 12:10 PM ► సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్లో ముందంజ ► మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణలో ముందంజ ► చెన్నపట్నంలో జేడీఎస్ నేత హెచ్డీ కుమార స్వామి ముందంజ Time: 11:53 AM ►హసన్లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్ గౌడ ఓటమి Time: 11:53 AM ►కనకపుర స్థానంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్ విజయం. కనకపురా నుంచి నాలుగో సారి గెలుపొందిన శివకుమార్ Time: 11:42 AM ►ఎల్లాపురాలో బీజేపీ అభ్యర్ధి శివరామ్ విజయం ►హసన్లో స్వరూప్(జేడీఎస్) విజయం ►చల్లకెరలో రఘుమూర్తి( కాంగ్రెస్) విజయం ►హిరియూర్లో సుధాకర్(కాంగ్రెస్) విజయం ►'నందిని మిల్క్ గెలిచింది ...అమూల్ ఓడింది' అంటూ కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు... కెపీసీసీ ఆఫీస్ దగ్గర సెలబ్రేషన్స్. Time: 11:37 AM ►కాంగ్రెస్ కి ఫుల్ మెజార్టీ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.140 సీట్లు వస్తాయన్న ధీమా మాకు ఉంది. రిసార్ట్ పాలిటిక్స్ జరిగేటటువంటి అవకాశం లేదు. బీజేపీ అవినీతే వాళ్లను ఓడిస్తోంది: డీకే.శివకుమార్ Time: 11:24 AM: ►వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య ఆధిక్యం, బీజేపీ మంత్రి సోమన్నపై 2710 ఓట్ల ఆధిక్యం. ►చెన్నపట్టణంలో జేడీఎస్ ఛీఫ్ కుమారస్వామి ఆధిక్యం Time: 11:23 AM: ►బీజేపీ మంత్రి మురుగేష్ నిరానీ 200 ఓట్ల స్వల్ప ఆధిక్యం. Time: 11:21 AM: ► కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ సవాదీ విజయం సాధించారు. 9వేల మెజార్టీతో లక్ష్మణ్ సవాదీ గెలుపొందారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన లక్ష్మణ్ సవాదీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? డి కె శివకుమార్ సిద్ధ రామయ్య మీ అభిప్రాయాన్ని పంచుకోవడానికి లింక్పై క్లిక్ చేయండి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 Time: 11:16 AM ►గంగావతి నియోజకవర్గంలో 6000 ఓట్ల ఆధిక్యత తో కొనసాగుతున్న గాలి జనార్ధన్ రెడ్డి Time: 11:07 AM ►గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ►పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం ►కోస్టల్ కర్ణాటక, బెంగుళూరులో బీజేపీ ఆధిక్యం ►హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యం ►ఓల్డ్ మైసూర్లో జేడీఎస్కు గండికొట్టిన కాంగ్రెస్ ►ఓల్డ్ మైసూర్లో మూడో స్థానంలో బీజేపీ ►ఉత్తర కార్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యం ►చిత్తాపూర్లో ప్రియాంక్ ఖర్గే(కాంగ్రెస్) ఆధిక్యం ►గంగావతిలో గాలి జనార్థన్రెడ్డి ఆధిక్యం ►బళ్లారి సిటీలో గాలి అరుణ లక్ష్మి వెనుకంజ Time: 10:57 AM కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ షిమ్లాలోని జాకూ ఆలయంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పూజలు చేశారు. #WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra offers prayers at Shimla's Jakhu temple pic.twitter.com/PRH47u36Zm — ANI (@ANI) May 13, 2023 Time: 10:45 AM మరోసారి జేడీఎస్ పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే 30 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యంలో ఉండగా.. మరోసారి చక్రం తిప్పేందుకు కుమారస్వామి సిద్ధమవుతున్నారు. ఆయనతో బీజేపీ అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారు. Time: 10:38 AM ►షిగ్గావ్ స్థానంలో బస్వరాజ్ బొమ్మె (భాజపా) ఆధిక్యం ►వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్య (కాంగ్రెస్) ఆధిక్యం ►రామనగరలో నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) ఆధిక్యం ►ఆధిక్యంలోకి వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామి ►హోళెనర్సీపూర్ నియోజకవర్గంలో రేవణ్ణ (జేడీఎస్) ఆధిక్యం Time: 10:32 AM ►కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్(113) దాటింది.140 స్థానాలు వస్తాయని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు బెంగుళూరు రావాలని ఆ పార్టీ హైకమాండ్ ఆదేశించింది. రేపు మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. దూసుకుపోతున్న కాంగ్రెస్.. ► కాంగ్రెస్ దాదాపు 110 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార బీజేపీ 71 స్థానాల్లో, జేడీఎస్ 23 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు. Karnataka elections | Congress inches towards the halfway mark of 112, leads in 110 constituencies while BJP leads in 71 seats and JD(S) in 23, as per trends for 209 of 224 Assembly constituencies.#KarnatakaElectionResults pic.twitter.com/9tApdBlMzd — ANI (@ANI) May 13, 2023 ► గంగావతి నియోజకవర్గంలో 2700 ఓట్ల ఆధిక్యతలో గాలి జనార్ధన్ రెడ్డి ► మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ ► రెండో రౌండ్లో కాంగ్రెస్ మరింత దూకుడు. ► అనేక ప్రాంతాల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు ► బసవ కళ్యాణ్లో మాజీ సీఎం ధరమ్ సింగ్ కొడుకు విజయ్ సింగ్ కి షాక్ ► బసవ కళ్యాణ్లో ముందంజలో బీజేపీ అభ్యర్థి శరణు తల్గర్. ► 4 రౌండ్లు ముగిసే సరికి 12980 ఓట్ల ఆధిక్యంలో బిజెపి ► బాగేపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి ఆధిక్యత. ► పావగడ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి తిమ్మరాయప్ప ముందంజ ►బీదర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జేడీఎస్ అభ్యర్థి సూర్యకాంత్ ఆధిక్యం ► ఔరద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి మంత్రి ప్రభు చవాన్ ముందంజ ► హుమనబాద్ లో బీజేపీ అభ్యర్థి సిద్దూ పాటిల్ ఆధిక్యంలో ► బీదర్ సౌత్ లో బీజేపీ అభ్యర్థి శైలేంద్ర బెల్దాలే ముందంజ. ► బాల్కి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్రే ముందంజ Time: 09:57 AM ►హైదరాబాద్లో కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ ►ప్రముఖ హోటల్స్లో రూమ్లు బల్క్ బుకింగ్ ►కర్ణాటక, హైదరాబాద్ వ్యక్తుల పేర్లతో రూమ్స్ బుకింగ్ ►ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించే అవకాశం Time: 09:44 AM ►కాంగ్రెస్ 82, బీజేపీ 52, జేడీఎస్ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి ►6 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో డీకే శికుమార్ ►షిగ్గావ్లో బస్వరాజు బొమ్మై(బీజేపీ) ముందంజ ►వరుణలో సిద్ధరామయ్య(కాంగ్రెస్) ముందంజ ►చెన్నపట్టణలో కుమారస్వామి(జేడీఎస్) స్వల్ప ఆధిక్యం ►రామనగర్లో నిఖిల్ కుమారస్వామి(జేడీఎస్) ముందంజ ►బెంగుళూరులో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 82 seats, BJP in 52 seats while the JDS is leading in 16 seats. #KarnatakaPolls pic.twitter.com/sL4RFJUYJ6 — ANI (@ANI) May 13, 2023 Time: 09:32 AM గాలి జనార్దన్ రెడ్డి దంపతులు ఆధిక్యం గంగావతి స్థానంలో గాలి జనార్దన్ రెడ్డి ఆధిక్యం - బళ్లారి పట్టణంలో గాలి లక్ష్మీ అరుణ ఆధిక్యం - బళ్లారి (ఎస్ టీ) స్థానంలో శ్రీరాములు (భాజపా) ఆధిక్యం - చిక్కబళ్లాపూర్ స్థానంలో సుధాకర్ (భాజపా) వెనుకంజ - హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ జగదీశ్ షెట్టార్ (కాంగ్రెస్) ఆధిక్యం - చిక్కమగళూరు స్థానంలో సి.టి.రవి (భాజపా) ఆధిక్యం Time: 09:29 AM ►హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక, మైసూరులో కాంగ్రెస్ హవా ►కోస్టల్ కర్ణాటకలో బీజేపీకి ఆధిక్యం ►బెంగుళూరు, సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ►షిగ్గావ్లో బస్వరాజ్ బొమ్మై ముందంజ Time: 09:24 AM 8 మంది కర్ణాటక మంత్రుల వెనుకంజలో ఉన్నారు. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్(113)ను కాంగ్రెస్ దాటింది. కాంగ్రెస్ 44 స్థానాల్లో, బీజేపీ 23 స్థానాల్లో, జేడీఎస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. Karnataka Election Results: As per ECI, Congress takes the lead in 44 seats, BJP in 23 seats while JDS leads in 07 seats.#KarnatakaElectionResults2023 pic.twitter.com/bFP4AfpZjN — ANI (@ANI) May 13, 2023 Time: 09:20 AM 113 మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ దాటింది. కాంగ్రెస్ 25 స్థానాల్లో, బీజేపీ 12 స్థానాల్లో, జేడీఎస్ 02 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 25 seats, BJP in 12 seats while the JDS is leading in 02 seats. #KarnatakaPolls pic.twitter.com/ReFREHP7Wt — ANI (@ANI) May 13, 2023 Time: 09:12 AM ►8 మంది కర్ణాటక మంత్రుల వెనుకంజ ►చిక్ మంగుళూరులో సీటీ రవి వెనుకంజ ►గంగావతిలో గాలి జనార్థన్రెడ్డి ముందంజ ►బళ్లారి సిటీలో గాలి అరుణలక్ష్మి ముందంజ Time: 09:05 AM ►ఏడుగురు కర్ణాటక మంత్రుల వెనుకంజ ►మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ►రామనగరలో నిఖిల్ కుమారస్వామి వెనుకంజ ►వరుణాలో సిద్ధరామయ్య ముందంజ #KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 12 seats, BJP in 8 seats while the JDS leads in one seat.#KarnatakaPolls pic.twitter.com/hnkhpjfXqv — ANI (@ANI) May 13, 2023 Time: 09:02 AM ►బసవరాజు బొమ్మై ముందంజ ►బీజేపీ రెబల్ నేత జగదీష్ శెట్టర్ ముందంజ Time: 08:59 AM ►ముంబై కర్ణాటకలో హోరాహోరీ ►ఇప్పటివరకు చెరో 23 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆధిక్యం ►బెంగుళూరు నగరంలో కాంగ్రెస్ 17, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యం ►హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ 23, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యం Time: 08:49 AM ►100 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ►చిత్తాపూర్లో ప్రియాంక్ ఖర్గే వెనుకంజ ►బీజేపీ రెబల్ నేత జగదీష్శెట్టర్ వెనుకంజ ►గాంధీనగర్లో దినేష్ గుండూరావు ముందంజ Time: 08:46 AM ►కనకపురంలో డీకే శివకుమార్ ముందంజ ►బళ్లారి రూరల్లో శ్రీరాములు ముందంజ ►వరుణలో సిద్ధరామయ్య ముందంజ Time: 08:39 AM ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. చెన్న పట్టణంలో కుమారస్వామి, బళ్లారిలో గాలి అరుణలక్ష్మి వెనుకంజలో ఉన్నారు. Time: 08:36 AM పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో తొలుత ఆధిక్యంలో బీజేపీ కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లో జేడీఎస్ పుంజుకుంటోంది. Time: 08:31 AM కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే హుబ్బళ్లిలోని హనుమాన్ ఆలయాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై దర్శించుకున్నారు. #WATCH | As counting of votes begins for #KarnatakaPolls, CM Basavaraj Bommai visits Hanuman temple in Hubballi. pic.twitter.com/isXkxoa79D — ANI (@ANI) May 13, 2023 Time: 08:18 AM పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ కర్ణాటక ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీ స్థానాలు 224, మ్యాజిగ్ ఫిగర్ 113, కాంగ్రెస్ అనుకూలంగా ఎగ్జిట్పోల్స్ అంచనాలు ఉండగా, జేడీఎస్సే మళ్లీ కింగ్ మేకర్ అంటూ జోరుగా చర్చ సాగుతోంది. Time: 08:14 AM పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి స్వల్ప ఆధిక్యం Time: 08:11 AM బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది:బొమ్మై మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేశారు. అభివృద్ధి పనులే గెలిపిస్తాయి.. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని బొమ్మై అన్నారు. #WATCH | Today is a big day for Karnataka as the people's verdict for the state will be out. I am confident that BJP will win with absolute majority and give a stable government, says Karnataka CM Basavaraj Bommai, in Hubballi. pic.twitter.com/8r9mKGiTIe — ANI (@ANI) May 13, 2023 Time: 08:02 AM కౌంటింగ్ ప్రారంభం కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, వయో వృద్ధుల ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. Time: 07:44 AM ప్రభుత్వం ఏర్పాటు చేసేది నేనే: కుమారస్వామి ►ఎగ్జిట్ పోల్స్పై జేడీఎస్ అధినేత కుమారస్వామి సెటైర్లు వేశారు. ఇంతవరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదన్న కుమారస్వామి.. మరో రెండు, మూడు గంటలు వేచి చూద్దామన్నారు. తనకు ఎవరూ ఆఫర్ చేయలేదని.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తానేనంటూ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. #WATCH | "No one has contacted me till now. There is no demand for me, I am a small party" says JD(S) leader HD Kumaraswamy, ahead of Karnataka election results. pic.twitter.com/0Mkbqdd7Tr — ANI (@ANI) May 13, 2023 ►ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ►ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలపై స్పష్టత రానుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. ►కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ►ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ►ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ►ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు ►కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. ►వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ►ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. -
కర్ణాటక తీర్పు
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. -
కొనసాగుతున్న పట్టభద్రుల ఓట్ల లెక్కింపు
చిత్తూరు కలెక్టరేట్/సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, అనంతపురం : తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ గెలుపునకు సరిపడా ఓట్లు సాధించకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లే గెలుపును నిర్ణయించనున్నాయి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొదటి ప్రాధాన్యతా ఓట్లలో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ ముందంజలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి స్వల్ప ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి వెంపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి శనివారం తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. -
‘ఈశాన్య’ ఫలితాలు నేడే
న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈశాన్యాన మరింతగా విస్తరించాలన్న అధికార బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరాయన్నది ఈ ఫలితాలతో తేలనుంది. ముఖ్యంగా ఈసారి అందరి దృష్టీ ప్రధానంగా త్రిపురపైనే నెలకొంది. అక్కడ పాతికేళ్ల వామపక్ష పాలనకు తెర దించుతూ అభివృద్ధి నినాదంతో బీజేపీ 2018లో సొంతంగా అధికారంలోకి రావడం తెలిసిందే. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా నిలువరించేందుకు చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి మరీ లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. ఇక నాగాలాండ్, మేఘాలయల్లో కూడా బీజేపీ అధికార సంకీర్ణంలో భాగస్వామిగా ఉంది. అయితే మేఘాలయలో ఎన్నికల ముందు అధికార నేషనల్ పీపుల్స్ పార్టీతో బంధం తెంచుకుని సంకీర్ణం నుంచి బయటికొచ్చింది. అంతేగాక తొలిసారిగా మొత్తం 60 స్థానాలకూ పోటీ చేసింది! నాగాలాండ్లో మరోసారి ఎన్డీపీపీతో కలిసి బరిలో దిగింది. అక్కడ బీజేపీ అధికారం నిలుపుకుంటుందని, త్రిపురలో ఏకైక పెద్ద పార్టీగా మెజారిటీకి చేరువగా వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం తెలిసిందే. ఇక త్రిపురలో హంగ్ తప్పకపోవచ్చని అంచనా వేశాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్మేకర్గా మారొచ్చని జోస్యం చెప్పాయి. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఏకపక్షమే..
సాక్షి, అమరావతి: గత రెండున్నరేళ్లుగా ఏ ఎన్నిక జరిగినా రాష్ట్ర ప్రజలు ఒకే రకమైన తీర్పు ఇస్తూ వస్తున్నారు. గతంలో వివిధ కారణాలతో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ అధికార వైఎస్సార్సీపీ తన ఆధిక్యతను చాటుకుంది. జమ్మలమడుగుతో సహా 11 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి గురువారం ఫలితాలను ప్రకటించగా 8 చోట్ల వైఎస్సార్సీపీ విజయభేరీ మోగించింది. మూడు చోట్ల టీడీపీ గెలిచింది. 129 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను ప్రకటించగా 85 వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 33 చోట్ల టీడీపీ నెగ్గింది. ఐదు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ, సీపీఎం రెండు చోట్ల, సీపీఐ ఒక చోట, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. ఏకగ్రీవాలతో కలిపి 12 జెడ్పీటీసీలు.. మొత్తం 14 జెడ్పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల ఒకటవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. వీటికి తోడు సెప్టెంబరులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సమయంలో ఓట్లు తడిచిపోవడంతో లెక్కించేందుకు వీలు కాక ఫలితాల ప్రకటన నిలిపివేసిన జమ్మలమడుగు జెడ్పీటీసీ, మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లో కొన్ని బూత్లకు కూడా తాజాగా ఎన్నికలు జరిగాయి. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. కాగా నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో పాటు 50 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసిన విషయం తెలిసిందే. ఏకగ్రీవమైన నాలుగు జెడ్పీటీసీ స్థానాలను అధికార వైఎస్సార్సీపీ దక్కించుకోగా ఎంపీటీసీ స్థానాల్లో 46 వైఎస్సార్సీపీ, మూడు టీడీపీ, ఒక చోట స్వతంత్రులు గెలిచారు. ఈ నేపథ్యంలో మొత్తం 15 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 12 వైఎస్సార్సీపీకి దక్కగా 179 ఎంపీటీసీ స్థానాల్లో 131 అధికార పార్టీ విజయం సాధించింది. + -
AP MPTC And ZPTC Election 2021 Results Live: విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం
AP MPTC And ZPTC Election Live Updates 05:30PM ►సాయంత్రం 5.30 గంటల వరకు వెలువడిన జెడ్పీటీసీ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11, టీడీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన పదిస్థానాలకు ఎన్నికలు జరిగాయి. ►ఎంపీటీసీ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 127, టీడీపీ 32, బీజేపీ 6, ఇతరులు 4స్థానాలను గెలుచుకున్నారు. మొత్తం 123 స్థానాలకు ఎన్నికలు జరగగా మరో 50 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. 03:18PM పశ్చిమగోదావరి జిల్లా ►ఎన్నిక జరిగిన పెనుగొండ జడ్పీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ స్థానాలు-14 ►వైఎస్సార్సీపీ-10 ►టీడీపీ-3 ►జనసేన-1 03:05PM తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ స్థానాలు - 21 ►వైఎస్సార్సీపీ - 9 ►టీడీపీ - 6 ►జనసేన - 3 ►ఇండిపెండెంట్ - 1 ►సీపీఎం - 1 ►సీపీఐ - 1 02:50PM తూర్పుగోదావరి జిల్లా ►ఏటపాక మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు ముగిసిన ఓట్ల లెక్కింపు.. ►12 ఎంపీటీసీ స్థానాలు ఏటపాక మండలంలో ఉండగా కన్నాయిగూడెం ఎంపీటీసీ స్థానం వైఎస్సార్సీపీ ఏకగ్రీవం . ఎన్నికలు జరిగిన 11 స్థానాల్లో.. ► ఏటపాక - వైఎస్సార్సీపీ ► రాయనపేట - వైఎస్సార్సీపీ ► నెల్లిపాక - వైఎస్సార్సీపీ ► గుండాల - వైఎస్సార్సీపీ ► లక్ష్మీపురం - వైఎస్సార్సీపీ ► చోడవరం - టీడీపీ ► గొమ్ముకొత్తగూడెం - టీడీపీ ► నందిగామ - టీడీపీ ► టీపీ వీడు - టీడీపీ ► కృష్ణవరం - సీపీఐ ► విస్సాపురం - సీపీఎం మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 6, సీపీఎం 1, సీపీఐ 1, టీడీపీ 4 గెలుచుకున్నాయి. 02:45PM కృష్ణా జిల్లా విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ►విస్సన్నపేట జడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలుపొందిన భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి ►లోకేశ్వరరెడ్డికి మిఠాయి తినిపించి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అనంతపురం: హిందూపురం నియోజకవర్గంలో గెలుపొందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఎమ్మెల్సీ ఇక్భాల్, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి అభినందించారు. 02:35PM విశాఖపట్నం ►టీడీపీ కంచుకోట ఆనందపురం జడ్పీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు ఘన విజయం ►1983 జిల్లా పరిషత్ ఆవిర్భావం నుంచి ఆనందపురంలో టీడీపీ అభ్యర్థులదే గెలుపు ►తొలిసారి 3576 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు జడ్పీటీసీగా విజయం ►ఆనందపురంలో టీడీపీ కంచుకోట శిథిలమైంది ►ఇది సీఎం జగన్కి కృతజ్ఞతగా ప్రజలు ఇచ్చిన గెలుపు - భీమిలి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్ 02:30PM అనంతపురం జిల్లా ►చిలమత్తూరు వైఎస్సార్ సీపీ జడ్పీటీసీ అభ్యర్థి అనూష 3,025 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 02:20PM నెల్లూరు జిల్లా ►ముగిసిన కోట ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ►వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ మొబీన్ భాష విజయం సాధించారు. 1.52PM ప.గో జిల్లాలో ముగిసిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ 15 ఎంపీటీసీ స్థానాలకు గాను తాళ్ళపూడి (మం) వేగేశ్వరపురం ఎంపీటీసీ- 2 వైఎస్సార్సీపీ అభ్యర్థి కొమిరెడ్డి వీర రాఘవమ్మ ఏకగ్రీవం కాగా 14 ఎంపీటీసీ, పెనుగొండ జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలు 10 ఎంపీటీసీ స్థానాలు, పెనుగొండ జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ జనసేన-1,టీడీపీ-3 ఎంపీటీసీ స్థానాలకు పరిమితం పెనుగొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పోడూరి గోవర్ధని 4,300 ఓట్లు మెజారిటీ తో గెలుపు అత్తిలి(మం)పాలూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి శరఖడం రామలింగ విష్ణు మూర్తి 257 ఓట్ల మెజారిటీతో గెలుపు అత్తిలి (మం) ఈడూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి సుంకర నాగేశ్వరరావు 225 ఓట్ల మెజారిటీతో గెలుపు భీమడోలు (మం) అంబరుపేట ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి విజయ భాను 10 ఓట్ల మెజార్టీ తో గెలుపు... చాగల్లు ఎంపీటీసీ - 5 వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉన్నమట్ల విజయకుమారి 969 ఓట్ల మెజార్టీతో గెలుపు దెందులూరు-1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లూరి నాగరాజు 85 ఓట్ల మెజారిటీతో గెలుపు దెందులూరు (మం) కొవ్వలి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి గొల్ల నాగరాజు 58 ఓట్ల మెజార్టీ తో గెలుపు జంగారెడ్డిగూడెం (మం) లక్కవరం ఎంపీటీసీ- 2 వైఎస్సార్సీపీ అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి 428 ఓట్ల మెజార్టీ తో గెలుపు. కుక్కునూరు (మం) మాధవరం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కుండా సూర్యనారాయణ182 ఓట్ల మెజారిటీతో గెలుపు నిడదవోలు(మం) తాళ్లపాలెం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్ధి బయ్యే కృష్ణబాబు 41 ఓట్ల మెజార్టీతో గెలుపు. పెరవలి (మం) కానూరు 2 ఎంపిటిసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్తల ఉషారాణి 256 ఓట్లు మెజార్టీతో గెలుపు 1.20PM పశ్చిమగోదావరి: ► పెనుగొండ జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ విజయం. వైఎస్సార్సీపీ అభ్యర్థి పోడూరి గోవర్ధని 4,300 ఓట్లు మెజారిటీతో గెలుపు 1.03PM కృష్ణా జిల్లా: ► జి.కొండూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 4,893 ఓట్ల మెజారిటీతో మంద జక్రధరరావు విజయం ► విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 9,656 ఓట్ల భారీ మెజార్టీతో భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి విజయం 12.43PM ► నంద్యాల జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణ రెడ్డి. 12.20PM ప్రకాశం జిల్లా ►పర్చూరు మండలం చెరుకూరు-2 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్ది షేక్ బీస్మల్లా 878 ఓట్ల మోజార్టితో గెలుపు. ►పెద్దారవీడు మండలం తంగిరాలపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పలపాటి భాగ్యరేఖ 252 ఓట్ల మెజారిటీతో గెలుపు ► యద్దనపూడి మండలం పోలూరు ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ ఖాసిం వలి 556 ఓట్లతో విజయం ► పీసీపల్లి మండలం మురుగుమ్మి ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెరుకూరి సతీష్ 61 ఓట్లతో విజయం 12.00PM చిత్తూరు: ► కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ప్రభంజనం ► శాంతిపురం మండలం 64 పెద్దూరులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 11.54AM విజయనగరం ► గరివిడి మండలం వెదురుల్లవలస ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ శ్రీరాములు విజయం ► బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి గుల్లిపల్లి సునీత 1357 ఓట్ల మెజార్టీతో గెలుపు ► మెంటాడ మండలం కుంటినవలస ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రావాడ ఈశ్వర రావు 610 ఓట్లు ఆధిక్యంతో గెలుపు ► నెల్లిమర్ల మండలం బూరాడపేట ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి సంగంరెడ్డి జగన్నాధం గెలుపు 11.48AM శ్రీకాకుళం ► హిరమండలం మండలం హిరమండలం 3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మీసాల రజినీ183 ఓట్ల మెజార్టీతో గెలుపు ► టెక్కలి 5వ వార్డు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బసవల సంధ్యారాణి 897 ఓట్ల మెజారిటీతో గెలుపు ► రేగిడి మండలం ఉంగరాడ ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పిల్లా రోజా 93 ఓట్ల మెజార్టీతో గెలుపు ►బూర్జ మండలం బూర్జ ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు. ► కొత్తూరు మండలం దిమిలి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపు ► ఆమదాల వలస మండలం కట్యాచారులుపేట ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు 11.15AM శ్రీకాకుళం ► కంచిలి మండలం తలతంపర ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బృందావన్ సాహు(538) ఓట్ల మెజారిటీతో విజయం ► కవిటి మండలం కొజ్జిరియా ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి కందుల దశరథ రావు 145 ఓట్ల మెజారిటీతో విజయం ► సీతంపేట-2 స్థానంలో వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సవర చంద్రశేఖర్ 779 ఓట్ల మెజారిటీతో గెలుపు ► కంచిలి మండలం కుంబరినువంగా ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు 11.03AM గుంటూరు ► ప్రత్తిపాడు మండలం నడింపాలెం-2 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పూర్ణి వెంకటేశ్వరరావు 200 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి చిట్టెంశెట్టి శివనాగమణి 587 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► వేమూరు-1 వైఎస్సార్సీపీ అభ్యర్థి చెల్లం చర్ల కామేశ్వరి 467 ఓట్ల మెజారిటీతో విజయం ►చావలి-2 స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి సోమరవుతు జయలక్ష్మి 345 ఓట్ల మెజారిటీతో విజయం. 10.50AM విశాఖపట్నం: ► గోలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీగా వైస్సార్సీపీ అబ్యర్ధి ఏళ్ల లక్మి దుర్గ 439 ఓట్లతో గెలుపు ► మాడుగుల మండలం వంటర్లపాలెంలో వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అభ్యర్థి దండి నాగరత్నం 79 ఓట్లు తేడాతో గెలుపు. చిత్తూరు: ► నగరి రూరల్ మండలం నంబాకం ఎంపీటీసీ స్థానంలో 63 ఓట్లు మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుణ శేఖర్రెడ్డి గెలుపు ►ఎస్ఆర్పురం మండలం వి.వి.పురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదిలక్ష్మి 269 ఓట్లతో విజయం ► గుడుపల్లి మండలం కనమనపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వరలక్ష్మి 494 ఓట్లు మెజార్టీతో గెలుపు 10.40AM కర్నూలు: ►చగలమర్రి -3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెళ్లంపల్లి వెంకటలక్ష్మీ గెలుపు ►చకరాజువేముల ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి షాజహాన్ విజయం ►మల్లెపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై. మమత గెలుపు ► కృష్ణగిరి మండలం టి. గోకులపాడు ఎంపీటీపీగీ వైస్సార్సీపీ అభ్యర్ది రమేశ్వరమ్మ 60 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఆదోని మండలం ధానపురం గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి హనుమయ్య 157 ఓట్లతో విజయం. ► ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె.నాగభూషణ్ రెడ్డి 58 ఓట్లతో విజయం. ► ఆదోని మండలం హనువల్ గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సి.ఇరన్న 437 ఓట్లతో గెలుపు. 10.30AM తూర్పు గోదావరి జిల్లా ► మారేడుమిల్లి మండలం దొర చింతలపాలెం ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం. ► సీతానగరం మండలం కాటవరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాడేపల్లి వెంకట్రావు 362 ఓట్ల మెజారిటీతో విజయం కృష్ణాజిల్లా ►పెనుగంచిప్రోలు మండలం కొనకంచి ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కనగాల శ్రీనివాసరావు 602 ఓట్ల మెజార్టీతో గెలుపు ► నూజివీడు మండలం దేవరగుంట ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్ధి నక్కా శ్రీనివాసరావు గెలుపు ► నాగాయలంక మండలం పర్రచివర ఎంపీటీసీ స్థానంలో 395 ఓట్ల మెజార్టీతో బుడిపల్లి ఆదిశేషు గెలుపు ► ఆగిరిపల్లి మండలం ఈదర-1 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దొండపాటి కుమారి 30 ఓట్ల మెజారిటీతో గెలుపు అనంతపురం ►చిలమత్తూరు మండలం కొడికొండ ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇర్షాద్ బేగం గెలుపు ► పరిగి మండలం శాసనకోట ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగజ్యోతి 213 ఓట్ల మెజార్టీతో విజయం ► కొండాపూర్ ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సునంద విజయం ► వానవోలు ఎంపీటీసీ రెండవ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గాయత్రి బాయి విజయం ► గోరంట్ల-3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సోమశేఖర్ విజయం ► డి.హీరేహాల్ మండలం చెర్లోపల్లి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి మొండి మల్లికార్జున 315 ఓట్లతో విజయం. ► మడకశిర మండలం గోవిందాపురం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లికేరమ్మ 82 ఓట్లతో విజయం ► పెనుకొండ మండలం రాంపురం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి పద్మావతి విజయం. ► ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం మల్లెపల్లి-1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి చిలక మస్తాన్ రెడ్డి 409 ఓట్ల మెజార్టీ తో విజయం ► నార్పల మండలం బి. పప్పూరు ఎంపీటీసీగా పద్మాకర్ రెడ్డి 137 మెజారిటీతో ఘన విజయం ► కనగానపల్లి మండలం కొనాపురం వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి జీ. రాజేశ్వరి 369 ఓట్లతో విజయం 10.20AM ►నెల్లూరు జిల్లా: ► సైదాపురం మండలం ఆనంతమడుగు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లెబాకు వెంకటరమణయ్య 270 ఓట్ల మెజారిటీతో విజయం ► గంగవరం ఎంపీటీసీలో 292 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి సుమిత్రమ్మ విజయం కృష్ణాజిల్లా: ► ఆగిరిపల్లి (మం) ఈదర -1 ఎంపీటీసీలో దొండపాటి కుమారి(వైఎస్సార్సీపీ) 30 ఓట్లతో గెలుపు ► గన్నవరం (మం) చినఅవుటుపల్లి ఎంపీటీసీలో గంతోటి ప్రశాంతి(వైఎస్సార్సీపీ) 470 ఓట్లతో విజయం ► నూజివీడు (మం) దేవరగుంట ఎంపీటీసీలో నక్కా శ్రీనివాసరావు ( వైఎస్సార్సీపీ) 1150 ఓట్లతో గెలుపు ► నాగాయలంక (మం) పర్రచివర ఎంపీటీసీలో బుడిపల్లి ఆదిశేషు( వైఎస్సార్సీపీ) 395 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం) ముదినేపల్లి ఎంపీటీసీలో మరీదు నాగలింగేశ్వరరావు( వైఎస్సార్సీపీ) 523 ఓట్లతో విజయం ► పెనుగంచిప్రోలు (మం) కొనకంచి ఎంపీటీసీలో కనగాల శ్రీనివాసరావు(వైఎస్సార్సీపీ) 602 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం) వణుదుర్రు ఎంపీటీసీలో గుమ్మడి వెంకటేశ్వరరావు( టీడీపీ) 279 ఓట్లతో గెలుపు 10.14AM పశ్చిమ గోదావరి జిల్లా: ► భీమడోలు మండలం అంబరుపేట ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి విజయభాను 10 ఓట్ల మెజార్టీతో గెలుపు ► దెందులూరు1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లూరి నాగరాజు 80 ఓట్ల మెజారిటీతో గెలుపు ► పెరవలి మండలం కానూరు 2 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్తల ఉషారాణి 256 ఓట్లు మెజార్టీతో గెలుపు ► కుక్కునూరు మండలం మాధవరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కుండా సూర్యనారాయణ182 ఓట్ల మెజారిటీతో గెలుపు ► అత్తిలి మండలంలోని పాలూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి శరఖడం రామలింగ విష్ణు మూర్తి 257 ఓట్ల మెజారిటీతో గెలుపు ► చాగల్లు ఎంపీటీసీ 5 స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మట్ల విజయకుమారి 969 ఓట్ల మెజార్టీతో గెలుపు ► జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీటీసీ- 2లో వైఎస్సార్సీపీ అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి 428 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► నిడదవోలు మండలంలోని తాళ్లపాలెం ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బి.కృష్ణబాబు 40 ఓట్ల మెజారిటీతో గెలుపు 10.05AM ► వైఎస్సార్ జిల్లా ► ప్రొద్దుటూరు మండలం నంగానూరుపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ చెందిన కృష్ట పాటి సంధ్య విజయం ► ముద్దనూరు మండలం కొర్రపాడు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పుష్పలత 420 ఓట్ల మెజార్టీతో గెలుపు ► జమ్మలమడుగు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిని అశ్విని 650 ఓట్ల మెజార్టీతో గెలుపు ►కృష్ణాజిల్లా : గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ►వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంతోటి ప్రశాంతి 470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 09.20AM ► కృష్ణా జిల్లా: విస్సన్నపేట జడ్పీటీసీ పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలు ►మొత్తం పోలైన ఓట్లు-32 ►వైఎస్సార్సీపీ-14 ►బీఎస్సీ -6 ►బీజేపీ-1 ►టీడీపీ-0 ►కాంగ్రెస్-0 ►సీపీఎం-3 ►చెల్లని ఓట్లు -8 08.30AM ► పశ్చిమ గోదావరి జిల్లా: చాగల్లు ఎంపీటీసీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు టేబుళ్ల ద్వారా కౌంటింగ్ అధికారులు నిర్వహిస్తున్నారు. ► నెల్లూరుజిల్లా: బాలాయపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వెంగమాంబాపురం ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ►కోవూరు నియోజకవర్గం గంగవరం ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కోడూరు మండల పరిషత్ కార్యాలయం కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. ►కోట బిట్ 2 ఎంపీటీసీ ఎన్నికల కౌటింగ్ కోట మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతోంది. 08.00AM ► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ► పెనడ, విస్పన్న పేట, జి. కొడూరు జడ్పీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ► విజయనగరం: జిల్లాలోని 9 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కిపు ప్రారంభమైంది. ► శ్రీకాకుళం: జిల్లాలోని ఒక జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ► కర్నూల్ జిల్లా: వెల్దుర్తి మండలం మల్లెపల్లి ఎంపీటీసీ స్థానానికి ప్రారంభమైన కౌంటింగ్. కృష్ణగిరి మండలం టి. గోకులపాడు ఎంపీటీసీ స్థానానికి ప్రారంభమైన కౌంటింగ్. 07.57AM ► మరికాసేపట్లో ప్రారంభం కానున్న రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తెలిపింది. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తేలతాయని, జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ 757 ఓట్లతో తేలనున్న జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం వీటితోపాటు సెప్టెంబరు 19న రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల సమయంలో కేవలం రెండు పోలింగ్ బూత్లలో ఓట్ల లెక్కింపునకు వీలులేని పరిస్థితిలో ఫలితం ప్రకటన వాయిదాపడిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానం విజేత ఎవరో కూడా గురువారం తేలనుంది. అప్పట్లో ఈ జెడ్పీటీసీ స్థానంలో లెక్కింపు జరిగినంతవరకు వైఎస్సార్సీపీ అభ్యర్థి.. ఆ తర్వాత స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంటే 517 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆ జెడ్పీటీసీ స్థానం పరిధిలోని గొరిగనూరు ఎంపీటీసీ స్థానంలో మొత్తం 827 మంది ఓటర్లున్న రెండు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు తడిసి లెక్కింపునకు వీలుగా లేవని అప్పట్లో కౌంటింగ్ సిబ్బంది తేల్చారు. మొదటి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 517గా ఉండడం, లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లు అంతకంటే ఎక్కువ ఉండడంతో అప్పట్లో ఆ ఎన్నికల ఫలితాన్ని ప్రకటించకుండా వాయిదా వేశారు. తాజాగా ఆ రెండు పోలింగ్ బూత్లలో మంగళవారం పోలింగ్ నిర్వహించగా 757 ఓట్లు పోలయ్యాయి. ఈ 757 ఓట్లే ఇప్పుడు ఆ జెడ్పీటీసీ విజేతను నిర్ణయించనున్నాయి. అప్పట్లో ఓట్లు తడిసిన కారణంగా ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాల ప్రకటనను వాయిదావేశారు. రీ పోలింగ్ నిర్వహించడంతో ఆ ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాలు కూడా గురువారం తేలనున్నాయి. -
Badvel By Election: రౌండ్ల వారీగా బద్వేలు ఉప ఎన్నిక ఫలితాలు
రౌండ్ల వారీగా బద్వేల్ ఉప ఎన్నిక ఫలితాలు -అప్డేట్స్ ఓట్లు వైఎస్సార్సీపీ బీజేపీ కాంగ్రెస్ రౌండ్-12 483 54 14 రౌండ్- 11 5139 984 223 రౌండ్- 10 10052 1554 449 రౌండ్- 9 11354 2839 493 రౌండ్- 8 9691 1964 774 రౌండ్- 7 10726 1924 841 రౌండ్- 6 11383 1940 531 రౌండ్-5 11783 1797 575 రౌండ్- 4 9867 2241 491 రౌండ్- 3 10184 2305 598 రౌండ్-2 10570 2270 634 రౌండ్- 1 10,478 1688 580 సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. బద్వేల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 90,533 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు. నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. గరిష్టంగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. బద్వేల్లో బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్ గల్లంతయ్యింది. మొదటి నుంచి ప్రతి రౌండ్లోనూ వైఎస్సార్సీపీ ఆధిక్యత ప్రదర్శించింది. -
బద్వేల్ ఉప ఎన్నిక: 90,533 ఓట్ల ఆధిక్యంతో వైఎస్సార్సీపీ గెలుపు
Live Updates: Time: 12:45 PM: బద్వేల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 90,533ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు. Time: 12:24 PM 13 వ రౌండ్లో వైఎస్సార్సీపీకి 362 ఓట్లు, బీజేపీకి 40 ఓట్లు, కాంగ్రెస్కు 12 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. Time: 12:20 PM 12వ రౌండ్లోనూ ‘ఫ్యాన్’ హవా కొనసాగింది. ఈ రౌండ్లో 483 ఓట్ల ఆధిక్యం సాధించిన వైఎస్సార్సీపీ మొత్తంగా 90,211 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపును సొంతం చేసుకుంది. అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్సీపీ 1,11,849 ఓట్లు, బీజేపీ 21,638 ఓట్లు, కాంగ్రెస్ 6,223 ఓట్లు సాధించాయి. Time: 12:00 PM ఇప్పటికే గెలుపు ఖాయం చేసుకున్న వైఎస్సార్సీపీ 11వ రౌండ్లోనూ సత్తా చాటింది. తాజా రౌండ్లో లభించిన 4584 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ 90,089 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ 1,11,710 ఓట్లు ,బీజేపీ 21,621 ఓట్లు, కాంగ్రెస్ 5968 ఓట్లు సాధించాయి. Time: 11:40 AM: బద్వేల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్సీపీ 85,505 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్సీపీ 1,06,088 ఓట్లు సాధించగా.. బీజేపీ 20,583, కాంగ్రెస్ 5968 ఓట్లు సాధించింది. అధికారికంగా మరో రౌండ్ ఫలితం వెలువడాల్సి వుంది. Time: 11:31 AM: బద్వేల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. అధికారికంగా మరో మూడు రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి వుంది. 8 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్సీపీ 68,492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. Time: 11:25 AM: బద్వేల్లో ఎనిమిదో రౌండ్ ముగిసింది. 8వ రౌండ్లో వైఎస్సార్సీపీ 9691, బీజేపీ 1964, కాంగ్రెస్కు 774 ఓట్లు పోలయ్యాయి. 68,492 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. Time: 11:14 AM: బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. వైఎస్సార్సీసీ 60,826 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారీ మెజార్టీ దిశగా డాక్టర్ దాసరి సుధ సాగుతున్నారు. Time: 11:7 AM: బద్వేల్లో ఏడో రౌండ్ ముగిసింది. ఏడో రౌండ్లో వైఎస్సార్సీపీకి 10,726, బీజేపీకి 1924, కాంగ్రెస్కు 841 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్సీపీ 74991 ఓట్లు సాధించింది. Time: 11:01 AM: బద్వేలులో ఆరో రౌండ్ ముగిసింది. ఆరో రౌండ్లో వైఎస్సార్సీపీకి 11,383, బీజేపీకి 1940, కాంగ్రెస్కు 531 ఓట్లు పోలయ్యాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్ వైఎస్సార్సీపీ 64,265 ఓట్లు సాధించింది. Time: 10:45 AM: బద్వేల్లో ఆరో రౌండ్ ముగిసే సరికి 52,024 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీకి 64,265 ఓట్లు, బీజేపీకి 12,241 ఓట్లు పోలయ్యాయి. Time: 10:45 AM: బద్వేల్లో భారీ విజయం దిశగా వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. వైఎస్సార్సీపీ ఆధిక్యత 50 వేలు దాటింది. Time: 10:38 AM: బద్వేల్లో ఆరో రౌండ్ ముగిసింది. 52,024 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. Time: 10:26 AM: భారీ విజయం దిశగా వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. బద్వేల్లో ఐదో రౌండ్ ముగిసే సరికి 42,824 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. Time: 10:06AM: బద్వేలులో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. భారీ విజయం దిశగా డాక్టర్ దాసరి సుధ సాగుతున్నారు. Time: 9:57 AM: నాలుగో రౌండ్ ముగిసే సరికి 30,412 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. Time: 9:36 AM: బద్వేల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసే సరికి 23,754 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. Time: 9:30 AM: తొలి రౌండ్లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ కొనసాగుతోంది. తొలి రౌండ్లో వైఎస్సార్సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్కు 580 ఓట్లు లభించాయి. Time: 9:03 AM: తొలి రౌండ్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. Time: 8:36 AM: బద్వేల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కలసపాడు మండలం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. Time: 8:24 AM: పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు.. Time: 8:00 AM: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 259 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. -
