Danam Nagender
-
బిల్డర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొందరు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ.. బిల్డర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. వీరంటే జీహెచ్ఎంసీ సిబ్బంది వణికిపోతున్నారని, అందరూ కూర్చుని కాంప్రమైజ్ అవుతుండడంతో.. అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. శాసనసభలో మంగళవారం జరిగిన జీరోఅవర్లో ‘దానం’మాట్లాడారు. తన ప్రమేయం లేకుండా.. తన నియోజకవర్గంలోని ఈద్గా మైదానంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. దీంతో తాను వెళ్లి.. సబ్ స్టేషన్కు వేసిన పునాదులను కూల్చివేశానన్నారు. తన క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరినా కేటాయించడం లేదని ‘దానం’ విమర్శించారు. » అంబర్పేటలో రూ.400 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మించగా, సీఎంకు సమయం లేక ఇంకా ప్రారంభించలేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఫ్లైఓవర్కు సమాంతరంగా సర్వీసు రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మూసారాంబాగ్ ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన సాగుతోందని, వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ 15 నెలలుగా తమ నియోజకవర్గాల్లో ఎలాంటి పనులకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. » ఎల్బీనగర్ నియోజకవర్గంలో హుడా ఆమోదించిన లేఅవుట్లో 44 కాలనీలు ఏర్పాటు కాగా, ఆ తర్వాత ఆ స్థలం ప్రభుత్వానిదని పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు ఆపేశారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 118 కింద ఈ స్థలాలను క్రమబద్దికరించి కన్వేయన్స్ డీడ్స్ జారీ చేసిందని చెప్పారు. ఎన్నికలు రావడంతో కొందరికి ఇవ్వలేకపోయిందన్నారు. మిగిలిన వారికి సైతం కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడంతో పాటు నిషేధిత జాబితాల నుంచి ఈ స్థలాలను తొలగించాలని కోరారు. ఈ సమస్యను గతంలో సైతం తన దృష్టికి తీసుకువచ్చారని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బదులిచ్చారు. » నగరంలోని బస్తీ దవాఖానాల్లో వైద్యులు, అత్యవసర మందులు లేవని యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తెలిపారు. రక్త పరీక్షలు సైతం జరపడం లేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు బస్తీ దవాఖానాలకు ప్రజలు ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలానికి తక్షణమే ఎన్వోసీ జారీ చేయాలని జీహెచ్ఎంసీని కోరారు. » ప్రకాశ్నగర్, ఇతర కాలనీల ప్రజలు అటవీ భూముల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని, వారికి పట్టాలు ఇవ్వాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. » తన నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.15 కోట్లు రావలసి ఉండగా, ఇవ్వడం లేదని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మెట్పల్లి ఆస్పత్రి నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వాలని కోరారు. మునిపేటలో రుణమాఫీ జరగని 330 మంది రైతులు ప్రజావాణిలో కలెక్టర్ను కలిసేందుకు వెళ్తే అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. » నాగర్కర్నూల్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం నిర్మించాలని, సాంకేతిక విద్య కళాశాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కె.రాజేశ్రెడ్డి విజ్ఞప్తి చేశారు. » సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల మధ్య ఉన్న తన నియోజకవర్గం.. గత బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మానకొండూరు ఎమ్మెల్యే కె.సత్యనారాయణ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆట పాటలు, ఎగరడం, దూకడానికే పరిమితమయ్యారని, నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించగా, బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కేవలం 24 ఎకరాలు సేకరిస్తే 10వ ప్యాకేజీ పనులు పూర్తయ్యేవని, బాలకిషన్ ప్రజలను రెచ్చగొట్టి పనులు జరగకుండా చేశారని ఆరోపించారు. సత్వరం భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. » ఆసిఫాబాద్ నియోజకవర్గం ఉండి గ్రామంలో రూ.8.5 కోట్లతో మంజూరైన వంతెన నిర్మాణ అంచనాలు రూ.14.4 కోట్లకు పెరిగాయని, నిధులు మంజూరు చేసి సత్వరం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి విజ్ఞప్తి చేశారు. లక్మాపూర్ వంతెనను కూడా పూర్తిచేయాలని, ఆసిఫాబాద్ నుంచి అస్మాపూర్ వరకు రోడ్డు వేయాలని కోరారు. » నారాయణపేట నియోజకవర్గం కోయిల్కొండ నియోజకవర్గంలో బీసీ వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధన్వాడలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. » నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన 396 ఇళ్లతో పాటు నిర్మాణం ఆగిపోయిన 252 ఇళ్లను పూర్తిచేసి లబ్దిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే డి.సూర్యనారాయణ గుప్తా విజ్ఞప్తి చేశారు. » మిర్యాలగూడను స్పెల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండగా, విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. -
మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని.. వచ్చాక స్పందిస్తానన్నారు. పోతే జైలుకు పోతా.. నాపై 173 కేసులు ఉన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదల ఇళ్లు కుల్చుతా అంటే ఊరుకోం. హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదు. నా ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫోటో ఉంది. ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి?. ఎవరి అభిమానం వాళ్లది’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.ఆయన గతంలో కూడా నగరంలో ఫుట్పాత్ కూల్చివేతలపై అధికారులు ఏకఫక్షంగా వవ్యహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారన్నారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నామంటూ వ్యాఖ్యానించారు. -
మీరు చేసే పనులు వల్ల ప్రజల్లో తిరగలేకపోతున్నాం: దానం
ఆదర్శ్ నగర్( హైదరాబాద్): నగరంలో ఫుట్పాత్ కూల్చివేతలపై(Demolished FootpathDemolish Footpaths) అధికారులు ఏకఫక్షంగా వవ్యహరిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేదందర్(Danam Nagender) మండిపడ్డారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆదర్శనగర్ లో ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్.. ‘ అధికారులు(GHMC Officials) చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నాం. పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదు.ఓల్డ్ సిటీ లో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా?, మొదలు పెడితే అక్కడి నుండే తొలగింపులు చేయాలి. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని... హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేను. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు... అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలు మనుగడ ఉండదు.ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పని చేయాలి. హైడ్రా చెరువులను కాపాడటానికి పని చేస్తుంది , దానిని స్వాగతిస్తున్నాను.మూసి ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్షతనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్ కాబట్టి.. తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికె పరిమితం కాదు..హైద్రాబాద్ లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం అన్నా ముందుంటాడు.గతంలో నేను హైడ్రా విషయంలో మాట్లాడిన ఇప్పుడు ఫుట్పాత్ ల విషయంలో మాట్లాడుతున్న అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే నా అభిప్రాయంఇటీవల మాదాపూర్ లో ఫుట్పాథ్ పై కుమారి అంటి ని వేదిస్తున్నప్పుడు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆమె జోలికి పోవొద్దని అధికారులకు ఏవిధంగా ఆదేశాలు ఇచ్చారో..ఇప్పుడు ఫుట్పాథ్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా ఆదేశాలు ఇవ్వాలి’ అని దానం పేర్కొన్నారు.హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు -
అక్రమ కూల్చివేతలను అడ్డుకున్న దానం!
-
హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్లో కేటీఆర్కు తాను క్లీన్చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్కు ఇమేజ్ పెరిగిందని మాత్రమే చెప్పానని.. విచారణ జరిగేటప్పుడు కామెంట్ చేయడం సరికాదన్నారు. క్విడ్ప్రోకో జరిగిందా లేదా తేల్చాలి. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెబుతున్నాను. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. తాను ఫైటర్ను.. ఉప ఎన్నికకు భయపడేది లేదని దానం అన్నారు.‘‘నేను ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతుంది. మూసీపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు. వారి ఇళ్లల్లోనే చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబయికి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.’’ అని దానం నాగేందర్ చెప్పారు.‘‘పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎంకి పాలాభిషేకం చేయాలి’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో లక్ష ఇళ్లు @సేల్! -
నిర్ణయం స్పీకర్దే
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్గా ఇచ్చిన అధికారాల మేరకు విధులు నిర్వహించాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో (రీజనబుల్ టైమ్) తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి..’ అని స్పష్టం చేసింది. ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తద్వారా స్పీకర్ ముందు పిటిషన్లు పెండింగ్లో ఉండగా కోర్టులు జోక్యం చేసుకోలేవని తేలి్చచెప్పింది. స్టేషన్ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు.అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అనర్హత పిటిషన్ల విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సెపె్టంబర్ 9న తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు ఇలా.. ‘స్పీకర్ తన ముందున్న పిటిషన్లపై నిర్ణయం వెలువరించిన తర్వాత కోర్టులు న్యాయ సమీక్ష జరపొచ్చు. అయితే అది కూడా చాలా స్వల్పమే. కానీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోక ముందు కోర్టులు ఆయనపై ఒత్తిడి తేలేవు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజ్యాంగ అధిపతి అయిన స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అతి స్వల్పం. తన ముందున్న అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది.స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని గతంలో ఎర్రబెల్లి దయాకర్ పిటిషన్లో ఇదే హైకోర్టు స్పష్టం చేసింది..’అని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్రెడ్డి, జంధ్యాల రవిశంకర్ వాదించారు. అయితే ‘పదవ షెడ్యూల్ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి.సాధారణంగా లోక్సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. కాబట్టి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచకుండా నిరీ్ణత సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ 8 నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింగిల్ జడ్జి ఇచి్చన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదు..’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్రావు, బీజేపీ Ôనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తరఫు న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు.పలు తీర్పులు ప్రస్తావించిన ధర్మాసనం సెపె్టంబర్ 30న అప్పీళ్లు దాఖలైన నాటి నుంచి ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న సీజే ధర్మాసనం ఈ నెల 12న తీర్పు రిజర్వు చేసింది. ఎర్రబెల్లి దయాకర్రావు వర్సెస్ తలసాని శ్రీనివాస్యాదవ్, ఎస్ఏ సంపత్కుమార్ వర్సెస్ కాలే యాదయ్య, కీష మ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్, మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాజేంద్రసింగ్ రాణా, కిహోటో హో లోహన్ సహా పలు కేసుల్లో తీర్పులను శుక్రవారం తీర్పు వెల్లడి సందర్భంగా సీజే ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు పలు కేసుల విచారణ సందర్భంగా స్పీకర్ తగిన(రీజనబుల్) సమయంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్న విషయాన్ని నొక్కి చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి తగిన అధికారం స్పీకర్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొంది. -
హైడ్రా ముందే మేల్కొంటే బాగుండేది: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా అంటే ప్రజల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కొంచెం ముందుగా మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కారణంగానే అక్రమ కట్టడాలను పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్దారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతాను. హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా?. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారు. కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలి. కూలగొట్టే ముందు అక్కడి వాస్తవ పరిస్థితులు హైడ్రా ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఒక చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని బోరున ఏడ్చింది.. నాకు చాలా బాధగా అనిపించింది. పేదల విషయంలో హైడ్రా మరోసారి ఆలోచించాలి. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు పది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మా కేసు బూచీగా చూపెట్టి బీఆర్ఎస్ పెద్దలు ఆపుతున్నారు. కాస్త ఆలస్యం అయినా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పక్కా. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తిట్టిస్తున్నారు. గౌరవప్రదంగా ఉండే హరీష్ రావు కూడా గాడి తప్పారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాను’అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా..‘మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదర్షా కోట్లో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు.ఇది కూడా చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం: హైడ్రా రంగనాథ్ -
దానం నాగేందర్పై మహిళా కమిషన్కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై దానం అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సినిమాల్లో పిచ్చి వేషాలు వేసుకునే కంగనా రనౌత్కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.మరోవైపు, కంగనా రనౌత్పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. కంగనాపై చేసిన వ్యాఖ్యలకు దానం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన చేపట్టింది. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగింది.ఇదీ చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులుఈ క్రమంలోనే దానం నాగేందర్ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ మహిళా మోర్చా మహిళా నేతలు. దానం చేసిన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా నేతలు మండిపడ్డారు. దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చౌకబారు వ్యాఖ్యలు తగదు. దానం నాగేందర్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. -
కౌశిక్ రెడ్డికి దానం నాగేందర్ కౌంటర్
-
జూబ్లీహిల్స్లో ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ క్లబ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు, మెగాస్టార్ సందడి (ఫొటోలు)
-
ఐపీఎస్ రంగనాథ్పై సీఎంకు ఫిర్యాదు చేస్తా: దానం నాగేందర్
సాక్షి,హైదరాబాద్:హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్(హైడ్రా) కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవి రంగనాథ్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా తనపై కేసు పెట్టడంపై దానం మంగళవారం(ఆగస్టు13) మీడియాతో మాట్లాడారు.‘ఆయనకు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లుంది. అందుకే నాపై కేసు పెట్టాడు. సీఎంకు ఫిర్యాదు చేస్తా. అధికారులు వస్తుంటారు పోతుంటారు. కానీ నేను లోకల్ నందగిరి హిల్స్ హుడా లే ఔట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందునే నేను అక్కడకి వెళ్లాను. జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్ళాను. నందగిరి హిల్స్ హుడా లే ఔట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తా. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది... నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు’అని దానం ఫైర్ అయ్యారు. -
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంపై కేసు నమోదు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–52లోని నందగిరిహిల్స్ హుడా లేఅవుట్లో ప్రభుత్వ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీగోడను పక్కనే ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు దౌర్జన్యంగా కూలి్చవేయడం జరిగిందని, ఇందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోత్సాహం ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జి వి.పాపయ్య ఇచి్చన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దానం నాగేందర్పై కేసు నమోదు చేశారు. నందగిరిహిల్స్ లేఅవుట్లో 850 గజాల జీహెచ్ఎంసీ ఓపెన్ స్పేస్ ఉందని, ఇది ప్రభుత్వానికి చెందినదని, దీనిని కాపాడే యత్నంలో భాగంగా చుట్టూ ప్రహరీ నిరి్మంచడం జరిగిందన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు ఇక్కడికి వచ్చి జీహెచ్ఎంసీ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీని కూలి్చవేశారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలంలోనే ఉండి బస్తీవాసులను ప్రోత్సహించారని, బస్తీ నేతలు గోపాల్నాయక్, రాంచందర్లను ప్రోత్స హించి ఈ కూలి్చవేతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కూలి్చవేతల వల్ల రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దానం, గురుబ్రహ్మనగర్ బస్తీ నేతలు గోపాల్నాయక్, రాంచందర్లపై బీఎన్ఎస్ 189 (3), 329 (3), 324 (4), రెడ్విత్ 190, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘దానం’ దమ్ముంటే రా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో తనను ఉద్దేశించి ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియాహాల్లో కౌశిక్రెడ్డి శనివారం(ఆగస్టు3) మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయన్నారు. సభలో రూల్స్కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే సీటు నుంచి మాట్లాడారన్నారు.‘దానం నాగేందర్ నేను హైదరాబాద్లోనే ఉన్నా. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం. ఎక్కడో స్పాట్ చెప్పు రావడానికి నేను రెడీ. దానం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవడు ఇక్కడ భయపడటం లేదు. కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు.గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మరువకు. మేము మళ్లీ కొట్టే సమయం వచ్చింది. దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్కు టీషర్ట్, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు’అని కౌశిక్రెడ్డి దానంపై విరుచుకుపడ్డారు. -
అందుకే సహనం కోల్పోయా.. దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేశారని.. తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలిపారు.శనివారం ఆయన హైదరాబాద్ ఆదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు. అసభ్యకర పదాలతో దూషించారని పేర్కొన్నారు.కాగా, శాసనసభలో శుక్రవారం.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. బీఆర్ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది. హైదరాబాద్లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేందర్కు మైక్ ఇచ్చారు. నాగేందర్ మాట్లాడటం ప్రారంభించగానే.. ఆయన వైపు తిరిగి ‘నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు’అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా, వివేకానంద, పాడి కౌశిక్రెడ్డి తదితరులు పదేపదే ప్రశ్నించటంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.ఆ క్రమంలోనే సహనం కోల్పోయి.. ‘నన్ను ఏయ్ అంటారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్లీ నాగేందర్ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయటంతో.‘ఏయ్ మూసుకో రా..నీయమ్మ.. తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కరిది.. నీ యమ్మ బయట కూడా తిరగనీయరా. ఏం అనుకుంటున్నార్రా మీరు...తోలు తీస్తా...బయట కూడా తిరగనియ్య.. రారా.’అంటూ మాట్లాడటంతో సభ్యులంతా విస్తుపోయారు. -
ఏయ్.. తోలు తీస్తా కొడకల్లారా.. బయట కూడా తిరగనివ్వ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. బీఆర్ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది. అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేందర్కు మైక్ ఇచ్చారు. నాగేందర్ మాట్లాడటం ప్రారంభించగానే.. ఆయన వైపు తిరిగి ‘నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు’అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా, వివేకానంద, పాడి కౌశిక్రెడ్డి తదితరులు పదేపదే ప్రశ్నించటంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.ఆ క్రమంలోనే సహనం కోల్పోయి.. ‘నన్ను ఏయ్ అంటారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్లీ నాగేందర్ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయటంతో.‘ఏయ్ మూసుకో రా..నీయమ్మ.. తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కరిది.. నీ యమ్మ బయట కూడా తిరగనీయరా. ఏం అనుకుంటున్నార్రా మీరు...తోలు తీస్తా...బయట కూడా తిరగనియ్య.. రారా.’అంటూ మాట్లాడటంతో సభ్యులంతా విస్తుపోయారు. వెంటనే మేల్కొన్న కాంగ్రెస్ సభ్యులు నాగేందర్ వద్దకు వచ్చి మైక్ ఆన్లో ఉందని, అలా మాట్లాడొద్దని సూచించారు. ఇంతలో కొందరు బీఆర్ఎస్ సభ్యులు నాగేందర్ వైపు దూసుకొచ్చి తమను బూతులు తిడతావా అంటూ నిలదీశారు. రండిరా చూసుకుందాం.. అంటూ నాగేందర్ కూడా వారితో బాహాబాహికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను నిలువరించారు. అటువైపు బీఆర్ఎస్ సభ్యులను వారి పార్టీ, కాంగ్రెస్ సభ్యులు కొందరు ఆపి వెనక్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత దానం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా సభలోనే ఏవో కాగితాలు చదువుతూ ఉండిపోయారు. ఖండించిన అక్బరుద్దీన్ సభ వెలుపల ఉన్న మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ వెంటనే సభలోకి వచి్చ. దానిపై స్పందించారు. సీనియర్ సభ్యుడైన దానం నాగేందర్ సభలో అన్పార్లమెంటరీ పదాలు వాడడం ఏమాత్రం సబబు కాదని, సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశా>రు. బీఆర్ఎస్ సభ్యులు కూడా అన్పార్లమెంటరీ పదాలు వాడుతూ తనను మాట్లాడనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఆ సందర్భంలో తాను ఆగ్రహం వ్యక్తం చేశానని, కావాలని అలాంటి పదాలు ఉచ్ఛరించలేదని, దానిపై ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని దానం పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల్లో నుంచి తొలగించే విషయమై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ పేర్కొన్నారు. అయి తే, తాను మాట్లాడింది హైదరాబాద్ నగర మాండలికంలో భాగమేనంటూ దానం నాగేందర్ పేర్కొనటం కొసమెరుపు. మాట్లా డేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్ను బీఆర్ఎస్ సభ్యులు అడగ్గా ఆయన ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
మీ చరిత్ర బయట పెడతా..
-
త్వరలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం: దానం నాగేందర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్లో చేరుతుండటంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై శుక్రవారం(జులై 12) మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. ‘రెండు రోజుల్లో మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్లో చేరుతారు. పదిహేను రోజుల్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటాం. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన అక్రమాలు వెలికి తీస్తాం. కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడతా. గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకుతో పాటు రాజేష్ రాజు లాంటి వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు. లెక్కలన్నీ బయటకు తీస్తాం’అని హెచ్చరించారు. -
TS : కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా..రాజకీయ నేతలు (ఫొటోలు)
-
ఎమ్మెల్యే ‘తెల్లం’కు కాంగ్రెస్ కండువా.. స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం(ఏప్రిల్ 7) ఎక్స్లో ఒక పోస్టు చేశారు. ఆదివారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఫొటోను కేటీఆర్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తాజాగా రిలీజ్ చేసిన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13వ పాయింట్ గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే లు, ఎంపీలు ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టేకి వెళితే ఆటోమెటిక్గా అనర్హతకు గురయ్యేలా చట్ట సవరణ చేస్తాం అని మేనిఫెస్టోలో చెబుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించిందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కండుడవా కప్పి మరీ చేర్చుకుంటున్నారన్నారు. గెలిచేంత వరకు ఒక మాట ... గెలిచాక ఇంకో మాట. ఇదే కాంగ్రెస్ రీతి .. నీతి. బీజేపీకి కాంగ్రెస్కు తేడా ఏంటి. మేనిఫెస్టోలు అమలు చేసే ఉద్దేశం లేనపుడు ఎందుకీ నాటకాలు రాహుల్గాంధీ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే -
దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని అన్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రిగా ఉండి సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..‘సభకు 10 లక్షల మందిని తరలిస్తాం. ఏప్రిల్ ఎనిమిదో తేదీన నాంపల్లిలో ఫిరోజ్ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుంది. బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. భువనగిరి, నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తాం. సికింద్రాబాద్లో కూడా దానం నాగేందర్ను గెలిపిస్తాం. దానం గెలుపు బాధ్యత మాదే. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఈసారి గెలిచాం. బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన. మాజీ మంత్రి హరీష్రావు మాటలకు అర్ధం లేదు. కేసీఆర్ చేసిన పాపాలకు వర్షాలు కూడా పడటం లేదు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నాడు. 40వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్ను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం. కేంద్రమంత్రిగా ఉండి కిషన్రెడ్డి సికింద్రాబాద్ను పట్టించుకోలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడు. అది సాధ్యం కాదు. కాంగ్రెస్ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ఇక, దానం నాగేందర్ మాట్లాడుతూ..‘సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నేను గెలవడానికి అందరి సహకారం కావాలి. తుక్కుగూడ సభ విజయవంతం చేయడానికి సమావేశమయ్యాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
రాజీనామాయే ప్ర‘దానం’!
రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడుతుండటం కలకలం రేపుతోంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీకి దింపుతామని కాంగ్రెస్ అధిష్టానం తేల్చినట్టు వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీనికితోడు మంత్రి కోమటిరెడ్డి కూడా దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేస్తే ఇబ్బందులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించే సభ, లోక్సభ మేనిఫెస్టోపై చర్చించేందుకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ శుక్రవారం భేటీ అయింది. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యను కలిసిన దీపాదాస్ మున్షీ, మల్లురవి, సంపత్ కుమార్ అంతకుముందు గాం«దీభవన్ వేదికగా టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ అయింది. ఇక బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరుతానని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మల్లు రవి, ఇతర నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసానికి వెళ్లి కాంగ్రెస్లోకి ఆహ్వనించారు. కె. కేశవరావు కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్లో చేరనున్నారు. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా చేరేందుకు రంగం సిద్ధమైంది. నర్సాపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కూడా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. – సాక్షి, హైదరాబాద్ -
దానం అవుట్.. సికింద్రాబాద్ సీటు మరొకరికి??
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు షాకిచ్చే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఆయన తీరుతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు ఆ టికెట్ మరొకరికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే.. ఎంపీ టికెట్ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో మూడో జాబితాలో దానం నాగేందర్ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. అయితే ముందు ఓకే చెప్పి తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఈలోపు ఆయన ఎన్నికపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. కోర్టు సైతం ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇదంతా పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ దానంను తప్పించి.. ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది. ఆయన పేరును ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధిష్టానం నిర్ణయం ఏంటన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్.. హైకోర్టులో మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల వేళ ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. దానం కాంగ్రెస్ చేరడం, సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై పోటీ చేసి దానం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక, కొద్దిరోజుల క్రితమే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. దీంతో, దానంకు కాంగ్రెస్ ఎంపీ సీటు ఆఫర్ చేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి దానం బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్దం, చట్ట విరుద్దమంటూ పిటిషనర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో దానంపై అనర్హత వేయాల్సిందిగా కోరారు. కాగా, ఈ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్కు నోటీసులు జారీ చేసింది. అయితే, దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానంకు నోటీసులు జారీ చేసింది. -
కాంగ్రెస్లో చేరిన రంజిత్రెడ్డి, దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ను దానం నాగేందర్కు కాంగ్రెస్ ఖరారు చేసింది. కాగా, బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే టార్గెట్గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుడ్ బై చెప్పారు. ఇటీవల రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం -
కాంగ్రెస్లోకి దానం, పసునూరి!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో సిట్టింగ్ ఎంపీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్చౌదరి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్రెడ్డి పాల్గొన్నారు. రెండు మూడురోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్లో చేరనున్నట్లు ఈ సందర్భంగా నాగేందర్ తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పసునూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా ఇద్దరు నేతలు ఈనెల 18న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. దానం నాగేందర్ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలో నిలిపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని గాందీభవన్ వర్గాలంటున్నాయి. మరోవైపు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఅర్జీ వినోద్రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు సికింద్రాబాద్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం. -
వైఎస్సార్ హయాంలోనే కాంగ్రెస్ హవా
హైదరాబాద్: రాష్ట్రంలో అనుకూల పవనాలతో అధికారం ‘హస్త’గతమైనప్పటికీ రాజధాని హైదరాబాద్ మాత్రం కాంగ్రెస్ను దూరం పెట్టింది. దశాబ్ద కాలంగా ఈ పార్టీకి ఇక్కడ ఆదరణ లభించడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడో ఎన్నికలోనూ కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవంగా పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఖాతా తెరవడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము కాగా, కోర్సిటీలో సైతం అదే పరిస్థితి నెలకొంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మాత్రమే కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ మేరకు 2009లో ఖైరతాబాద్లో దానం నాగేందర్, జూబ్లీహిల్స్లో విష్ణువర్ధన్రెడ్డి, సనత్నగర్లో మర్రి శశిధర్రెడ్డి, గోషామహల్లో ముఖేశ్గౌడ్, సికింద్రాబాద్లో జయసుధ, కంటోన్మెంట్లో శంకర్రావు, మల్కాజిగిరిలో ఆకుల రాజేందర్, ఉప్పల్లో బండారి రాజిరెడ్డి, ఎల్బీనగర్లో దేవిరెడ్డి సుధీర్రెడ్డి, శేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్, మహేశ్వరంలో సబితారెడ్డి, ముషీరాబాద్లో మణెమ్మ తదితరులు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పూర్తిగా చతికిలపడింది. 2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలనుసైతం దక్కించుకోలేక పోయింది. 2018 ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్తో కలిసి కూటమిగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అన్ని స్థానాల్లో అపజయాన్ని మూటగట్టుకుంది. పదేళ్లలో రెండు పర్యాయాలు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినా..అందులోనూ సైతం మొక్కుబడి స్థానాలకు పరిమితమైంది. కాగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే. నగర అధ్యక్షుల ఎంపికలో ఆలస్యం..సీనియర్ల మధ్య సమన్వయలేమి కాంగ్రెస్కు నష్టం చేకూర్చింది. 2014, 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ, 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నా అధిష్టానం సమీక్షించుకోకపోవడం దారుణం. -
అభ్యర్థులు ఎక్కడ ఓటు వేస్తారంటే?
