Dating
-
రిలేషన్షిప్లో ఆదిపురుష్ భామ.. మరోసారి భాయ్ఫ్రెండ్తో కలిసి!
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. గతేడాది ఎక్కువగా బాలీవుడ్లో పలు చిత్రాలతోనే మెప్పించింది. అయితే ఇటీవల ఎక్కువగా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించింది. అంతేకాకుండా ఓ వ్యాపారవేత్తలో ఈ ముద్దుగుమ్మ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. గతంలో చాలాసార్లు అతనితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. గతంలో అతని బర్త్ డే సందర్భంగా కృతిసనన్ ఫోటోలను పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లొ నిలిచింది.డిన్నర్కు వెళ్తూ..తాజాగా మరోసారి తన భాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ దహియాతో కలిసి జంటగా కనిపించింది. ముంబయిలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్కు వెళ్తూ జంటగా కనిపించారు. వీరిద్దరితో పాటు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా వెంటే ఉన్నారు. అయితే కృతి మాత్రం ఫ్యాన్స్కు కనిపించకుండా ముఖానికి మాస్క్ ధరించి కనిపించింది. దీంతో వీరిద్దరిపై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది. ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ ఖాయమనే అంటున్నారు నెటిజన్స్. అంతేకాకుండా గతేడాది వీరిద్దరు కలిసి గ్రీస్కు పర్యటనకు వెళ్లారు. అక్కడే వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడంతో ఈ జంట రిలేషన్లో ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఇప్పటివరకు ఎక్కడా కూడా నోరు విప్పలేదు.ఇక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా నెట్ఫ్లిక్స్ చిత్రం దో పట్టిలో కనిపించింది. అంతేకాకుండా గతేడాది క్రూ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. కాగా.. కబీర్ దహియా వరల్డ్వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ యజమాని కుల్జిందర్ బహియా కుమారుడే కబీర్ దహియా. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
ఇన్స్టాలో పికిల్ బాల్ టోర్నీ ఫోటోలు షేర్ చేసిన సామ్
-
వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నటించారు. అతని సరసన పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. 2023లో వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఇదిలా ఉండగా.. గతేడాది బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ధడక్-2లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది. ఇదిలా ఉండగా యానిమల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ తన ఇన్స్టాలో స్టోరీస్ బర్త్ డే విషెల్ చెబుతూ పోస్ట్ చేసింది. "హ్యాపీ బర్త్డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్కు ఇన్స్టా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అతనితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్రిప్తి డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కొంతకాలంగా సామ్ మర్చంట్, త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ అతని బర్త్ డే రోజును విష్ చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా నోరు విప్పలేదు.సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్లు, హోటళ్ల బిజినెస్లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్గా రాణిస్తున్నారు.ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. -
సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్!
సింగింగ్ సెన్సేషన్ శ్రేయా ఘోషల్(Shreya Ghoshal) తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ ఇలా పలు భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే గాయనీమణి ఆమె. ఎన్నో జాతీయ అవార్డులు. ఏ భాషలో పాడినా అత్యంత సహజంగా తన గానమాధుర్యంతో అలరించడం ఆమె స్పెషాల్టీ. అందుకే కోట్లాదిమంది సినీ సంగీతా భిమానులకు, మరెంతోమంది గాయకులకు ఆరాధ్యదైవం. తాజాగా శ్రేయా ఘోషల్ లవ్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. సింగర్ శ్రేయ భర్త ఎవరు? ఆయనను తొలిసారి ఎక్కడ చూసింది, ఎవరు ప్రపోజ్ చేశారు. ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.శ్రేయ ఘోషాల్ ప్రేమకథ (Love Story అద్భుతమైన సినిమా స్టొరీ కంటే తక్కువేమీకాదు. శ్రేయా ఘోషల్ భర్త పేరు శిలాదిత్య ముఖోపాధ్యాయ (Shiladitya Mukhopadhyaya). ఖ ట్రూకాలర్ గ్లోబల్ హెడ్. వీరి వివాహం 2015, ఫిబ్రవరి 5న జరిగింది. పెళ్లయిన ఆరేళ్లకు 2021లో వీరికి కుమారుడు దేవయాన్ జన్మించాడు.శ్రేయా ఘోషల్, శిలాదిత్య ప్రేమకథపాఠశాల విద్యార్థులగా ఉన్నప్పటినుంచే వీరి మధ్య ప్రత్యేకమైన అభిమానం ఉండేది. 10 ఏళ్ల డేటింగ్ తరువాత వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే తనకు లవ్ ప్రపోజ్ చేయడానికి శిలాదిత్య పడిన కష్టాలను ఒక సందర్భంగా శ్రేయా స్వయంగా వెల్లడించింది. శిలాదిత్య తన స్నేహితుడి వివాహంలో శ్రేయాకు ప్రపోజ్ చేశాడట. చాలా రోజులుగా ఇద్దరి మనస్సులో ఉన్నప్పటికీ వ్యక్తం చేసుకోవడానికి సమయం దొరకలేదు. ఇద్దరూ కలిసి స్నేహితుడి పెళ్లి పెళ్లారు. ఈ సందర్భంగానే ఎలాగైనా తన మనసులోని మాటను చెప్పేయాలని శిలాదిత్య ప్లాన్ చేసుకున్నాడు. కానీ విషయం అస్సలు శ్రేయాకు తెలియదు. ఇద్దరూ ఒక చోట కూర్చుని ఉండగా, అదిగో ఉడుత అని తన దృష్టి మళ్లించి, మోకాలిమీద కూర్చుని రింగ్తో ప్రపోజ్ చేశాడు. నిజంగానే నవలల్లో చదివినట్టుగా, సినిమాలో చూపించినట్టుగానే జరిగింది..అస్సలేమీ అర్థం కాలేదు అంటూ తన మూడో వివాహ వార్షికోత్సవం (గతంలో) సందర్భంగా వెల్లడించింది.కాగా శ్రేయా ఘోషల్ 1984లో మార్చి 12,న పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించింది. రాజస్థాన్ కోట సమీపంలోని రావత్భట అనే చిన్న పట్టణంలో పెరిగింది. నాలుగేళ్ల వయసునుంచే శాస్త్రీయ వాయిద్యం, హార్మోనియం నేర్చుకుంది. గురువు మహేష్ చంద్ర శర్మ నుండి సంగీత పాఠాలు నేర్చుకుంది. శ్రేయ తొలి స్టూడియో ఆల్బమ్ 1998లో బెంధెచ్చి బీనా పేరుతో విడుదలైంది. సరేగమా టీవీ రియాలిటీ షో ద్వారా ప్రసిద్ధి చెందింది. 16 ఏళ్ల వయసులో సంజయ్ లీలా భన్సాలీ రొమాంటిక్ మూవీ దేవదాస్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమాకే జాతీయ అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. అప్పటినుంచి సినీ సంగీత లోకాన్ని ఏలుతోంది. 2012లో భారత దేశంలోని ప్రముఖుల ఆదాయం, ప్రజాదరణ ఆధారంగా రూపొందించిన 100 ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితాలో చోటు సంపాదించుకుంది. తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు, అనేక జాతీయ అవార్డులు ఆమె ఖాతాలో చేరాయి. 2017లో, ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారతీయ విభాగంలో మైనపు విగ్రహాన్ని పొందిన తొలి గాయకురాలు కూడా శ్రేయా ఘోషల్ కావడమ విశేషం. గాయనిగా, ప్రదర్శకురాలిగా, ప్లేబ్యాక్ సింగర్గా, సంగీత కంపోజర్గా రాణిస్తున్న ఆమె ఆదాయం సుమారు రూ. 240కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇక ఆమె భర్త శిలాదిత్య ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ట్రూకాలర్ కంటే ముందు ఆయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేశారని సమాచారం.ఇదీ చదవండి : Maha Kumbh Mela 2025: కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు... -
ప్రముఖ సింగర్తో మహమ్మద్ సిరాజ్ డేటింగ్..!
భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేమల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ సింగర్తో మన టీమిండియా స్టార్, హైదరాబాదీ డేటింగ్లో ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె బర్త్ డే వేడుకల్లోనూ సిరాజ్ కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసుకుందాం.ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోంస్లే మనవరాలు జనాయి భోంస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సిరాజ్ భాయ్ డేటింగ్లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరినొకరు ఇన్స్టాలో ఫాలో అవుతుండడంతో ఈ రూమర్స్ మరింత వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పుట్టిన రోజు వేడుకల్లో మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొన్నారు.కాగా.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సింగర్ జనాయి భోంస్లేకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జనాయి భోంస్లే విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఆశా భోంస్లే కుమారుడైన ఆనంద్ భోంస్లే కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇటీవల జరిగిన పుట్టినరోజు వేడుకల్లో నటుడు జాకీ ష్రాఫ్, ఆశా భోంస్లే, సిద్ధేష్ లాడ్, సుయాష్ ప్రభుదేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్, ముంజ్య స్టార్ అభయ్ వర్మ కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
50 ఏళ్ల వయసులో హీరోయిన్ డేటింగ్? నిజమిదే!
హీరోయిన్ అమీషా పటేల్కు (Ameesha Patel).. ఈ ఏడాది జూన్ నెల వస్తే 50 ఏళ్లు వస్తాయి. హాఫ్ సెంచరీకి చేరువైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయింది. కెరీర్ మొదట్లో దర్శక నిర్మాత విక్రమ్ భట్ (Vikram Bhatt)తో డేటింగ్ చేసింది. ఐదేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన వీరు తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.ఈ ప్రేమ కూడా మధ్యలోనే..2008లో బిజినెస్మెన్ కనవ్ పూరితో లవ్లో పడింది. అతడు తనకెంతో స్పెషల్ అని.. తమ మధ్య మూడో వ్యక్తికి చోటు లేదని మీడియాకు చెప్పింది. తర్వాత వీరిద్దరికీ పెళ్లయినట్లు వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని ఆమె కొట్టిపారేసింది. చివరకు ఈ ప్రేమ కూడా ఎంతోకాలం నిలవలేదు. 2010లో అతడికి బ్రేకప్ చెప్పేసింది. తాను సింగిల్ అని.. ప్రస్తుతం కెరీర్పైనే ఫోకస్ చేస్తున్నా అంటూ అప్పట్లో ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.తనకంటే 20 ఏళ్లు చిన్నవాడితో లవ్?ఇలా ఏ ప్రేమా పెళ్లిదాకా రాలేదు. ఇటీవల అమీషా పటేల్ ఓ 30 ఏళ్ల యువకుడితో దుబాయ్లో విహరించింది. ఆ సమయంలో అతగాడితో క్లోజ్గా ఉన్న ఫోటోను అమీషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'నా డార్లింగ్ నిర్వాన్ బిర్లాతో.. లవ్లీ సాయంత్రం' ఆ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. వ్యాపార కుటుంబంలో జన్మించిన 'నీరవ్ బిర్లా' (Nirvaan Birla).. అమీషా పటేల్ కంటే సుమారు 20 ఏళ్ల చిన్నవాడు. వయసులో ఇంత చిన్నవాడితో డేటింగ్ చేయడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోయారు.(చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్తో ఆ స్టెప్పులు!)అలాంటిదేం లేదుతాజాగా ఈ రూమర్లపై నీరవ్ బిర్లా స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. అమీషా, నేను ప్రేమించుకోవట్లేదు. తను మా ఫ్యామిలీ ఫ్రెండ్. మా నాన్న, అమీషా చిన్నప్పటినుంచి స్నేహితులు. నేను దుబాయ్లో మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నాను. ఆ సాంగ్లో అమీషా కనిపించనుంది. అప్పుడు దిగిన ఫోటో చూసి మీ అందరూ ఏదేదో అనుకుంటున్నారు అని క్లారిటీ ఇచ్చాడు.ఎవరీ అమీషా పటేల్?ముంబైలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ కహో నా.. ప్యార్ హై (2000) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. అదే ఏడాది బద్రి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ మరుసటి ఏడాది గదర్: ఏక్ ప్రేమ్ కథ చిత్రంతో స్టార్ స్టేటస్ అందుకుంది. దీంతో వరుసగా హిందీలో అవకాశాలు క్యూ కట్టాయి. యే జిందగీ కా సఫర్, క్రాంతి, హమ్రాజ్, ఆప్ ముజే అచ్చే లగ్నే లగ్నే, తథాస్తు, మంగళ్ పాండే, వాదా, భూల్ భులయ్యా, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, రేస్ 2.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది.తెలుగులోనూ..తెలుగులో మహేశ్బాబు సరసన నాని (Naani Movie), బాలకృష్ణతో నరసింహుడు (Narasimhudu Movie), పరమవీరచక్ర (Parama Veera Chakra) మూవీస్లో నటించింది. 2018లో వచ్చిన భయ్యాజీ సూపర్ హిట్ మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. గదర్ 2తో 2023లో రీఎంట్రీ ఇచ్చింది.చదవండి: డాకు మహారాజ్లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? -
బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!
డేటింగ్ అనేది సక్రమ మార్గంలో వాడుకుంటే మంచిదే. ఒకర్నొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి అభిరుచులు మరొకరికి తెలియడానికి, ఇద్దరి మధ్యా మంచి సాంగత్యానికి ఉపయోపడుతుంది. కానీ ప్రస్తుత సాంకేతిక యుగం, సోషల్ మీడియా విశృంఖలత్వంతోపాటు, డేటింగ్ యాప్లు ఈ అర్థాన్ని మార్చి పారేశాయి.హానికరమైన, విషపూరితమైన సంబంధాలకు నాంది పలుకుతూ కొత్త డేటింగ్ ట్రెండ్లు ఉద్భవించాయి. అలాంటి వాటిల్లో ఒకటి బెంచింగ్ డేటింగ్. అసలేంటి బెంచింగ్ డేటింగ్? దీనివలన లాభమా? నష్టమా? తెలుసుకుందాం ఈ కథనంలో.ఆధునిక డేటింగ్ పదం బెంచింగ్ డేటింగ్. అంటే పేరుకు తగ్గట్టే భాగస్వాముల్లో ఒకర్ని హోల్డ్లో ఉంచి, మరొకరిపై ఆసక్తిగా ఉండటం. ప్రేమ భాగస్వామిని 'బెంచ్ మీద' ఉంచడం అంటే మరో బెస్ట్ ఆప్షన్ కోసం అన్వేషించడమే. అచ్చం ఒక ఆటగాడిని బెంచి మీద ఉంచడం లాంటిదన్నమాట. అంటే మెయిన్ టీంలో లేకుండా, ఆటలో పాల్గొనకుండా,సందర్భం కోసం వాడుకునేందుకు బెంచ్ మీద ఉండే ప్లేయర్ లాంటి వారు. ఈ డేటింగ్లో బెంచింగ్ చేస్తున్న వారు, తోటి భాగస్వామితో స్నేహం చేస్తారు కానీ మనస్సు పూర్తిగా పూర్తిగా సంబంధానికి కట్టుబడి ఉండరు. అలాగే ఈ డేటింగ్లో బెంచ్మార్కింగ్" అంటే ఎవరైనా తమ ప్రస్తుత భాగస్వామితో, గతంలోని వారితో పోల్చపుడు, నెగెటివ్గా కమెంట్ చేయడం లాంటివి కూడా ఉంటాయి. అంతిమంగా ఇది రెండో వ్యక్తిలో (బెంచ్మీద ఉన్న) గందరగోళానికి మానసిక వేదనకు గురి చేస్తుంది. నిజాయితీ, నిబద్ధత లోపించడంతో అవతలి వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఒకరిమీద ఒకరికి విశ్వాసం, నమ్మకం లేనపుడు ఇక ప్రేమకు తావు ఎక్కడ ఉంటుంది. మోసపోయామన్న నిరాశ, నిస్పృహతోపాటు కొన్ని అనారోగ్యకరమైన, పెడధోరణులకు దారి తీయవచ్చు.బెంచ్మార్కింగ్ సంకేతాలుప్రస్తుత భాగస్వామిని మాజీలు లేదా గత సంబంధాలతో క్రమం తప్పకుండా పోల్చడం.అవాస్తవిక అంచనాలతో ఉండటం, వాళ్లు చెప్పినట్టే వినాలని అన్యాయంగా పట్టుబట్టటంఎపుడూ అసంతృప్తిగా ఉండటం, మరొకరితో పోల్చి, ఉద్దేశపూర్వకంగా అవమానించడం.నమ్మకం లేకపోవడం, ఎపుడూ విమర్శిస్తూ ఉండటం తమ రిలేషన్ను మరింత ఆరోగ్యకరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సుతరామూ అంగీకరించకపోవడంఇదీ చదవండి : భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా! జాగ్రత్తలుపైన పేర్కొన్న అనుమానాస్పద లక్షణాలు కనిపించినపుడు అప్రమత్తం కావడం మంచిది. వీటిని గమనించి నపుడు అపార్థాలకు, అపోహలకు తావులేకుండా భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకొని, బంధం ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. లేదా గతాన్ని వదిలేసి, బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం ఉత్తమం. సిమ్మర్ డేటింగ్ఒకపుడు ద్దలు కుదుర్చుకునే పెళ్లిళ్లకే ప్రాధాన్యత ఉండేది. కాల క్రమంలో ప్రేమ వివాహాలపై యువతకు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సిమ్మర్ డేటింగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రధానంగా జనరేషన్ జెడ్ దీనిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అసలు ఈ సిమ్మర్ డేటింగ్ అంటే ఏమిటి? సుదీర్ఘ సంబంధాలపై దృష్టి పెట్టడమే దీని ప్రత్యేకత. చాలా కాలంపాటు బంధంలో కొనసాగడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందట. ఒకరిపై ఒకరికి అవగాహన, నమ్మకం పెరిగిన తరువాత లైంగిక బంధంలోకి అడుగుపెట్టడం మంచిదని, తద్వారా బంధం బలపడుతుందని నేటియువత భావిస్తోంది. -
అతనితో డేటింగ్లో దంగల్ నటి.. ఫోటోలు వైరల్!
దంగల్ మూవీతో క్రేజ్ దక్కించుకున్న నటి సన్యా మల్హోత్రా(Sanya Malhotra). ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్ను మెప్పించింది. ఇటీవల వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ చిత్రంలో మెరిసింది. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కథను అందించగా.. నిర్మాత ఆయన భార్య వ్యవహరించారు. ఈ మూవీ ద్వారానే కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఇదిలా ఉండగా అయితే దంగల్ నటి సన్యా మల్హోత్రాపై నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ వాద్యకారుడు రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో టాక్ నడుస్తోంది. ఇటీవల ఓ ఫోటో షూట్లో రిషబ్, సన్యా కలిసి ఓ అభిమానితో ఫోటోలకు పోజులిచ్చారు. ఓకే ఈవెంట్లో ఇద్దరు అదే వ్యక్తితో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట ఎంత అద్భుతంగా ఉంది.. సన్యా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇద్దరూ చాలా ప్రతిభావంతులు..మీరు డేటింగ్లో ఉంటే ఇంకా మంచిది' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు.ఇక సన్యా మల్హోత్రా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సన్నీ సంస్కారీ కి తులసి కుమారి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మించారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, రోహిత్ సరాఫ్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 18, 2025న థియేటర్లలోకి రానుంది.కాగా.. 2016లో వచ్చిన దంగల్ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటివరకు దంగల్ మూవీ కలెక్షన్స్ను ఏ సినిమా కూడా దాటలేకపోయింది. ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్, సుహానీ భట్నాగర్, జైరా వాసీం,సాక్షి తన్వర్, అపరశక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు. -
ప్రేమ,పెళ్లిపై రష్మిక అలా.. విజయ్ ఇలా
సినీ నటుల వ్యక్తిగత జీవితాలపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయంలో రకరకాలు పుకార్లు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి గాసిప్లను కొంతమంది సీరియస్గా తీసుకొని ఖండిస్తుంటారు. మరికొంతమంది అయితే పెద్దగా పట్టించుకోరు. పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు ఇలాంటి కామన్లే అనుకొని వదిలేస్తుంటారు. విజయ్ దేవరకొండ ఆ కోవలోకి చెందిన హీరో అనే చెప్పాలి. ఆయన ప్రేమ, పెళ్లిపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తునే ఉన్నాయి. ఓ స్టార్ హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ మాత్రం ఈ రూమర్స్ని పెద్దగా పట్టించుకోకుండా..తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. గతంలో ఒకసారి తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను ఖండించాడు. ఆ తర్వాత చాలా గాసిప్స్ వచ్చిన స్పందించలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా తన రిలేషన్షిప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ఓ జాతీయ మీడియాతో విజయ్ మాట్లాడుతూ..సమయం వచ్చినప్పుడు తానే తన రిలేషన్షిప్ గురించి మాట్లాడతానన్నాడు. ‘నా రిలేషన్షిప్ గురించి ప్రపంచానికి తెలియజేయాలని నాకు అనిపించినప్పుడు నేనే ఆ విషయాన్ని బయట పెడతా. దానికంటూ ఓ సమయం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు నేనే సంతోషంగా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటాను. నా డేటింగ్ విషయంపై వస్తున్న రూమర్స్ని నేను పెద్దగా పట్టించుకోను. పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. అది కూడా నా వృత్తిలో భాగంగానే భావిస్తాను. ఆ రూమర్స్ నాపై ఎలాంటి ఒత్తిడిని కలిగించవు. వార్తలను వార్తగానే చూస్తా’ అని విజయ్ అన్నారు. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘అపరిమితమైన ప్రేమ ఉంటే..దానికి తోడుగా బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి వస్తుంది’ అని విజయ్ చెప్పుకొచ్చాడు.ఇక మరో ఇంటర్వ్యూలో హీరోయిన్ రష్మిక మందన్నా తన ప్రేమ, రిలేషన్ గురించి మాట్లాడుతూ.. తనకు రాబోయే భాగస్వామి ఎలా ఉండాలో చెప్పింది. ‘లైఫ్ పార్ట్నర్ అనేవాడు అన్ని వేళలా నాకు తోడుగా నిలవాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్గా ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి’ అని చెప్పింది. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. సా దృష్టింలో ప్రేమలో ఉన్నారంటే.. వాళ్లు తమ భాగస్వామితో కలిసి ఉన్నట్లే. జీవితంలో ప్రతి ఒక్కరికి తోడు కావాలి. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనమే ఉండదు’ అని రష్మిక అన్నారు. -
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన ఆదిపురుష్ భామ..!