అక్టోబర్ 30న బద్వేలు ఉపఎన్నిక
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 1న జారీకానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 8 చివరి తేదీ. ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరుగుతుంది. షెడ్యూల్ వెల్లడి కావడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందినందున ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక ఈ ఏడాది జనవరి 1 నాటి ఓటర్ల జాబితాతో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలను విధించింది. హుజూరాబాద్లో కూడా.. మరోవైపు.. తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గానికి కూడా అదేరోజు ఉపఎన్నిక జరగనుంది. బద్దేలు, హుజూరాబాద్తో కలిపి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మధ్యప్రదేశ్లోని ఖంద్వా, హిమాచల్ప్రదేశ్లోని మండి, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ ఆంక్షలు ఇవే.. ► నామినేషన్ వేసే ముందుగానీ, తరువాతగానీ ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం. ► రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బంది, అధికారులను మాత్రమే ఎన్నికల ప్రక్రియలో వినియోగించాలి. ► సభ చుట్టూ వలయాలు, బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చును అభ్యర్థులు లేదా పార్టీ భరించాల్సి ఉంటుంది. బారికేడ్లు ఏర్పాటు చేయదగిన బహిరంగ స్థలాలను మాత్రమే సభలకు ఎంపిక చేయాలి. ► స్టార్ క్యాంపేయినర్స్ సంఖ్యపై కూడా పరిమితి ఉంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలకు 20 మంది, గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీలకు 10 మంది మాత్రమే ఉండాలి. ► రోడ్డు షోలు, బైక్, కార్, సైకిల్ ర్యాలీలకు అనుమతిలేదు. ► ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు, వారి ప్రతినిధులు సహా మొత్తం ఐదుగురికి మాత్రమే అనుమతి. ► ఒక అభ్యర్థి లేదా రాజకీయ పార్టీకి గరిష్టంగా 20 వాహనాలు.. అందులోని సీట్ల సామర్థ్యంలో 50శాతం మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి. -
ఇక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా రాలేదు
చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీ స్థానంలో 1347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న నిమ్మకూరులో సైతం వైఎస్సార్సీపీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాల తరహాలో మరో ఎంపీటీసీ ఫలితం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా కమలాపూర్ మండలం దేవరాజుపల్లి ఎంపీటీసీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 191 ఓట్లు ఉండగా వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ఏకంగా 186 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 5 ఓట్లు వచ్చాయి. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీలకు కనీసం ఒక్క ఓటు కూడా రాకపోవడం విశేషంగా మారింది. కనీసం స్వతంత్ర అభ్యర్థికి కూడా దాటలేకపోయారంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుతున్నారు కొందరు నెటిజన్లు. -
ట్రెండింగ్గా మారిన అశ్విని.. మరోసారి 23 సెంటిమెంట్
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఒక్కసారిగా అశ్వినీ పేరు మార్మోగిపోతోంది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అశ్వినీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. 1989 నుంచి ఇక్కడ టీడీపీ పార్టీనే వరుసగా గెలుస్తూ వస్తోంది. అలాంటి స్థానంలో టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో పెరిగింది. మరోసారి తెరపైకి 23 వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్య నెలకొన్న పొలిటికల్ వార్లో 23 నంబర్కి ప్రత్యేకత ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. అందులో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తే, టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. తాజాగా కుప్పంలో టీ సద్దుమూరు స్థానం నుంచి విజయం సాధించి వెలుగులోకి వచ్చిన అశ్విని వయస్సు కూడా 23 ఏళ్లే కావడం గమనార్హం. దిష్టి గట్టిగా తీయండమ్మా !! ఆ పాపిష్టి కళ్ళు అన్ని ఈ అమ్మాయి మీదే ఉన్నాయి ! pic.twitter.com/Ka7lCYwlh5 — Ram (@iamSidde) September 19, 2021 -
ఫ్యాన్..తుఫాన్
ఫ్యాన్ తుఫాన్ వేగంతో తిరిగింది. ఆ ధాటికి సైకిల్ తునాతునకలైంది. ప్రభుత్వంపై జనం కురిపించిన అభిమానం.. ప్రతిపక్షంలోని ఉద్ధండ నాయకులను సైతం మట్టి కరిపించింది. మైకుల ముందు, సోషల్ మీడియా వేదికల్లో రెచ్చిపోయే టీడీపీ నాయకుల అసలు బలమెంతో ఈ ఎన్నికలతో తేలిపోయింది. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆల్టైమ్ రికార్డు సాధించింది. అపురూపమైన పథకాలతో అద్భుత పాలన అందిస్తున్న వైఎస్ జగన్ సర్కారుపై సిక్కోలు జనం ఓట్ల రూపంలో ప్రేమను కురిపించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గెలుపంటే ఇదీ.. అనే రీతిలో వైఎస్సార్సీపీ ప్రాదేశికాలను చేజిక్కించుకుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విజయబావుటా ఎగురవేసింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనం ముందు టీడీపీ ఏమాత్రం నిలవలేకపోయింది. పంచాయతీ, పురపాలక ఎన్నికల కంటే ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్ సీపీ గెలవడంతో పాటు ఎన్నికలు జరిగిన 37 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎంపీపీ స్థానా లు కూడా వైఎస్సార్ సీపీ వశమవుతున్నాయి. దీంతో జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో కొత్త అధ్యా యం లిఖించినట్టైంది. తిరుగులేని విజయం.. దశాబ్దాలుగా సిక్కోలు టీడీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి జిల్లాలో 37 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే అన్నింటినీ వైఎస్సార్ సీపీ గెలుచుకుని రికార్డు సృష్టించింది. అలాగే 667 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకగ్రీవాలతో కలుపుకుని 559 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. రెండు స్థానాల్లో స్వతంత్రులు ఏకగ్రీవమయ్యారు. టీడీపీ 81 స్థానా లకే పరిమితమైంది. ఇతరులు 12 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇందులో జనసేన, బీజేపీలు ఒక్కో స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి. 11 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన రెండు స్థా నాల్లో రీపోలింగ్ జరగనుంది. మొత్తానికి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 10 అసెంబ్లీలకు గాను ఎనిమిది దక్కించుకున్న వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పుంజుకుంది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 81.61శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకున్న వైఎ స్సార్సీపీ, పార్టీ గుర్తుపై జరిగిన మున్సిపల్ ఎన్నికలో 74.32శాతం స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా పరిషత్ ఎన్నికల్లో 84.40 శాతం స్థానాలను ఎగరేసుకుపోయింది. జెడ్పీటీసీ స్థానాల్లోనైతే 100 శాతం విజయాలను సాధించింది. ఆల్టైమ్ రికార్డు సిక్కోలు రాజకీయ చరిత్రను వైఎస్సార్సీపీ తిరగరాసింది. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల విషయంలో స్వీప్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇన్ డైరెక్ట్ ఎన్నికలు జరిగాక పూర్తి స్థాయిలో విజయం సాధించిన పార్టీ గతంలో ఏ ఒక్కటీ లేదు. ఒక్క వైఎస్సార్సీపీకే ఆ ఘనత దక్కింది. 1995లో తొలిసారి ఇన్ డైరెక్ట్ ఎన్నికలు జరగ్గా 38 జెడ్పీటీసీ స్థానాలకు టీడీ పీ 34, కాంగ్రెస్ నాలుగు దక్కించుకున్నాయి. 2001 లో టీడీపీ 31, కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. 2006లో కాంగ్రెస్కు 32, టీడీపీకి 6 దక్కాయి. 2014లో టీడీపీకి 22రాగా, వైఎస్సార్సీపీకి 16 వచ్చాయి. కానీ ఈ సారి ఎన్నికలు జరిగిన 37 స్థానాలను వైఎస్సార్సీపీ స్వీప్ చేసింది. అంతేకాదు 38 మండల పరిషత్లను దక్కించుకుంది. బోణీ కొట్టని టీడీపీ ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఎనిమిది మండలాల్లో టీడీపీ బోణీ కొట్టలేకపోయింది. నరసన్నపేట, అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి, నందిగాం, పలాస, భామిని, సీతంపేట, మందస, పాతపట్నంలో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూ డా టీడీపీ గెలుచుకోలేకపోయింది. ఇక జి.సిగడాం, కవిటి, జలుమూరు, సారవకోట మండలాల్లో ఒక్కో ఎంపీటీసీ స్థానానికే పరిమితమైంది. విశేషమేమిటంటే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సొంత ఎంపీటీసీ స్థానమైన కవిటి–2లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మరో 14 మండలాల్లో టీడీపీ రెండేసి స్థానాలను మాత్రమే దక్కించుకుంది. భారీ మెజారిటీలు.. ఎమ్మెల్యేల కంటే కొందరు ప్రాదేశిక అభ్యర్థులకు ఎ క్కువ మెజారిటీ రావడం విశేషం. రేగిడి జెడ్పీటీసీగా 22,798ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీకి చెందిన పాలవలస ఇందుమతి, టెక్కలి జెడ్పీటీసీ స్థా నం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ వాణి అత్యధికంగా 22,732 ఓట్ల మెజార్టీతో, నందిగాంలో వైఎ స్సార్సీపీ అభ్యర్థి పేరాడ భార్గవి 20 వేల ఓట్ల ఆధిక్యతతో, పాతపట్నం జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీకి చెందిన మామిడి మహాలక్ష్మి 16,328 ఓట్ల తేడాతో గెలిచారు. వైఎస్సార్సీపీ నుంచి విజ యం సాధించిన వారిలో అత్యధిక మంది 10వేలకు పైగా మెజార్టీతో గెలిచినవారే. పిరియా విజయ, ధర్మాన కృష్ణచైతన్య తదితరులు కూడా మంచి ఆధిక్యతను కనబరిచారు. ప్రజల గుండెల్లో వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రజాతీర్పు ముందు ప్రతిపక్షాల కుట్రలు తేలిపోయా యి. ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజల గుండెల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానం ఏమిటో మరోసారి రుజువైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ హవా స్పష్టంగా కనిపించింది. పోటీ చేస్తే ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే ఊహించి టీడీపీ పారిపోయింది. చాలా చోట్ల టీడీపీ నాయకుల పిలుపును కింది స్థాయి కార్యకర్తలు పట్టించుకోలేదు. పోటీ చేసి బోర్లా పడ్డారు. ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. – ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం జగన్ పాలనకు నిదర్శనం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పాలనకు నిదర్శనమే పరిషత్ ఎన్నికల్లో జనం ఇచ్చిన తీర్పు . మంచి పాలనకు జనం మంచి తీర్పు ఇచ్చా రు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులు. ఈ ఫలితాలతో ప్రతిపక్షం విమర్శలు పస లేనివిగా తేలిపోయాయి. న్యాయవ్యవస్థ సరైన సమయంలో తీర్పునిచ్చి ప్రజలకు న్యాయం చేసింది. ఆమదాలవలస నియోజకవర్గంలో నాలుగు మండలాలు, జెడ్పీటీసీ స్థానాన్ని సైతం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. – తమ్మినేని సీతారాం, స్పీకర్ అభాసుపాలైన టీడీపీ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చే యడం లేదంటూ తో క ముడిచినట్లు నటించిన తెలుగుదేశం పా ర్టీ పోటీ చేసి ఓడిపోయి అభాసుపాలైంది. రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లభించడం మన అదృష్టం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి -
Vizianagaram: విజయనగరంలో వైఎస్సార్సీపీ విజయబావుటా
సాక్షి, విజయనగరం: జిల్లాలో ఫ్యాన్గాలి బలంగా వీచింది. ప్రభంజనం సృష్టించింది. ప్రజాసంక్షేమ పాలనకు ఓటర్లు పట్టం కట్టారు. స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చారు. టీడీపీని మరోసారి గట్టిగా తిరస్కరించారు. ఓటరు తీర్పుతో స్థానిక సంస్థల చరిత్రలో తిరుగులేని ఆధిక్యం సాధించి ఫ్యాన్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత సాధారణ ఎన్నికల్లోనూ, మున్సిపోల్స్లోనూ చావుదెబ్బ తిన్న టీడీపీ ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ చతికిలపడింది. సీఎం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై టీడీపీ సహా విపక్ష పార్టీలు ఎన్ని నిరాధార ఆరోపణలు చేసినా ప్రజాతీర్పు స్పష్టంగా ఉంది. జిల్లా పరిషత్ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని అద్భుతం నెలకొంది. మొత్తం 34 జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక 33 మండల అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ అభ్యర్థులు అధిరోహించనున్నారు. ఒక్క రామభద్రపురంలో మినహా టీడీపీ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. ఏడు మండలాల్లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. కేవలం 86 ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైంది. ఏకగ్రీవాల సహా 444 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. బీజేపీకి మాత్రం ఒకే ఒక్క ఎంపీటీసీ స్థానం దక్కింది. మిగతా విపక్ష పార్టీల జాడ కూడా కనిపించలేదు. 11 ఎంపీటీసీ స్థానాలు స్వతంత్ర అభ్యర్థులకు దక్కాయి. విజయనగరంలో వైఎస్సార్ సీపీ హవా... టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లా ఇప్పుడు వైఎస్సార్సీపీ ఖిల్లాగా మారింది. గత సాధారణ ఎన్నికలలో విజయనగరం ఎంపీ సహా జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లోనూ ఫ్యాన్ హోరెత్తిన సంగతి తెలిసిందే. తర్వాత జరిగిన విజయనగరం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికలలోనూ వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక జిల్లా పరిషత్, మండల పరిషత్లలోనూ తిరుగులేని విజయం సాధించారు. పరిషత్ ఎన్నికలకు ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వచ్చింది. పోలింగ్కు ముందే మూడు జెడ్పీటీసీ స్థానాలు, 55 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. మెరకముడిదాం నుంచి వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) జెడ్పీటీసీగా ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఇక హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం జిల్లాలో పరిషత్తు ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభించిన అధికారులు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ పూర్తి చేశారు. సాయంత్రం ఏడు గంటలకల్లా జెడ్పీటీసీ ఫలితాల వెల్లడి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి అల్లర్లు లేకుండా కౌంటింగ్ ప్రశాంతంగా ముగించడంలో జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి, ఎస్పీ ఎం.దీపిక సఫలమయ్యారు. జాయింట్ కలెక్టర్లు జీసీ కిశోర్కుమార్, మహేశ్కుమార్, వెంకటరావు, అశోక్, సబ్కలెక్టరు భావన, ఐటీడీఏ పీఓ కూర్మనాథ్తో ప్రత్యేకాధికారులు ప్రత్యేకంగా కృషి చేశారు. జిల్లా పరిషత్లో వైఎస్సార్సీపీ పాగా... వైఎస్సార్సీపీ తొలిసారిగా జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకుంది. అంతేకాదు జిల్లా పరిషత్ చరిత్రలో క్లీన్స్వీప్ చేసిన ఏకైక పార్టీ కూడా ఇదే కావడం విశేషం. మొత్తం 34 స్థానాల్లో మూడు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 31 జెడ్పీటీసీ సీట్లను కూడా ప్రత్యక్ష పోరులో సొంతం చేసుకుంది. గెలుపొందినవారిలో డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు భార్య శ్రీదేవి కూడా ఉన్నారు. కొత్తవలస జెడ్పీటీసీగా ఆమె విజయం సాధించారు. మండలాల్లో తిరుగులేని ఆధిక్యం.... జిల్లాలోని 34 మండల పరిషత్లలో రామభద్రపురం మినహా మిగతా చోట్లా వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం చూపించింది. బాడంగి మండల పరిషత్లో మాత్రమే వైఎస్సార్సీపీ, టీడీపీలకు సమానంగా సీట్లు వచ్చాయి. గజపతినగరం, దత్తిరాజేరు, మెరకముడిదాం, గుర్ల, గరివిడి, సీతానగరం, కురుపాం మండలాల్లో టీడీపీకి ఒక్క ఎంపీటీసీ సీటు కూడా దక్కలేదు. ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గంట్యాడ, బలిజిపేట, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలసలో కేవలం ఒక్కొక్క ఎంపీటీసీ సీటుకే పరిమితమైంది. అంతేకాదు ఏ ఒక్క మండలంలోనూ టీడీపీ డబుల్ డిజిట్ స్థానాలను సాధించలేకపోయింది. బీజేపీ జియ్యమ్మవలస మండలంలో ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. 11 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రామభద్రపురం మండలంలోనే ముగ్గురు ఉన్నారు. అక్కడ మాత్రమే ఎంపీపీని నిర్ణయించడంలో కీలకం కానున్నారు. -
అనంతపురంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
ప్రాదేశిక ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నిక ఏదైనా ‘రిజల్ట్ రిపీట్’ అంటూ మరోసారి నిరూపించింది. సార్వత్రిక, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మాదిరే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ‘ఫ్యాన్’ గాలి హోరెత్తింది. ఈ ధాటికి ‘సైకిల్’ తుక్కుతుక్కు అయ్యింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం ‘ప్రాదేశిక’ పోరులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. సమీప ప్రత్యర్థులపై భారీ మెజార్టీలతో గెలుపొందారు. ఏకంగా 60 జెడ్పీటీసీ, 762 ఎంపీటీసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జిల్లాలోని 17 కేంద్రాల్లో చేపట్టారు. రాత్రి ఏడున్నర గంటలకల్లా పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడ్డాయి. ఓటరు తీర్పు ఏకపక్షమేనని తేలిపోయింది. జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. పోలింగ్కు ముందే వైఎస్సార్సీపీ అభ్యర్థి చనిపోవడంతో చిలమత్తూరు స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. మిగిలిన 62 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. ఇందులో 60 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అగళి స్థానాన్ని టీడీపీ దక్కించుకోగా.. రొళ్లలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అలాగే మొత్తం 841 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో 50 ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్సీపీ 49, టీడీపీ 1 స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. పది చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నిక నిర్వహించలేదు. మిగిలిన 781 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా..ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. వైఎస్సార్సీపీ 713, టీడీపీ 50, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ ఒక్కో ఎంపీటీసీ స్థానంలో గెలుపొందాయి. 13 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్సీపీ ఏకంగా 762 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 51 స్థానాలకు పరిమితమైంది. అన్ని డివిజన్లలో సై‘కిల్’ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో మాదిరే ప్రాదేశిక ఎన్నికల్లోనూ టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో పట్టు కోల్పోయింది. టీడీపీ ముఖ్య నేతల ఇలాకాల్లోనూ ఆ పార్టీ కనీస ప్రభావం చూపలేదు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లలోనూ సై‘కిల్’ కావడం గమనార్హం. అనంతపురం డివిజన్లో 19 జెడ్పీటీసీ, 254 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్ని జెడ్పీటీసీ స్థానాలతో పాటు 226 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. టీడీపీకి 23 స్థానాలు మాత్రమే దక్కాయి. సీపీఎం ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు ఎంపీటీసీ స్థానాలు గెలుపొందారు. ►ధర్మవరం డివిజన్లోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అలాగే 79 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 74 చోట్ల గెలుపొందగా.. రామగిరిలో ఒక స్థానం, రాప్తాడు 2, కనగానపల్లెలో 2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ►కళ్యాణదుర్గం డివిజన్లో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయభేరి మోగించారు. 143 ఎంపీటీసీ స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ 137 స్థానాల్లో గెలుపొందగా.. కేవలం ఐదు చోట్ల టీడీపీ, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ►పెనుకొండ డివిజన్లో 12 జెడ్పీటీసీలకు గాను పది స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అగళి జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందగా.. రొళ్ల స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అలాగే 183 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 162 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 13 స్థానాల్లో టీడీపీ, పరిగి మండలం కొడిగెనహళ్లి–3 స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడు చోట్ల విజయం సాధించారు. ►కదిరి డివిజన్లోనూ టీడీపీకి పరువు పోయింది. 12 జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ ఖాతాలో వేసుకుంది. అలాగే 122 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్సీపీ 114 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. టీడీపీ ఆరు స్థానాలకే పరిమితమైంది. జనసేన, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో స్థానంలో గెలుపొందారు. ‘సంక్షేమ’ విజయం పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలతో పాటు తాజాగా ప్రాదేశిక ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయానికి వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేయడం, సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా, జాప్యం లేకుండా లబ్ధి చేకూరుస్తుండడంతో ప్రజలు వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని అంటున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించగలిగారు. -
Kurnool: జెడ్పీపై తొలిసారి వైఎస్సార్సీపీ జెండా రెపరెపలు
కర్నూలు(అర్బన్): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే దూకుడును ప్రదర్శించింది. జిల్లాలోని 53 మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు తిరుగులేని మెజారిటీని సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా..ఆదివారం జిల్లాలోని 11 ప్రాంతాల్లో ఓట్లను లెక్కించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మెజారిటీ పరంగా ముందంజలో సాగారు. జెడ్పీపై తొలిసారి వైఎస్సార్సీపీ జెండా రెపరెపలు ... జిల్లాపరిషత్పై తొలిసారి వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడనుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు మెజారిటీగా గెలుపొందినా, అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పలువురు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలను కుట్రలు, కుంతంత్రాలతో మభ్యపెట్టి తమవైపు తిప్పుకొని జెడ్పీ పీఠాన్ని దొడ్డిదారిలో చేజిక్కించుకుంది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తిరుగులేని మెజారిటీని అందించారు. మొత్తం 53 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఎన్నికల కంటే ముందే 16 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో జమ అయ్యాయి. బీజేపీ అభ్యర్థి మృతితో నంద్యాల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిలిచి పోగా, మిగిలిన 36 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 672 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం... జిల్లాలో మొత్తం 807 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వివిధ కారణాలతో 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన 796 ఎంపీటీసీల్లో 312 ఏకగ్రీవం కాగా, 484 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకగ్రీవాలను కలుపుకొని వైఎస్సార్సీపీ 672 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ 105 స్థానాలను దక్కించుకుంది. ఐదు స్థానాలను బీజేపీ, మూడు స్థానాలను సీపీఐ గెలుపొందింది. స్వతంత్రులు 11 స్థానాల్లో విజయం సాధించారు. పలు ప్రాంతాల్లో సీపీఎం, జనసేన అభ్యర్థులు పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. 25న జెడ్పీచైర్మన్, 24న ఎంపీపీల ఎన్నిక ఈ నెల 24న మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, 25న జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మండల పరిషత్లకు ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులను 24న ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే 25న జిల్లా పరిషత్కు ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు, ఇద్దరు వైస్ చైర్మన్లను కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుని ఎన్నికకు సంబంధించి 20న నోటీస్ జారీ చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరిస్తారు. స్రూ్కటీనీ నిర్వహించిన అనంతరం 12 గంటలకు అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు. మధ్యాహ్నం 1 గంట లోపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయిన అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. 21న జిల్లా పరిషత్కు సంబంధించి ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు, చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు జిల్లా కలెక్టర్ నోటీసు జారీ చేస్తారు. 25న ఉదయం 10 గంటలకు నామినేషన్లను స్వీకరించి స్రూ్కటీనీ నిర్వహిస్తారు. అనంతరం 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రచురించి 1 గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మధ్యాహ్నం 3 గంటలకు చైర్మన్, ఇద్దరు వైస్ఛైర్మన్లను ఎన్నుకోవాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రశాతంగా ఓట్ల లెక్కింపు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను లెక్కించినట్లు జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన రాయలసీమ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ హరిప్రసాద్, డీఆర్డీఏ పీడీ వెంకటేశులు ఉన్నారు. పరిశీలకులు ప్రభాకర్రెడ్డి కూడా ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. -
YSR Kadapa: కడప జిల్లాలో వైఎస్సార్సీపీ జయకేతనం
జిల్లాలో ఫ్యాను గాలి ఉధృతంగా వీచింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహత విజయం సాధించింది. ఓటర్లు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అధికార పార్టీ హవా ముందు టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. జెడ్పీ పీఠం వైఎస్సార్సీపీనే వరించనుంది. స్థానిక ఎన్నికల్లో వరుసగా తిరుగులేని విజయాలను నమోదు చేసుకుంటున్న అధికార పార్టీలో విజయోత్సాహం నెలకొంది. సాక్షి, వైఎస్సార్ కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు ఏవైనా వైఎస్సార్సీపీ వైపే ప్రజలు నిలిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు మద్దతు ఇస్తూ తిరుగులేని ఆధిక్యతను అందించారు. కనీవినీ ఎరుగని రీతిలో అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీని అందిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఓటు అస్త్రంతో వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రెండేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం తప్పలేదు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో కేవలం అంతంత మాత్రం సీట్లు దక్కించుకోలేక టీడీపీ సైకిల్ గాలికి కొట్టుకుపోయింది. ఊహించని దెబ్బకు టీడీపీ నాయకులు ఇంటి నుంచి బయటికి రాలేక ముఖం చాటేశారు. 92 స్థానాల్లో తిరుగులేని విజయం జిల్లా మొత్తం మీద 554 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 432 స్థానాలు ఏకగ్రీవం కాగా...అందులో 423 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఏడు స్థానాలను టీడీపీ, రెండు స్థానాలు బీజేపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 117 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం వీటికి సంబంధించి కౌంటింగ్ జరగ్గా అందులో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తిరుగులేని మెజార్టీ లభించింది. 117 స్థానాలకుగాను 92 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగుర వేశారు. టీడీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కాగా, ఏడు స్థానాలు బీజేపీకి దక్కగా, మరో ఐదు స్థానాల్లో ఇండిపెండింగ్ అభ్యర్థులు అనూహ్యంగా విజయం సాధించారు. జమ్మలమడుగు మండలం గొరిగనూరు, ముద్దనూరు మండలం కొర్రపాడు ఎంపీటీసీలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోకి నీరు చేర డంతో అధికారులు కౌంటింగ్ పెండింగ్లో ఉంచారు. వైఎస్సార్సీపీ ఖాతాలో 10 జెడ్పీటీసీలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. 50 మండలాలకు చెందిన 38 జెడ్పీ స్థానాలు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 12 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివారం కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 12 స్థానాలకుగాను 10 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. కేవలం టీడీపీకి గోపవరం జెడ్పీటీసీ స్థానం మాత్రమే దక్కింది. పేరుకే అభ్యర్థులు..కనిపించని ఓటు: జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది పేరుకే అభ్యర్థులుగా కనిపించారు. తీరా కౌంటింగ్ కేంద్రాల్లో చూస్తే వారికి ఒక్క ఓటు కూడా పడలేదు. చివరికి వారి ఓటు కూడా వారు వేసుకోలేదు. అభ్యర్థుల జాబితాలో పేరున్నా చివరికి వారికి ఒక్క ఓటు కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. రైల్వేకోడూరు ఎంపీటీసీ పరిధిలో ఇద్దరు అభ్యర్థులు అలా కనిపించగా, మిగిలిన చోట్ల కూడా ఇలా ఓటు పడని అభ్యర్థులు కనిపించారు. సంబరాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి అత్యధిక స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవడంతోపాటు ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి పండుగ నిర్వహించుకున్నారు. గెలిచిన అభ్యర్థులు స్వీట్లు తినిపించుకుని కేకులు పంచుతూ ఆనందంలో మునిగిపోయారు. ఆ ముగ్గురికి భారీ మెజార్టీ రైల్వేకోడూరు జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పాలెంకోట రత్నమ్మ 25,100 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థి జనసేన అభ్యర్థి మధులతపై విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితం కాగా, జిల్లాలోనే అత్యధిక మెజార్టీ రైల్వేకోడూరు అభ్యర్థికి దక్కింది. తర్వాత స్థానంలో నందలూరు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఉషారాణి 20,556 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి జనసేన అభ్యర్థి నాగమణిపై గెలుపొందారు. ఇక్కడ కూడా టీడీపీ మూడో స్థానానికే పరిమితమైంది. అలాగే చిట్వేలి వైఎస్సార్సీపీ అభ్యర్థి పుష్పలత కూడా 19,578 ఓట్ల భారీ ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. సంక్షేమం, అభివృద్ధికే పట్టం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జిల్లాలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రభావం జిల్లాలో తీవ్రంగా ఉంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులతోపాటు పరిశ్రమలను సైతం ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సర్వం సిద్ధం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ప్రాజెక్టులకు కృష్ణా జలాలను తరలించి సాగు, తాగనీటి కష్టాలను తీర్చింది. జిల్లా ప్రజలంతా వైఎస్ జగన్ పాలన పట్ల మరింత ఆకర్షితులయ్యారు. -
Chittoor: ఫ్యాన్కే పట్టం.. కుప్పంలోనూ బాబుకు మొండిచేయి
పల్లె ప్రజలు పరిషత్ పోరులోనూ ఏకపక్షంగా తీర్చునిచ్చారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలనే పునరావృతం చేశారు. సంక్షేమ పాలనకే పట్టం కట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. టీడీపీని మట్టికరిపించారు. చంద్రబాబు కుతంత్రాలను ఓటుతో తిప్పికొట్టారు. కుప్పంలోనూ కర్రు కాల్చి వాత పెట్టారు. చివరకు నారావారిపల్లెవాసులు సైతం ‘నిన్ను నమ్మం బాబూ’ అని తేల్చేశారు. సాక్షి, తిరుపతి: జిల్లావ్యాప్తంగా ఆదివారం వెల్లడైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. సొంత ఇలాకాలోనే చంద్రబాబుకు మరోసారి ఘోరపరాభవం ఎదురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు సంపూర్ణ మద్దతు లభించింది. ఫ్యాను ప్రభంజనానికి సైకిల్ కొట్టుకుపోయింది. జిల్లాలోని అన్ని జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాలను సైతం దాదాపు స్వీప్ చేసేసింది. దిమ్మ తిరిగే తీర్పు ఘనత వహించిన చంద్రబాబుకు ప్రజలకు చుక్కలు చూపించారు. సొంతూరు నారావారిపల్లె నుంచి ఏళ్ల తరబడి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వరకు దిమ్మ తిరిగే తీర్పునిచ్చారు. బాబు కోటగా భావించే కుప్పంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో తిరుగులేని విజయం సాధించారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన 4 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. 63 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 63 స్థానాల్లోని ఓటర్లు ఫ్యాను గుర్తు వైపే మొగ్గుచూపారు. టీడీపీని కేవలం 3 స్థానాలకే పరిమితం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె ప్రజలు సైతం చంద్రబాబును తిరస్కరించారు. చిన్న రామాపురం ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యరి్థకి ఓటేసి అత్యధిక మెజారిటీ కట్టబెట్టారు. మాజీ మంత్రికి షాక్ మాజీ మంత్రి అమరనాథ్రెడ్డికి పలమనేరు నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. ఇక్కడి ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీనే గెలిపించారు. ముఖ్యంగా వి.కోట జెడ్పీటీసీ స్థానంలో ఫ్యాను గుర్తుకు 27,713 ఓట్ల ఆధిక్యతను అందించారు. మొత్తం 83 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 81 స్థానాలను వైఎస్సార్సీపీకి అందించారు. టీడీపీని కేవలం 2 స్థానాలకే పరిమితం చేశారు. నల్లారికి నగుబాటు పీలేరు నియోజకవర్గంలో నల్లారి వారికి నగుబాటు తప్పలేదు. ఇక్కడి ఐదు జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 67 ఎంపీటీసీ స్థానాలకు గాను ఫ్యాను 60 గెలుచుకుంటే, సైకిల్ 7 స్థానాలతో సరిపెట్టుకుంది. నగరి నియోజక వర్గంలో మొత్తం 5 జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 40 ఎంపీటీసీ స్థానాలకు గాను 37చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. గంగాధరనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజక వర్గాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల హవా కొనసాగింది. మదనపల్లి నియోజక వర్గంలోని 3 జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. 50 ఎంపీటీసీ స్థానాలకు గాను 49 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రశాంతంగా కౌంటింగ్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని ఇంచార్జి కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కౌంటింగ్ అనంతరం కలెక్టరేట్లో ఆయన అధికారులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. జెడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండల, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు. 24వ తేదీన ఎంపీపీ, 25వ తేదీన జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జేసీ (సంక్షేమం) రాజశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దశరథరామిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: పంచాయతీ, మునిసిపల్ను మించి జైత్ర యాత్ర -
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకే పట్టం
సింహపురిలో వైఎస్సార్సీపీ మరో ప్రభంజనం సృష్టించింది. సార్వత్రిక ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల వరకు ప్రజలు వైఎస్సార్సీపీకే జై కొట్టారు. జిల్లాలో వైఎస్సార్సీపీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆదివారం వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలతో టీడీపీ కంచుకోటలు బద్ధలయ్యాయి. జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కీŠల్న్ స్వీప్ చేయగా, ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతం సీట్లను వైఎస్సార్సీపీ దక్కించుకుంటే.. టీడీపీ 6.13 శాతానికి పరిమితమైంది. స్థానిక ఒప్పందాల నేపథ్యంలో స్వతంత్రులు, సీపీఎం, బీజేపీ, జనసేన అభ్యర్థులు 21 స్థానాల్లో స్వల్ప మెజార్టీలతో బయటపడ్డారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో అన్ని మండల పరిషత్లతో పాటు జిల్లా పరిషత్ను సొంతం చేసుకోనుంది. 46 జెడ్పీటీసీ స్థానాలు, 495 మంది ఎంపీటీసీ స్థానాలు అధికార పార్టీ కైవశం చేసుకుంది. టీడీపీ జాతీయ స్థాయి నాయకుడిగా భావించే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఇలాఖాలో సైతం ఘోర పరాభవం తప్పలేదు. మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో కూడా ప్రజలు టీడీపీ అభ్యర్థులను తిరస్కరించారు. జిల్లా ప్రజానీకం వైఎస్సార్సీపీ పక్షమేనని నిరూపించారు. ఎన్నికలు ఏవైనా సరే, ఎప్పుడైనా సరే తామంతా వైఎస్సార్సీపీ వెంటనేనని మరోసారి రుజువు చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు కట్టబెట్టిన జిల్లా ప్రజలు దాదాపు 20 నెలల పాలన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకి జైకొట్టారు. గ్రామీణులకు అందుతోన్న సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల తీర్పులో ప్రతిబింబించింది. మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో, ఇప్పటి వరకూ టీడీపీ మినహా మరే పార్టీ గెలుపొందని గ్రామాల్లో సైతం వైఎస్సార్సీపీ జయకేతనం ఎగరవేసింది. జిల్లాలో 554 ఎంపీటీసీ స్థానాల్లో 4 స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. గంగవరం, వెంగమాంబపురం, అనంతమడుగు, కోట–2 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు మృతి కారణంగా నిలిచిపోయాయి. 550 స్థానాలకు 495 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం చేజిక్కించుకున్నారు. కేవలం 34 స్థానాలకే మాత్రమే టీడీపీ పరిమితమైంది. సీపీఎం 5 , బీజేపీ 2 స్థానాలతో సరిపెట్టుకొగా, కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని జనసేన దక్కించుకుంది. 13 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలోని 46 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు వైఎస్సార్సీపీ అభ్యర్థులు పొట్లూరి సుబ్బమ్మ (జలదంకి–2), కల్లూరు జయరామయ్య (శిరసనంబేడు) మృతి చెందారు. ఈ స్థానాలతో పాటు నిలిచిపోయిన స్థానాలకు ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఆనం ఇంట మహిళ నేత ఆరంగ్రేటం జిల్లాలో ఆనం కుటుంబానికి 8 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఆనం ఇంటి మహిళా నేతలు ఎవరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనం విజయకుమార్రెడ్డి సతీమణి అరుణమ్మ రాజకీయ ఆరంగ్రేటం చేశారు. నెల్లూరు రూరల్ జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో ఆనం ఇంటి నుంచి మహిళ నేత అరుణమ్మ ప్రజాసేవలో నిమగ్నం కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 మంది మహిళా నేతలు జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యారు. మరో 270 మంది ఎంపీటీసీలుగా మహిళలను ఎన్నుకున్నారు. వారిలో 23 మంది ఎంపీపీలు కానున్నారు. ఈ నెల 24న ఎంపీపీ, 25న జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు ఎంతో కాలంగా నిరీక్షిస్తూ వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పదవీయోగం దక్కనుంది. గణనీయంగా పెరిగిన ప్రజామద్దతు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు లభించిన మెజార్టీ కంటే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో లభించిన గణనీయంగా పెరిగింది. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి 14,117 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకుంటే.. అదే స్థానిక సంస్థల ఫలితాల్లో అల్లూరు జెడ్పీటీసీ ఏకగ్రీవం కాగా, తక్కిన మూడు మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థులకు 33,321 మెజార్టీ లభించింది. సర్వేపల్లె ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డికి 13,973 ఓట్లు మెజార్టీ దక్కగా, ఈ నియోజకవర్గంలోని జెడ్పీటీసీ అభ్యర్థులందరి మెజార్టీలు పరిశీలిస్తే 58,345 ఓట్లు అధికంగా దక్కించుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి 38,720 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అక్కడ రాపూరు మండలం ఏకగ్రీవం కాగా, తక్కిన ఐదు మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థుల మెజార్టీ 48,884 ఉండడం విశేషం. ఇలా ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పట్ల ప్రజామద్దతు గణనీయంగా పెరిగింది. మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో టీడీపీకి తిరస్కరణ టీడీపీ మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనూ పరాభవం తప్పలేదు. వెంటకగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వగ్రామం కమ్మవారిపల్లె పంచాయతీలోని లింగసముద్రం ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి నావూరు కోటేశ్వరరావు 1,011 ఓట్లతో ఘన విజయం సాధించారు. అక్కడ టీడీపీ కంటే బీజేపీకి 4 ఓట్లు అధికంగా రావడంతో టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సొంతూరు పెద్దకొండూరులో టీడీపీ మట్టి కరిచింది. 1,025 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇండ్ల చెంచమ్మ గెలుపొందింది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య స్వగ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రమాదేవి విజయం దక్కించుకుంది. టీడీపీ జాతీయ స్థాయి నేతగా ప్రకటించుకునే మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లెలో టీడీపీ కేవలం 2 ఎంపీటీసీ స్థానాలకు పరిమితమైంది. సోమిరెడ్డి నివాసం ఉంటున్న అల్లీపురం ఎంపీటీసీ సైతం వైఎస్సార్సీపీ దక్కించుకుంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్వగ్రామం నార్త్రాజుపాళెం రెండు ఎంపీటీసీలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్వగ్రామం ఇసకపల్లిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొండూరు వాసు 1,079 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం స్వగ్రామం భీమవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నెలవల మమత విజయం దక్కించుంది. టీడీపీ కంచుకోటలుగా ఉండే స్థానాల్లో ఘోర ఓటమి చవిచూడాల్సిన అనుభవం ఆ పార్టీకి ఎదురయింది. దీనికి ప్రధాన కారణంగా పార్టీలు, వర్గాలతో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతుండడమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
Prakasam: విజయ పంకా..
పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని సృష్టించింది. బ్యాలెట్ బాక్స్లు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచీ ఫ్యాన్ స్పీడు కొనసాగింది. ఆ జోరుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలని టీడీపీ పన్నిన కుయుక్తులకు ప్రజలు ఓటుతో సమాధానమిచ్చారు. 55 జెడ్పీటీసీ, 628 ఎంపీటీసీ స్థానాల్లో విజయదుందుభి మోగించి జిల్లాలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారయంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సాక్షిప్రతినిధి, ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతూనే ఉంది. గతంలో జరిగిన సర్పంచ్లు, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి 90 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ సీపీ పరిషత్ పోరులోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది. పరిషత్ పోరులో వైఎస్సార్సీపీ మరింత దూకుడు పెంచగా, టీడీపీ అడ్రస్ గల్లంతైంది. మిగిలిన పారీ్టల ఉనికి సైతం లేని పరిస్థితి. జిల్లాలో 56 మండలాలుండగా అందులో 55 మండలాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టీడీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. చివరకు ఎన్నికలయ్యాక కూడా కౌంటింగ్ను నిలిపేస్తూ వచ్చింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని ముందుగానే తెలుసుకున్న టీడీపీ కోర్టులను అడ్డుపెట్టుకొని ఏడాదిగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. జిల్లాలో 55 జెడ్పీటీసీ స్థానాలకు గాను 14 జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా, 41 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఆదివారం జరిగిన కౌంటింగ్లో 41 జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకొని జిల్లాలో ఉన్న 55 జెడ్పీటీసీలను తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా జిల్లాలో 784 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో 68 చోట్ల ఎన్నిక నిలిచిపోయిన విషయం తెలిసిందే. 348 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం ఎన్నికలు జరిగిన 716 ఎంపీటీసీల్లో 628 వైఎస్సార్సీపీ, 64 టీడీపీ, 21 ఇండిపెండెంట్లు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఒక్కొక్క స్థానాన్ని దక్కించుకున్నాయి. వరుస విజయాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉండగా, ఘోర పరాజయాల పరంపర కొనసాగుతుండటంతో టీడీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో అయితే టీడీపీ ఖాతా కూడా తెరవని పరిస్థితి. పది శాతం స్థానాలకు పరిమితమైన టీడీపీ: 2019 ఎన్నికల్లో జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 4 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో జిల్లాలో పది శాతం స్థానాలను కూడా దక్కించుకోలేక చతికలపడింది. 55 జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేని దుర్భర పరిస్థితి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పారీ్టలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తుండటంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో సైతం అన్ని జిల్లా పరిషత్, మండల పరిషత్లను వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేయటం చూస్తుంటే టీడీపీ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాలకు హాజరై సూచనలు చేయాల్సి ఉన్నా జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేసి రాజకీయ డ్రామాలకు తెరతీయటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు చూస్తుంటే టీడీపీ పై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే జనసేన, కాంగ్రెస్ పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఈ రెండు పారీ్టలు ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా గెలవలేదు. చదవండి: పంచాయతీ, మునిసిపల్ను మించి జైత్ర యాత్ర -
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీదే ఆధిక్యం
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : పరిషత్ పోరులోనూ ఫ్యాన్ హవా కొనసాగింది. పల్లెపల్లెనా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీగా స్థానాలు దక్కించుకుని జిల్లాలో ప ట్టును మరోసారి చాటింది. టీడీపీ కంచుకోటగా ఉన్న మండలాల్లో సైతం వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. గణపవరం, ఏలూరు రూరల్ మండలాల్లో నూరు శాతం ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా రికార్డు మెజార్టీలు సాధించారు. మొత్తంగా 48 స్థానాలకు గాను 47 చోట్ల ఎన్నికల ప్రక్రియ జరగ్గా 45 స్థానాలను కైవసం చేసుకుంది. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 3,600 మంది సిబ్బంది ► ఏలూరు డివిజన్ పరిధిలో 16 జెడ్పీటీసీ, 302 ఎంపీటీసీ స్థానాలకు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరిగింది. ► నరసాపురం డివిజన్ పరిధిలో 12 జెడ్పీటీసీ, 218 ఎంపీటీసీ స్థానాలకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లను లెక్కించారు. ► కొవ్వూరు డివిజన్ పరిధిలో 12 జెడ్పీటీసీ, 249 ఎంపీటీసీ స్థానాలకు తణుకు ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరిగింది. ► జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్ల పరిధిలో 7 జెడ్పీటీసీ, 77 ఎంపీటీసీ స్థానాలకు జంగారెడ్డిగూడెం నోవా ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లను లెక్కించారు. జెడ్పీటీసీలు ఇలా.. జిల్లాలో 48 జెడ్పీటీసీ స్థానాలకు గాను పెనుగొండ జెడ్పీటీసీ అభ్యర్థి ఒకరు మరణించడంతో అక్కడ నిలిచిపోయింది. ఇప్పటికే రెండు స్థానాలు ఏకగ్రీవం కా గా మిగిలిన 45 స్థానాలకు గాను వైఎస్సార్ సీపీ 43 స్థానాలు, టీడీపీ, జనసేన చెరో ఒక స్థానం చొప్పున గెలుపొందాయి. మొత్తంగా 45 స్థానాలతో వైఎస్సార్ సీపీ సత్తాచాటింది. జంగారెడ్డిగూడెం, ఏలూరు రూరల్ జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నిక జరగలేదు. 673 స్థానాల్లో విజయఢంకా జిల్లాలో 876 ఎంపీటీసీ స్థానాలకుగాను 73 ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు మరణించడం తదితర కార ణాలతో 22 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. 781 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. వైఎస్సార్ సీపీ 608, టీడీపీ 99, జనసేన 60, ఇతరులు 14 స్థానాల్లో గెలుపొందారు. ఏMýగ్రీవాలతో కలిసి 673 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. పెదవేగి, చాగల్లు మండలాల్లో ఒక్కో స్థానానికి రీకౌంటింగ్ జరిగింది. ఏలూరు (11), గణపవరం (19) మండలాల్లో అన్ని స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ ఒకటి.. జనసేన ఒకటి.. ఆచంట జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఉప్పలపాటి సురేష్బాబు గెలుపొందారు. వీరవాసరం జెడ్పీటీసీ స్థానంలో గుండా జయప్రకాష్ నాయుడు జనసేన తరçఫున గెలుపొందారు. టీడీపీ ఎమ్మెల్యేలకు భంగపాటు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గట్టి షాక్ తగిలింది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత మండలమైన పాలకొల్లులో 14 ఎంపీటీసీలకు 8 వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోగా టీడీపీ ఐదు స్థానాలకు పరిమితమైంది. ఎమ్మెల్యే స్వగ్రామం అగర్తపాలెంలో ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపొందారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు సొంత మండలం కాళ్లలోనూ వైఎస్సార్ సీపీ పట్టు సాధించింది. 19 ఎంపీటీసీ స్థానాలకు 15 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందగా టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎమ్మెల్యే స్వగ్రామం కలవపూడిలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. పకడ్బందీగా కౌంటింగ్ ఏలూరు, (మెట్రో): జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఐఏఎస్ అధికారి సత్యనారాయణ, కలెక్టర్ కార్తికేయమిశ్రా జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపును విజయవంతంగా ముందుకు సాగించారు. జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకే కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు స్ట్రాంగ్రూమ్ల నుంచి ఉదయం 7, 8 గంటల మధ్యలో బ్యా లెట్ బాక్సులు తీసుకువచ్చి ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్పత్రాలు వేరు చేసి కట్టలు కట్టారు. ఉదయం 10 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అర్ధరాత్రి 1 గంట వరకు కౌంటింగ్ ప్రక్రియ సాగింది. మధ్యాహ్నం నుంచి ఏలూరులో వర్షం కురవడంతో బయట విధులు నిర్వహించే పోలీసులు, సిబ్బంది కాస్త ఇబ్బంది పడ్డారు. పార్టీల ఏజెంట్లు, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ను జంగారెడ్డిగూడెం డివిజన్లో మధ్యాహ్నానికి పూర్తి చేసి మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో కొవ్వూరు డివిజన్, మూడో స్థానంలో నరసాపురం డివిజన్, చివరి స్థానంలో ఏలూరు డివిజన్ నిలిచాయి. 24 ఎంపీపీ.. 25న జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 24న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ మెంబర్ స్థానాలకు, 25న జిల్లాపరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ సభ్యుల స్థానాలకు జిల్లా అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలైనవి 53.. చెల్లనివి 47 భీమడోలు: భీమడోలు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పోలైన 53 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 47 చెల్లుబాటు కాలేదు. ఆరు ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా వైఎస్సార్ సీపీ 4, టీడీపీ, జనసేనకు ఒక్కొ క్కటి చొప్పున వచ్చాయి. ఉద్యోగులు డిక్లరేషన్ పత్రంలో ఎంపీటీసీ స్థానాన్ని నమోదు చేయకపోవడంతో ఓట్లు చెల్లుబాటు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. దీని వల్ల జిల్లాలోనే భీమడోలు మండలంలో అత్యధికంగా ఓట్లు చెల్లబాటు కాకుండాపోయాయి. పోస్టల్ ఓటు వేసే తరుణంలో ఉద్యోగి తాము ఏ ఎంపీటీసీ స్థానానికి చెందిన ఓటరు అనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అదే జెడ్పీటీసీ ఓటు కు మండలం పేరు నమోదు చేస్తే సరిపోతుంది. ఇదిలా ఉండగా జెడ్పీటీసీ స్థానానికి మా త్రం 72 ఓట్లలో 69 చెల్లుబాటు అయ్యాయి. -
Krishna: పంఖా ప్రభంజనం
సాక్షి, కృష్ణా: సంక్షేమ పాలనను జనం మెచ్చారు. ప్రాదేశిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. ఫలితంగా ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభంజనం కొనసాగింది. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ జిల్లా వాసులు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పాలనకు మెచ్చి తిరుగులేని తీర్పునిచ్చారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఏకపక్షంగా పట్టం కట్టారు. అత్యధిక స్థానాలే కాదు.. భారీ మెజార్టీలూ అందించారు. ఎంతలా అంటే.. కొన్ని మండలాల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అడ్రస్ గల్లంతయింది. ఆయా మండలాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని దక్కించుకోలేక చతికిలపడింది. పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించి, వారితో నామినేషన్లు వేయించి ఓటమి భయంతో బరి నుంచి తప్పుకుంది. అయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో కొనసాగారు. తొలి నుంచి వైఎస్సార్ సీపీ హవా ఆదివారం జిల్లాలోని 17 కేంద్రాల్లోని 46 కౌంటింగు హాళ్లలో పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను లెక్కించారు. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఏ దశలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. జిల్లాలో మొత్తం 812 ఎంపీటీసీ, 49 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. పురపాలకసంఘాల్లో విలీనంతో పెనమలూరు మండలంలో 48, మచిలీపట్నం మండలంలో 20, జగ్గయ్యపేట మండలంలో 21 వెరసి 89, ఏకగ్రీవమైన 69, అభ్యర్థులు మరణించడంతో ఆరు చోట్ల కలిపి 164 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 648 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 49 జెడ్పీటీసీ స్థానాలకు 41 చోట్లే ఎన్నికలు జరిగాయి. మచిలీపట్నం, పెనమలూరు, జగ్గయ్యపేటకు ఎన్నికలు జరగలేదు. జి.కొండూరు, విస్సన్నపేట, పెడనల్లో అభ్యర్థులు మృతి చెందడంతో వాయిదాపడ్డాయి. ఉంగుటూరు, మండవల్లి స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 69 ఎంపీటీసీల్లో 67 మంది వైఎస్సార్ సీపీ, ఇద్దరు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఫలితాలు ఇలా.. వైఎస్సార్ సీపీ 572, టీడీపీ 60, జనసేన 9, బీజేపీ, సీపీఐ, బీఎస్పీకి ఒక్కొక్క చోట, స్వతంత్రులు నాలుగు స్థానాల్లోను గెలుపొందారు. కోడూరు మండలంలో 13కు 13 ఎంపీటీసీలూ, పెడనలో 10కి 10 స్థానాలూ, బంటుమిల్లిలో 13కి 13, నందివాడలో 11 ఎంపీటీసీ స్థానాల్లో అన్నింటినీ, విస్సన్నపేట మండలంలో 17కు 17, గుడ్లవల్లేరులో 15కి 15, చాట్రాయిలో 15కి 15, మండవల్లిలో 14కు 14, ఎ.కొండూరులో 14కు 14, ఉంగుటూరు మండలంలో 16 ఎంపీటీసీలకు 15, నూజివీడులో 19కు 17, పెదపారుపాడులో 9కి 9 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవశం చేసుకుంది. ఇలా జిల్లాలో చాలా మండలాల్లో టీడీపీ బోణీ కొట్టని పరిస్థితి ఏర్పడింది. జెడ్పీటీసీ స్థానాల్లోనూ హవా.. మరోవైపు జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ పూర్తి హవా కొనసాగించింది. మొత్తం 49 జెడ్పీటీసీ స్థానాల్లో ఇప్పటికే రెండు ఏకగ్రీవం కాగా ఆ రెండింటిని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. వివిధ కారణాలతో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 41 స్థానాల్లో మోపిదేవిని టీడీపీ దక్కించుకోగా మిగిలిన 40 వైఎస్సార్ సీపీ పరమయ్యాయి. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ► కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలో ముదినేపల్లి–2, వణుదురు ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల మృతి వల్ల ఎన్నిక జరగలేదు. ► నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు మండలం దేవరగుంట స్థానం అభ్యర్థి మృతి వల్ల ఎన్నిక జరగలేదు. ► నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం వీరులపాడు సెగ్మెంట్ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ మద్దతుతో సీపీఐ పారీ్టలో గెలిచారు. ► గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం అల్లాపురం సెగ్మెంట్ అభ్యర్థి మృతి చెందటంతో ఎన్నిక జరగలేదు. ► అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలం పెదపాలెంలో అభ్యర్థి మృతి చెందటంతో ఎన్నిక జరగలేదు. -
Guntur: ఫ్యాన్ ప్రభంజనం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ సీపీ మరోమారు ప్రభంజనం సృష్టించింది. పరిషత్ ఎన్నికల్లో జయభేరి మోగించింది. తనకు ఎదురు లేదని నిరూపించింది. ఫ్యాన్ ధాటికి తెలుగుదేశం పార్టీ చిత్తయింది. మొదటి నుంచి ఆ పార్టీకి కంచుకోటైన గుంటూరు జిల్లాలోనే సైకిల్ తుక్కుతుక్కు అయింది. 2019 సాధారణ ఎన్నికల నుంచి ప్రారంభమైన టీడీపీ పతనం పరిషత్ ఎన్నికలతో సంపూర్ణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పంచాయతీ, పురపాలకసంఘ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. జెడ్పీపై జయకేతనం జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ వైఎస్సార్ సీపీ క్లీన్స్వీప్ చేసింది. జిల్లా పరిషత్పై జయకేతనం ఎగురవేసింది. ఎంపీటీసీ స్థానాల్లోనూ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. ఒక్క దుగ్గిరాల తప్ప అన్ని మండల పరిషత్లనూ కైవసం చేసుకుంది. టీడీపీ సున్నా 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 23 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోగా, టీడీపీ 34 స్థానాలు గెలిచి జిల్లా పరిషత్ను గెలుచుకుంది. 2021కి వచ్చే సరికి సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నికలు జరిగిన, ఏకగ్రీవమైన మొత్తం 53 జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. టీడీపీ గుడ్డుసున్నాగా మిగిలిపోయింది. ఎన్నికలు జరిగిన, ఏకగ్రీవమైన మొత్తం 797 ఎంపీటీసీ స్థానాల్లో 709 వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, టీడీపీ 61కి పరిమితమైంది. జనసేన అభ్యర్థులు 11, ఒక స్థానంలో సీపీఐ అభ్యరి్థ, 15 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. అంతకు మించి.. ఇటీవల 973 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 768 వైఎస్సార్ సీపీ, 176 టీడీపీ, 17 జనసేన, 12 ఇతర అభ్యర్థులు చేజిక్కించుకున్నారు. 78.93శాతం సర్పంచ్ పదవులను అధికారపార్టీ దక్కించుకుంది. టీడీపీ 18.08 శాతానికి పరిమితమైంది. ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల్లో అంతకుమించి విజయాన్ని వైఎస్సార్ సీపీ దక్కించుకుంది. 88.83 శాతం స్థానాల్లో పాగా వేసింది. టీడీపీ 7.65 శాతానికి పడిపోయింది. మాచర్లలో క్లీన్ స్వీప్ మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ క్లీన్స్వీప్ చేసింది. మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలు ఉంటే ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కృషితో 70 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దుర్గి మండలం ధర్మవరం గ్రామంలోని ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక జరిగింది. ఇప్పుడు ఆ స్థానంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి అరిగల గోవిందమ్మ గెలుపొందడంతో మొత్తం క్లీన్ స్వీప్ చేసినట్టయింది. ఇదిలా ఉంటే మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి జెడ్పీటీసీ స్థానాలన్నీ గతంలోనే ఏకగ్రీవంగా వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్ను మించి జైత్ర యాత్ర -
ఫ్యాన్టాస్టిక్ విక్టరీ
అదే ఫ్యాన్ ఫాలోయింగ్.. మొన్న పంచాయతీ.. నిన్న మున్సిపాలిటీ.. నేడు పరిషత్.. ఎన్నిక ఏదైనా గెలుపు వైఎస్సార్ సీపీదే. సంక్షేమ యజ్ఞంతో ఉజ్వల భవితకు భరోసా ఇస్తున్న జగనన్న పాలనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే పరిషత్ ఎన్నికల్లో సై‘కిల్’ కాగా, గ్లాసు బీటలు తీసింది. కమలం మరీ వాడిపోయింది. టోటల్గా సార్వత్రిక ఎన్నికల సీన్ రిపీట్ అయింది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పరిషత్ పోరులోనూ పల్లె ప్రజలు వైఎస్సార్ సీపీకే బ్రహ్మరథం పట్టారు. జగన్ సంక్షేమ పాలనకు “జై’ కొట్టారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ఏకపక్ష గెలుపుతో వైఎస్సార్ సీపీ జిల్లాలో ప్రభంజనం సృష్టించింది. మెజారిటీ జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఆ పార్టీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. కడపటి వార్తలు అందేసరికి జిల్లాలోని దాదాపు అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడేలా ఓటర్లు తీర్పు ఇచ్చినట్టు స్పష్టమైంది. జిల్లా పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ అధిష్టించడం ఖాయమైపోయింది. మొత్తం 61 జెడ్పీటీసీలకు గానూ అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. ఫలితాలు వెల్లడి కావాల్సిన వాటిల్లో దాదాపు అన్నిచోట్లా విజయతీరాలకు దూసుకుపోతున్నారు. ఎన్నికలు జరిగిన 996 ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతం విజయాలతో వైఎస్సార్ సీపీ తిరుగులేని మెజార్టీ సాధించే దిశగా పయనిస్తోంది. ఎన్నికల కంటే ముందు ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాల్లో సైతం మెజార్టీ స్థానాలు (77) వైఎస్సార్ సీపీ పరమయ్యాయి. తిరుగులేని ఈ ఫలితాలు పార్టీ శ్రేణులకు బూస్ట్ అందించాయి. ఈ ఫలితాల ద్వారా ప్రభుత్వానికి జిల్లా ప్రజలు మరోసారి మద్దతుగా నిలిచినట్టయ్యింది. ప్రతి ఇంటా రెండు మూడు సంక్షేమ పథకాలు అందుకుంటున్నందుకు గానూ ప్రజలు ప్రభుత్వ రుణాన్ని ఓట్ల రూపంలో తీర్చుకున్నారు. తుని నియోజకవర్గంలో 63 ఎంపీటీసీ స్థానాలకు గానూ 60 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయఢంకా మోగించారు. రాజానగరం నియోజకవర్గంలో 57కు 50 చోట్ల ‘ఫ్యాన్’ గాలి హోరెత్తింది. అనపర్తిలో 76కు 68 చోట్ల, పెద్దాపురంలో 44కు 37 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. ‘ఫ్యాన్’కే మన్యసీమ మద్దతు పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నంటి నిలిచినట్టే ఈ ఎన్నికల్లో సైతం మన్యసీమ బిడ్డలు వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. ఏజెన్సీని ఆ పార్టీ కంచుకోటగా నిలిపారు. టీడీపీని మట్టి కరిపించారు. రాష్ట్ర విభజన తరువాత విలీన మండలాల్లో తొలిసారి పార్టీ పరంగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఆ మండలాల ప్రజలు వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టారు. ఇక్కడ నాలుగు మండలాలకు గానూ టీడీపీకి వీఆర్ పురం ఒక్కటే దక్కింది. కూనవరం, చింతూరు, ఎటపాక జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. డివిజన్ కేంద్రం రంపచోడవరం సహా గంగవరం, దేవీపట్నం, అడ్డతీగల, వై.రామవరం తదితర జెడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ పీఠాలను కూడా వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. కోనసీమలోనూ అదే ప్రభంజనం కోనసీమలో సైతం వైఎస్సార్ సీపీ ప్రభంజనమే కొనసాగుతోంది. అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గాల్లో 16 మండల పరిషత్లు, జెడ్పీటీసీ స్థానాల్లో దాదాపు అన్నింటా వైఎస్సార్ సీపీ దూసుకుపోతోంది. ఈ 16 మండలాల్లో మొత్తం 305 ఎంపీటీసీలకు 90 శాతం స్థానాల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసే దిశగా పరుగులు తీస్తోంది. మరోపక్క మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్, రామచంద్రపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అప్రతిహతంగా పయనిస్తోంది. కుప్పకూలిన ‘దేశం’ కంచుకోటలు తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోటలన్నీ వైఎస్సార్ సీపీ హోరుగాలిలో నిలవలేక పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఏజెన్సీ, కోనసీమ, మెట్ట అనే వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినప్పటికీ తెలుగు తమ్ముళ్లు జనసేనతో అపవిత్ర పొత్తు పెట్టుకుని బరిలో నిలిచారు. ఈ రెండు పార్టీలూ అంతర్గత ఒప్పందం చేసుకుని బరిలో దిగినా జిల్లా ప్రజలు మాత్రం వారి అపవిత్ర కలయికను చీల్చి చెండాడారు. టీడీపీలో కాకలు తీరిన యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వంటి నేతలు సైతం సొంత మండలాల్లో బోర్లా పడ్డారు. ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికి కోసం పాకులాడటం కనిపించింది. ఆ ఇద్దరు నేతలూ కనీసం ఒక్క జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాన్ని కూడా దక్కించుకోలేక చేతులెత్తేశారు. టీడీపీలో నంబర్–2గా పిలిపించుకునే యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగరంలో టీడీపీ కుప్పకూలిపోయింది. అక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి 1,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురంలో అన్నింటా వైఎస్సార్ సీపీ హవానే కొనసాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలైన తుని, రాజానగరం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, మండపేట నియోజకవర్గాల్లో సైతం ప్రజలు ఆ పార్టీని కూకటివేళ్లతో సహా పెకలించివేశారు. ఆయా నియోజకవర్గాల్లోని జెడ్పీటీసీ, అత్యధిక ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ జోరు కొనసాగింది. -
Visakhapatnam: విశాఖపట్నం జిల్లాలో వైఎస్సార్సీపీ హవా
రెండేళ్ల క్రితం మొదలైన వైఎస్సార్సీపీ ప్రభంజనం అదే హోరు.. అదే జోరుతో కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన అధికార పార్టీ.. పరిషత్ పోరులోనూ ప్రజల మద్దతుతో విజయ దుందుభి మోగించింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన రాజధాని విశాఖ జెడ్పీ పీఠంపై వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. జిల్లాలో మొత్తం 39 జెడ్పీటీసీ స్థానాలుండగా రెండు స్థానాలను మినహాయించి (ఒకటి ఏకగ్రీవం, మరొక స్థానంలో బరిలో ఉన్న అభ్యర్థి మరణించడంతో) 37 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకంగా 35 స్థానాలను అధికార వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకచోట టీడీపీ గెలువగా... మరో స్థానాన్ని సీపీఎం చేజిక్కించుకుంది. జిల్లా జెడ్పీ పీఠంపై ఎస్టీ మహిళ వైఎస్సార్సీపీ తరపున ఆసీనులు కానున్నారు. ఇక 39 మండలాల్లో 651 ఎంపీటీసీ స్థానాలకుగానూ 612 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పేపర్లు వర్షపు నీటితో దెబ్బతినడంతో ఒక స్థానంలో (పాకలపాడు) కౌంటింగ్ నిలిపివేయగా.... 611 స్థానాల్లో మాత్రమే లెక్కింపు జరిపారు. వీటిలో 450 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 118 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక బీజేపీ 6, సీపీఎం 3, కాంగ్రెస్ 2, సీపీఐ 2, జనసేన 2, స్వతంత్రులు 28 స్థానాల్లో గెలుపొందారు. వీటికి గతంలో వైఎస్సార్సీపీ ఖాతాలో పడిన 36 ఏకగ్రీవాలు కలుపుకుంటే ఆ పార్టీ అభ్యర్థులు మొత్తం 486 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. యలమంచిలి నియోజకవర్గంలోని అన్ని స్థానాలను వైఎస్సార్సీపీనే క్లీన్స్వీప్ చేసింది. ఆ నియోజకవర్గంలోని 4 జెడ్పీ స్థానాలతో పాటు 58 ఎంపీటీసీలూ ఆ పార్టీ ఖాతాలోకే చేరాయి. ఫలితంగా ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో టీడీపీకి కనీసం ప్రాతిని«థ్యమే లేకుండా పోయింది. ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహించిన నర్సీపట్నంతోపాటు మరో సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సొంత నియోజకవర్గం పెందుర్తిలోనూ ఆ పార్టీకి చావుదెబ్బ తగిలింది. ఒకవైపు జెడ్పీ పీఠాన్ని తిరుగులేని మెజార్టీతో దక్కించుకున్న వైఎస్సార్సీపీ.... అదే ఊపుతో అన్ని ఎంపీపీలనూ కైవసం చేసుకోనుంది. అయ్యన్న ఇలాకాలో...! మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహించిన నర్సీపట్నంలోనూ ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. అయితే, చావుతప్పి కన్నులొట్టపోయినట్టు 4 జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి దక్కించుకోగా... మిగిలిన మూడింటిలో వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. ఇక ఎంపీటీసీ స్థానాల్లో 58 స్థానాలకుగానూ 57లోనే కౌంటింగ్ జరిగింది. ఇందులో ఏకంగా 43 వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. టీడీపీ 14 స్థానాలకే పరిమితమయ్యింది. అంతేకాకుండా నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీలనూ వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. ఇక మరో టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తిలోనూ వైఎస్సార్సీపీనే విజయఢంకా మోగించింది. నియోజకవర్గంలోని 3 జెడ్పీలనూ వైఎస్సార్సీపీ గెలుపొందింది. 42 ఎంపీటీసీలలో... 34 స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో మరోసారి వైఎస్సార్సీపీకి తిరుగులేదని నిరూపితమైంది. ఇక యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ తరపున స్థానిక సంస్థల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాతినిథ్యం వహించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభావం చూపించని బీజేపీ, జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కేవలం సీపీఎం మాత్రమే ఒక జెడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీటీసీ స్థానాల్లో కూడా బీజేపీ–6, జనసేన–2 సీపీఎం–3, సీపీఐ–2, కాంగ్రెస్–2 స్థానాలకే పరిమితమయ్యాయి. అయితే, ఈ పార్టీలన్నింటికీ కలుపుకుని 15 ఎంపీటీసీలు రాగా..... స్వతంత్ర అభ్యర్థులు 28 ఎంపీటీసీలను చేజిక్కించుకోవడం గమనార్హం. ఉదయం నుంచే కౌంటింగ్....! ఈ ఎన్నికల్లో 5,76,725 మంది పురుషులు, 5,96,872 మంది మహిళలు (మొత్తం 11,73,601 మంది) ఓటింగులో పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ను 1,282 మంది అధికారులు పర్యవేక్షించగా, 3,573 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. మొత్తం 39 కేంద్రాల్లో కౌంటింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. కౌంటింగ్ పర్యవేక్షణకు ఎన్నికల సంఘం నియమించిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్తో పాటు కలెక్టర్ ఎ.మల్లికార్జున ఉదయం నుంచే కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా కౌంటింగ్ సాగేలా చూశారు. పాకలపాడులో కౌంటింగ్ నిలిపివేత పాకలపాడు ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికకు కౌంటింగ్ నిలిపివేశారు. బ్యాలెట్ బాక్సులోకి వర్షపునీరు చేరి బ్యాలెట్ పేపరు దెబ్బతినడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. ఇక గొలుగొండ జెడ్పీ స్థానంలో వైఎస్సార్సీపీకి 6,900 మెజార్టీ ఉంది. అయితే, ఇంకా ఓట్లు లెక్కించాల్సిన బ్యాలెట్ బాక్సులో కేవలం 1,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మెజార్టీ లెక్కించాల్సిన ఓట్ల కంటే ఎక్కువగా ఉండటంతో ఈ స్థానం వైఎస్సార్సీపీ ఖాతాలో చేరింది. పీఠం నుంచి పాతాళానికి...! వాస్తవానికి విశాఖపట్నం జిల్లాలో గతంలో టీడీపీ ఆధిపత్యం సాగించేది. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 39 జెడ్పీ స్థానాల్లో 25 చోట్ల టీడీపీ గెలుపొందగా, 14 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ పీఠాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. ఏడేళ్ల తర్వాత జరిగిన స్థానిక పోరులో టీడీపీ 25 స్థానాల నుంచి కేవలం ఒకే ఒక స్థానానికే పరిమితమైపోయింది. ఎంపీటీసీ స్థానాల్లోనూ.. 2014లో 341 స్థానాలు రాగా ఇప్పుడు 118 స్థానాలకు పరిమితమైపోయింది. మరోవైపు కొన్ని స్థానాల్లో కనీసం రెండో స్థానంలో కూడా టీడీపీ నిలువలేకపోయింది. పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. టీడీపీ నేతలు వారి అధినేత నిర్ణయానికి అనుగుణంగా అమరావతికే మద్దతు పలికారు తప్ప విశాఖపట్నానికి అనుకూలంగా ఒక్కమాట మాట్లాడలేదు. అంతేకాకుండా రోజుకు ఒకటి చొప్పున టీడీపీ నేతల అవినీతి వ్యవహారం బయటకు వస్తుండటంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకతనే ఇప్పుడు ఓట్ల రూపంలో వారి చెంప చెళ్లుమనిపించారని అర్థమవుతోంది. -
ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్: జిల్లాల వారీగా ఫలితాలు
AP MPTC, ZPTC Election Results: ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అధిక్యంలో ఉంది. జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సమాచారం.. ► విశాఖపట్నం: విశాఖపట్నం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(39) ఎంపీటీసీ( 651) వైఎస్సార్సీపీ 36 452 టీడీపీ 1 114 బీజేపీ 5 ఇతరులు 1 32 ► తూర్పు గోదావరి: తూర్పు గోదావరి ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(61) ఎంపీటీసీ( 1086) వైఎస్సార్సీపీ 57 712 టీడీపీ 1 61 బీజేపీ 42 ఇతరులు 1 8 ► పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(48) ఎంపీటీసీ( 863) వైఎస్సార్సీపీ 45 642 టీడీపీ 1 80 బీజేపీ 3 ఇతరులు 1 50 ► కృష్ణా: కృష్ణా ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(46) ఎంపీటీసీ( 723) వైఎస్సార్సీపీ 42 630 టీడీపీ 1 64 బీజేపీ 11 ఇతరులు 6 ► గుంటూరు : గుంటూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(54) ఎంపీటీసీ( 805) వైఎస్సార్సీపీ 53 704 టీడీపీ - 62 బీజేపీ 0 ఇతరులు 23 ► ప్రకాశం: ప్రకాశం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(55) ఎంపీటీసీ( 742) వైఎస్సార్సీపీ 55 649 టీడీపీ - 62 బీజేపీ 3 ఇతరులు 13 ► నెల్లూరు: నెల్లూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(46) ఎంపీటీసీ( 554) వైఎస్సార్సీపీ 46 494 టీడీపీ - 33 బీజేపీ 2 ఇతరులు 18 ► చిత్తూరు: చిత్తూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(65) ఎంపీటీసీ( 841) వైఎస్సార్సీపీ 63 817 టీడీపీ - 37 బీజేపీ 0 ఇతరులు 6 ► వైఎస్సార్: వైఎస్సార్ ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(50) ఎంపీటీసీ( 858) వైఎస్సార్సీపీ 47 520 టీడీపీ 1 16 బీజేపీ 8 ఇతరులు 5 ► కర్నూలు: కర్నూలు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(53) ఎంపీటీసీ( 796) వైఎస్సార్సీపీ 52 672 టీడీపీ - 99 బీజేపీ 5 ఇతరులు 14 ► అనంతపురం: అనంతపురం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(63) ఎంపీటీసీ( 804) వైఎస్సార్సీపీ 61 742 టీడీపీ 1 47 బీజేపీ 1 ఇతరులు 1 14 ► శ్రీకాకుళం : శ్రీకాకుళం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(38) ఎంపీటీసీ( 667) వైఎస్సార్సీపీ 37 562 టీడీపీ - 76 బీజేపీ 2 ఇతరులు 10 ► విజయనగరం : విజయనగరం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(34) ఎంపీటీసీ( 549) వైఎస్సార్సీపీ 34 445 టీడీపీ - 85 బీజేపీ 2 ఇతరులు 10 -
Live: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రజా తీర్పు
AP Local Body Elections Results Live Updates: -
ఆ 23 మంది గెలిస్తే అక్కడ మళ్లీ ఎన్నికలే
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘకాలంపాటు జరిగినందువల్ల రాష్ట్రంలోని పలుచోట్ల ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం జరగనున్న ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఓ 23 మంది అభ్యర్థులు గెలిచినా ఆ స్థానాల్లో మళ్లీ ఎన్నిక జరగడం అనివార్యం. ఎందుకంటే.. ఆయాచోట్ల వారు మరణించడమే కారణం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసినా హైకోర్టు తీర్పు కారణంగా ఓట్ల లెక్కింపు ఐదున్నర నెలలపాటు నిలిచిపోయింది. ఈ కాలంలో పోలింగ్ జరిగిన పలు స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 23 మంది మరణించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు నిర్ధారించారు. నేడు 'పరిషత్' ఫలితాలు ఎంపీటీసీ స్థానాల్లో పోటీచేసిన వారు 20 మంది మరణించగా.. జెడ్పీటీసీ స్థానాలలో పోటీచేసిన అభ్యర్థులు ముగ్గురు మరణించారు. దీంతో.. ఈ స్థానాల్లో మరణించిన అభ్యర్థులు గెలుపొందితే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయ వివరణ కోరుతూ ఆయా జిల్లాల అధికారులు లేఖ రాశారు. ఇందుకు కమిషన్ స్పందిస్తూ.. ఒకవేళ మృతిచెందిన అభ్యర్థులు విజయం సాధిస్తే ఆ ఫలితాన్ని వెల్లడించి, తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిన స్థానాల జాబితాలో ఆ స్థానాలను చేర్చాలని అధికారులు స్పష్టంచేశారు. ఇక నామినేషన్ల ఘట్టానికి, పోలింగ్ ప్రక్రియ మధ్య కూడా ఏడాదిపాటు ఖాళీ ఏర్పడింది. ఈ సమయంలో మరణించిన వారి స్థానాల్లోనూ పోలింగ్ను నిలుపుదల చేశారు. -
AP MPTC, ZPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
లైవ్ అప్డేట్స్.. రాష్ట్రవ్యాప్తంగా 637 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 627 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 8,075 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. ఇప్పటివరకు వెల్లడైన ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఇలా ఉన్నాయి. కృష్ణా: 648 ఎంపీటీసీ స్థానాల్లో 568 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపు. ప్రకాశం: 784 ఎంపీటీ\సీ స్థానాల్లో 668 చోట్ల వైఎస్సార్సీపీ విజయకేతనం నెల్లూరు: 562 ఎంపీటీసీ స్థానాల్లో 400 వైఎస్సార్సీపీ 312 సొంతం చేసుకుని తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 998 స్థానాల్లో 538 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. పశ్చిమ గోదావరి: 781 స్థానాల్లో 577 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్టణం: 612 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ 450 గెలుచుకుంది. విజయనగరం: 549 ఎంపీటీసీ స్థానాల్లో 433 వైఎస్సార్సీపీ కైవసం శ్రీకాకుళం: 668 ఎంపీటీసీ స్థానాల్లో 562 వైఎస్సార్సీపీ గెలుపు. వైఎస్సార్ కడప: 549 స్థానాల్లో 433 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. అనంతపురం: 841 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 763 సొంతం చేసుకుంది. చిత్తూరు: 886 ఎంపీటీసీ స్థానాల్లో 822 సొంత చేసుకుని వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. కర్నూలు: 807 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 718 గెలుపొందింది. రాష్ట్రవ్యాప్తంగా 412 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 404 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 5,462 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ పీఠం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. 48 స్థానాల్లో ఇప్పటికే 35 స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. ఎంపీటీసీ ఇప్పటివరకు 6,242 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5,273 స్థానాలు కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. జెడ్పీటీసీ ఇక జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 354 స్థానాల ఫలితాలు ప్రకటించారు. వీటిలో 348 జెడ్పీటీసీలను సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల జెడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. నాలుగు టీడీపీకి, రాగా ఒకటి సీపీఐ, స్వతంత్రుడు మరొకరు గెలిచారు. కోనసీమలోనూ వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతోంది. వెలువడుతున్న ఎన్నికల ఫలితాలన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడుతున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను సొంతం చేసుకుంటోంది. విజయనగరం: నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల సరసన విజయనగరం చేరింది. విజయనగరంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 34 జెడ్పీటీసీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. వైఎస్సార్ కడప జిల్లా: కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలకు 46 వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లా: ప్రకాశంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని 56 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. చిత్తూరు జిల్లా: జెడ్పీ ఎన్నికలతో పాటు మండల పరిషత్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యత ప్రదర్శించింది. చిత్తూరు జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 822 సొంతం చేసుకుని విజయదుంధుబి మోగించింది. కాగా టీడీపీ కేవలం 25 స్థానాల్లో గెలిచింది. ఈ విజయంతో వైఎస్సార్సీపీ 65 మండల పరిషత్లను సొంతం చేసుకుంది. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్. ఆయా జిల్లాల్లోని ఉన్న జెడ్పీటీసీ స్థానాలన్నింటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైఎస్సార్సీపీ సొంతం. గుంటూరు: 54 జెడ్పీటీసీ స్థానాల్లో 27 వైఎస్సార్సీపీ విజయం ప్రకాశం: 56 స్థానాల్లో 56 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. విశాఖపట్టణం: 39 స్థానాల్లో 30 వైఎస్సార్సీపీ గెలుపు విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వైఎస్సార్సీపీ కైవసం అనంతపురం: 63 స్థానాల్లో 35 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ చిత్తూరు: 63 జెడ్పీటీసీ స్థానాల్లో 63 వైఎస్సార్సీపీ విజయం వైఎస్సార్ కడప: 50 స్థానాల్లో 44 గెలిచిన వైఎస్సార్సీపీ కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీలకు 5 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. పశ్చిమ గోదావరి: 48 జెడ్పీటీసీ స్థానాల్లో 32 వైఎస్సార్సీపీ కైవసం. జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 186 జెడ్పీటీసీ ఫలితాలు రాగా 184లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్లలో 11 జెడ్పీలు కైవసం చేసుకుంది. 144 జెడ్పీటీసీ స్థానాల్లో 142 వైఎస్సార్సీపీ సొంతం విజయనగరం జిల్లా: శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుపేట జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం: ముదిగుబ్బ జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం గుంతకల్లు నియోజకవర్గం: గుత్తిలో జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం కృష్ణాజిల్లా: పెడన నియోజకవర్గం కృత్తివెన్ను జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం. పశ్చిమ గోదావరి: ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం శ్రీకాకుళం: చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం శ్రీకాకుళం: పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ప్రకాశం: కందుకూరు గుడ్లూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ గెలుపు ఆమడగూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ఓబులదేవచెరువు వైఎస్సార్సీపీ విజయం కొత్తచెరువు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం నల్లమాడ జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం బుక్కపట్నం వైఎస్సార్సీపీ సొంతం అనంతపురం: దర్శి నియోజకవర్గం కురిచేడు వైఎస్సార్సీపీ విజయం. చిత్తూరు: జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్సార్ పురం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్ రెడ్డి విజయం. వైఎస్సార్ కడప: రాజంపేట నియోజకవర్గం నందలూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ వశం. కర్నూలు: శ్రీశైలం నియోజకవర్గం మహానంది జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ సొంతం. విశాఖపట్టణం: అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. విశాఖపట్టణం: పాడేరు నియోజకవర్గం పాడేరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం. ►అనంతపురం: పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 8,856 ఓట్ల మెజార్టీతో శ్రీరాములు గెలుపొందారు. పెనుగొండ నియోజకవర్గం సోమందేవపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 4,348 ఓట్ల మెజార్టీతో డీసీ అశోక్ గెలుపు పొందారు. ►ఇప్పటివరకు 3129 ఎంపీటీసీ ఫలితాలు వైఎస్సార్సీపీ-2773, టీడీపీ-267, బీజేపీ-7 విశాఖపట్నం: యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 16,097 ఓట్ల మెజార్టీతో ధూళి నాగరాజు గెలుపొందారు. విశాఖ: అరకు నియెజకవర్గం పెదబయలు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 500 ఓట్ల మెజార్టీతో బొంజుబాబు గెలుపొందారు. ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గం యర్రగొండపాలెం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 12,906 ఓట్ల మెజార్టీతో విజయభాస్కర్ గెలుపొందారు. చిత్తూరు జిల్లా: మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 5,464 ఓట్ల మెజార్టీతో ప్రమీలమ్మ గెలుపొందారు. మదనపల్లి నియోజకవర్గం రామ సముద్రం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 9, 875 ఓట్ల మెజార్టీతో సీహెచ్ రామచంద్రారెడ్డి గెలుపొందారు. విజయనగరం: గజపతినగరం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 17,971 ఓట్ల మెజార్టీతో గార తవుడు గెలుపొందారు. అనంతపురంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఆత్మకూరు మండలం ముట్టాల ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించారు. 65 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పుణ్యశ్రీ విజయం సాధించారు. దాంతో టీడీపీ నేతలు వాదనకు దిగారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో వైఎస్సార్సీపీ విజయం పామర్రు మండలం నిమ్మకూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. నిమ్మకూరును నారా లోకేష్ దత్తత తీసుకోగా, ఆయనను ప్రజలు విశ్వసించలేదు. చరిత్రలో తొలిసారి పామర్రు ఎంపీపీని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. వైఎస్సార్సీపీ ప్రభంజనం చిత్తూరు: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్రెడ్డి గెలుపొందారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 6,758 ఓట్ల మెజార్టీతో అన్బలగన్ గెలుపొందారు. చంద్రబాబుకు షాక్.. పరిషత్ ఎన్నికల్లో నారావారిపల్లిలో చంద్రబాబుకు షాక్ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ►ఇప్పటివరకు 1562 ఎంపీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్సార్సీపీ 1399, టీడీపీ 120, బీజేపీ 7. ►వైఎస్సార్జిల్లా పరిషత్ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 50కిగాను ఇప్పటివరకు 40 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ప్రకాశం: త్రిపురాంతకం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 10,930 ఓట్ల మెజార్టీతో మాకం జాన్పాల్ గెలుపొందారు. ప్రకాశం: కొనకనమిట్ల జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 16,681 ఓట్ల మెజార్టీతో అక్కి దాసరి ఏడుకొండలు గెలుపు ప్రకాశం: గుడ్లూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 11,464 ఓట్ల మెజార్టీతో కొరిసిపాటి బాపిరెడ్డి గెలుపు ప్రకాశం: కురిచేడు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 5,930 ఓట్ల మెజార్టీతో వెంకట నాగిరెడ్డి గెలుపు ►పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఫ్యాన్ దూసుకుపోతోంది. అనేక చోట్ల సింగిల్ డిజిట్కే టీడీపీ పరిమితమైంది. ►వైఎస్సార్ జిల్లా: నందలూరు జడ్పీటీసీ వైఎస్సార్ కైవసం చేసుకుంది. 20,849 ఓట్ల మెజార్టీతో గడికోట ఉషారాణి విజయం సాధించారు. ►కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 202 ఎంపీటీసీ ఫలితాలు.. మిగిలిన 282 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్ వైఎస్సార్సీపీ-184, టీడీపీ-15 బీజేపీ-1, ఇతరులు-2 ►వైఎస్సార్ జిల్లాలో ఇప్పటివరకు 20 ఎంపీటీసీ ఫలితాలు దేవినేని ఉమా ఇలాకాలో వైఎస్సార్సీపీ హవా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. విజయవాడ: దేవినేని ఉమా ఇలాకాలో వైఎస్సార్సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్సీ కైవసం చేసుకుంది. ►వైఎస్సార్ జిల్లా: రాజుపాలెం మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం. ►విజయనగరం: మెరముడిదం మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్. 16 ఎంపీటీసీలకు 16 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ►అనంతపురం: తాడిమర్రి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం. ►చిత్తూరు: నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం ►ప్రకాశం: మర్రిపూడి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్. 11 ఎంపీటీసీ స్థానాలకు 11 వైఎస్సార్సీపీ కైవసం ►ప్రకాశం: మార్కాపురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 15,315 మెజార్టీతో వైఎస్సార్సీ అభ్యర్థి బాపన్నరెడ్డి విజయం సాధించారు. ►విశాఖపట్నం: 45 ఓట్ల మెజార్టీతో జీకే వీధి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►ప్రకాశం: తుర్లుపాడు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 10,335 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్న ఇందిర గెలుపు పొందారు. ►ప్రకాశం: జిల్లాలో రెండు జడ్పీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం ►చిత్తూరు: ఎస్ఆర్పురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్రెడ్డి గెలుపొందారు. ►కర్నూలు: మహానంది జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 13,288 ఓట్ల మెజార్టీతో కేవీఆర్ మహేశ్వర్రెడ్డి గెలుపు పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా చిత్తూరు: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు పొందారు. 1073 ఓట్ల మెజార్టీతో టీ.సదుం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపొందారు. ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. రాత్రి లోపు పూర్తిస్థాయి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఐదారు చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు చేరాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు పూర్తిగా తెరిచాక స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ►విజయనగరం: 44 ఓట్ల మెజార్టీతో గంజాయి భద్ర ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 1331 ఓట్ల మెజార్టీతో వెన్న పూసపల్లి ఎంపీపీటీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా జిల్లా: 180 ఓట్ల మెజార్టీతో పాములంక ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా: 585 ఓట్ల మెజార్టీతో ఆటపాక ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►విజయనగరం: 1629 ఓట్ల మెజార్టీతో ఉత్తరవల్లి ఎంపీటీసీ( వైఎస్సార్సీపీ) గెలుపు) ►ప్రకాశం: 1645 ఓట్ల మెజార్టీతో సంతమాగులూరుఏ-1 ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►ప్రకాశం: 434 ఓట్ల మెజార్టీతో ఊళ్లపాలెం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ గుంటూరు: మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. ఐదు జీడ్పీటీసీ స్థానాలకు ఐదూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. బాబు ఇలాకాలో ఫ్యాన్ గాలి.. చిత్తూరు జిల్లా: చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ గాలి వీచింది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ►విజయనగరం: పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. సీతానగరం మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 ఎంపీటీసీ స్థానాల్లో 5 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►పశ్చిమగోదావరి: 613 ఓట్ల మెజార్టీతో శ్రీరామపురం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపలల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా: 372 ఓట్ల మెజార్టీతో అక్కపాలెం ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►చిత్తూరు: 616 ఓట్ల మెజార్టీతో పాత వెంకటాపురం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 883 ఓట్ల మెజార్టీతో ఊటుకురు-2 ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 882 ఓట్ల మెజార్టీతో దంచర్ల ఎంపీటీసీ( వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 729 ఓట్ల మెజార్టీతో అమ్మలదిన్నె ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►చిత్తూరు: 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: రామగిరి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: బంటుపల్లి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►పశ్చిమగోదావరి: జీలుగుమిల్లి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►కృష్ణా: పెడన జడ్పీటీసీ పోస్టల్బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ►నెల్లూరు: 766 ఓట్ల మెజార్టీతో ఆమంచర్ల ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►పశ్చిమగోదావరి: వేలేరుపాడు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►నెల్లూరు: కలిగిరి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►అనంతపురం: కనగాపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మారుతి ప్రసాద్ ఆధిక్యం ఉరవకొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పార్వతమ్మ ఆధిక్యం తనకల్లు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి జక్కల జ్యోతి ఆధిక్యం పెద్దవడుగూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి భాస్కర్రెడ్డి ముందంజ కంబదూరు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: కమలాపురం మండలం దేవరాజుపల్లి దేవరాజుపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపొందారు. 186 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు. ►విజయనగరం: జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 31 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఆన్లైన్ ద్వారా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ►పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్ పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. ►ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. 515 జడ్పీటీసీ, 7216 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. ► 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన వారి భవితవ్యం తేలబోతోంది. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు. జిల్లాల వారీగా.. శ్రీకాకుళం: 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ విజయనగరం: 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ విశాఖపట్నం: 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ తూర్పు గోదావరి: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ పశ్చిమ గోదావరి: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ కృష్ణా: 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ గుంటూరు : 45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ స్థానాలకుకౌంటింగ్ నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకుకౌంటింగ్ చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ వైఎస్సార్: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ కర్నూలు: 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ అనంతపురం: 62 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఆదివారం వెల్లడి కాబోతున్నాయి. 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన ఏడాదిన్నర తర్వాత నేడు వారి భవితవ్యం తేలబోతోంది. ఏప్రిల్ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. చదవండి: ఆ 23 మంది గెలిస్తే అక్కడ మళ్లీ ఎన్నికలే మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్ బెంచ్ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 44,155 మంది సిబ్బంది పని చేయనున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ► ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ► ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు. చదవండి: 30 వరకు నైట్ కర్ఫ్యూ ఐదున్నర నెలల తర్వాత.. బ్యాలెట్ బాక్స్లు దాచి ఉంచిన స్ట్రాంగ్ రూంలను పోలింగ్ జరిగిన ఐదు నెలల తర్వాత తెరవనున్నారు. దీంతో మొదట బ్యాలెట్ బాక్స్లు శుభ్రం చేసుకోవడం వంటి కారణాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నీర్ణీత సమయం కంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు బ్యాలెట్ పేపరు ద్వారా ఎన్నికలు కావడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి దాదాపు అన్ని చోట్ల ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని.. జెడ్పీటీసీ ఫలితాలు మాత్రం రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల వర్గాలు పేర్కొన్నాయి. అన్ని జాగ్రత్తల మధ్య కౌంటింగ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచించిన మేరకు పూర్తి స్థాయిలో కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ.. ఓట్ల లెక్కింపునకు తగిన రక్షణ ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. అభ్యర్థి, కౌంటింగ్ ఏజెంట్లు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినట్లు ధృవీకరణ పత్రం చూపాలి. లేదా ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్/ఆర్టీపీసీఆర్ టెస్ట్లో నెగటివ్ ఉంటేనే లెక్కింపు కేంద్రం లోపలికి అనుమతిస్తామని ఇప్పటికే తెలిపాం. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. 13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి 13 మంది అధికారులను నియమించాం. – గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి -
గ్రహణం వీడింది: సజ్జల
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై తాజాగా హైకోర్టు ఆదేశాలతో దీర్ఘకాలంగా ప్రజా తీర్పునకు పట్టిన గ్రహణం వీడినట్లయిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018లో సర్పంచ్ ఎన్నికలు, 2019లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా గత సర్కార్ నిర్వహించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాక టీడీపీ కార్యాలయం సూచనల మేరకే 2020 మార్చి 15న నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ కరోనా సాకుతో ఏకపక్షంగా వాయిదా వేశారని చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ఆరు రోజుల ముందు కరోనా ప్రభావం లేకున్నా నిమ్మగడ్డ కావాలనే వాయిదా వేసినట్టు తెలిపారు. అజెండాలో లేకున్నా ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను ముందుకు తెచ్చి టీడీపీపై కృతజ్ఞత చాటుకుని నిమ్మగడ్డ పదవీ విరమణ చేసి వెళ్లిపోయారన్నారు. చంద్రబాబే దోషి.. ఈ ఎన్నికల ప్రక్రియలో జరిగిన పరిణామాలన్నింటికీ చంద్రబాబే దోషి అని సజ్జల స్పష్టం చేశారు. వ్యవస్థల్లో సాంకేతిక లొసుగులను అడ్డు పెట్టుకుని పార్టీ నేతలతో పిటిషన్లు దాఖలు చేయించడం వల్ల ఏప్రిల్లో పూర్తి కావాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటిదాకా కొనసాగిందన్నారు. దాదాపు 6 నెలలపాటు ఓట్ల లెక్కింపు జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. విజ్ఞులు, సామాజికవేత్తలు, మేధావులు ఈ అంశంపై ఆలోచించాలని కోరారు.ఎన్నికల ప్రక్రియను ఏళ్ల తరబడి ఆపగలగడాన్ని అంగీకరించాలా? అని ప్రశ్నించారు. దిశ బిల్లు ప్రతులను లోకేశ్ తగలబెట్టడం ఆయన మానసిక స్థితికి నిదర్శమన్నారు. పింఛన్లపై దుష్ప్రచారం పేదరిక నిర్మూలనకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ, దాని అనుకూల మీడియా దుష్ప్రచారాన్ని అడ్డుకుని ప్రజలకు వాస్తవాలను తెలియచేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి, బోయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదనరావు అధ్యక్షతన నిర్వహించిన వాల్మీకి, బోయ కులస్తుల ఆత్మీయ సమావేశానికి సజ్జల హాజరయ్యారు. చంద్రబాబు హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇవ్వగా సీఎం జగన్ ఆ సంఖ్యను 60 లక్షలకు పెంచారని చెప్పారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండూ ఓసీలకు రిజర్వ్ అయిన మండలాల్లో ఒకటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు. బీసీలు ఇతర కులాలకు కూడా నాయకత్వం వహించేలా సీఎం జగన్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సజ్జల సూచించారు. సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదే ఆనాడు వాల్మీకి రామాయణాన్ని రచిస్తే, సీఎం జగన్ పేదల జీవితాలు బాగు చేసే కార్యక్రమాలను రూపొందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బోయ, వాల్మీకి కులానికి చేసిన వాగ్దానాలను సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారని కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు. వాల్మీకి, బోయ కులస్తుల అభివృద్ధికి సీఎం జగన్ పలు పథకాలను అమలు చేస్తున్నారని ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. బీసీ కులాల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు నెలలుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాల్మీకిలు బీసీలుగా మరికొన్ని చోట్ల ఎస్టీలుగా ఉన్నారని, దీన్ని సరి దిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సమావేశంలో నవరత్నాలు నారాయణమూర్తి, వాల్మీకి, బోయ కార్పొరేషన్ డైరెక్టర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు. -
MPTC, ZPTC Elections: కౌంట్డౌన్!