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. నెల రోజుల నుంచి ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. గురువారం ఈ ముగ్గురు అభ్యర్థులు నియోజకవర్గంలోని వేర్వేరు డివిజన్ల పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ►బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వెంకటేశ్వరకాలనీ డివిజన్ బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని ఓల్డ్ వెంకటేశ్వరనగర్ బూత్ నెం. 130లో తన ఓటు వేయనున్నారు. ► కాంగ్రెస్ అభ్యర్థి పి. విజయారెడ్డి ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని టెలిఫోన్ భవన్ పక్కన పాఠశాల విద్యాశాఖ పోలింగ్ బూత్ నెం. 59లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి జూబ్లీహిల్స్ డివిజన్పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 2 షేక్పేట మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ బూత్లో ఓటు వేయనున్నారు. -
ఆస్తులకు మించిన అప్పుల్లో ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. దానం నాగేందర్ పేరిట మొత్తం ఆస్తుల విలువ రూ. 41,33,50,000గా పేర్కొన్నారు. కాగా వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 47.63 లక్షలు ఉండగా ఆయన భార్య దానం అనిత పేరు మీద 78.17 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. కుమార్తె సాయి ప్రియ పేరిట 9.55 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు, పెట్టుబడుల రూపంలో భాగ్యలక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలో రూ. 16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్పీ. ఇండెన్ సంస్థ నుంచి తనకు రూ. 2.74 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. తనకు వరంగల్ జిల్లా నిరుకులలో 6.09 ఎకరాలు, కళ్ళం గ్రామంలో 18.29 ఎకరాలు, నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 9 ఎకరాలు, జనగాం జిల్లా పల్లగుట్ట గ్రామంలో 16 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాల గ్రామంలో 4.11 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని 1432 గజాల్లో ఇల్లు ఉందని దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. తనకు రూ. 47.55 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య పేరిట రూ. 2 కోట్ల అప్పు ఉందని కాగా తన చేతిలో రూ. 1.50 లక్షల నగదు మాత్రమే ఉందని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. ఆభరణాల విలువ రూ. 27కోట్లు దానం నాగేందర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ. 27 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో దానం పేరిట 1297 క్యారెట్ల వజ్రాలు(రూ.2.99 కోట్లు), 80 తులాల బంగారం(21.6లక్షలు), పది కేజీల వెండి(రూ.4.4 లక్షలు) ఉండగా ఆయన భార్య అనితకు 1350 క్యారెట్ల వజ్రాభరణాలు(3.39కోట్లు), 225 తులాల బంగారం(60.75లక్షలు) ఉన్నాయి. రూ. 10.82 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. -
విద్యాసాగర్ రావును బీజేపీ బలి పశువును చేస్తోంది: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు రాష్ట్రానికి ఇచ్చిన వివరాలను ‘రిపోర్టు టు పీపుల్ పేరుతో’ కేంద్రమంత్రి కిషన్రెడ్డి పవర్ పాయింట్ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ సందర్బంగా దానం నాగేందర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి వాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రావాల్సిన నిధులు ఇప్పటివరకు కేంద్రం ఇవ్వలేదు. ఎంపీగా గెలిచిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి కిషన్రెడ్డి ఏం చేశారో చెప్పాలి. మోటర్లకు మీటర్లు పెడతామని కేంద్రం చెప్పలేదా?. రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం అడ్డుకుంది. హైదరాబాద్, తెలంగాణ నుంచి వస్తున్న రిసోర్సెస్ వల్లనే రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. దాని ఆధారంగానే అభివృద్ధి జరుగుతోంది. కిషన్ రెడ్డి ఈ మాయ మాటలు పక్కన పెట్టాలి. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీ. విద్యాసాగర్ రావు హైదరాబాద్ రెండో రాజధాని అంటూ చేసిన కామెంట్స్పై కూడా దానం స్పందించారు. తెలంగాణకు రెండో రాజధాని అంటూ బీజేపీ మళ్లీ మాటలు చేప్తోంది. హైదరాబాద్ ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. విద్యాసాగర్ను బలిపశువును చేయడానికే బీజేపీ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తోంది. ఇది కూడా చదవండి: రాహుల్తో జూమ్ మీటింగ్.. 22న కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల! -
ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని నేనే
బంజారాహిల్స్: ‘ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అపోహలు, వదంతులు నమ్మొద్దు’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పెద్ద సంఖ్యలో విచ్చేసిన కార్యకర్తల సమక్షంలో స్పష్టం చేశారు. ఫిలింనగర్ బస్తీల్లో పాదయాత్ర చేయడానికి వచ్చిన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రికి అన్నీ తెలుసని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా తనే నిలబడతానని వెల్లడించారు. కొంత మంది యూట్యూబ్ చానళ్లు పెట్టుకొని పనికిమాలిన వార్తలను ప్రసారం చేస్తుంటారని, అదే పనిగా వైరల్ చేస్తున్నారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్లో మరోసారి గులాబీ జెండా గుబాళిస్తుందని వెల్లడించారు. -
అర్వింద్ పద్ధతి మారకుంటే ప్రజలు ఊరుకోరు: దానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను లక్ష్యంగా చేసుకుని ఎంపీ ధర్మపురి అర్వింద్ చేస్తున్న వ్యక్తిగత దాడిని ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకునేది లేదని, పద్ధతి మార్చుకోకపోతే ప్రజల చేతిలో చావుదెబ్బతినాల్సి వస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. శనివారం ఆయన కవితను కలసి సంఘీభావం తెలిపారు. అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలసి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ను ఉద్దేశించి బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ మాటలు వింటే ప్రజల రక్తం మరిగిపోతోంద న్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఫారమ్స్ అమ్ముకున్న చిల్లర వ్యక్తి అరవింద్ ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారన్నారు. -
Sadar Festival 2022 :హైదరాబాద్ లో వైభవంగా సదర్ వేడుకలు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ ఎమ్మెల్యే కార్లపై 66 చలాన్లు.. రూ. 37, 365 చెల్లించి..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు చెందిన అయిదు కార్లకు పెండింగ్ చలాన్లను ఆదివారం క్లియర్ చేశారు. కొంత కాలంగా ఆయనకు చెందిన టీఎస్ 09 ఎఫ్ఏ 0999తోపాటు మరో నాలుగు కార్లకు 66 చలానాలు పెండింగ్లో ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఈ వాహనాలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పెండింగ్ చలాన్ల జాబితా గుట్టురట్టైది. దీంతో 66 చలానాలకుగాను రూ. 37365లను ఎమ్మెల్యే చెల్లించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్కు చెందిన అయిదు కార్లకు చెందిన చలానాలు క్లియర్ అయినట్లు తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు -
విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్
Danam Nagender Fires On Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్సేన్- ప్రముఖ టీవీ యాంకర్కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్లో జరిగిన డిబెట్లో విశ్వక్ సేన్, సదరు యాంకర్ దేవీ నాగవల్లి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర ఎఫ్.. పదంతో దూషించడం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇక దీనిపై మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్ ‘చానళ్లు విశ్వక్ సేన్ హీరోగా గుర్తిస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ, మేం మాత్రం అతడిని హీరోగా గుర్తించడం లేదు. లైవ్లో ఇలాంటి అసభ్యకర పదాలు వాడటం కరెక్ట్ కాదు. దేవి నాగవళ్లికి యాంకర్గానే కాదు, బయట సమాజంలో కూడా మంచి పేరు ఉంది. అలాంటి యాంకర్ను పట్టుకుని అతడు అలా అనడం సహించరానిది. మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు రావాలి. లేకపోతే సైలెంట్గా ఉండాలి. స్టూడియోలో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి’ అన్నారు. లేకపోతే మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తామని, అతను ఆ మాట అనగానే అదే వేదికపై యాంకర్ చెప్పుతో కొట్టేది ఉండే అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్పై టీవీ యాంకర్ ఫైర్ ‘విశ్వక్ సేన్ బయట కనపడితే మా మహిళలు చెప్పులు తీసుకుని కొడతారు. విశ్వక్ సేన్ లాంటి వ్యక్తికి బుద్ది చెప్పాల్సిందే. ఇంకోసారి మరెవరు ఇలాంటి పదాలు వాడకుండా చేయాలి. విశ్వక్ సేన్ లాంటి వాళ్లను సినిమాల్లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలను కోరుతున్నాను’ అని దానం నాగేందర్ పేర్కొన్నారు. అయినప్పటికీ తమ మహిళ సంఘాలు ఆయనను కొట్టడానికి రెడీగా ఉన్నారని దానం హీరోపై ఫైర్ అయ్యారు. అనంతరం రోడ్లపై ఇలాంటి వ్యవహరాలు చేయడం. కిరోసిన్ డబ్బాను పట్టుకుని సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి ఆయన ఏమైన పెద్ద హీరో అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే యాంకర్ దేవి నాగవళ్లి ఫిర్యాదుతో విశ్వక్ సేన్పై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
GHMC: మేయర్ సహా మంత్రులకు జీహెచ్ఎంసీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ నుంచి ట్విట్టర్ ద్వారా ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఇతర నిబంధనల అతిక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(సీఈసీ) ఫిర్యాదుల స్వీకరణను పునరుద్ధరించింది. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేందుకు, వారికి పెనాల్టీలు వేయకుండా ఉండేందుకేనని ప్రజల నుంచి ముఖ్యంగా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సర్వర్ అప్డేషన్ కోసమని సీఈసీ పేర్కొన్నా ప్రజలు విశ్వసించలేదు. ప్రతిపక్ష రాజకీయపార్టీలు ఆందోళనలు సైతం నిర్వహించాయి. ► తాజాగా ట్విట్టర్ ఖాతా తెరిచి ఇన్ని రోజుల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ చలానాలతో పెనాల్టీలు విధించారు. ఈ పెనాల్టీల విధింపులో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. పెనాల్టీల విధింపు ఇంకా కొనసాగుతోంది. తాజా సమాచారం మేరకు జారీ అయినా పెనాల్టీల్లో ఆయా నాయకులకు పడ్డ మొత్తం పెనాల్టీలు దాదాపుగా దిగువ విధంగా ఉన్నాయి. (వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్) ► ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో ఫ్లెక్సీల ఏర్పాటుకు ఈ పెనాల్టీలు విధించారు. అందరికంటే ఎక్కువగా ఎమ్మెల్యే దానం నాగేందర్కు రూ.3 లక్షలకు పైగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు రూ.1.60 లక్షలకు పైగా పెనాల్టీలు పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట రూ.2.20 లక్షలు, మంత్రి చామకూర మల్లారెడ్డికి రూ.10 వేలు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావుకు రూ.10 వేలు, కాలేరు వెంకటేశ్కు రూ.25 వేలు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి రూ.60వేలు పెనాల్టీలు పడ్డాయి. కార్పొరేటర్ రాగం సుజాత రూ.2 లక్షలు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?) -
చివరి శ్వాస ఉన్నంత వరకూ టీఆర్ఎస్తోనే: దానం
సాక్షి, హైదరాబాద్: ‘చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్తోనే ఉంటా. విధేయతతో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం కిందే పనిచేస్తా. నా ఇంటికి ఎవరు వచ్చినా టీఆర్ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందే’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్లో చిచ్చు పెట్టేవారికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న వారు ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసన్నారు. రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేస్తారో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్లో తనకు చాలా అవమానాలు జరిగాయన్నారు. కాంగ్రెస్లో కంటే టీఆర్ఎస్లో నాకు పదింతలు గౌరవం దొరుకుతోందన్నారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి జరగనందునే ఆత్మ పరిశీలనతో టీఆర్ఎస్ చేరి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములయ్యేందుకు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. తాను సీఎం కేసీఆర్ను మంత్రి పదవి అడగలేదని ఇకముందు కూడా అడగని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
దానం నాగేందర్ వియ్యంకుడిపై దాడి
సాక్షి, బంజారాహిల్స్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడు అనిల్ కుమార్ కిషన్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 15లో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే నాగేందర్ వియ్యంకుడు అనిల్ కిషన్ సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ మీదుగా కళాంజలి నుంచి తన ఇంటికి కారులో వెళ్తున్నాడు. కళాంజలి షోరూం దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఆయన తన వియ్యంకుడు దానం నాగేందర్కు ఫోన్ చేశారు. అప్రమత్తమైన దానం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ నాయుడు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈఘటనలో కారు అద్దాలు పగిలి ఉన్నాయని, సీసీ ఫుటేజీలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్నదానిౖపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఐపీఎల్ మ్యాచ్లను అడ్డుకుంటాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
బంజారాహిల్స్: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తెలంగాణకు చెందిన ఒక్క క్రీడాకారుడిని కూడా ఎంపిక చేయకపోవడం పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో క్రీడాకారులను అందించిన హైదరాబాద్ నుంచి క్రికెట్కు ఆటగాడిని ఎంపిక చేయకపోవడం పట్ల ఆ జట్టు యాజమాన్యాన్ని దుయ్యబట్టారు. హైదరాబాద్కు చెందిన ఆటగాడు లేకుండా అది హైదరాబాద్ జట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పునరాలోచించి స్థానిక క్రికెటర్లను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎంపిక చేయకపోతే త్వరలో ఉప్పల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. మిగతా అన్ని జట్లు తమ ప్రాంతం వారికి అవకాశం కల్పిస్తే ఎస్ఆర్హెచ్ మాత్రమే విదేశీ, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిందని, ఇది చాలా బాధాకరమన్నారు. చదవండి: ఆ రికార్డుకు ఆరు వికెట్ల దూరంలో.. -
షేక్పేట తహసీల్దార్.. బదిలీ రగడ!
సాక్షి, హైదరాబాద్: నగరంలో షేక్పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీపై రగడ రగులుకుంటోంది. తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యలతో దీనికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు బలం చేకూర్చినట్లయింది. బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్గా ఎన్నికైన మరుసటి రోజు షేక్పేట తహసీల్దార్కు స్థానచలనం కలిగించడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. సరిగ్గా పక్షం రోజుల క్రితం జనవరి 20న ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగతున్న నిర్లక్ష్యం..జాప్యంపై ప్రశ్నించేందుకు బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి షేక్పేట తహసీల్ ఆఫీస్కు వెళ్లారు. ఈనేపథ్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్రెడ్డి..కార్పొరేటర్ విజయలక్ష్మి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో షేక్పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ విజయలక్ష్మి ఒకరిపై మరొకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఈ నెల 11న కార్పొరేటర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికయ్యారు. ఎన్నికైన 72 గంటల్లోనే శ్రీనివాస్రెడ్డిపై బదిలీ వేటు వేస్తూ సీసీఎల్ఏలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి సోమేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్కు ఫిర్యాదు చేశాం: దానం నాగేందర్ షేక్పేట తహసీల్దార్పై ఎంపీ కేశవరావుతో కలిసి సీఎస్కు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులంటే తహసీల్దార్కు గౌరవం లేదన్నారు. ఆదాయ, కులదృవీకరణ పత్రాల జారీలో నిర్లక్ష్యం వహించడం వల్లనే సీఎస్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అండగా ఉద్యోగ సంఘాలు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డికి అండగా నిలబడ్డాయి. రాజకీయ జోక్యంతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూన్నాయి. ఏకంగా మీడియా ముందుకు వచ్చి గళం విప్పుతున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ఎంపీ కె.కేశవరావు కుమార్తె, అమెరికాలో ఉన్నత ఉద్యోగం సైతం వదిలి ప్రజా సేవకు వచ్చిన ఆమె.. ఇటువంటి చిన్న చిన్న విషయాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. అధికారికంగా ఉత్తర్వులు అందలేదు: శ్రీనివాస్ రెడ్డి ఇంకా అధికారికంగా తనకు బదిలీ ఉత్తర్వులు అందలేదని షేక్పేట మండల తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు జరగడం సాధారణమేనని, తన బదిలీ కూడా అలా జరిగే ఉంటుందని భావిస్తున్నానన్నారు. తనను ఎందుకు బదిలీ చేశారో తెలియదన్నారు. కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి ముందుగా తనపైనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఆ తర్వాతే తాను కౌంటర్ పిటిషన్ వేశానన్నారు. ఆదాయ «ధృవీకరణ పత్రం కోసం ఆమె ఫోన్చేశారని, తన వద్ద వీఆర్వోలు లేరన్న విషయాన్ని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఆ కొద్దిసేపటికే ఆఫీస్కు వచ్చారని, ఆ సమయంలో కోర్టుకు వెళ్లాల్సి ఉండగా కేసును స్టడీ చేస్తున్నానని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే తాను నడుచుకున్నానన్నారు. చదవండి: మేయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ -
ఎమ్మెల్యే దానంపై పోలీసులకు ఫిర్యాదు
-
వైరల్: ‘బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే దానం’
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్కు చెందిన ఓ స్థల వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంక్ అధికారులతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తమను బెదిరించారంటూ బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల క్రితం ఖైరతాబాద్లోని ఓ స్థలంపై ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని బ్యాంక్ బహిరంగ వేలానికి పెట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్ బ్యాంక్ అధికారుల విధులకు అడ్డుతగిలారు. ఎమ్మెల్యే తన అనరుచరులతో కలిసి వేలాన్ని అడ్డుకున్నారని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేశారని, బెదిరింపులకు దిగారని తెలిపారు. ఆయన అనుచరులు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ) -
సచివాలయంపై కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హైకోర్టును తప్పుదోవ పట్టించాయని మాజీ మంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, శ్రీనివాస్రెడ్డితో కలసి శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాతే సచివాలయం కూల్చివేతలు ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరేళ్లుగా అభివృద్ధి జరుగుతున్నా కళ్లుండీ చూడలేని కబోదులుగా విపక్షాలు మారాయని విమర్శించారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తున్నా ప్రతిపక్షాల వైఖరి మారడం లేదని, రాబోయే రోజుల్లో విపక్షాలకు బంగాళాఖాతమే దిక్కవుతుందన్నారు. సచివాలయంలో దేవాలయం, ప్రార్థనా మందిరం దెబ్బతినడంపై సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వడంతో పాటు మత పెద్దలతో కూడా మాట్లాడారని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రోడ్ల విస్తరణ పేరిట ప్రార్థనా మందిరాలను కూల్చివేశారన్నారు. మతాల నడుమ చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్లో మత సామరస్యానికి భంగం వాటిల్లకుండా చూస్తామని, విపక్షాల కుట్రలను అనుమతించేది లేదన్నారు. సచివాలయం శిథిలాలను తిరిగి వినియోగించుకునేందుకు జీడిమెట్లలో ప్రత్యేక ప్లాంటు నెలకొల్పినట్లు బొంతు రామ్మోహన్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న గంగా జమునా తెహజీబ్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. కొత్త సచివాలయం రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతిపక్షాల తీరు మారకుంటే మరింతగా ప్రజలకు దూరమవడం ఖాయమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
చెయ్యి కడుక్కోవే శీనన్నా...
సాక్షి, బంజారాహిల్స్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర సరకులు ఎలా అందుతున్నాయో పరిశీలించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న (గురువారం) ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి బంజారాహిల్స్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా దానం ఇంటికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్కు శానిటైజర్తో చేతులు కడిగించారు. ప్రజలకు మరింత అవగాహన పెంచే దిశలో నాగేందర్ గత పది రోజుల నుంచి తన ఇంటి వద్ద ప్రత్యేకంగా శానిటైజర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ తానే దగ్గరుండి చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కలిగిస్తున్నారు. (కరోనా కథ.. ఇల్లే సురక్షితం) కాగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మంత్రి తలసాని అన్నారు. నిన్న ఆయన బేగంబజార్లోని మిట్టికా షేర్ హోల్సేల్ మార్కెట్లో వ్యాపారులతో సమావేశం అయ్యారు. మార్కెట్లో సుమారు 300 దుకాణాలు ఉన్నాయని, రోజుకు 40 దుకాణాల చొప్పున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల విక్రయాలు జరుపుకోవాలని సూచించారు. (బ్రేక్ 'కరోనా') నిత్యావసరాలపై నిఘా అవినాష్ మహంతి నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెండు రోజుల్లో 20 వేలకు పైగా పాసులు జారీ లాక్డౌన్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాల కదలికల్ని సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి, ఆయా విభాగాలతో సమన్వయానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కొత్వాల్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం 25 మంది అధికారులతో ఉండే ఈ బృందం 24 గంటలూ మూడు షిఫ్టుల్లో నిర్విరామంగా సేవలు అందిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకువచ్చే లారీలు, నగరంలో వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే వాహనాల కదలికలకు ఆటంకం లేకుండా సాగేలా ఈ టీమ్ ఆద్యంతం పర్యవేక్షించనుంది. అలాగే మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు అత్యవసర సేవలు అందించే వ్యక్తులు, వాహనాలకు బుధవారం నుంచి ప్రత్యేక పాస్లు జారీ చేస్తున్నారు. దీనికోసం ఎవరికి వారు హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువుల్ని ఇళ్లకు సరఫరా చేసే ఈ–కామర్స్ వాహనాలు, వ్యక్తులు, కోళ్లు, కోడిగుడ్లు, ఆవులు, గేదెలు రవాణా చేసే వాహనాలు, కూరగాయలు తరలించే లారీలు, హాస్పిటల్స్లోని వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు, వివిధ స్టార్ హోటళ్లు, లాడ్జిలలో పనిచేసే ఉద్యోగులకు, మండీలు, మార్కెట్లలో పని చేసే హమాలీలు, ఇతర ఉద్యోగులు చేపలు, మాంసం, వంటనూనె,పంచదార రవాణా చేసే వాహనాలు, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవల టెక్నీషియన్లకు కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు పాస్లు ఇస్తున్నారు. గురువారం రాత్రికి జారీ చేసిన పాసుల సంఖ్య 20 వేలు దాటింది. ఈ పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులుని స్పష్టం చేస్తున్నారు -
‘దానం’ అన్నను గెలిపించండి: లగడపాటి పద్మ
సాక్షి, హైదరాబాద్(ఖైరతాబాద్) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ చెబుతుంటే మరోవైపు ఆయన సతీమణి పద్మ టీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ సతీమణి అనితతో కలిసి ఆమె మంగళవారం రాత్రి ఖైరతాబాద్ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. దానం నాగేందర్ అన్నను గెలిపించాలని కోరారు. ఏ ప్రభుత్వమూ ఐదేళ్లలో పనులన్నీ పూర్తి చేయలేదన్నారు. పదేళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి దానం నాగేందర్ను గెలిపించాలని కోరారు. -
దానం అంటేనే దందాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై పోరాటమే తప్ప తనకు ఏ గూండాయిజం తెలియదని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్కుమార్ అన్నారు. దానం నాగేందర్ అంటేనే దళారితనం, దందాలు, కబ్జాలని ఆరోపించారు. దానంకు ఖైరతాబాద్లో ఓడిపోతాననే భయం పట్టుకుందని.. దాంతోనే ఎవరికో డబ్బులు ఇచ్చి తనకు టికెట్ ఇప్పించానని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్ లో మధుకర్యాదవ్, నిరంజన్, మహేశ్యాదవ్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు 15 రోజులు తన కోసం వెచ్చిస్తే జీవితాంతం నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతానని చెప్పారు. -
‘ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టినా నాదే విజయం’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ వందల కోట్లు ఖర్చు పెట్టినా ఖైరతాబాద్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్లో ప్రజలు 15 రోజులు తనకు కేటాయించి గెలిపిస్తే. ఐదేళ్లు వారికి సేవ చేసుకుంటానన్నారు. దానం నాగేందర్లాగా తనకు చిల్లర రాజకీయాలు చేయడం రాదని చెప్పారు. ఆయనలా తాను భూ కబ్జాలు, దందాలు చేయలేదన్నారు. ఒక డ్రైవర్గా ఉన్న దానం దందాలు, రాజీకీయాలు చేసి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. దానం నాగేందర్ పీజేఆర్ను మానసికంగా హింసించి ఆయన చావుకు కారణమయ్యారని ఆరోపించారు. దానం అంటేనే దందాలు, దౌర్జన్యాలు, దళాలు అని ఎద్దేవా చేశారు. దానం ఎన్ని కుట్రలు చేసినా ఖైరతాబాద్లో తానే గెలుస్తానని శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు. -
నాడు శత్రువులు.. నేడు మిత్రులు
బంజారాహిల్స్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు/శత్రువులు ఉండరు. అందుకు ఈ రెండు ఉదంతాలే నిదర్శనం. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు టీడీపీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ పార్టీల పరంగా బద్ధ శత్రువులు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరినీ టీఆర్ఎస్ ఒక్కటి చేసింది. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్కు ఖైరతాబాద్ టిక్కెట్ కేటాయించగా టీఆర్ఎస్లోనే ఉన్న విజయరామారావు మద్దతు కావల్సి వచ్చింది. దీంతో నాగేందర్ శనివారం విజయరామారావు ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 2009లో ఇద్దరూ పోటీపడ్డ విషయాన్ని సరదాగా గుర్తుచేసుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థిగా విజయారెడ్డి పోటీ చేశారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలో నిలిచారు. ఈ ఇద్దరు హోరాహోరీ తలపడ్డారు. ఈ ఎన్నికల అనంతరం విజయారెడ్డి టీఆర్ఎస్లో చేరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్గా గెలిచారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్కు ప్రస్తుతం ఖైరతాబాద్ టిక్కెట్ దక్కడంతో.. నాడు పోటీలో నిలిచి ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న విజయారెడ్డి వద్దకు వెళ్లి ఆమె మద్దతు కోరారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని ఈ రెండు సంఘటనలు కళ్లకు కట్టాయి. తొలి మహిళా మంత్రి హైదరాబాదీ పరదా ధరించే సంప్రదాయం.. మగవాళ్ల మధ్యలోకి రావద్దంటూ ఆంక్షలు..ఆపై రజాకార్ల ఆగడాలు.. ఇంతటి ఆంక్షల చట్రంలోనూ ఉన్నత చదువులు పూర్తిచేసి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు మాసుమా బేగం! హైదరాబాదీ అయిన మాసుమా బేగం చిన్నప్పట్నుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజిని నాయుడుతో పరిచయం ఏర్పడింది. 1928లో బొంబాయిలో తొలిసారిగా నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ స్టేట్లో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన కమ్యూనిస్టు యోధుడు మఖ్దూం మొహియుద్దీన్పై 780 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. మొహియుద్దీన్ పీడీఎఫ్ టికెట్పై.. మాసుమా బేగం కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాసుమా బేగం డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పని చేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో çఫత్తర్గట్టి నుంచి శాసనసభ్యురాలిగా విజయం సాధించారు. 1960లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రభుత్వంలోనూ మాసుమా బేగం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. -
టీఆర్ఎస్ జాబితాలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు?
