Gollapudi Maruthi rao
-
మా నాన్న ముందే గొల్లపూడి నా చెంప పగలగొట్టాడు: నటి
బాలనటిగా కెరీర్ ఆరంభించిన పూర్ణిమ సింగర్ అవుదామనుకుంది. కానీ కాలం, ఆమెలోని నటనా చాతుర్యం ఆమెను నటిని చేసింది. 'శ్రీవారికి ప్రేమలేఖ', 'ముద్దమందారం', 'నాలుగు స్తంభాలాట', 'పుత్తడిబొమ్మ', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' వంటి సినిమాలతో హీరోయిన్గా అలరించింది. ఆ తర్వాత సహాయక పాత్రలు సైతం పోషించి తెలుగువారి మనసుల్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పూర్ణిమ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నా పేరు మలయాళంలో సుధ, తెలుగులో పూర్ణిమ. నేను సింగర్ అవుదామనుకున్నా, కానీ నటినయ్యా. హీరోయిన్గా చేస్తున్నప్పుడే కృష్ణగారికి చెల్లెలిగా కూడా చేశా. సావిత్రిగారితో కూడా నటించాను. ఆమె చనిపోయే ముందు రోజుల్లో.. పాన్ తింటూ ఇలా యాక్ట్ చేయాలి, అలా చేయాలని సూచనలిచ్చేవారు. ఇక నేను సినిమా ఆర్టిస్ట్ అని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఆరు సంబంధాలు వచ్చినదారినే వెళ్లిపోయాయి. నాకింక లైఫ్లో పెళ్లవదు, కుమారిగానే మిగిలిపోతాననుకున్నా. కానీ 1998లో నాకు పెళ్లైంది. నాలుగు స్తంభాలాట సినిమా సమయంలో వైజాగ్ అందాలు చూసివద్దామని నేను, నరేశ్ బైక్పై వెళ్లి వస్తుండగా చున్నీ టైర్లో చుట్టుకోవడంతో కింద పడిపోయా, గాయాలయ్యాయి. నన్ను అలా చూసి నరేశ్ కంట్లో నీళ్లు తిరిగాయి. 'మనిషికో చరిత్ర' సినిమా సెట్స్లో గొల్లపూడి మారుతీరావు నన్ను సీరియస్గా కొట్టేశారు. అక్కడే ఉన్న మా నాన్న మా అమ్మాయిని ఎందుకు కొట్టారు? అని మారుతీరావును నిలదీశాడు. అందుకాయన నాకు కూతుర్లు లేరమ్మా, అందుకే కొట్టేశాను అని చెప్పడంతో ఊరుకున్నాడు' అని చెప్పుకొచ్చింది పూర్ణిమ. -
కాలంలో కరిగిన ప్రేమకథ
బస్సు జుజుమురా దగ్గర ఆగినప్పుడు ఆ అమ్మాయిని చూశాను. నవంబర్ చలి దుర్మార్గుడి పగలాగ పట్టుకుని వదలకుండా ఉంది. శంభల్పూర్ నుంచీ భువనేశ్వర్ ప్రయాణం. ‘‘ఈ రాత్రి వద్దు భాయ్. రెఢాకోల్ అడవిలో చలి తట్టుకోలేవు’’ అన్నాడు సాహు. ‘‘రేపు ఉదయం భువనేశ్వర్లో పని ఉందం’’టూ బస్సు ఎక్కేశాను. ముతక శంభల్పూర్ చీరలో చుట్టిన రబ్బరు బొమ్మలాగా ఉంది ఆమె. ఒరియా అమ్మాయేమో అనుకున్నాను. నన్ను తికమక పెట్టింది ఒకటే– ఆమె సిగలో కెంపులాంటి గులాబీ పువ్వు. ఇక్కడ అమ్మాయిలు పువ్వులు పెట్టుకోరు. శరీరంలో కనిపించని ఏ అందాన్నయినా భర్తీ చేయగలిగిన అందమైన కళ్లు. నా ముందు సీట్లో కూర్చుంది. పక్కన ఎవరూ లేరు. ముసలి పండా కారా కిళ్లీ చారలో చొంగ కలిసి వంటి మీదకి కారుతుండగా చలిని జయించి నిద్రపోతున్నాడు. ఆంధ్రదేశంలో చలికాలానికి ఉపయోగించే ఏ దుప్పటీ ఈ చలికి ఆగడం లేదు. ఉన్నట్టుండి బస్సు కుదుపుతో ఆగింది. ఒరియా భాష ఒక్కసారి నిద్రలేచింది. అతి