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది బాలీవుడ్లో పలు చిత్రాలతో మెప్పించింది. అయితే గత కొంతకాలంగా కృతి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్ చూస్తే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో కృతి సనన్ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అని తెగ చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కృతిసనన్ తాజాగా ఓ పెళ్లి వేడుకలో మెరిసింది. ఆ పెళ్లి మరోవరిదో కాదు.. తన ప్రియుడు కబీర్ బహియా బంధువులదే కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో వీరిద్దరి రిలేషన్పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో కృతి సనన్ పెళ్లి చేసుకోబోతోందా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.కాగా.. గతంలో కృతి సనన్, కబీర్ బహియా కలిసి విదేశాల్లో వేకేషన్కు వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అయితే తమ రిలేషన్ గురించి వీరిద్దరు ఎక్కడా బయటికి చెప్పలేదు. కబీర్ బహియా పుట్టినరోజు సందర్భంగా కృతి సనన్ అతనితో ఉన్న రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోతో తమ రిలేషన్పై క్లారిటీ ఇచ్చేసింది.కబీర్ బహియా లండన్కు చెందిన వ్యాపారవేత్త. అతని తండ్రి కుల్జిందర్ బహియా యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ వ్యవస్థాపకుడు. అతను స్టార్ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి సన్నిహితుడు కూడా. మరోవైపు కృతి సనన్ ఈ ఏడాది తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, క్రూ, దో పట్టి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. -
టీమిండియా స్టార్ సిరాజ్పై రూమర్లకు కారణం ఈ ఫొటోలే! (ఫొటోలు)
-
డేటింగ్లో ఆదిపురుష్ భామ.. బాయ్ఫ్రెండ్కు స్పెషల్ విషెస్
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. ఈ ఏడాది క్రూ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల దో పట్టి మూవీలోనూ కనిపించింది. అయితే ఇటీవల విదేశాల్లో వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన బర్త్ డే వేడుకలు సైతం విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఆ పార్టీలో ఆమె బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా కూడా ఫోటోల్లో కనిపించారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.తాజాగా ఇవాళ కబీర్ బహియా బర్త్ డే సందర్భంగా అతనికి విషెస్ తెలిపింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. హ్యాపియస్ట్ బర్త్ డే అంటూ లవ్ సింబల్ను జోడించింది. ఈ పోస్ట్ చూస్తే వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ జంట డేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. కబీర్ బహియా యూకేలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం.అంతేకాకుండా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, ఆమె ప్రియుడు స్టెబిన్ బెన్ సైతం కబీర్ దహియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా కబీర్, కృతి కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా.. కృతి చివరిసారిగా నటించిన దో పట్టి ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో కాజోల్, షాహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
నో ఆల్కహాల్, నో టాక్సిక్ పీపుల్ మలైకా పోస్ట్: షాకవుతున్న ఫ్యాన్స్
చిరకాల ప్రియుడు అర్జున్ కపూర్తో నుంచి బ్రేకప్ తరువాత నటి మలైకా అరోరా సంచలన ప్రకటన చేసింది. ఇటీవల కొన్ని పోస్ట్ల తరువాత 'నవంబర్ ఛాలెంజ్' ని ఆసక్తికరంగా ప్రకటించింది. మద్యం,నిద్రతోపాటు టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉంటానంటూ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇది మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ గురించేనా అంటూ షాక్ అవడం అభిమానుల వంతైంది.శారీరకంగా దృఢంగా ఉండటానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈనెలలో(నవంబరు)లో మలైకా చేయాలను కుంటున్న తొమ్మిది పనుల లిస్ట్ను ప్రకటించింది. మలైకా నవంబర్ ఛాలెంజ్ 1. మద్యం దూరంగా ఉండటం 2. ఎనిమిది గంటల నిద్ర. 3. మంచి గురువును 4. రోజూ వ్యాయామం 5. రోజుకు పదివేల అడుగులు. 6. రోజూ ఉదయం 10 గంటల వరకు ఉపవాసం. 7. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం 8. రాత్రి 8 గంటల తర్వాత నోటికి తాః 9. విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటం. శారీరంగా ఆరోగ్యంగా ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య నిపుణులు కూడా ఇలాంటి సలహాలే ఇస్తారు. అలాగే మానసిక ఉల్లాసానికి సానుకూలంగా, స్నేహంగా ఉండే వ్యక్తులతో సన్నిహితం ఉండటం కూడా అవసరమే అంటారు కూడా.కాగా అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత మలైకా,అర్జున్ రిలేషన్లో ఉన్నారు. అయితే 'సింగమ్ ఎగైన్' మూవీప్రమోషన్ ఈవెంట్లో తాను ఇంకా సింగిల్ అని ప్రకటించి, మలైకాతో తన బంధం గురించి చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం తేల్చి చెప్పేశాడు. సింగం ఎగైన్ మూవీలో విలన్గా అర్జున్ కపూర్ మంచి మార్కులే సాధించాడు. సినిమా సక్సెస్ కావడంతో మరింత ఉత్సాహంగా ఉన్నాడు. -
పొలిటీషియన్ కొడుకుతో హీరోయిన్?
బాలీవుడ్లో డేటింగ్ రూమర్స్ సర్వసాధారణం. పలానా హీరో, హీరోయిన్లు ప్రేమలో ఉన్నారంటూ రోజుకో పుకారు పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇక హీరోయిన్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఏ సెలెబ్రిటీతో అయినా కలిసి ఫోటో దిగితే చాలు..వాళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు పుట్టుకొస్తాయి. వాటిల్లో కొన్ని నిజమైన సందర్భాలూ ఉన్నాయి. ఇక ఈ సారి సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి.పొలిటిషీయన్ కొడుకుతో ప్రేమాయణంసారా అలీఖాన్ ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రముఖ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అర్జున్కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్కి చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా కొడుకు ఈయన. అర్జున్ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95)అలా మొదలైంది..ఇటీవల సారా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లింది.ఈ పర్యటననే డేటింగ్ రూమర్లకి కారణమైంది. సారాతో పాటు అర్జున్ కూడా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలోనే వీరిద్దరు మరింత క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు కలిసి దర్శనం చేసుకుంటున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అప్పటి నుంచి అర్జున్-సారా డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ మొదలైయ్యాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్పై అటు సారా కానీ, ఇటు అర్జున్ కానీ స్పందించలేదు. (చదవండి: మరోసారి తల్లయిన హీరోయిన్.. బేబీ బంప్స్ ఫొటోలు) View this post on Instagram A post shared by Arjun Pratap Bajwa (@bajwaarjun) -
అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది!
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగువారికి సుపరిచితమే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది అనన్య పాండే. ఇవాళ తన 26 పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల సీటీఆర్ఎల్ మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కాల్ మీ బే సీజన్-2లో నటిస్తోంది.అంబానీ పెళ్లిలో సందడి..ఇదిలా ఉండగా.. గతంలో అంబానీ పెళ్లిలో అనన్య పాండే సందడి చేసింది. ఆ సమయంలో మోడల్ వాకర్ బ్లాంకోతో కలిసి హాజరైంది. దీంతో వీరిద్దరిపై అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ పోస్టులు పెట్టారు. అయితే డేటింగ్పై అనన్య ఇప్పటివరకు స్పందించలేదు.ఐ లవ్ యూ అంటూ పోస్ట్అయితే ఇవాళ అనన్య పాండే బర్త్ డే కావడంతో వాకర్ బ్లాంకో విషెస్ తెలిపారు. ఇన్స్టా స్టోరీస్లో అనన్య ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు. 'హ్యాపీ బర్త్ డే బ్యూటీ.. యూ ఆర్ సో స్పెషల్.. ఐ లవ్ యూ అనీ' అంటూ రొమాంటిక్గా విష్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరు డేటింగ్ రూమర్స్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తాజా పోస్ట్తో ఈ జంట ప్రేమలో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది.తొలిసారిగా ఆ పెళ్లిలోనేకాగా.. అనన్య, వాకర్లు మొదటిసారిగా జూలైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహంలో జంటగా కనిపించారు. ఈ పెళ్లిలో వాకర్ని తన భాగస్వామిగా పరిచయం చేసింది. ఈ వేడుకల్లో ఓ సాంగ్కు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. అంతకుముందు బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ జంట ఇద్దరూ విడిపోయారు. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఎక్కడా కూడా స్పందించలేదు. -
స్టార్ హీరో కుమారుడితో హీరోయిన్.. దివాళీ బాష్లో మెరిసిన ప్రేమజంట..!
బాలీవుడ్ భామ పాలక్ తివారీ ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతోంది. గతేడాది కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ అనే మూవీతో అభిమానలను అలరించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించింది. బాలీవుడ్ నటి శ్వేత తివారీ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ కొన్ని నెలలుగా ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ బీటౌన్లోనే వినిపిస్తూనే ఉన్నాయి.బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్తో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుడా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. గతంలో ఇబ్రహీం, పాలక్ తివారీ గోవా నుంచి తిరిగివస్తూ విమాశ్రయంలో కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఓసారి అతని ఇంటి వద్ద కూడా కనిపించింది.తాజాగా ఈ జంట ప్రముఖ డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా దీపావళి పార్టీలో మెరిశారు. వీరిద్దరు కలిసి పార్టీకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఇబ్రహీం అలీ ఖాన్ తన ప్రియురాలు పాలక్ తివారీని కలిసి వెళ్లడం కనిపించింది. అయితే వీరిద్దరి డేటింగ్పై ఇప్పటివరకు స్పందించలేదు.కాగా.. సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన పాలక్ తివారీ మరో చిత్రంలో నటిస్తోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న రోసీ: ది సాఫ్రాన్ చిత్రంలో కనిపించనుంది. మరోవైపు కరణ్ జోహార్ రాబోయే చిత్రం 'సర్జమీన్'చిత్రం ద్వారా ఇబ్రహీం అలీ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సల్మాన్ ఖాన్ సోదరుడితో విడాకులు.. ఇప్పుడేమో మాజీ భాయ్ఫ్రెండ్తో!
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, సల్మాన్ ఖాన్ తమ్ముడి భార్య సీమా సజ్దేహ్ ఓ షోలో మెరిసింది. నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో కనిపించింది. ఈ షోలో పాల్గొన్న సీమా సజ్దేహ్ తన వివాహా జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సోహైల్ ఖాన్తో పెళ్లికి ముందే ప్రముఖ రచయిత విక్రమ్ అహుజాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ను పెళ్లాడింది. వీరిద్దరు 2022లో విడాకులు తీసుకున్నారు.తాజాహా నెట్ఫ్లిక్స్ షోలో కనిపించిన సీమా.. తన డేటింగ్ గురించి నోరు విప్పింది. సోహైల్తో డివోర్స్ తర్వాత విక్రమ్ అహుజాతో డేటింగ్లో ఉన్నట్లు సీమా వెల్లడించింది. ప్రస్తుతం అతనితో డేటింగ్లో ఉన్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ముంబయిలోని వర్లీ నుంచి బాంద్రాకు మారినప్పుడు తన ఇంటికోసం సాయం చేశాడని సీమా తెలిపింది. తన గురించి నాకంటే అతనికే ఎక్కువగా తెలుసని చెప్పింది. అతనితో మళ్లీ ప్రేమలో పడినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.కాగా.. విక్రమ్ అహుజా ఒక వ్యాపారవేత్త. మల్టీ మిలియనీర్ దేవేంద్ర అహుజా కుమారుడు. అతను సెంచూరియన్ బ్యాంక్ ప్రమోటర్గా పనిచేశాడు. గతంలో సీమా, విక్రమ్ 1990 నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఊహించని కారణాలతో వాళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సీమా.. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరు రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. దీంతో తాజాగా సీమా తన మాజీ బాయ్ఫ్రెండ్ విక్రమ్ అహుజాతో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపింది. నెట్ఫ్లిక్స్ షో ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ షోలో ఈ విషయాన్ని వెల్లడించింది. -
చాలామందితో డేటింగ్ చేశా
-
ఇటలీ ప్రధానితో డేటింగ్? స్పందించిన మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇటీవల వీరు ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇద్దరు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో నెట్టింట్లో రూమర్లు గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వీరు డేట్కు వెళ్తారని అనుకుంటున్నారా?’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో మస్క్ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. తమ మధ్య డేటింగ్ జరగడం లేదంటూ ఆయన పోస్టు చేశారు.Do you think They’ll date? 🤣 pic.twitter.com/XXs1U45kjb— Tesla Owners Silicon Valley (@teslaownersSV) September 24, 2024కాగా మంగళవారం న్యూయార్క్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో.. అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ మెలోనీకి అందజేశారు. మస్క్ ఆమెకు పురస్కారాన్ని అందజేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటలీ ప్రధానికి అవార్డును అందజేయడం గర్వంగా భావిస్తున్నట్లు మస్క్ అన్నారు. కనిపించే అందం కన్నా..ఆమె మనసు మరింత అందమైందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకుల గురించి కొన్ని పదాలను ఎప్పుడూ చెప్పలేం. కానీ, మెలోనీ అలా కాదని, ఆమె నిజాయతీ గల విశ్వసనీయమైన వ్యక్తిగా ప్రశంసించారు. -
అతనితో రిలేషన్షిప్.. క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
-
నాగచైతన్య ఎంగేజ్మెంట్.. అతనితో సమంత డేటింగ్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా నిశ్చితార్థం తర్వాత చైతూ చాలా సంతోషంగా ఉన్నాడని నాగ్ తెలిపారు.అయితే చైతూకు ఎంగేజ్మెంట్ కావడంతో అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపైనే పడింది. చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ఎలాంటి పోస్టులు పెడుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.డైరెక్టర్తో డేటింగ్?ఈ సంగతి అటుంచితే.. తాజాగా సమంతపై నేషనల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రెడ్ఇట్ కథనం ప్రకారం సామ్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అతను సమంత నటిస్తోన్న సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలోనూ సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు. ఆ సిరీస్ తర్వాతే అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. అయితే సమంత- రాజ్ నిడిమోరుపై వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రెండు వెబ్ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లయిన రాజ్ నిడిమోరు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు.కాగా.. 2017లో సమంత- నాగచైతన్య పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు తమ తమ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. -
మాజీ ముఖ్యమంత్రి మనవడితో టాలీవుడ్ హీరోయిన్ డేటింగ్ (ఫోటోలు)
-
Manushi Chhillar: మాజీ సీఎం మనవడితో వరుణ్ తేజ్ హీరోయిన్ డేటింగ్?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది మానుషి చిల్లర్. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించి..తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో టాలీవుడ్లో ఈ మాజీ విశ్వసుందరి ఆఫర్లు లభించలేదు. దీంతో మళ్లీ తన మకాంను బాలీవుడ్కి మార్చింది. అక్కడ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇలా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది మానుషి. ప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. అయితే ఇన్నాళ్లు ఆమె ఫోటోలు మాత్రమే వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు మానుషి పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఓ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మాజీ విశ్వసుందరీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ షిండే మనవడు, నటుడు వీర్ పహారియాతో మానుషి డేటింగ్ ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దానికి ఓ కారణం ఉంది. ఇటీవల జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియా, స్నేహితులతో కలిసి టూర్కి వెళ్లింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మానుషి, శిఖర్ సోదరుడు వీర్ పహారియా భుజంపై సేదతీరుతూ కనిపించింది. దీంతో మానుషి, వీర్లు ప్రేమలో ఉన్నారని, అందుకే కలిసి టూర్కి వెళ్లారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.అయితే దీనిపై అటు మానుషి కానీ, ఇటు వీర్ కానీ స్పందించలేదు.(చదవండి: ఈ వారం థియేటర్స్లో 11 సినిమాలు..కానీ ఒక్కటి కూడా!)ఇక మానుషీ విషయానికొస్తే.. హరియాణాకు చెందిన ఈ బ్యూటీ 2017లో విశ్వ సుందరిగా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. బాలీవుడ్ మూవీ సామ్రాట్ పృథ్వీరాజ్లో అక్షయ్కు జోడీగా నటించింది మానుషీ. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. రెండో మూవీ ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ కూడా ఫ్లాప్ అయింది. బాలీవుడ్ అచ్చిరాకపోవడంతో టాలీవుడ్ మూవీతోనైనా హిట్ కొడదామని ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా ప్లాప్గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న ‘టెహ్రాన్’లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia) -
గ్రీస్లో ఆదిపురుష్ భామ.. అతనితో డేటింగ్ నిజమేనా!
ఆదిపురుష్ భామ, బాలీవుడ్ నటి కృతి సనన్ తెలుగువారికి సుపరిచితమే. ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీతగా మెప్పించింది. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో అభిమానులను అలరించలేకపోయింది. ఓం రౌత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇటీవల క్రూ మూవీతో ఫ్యాన్స్ను అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం గ్రీస్లో విహరిస్తోంది. తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న కబీర్ బహియాతో చిల్ అవుతోన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.గతంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పలుసార్లు రూమర్స్ వినిపించాయి. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లోనూ ఈ జంట పార్టీలో సందడి చేశారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్లో ఉన్నారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే కబీర్తో రిలేషన్పై ఇప్పటివరకు కృతి సనన్ స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరు జంటగా గ్రీస్లో కనిపించడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా కృతి సనన్ ఇటీవల తన పుట్టినరోజును కబీర్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.పదేళ్ల ఏజ్ గ్యాప్..అయితే ఈ జంట మధ్య వయసు అంతరం ఎక్కువగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కృతి సనన్ వయస్సు 34 ఏళ్లు కాగా.. కబీర్ బహియాకు వయస్సు 24 ఏళ్లు మాత్రమేనని తెలుస్తోంది. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇది చూస్తుంటే తనకంటే పదేళ్లు చిన్నవాడైన కబీర్తో ఆదిపురుష్ భామ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి సనన్ దో పట్టి మూవీలో కనిపించనుంది. ఇందులో కాజోల్, షహీర్ షేక్ కూడా నటించారు. -
అతని వల్ల నా హార్ట్ బ్రేక్ అయింది: జాన్వీ కపూర్ కామెంట్స్
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఆ తర్వాతా టాలీవుడ్లో దేవర భామ ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఇటీవల అంబానీ పెళ్లిలో తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి సందడి చేసింది. వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. దీంతో అతనితోనే ఏడడుగులు నడుస్తుందని బాలీవుడ్లో టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా అతనితో రిలేషన్పై జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కానీ అతని వల్లే తనకు ఒకసారి హార్ట్ బ్రేక్ అయిందని వెల్లడించింది.శిఖర్ పహారియాతో తన రిలేషన్ గురించి జాన్వీ కపూర్ చాలా ఓపెన్గా మాట్లాడింది. గతంలో తాను శిఖర్తో ఎందుకు విడిపోయిందో కారణాలను వివరించింది. నాకు పీరియడ్స్ వచ్చాక మొదటి రెండేళ్ల పాటు ప్రతి నెలా అతనితో బ్రేకప్ అయ్యానని వెల్లడించింది. దీంతో తాను మొదటి రెండు, మూడు నెలలు షాక్లో ఉన్నాడని తెలిపింది. ఆ తర్వాత రెండు రోజులకే నేను అతని వద్దకు వెళ్లి ఏడుస్తూ సారీ చెప్పేదాన్ని అని పేర్కొంది. కానీ ఆ సమయంలో నా మెదడు ఎందుకలా పనిచేస్తుందో అర్థం కాలేదని జాన్వీ చెప్పుకొచ్చింది.శిఖర్ వల్ల ఒకసారి తన గుండె పగిలిపోయిందని.. కానీ అదే మనిషి తిరిగి వచ్చి నా పగిలిన గుండెను మళ్లీ ఒక్కటి చేశాడని తెలిపింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని వివరించింది. కాగా.. బాలీవుడ్ ఎంట్రీకి ముందే జాన్వీ శిఖర్తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ఆ తర్వాత 2018 వచ్చిన రొమాంటిక్ మూవీ ధడక్ సహనటుడు ఇషాన్ ఖట్టర్తో డేటింగ్ చేసింది. ఇషాన్తో విడిపోయిన తర్వాత మళ్లీ శిఖర్తో జతకట్టింది. ఇక సినిమాల విషయాకొనిస్తే..జాన్వీ చిత్రం ఉలాజ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో జాన్వీ కపూర్ డిప్యూటీ హైకమీషనర్గా కనిపించనున్నారు. ఆ తర్వాత దేవర పార్ట్ 1తో పాటు రామ్ చరణ్ సరసన నటించనుంది. -
హీరోతో లైగర్ భామ బ్రేకప్.. అప్పుడే బాయ్ఫ్రెండ్ దొరికేశాడా?
బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండే చివరిసారిగా ఖో గయే హమ్ కహాన్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తన తొలి వెబ్ సిరీస్ కాల్ మీ బేలో కనిపించనుంది. తాజాగా అనన్య ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో అనంత్ బారాత్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.అయితే గతంలో హీరో ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగమ్మ ఆదిత్య రాయ్ కపూర్తో మార్చి 2024లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇద్దరు కూడా ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు. కానీ మార్చి నుంచి ఈ జంట దూరంగానే ఉంటున్నారు.తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో మరొకరితో అనన్యపాండే కనిపించింది. దీంతో అందరిదృష్టి అతనిపైనే పడింది. ఎవరా మిస్టరీ మ్యాన్? అంటూ తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. తీరా చూస్తే అతని పేరు వాకర్ బ్లాంకో అని.. ఇన్స్టాగ్రామ్లోనూ ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దీంతో అనన్య అతనితో డేటింగ్లో ఉందా? అంటూ ఫ్యాన్స్ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. -
‘డిజైన్డ్’ సంసారం! సిటీలో స్థిరపడుతున్న సహజీవన సంస్కృతి!!
కలిసి జీవనం ప్రారంభించడం, బాధ్యతలు, వ్యయాలు సమానంగా పంచుకోవడం, పరస్పర వ్యక్తిగత ఇష్టాయిష్టాలను గౌరవించుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించకపోవడం, ఇష్టమున్నంత కాలం కలిసి ఉండడం, ఇద్దరిలో ఎవరు వద్దనుకున్నా సింపుల్గా ‘బై..బై’ చెప్పేయడం.. ఇదే ‘లివిన్’. సహజీవనంతో మరింత బలపడిన అనుబంధాన్ని పెళ్లితో చట్టబద్దం చేసుకుంటున్నవారూ లేకపోలే దు.. అయితే కొంతకాలం అనుబంధం తర్వాత విడిపోయి కూడా ఫ్రెండ్స్గా కొనసాగే వారూ ఉన్నారు.ఇటీవల యువ అనుబంధాలపై లయన్స్ గేట్ ప్లే అనే సంస్థ స్వతంత్ర అధ్యయనం నిర్వహించింది. ‘లయన్స్గేట్ ప్లే రిలేషన్ షిప్ మీటర్’ పేరిట విడుదల చేసిన అధ్యయన ఫలితాల్లో అత్యధికులు లివిన్ రిలేషన్ షిప్స్కి జై కొడుతున్నారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, సిటీబ్యూరోశాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడానికి బదులు వారు లివిన్ రిలేషన్ షిప్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలనే ఆధునికులు ఎంచుకుంటున్నారు. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి పెళ్లికన్నా లివిన్ రిలేషన్ షిప్లో ఉండటం మేలని 50 శాతం మంది అంటున్నారు. ఈ రిలేషన్ షిప్లో ఉండటానికి తల్లిదండ్రులు అంగీకరిస్తారని 34% మంది భావిస్తున్నారు.భార్య, భర్త కాదు.. ఓన్లీ ఫ్రెండ్స్..ప్రేమను కొనసాగించడానికి స్నేహమే మూలమని నవతరం నమ్ముతున్నారు. ఆ మధ్య ప్రేమ అంటే స్నేహం అని అర్థం చెప్పిన బాలీవుడ్ హీరో షారుఖ్ఖాన్ అభిప్రాయం సరైనదేనని 87 శాతం మంది పురుషులు 92 శాతం మహిళలు భావిస్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగొచ్చు అంటూ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ మాజీ ప్రియుడితో స్నేహం చేయడం మంచిదంటున్నారు. కేవలం 30% మంది భారతీయులు మాత్రమే తమ భాగస్వామి అపోజిట్ సెక్స్కి చెందిన క్లోజ్ ఫ్రెండ్ని కలిగి ఉండటం పట్ల అసౌకర్యంగా ఉన్నారు.ఎంపికలో కీలకం ఇవే..భాగస్వామి ఎంపికలో భావోద్వేగ సంబంధం కన్నా అందానికే 50 శాతం మంది పురుషులు ప్రాధాన్యత ఇస్తుండగా మహిళలు 35 శాతం మంది మాత్రమే లుక్స్కి విలువ ఇస్తున్నారు. ఆర్థికంగా సురక్షితంగా ఉండే రిలేషన్ షిప్లోకి మాత్రమే ప్రవేశించాలని 72 శాతం మంది భావిస్తున్నారు. ఇంటి ఖర్చులను జంటగా పంచుకోవాలని 50 శాతం మంది మహిళలు అంటుంటే 37 మంది పురుషులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు.బ్రేకప్.. వాట్ నెక్ట్స్?అనుబంధాలు ముక్కలయ్యాక ఏమిటి పరిస్థితి? హృదయం ముక్కలైపోతుందేమోనని, ఒంటరిగా ఉండడం కష్టమని, మళ్లీ ప్రేమ దొరకదేమోననే భయాల్లో 60 శాతం మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో పురుషులు ఎమోషనల్గా కనిపిస్తుండగా, మహిళలు ఆచరణాత్మకమైన విధానాన్ని ఎంచుకుంటున్నారు. 53% మంది మహిళలు ‘మాజీని మరచిపోయి ముందుకు సాగుదాం’ అనే వైఖరిని కలిగి ఉన్నారు. కానీ 66% మంది పురుషులు తమ మొదటి ప్రేమకు తిరిగి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.అలాగే 37% మంది విడిపోయిన తర్వాత కూడా భాగస్వామితో కలిసి ఒకే ఇంట్లో నివసించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. అయితే రిలేషన్ను తిరిగి నిర్మించుకోవడం కంటే ముగించుకోవడమే సులభమని 33 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల వారిలో 72% మంది 27 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల వారిలో 67% మంది అంగీకరిస్తున్నారు. అలాగే అనుబంధం ముగిశాక ముందుకు సాగడానికి కొత్త బంధాన్ని ప్రారంభించడం ఉత్తమమని 48% మంది భావిస్తున్నారు.తారా పథంలో..ఫ్యాషన్ల నుంచి ఎమోషన్ల వరకూ దేనికైనా సరే అపరిమితమైన ఫాలోయింగ్ రావాలంటే.. దాన్ని సెలబ్రిటీ ఆదరించాలి. ఈ లివిన్ రిలేషన్íÙప్ విషయంలో కూడా అదే జరిగింది. చాలామంది నటీనటులు ఇలా ‘కలిసి జీవించడం’ కనిపిస్తోంది. దాన్ని అనుసరిస్తూ కార్పొరేట్, ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పెళ్లికి ప్రత్యామ్నాయంగా యువత ఈ అనుబంధం ఏర్పరచుకుంటున్నారు. అప్పట్లో హాలీవుడ్లో బ్రాడ్పిట్, ఏంజెలినా జోలి నుంచీ ప్రీతిజింతా, సుస్మితాసేన్, సంజయ్దత్లతో పాటు కరీనా–సైఫ్ అలీఖాన్ ఇంకా ఎందరెందరో ఈ కల్చర్ని కలర్ఫుల్గా మార్చారు.నగరంలో స్థిరపడిన సంస్కృతి..వుయ్ ఆర్ మ్యారీడ్ అన్నంత సహజంగా వుయ్ ఆర్ ఇన్ రిలేషన్ షిప్ అంటున్నాయి జంటలు. ఆ అనుబంధం పేరే లివిన్. ‘లివింగ్ టు గెదర్’ తెలుగీకరిస్తే ‘సహజీవనం’. వివాహంతో పనిలేకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా, స్త్రీ–పురుషుడు కలిసి ఉండడమే ‘లివిన్ రిలేషన్íÙప్’. భిన్న సంస్కృతుల నిలయమైన నగర జీవనంలో వైవాహిక బంధానికి ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త సంస్కృతి స్థిరపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.పెరుగుతున్న మోసాలు.. గతంలో మహిళా కమిషన్ వర్గాలు వెల్లడించిన డేటా ప్రకారం.. లివ్ ఇన్కు సంబంధించిన మోసాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, తెలంగాణలోని రంగారెడ్డి ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో అగ్రగామిగా హైదరాబాద్ నిలిచింది. లివిన్ చీటింగ్ కేసుల్లో 47 శాతం ఒక్క హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా కౌన్సిలింగ్ కేంద్రాలకు ఒక్క ఏడాదిలోనే 2వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.జాగ్రత్తలు తప్పనిసరి..ఏదేమైనా తప్పుకాదనుకునో, తప్పనిసరిగానో ఈ అనుబంధంలోకి అడుగుపెడుతున్నవారు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. భాగస్వామి మరణించినా, మరే కారణం చేత దూరమైనా చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ‘లివిన్’ కొనసాగుతున్నప్పుడు అర్జించిన ఉమ్మడి ఆదాయాలకి సంబంధించిన ఒప్పందాలు, స్థిర, చరాస్తుల పంపకాలకు సంబంధించిన ఒప్పందాలను ముందుగానే రాసుకోవడం మంచిదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.పుట్టిన పిల్లలకు కూడా మున్ముందు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. అనూహ్యమైన ప్రమాదాలతో భాగస్వామి ఆస్పత్రి పాలైతే అవసరమైన సేవలు అందించడానికి, చికిత్సకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బాధితవ్యక్తి తల్లిదండ్రులు, బంధువుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. మెడికల్ పవర్ ఆఫ్ అటారీ్నని ముందుగా రాయడం ద్వారా అధిగమించవచ్చు.‘లివిన్’కు కారణాలెన్నో..నగరం ఈ తరహా బంధాలకు నెలవుగా మారుతోంది. సినిమా, మోడలింగ్, ఎంటర్టైన్మెంట్, టీవీ, మీడియా, ఐటీ, సాఫ్ట్వేర్.. రంగాలకు చెందిన యువతీ యువకులు ఈ అనుబంధంవైపు తేలికగా ఆకర్షితులవుతున్నారు.మహిళలు, పురుషులు ఎవరికి వారు వ్యక్తిగత కెరీర్ను, విజయాలను కోరుకోవడం, కెరీర్ను కొనసాగిస్తూనే భావోద్వేగపూరిత బలమైన అనుబంధాన్ని కోరుకుంటున్నారు.వ్యక్తిగత ఖర్చులు భరించలేక రూమ్ షేర్ చేసుకోవడంతో మొదలై ‘లివిన్’గా మారుతోంది.పబ్స్ నుంచి క్లబ్స్ వరకూ ‘స్టాగ్స్ నాట్ అలవ్డ్’ అని బోర్డు పెడతారు. దీంతో రోజుకొకర్ని వెంటేసుకుని వెళ్లేకన్నా.. స్థిరంగా ఉండే బాయ్ఫ్రెండ్/గరల్ ఫ్రెండ్ మిన్న అని భావించడం.పెళ్లిద్వారా పరస్పరం సంక్రమించే హక్కుల పట్ల భయం.చట్టబద్దమైన బంధంలోకి వెళ్లే ముందుగా తమ భాగస్వామిని అర్థం చేసుకోవాలనుకోవడం.ఈ కొత్త తరహా జీవనశైలి మానసిక సంఘర్షణకు, తీవ్ర ఒత్తిడికీ దారి తీస్తాయి. అద్దె ఇంటి దగ్గర్నుంచి ఆఫీసు వ్యవహారాల వరకూ పెళ్లికాని కాపురం చేయాలనుకునే యువత చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వివాహం కంటే బలమైన అనుబంధం తమ మధ్య ఉందనుకున్నప్పుడు మిగిలిన విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అలాగే ఆవేశంలోనో, ఫ్యాషన్గానో, సహజీవనంలోని లోతుపాతులు తెలియకుండా అడుగుపెట్టడం సహజీవనంలోకి అడుగుపెట్టడం మంచిది కాదు’ అంటారు రచయిత్రి ఓల్గా. ఫిర్యాదులు ఇలా..నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఫిబ్రవరి 18న ఈవెంట్ ఆర్గనైజర్ సేవలు అందించే 30ఏళ్ల మహిళ తన భాగస్వామి ఖాలిద్ చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.గత ఏప్రిల్ 1న గచ్చి»ౌలిలోని ఓ ఆపార్ట్మెంట్లో నివసిస్తున్న లివ్ ఇన్ కపుల్ మధ్య వ్యక్తిగత విబేధాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఆ అమ్మాయిది చత్తీస్గఢ్ కాగా అబ్బాయిది బీహార్ కావడం గమనార్హం.అనురాథారెడ్డి అనే మహిళ తనకన్నా వయసులో చిన్నవాడైన చంద్రమోహన్ అనే వ్యాపారితో రిలేషన్ షిప్లో ఉంటూ హత్యకు గురయ్యారు. ముక్కలైన ఈమె మృతదేహాన్ని గతేడాది మే 25న పోలీసులు కనుగొన్నారు.లివిన్ రిలేషన్ షిప్లో ఉంటూ తమ జల్సాలు తీర్చుకోవడం కోసం మ్యాట్రిమోనియల్ పేరిట అబ్బాయిలకు వలవేస్తున్న యువతిని, ఆమె లివిన్ పార్ట్నర్ని రాచకొండ పోలీసులు 2022 డిసెంబరు 18న అరెస్ట్ చేశారు.గతేడాది జూలై 23న ఫిలింనగర్కు చెందిన సెక్యూరిటీ గార్డ్ శివకుమార్ తన లివిన్ పార్ట్నర్తో వచి్చన విబేధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మహిళల పక్షపాతిగా మారిన కొన్ని చట్టాలు అబ్బాయిల్ని పెళ్లికి విముఖులుగా మార్చి, ఈ బంధం వైపు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది.ఆడవాళ్లకే నష్టం ఎక్కువ..ఏదేమైనా, ఇందులో పార్ట్నర్స్ ఇద్దరికీ ఎటువంటి హక్కులూ ఉండవు. ‘సహజీవనం’ విఫలమై మా వద్దకు వస్తున్న మహిళలు కొంత కాలం కలిసి జీవించాక విడిపోతే మనోవర్తి వస్తుందా? అని అడుగుతున్నారు. ఈ బంధానికి చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల ఆడవాళ్లకే నష్టం ఎక్కువ జరుగుతోంది. – నిశ్చలసిద్ధారెడ్డి, హైకోర్టు అడ్వకేట్ఇవి చదవండి: స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం.. -
ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా?
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ ప్రకాశ్ బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న నటి హిందీలో పలు సీరియల్స్లో నటిస్తోంది. ఆమె ప్రస్తుతం ఏక్తా కపూర్ సూపర్ నేచురల్ టీవీ షో నాగిన్- 6లో నటిస్తోంది. అంతేకాదు తేజస్వి ప్రకాష్ బిగ్బాస్-15 సీజన్ విజేతగా నిలిచింది. అయితే బిగ్బాస్ షోలో ఉన్న సమయంలోనే నటుడు కరణ్ కుంద్రాను ప్రేమించింది. గత మూడేళ్లుగా ఈ జంట డేటింగ్లో ఉన్నారు.తాజాగా వీరిద్దరు తమ ప్రేమ బంధానికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. కరణ్, తేజస్వీ దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్ చెప్పుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా వీరి మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తాయని.. దీంతో బ్రేకప్ నిర్ణయానికి వచ్చారని వారి సన్నిహితులు తెలిపారు. అయితే విడిపోయినట్లు వస్తున్న వార్తలపై తేజస్వీ ప్రకాశ్, కరణ్ కుంద్రా ఇప్పటివరకు స్పందించలేదు.అయితే ఇటీవలే కొద్ది రోజుల క్రితమే కరణ్, తేజస్వి ముంబయిలోని జంటగా కనిపించారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ వెలుపల ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. బ్రేకప్ రూమర్స్ నేపథ్యంలో ఇద్దరు జంటగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము విడిపోతున్నట్లు వార్తలు రావడంతో వాటికి చెక్ పెట్టేందుకే జంటగా కనిపించారా? అన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
తనకంటే చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసిందా?
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో సాహో చిత్రంలో మెప్పించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. స్ట్రీ-2, చందు ఛాంపియన్ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ తన అభిమానులను అలరించింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన కనిపించింది. అయితే ఈ చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా శ్రద్ధా కపూర్.. అతనితో ఉన్న ఫోటోలను ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో ఇంతకీ అతను ఎవరా? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే తు ఝూథీ మెయిన్ మక్కార్ సినిమా రిలీజ్ తర్వాత వీరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా పోస్ట్తో డేటింగ్పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ బీ టౌన్లో హాట్ టాపిక్గా మారింది. కాగా.. రాహుల్ మోడీ ప్యార్ కా పంచ్నామా 2, సోను కే టిటు కి స్వీటీ, ప్యార్ కా పంచ్నామా పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. మరోవైపు అతను శ్రద్ధా కపూర్ కంటే మూడేళ్లు చిన్న అని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్కు 34 ఏళ్లు కాగా..శ్రద్ధా కపూర్ 37 ఏళ్లు. కొద్దికాలంగా ఈ జంట పలు ఈవెంట్లలో సందడి చేశారు. దీంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్లో శ్రద్ధా, రాహుల్ జంటగా కనిపించారు. -
స్టార్ హీరోతో మమతా మోహన్ దాస్.. డేటింగ్పై ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్లో యమదొంగ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ మమతా మోహన్దాస్. మలయాళంతో పాటు తెలుగులోనూ నటించింది. వెంకటేశ్ సరసన చింతకాయల రవి చిత్రంలోనూ మెరిసింది. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన మమతా సినిమాలకు దూరమైంది. చాలా ఏళ్లపాటు క్యాన్సర్తో పోరాడి కోలుకుంది. గతేడాది రుద్రంగి సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం కోలీవుడ్లో మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వూలో ఆమె మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంపై గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెను తన పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించారు.మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. "నాకు మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన గుర్తింపుతో చాలా సంతోషంగా ఉన్నా. తాను నటించిన చిత్రాలకు ప్రశంసలు కూడా దక్కాయి. అందువల్లే తమిళం, తెలుగు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. మలయాళ ప్రేక్షకులు నాకు అండగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్ నాపై ప్రశంసలు కురిపించారు.' అని అన్నారు.డేటింగ్ గురించి మాట్లాడుతూ..'గతంలో లాస్ఎంజిల్స్లో ఉన్నప్పుడు ఒకరితో డేటింగ్లో ఉన్నా. కానీ ఆ రిలేషన్ ఎక్కువకాలం నిలవలేదు. లైఫ్లో రిలేషన్ అనేది ఉండాలి. కానీ దానివల్ల వచ్చే ఒత్తిడిని నేను కోరుకోవడం లేదు. అయితే జీవితంలో రిలేషన్ అనేది కచ్చితంగా అవసరమని నేను అనుకోవడం లేదు. ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూద్దాం. ప్రస్తుతం అయితే పార్ట్నర్ కోసం వెతుకుతున్నా. కాలంతో పాటే అన్ని విషయాలు ఎప్పుడో ఒకసారి బయటపడాల్సిందే' అని అన్నారు. మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ప్రస్తుతం మమతా నటించిన మహారాజా చిత్రంలో అనురాగ్ కశ్యప్, నట్టి నటరాజ్ కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదల కానుంది. -
స్టార్ హీరో కుమారుడితో నటి డేటింగ్.. వీడియో వైరల్!