టీఆర్ఎస్ ఇప్పటివరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సామాజికవర్గాల వారీగా వివరాలివి.. రెడ్డి – 37, వెలమ– 12, కమ్మ– 6, బ్రాహ్మణ– 1, వైశ్య– 1, ఠాకూర్ –1, మున్నూరుకాపు– 8, గౌడ– 6, యాదవ– 5, ముదిరాజ్– 1, పద్మశాలి– 1, విశ్వబ్రాహ్మణ –1, పెరిక– 1, వంజర– 1, మాదిగ– 11, మాల– 7, నేతకాని– 1, లంబాడ–7, కోయ–4, గోండు–1, ముస్లిం–3, సిక్కు–1. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన జారీ చేశారు. కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. తాజాగా ప్రకటించిన జాబితాతో టీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య 117కు చేరింది. సెప్టెంబర్ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్టోబర్ 21న మలక్పేట, జహీరాబాద్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా పది మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు చామకూర మల్లారెడ్డికి మేడ్చల్ స్థానంలో అవకాశం కల్పించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ను వరంగల్ తూర్పు అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావును మల్కాజ్గిరిలో పోటీకి దింపారు. అనూహ్యంగా చార్మినార్ స్థానంలో ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేశారు. రాజేంద్రనగర్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం వల్లే చార్మినార్లో ముస్లిం అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. కోదాడకు వేనపల్లి చందర్రావు, ముషీరాబాద్కు ముఠా గోపాల్ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. అభ్యర్థుల తాజా జాబితా ఇదీ మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి, గోషామహల్ – ప్రేమ్సింగ్రాథోడ్, చార్మినార్ – మహ్మద్ సలావుద్దీన్ లోడీ, వరంగల్ తూర్పు – నన్నపునేని నరేందర్, హుజూర్నగర్ – శానంపూడి సైదిరెడ్డి, వికారాబాద్ – డాక్టర్ మెతుకు ఆనంద్, అంబర్పేట – కాలేరు వెంకటేశ్, మల్కాజ్గిరి – మైనంపల్లి హనుమంతరావు, చొప్పదండి – శొంకె రవిశంకర్, ఖైరతాబాద్ – దానం నాగేందర్ -
టికెట్ ఎవరికిచ్చినా మద్దతిస్తా: దానం
హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్పై రెండు మూడు రోజుల్లో నిర్ణయం రానుందని, టీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ టిక్కెట్ ఎవరికిచ్చినా తన మద్దతు ఉంటుందని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాద్లో దానం విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. పొన్నాల లాంటి సీనియర్ నేతను బలి పశువును చేశారని విమర్శించారు. బీసీ నాయకులను రోడ్డున పడేసి.. ఏసీ రూముల్లో మీటింగ్లు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్లో అన్యాయం జరిగిన వాళ్లు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నానని, కేసీఆర్ అన్ని వర్గాలకు వారికి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్లో ఒకరి తోక మరొకరు కట్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
‘అలా చేస్తే సగం మీసం తీసేస్తా’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి అధికార పీఠం టీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ నమ్మకం వ్యక్తం చేశారు. సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడనున్న మహాకూటమికి ఘోర పరాభావం తప్పదని, తాజా సర్వేల్లో ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. కుటంబ పాలనపై గొంతు చించుకుంటున్న టీపీసీసీ ఆధ్యక్షడు ఉత్తమ్కుమార్ రెడ్డికి దానం సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబానికి ఒక్కరికే సీటు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. అలా చేస్తే సగం మీసం తీసేసి తిరుగుతానని ఉత్తమ్కు దానం చాలెంజ్ చేశారు. -
ఆ వార్తలు ఆవాస్తవం
-
టికెట్ ఇవ్వకున్నా టీఆర్ఎస్లోనే: దానం
హైదరాబాద్: తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచా రం జరుగుతోందని, తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. తన నివాసం లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమా ర్రెడ్డిని తాను ఓ హోటల్లో కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితా లో తన పేరు లేకపోవడం ఏ మాత్రం బాధించలేదన్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్లోనూ అసంతృప్తి రావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్కు డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. టీఆర్ఎస్ టికెట్ను ఎవరికి ఇచ్చినా వారి గెలుపుకోసం శ్రమిస్తానని వెల్లడించారు. -
టికెట్పై సస్పెన్స్: ఎట్టకేలకు మౌనం వీడిన దానం
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత దానం నాగేందర్కు గులాబీ అధినేత కేసీఆర్ ఇంకా టికెట్ ఖరారు చేయని సంగతి తెలిసిందే. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండగా.. గోషామహల్ నుంచి పోటీచేయాల్సిందిగా ఆయనను టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించినట్టు కథనాలు వస్తున్నాయి. టికెట్ ఖరారు చేయకపోవడంతో దానం అసంతృప్తిగా ఉన్నారని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఎట్టకేలకు మౌనం వీడారు. తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న కథనాలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా టీఆర్ఎస్లోనే కొనసాగుతానని దానం చెప్పారు. పార్టీ మారాలనుకున్న నాయకులు ‘వెళ్ళిపోతే... వెళ్లిపోవాలి’ తప్ప ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో కేటీఆర్ కోటరీ ఉంది అనడం తప్పు అని మీడియాతో చెప్పారు. తరచూ పార్టీలు మారడానికి తానేమీ గంగిరెద్దును కాదని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒప్పందం లేకుండానే తాను టీఆర్ఎస్లో చేరానని చెప్పారు. -
అసమ్మతి తిరుగుబావుటా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాలు వచ్చినప్పుడే టీఆర్ఎస్లో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే, గులాబీ బాస్ మాత్రం ఎక్కడిక్కడ తాజా మాజీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయిస్తూ ప్రకటన జారీ చేశారు. దీంతో గ్రేటర్లోని ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి వర్గాలు తిరుగుబావుటా ఎగరేశాయి. మొదటి రెండు రోజుల్లో షాక్లో ఉన్న ఆశావహులు, తర్వాత తేరుకుని వేరు కుంపట్లకు రెడీ అయ్యారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం గ్రూపులు కట్టారు. తమ నిరసనను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఇంతకాలం అధికారం చెలాయించిన తాజా మాజీలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. టికెట్లు ఆశించినవారు సైతం రెబెల్స్గా మారారు. దీంతో ఎవరిని బుజ్జగించాలో.. ఇంకెవరి స్థానాలు మార్చాలో తెలియని పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. ఇదే అదునుగా ఇంతకాలం గుంభనంగా ఉన్నవారు సైతం తమకు ప్రజాబలం ఉందని.. తమకు టికెట్ ఇస్తే టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం తమ వెంట వస్తారని కాంగ్రెస్, టీడీపీ అధినేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో గ్రేటర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ ముగ్గురు ఎటు వైపు..? కుత్బుల్లాపూర్: టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాయి. కుత్బుల్లాపూర్లో ఇప్పటి దాకా తెర చాటుగా ఉన్న గ్రూపు రాజకీయాలు బహిరంగ సమరానికి సై అంటున్నాయి. ఇక్కడి నుంచి తనకు టికెట్ ఇస్తే తన వెంట ముగ్గురు కార్పొరేటర్లు వస్తారని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్.. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను కలిసి విన్నవించడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కార్పొరేటర్లుగా కొనసాగుతున్న పై ముగ్గురు జ్ఞానేశ్వర్ వెంట నడుస్తారా.. లేక పార్టీ అభ్యర్థికి మద్దతునిస్తారా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఎమ్మెల్సీ శంభీపూర్రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం పనిచేస్తామని, ఏ ఒక్కరూ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. సిట్టింగ్కు కార్పొరేటర్ల మధ్య దూరం.. తాజా మాజీ ఎమ్మెల్యేగా వివేకానంద్కు సీటు కేటాయించడంతో కార్పొరేటర్లు కనీసం వివేకానంద్ను కలిసేందుకు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం ప్రకటన వెలవడగానే కేవలం రెండు, మూడు డివిజన్ల కార్యకర్తలు, కార్పొరేటర్లు మాత్రమే హంగామా చేశారు. తిరుగుబావుటా ఎగురవేసిన కార్పొరేటర్లు మాత్రం వివేకానంద్ను కలవకుండానే వేరు కుంపటి పెట్టడం చర్చానీయాంశమైంది. ఇంతలోనే కాసాని విషయం వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్లో మరింత ఆందోళన మొదలైంది. ఎమ్మెల్సీ శంభీపూర్రాజు సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు ఆయన వర్గీయులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అయితే సీఎం చెప్పిన విధంగానే సిట్టింగ్లకు అవకాశం ఇవ్వడంతో అటు కార్పొరేటర్లు, ఇటు గ్రామాల సర్పంచ్లు గ్రూపులు కట్టారు. శంభీపూర్కు టికెట్ ఇవ్వాలని తీర్మానం కుత్బుల్లాపూర్: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని మంత్రి కేటీఆర్ను కోరాలని కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తీర్మానించారు. ఆదివారం మండలంలోని ఓ రహస్య ప్రాంతంలో సమావేశమైన వీరంతా ఎమ్మెల్సీ శంభీపూర్రాజును నిలదీశారు. టికెట్ నీకేనని తామంతా ప్రచారం చేశామని, తీరా ఫలితం తారుమారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, రావుల శేషగిరి, విజయ్శేఖర్గౌడ్తో పాటు జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్రెడ్డి, పలువురు సర్పంచ్లు, 14 మంది ఎంపీటీసీలు ఈ సమావేశంలో పాల్గొని తమకు కేటీఆర్ను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థి విషయంపై తమ అభిప్రాయాన్ని ఆయనకు చెబుతామన్నారు. అయితే, పార్టీ నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్ట వద్దని, అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని రాజు చెప్పగా.. పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద్ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఈ రహస్య సమావేశం మరింత హాట్టాపిక్గా మారింది. ఎల్బీనగర్కు అసమ్మతి సెగలు అధికార టీఆర్ఎస్లో ‘ముందస్తు’ అభ్యర్థుల ప్రకటన అసమ్మతి నగరమంతటా విస్తరిస్తోంది. ఆదివారం ఎల్బీనగర్లో అభ్యర్థితో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశానికి ఏడుగురు కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, జూబ్లీహిల్స్,రాజేంద్రనగర్లలో కార్పొరేటర్లే కేంద్రంగా అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఉప్పల్ అభ్యర్థి భేతి సుభాష్రెడ్డికి వ్యతిరేకంగా ఏకంగా మేయర్ రాంమోహన్ పావులు కదుపుతున్నారు. ఇక అభ్యర్థులు ప్రకటించని ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్పేట, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. సందిగ్దంలో దానం నాగేందర్ ఖైరతాబాద్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి దానం నాగేందర్ను గోషామహల్ నుండి పోటీ చేయాల్సిందేనని పార్టీ ముఖ్యనేత హుకుం జారీ చేయడంతో ఆయన ఒకటి రెండు రోజుల్లో అక్కడ ప్రచారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఖైరతాబాద్లో కార్పొరేటర్ విజయారెడ్డి – మన్నె గోవర్ధన్రెడ్డిలలో ఒకరికి టికెట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక ముషీరాబాద్లో హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి టికెట్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని బృందం నాయినిని కలిసి శ్రీనివాసరెడ్డి అన్ని విధాలుగా అర్హుడని ఆయనకే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా సీఎంను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. గోషామహల్లో ముస్లిమేతరులను అంగీకరించం బంజారాహిల్స్: ముస్లింలకు కనీసం పది సీట్లు కేటాయించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ సీనియర్ నేత సయ్యద్ సాజిద్ అలీ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రకటించిన 105 స్థానాల్లో ముస్లింలకు కేవలం రెండు సీట్లు మాత్రమే కేటాయించారని ఇది అన్యాయమన్నారు. గోషామహల్లో పోటీ చేసేందుకు దానం నాగేందర్ను బతిమిలాడుతున్నారని, ముఖేష్గౌడ్ చుట్టూ తిరుగుతున్నారని అయితే, ఇక్కడున్న ముస్లిం నేతలను వదిలేసి ఇతరులను బతిమిలాడాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో 90 వేల మంది ముస్లింలు ఉన్నారని, తనకు అవకాశమిస్తే గెలిచి చూపిస్తానన్నారు. ఎవరినో తీసుకొచ్చి తమపై రుద్దితే సహించమని హెచ్చరించారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ‘బొంతు’కు టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన బంజారాహిల్స్: గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్కు ఉప్పల్ అసెంబ్లీ స్థానానికి టిక్కెట్ ఇవ్వాలంటూ కుషాయిగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని బొంతు నివాసం ముందు బైఠాయించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఉప్పల్ను రామ్మోహన్కు ఇవ్వకపోతే స్థానిక మహిళలెవరూ టీఆర్ఎస్ కోసం పనిచేయరని హెచ్చరించారు. అయితే, ఆందోళనచేస్తున్న సమయంలో మేయర్ తన ఇంట్లో లేరు. -
ఖైరతాబాద్ సస్పెన్స్.. దానంకు ఆ ముగ్గురితో గండం!
సాక్షి, బంజారాహిల్స్: ఇప్పుడు అందరి దృష్టి ఖైరతాబాద్పైనే... కేసీఆర్ ప్రకటించిన 105 మంది టీఆర్ఎస్స్ అభ్యర్ధుల జాబితాలో ఖైరతాబాద్ అభ్యర్ధిని మాత్రం ప్రకటించలేదు. దీంతో ఇక్కడి నుంచి ఎవరికీ సీటు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మన్నె గోవర్ధన్రెడ్డితోపాటు బంజారాహిల్స్ కార్పొరేటర్, కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు పీ విజయారెడ్డి ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా ఇక్కడి నుంచే పోటీలో ఉండాలనుకుంటున్నారు. గతంలో ఇది ఆయనకు సిట్టింగ్ సీటు. ఈ నేపథ్యంలో ఈ నలుగురిలో టిక్కెట్ ఎవరికి దక్కుతుందోనన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, దానం నాగేందర్ను గోషామహల్లో నిలబెట్టే అవకాశాలుగా మెండుగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే వీరెవరూ కాకుండా కొత్తవారిని ఎవరినైనా నిలబెడతారా అన్నదానిపై కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి ఖైరతాబాద్ టికెట్ ఇప్పుడు హాట్హాట్గా మారింది. -
అభ్యర్థుల జాబితా : దానం పేరు ఎక్కడ..?
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఊహాగానాలకు తెరదించుతూ... టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తెలంగాణ తొలి అసెంబ్లీని రద్దు చేసేశారు. ముందస్తు ఎన్నికలకు సంకేతాలిస్తూ.. అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. నవంబర్లో ఎన్నికలు జరిగి, డిసెంబర్లో ఫలితాల ప్రకటన వచ్చే అవకాశముందని కూడా ప్రెస్ మీట్లో తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 105 మందికి టిక్కెట్లు కేటాయించారు. అయితే మరికొన్ని స్థానాలను, అభ్యర్థులను కేసీఆర్ పక్కనబెట్టారు. కేసీఆర్ జాబితాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కనిపించలేదు. దానం నాగేందర్కు హామీ దొరకలేదని తెలుస్తోంది. అంతేకాక వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ స్థానాన్ని కూడా కేసీఆర్ పెండింగ్లో పెట్టారు. మేడ్చల్ టిక్కెట్నూ కేసీఆర్ ప్రకటించలేదు. మేడ్చల్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ నేత కేఎల్ఆర్ ఫామ్ హౌజ్లో ఉన్నట్టు తెలిసింది. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభకు కూడా కేసీఆర్ టిక్కెట్ ప్రకటించిలేదు. హుజూర్ నగర్, కోదాడ, అంబర్పేట, మల్కాజిగిరి, వికారాబాద్ స్థానాలను కూడా కేసీఆర్ పెండింగ్లో ఉంచారు. కేసీఆర్ ప్రకటించిన ఈ జాబితా బట్టి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నాలుగు చోట్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉన్న స్థానం కోదాడలోనూ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించలేదని తెలిసింది. -
రికార్డు స్థాయిలో సభ: కర్నె, బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం పది రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో బహిరంగసభను నిర్వహించామని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ నేత గట్టు రామచందర్రావు అన్నారు. సోమవారం విలేకరులతో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ సభకు 25 లక్షల మంది వస్తారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని, వారి అనుమానాలను తలకిందులు చేస్తూ అన్ని రికార్డులను అధిగమించిందన్నారు. దీనికి అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాయన్నారు. ఈ సభపై కాంగ్రెస్ నాయకులు దివాళాకోరు తనంతో దిగజారుడు విమర్శలు చేస్తున్నారని, ఈ సభ దేశంలోనే రికార్డు అని కర్నె ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్లు పాలించినా ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ జామ్ వల్లే రాలేకపోయారు: దానం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ జామ్ వల్ల వేలాదిమంది ప్రగతి నివేదన సభ జరుగుతున్న ప్రాంతానికి రాలేకపోయారని మాజీమంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సభ విజయవంతమైనా కొందరు కాకి గోల చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్కుమార్రెడ్డి ప్రగతి నివేదన సభ గురించి ఉత్తమాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ను గద్దెదించడం సాధ్యంకాదని, గాంధీభవన్ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డిని తొలగిస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు కాకి గోల చేస్తున్నారని, ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్లో తలొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల అండ టీఆర్ఎస్కు ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నేరుగా ప్రధానమంత్రి మోదీకే కేసీఆర్ చెప్పాడని దానం వెల్లడించారు. ప్రగతి నివేదన సభలో అభివృద్ధి గురించి చెప్పడం తప్ప రాజకీయ విమర్శలు చేయలేదని, ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ కడిగి పారేస్తారని హెచ్చరించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యంకాదని ఉత్తమ్కు కాంగ్రెస్ నేతలే చెప్పారని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్షాతో ఉత్తమ్ ఎందుకు రహస్యంగా సమావేశం అయ్యారో చెప్పాలని దానం డిమాండ్ చేశారు. -
బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు
హైదరాబాద్ : బీజేపీ నేత రాంమాధవ్ ఎంతగా మాట్లాడినా ఆ పార్టీకి తెలంగాణాలో స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదని టీఆర్ఎస్ నేతలు జోస్యం చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే తెలంగాణలో అట్టడుగు వర్గాలకు కేసీఆర్ హయాంలోనే వచ్చిందని తాను చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు. ఇపుడు కూడా చెబుతున్నా ...సబ్సిడీ గొర్రెల పథకం తెచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారని చెప్పారు. ఇప్పటి వరకు అరవై లక్షల గొర్రెల పంపిణీ చేశామని, ఇదో పెద్ద విజయమన్నారు. గొల్ల కురుమలు, మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది కేసీఆరేనని స్పష్టం చేశారు. కోట్లాది చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతో వెనుకబడిన కులాలకు మంచి మేలు జరిగిందన్నారు. అసెంబ్లీ స్పీకర్ ,శాసనమండలి చైర్మన్ కూడా వెనకబడిన వర్గాలకు చెందిన వారు కావడం బీసీ వర్గాల అదృష్టమని, ప్రభుత్వం బీసీ వర్గాలకు ఎన్ని కోట్ల రూపాలయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. బీసీలను తామే ఉద్ధరిస్తున్నట్టు కొందరు మాట్లాడుతున్నారని..కానీ వారు చేసింది ఏమీ లేదని విమర్శించారు. గొర్రెల పంపిణీ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హేళనగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. -
ఫ్లెక్సీ ఎక్కిన అభిమానం.. ఫైన్ వేసిన అధికారం
బంజారాహిల్స్: స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యానికి తూట్లు పొడిస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని నిరూపించారు గ్రేటర్ అధికారులు. తప్పు చేస్తే పైవారు.. తమ వారు అన్న వివక్ష వద్దని గతంలోనే మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్కు ఆహ్వానం పలుకుతూ ఓ మాజీ కార్పొరేటర్ బంజారాహిల్స్లోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కట్టారు. ఇలా కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీహెచ్ఎంసీ అధికారులు సదరు నేతకు నోటీసులతో షాక్ ఇచ్చారు. ఇది మంత్రి కేటీఆర్కు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డికి నచ్చలేదు. ఫ్లెక్సీలు బ్యానర్లపై నిషేధం ఉండగా ఇలా సొంత పార్టీ వారే నిబంధనలు ఉల్లంఘించడమేంటని వారు కింది స్థాయి అధికారులపై మండిపడ్డారు. తక్షణమే బాధ్యులపై జరిమానా విధించాలంటూ ఆదేశించారు. దీంతో దానంతో పాటు టీఆర్ఎస్లో చేరిన బంజారాహిల్స్ మాజీ కార్పొరేటర్ బి.భారతినాయక్కు నోటీసులు జారీ చేశారు. చేసిన తప్పుకు రూ.30 వేల జరిమానా చెల్లించాల్సిందేనంటూ అందులో పేర్కొన్నారు. దీంతో సదరు నాయకులు తెల్లమొహం వేశారు. దానం ఫ్లెక్సీలపై ఎవరెవరు ఆహ్వానం పలుకుతూ ఫొటోలు వేసుకున్నారో వారందరికీ జరిమానాలు వేస్తామని అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీలో చేరితో ఇదోమి గోసరా దేవుడా అంటూ ఇప్పుడా నేతలు తల పట్టుకుంటున్నారు. మా కాలంలో ఇలా లేదు బాబు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. -
కేసీఆర్ సవాల్ను స్వీకరించిన ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విసిరిన సవాల్ను కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి స్వీకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు 2019లో వచ్చినా, ఈ ఏడాది డిసెంబర్లో వచ్చినా.. లేక ఈరోజే వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార టీఆర్ఎస్ను గద్దె దించుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్నికల విషయంలో తమ వైఖరిని ట్వీట్ ద్వారా వెల్లడించారు. అవినీతిమయమైన టీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలికేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధమేనన్నారు. ముందస్తు ఎన్నికలు అనేవి తెలంగాణ ప్రజలకు నిజంగానే శుభవార్త అని, కేసీఆర్ పాలన నుంచి కొన్ని నెలల ముందుగానే రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ‘వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటైనా టీఆర్ఎస్ను ఏమీ చేయలేవు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు ఆపకపోతే ఎన్నికలకు పోదాం పదా అని అడుగుతా.. ఇలా అడిగే రోజు దగ్గర్లోనే ఉందని’ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు తెలివి తక్కువ దద్దమ్మలని, వారికి అబద్ధం కూడా అతికేటట్టు మాట్లాడే తెలివి లేదని మండిపడ్డారు. ఆదివారం(జూన్ 24న) మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ భవన్కు వచ్చి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించిన కేసీఆర్.. దానం టీఆర్ఎస్ చేరిక సమయంలోనూ డిసెంబర్లో ఎన్నికలకు ఇతర పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరో 15 మంది దాకా చేరుతామంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పందిస్తూ.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ను గద్దె దింపడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. సంబంధిత కథనం (ఎన్నికలకు వెళ్దామా?) Whether it is May, 2019 or December, 2018 or TODAY, @INCTelangana is fully prepared and geared up to pull down TRS’ corrupt and insensitive regime. Early polls is good news for the people of Telangana as we can get rid of KCR a few months earlier. https://t.co/oPrqyfzg1q — Uttam Kumar Reddy (@UttamTPCC) 25 June 2018 -
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మరో 15 మంది!