త్వరగా మాట్లాడుతారు. మాటల్లో కంచు గొంతు వెదికి తెచ్చుకుంటారు. డ్రైవరు ఏదో చెబుతున్నాడు. కొన్ని నిద్రముఖాల్లో కోపం తెలుస్తోంది. ప్రయాణికులంతా దిగారు. నా ముందున్న అమ్మాయి ఊదారంగు శాలువా వదిలించి దగ్గరగా లాక్కుని లేచింది. నేనూ లేచాను. ‘‘జుజుమురా’’ అన్న నల్లటి అక్షరాలు బస్సు లైట్ల వెలుగులో కనిపిస్తున్నాయి. చిన్న గ్రామం. డ్రైవరు ఏం చెపుతున్నాడో తెలుసుకోవాలనిపించింది. ఒక రాయిమీద కూర్చుంది అమ్మాయి. ఇంగ్లిష్ అర్థమవుతుందేమో, అడిగాను. ‘‘డ్రైవరు ఏం చెపుతున్నాడో చెప్పగలరా?’’ ‘‘ఇంజిన్ చెడిందట. క్షణంలో బాగు చేస్తానంటున్నాడు’’ తెలుగులో వచ్చింది సమాధానం. ‘‘నాకు తెలుగు ఎలా వచ్చునా అని ఆశ్చర్యపోతున్నారా?’’ ‘‘అది ఒకటి. నేను తెలుగువాడినని ఎలా అర్థం చేసుకున్నారా అని.’’ ‘‘పాన్ వేసుకుంటే ఇక్కడ వాళ్లు గంటల కొద్దీ బుగ్గన ఉంచుకుంటారు. మీరేమో కిటికీ దగ్గర కూర్చున్నారు. అయిదు నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నారు.’’ ‘‘కానీ నేను తెలుగువాడినని ఎలా అర్థం చేసుకున్నారో చెప్పలేదు’’ ‘‘మీ చేతుల్లో తెలుగు ఉత్తరం ఉంది. మీరు కట్టుకున్న పంచె పొందూరు ఖద్దరు.’’ క్షణం నిర్ఘాంతపోయాను. ‘‘మీరేం చేస్తారు?’’ అంది. ‘‘టెక్స్టైల్ మిల్ ఏజెంటుని. ప్రతి సీజన్లోనూ వచ్చి ధర్మవరం చీరలకు ఆర్డర్స్ తీసుకుంటాను. తిరిగి వెళ్లి సరుకు పంపే ఏర్పాటు చేస్తాను. అమ్మకంలో రెండు పర్సెంట్ కమీషన్ ఇస్తారు. అందులో ఒక పర్సెంట్ జర్దాకిళ్లీలు నమిలి ఒరిస్సాకే చెల్లించి వెళ్లిపోతాను.’’ గలగలమని నవ్వింది. నిద్రపోతున్న జుజుమురాలో కాస్త చైతన్యం వచ్చినట్టనిపించింది. ‘‘ఎలా ఉంది ఒరిస్సా మీకు?’’ ‘‘ఇక్కడికి వస్తూ పోతూండడం 14 నెలల అలవాటు. దిగులుగా, తీరుబాటుగా, ఒంటరిగా, భయంగా ఉంది. తెలుగు భాష వినిపిస్తే ఆప్తబంధువుని చూసినట్టు ఫీలవుతాను.’’ ‘‘అయితే మీకో ఆప్తబంధువు దొరికినట్టే.’’ ఆమె చొరవకి ఆశ్చర్యం కలిగినా, ఆనందంగానే ఉంది. ప్రయాణికులంతా మా వేపు దొంగ చూపులు చూసి నవ్వుకున్నారు. ‘‘మీ పేరు?’’ ‘‘మీరా’’ బస్సు రిపేరు అయిందని అరుస్తున్నాడు కండక్టరు. లేచి చీరె సవరించుకుంది. నేను లేవడానికి చెయ్యి అందించింది. జారిపోయిన నా కండువాని తనే భుజం మీద వేసింది. బస్సులో ఇదివరకే కూర్చున్న సీటులోకి కునుకుతున్నాను. నా పక్కన కూర్చున్న పండా ఏదో అన్నాడు. మీరా నవ్వుతోంది. ‘‘ఆయనేమంటున్నాడో తెలుసా? మీరిద్దరూ భార్యాభర్తలు కదా, రెండు సీట్లెందుకు? మీరు నా పక్కన కూర్చుంటే, ఆయన పడుకుంటాడట.’’ నా ముఖం ఎరుపెక్కింది. ‘‘మనం భార్యాభర్తలం కానక్కరలేదు కానీ నా పక్కన కూర్చోండి. పాపం, పడుకుంటాడు’’ అంది. నా భార్య అయ్యే అర్హతలు మీరాకి లేవా? జీవితం పట్ల ఆమెకున్నపాటి కలలు కూడా నాకు లేవు. ‘‘ఊరు పేరు తెలీని అమ్మాయి నా భార్య అంటాడా ఈ ఫూల్’’ అని కోపం వచ్చింది మీకు. అవునా?’’ ‘‘మీకెలా తెలుసు?’’ ‘‘నేను బీఏ సైకాలజీ స్టూడెంటుని.’’ ఆ అమ్మాయి అంత చదువుకున్నదని ఊహించలేదు. మనలో లేని గుణాన్ని ఇంకొకరిలో చూడడాన్ని ఆకర్షణ అంటారనుకుంటాను. మీరా నన్ను ఆకర్షించింది. క్రమంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకి మనస్సు ఒదిగిపోయింది. ‘‘నేను పూరీ వెడుతున్నాను. ఈ పండా ఆశీర్వాదం ఫలించాలని జగన్నాథుడికి చెప్పుకుంటాను’’ అన్నాను. నాకు తెలుగు ఎలా వచ్చునా అని ఆశ్చర్యపోతున్నారా?’’ ‘‘అది ఒకటి. నేను తెలుగువాడినని ఎలా అర్థం చేసుకున్నారా అని.’’ ఇప్పుడామె ముఖంలో ఆశ్చర్యం. ‘‘అమ్మ లేదు. నాన్న లేడు. పెళ్లి నా జీవితంలో కలకాలం నిలవడానికి చేసే స్నేహం లాంటిది. మీరు మంచి స్నేహితులు కాగలరని ఈ చిన్న వ్యవధిలోనే అనిపించింది.’’ అంత పెద్ద కళ్లలో కదిలిన నీటితెరని ఆ మసక వెలుగు దాచలేకపోయింది. ఆమె చెయ్యి నా చేతిని బలంగా పట్టుకుంది. నేను వణుకుతున్నానని అప్పుడర్థమయింది– నేను తీసుకున్న నిర్ణయానికి గానీ చలికి గానీ. ‘‘అదేమిటి వణుకుతున్నారు? ఈ శాలువా కప్పుకోండి.’’ ఇప్పుడు ఆమె శరీరం నాకు తగులుతోంది. సన్నటి నడుం వెచ్చగా నా కుడిచేతికి ఆనుకుంది. ఎంతసేపు గడిచిందో తెలియలేదు. ‘‘రెఢాఖోల్ వచ్చాం. కాస్త టీ తాగరూ?’’ చుట్టూ చూశాను. బస్సంతా ఖాళీ. ఆమె ఒళ్లో తలపెట్టుకున్నానని అర్థమై, సిగ్గుపడిపోయాను. ఇద్దరం దిగాం. ‘‘భర్త అపస్మారంలో ఉపయోగపడడానికి భార్యకి ఎంత అదృష్టం.’’ ‘‘ప్రతి స్త్రీ పుట్టుక నుంచీ వైవాహిక జీవితానికి సిద్ధపడుతుందనుకుంటాను. భార్య పాత్రని ఎంత సులువుగా స్వీకరిస్తున్నారు మీరు?’’ చిన్న కుర్రాడు రొట్టెలు చేస్తున్నాడు. కాల్చడానికి పెనం ఏమీ లేదు. నేలకి సమంగా ఒక కుండని పాతేశారు. మూడు రొట్టెలు కొన్నాను. పప్పు సెగలు కక్కుతోంది. ఆకలి చల్లార్చుకుని బస్సు ఎక్కాం. భయంకరమైన రోడ్డు. విడాకులు ఇచ్చుకుందామని నిశ్చయం చేసుకున్న భార్యాభర్తల్ని బస్సులో కూర్చోపెడితే ఆ రోడ్డు వాళ్లని అనుగుల్ చేరే లోపల ఏకం చేస్తుంది. ప్రతి పది నిమిషాలకీ నా చేతుల్లో ఉంటోంది మీరా. బస్సులో దీపాలన్నీ ఆర్పేశారు. మా పెళ్లి, తర్వాతి జీవితాన్ని గురించి 30 మైళ్లు చర్చించుకున్నాం. నేను కంపెనీ తరపున బరంపురంలో ఉండిపోయేట్టు ఏర్పాటు చేసుకుంటాను. నా క్యాంపులన్నీ ఇద్దరం కలిసే తిరుగుతాం. ముగ్గురు పిల్లలు. ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. ఇద్దరమ్మాయిలు, అబ్బాయి అయినా ఫరవాలేదు. ముగ్గురూ అమ్మాయిలే పుడితే? అనుగుల్ వచ్చేసింది. దూరంగా ఉన్న టీ దుకాణం వేపుకి మళ్లించింది మీరా. ‘‘ఇష్, ఇటు’’ అంది. నా భుజం మీద పడిన ఆమె వేళ్లు వణుకుతున్నాయి. ‘‘ముద్దు పెట్టుకోరూ!’’ అంది. దిమ్మర పోయాను. నా చేతులు స్వాధీనం తప్పాయి. మంచులాంటి గాలి మా మధ్య వేడెక్కింది. కాసేపటికి ఆమె ఏడుస్తోందని తెలుసుకున్నాను. ఊపిరి సలపని ఆనందానికి పరాకాష్ట దుఃఖమేమో! డ్రైవరు మా కోసమే హారను మోగిస్తున్నాడు. అనుగుల్ వచ్చిన డ్రైవరు గుర్రు తీస్తున్నాడు. కొత్త డ్రైవరు నడుపుతున్నాడు. అతి సులువుగా నా కౌగిట్లో ఒదిగిపోయిన ఈ మీరా నా జీవితంలో వహించనున్న పాత్రకి అర్హురాలేనా? ఢెంకనాల్ దాటి కుంఠలీ. ఇంకాసేపట్లో తెల్లవారుతుంది. ‘‘నేను కటకంలో దిగాలి’’ అంది. కటకం దగ్గరవుతుందనగానే ఆమె కంఠంలో దిగులు. ‘‘వస్తే రానీ నాతో భువనేశ్వర్ వస్తున్నావు నువ్వు’’. అదే మొదటిసారి నువ్వు అనడం– ఆశ్చర్యపోయింది. ‘‘నిన్ను దిగనివ్వను.’’ నా వేపు జాలిగా చూసింది. ‘‘నా మీద అప్పుడే అంత హక్కును పెంచుకున్నారా?’’ అంది. ‘‘రాత్రంతా ఆలోచనల్తో రెచ్చగొట్టి ఇప్పుడు హఠాత్తుగా మాయమవుతావా?’’ మీరా మాట్లాడలేదు. దిగే ప్రయాణికులంతా హడావుడిలో పడ్డారు. ‘‘ఇక్కడ అరగంట పైగా ఆగుతుంది. అలా నడుద్దాం పదండి’’ అంది. ‘‘నాకూ మిమ్మల్ని వదిలి పోవాలని లేదు. చిన్నతనంలో చెట్టపట్టాలేసుకు నడిచే భార్యాభర్తల్ని చూస్తూ ఇలాగా నా రోజులూ గడవాలనుకునేదాన్ని. ఇద్దరం భవిష్యత్తును గురించి కలలు కన్నాం. నా జీవితానికి ఈ ఒక్క రాత్రి చాలు’’. ‘‘కానీ మీరా! ఈ ఒక్క రాత్రి ఏం ఖర్మ. మన మధ్య ఇలాంటి ఎన్నో రాత్రులు ఉంటాయి. జీవితమంతా నేను నీతో ఉంటాను.’’ ‘‘ఉండే మనస్సు మీకుంది. కానీ ఉంచుకునే అదృష్టం నాకు లేదు. నాకు లంగ్ కేన్సర్.’’ మున్సిపాలిటీ దీపాలు గుప్పుమని ఆరిపోయాయి. నా గొంతు పెగలలేదు. ‘‘కానీ మీరా! మీరా! ఇది ఘోరం.’’ ‘‘నేనిక్కడే ఆగిపోతాను. నీ ఆపరేషను అయ్యేవరకు ఉంటాను.’’ ‘‘వద్దు. వీల్లేదు. మీరు వెళ్లాలి. ఇప్పుడే, ఈ బస్సులోనే.’’ ఇద్దరం కళ్లనీళ్లు కారుస్తూనే ఉన్నాం. డ్రైవరు హారన్ మోగిస్తున్నాడు. ∙∙ ఈసారి భువనేశ్వర్ వచ్చినప్పుడు కటకంలో ఆగి మీరా చెప్పినట్టే వాకబు చేశాను. డిసెంబర్లో మేం అనుకున్నట్టు పెళ్లయితే జరగలేదు కానీ క్రిస్ట్మస్ రెండు రోజులుందనగా మీరా కన్ను మూసింది. శంభల్పూర్ బస్సులో ప్రయాణం చేస్తూ జుజుమురా వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తు చెయ్యమని కండక్టరుతో చెప్పాను. కళ్లిప్పేసరికి బస్సు ఇంకా నడుస్తోంది. కండక్టర్ని అడిగాను. జుజుమురా వెళ్లిపోయిందన్నాడు. ఒక అపూర్వమైన అనుభవాన్ని మీరా రూపంలో ప్రసాదించి నా దారి నుంచి సవినయంగా తప్పుకుంది జుజుమురా. గొల్లపూడి మారుతీరావు ‘జుజుమురా’కు సంక్షిప్త రూపం ఇది. కాలదోషం పట్టనిదే మంచికథ అయితే గనక ఈ కథ ఆ ప్రమాణానికి నిలబడదు. ఇలాంటి ఎన్నో ప్రేమకథలు మనం వినివుండటమే దానికి కారణం. ఒక విషయం మళ్లీ మళ్లీ వాడకంలోకి రావడం వల్ల దాని గొప్పతనం కోల్పోతుంది. ఈ కథ కూడా అదే కోవలోనిది. కానీ గుర్తుంచుకోవాల్సింది, అలాంటి ఎన్నో ప్రేమకథలు సినిమాలుగా రాకముందు 1971లో రాసిందిది. ఆ కారణం వల్లే ఇది ఆ కాలపు ఎందరో పాఠకుల్ని ఆకర్షించింది. సినిమా నటుడు, సినిమా, నాటక, రేడియో రచయిత, పాత్రికేయుడు, కాలమిస్టు, టీవీ ప్రయోక్త అయిన గొల్లపూడి చివరివరకూ ‘జీవన కాలమ్’ రాస్తూనే వున్నారు. అమ్మ కడుపు చల్లగా ఆయన ఆత్మకథ. సాయంకాలమైంది ఆయన నవల. గొల్లపూడి మారుతిరావు 14 ఏప్రిల్ 1939 12 డిసెంబర్ 2019 -