బాలీవుడ్ భామ పాలక్ తివారీ గతేడాది కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ చిత్రంతో అలరించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో పూజా హెగ్డే లీడ్రోల్లో కనిపించింది. నటి శ్వేత తివారీ వారసులరాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గత ఏప్రిల్లో ఇబ్రహీం, పాలక్ తివారీ గోవా నుంచి తిరిగివస్తూ విమాశ్రయంలో కనిపించారు. అప్పటి డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పాలక్ తివారీ తాజాగా ప్రియుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఇంటివద్ద కనిపించింది. అతని ఇంటి నుంచి కారులో వెళ్తుండగా కెమెరాలకు చిక్కింది.ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పాలక్, ఇబ్రహీం డేటింగ్లో ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కరణ్ జోహార్ రాబోయే చిత్రం 'సర్జమీన్'చిత్రం ద్వారా ఇబ్రహీం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీ, సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటించిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. పాకిస్తాన్లో లాహోర్లో జరిగిన స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కించారు. అయితే సిరీస్లో షర్మిన్ సెగల్(ఆలంజేబ్) ప్రియుడిగా తహా షా బాద్షా నటించారు.అయితే తాజాగా అతను మరో నటితో డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్లో రూమర్స్ మొదలయ్యాయి. హీరామండి నటి ప్రతిభా రంతాతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో తనపై వస్తున్న వార్తలపై హీరామండి నటుడు తహా షా బాద్షా స్పందించారు. ఆమెతో పరిచయం కేవలం నటన వరకు మాత్రమేనని అన్నారు. ఆమెతో నా రిలేషన్ కేవలం షూట్ వరకే ఉంటుందని బాద్షా అన్నారు. ముందుగా నేను జీవితంలో స్థిరపడాలని.. ఆ తర్వాతే ప్రేమ, కుటుంబం గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. కాగా.. ముంబయిలో ఇద్దరు కలిసి డిన్నర్ డేట్లో కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చేశాడు. హీరామండిలో తాజ్దార్ పాత్రలో మెప్పించాడు. షర్మిన్ సెగల్ ప్రియుడిగా.. స్వాతంత్ర్య ఉద్యమ కారుడిగా ఈ సిరీస్లో మెప్పించారు. ఇటీవల జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తాహా షా బాదుషా సందడి చేశారు. ప్రతిభా రంతా హీరామండిలో షామా పాత్రలో కనిపించింది. -
బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్ఫ్రెండ్ శాంతను హజరికాతో బంధానికి గుడ్ బై చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఈ రూమర్స్కు మరింత బల చేకూరింది. అయితే ఈ విషయాన్ని శృతిహాసన్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.అయితే తాజాగా శృతిహాసన్ ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మి ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓ నెటిజన్ శృతి రిలేషన్షిప్ గురించి ప్రశ్నించారు. ప్రస్తుతం మీరు సింగిలా? లేదా కమిట్ అయ్యారా? అని నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి శృతి తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది.శృతి హాసన్ స్పందిస్తూ.. 'ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం నాకు సంతోషం అనిపించదు. కానీ నేను ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉన్నా. మింగిల్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నా. అందులోనే నేను ఆనందంగా ఉన్నా. ప్రస్తుతానికి నాకు ఇది చాలు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో శాంతను హజరికాతో బ్రేకప్ అయినట్లు క్లారిటీ ఇచ్చేసింది. గతంలో వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలొచ్చాక తొలిసారి శృతిహాసన్ స్పందించింది.కాగా.. శృతిహాసన్, శాంతను కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరూ ముంబయిలోనే సహజీవనం చేశారు. గతంలో ఎప్పటికప్పుడు తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకునేవారు. ప్రస్తుతం ఈ జంట విడివిడాగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. శృతిహాసన్ ప్రస్తుతం అడివి శేష్ సరసన డకాయిట్ చిత్రంలో కనిపించనుంది. ఆ తర్వాత చెన్నై స్టోరీ, సలార్ పార్ట్-2: శౌర్యంగ పర్వంలోనూ నటించనుంది. -
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ భామ జాన్వీకపూర్ దేవరలో జూనియర్ సరసన నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవలే తన కాబోయే వరుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాజాగా బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా గురించి మొదటిసారి నోరు విప్పింది దేవర భామ.జాన్వీ మాట్లాడుతూ..'నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడే శిఖర్ నా లైఫ్లోకి వచ్చాడు. మేమిద్దరం కలసి పెరిగాం. అతను నా కలలను తనవిగా ఫీలవుతాడు. అలాగే నేను కూడా అతని కలలు నా సొంతం అనుకుంటా. మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు మేము మద్దతుగా ఉంటాం' అని తెలిపింది. కాగా.. ఇటీవల ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఇలాంటి లక్షణాలు ఉండాలంటూ చెప్పుకొచ్చింది. గతంలోనూ బోనీ కపూర్ సైతం శిఖర్పై ప్రశంసలు కురిపించారు. మంచివాడని.. అందరితో త్వరగా కలిసిపోతారని తెలిపారు. జాన్వీతో పరిచయం కాకముందు ముందునుంచే శిఖర్ తనకు తెలుసని బోనీ అన్నారు. కాగా.. జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ ఈనెల 31న థియేటర్లలో సందడి చేయనుంది. -
బిగ్ బాస్ హౌస్లో డేటింగ్.. అప్పుడే బ్రేకప్ చెప్పేసుకున్నారా?
బిగ్ బాస్ సీజన్- 17తో ఫేమస్ అయిన జంట సమర్థ్ జురెల్- ఇషా మాల్వియా. గతేడాది జరిగిన షోలో వీరిద్దరు మరింత రెచ్చిపోయారు. ఏకంగా ఓకే బెడ్పై నిద్రించిన వీడియో అప్పట్లో తెగ వైరలైంది. హౌస్లో సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశారు. అంతే కాకుండా ఇది బిగ్బాస్ షోనా.. అడల్ట్ షోగా మార్చేశారా అంటూ మండిపడ్డారు. అదే హౌస్లో ఇషా మాజీ భాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఈ జంటపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఉదరియన్ అనే సీరియల్లో నటించే సమయంలో వీరి మధ్య రిలేషన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బిగ్బాస్ షో ద్వారా తమ రిలేషన్ నిజమేనని ధృవీకరించారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలకనున్నట్లు టాక్ వినిపించింది. ఈ జంట త్వరలోనే బ్రేకప్ కానుందని నెట్టింట తెగ వైరలైంది. కానీ ఈ రూమర్స్పై ఇషా కానీ, సమర్థ్ కానీ స్పందించలేదు. (ఇది చదవండి: 'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!) తాజాగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ అభిమాను జంట బ్రేకప్ కావడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే ఈ జంట బ్రేకప్కు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై మాత్రం బుల్లితెర జంట నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇషా మాల్వియా ఇటీవల పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. -
మెడలో బాయ్ఫ్రెండ్ నెక్లెస్.. దేవర భామ డేటింగ్ నిజమేనా!
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆ తర్వాత బుచ్చిబాబు- చెర్రీ కాంబోలో వస్తోన్న మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంలో మెరిసింది జాన్వీ. అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇటీవలే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అదే సమయంలో తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా వెంటే ఉన్నారు. అయితే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. అదే సమయంలో ఇటీవల ఆమె తండ్రి బోనీకపూర్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. శిఖర్ చాలా మంచివాడని ప్రశంసలు కురిపించారు. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ మైదాన్ సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లింది. అదే సమయంలో అక్కడున్న వారి పోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్ తన భాయ్ఫ్రెండ్ పేరు ఉన్న నెక్లెస్ను ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పేరుతో నెక్లెస్ జాన్వీ కపూర్ ధరించిన నెక్లెస్పై శిఖు అని రాసి ఉంది. ఈ పేరుతోనే జాన్వీ అతన్ని ముద్దుగా పిలుస్తుందట. అంతేకాదు మంగళవారం ఉదయం నటి శిఖర్ తల్లి స్మ్రుతి షిండేతో కలిసి బాంద్రా ప్రభాదేవిలోని సిద్ధివినాయక ఆలయానికి చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. మార్చిలో జాన్వీ తన పుట్టినరోజు సందర్భంగా శిఖర్తో కలిసి తిరుపతి బాలాజీ ఆలయానికి నడిచి వెళ్లారు. మోకాళ్లపై ఆలయ మెట్లను కూడా ఎక్కారు. ఇవన్నీ చూస్తుంటే శిఖర్ పహారియాకు జాన్వీ కపూర్ కుటుంబం ఓకే చెప్పినట్లు అర్థమవుతోంది. ఇటీవల జాన్వీ తండ్రి బోనీ కపూర్ మాట్లాడుతూ.. తమ జీవితంలోకి ఇలాంటి యువకుడు ఉన్నందుకు తాము ఆశీర్వదంగా భావిస్తున్నామని తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్ నిజమేనని తెలుస్తోంది. -
అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడం ఇష్టం : కృతి సనన్
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ వరుస హిట్లతో దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా'(Teri Baaton Mein Aisa Uljha Jiya) మూవీతో ఓ సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె నటించిన క్రూ(Crew)’ చిత్రం కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇలా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ పొడుగుకాళ్ల సుందరీ.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. డేటింగ్ కోసం ఓ మగాడు కావాలని, అది భారతీయుడు అయితే మరీ మంచిదని అంటోది ఈ పొడుగు కాళ్ల సుందరి. ‘శ్వేత జాతీయులు హాట్గా ఉండొచ్చు. కానీ నేను ఇప్పటి వరకు ఏ విదేశీయుడికి అంతగా ఎట్రాక్ట్ కాలేదు. నాకు భారతీయ మగాళ్లు అంటేనే ఇష్టం. దేశీ అయిన వ్యక్తితో నేను డేటింగ్కు ఇష్టపడతాను. హిందీ అర్థం చేసుకునే మగాడు అయితే ఒకే. నేను ప్రతిసారి ఇంగ్లీష్లో మాట్లాడలేను. ఇంగ్లీష్ పాటలకు డ్యాన్స్ కూడా చేయలేను. నాతో కలిసి పంజాబీ, హిందీ పాటలకు డ్యాన్స్ చేసే భారతీయ మగాడు కావాలి. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి నేను ఇష్టపడతాను’ అని కృతి సనన్ చెప్పుకొచ్చింది. కాగా, కృతి సనన్ ఇప్పటికే ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వయసులో తనకంటే 10 ఏళ్లు చిన్నవాడు, క్రికెటర్ ధోనీకి అత్యంత సన్నిహితుడైన కబీర్ బహియాతో ప్రేమాయణం సాగిస్తుందని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
మా డేటింగ్ మొదలైంది అప్పుడే!
‘నువ్వు కావాలయ్యా...’ అంటూ ‘జైలర్’లోని ప్రత్యేక పాటలో తమన్నా చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పాటల్లో ఇదొకటి. కాగా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అయితే తమన్నాతో దాదాపు ఇలానే అన్నారట. ‘నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అని చెప్పారట విజయ్. గత ఏడాది కొత్త సంవత్సరం పార్టీలో విజయ్, తమన్నా చాలా క్లోజ్గా కనిపించడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా సినిమాల్లో కూడా చేయనంతగా విజయ్ వర్మతో ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్లో ముద్దు సన్నివేశాల్లో నటించారు తమన్నా. ఆ సిరీస్లో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేమలో ఉన్నారేమోననే అభిప్రాయం పలువురికి కలగజేసింది. అయితే అప్పుడు కాదు.. అసలు డేటింగ్ మొదలైంది ఎప్పుడంటే అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు విజయ్ వర్మ, ఆ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ – ‘‘లస్ట్ స్టోరీస్ 2’ అప్పుడు మేం డేటింగ్లో లేము. ఆ షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ‘ర్యాప్అప్ పార్టీ’ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో తమన్నా, నేను, మరో ఇద్దరు పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీలోనే ‘నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అంటూ నా ఫీలింగ్ని తమన్నాతో చెప్పాను. ఆ తర్వాత మా ఫస్ట్ డేట్ సెట్ కావడానికి 20, 25 రోజులు పట్టింది’’ అని పేర్కొన్నారు. సో.. ప్రపోజ్ చేసిన 25 రోజులకు విజయ్, తమన్నాల డేటింగ్ మొదలైందన్న మాట. ఇక ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో ఒకరంటే మరొకరికి బాగా ఇష్టమన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. -
యానిమల్ హీరోయిన్తో డేటింగ్ చేయాలనుంది: నటుడు షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. రణ్బీర్కపూర్, రష్మిక జంటగా నటించిన బాక్సాఫీస్ను షేక్ చేసింది. పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో రష్మిక లీడ్ రోల్లో కనిపించగా.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. రణ్బీర్ కపూర్ ప్రియురాలిగా జోయా పాత్రలో మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. యానిమల్తో త్రిప్తి డిమ్రీకి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో మరో నటుడు సిద్ధాంత్ కర్నిక్ కీలక పాత్ర పోషించారు. రణబీర్ కపూర్ బావగా వరుణ్ ప్రతాప్ మల్హోత్రా అనే పాత్రను పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధాంత్.. త్రిప్తి డిమ్మీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెతో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను సిద్ధాంత్ వెల్లడించారు. రీల్ లైఫ్ నుంచి నిజ జీవితాన్ని వేరుగా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్తో పాటు మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, అమయా, తప్పడ్, ఆదిపురుష్ లాంటి చిత్రాల్లో కనిపించారు. మాహి వే, యే హై ఆషికి, ఏక్ థా రాజా ఏక్ థీ రాణి లాంటి సీరియల్స్లో నటించారు. -
తమన్నాతో డేటింగ్.. అప్పుడే మొదలైందన్న బాయ్ఫ్రెండ్!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్తో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. అంతే కాకుండా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్తో అలరించింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. అరణ్మణై- 4 అనే తమిళ చిత్రంతో పాటు స్ట్రీ-2 అనే మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉండగా గతేడాది తమన్నా తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మను అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు పెళ్లి గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమన్నాతో డేటింగ్ ఎప్పుడు ప్రారంభించారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. విజయ్ వర్మ మాట్లాడుతూ..' తమన్నా, నేను డేటింగ్ ప్రారంభించింది లస్ట్ స్టోరీస్-2 షూటింగ్లో కాదు. ఆ సమయంలో ర్యాప్ పార్టీ జరగాల్సింది. కానీ కుదరలేదు. మేమే నలుగురం కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నాం. ఆ రోజే తమన్నాకు అసలు విషయం చెప్పాను. నేను మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు ఆమెతో చెప్పా. ఆ తర్వాత మేం కలవడానికి దాదాపు 20 నుంచి 25 రోజులు పట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరు జంటగా నటించిన లస్ట్ స్టోరీస్-2 చిత్రంలో కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఆ మూవీ సమయంలోనే డేటింగ్ ప్రారంభించారని ఫ్యాన్స్ భావించారు. కానీ తాజాగా ఈ విషయంపై విజయ్ వర్మ క్లారిటీ ఇచ్చారు. కాగా.. కొన్ని రోజుల క్రితమే విజయ్ వర్మ, తమన్నా భాటియా జంటగా ఓ పార్టీకి వెళ్తూ కనిపించారు. కాగా.. కొత్త ఏడాదిలో విజయ్ వర్మ మర్డర్ ముబారక్ సినిమాతో అలరించాడు. గతేడాది జానే జాన్, దాహాద్, లస్ట్ స్టోరీస్-2 చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఉల్ జలూల్ ఇష్క్లో విజయ్ వర్మ కథానాయకుడిగా కనిపించనున్నారు. వీరిద్దరు డేటింగ్ గురించి తెలిసినప్పటీ నుంచి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని తెగ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాదిలోనైనా వివాహాబంధంలోకి అడుగుపెడతారో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. ఇటీవలే పెళ్లి కూతురులా తయారైన ఫొటోలను తన కాస్ట్యూమ్ డిజైనర్ ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారు, పెళ్లి కూతురులా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి కొందరైతే అంతా బాగానే ఉంది గానీ పెళ్లెప్పుడో? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. -
ఆన్లైన్ ప్రేమలు.. డేటింగ్ విత్ డిప్రెషన్!