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటైనా టీఆర్ఎస్ను ఏమీ చేయలేవు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీ యాలు ఆపకపోతే ఎన్నికలకు పోదాం పదా అని అడుగుతా.. ఇలా అడిగే రోజు కూడా దూరంగా లేదు.. దగ్గర్లోనే ఉంది...అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణ నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఎన్నికల తర్వాత హైదరాబాద్ను స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు తెలివి తక్కువ దద్దమ్మలని, వారికి అబద్ధం కూడా అతికేటట్టు మాట్లాడే తెలివి లేదని మండిపడ్డారు. ఆదివారం మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ భవన్కు వచ్చి సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. కరెంటు, రైతులు, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు..ఇలా అన్నింటిపై ఆ పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ‘‘ఏ వర్గాలకు ఏం చేస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పరు. కేసీఆర్ను గద్దె దించడమే మా లక్ష్యం.. కర్తవ్యం అంటరు. కాంగ్రెస్కు ఇదేం దిక్కుమాలిన కర్తవ్యం? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించిన నియోజకవర్గాల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలిచింది. కాంగ్రెస్ వాళ్లకు సొంతంగా ఎలా పనిచేయాలో తెలియదు. ఎన్నడూ స్వయంగా పాలించిన వారు కాదు’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ తెలివైన వాళ్లున్న రాష్ట్రమని రుజువైందన్నారు. జనరేటర్ కంపెనీలు దివాలా తీసినట్టుగానే కాంగ్రెస్ కూడా దివాలా తీసిందన్నారు. అసెంబ్లీలో మాట్లాడమంటే ప్రిపేర్ కాలేదని చెప్పిన ఉత్తమ్కుమార్రెడ్ది ఇప్పుడా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లేనని, కరెంట్ ఉండదంటూ చేతిలో కర్రపట్టి చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఎక్కడ పోయాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ను ఇంకా వస్తారు టీఆర్ఎస్, మజ్లిస్ది ఆషామాషీ స్నేహం కాదని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో ఏ సర్వే చేసినా టీఆర్ఎస్కు వంద స్థానాలు వస్తాయని తేలుతోందని చెప్పారు. ఈ సర్వేల ఫలితాలను త్వరలోనే స్వయంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. ‘‘దానం నాగేందర్ టీఆర్ఎస్లోకి సుఖ పడటానికి రాలేదు. పార్టీ భారాన్ని మోయాలి. తెలంగాణ నిర్మాణం జరుగుతోంది. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కాదు. రాబోయే రోజుల్లో పది పదిహేను మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్కు దమ్ముందా అని బీజేపీ నేతలు పాటలు పాడుతున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పథకాలు ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో నాపై కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి అనుచితంగా మాట్లాడారు. ఇలాంటి నాయకుల మాటల వల్ల ఏనాడూ సర్పంచ్గా కూడా పనిచేయని దయాకర్ను ప్రజలు ఆ ఎన్నికల్లో ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించారు అని కేసీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్ను మురికి కుంటగా మార్చారు మంచిగా పని చేసిన వారిని జనం ఓడించరని, ఏ పార్టీ, ఎవరని కూడా చూడరని సీఎం అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై ఏమీ అనుమానాల్లేవని స్పష్టంచేశారు. దానం నాగేందర్కు తమ సహకారం ఉంటుందని, పాత, కొత్త అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గత పాలకులు హైదరాబాద్ను మురికి కుంటగా చేశారని, ఎన్నికల తర్వాత నగరాన్ని స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. ‘‘ఈ నాలుగేళ్లుగా తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిపక్ష పార్టీల వైఖరి వల్ల ఎన్నికలకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో 196 కేసులు వేసింది’’ అని అన్నారు. 90 శాతం మంది పేదలున్న రాష్ట్రం తెలంగాణ అని, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని వివరించారు. అగ్రకుల పేదలకూ కల్యాణలక్ష్మి ఇస్తున్నాం. తెలంగాణకు మంచి ఆదాయం ఉంది. సొంత వనరుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుంది. పక్కరాష్ట్రం ఏపీలో మాటలు చెప్పడం తప్ప చేతలు ఏమీ లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. నాలుగేళ్ల్లలో ఎన్నో అవార్డులను సాధించాం అని అన్నారు. సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. కరెంటు, రైతులు, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు..ఇలా అన్నింటిపై ఆ పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ‘‘ఏ వర్గాలకు ఏం చేస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పరు. కేసీఆర్ను గద్దె దించడమే మా లక్ష్యం.. కర్తవ్యం అంటరు. కాంగ్రెస్కు ఇదేం దిక్కుమాలిన కర్తవ్యం? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించిన నియోజకవర్గాల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలిచింది. కాంగ్రెస్ వాళ్లకు సొంతంగా ఎలా పనిచేయాలో తెలియదు. ఎన్నడూ స్వయంగా పాలించిన వారు కాదు’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ తెలివైన వాళ్లున్న రాష్ట్రమని రుజువైందన్నారు. జనరేటర్ కంపెనీలు దివాలా తీసినట్టుగానే కాంగ్రెస్ కూడా దివాలా తీసిందన్నారు. అసెంబ్లీలో మాట్లాడమంటే ప్రిపేర్ కాలేదని చెప్పిన ఉత్తమ్కుమార్రెడ్డి ఇప్పుడా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లేనని, కరెంట్ ఉండదంటూ చేతిలో కర్రపట్టి చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఎక్కడకు పోయాడని ప్రశ్నించారు. హైదరాబాద్ను మురికి కుంటగా మార్చారు మంచిగా పని చేసిన వారిని జనం ఓడించరని, ఏ పార్టీ, ఎవరని కూడా చూడరని సీఎం అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై ఏమీ అనుమానాల్లేవని స్పష్టంచేశారు. దానం నాగేందర్కు తమ సహకారం ఉంటుందని, పాత, కొత్త అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గత పాలకులు హైదరాబాద్ను మురికి కుంటగా చేశారని, ఎన్నికల తర్వాత నగరాన్ని స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. ‘‘ఈ నాలుగేళ్లుగా తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిపక్ష పార్టీల వైఖరి వల్ల ఎన్నికలకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో 196 కేసులు వేసింది’’ అని అన్నారు. 90 శాతం మంది పేదలున్న రాష్ట్రం తెలంగాణ అని, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని వివరించారు. ‘‘అగ్రకుల పేదలకూ కల్యాణలక్ష్మి ఇస్తున్నాం. తెలంగాణకు మంచి ఆదాయం ఉంది. సొంత వనరుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుంది. పక్కరాష్ట్రం ఏపీలో మాటలు చెప్పడం తప్ప చేతలు ఏమీ లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. నాలుగేళ్ల్లలో ఎన్నో అవార్డులను సాధించాం’’ అని అన్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా చాలా మంది వస్తారు టీఆర్ఎస్, మజ్లిస్ది ఆషామాషీ స్నేహం కాదని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో ఏ సర్వే చేసినా టీఆర్ఎస్కు వంద స్థానాలు వస్తాయని తేలుతోందని చెప్పారు. ఈ సర్వేల ఫలితాలను త్వరలోనే స్వయంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. దానం నాగేందర్ టీఆర్ఎస్లోకి సుఖ పడటానికి రాలేదు. పార్టీ భారాన్ని మోయాలి. తెలంగాణ నిర్మాణం జరుగుతోంది. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కాదు. రాబోయే రోజుల్లో పది పదిహేను మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్కు దమ్ముందా అని బీజేపీ నేతలు పాటలు పాడుతున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పథకాలు ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో నాపై కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి అనుచితంగా మాట్లాడారు. ఇలాంటి నాయకుల మాటల వల్ల ఏనాడూ సర్పంచ్గా కూడా పనిచేయని దయాకర్ను ప్రజలు ఆ ఎన్నికల్లో ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు. -
‘దానం టీఆర్ఎస్లో ఉండరు’
సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్ది పక్కా అవకాశవాద రాజకీయమని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు పవర్లో ఉన్న పార్టీల పట్ల మాత్రమే ప్రేమ ఉంటుందని మండిపడ్డారు. బీసీ నాయకుడుగా ఆయన ఎప్పుడూ వారి సమస్యలపై పోరాడలేదనీ, పదవులకోసమే రాజకీయాలు చేసేవారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బీసీలకు కాంగ్రెస్లో అన్యాయం జరుగుతోందని అసత్య ప్రచారం చేస్తున్న దానం.. గతంలో మంత్రి పదవులెలా పొందారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పీజేఆర్, శశిధర్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచినా నాగేందర్కే మంత్రి పదవులు, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చారని గుర్తుచేశారు. పార్టీలు మారడం దానంకు కొత్తకాదనీ.. టీఆర్ఎస్ ఓడినా, గెలిచినా ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరతారని నారాయణరెడ్డి జోస్యం చెప్పారు. ఏదేమైనా కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
దానం ఓ బచ్చా; ఆయనతో ఏమీ కాదు..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి దానం నాగేందర్పై కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ నిప్పులు చెరిగారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ‘దానం ఓ బచ్చాగాడు. అతను చెప్పడం వల్లనే నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారనడం హస్యాస్పదం’ అని అంజన్కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాగేందర్ కాంగ్రెస్ను వీడడం వల్ల జరిగే నష్టమేమీ లేదని అన్నారు. అయినా, ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారిన నాగేందర్ పార్టీని వీడడం ఒకందుకు మంచిదేనని అన్నారు. కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని చెప్పుకు తిరుగుతున్న దానంకు సిగ్గుండాలని అన్నారు. హైదరాబాద్లో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. కబ్జాదారున్ని ఎందుకు చేర్చుకున్నారు..? ‘దానం నాగేందర్ భూ కబ్జాదారుడని హోం మంత్రి గతంలో అన్నారు. అలాంటి కబ్జాదారున్ని పార్టీలో ఎందుకు చేర్చుకున్నార’ని పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్పై మండిపడ్డారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. బీసీలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని చెప్పుకుంటున్న దానం.. టీఆర్ఎస్ పాలనలో బీసీల అభివృద్ధికి కేటాయించిన నిధులెన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పొన్నం తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు దాసోహం.. దానం ఒక బీసీ అయివుండి అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహేశ్గౌడ్ విమర్శించారు. బీసీ సమస్యలపై ఏనాడూ పోరాడని దానం తనకు పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజలకు తెలుసునని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. -
చంద్రబాబు బాగోతం చెప్పిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఐదుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తోన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి వెల్లడించారు. ‘‘పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నదో చూస్తున్నాం కదా..’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి బాగోతాన్ని వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ను టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్న సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ సీఎం, బీజేపీ సీఎంలపైనా వ్యాఖ్యలు చేశారు. (చదవండి: సర్వే ఫలితాలు చూసి షాకయ్యా: కేసీఆర్) ఏపీలో జరుగుతున్నదిదే: ‘‘నాలుగేళ్ల నుంచి ఏపీలో జరుగుతున్నదేంటో మనం చూడట్లేదా, డుమ్కీలు కొట్టడం తప్ప అక్కడ పని జరగట్లేదు. మాకంటే పెద్ద ఎవడూలేడన్న స్థాయిలో ఏదేదో చేస్తమని అక్కడి పాలకులు అన్నారు. కేవలం మాటలు చెప్పుకుంటపోతే అయ్యేదేమీలేదని రుజువైంది. ఏపీకి భిన్నంగా తెలంగాణలో నాయకులందరం కష్టపడి పనిచేశాం. కాబట్టే మంచి ఫలితాలు, అభివృద్ధి సాధించాం’’ అని కేసీఆర్ అన్నారు. విభజనతో హైదరాబాద్ను కోల్పోవడమేకాక, అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అని ప్రజానీకం గట్టిగా భావిస్తున్నా, సీఎం చంద్రబాబు మాత్రం అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కేసులకు భయపడి కేంద్రం పాదాల వద్ద ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి, తీరా ఎన్నికలు వస్తుండటంతో కొత్త నాటకాలకు తెరలేపడాన్ని జనం అసహ్యించుకుంటుండటం విదితమే. బీజేపీ సీఎంలకు కితాబు: మంచి పనులు చేసే ప్రభుత్వాలను, నాయకులను ప్రజలు వదులుకోలేరన్న కేసీఆర్.. అందుకు ఉదాహరణగా బీజేడీ, బీజేపీ సీఎంలను పేర్కొనడం గమనార్హం. ‘‘మన పక్కనే ఒడిశాలో బీజేడీ వరుసగా నాలుగు సార్లు ఎన్నికల్లో గెలిచింది. ఐదోసారి కూడా ఆయనే(నవీన్ పట్నాయకే) గెలుస్తాడు. ఇటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ ముఖ్యమంత్రులు విజయవంతంగా మూడో టర్మ్ పూర్తిచేసుకున్నారు. మంచిచేస్తే జనమే నాయకుల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. తప్పుచేస్తే ఖచ్చితంగా శిక్ష తప్పదు’’ అని కేసీఆర్ అన్నారు. -
ప్రతిపక్షాలు సరేనంటే ముందస్తుకు రెడీ
-
సర్వే ఫలితాలు చూసి షాకయ్యా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మంచి పనులు చేసే ప్రభుత్వాలను, పార్టీలను ప్రజలు వదులుకోరని, టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని జనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ 100 పైచిలుకు స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సిటీ కాంగ్రెస్ మాజీ చీఫ్, మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్కా సర్వే.. ముందస్తుకు సై: ‘‘ దేశంలో ఏ రాష్ట్రమూ అమలుచేయలేనన్ని గొప్ప గొప్ప పథకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మనసును గెలుచుకుంది. యావన్మంది ‘ఔరా!’ అని ముక్కున వేలేసుకునే విధంగా పరిపాలన సాగిస్తున్నాం. కానీ రాష్ట్రంలో జరుగుతోన్న మంచిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. నీటి ప్రాజెక్టులకు అడ్డగోలుగా అడ్డం పడుతున్నాయి. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి వీళ్లు (విపక్షాలు) ఇంకా పిచ్చి కథలుపడతారు. ఇదంతా అవసరమా, ఈ గోలంతా ఎందుకు, సరే, మరి ముందస్తు ఎన్నికలకు పోదామా? అని నేనే వాళ్లను ప్రశ్నిద్దామనుకుంటున్నా. మా పార్టీ నేతలు కూడా ఇదే మాట అంటున్నారు. ‘జనం రెడీగా ఉన్నారు.. ముందస్తుకు పోదాం సార్’అని! నా లెక్క ప్రకారం కూడా ముందస్తు ఎన్నికలు రావొచ్చని అనుమానంగా ఉంది. ప్రతిపక్షాలు సరేనంటే ముందస్తుకు రెడీగా ఉన్నాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నాగేందర్ తలపై బండ.. 20 రోజుల్లో ఇంకా చాలామంది: హైదరాబాద్ను విశ్వనగరంగా, ప్రపంచంలోనే నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దాలంటే కష్టపడి పనిచేసే నాయకులు అవసరమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న పనులు నచ్చి ఇవాళ దానం నాగేందర్ పార్టీలోకి వచ్చాడు. రాబోయే 20 రోజుల్లో ఇంకా చాలా మంది నాయకులు క్యూ కడతారు. ఏదో సుఖపడటానికి ఆయన రాలేదు.. టీఆర్ఎస్లో చేరడమంటే నాగేందర్ నెత్తిన బండ ఎత్తుకున్నట్లే. అంత కష్టపడి పనిచేయాలన్నమాట! కార్యకర్తగా ఉన్నప్పటినుంచీ అతను నాకు తెలుసు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఇక్కడ కూడా మంచి అవకాశాలు, మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇస్తున్నా..’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సర్వే చూసి నేనే షాకయ్యా! : ఇంతకు ముందు చేయించిన సర్వేలకంటే బలమైన, సత్యప్రమాణాలు అధికంగా ఉన్న మరో సర్వేను ఇటీవలే చేయించానని ముఖ్యమంత్రి తెలిపారు. తాజా సర్వేలో తనతో సహా అందరూ ఆశ్చర్యపోయే ఫలితాలు వచ్చాయని చెప్పారు. ‘‘తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ బలం 50 శాతానికి మించి పెరిగింది. మిగతా పార్టీలతో డిఫరెన్స్ దాదాపు 40 శాతం ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 60వేలు, 70వేలు పైచిలుకు మెజారిటీ సాధించబోతున్నారు. ఈ సర్వే ఫలితాలు చూసి నేనే ఆశ్చర్యపోయాను. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలన్నీ మీడియాకు వెల్లడిస్తాను’’ అని సీఎం తెలిపారు. -
టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్
-
దానం విమర్శలకు పొన్నం కౌంటర్
-
రేసు గుర్రాలెక్కడ?
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలుపు గుర్రాలతో ఎన్నికల రణంలోకి దిగే వ్యూహానికి తెర లేపింది. మాజీ మంత్రి దానం నాగేందర్తో పాటు నగరంలో సగం నియోజకవర్గాలను కొత్త నేతలతో నింపే దిశగా పావులు కదుపుతోంది. గడిచిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్, పటాన్చెరు శాసనసభ స్థానాలనే గెలుచుకున్న టీఆర్ఎస్.. తదనంతరం టీడీపీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకొని ఆయా నియోకజవర్గాల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పక్షాన ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, నాంపల్లి, కార్వాన్, మలక్పేట తదితర నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బలమైన నాయకులు కనిపించడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతల కోసం వేట ప్రారంభించిన టీఆర్ఎస్.. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో గత మూడేళ్లుగా టీఆర్ఎస్లో చేరే ప్రయత్నాలు చేస్తున్న దానం నాగేందర్కు ఎట్టకేలకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇవ్వడంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ ‘ఆపరేషన్ ఆకర్‡్ష’ను అమలు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని చేర్చుకునే అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుధీర్రెడ్డి సైతం గడిచిన కొన్నాళ్లుగా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు సైతం దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సుధీర్రెడ్డి సేవలను విస్తృత స్థాయిలో వాడుకునే విషయంలో ఫెయిలైందన్న భావన కూడా పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోంది. పార్టీ మారే విషయంలో సుధీర్రెడ్డి ఇప్పటికిప్పుడు నిర్ణయాన్ని ప్రకటించకుండా మరికొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ఉప్పల్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్కు బలమైన నాయకుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండారి లక్ష్మారెడ్డి అధికార టీఆర్ఎస్, బీజేపీ నాయకుల కంటే విస్తృత కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీ బలమైన నాయకుడి కోసం పావులు కదిపే యోచనలో ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే కనకారెడ్డి సైతం వివిధ కారణాలతో క్యాడర్కు, జనానికి దూరంగా ఉండడం.. ఈ నియోకజవర్గంలో ఎమ్మెల్సీ హన్మంతరావు హడావుడి పెరగడం వల్ల మధ్యే మార్గంగా ప్రముఖ విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న ఓ యువ నాయకుడిని ఇక్కడి నుంచి పోటీకి దింపాలన్న చర్చ టీఆర్ఎస్లో సాగుతోంది. ఇక గోషామహల్, అంబర్పేట, ముషీరాబాద్లలో బీజేపీ ఎమ్మెల్యేలకు దీటుగా పనిచేసే నాయకులు కూడా ప్రస్తుతానికి టీఆర్ఎస్లో కనిపించడం లేదు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని మలక్పేట, కార్వాన్, చంద్రాయణగుట్ట, బహుదూర్పురా, యాకుత్పురాలో బలమైన నేతల కోసం వేట సాగుతోంది. ఆ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా.. టీడీపీ తరఫున విజయం సాధించి టీఆర్ఎస్లో చేరిన కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, జూబ్లిహిల్స్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లోనూ అవసరమైతే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎంచుకునే ఛాన్స్ ఉండాలని పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. సీఎం నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ఆశించిన స్థాయిలో మార్కులు పొందలేని ఎమ్మెల్యేల స్థానే వారు సూచించిన కొత్త అభ్యర్థులను ప్రతిపాదించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. -
కాంగ్రెస్ను ఒక వర్గమే ఏలుతోంది...
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ను ఒక వర్గానికి చెందిన వారే ఏలుతున్నారని ఆ పార్టీ మాజీ నేత దానం నాగేందర్ పేర్కొన్నారు. ఆత్మగౌరవం లేని చోట కొనసాగడం వృథా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను వీడేందుకు దారితీసిన పరిస్థితులను శనివారం ఆయన మీడియాకు వివరించారు. ‘‘30 ఏళ్లుగా పార్టీకి సేవ చేశా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశా. సైనికుడిగా పనిచేసినప్పటికీ చాకిరీగా వాడుకున్నారు. కాంగ్రెస్లో ఉన్న బీసీ నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏ సమావేశం జరిగినా ఒక వర్గానికి చెందిన వారే వేదికపై ఉంటున్నారు. వారే మాట్లాడుతున్నారు. పార్టీలో బీసీ నేతలు, నాయకులకు అవకాశం లభించడం లేదు. సీనియర్లు డి.శ్రీనివాస్, కె.కేశవరావు పార్టీని వీడడానికి కారణాలేంటో తెలుస్తోంది. సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదో చెప్పాలి. వీహెచ్ను కూడా పట్టించుకోవడం లేదు. ఆయన పార్టీలో మింగలేక.. కక్కలేక అన్నట్లు ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ పార్టీ అధినేత రాహుల్గాంధీకి చెప్పాను. ఆరు నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ బీసీ నాయకులతో రాహుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి నేను కూడా హాజరయ్యా. అందులో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను’’అని దానం చెప్పారు. కాంగ్రెస్కు పూర్వ వైభవం రావాలంటే బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్కు సూచించినట్లు తెలిపారు. ఉత్తమ్ పని బాగున్నా.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పనితీరు బాగుందని, ఆయన పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని దానం పేర్కొన్నారు. కానీ కొందరు నేతలు ఉత్తమ్ను కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోలీసు శాఖలో ఒక సామాజిక వర్గానికే పదోన్నతులు ఇచ్చారని, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అప్పటి హోంమంత్రి జానారెడ్డిని వైఎస్ వారించారన్నారు. కాంగ్రెస్లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే టికెట్లు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గ్రేటర్లో ఏ కార్యక్రమం జరిగినా.. బాధ్యతనంతా నా భుజాలపైనే వేసుకుని పని చేశా. కానీ నన్ను విస్మరించారు. పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదు. బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదు’’అని అన్నారు. కేసీఆర్ను చూసి గర్వపడుతున్నా.. సీఎం కేసీఆర్ను చూసి గర్వపడుతున్నానని దానం పేర్కొన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ గతంలో ఏ పార్టీ చేయని విధంగా బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను చూసి పలువురు ఆకర్షితులవుతున్నారన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. రైతుబంధు, రైతుబీమాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలు బడుగుల కులాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు. టీఆర్ఎస్లో చేరే విషయంపై త్వరలో సమాచారం ఇస్తానని చెప్పారు. టీఆర్ఎస్లో చేరిన తర్వాత తాను పదవులు ఆశించబోనన్నారు. ఎలాంటి కార్యాన్ని అప్పగించినా బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. -
కాంగ్రెస్లో కలవరం
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల తరుణంలో అధికార టీఆర్ఎస్ మళ్లీ మొదలుపెట్టిన ‘ఆకర్‡్ష’ వ్యూహానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్లో కలవరం మొదలైంది. ఎన్నికల తరుణంలో ఇతర పార్టీల నుంచి నేతలు రావాల్సి ఉండగా దీనికి భిన్నంగా జరుగుతుండటం కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో కీలక నేత దానం నాగేందర్ రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్లో కలవరం మొదలైంది. దానం దారిలోనే మరికొందరు ముఖ్య నేతలు పయనిస్తున్నారనే ప్రచారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పెద్దలను ఆత్మరక్షణలో పడేసింది. కాంగ్రెస్లో సమన్వయం లేదని, చొరవ తీసుకుని పార్టీని ఏకతాటిన పెట్టాలని రాష్ట్రంలోని పలువురు ముఖ్య నేతలు నాలుగు రోజుల క్రితమే ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీని కలసి విన్నవించారు. అయితే ఆ వెంటనే దానం నాగేందర్ పరిణామం జరగడం కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారింది. పార్టీ నుంచి ముఖ్య నేతల వలసల ఆందోళన పెరగడంతో దిద్దుబాటు చర్యలపై టీపీసీసీ పెద్దలు కసరత్తు ప్రారంభించారు. అసంతృప్త నేతలకు సర్దిచెప్పే వ్యూహాలకు పదునుపెట్టారు. ఇలాంటి వారి వద్దకు ఇతర నేతలను పంపించి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దానం నాగేందర్ రాజీనామా, మరికొందరు నేతలు ఇదే దారిలో వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, తాజా పరిణామాలపై ఏఐసీసీ పెద్దలతో చర్చించారు. మొత్తంగా కాంగ్రెస్లో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ఊహించిందే అయినా... గ్రేటర్ హైదరాబాద్లో కీలక నేతగా గుర్తింపు పొందన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ను వీడుతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ ప్రచారం తాజాగా వాస్తవరూపం దాల్చింది. అయితే ఇది జరిగిన తీరు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసిందనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ను వీడేందుకు దానం చెప్పిన కారణాలు, ఉత్తమ్ స్వయంగా ఇంటికి వెళ్లినా దానం కలకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్లో ఒక సామాజికవర్గం లాబీయింగ్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ కారణంతోనే కేకే, డీఎస్ లాంటి నేతలు పార్టీని వీడారంటూ దానం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ను కలవరానికి గురి చేస్తున్నాయి. ఒక సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువైందనే అంచనా నేపథ్యంలోనే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా పార్టీ కమిటీల కూర్పు చేయాలని కసరత్తు ప్రారంభించారు. అయితే ఆ కసరత్తు మొదలై ఆరు నెలలైనా కొలిక్కి రాకపోవడం పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న ఆయా వర్గాల నేతలకు అసంతృప్తి కలిగించింది. పార్టీలో ఒకవైపు పదవులు, ప్రాధాన్యత లేకపోవడం, మరోవైపు టీఆర్ఎస్ ‘ఆకర్ష’ వ్యూహం అమలు చేస్తుండటంతో ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు ఊగిసలాటలో పడ్డారు. దానం నిర్ణయం ఈ కోణంలోనే జరిగిందని కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. అదే బాటలో మరికొందరు.. దానం నాగేందర్ కాంగ్రెస్ను వీడిన తరహాలోనే మరికొందరు నేతలు అదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ మొదలైంది. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. హైదరాబాద్కు చెందిన ముఖేశ్గౌడ్, కూన శ్రీశైలంగౌడ్, లక్ష్మారెడ్డి, సుధీర్రెడ్డిలు కాంగ్రెస్లో సంతృప్తిగా లేరని, వారికి టీఆర్ఎస్ గాలం వేసిందనే చర్చ గాంధీ భవన్లో రెండు రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ పెద్దలు పార్టీ దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించారు. టీపీసీసీ ముఖ్య నేతలు శుక్రవారం రాత్రి సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఎన్నికల వేళ రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారుతున్న సమయంలో ఈ పరిణామాలు పార్టీపై ప్రజల్లో మరో విధమైన అంచనాను కలిగిస్తాయనే అభిప్రాయానికి వచ్చారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన అభిషేక్రెడ్డి వద్దకు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వెళ్లారు. అయితే తాను కాంగ్రెస్ను వీడనని అభిషేక్రెడ్డి చెప్పారు. కానీ మిగిలిన నేతలతో సంప్రదింపులకు టీపీసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నా వారిలో ఎందరు సర్దుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఛలో ఢిల్లీ... పార్టీలోని తాజా పరిణామాలపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ శనివారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు అశోక్ గెహ్లాట్, జైరాం రమేశ్, కాంగ్రెస తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాతోపాటు కొత్తగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులతో దాదాపు ఐదుగంటలపాటు చర్చించారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు కార్యదర్శులకు మూడు జోన్ల బాధ్యతలు అప్పగించారు. దక్షిణ, ఉత్తర, మధ్య తెలంగాణగా విభజించి ముగ్గురు కార్యదర్శులకు బాధ్యతలిచ్చారు. దీనికితోడు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మేనిఫెస్టో, స్క్రీనింగ్, ప్రచార, కో ఆర్డినేషన్ కమిటీల కూర్పుపైనా ఏఐసీసీ పెద్దలతో ఉత్తమ్ చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని, పార్టీ కమిటీల ప్రకటన వచ్చే అవకాశముందని, మరికొందరు నేతలు జారిపోకుండా సామాజిక న్యాయంతో కూడిన కమిటీలను ప్రకటిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. -
‘రెండేళ్లుగా టీఆర్ఎస్కు టచ్లో..’
సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్ పార్టీ మారడం కొత్త కాదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. దానం రాజీనామా అంశంపై శనివారం కోమటిరెడ్డి స్పందించారు. ‘దానం నాగేందర్ పార్టీ మారడం ఊహించిన విషయమే. గత రెండు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్తో దానం టచ్లో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్లోకి వెళ్ళడానికి ఫ్లెక్సీలు కూడా రెడీ చేసుకున్నారు. అంతకుముందు కూడా టీడీపీలో చేరి మళ్ళీ కాంగ్రెస్కు వచ్చి మంత్రి పదవి అనుభవించారు. ఇప్పుడు కాంగ్రెస్లో బీసీలకు న్యాయం జరగడం లేదని చెప్పడం విడ్డురంగా ఉంది. సొంత ఎజెండా కోసమే దానం పార్టీ మారుతున్నారు. అలాంటి దానం ఇంటికి పీసీసీ ప్రెసిడెంట్ వెళ్లడం కూడా కరెక్ట్ కాదు. ఆయనకు అంత స్థాయి లేదు. దానం రాజీనామాను నేతలు ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. అసలు టీఆర్ఎస్ పార్టీలోనే సామాజిక న్యాయం లేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మోసం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్లో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకుండా కేసీఆర్ మహిళలను అవమాన పర్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాం.. దళిత, గిరిజన, బీసీలకు ప్రాధాన్యతనిచ్చాం. కాంగ్రెస్ నేతలంతా ధైర్యంగా ఉండాలి. రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.’ అని పేర్కొన్నారు. -
హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఉత్తమ్ శనివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వార్ రూమ్ లో కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్తో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఉత్తమ్ హైకమాండ్తో చర్చించునున్నట్టు తెలుస్తోంది. అలాగే కొత్త కమిటీ ఏర్పాటు, సంస్థాగత మార్పులపై చర్చించే అవకాశం ఉంది. -
‘టీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ రాలేదు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు దానం నాగేందర్ శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డిలకు పంపారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 30ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. పార్టీ కోసం బాధ్యతగా పనిచేస్తూ వచ్చానని అన్నారు. అంతేకాక కాంగ్రెస్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్లో ఏదైనా నా భూజాలపై వేసుకొని పనిచేశానని పేర్కొన్నారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీలో చాలా పితలు ఉన్నాయన్నారు. బలహీన వర్గాల గురించి దివంగత నేత వైఎస్సార్ తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో నాకు తెలియకుండా సీట్లు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసిన ఎదగకుండా వెనక్కి లాగుతున్నారని విమర్శించారు. ఒకే వర్గానికి చెందిన వారికి పార్టీలో ప్రధాన్యతా ఇస్తున్నారని దానం ఆసహనం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి తనకు ఎలాంటి హామీ రాలేదని దానం స్పష్టం చేశారు. అయినా టీఆర్ఎస్లో పని ఇస్తే చేస్తా.. లేకపోతే కార్యకర్తగా ఉంటానని దానం నాగేందర్ తెలిపారు. ‘అంజన్కుమార్తో నాకు ఎలాంటి విభేదాలు లేవని దానం స్ఫష్ట చేశారు. అతనికి పదవి ఇవ్వమని చెప్పిందే నేనే దానం తెలిపారు. నాకు కూడా కాంగ్రెస్లో పదవి ఫైనల్ అయింది.. పదవి వచ్చాక పోతే బాగోదని ఇప్పుడు కాంగ్రెస్ను నుంచి వెళ్లిపోతున్నానని దానం అన్నారు. ఢిల్లీ చుట్టూ తిరిగే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరాం. హైకమాండ్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. తెలంగాణ జనాభాలో 51శాతం బీసీలు ఉన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేకపోవడం, వారిని పక్కన పెట్టడం చాలా బాధ కలిగించింది. బస్సు యాత్రలో కూడా అతికష్టంగా బీసీ నుంచి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తున్నాడు. కానీ, ఆయనను కూడా పీతల మాదిరిగా లాగుతున్నారు. సీనియర్ నాయకులు డీఎస్, కేకే దూరం కావడానికి గల కారణాలను రాహుల్ గాంధీకి వివరించాను. అంతేకాక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డిని కొందరు నేతలు పనిచేయనీయడం లేదు. పొన్నాలకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు. పార్టీలో వీహెచ్ పరిస్థితి కక్కలేక.. మింగలేక ఉన్నట్టు ఉందని’ దానం పేర్కొన్నారు. వైఎస్సార్ లాంటి నేత అవసరం.. కాంగ్రెస్ పార్టీకి దివంగత వైఎస్సార్ లాంటి నేత అవసరమని దానం నాగేందర్ అన్నారు. అంతేకాక వైఎస్సార్ లాంటి నేత ఇక దొరకరు అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను దానం గుర్తు చేశారు. ఆ వర్గాలకు దివంగత నేత వైఎస్సార్ చేసినంత సేవ దేశంలో ఏ సీఎం చేయలేదని ఆయన పేర్కొన్నారు. బుజ్జగించేందుకు ఉత్తమ్ ప్రయత్నాలు దానం నాగేందర్ణు బుజ్జగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి రంగంలో దిగారు. దానంను కలిసేందుకు ఉత్తమ్ మీడియా సమావేశం జరిగే ప్రాంతానికి వెళ్ళారు. కానీ, అప్పటికే దానం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫోన్లో ట్రై చేసిన దానం అందుబాటులోకి రాలేదని సమాచారం. -
కాంగ్రెస్కు దానం గుడ్బై
-
కాంగ్రెస్కు దానం నాగేందర్ గుడ్బై
-
కాంగ్రెస్కు దానం నాగేందర్ గుడ్బై
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలు ఐదా రు నెలల్లోనే ఉంటాయని ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్లో కీలక నాయకుడు దానం నాగేందర్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమి క సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిలకు రాజీనామా లేఖ పంపారు. బడుగులు, బీసీలకు పార్టీలో అన్యా యం జరుగుతున్న కారణంగానే వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ‘వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి మూడు దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేశాను. అయితే జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం, మారుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీలోని జాతీయ, రాష్ట్ర పెద్దలతో చర్చించినా పెడచెవిన పెట్టారు. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అభద్రత, అసంతృప్తితో ఉన్నారు. సమన్వయ లేమి, కార్యకర్తలతో సంప్రదింపులు జరపకపోవడం, క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం, సరైన మార్గనిర్దేశం లేకపోవడంతో వారంతా తప్పని పరిస్థితుల్లో పార్టీ వీడుతున్నారు. అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లేమి కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితులే నన్ను రాజీనామా దిశగా అడుగులు వేయించాయి. పార్టీ పునర్నిర్మాణం, బీసీల సంక్షేమంపై చర్చించాలని చాలామార్లు ప్రయత్నించినా దురదృష్టవశాత్తూ నాయ కత్వం నా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు’’అని లేఖలో దానం పేర్కొన్నారు. మొదట్నుంచీ ప్రచారమైనట్టుగానే... నిజానికి దానం నాగేందర్ కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం 2014 ఎన్నికలు ముగిసిన నాటి నుంచీ ఉంది. ఆయన కాంగ్రెస్కు చాలా రోజు లుగా దూరంగా ఉన్నారు. 2015 గ్రేటర్ ఎన్నికల సందర్భంగా దానం టీఆర్ఎస్లో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ మేరకు ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. చివరి నిమిషంలో టీఆర్ఎస్ పెద్దల నుంచి సరైన హామీ రాక చేరిక వాయిదా పడింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ స్వయంగా మాట్లాడి, పార్టీలో కొనసాగాలని, గ్రేటర్లో బలోపేతం చేయాలని కోర డంతో దానం అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల పార్టీ పదవుల భర్తీలో దానం పేరును పార్టీ పట్టించుకోలేదు. నగర అధ్యక్ష పదవి నుంచి తొలగించి మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ను నియమించడంపై దానం ఆగ్రహించారు. ఐఏసీసీ కార్యదర్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దానం ఆశించినా నిరాశే మిగిలింది. ఏఐసీసీ కార్యదర్శిగా శుక్రవారం ఎమ్మెల్యే సంపత్ను ప్రకటించడంతో దానం మరింత అసంతృప్తికి లోన య్యారు. రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా బీసీ వర్గానికి చెందిన దానంను చేర్చుకునేందుకు పార్టీ సిద్ధపడటం, ఆ దిశగా చర్చలు ఫలప్రదం కావడంతో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బుజ్జగించేందుకు.. దానం రాజీనామా సమాచారం అందగానే ఉత్తమ్ స్వయంగా రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డిని వెంటపెట్టుకొని దానం ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆయన బయటకు వెళ్లిపోవడంతో కలవలేకపోయారు. ఫోన్లో సం ప్రదించే ప్రయత్నం చేసినా దానం అందుబాటులోకి రాలేదు. బుజ్జగింపు యత్నాలు జరుగుతుండగానే దానం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో భేటీ అయ్యారనే సమాచారం అందడం, టీఆర్ఎస్లో చేరడం ఖాయమని తేలడంతో కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలను విరమించారు. -
‘దానం పార్టీ మారకుండా చూస్తాం’
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అంజన్కుమార్ యాదవ్ పేరును ఇటీవల ఖరారు చేసింది. అయితే తనకు మాట మాత్రమైనా చెప్పకుండా గ్రేటర్ అధ్యక్షుడి నియామకం జరగడంతో మాజీ మంత్రి దానం నాగేందర్ మనస్తాపం చెందారనీ, ఆయన కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దానం శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది. ఆయన శనివారం కేసీఆర్ సమక్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ పార్టీని వీడడం కాంగ్రెస్కు నష్టమేనని వ్యాఖ్యానించారు. రేపు ఉదయంలోగా దానంతో మాట్లాడి మనసు మార్చుకొనేలా ప్రయత్నిస్తామని అన్నారు. జానారెడ్డి నివాసంలో సమావేశమై పార్టీ నాయకత్వం ఈ విషయంపై చర్చించిందని తెలిపారు. -
దానం రాజీనామా కాంగ్రెస్లో కలకలం
-
తలసానిని కలసిన దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో దానం నాగేందర్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం టీఆర్ఎస్లో చేరికపై దానం నాగేందర్ తలసానితో చర్చించారు. భేటీ అనంతరం మాట్లాడుతూ పార్టీలోకి ఎవరు వచ్చిన సాదరంగా ఆహ్వానిస్తామని తలసాని అన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. మరోవైపు దానం నాగేందర్ బాటలో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కూడా నడుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. దానం నాగేందర్ పార్టీని విడటంపై చర్చించారు. అంతకుముందు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, దానం నాగేందర్ను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. సంపత్కుమార్కు పదవి ఇవ్వడంపై దానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సమయంలో కీలక నేతలు పార్టీని వీడటం వల్ల బలహీనమవుతామని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ముఖేశ్, విక్రమ్లు కూడా పార్టీని వీడతారనే వార్త వారిలో మరింత గుబులు పుట్టిస్తోంది. -
కాంగ్రెస్కు దానం రాజీనామా
-
కాంగ్రెస్కు దానం గుడ్బై; అటు భారీ ఆఫర్?
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, సిటీ కాంగ్రెస్ కీలక నాయకుడు దానం నాగేందర్ హస్తం పార్టీతో తన బంధాన్ని తెంచుకున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ, తెలంగాణ పరిశీలకుడు అశోక్ గెహ్లాట్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు లేఖలు రాశారు. పార్టీలో బడుగులు, బీసీలకు అన్యాయం జరుగుతోందన్న కారణంగానే వెళ్లిపోతున్నట్లు దానం లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, ఇటీవలే సంస్థాగత పదవుల భర్తీలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని కోల్పోయినప్పటి నుంచీ దానం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు, అందుకే రాజీనామా చేసినట్లు ఆయన వర్గీయులు పేర్కొన్నారు. రాజీనామా వార్తలు ప్రసారమైన కొద్దిసేపటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.. దానం ఇంటికి వెళ్లి, సముదాయించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ నుంచి భారీ ఆఫర్?: దానం కాంగ్రెస్కు రాజీనామా చేశారన్న వార్త ప్రస్తుతం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. శనివారం(రేపు) దానం తన భవిష్యత్ కార్యాచరణను మీడియాకు వివరిస్తానని ఆయన కార్యాలయం తెలిపింది. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ను వీడి కారు ఎక్కేందుకు తీవ్రంగా యంత్నించిన ఆయన... చివరి నిమిషంలో మనుసుమార్చుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా స్తంబ్ధుగా వ్యవహరిస్తోన్న దానం.. తన సిటీ ప్రెసిడెంట్ పదవిని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కు కట్టబెట్టడంతో ఇంకాస్త కుంగిపోయారని తెలిసింది. అదేసమయంలో అధికార పార్టీ నుంచి భారీ ఆఫర్ రావడంతో ఆయన గులాబీ గూటిలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ భారీ ఆఫర్ ‘సికింద్రాబాద్ ఎంపీ టికెట్’ అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే అధికారికంగా ఈ విషయాలేవీ నిర్ధారణ కాలేదు. -
వెళ్లొద్దన్నా వచ్చిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సహా తెలంగాణ, ఏపీ మంత్రులు పలువురు ఈ విందుకు హాజరయ్యారు. అయితే గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని టీ-కాంగ్రెస్ నేతలు ఈ విందును బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి దానం నాగేందర్లు విందుకు హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమాచారం లేదని, వెళ్లొద్దని చెబితే వెళ్లేవాడిని కాదని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. కాగా ఈ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాలేదు.. -
దానం ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం.. సీత మృతి!
-
‘మంత్రుల గైర్హాజరు సిగ్గుచేటు’
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరద పరిస్థితిపై మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హైదరాబాద్కు చెందిన మంత్రులెవ్వరూ లేకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి దానం నాగేందర్ విరుచుకుపడ్డారు. నగరంపై అవగాహన ఉన్న మంత్రులను పిలవకుండా నిన్నగాక మొన్న వచ్చి అవగాహనలేమితో నిర్ణయాలు తీసుకుంటున్న కేటీఆర్కు ఏమి తెలుసని ప్రశ్నించారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్నం 10లోని సింగాడికుంట, నాయుడునగర్ బస్తీలలో ఆయన పర్యటించి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఇలాంటి వరదలే వచ్చినప్పుడు కేటీఆర్ ఆరు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. మళ్లీ మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలోను, ఒక్క రోజులో అంతా సర్ధుకుంటుందని మంత్రి చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్కడైనా పరిస్థితి సద్దుమణిగిందా అని నిలదీశారు. హైదరాబాద్లో వరస వస్తే చెరువులను తలపిస్తున్నాయని పక్కా ప్రణాళిక లేకుండా అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారని దానం ఆరోపించారు. నాయుడు నగర్లో చుట్టూ మట్టి కుప్పులతో పాటు రాళ్లు పేరుకుపోయాయని సోమవారం నాటి వరదలు మళ్లీ వస్తే ఇవన్నీ కొట్టుకొచ్చి గుడిసెలను ముంచెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా స్థానికులు తినడానికి తిండి లేక ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు నష్టపరిహారం ఇస్తామని పేర్కొన్నారని ఈ డబ్బుతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు. వైట్ ట్యాపింగ్ రోడ్లు వేస్తున్నట్లు గతంలో ప్రకటించారని ప్రధాన రోడ్లు సన్నగా చేసి అంతర్గత రహదారులను గాలికి వదిలేశారన్నారు. ఇక్కడి మృతుల కుటుంబానికి కాంగ్రెస్ తరపున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు దానం నాగేందర్ వెల్లడించారు. నా ఇంటి ముందు చెట్టు విరిగిపడ్డా.. సోమవారం భారీ వర్షానికి జంబారాహిల్స్ రోడ్ నం.3లోని తన ఇంటి ముందు ఓ చెట్టు విరిగిపడిందని దీంతో తాను జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని దానం ఆరోపించారు. తరువాత మెస్సేజ్ పెట్టానని అన్నారు. ఆ కొద్దిసేపటికి డీఎంసీకి కూడా ఫోన్ చేసి ఈ సమస్యను చెప్పానన్నారు. 24 గంటలు గడిచినా రెస్య్కూ టీమ్ రాలేదని మాజీ మంత్రి ఇంటి వద్దే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల ప్రాంతాల్లో ఎంతటి అలక్ష్యం చోటు చేసుకుంటున్నదో ఈ ఘటన అద్దం పడుతుందని ఆయన చెప్పారు. -
సెలబ్రిటీలు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారా?
హైదరాబాద్: డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఉన్నతాధికారికి బెందిరింపు ఫోన్లు వస్తే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోవడం బాధాకరమని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ' డ్రగ్స్ కేసు విచారిస్తున్న అధికారులపై ఒత్తిడి ఉంది. సెలబ్రిటీలు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారా.. ఈ కేసులో మిగతా వారి పేర్లు ఎందుకు బయటకు రావడం లేదు. అధికార పార్టీకి చెందిన వాళ్లు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని మేమనడం లేదు. వాళ్లెందుకు చేస్తారు.. వాళ్లకేం పనిలేదా? తెల్లవారుజామున మూడు గంటల వరకు పబ్స్ నడుపుతున్నా అధికారులు చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని ఓ పబ్ తెల్లవారి వరకు నడుస్తోందని స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. నగరంలో నైజీరియన్లు, సోమాలియన్లు ఎంతమంది ఉన్నారో లెక్కలు ఉన్నాయా.. వారిపై నిఘా ఉందా' అని ప్రశ్నించారు. -
కేటీఆర్ అమ్మినచోటే.. మేమూ ఐస్క్రీమ్లు అమ్ముతాం
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నోరు పారేసుకోవడం సరికాదని ఆ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ అన్నారు. నెల రోజులు కష్టపడి పనిచేసేవారు నెలకు 20 వేల రూపాయలు సంపాదిస్తుంటే, మంత్రి కేటీఆర్ ఒక్క రోజు కూలి పనిచేస్తే 7 లక్షల రూపాయలు రావడం విడ్డూరమని విమర్శించారు. టీఆర్ఎస్ కూలీలంతా ఓ డ్రామా అని ఆయన అభివర్ణించారు. కేటీఆర్ ఐస్క్రీమ్లు అమ్మినచోట తాము కూడా అమ్ముతామని, తమకు అదే కూలి రాకపోతే అదే షాపు ముందు బైఠాయిస్తామని నాగేందర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి ఎవరెవరు ఫండింగ్ ఇస్తున్నారో తమ దగ్గర లిస్ట్ ఉందని చెప్పారు. సోమవారం ట్యాంక్ బండ్పై ప్రజాస్వామ్యయుతంగా నిరసన ప్రదర్శన చేపడతామని తెలిపారు. -
రాబోయే రోజుల్లో ఊహించనివిధంగా నిరసనలు..
హైదరాబాద్: రాబోయే రోజుల్లో ఊహించని విధంగా నిరసనలు ఉంటాయని, జరగబోయే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని దానం నాగేందర్ హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ధర్నా చౌక్ తరలింపు విషయంలో ప్రభుత్వం వెనుకకు తగ్గకపోతే.. డీజీపీ ఆఫీస్ , పోలీస్ కమిషనర్ ఆఫీస్ , హోమ్ మంత్రి ఇంటి ముట్టడి నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 17న ధర్నా చౌక్ తరలింపుకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన చేస్తుందన్నారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సత్యగ్రహ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. -
పెద్దనోట్ల రద్దుపై
రేపు భారీ ర్యాలీ: దానం సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా గురువారం హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టుగా మాజీమంత్రి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ప్రకటించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్, పార్టీ నగర పరిశీలకురాలు కవితారెడ్డితో కలసి మంగళవారం గాంధీభవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ దిక్కుమాలిన నిర్ణయం తీసుకుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతునిస్తూ పనికిమాలిన పనిచేస్తున్నాడని విమర్శించారు. 5వ తేదీన జరిగే ర్యాలీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ .ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలంతా హాజరవుతారని చెప్పారు -
వైఎస్సే ఉంటే ఇలా జరిగేదా?
కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ వైఎస్ జగన్ని కంట్రోల్ చేయాలని ఉన్నవీ లేనివీ అన్నీ అసాధారణ కేసులు పెట్టించి డీమోరలైజ్ చేసేస్తే మళ్లీ సరెండర్ అయిపోతాడని అందరూ అను కున్నారు. కానీ వైఎస్సే మొండోడు అనుకుంటే ఆయన కంటే మొండోడు జగన్. సరెండర్ కాదు కదా, ఇంకా మొండెక్కిపోయాడాయన. మొండి వాడిని జగమొండిని చేసినట్లయిపోయింది పరిస్థితి. ఒకే ఒక వ్యక్తి (వైఎస్ఆర్) ఉన్నట్లుండి పోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రం చరిత్రే మారి పోయిందని హైదరాబాద్ నగర కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ అంటున్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నావను తానే ముంచుకుందని, ఒక రాష్ట్ర భవిష్యత్తు వంటి కీలక నిర్ణయంపై అధిష్టానానికి తప్పుడు రిపోర్టు ఇస్తే ఆ నష్టాన్ని ఇప్పుడు పార్టీ మొత్తంగా అనుభవించాల్సి వస్తోందన్నారు. వైఎస్ జగన్ విషయంలో అధిష్టానానికి విషం నూరిపోయ టంతో ఆయన పార్టీలోంచే బయటకు వెళ్లారని, ఇటు తెలంగాణలో అటు ఏపీలో తప్పుగా వ్యవహరించడమే కాంగ్రెస్ పార్టీకి పెను నష్టం కలిగించిందని వ్యాఖ్యానించారు. విభజన తప్పదని తేలాక ఒకటిన్నర సంవత్సరం ముందే ఏపీ, తెలంగాణలకు ఇద్దరు సీఎంలను నియమించి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు తప్పుడు కలర్ ఇవ్వడమే కాంగ్రెస్ భంగపాటుకు కారణమైందంటూ దానం నాగేందర్ ‘‘మనసులో మాట’’లో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్ రాజకీయాలు సడన్గా ఇలా మారిపోయాయేమిటి? రాజకీయాలు మారలేదండి. ఒక వ్యక్తి పోవడం వల్ల ఇంత తేడా వచ్చింది. వైఎస్. రాజశేఖరరెడ్డి ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఇలా అయ్యేది కాదు. ఒక్క వ్యక్తివల్లే, ఆయన లేక పోవడం వల్లే ఇంత దుస్థితి వచ్చిందనేది జనం మాట. తెలంగాణ అంశంలో ఎవరు కరెక్ట్.. మీరా, అధిష్టానమా, కిరణా? అధిష్టానానికి తెలంగాణ గురించి చెప్పేవాళ్లు తప్పు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఒకటిన్నర సంవత్సరానికి ముందు ఇచ్చి, కావలసిన ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. రెండు రాష్ట్రాలను చేసి, వాటికి ఇద్దరిని ముఖ్యమంత్రులను చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. టీఆర్ఎస్కు కొంచెం శక్తి వచ్చినా, ఆం్ర«ధలో మేము దెబ్బతిన్నా.. పర్వాలేదు. అప్పటికే జగన్ వల్ల ఏపీలో కాంగ్రెస్కు నష్టమే. అక్కడ కాంగ్రెస్ రాదు. కనీసం ఇక్కడయినా పార్టీ అధికారం లోకి వస్తుందని అనుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం ముందే ఇచ్చేసి ఉంటే ప్రచారం చేసుకునేవాళ్లం. కానీ ఆరుమాసాల ముందు ఇచ్చారు. మూడు మాసాల ముందు ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. కాంగ్రెస్ తన నావను తానే ముంచుకుంది. మేం చేసిన తప్పుకు మేమే అనుభవించాల్సి వస్తోంది. జగన్నే సీఎంని చేయాలని 150 మంది ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చారు కదా? ఆ రోజు జరిగిందేమిటంటే ‘జగన్ కొంచెం ఎక్సెంట్రిక్. మాట వినడు. ఎవరినీ కేర్ చేయడు. ఇప్పుడు జగన్ని సీఎం చేయొద్దు’ అని ఢిల్లీకి వెళ్లి విషం చిమ్మేశారు. జగనేంటి చిన్న పిల్లగాడు కదా. అప్పుడే సీఎం ఏంటి అని అడ్డుపుల్లలేశారు. కాంగ్రెస్కు అసలే పెద్ద చెవులు. ఎవరేది చెప్పినా దాని చెవుల్లోకి వెళ్లిపోతుంది. ఇంతమంది చెప్పగానే అమ్మో జగన్కి సీఎం పదవి ఇవ్వడం డేంజరా.. అనుకుని వ్యతిరేక నిర్ణయాలకు వచ్చే శారు. దాంతో తన ఉనికిని తాను కాపాడుకోవాలని జగన్ భావించారు. ‘ఓదార్పు యాత్రలో తప్పేముంది మేడమ్’ అని అడి గారు. జగన్ ఓదార్పు యాత్రకూ మావాళ్లు తప్పుడు భాష్యం చెప్పారు. జగన్ సొంతంగా పార్టీ పెడితే కేసులు పెడ తారా? అవి పొలిటికల్ కేసులు కావా? మొదటినుంచి ఇదే చెబుతున్నా. జగన్ని కంట్రోల్ చేయాలంటే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని రకరకాల సలహాలు ఇచ్చి, ఉన్నవీ లేనివీ.. అన్నీ అసాధారణ కేసులు పెట్టించి ఆయన్ని డీమోరలైజ్ చేసేస్తే మళ్లీ అధిష్టానానికి సరెండర్ అయిపోతా డని అందరూ అనుకున్నారు. కానీ మొండోడి విషయంలో అలా జరుగుతుందా? ముందే ఆయన మొండోడు. రాజశేఖరరెడ్డే ఒక మొండోడు అనుకుంటే ఆయన కంటే మొండోడు జగన్. రాత్రి పగలు అని తేడా ఉండదు. ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే అది అయిపోయేంతవరకు ఇక ప్రజల్లోనే ఉంటాడు. వైఎస్దీ అదే స్వభావం. ప్రజలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే ఇక ఎవరు చెప్పినా వినేటోడు కాదు. మరి వైఎస్ కుమారుడు కాబట్టి ఆయన వారసత్వం జగన్ కొనసాగించాలి కదా. అదే జరిగింది. ఇలా కేసులు పెట్టడం, వేధించడం తప్పు అని అధిష్టానానికి మీరెప్పుడూ చెప్పలేదా? అధిష్టానానికి తెలియదని కాదు. జగన్కి చాలామంది నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశారు. కొందరు కేసులు పెడితే మళ్లీ మనకే సరెండర్ అవుతాడని చెప్పారు. కానీ సరెండర్ కాదు కదా. ఇంకా మొండెక్కి పోయాడు. మొండివాడిని జగమొండిని చేసినట్ల యింది పరిస్థితి. ఆ కేసులన్నీ నిలిచేవి కాదని తెలిసి కూడా అలా ఎందుకు పెట్టారు? నిలిచినా నిలవక పోయినా ఒక మాటండీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది కదా. కేసులు పెట్టించి, భయపెట్టించి, అదిచేసి ఇది చేసి అందరినీ లాక్కుపోతున్నారు. ఏ పార్టీకయినా ఇది దీర్ఘకాలంలో నడ వదు. రాజకీయంగా ఎదుర్కోవాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం? పాదయాత్ర చేయడానికి ముందు ఆయన చాలా దూకుడుగా ఉండేవారు. ఘర్షణ చెలరేగిన సందర్భాల్లో మాలాంటివాళ్లం ఆయనను శాంతపరచి సర్దిచెప్పాల్సి వచ్చేది. కానీ అధికారంలోకి వచ్చాక వైస్సార్ ఎంతగా మారిపోయారంటే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడు తున్నా నవ్వుతూ ఉండేవారు. అప్పట్లో నేను అసెంబ్లీలో వైఎస్ పక్కసీటులోనే కూచునేవాడిని. ఒకసారి మాటల సందర్భంలో ‘పాత రాజశేఖరరెడ్డి ఎక్కడికి పోయాడు?’ అని అడిగేశాను. ‘నాగేందర్..! ఇతరులు విమర్శ చేస్తుంటే మనం వినా ల్సిన సమయమిది. అధికారం ఉంది కదా అని మనం ఇష్టమొచ్చినట్లు మాట్లాడినా, రెచ్చిపోయినా ప్రజలు ఏ మాత్రం మెచ్చుకోరు. విమర్శించేవారు చెప్పాలనుకున్నది చెప్పనిద్దాం. తర్వాత నేను ఎలాగూ సమాధానం ఇస్తాను కదా’ అనేవారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం సానుకూల పరిస్థితిని కూడా మీరు ఉపయోగించు కోలేక పోయారు కదా? విభజన ఖాయమయ్యాక సోనియాగాంధీ, కేసీఆర్తో మాట్లాడి.. తర్వాత జరగా ల్సిన దానిపై చర్చిద్దాం అన్నారు. కానీ మావాళ్లేం చేశారు? కేసీఆర్కెందుకు సీఎం పదవి ఇవ్వడం, మేం లేమా? అని సీఎం పదవిపై ఆశ ఉన్నోళ్లంతా మొత్తంగా మళ్లీ ఢిల్లీకి ఉరికారు. మేమిన్ని రోజులుగా సేవ చేస్తుంటే కేసీఆర్కి సీఎం పదవి ఎలా ఇస్తారని అడ్డుకున్నారు. కాంగ్రెస్లో రెండేళ్ల కంటే ఎవరినయినా సీఎం పదవిలో పెడతారా? మూడో సంవత్సరం కూడా సీఎంగా ఉంటే గొప్ప అనుకోవాలి. వైఎస్సార్ మాత్రమే అన్నేళ్లు చేయగలిగారు. ఇప్పుడు మీ పార్టీలో సీఎం అభ్యర్థులుగా ఎంతమంది ఉన్నారు? మా పార్టీలో ఉన్నది చెప్పకూడదు. లేనిది చెపితేనే జల్దీగా నమ్ముతారు. సీఎం అభ్యర్థులు ఇప్పుడెందుకు పుడతారు? కాంగ్రెస్లో విశేషం ఏమిటంటే టైమ్ చూసి వచ్చే స్తారు మళ్లీ. పవర్ వస్తుందీ అనగానే మళ్లీ తయారయిపోతారు కాబోయే సీఎం క్యాండిడేట్లంతా.. వెట్టి చాకిరీ చేసేటోడికేమో గుర్తింపు ఉండదు. ఏం చేయనోడికి ఎక్కడ లేని గుర్తింపూ ఉంటుంది. కేసీఆర్లాగా పార్టీని నడిపేవారేరీ కాంగ్రెసులో. రాజశేఖరరెడ్డి విషయం చూస్తే మొత్తం పార్టీని తానే నడిపారు. అలాంటి నాయకులేరీ ఇప్పుడు? (దానం నాగేందర్తో పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దానం నాగేందర్ రాజీనామాకు ఆమోదం
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ చేసిన రాజీనామాను పీసీసీ ఆమోదించింది. హైకమాండ్ సూచన మేరకు దానం రాజీనామాకు పీసీసీ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దానం నాగేందర్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి పంపించారు. -
గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి దానం నాగేందర్ వెల్లడించారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి పంపినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. శనివారమిక్కడ తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమష్టికృషి లేకపోవడం వల్లనే గ్రేటర్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిందన్నారు. గ్రూపులను ప్రోత్సహించడం వల్లే కాంగ్రెస్ ఈ స్థాయికి దిగజారిందన్నారు. ఈ నెల 2న పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ అభ్యర్ధులు ఓడిపోతున్నట్లు చెప్పానని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలను కాంగ్రెస్ దూరం చేసుకుందని అందుకే ఓటర్లు ఈ తీర్పునిచ్చారని విశ్లేషించారు. సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలను అమలుపర్చాలని లేకుంటే ఆర్నెల్ల తర్వాత కాంగ్రెస్ నిలదీస్తుందన్నారు. టీఆర్ఎస్కు ఎన్నికల సారథిగా పనిచేసిన మంత్రి కేటీఆర్ అందరినీ సమన్వయం చేసుకుని గెలిచారని ప్రశంసిచారు. -
'పవన్కల్యాణ్ని ఎంపీ కవిత అవమానించారు'
హైదరాబాద్ : గ్రేటర్ ప్రజలకు అధికార టీఆర్ఎస్ అరచేతిలో స్వర్గం చూపించిందని హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఖైరతాబాద్లో దానం నాగేందర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ... బలహీన వర్గాలు అంటే ఎంపీ కవితకు చిన్నచూపు అని ఆరోపించారు. మేకప్ ప్యాకప్ అని పవర్ స్టార్ పవన్కల్యాణ్ని కవిత అవమానించారని దానం ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగరంలో పవన్కల్యాణ్ సేవలు అవసరం అని దానం చెప్పారు. ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, జానారెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. -
'హైదరాబాద్ను అభివృద్ధి చేసేది టీడీపీ-బీజేపీనే'
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేది టీడీపీ, బీజేపీనేనని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ ఒక జట్టు, టీఆర్ఎస్, ఎంఐఎం ఒక జట్టుగా ఆయన పేర్కొన్నారు. బుధవారం రేవంత్ హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని అన్నారు. భారతదేశాన్ని పది నిమిషాల్లో శ్మశానంగా మారుస్తానన్న వారికి ఓటు వెయ్యాలా వద్దా అనేది ఓటర్లు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్కు ఓటేసినా పరోక్షంగా ఎంఐఎంకే ఓటేసినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పాత్రేంటో ఆయనకే తెలియదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
కొట్లాటలకు ఇదేనా సమయం?
దానం, మల్లేశ్లను మందలించిన ఉత్తమ్, భట్టి సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు అంతర్గత కొట్లాటలు తప్పుడు సంకేతాలను ఇస్తాయి. వ్యక్తిగత ప్రయోజనాలు, ఇష్టాయిష్టాలకు అతీతంగా పార్టీ గెలుపు కోసం ఐక్యంగా ఉండాల్సిన సమయంలో తన్నులాటలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. పార్టీ శ్రేణుల్లో మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీదా ఉంది’ అని కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్లను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క హెచ్చరించారు. ఉప్పల్ నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ విషయంలో జరిగిన కొట్లాట నేపథ్యంలో వీరిద్దరితో ఉత్తమ్, భట్టి బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు వస్తున్న తరుణంలో సరిహద్దులంటూ వివాదం చేయడం, భౌతికదాడులకు దిగడం తప్పుడు సంకేతాలను ఇస్తాయన్నారు. భవిష్యత్తులో ఎవరూ, ఎవరితోనూ ఘర్షణ పడొద్దని, ఇకపై అలాంటివి మళ్లీ జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
కాంగ్రెస్లో డిష్యూం.. డిష్యూం
ఉప్పల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రచ్చరచ్చ సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మధ్య సరిహద్దు వివాదం కాస్తా పరస్పర దాడులకు దారి తీసింది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఉప్పల్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం రచ్చరచ్చ అయ్యింది. జిల్లాలవారీగా విడిపోయిన కార్యకర్తలు నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దూషణలకు దిగడమే కాక.. జెండా కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఆపై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసురుకున్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ సహా ఎనిమిది మందికి స్వల్పగాయాలయ్యాయి. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప్పల్ బస్టాండ్ సమీపంలో పార్టీ జెండాను సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మరో నేత బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామమల్లేష్ ఆవిష్కరించి మరో కార్యక్రమానికి బయలుదేరారు. ఇంతలో రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి ఆహ్వానం మేరకు దానం నాగేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అదే జెండా వద్దకు వచ్చి పార్టీ జెండాను దించి మళ్లీ ఆవిష్కరించారు. దీంతో సుధీర్రెడ్డి, మల్లేష్, లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలోని కార్యకర్తలు.. బుల్లెట్పై ర్యాలీగా వెళుతున్న దానం నాగేందర్ను అడ్డుకున్నారు. ‘ఏ హోదాలో ఉప్పల్ వచ్చావ్? హైదరాబాద్లో పార్టీని నాశనం చేశావ్. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు వచ్చావా? నీ పప్పులు ఇక్కడ ఉడకవు’ అంటూ హెచ్చరించారు. అదే స్థాయిలో దానం, అతని అనుచరులు జ వాబివ్వటంతో రెచ్చిపోయిన బండారి లక్ష్మారెడ్డి వర్గీయులు జెండా కర్రలతో దానం నాగేందర్, ఆయన అనుచరులపై దాడులకు దిగారు. దీంతో దానం అనుచరులు కూడా ప్రతిదాడులకు దిగారు. ఈ దాడుల్లో దానంతో పాటు మురళీకృష్ణ, నిరంజన్, శేఖర్రెడ్డి, బాకారం అరుణ్, నవీన్కుమార్, పీటర్, శ్రీనివాసరెడ్డి, జితేందర్రెడ్డిలకు గాయాలయ్యాయిు. దీనిపై ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నాయకుల మధ్య వివాదం ఏఐసీసీ దృష్టికి వెళ్లింది. పీసీసీ నాయకులు ఘటన వివరాలను ఢిల్లీకి చేరవేశారు. దానంకు ఇక్కడేం పని: మల్లేష్ తాము ఎగురవేసిన జెండాను తొలగించారన్న సమాచారంతో తాము వచ్చి దానంను ప్రశ్నించామని, ఇంతలో నే తమపై కొందరు దాడికి పాల్పడ్డారని మల్లేష్ ఆరోపించారు. నగరానికి సంబంధించిన దానంకు రంగారెడ్డి జిల్లాలో ఏం పనని ప్రశ్నించారు. కాగా, ‘గ్రేటర్’ నాయకులు రంగారెడ్డి జిల్లాలో ఆధిపత్యం చెలాయిం చాలని చూస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యేలు బండారి రాజిరెడ్డి, సుధీర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవా రం వారు కుషాయిగూడలో కాంగ్రెస్ ఉప్పల్ ఇన్చార్జి బండారి లక్ష్మారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. తోపులాటే.. సర్దిచెబుతాం: దానం సమాచార లోపంతోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగిందని, పార్టీ పెద్దలతో మాట్లాడి అన్నీ సరిచేస్తామని దానం నాగేందర్ చెప్పారు. తనపై ఎవరూ దాడి చేయలేదని చెప్పారు. ఘటన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎగరేసిన జెండాను, తాను మళ్లీ ఎగరేయడంతో వివాదం రేగిందని, ఇది సమాచార లోపంతో జరిగిన తప్పిదమన్నారు. -
నా మీద ఎలాంటి దాడి జరగలేదు
-
నా మీద ఎలాంటి దాడి జరగలేదు: దానం
హైదరాబాద్ : తనపై ఎలాంటి దాడి జరగలేదని గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఉప్పల్లో జెండా ఆవిష్కరణ సందర్భంగా స్థానికంగా ఉండే రెండు వర్గాల మధ్య తోపులాట మాత్రమే జరిగిందన్నారు. తనపై ఎలాంటి దాడి జరగలేదని ఆయన వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో భిన్నభిప్రాయాలు సహజమేనని.. అందరం కూర్చోని సమస్యలు పరిష్కరించుకుంటామని దానం పేర్కొన్నారు. కాగా సోమవారం ఉప్పల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. దానం నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో గందరగోళం రేగింది. దానం నాగేందర్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రమేనని, గ్రేటర్ పరిధిలోని తమ జిల్లాలోకి రావొద్దని కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా పార్టీ జెండా ఎగురవేసేందుకు దానం ప్రయత్నించడంతో ఆయనపై కోడిగుడ్లతో కార్యకర్తలు దాడి చేశారు. -
దానం నాగేందర్ పై కోడిగుడ్లతో దాడి
-
దానం నాగేందర్ పై కోడిగుడ్లతో దాడి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ పై ఆ పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఉప్పల్ లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ రసాభాసగా మారింది. దానం నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో గందరగోళం రేగింది. దానం నాగేందర్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రమేనని, గ్రేటర్ పరిధిలోని తమ జిల్లాలోకి రావొద్దని కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా పార్టీ జెండా ఎగురవేసేందుకు దానం ప్రయత్నించడంతో ఆయనపై కోడిగుడ్లతో కార్యకర్తలు దాడి చేశారు. -
దానమన్నా... ఏడున్నవే..!
కాంగ్రెస్ కార్యకర్తల ఎదురుచూపులు పార్టీకి అండగా నిలిచేవారే లేరా అని ఆవేదన బంజారాహిల్స్: ‘ఇక కదన రంగంలోకి దూకుతా.. రేపటి నుంచే దుమ్మురేపుతా.. ఒక్కొక్కరి పంచెలూడగొడతా...’ఇదీ పది రోజుల క్రితం మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ గర్జన. ఇక కాంగ్రెస్ పూర్వ వైభవం సంతరించుకొని అధికార విపక్ష పార్టీలకు చెమటలు పటిస్తుందని కార్యకర్తలు సంబురపడ్డారు. సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.. తీరా చూస్తే ఆయన ఇంత వరకు రంగంలోకి దిగకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ నిరాశ నిస్రృహల్లో మునిగిపోయారు. ఈ నెల 4వ తేదీన దానం నాగేందర్ తన నివాసంలోను, షబ్బీర్ అలీ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రేపటి నుంచే బస్తీల్లో పర్యటిస్తానని, సమావేశాలు ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. ఆ తెల్లవారే ఫిలింనగర్లోను, సోమాజిగూడలోను రెండు చోట్ల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి గట్టిగానే మాట్లాడారు. ఆ తెల్లవారునుంచి కనిపించకుండాపోయారు. అన్ని డివిజన్లలో తిరుగుతారని భావించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నట్లు టీవీ చానెల్లో కనిపించడంతో కార్యకర్తలు సరిపెట్టుకున్నారు. తీరాచూస్తే నగరానికి వచ్చి కూడా సమావేశాల్లో పాల్గొనకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. ఒక వైపు టీఆర్ఎస్, బీజేపీ జనంలోకి దూసుకెళ్తూ పట్టు పెంచుకుంటుంటే కాంగ్రెస్ చేష్టలుడిగి చూస్తున్నది. -
కాంగ్రెస్లో సరిహద్దుల లొల్లి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతల మధ్య సరిహద్దుల పంచాయతీ పతాకస్థాయికి చేరింది. గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లపై పెత్తనాన్ని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్కు ఎలా అప్పగిస్తారని రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన డివిజన్లపై దానంకు పెత్తనం అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీలో ఇక తామెందుకని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డిని నిలదీస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతలో దానం నాగేందర్ జోక్యం చేసుకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి తలలు పట్టుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 150 డివిజన్లు ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 43 డివిజన్లు ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు, రంగారెడ్డి డీసీసీ నిర్వహించాలని వీరు కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్కు, రంగారెడ్డి జిల్లాల మధ్య ‘పెత్తనం’ పంచాయతీ ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ సమక్షంలో జరిగింది. దీనిని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో చర్చించి పరిష్కరించాలంటూ టీపీసీసీని దిగ్విజయ్సింగ్ ఆదేశించారు. అయితే దానం టీఆర్ఎస్లో చేరాలని ఏర్పాట్లు చేసుకోవడం, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా పట్టించుకోకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతల మధ్య పంచాయతీ మరింత పెరిగింది. కాంగ్రెస్పార్టీని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుని, చివరలో ఆగిపోయిన దానంకు తమ డివిజన్లలో పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎలా అప్పగిస్తారని రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, ఆ జిల్లా నేతలు డి.సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, బండారు లక్ష్మా రెడ్డి, నందికంటి శ్రీధర్, బిక్షపతి యాదవ్ తదితరులు ఉత్తమ్ను, జానాను కలిసి తమ అభిప్రాయాన్ని తెగేసి చెప్పారు. ఏదేమైనా తమ నియోజకవర్గాల్లోని డివిజన్లలో దానం నాగేందర్ జోక్యాన్ని, పెత్తనాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. జానారెడ్డిని, ఉత్తమ్కుమార్ రెడ్డిని గురువారం రాత్రి వీరు కలిశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని డివిజన్లలో తమకే నిర్ణయాధికారం ఉండాలని కోరారు. తమను పట్టించుకోకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడేది లేదని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు వీరిని హెచ్చరించినట్టుగా తెలిసింది. -
కాంగ్రెస్లోనే దానం
-
కాంగ్రెస్లోనే దానం
- చివరి నిమిషంలో నిర్ణయం మార్పు - పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి - షబ్బీర్తో భేటీ అనంతరం ప్రకటన - టీఆర్ఎస్లో చేరిక కోసం ఏర్పాట్లు.. కేసీఆర్ రాలేననడంతో కినుక! సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్లోనే కొనసాగనున్నారు. పార్టీ మారబోనని ఆయన స్పష్టంచేశారు. సోమవారం ఉదయం శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి దానం సుదీర్ఘ సమాలోచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలోకి వెళ్లటం లేదని, కాంగ్రెస్లోనే కొనసాగుతానని తెలిపారు. కొందరు తనను పార్టీ నుంచి పంపే ప్రయత్నాలు చేశారని, అయినా ప్రస్తుతం అన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించే లక్ష్యంతో పని చేస్తానని చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో డివిజన్ల వారిగా సమీక్షలు నిర్వహిస్తానని, గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు మైండ్గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల్లో బలం పెంచుకోకుండా ఇతర పార్టీల నుంచి కిరాయికి తెచ్చుకున్న నేతలతో ప్రభుత్వాన్ని నడిపించుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీఎం సమక్షంలో అయితేనే.. సోమవారం మధ్యాహ్నం దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరటం లాంఛనమేనని అందరూ భావించారు. అందుకు అనుగుణంగా టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంది. దానం అనుచరులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బాణసంచాకు ఆర్డర్లు కూడా ఇచ్చారు. అయితే ఆదివారం మధ్యాహ్నానికే ముఖ్యమంత్రి కేసీఆర్.. దానం చేరిక కార్యక్రమంలో పాల్గొనటం లేదన్న సమాచారం పార్టీ వర్గాలకు అందింది. దానం పార్టీలోకి వచ్చే కార్యక్రమాన్ని నగర మంత్రుల సమక్షంలో నిర్వహించాలని సూచించారు. అయితే దానం మాత్రం సీఎం సమక్షంలో అయితేనే తాను టీఆర్ఎస్లో చేరుతానని, లేనట్లయితే అవసరం లేదని తేల్చేసి సోమవారం ఉదయమే షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. అనంతరం కాంగ్రెస్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడిగా కొనసాగుతారా? గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దానం నాగేందర్ను కొనసాగించే విషయంలో పునరాలోచన చేయాలని పలువురు నగర పార్టీ నేతలు పీసీసీ, ఏఐసీసీకి విజ్ఞప్తి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. నగరంలో మంచి క్యాడర్ ఉన్న నాగేందర్ పార్టీలో పనిచేసేందుకు తిరిగి రావటం సంతోషమే అయినా.. ఆయన్ను యథాతథంగా నగర అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగిస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయో ఆలోచించాలని వారు పార్టీ అగ్రనేతలకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఈ విషయమై పీసీసీ ముఖ్య నేత ఒకరిని ప్రశ్నించగా.. ఇప్పుడే ఏం చెప్పలేనని వ్యాఖ్యానించారు. -
పొమ్మనలేక పొగ పెట్టారు
-
టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది: షబ్బీర్ అలీ
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలతో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. దానం నాగేందర్ తమ పార్టీలో చేరుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు ఓ పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ఓడినంత మాత్రాన కాంగ్రెస్ డీలా పడదని షబ్బీర్ అన్నారు. రాజకీయంగా లబ్ది కోసమే టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా దానం నాగేందర్ కారు ఎక్కేందుకు సిద్ధమై చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానం సోమవారం ఉదయం షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. సుమారు అరగంటపాటు వీరి భేటీ జరిగింది. పొమ్మనలేక పొగ పెట్టారు అంతకు ముందు దానం నాగేందర్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీలో కొందరు నేతలు పొమ్మనలేక పొగ పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చూశారని, తనను తక్కువ చేయడం ..తన అనుచరులను బాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని, ఇక నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి పని చేస్తానని దానం తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కసరత్తు కోసం రేపట్నుంచి గాంధీభవన్లో సమావేశాలు జరుగుతాయన్నారు. ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తామన్నారు. -
తుది ఘట్టానికి ‘దానం’ హైడ్రామా
-
తుది ఘట్టానికి ‘దానం’ హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్కు చేరింది. అంతా సవ్యంగా సాగితే సోమవారం మధ్యాహ్నం టీఆర్ఎస్లో చేరదామని ఆదివారం ఉదయం పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చిన ఆయన... మధ్యాహ్నానికల్లా మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. ‘మనమంతా కాంగ్రెస్లోనే కొనసాగుదాం’ అని వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గ శ్రేణులు పూర్తి అయోమయానికి గురయ్యాయి. దానం టీఆర్ఎస్లో చేరే సందర్భంలో తాను ఆహ్వానించి కండువా కప్పలేనని, ఒక వేళ నగర మంత్రులు, ఇతర ముఖ్యనాయకుల సమక్షంలో ఆయన చేరితే అభ్యంతరం లేదని టీఆర్ఎస్ అగ్రనేత స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో దానం మనసు మార్చుకున్నట్లు సమాచారం. తాను అగ్రనేత సమక్షంలో అయితేనే పార్టీలోకి వస్తానని, ఇతరులైతే రాలేనని... దానం సైతం మధ్యవర్తులకు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఒకరిద్దరు సన్నిహితులతోనూ ఆయన చర్చించి, తానిక కాంగ్రెస్లోనే కొనసాగుతానంటూ స్పష్టం చేసినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రానికి దానం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఊహాగానాలకు తెరదించే అవకాశం కనిపిస్తోంది. -
'పార్టీ మారే ప్రసక్తే లేదు'
-
'పార్టీ మారే ప్రసక్తే లేదు'
హైదరాబాద్: పార్టీ మారే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. తన మద్దతుదారులు అనుచరులు, మాజీ కార్పొరేటర్లతో దానం గురువారం కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ అధిష్టానంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. గ్రేటర్ ఎన్నికలలో మేయర్ పీఠం కాంగ్రెస్దే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ వలసలను ప్రోత్సహించడం సాధారణమన్నారు. కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వలసలను ఆపేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా నగర అధ్యక్షునిగా ఉంటూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న తీరుపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ సైతం అసహనం వ్యక్తం చేస్తూ, రెండుమూడు రోజుల్లో ఏదో ఒకటి తేల్చేయాలని టీపీసీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు టీపీసీసీ బుధవారం నాగేందర్కు ఒక లేఖను పంపింది. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అందులో పార్టీలో కొనసాగుతారా, లేదా అన్న విషయమై వెంటనే తేల్చాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యఅనుచరులతో సమావేశమై చర్చించారు. -
'ఏం చేద్దాం.. వెళ్దామా ఉందామా?'