నిలువెత్తు తెలుగుదనం గొల్లపూడి సోంతం: ఎస్పీ బాలు
-
గొల్లపూడికి కన్నీటి వీడ్కోలు
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత నటుడు, రచయిత, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు ఆదివారం చెన్నైలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఉదయం పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి పార్థివదేహానికి నివాళులర్పించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాత దగ్గుబాటి సురేశ్, దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్, సినీ ప్రముఖులు మారుతీరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఉదయం 10 గంటలకు గొల్లపూడి భౌతికకాయానికి కుటుంబ సభ్యులు శాస్త్రీయంగా అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు. 11.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై టీ నగర్ కన్నమ్మపేటలోని శ్మశాన వాటికలో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు జరిగాయి. కుమారుడు రామకృష్ణ తలకొరివి పెట్టారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
గొల్లపూడికి చిరంజీవి, సుహాసిని నివాళి
-
గొల్లపూడికి చిరంజీవి నివాళి
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు భౌతికకాయాన్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. ప్రముఖుల, అభిమానులు సందర్శనార్థం గొల్లపూడి పార్థీవదేహాన్ని టీనగర్లోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. గొల్లపూడి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కన్నమ్మపేట దహనవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అదేరోజు ఉదయం టీనగర్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని వారు చెప్పారు. చిరంజీవి, సుహాసిని నివాళి గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి హీరో చిరంజీవి నివాళులర్పించారు. చెన్నై టీనగర్లోని శారదాంబల్లోని ఆయన నివాసానికి వెళ్లిన చిరంజీవి.. గొల్లపూడి పార్థీవదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చిరంజీవితో పటు సినీనటి సుహాసిని సహా పలువురు ప్రముఖులు గొల్లపూడికి నివాళులర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి మారుతీరావు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. చదవండి: గొల్లపూడి నాకు క్లాస్లు తీసుకున్నారు సాహితీ శిఖరం.. కళల కెరటం.. -