ఆన్లైన్ ప్రపంచంలో ప్రేమలను వెతుక్కోవడం అంటే సముద్రంలో పారబోసుకున్న మంచినీళ్లను దోసిళ్లతో పట్టుకోవాలనుకోవడం లాంటిది. డిజిటల్ యుగంలో ప్రపంచం చిన్నదైనప్పటికీ మనుషుల మధ్య పెరుగుతున్న అంతరాలు ఒంటరితనం వైపుగా పయనిస్తున్నాయి. ఫలితంగా ఒంటరి మనసులు భావోద్వేగాల జడిని కనపడని వ్యక్తులతో పంచుకుంటున్నారు. డేటింగ్ యాప్లలో మహిళలు భాగస్వాముల కోసం వెతుకుతూ, వారితో మానసిక అనుబంధాలను పెంచుకొని, కొంతకాలానికి డిప్రెషన్కు గురవుతున్నారని, వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది అంటున్నారు మానసిక నిపుణులు. పెరుగుతున్న సమస్య... 35 ఏళ్లు దాటిన వసు (పేరుమార్చడమైనది) లక్షల వ్యాపారాన్ని సులువుగా నిర్వహించే స్టార్టప్ను రన్ చేస్తుంది. కానీ, మానసిక సంబంధాన్ని సరిగా నిర్వహించలేక డిప్రెషన్ బారిన పడింది. వసు తల్లి ఈ విషయాన్ని చెబుతూ ‘నా కూతురు సొంతంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతో పెళ్లి విషయంలో ఆలస్యం చేసింది. సెటిల్ అయ్యాక ఇక పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో డేటింగ్ యాప్లో ఒక అబ్బాయిని ఇష్టపడింది. అతను కూడా నా కూతురితో రోజూ ఆన్లైన్లో మాట్లాడుతుండేవాడు. ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్, వీడియో కాల్స్ చేసుకునేవారు. కానీ, కలవడానికి దూరంగా ఉండేవాడు. నా కూతురు అతనితో ఎమోషనల్గా అటాచ్ అయ్యింది. కానీ, ఆ అబ్బాయి సరైనవాడు అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే, కలుద్దామంటే అతను చూడటానికి రావడం లేదు. నా కూతురిని అతని నుంచి దూరంగా ఉంచాలంటే ఏం చేయాలో తెలియట్లేదు’అనేది ఆమె ఆవేదన.‘వర్చువల్ ప్రపంచంలో ప్రేమలు వెతికేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతున్న ఈ సమయంలో కూతుళ్ల పట్ల తల్లుల ఆందోళన కూడా పెరుగుతోంది’ అంటున్నారు రిలేషన్షిప్ కౌన్సెలర్ డాక్టర్ మాధవీ సేథ్. ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు. తెలివిగా వ్యవహరించాలి... ఈ రోజుల్లో తల్లులు చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కూతుళ్లు బాగా చదువుకుంటూ, బిజినెస్ ఉమెన్గా నిలదొక్కుకుంటున్నవారున్నారు. వారికి తమ మంచి చెడులు బాగా తెలుసు. అందుకని, వాళ్లు చాటింగ్ చేయడాన్ని లేదా అబ్బాయితో మాట్లాడడాన్ని నిషేధిస్తే మీ మాట వినరు. నిఘా పెడితే మీ పై నమ్మకం కోల్పోతారు. నమ్మకాన్ని గెలుచుకోవడం ద్వారా మాత్రమే మీరు మీ కూతురిని అర్థం చేసుకోగలరు. సమయం ఇవ్వండి.. స్త్రీ ఎంతటి సమర్థత, విజయం సాధించినా ప్రేమ విషయంలో చాలా ఎమోషనల్గా ఉంటుంది. కాబట్టి ఆమె అవతలి వ్యక్తి లోపాలను చూడలేదు. కానీ, తెలివిగా ఆమెకు నిజం చెప్పాలి. దీని కోసం మీరు మీ కుమార్తెతో సమయం గడపడం అవసరం. మొదట ఆమె ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అవును అయితే ఆ విషయం గురించి ప్రేమగానే మాట్లాడాలి. అబ్బాయిని ఇంటికి పిలవమని, అతని తల్లిదండ్రులను కలవడానికి ప్లాన్ చేయమని చెప్పాలి. తర్వాత నెమ్మదిగా సాక్ష్యాధారాలతో ఆ అబ్బాయి గురించి నిజాలను కూతురికి చెప్పాలి. నిజానికి ఈ విషయాలు చెప్పాలంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ‘ఆమె’ ఒంటరితనం ఫీలవుతుంది. ఆమెకు మీ ప్రేమపూర్వక మద్దతు అవసరం. ప్రతి పరిస్థితిలో మీరు ఆమెతో ఉన్నారని మీ కుమార్తెకు భరోసా ఇవ్వండి. వీలైతే మీ కూతురిని కొంతకాలం దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్లండి. దీనివల్ల ఆమె మానసిక స్థితిలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. వర్చువల్ ప్రపంచం నుండి బయటకు రండి... ఆన్లైన్ ప్రేమ కోసం వెతుకుతున్న యువత వర్చువల్ ప్రపంచం నుండి బయటపడి జనంతో కలిసి΄ోవాలి. ఒకటి లేదా రెండు రోజులు ఆన్లైన్ చాటింగ్ అవతలి వ్యక్తి గురించి ఎక్కువ సమాచారాన్ని అందివ్వవు. డేటింగ్యాప్లలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాస్తవ ప్రపంచంలో నిజమైన ప్రేమలను వెతుక్కోవాలి. ఒకరికొకరు పరస్పరం కలిసి మాట్లాడుకోవడంలో సాంత్వన ΄÷ందుతారు. ఇటువంటి వాటిలో మోసం, భయం ఉండవు. ప్రేమ సంబంధాలలో నమ్మకం ముఖ్యం. వర్చువల్... నిజాలు... లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధన ప్రకారం దాదాపు 70 శాతం మంది డేటింగ్ యాప్లలో భాగస్వాముల కోసం వెతుకుతున్న వ్యక్తులు డిప్రెషన్కు గురవుతున్నారనీ, అది వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోందని తేలింది. ఈ రోజుల్లో వ్యక్తులు తరచుగా సంబంధాలను వదులుకోవడానికి చాలా త్వరపడుతుంటారు. ఎందుకంటే, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఆ దిశగా అన్వేషణ చేయడం కూడా ఇందుకు కారణం అవుతుంటుంది. కోవిడ్ లాక్డౌన్ మార్పులు కూడా ఈ స్థితికి బాగా కారణమైంది. ఇంటి నుండి పని మొదలు డేటింగ్ యాప్లో రొమాన్స్ చేయడానికి ఓ కొత్తమార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. మరికొన్ని సూచనలు.. ∙ఒంటరిగా ఉండటం వల్ల కలిగే ప్రతికూలతలపై దృష్టి సారించే బదులు మీరు ఆనందించే అంశాలు, అది తెచ్చే స్వేచ్ఛపై దృష్టి పెట్టాలి ∙జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం, అభిరుచులవైపు మనసును మళ్లించాలి. కుటుంబం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సామాజికంగా కలవాలి... ► ఆన్లైన్ డేటింగ్లో మరొక వ్యక్తి జీవితాన్ని, సంబంధాలను, వివరాలను ఎప్పటికీ తెలుసుకోలేరు. సోషల్ మీడియా ΄ోస్ట్లో సంతృప్తికరమైన సంబంధంలా కనిపించేది నిజ జీవితంలో చాలా భిన్నంగా కనిపించవచ్చు ► ఒంటరిగా ఉన్నప్పుడు వర్చువల్ మీట్–అప్లను కూడా స్నేహితులతోప్లాన్ చేయడం మంచిది ►వారానికి కొన్నిసార్లు మీ ప్రియమైన వారితో ఫోన్లో చాట్ చేసినా, ఆన్లైన్లో ఇంటరాక్ట్ అవుతున్నా మీ ఒంటరితనం అనే భావన దూరం అవుతుంటుంది ►స్వచ్ఛంద సేవ, స్థానిక స్పోర్ట్స్ క్లబ్లలో పాల్గొనడం, రీడర్స్ క్లబ్.. వంటివి ఏర్పాటు చేయడం వల్ల ఒంటరితనం దూరం అవడమే కాదు, మనసులో ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం కూడా దొరకవచ్చు ► జీవితం ఒక రేస్ కాదు. ఒక నిర్దిష్ట వేగంతో జీవితంలోని మైలురాళ్లను చేరుకోవాల్సిన అవసరం లేదు. అన్నింటికన్నా ముందు మీకు మీరే ప్రియమైనవారని గుర్తుచేసుకోండి. డేటింగ్ యాప్లలోనే కాదు మీ ఆసక్తులు, లక్ష్యాలు, విలువలు పంచుకునే ఒంటరి వ్యక్తులు మీ చుట్టూ పుష్కలంగా ఉన్నారనే విషయం గ్రహించాలి. – డాక్టర్ మాధవీ సేథ్, రిలేషన్షిప్ కౌన్సెలర్ -
సీబీఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో... డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు
న్యూఢిల్లీ: టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం.. తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో, సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం మంచిదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సీబీఎస్ఈ నిర్ణయించుకుంది. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సీబీఎస్ఈ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్షిప్ వంటి ఛాప్టర్లను తమ 9వ తరగతి ‘వాల్యూ ఎడిషన్’ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపై ఇష్టం, కలిసి మెలసి ఉండటం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జతచేశారు. ‘డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్: అండర్స్టాండింగ్ యువర్సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్’ పేరుతో ఉన్న ఒక పాఠం, కొన్ని పదాలకు అర్ధాలు, ఇంకొన్ని భావనలపై మీ అభిప్రాయాలేంటి? అనే ఎక్సర్సైజ్ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలవంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే ‘క్యాట్ఫిషింగ్’, సంజాయిషీ లేకుండా బంధాన్ని హఠాత్తుగా తెగతెంపులు చేసుకునే ‘ఘోస్టింగ్’, ‘సైబర్ బులీయింగ్’ పదాలకు అర్ధాలను వివరిస్తూ చాప్టర్లను పొందుపరిచారు. ‘క్రష్’, ‘స్పెషల్’ ఫ్రెండ్ భావనలను చిన్న చిన్న కథలతో వివరించారు. -
డేటింగ్లో ఉన్నది నిజమే.. కానీ అతనితో కాదు..స్టార్ హీరోయిన్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంతో బిజీగా ఉంది. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈనెల 22న అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైంది కంగనా. అదే సమయంలో అక్కడే ఉన్న ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో ఓ ఫోటోకు పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగనా అతనితో డేటింగ్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట తెగ వైరలవుతున్న రూమర్స్పై కంగనా స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని చెప్పుకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని.. దయచేసి ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని కోరింది. అయితే తాను ఇంకో వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని.. సరైన సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని కంగనా కుండబద్దలు కొట్టింది. ఒక వ్యక్తితో ఫోటో దిగినంత మాత్రాన ఇలా మాట్లాడడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా.. ఇటీవలే అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కంగనా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్ వేదికగా పంచుకుంది. అయితే గతంలో ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఆ ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. అతను తన హెయిర్ స్టైలిష్ట్ అని కంగనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతలోనే మరోసారి అయోధ్య రామమందిర్ ప్రారంభోత్సవంలో కంగనా, నిషాంత్ ఫొటోలు వైరల్ కావడంతో రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. Yehi janmbhoomi hai param pujya Shri Ram ki, ek naye yug ka aarambh 🚩 pic.twitter.com/TBFAtWAYu3 — Kangana Ranaut (@KanganaTeam) January 22, 2024 -
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్లో ఉన్నాను: తాప్సీ
టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ మాత్రం తన ప్రేమ గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై తొలిసారి ఆమె మాట్లాడింది. దాదాపు పదేళ్ల నుంచి మాథిస్ బోతో ప్రేమలో ఉన్నానని ఇలా చెప్పింది. 'దక్షిణాది నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడింది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. ఆ సమయం నుంచి అతడి వెంటే నేను ఉన్నాను. అతనితో బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ నాకు రాలేదు. అతడి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు.' అని తాప్సీ చెప్పింది. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 13 ఏళ్లు అయ్యిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ప్రేక్షకాదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని ఆమె పేర్కొంది. అభిమానుల తనపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పింది. గతేడాదిలో షారుక్ ఖాన్తో 'డంకీ' చిత్రంలో తాప్సీ మెరిసింది. బాలీవుడ్లో ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. వహ లడ్కీ హై కహా, ఫిర్ అయీ హసీన్ దిల్రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాల్లో ఆమె నటిస్తుంది. (ఇదీ చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార) -
విజయ్-రష్మిక రిలేషన్పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య డేటింగ్ రూమర్స్ లాంటివి చాలా తక్కువ. కానీ విజయ్ దేవరకొండ-రష్మిక గురించి మాత్రం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కొన్నిరోజుల క్రితం అలానే వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకోనున్నారని టాక్ వినపడింది. ఫిబ్రవరిలో ఉంటుందని గోలగోల చేశారు. తీరాచూస్తే అలాంటిదేం లేదని తేలింది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి రహస్యంగా ఫారెన్ ట్రిప్కి వెళ్లొచ్చారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ ఫొటోల్ని చూపించి మరీ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'యాత్ర 2' సినిమాలో ఆ ముగ్గురి పాత్రలు కనిపించవా?) కన్నడ బ్యూటీ రష్మిక.. విజయ్ దేవరకొండతో కలిసి తొలిసారి 'గీతగోవిందం' మూవీలో నటించింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' అని మరో సినిమా చేశారు. ఈ రెండు చిత్రాల ఫలితం ఏంటనేది పక్కనబెడితే వీళ్ల మధ్య కెమిస్ట్రీ.. అభిమానులకు తెగ నచ్చేసింది. అదే టైంలో వీరిద్దరి గురించి డేటింగ్ రూమర్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. గతంలో మాల్దీవుల్ ట్రిప్కి కలిసి వెళ్లారని కొన్ని ఫొటోలతో సహా వైరల్ చేశారు. తాజాగా కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు. అది టూర్ అని తెలుస్తోంది కానీ ప్లేస్ ఎక్కడ అనేది అర్థం కాలేదు. ఇకపోతే తాజాగా రష్మిక కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇవన్నీ వియత్నాంలో దిగిన పిక్స్ అన్నట్లు పేర్కొంది. ఇప్పుడు వీళ్లిద్దరూ ఫొటోల్ని కాస్త అబ్జర్వ్ చేసిన కొందరు నెటిజన్స్.. విజయ్-రష్మిక కలిసి ఈ ట్రిప్కి వెళ్లారని, అది కూడా సీక్రెట్గా అని మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
మాజీ భర్త రెండో పెళ్లి.. 50 ఏళ్ల వయసులో హీరోయిన్ బ్రేకప్!
సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్లు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. బాలీవుడ్లో అయితే కాస్తా ఎక్కువగానే ఇలాంటి వార్తలు తరచుగా వస్తుంటాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఓ యంగ్ హీరోకు స్టార్ హీరోయిన్ దూరంగా ఉంటున్నట్లు లేటెస్ట్ టాక్. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ భామ మలైకా అరోరా. ప్రస్తుతం ఈ టాపిక్ బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న మలైకా.. ఇప్పటికే తన మొదటి భర్తతో అర్బాజ్ ఖాన్తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ కొనసాగిస్తోంది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న భామ.. 2019లో తమ రిలేషన్ను బయటపెట్టారు. గతంలో చాలాసార్లు ఈవెంట్లలో ఈ జంట కనిపించి సందడి చేశారు. తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఇటీవలే మలైకా తన స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంది. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లోనూ అర్జున్ కపూర్, మలైకా దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రేకప్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై బాలీవుడ్ భామ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. ఇటీవలే మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మలైకా అరోరాకు నటుడు అర్బాజ్ ఖాన్ 1998 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత అర్బాజ్, మలైకా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. -
సినిమా వాళ్లతో డేటింగ్ చేయను, ఎందుకంటే..: జాన్వీ కపూర్
శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. దఢక్ సినిమాతో హీరోయిన్ గా మారిన జాన్వీ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూబాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తుంది. త్వరలోనే టాలీవుడ్ తెరపై కూడా సందడి చేయబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో జాన్వీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే జాన్వీ ఆమె సోదరి ఖుషీ కపూర్ ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’కి గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డేటింగ్ పై తన అభిప్రాయం ఏంటో చెప్పింది. సినిమా వాళ్లతో డేటింగ్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పేసింది. ‘డేటింగ్ చేసేవాళ్లకు నేనే ప్రపంచమై ఉండాలి. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. సినీ రంగంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఒకే వృత్తిలో ఉండేవాళ్లు దాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం. అందుకే నేను సినిమా వాళ్లతో డేటింగ్ చేయను’అని జాన్వీ చెప్పుకొచ్చింది. (చదవండి: అమ్మ నన్ను తిట్టేది: జాన్వీ) -
అతనితో డేటింగ్.. నోరు జారిన దేవర భామ!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి చిత్రం ధడక్తో అలరించింది. గతేడాది బవాల్ చిత్రంలో మెరిసింది. తాజాగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన జాన్వీ కపూర్ ఫస్ట్లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా దేవర గ్లింప్స్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారుయ అయితే ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. తన సోదరి ఖుషి కపూర్తో కలిసి కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. కాఫీ విత్ కరణ్ సీజన్ -8 పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కరణ్ అడిగిన ప్రశ్నలకు జాన్వీ, ఖుషి ఆసక్తికర సమాధానాలిచ్చారు. (ఇది చదవండి: ఫ్యాన్స్కు పోస్టర్తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దేవర గ్లింప్స్ రెడీ) జాన్వీ కపూర్ను ప్రశ్నిస్తూ నీ స్పీడ్ డయల్ నంబర్స్లో ముగ్గురి పేర్లు చెప్పమని కరణ్ జోహార్ అడిగాడు. దీనికి ఆమె సమాధానమిస్తూ పాపా(నాన్న), ఖుషు, శిక్కు అని ఠక్కున చెప్పేసింది. దీనికి ఖుషీ, కరణ్ ఆశ్చర్యంగా జాన్వీ వైపు చూశారు. ఆమె సమాధానంతో నటుడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉందన్న విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో చాలాసార్లు జాన్వీ కపూర్, శిఖర్ పహారియా జంటగా చాలాసార్లు కనిపించారు. కానీ తమ రిలేషన్పై ఎక్కడా స్పందించలేదు. కాగా.. శిఖర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8' ఫుల్ ఎపిసోడ్ జనవరి 4న ఓటీటీ ప్లాట్ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం కానుంది. -
సినిమాల్లోకి జాన్వీ కపూర్ చెల్లెలు ఎంట్రీ.. అప్పుడే డేటింగ్ రూమర్స్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్ ఎక్కువ సినిమాల్లో కనిపించిన జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఆమె చెల్లెలు కూడా అక్కా బాటలోనే పయనిస్తోంది. శ్రీదేవి చచిన్న కూతురిగా ఖుషీ కపూర్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ది ఆర్చీస్ మూవీతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమాల్లో అలా ఎంట్రీ ఇచ్చిందో.. లేదో అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ది ఆర్చీస్ సహా నటుడు వేదంగ్ రైనాతో డేటింగ్లో ఉందంటూ బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఖుషీ కపూర్ తన మొదటి సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తుండగా.. మరోవైపు రూమర్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి.అయితే ఈ వార్తలను నటుడు వేదాంగ్ రైనా ఖండించారు. వేదాంర్ రైనా మాట్లాడుతూ ఖుషీ కపూర్, నేను చాలా సందర్భాల్లో కనెక్ట్ అయ్యాం. సంగీతంలో మా ఇద్దరికీ అభిరుచులు ఓకేలా ఉన్నాయి. అలాగని మేమిద్దరం డేటింగ్ చేయడం లేదు. ఆమెతో నాకు చాలా రోజుల నుంచి తెలుసు. మా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. ప్రస్తుతానికి నేను సింగిల్గానే ఉన్నా. ఆ టైం వస్తే నేనే మీ ముందుకొచ్చి చెబుతా' అన్నారు. కాగా.. ది ఆర్చీస్ మూవీలో ఖుషీతో పాటు అగస్త్య నందా, డాట్, మిహిర్ అహుజా, సుహానా ఖాన్ నటించారు. -
ప్రియురాలికి బ్రేకప్ చెప్పేసిన యంగ్ హీరో!
బాలీవుడ్ స్టార్, నిర్మాత సునీల్ శెట్టి పరిచయం అక్కర్లేని పేరు. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అహన్ శెట్టి. 2021లో తడప్(ఆర్ఎక్స్ 100 రీమేక్) అనే ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ తారా సుతారియా హీరోయిన్గా నటించింది. అయితే ప్రస్తుతం అహన్ శెట్టి తన ప్రియురాలితో బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 11 ఏళ్లపాటు మోడల్ తానియా ష్రాఫ్తో రిలేషన్షిప్లో ఉన్న అహాన్ వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. ఈ విషయంపై వారి సన్నిహితుడు మాట్లాడుతూ.. 'అహన్కు, తానియా చిన్నప్పటి నుంచి తెలుసు. వారిద్దరు ఓకే పాఠశాలలో చదువుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు పదకొండేళ్ల బంధానికి గత నెలలో ముగింపు పలికారు. ప్రస్తుతం ఈ జంట తమ జీవితంలో ఒంటరిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని' తెలిపారు. అయితే వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. తానియా ష్రాఫ్ పారిశ్రామికవేత్త జైదేవ్, రొమిలా ష్రాఫ్ల కుమార్తె. అయితే గతంలో అహాన్, తానియా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. View this post on Instagram A post shared by Ahan Shetty (@ahan.shetty) View this post on Instagram A post shared by Tania Shroff (@tania_shroff) -
'సహజీవనం' అంటే సులువుగా 'సెపరేట్ అయ్యే బంధమా?