హైదరాబాద్: తన మద్దతుదారులు అనుచరులు, మాజీ కార్పొరేటర్లతో కాంగ్రెస్ పార్టీ నేత దానం నాగేందర్ గురువారం కీలక భేటీ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా పార్టీ మారడంపై ఆయనవారి నుంచి అభిప్రాయాలు కూడా కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ మారడంపై అనుచరుల మధ్యలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కొందరు అనుచరుల కోరగా.. టీఆర్ఎస్ లోకి వెళ్దామని మరికొందరు దానానికి సూచించినట్లు చెప్పారు. కాగా, ఒక వేళ కాంగ్రెస్ లో ఉండాలంటే మొత్తం 150 డివిజన్ల అభ్యర్థుల ఎంపికను దానంకే అప్పగించాలని మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే, పార్టీ మార్పుపై మాత్రం దానం ఇంకా నోరు విప్పలేదు. -
ఉంటావా.. వెళతావా?
♦ మాజీ మంత్రి దానం నాగేందర్కు టీపీసీసీ అల్టిమేటం ♦ అనుయాయులతో నేడు నాగేందర్ ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ అంశంపై ఏదో ఒకటి తేల్చే దిశగా టీపీసీసీ పావులు కదిపింది. నగర అధ్యక్షునిగా ఉంటూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న తీరుపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ సైతం అసహనం వ్యక్తం చేస్తూ, రెండుమూడు రోజుల్లో ఏదో ఒకటి తేల్చేయాలని టీపీసీసీని ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు టీపీసీసీ బుధవారం నాగేందర్కు ఒక లేఖను పంపింది. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అందులో పార్టీలో కొనసాగుతారా, లేదా అన్న విషయమై వెంటనే తేల్చాలని ఆదేశించినట్లు సమాచారం. నేడు అనుచరులతో దానం భేటీ మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం గురువారం తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ అంశాలను చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. -
నేను యాక్టివ్గానే ఉన్నా...: దానం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారులోని 50 డివిజన్లపై దానం నాగేందర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేధాలను పరిష్కరించేందుకు గురువారం ఆయన గ్రేటర్ నేతలతో భేటీ అయ్యారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానుండటంతో.. పార్టీ అంతర్గత వ్యవహారాలను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ భేటీలో పాల్గొన్న రంగారెడ్డి కాంగ్రెస్ నేతలు.. దానం వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. గ్రేటర్ కాంగ్రెస్ ను దానం బలో పేతం చేయడం లేదని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న 50 డివిజన్ల వ్యవహారాలు.. జిల్లా కాంగ్రెస్ కే అప్పగించాలని కోరారు. మరో వైపు ఆ 50 డివిజన్లు కూడా గ్రేటర్ లో భాగం కనుక.. తన పరిధిలోకే వస్తాయన్నట్లు దానం ప్రవర్తించడాన్ని వారు తప్పుపట్టారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్ ఆ 50 డివిజన్ల బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లలో ఎవరిదో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని, పీసీసీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్, రంగారెడ్డి జిల్లాల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓట్ల తొలగింపుపై స్పందించడంలో దానం ఫెయిల్ అయ్యారని ఈ సందర్భంగా పార్టీ నేతలు ఫిర్యాదు చేయగా...అందుకు దానం తాను యాక్టివ్ గానే ఉన్నానని వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు వార్తలొస్తున్నాయని దానంను ఈ సందర్భంగా ప్రశ్నించగా, తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని దానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఓ దశలో సహనం కోల్పోయిన దిగ్విజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పని చేయాల్సింది పోయి.. ఈ విబేధాలు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలపై సూచలను ఇవ్వాలని కోరితే...ఆరోపణలు చేసుకుంటారా అని అసహనం వ్యక్తం చేశారు. ఈ భేటీలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్లు కూడా పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ నేతల రగడ
హైదరాబాద్: అంతర్గత ప్రజాస్వామ్యం అతిగా కనిపించే కాంగ్రెస్ పార్టీలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు అందుకు వేదికయింది. సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు మోహరించిన ఇరు వర్గాలు.. డిగ్గీ విమానం దిగీదిగగానే వాగ్వాదాలతో స్వాగతం పలికారు. డిగ్గీ ముందే.. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్, పరిగి ఎమ్మెల్యే రాంమోహనర్ రెడ్డిలు తీవ్రస్థాయిలో తగువులాడుకున్నారు. వివాదం ఎలా మొదలైందంటే.. జీహెచ్సీసీ అధ్యక్షుడైన దానం.. రంగారెడ్డి అర్బన్ జిల్లా వ్యవహారాలను కూడా తన ఆధీనంలోనే ఉండాలని, ఆమేరకు ఉత్తర్వులు ఇవ్వాలని గతంలో పార్టీ హైకమాండ్ ను కోరారు. అయితే రంగారెడ్డి అర్బన్ నాయకులు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. దానం కేవలం హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకు మాత్రమే అధ్యక్షుడని, తమ పరిధిలో ఆయన పెత్తనం సాగనివ్వబోమని స్పష్టం చేశారు. మరో అడుగు ముందుకేసి.. అధిష్టానం నుంచి లిఖిత పూర్వకహామీ కూడా తెచ్చుకున్నారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ ముందు మరోసారి ఇదే అంశంపై దానం, రంగారెడ్డి అర్బన్ నేతలు పోట్లాడుకున్నారు. అర్బన్ హక్కులు తనకే కావలని దానం.. అది కుదరదని ఎమ్మెల్యే రాంమోహన్ కీచులాడుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే మరణించిన టీడీపీ ఎమ్మల్సీ మస్కతీ ఇంటికి కాంగ్రెస్ హైకమాండ్ నేతలు వెళ్లడంపై ఎంపీ వి. హనుమంతరావు తప్పుపట్టారు. వీహెచ్ వాదనతో మరోనేత షబ్బీర్ అలీ విభేధించారు. ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ ఒక మైనారిటీ నేత కుటుంబాన్ని పరామర్శించడం తప్పుకాదన్నారు. -
దానం, అంజన్న అరెస్ట్
హైదరాబాద్ : తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని ఆపివేశారు. ఆగ్రహించిన దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్లతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఒకే దఫా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని కాంగ్రెస్తోపాటు వివిధ రాజకీయ పక్షాలు అక్టోబర్ 10వ తేదీన తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని వారిని పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తామంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వారు ఆరోపించారు. అనంతరం రహదారిపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాంతో నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్లతోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. -
ఖైరతాబాద్ గణపతి వేడుకలకు గవర్నర్ దంపతులు
-
'ఆయన చిక్కడు దొరకడు'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ను కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ నిశితంగా విమర్శించారు. నగర సమస్యలపై పోరాడే విషయంలో పార్టీ నేతలకు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిక్కడు దొరకుడు అంటూ చురక అంటించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ పరిధిలో సెటిలర్ల ఓట్లను తొలగించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. దీనిపై పదేపదే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇళ్లు మారారనే కారణంతో 24 శాతం ఓట్లు తొలగించారని అన్నారు. ఈ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న తప్పులను హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. -
కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో దానం!
-
కుట్ర జరుగుతోందేమో: దానం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు వచ్చినట్టు వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల వెనుక కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. పొమ్మనలేక పొగ బెట్టినట్టుగా తనను బయటకు పంపేందుకు కుట్ర జరుగుతుందేమోనని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను బలహీన పర్చాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తోందని ఆరోపించారు. ఒంటెత్తు పోకడలతో కిరణ్ కుమార్ రెడ్డికి ఏ గతి పట్టిందో చూడాలన్నారు. పార్టీ పెద్దలు చెప్పుడు మాటలు వినడం వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ కలలు కంటోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో అరచేతిలో స్వర్గం చూపించినట్టు ఉందని విమర్శించారు. హైదరాబాద్ లోని సీమాంధ్రుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంజీలోని 24 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. -
కుట్ర జరుగుతుందేమో: దానం
-
'టీఆర్ఎస్ కు ఏజెంట్ లా పనిచేస్తున్నారు'
హైదరాబాద్:జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆరోపించారు. దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు గురువారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దానం.. డివిజన్ల డీలిమిటేషన్ లో సోమేష్ కుమార్ టీఆర్ఎస్ కు ఏజెంట్ లా పనిచేస్తున్నారని విమర్శించారు. గత ఏడాది ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల ఆధారంగా.. ఆ పార్టీకి అనుకూలంగా డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా సోమేష్ కుమార్ ను తప్పించాలని.. లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని దానం పేర్కొన్నారు. -
నిరంజన్, దానం మధ్య వాగ్వాదం
హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్ గ్రేటర్ కాంగ్రెస్ నేత నిరంజన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నగర్ కాంగ్రెస్ సమావేశాలను దానం నాగేందర్ నిర్వహించడం లేదని ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. ఆ సమావేశాలేవో మీరే పెట్టుకోండి అంటూ దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రేటర్ అధ్యక్షుడిగా దానం కొనసాగడానికి వీల్లేదంటూ కూడా ఆయన అన్నట్లు సమాచారం. -
ఆయనగారికి 'అలకలు అలవాటే'
(వెబ్సైట్ ప్రత్యేకం) టికెట్ ఇవ్వలేదంటే అలక పాన్పు ఎక్కడం ఆయనకు అలవాటే. అలకబూనటం, ఆ తర్వాత ఆయనగారిని బుజ్జగించటం మామూలే. పార్టీ సీనియర్ నాయకులు వచ్చి కొద్దిగా సోప్ వేస్తే చాలు ఇలా ఐస్ అయిపోతారు. ఆయనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్. 2004లో ఆయన గారు ఆసిఫ్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. అయితే ఆ స్థానాన్ని మరొకరికి అధిష్టానం కేటాయించింది. ఆయనకు మాత్రం సికింద్రాబాద్ లోక్సభ స్థానం ఇచ్చింది. దాంతో పార్టీ హైకమాండ్ మీద అలక బూనారు. మీరు వద్దు మీ టిక్కెట్ వద్దు అంటూ హస్తం పార్టీకి బై బై చెప్పి.. టీడీపీ సైకిల్ ఎక్కేశారు. తీరా ఎన్నికలు జరిగి... అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అదికాక సికింద్రాబాద్ లోక్సభ నుంచి ఆయన తప్పుకోవడంతో ఆ టిక్కెట్ అంజన్ కుమార్ యాదవ్ దక్కించుకుని... నేరుగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. దాంతో దానం తన దురదృష్టాన్ని తానే నిందించుకున్నారు. హస్తాన్ని వీడి 'సైకిల్'పై ప్రయాణం చేసేందుకు సతమతం అయిన ఆయన కొద్దిరోజులకే పచ్చ పార్టీకి కనీసం గుడ్ బై చెప్పకుండా హస్తం పట్టేసుకుని స్వంత గూటికి వచ్చేసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మళ్లీ అసెంబ్లీకి ఎన్నికై మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తదితర పరిణామాల నేపథ్యంలో 2014 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలనే గెలుచుకుంటే... హైదరాబాద్లో మాత్రం 'చేతి'పార్టీ చతికిలపడింది. నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నా అధికారం ఉంటేనే కానీ హవా సాగదాయే అనే విషయం అర్థమైన దానం నాగేందర్ కన్ను ఎమ్మెల్సీపై పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల తరుణం రానే వచ్చింది. తాను ఆశించిన ఎమ్మెల్సీ సీటును నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళ ఆకుల లలితకు ఇవ్వడంపై ఆయన అవాక్కయ్యారు. అసలే గ్రేటర్ ఎన్నికలు తుపాకీ వదిలిన బుల్లెటూలా దూసుకు వస్తుంటే ఎవరికో టిక్కెట్ ఇవ్వడం ఏమిటని దానం మళ్లీ అలక పాన్పు ఎక్కేశారు. ఈ ఎన్నికల్లో ఐదో ఎమ్మెల్సీని కూడా తమ కారులో ఎక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ వ్యూహారచన చేస్తుంది. ఈ నేపథ్యంలో నిలబెట్టిన ఒక్క అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థంగా మారుతుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ దూతలను రంగంలోకి దింపింది. పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, వాయిలార్ రవి తదితర నేతలంతా హైదరాబాద్లో మకాం వేసి... దానంను అలక పాన్పు నుంచి దించి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునే పనిలో పడ్డారు. -
అలకబూనిన దానం నాగేందర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ శుక్రవారం గాంధీ భవన్లో భేటీ అయిన కాంగ్రెస్ హైకమాండ్ నేతలు గులాం నబీ ఆజాద్, వాయిలార్ రవిలను కలిశారు. గత వారం రోజులుగా దానం నాగేందర్ గత వారం రోజులుగా హైకమాండ్ పట్ల అలకబూనారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారు. గురువారం రోజున హైకమాండ్ నేతలు గులాం నబీ ఆజాద్. వాయిలార్ రవిలు దానం నాగేందర్ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. నేడు కూడా దానం ఇంటికి హైకమాండ్ నేతలు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేయనున్నట్టు సమాచారం. -
గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం రాంరాం!?
ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆకుల లలితకు ఎమ్మెల్సీ టికెట్ ఖరారుచేస్తూ హైకమాండ్ బుధవారం సాయంత్రం నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో ఇదే టికెట్ ఆశించి భంగపడ్డ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. తనకు టికెట్ ఇవ్వకపోయినాసరే, సీనియర్ నాయకులు డీ శ్రీనివాస్ లేదా సబితా ఇంద్రారెడ్డివంటి వారికో కాకుండా అంతగా ప్రజాదరణలేని ఆకుల లలితకు అవకాశం ఇవ్వడంపై దానం మండిపడుతున్నారని, ఈ విషయంలో అధిష్ఠానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని ఆయన అనుచరులు చెప్పారు. సంబంధిత విషయాలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దానం ఓ లేఖ రాయనున్నట్లు తెలియవచ్చింది. అయితే దానం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
'నేను పనికి రాను అనుకుంటే తీసేయండి'
-
'నేను పనికి రాను అనుకుంటే తీసేయండి'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి తీరుపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్రంగా మండిపడ్డారు. నగర కాంగ్రెస్ ను విభజించి పబ్బం గడుపుకోవడానికి మర్రి చూస్తున్నారని విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన దానం.. తనకు చెప్పకుండా హైదరాబాద్ లో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. తనకు చెప్పకుండా పార్టీ వ్యవహారాలు నడపడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. నగర అధ్యక్షునిగా తాను పనికి రాను అనుకుంటే మరో నేతను తీసుకునే అధికారం పొన్నాలకు ఉందని.. అయితే మర్రి శశిధర్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేయలేదన్నారు. తాను పదవి లేకున్నా.. కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. అధికార పార్టీతో, సీఎంతో పైరవీలు తనకు అవసరం లేదని దానం స్పష్టం చేశారు.'మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓ డిజాస్టర్. ఢిల్లీ చుట్టూ తిరిగి పెద్దనేత అనుకుంటున్నాడు. నాకు చెప్పకుండానే ఇళ్ల నిర్మాణ అంశంపై నగర నేతలతో కలిసి గవర్నర్ కలవడం సరికాదు' అని దానం విమర్శించారు. -
'దానం లేకుండానే గవర్నర్ ను కలిశారు'
హైదరాబాద్: గ్రేటర్ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ లేకుండానే మిగతా నేతలు గురువారం గవర్నర్ను కలిశారు. గవర్నర్ను కలిసిన వారిలో మర్రి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, బండా కార్తీక తదితరులు ఉన్నారు. నగరంలో ఇళ్లు కట్టిస్తామని కొందరు కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కాగా దానం నాగేందర్ పార్టీ మారుతున్నారని, అందుకే కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రమే దానం గాంధీభవన్కు వస్తున్నారని పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. -
టీఆర్ఎస్లో చేరను: దానం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాసమస్యలను ప్రస్తావించే విపక్ష నేతలను కించపరిచేలా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ నెల 19న నిర్వహించనున్న ఇంటింటి సర్వేలో భాగస్వాములు అయ్యేందుకు ఊరికి వెళ్తున్న నగరంలోని పేదలకు ప్రభుత్వమే భత్యం చెల్లించాలని డిమాండ్చేశారు. ఎంఐఎంతో కాంగ్రెస్కు పొత్తు ఉంటుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. -
‘గ్రేటర్’ ఆకర్ష్!