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ శుక్రవారం కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీనే ఎన్నికలు జరిగినప్పటికీ న్యాయ వివాదాలతో కౌంటింగ్ ప్రక్రియ వాయిదా పడింది. దాదాపు ఆరు నెలల అనంతరం గురువారం ఉదయం హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు అనుమతించడంతో 19వ తేదీన కౌంటింగ్ జరపనున్నట్టు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం వరుసగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో పరిషత్ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్ జారీ అయి ఇప్పటికి ఏడాదిన్నర దాటిపోయింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం 2020 మార్చి 21వ తేదీన ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి అదే ఏడాది మార్చి 24న కౌంటింగ్ పూర్తి చేయాలి. కానీ నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిపోయి అభ్యర్ధుల తుది జాబితా ఖరారైన తర్వాత అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ కరోనా పేరుతో మార్చి 15వ తేదీన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే పరిషత్ ఎన్నికలు జరపకుండా కాలయాపన చేశారనే విమర్శలున్నాయి. అనంతరం నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి 8వ తేదీన ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. -
AP: 19న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈనెల 19వ తేదీన ‘పరిషత్’ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి అదేరోజు ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్ఈసీ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 18వతేదీ సాయంత్రం ఐదు గంటలలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఆర్వోలకు అందచేయాలని సూచించారు. చదవండి: గ్రహణం వీడింది: సజ్జల ఆ వ్యాఖ్యలపై ఆక్షేపణ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అంతకుముందు ఉదయం హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని, ఫలితాలను వెల్లడించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఈ ఏడాది మే 21న ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం రద్దు చేసింది. ఈ తీర్పులో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ఆక్షేపించింది. అలాంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం అవసరం లేదని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసినందున, ఆ తీర్పులోని వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని దాఖలు చేసిన అప్పీల్ను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జవలాకర్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. చదవండి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ ఏడాది ఆగస్టు 1న ఎన్నికల కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ పోటీ చేసే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించలేదనడం అర్థం కాకుండా ఉందని తీర్పులో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ నోటిఫికేషన్ రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులందరికీ వర్తిస్తున్నప్పుడు అది ఏ రకంగా అభ్యర్థుల హక్కులను హరిస్తుందో అర్థం కావడం లేదంది. వాస్తవానికి జనసేన నేత అభ్యర్థన ఎన్నికలను ఎక్కడ ఆపారో ఆ దశ నుంచి కాకుండా తిరిగి మొదటి నుంచి పెట్టాలన్నదేనని, అయితే ఈ అభ్యర్థనను సింగిల్ జడ్జి తన తీర్పులో తిరస్కరించారని ధర్మాసనం తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల నియామావళిని అమలు చేయాలన్న వర్ల రామయ్య అభ్యర్థనను జనసేన నేత వ్యాజ్యంలో పరిగణలోకి తీసుకున్నారని అనుకున్నా.. ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారని సింగిల్ జడ్జి పేర్కొనడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా, ఎన్నికలను నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై వెంటనే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయడాన్ని సింగిల్ జడ్జి తన తీర్పులో తప్పుపట్టారని, ఇది ఎంత మాత్రం సరికాదని ధర్మాసనం తెలిపింది. చట్టబద్ధంగా అప్పీల్ దాఖలు చేసినప్పుడు దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదని సూచించింది. ‘సుప్రీం’ ఆదేశాలను పాటించినట్లే ఎన్నికల నిర్వహణకు నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలు చేశారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను సంతృప్తిపరచడమే అవుతుందని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఆదేశమే తప్ప, ప్రతీ ఎన్నికకు 4 వారాల ముందు నియమావళిని అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం కాదని పేర్కొంది. పిటిషన్లో ప్రస్తావించకున్నా.. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయనప్పుడు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు తన వ్యాజ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన గురించి కనీసం ఎలాంటి అభ్యర్థన చేయలేదని తెలిపింది. అయినప్పటికీ సింగిల్ జడ్జి తన తీర్పులో ఎన్నికల నియమావళి ఉల్లంఘనను జనసేన ప్రస్తావించిందని, నియమావళిని అమలు చేయకపోవడం వల్ల పోటీ చేసే అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగినట్లు నిరూపించారని అందులో పేర్కొన్నారని ధర్మాసనం తెలిపింది. సింగిల్ జడ్జి తన తీర్పులో పేర్కొన్న విషయాలను జనసేన నేత తన పిటిషన్లో ప్రస్తావించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఏలూరు కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం
లైవ్ అప్డేట్స్ వైఎస్సార్సీపీ ప్రభంజనం ►ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఏలూరు కార్పొరేషన్ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఏలూరు మేయర్ పీఠం వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 50 డివిజన్ల ఫలితాలు వెల్లడికాగా, 47 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ► 1వ డివిజన్ ఎ.రాధిక (వైఎస్సార్సీపీ) విజయం ►2వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి నరసింహారావు గెలుపు, 787 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం. ► 3వ డివిజన్ బి.అఖిల (వైఎస్సార్సీపీ) విజయం ► 4వ డివిజన్ డింపుల్ (వైఎస్సార్సీపీ) విజయం, 744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు ► 5వ డివిజన్ జయకర్ (వైఎస్సార్సీపీ) విజయం, 865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం ► 10వ డివిజన్ పైడి భీమేశ్వరరావు (వైఎస్సార్సీపీ) గెలుపు, 812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం ► 11వ డివిజన్ కోయ జయగంగ (వైఎస్సార్సీపీ) గెలుపు, 377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం ► 12వ డివిజన్ కర్రి శ్రీను (వైఎస్సార్సీపీ) గెలుపు, 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం ► 17వ డివిజన్ టి.పద్మ (వైఎస్సార్సీపీ) విజయం, 755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు ► 18వ డివిజన్ కేదారేశ్వరి (వెస్సార్సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు ► 19వ డివిజన్ వై.నాగబాబు (వెస్సార్సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం ► 22వ డివిజన్ సుధీర్బాబు (వైఎస్సార్సీపీ) గెలుపు ► 23వ డివిజన్ కె.సాంబ (వైఎస్సార్సీపీ) విజయం, 1823 ఓట్ల మెజార్టీతో కె.సాంబ గెలుపు ► 24వ డివిజన్ మాధురి నిర్మల (వైఎస్సార్సీపీ) గెలుపు, 853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం ► 25వ డివిజన్ గుడుపూడి శ్రీను (వైఎస్సార్సీపీ) గెలుపు ►26వ డివిజన్ అద్దంకి హరిబాబు(వైఎస్సార్సీపీ) గెలుపు, 1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం ► 31వ డివిజన్ లక్ష్మణ్ (వైఎస్సార్సీపీ) విజయం, 471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు ► 32వ డివిజన్ సునీత రత్నకుమారి (వైఎస్సార్సీపీ) గెలుపు ► 33వ డివిజన్ రామ్మోహన్రావు (వైఎస్సార్సీపీ) విజయం, 88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్రావు గెలుపు ►36వ డివిజన్ హేమ సుందర్ (వైఎస్సార్సీపీ) విజయం ►38వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు ►39వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం ►40వ డివిజన్ టి.నాగలక్ష్మి (వైఎస్సార్సీపీ) గెలుపు, 758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం ► 41వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి కల్యాణి విజయం, 547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం ► 42వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం ► 43వ డివిజన్ జె.రాజేశ్వరి (వైఎస్సార్సీపీ) గెలుపు ► 45వ డివిజన్ ముఖర్జీ (వైఎస్సార్సీపీ) గెలుపు, 1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం ► 46వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ప్యారీ బేగం విజయం, 1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు ► 48వ డివిజన్ స్వాతి శ్రీదేవి (వైఎస్సార్సీపీ) విజయం, 483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు ►50వ డివిజన్ షేక్ నూర్జహాన్ (వైఎస్సార్సీపీ) విజయం, 1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు ► 26 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ ► 50వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి షేక్ నూర్జహాన్ ఆధిక్యం ►ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా ►20 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ ►41వ డివిజన్లో వైఎస్సార్సీపీఅభ్యర్ధి కల్యాణి విజయం ► 8వ డివిజన్లో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ► 2,10, 31, 33, 36, 39, 45, 46, 47 డివిజన్లలో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ► ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ► 50 పోస్టల్ బ్యాలెట్లలో పోలైన ఓట్లు 15, ► వైఎస్సార్సీపీ- 11, చెల్లనవి- 2, నోటా-1, టీడీపీ-1 ► ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ► తొలుత 50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్లింపు అనంతరం డివిజన్ల వారీగా ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్కి ప్రతీ రౌండ్లో1000 ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్కి 25 ఓట్లని బండిల్గా కట్టి 40 బండిల్స్గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. ► ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 47 డివిజన్లకు 48 టేబుల్స్పై ఒకే రౌండ్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తై తుది ఫలితాలు వెల్లడికాన్నాయి. నలుగురు సీనియర్ ఆఫీసర్లను నాలుగు కౌంటింగ్ హాళ్లకు సూపర్ వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీతో పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ టెస్టులు, మాస్క్, ఫేస్ షీల్డ్ లేనిదే కౌంటింగ్ హాలులోకి అనుమతి నిరాకరిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. కాగా, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 50 డివిజన్లలో ఇప్పటికే మూడు డివిజన్లు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు నేడు వెల్లడి కానున్నాయి. -
నేడు ‘ఏలూరు కార్పొరేషన్’ ఫలితాలు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు వెల్లడి కానున్నాయి. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు డివిజన్లు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మరో 47 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా.. వీటికి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో 47 టేబుళ్లపై ఏకకాలంలో రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 47 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, మరో 254 మంది సిబ్బందితోపాటు, అదనంగా 200 మంది ఏలూరు కార్పొరేషన్ సిబ్బంది ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారని నగర కమిషనర్ డి.చంద్రశేఖర్ చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ఒక ఏజెంట్కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కాగా, ఓట్ల లెక్కింపు జరిగే సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం సందర్శించారు. కౌంటింగ్ హాళ్లను, టేబుళ్ల అమరికను పరిశీలించారు. అనంతరం అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆమెకు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్ విధించామని, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ రాహుల్దేవ్ శర్మ తెలిపారు. మొత్తం 175 మంది పోలీసులను నియమించామన్నారు. -
పరిషత్ ఎన్నికల రద్దు ఆదేశాలు నిలుపుదల
సాక్షి,అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. అయితే ఈ అప్పీల్పై తేలేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టరాదని, ఫలితాలను వెల్లడించరాదని ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. అప్పీల్పై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ సింగిల్ జడ్జి గత నెల 21న ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. సింగిల్ జడ్జి తప్పు చేశారు...! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశించాలంటూ జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు వేర్వేరుగా పిటిషన్లు వేశారని తెలిపారు. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాలని శ్రీనివాసరావు తన పిటిషన్లో కోరలేదన్నారు. అయితే సింగిల్ జడ్జి మాత్రం వర్ల రామయ్య పిటిషన్ను కొట్టివేసి శ్రీనివాసరావు పిటిషన్లో ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలంటూ ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ విషయంలో సింగిల్ జడ్జి తప్పు చేశారని వివరించారు. ఈ సమయంలో జనసేన తరఫు న్యాయవాది వి.వేణుగోపాలరావు స్పందిస్తూ ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలని వాదనల సమయంలో న్యాయమూర్తి దృష్టికి తెచ్చామని చెప్పారు. క్షుణ్ణంగా విచారణ అవసరం... ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆగస్టు మొదటి వారంలో విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొనగా జూలై మొదటి వారంలో చేపట్టాలని నిరంజన్రెడ్డి అభ్యర్థించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన బ్యాలెట్ బాక్సులను తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఏవీ లేవు కదా? అని ధర్మాసనం ప్రశ్నించగా తమిళనాడులో స్థానిక ఎన్నికలు జరగనున్నాయని నిరంజన్రెడ్డి చెప్పారు. జూలై మొదటి వారంలో సాధ్యం కాదని, అనేక ముఖ్యమైన కేసులను ఆ వారంలో విచారించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో జూలై 27న విచారణ జరుపుతామని పేర్కొంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడే మిగిలింది.. నిరంజన్రెడ్డి వాదనలను కొనసాగిస్తూ ఇప్పటికే పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాయని, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలి ఉందన్నారు. అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టు తనకున్న అధికారాలను ఎన్నికల నిర్వహణకు ఉపయోగించాలే కానీ అడ్డుకునేందుకు వాడరాదన్నారు. ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక∙అసాధారణ పరిస్థితుల్లో మినహా న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి సంబంధించిన రాజ్యాంగంలోని అధికరణలు 243 ఓ, 329లకు సింగిల్ జడ్జి తనదైన శైలిలో భాష్యం చెప్పారని, అది ఎంతమాత్రం సరికాదన్నారు. 2019 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అప్పీల్పై వీలైనంత త్వరగా విచారణ జరిపేందుకు వీలుగా నిర్దిష్టంగా ఒక తేదీని ఖరారు చేసి తుది విచారణ చేపట్టాలని కోరారు. -
ఓట్లు లెక్కిస్తేనే ఫలితం తేలేది
చాందీపూర్/కోల్కతా: ఓట్లను లెక్కించిన తర్వాతే ప్రజల తీర్పు తేటతెల్లమవుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్లో తొలి దశ ఎన్నికలు జరిగిన 30 స్థానాల్లో బీజేపీ 26 స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు. ఎన్నికలు జరిగిన తెల్లారే 26 సీట్లు గెలుస్తామంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. మరి మిగిలిన 4 సీట్లు ఎవరికి వదిలేశారు? కాంగ్రెస్, సీపీఎంలకా? అని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ ఆదివారం చాందీపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలను తాను ఇప్పుడే ఊహించలేనని అన్నారు. ఓట్ల లెక్కింపు తర్వాతే తేలుతుందని స్పష్టం చేశారు. అన్నిచోట్లా అభ్యర్థి నేనే నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి ఎవరు అనేది పట్టించుకోవద్దని, అన్ని స్థానాల్లో స్వయంగా తానే పోటీ చేస్తున్నట్లు భావించాలని ఓటర్లను మమత కోరారు. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని తృణమూల్ పోలింగ్ ఏజెంట్లకు సూచించారు. బెంగాల్లో మైనార్టీ ఓట్ల ను చీల్చడానికి హైదరాబాద్ నుంచి ఓ నాయకుడు వచ్చాడని పరోక్షంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై మండిపడ్డారు. ఢిల్లీ, గుజరాత్లో అల్లర్లు జరిగితే ఈ నేత ఎక్కడున్నాడో చెప్పాలన్నారు. అలజడి సృష్టిస్తున్న మరో ఫోన్కాల్ పశ్చిమ బెంగాల్లో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష బీజేపీ విడుదల చేసిన ఆడియో టేప్నకు ప్రతీకారం అన్నట్లుగా అధికార తృణమూల్ కాంగ్రెస్ కూడా వెంటనే ఓ ఫోన్కాల్ టేప్ను బహిర్గతం చేసింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, సీనియర్ నేత, పారిశ్రామికవేత్త శిశిర్ బజోరియా మాట్లాడుకున్నట్లు చెబుతున్న ఈ ఫోన్ కాల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెంగాల్లో అన్ని చోట్లా బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు లేరు, అందుకే స్థానికేతరులను ఏజెంట్లుగా నియమించేలా ఈసీని ఒప్పించాలని బజోరియాను ముకుల్ రాయ్ అదేశిస్తున్నట్లు ఈ టేప్లో రికార్డయ్యింది. -
ఒక్కసారే రీ కౌంటింగ్కు అనుమతి
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అన్నిచోట్లా రాత్రి 8 గంటలకల్లా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ జిల్లాల కలెక్టర్లతోపాటు మున్సిపల్ శాఖ కమిషనర్, ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీ/కార్పొరేషన్ కమిషనర్లకు సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఒక అంకె ఓట్ల తేడా ఉన్నచోట మాత్రమే రీకౌంటింగ్ నిర్వహించాలని, రెండంకెల ఓట్ల తేడా ఉన్నప్పుడు అభ్యర్థులెవరైనా రీకౌంటింగ్ కోరితే రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత జిల్లా కలెక్టర్తో మాట్లాడాలని తెలిపారు. కేవలం ఒకసారి మాత్రమే రీకౌంటింగ్కు అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై నిమ్మగడ్డ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అన్నిచోట్ల వీడియో కెమేరాల ద్వారా, లేదంటే సీసీ కెమేరాలు, వెబ్కాస్టింగ్ పర్యవేక్షణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ఆ వీడియో ఫుటేజీని ఎన్నికల రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో విద్యుత్ అంతరాయాల్లేకుండా చర్యలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైతే జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచనలిచ్చారు. -
ఫలితాలు నేడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఏలూరు నగర పాలక సంస్థ మినహా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదు. ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టిన 12 నగర పాలక సంస్థల్లోని 671 డివిజన్లలో 91 ఏకగ్రీవమయ్యాయి. దాంతో 580 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో ఏలూరులో ఎన్నికలు నిర్వహించిన 47 డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం చేపట్టడం లేదు. మిగిలిన 533 డివిజన్లలో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వాటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. పురపాలక శాఖ పటిష్ట ఏర్పాట్లు ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. ► ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. ► ఓట్ల లెక్కింపు టేబుళ్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొత్తం వీడియో తీయనున్నారు. ► ఓట్ల లెక్కింపు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా డిస్కం అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా జనరేటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం విజయవాడలోని లయోలా కాలేజీలో చేసిన ఏర్పాట్లు రెండు గంటల్లో తొలి ఫలితాలు ► ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తారు. ► వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను 25 చొప్పున కట్టలు కడతారు. ఒక్కో టేబుల్కు 40 ఓట్ల కట్టలు చొప్పున విభజించి ఓట్లు లెక్కింపు ప్రారంభిస్తారు. ► ఓట్ల లెక్కింపు వివరాలు ప్రకటించేందుకు పోలింగ్ కేంద్రాల్లో డిజిటల్ తెరలు ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఎప్పటికప్పుడు డిజిటల్ తెరలపై వెల్లడిస్తారు. ► ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటలకు తొలి ఫలితాలు వెలువడతాయని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి నగర పంచాయతీల తుది ఫలితాలు ప్రకటించగలమని చెబుతున్నారు. ► విశాఖపట్నం మినహా మిగిలిన అన్ని చోట్లా ఆదివారం సాయంత్రానికి ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నంలో తుది ఫలితాలు వెలువడేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. -
పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు లేవు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎటువంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కరెంట్ నిలిపివేసి ఫలితాలను తారుమారు చేశారని, నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల రీకౌంటింగ్ నిర్వహించారని ఫిర్యాదులు రావడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ రాజ్శాఖ కమిషనర్ నుంచి నివేదికలు తెప్పించుకున్నట్టు కమిషన్ తెలిపింది. కొన్ని చిన్న సంఘటనలు జరిగినప్పటికీ, వాటిలో తీవ్రంగా పరిగణించాల్సినవి ఏమీ లేవని పేర్కొంది. ఎక్కడా కూడా కరెంట్ నిలిపివేసి ఫలితాలను మార్చినట్టు నిర్ధారణ కాలేదని తెలిపింది. గుంటూరు జిల్లాలో నాలుగు పంచాయతీల్లో ఎక్కువ ఓట్ల తేడా ఉన్నా, రీ కౌంటింగ్ నిర్వహించినట్టు తెలిసిందని, వాటిపై జిల్లా కలెక్టరు నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకున్నానని, రీకౌంటింగ్లో ఎటువంటి అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కాలేదని వెల్లడించింది. ఓట్ల లెక్కింపుపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. -
ఓటెత్తిన పురం
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో ఓట్లు పోటెత్తాయి. 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో ఏకంగా 62.28 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థల కంటే పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగిన 12 నగరపాలక సంస్థల్లో 57.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 70.66 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏకగ్రీవమైనవాటిని మినహాయించగా 12 నగరపాలక సంస్థల్లోని 581 డివిజన్ల్లో 2,569 మంది, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డుల్లో 4,981 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం మీద 7,550 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నగరపాలక సంస్థల పరిధిలో 4,626, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 3,289 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పోటెత్తిన ఓటర్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు సైతం ఓటింగ్ పట్ల ఆసక్తి చూపారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్నవారిని కూడా ఓట్లు వేసేందుకు అనుమతించారు. ఓటర్ స్లిప్పులు లేకపోయినా ఓటర్ల జాబితాలో ఉన్నవారు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకువస్తే ఓటింగ్కు అవకాశమిచ్చారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను సంబంధిత ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. సీసీ కెమెరాలతోపాటు స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్లేసిన 48.30 లక్షల మంది.. ► పోలింగ్ నిర్వహించిన 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో మొత్తం 77,56,200 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 48,30,296 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ► అత్యధికంగా 75.93 శాతం ఓటింగ్తో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ► 75.49 శాతం పోలింగ్తో ప్రకాశం జిల్లా రెండో స్థానంలో, 71.52 శాతంలో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. ► కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 55.87 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థల్లో టాప్లో ఒంగోలు ► నగరపాలక సంస్థల్లో 75.52 శాతం పోలింగ్తో ఒంగోలు మొదటి స్థానంలో నిలిచింది. ► 71.14 శాతం పోలింగ్తో మచిలీపట్నం రెండో స్థానంలో, 66.06 శాతం పోలింగ్తో చిత్తూరు మూడో స్థానంలో ఉన్నాయి. ► కర్నూలులో అత్యల్పంగా 49.26 శాతం ఓట్లు పోలయ్యాయి. పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో మొదటి స్థానంలో గూడూరు ► 85.98 శాతం పోలింగ్తో గూడూరు (కర్నూలు జిల్లా) నగర పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. ► 83.04 శాతం ఓటింగ్తో అద్దంకి రెండో స్థానంలో, 82.24 శాతం ఓటింగ్తో మండపేట మూడో స్థానంలో ఉన్నాయి. ► ఆదోనిలో అత్యల్పంగా 50.05 శాతం ఓట్లు పోలయ్యాయి. పురపాలక ఓట్ల లెక్కింపు కోసం విస్తృత ఏర్పాట్లు.. పురపాలక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్, పురపాలక శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఎన్నికలు నిర్వహించిన 12 నగరపాలక సంస్థల్లో మొత్తం 2,204 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 9,788 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వారిలో కౌంటింగ్ సిబ్బంది 7,412 మంది కాగా కౌంటింగ్ సూపర్వైజర్లు 2,376 మంది. ► ఎన్నికలు నిర్వహించిన 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కోసం 1,822 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 7,136 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వారిలో కౌంటింగ్ సిబ్బంది 5,195 మంది కాగా కౌంటింగ్ సూపర్వైజర్లు 1,941 మంది ఉన్నారు. -
ఏలూరులో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలిగాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నిక నిర్వహించవచ్చని, ఓట్ల లెక్కింపు మాత్రం చేపట్టవద్దని, ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ధర్మాసనం మంగళవారం స్టే విధించింది. బ్యాలెట్ బాక్సులను జాగ్రత్త చేయాలని, హైకోర్టు ఆదేశిస్తే కానీ వాటిని తెరవడానికి వీల్లేదని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం, ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లను సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉంచదలచుకోలేదని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఎన్నికల నిలిపివేతపై సర్కార్ అప్పీల్... ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలంటూ గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ టీడీపీ నేత ఎస్వీ చిరంజీవి, మరో 33 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఓటర్ల జాబితాలో తప్పులను సవరించేందుకు వీలుగా కార్పొరేషన్ ఎన్నికను నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్లు లంచ్మోషన్ రూపంలో అత్యవసర అప్పీల్ దాఖలు దాఖలు చేశారు. ఇలాగే మరో వ్యక్తి కూడా అప్పీల్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, టీడీపీ నేతలు ఎస్వీ చిరంజీవి తదితరుల తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చిలకలూరిపేట ఎన్నికలకు హైకోర్టు ఓకే గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపల్ పాలకవర్గ ఎన్నికల నిర్వహణకు కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక నిర్వహించుకోవచ్చన్న న్యాయస్థానం ఎన్నికల ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. ఈ విషయాన్ని అభ్యర్థులకు అందజేసే ధ్రువీకరణ పత్రాల్లో స్పష్టంగా పేర్కొనాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. మానుకొండవారిపాలెం, పసుమర్రు, గణపవరం పంచాయతీలను చిలకలూరిపేట మునిసిపాలిటీలో విలీనం చేస్తూ గతేడాది జనవరిలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూæటి.పూర్ణచంద్రరావు, జి.రవితేజ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఆ జీవోల అమలును నిలిపేస్తూ గతేడాది అక్టోబర్లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది సత్యశివాజీ మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులను అభ్యర్థించారు -
కౌంటింగ్ వీడియో తీయండి
సాక్షి, అమరావతి: సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వెబ్కాస్టింగ్ లేదా సీసీ కెమెరా లేదా వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి కన్నబాబు కలెక్టర్లతో పాటు డీపీవోలు, ఎస్పీలకు లేఖలు రాశారు. మొత్తం నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే రెండు దశలు పూర్తవగా.. మూడు, నాలుగో దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ► కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో కరెంటు సరఫరాకు అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలి. అదే సమయంలో జనరేటర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ► కౌంటింగ్ అనంతరం పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల మధ్య అతి స్వల్పంగా ఒక అంకె (సింగిల్ డిజిట్) ఓట్ల తేడా ఉన్నప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం ఒక్కసారి రీ కౌంటింగ్కు అనుమతించాలి. రెండు అంకెల (డబుల్ డిజిట్) ఓట్ల తేడా ఉంటే అనుమతించవద్దు. ► కౌంటింగ్ కేంద్రాలలోకి ముందుగా అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ఇతరులను రానీయకూడదు. ► సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, పెద్ద గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. -
మూడో విడత పోలింగ్ రేపు
సాక్షి, అమరావతి: మూడో విడతలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 2,640 సర్పంచి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్శాఖ జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు చేశాయి. మూడో విడతలో 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అందులో 579 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్క చోట సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 2,640 సర్పంచి పదవులకు బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగే చోట మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ కొనసాగనుంది. ఆయా పంచాయతీల పరిధిలో 19,607 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో ఎన్నికలు జరిగే 3,221 గ్రామ పంచాయతీల పరిధిలో 31,516 వార్డులున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 11,732 వార్డులకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 177 వార్డులకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 19,607 వార్డుల్లో ఎన్నికలు జరగుతున్నాయి. ఈ వార్డులకు 43,282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బుధవారమే ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. చివరి విడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేడు చివరి విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగనున్న 3,229 గ్రామ పంచాయతీల్లో మంగళవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత 3,229 గ్రామ సర్పంచి పదవులకు 18,016 మంది, 33,429 వార్డులకు 86,064 మంది పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది మార్చి 9న నోటిఫికేషన్.. 15న నిలిపివేత రాష్ట్రంలోని 16 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 12 కార్పొరేషన్లలో, 104 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా 75 చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు 2020 మార్చి 9వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ ముగిశాక కరోనా పేరుతో అదే నెల 15న ఆ ఎన్నికలను అర్ధంతరంగా నిమ్మగడ్డ నిలిపివేశారు. కాగా ఆగిపోయిన చోట నుంచే ఆ ఎన్నికల ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు, వచ్చే నెల 2 నుంచి 3వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తున్నట్లు తాజా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
పరిషత్ తొలి భేటీకి నిబంధనలు సవరించాలి
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన వెంటనే జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ), మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుతమున్న నిబంధనలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది. ఈ నిబంధనలు సవరించడం ద్వారా పరిషత్ ఫలితాలు వెలువడ్డాక ఎక్కువ ఆలస్యం లేకుండా ఎన్నికైన సభ్యులు పరోక్ష పద్ధతుల్లో జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకునే వీలుంటుందని ఎస్ఈసీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన అందగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు తేదీని ఎస్ఈసీ ప్రకటిస్తుందన్నారు. సోమవారం జరగాల్సిన పరిషత్ ఓట్ల లెక్కింపును వాయిదా వేసిన నేపథ్యంలో మళ్లీ కౌంటింగ్ నిర్వహించే తేదీని ఎస్ఈసీ ప్రకటించాల్సి ఉంది. -
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ విషయంలో గతేడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ, తాజాగా ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ పోలీసులు అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. వాస్తవానికి ఈ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. పార్లమెంటు కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఏప్రిల్ 11న తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర పోలీసులు మొత్తం 54 వేల మందికి తోడుగా కేంద్ర బలగాలు, అటవీ, విద్యుత్తు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులంతా కలిపి దాదాపు 80 వేల మందికిపైగా పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూంబింగ్ పార్టీలు నిత్యం అప్రమత్తంగా ఉండటంతో సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్గఢ్ల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించకుండా పొలిమేరలను కట్టుదిట్టంగా పహారా కాశారు. పోలింగ్ ముందు ఛత్తీస్గఢ్లో ఎమ్మెల్యే కాన్వాయ్ పేల్చివేత, పోలింగ్ తరువాత మహారాష్ట్రలో పోలీసుల కాన్వాయ్పై మెరుపు దాడితో మావోయిస్టులు హింసకు దిగి ప్రశాంతతను చెదరగొట్టారు. కానీ, తెలంగాణలో మావోయిస్టులకు అలాంటి అవకాశాలు ఏమాత్రం ఇవ్వలేదు. ఇక తెలంగాణలో మొత్తం 2,600 సంక్లిష్ట ప్రాంతాలు, 5749 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి సఫలమయ్యారు. 40 రోజులపాటు సుదీర్ఘ పహారా.. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా, మే 23 ఓట్ల లెక్కింపు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 34,603 పోలింగ్ స్టేషన్లలో 18,526 పోలింగ్ స్థానాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరపడంలో పోలీసులు సఫలమయ్యారు. ఒక్క చోట కూడా రీపోలింగ్ జరపాల్సిన అవసరం రాకపోవడం పోలీసుల పనితీరుకు నిదర్శనం. ఎన్నికల అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం.. 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కేంద్ర బలగాల పహారా మధ్య తరలించారు. వీటికి 42 రోజులుగా సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను కల్పించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్లతో లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా ఏకంగా 10,000 మంది స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. విరామం ఎరగకుండా.. ఏడాదిలోపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడం సవాలే అయినా.. సమస్యల్లేకుండా ఎలాంటి విశ్రాంతి, సెలవులు తీసుకోకుండా తెలంగాణ పోలీసులు నిర్విరామంగా, సమర్థంగా విధులు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాతే సర్పంచి ఎన్నికలు, తరువాత పార్లమెంటు, అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తిచేశారు. -
నేడే ప్రజా తీర్పు
సాక్షి, అమరావతి: టెన్షన్.. టెన్షన్.. టెన్షన్..41 రోజుల టెన్షన్కు నేటితో తెర పడనుంది. ఓటరు దేవుళ్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ మరికొద్ది గంటల్లోనే వీడనుంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, తరువాత సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రజా తీర్పు ఎలా ఉండనుందో ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడటం తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించినా దేశవ్యాప్తంగా ఏడు విడతల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉండటంతో ఫలితాల కోసం ఈ దఫా ఏకంగా 41 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్కు, కౌంటింగ్కు మధ్య గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల వ్యవధి లేకపోవడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జగన్కే పట్టం గట్టిన ఎగ్జిట్ పోల్స్ ఆదివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కే జై కొట్టాయి. దీంతో గురువారం వెలువడే ఫలితాలు ఎలా ఉంటాయో అంతా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. పోలింగ్కు ముందు, పోలింగ్ రోజుతో పాటు తరువాత నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పాయి. లగడపాటి చిలక జోస్యాన్ని నమ్ముకున్న టీడీపీ ఊహలకు నేటి మధ్యాహ్నంతో తెరపడనుంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,118 మంది రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల్లో 2,118 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. 25 ఎంపీ సీట్లకు 319 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ ఎవరితోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా అన్ని సీట్లకు పోటీ చేసింది. టీడీపీ లోపాయికారీ పొత్తులతో కాంగ్రెస్, జనసేనలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించింది. చివరిలో వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపు నేడు మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితాల సరళి వెల్లడి కానుండటంతో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందో స్పష్టం కానుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ ప్రతి నియోజకవర్గంలో ఐదు చొప్పున వీవీ ప్యాట్ స్లిప్లను కూడా చివరిలో లెక్కించనున్నారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. దీంతో అధికారికంగా ఫలితాల ప్రకటనలో జాప్యం కానుంది. అయితే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ముగియగానే విజేత ఎవరనేది దాదాపుగా తేలిపోనుంది. -
కౌంటింగ్కు అన్ని భద్రతా ఏర్పాట్లు చేశాం
-
కౌంటింగ్కు కౌంట్డౌన్
-
25,224 మందితో పటిష్ట బందోబస్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, రాజకీయ పార్టీలకు చెందిన భారీ కాన్వాయ్లను కూడా అనుమతించబోమని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 16 ప్రాంతాల్లోని 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. అందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో నాలుగంచెల భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మొదటి దశలో కౌంటింగ్ హాలు వద్ద కేంద్ర సాయుధ బలగాలు ఉంటాయని, కౌంటింగ్ కేంద్రం వద్ద రెండో దశలో ఏపీఎస్పీ సాయుధ పోలీసులు ఉంటారని, మూడో దశలో బాడీ వోర్న్ కెమెరాలు ధరించిన పోలీసులు కౌంటింగ్ కేంద్రం బయట ఉంటారని, నాలుగో దశలో ప్రత్యేక పోలీసు బృందాలు వాహనాల్లో గస్తీ తిరుగుతుంటాయని పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు తగినంత పోలీస్ బలగం అందుబాటులో ఉందని డీజీపీ ఠాకూర్ చెప్పారు. 35 కంపెనీల కేంద్ర బలగాల్లో 3,325 మంది, 61 కంపెనీల ఏపీఎస్పీ బలగాల్లో 5,490 మంది, 118 స్పెషల్ పార్టీ టీమ్ల్లో 1,770 మంది, 67 ఏపీ ప్లాటూన్లలో 1,340 మంది సిబ్బంది, రాష్ట్రంలోని 21 మంది ఎస్పీలు, 31 మంది అదనపు ఎస్పీలు, 137 మంది డీఎస్పీలు, 379 మంది సీఐలు, 1,037 మంది ఎస్ఐలు, 2425 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, 6,510 మంది కానిస్టేబుళ్లు, 2,759 మంది హోంగార్డులు ఎన్నికల లెక్కింపు సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉంటారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా మొత్తం 25,224 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కౌంటింగ్ సందర్భంగా బందోబస్తు నిర్వహించే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నట్టు డీజీపీ చెప్పారు. అన్ని హంగులతో ఉండే ఐదు ఫాల్కాన్స్ వాహనాలు, 14,770 సీసీ కెమెరాలు, 1,200 బాడీ వోర్న్ కెమెరాలు, 68 డ్రోన్స్, 9 వేల కమ్యూనికేషన్స్ పరికరాలు వినియోగిస్తున్నట్టు చెప్పారు. వాటిని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాలకు అనుసంధానం చేసి, కౌంటింగ్ సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా తక్షణం స్పందించి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 144, 30 సెక్షన్లు అమలు ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీఆర్పీసీ 144, పోలీస్ యాక్ట్ 30 సెక్షన్లు అమలు చేస్తున్నట్టు డీజీపీ ఠాకూర్ పేర్కొన్నారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమిగూడటం, సమావేశాలు నిర్వహించడం నిషేధం. సెక్షన్ 30 అమలుతో కౌంటింగ్ కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లో ఎక్కువ మంది సమావేశం కావడం, మైక్లు వాడటం నిషేధం. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీస్ ఫోర్స్తో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు డీజీపీ చెప్పారు. ఇవి చెయ్యొద్దు... ఓట్ల లెక్కింపు సందర్భంగా ర్యాలీలపై నిషేధం అమలు చేస్తామని డీజీపీ తేల్చిచెప్పారు. పోలీసుల అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు జరపరాదన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు ఎటువంటి వాహనాలు, జన సమీకరణలు ఉండకూడదని సూచించారు. ముందస్తు చర్యలు అనుమానిత వ్యక్తులు, అల్లర్లు సృష్టిస్తారనుకునే వారిని ముందు జాగ్రత్తగా బైండోవర్ చేసినట్టు డీజీపీ తెలిపారు. రౌడీషీటర్లు, అనుమానితులను కౌంటింగ్ రోజున పోలీస్ కస్టడీకి తీసుకుంటామన్నారు. అల్లర్లు సృష్టించే వారిపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు శాంతిభద్రతలను సమీక్షిస్తామన్నారు. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశమున్న పట్టణాలు, గ్రామాలను గుర్తించి ముందుజాగ్రత్తగా ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల జాబితాలు తమకు వచ్చాయని, వాటిని పరిశీలించి వారిలో నేర చరిత్ర ఉన్న వారిని, వివాదాస్పదంగా ఉండే వారిని గుర్తిస్తామన్నారు. వారి స్థానంలో ఇతరులను నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు సూచిస్తామన్నారు. -
రేపే కౌంటింగ్