సహజీవనం పేరుతో సాగించి బంధాలు చివరికి సన్నగిల్లి అంతం చేసుకునే స్థాయికి వెళ్లిపోతున్నాయి. ఏ ఉద్దేశ్యంతో కలిసి ఉండాలనుకున్నారో ఆ బంధమే వెక్కిరింపుగా మిగిలిపోతుంది. 'సహజీవనం' కాస్త సెపరేట్ అవ్వుతోంది. చివరికి మోసానికి కేరాఫ్ అడ్రస్గా మారి జీవితాలు అల్లకల్లోలంగా మారిపోతున్నాయి. ఇదెంత వరకు కరెక్ట్? పెళ్లి కంటే సహజీవనమే బెటర్ అనేది కొందరి యువత అభిప్రాయం. పైగా ఇరువురి అండర్స్టాండింగ్తో కలిసుంటాం కాబట్టి సమస్యలొస్తే సెపరేట్ అయిపోతాం. సులవుగా రిలేషన్ నుంచి బయటపడిపోవచ్చు అనుకుంటున్నారు. అలాంటప్పుడూ ఆ సహజీవనం ఎందుకు నేరాలకు తావిస్తోంది. చివరికి ఎందుకు విషాదాంతంగా మిగిలి అసహ్యమైన బంధాలుగా మిగిలిపోతున్నాయి అనేదాని గురించే ఈ కథనం!. సమాజంలో ఈ 'సహజీవనం' పేరుతో మోసపోతున్న యువతీయువకుల ఉదంతాలు రోజుకొకటి చొప్పున తెరమీదకు వస్తునే ఉన్నా వాటి ఉచ్చులోనే పడుతునే ఉంటున్నారు. కన్నవాళ్లకి, వారిని నమ్ముకున్న వాళ్లకి తీరని వ్యథని, ఓ కళంకాన్ని మిగిల్చి కటకటాల పాలవ్వడం లేదా చనిపోవడం జరుగుతోంది. అలాంటి ఉందంతమే మహారాష్ట్రలో ప్రియాసింగ్ అనే మహిళ విషయంలో చోటు చేసుకుంది. ఆమె సమాజంలో అత్యున్నత హోదాలో ఉన్న ఓ సీనియర్ బ్యూరోక్రాట్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్తో ఒకటి, రెండు కాదు ఏకంగా నాలుగన్నరేళ్లు సహజీవనం సాగించింది. పూర్తిగా నమ్మింది. కానీ అతడు తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని బయటపెట్ట లేదు. పోనీ ఆ విషయం ఆమె ఎలాగో తెలుసుకున్నాక అయినా కాస్త తెలివిగా బయటకొచ్చే యత్నం చేయక అతడిని మళ్లీ గుడ్డిగా నమ్మింది. ఎందుకిలా చేశావ్? అని అమాయకంగా ప్రశ్నించింది. వెంటనే అతడు మాటదాటేసి..తన భార్యతో విడిపోయనన్నాడు. త్వరలో విడాకులు తీసుకున్నాం. నేను నీతోనే ఉంటానని ప్రియాసింగ్కి కల్లబొల్లి మాటలు చెప్పాడు. ఇక్కడ అశ్వజిత్ తనకు పెళ్లై అయ్యిందనేది దాచేసినవాడు. తర్వాత చెప్పే ప్రతి మాట ఎంత వరకు నిజం అనేది ప్రియాసింగ్ ఆలోచించలేదా, అతడి మీద ఉన్న ప్రేమ లేదా వ్యామోహం ఆ స్థాయిలో ఆలోచించనివ్వ లేదో తెలియదు. కానీ ప్రియాసింగ్ మాత్రం అతడే ఏం చెప్పిన గుడ్డిగా నమ్మింది. ఉన్నటుండి తెల్లవారుఝామున ఫోన్ చేసి కలుద్దామని ప్రియాసింగ్ని ఫోన్ చేసి పిలిపించాడు అశ్వజిత్. లోకేషన్ కూడా షేర్ చేశాడు. తీరా ప్రియాసింగ్ అక్కడికి వెళ్లితే తన బాయ్ఫ్రెండ్ తన భార్య, దగ్గరి స్నేహితులతో కనిపించాడు. ఒక్కసారిగా షాక్కి గురైన ప్రియాసింగ్ ఏం అర్థంకాక కాసేపు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని భయంభయంగా అడిగింది. అందుకు నిరాకరించిన ఆ వ్యక్తి ఆమె ఎవరో తెలియనట్లు అరిచి, గొడవకు దిగాడు. పైగా తన స్నేహితులతో దుర్భాషలాడించాడు. చివరికి ఆమెపై దాడికి కూడా దిగాడు. ఏకంగా తన డ్రైవర్ చేత కారుని ఆమెపై పోనిచ్చి దారుణంగా గాయపరిచి అక్కడ నుంచి పరారయ్యాడు. చివరికి ఆమె తీవ్రగాయలపాలై ఆస్పత్రిపాలయ్యింది. పైగా తన బాయ్ఫ్రెండ్ మోసం చేశాడంటూ కేసు పెట్టింది. ఇక్కడ ఆమె బాయ్ఫ్రెండ్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కొడుకు. చాలా పరపతి, అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. ఇక్కడ ఆమెకు ఎంత వరకు న్యాయం జరగుతుందనేది కూడా తెలియదు. అస్సలు ఈ కేసు సవ్యంగా నడుస్తుందా? అన్నది కూడా అనుమానమే!. ఇరువురిలో ఎవరిది మోసం అనేది కూడా పోలీసులు విచారణలో పూర్తి స్థాయిలో తెలియాల్సి కూడా ఉంది. ఈ రిలేషన్లు చివరికి సుఖాంతమేనా..? సహజీవనం అనే అక్రమసంబంధాలు ఎప్పటికీ పూర్తి స్థాయిలో కడవరకు సవ్యంగా జరగవు. పెద్దలు కుదర్చిన పెళ్లి సంబంధాల్లోనే ఎన్నో సమస్యలు వచ్చి విడిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇంకా అక్కడ.. ఇరువైపుల బంధువుల సమక్షంలో పెళ్లి జరగుతుంది కాబట్టి కొద్దోగొప్పో న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సహజీవనం లాంటి సంబంధాల్లో తమకు ఎవరి మద్దతు, అండదండ లభిస్తుందో యువత ఆలోచించాలి. ఆ తర్వాత ఎదురయ్యే ఏ సమస్య అయినా అధిగమించగలం అనుకుంటేనే వీటి జోలికి వెళ్లండి. అలాగే ఇరువురికి ఒకరి నేపథ్యం గురించి ఒకరికి పూర్తి స్థాయిలో తెలుసుండాలి. మొదట్లో ఇద్దరి మధ్య ఏ చిన్న చోట మాట తేడావస్తున్నా.. ఒకరిమీద ఒకరికి ఉన్న మోజులో అది చిన్న విషయంగా కనపడుతుంది. ఎప్పుడైతే ఇరువురి మధ్య గొడవలొస్తోయే అప్పుడే ప్రతి విషయం పెద్ద పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. ఒక్కటి మాత్రం గుర్తించుకోండి ఏ బంధంలో అయినా దాపరికాలు ఉండకూడదు. అప్పుడే ఆ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొకటి ఇలాంటి (సహజీవనం)బంధాల వల్ల కచ్చితంగా మానసిక ప్రశాంతతకు దూరం అయ్యి మిమ్మల్ని మీరే కోల్పోతారు. సహజీవనం చేయాలనుకుంటే అవతలి వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉందంటేనే సాగించండి. అది కూడా హద్దుల్లోనే మీ స్నేహితులు లేదా కుంటుంబ సభ్యులకు కూడా ఆ వ్యక్తి గురించి తెలియజేయండి. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ రిలేషన్లో ఎలాంటి సమస్య వచ్చినా..మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మొదట్లో మీకు మద్దతు ఇవ్వకపోయినా, కనీసం మనకు ముందుగా తెలియజేసింది కదా! అన్న ఫీల్తో మనసు మార్చుకుని మీకు సపోర్ట్ లేదా సాయం చేసే అవకాశం ఉంటుంది. పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లగలం అనే నమ్మకం ఉంటే వాటి జోలికి వెళ్లండి. లేదంటే ఇంట్లో తల్లిదండ్రుల మాట విని వారు కుదిర్చిన పెళ్లి చేసుకోండి. ఎందులోనైనా సమస్యలు వస్తాయి. దీన్ని కాదనలేం. కానీ పెద్దల సమక్షంలో జరిగితే.. అన్యాయమైతే ఇంట్లో వాళ్లు ఆదుకుంటారు లేదా స్నేహితులైనా సాయం చేయగలుగుతారు. సమాజం నుంచి కూడా కొద్దోగొప్పో మద్దతు లభిస్తుంది. బహుజాగ్రత్తగా ఆలోచించి రిలేషన్స్ విషయంలో మంచిగా అడుగులు వేయండి. జీవితం గజిబిజి అయ్యి, నరకంగా మారదు. ఏదైనా మన చేతిలోనే ఉందనేది మరచిపోకండి. (చదవండి: పుట్టింటికి భారమై.. మెట్టింటికి దూరమై.. జీవితాన్ని యోగవంతం చేసుకుంది!) -
పార్టీలో మెరిసిన సీతారామం బ్యూటీ.. అతనితో డేటింగ్ నిజమేనా!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన పిప్పా అనే హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ తాజాగా ముంబయిలో తళుక్కున మెరిసింది. శిల్పాశెట్టి నిర్వహించిన దివాళీ బాష్లో సందడి చేసింది. అయితే శిల్పాశెట్టి పార్టీకి హాజరైన మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో కలిసి జంటగా కనిపించింది. అంతే కాకుండా అతని చేతిలో చేయి పట్టుకుని కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. మృణాల్ అతనితో డేటింగ్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్, అతనితో కలిసి ఓకే కారులో వెళ్లడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఓ నెటిజన్ రాస్తూ.. " మృణాల్, బాద్షా డేటింగ్లో ఉన్నారా? అంటూ కామెంట్ చేయగా.. మరొకరు 'వీరిని జంటగా నేను ఊహించలేదు ... వావ్ " అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ..'అతను ఇప్పటికే పెళ్లయినట్లు కనిపిస్తున్నారంటూ' కామెంట్ చేశాడు. ఓ నెటిజన్ ఏకంగా 'ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది' అంటూ రాసుకొచ్చారు. అయితే కొందరేమో ఈ జోడీ సెట్ కాలేదంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఇటీవలే టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోనుందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. -
బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
బాలీవుడ్ నటి తారా సుతారియా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అపూర్వ అనే చిత్రంతో అభిమానుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ, ధైర్య కర్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె తన బాయ్ఫ్రెండ్తో విడిపోయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. తన ప్రియుడు, నటుడు ఆదార్ జైన్తో విడిపోయిందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని తారా ధృవీకరించింది. తాను అతనితో రిలేషన్లో లేనని పేర్కొంది. కాగా.. మరోవైపు కార్తీక్ ఆర్యన్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాయ్ ఫ్రెండ్కు బ్రేకప్ అయినట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. తారా మాట్లాడుతూ.. "ఇలాంటివి వింటుంటే చాలా ఉత్సాహంగా ఉంది. నా గురించి ఇలా రాయడం చాలా బాగుంది. నిజ జీవితంలో నేను కూల్గా ఉండాలనుకుంటున్నా. అయితే ఈ వ్యక్తులందరితో నేను పనిచేశా. కానీ నాపై వస్తున్న అన్నీ రూమర్సే. ఎలాంటి నిజం లేదు. ఈ పుకార్లలో ఏదీ నిజం కాదు. ఒక్క వారంలోనే నేను ముగ్గురు వేర్వేరు వ్యక్తులను కలిశా. ఈ ప్రపంచంలోనే నాకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి విషయాల్లో నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఇలాంటివి చదివితే వాళ్లే నా దగ్గరకు వస్తారు. తీరిగ్గా టీ తాగుతూ మాట్లాడుకుంటామని' తెలిపింది. కాగా.. తారా సుతారియా నటించిన అపూర్వ నవంబర్ 15న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
శుభమన్తో సారా డేటింగ్.. నేను కాదన్న హీరోయిన్!
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ షోకు హాజరైంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ భామ అనన్య పాండేతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. శుభమన్తో డేటింగ్? అయితే ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్లో సారా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో మీరు శుభ్మన్ గిల్తో డేటింగ్లో ఉన్నారా? అంటూ సారాను కరణ్ అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానమిచ్చింది సారా అలీ ఖాన్. ఆ సారాను నేను కాదంటూ చెప్పేసింది. అందరూ నా పేరు వెనకాలే పడ్డారంటూ నవ్వేసింది. అంతే కాకుండా ఆదిత్య రాయ్కపూర్తో అనన్య డేటింగ్పై కూడా క్లారిటీ ఇచ్చింది. అనన్యకు ది నైట్ మేనేజర్ ఉన్నారంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. కాగా.. వెబ్ సిరీస్ నైట్ మేనేజర్లో ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. సారాపై రూమర్స్! ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా ఆడే అన్ని మ్యాచులకు సచిన్ కూతురు సారా టెండూల్కర్ హాజరవుతోంది. శుభ్మన్ గిల్ ఆడేటప్పుడు సారా హావభావాలు ఓ రేంజ్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా సారా సారా అంటూ గిల్ను ఆట పట్టిస్తున్నారు. ఇండియా ఆడిన ఓ మ్యాచ్లో సారా టెండూల్కర్ రావడంతో కెమెరాలు పదే పదే ఆమెను చూపించడం విశేషం. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం గిల్ బ్యాటింగ్ను అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) -
హీరోతో డేటింగ్.. నిజం బయట పెట్టేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ ఇటీవలే అనన్య పాండే ఇటీవలే తన పుట్టినరోజును జరుపుకున్నారు. తన రూమర్డ్ బాయ్ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కు వెళ్తూ వీడియోలో కనిపించారు. తాజాగా ఇండియాకు తిరిగొచ్చిన భామ కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. మరో నటి సారా అలీ ఖాన్తో కలిసి పాల్గొంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 'అసలు ఏంట్రా ఇదంతా.. ఏం చేస్తున్నారు హౌస్లో..'!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ షోలో పాల్గొన్న సారాను కరణ్ ఆసక్తిక ప్రశ్న వేశారు. ప్రస్తుతం అనన్య పాండే వద్ద ఉన్న వస్తువు ఏంటి? అని అడిగారు. దీనికి సారా స్పందిస్తూ 'ది నైట్ మేనేజర్' అంటూ సమాధానమిచ్చింది. అయితే ఇది విన్న అనన్య తెగ సిగ్గు పడిపోయింది. తాను అనన్య రాయ్ కపూర్గా భావిస్తున్నాను అంటూ మనసులో మాట చెప్పేసింది. దీంతో వీరిద్దరి రిలేషన్పై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్లో ఆదిత్య రాయ్ కపూర్ నటించారు. కాగా.. సారా అలీ ఖాన్ మెట్రో అనే చిత్రంలో కనిపించనుంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్తో స్క్రీన్ను పంచుకోనుంది. మరోవైపు అనన్య పాండే.. ఖో గయే హమ్ కహాన్ అనే చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత కాల్ మీ బే అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్లో కూడా నటించనుంది. (ఇది చదవండి: ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్ ఫ్రెండ్!) -
సార్.. ప్రేమలో పడ్డా కాస్త డబ్బు సర్దండి!
కోహిమా: రాజకీయ నాయకులకు తరచూ ఉద్యోగం, ఉపాధి, డబ్బు సాయం కావా లంటూ విజ్ఞాపనలు అందుతుండటం సహజంగా జరిగేదే. కానీ, ఓ యువకుడు మాత్రం తన కలల రాణితో ప్రేమ వ్యవ హారం సాగించేందుకు డబ్బు సర్దాలంటూ ప్రాధేయ పడ్డాడు. ఈ విడ్డూరం నాగాలాండ్లో చోటుచేసుకుంది. బీజేపీ నాగాలాండ్ అధ్యక్షుడు టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తనకు ఎదురైన అరుదైన అనుభవాన్ని స్వయంగా ‘ఎక్స్’లో వివరించారు. ఆయనకు అరవింద పాండా అనే ఓ యువకుడు పంపిన మెయిల్లో ఇలా ఉంది.. ‘సర్, ఈ నెల 31వ తేదీన నా గర్ల్ఫ్రెండ్తో మొద టిసారిగా డేటింగ్కు వెళ్తున్నాను. కానీ, ఇప్పటి వరకు నాకు ఉద్యోగం రాలేదు. దయవుంచి కొద్దిగా సాయం చేయండి. ఏదో ఒకటి చేయండి సార్’అని అందులో ఉంది. అందుకాయన, ‘ఎలాంటి సాయం కావాలో చెప్పండి’అంటూ బదులి చ్చారు. ‘ఎక్స్’లో అలోంగ్ పోస్టుకు నెటిజన్లు తమాషా వ్యాఖ్యలతో స్పందించారు. యువకు డితోపాటు డేటింగ్కు వెళ్లాలంటూ అలోంగ్కు ఒకరు సూచించగా, అతడికి డబ్బు సాయం చేయాలని మరొకరు కోరారు. లవర్ బోయ్ అరవింద పాండాకు ఎమ్మెల్యేగా అవకాశమి వ్వాలని, అతడికి ఉద్యోగమి వ్వాలని.. ఇలా రకరకాల సూచ నలు చేశారు. తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మరొకరు ఆ యువకుడికి తెలిపారు. ఆ యు వకుడు జీవితంలో కఠినమైన పాఠా లను నేర్చు కోవాల్సిన అవసరం ఉన్నందున ఆ వినతిని పట్టించుకోవద్దని కొందరు పేర్కొన్నారు. -
'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!
‘సమ్మోహనం’తో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా తన 37వ పుట్టినరోజును జరుపుకుంది. అక్టోబర్ 28న జన్మించిన ఈ హైదరబాదీ భామ తెలుగులో సైకో, అంతరిక్షం, హే సినామికా లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: పునీత్ రాజ్కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే కోలీవుడ్ హీరోతో మన హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మహా సముద్రం చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీని అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కించగా.. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చాలా సార్లు వార్తలొచ్చాయి. ఈ జంట లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా ఇద్దరు కలిసి పార్టీల్లో కనిపించడంతో వీరి రిలేషన్పై నిజమేనంటూ కథనాలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా అదితి బర్త్డే సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్స్టాలో విషెస్ చెప్పారు. ఈ ఒక్క పోస్ట్తో వీరిద్దరి రిలేషన్పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కోలీవుడ్ హీరో. అయితే ఈ ఫోటోను మహాసముద్రం డైరెక్టర్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీనంతటికీ కారణం నేనేనా? అంటూ కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ..' దీనికి కారణం నేనే అని అందరూ అనుకుంటున్నారు... అసలు ఏం జరుగుతోంది??' అంటూ అదితి, సిద్ధార్త్ ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. కాగా.. సిద్ధార్థ్ ఇటీవలే చిన్నా(చిత్తా) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అదితి ప్రస్తుతం గాంధీ టాక్స్, లయనీస్ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. (ఇది చదవండి: 'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్!) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔#Siddharth @aditiraohydari pic.twitter.com/vcXQcMrmvu — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2023 -
అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!
లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన కొత్త హీరోయిన్ అనన్య పాండే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది భామ. అయితే ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్లో ఉందంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా ఇటీవలే ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కెమెరాలకు చిక్కడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. (ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!) అయితే ప్రస్తుతం డ్రీమ్ గర్ల్-2 నటిస్తోన్న భామ ఆ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అతను ఎలా ఉండాలో వివరించింది. అతనిలో తాను కోరుకునే లక్షణాల గురించి వెల్లడించింది. కాగా.. అనన్య పాండే, ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్- 2 ఆగస్ట్ 25న శుక్రవారం విడుదలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని 2019 హిట్ ఫిల్మ్ డ్రీమ్ గర్ల్కి సీక్వెల్గా తెరకెక్కించారు. అనన్య మాట్లాడుతూ..' ఓ గాడ్. నాకు మా నాన్నే ఆదర్శం. నాకు కాబోయే వారు మా నాన్నలా దయగా, ప్రేమగా, ఫన్నీగా ఉండాలి. ఆయనే నాకు బెంచ్మార్క్. మా నాన్న అత్యుత్తమ వ్యక్తి. అందుకే అతనికి అలాంటి లక్షణాలే ఉండాలి. అయితే ఇటీవల నా సినిమాలు లేకపోవడంతో నా వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా వారి దృష్టి నా సినిమాలపై పెడతారేమో వేచి చూడాలి.' అని అన్నారు. ఆదిత్య రాయ్ కపూర్తో రిలేషన్పై మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే డ్రీమ్ గర్ల్-2 తర్వాత ఫర్హాన్ అక్తర్ చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించే సైబర్ థ్రిల్లర్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఇంతదాకా వచ్చాకా సిగ్గెందుకు? ప్రియుడితో అనన్య షికారు!) -
హీరోయిన్తో సింగర్ డేటింగ్.. వైరలవుతున్న ఇన్స్టా పోస్ట్!
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన అక్టోబర్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన భామ బనితా సంధు. ఆమె విక్కీ కౌశల్ నటించిన సర్దార్ ఉదమ్లో కూడా నటించింది. ఆ తర్వాత తమిళ చిత్రం ఆదిత్య వర్మలోనూ కనిపించింది. అంతే కాకుండా సీడబ్ల్యూ సిరీస్ పండోరలో నటించింది. అయితే తాజాగా ఆమె పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్తో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసిన పిక్స్తో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. (ఇది చదవండి: 'అశ్లీల వీడియోలు తీసి వేధించింది'.. హీరోయిన్పై సంచలన కామెంట్స్!) ముంబయిలో ఇటీవల రిలీజైన డాక్యు-సిరీస్కు కూడా ఆమె హాజరైన బనితా సంధు అతని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ముంబయిలోని హోటల్లో బనితా సంధు అతనితో ఉన్న సన్నిహిత ఫోటోలను కూడా పంచుకున్నారు. అంతే కాకుండా విత్ మీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సింగర్ అమృత పాల్ సింగ్ ధిల్లాన్ అలియాస్ ఏపీ ధిల్లాన్ పంజాబీ సంగీతంలో బాగా పేరు సంపాదించారు. ఇండో-కెనడియన్ రాపర్గా అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంటరీ సిరీస్, ఏపీ ధిల్లాన్: ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్తో మరింత ఫేమస్ అయ్యాడు. View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) -
నా జీవితంలో చేసిన చెత్త పని అదే: స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
మాన్సూన్ వెడ్డింగ్ హాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నటుడు రణదీప్ హుడా. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాలతో స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ రోజు రణ్దీప్ 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే అప్పట్లో మాజీ మిస్ యూనివర్స్, సుస్మితాసేన్తో డేటింగ్లో ఉండడం అందరినీ దృష్టని ఆకర్షించింది. బాలీవుడ్లో వీరిద్దరి రిలేషన్ హాట్ టాపిక్గా మారింది. 2006 నుంచి దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ ఈ జంట వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రణదీప్ హుడా సుస్మితాసేన్తో రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమెతో బ్రేకప్ కావడంపై రణ్దీప్ స్పందించారు. (ఇది చదవండి: మూడేళ్ల గ్యాప్, అయినా తగ్గేదేలే.. రెమ్యునరేషన్ డబుల్..) రణ్దీప్ హుడా మాట్లాడుతూ..' నేను 'మిస్ యూనివర్స్ సుస్మితా సేన్తో రిలేషన్లో లేను. అంతే కాదు ఆమెపై నాకు ఏ విధంగానూ ఫీలింగ్స్ లేవు. సుస్మిత సేన్ జీవితంలోకి నేను వెళ్లకూడదని కోరుకున్నందున.. నా జీవితంలో కేవలం ఒక థియేటర్ రిహార్సల్ను మాత్రమే కోల్పోయాను. నా విలువల పరంగా ఇది నేను చేసిన చెత్త పని అని భావించా. కానీ ఆమెతో బ్రేకప్ కావడం నాకు మంచే జరిగింది. ఎందుకంటే నేను పెద్ద స్టార్ను కూడా కాదు. కొన్నిసార్లు తాము అనుకున్న సొంత మార్గాల్లోనే వెళ్లడం ఉత్తమమైన పని. ఆ తర్వాతే నేనేంటో నాకు తెలుసొచ్చింది.' అని అన్నారు. అయితే సుస్మితా సేన్తో బ్రేకప్ తర్వాత కెరీర్లో బిజీగా మారిపోయారు. రణదీప్ హుడా ప్రస్తుతం 'స్వతంత్ర వీర్ సావర్కర్', 'లాల్ రంగ్ 2' చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు, సుస్మితా సేన్ ఇటీవలే విడుదలైన 'తాలీ' వెబ్ సిరీస్తో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సిరీస్లో ట్రాన్స్జెండర్స్ హక్కుల కోసం పోరాడే పాత్రలో కనిపించింది. (ఇది చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) -
పెళ్లికాని శ్రీమంతుడు.. రెడీ టూ మింగిల్ అంటున్నా పట్టించుకోని అమ్మాయిలు
అతనో బిలియనీర్.. అమెరికాలోని సంపనుల్లో అతడొకడు. పేరు బ్రియాన్ జాన్సన్. కండలు తిరిగిన దేహంతో చూడటానికి కూడా చాలా అందంగానే ఉంటాడు. పైగా ఆల్కహాల్ కూడా ముట్టుకోడు పక్కా హెల్తీ డైట్ను ఫాలో అవుతాడు. అయినా అతనికి ఇప్పటివరకు పెళ్లి కాలేదు. జీవితంలో ఓ తోడు కోసం బ్రియాన్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. కానీ ఏం చేస్తాం.. ఇప్పటికీ పెళ్లికాని కోటీశ్వరుడిగానే మిగిలిపోయాడు.ఇన్ని మంచి అలవాట్లు ఉన్న జాన్సన్ ఇంకా సింగిల్గానే ఉన్నాడు. చాలా సార్లు డేటింగ్కు పిలిచినా అమ్మాయిలు నో చెప్పి పారిపోతున్నారట. ఇంతకీ ఈ బిలియనీర్ పెళ్లి కహానీ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. బ్రియాన్ జాన్సన్.. అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. అందంగా ఉంటాడు, మద్యం కూడా తాగడు. కాలిఫోర్నియాకు చెందిన ఈ బిజినెస్మ్యాన్ వందల కోట్లకు అధిపతి. వయసు 45. పెళ్లీడు ఎప్పుడో వచ్చి వెళ్లిపోయింది కూడా. కానీ జాన్సన్కు ఇంకా పెళ్లి కాలేదు. భాగస్వామి కోసం అతను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడట. వందల కోట్లున్నా తన జీవితంలో ఇంకా అమ్మాయి లేదని తెగ ఫీల్ అవుతున్నాడు. వయసు మీద పడుతున్నా యంగ్గా కనిపించేందుకు బ్రియాన్ జాన్సన్ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కూడా. దీనికోసం ఏడాదికి ఏకంగా రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అయినా నో యూజ్.. అమ్మాయిలు ఇతను చెప్పే కండిషన్స్ విని దూరంగా పారిపోతున్నారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో జాన్సన్.. పెళ్లికోసం తను పడుతున్న ఇబ్బందులను వివరించాడు. కోట్లున్నా తనకింకా పెళ్లి కాలేదని, భాగస్వామి దొరకడం కష్టమైపోయిందని ఆవేదన చెందాడు. అతను ఏమన్నాడంటే.. ''నేను రాత్రి 8.30 గంటలకే నిద్రపోతాను. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపు కేవలం 2250 కెలోరీలనిచ్చే ఆహార పదార్థాలనే తీసుకుంటాను. రోజుకు ఐదు గంటలు ఏకాగ్రత, మంచి లైఫ్స్టైల్ కోసమే కేటాయిస్తాను. పక్కా న్యూటిషియన్లు చెప్పిన డైట్నే ఫాలో అవుతాను. దీంతో పాటు ముడుచుకొని పడుకోవడం నాకు అలవాటు. ఇదే విషయాల గురించి అమ్మాయిలతో ప్రస్తావిస్తే వాళ్లు షాకవుతున్నారు.మొదట డేట్కు వస్తామని చెప్పిన వాళ్లు నా కండిషన్స్ లిస్ట్ చూసి నో చెబుతున్నారు.అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకుముందు మద్యం తాగే అలవాటు కూడా ఉండేది. కానీ దానివల్ల అదనపు క్యాలరీలు వచ్చి బరువు పెరుగుతానని దీనికి కూడా దూరంగా ఉంటున్నా. అందం కోసం రోజుకు 111 ట్యాబ్లెట్స్ వేసుకుంటా. ఇన్ని చేస్తున్నా నాకింకా పెళ్లి కాలేదు'' అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు జాన్సన్. -
83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!
ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే దాదాపు 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు. అది కూడా తనకంటే వయసులో చిన్నదైన 29 ఏళ్ల నూర్ అల్పాల్లాతో ఓ బిడ్డకు స్వాగతం పలికారు. జూన్లో నూర్ అల్ఫాల్లా బిడ్డకు జన్మనివ్వగా.. రోమన్ పాసినో అని నామకరణం చేశారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. అల్ పాసినో అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో తన గర్ల్ ఫ్రెండ్ నూర్ అల్ఫాల్లాతో కనిపించారు. ఈ జంట కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది!) ప్రెగ్నెన్సీ సమయంలో అనుమానాలు? అయితే గతంలో నూర్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లు ప్రకటించగా.. నటుడు అల్ పాసినో అభ్యంతరం వ్యక్తం చేశారు. నూర్ ప్రెగ్నెన్సీ వార్తలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందిగా కోరాడని తెలిసింది. అంతేకాకుండా తనకు 83 ఏళ్ల వయసులో పిల్లలను కనడం ఇష్టం లేదని తెలిపాడు. అయితే నూర్ గర్భం ధరించిన విషయాన్ని చాలా రోజుల పాటు అల్ పాసినోకు తెలియకుండా దాచింది. మే 31న గర్భం ధరించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి చేసుకోకుండానే ముగ్గురితో సహజీవనం? అల్ పాసినోకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. అతనికి మొదట తన యాక్టింగ్ కోచ్ జాన్ టారెంట్ అనే మహిళతో సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఆ తర్వాత మరో నటి బెవర్లీ డి ఏంజెలోతో డేటింగ్ చేశారు. వీరికీ కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత అల్, బెవర్లీ 2004లో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగానే ఉంటున్నారు. ఆ తర్వాత అల్ పాసినో, నూర్ అల్ఫాల్లా ఏప్రిల్ 2022లో లాస్ ఏంజిల్స్లో కలిసి డిన్నర్ చేస్తుండగా.. మొదటిసారి ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. కొవిడ్ లాక్ డౌన్లో వీరిద్దరు డేటింగ్ ప్రారంభించారు. అల్ పాసినో తన తండ్రి కంటే పెద్ద వయసులో ఉన్నా.. అల్ఫాల్లా అతని వయస్సు అంతరాన్ని పెద్దగా పట్టించుకోదు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?) + Al and his girlfriend, Noor Alfallah, after dinner in Santa Monica. pic.twitter.com/6kCrePMDuf — Pacino's World 👑 (@worldpacino) August 2, 2023 -
ఒక్క ఏడాదిలోనే వందమంది బాయ్ఫ్రెండ్స్ను మార్చిన యువతి
పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నామంటేనే పేరెంట్స్ తాట తీసేస్తారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ప్రేమ విషయంలో చాలానే ఆంక్షలు పెడుతుంటారు. అబ్బాయిలకు దూరంగా ఉండమని, వీలైతే మాట్లాడటం కూడా చేయొద్దని కాలేజీ రోజుల నుంచే హితబోధ చేస్తుంటారు. కానీ బ్రిటన్కు చెందిన ఓ తల్లి మాత్రం దగ్గరుండి మరీ కూతురిని డేటింగ్కు పంపించింది. కూతురి ఖర్చుల కోసం 500 డాలర్లు కూడా ఇచ్చి హ్యాపీగా డేటింగ్ చేయమని ప్రోత్సహించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. ఎంత అప్గ్రేటెడ్ సొసైటీలో బతుకుతున్నా ప్రేమ విషయంలో తల్లిదండ్రుల వైఖరి కాస్త కఠినంగా ఉంటోంది. ఇప్పటికీ ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు బోలెడన్నీ ఆంక్షలు పెడుతుంటారు. కానీ బ్రిటన్కు చెందిన ఓ తల్లి మాత్రం కూతుర్ని డేటింగ్ చేయమని దగ్గరుండి మరీ పంపించింది. అలా ఒకరిద్దరిని కాదు, ఏకంగా వంద మందితో డేటింగ్ చేయమని, అలా చేస్తే డబ్బులు కూడా ఇస్తానంటూ షాకింగ్ ఆఫర్ను ప్రకటించింది. ఇంకేముంది కూతురు కూడా రెచ్చిపోయింది. తన అందంతో అబ్బాయిలకు గాలం వేసి ఒకరిద్దరితో కాదు, ఏకంగా 100మంది బాయ్ఫ్రెండ్స్ను మార్చేసింది. అది కూడా ఒక్క ఏడాదిలోనే కావడం విశేషం. ఈ విషయాన్ని యువతి సోదరి ఎలిస్ కేరొలీన్ టిక్టాక్లో షేర్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తల్లి ఇచ్చిన టాస్క్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఆ యువతికి ఆమె తల్లి గ్రాండ్గా వేడుకలు జరిపిందట. కేక్పై 100 నెంబర్ క్యాండిల్తో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారట. దుగా అనుకున్న ఒప్పందం ప్రకారం.. కూతురికి తల్లి ఐదందల డాలర్లు బహుమతిగా ఇచ్చిందట. కన్నతల్లి అయ్యిండి కూతురికి డేటింగ్ చేయమని ఎంకరేజ్ చేయడం ఏంటని ప్రశ్నించగా.. పెళ్లి తర్వాత తన కూతురికి మగవాళ్ల పట్ల భయం, అనుమానం ఉండకూడదని, అందుకే చాలామంది పురుషులతో డేటింగ్కు వెళ్లమని ప్రోత్సహించినట్లు మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్తో సెలవిచ్చింది. -
అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా
ఏంటి.. హీరోయిన్ రాశీఖన్నా లవ్లో పడిందా? అవును ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సినిమా సినిమాకు తనని మార్చుకుంది. ప్రారంభంలో బొద్దుగా ఉండేది కానీ తర్వాత స్లిమ్గా తయారై సెగలు పుట్టిస్తోంది. చాలామంది ఈమె సింగిల్ గానే ఉందనుకుంటున్నారు. కానీ తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. బ్రేకప్తో బరువు పెరిగా 'అప్పట్లో నేను ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నాను. అతడితో బ్రేకప్ అవ్వడం వల్ల డిప్రెషన్కి గురయ్యాను. దీనికి తోడు నాకు థైరాయిడ్ సమస్య ఉండటంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. చాలా ప్రయత్నించా, ఎన్నో వర్కౌట్స్ చేశా కానీ బరువు తగ్గలేదు. జిమ్ కోచ్ని మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా బరువు పెరగడంతో నేను చేస్తున్న సినిమాలపై ఎఫెక్ట్ పడింది' (ఇదీ చదవండి: దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?) డేటింగ్తో స్లిమ్గా 'మీరే చెప్పండి హీరోయిన్ బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయి? అయితే ఫైనల్గా నన్ను అర్థం చేసుకునే ఓ వ్యక్తి దొరికాడు. అతడితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాత అదేంటో గానీ బరువు తగ్గాను. స్లిమ్ అయ్యాను. చెప్పాలంటే నేను అనుకున్నట్లు మారాను.' అని హీరోయిన్ రాశీఖన్నా చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి అని చెప్పింది కానీ అతడు ఎవరో? ఏంటి? అనే విషయాలు మాత్రం బయటపెట్టలేదు. త్వరలో చెబుతుందేమో? ఆ మూవీస్తో బిజీ రాశీఖన్నా నటించిన తెలుగు సినిమాలు 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' గతేడాది విడుదలయ్యాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర అవి ఫెయిలయ్యాయి. ప్రస్తుతానికి తెలుగులో కొత్త చిత్రాలేం చేయడం లేదు. తమిళంలో రెండులో, హిందీలో 'యోధ' చిత్రం చేస్తోంది. ఈ ఏడాది 'ఫర్జీ' వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరించింది. ఇది పక్కనబెడితే అప్పుడప్పుడు పెళ్లి గురించి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. త్వరలో పెళ్లి ఏమైనా ప్లాన్ చేస్తుందోమో చూడాలి. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) -
స్టార్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్!
శ్రీవిష్ణు, రెబా మోనిక జంటగా నటించిన తాజా చిత్రం సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్ మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మించారు. జూన్ 29 న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టింది. చిన్న సినిమా అయినా సరే సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ మలయాళీ ముద్దుగుమ్మ రెబా మోనిక. మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ చక్కగా మాట్లాడేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రెబా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. (ఇది చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!) రెబా మోనిక మాట్లాడుతూ..' జెర్సీలో నానితో పనిచేసే అవకాశం వచ్చింది. కానీ నేను ఆయనకు కూడా అభిమానే. అల్లు అర్జున్కు నేను బిగ్ ఫ్యాన్. ఆయనకు మలయాళంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఆయను మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఏ హీరోకు లేని క్రేజ్ అల్లు అర్జున్కు మాత్రమే ఉంది. అల్లు అర్జున్ మూవీస్కు మలయాళంలో చాలా క్రేజ్ ఉంది.' అని అన్నారు. తెలుగులోకి రాకముందు మిమ్మల్ని ఒక స్టార్ హీరో డేట్కు పిలిచారని ప్రశ్నించగా రెబా మోనిక స్పందించింది. హీరో డేట్కు పిలవడంపై మాట్లాడుతూ..' అవును.. అలా జరిగింది. డేట్కు పిలిచారు.. కానీ నేను వెళ్లానా? లేదా అన్నదే ముఖ్యం. కానీ నేను వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చింది భామ. డేట్కు వెళ్లడమనేది తప్పుగా భావించాల్సిన విషయం కాదని. ' అని అన్నారు. (ఇది చదవండి: విజయ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాపై తమన్నా కామెంట్) -
అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్
స్మృతి మంధాన భారత క్రికెట్ జట్టులో ప్రముఖ క్రీడాకారిణి. మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గ్రౌండ్లోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే . క్రీజ్లో ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్ చేయడమే కాదు, మైదానం బయట కూడా అంతే చురుగ్గా కనిపించే ఈతరం అమ్మాయి. భారత ఓపెనర్గా ఎన్నో చూడచక్కటి ఇన్నింగ్స్లు ఆడిన స్మృతి సోషల్మీడియాలో కూడా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య తను బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్ ముచ్చల్తో డేటింగ్లో ఉన్నట్లు తరుచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా తన పుట్టినరోజును జులై 18న ఢాకాలో జరుపుకుంది. భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉండటంతో ఆమె అక్కడే ఈ వేడుకలను జరుపుకుంది. ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ కూడా ఢాకా వెళ్లి స్మృతి మంధానకు బర్త్డే శుభాకాంక్షలు చెప్పాడు. అది బాగా వైరల్ అయింది. (ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్ టైటిల్తో వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ!) ఈ వార్త మరిచిపోక ముందే తాజాగా పలాష్ ముచ్చల్తో సినిమా షూటింగ్ స్పాట్లో స్మృతి మంధాన కనిపించింది. బాలీవుడ్ కమెడియన్, నటుడు రాజ్పాల్ యాదవ్ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ప్రకటన కార్యక్రమంలో ఆమె మరోసారి తన బాయ్ఫ్రెండ్తో కనిపించింది. ఈ చిత్రానికి పలాష్ ముచ్చల్ మ్యూజిక్ కంపోజర్గానే కాకుండా డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాతో తొలిసారి నిర్మాతగా కూడా మారనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన ఫోటోలను కమెడియన్ రాజ్పాల్ యాదవ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. రెండు నెలల క్రితం, పలాష్ పుట్టినరోజు జరుపుకునేటప్పుడు, అతను తన చేతిపై 'SM 18' అని పచ్చబొట్టును గుర్తుగా రాపించాడు. స్మృతి మందన క్రికెట్ జెర్సీ నంబర్ '18' అనేది అందరికీ తెలిసిందే. అందుకే వీరిద్దరి డేటింగ్ చర్చ బాగా పాపులర్ అయింది. కానీ ఈ విషయంపై వీరద్దరూ బహిరంగంగా ఇప్పటికి వరకు ఒప్పుకోలేదు. అన్నీ సజావుగా జరిగితే వీరిద్దరూ త్వరలో శుభం కార్డుతో ఈ పుకార్లకు ఫుల్స్టాఫ్ పెడతారని సమాచారం. View this post on Instagram A post shared by Rajpal Naurang Yadav (@rajpalofficial) -
కమెడియన్తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
కోలీవుడ్ నటి గాయత్రీ శంకర్ సౌత్ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మామనితమ్, విక్రమ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గాయత్రీ 2012లో '18 వయసు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి.. 'నడువుల కొంజం పక్కత కానోమ్' అనే చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ హీరోయిన్పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అర్వింద్తో డేటింగ్లో కోలీవుడ్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. (ఇది చదవండి: కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) ఆమె ఇటీవల తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసిన ఫోటోను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఫోటోలో గాయత్రి, అరవింద్ ఎస్ఏను కౌగిలించుకుంటూ కనిపించింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇది చూసిన అభిమానులు ఈ జంట డేటింగ్లో ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇన్స్టాలో గాయత్రి రాస్తూ.. 'కమెడియన్గా అతని ఎదుగుదలను ప్రశంసించింది. అతని పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు. మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అసలు అరవింద్ ఎవరు? తన కామెడీతో అందరినీ నవ్వించే అరవింద్ ఎవరో తెలుసుకుందాం. అతని అసలు పేరు అరవింద్ సుబ్రమణ్యం. అందరూ అతన్ని అరవింద్ ఎస్ఏ అని పిలుస్తారు. ఈ స్టాండప్ కమెడియన్ మొదట 2013లో తమిళ చిత్రం ఆరంభం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు. యూట్యూబ్లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో ప్రేక్షకాదరణ పొందాడు. అరవింద్ మద్రాసీ డా లాంటి షోలో కూడా కనిపించాడు. ఆ తర్వాత 2020లో అమెజాన్ ప్రైమ్లో "ఐ వాజ్ నాట్ రెడీ డా" షోను విడుదల రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 'వీ నీడ్ టూ టాక్' అనే కామెడీ షోను ప్రదర్శిస్తున్నాడు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) -
ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగతో ప్రేమలో పడింది
ఆ దొంగ తొలుత ఆమె ఫోన్ ఎత్తుకెళ్లాడు. తరువాత ఆమె హృదయాన్ని దోచుకున్నాడు. ఒక బ్రెజిలియన్ యువతి తనను దోచుకున్న దొంగతో ప్రేమలో పడ్డానని వెల్లడించిన నేపధ్యంలో దొంగతనానికి కొత్త అర్థం వచ్చినట్లయ్యింది. ఇప్పుడు వీరిద్దరూ ఎవరూ విడదీయలేని జంటగా మారిపోయారు. ఆన్లైన్లో షేర్ అయిన ఈ జంటకు సంబధించిన వీడియోకు 2,32 వేలకుపైగా వీక్షణలు దక్కాయి. ఈ వీడియోలో ఈ జంట తమ ప్రేమ కథను వివరించారు. ‘ఆరోజు నేను.. అతను నివసించే వీధిలో నడుస్తున్నాను. అప్పుడు నా ఫోన్ చోరీ జరిగింది’ అని అంటూ ఇమాన్యులా బ్రెజిల్లో జరిగిన ఒక మీడియా సమావేశంలో తమ మొదటి కలయిక గురించి వివరించింది. మనసు మార్చుకున్నదొంగ ఆ రోజు దొంగ తన ఫోన్ను ఎలా తీసుకున్నాడో ఆమె గుర్తుచేసుకుంది. అతను ఆరోజు దోపిడీకి పాల్పడ్డాడని తెలిపింది. అయితే ఇది మరొకరి ఫోన్ నంబర్ను తెలుసుకునే మార్గం అని పేర్కొంది. అప్పటి వరకూ తనకు తెలియని జాకర్(దొంగ) మనసు మార్చుకున్నాడని ఇమాన్యులా చెప్పింది. తరువాత జాకర్ మాట్లాడుతూ తనకు గర్ల్ఫ్రెండ్ లేకపోవడంతో ఇబ్బందిగా అనిపించింది. ఆ సమస్యకు ఊహించని విధంగా పరిష్కారం దొరికింది అంటూ తమ మొదటి కలయికను జాకర్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఫోనులో తాను ఆమె ఫోటోను చూసినప్పుడు, ఆమె అందానికి ఫిదా అయ్యాను. ప్రతిరోజూ ఆమెను చూడాలనుకున్నాను. ఆమె ఫోను దొంగిలించినందుకు చింతించాను అని అన్నాడు. ఒక రిపోర్టర్ మాట్లాడుతూ ‘మీరు తొలుత ఆమె ఫోన్ను దొంగిలించారు. తరువాత ఆమె హృదయాన్ని దొంగిలించారు’ అని అన్నాడు. కాగా ప్రేమలో పడినవారిద్దరూ రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వీరి వ్యవహారంపై తల్లిదండ్రుల స్పందన ఏమిటో ఇంతవరకూ తెలియరాలేదు. వీరిద్దరి ప్రేమ కథపై ట్విట్టర్ వ్యాఖ్యానాలు లెక్కకు మించి ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఇది బ్రెజిల్లో మాత్రమే సాధ్యం’ అని ఒకరు పేర్కొనగా ‘ప్రేమ ఏదైనా సాధించగలదు’ అని మరొకరు చమత్కరించారు. ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్స్ రిచర్డ్ రామిరేజ్, జాన్ వేన్ గేసీ వంటి నేరస్తులకు పలువురుస్త్రీలు ఆకర్షితులయ్యారు. అంటే నేరాలకు ఆకర్షణకు సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. 2015లో సెక్యూరిటీల మోసం కేసులో అరెస్టయిన ఫార్మా బ్రో మార్టిన్ ష్క్రెలీతో ప్రేమలో పడిన బ్లూమ్బెర్గ్ రిపోర్టర్ క్రిస్టీ స్మిత్ తన భర్తకు విడాకులు ఇచ్చి అతనితో ఉంటోందనే వార్తలు వినిపించాయి. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. É só no Brasil mesmo….kkkkkkkkkkk. pic.twitter.com/EmrqKfUzZM — Milton Neves (@Miltonneves) July 21, 2023 -
నటితో డేటింగ్.. నాకంత టైం కూడా లేదు!