* దానం, ముఖేష్గౌడ్, సుధీర్రెడ్డి, ఆర్.కృష్ణయ్యలకు టీఆర్ఎస్ గాలం * ఆయా నేతలతో హరీశ్రావు రహస్య మంతనాలు * కాంగ్రెస్లోనే ఉంటామన్న దానం, సుధీర్! సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేసేందుకు టీఆర్ఎస్ ‘గ్రేట్’ ఆకర్ష్ను ప్రారంభించింది. శాసనమండలిలో ఆధిపత్యం కోసం ప్రయోగించిన అస్త్రం పూర్తిగా విజయవంతం కావడంతో.. ఇప్పుడు కీలకమైన రాజధానిపై కన్నేసింది. మరో ఆరు నెలల్లో గ్రేటర్ ఎన్నికలు రాబోతుండడంతో ఇక్కడ ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలనే యోచనతో పావులు కదుపుతోంది. గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ఆయా నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. రాజధానిలో పార్టీ కొంత బలహీనంగా ఉండటం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వస్తున్న ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే నేపథ్యంలో.. ఇక్కడ సంస్థాగతంగా పట్టున్న ఇతర పార్టీల నేతలపై ‘ఆకర్ష్’ మంత్రాన్ని ప్రయోగించే పనిలో టీఆర్ఎస్ నిమగ్నమైంది. జీహెచ్ఎంసీపై గులాబీ జెండాను రెపరెపలాడించడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా బలహీనపర్చడమనే ద్వి ముఖ వ్యూహంతో పావులు కదుపుతోంది. మంత్రులు టి.హరీశ్రావు, కె.తారకరామారావు ఈ విషయంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇందులో భాగంగా హరీశ్రావు కొద్దిరోజులుగా మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్గౌడ్తో పాటు టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే డి.సుధీర్రెడ్డిలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని, టీఆర్ఎస్లో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ఆయా నేతలకు రకరకాల తాయిలాలు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్.కృష్ణయ్య టీఆర్ఎస్లో చేరితే మెదక్ ఎంపీ సీటిచ్చి గెలిపించుకుంటామని.. ఒకవేళ ఓడినా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణయ్య పార్టీలోకి వస్తే ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని దింపి గెలిపించుకోవచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. సుధీర్రెడ్డితో చర్చల సందర్భంగా హరీశ్రావు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో హుడా చైర్మన్గా ఉన్న సుధీర్రెడ్డిపై గతంలో ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాటిపై విచారణ జరిపిస్తామని ఆ పార్టీ నేతలు కొందరు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో కొనసాగితే టీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశముందని, అదేదో గులాబీ జెండా కప్పుకుంటే మేలని సుధీర్రెడ్డిపై ఆయన సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి దానం నాగేందర్పై కూడా ఇదే తరహాలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. దానంపై అనేక భూఅక్రమణ ఆరోపణలున్న సంగతి తెలిసిందే. దాంతో టీఆర్ఎస్లో చేరితే ఎలాంటి ఇబ్బందీ ఉండదని, పైగా గ్రేటర్పై తన ముద్ర వేయవచ్చని దానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హరీశ్తో చర్చల సందర్భంగా దానం పలు ప్యాకేజీలను డిమాండ్ చేయడంతో వాటిపై టీఆర్ఎస్ నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. మాజీమంత్రి ముఖేష్గౌడ్తోనూ టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. తన కుమారుడు విక్రమ్గౌడ్ను రాజకీయంగా బలోపేతం చేయాలని భావిస్తున్న ముఖేష్ గత ఎన్నికల్లో తన కుమారుడికి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. టీఆర్ఎస్లో చేరితే గ్రేటర్ ఎన్నికల్లో విక్రమ్గౌడ్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన టీఆర్ఎస్వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు మాత్రం ఆయా నేతల తో ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని, ఇంకా ఒక కొలిక్కి రాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్లోనే కొనసాగుతాం: దానం, సుధీర్రెడ్డి దానం, సుధీర్రెడ్డి సహా పలువురు గ్రేటర్ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ కొన్నిచానళ్లలో వార్తలు రావడంతో.. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆయా నేతలతో గాంధీభవన్లో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం దానం, సుధీర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. టీఆర్ఎస్లోకి రమ్మని ఆ పార్టీ నేత లు మీతో మాట్లాడారా? లేదా? అని విలేకరులు ప్రశ్నిం చినా.. వారు సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఆర్.కృష్ణయ్య సైతం తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని పేర్కొన్నారు. నాయకత్వ లోపంవల్లే: జానారెడ్డి, జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉందని మాజీమంత్రి జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రజల ముందుంచలేకపోయామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి సైతం జీవన్రెడ్డి వ్యాఖ్యలను సమర్థిం చారు. హైకమాండ్ హడావుడి నిర్ణయంతో లోపం జరిగిందని, అదే ఇప్పుడు గుణపాఠమైందన్నారు. త్వరలో హైకమాండ్తో సమీక్షించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు. -
టీఆర్ఎస్లో చేరటం లేదు, అవన్ని పుకార్లే
హైదరాదాబాద్ : టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న కథనాలను మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని వారు స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తవాలని కొట్టిపారేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటామని, చచ్చినా, బతికినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని దానం, సుధీర్ రెడ్డి తెలిపారు. వలసలను ప్రోత్సహించటం మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే తమ ముందున్న బాధ్యత అని దానం, సుధీర్ రెడ్డి అన్నారు. ఇస్కాన్ దేవాలయం భూముల వ్యవహారంపై టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుస్తామని దానం, సుధీర్ రెడ్డి తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. -
పార్టీని వీడేందుకేనా కార్పొరేటర్ల అలక!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడేందుకు పలువురు నేతలు తమకు తగిన మార్గాలను అన్వేషించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడే వారే సంఖ్య క్రమేపి పెరిగినా.. తాజా పరిస్థితులను చూస్తే నగర పరిధిలో మరికొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ కు హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటమికి దారితీసిన కారణాలను సమీక్షించుకొని లోపాలు సరిదిద్దుకునేందుకు శనివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి జూబ్లీహిల్స్ కార్పొరేటర్ మామిడి లక్ష్మీబాయి, జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ నేత మామిడి నర్సింగరావు డుమ్మా కొట్టారు. ఇదే విషయం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గానికి చెందిన అయిదుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లలో నలుగురు త్వరలోనే జంప్ జిలానీలుగా మారనున్నారని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మొదటి సమావేశానికే జూబ్లీహిల్స్ కార్పొరేటర్ లక్ష్మీబాయి హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. తమకు సమాచారం ఆలస్యంగా అందిందని అనుకోకుండా బయటికి వెళ్లడం వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేకపోయామని కార్పొరేటర్ పేర్కొంటూన్నా.. ఇందులో నిజమెంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. జూబ్లీహిల్స్ కార్పొరేటర్ మామిడి ఎప్పటి నుంచో ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. ఇదే అనుబంధం త్వరలో పెనవేసుకోనుందని తెలుస్తున్నది. వచ్చే కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గెలిచే ఛాన్స్ చాలా తక్కువగా ఉండటంతో చాలా మంది కార్పొరేటర్లు ఇతర పార్టీల్లోకి వెళ్తారని భావిస్తున్న నేపథ్యంలో ఆమె గైర్హాజరు ఇందుకు మరింత ఊతమిచ్చినట్లు అయ్యింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే మామిడికి, మాజీ మంత్రి దానంకు మధ్య విభేదాలు పొడసూపాయి. మామిడిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ బాధ్యతలు ఇక్కడ సంబంధం లేని బోజిరెడ్డికి అప్పగించడంతో వివాదం మరింత ముదిరింది. మొన్నటి ఫలితాల్లో ఇక్కడ బీజేపీకి 5 వేల పైచిలుకు మెజారిటీ రావడం కూడా ఆ వివాదానికి ఆజ్యం పోసింది. దీంతో ఇద్దరి మధ్య అగాథం పెరిగిందని వచ్చే కార్పొరేటర్ టిక్కెట్ను కూడా మామిడికి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సహజంగానే ఆమె మరో పార్టీవైపు చూస్తున్నట్లు స్పష్టమవుతున్నది. దానం నాగేందర్ పార్టీ ఓటమిలో భాగంగా నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరు కాకుండా అలక పూనడానికి ప్రధాన కారణం మాత్రం కాంగ్రెస్ వీడేందుకేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
'రాజకీయాల్లో గెలుపోటములనేవి సహజం'
-
రాజధానిలో కాంగ్రెస్ ఖాళీ
24 శాసనసభా స్థానాల్లో ఒక్కటీ గెలవని వైనం డిపాజిట్ కోల్పోయిన వీహెచ్ పోటీ ఇవ్వని దానం, ముఖేష్ సాక్షి, సిటీబ్యూరో : రాష్ట్ర రాజధాని ఓటర్లు వైవిధ్యమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానంలోనూ అవకాశం ఇవ్వకపోగా.. పలు నియోజకవర్గాల్లో మూడవ స్థానానికే పరిమితం చేశారు. అంబర్పేట, సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వి.హన్మంతరావు, జయసుధలకు డిపాజిట్ గల్లంతవడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన దానం నాగేందర్ (ఖైరతాబాద్లో), మూల ముఖేష్గౌడ్ (గోషామహల్లో) భారీ తేడాతో ఓటమి పాలుకాగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సనత్నగర్లో మర్రి శశిధర్రెడ్డి, జూబ్లీహిల్స్లో విష్ణువర్ధన్రెడ్డి, ఎల్బీనగర్లో సుధీర్రెడ్డి, శేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్, కుత్బుల్లాపూర్లో శ్రీశైలంగౌడ్లు మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. తెలుగుదేశం, బీజేపీ కూటమి గణనీయంగా పుంజుకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం తొమ్మిది, బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎం పార్టీ తిరిగి తనకున్న ఏడు స్థానాలను నిలబెట్టుకుంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, పటాన్చెరు అసెంబ్లీ స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది. రికార్డు మెజారిటీలు: నగరంలో బహుదూర్పురా నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి మౌజంఖాన్ 95,023 రికార్డు మెజారిటీతో విజయం సాధించగా, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గాంధీ 75,904, అంబర్పేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి 62,548 మెజారిటీతో తమ సమీప ప్రత్యర్థులపై విజయం సాధించారు. -
'కేసీఆర్ బ్లాక్మెయిల్కు భయపడొద్దు'
-
కేసీఆర్ పంచాంగం చెప్పుకోవాల్సిందే: దానం
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తాజీ మాజీ మంత్రి దానం నాగేందర్ దీమా వ్యక్తం చేశారు. సర్వేల ఫలితాలు తలక్రిందులయ్యేలా తెలంగాణలో తెలంగాణలో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంచాంగం చెప్పుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. వ్యాపారవేత్తలు టీఆర్ఎస్ ఒత్తిళ్లకు లొంగొద్దని సూచించారు. టీఆర్ఎస్కు భయపడాల్సిన పనిలేదని భరోసాయిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు గెలుచుకుంటుందని దానం నాగేందర్ అంతకుముందు చెప్పారు. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే మొత్తం 16 సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని నాగేందర్ జోస్యం చెప్పారు. -
'కేసీఆర్ బ్లాక్మెయిల్కు భయపడొద్దు'
హైదరాబాద్లోని కిషన్బాగ్ సిక్ ఛావనీ అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో దానం నాగేందర్ మాట్లాడుతూ... శుక్రవారం వెలువడనున్న ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దానం ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ నాలుగు జిల్లాలకే పరిమితమైన పార్టీ దానం ఈ సందర్బంగా గుర్తు చేశారు. కేసీఆర్ బ్లాక్మెయిల్కు సెటిలర్లు, అధికారులు భయపడొద్దని ఆయన హితవు చెప్పారు. తెలంగాణలో సెటిలర్లు, అధికారుల రక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని దానం స్పష్టం చేశారు. -
'తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదే'
తెలంగాణలో తమ పార్టీ గెలుపు తథ్యమని, అందులో ఎటువంటి సందేహం లేదని టీ.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్సష్టం చేశారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం తమదే అని బల్లగుద్దీ మరి చెప్పారు. శనివారం హైదరాబాద్లో మాజీ మంత్రి దానం నాగేందర్తో కలసి పొన్నాల విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని ఆయన ఆరోపించారు. సొంత అభ్యర్థులు లేని పార్టీ గెలుస్తుందా అంటూ పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు గెలుచుకుంటుందని మాజీ మంత్రి దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే మొత్తం 16 సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని నాగేందర్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉందనేది అవాస్తవమని అన్నారు. ఇతర పార్టీల ప్రకటనలు మాటల వరకే పరిమిత మంటూ ఆ పార్టీ నాయకులను ఎద్దేవా చేశారు. -
రెచ్చిపోయిన దానం... అనుచరగణం
బంజారాహిల్స్, న్యూస్లైన్: తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. పోలింగ్ స్టేషన్ల ముందే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధి కిందకు వచ్చే ఫిలింనగర్ గీతాంజలి స్కూల్ కేంద్రానికి పోలింగ్ ముగిసే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను పోలింగ్ స్టేషన్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని... టీడీపీ నేతలు మాత్రం యథేచ్ఛగా తిరుగుతున్నారని ఫిలింనగర్ కాంగ్రెస్ నేతలు నాగేందర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నాగేందర్ ఒక్కసారిగా కోపోద్రేక్తుడయ్యారు. అక్కడి పరిస్థితులు గమనించి వెంటనే బయటకు వచ్చారు. కొద్ది దూరంలో జూబ్లీహిల్స్ టీడీపీ అధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వరరావు ఫోన్ మాట్లాడుతూ అటు నుంచి వస్తుండగా నాగేందర్ అతడిని ఆపారు. ‘నీకు ఇక్కడేం పని’ అని ప్రశ్నిస్తుండగానే... కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. వెంకటేశ్వరరావుపై దాడికి దిగారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వెంకటేశ్వరరావును అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అదే సమయంలో టీడీపీ నేత సలీం అటు నుంచి వస్తుండగానే రౌడీషీటర్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నాగేందర్కు చెప్పారు. దీంతో నాగేందర్ రౌడీలకు ఇక్కడేం పనంటూ ప్రశ్నించారు. ఆయన ఒకవైపు మాట్లాడుతుండగానే ఇంకోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు సలీంపైకి దూసుకెళ్లారు. దీంతో మరోమారు ఉద్రిక్తత ఏర్పడింది. అరగంటపాటు ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం సృష్టించారు. సుమారు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కటై అక్కడున్న పలువురు టీడీపీ కార్యకర్తలను వేలెత్తి చూపుతూ పోలీసులకు అప్పగించారు. ఇంకోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా దాడి జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు మరోమారు లాటీచార్జ్ చేశారు. పరిస్థితి ఎంతకూ అదుపులోకి రాకపోయేసరికి భారీగా పోలీసులు మోహరించారు. డీసీపీ సత్యనారాయణ రంగప్రవేశం చేశారు. వంద మంది టాస్క్ఫోర్స్ పోలీసులు గీతాంజలి స్కూల్ను, పక్కనే ఉన్న మాగంటి కాలనీ స్కూల్ పోలింగ్ బూత్లను చుట్టుముట్టారు. అల్లర్లు జరగకుండా అడ్డుకున్నారు. కొద్దిసేపటికే టీడీపీ నేతలు అక్కడికి చేరుకొని దానం నాగేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె గోవర్ధన్రెడ్డి అక్కడే బైఠాయించి తక్షణం గీతాంజలి స్కూల్ పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరపాలంటూ డిమాండ్ చేశారు. తమ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టారంటూ ఆరోపించారు. ఒకవైపు టీడీపీ, మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. మొత్తానికి పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తరలించారు. -
దానం, గులాం నబీ ఆజాద్లపై కేసు
హైదరాబాద్, న్యూస్లైన్: కాంగ్రెస్ జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్, రాష్ట్ర మాజీ మంత్రి దానం నాగేందర్లపై పంజగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా అజాద్, దానం నాగేందర్లు పంజగుట్ట పీఎస్ పరిధిలోని ఎంఎస్ మస్తాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. -
‘దానం’కు చుక్కెదురు
బొందలగడ్డను కబ్జా చేశారంటూ బస్తీవాసుల ఆగ్రహం కాంగ్రెస్ నాయకులపై తిరగబడిన వైనం.. తిట్ల దండకం అందుకున్న మహిళలు పంజగుట్ట, న్యూస్లైన్: బొందల గడ్డను కబ్జా చేసి అనుచరులను వెంటేసుకొని ఓట్లేయాలంటూ మళ్లీ మా బస్తీకి రావడానికి నీకు ముఖమెక్కడిదంటూ బస్తీవాసులు నిలదీయడంతో మాజీ మంత్రి, ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి దానం నాగేందర్ నీళ్లు నమిలారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగేందర్ పంజగుట్ట కార్పొరేటర్ బి. రాజుయాదవ్తో కలిసి చింతలబస్తీ సమీపంలోని భోలాశంకర్ భక్తసమాజం నగర్ బస్తీకి వెళ్లారు. ఓటేయమని కోరేందుకు స్థానికంగా నివసించే పి.గోవిందరాజు అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అయితే బంజారాహిల్స్ రోడ్నెం. 13లోని మా శ్మశానవాటిక స్థలాన్ని మీ కార్పొరేటర్తో పాటు నేతలు కబ్జా చేశారని చెప్పినా వినిపించుకోలేదని, ఇప్పుడు మాత్రం ఓట్లు కావాల్సి వచ్చాయా అని ఆయన దానంను నిలదీశారు. దీంతో నాగేందర్ కంగు తిన్నారు. ‘శ్మశానం కబ్జాకు గురవుతోందని అప్పట్లోనే నేను నిలదీస్తే నువ్వెవడివిరా... నన్ను అడగడానికి అంటూ ఆ రోజు తిప్పి పంపారు. అంతేకాకుండా రౌడీయిజానికి పాల్పడుతున్న పంజగుట్ట కార్పొరేటర్ రాజు యాదవ్ను చూపిస్తూ వీడి సంగతి ఏంటో చూడు అని హెచ్చరించారు. వీడిపై ఏమైనా కేసులుంటే బయటకు తోడండిరా.. అంటూ కార్పొరేటర్ను ఆదేశించారు’ అవన్నీ గుర్తులేవా అంటూ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఆయనకు మద్దతుగా స్థానిక మహిళలందరూ ఏకమయ్యారు. ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నేతలపై తిట్ల పురాణం విప్పారు. ఒక్కసారిగా బస్తీ వాసులంతా ఒకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ నేతలపై తిరగబడటంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యకర్తలకు, బస్తీవాసులకు మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బస్తీ వాసులు కాంగ్రెస్వారిని అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఈ నేపథ్యంలో తనకు స్థానిక కార్పొరేటర్ రాజుయాదవ్ నుంచి ప్రాణహాని ఉందంటూ గోవింద్రాజ్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్పై, కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నాగేందర్ ఆటలు ఇక సాగవు
వైఎస్సార్ సీపీ నేత విజయారెడ్డి బంజారాహిల్స్, న్యూస్లైన్: చిన్నచిన్న కేసులున్నాయంటూ సామాన్య కార్యకర్తలను బైండోవర్లు చేస్తున్న పోలీసులు నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులున్న మాజీ మంత్రి దానం నాగేందర్ను ఎందుకు బైండోవర్ చేయడంలేదని వైఎస్సార్ సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గం కన్వీనర్ పి.విజయారెడ్డి ప్రశ్నించారు. పెద్దలకు ఓ న్యాయం, పేదలకు మరో న్యాయమా అని పోలీసుల తీరుపై మండిపడ్డారు. శనివారం బంజారాహిల్స్ రోడ్డు నెం.10లోని గౌరీశంకర్ కాలనీలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు తీసుకెళ్తుంటే వాహనాల తనిఖీల్లో దొరికాయంటూ ప్రకటనలు ఇస్తున్న పోలీసులకు మాజీ మంత్రి దానం ఇంటి వద్ద నిత్యం డబ్బు జాతర జరుగుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బైండోవర్లు జరుగుతున్నాయని, ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తాము కాలనీల్లో పాదయాత్ర చేస్తుంటే పోలీసులు వెంబడిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని, పోలీసులే తమ కార్యకర్తలను బెదిరించి కాంగ్రెస్లో తిరగాలంటూ ఆదేశిస్తున్నారన్నారు. పీజేఆర్ పేరు చెప్పుకుని గత ఎన్నికల్లో గెలిచిన నాగేందర్ ఇప్పుడు పీజేఆర్ అనుచరులను తొక్కిపెట్టడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్లో దానంకు గడ్డు పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుందని సర్వేలు చెప్పడంతో ఏమీచేయలేక ఆయన ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఎన్బీనగర్లోని బడుగులు ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు వస్తే తాను లాయర్ను ఏర్పాటు చేసి కోర్టులో పోరాడి వారికి న్యాయం చేశానన్నారు.అయిదేళ్ల పాలనలో ఖైరతాబాద్లో పేద, ధనిక అన్న తేడా లేకుండా అధికార పార్టీ నరకం చూపించిందని, విసుగెత్తి అందరూ వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో నాగేందర్ ఎంత డబ్బు వెదజల్లినా ఇంటికే పరిమితమవుతారన్నారు. అధికారం కోసం రాత్రికి రాత్రే పార్టీలు మార్చిన నాగేందర్కు తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. భీంరావ్బాడలో పేదల ఇళ్లను నామరూపాల్లేకుండా చేసిన దానం నోటీసుల పేరుతో అనేక బస్తీలను అతలాకుతలం చేస్తున్నారని, మరోసారి గెలిస్తే బస్తీలు మిగలవన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. -
దానం అనుచరులు వేధిస్తున్నారు: విజయా రెడ్డి
రాత్రికి రాత్రే పార్టీలు మార్చే వారికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి పరోక్షంగా మాజీ మంత్రి దానం నాగేందర్ను విమర్శించారు. శనివారం హైదరాబాద్లో విజయారెడ్డి మాట్లాడుతూ...దానం అండ చూసుకుని అటు అనుచరులు ఇటు పోలీసులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. దానం అనుచరులు అందరినీ వేధిస్తున్నారని విమర్శించారు. దానం అనుచరులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నవారిపై పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్నారని విజయారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
మీదే బాధ్యత
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావించే ఈ పోరులో విజయం సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్లో నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. ీ సనియర్లను సమన్వయపరుచుకుంటూ ప్రచారపర్వాన్ని కొనసాగించాలన్నారు.మండల/ జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. స్థానిక, సాధారణ ఎన్నికల వరకు పార్టీని సమన్వయపరుచుకునేందుకు వీలుగా జిల్లా స్థాయిలో మూడు కమిటీలు వేయాలని పొన్నాల సూచించారు. ప్రచార కమిటీ, మేనిఫెస్టో, సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, వీటిని రాష్ట్రస్థాయి కమిటీతో అనుసంధానం చేసుకోవాలన్నారు. జిల్లా సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరిచే అంశంపై జిల్లాస్థాయి సిఫార్సులు చేయాలని ఆయన స్పష్టం చేశారు. దానంపై ఫైర్! గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ రంగారెడ్డి జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. రంగారెడ్డి రెవెన్యూ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థులను దానం ప్రకటించడంపై కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశా? దానం నాగేందరా? అని ప్రశ్నించారు. గతంలోనూ ఇలా జిల్లా పరిధిలోని అంశాలపై కలగజేసుకున్నారని, ఇది సరికాదని అన్నారు. సర్వే, ఇతర ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించిన పొన్నాల, ఉత్తమ్.. దానం తీరును తప్పుబట్టారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ కార్యక్రమాలను డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. జెడ్పీ అభ్యర్థిగా యాదవరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డిని ప్రకటించేందుకు టీపీసీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. సొంత మండలం నుంచి జెడ్పీటీసీగా బరిలో దిగాలని యోచిస్తున్నానని, జెడ్పీ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని యాదవరెడ్డి కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలు.. గెలుపే లక్ష్యంగా పనిచేయండని, అందరం సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఇదిలావుండగా, జిల్లా పరిషత్పై కన్నేసిన కొంతమంది నేతలు ఇతర మండలాల నుంచి పోటీకి దిగుతున్నారని, దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందని, ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, బండారి రాజిరెడ్డి, ఆకుల రాజేందర్, భిక్షపతి యాదవ్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికలో తలమునకలైనందున ఈ సమావేశానికి మాజీ మంత్రులు సబిత, ప్రసాద్కుమార్ హాజరుకాలేదు. -
కాలగర్భంలో కలసిపోయేదే !
కిరణ్ పార్టీపై పీసీసీ చీఫ్ బొత్స వ్యాఖ్య విభజన నిర్ణయం తీసుకున్నపుడు కిరణ్ రాజీనామా ఎందుకు చేయలేదు? గవర్నర్పై విమర్శలు సరికాదు సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కొత్తగా పెట్టనున్న పార్టీ కాలగర్భంలో కలిసిపోయేదే తప్ప నిలిచేది కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం దెబ్బతిందని చెబుతున్న కిరణ్ విభజన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. పదవిలో చివరి వరకు కొనసాగి.. ఇప్పుడు కొత్తపార్టీ అంటూ వెళ్లినంత మాత్రాన ప్రజలు ఆదరిస్తారనుకోవడం పొరపాటన్నారు. గురువారం గాంధీభవన్లో బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కిరణ్ ఆత్మగౌరవానికి ఏమైంది? ఆయ నకు ఇప్పుడు విభజన గుర్తుకు వచ్చిందా?’’ అంటూ ప్రశ్నించారు. గవర్నర్పై కిరణ్ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి పట్ల జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. కిరణ్ను నమ్మితే నట్టేట మునిగినట్లేనని, ఆ విషయం ఇప్పటికే ఆయన వెనక చేరిన వారికి అర్థమైందన్నారు. కిరణ్పై అవినీతి ఆరోపణల గురించి మీడియా ప్రస్తావించగా.. ‘‘ప్రజాజీవితంలో ఉన్న వారిపై ఆరోపణలు వస్తే విచారణకు సిద్ధపడాలి. కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోకూడదు’’ అన్నారు. కిరణ్పై మాజీ మంత్రి డొక్కా చేసిన ఆరోపణల్ని ప్రస్తావించగా.. ‘‘ఆయన వద్ద ఏం సమాచారం ఉందో నాకెలా తెలుస్తుంది’’ అని ఎదురు ప్రశ్నించారు. సవాలక్షలో కిరణ్ పార్టీ ఒకటి: జానారెడ్డి కిరణ్ పెట్టే పార్టీ ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం ఉండదని, దేశంలో అనేక రిజిస్టర్డ్ పార్టీల్లో అదీ ఒకటని మాజీ మంత్రి కె .జానారెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్పై కిరణ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆ విమర్శలపై గవర్నర్ను అడిగితే ఆయనే సమాధానం చెబుతారన్నారు. బ్లాక్ స్థాయి కూడా లేని కిరణ్ను సీఎంగా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మరో మాజీ మంత్రి దానం నాగేందర్ విమర్శించారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టడం ఆయన వ్యక్తిగతమని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చని విప్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే ఎన్నికల్లో అదెలాంటి ప్రభావం చూపిస్తుందనేదే ప్రధానమన్నారు. తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం ఉంటుందో ఉండదో చెప్పలేమన్నారు. బాబువి పగటి కలలు: పద్మరాజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలు, శ్రేణులపై విశ్వాసం లేకనే కాంగ్రెస్ పార్టీనుంచి వచ్చిన వారిని టీడీపీలోకి రప్పించుకుంటున్నారని చీఫ్విప్ రుద్రరాజు పద్మరాజు విమర్శించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వారిని చేర్చుకున్నంత మాత్రాన టీడీపీ గెలుస్తుందనుకోవడం పొరపాటని, సీఎం అవుతానంటున్న చంద్రబాబువి పగటికలలేనని దుయ్యబట్టారు. -
బలహీనవర్గాల వారికే పీసీసీ: దానం
దిగ్విజయ్ను కోరిన మాజీ మంత్రి దానం సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని మాజీ మం త్రి దానం నాగేందర్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ను కలసి విజ్ఞప్తి చేశారు. పీసీసీ చీఫ్గా బలహీనవర్గానికి చెందిన నేతనే ఎంపిక చేయాలని విన్నవించారు. తెలంగాణలో బీసీల ప్రాబల్యం ఎక్కువని, అందువల్ల ఆ వర్గం నేతను అధ్యక్షునిగా నియమిస్తే పార్టీకి ఎన్నికల్లో లాభం చేకూరుతుందని ఆయన వివరించినట్టు సమాచారం. ఎన్నికల్లో పార్టీని ఒకేతాటిపైకి తేవడం, అభ్యర్థుల ఖరారు, ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో అధిష్టానానికి చేదోడుగా నిలిచే నేతను పీసీసీ సారథిగా నియమిస్తేనే ఆశించిన ప్రయోజనం ఉంటుందని నొక్కిచెప్పినట్టు తెలిసింది. సోమవారం ఢిల్లీ వచ్చిన దానం దిగ్విజయ్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం హైదరాబాద్లో పరిస్థితులు, పార్టీకి లభిస్తున్న ఆదరణపై దానం వివరించారు. టీఆర్ఎస్ కలిసిరాకున్నా కాంగ్రెస్కు సొంతంగా మెజార్టీ రావడం ఖాయమని వివరించినట్టు సమాచారం. కాగా తెలంగాణ నుంచి పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలు ఆశిస్తోందని, ఇందుకోసం నేతలు కృషిచేయాలని దిగ్విజయ్ సూచించినట్టు సమాచారం. -
పీసీసీ చీఫ్ పదవి ఇవ్వండి: దిగ్విజయ్ను కోరిన దానం
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ తో మాజీ మంత్రి దానం నాగేందర్ భేటి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులను దిగ్విజయ్ కు దానం వివరించినట్టు తెలుస్తోంది. రాష్టంలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జంట నగరాల్లో పార్టీ విజయానికి తోడ్పాటునందించే అంశాలను దిగ్విజయ్ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయని.. తనకు పార్టీ పగ్గాలు అప్పగించితే తాను విజయానికి కృష్టి చేస్తానని దిగ్విజయ్ తో అన్నట్టు సమాచారం. ఎన్నికల ముందే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని దిగ్విజయ్ను దానం కోరినట్టు తెలుస్తోంది. అయితే దానం విజ్ఞప్తికి దిగ్విజయ్ ఎలాంటి హామీ ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. -
'సొమ్ము మింగిన' కాంట్రాక్టర్లు జైలుకే: దానం
కాంట్రాక్టర్లపై రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ మంగళవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లే భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్లలో అంచనా వ్యయాలను అడ్డగోలుగా పెంచడానికి ఎలా అంగీకరించారని ఆయన ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును దొడ్డి దారిన కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సొమ్మును దిగమింగిన కాంట్రాక్టర్లు త్వరలో జైల్లో ఉంటారని హెచ్చరించారు. మాజీ మంత్రులు సబిత, ధర్మాన ప్రసాద రావులు చేయని తప్పులకు నిందలు పడ్డారని దానం అభిప్రాయపడ్డారు. అంచనాలు పెంచడం వల్ల ప్రాణహిత చేవెళ్లకు జరిగింది శూన్యమన్నారు. హంద్రినీవాకు మాత్రం 8 స్టేజ్లని అన్నారని అయితే ఇప్పటికి 34 స్టేజ్లకు వచ్చిందన్నారు. ట్రైబ్యునల్ ప్రకారం 15 టీఎంసీల నీటీని హైదరాబాద్కు తరలించాలని ప్రతిపాదనలు ఉన్నా ప్రభుత్వం ఎక్కడా పేర్కొన్నలేదని దానం నాగేందర్ తెలిపారు. -
అందరూ హైదరాబాద్ గురించే పట్టుబడుతున్నారు:దానం
-
అశోక్ బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది: దానం
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ను సమైక్యవాదులు అడ్డుకోవడంపై మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి .. .పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆయన గురువారమిక్కడ ఖండించారు. పార్టీలో కీలక పదవులు పొందిన జేసీ ఇప్పుడు సోనియాను విమర్శించటం తగదన్నారు. ఎవరైనా సోనియాని విమర్శిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు. దిగ్విజయ్ సింగ్ ను గోబ్యాక్ అనడానికి అశోక్ బాబు ఎవరంటూ దానం ప్రశ్నించారు. అశోక్ బాబు ఒక ఉద్యోగ సంఘం నేతగా వాళ్ల సమస్యలనే ప్రస్తావించాలే కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని దానం అన్నారు. హైదరాబాద్పై అందరికి సమానంగా హక్కు ఉందని దానం అన్నారు. అన్నదమ్ముల్లా విడపోవాలంటే...రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.