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఫలితాలు వెల్లడి కావడానికి ఇక గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో క్షణక్షణానికి ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల స్ట్రాంగ్రూమ్ల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) భద్రపర్చారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 6 చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గురువారం స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి, పక్కనే ఉన్న కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 25,000 మందికిపైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. భద్రత కోసం 25,000 మందికిపైగా పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కేంద్రాల వివరాలివీ... శ్రీశివానీ ఇంజనీరింగ్ కాలేజ్, చిలకపాలెం,శ్రీకాకుళం: పాలకొండ(ఎస్టీ), ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం(ఎస్సీ) ఎంవీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చింతలవలస, విజయనగరం: కురుపాం(ఎస్టీ), పార్వతీపురం(ఎస్సీ), సాలూరు(ఎస్టీ), శృంగవరపుకోట. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్, విశాఖపట్నం: అరకు వ్యాలీ(ఎస్టీ), పాడేరు(ఎస్టీ), భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ, గాజువాక, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట(ఎస్సీ), నర్సీపట్నం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, కాకినాడ: రంపచోడవరం(ఎస్టీ) జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం: బొబ్బిలి, గజపతినగరం లెండి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, జొన్నాడ, విజయనగరం: చీపురుపల్లి, నెల్లిమర్ల పోలీస్ ట్రైయినింగ్ కాలేజ్, కంటోన్మెంట్, విజయనగరం: విజయనగరం జేఎన్టీయూ–కాకినాడ: తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట, ముమ్మిడివరం, మండపేట, రాజానగరం రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ: అమలాపురం(ఎస్సీ), రాజోలు(ఎస్సీ), గన్నవరం(ఎస్సీ), కొత్తపేట డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథార్టీ, కాకినాడ: రామచంద్రాపురం ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్, కాకినాడ: అనపర్తి, రాజమండ్రి సిటీ, రాజమండ్రి గ్రామీణం సర్ సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏలూరు: కొవ్వూరు(ఎస్సీ), నిడదవోలు, గోపాలపురం(ఎస్సీ) విష్ణు స్కూల్, భీమవరం: నర్సాపురం, భీమవరం విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం: ఆచంట, పాలకొల్లు బి.సీతా పాలిటెక్నిక్, విష్ణు కాలేజ్, భీమవరం: ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏలూరు: ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం(ఎస్టీ), చింతలపూడి(ఎస్సీ) కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నం: నూజివీడు, కైకలూరు, గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు(ఎస్సి), పెనమలూరు ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీ–గంగూరు: తిరువూరు (ఎస్సీ), విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ(ఎస్సీ), జగ్గయ్యపేట నాగార్జున యూనివర్సిటీ, నంబూరు: తాడికొండ (ఎస్సీ), మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు(ఎస్సీ), గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, వేమూరు(ఎస్సీ), రేపల్లె, బాపట్ల లయోలా పబ్లిక్ స్కూల్, నల్లపాడు: పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల పేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వల్లూరు: పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు(ఎస్సీ) రైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూపు, వల్లూరు: ఎర్రగొండపాలెం(ఎస్సీ), దర్శి, ఒంగోలు, కొండెపి(ఎస్సీ) రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూపు, వల్లూరు : మార్కాపురం, గిద్దలూరు రైజ్ కృష్ణసాయి పాలిటెక్నిక్, వల్లూరు: కనిగిరి, కందుకూరు రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు: ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు(ఎస్సీ), పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్ రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్నూలు: పత్తికొండ, ఎమ్మిగనూరు జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలు: కోడుమూరు(ఎస్సీ), కర్నూలు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్, అనంతపురం: రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, శింగనమల(ఎస్సీ), అనంతపురం, కళ్యాణదుర్గం ఎస్కే యూనివర్సిటీ, అనంతపురం: రాప్తాడు, మడకశిర(ఎస్సీ), హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి కేఎల్ఎం ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, కడప: బద్వేలు(ఎస్సీ), కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు(ఎస్సీ), రాయచోటి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్, నెల్లూరు: కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరుగ్రామీణం, ఉదయగిరి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్, నెల్లూరు: సర్వేపల్లి, గూడూరు(ఎస్సీ), సూళ్లూరుపేట(ఎస్సీ), వెంకటగిరి వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, పూతలపట్టు: తిరుపతి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు ఆర్కేఎం లా కాలేజ్, పూతలపట్టు: శ్రీకాళహస్తి, సత్యవేడు(ఎస్సీ) శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిమ్మసముద్రం: చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు(ఎస్సీ), చిత్తూరు, పూతలపట్టు(ఎస్సీ), పలమనేరు, కుప్పం -
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్), ఎలక్షన్ నోడల్ అధికారి జితేందర్ వెల్లడించారు. మంగళవారం ఆయన డీజీపీ కార్యాలయంలో మరో నోడల్ అధికారి ఎస్పీ సుమతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 11న తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియను 23వ తేదీన చేపట్టనున్న నేపథ్యంలో బందోబస్తుపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 34,603 పోలింగ్ స్టేషన్లలో 18,526 పోలింగ్ స్థానాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం.. 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కేంద్ర బలగాల పహారా మధ్య తరలించామని చెప్పారు. వీటికి 40 రోజులుగా సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను కొనసాగిస్తున్నామని తెలిపారు. 13 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దాదాపు 10 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్.. కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జితేందర్ తెలిపారు. కేంద్ర బలగాల పహారా మధ్య ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో జనసంచారంపై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. సరైన అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించడం కుదరదని వెల్లడించారు. ఒకవేళ అనుమతి ఉన్నా.. మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్లడానికి వీల్లేదని తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద స్థానిక అవసరాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టామని.. ప్రతీ కేంద్రానికి డీఎస్పీ స్థాయి అధికారి భద్రతా చర్యలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కమిషనర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షిస్తారని వివరించారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి.. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి అని జితేందర్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండటంతో ర్యాలీలు చేపట్టాలనుకున్నవారు పోలీసులను ముందుగా సంప్రదించి, అనుమతి తీసుకుంటే తామే బందోబస్తు కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన తెలంగాణ ప్రజలకు జితేందర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంత వాతావరణంలోనే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్పై ప్రత్యేక దృష్టి.. నిజామాబాద్లో ఈవీఎం యంత్రాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జితేందర్ వెల్లడించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో నిజామాబాద్ ఫలితం మిగిలిన అన్ని స్థానాల కంటే ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనికితోడు సున్నిత ప్రాంతాల్లో కమిషనర్లు, ఎస్పీలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలోనూ ఇలాంటి ఏర్పాట్లే చేశామని వెల్లడించారు. -
కౌంటింగ్ నుంచి ఆ వీవీప్యాట్లను తొలగిస్తాం
సాక్షి, అమరావతి: మాక్ పోలింగ్లో నమోదైన స్లిప్పులను తొలగించని వీవీప్యాట్లను ఓట్ల లెక్కింపునకు (లాటరీ ద్వారా ఎంపిక చేసినవి) తీసుకోబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వీవీప్యాట్ల లెక్కింపులో అనవసర సందేహాలు తలెత్తకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నికల సమయంలో మాక్ పోలింగ్లో 50 ఓట్లు నమోదైన తర్వాత వాటిని తొలగించి సీఆర్సీ చేసి పోలింగ్ ప్రారంభించాల్సి ఉండగా కొన్ని చోట్ల వాటిని తొలగించకుండా పోలింగ్ కొనసాగించారని, దీనివల్ల ఈవీఎం, వీవీప్యాట్ ఓట్లకు తేడా వస్తుందని చెప్పారు. ఇలాంటి వీవీప్యాట్లను లెక్కింపు నుంచి మినహాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు. శనివారం సచివాలయంలో కలిసిన విలేకరులతో మాట్లాడుతూ చంద్రగిరి రీపోలింగ్పై పిటీషన్ దాఖలు కావడంతో వీడియో దృశ్యాలను కోర్టుకు అందచేశామని, సోషల్ మీడియాలో వస్తున్న దృశ్యాలు చంద్రగిరివి కావని ఆయన స్పష్టం చేశారు. మే 23లోపు ఎప్పుడైనా రీ–పోలింగ్ చేయవచ్చని, పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాతనే ఏడు చోట్ల రీ–పోలింగ్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రీపోలింగ్పై తనకు వచ్చిన ఫిర్యాదు పరిశీలించాలంటూ సీఎస్ లేఖ రాయడం ఎలా తçప్పవుతుందని ప్రశ్నించారు. పోస్టల్ బ్యాలెట్ జారీలో ఒక్కచోటే తప్పు పోస్టల్ బ్యాలెట్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ద్వివేది కొట్టిపారేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఒక్కచోట మాత్రమే ఒక ఉద్యోగికి రెండు ఓట్లు జారీ అయ్యాయని, ఇలా జారీ చేసిన ఓటులో ఒకటి వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లపై ఫిర్యాదులు రావడంతో అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకొని పరిశీలించామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన తర్వాతనే ఆర్వోలు ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్లో 200 మంది ఆర్వోలు, 200 మంది కేంద్ర పరిశీలకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. -
20న ఓట్ల లెక్కింపుపై శిక్షణ: రజత్కుమార్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 23న నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ ఈ నెల 20న నగరంలోని ఓ హోటల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపులో ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కారాలు, కచ్చితమైన ఫలితాల ప్రకటన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. -
ఓట్ల లెక్కింపులో బాధ్యతగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బాధ్యతగా వ్యవహరించాలని కౌంటింగ్ ఏజెంట్లకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. శనివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సికింద్రా బాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ ఏజెంట్లు, కార్పొరేటర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఏజెంట్లు ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 6.30 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు, వీవీ ప్యాట్ల లెక్కింపుల్లో ఎలాంటి సందేహాలు వచ్చినా... అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల బాధ్యతల గురించి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ అవగాహన కల్పించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, జనార్దన్రెడ్డి, ప్రభాకర్, స్టీఫెన్ సన్, పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లు లెక్కించేందుకు సర్వం సిద్ధం: సీఈవో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 23న ఓట్లు లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 18 జిల్లాల్లోని 35 ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన 82 హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందుకు మొత్తంగా 1,841 టేబుళ్లు ఏర్పాటు చేయను న్నట్లు వివరించారు. 110 సెగ్మెంట్లలో ఒక్కో సెగ్మెంట్లో 15 (14+1) టేబుళ్లను, నిజామాబాద్లోని 7 సెగ్మెంట్లలో 19 (18+1) టేబుళ్లను, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మేడ్చల్, ఎల్బీనగర్లోని 2 సెగ్మెంట్లలో 29 (28+1) టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్, ఒక లెక్కింపు సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అదనపు లెక్కింపు సహాయకుడు, ఇద్దరు అదనపు సూక్ష్మ పరిశీలకులు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్స్, ఇద్దరు కార్మికులు, ఒక డీఈవో ఉంటారని వివరించారు. వీరితోపాటు 61 మంది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఉంటారని, మొత్తం 6,745 మంది లెక్కింపులో పాల్గొంటారని తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ర్యాండమ్గా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్లలోని పేపర్ స్లిప్పులను కూడా లెక్కిస్తామని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ఫలితాల ప్రకటన 3 గంటలు ఆలస్యం కావొచ్చని రజత్ కుమార్ తెలిపారు. -
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు: నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి అధికారులకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. శుక్రవారం ఇక్కడి ఎస్ఈసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ పూర్తయ్యాక ర్యాండమైజేషన్ చేపట్టాలని, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్, జాయింట్ సెక్రటరీ జయసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నార -
20లోగా కౌంటింగ్ ఏజెంట్ల పేర్లివ్వాలి
సాక్షి, అమరావతి: ఈనెల 23న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఏజెంట్లదే కీలక పాత్ర. అందుకే పోటీలో ఉన్న అభ్యర్థులు తమకు అత్యంత నమ్మకమున్న వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకుంటారు. అందులో ఈసారి తొలిసారిగా వీవీప్యాట్ల లెక్కింపు ఉండటంతో ఏజెంట్లు మరింత కీలకంగా మారనున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఏజెంట్లుగా ఎవరిని నియమించాలి? ఎవరిని నియమించకూడదు? పోటీచేసే అభ్యర్థులు ఏజెంట్ల వివరాలను ఎప్పటిలోగా ఇవ్వాలి? టేబుళ్ల వద్ద ఎక్కడ కూర్చోవాలి.. ఇలా ప్రతీ అంశంపై ఎన్నికల నిబంధనావళిలో స్పష్టంగా పేర్కొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు ఇవిగో ఇలా.. కౌంటింగ్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి ఎన్నికల సంఘం ఒకేసారి అనేక టేబుళ్లను ఏర్పాటుచేసి ఓట్ల లెక్కింపును చేపడుతుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థి అన్ని టేబుళ్ల వద్ద జరుగుతున్న లెక్కింపును పరిశీలించలేరు కాబట్టి ఆయన స్థానంలో ఏజెంట్లను నియమించుకోవడానికి చట్టం అనుమతిస్తోంది. కాబట్టి ఎన్ని టేబుళ్లు ఏర్పాటుచేస్తే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు.. కౌంటింగ్ హాల్ పరిమాణం బట్టి ఎన్ని టేబుళ్లు ఏర్పాటుచేయాలన్నది ఆ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు. సాధారణంగా ప్రతీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు మించకుండా ఏర్పాటుచేస్తారు. దీనికి అదనంగా రిటర్నింగ్ అధికారి బల్ల ఒకటి ఏర్పాటుచేస్తారు. ఈ రిటర్నింగ్ అధికారి బల్లపైనే పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓటర్లు, వీవీప్యాట్లను లెక్కిస్తారు. అంటే మొత్తం 15 టేబుళ్లకు ప్రతీ అభ్యర్థికీ కనీసం 15 మంది ఏజెంట్లు అవసరమవుతారు. అదే విధంగా పార్లమెంటుకు, శాసనసభకు వేర్వేరుగా టేబుళ్లు ఏర్పాటుచేస్తారు కాబట్టి నియోజకవర్గానికి ప్రతీ పార్టీ కనీసం 30 మంది ఏజెంట్లను నియమించుకోవాల్సి వస్తుంది. కొన్నిచోట్ల ప్రత్యేక అనుమతితో అదనపు టేబుళ్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏజెంట్లను నియమించుకోవడానికి వీలుగా కనీసం ఒక వారం ముందుగానే ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామన్న వివరాలను అభ్యర్థులకు తెలియజేస్తారు. మన రాష్ట్రంలో కౌంటింగ్పై మే 17న కేంద్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుండటంతో ఆ సమయానికి టేబుళ్ల సంఖ్యపె స్పష్టత వచ్చే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కాగా, ఈసారి ఏజెంట్ల నేర చరిత్రనీ ఈసీ పరిశీలిస్తోంది. వీరు కూడా ఏజెంట్లుగా అనర్హులు - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు - పార్లమెంటు/శాసనసభ/శాసన మండలి సభ్యులు - మేయర్లు, మున్సిపల్, నగర పంచాయితీ చైర్మన్లు - జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, బ్లాక్ లెవెల్, పంచాయితీ సమితి చైర్పర్సన్లు - ఎన్నికైన జాతీయ, రాష్ట్ర, జిల్లా కో–ఆపరేటివ్ చైర్పర్సన్లు - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల అధిపతులు, ప్రభుత్వ ప్లీడర్లు, అడిషనల్ గవర్నమెంటు ప్లీడర్లు మూడు రోజులు ముందుగా పేర్లు ఇవ్వాలి.. ఫారం–18 దరఖాస్తు ద్వారా ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. పోటీచేసిన అభ్యర్థి లేదా అతను నియమించుకున్న ఏజెంటుగానీ కౌంటింగ్ ఏజెంటును నియమించుకోవచ్చు. అలాగే, విడివిడిగా కానీ అందరి పేర్లు ఒకేసారి ఫారం–18లో పూర్తిచేయడం ద్వారా కానీ నియమించుకోవచ్చు. ఏజెంటు పేరు, చిరునామాతో పాటు ఫొటోలు జతచేసి సంతకం చేసి రెండు కాపీలను తయారుచేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కాపీ రిటర్నింగు ఆఫీసర్కు పంపి, రెండో కాపీ కౌంటింగ్ రోజు రిటర్నింగ్ అధికారికి చూపించేందుకు ఏజెంటుకు ఇవ్వాలి. నియోజకవర్గంలోని పోటీచేసే అభ్యర్థులందరూ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఓట్ల లెక్కింపునకు మూడు రోజులు ముందు అంటే మే 20 సాయంత్రం 5 గంటల లోపు ఏజెంట్ల వివరాలను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి ఏజెంటు గుర్తింపు కార్డులను తయారుచేసి అభ్యర్థికిస్తారు. కౌంటింగ్ సమయంలో ఈ గుర్తింపు కార్డు, నియామక పత్రం చూపించాల్సి ఉంటుంది. లెక్కింపు మొదలయ్యే సమయానికి ఒక గంట ముందుగా ఏజెంటు రిటర్నింగ్ అధికారికి గుర్తింపు కార్డులను చూపించాలి. ఈలోపు వచ్చిన వారిని మాత్రమే ఏజెంట్లుగా అనుమతిస్తారు. ఫారం–19 ఉపయోగించుకోవడం ద్వారా అభ్యర్థులు నియమించుకున్న ఏజెంట్లను ఉపసంహరించుకోవచ్చు. వ్యక్తిగత భద్రత ఉన్న వారికి నో ఎంట్రీ - 18 ఏళ్లు నిండిన వారిని అభ్యర్థులు ఏజెంట్లుగా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ఇలా ఎంపిక చేసే వ్యక్తుల విషయంలో స్పష్టమైన ఆదేశాలున్నాయి. అవి.. - కౌంటింగ్ హాల్లోకి భద్రతా సిబ్బందిని అనుమతించరు కాబట్టి వ్యక్తిగత భద్రత కలిగిన వ్యక్తులను ఏజెంట్లుగా అనుమతించరు. - ఒకవేళ ఏజెంటుగా నియమించుకోవడానికి ఆ వ్యక్తి భద్రతను ఉపసంహరించుకున్నా సరే అనుమతించడానికి వీల్లేదని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. కౌంటింగ్ కోసం భద్రతను ఉపసంహరించుకుంటే అతని భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సెక్యూరిటీ పొందుతున్న ఏ వ్యక్తిని కూడా కౌంటింగ్ ఏజెంటుగా అనుమతించరు. - ప్రజా ప్రతినిధుల చట్టం–1951 ప్రకారం కౌంటింగ్ ఏజెంటుగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరించకూడదు. ఇలా చేసిన వ్యక్తికి జరిమాన, మూడు నెలల జైలుశిక్ష లేక రెండూ విధించే అవకాశముంది. బయటకు రావడానికి వీల్లేదు ఓటింగ్ రహస్యానికి సంబంధించిన ప్రకటనపై సంతకం చేసిన తర్వాతే ఏజెంట్ను హాలులోకి పంపిస్తారు. ఏజెంటు ఏ అభ్యర్థికి చెందిన వారు, ఏ సీరియల్ నెంబరు టేబుల్ వద్ద లెక్కింపు గమనిస్తారో సూచించే బ్యాడ్జీలను రిటర్నింగ్ అధికారి ఇస్తారు. ఏ టేబుల్ కేటాయించారో అక్కడే కూర్చోవాలి కానీ హాలంతా తిరగడానికి అనుమతించరు. రిటర్నింగ్ అధికారి బల్ల దగ్గర ఉండే ఏజెంటు మిగిలిన ఏజెంట్లు లేని సమయంలో ఆ టేబుళ్ల దగ్గరకు వెళ్లడానికి అనుమతిస్తారు. ఒకసారి కౌంటింగ్ హాలులోకి ప్రవేశించిన తర్వాత బయటకు వెళ్లడానికి అనుమతించరు. వీరికి కావాల్సిన అన్నిరకాల మౌలిక వసతులను లోపలే ఏర్పాటుచేస్తారు. టేబుల్స్ దగ్గర ఏజెంట్ల సీట్ల కేటాయింపు పార్టీల గుర్తింపు ఆధారంగా నియమిస్తారు. - తొలుత గుర్తింపు పొందిన జాతీయ పార్టీ ఏజెంటు - గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల ఏజెంట్లు - నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొంది, ఇతర చిహ్నాలను ఉపయోగించుకున్న అభ్యర్థులు - నమోదై గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు - స్వతంత్ర అభ్యర్థులు -
ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాక మీద ఉన్న నేపథ్యంలో 23న జరిగే కౌంటింగ్లో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సచివాలయంలో ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో ఆయన రాష్ట్ర స్థాయి శిక్షణా సమావేశం నిర్వహించారు. కౌంటింగ్లో ఎటువంటి తప్పులు దొర్లకుండా, ఎన్నికల నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్కు వచ్చే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ప్రతి అంశంపై అవగాహన ఉంటుంది కాబట్టి అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఏవైనా ఈవీఎంల్లో సమస్యలొస్తే వాటిని చివరి రౌండ్కు మార్చి అప్పుడు పరిశీలించాలని సూచించారు. అదేవిధంగా మాక్ పోలింగ్ సందర్భంగా నమోదైన ఓట్లను కొన్ని చోట్ల వీవీ ప్యాట్స్ నుంచి తొలగించకపోతే వాటిని అభ్యర్థుల సమక్షంలో లెక్కించి వారికి వివరించాలన్నారు. మాక్ పోలింగ్ వివరాలు అన్ని పార్టీల ఏజెంట్ల వద్ద ఉంటాయి కాబట్టి వాటితో సరిపోల్చి వివరించాల్సిందిగా కోరారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాళ్లకు ఈవీఎంలు తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, గందరగోళానికి తావు లేకుండా ఉండేందుకు లోక్సభ, శాసనసభ బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఇవ్వాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు నియోజకవర్గ స్థాయిలో కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారు. తొలిసారి వీవీప్యాట్లను కూడా లెక్కిస్తుండటంతో దీనిపై సిబ్బందికి తగిన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఏజెంటుకు ఐడీ కార్డు కౌంటింగ్ హాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లను అనుమతించేది లేదని ద్వివేది స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు తప్ప ఇతరులెవరూ సెల్ఫోన్లు లోపలికి తీసుకువెళ్లడానికి వీల్లేదన్నారు. కాబట్టి సెల్ఫోన్లను భద్రపరచడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను పోలీసులు పరిశీలించి నేరచరిత్ర ఉంటే తిరస్కరించాలని సూచించారు. ప్రతి ఏజెంటుకు ఐడీ కార్డు ఇవ్వడంతోపాటు ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలిపేలా సెంట్రల్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని తొలగించాలి ఉద్యోగులు గతంలో ఎన్నో ఎన్నికల్లో విధులు నిర్వహించినా ఈసారి ఎదుర్కొన్నంత ఒత్తిడి ఎప్పుడూ ఎదుర్కోలేదని జాయింట్ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బాబూరావు.. ద్వివేది దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సిబ్బందిలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా 12 మంది అధికారులపై తీసుకున్న చర్యలపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ద్వివేది స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఎంతవరకు తప్పు చేస్తే ఆ మేరకే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి డి.మార్కండేయులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్ఐసీ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
కౌంటింగ్పై మే 7న రాష్ట్రస్థాయి శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్పై ఉన్నతాధికారులకు అవగాహన కల్పించేందుకు మే 7న రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సోమవారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఆర్వోలు, ఈఆర్వోలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా వీవీప్యాట్లను వినియోగించడంతో ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన నిబంధనలపై ఈ సమావేశంలో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లను ఆర్వో, పరిశీలకుల సమక్షంలో లెక్కించాల్సి ఉండటంతో అసెంబ్లీ ఫలితాలకు ఆరు గంటలకు పైగా సమయం పడుతుందన్నారు. మొత్తం రాష్ట్రంలో 1,750 వీవీప్యాట్లలో పోలైన స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు. ఈవీఎంలో పోలైన ఓట్లు, వీవీప్యాట్లలోని స్లిప్పులతో సరిపోయిన తర్వాతనే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈవీఎంలు మొరాయిస్తే వాటిని పక్కన పెట్టి మిగిలిన వాటిని లెక్కిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొరాయించిన ఈవీఎంలపై ఆర్వో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఒకవేళ అభ్యర్థి మెజార్టీ కంటే మొరాయించిన ఈవీఎంలో నమోదైన ఓట్లు తక్కువ ఉంటే ఏజెంట్ల నిర్ణయం ప్రకారం ఆర్వో నడుచుకుంటారని తెలిపారు. మెజార్టీ కంటే మొరాయించిన ఈవీఎంలో నమోదైన ఓట్లు ఎక్కువ ఉంటే ఆ ఈవీఎంకు చెందిన బూత్లో రీ పోలింగ్ నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. రాష్ట్రంలో 3.50 లక్షల మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చామని, ఇందులో 90 శాతంపైగా ఓట్లు నమోదైతే ఒక శాతం పోలింగ్ పెరుగుతుందని వివరించారు. దీంతో పోటాపోటీగా జరిగే నియోజకవర్గాల్లో ఈ ఓట్లు ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 23వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సచివాలయం నుంచి కౌంటింగ్ ఏర్పాట్లు, తాగునీరు తదితర అంశాలపై ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది, డీజీపీ ఠాకూర్తో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వక పోవడం వల్ల అక్కడక్కడ ఈవీఎంలు సరిగా పని చేయలేదని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కౌంటింగ్ నిర్వహణలో అలాంటి ఫిర్యాదులకు ఎంతమాత్రం ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్లకు సూచించారు. ఓట్ల లెక్కింపునకు నెల రోజులు సమయం ఉన్నందున ఏర్పాట్లపై కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు, కౌంటింగ్ టేబుళ్లు, సీటింగ్ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో మెరుగైన శిక్షణ ఇచ్చే విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై, కౌంటింగ్ రోజున, ఆ తర్వాత అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు కల్పించాలని ఎస్పీలను ఆదేశించారు. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించవద్దని, పార్టీలకతీతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తమకున్న విస్తృత అధికారాలను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. మంచి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో తాగు నీరు, పశుగ్రాసం వంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కలెక్టర్లు వెంటనే స్పందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. నిధుల సమస్యలుంటే ఆర్థిక శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని చెప్పారు. నీటి ఎద్దడి నుంచి ఉద్యాన పంటలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్యపై రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే తాను ఉన్నతాధికారులతో సమీక్షించానని, జిల్లా స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహించి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు రోజువారీ పరిస్థితిని సమీక్షించి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా : ద్వివేది జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కొనియాడారు. ఎన్నికల్లో 65 శాతం పైగా దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకోవడం, మారుమూల గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రాంతాల్లో సైతం పోలింగ్ శాతం పెరగడం ఇందుకు నిదర్శనమన్నారు. స్ట్రాంగ్ రూమ్లను రోజూ ఎవరెవరు సందర్శిస్తున్నారనేది ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు. వినియోగించని, రిజర్వుడు ఈవీఎంలను కూడా సక్రమంగా భద్ర పరిచామన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారుల ఫోన్ నంబర్లను అక్కడ ప్రదర్శించామని చెప్పారు. మే మొదటి వారంలో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇస్తామని చెప్పారు. సిబ్బందికి మూడు దశల్లో శిక్షణ ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్లో పాల్గొనే ఏజెంట్లకు ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేయాలని, లోపలికి మొబైల్ ఫోన్ల అనుమతి లేనుందున వాటిని బయట భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్. అనురాధ, శాంతి భద్రతల అదనపు డీజి రవిశంకర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, అదనపు సీఈవో సుజాతా శర్మ, సంయుక్త సీఈవో డి.మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అల్లర్లు తలెత్తకుండా చర్యలు : ఠాకూర్ తక్కువ పోలీస్ ఫోర్సు ఉన్నప్పటికీ 2014 ఎన్నికలతో పోలిస్తే స్వల్ప ఘటనలు మినహా ప్రస్తుత ఎన్నికలను సజావుగా నిర్వహించారని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ అభినందించారు. పోలింగ్ అనంతరం ఘటనలకు బాధ్యులైన వారిని చాలా వరకు అరెస్టు చేశామని చెప్పారు. కౌంటింగ్ అనంతరం కూడా అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. రీపోలింగ్ జరగనున్న కేంద్రాల్లో పటిష్ట భద్రత కల్పిస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
ముగిసిన ఏపీ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో గెలుపొందిన 25 మంది పేర్లను బార్ కౌన్సిల్ అధికారులు ప్రకటించారు. చలసాని అజయ్కుమార్, బి.వి.కృష్ణారెడ్డి, ఆలూరు రామిరెడ్డి, కలిగినీడి చిదంబరం, వి.చంద్రశేఖర్రెడ్డి, వేలూరి శ్రీనివాసరెడ్డి, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎన్.ద్వారకనాథరెడ్డి, వజ్జా శ్రీనివాసరావు, రోళ్ల మాధవి, ఎస్.కృష్ణమోహన్, సోమసాని బ్రహ్మానందరెడ్డి, కె.రామజోగేశ్వరరావు, ముప్పాళ్ల సుబ్బారావు, నరహరిశెట్టి రవికృష్ణ, కొవ్వూరి వెంకటరామిరెడ్డి, సుంకర రాజేంద్రప్రసాద్, పి.రవి గువేరా, బి.అరుణ్కుమార్, పి.నర్సింగరావు, గంటా రామారావు, యర్రంరెడ్డి నాగిరెడ్డి, జి.వాసుదేవరావు, చిత్తరవు నాగేశ్వరరావు, ఎస్.మల్లేశ్వరరావులు గెలిచిన వారిలో ఉన్నారు. ఈ 25 మందిని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు. అనంతరం చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు. గెలిచిన ఈ 25 మందిలో నుంచి ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు. ఆగస్టు నెలాఖరుకల్లా చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రారంభమైన తెలంగాణ ఓట్ల లెక్కింపు.. తెలంగాణ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ బార్ కౌన్సిల్కు మొత్తం 86 మంది పోటీ చేశారు. సోమవారం సాయంత్రం లెక్కింపు పూర్తయ్యే సమయానికి 280 ఓట్లతో గండ్ర మోహనరావు లీడింగ్లో ఉన్నారు. తరువాతి స్థానాల్లో ఉన్న ఎన్.హరినాథ్ 132 ఓట్లు, ఎ.నర్సింహారెడ్డి 131, ఎ.గిరిధరరావు 126, ముఖీద్ 96 ఓట్లు సాధించారు. -
ఓటు టోటలైజర్లతో పనిలేదు: సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఓట్ల టోటలైజర్ యంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం దేశంలో అలాంటి యంత్రాలతో పనిలేదనీ, బూత్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తేనే అభ్యర్థులకు ఏ ప్రాంతంలో ఓట్లు తక్కువ వచ్చాయి, ఎక్కడ ఎక్కువ వచ్చాయి అనే విషయాలు తెలుస్తాయంది. తద్వారా వారు ఓట్లు తక్కువ వచ్చిన ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టి పనిచేసే అవకాశం ఉంటుందని న్యాయ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. -
ఓట్ల లెక్కింపులో మార్పులకు కేంద్రం తిరస్కారం
న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు బయటకు కనిపించకుండా... తుది ఫలితాన్ని ఒకేసారి ’టోటలైజర్‘ యంత్రం ద్వారా వెల్లడించాలన్న ఈసీ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఆ మేరకు నిర్ణయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీకి తెలిపింది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోని ఈవీఎంలకు టోటలైజర్ మిషన్ ను అనుసంధానం చేస్తారు. దీంతో తుది ఫలితం మాత్రమే వెల్లడవుతుంది. బూత్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అన్న వివరాలు తెలియవు. -
రేపు తేలనున్న ఐదుగురు సీఎంల భవితవ్యం
న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం సహా కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రుల భవితవ్యం గురువారం తేలనుంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కౌంటింగ్కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటలకల్లా ఫలితాల ట్రెండ్స్ తెలిసే అవకాశముంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెలువడుతాయని అధికారులు చెప్పారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్లో మాత్రమే అధికార పార్టీ మళ్లీ గెలవనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వేలు తెలిపాయి. ఇక మిగిలిన తమిళనాడు (జయలలిత-అన్నా డీఎంకే), కేరళ (ఉమెన్ చాందీ-కాంగ్రెస్), పుదుచ్చేరి (రంగస్వామి), అసోం (తరుణ్ గొగోయ్- కాంగ్రెస్)లో అధికార పార్టీలకు పరాజయం తప్పదని జాతీయ సర్వేలు తేల్చాయి. అయితే తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తారని స్థానిక మీడియా ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. దీంతో తమిళనాడు ఫలితాలపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. -
99 మ్యాజిక్ ..?
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందిన సీట్లు 99. ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది కూడా 99 హాళ్లలో. అదే విశేషం. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్లను దాదాపు 25 ప్రాంతాల్లోని 99 హాళ్లలో లెక్కించారు. ఈ విషయం తెలిసిన కొందరు ఇంకా ఎక్కువ హాళ్లలో లెక్కిస్తే ఎక్కువ సీట్లు వచ్చేవేమో అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. -
బల్దియా భవితవ్యం.. తేలేది నేడే
* సాయంత్రం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు * 5 గంటలకల్లా తొలి ఫలితాలు.. 7 గంటలకల్లా తుది లెక్కలు * గెలుపు ధీమాతో అధికార టీఆర్ఎస్ * మెజారిటీ స్థానాలు తమవే అంటున్న గులాబీ శ్రేణులు * నేడు పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ * భారీగా బందోబస్తు.. 800 మంది ఆర్ఏఎఫ్ సిబ్బంది మోహరింపు సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో విజేతలెవరో కొద్దిగంటల్లో తేలిపోనుంది. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా... సాయంత్రం 5 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశముంది. 7 గంటలకల్లా పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. మెజారిటీ డివిజన్లు దక్కించుకుని, ఎవరి సాయం లేకుండానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని అధికార టీఆర్ఎస్ నాయకత్వం భరోసాతో ఉంది. జీహెచ్ఎంసీ-2009 ఎన్నికల్లో ఒక్క డివిజన్లోనూ పోటీ చేయని టీఆర్ఎస్... ఈసారి ‘జీరో టు హండ్రెడ్’ నినాదంతో 150 డివిజన్లకు పోటీ పడింది. ఎంఐఎం ప్రభావం బలంగా ఉంటుందని భావించే పాతబస్తీలోనూ ఈసారి తాము ఖాతా తెరుస్తామన్న ఆశాభావాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలపై ఉత్కంఠ.. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన మంగళవారం పాతబస్తీలో ఎంఐఎం-కాంగ్రెస్, ఎంఐఎం-టీఆర్ఎస్ మధ్య ఘర్షణ... ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం నాడే పురానాపూల్ డివిజన్ కు రీపోలింగ్ జరగనుండడంతో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ రోజే వివిధ మీడియా, ఇతర సంస్థలు స్వతంత్రంగా జరిపిన సర్వేలు, ‘ఎగ్జిట్ పోల్’ల అంచనాల ఆధారంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ, ఎంఐఎం, ఇతరులు గెలుపొందే డివిజన్ల సంఖ్యపై ప్రచారం జరిగింది. దీంతో సహజంగానే శుక్రవారం జరగనున్న కౌంటింగ్పై చర్చ జరుగుతోంది. రీపోలింగ్ కారణంగా ఓట్ల లెక్కింపును శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభిస్తామని, 5గంటల కల్లా తొలి ఫలితాలు వెలువడతాయని జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో తుది ఫలితాలు ఏడు గంటల కల్లా వెలువడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గెలుపుపై టీఆర్ఎస్ భరోసా జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ (76)ను దాటుతామని టీఆర్ఎస్ నాయకత్వం భరోసా వ్యక్తం చేస్తోంది. తాము 77 నుంచి 85 డివిజన్ల దాకా గెలవబోతున్నామని... ఎవరి సాయం లేకుండానే మేయర్ పీఠాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ 19.71 శాతం ఓట్లను పొందింది. తాజాగా తమ అంతర్గత సర్వేల ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 42 శాతం ఓట్లు పొందుతామని పార్టీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయని తెలిసింది. ఈ కారణంగానే అత్యధిక డివిజన్లలో గెలుస్తామని, జీహెచ్ఎంసీలో ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తామని చెబుతోంది. ప్రభుత్వ నిఘా వర్గాలు సైతం అధికార పార్టీ 90కిపైగా డివిజన్లలో విజయం సాధిస్తుందని నివేదికలు అందించినట్లు తెలిసింది. పురానాపూల్ డివిజన్లో భారీగా బందోబస్తు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారం పాతబస్తీలోని పురానాపూల్లో చోటు చేసుకున్న ఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పురానాపూల్ డివిజన్కు శుక్రవారం జరుగనున్న రీ-పోలింగ్కు శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతల నుంచి సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణను తప్పించి.. మరో సీనియర్ పోలీసు అధికారికి అప్పగించాలని గురువారం ఆదేశించింది. ఈ మేరకు పురానాపూల్ డివిజన్ రీ-పోలింగ్ ఇన్చార్జిగా సంయుక్త పోలీస్ కమిషనర్ శివప్రసాద్ను నియమిస్తూ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పురానాపూల్లో కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డివిజన్లోని 36 పోలింగ్ స్టేషన్లకు 36 మంది ఇన్స్పెక్టర్లను నియమించారు. ముగ్గురు ఏసీపీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారు. సంయుక్త, అదనపు పోలీసు కమిషనర్లు సైతం పరిస్థితుల్ని సమీక్షిస్తుంటారు. 800 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరిస్తున్నారు. -
రేపే గ్రేటర్ కౌంటింగ్
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రారంభించాలా లేక శనివారమా అన్న సస్సెన్స్ కు అధికారులు తెర దించారు. శుక్రవారం రోజునే కౌంటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ముందుగా అనుకున్నట్టు సాయంత్రం 4 గంటలకు కాకుండా 3 గంటలకే మొదలుపెట్టాలని నిర్ణయించారు. పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్ లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఉన్నత స్థాయి అధికారులు తర్జనభర్జన పడ్డారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తే పూర్తి ఫలితాలు వెల్లడి కావడానికి కనీసంగా అయిదు గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తే రాత్రి 9 లేదా 10 గంటల వరకు కొనసాగే ఆస్కారం ఉంటుందని, రాత్రి వేళ ఫలితాలు వెల్లడించడం, తద్వారా శాంతి భద్రతల సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందేమోనన్న అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్, జీహెచ్ ఎంసీ కమిషనర్, హైదరాబాద్ పోలిస్ కమిషనర్ తదితరులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉన్న పక్షంలో కౌంటింగ్ శనివారం ఉదయం నుంచి ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి అవసరమైన బలగాలు సిద్ధంగా ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడంతో చివరకు కౌంటింగ్ శుక్రవారం చేపట్టాలని నిర్ణయించారు. అయితే మరీ ఆలస్యం కాకుండా ఉండేందుకు వీలుగా ఒక గంట ముందుగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. -
రేపే కౌంటింగ్
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 1,333 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో... స్ట్రాంగ్రూమ్లలో భద్రంగా ఉంది. రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు మొత్తం కౌంటింగ్ పూర్తి కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాయంత్రం 4 గంటల్లోగా ఓట్ల లెక్కింపు పూర్తి చేయాల్సి ఉంది. అంతకన్నా ముందే ఇది పూర్తికానుంది. వివిధ వార్డుల్లో పోలైన ఓట్లు ... లెక్కింపు కోసం అందుబాటులో ఉన్న హాళ్లు, టేబుళ్ల సంఖ్యపై ఆధారపడి తొలి, చివరి వార్డుల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక అడిషనల్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు.వీరిని ఎన్నికల పరిశీ లకులు, రిటర్నింగ్ అధికారులు రాండమ్గా నియమిస్తారు. ఉదయం 6 గంటల లోపునే సిబ్బంది రాండమైజేషన్ను పూర్తి చేస్తారు. వారు 6 గంటలకల్లా తమకు కేటాయించిన కేంద్రానికి చేరుకుంటారు.ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుంది.కౌంటింగ్ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు.ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలి అర్ధగంటలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. వీటికి ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేస్తారు.ఈ కేంద్రాల్లోని సదుపాయాలను బట్టి కొన్ని వార్డుల తర్వాత మరికొన్ని వార్డుల లెక్కింపు చేపడతారు. మొత్తం మూడు విడతలుగా ఇది పూర్తి కానున్నట్లు సమాచారం. -
‘పెద్ద’లెవరో?
మరికొన్ని గంటల్లో ‘పెద్ద’లెవరో తేలిపోనుంది. శాసనమండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం నేడు బయటపడనుంది. బుధవారం రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలోని కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో 769 మంది ఓట్లు వేశారు. వీటిని ప్రాధాన్యక్రమంలో లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. నేడు తేలనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం * రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో కౌంటింగ్ * ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు * బరిలో నిలిచింది ఐదుగురు.. గెలిచేది ఇద్దరే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో విజేతలుగా నిలిచే ఇద్దరు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ తరుఫున పట్నం నరేందర్రెడ్డి, శంభీపూర్ రాజు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, టీడీపీ తరుఫున బుక్కా వేణుగోపాల్, స్వతంత్ర అభ్యర్థిగా కొత్త అశోక్గౌడ్ పోటీపడ్డారు. రెండు సీట్లనూ కైవసం చేసుకోవాలని అధికారపార్టీ, ఒక సీటయినా దక్కించుకొని పరువు కాపాడుకోవాలని జతకట్టిన కాంగ్రెస్, టీడీపీలు ప్రయత్నించాయి. ఇక స్థానిక సంస్థల ప్రతినిధుల ఆత్మగౌరవ నినాదంతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి కూడా గెలుపుకోసం సర్వశక్తులొడ్డారు. ధనప్రవాహం, ప్యాకేజీలు, బెదిరింపులు, క్యాంపు రాజకీయాలతో హోరెత్తించిన శాసనమండలి ఎన్నికల్లో ప్రతి పార్టీ ఓటర్ల కొనుగోలుపైనే దృష్టి సారించాయి. * రాజకీయాలకతీతంగా బేరసారాలు జరిపారు. అదేస్థాయిలో ఓటర్లు కూడా పార్టీలకతీతంగా ఫిరాయింపుల పర్వానికి తెరలేపారు. * ఈ క్రమంలో ఓటర్ల నాడి అంతుబట్టడంలేదు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే రెండు సీట్లను గెలుచుకునే దిశగా ఓటర్లను టీఆర్ఎస్ విభజించింది. ఇక కారు దూకుడుకు కళ్లెం వేయాలనే దృఢనిశ్చయంతో రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఒక్కటైన కాంగ్రెస్, టీడీపీలు * శక్తివంచనలేకుండా కృషి చేశాయి. * గులాబీ శిబిరంలో ఉన్న పాతమిత్రుల సహకారంతో గట్టెక్కుతామనే మిణుకుమిణుకుమనే ఆశ ఆ పార్టీల్లో కనిపిస్తోంది. ఇక ఎంపీటీసీల సంఘం తరుఫున బరిలో దిగిన అశోక్గౌడ్ ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. ఒంటిరిపోరు సాగించిన ఆయన ప్రతి ఓటరును కలిసి మద్దతు కూడగట్టారు. పార్టీలకతీతంగా పెద్దల సభలో స్థానిక సమస్యలపై గళం విప్పేందుకు తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఇలా ఎవరికివారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. 11 గంటల లోపు తుది ఫలితం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఇద్దరు అభ్యర్థులు గట్టెక్కితే 11 లోపు తుది ఫలితం వెలువడుతోంది. ఒకవేళ తొలి ప్రాధాన్య ఓట్లలో అధిక్యత లభించని పక్షంలోనే ఫలితం ఆలస్యమయ్యే అవకాశముంది. -
ఎమ్మెల్సీ కౌంటింగ్ రోజున సెలవు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలికి సంబంధించి రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదివారం (27న) జరుగనున్నాయి. ఓట్ల కౌంటింగ్ బుధవారం (30న) జరుగనుంది. కౌంటింగ్ రోజున సెలవు ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఎప్పుడు ఎవరేమన్నారు?
బిహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు నుంచే ఎన్నికల వేడి మొదలైపోయింది. వివిధ పార్టీల నాయకులు ఎన్నికల ఫలితాల గురించి రకరకాలుగా స్పందించారు. ఏ సమయంలో ఎవరు ఏమన్నారో చూద్దామా.. 12.20: మహాకూటమి భాగస్వామి పక్షాలను రాహుల్ గాంధీ అభినందించారు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి విజయమని, దురహంకారానికి పరాజయమని, విద్వేషంపై ప్రేమ విజయమని, మొత్తానికి బీహార్ ప్రజల విజయమని వ్యాఖ్యానించారు. 12.10: బీజేపీ నాయకుడు శత్రఘ్న సిన్హా, నీతీష్, లాలూలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బీహార్ ప్రజలిచ్చిన తీర్పును శిరస్సు వంచి స్వీకరిస్తున్నానని తెలిపారు. 11:55 ఏఎం: బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు జేడీయూ నాయకుడు నితీష్ కుమార్కు ఫోన్ చేసిన మహాకూటమి విజయం పట్ల అభినందనలు తెలియజేశారు. బీజేపీ ఓటమి పట్ల ఆత్మావలోకనం చేసుకుంటామని చెప్పారు. 11:30: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నితీష్ కుమార్కు ఫోన్చేసి అభినందనలు తెలిపారు. ఇది సహనానికి విజయమని వ్యాఖ్యానించారు. 11:15: శివసేన సంజయ్ రౌత్ నితీష్ను అభినందిస్తూ దేశ రాజకీయాల్లో ఇది గొప్ప మలుపని, ప్రధాన మంత్రి అహంకారం బీజేపీని ఓడించిందని వ్యాఖ్యానించారు. 11:05: ఇది చారిత్రక విజయమంటూ నితీష్ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 11:00: ఓ విజయాన్ని నాయకుడికి ఆపాదిస్తామని, అదే పరాజయాన్ని పార్టీకి ఆపాదిస్తామని, కూటమి విజయసారథి నితీష్ కుమార్ సాహెబ్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. భవిష్యత్ దేశ రాజకీయాలకు తమ విషయం ఓ గుణపాఠం అవుతుందని అన్నారు. 11:00: బీహార్ ప్రజల తీర్పును గౌరవిస్తామని బీజేపీ నాయకుడు రామ్మాధవ్ వ్యాఖ్యానించారు. 10:30:బీజేపీ నాయకుడు ప్రకాష్ జవడేకర్ మీడియాతో మాట్లాడుతూ ‘మరికొన్ని గంటలు నిరీక్షిద్దాం. పరస్పరం విమర్శించుకునే పార్టీలన్నీ ఒకచోటకు చేరాయని, ఇది ఎన్నికల ఫలితాలపై కచ్చితంగా ప్రభావాన్ని చూపుతుందని వ్యాఖ్యానించారు. 10:15: జేడీయూ నాయకుడు శరద్ యాదవ్ బీహార్ ప్రజలను అభినందించారు. మహాకూటమికి 150కు పైగా సీట్లు వస్తాయని చెప్పారు. 9:15: ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్లను చూపిపోయిన బీజేపీ కార్యకర్తలు పట్నాలోని తమ ఆఫీసు ముందు బాణసంఛా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. 9:00: రాష్ట్ర ఎన్నికల్లో అమిత్ షా నిర్వహించిన ప్రచారం తీరును మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నానని, ఈ ఫలితాలు దేశ రాజకీయాలనే పూర్తిగా మార్చివేస్తాయని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. 8:30: బీహార్ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించడం ఖాయమని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శణమని బీజేపీ నాయకుడు జవదేకర్ వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వం పట్ల, ఆయన అభివృద్ధి నినాదం పట్ల ప్రజలకున్న విశ్వాసం అలాంటిదని అన్నారు. 7.45: బిహార్ రాజకీయాల్లో లాలూ నిర్వహించిన పాత్ర అంతా ఇంతా కాదని, మంచి జరిగిందా, చెడు జరిగిందా ఇక్కడ ముఖ్యం కాదని లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. 6.30: ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పాత్రికేయులకు గుడ్మార్నింగ్ చెప్పారు. మహాకూటమి గెలవబోతోందని, మెజారిటీ ఖాయమని చెప్పారు. -
నేడు కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
-
‘కౌంట్’ డౌన్ షురూ..
భారీ బందోబస్తు మధ్య నేడే ఓట్ల లెక్కింపు.. 288 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాల మోహరింపు నగరంలోనూ కొన్ని రోడ్ల మూసివేత, మరికొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లింపు సాక్షి, ముంబై: భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఇప్పటికే మూడంచల భద్రత వలయాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కోసం గతంలో 256 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈసారి ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 288 కేంద్రాలను ఏర్పాటు చేశారు. లెక్కింపు సమయంలో ప్రజలు గుంపులుగా చేరకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తింపు కార్డులున్నవారు మినహా మిగతా ఎవరినీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించేది లేదని మహారాష్ట్ర డీజీపీ (ఎన్నికలు) ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలు వెలుపడిన అనంతరం కూడా విజయం సాధించిన అభ్యర్థులు ఊరేగింపు తదితరాలు చేపట్టాలనుకున్నప్పటికీ ఆయా ప్రాంతాల జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు సమయంలో కూడా సివిల్ డ్రెస్లలో పరిసరాలపై నిఘా వేసి ఉంచనున్నారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపు... ఓట్ల లెక్కింపునకు సంబంధించి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. భద్రత దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లోని పలు రోడ్లను వాహనాల రాకపోకలు సాగించకుండా ఉండేందుకు మూసివేయగా మరికొన్ని రోడ్లపై ట్రాఫిక్ను మళ్లించనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మాహీం అసెంబ్లీ నియోజకరవర్గం ఓట్ల లెక్కింపు ఎస్.కె.బోలేమార్గ్లోని అంథోనీయో డి సిల్వా హై స్కూల్లో నిర్వహించనున్నారు. దీంతో ఈ కేంద్రానికి సమీపంలోని కొన్ని రోడ్లను మూసి వేయగా మరి కొన్ని రోడ్ల ట్రాఫిక్ను మళ్లించారు. ట్రాఫిక్లో చేసిన మార్పుల మేరకు హనుమాన్ మందిరం నుంచి పోర్చ్గీస్ చర్చి జంక్షన్ వరకు ఎస్.కె.బోలే మార్గ్ను మూసి వేయనున్నారు. ఇటువైపునుంచి వెళ్లే వాహనాలను గోఖలే రోడ్పై నుంచి మళ్లించనున్నారు. గోపినాథ్ చవాన్ చౌక్ నుంచి హనుమాన్ మందిరం జంక్షన్వరకు భవానీ శంకర్ రోడ్డుతోపాటు స్టీల్మన్ జంక్షన్ నుంచి ఎన్.సి.కేల్కర్ మార్క్ వరకు రానడే రోడ్డు, ఎస్.కె.బోలే రోడ్డు నుంచి రానడే రోడ్డు వరకు అశోక్ వృక్ష రోడ్డులను మూసివేయనున్నారు. అదే విధంగా వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు వర్లీలోని గాందీమైదానంలో ఉన్న లలితా కళాభవన్, కామ్కళ్యాణ్ కేంద్రంలో జరగగా శివ్డీ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఎన్ఎమ్ జోషి మార్గంపై ఉన్న మున్సిపల్ స్కూల్లో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్.ఎమ్.జోషి మార్గ్, జిఎమ్.బోస్లే మార్గ్ చుట్టుపక్కల పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు పలు రోడ్లలో ట్రాఫిక్ను మళ్లించారు. ఇలా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసరాలలో ట్రాఫిక్లో మార్పులు చేశారు. సొంత గూటికి చేరుకుంటున్న అభ్యర్థులు.... ఎన్నికల అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లిన అనేక మంది అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు సాయంత్రం వరకు దాదాపు అందరూ ఓట్ల లెక్కింపు కేంద్రాలున్న పరిసరాలకు చేరుకున్నప్పటికీ పలువురు అర్థరాత్రి వరకు చేరుకుంటారని తెలిసింది. అక్టోబరు 15వ తేదీని ఎన్నికలు జరిగిన తర్వాత కొంత విరామం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన పలువురు అభ్యర్థులు ఆదివారం ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనున్నందున మళ్లీ సొంత గూటికి చేరిపోయారు. మొదటి ఫలితం ముంబాదేవి..? సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలుపడనున్నాయి. 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్నింటికంటే ముందుగా ముంబైలోని ముంబాదేవి, వడాలా నియోజకవర్గాల ఫలితాలు వెలుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అన్ని నియోకవర్గాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, ఈ నియోజకవర్గాలలో ఫలితాలు కేవలం మూడు, నాలుగు గంటల్లోనే స్పష్టం అవనున్నాయని భావిస్తున్నారు. ముంబాదేవి, మాలేగావ్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తక్కువగా జరిగింది. దీంతో ఈ నియోజకవర్గాల్లో ముందుగా ఫలితాలు వెలుపడతాయని చెప్పవచ్చు. రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నికంటే ముంబైలోని వడాల అసెంబ్లీ నియోజకవర్గంలో అతితక్కువగా 1,96,859 మంది ఓటర్లుండగా 1,20,664 మంది ఓట్లు వేశారు. అయితే 2,37,743 మంది ఓటర్లున్న ముంబాదేవిలో మాత్రం కేవలం 1,10,118 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఫలితాలు అన్నింటికంటే ముందుగా వెలుపడే అవకాశాలున్నాయి. -
ఇంకెన్నాళ్ళో?
- పదవులు చేపట్టే దెప్పుడో? - ఆత్రంగా ఎదురుచూస్తున్న విజేతలు - పీఠం ఎవరికి దక్కుతుందోనన్న సందిగ్ధం - సమీకరణాల్లో రాజకీయ పార్టీల నేతలు - అసెంబ్లీ తర్వాతే మున్సిపల్, పరిషత్తు పీఠాలు సాక్షి, గుంటూరు: మునిసిపల్, పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపూ జరిగిపోయింది. విజేతలెవరో తెలిసిపోయింది. కానీ కుర్చీ దక్కేదెవరికన్న సందేహం ఇంకా వెన్నాడుతోంది. గెలిచామన్న సంతోషం కంటే పదవుల్లో అధిష్టించేదెపుడనే ఆత్రం అందరిలోనూ కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరిగినా ఓట్ల లెక్కింపులోనూ జాప్యం జరగడం... తీరా ఫలితాలు వెల్లడైనా పదవులు చేపట్టేందుకు ఏవో అడ్డంకులు. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తరువాతనే ఈ పీఠాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో ఆ రోజుకోసం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ తేదీ ప్రకటించడం, అసెంబ్లీ ఎప్పుడు జరుగుతుందో ఇంకా వెల్లడి కాకపోవడంతో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ లోగా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కూడా లేకపోలేదు. క్యాంపుల్లో అభ్యర్థులు అధ్యక్ష స్థానాల్లో ఎవరిని కూచోబెట్టాలనే దానిపై రాజకీయ పార్టీల నేతలు సమీకరణ ల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు క్యాంపుల పేరుతో జిల్లాలోని కొన్ని మండలాల్లో గెలుపొందిన వారు జిల్లా కేంద్రంలోగల ప్రైవేటు గెస్ట్హౌస్ల్లో బస చేస్తున్నారు. మరికొందరు జిల్లాల సరిహద్దులు దాటి సేద తీరుతున్నారు. అయితే ఎన్నాళ్ళు క్యాంపులు నిర్వహించాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆటవిడుపు కోసం క్యాంపులు ఏర్పాటు చేసిన వారు ఆర్థిక భారం తట్టుకోలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలకు తొమ్మిదేళ్ళ అనంతరం ఎన్నికలు నిర్వహించారు. ఫలితాలు వెల్లడైనా పీఠాలు అధిష్టించడంలో జాప్యంపై నిరుత్సాహంలో ఉన్నారు.మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు వేసే వీలుంది. పాలకవర్గం ఎన్నుకోవడంలో వీరికి ఓటు హక్కు కల్పించడంతో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ముందుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది. అంతవరకూ ఎలా వీరిని కట్టడిచేయాలన్నదే వారి ఆందోళన. జాప్యంపై టీడీపీలోనే ఆందోళన జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో టీడీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఒక్క తాడేపల్లి వైఎస్సార్సీపీ పరమైంది. గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠంపై కొన్ని చోట్ల టీడీపీలోనే అంతర్గత వివాదాలు నడిచాయి. ఈ పంచాయతీలు పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్ళాయి. మంగళగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరనే విషయంలో సమస్య తలెత్తింది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన గంజి చిరంజీవికే ఇవ్వాలని బాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ సీపీఐ, సీపీఎం చెరో మూడు వార్డులు గెలుచుకోవడం, వైఎస్సార్ సీపీకి మద్దతిచ్చే అంశంలో చర్చలు జరగడంతో టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకునే విషయంలో ఓటు ఉండటంతో ఎంపీగా గెలుపొందిన గల్లా జయదేవ్ను ఓటు మంగళగిరిలో వినియోగించుకోవాలని టీడీపీ వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే చిరంజీవికి ముగ్గురు పిల్లలున్నారని, నామినేషన్ సమయంలో మేనేజ్ చేసి పోటీ చేసి గెలుపొందారని సొంత వర్గం వారే చెబుతున్నారు. చిరంజీవి పదవికి అనర్హుడని, కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు స్థానికులు కొందరు ఉద్యుక్తులవుతున్నారు. అయితే ముందు జాగ్రత్తగా చిరంజీవి కేవియేట్ దాఖలు చేయడం గమనార్హం. పరిషత్తుల విషయానికొస్తే జిల్లాలో సగానికి పైగా మండలాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు క్యాంపులు నడుపుతున్నాయి. హంగ్ ఏర్పడిన మండలాల్లోనూ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఏది ఏమైనా పీఠాలు ఎక్కేదెప్పుడోనని ‘స్థానిక’ నేతలకు ఎన్నాళ్ళు ఎదురు చూపులుంటాయో.. వేచి చూడాల్సిందే. -
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
విశాఖ రూరల్, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కిం పు ప్రశాంతంగా ముగిసింది. అధికారుల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా కౌంటింగ్ పూర్తయింది. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ రసవత్తరంగా సాగింది. చివరి వరకు ఏ పార్టీకి విజయం వరిస్తుందో తెలియక అందరిలోను ఉత్కంఠ రేపింది. సాయంత్రం ఆరు గంటల వరకూ చోడవరం, పాయకరావుపేట ఫలితాలు తేలలేదు. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ, 3 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనకాపల్లి లోక్సభకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ సాయంత్రం 7 గంటల వరకు సాగింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఒకవైపు చేపడుతుండగానే ఉదయం 8.30కు ఈవీఎంలను స్ట్రాంగ్ల రూమ్లను తీసుకువచ్చారు. ఉదయం 9 నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు వేరువేరుగా 14 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించారు. భీమిలి నియోజకవర్గానికి అధికంగా 22 రౌండ్లు లెక్కింపు జరగగా, మాడుగులకు తక్కువగా 14 రౌండ్లుగా చేపట్టారు. ముందుగా ఈ నియోజకవర్గం ఫలితమే వెల్లడైంది. అనకాపల్లి లోక్సభ ఫలితం అన్నింటికంటే ఆలస్యంగా సాయంత్రం 7.30కు వచ్చింది. గెలిచిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు వచ్చి సందడి చేశారు. రిటర్నింగ్ అధికారులు వారికి డిక్లరేషన్లు ఇచ్చారు. అన్ని కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చు కున్నారు. -
పరువు కాపాడిన అశోక్రావ్ చవాన్
సాక్షి, ముంబై: దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో నామరూపాల్లేకుండా ఊడ్చుకుపోయే పరిస్థితి నుంచి కొంతమేర ఊరట కల్పించారు మాజీ ముఖ్యమంత్రి అశోక్రావ్ చవాన్. లోక్సభ ఎన్నికల్లో నాందేడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు పోటీ చేసిన 26 మంది అభ్యర్థుల్లో గెలుపొందిన ఒకే ఒక్కడు అశోక్చవాన్. ఈయన కూడా గెలవకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్కు కనీసం ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా ఉండేవాడు కాదు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ హవా వీస్తున్న సందర్భంలో బీజేపీ అభ్యర్థి డీబీ పాటిల్ను 81,455 ఓట్ల భారీ మెజార్టీతో ఓడించి, కాంగ్రెస్ పరువును కాపాడారు. ఈ స్థానమైనా నిలిచేనా... కనీసం ఒక్కస్థానమైనా దక్కిందనుకొంటున్న కాంగ్రెస్కు ఆ కాస్త ఊరట కూడా ఐదేళ్లపాటు నిలిచే పరిస్థితి కనిపించడంలేదు. ఎందుకంటే నాందేడ్ నుంచి గెలుపొందిన అశోక్రావ్ చవాన్పై పెయిడ్ న్యూస్ కేసులతోపాటు ఆదర్శ్ కుంభకోణంలో కూడా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన దోషిగా నిరూపితమై, జైలుశిక్ష పడితే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడమేగాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్కు దక్కిన ఆ ఒక్క స్థానం కూడా ఖాళీ అయ్యే దుస్థితి నెలకొంటుంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో లేనందున ఇక చవాన్ తన పార్లమెంటు స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. -
రాష్ట్రంలో 168 కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటు లోక్సభ, ఇటు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం 168 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 42 లోక్సభ స్థానాలకు మొత్తం 598 మంది అభ్యర్థులు, 294 అసెంబ్లీ స్థానాలకుగాను 3910 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. అనంతరం అంటే ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు. -
కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
-
దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
543 లోక్సభ స్థానాలకు దేశవ్యాప్తంగా 989 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభంకానుంది. దేశవ్యాప్తంగా 8,251 మంది లోక్సభ అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల కౌంటింగ్ కూడా ఉదయం 8.00 గంటలకే ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని చర్యలు చేపట్టింది. -
నేడు ‘సార్వత్రిక’ తీర్పు
సాక్షి, ఒంగోలు : అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శుక్రవారంతో రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ నెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నానికి తేటతెల్లం కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెల్లడవుతాయి. జిల్లాలో ఒంగోలు, బాపట్ల లోక్సభ నియోజకవర్గాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఒంగోలు నగరంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లోనే నిర్వహిస్తున్నారు. ఈ మేరకు లెక్కింపు కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లోక్సభ, అసెంబ్లీ ఓట్లలెక్కింపు ఒకేసారి జరిగేలా చర్యలు చేపట్టారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ్కుమార్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియకు సర్వసన్నద్ధమైంది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్తో పాటు లోక్సత్తా, బీఎస్పీ, జైసమైక్యాంధ్ర, సీపీఐ, సీపీఎం, స్వతంత్రులతో కలిపి మొత్తం 187 మంది బరిలో నిలిచారు. ఒంగోలు, బాపట్ల లోక్సభ స్థానాల్లో 29 మంది పోటీ చేశారు. పోలింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్లా ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది. 2009 సాధారణ ఎన్నికలతో పోల్చిచూస్తే ఈ ఎన్నికల్లో దాదాపు 7.5 శాతం ఓటింగ్ అదనంగా నమోదు కావడం విశేషం. కొద్ది గంటల్లో ఫలితాల వెల్లడికానుండటంతో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ భవిష్యత్పై లెక్కలేసుకుంటున్నారు. ఎవరికి వారు విజయం తమదేనంటూ పైకి గంభీరంగా కనిపిస్తున్నా ఫలితాలపై లోలోపల టెన్షన్ అనుభవిస్తున్నారు. రౌండ్లవారీగా ఫలితాలు... లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కేంద్రంలోని మూడు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ గంటన్నర వ్యవధిలో పూర్తిచేసేలా కలెక్టర్ అధికారయంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ఒక్కో సెగ్మెంట్కు కనిష్టంగా 16 రౌండ్లు, గరిష్టంగా 20 రౌండ్లలో జరగనుంది. ఒక్కో రౌండ్కు నాలుగున్నర నిమిషాల సమయం పట్టనుంది. కౌంటింగ్ హాలులో మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్పై 20 ఈవీఎంలు ఉండేలా చర్యలు చేపట్టారు. ఆ మేరకు 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ 9.30 గంటలకల్లా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. అడుగడుగునా పోలీసులు ఒంగోలు నగరంలో శుక్రవారం సాయంత్రం వరకు పోలీసు యాక్ట్ 30, 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎస్పీ పి. ప్రమోద్కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభ్యర్థుల మద్దతుదారులు భారీగా ఒంగోలు తరలి వచ్చారు. అదే సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటచేసుకునే అవకాశాలుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏజెంట్ పాస్లు ఉన్నవారు, నగర వాసులు మినహా ఒంగోలు నగరానికి ఎవరూ రాకూడదని, ఒకవేళ పనికోసం వచ్చిన వారు వెంటనే వెళ్లిపోవాలని పోలీసు అధికారులు హెచ్చరించారు. -
దేవుడా....దేవుడా...!
సార్వత్రిక ఫలితాలు తేలేది నేడే రెండు ఎంపీ, 16 ఎమ్మెల్యే స్థానాలకు ఓట్ల లెక్కింపు దేవుళ్లకు మొక్కుతున్న అభ్యర్థులు ఫలితాలపై సర్వత్రా ఆసక్తి సర్వేల పేరుతో పందాలకు ఊతం రూ.కోట్లు దాటిన బెట్టింగ్లు ఓటు కోసం ఓటరు దేవుడి చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేసిన అభ్యర్థులు ఇప్పుడు అనుకూల ఫలితాలు ఇవ్వాలని కోరుతూ తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తున్నారు. తమ నేతలను గెలిపించాలని కోరుతూ ఆయా పార్టీల కార్యకర్తలు కూడా దేవుళ్లనే ఆశ్రయిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములపై పందేలు నిర్వహించిన బుకీలు కూడా తమకు లాభాలు వచ్చేలా దీవించాలంటూ వేడుకుంటున్నారు. సాక్షి, మచిలీపట్నం : ఓటేసి గెలిపించాలని చేతులెత్తి నమస్కరించిన అభ్యర్థుల్లో తమకు ఇష్టమైన వారిని ఎంపిక చేసుకున్న ఓటరు దేవుళ్లు తమ తీర్పును ఈవీఎంలలో పదిలపరిచారు. ఈవీఎంలో భద్రపరిచిన ఓటరు తీర్పు శుక్రవారం వెలుగు చూడనుంది. జిల్లాలో 33,37,071 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 25,14,29 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాలకు 33 మంది అభ్యర్థులు, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 227 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ జరి గింది. జిల్లాలో ఇరు పార్టీల అభ్యర్థుల్లో గెలుపు ఎవరిది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. జయాపజయాలపై అభ్యర్థులు, ఆయా పార్టీల కార్యకర్తల్లో గుబులు రేగుతోంది. ఫలితాలపై ప్రజల్లోనూ ఆసక్తి ఉంది. ఏది ఏమైనా తాము సీట్లు, ఓట్లుపై పెట్టిన పందేలు నెగ్గేలా ఫలితాలు రావాలంటూ బెట్టింగ్ రాయుళ్లు కూడా దేవుళ్లకు మొక్కుతున్నారు. గెలిస్తే కొండకొస్తామని, కొబ్బరికాయ కొడతామని తమ ఇష్ట దైవాలకు మొక్కుతున్నారు. దీంతో ఫలితాల అనంతరం దేవుళ్లు కూడా రాజకీయ మొక్కులతో బిజీ అయిపోతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. వేగంగా ఫలితాల వెల్లడికి చర్యలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వేగంగా వెల్లడించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందనరావు చర్యలు చేపట్టారు. విజయవాడ సమీపంలోని కానూరు పీవీపీ సిద్ధార్థ, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. విజయవాడ, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాలతోపాటు ఏలూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఓట్ల లెక్కింపు చేపట్టేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7.50 గంటలకు స్ట్రాంగ్ రూమ్లను తెరిచి కచ్చితంగా 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి ఫలితం వీలైనంత త్వరగా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు పరిధిలో ఏడేసి టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కిస్తారు. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. రూ.కోట్లలో బెట్టింగులు క్రికెట్ను ఆధారంగా చేసుకుని కోట్ల రూపాయాల పందేలకు కౌంటర్లు తెరిచే బుకీలు రాజకీయ రంగాన్ని కూడా వదల్లేదు. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాలతోపాటు 16 అసెంబ్లీ స్థానాల ఫలితాలపై కోట్లాది రూపాయాలు బెట్టింగ్లు వేశారు. క్రికెట్లో బంతి బంతికి వచ్చే పరుగులు, పడే వికెట్లపై బెట్టింగ్లు కాసే వారంతా ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి? తదితర అన్ని కోణాల్లోను పెద్ద ఎత్తున పందాలు ఒడ్డారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఎంత మంది గరీబులవుతారో.. ఎంత మంది కుబేరులవుతారో చూడాలి. -
మరికొన్ని గంటల్లో వెల్లడికానున్న ‘సార్వత్రిక’ ఫలితాలు
సాక్షి, సంగారెడ్డి: పక్షం రోజుల ఉత్కంఠత.. ఉద్విగ్నతకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈవీఎంలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం నేడు బయటపడనుంది. నువ్వా, నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ఫలితాల వెల్లడికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్ 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలకు 23 మంది, 10 అసెంబ్లీ స్థానాలకు 105 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓటర్లు సైతం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో జిల్లాలో 76.83 శాతం పోలింగ్ నమోదైంది. అభ్యర్థుల తలరాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నిక్షిప్తమై ఉం ది. శుక్రవారం ఈ ఈవీఎంలను క్రోడీకరించడం ద్వారా ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. అందరి దృష్టీ జిల్లాపైనే ఒకేసారి వచ్చినపడిన సార్వత్రిక, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పై చెయ్యి సాధించగా.. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సైతం మన జిల్లా నుంచే పోటీ చేస్తుండడంతో అందరి చూపు ఇక్కడి ఫలితాలపైనే కేంద్రీకృతమై ఉంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీతో పాటు మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. మెదక్ లోక్సభలో ఆయన గెలుపు సునాయసనమే అయినా.. గజ్వేల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి తన సొంత బలంతో అమీతుమీకి దిగి కేసీఆర్కు గట్టి పోటీ ఇచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డిలకు సైతం ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు ముచ్చెమటలు పట్టించారు. వీరి భవితవ్యంపై ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. లెక్కింపు కేంద్రాలు ఇవే.. జిల్లావ్యాప్తంగా 2,678 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ కోసం 6 వేల ఈవీఎంలను వినియోగించారు. అనంతరం ఈ యంత్రాలను..సంగారెడ్డి, పటాన్చెరు మండలాల పరిధిలోని మూడు ప్రైవేటు విద్యా సంస్థల్లో స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేసి భద్రపరిచారు. డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల: జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జహీరాబాద్, నారాయణ్ఖేడ్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును సంగారెడ్డి మండలం కాశీపూర్లోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఇదే కళాశాలలో భద్రపరిచారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓట్ల క్రోడీకరణ, ఫలితాల ప్రకటన డీవీఆర్ కళాశాలలోనే జరపనున్నారు. ఎంఎన్ఆర్ వైద్య కళాశాల: మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో నిర్వహించనున్నారు. గీతం విశ్వవిద్యాలయం: మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును పటాన్చెరు మండలం రుద్రారం పరిధిలో గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గ ఓట్ల క్రోడీకరణ, ఫలితాల ప్రకటన సైతం గీతం యూనివర్శిటీలోనే జరుపుతారు. -
తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి
సాక్షి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొన్ని గంటల్లో శాసనసభ, లోక్సభ అభ్యర్థుల జయాపజయాలను తేల్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ద్వారా మధ్యాహ్నానికే ఫలితాలు వెల్లడికానున్నాయి. మొదటి మూడునాలుగు రౌండ్లలోనే అభ్యర్థికి వచ్చే ఓట్ల మెజార్టీ ఆధారంగా ఫలితం తేలనుంది. మరోవైపు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఏ పార్టీకి ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయంపై లెక్కలేయడంలో బిజీగా మారారు. ఎన్నికల ముందు, తర్వాత రాజకీయ మార్పులు, సమీకరణాలను విశ్లేషించుకుంటూ.. పార్టీ భవిష్యత్తును అంచనా వేస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో బేరీజు వేసుకుంటూ, ఎక్కడెక్కడ ఏ సామాజికవర్గం నుంచి ఏ మేరకు ఓట్లు దక్కాయని కూడికలేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కాస్తంత బలం చాటుకున్నప్పటికీ.. ప్రాదేశికాల్లో బోర్లాపడటంతో ప్రజానాడి తేలిపోయింది. అర్బన్ప్రాంతాల్లో బొటాబొటి మెజార్టీ తెచ్చుకున్నా.. గ్రామీణ ప్రాంత ప్రజలు టీడీపీకి పట్టం కట్టకపోవడంపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇవే ఫలితాలు రేపటి సార్వత్రిక ఎన్నికల లెక్కింపులోనూ కనిపించనున్నాయా..? అనే ఆందోళన వారిలో నెలకొంది. ప్రధానంగా దర్శి, కనిగిరి, సంతనూతలపాడు, గిద్దలూరు, యర్రగొండపాలెం, పర్చూరు, మార్కాపురం ప్రాదేశికాల్లో టీడీపీ ఘోరంగా విఫలమవడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం కీలక నేతలంతా సమావేశమై.. జెడ్పీటీసీలు దక్కించుకోలేకపోవడానికి కారణాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాత్మకంగా ఉన్నప్పటీకీ.. ఎన్నికల వ్యూహాన్ని నడిపించలేకపోవడమే ఓటమికి దారితీసిన అంశంగా తేల్చుకున్నారు. ఇవే అంశాలతో కూడిన నివేదికను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం పంపినట్లు సమాచారం. సార్వత్రిక ఫలితాల్లో కూడా టీడీపీ వాటా రెండు స్థానాలకే పరిమితం కానున్నట్లు ఆ పార్టీ కీలక నేతలు అంచనావేసి.. అధిష్టానానికి తెలియజేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చరిత్ర తిరగరాయనున్న ‘ఫ్యాన్’గాలి... జిల్లాలో జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ రికార్డు సృష్టించనున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అర్బన్, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఆ పార్టీపై పెట్టుకున్న అభిమానం స్థానిక ఫలితాల ద్వారా ఉవ్వెత్తున ఎగిసిపడినట్లు తెలుస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ ఫలితాల సరళిని గమనించిన తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వైఎస్ఆర్ సీపీకే రానున్నట్టు వివరిస్తున్నారు. స్థానిక ఎన్నికల తర్వాత సీమాంధ్రలో చోటుచేసుకున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో పలు సామాజికవర్గాలు ఫ్యాన్ గుర్తుకే మొగ్గుచూపినట్టు.. టీడీపీ, బీజేపీ పొత్తు నేపథ్యంలో మైనార్టీలు ఆ రెండు పార్టీలకు దూరమైనట్లు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా పొత్తు కుదుర్చుకున్నట్లు బహిరంగంగా ప్రకటించి కూడా సంతనూతలపాడు నియోజకవర్గం విషయంలో బీజేపీకి వెన్నుపోటు పొడవడం టీడీపీకి పెద్ద మైనస్గా నిలిచిందంటున్నారు. బహుజన సామాజికవర్గాలతో పాటు గ్రామీణ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలంతా జగన్మోహన్రెడ్డి అభిమానులుగా ఉంటూ వైఎస్ఆర్ సీపీకే ఓట్లేశారని పరిశీలకులు చెబుతున్నారు. జిల్లాలో 12 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించనున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించండి
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్లైన్: జిల్లాలో శుక్రవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని కలెక్టర్ కే.రాంగోపాల్ ఆదేశించారు. బుధవారం ఉదయం చిత్తూరులోని మహతి కళాక్షేత్రంలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, వారి అనుమానాలను తీర్చు తూ కౌంటింగ్ను నిర్వహించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధు లు కేటాయిస్తామని, ఈ-మెయిల్ ఐడీలకు, సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేస్తామని చెప్పారు. కౌంటింగ్ విధులకు హాజరయ్యే వారు సంబంధిత ఆర్డీవోల నుంచి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్డర్ కాపీ ఉన్న వారు శుక్రవారం ఉదయమే వారికి కేటాయించిన కేంద్రానికి చేరుకోవాలని, గుర్తింపు కార్డులు పొంది సం బంధిత అసెంబ్లీ సెంటర్లకు వెళ్లి విధు లు నిర్వర్తించాలని ఆదేశించారు. సిబ్బం ది త్వరితగతిన కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు చిత్తూరులో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కౌంటింగ్ విధులకు ముందురోజే హాజరయ్యే సిబ్బంది గురువారం రాత్రి ఉండేందుకు టీటీడీ కల్యాణ మండపం, చక్కెర ఫ్యాక్టరీ కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా లో ఎక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు వచ్చినందున ముందుగా వాటిని లెక్కించి, అర్ధగంట తర్వాత ఈవీఎంలను తెరవాలని సూచించారు. పార్లమెం ట్కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక హాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఏజేసీ వెంకట సుబ్బారెడ్డి, డీఆర్వో శేషయ్య, సంబంధిత నియోజకవర్గాల ఆర్వోలు తది తరులు పాల్గొన్నారు -
ఓట్లలో దూకుడు
- తొలిసారే అయినా జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా - సీట్లలో వెనుకబడ్డా ఓట్లలో వైఎస్సార్సీపీ మెరుగైన స్థాయి - 44,565 ఓట్ల ఆధిక్యంతో టీడీపీకి జెడ్పీపీఠం - 70 ఎంపీటీసీలు ఎక్కువ గెల్చుకున్న టీడీపీకి 35,990 ఓట్ల మెజార్టీ సాక్షి, విశాఖపట్నం : జిల్లా పరిషత్ ఎన్నికల బరిలోకి దిగింది తొలిసారే అయినా ఎన్నో ఏళ్లుగా తలపండిన టీడీపీకి వైఎస్సార్సీపీ చుక్కలు చూపించింది. జెడ్పీ పీఠాన్ని సులువుగా ఎగరేసుకుపోదామనుకున్న సైకిల్కు హోరాహోరీ పోటీ ఇచ్చింది. అడుగడుగునా సవాలు చేస్తూ ప్రజల్లో తనకున్న బలాన్ని చాటుకుంది. మంగళవారం వెల్లడించిన 39 జిల్లాపరిషత్ ఓట్ల లెక్కింపులో టీడీపీ 24, వైఎస్సార్సీపీ 15 దక్కించుకున్నాయి. సీట్ల పరంగా వైఎస్సార్సీపీ అనుకున్నంతమేర సాధించలేకపోయినా ఓట్ల విషయంలో దూకుడు ప్రదర్శించింది. విజయం సాధించిన టీడీపీతో దీటుగా ఓట్లు దక్కించుకుని ప్రజాబలం నిరూపించింది. జిల్లా పరిషత్ ఓట్లు 16,50,329. పోలైన ఓట్లు 13,05,268. వీటిలో ఫలితాలు మొత్తం వెల్లడయ్యేసరికి వైఎస్సార్సీపీ 5,73,131 ఓట్లు దక్కించుకోగా, టీడీపీ 6,17,596 ఓట్లు సాధించింది. అంటే రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 44,465 మాత్రమే. పేరుకు 24 జెడ్పీటీసీలను టీడీపీ దక్కించుకో గలిగినా ఓట్లు మాత్రం ఆ స్థాయిలో తెచ్చుకోలేకపోయింది. ఎన్నికలు జరిగిన 39 జెడ్పీటీసీల పరిధిలోని పది నియోజకవర్గాల్లో టీడీపీ ఏడు నియోజకవర్గాల్లో అత్యధికంగా జెడ్పీటీసీలు గెలవగా వీటిల్లో వచ్చిన మెజార్టీ కేవలం 56 వేల ఓట్లు. అదే వైఎస్సార్సీపీ పాడేరు,అరకు, పాయకరావుపేట నియోజకవర్గాల్లో అత్యధిక జెడ్పీటీసీలు గెలుచుకుని తెచ్చుకున్న ఓట్ల మెజార్టీ 44,461 ఓట్లు. అంటే ఏడు నియోజకవర్గాల పరిధిలోని టీడీపీ దక్కించుకున్న మెజార్టీ కన్నా మూడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ దక్కించుకున్న మెజార్టీతో సమానం అన్నమాట. అదే విధంగా టీడీపీ దక్కించుకున్న 24 జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీ తీవ్ర పోటీ ఇచ్చి తన బలాన్ని చాటుకుందని చెప్పవచ్చు. వాస్తవానికి 24 జెడ్పీలు కైవసం చేసుకుని టీడీపీ జిల్లా జెడ్పీ పీఠాన్ని దక్కించుకున్నా తక్కువ ఓట్ల ఆధిక్యతతోనేనని చెప్పవచ్చు. మరోపక్క వైఎస్సార్సీపీ జిల్లామొత్తం మీద అరకు,పాడేరు,పాయకరావుపేటలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు గెల్చుకోగా, ఈ ప్రాంతంలో టీడీపీ దరిదాపులకు రాలేకపోయింది. ఎంపీటీసీల్లోనూ జోరు... 656 ఎంపీటీసీల్లో ఏకగ్రీవం 14, నామినేషన్లు పడని రెండు స్థానాలను తీసివేయగా మొత్తం 640 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో వైఎస్సార్సీపీ 253 స్థానాలు, టీడీపీ 323 స్థానాలు దక్కించుకున్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి అధికంగా వచ్చిన స్థానాలు 70. ఇంతవరకు బాగానే ఉన్నా ఓట్లను దక్కించుకోవడంలో మా త్రం వైఎస్సార్సీపీ టీడీపీకి ధీటైన పోటీ ఇచ్చింది. 13,05,268 ఓట్లు పోలవగా, వైఎస్సార్సీపీ 5,27,447, టీడీపీ 5,63,437 ఓట్ల ను సాధించాయి. 70 ఎంపీటీసీ లు అధిక్యత వచ్చిన టీడీపీకి ఓట్ల మెజార్టీ మాత్రం కేవలం 35,990 మాత్రమే. ఇక్కడ కూడా ఏడు నియోజకవర్గాల పరిధిలోని ఎంపీటీసీల్లో టీడీపీ తక్కువ మెజార్టీతో వీటిని దక్కించుకోగా, వైఎస్సార్సీపీ మాత్రం పాడేరు,అరకు, పాయకరావుపేటల్లో మాత్రం వేలల్లో ఆధిక్యతను సాధించింది. వైఎస్సార్సీపీ,టీడీపీ తర్వాత జిల్లాలో ఇండిపెండెంట్లు పలుచోట్ల తమ సత్తా చాటుకున్నారు. దీంతో ఆయా చోట్ల టీడీపీ మూడోస్థానానికి సైతం పడిపోయిన దాఖలాలున్నాయి. -