బిగ్ బాస్ ఫేమ్, బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది. బాలీవుడ్లో సీరియల్స్తో పాటు పలు చిత్రాల్లో నటించింది. అయితే షెహనాజ్ గిల్ బిగ్ బాస్- 13లో తన సహ-కంటెస్టెంట్, బాలికా వధు నటుడు సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఊహించని విధంగా సిద్ధార్థ్ శుక్లా కథ విషాదాంతంగా మారింది. అనుకోని విధంగా సిద్ధార్థ మరణించాడు. ఆ తర్వాత షెహనాజ్ గిల్ మరొకరితో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స వినిపించాయి. మరో నటుడు రాఘవ్ జుయల్తో డేటింగ్లో ఉందని బీటౌన్లో గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు రాఘవ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా షెహనాజ్తో రిలేషన్పై నోరు విప్పారు. రాఘవ్ మాట్లాడుతూ..'రాబోయే కొద్ది నెలల్లో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పనులతోనే నేను బిజీగా ఉన్నా. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నా. ఎవరితోను రిలేషన్లో లేను. నాకు ఒకరిని ప్రేమించేందుకు, రిలేషన్లో కొనసాగించేంత టైం కూడా లేదు.' అని అన్నారు. కాగా.. సిద్ధార్థ్ మరణం తర్వాత షెహనాజ్ రెండు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ సల్మాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'తో రీ ఎంట్రీ ఇచ్చింది. కాగా.. షెహనాజ్, రాఘవ్ జుయల్ ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ పలుసార్లు జంటగా కనిపించారు. దీంతో వీరిపై డేటింగ్ రూమర్స్ పెద్దఎత్తున ఊపందుకున్నాయి. View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) -
డేట్కి వెళ్లిన మెగా కపుల్.. ఆ ఫొటోలు వైరల్
మెగాహీరోల్లో వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్. సినిమాలు విభిన్నంగా చేస్తుంటాడు. బయట కూడా పెద్దగా కనపడడు. వివాదాలు జోలికి అయితే అసలు పోనేపోడు. అలాంటి వరుణ్.. కొన్నిరోజుల ముందు హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు. ఈ ఏడాది వీళ్ల పెళ్లి ఉండనుందని తెలుస్తోంది. ఇప్పుడు వీళ్లిద్దరూ డేట్కి వెళ్లారు. (ఇదీ చదవండి: 'బేబీ' హిట్ అవడానికి అదే కారణం: విజయ్ దేవరకొండ) 'మిస్టర్' సినిమాలో తొలిసారి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి నటించారు. ఆ మూవీ హిట్ అవ్వలేదు కానీ వీళ్ల లైఫ్ మాత్రం సూపర్హిట్ అయింది. అప్పుడు ప్రేమలో పడ్డ వీళ్లిద్దరూ ఇన్నేళ్ల పాటు తమ బంధాన్ని సీక్రెట్గా మెంటైన్ చేస్తూ వచ్చారు. కొన్నిరోజుల ముందు పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇకపోతే పెళ్లికి ముందే చిల్ అవుతున్న ఈ జంట.. ఈ మధ్య ఇటలీ వెళ్లొచ్చారు. ఇప్పుడు సరదాగా అలా కాఫీ డేట్కి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని తమ తమ ఇన్ స్టా స్టోరీల్లో షేర్ చేశారు. వరుణ్ ఇన్ స్టాలో లావణ్య పిక్, లావణ్య ఇన్ స్టాలో వరుణ్ తేజ్ ఫొటోలు కనిపించడం మెగాఫ్యాన్స్ సంతోషానికి కారణమైంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ తెగ లైకులు కొట్టేస్తున్నారు. (ఇదీ చదవండి: నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!) -
డేట్ నైట్
‘‘బాగా నిద్రపోవాలని ఫిక్స్ అయినప్పుడు కడుపులో ఉన్న బిడ్డ డ్యాన్స్ పార్టీ పెట్టుకోవాలని ఫిక్స్ అయితే.. ఇక నిద్ర ఎలా పోతాం’’ అంటూ చిరనవ్వులు చిందిస్తూ తన ప్రెగ్నెన్సీ తాలూకు ఆనందాన్ని ఇటీవల ఇలియానా పంచుకున్న విషయం తెలిసిందే. ‘‘నేను తల్లిని కాబోతున్నా’’ అని ఇలియానా ప్రకటించినప్పటి నుంచి తండ్రి వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఆ మధ్య ఓ వ్యక్తి ముఖాన్ని బ్లర్ చేసి, ఇలియానా ఆ ఫొటోను షేర్ చేశారు. సోమవారం స్పష్టంగా ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘డేట్ నైట్’ అంటూ ఆ వ్యక్తితో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే అతని పేరు, ఇతర వివరాలేమీ ఇలియానా బయటపెట్టలేదు. ‘డేట్ నైట్’ అన్నారు కాబట్టి అతను ఇలియానా బాయ్ఫ్రెండ్ అని స్పష్టమవుతోంది. మరి.. రహస్య వివాహం ఏమైనా చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. -
స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. కానీ ఆమె చెల్లెలు షమితా శెట్టి కొద్దిమందికే తెలుసు. బాలీవుడ్లో మొహబత్తీన్ మూవీ ఎంట్రీ ఇచ్చిన భామ తెలుగులోనూ పిలిస్తే పలుకుతా చిత్రంలో నటించింది. అంతే కాకుండా హిందీ బిగ్బాస్లో పాల్గొన్న సందడి చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ చిత్రంలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మపై బీ టౌన్లో డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని గాసిప్స్ గుప్పమంటున్నాయి. ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్లో కనిపించడంతో ఈ వార్తలు హాట్ టాపిక్గా మారాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అమీర్ అలీ స్పందించారు. (ఇది చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్) అమీర్ అలీ మాట్లాడుతూ..' నేను ఒంటరిగా ఉన్నానంటే డేటింగ్లో ఉన్నట్లు కాదు.. నేను ఎవరితోనైనా బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి వార్తలొస్తున్నాయి. నేను నా స్నేహితులతో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్తాం. అంతే కాదు నా ఫ్రెండ్ బర్త్డే వేడుకల కోసం రెస్టారెంట్కు వెళ్లాం. అదే సమయంలో నా స్నేహితురాలు షమితాశెట్టి కూడా వచ్చింది. అదే సమయంలో నేను ఆమెను డ్రాప్ చేయడానికి వెళ్లా. అంతే మరుసటి రోజే నా ఫ్రెండ్ ఫోన్ మీరు ఆమెతో డేటింగ్లో ఉన్నట్లు విన్నానంటూ చెప్పాడు. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. మేము ఇప్పటికీ మంచి స్నేహితులం. నేను ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోను. నేను వాటి గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకెళ్లలేను.' అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు అమీర్ అలీ. కాగా.. అమీర్ అలీ 'ఎఫ్ఐఆర్', 'ఢిల్లీ వలీ ఠాకూర్ గర్ల్స్', 'సరోజినీ-ఏక్ నయీ పెహల్' వంటి షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా నాచ్ బలియే, 'జరా నచ్కే దిఖా 2' లాంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. అతను తన మొదటి భార్య సంజీదా షేక్తో విడాకులు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే అమీర్ షమితా శెట్టితో కనిపించడంతో డేటింగ్ పుకార్లు వ్యాపించాయి. తాజాగా కామెంట్స్తో రూమర్స్కు చెక్ పెట్టాడు. (ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది) View this post on Instagram A post shared by Shamita Shetty (@shamitashetty_official) -
ప్రెగ్నెన్సీతో పోకిరీ భామ.. బాయ్ ఫ్రెండ్ ఫోటో షేర్ చేసిన ముద్దుగుమ్మ!
పోకిరీ భామ ఇలియానా గురించి టాలీవుడ్కు పరిచయం చేయాల్సిన పనిలేదు. దేవదాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పోకిరీ మూవీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్గా నిలవడంతో ముద్దుగుమ్మకు అవకాశాలు అంతేస్థాయిలో వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఇలియానా ఇప్పటి వరకు ఆమె భాయ్ఫ్రెండ్ ఎవరో బయటపెట్టలేదు. ఇటీవల ఇన్స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాటితో ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది భామ. (ఇది చదవండి: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా!) తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన తర్వాత కానీ ఎవరితో రిలేషన్ ఉందనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు. అయితే తాజాగా తన ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్న ఇలియానా.. తన భాయ్ఫ్రెండ్ను ఫోటోను పంచుకుంది. డేట్ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి అతనితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అయితే పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్తో ఇలియానా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సోషల్ మీడియా పోస్ట్ చిత్రాలలో ఉన్న వ్యక్తి సెబాస్టియన్ కానందున ఊహాగానాలకు తెరపడింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పటిలోగా తన భాయ్ఫ్రెండ్ పేరును ప్రకటిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రెగ్నెన్సీకీ బాలీవుడ్లో వెబ్ సిరీస్ల్లో నటించింది. (ఇది చదవండి: ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్) -
'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!
Ananya Pandey Aditya Roy Kapoor: టాలీవుడ్లో తక్కువ గానీ బాలీవుడ్లో మాత్రం హీరోయిన్లు డేటింగ్, బాయ్ ఫ్రెండ్స్ విషయంలో ముందుంటారు. ఇప్పుడున్న స్టార్ హీరో హీరోయిన్లు దాదాపుగా డేటింగ్-రిలేషన్ లాంటి వాటిలో ఉండి వచ్చినవాళ్లే. వాళ్ల గురించి ఇప్పుడేం చెప్పట్లేదు. హీరోయిన్ అనన్య పాండే మాత్రం ప్రస్తుతం ఓ హీరోతో సీరియస్ డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని బయటపెట్టేసింది కూడా. హీరోయిన్గా నో హిట్ సాధారణంగా హీరోయిన్ అయిన తర్వాత ఒకటి కాకపోతే మరో సినిమాతో అయినా హిట్ కొడతారు. అందుకోసం ప్రయత్నిస్తారు. కానీ అనన్య పాండేని చూస్తే అలా అస్సలు అనిపించదు. ఎందుకంటే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వో, కాలీ పీలీ, గెహ్రాయాన్, లైగర్ చిత్రాల్లో నటించింది. కానీ వీటిలో ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్కి అవమానం!) రెండో బాయ్ ఫ్రెండ్ తండ్రి చుంకీ పాండే నటుడు కావడంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అనన్య పాండే.. సక్సెస్ కంటే డేటింగ్ రూమర్స్తోనే ఎక్కువ పాపులర్ అయింది. గతంలో హీరో ఇషాన్ కట్టర్ తో 'కాలీ పీలీ' సినిమా చేసింది. షూటింగ్ సమయంలో వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు, ఆ తర్వాత విడిపోయారని సమాచారం. ఇప్పుడు హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. స్పెయిన్లో హగ్గులు గతేడాది దీపావళి సందర్భంగా హీరోయిన్ కృతిసనన్ పార్టీ ఇచ్చింది. అప్పుడు లీక్ అయిన ఓ ఫొటో వల్ల అనన్య-ఆదిత్య డేటింగ్ విషయం బయటపడింది. ఇప్పుడు వీళ్లిద్దరూ స్పెయిన్లోని ఓ కన్సర్ట్ చూడటానికి వెళ్లారు. ముంబయి నుంచి విడివిడిగానే వెళ్లినప్పటికీ ఇన్ స్టాలో స్టోరీలు పోస్ట్ చేయడంతో ఒకేచోట ఉన్నారని అందరికీ అర్థమైంది. అలానే ఓ బ్రిడ్జిపై హగ్ చేసుకున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీళ్ల డేటింగ్ నిజమని తేలిపోయింది. Maro mujhe #AdityaRoyKapur #AnanyaPanday pic.twitter.com/RjSEwhGEYM — Alyaa 💕 (@birdiealyaa) July 12, 2023 (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఎప్పటికీ తనని క్షమించను: సింగర్) -
పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?
Harshvardhan Sanjeeda Dating: సాధారణంగా టాలీవుడ్లో హీరోయిన్లకు అవకాశాలు తక్కువని అంటారు. చాలావరకు అది నిజమేనని అనుకుంటారు. కానీ ఓ తెలుగు నటుడికి కూడా ఇక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. దీంతో బాలీవుడ్కి వెళ్లిపోయాడు. అక్కడే హీరోగానూ నటిస్తూ బిజీ అయిపోయాడు. ఇప్పుడు అతడు ఏకంగా ఓ పెళ్లయిన నటితో కలిసి డేటింగ్ చేస్తున్నాడు. కొన్ని ఫొటోలు వైరల్ అయ్యేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: 'సలార్' vs 'జవాన్'.. ఇదెక్కడి గొడవరా బాబు!?) రాజమండ్రి కుర్రాడు హర్షవర్ధన్ రానే.. తెలుగులో అవును, ఫిదా, గీతాంజలి, బెంగాల్ టైగర్ తదితర సినిమాల్లో నటించాడు. కానీ మన డైరెక్టర్స్ ఎవరూ ఇతడిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బాలీవుడ్లో ట్రై చేశాడు. అక్కడ క్లిక్ అయిపోయాడు. దీంతో హిందీలో వరసగా సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఇతడు.. లేడీ యాక్టర్స్ కిమ్ శర్మ, మీనాక్షి దాస్ తో డేటింగ్ చేశాడు. వాళ్లతో ఎందుకో ఇతడికి సెట్ కాలేదు. దీంతో విడిపోయారు. ఇప్పుడు మాత్రం హిందీ నటి సంజీదా షేక్ తో డేటింగ్ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ కలిసి తాజాగా టూర్కి వెళ్లారు. సంజీదాకు ఇప్పటికే పెళ్లయి విడాకులు కూడా తీసుకుంది. నటుడు ఆమిర్ అలీని 2012లో వివాహం చేసుకున్న ఈమె.. గతేడాది విడాకులు ఇచ్చేసింది. ఇప్పుడు హర్షవర్ధన్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీడియా ప్రతినిధులు హర్షని దీని గురించి అడిగితే.. ఎటు తేల్చకుండా ఆన్సర్ ఇచ్చాడు. దీంతో డేటింగ్ నిజమేనని తేలింది. (ఇదీ చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!) -
గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్తో మళ్లీ కనిపించిన హీరోయిన్!
బాలీవుడ్ బ్యూటీ, దిశా పటానీ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె తమిళంలో సూర్య సరసన కంగువా చిత్రంలో నటిస్తోంది. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిశా పటానీ తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించింది. అయితే గతంలో టైగర్ ష్రాఫ్తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఈ బాలీవుడ్ బ్రేకప్ చెప్పేసుకుంది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న టైగర్ ష్రాఫ్ తాను సింగిల్గానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. (ఇది చదవండి: దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ) అయితే తాజాగా ఓ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశా పటానీ, ఆమె మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ జంటగా కనిపించారు. శనివారం దిల్లీలో జరిగిన ఓ ఈవెంట్కు ఈ మాజీ లవర్స్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు దిశా, టైగర్ మళ్లీ కలిసిపోయారంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో టైగర్ ష్రాఫ్ పుట్టినరోజు సందర్భంగా దిశా పటానీ విష్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో మాజీ లవర్కు విషెస్ చెప్పింది. కాగా.. దిశా పటాని ప్రస్తుతం యోధా, కంగువా, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ గణపత్, బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్) Tiger and Disha together again 😍#TigerShroff #DishaPatani pic.twitter.com/LrThURuSgO — $@M (@SAMTHEBESTEST_) July 2, 2023 Disha Patani with Tiger Shroff @DishPatani @iTIGERSHROFF #DishaPatani #TigerShroff pic.twitter.com/gChdDXIVS7 — Disha Patani Fan Club ❤️ (@satyam20157) July 1, 2023 View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
తమన్నాతో డేటింగ్.. అందుకే బయటకు చెప్పలేదు: విజయ్ వర్మ
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్లో జంటగా నటించారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, కాజోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ చాలాసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సీక్రెట్గా ఉన్న బంధాన్ని మిల్కీ బ్యూటీ తాజాగా బయట పెట్టేసింది. దీంతో ఇన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరదించింది తమన్నా భాటియా. తాజాగా విజయ్ వర్మ సైతం తమ రిలేషన్షిప్పై స్పందించారు. ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?) ప్రస్తుతం లస్ట్ స్టోరీస్-2 ప్రమోషన్లతో బిజీగా ఉన్న విజయ్ వర్మ ఓ యూట్యూబ్ ఛానెల్తో చిట్చాట్ సందర్భంగా తమన్నాతో రిలేషన్పై నోరు విప్పారు. తమ ప్రేమ గురించి ఇన్ని రోజులు బయటకు చెప్పకపోవడానికి గల కారణాలు వెల్లడించారు. విజయ్ వర్మ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ప్రజలకు నా ప్రొఫెషనల్ కెరీర్కు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాలనుకున్నా. సరైన సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి మీతో చెబుదామనుకున్నా.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే విజయ్తో ప్రేమలో ఉన్నానని.. లస్ట్ స్టోరీస్-2 సెట్స్లోనే లవ్లో పడినట్లు మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది. విజయ్ తోడుగా ఉంటే హ్యాపీగా ఉంటానని తెలిపింది. - కె.తారక రామ కుమార్ ( ఇది చదవండి: స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!) -
సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. ఇటీవలే తాను హీరోగా నటించిన చిత్రం ‘టక్కర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. (ఇది చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..) చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్లో సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సిద్ధార్థ్.. బాలీవుడ్ భామ ఆదితి రావు హైదరితో డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ జంట చాలాసార్లు ఫంక్షన్లలో తళుక్కున మెరిశారు. గతంలో ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ కలిసి టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్కు కూడా హాజరయ్యారు. ఇటీవలే రాజస్థాన్లో జరిగిన పెళ్లిలోనూ జంటగా పాల్గొన్నారు. దీంతో ఈ జంట పీకల్లోతు డేటింగ్లో ఉన్నట్లు మరోసారి వార్తలు వైరలయ్యాయి. అయితే తాజాగా ఓ టీవీ షోలో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చూస్తే ఈ రూమర్స్ నిజమనే తెలుస్తోంది. ఇంతకీ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఓ టీవీ షోలో పాల్గొన్న సిద్ధార్థ్ను యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. జీవితాంతం మీతో కలిసి డ్యాన్స్ చేయాలనుకునే ఆమె ఎవరైనా ఉన్నారా? అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ..'మా ఊర్లో అందరూ 'ఆదితి దేవో భవ అంటారు' కదా అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో అతిథిని ఆదితి పేరుతో పిలవడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సిద్ధార్థ్ సమాధానంతో ఆదితి రావు హైదరీతో డేటింగ్ ఖాయమని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) Awwww did he just accept?? CUTE. ❤️❤️🧿#Siddharth pic.twitter.com/x9pVfv8SHT — Shravani (@shravd05) June 9, 2023 -
సహనటుడితో హీరోయిన్ డేటింగ్.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవలే దహాద్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. అయితే దబాంగ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత రౌడీ రాధోడ్ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. జూన్ 2న సోనాక్షి సిన్హా తన 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ తారలు శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి) అయితే ఆమె సహనటుడు జహీర్ ఇక్బాల్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై సోనాక్షి, జహీర్ ఎక్కడా నోరు విప్పలేదు. అయితే ఈ జంట పలు ఈవెంట్లలో కనిపించారు. దీంతో ప్రతిసారీ సోషల్ మీడియాలో రిలేషన్ షిప్పై గాసిప్స్ వినిపించాయి. తాజాగా సోనాక్షి సిన్హా పుట్టినరోజు సందర్భంగా జహీర్ చేసిన పోస్ట్ డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తోంది. బర్త్ డే విషెష్ చెబుతూనే 'ఐ లవ్ యూ' అంటూ నోట్లో రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆమెతో దిగిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. కాగా.. గత నెలలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ జహీర్ ఇక్బాల్తో సోనాక్షి సిన్హా సంబంధాన్ని దాదాపుగా ధృవీకరించారు. కాగా.. వీరిద్దరు కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. సోనాక్షి సిన్హా ప్రస్తుతం హర్రర్-కామెడీ చిత్రం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనుంది. ఆ తర్వాత నికితా రాయ్ మూవీ ది బుక్ ఆఫ్ డార్క్నెస్లో నటించనుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కూడా ఉన్నారు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన బెస్ట్ ఫ్రెండ్.. వైరలవుతున్న ఫోటోలు) View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
అదితిరావు హైదరితో డేటింగ్ గురించి సిద్ధార్థ్ మాటల్లో వినండి..!