ప్రాదేశిక ఫలితాలు తేలేది నేడే
-
నెల్లూరులో వైఎస్సార్సీపీ భారీ విజయం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కోటలను బద్ధలు కొట్టింది. తీవ్ర స్థాయిలో పోరు నడిచిన నెల్లూరు కార్పొరేషన్ను వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో దక్కించుకుంది. కావలిలో విజయం కోసం తీవ్రంగా కష్టపడిన టీడీపీ ప్రయత్నం ఫలించలేదు. ఇక్కడ కూడా వైఎస్సార్సీపీ సంపూర్ణ మెజారిటీతో మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. సూళ్లూరుపేటను దక్కించుకోవడానికి టీడీపీ భారీ మొత్తంలో ధన ప్రవాహం చేసినా వైఎస్సార్సీపీ ఒక వార్డు ఎక్కువ గెలుచుని పాగా వేసింది. గూడూరులో రెండు పార్టీల మధ్య పోరు జరిగి చెరో 16 వార్డులు గెలుచుకోగా, ఇక్కడ వైఎస్సార్ సీపీ రెబల్ అభ్యర్థి షంషీర్ నిర్ణయం కీలకం కానుంది. ఆత్మకూరులో వైఎస్సార్సీపీ కాంగ్రెస్, టీడీపీ కంటే రెండు వార్డులు ఎక్కువగా గెలుచుకోగా, టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. వెంకటగిరి, నాయుడుపేటల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఆత్మకూరులో మినహా మరెక్కడా తన ప్రభావం చూపలేకపోయింది. - నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ను ఈసారి ఎలాగైనా గెలుచుకోవడానికి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డితో పాటు పార్టీ ముఖ్యులను రంగంలోకి దించింది. చిన్నపిల్లల వైద్య నిపుణుడు, పార్టీ నాయకుడు జెడ్.శివప్రసాద్ను ముందుగానే చైర్మన్గా ప్రకటించి బరిలోకి దించింది. ఓటు కోసం నోట్ల పంపిణీకి ఎక్కడా వెనుకంజ వేయలేదు. కొన్ని డివిజన్లలో ఓటుకు రూ.2,000 కూడా పంపిణీ చేసింది. మద్యం ఏరులై పారించింది. ఇంత పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెర లేపినందువల్ల కార్పొరేషన్ గెలుస్తామని టీడీపీ నేతలు ధీమాగా వ్యవహరించారు. అయితే ఇక్కడ మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ 32 డివిజన్లు గెలుచుకుని టీడీపీ నేతలను ఖంగుతినిపించింది. ఇక్కడ టీడీపీ మిత్రపక్షం బీజేపీ 2 డివిజన్లు, సీపీఎం 1, స్వతంత్రుడు ఒక స్థానం దక్కించుకోగా, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పార్టీ నుంచి ఆనం రంగమయూర్రెడ్డి మాత్రమే 903 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ 17 డివిజన్లు మాత్రమే దక్కించుకుంది. ఈ ఫలితం టీడీపీని తీవ్ర నిరాశకు గురి చేసింది. గెలిచిన కార్పొరేటర్లు కోటంరెడ్డి శ్రీధీర్రెడ్డిని సన్మానించారు. - సూళ్లూరుపేటలో మరోసారి పట్టు సాధించుకోవడానికి చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, కాంట్రాక్టర్ గంగాప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికలకు చివరి మూడు రోజుల ముందు ఆయన రంగంలోకి దిగి నోట్ల వరద పారించి పది ఓట్లున్న చోటా నాయకులను కూడా ప్రలోభాలతో తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి కూడా టీడీపీతో దీటుగా డబ్బులు ఖర్చు చేశారు. అయితే ఇక్కడి ఓటర్లు వైఎస్సార్సీపీకే అండగా నిలిచారు. మొత్తంలో 23 వార్డుల్లో 10 వైఎస్సార్ సీపీ, 9 టీడీపీ, 3 కాంగ్రెస్ గెలవగా 7వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి జి.శ్రావణ్కుమార్ గెలుపొందారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలో ఇతని మద్దతు కూడా కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఫలితాలు వెలువడితేనే పూర్తి స్పష్టత రానుంది. - గూడూరు అసెంబ్లీ టీడీపీ టికెట్ తనకు రావడం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు మున్సిపల్ ఎన్నికల మీద ప్రత్యేకంగా దృష్టిసారించారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. పట్టణంలో తమకు పూర్తి పట్టు ఉన్నందువల్ల ఇక్కడ గెలిచి తీరుతామనే ధీమాగా వ్యవహరించారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ టీడీపీతో సమానంగా 16 వార్డులు గెలుచుకుంది. 13వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ రెబల్ అభ్యర్థి షంషీర్ విజయం సాధించారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలో ఈమె మద్దతు కీలకం కానుండగా, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితిలో మార్పు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీని దక్కించుకోవడంపై వైఎస్సార్ సీపీ ధీమాతో ఉంది. - కావలి అసెంబ్లీ ఎన్నిక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బీద మస్తాన్రావుకు చావో, రేవో అనేంత ఆందోళన కలిగించింది. దీంతో కావలిలో తన పట్టు పెంచుకోవడానికి ఆయన ఈసారి చేతికి ఎముక లేని విధంగా ఖర్చుకు వెనుకాడలేదు. ఇక్కడ తమ ఆధిపత్యం నిరూపించుకోగలిగితేనే తాను గెలుస్తాననే నమ్మకంతో ఆయన కావలిలో మెజారిటీ వార్డులు గెలుచుకోవడానికి శక్తికి మించి కష్టపడ్డారు. అయితే ఆయన ఆశలు నెరవేరలేదు. 40 వార్డుల్లో వైఎస్సార్సీపీ 20, ఆ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్రుడు ఒకరు గెలిచారు. దీంతో వైఎస్సార్సీపీకి సంపూర్ణ ఆధిక్యత దక్కింది. ఇక్కడ టీడీపీ 16 వార్డులు, బీజేపీ 1, కాంగ్రెస్ 2 వార్డులు దక్కించుకున్నాయి. - మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహించిన ఆత్మకూరు మున్సిపాలిటీని గెలవడం కోసం ఆయన పెద్ద ప్రయత్నమే చేశారు. కొన్ని వార్డుల్లో తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకుని వైఎస్సార్సీపీని ఓడించే వ్యూహం అమలు చేశారు. టీడీపీ సైతం భారీగానే ఓటర్లకు నోట్లు పంపిణీ చేసింది. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 డివిజన్లు గెలిచింది. కాంగ్రెస్ 8 స్థానాలు దక్కించుకోగా, టీడీపీ 4 వార్డులు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి మూడో వార్డులో స్వతంత్రుడిగా పోటీ చేసిన షేక్ సందాని గెలిచారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల అనంతరం ఇక్కడ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి స్పష్టత రానుంది. - వెంకటగిరి, నాయుడుపేట మున్సిపాలిటీల్లో మాత్రం టీడీపీ పూర్తి మెజారిటీ సాధించింది. వెంకటగిరిలో 25 వార్డులకు గాను 21, నాయుడుపేటలో 20 వార్డులకు గాను 14 గెలుచుకుంది. -
ఫ్యాన్ జోరు
సాక్షిప్రతినిధి, కర్నూలు : మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. జిల్లాలోని ఆదోని, నందికొట్కూరు మున్సిపాలిటీలు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలను వైఎస్ఆర్సీపీ దక్కించుకోగా.. నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీలు టీడీపీ ఖాతాలో చేరిపోయాయి. జిల్లాలో ఒక కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీలు ఉండగా... కర్నూలు కార్పొరేషన్, బనగానపల్లి మున్సిపాలిటీ మినహా మిగిలిన మున్సిపాలిటీలకు మార్చి 30న ఎన్నికలు నిర్వహించారు. సుమారు 45 రోజుల క్రితం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం పూర్తయింది. కర్నూలు శివారు ప్రాంతంలోని సెయింట్జోసెఫ్ బాలిల జూనియర్ కళాశాలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య చేపట్టిన ఓట్ల లెక్కింపులో ప్రారంభం నుంచి ఫ్యాను జోరు కనిపించింది. జిల్లా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని నిరూపించారు. మొత్తం 219 వార్డులుండగా.. ఆళ్లగడ్డలో రెండు వార్డులు వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన 217 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. వైఎస్సార్సీపీ 104, టీడీపీ 102, కాంగ్రెస్ 2, ఎంఐఎం 5, ఆర్పీఎస్ ఒకటి, ఇండిపెండెంట్లు 3 వార్డుల్లో గెలిచారు. ఆళ్లగడ్డలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఎదురులేదని మరోసారి నిరూపితమైంది. ఎన్ని కుట్రలు పన్నినా ఆ కుటుంబాన్ని ఢీకొనలేరని తేలిపోయింది. ఈ మునిసిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉంటే... 18 వార్డులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ రెండు వార్డులకే పరిమితమైంది. వీటిని కూడా అతికష్టం మీద దక్కించుకోగలిగింది. 9వ వార్డులో 60 ఓట్లు, 20వ వార్డులో 56 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు గట్టెక్కారు. అదేవిధంగా ఆదోని మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుపై ప్రజలకున్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దం పట్టాయి. మొత్తం 41 వార్డుల్లో 23 వార్డులను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దక్కించుకోవడం విశేషం. టీడీపీ 13 స్థానాలకే పరిమితమైంది. ఇక నందికొట్కూరులోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించింది. మొత్తం 23 వార్డుల్లో అత్యధికంగా 15 వార్డులను కైవసం చేసుకుని సత్తా చాటింది. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినా నందికొట్కూరు వాసులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ గుండెల్లో ఉన్నారని చాటుకున్నారు. ఇక్కడ టీడీపీ, ఆర్పీఎస్ ఒక్కటై ఫ్యాన్ జోరును ఆపాలని చూసినా చుక్కెదురవడం గమనార్హం. టీడీపీ.. మూడింటితో సరి నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీలను టీడీపీ దక్కించుకుంది. డోన్ మున్సిపాలిటీలో అతి కష్టంపై నెగ్గుకొచ్చింది. స్థానికంగా టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుమ్ముక్కవడంతోనే ఈ ఫలితం చేజిక్కించుకున్నట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా నంద్యాలలోనూ కాంగ్రెస్, టీడీపీ తెరచాటు బాగోతం నడపటంతో పాటు దొంగ ఓట్లు వేయించినట్లు తెలుస్తోంది. పోలింగ్ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓటర్లను అడ్డుకోవడం ఇందుకు నిదర్శనం. టీడీపీ గెలుపొందిన ఆ మూడు మున్సిపాలిటీల్లో ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ జిల్లాలో అత్యధిక మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. -
గూడూరులో వైఎస్సార్సీపీ జయభేరి
గూడూరు, న్యూస్లైన్ : గూడూరు నగర పంచాయతీకి మొదటిసారి నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డికి కంచుకోటగా ఉన ్న గూడూరు పట్టణం వైఎస్సార్సీపీ పరమైంది. మొత్తం 20 వార్డుల్లో 11 స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. టీడీపీ 6, కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ఓటర్లు గట్టిగా గుణపాఠం చెప్పారు. వైఎస్సార్సీపీ కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి ఎం.మణిగాంధీ, నేతలు ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి, మాజీ ఎంఎల్ఏ కొత్తకోట ప్రకాష్రెడ్డి స్థానిక నేతలతో కలిసి మెలసి పనిచేయడం వల్లే అధిక స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. పట్టణంలో వైఎస్సార్సీపీ గెలుపొందడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. స్వతంత్ర అభ్యర్థి వైఎస్సార్సీపీలో చేరిక 15వ వార్డు నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి కె.వెంకట్రాముడు వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 12కి చేరింది. స్థానిక నేతలు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్.వెంకటేశ్వర్లు, మాజీ ఉప-సర్పంచు ఎస్ఎ జిలానీ ఆధ్వర్యంలో వెంకట్రాముడు కర్నూలులో విష్ణువర్ధన్రెడ్డిని కలిసి పూలమాల వేసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థి ఓటమి గూడూరు మునిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన డి.సుందరరాజు ఓటమి పాలయ్యాడు. 20వ వార్డు నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దిగగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడివెప్ప 157 ఓట్ల మెజార్టీతో ఓడించాడు. 19వ వార్డు నుంచి పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పీఎన్ అస్లామ్ సమీప టీడీపీ అభ్యర్థి షరీఫ్పై 445 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించాడు. అస్లామ్కు 557 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 112 మాత్రమే వచ్చాయి. -
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీదే ఆధిక్యం
- సంస్థాగత నిర్మాణం లేకున్నా టీడీపీకి గట్టిపోటీ ఇచ్చిన వైఎస్సార్సీపీ - అనంతపురం కార్పొరేషన్తో పాటు తొమ్మిది మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఆధిక్యం చాటుకున్న టీడీపీ - గుత్తి నగర పంచాయతీలో వైఎస్సార్సీపీ ఖాతాలోకి మెజార్టీ వార్డులు - టీడీపీ కంచుకోట హిందూపురంలో ఆ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కని వైనం సాక్షి ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికలకు ముందు అనుకోకుండా వచ్చిపడిన మున్సిపల్ ఎన్నికల్లో సంస్థాగత నిర్మాణం లేకున్నా టీడీపీకి వైఎస్సార్సీపీ గట్టిపోటీ ఇచ్చింది. టీడీపీ కంచుకోటగా భావిస్తోన్న హిందూపురం మున్సిపాలిటీలో ఆ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కలేదు. ఇక్కడ టీడీపీకి వైఎస్సార్సీపీ గట్టిపోటీ ఇచ్చింది. కదిరి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ విజయాన్ని ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు అడ్డుకున్నారు. అనంతపురం కార్పొరేషన్తోపాటు తొమ్మిది మున్సిపాల్టీల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. అనంతపురం కార్పొరేషన్, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్, కదిరి, ధర్మవరం మున్సిపాలిటీలు, కళ్యాణదుర్గం, మడకశిర, పామిడి నగర పంచాయతీల్లో మెజార్టీ వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. గుత్తి మునిసిపాలిటీలో సింహభాగం వార్డులను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ, వైఎస్సార్సీపీ నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. వైఎస్సార్సీపీ గట్టిపోటీ ఇవ్వడంతో హిందూపురంలో టీడీపీ మేజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. - కదిరి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేయలేదు. కానీ.. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టీడీపీకి గట్టిపోటీ ఇచ్చింది. వైఎస్సార్సీపీ టికెట్ దక్కక బరిలోకి దిగిన రెబల్స్ 14 వార్డుల్లో ఆ పార్టీ అధికారిక అభ్యర్థులను ఓడించారు. ఆ మేరకు టీడీపీ లబ్ధి పొందింది. వైఎస్సార్సీపీ రెబల్ అభ్యర్థులు బరిలో లేకపోతే కదిరి మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. - హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయలేదు. అయినా.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో వైఎస్సార్సీపీ నువ్వానేనా అన్నట్లుగా తలపడింది. మొత్తం 38 వార్డులకుగానూ.. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే 20 వార్డులు చేజిక్కించుకోవాలి. కానీ.. టీడీపీ 19 వార్డులకే పరిమితమై.. మేజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. - తాడిపత్రి, రాయదుర్గం, ధర్మవరం, గుంతకల్ మున్సిపాలిటీల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యం సాధించిది. ఆ నాలుగు మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలు టీడీపీ ఖాతాలో చేరనున్నాయి. - మడకశిర, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, పామిడి నగర పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ మెజార్టీ సాధించింది. ఆ పంచాయతీల ఛైర్మన్ పదవులు కూడా ఆ పార్టీ ఖాతాలోనే చేరనున్నాయి. - గుత్తి నగర పంచాయతీలో 24 వార్డులకుగాను 11 వార్డుల్లో వైఎస్సార్సీపీ గెలుపొంది.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. చైర్మన్ పీఠం చేజిక్కించుకోవాలంటే మరో రెండు వార్డుల సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటికే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించారు. - అనంతపురం కార్పొరేషన్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుకుంది. మొత్తం 32 డివిజన్లను చేజిక్కించుకుని.. మేయర్ పదవిని ఆపార్టీ ఖాతాలో వేసుకుంది. -
నేడు ప్రాదేశిక ఫలితాలు
డివిజన్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు - ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం - మధ్యాహ్నం 3గంటల్లోగా ఎంపీటీసీ ఫలితాలు - రాత్రి వరకు కొనసాగనున్న జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు - కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు - గెలుపు సంబరాలు, మద్యం దుకాణాలు బంద్ నల్లగొండ, న్యూస్లైన్, ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవి తవ్యం మంగళవారం తేలనుంది. ఈ ఓట్ల లెక్కింపు ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 59 జెడ్పీటీసీ స్థానాలకు 392 పోటీలో ఉండగా, 835 ఎంపీటీసీ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 3,311మంది పోటీ చేశారు. తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో జరిగాయి. రెండో విడత 11వ తేదీన నల్లగొండ, భువనగిరి డివిజన్ పరిధిలోని మండలాలకు జరిగాయి. ఎన్నికల ఫలితాల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఉదయం 7.30 గంటలకు ఆయా డివిజన్ కేంద్రాల్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాత 10గంటల నుంచి బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో 484 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నిర్వహణకు రెండువేల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. లెక్కింపు ఇలా.. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఓట్ల లెక్కింపు కోసం ఐదు కేంద్రాల్లో ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ముందుగా ఆయా గ్రామాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల సమక్షంలో సీల్ తీస్తారు. ఇలా తీసిన బాక్సుల్లో ఓట్లను ఒక కుప్పగా వేసి అందులోంచి జెడ్పీటీసీకి కేటాయించిన తెల్లరంగు బ్యాలెట్, ఎంపీటీసీకి కేటాయించిన గులాబీ రంగు బ్యాలెట్లను వేరుచేస్తారు. వేరుచేసిన బ్యాలెట్ పేపర్లను ఆయా గుర్తులతో ముందుగానే సిద్ధం చేసిన ట్రేలల్లో వేస్తారు. ఇలా వేరు చేయడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. పూర్తిస్థాయి లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తారు. ప్రతి ఎంపీటీసీ స్థానం లెక్కింపు మూడురౌండ్లుగా జరుగుతుంది. ఒక్కో రౌండ్కు సుమారు వెయ్యి ఓట్లను లెక్కపెడతారు. ప్రతి గంటకు ఒకసారి ఓట్ల లెక్కించిన వివరాలను ఏజెంట్లకు, మీడియాకు సమాచారం అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటవరకు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. జెడ్పీటీసీల లెక్కింపు రాత్రి వరకు పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 25ఓట్లను ఒక బండిల్గా కట్టి ఓట్లను లెక్కపెడతారు. ఇలా చేయడం వల్ల లెక్కింపు సులువుగా ఉండడమే గాకుండా, త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పకడ్బందీ బందోబస్తు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మినహా మిగతా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. అలాగే ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు గెలుపు సంబరాలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధించారు. -
నేటి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
సూర్యాపేట రూరల్, న్యూస్లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు సూర్యాపేట మండలం అరవిందాక్ష ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను సోమవారం జేసీ హరి జవర్లాల్ పర్యవేక్షించారు. బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని పోలీసులకు సూచించారు. అదే విధంగా మాక్ కౌంటింగ్ నిర్వహణను పరిశీలించారు. సూర్యాపేట రెవెన్యూ డివిజన్లోని 14 మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. అరవిందాక్ష ఇంజనీరింగ్ కళాశాలలో మూడో అంతస్తులో సూర్యాపేట, చిలుకూరు, మోతే, నడిగూడెం, మునగాల, ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల మండలాల ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. నాలుగవ అంతస్తులో తుంగతుర్తి, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, కోదాడ, మేళ్ళచెరువు మండలాల ఓట్ల లెక్కించనున్నారు. ఒక్కో మండలానికి ఆరు నుంచి ఏడు టేబుల్లు ఏర్పాటు చేయగా, కౌంటింగ్ నిర్వహించేందుకు ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు సిబ్బంది ఉంటారని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్కు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు వరుస క్రమంలో కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా వాహనాల పా ర్కింగ్, మంచినీటి వసతి, తదితర ఏర్పాట్లన్నింటినీ సూర్యాపేట ఆర్డీఓ వి.నాగన్న పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే వారు తప్పని సరిగా పాస్ తీసుకోవాలని తెలిపారు. -
భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు
సంగారెడ్డి క్రైం, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సంగారెడ్డిలో సోమవారం పోలీసులు భారీగా మోహరించారు. డీఆర్డీఏ, మహిళా ప్రాంగ ణం వద్ద లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శెముషీ బాజ్పాయ్ నేతృత్వంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాలను ఆ రోడ్డుపై కాకుండా ఇతర దారుల్లోకి మళ్లించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు వాహనాలను అనుమతించలేదు. లెక్కింపు కేంద్రాలకు కౌన్సిలర్ అభ్యర్థులను, వారి తరఫున నియమించిన ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా సీఐలు 10 మంది, ఎస్ఐలు 38, ఎఎస్ఐలు- హెడ్కానిస్టేబుళ్లు 49, కానిస్టేబుళ్లు 216, మహిళా కానిస్టేబుళ్లు 17, హోంగార్డులు 56, ఆర్ఎస్ఐలు ఇద్దరు, ఏఆర్ఎస్ఐలు-హెడ్కానిస్టేబుళ్లు 10, ఏఆర్ కానిస్టేబుళ్లు 60 మంది విధుల్లో పాల్గొన్నారు. డీఆర్డీఏ, మహిళా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను ఎస్పీ, ఎఎస్పీ ఆర్.మధుమోహన్రెడ్డి, సంగారెడ్డి డిఎస్పీ వెంకటేష్, డీఎస్పీ రాజేంద్ర, సీఐలు శివశంకర్ నాయక్, చెన్నకేశవులు తదితరులు పర్యవేక్షించారు. -
‘పుర’ ఫలితం నేడే
సాక్షి, ఒంగోలు: మున్సిపల్.. స్థానికం.. సార్వత్రికం.. వరుస ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా పూర్తవడంతో.. ఇక ఓట్ల లెక్కింపును కూడా ప్రశాంతంగా ముగించాలని జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తొలుత సోమవారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ మేరకు ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, కందుకూరు మున్సిపాలిటీల ఎన్నికలు కోర్టు వ్యాజ్యాల నేపథ్యంలో వాయిదా పడగా, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలతో పాటు అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీలకు మార్చి నెల 30వ తేదీ పోలింగ్ జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు ఈవీఎంలు వినియోగించడంతో ఓట్ల లెక్కింపు సైతం సులువుగా, వేగంగా పూర్తికానుంది. ఉదయం 8 గంటలకే ప్రారంభం కానున్న లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను పార్టీలవారీగా లెక్కించి.. అనంతరం ఈవీఎంలను వార్డుల వారీగా లెక్కించనున్నారు. మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేసిన క్రమంలో ఒక్కోరౌండ్కు 14 వార్డుల ఓట్లను లెక్కించవచ్చు. ప్రతీ రౌండ్కు అర్ధగంట నుంచి ముప్పావుగంట సమయం పడుతుంది. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై కలెక్టర్ విజయకుమార్ ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. టేబుళ్ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని కూడా అదనంగానే నియమించి ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా వేగవంతంగా పూర్తిచేయాలని కసరత్తు చేస్తున్నారు. మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ఇలా.. ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపై మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులతో ఇప్పటికే కలెక్టర్ విజయకుమార్ సమీక్ష నిర్వహించారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కోరౌండ్కు 14 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. అంటే, ఒక్కోవిడత 14 వార్డుల్లో ఓట్లను లెక్కించవచ్చు. జిల్లాలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో 20 నుంచి 30 వార్డులున్నాయి. అంటే, 20 వార్డులున్న మున్సిపాలిటీల ఓట్లలెక్కింపు రెండు రౌండ్లలోనూ, 30 వార్డులుంటే వాటి లెక్కింపు మూడు రౌండ్లలోనూ పూర్తికానుంది. ప్రతీ అర్ధగంట నుంచి ముప్పావుగంటకో రౌండ్ ముగియనుంది. ఆమేరకు ఉదయం 8 గంటలకే ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ఉదయం 10.30 నిముషాలకల్లా పూర్తికానుంది. 11 గంటలకల్లా తుది ఫలితాలు వెల్లడించి.. విజేతలకు ధ్రువీకరణలు అందజేయనున్నారు. అభ్యర్థుల ఉత్కంఠ.. మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద లెక్కింపు సమయాన పోటీచేసిన అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల ఏజెంట్లను కూడా అనుమతించనున్నారు. పార్టీలవారీగా రౌండ్ ఫలితాలను ఏజెంట్ల సమక్షంలోనే లెక్కించనున్నారు. మొట్టమొదటి సారిగా మున్సిపల్ ఎన్నికలు ఎదుర్కొన్న నాలుగు నగర పంచాయతీలతో పాటు రెండు మున్సిపాలిటీల పరిధిలో బరిలో నిల్చిన అభ్యర్థుల్లో సోమవారం కౌంటింగ్పై ఉత్కంఠ నెలకొంది. అన్నిచోట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా.. చీరాల, గిద్దలూరులో స్వతంత్ర అభ్యర్థులూ గట్టిపోటీనే ఇచ్చారు. పట్టణ ఓటర్ల నాడి మున్సిపాలిటీల్లో ఎలా పనిచేసింది.. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపైనా ఉంటుందా..? అనే భావనలో రాజకీయ పార్టీల నేతలంతా ఉత్కంఠతో ఉన్నారు. -
మున్సి‘పల్స్’ తేలేది నేడే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సి‘పల్స్’ తేలేందుకు మరికొన్ని గంటలే సమయం.. సుమారు 42 రోజుల నిరీక్షణకు తెరపడనుంది. పురపాలక సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. నిజానికి ఏప్రిల్ 2న ఎన్నికల ఫలితాలు ప్రకటించి, 5న చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రభావం ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల మీద పడే అవకాశం ఉందనే కారణంతో న్యాయస్థానం ఫలితాలను వాయిదా వేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సోమవారంతో ముగుస్తున్నందున ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలలో మొత్తం 145 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జోగిపేట-అందోల్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, జహీరాబాద్కు సంబంధించిన ఎన్నికల ఓట్లను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో, సదాశివపేట, మెదక్, సంగారెడ్డి మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్లను పాత డీఆర్డీఏ భవనంలో లెక్కిస్తారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం అవుతుందని, మధ్యాహ్నం 12.30 గంటలలోపే ఫలితాలు వస్తాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ మీడియాకు తెలిపారు. ఓట్లను మూడు రౌండ్లలో లెక్కిస్తారు. ఒక రౌండు పూర్తి కావడానికి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది. నివేదికలను కూడా ఇవాల్సి ఉంటుంది కాబట్టి గరిష్టంగా 30 నిమిషాల్లో ఒక రౌండు ముగుస్తుంది. ప్రతి రౌండులో 10 వార్డుల ఫలితాలు వస్తాయి. ఈ లెక్కన గంటన్నర వ్యవధిలోనే ఫలితాలు అందుతాయి. చైర్మన్ ఎంపిక ఆలస్యం... మున్సిపల్ చైర్మన్ ఎంపిక ఆలస్యం కానుంది. చైర్మన్ ఎంపికలో ఎమ్మెల్యేల ఓటు కూడా కీలకమే. అయితే ప్రమాణ స్వీకారం తర్వాతే ఎమ్మెల్యేలకు ఎక్స్అఫీషి యో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉం టుంది. కాబట్టి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాతే మున్సిపల్ చైర్మన్లను ఎంపిక చేసే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతున్నారు. పట్టణంలో మద్యం దుకాణాలు బంద్ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌటింగ్ కేంద్రాల సమీపంలోని మద్యం దుకాణాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మరుసటి రోజు కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్నందున మంగళవారం కూడా మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. -
మున్సి‘పల్స్’ తేలేది రేపే
సాక్షి, ఖమ్మం: కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు.., సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సుమారు నెలన్నరరోజులుగా ఎదురు చూస్తున్న ఫలితాలు సోమవారం తేలనుండడంతో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరుసగా జరిగిన ఎన్నికలకు ఇదే తొలి ఫలితం కావడంతో అన్ని పార్టీలు వీటిపై అంచనాలు వేసుకున్నాయి. మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు ముగి శాయి. కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలో మొత్తం 97 వార్డుల్లో 523 మంది తలపడ్డారు. నాలుగు చోట్ల 1,35,235 మంది ఓటర్లు తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పురపోలింగ్ ముగిసినప్పటి నుంచి కూడా తమకు వచ్చే వార్డులు, చైర్మన్ పీఠంపై పార్టీల నేతలు, అభ్యర్థులు లెక్కలు కడుతూనే ఉన్నారు. ప్రధానంగా కొత్తగూడెం, ఇల్లెందులో ఎవరు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారోననే చర్చ జోరుగా సాగుతోంది. కొత్తగూడెంలో 33 వార్డులకు 190 మంది, ఇల్లెందులో 24 వార్డులకు 173 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... ఇక్కడ గెలుపుపై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్లుగా పోలింగ్ జరిగిన చాలారోజుల తర్వాత ఫలితా లు వెలువడుతుండడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కౌంటింగ్కు సంబంధించి ఇప్పటికే అందరు అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకున్నారు. కౌంటింగ్ ప్రారంభించిన కొద్ది సమయంలోనే ఫలితాలు వెలువడనుండడంతో ఏ పార్టీ మెజారిటీ వార్డులు సాధించేది, చైర్మన్ పీఠం ఎవరిదీ కూడా తేలిపోనుంది. లెక్కింపునకు 125మంది ప్రత్యేక సిబ్బంది మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరుస ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగం తొలి ఫలితం వెల్లడించేందుకు సమాయత్తమైంది. ఈ ఓట్ల లెక్కింపునకు కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలో 125 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. కొత్తగూడెంలో ఆరుటేబుళ్లు, ఇల్లెందులో నాలుగు టేబుళ్లు, మధిరలో ఐదు, సత్తుపల్లిలో నాలుగు టేబుళ్లు ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రతి చోట నాలుగు లేదా ఐదు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన రెండు,మూడు గంటల్లో ఎవరు విజేతలు, ఎవరు పరాజితులో బయట పడనుంది. విధులు కేటాయించిన సిబ్బంది ఆదివారం సాయంత్రమే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. -
మున్సిపల్ పీఠంపై ప్రధాన పార్టీల నజర్
తాండూరు, న్యూస్లైన్ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు దగ్గర పడుతుండటంతో తాండూరులో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. తాండూరు మున్సిపాలిటీలోని 31 వార్డుల ఓట్ల కౌంటింగ్, కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిని సోమవారం ప్రకటించనున్నారు. అయితే చైర్పర్సన్ ఎన్నిక మాత్రం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ పదవిపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ పదవి చేజిక్కించుకోవాలంటే 16వార్డుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే మెజార్టీ స్థానాలు రావని అంచనాకొచ్చిన ప్రధాన పార్టీల నాయకత్వాలు ఎలాగైనా మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్లో కౌన్సిలర్లుగా గెలిచే అవకాశం ఉన్న వారికి ప్రధాన పార్టీల నాయకులు గాలం వేస్తున్నారు. చైర్పర్సన్ ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని సదరు అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు. తమ పార్టీ అభ్యర్థి చైర్పర్సన్గా ఎన్నికైతే నగదు నజరానాలు, అభివృద్ధి పనుల కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఆఫర్లు ఎరవేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే మరోవైపు సొంత పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్, ఫలితాలు వెల్లడయ్యే వరకూ చైర్పర్సన్ ఎన్నిక జరిగే అవకాశం లేనందున క్యాంపు రాజకీయాలకు వ్యూహరచన చేస్తున్నారు. కౌన్సిలర్లుగా గెలిచిన తమ వారిని, చైర్పర్సన్ ఎన్నికలో తమకు మద్దతు ఇచ్చేవారిని రహస్య ప్రాంతాలకు తరలించాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. బెంగళూరు, ముంబై తదితర నగరాలకు అభ్యర్థులను తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఏసీ బస్సులను సైతం సిద్ధం చేసినట్టు సమాచారం. -
ఓట్ల లెక్కింపునకు పరిశీలకుల నియామకం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్లైన్: ఈనెల 13న నిర్వహించే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు మూడంచెల పోలీస్ బందోబస్తుతో పాటు అదనపు పరిశీలకులను నియమిస్తూ కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. -
మునిసిపల్ ఓట్ల లెక్కింపునకు భద్రతా ఏర్పాట్లు
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలో ఈ నెల 12న ఏలూరు కార్పొరేషన్, ఏడు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జిల్లాలోని మునిసిపల్ కమీషనర్లతో ఆయన కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి కౌంటింగ్ సెంటరులో లెక్కింపు నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఆయా మునిసిపల్ కమిషనర్లు ముందుగానే పూర్తి చేసుకోవాలన్నారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటలకే కౌంటింగ్ సెంటర్కు హాజరు కావాలన్నారు. వారి సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ చేపట్టి ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్లోకి సెల్ఫోన్లు అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేసి వాటిలో కంప్యూటర్, ఇంటర్నెట్, టెలిఫోన్ తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు వివరించేందుకు మీడియా సెంటరును ఏర్పాటు చేసి, అక్కడ ఓ ఉద్యోగిని నియమించాలని సూచించారు. కౌంటింగ్ సరళిని వీడియో తీయించాలని, సంబంధిత సీడీలు, డీవీడీలను భద్రపరచాలన్నారు. ఆరోజు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు స్థానిక ఎన్నికల పరిశీలకులు కె.ప్రవీణ్కుమార్, విజయమోహన్ వస్తారని తెలిపారు. కౌంటింగ్ సెంటర్లు ఇవి.. ఏలూరు- సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ కొవ్వూరు- బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడేపల్లిగూడెం- డీఆర్ గోయెంకా మహిళా డిగ్రీ కళాశాల నిడదవోలు- ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భీమవరం- మునిసిపల్ కార్యాలయంలో పాత కౌన్సిల్ హాల్ తణుకు- ఎస్కేఎస్డీ మహిళా కళాశాల నరసాపురం-పాలకొల్లు రోడ్డులోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాల పాలకొల్లు- సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల జంగారెడ్డిగూడెం- ఏఎంసీ కార్యాలయం గోడౌన్ అదనపు పరిశీలకులుగా 9 మంది నియామకం కౌంటింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు 9 మంది అధికారులను అదనపు పరిశీలకులుగా కలెక్టర్ నియమించారు. ఏలూరుకు జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి, కొవ్వూరుకు ఆర్డీవో గోవిందరావు, తాడేపల్లిగూడెంకు కేఆర్సీ ఎస్డీసీ కోగంటి ఉమారాణి, నిడదవోలుకు టీఎల్ఐఎస్ ఎస్డీసీ ఎం.సమజ, భీమవరానికి డ్వామా అదనపు పీడీ టి.సవరమ్మ, తణకుకు డీపీవో నాగరాజువర్మ, నరసాపురానికి ఆర్డీవో జె.ఉదయభాస్కర్, పాలకొల్లుకు మైక్రోఇరిగే షన్ పీడీ ఆర్వీ సూర్యనారాయణను నియమించారు.