ఒక జీవనది అదృశ్యమైంది
‘గొల్లపూడి మారుతీరావు గొప్ప నాటక రచయిత మాత్రమే కాదు, చాలా మంచి నటుడు కూడా. సినిమాల్లో వేస్తే ముఖ్య పాత్రలో బాగా రాణించగ లడు’ అంటూ 1970లో ప్రముఖ పత్రికా సంపాద కులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గొల్లపూడిని అంచనా వేశారు. తర్వాత అక్షరాలా అంతే జరి గింది. పదేళ్ల తర్వాత ముఖానికి రంగు పూసుకుని వెండితెరకెక్కారు. గద్దముక్కు, తీక్షణమైన చూపులు, సన్నగా పొడుగ్గా కింగ్ సైజు సిగరెట్ లాంటి విగ్రహం, చేతులు వూపేస్తూ వాదనలో పస లేకపోయినా అవతలివాళ్లని తగ్గేట్టు చేసే వాగ్ధాటి గొల్లపూడికి ముద్రవేసి నటుడిగా నిలబెట్టాయి. తొలి సినిమా ‘ఇంట్లో రామయ్య...’ చిత్రంతోనే అన్ని వయసుల వారిని ఆకట్టుకున్నారు. వంద సినిమాల తర్వాత అబ్బాల్సిన ‘ఈజ్’ మొదటి దెబ్బకే వంటబట్టింది. ఇక తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. మారుతీరావుది పరిపూర్ణ జీవితం. పద్నాలుగే ళ్లప్పుడే మించిన ప్రతిభని ప్రదర్శిస్తూ ‘ఆశాజీవి’ కథ రాశారు. ఇంకో రెండేళ్లకి తొలి నాటకం అనంతం, ఇంకో రెండేళ్లకి మరో మంచి పెద్ద కథ గొల్లపూడిని రచయితగా నిలబెట్టాయి. విశాఖ పట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చది వారు. ఆ పట్టాని, దాష్టీకమైన వాక్కుని పట్టుకుని విజయవాడ ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదిం చారు. అక్కడ మహానుభావుల మధ్యలో ఉండి కలానికి పదను పెట్టుకున్నారు. సరిగ్గా వృత్తి నాటక రంగం వెనకబడి సినిమాకు అన్ని కళలూ, శక్తి యుక్తులూ దాసోహం అంటున్న తరుణంలో నాటి కలు, నాటకాలు రాసేవారు ఒట్టిపోయారు. ఈ మహా శూన్యంలో గొల్లపూడి ప్రవేశించి పుంఖాను పుంఖాలుగా నాటక రచనలు చేసి తెలుగు అమె చ్యూర్ థియేటర్కి కొత్త చిగుళ్లు తొడిగారు. ‘అనంతం’ కొన్ని వందల ప్రదర్శనలకు నోచు కుంది. ‘బియాండ్ ది హొరైజన్’ ఆధారంగా తీర్చిది ద్దిన ‘రాగగాగిణి’ మాతృక వలే ఖ్యాతి పొందింది. కొత్త కొత్త నాటకాలు చదవడం, తనదైన శైలిలోకి దించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తన రచనలకు బారసాలలు చేసి పేర్లు పెట్టడంలో గొల్ల పూడిది విలక్షణమైన దారి. పిడికెడు ఆకాశం, వెన్నెల కాటేసింది, రెండురెళ్లు ఆరు, మళ్లీ రైలు తప్పిపోయింది, కరుణించని దేవతలు, రోమన్ హాలిడే, కళ్లు, సత్యంగారి ఇల్లెక్కడ, చీకట్లో చీలి కలు, ఎర్రసీత ఇవన్నీ కొత్తగా ఆకర్షణీయంగా ఉంటాయ్. ఆఖరికి ఆయన స్వీయ చరిత్రకి ‘అమ్మ కడుపు చల్లగా...’ అని నామకరణం చేసు కున్నారు. విజయనగరం నేల మహత్యం, గాలి నైజం మారు తీరావుకి పుట్టుకతోనే (1939) అంటింది. హమేషా కొత్తపూలు విరిసే విశాఖ ప్రభాతం ఆయనపై పూర్తిగా పడింది. తెలుగు కథని జాగృతం చేసిన చా.సో., కా.రా., రావి శాస్త్రి, భరాగో ఇంకా మరెం దరో గొల్లపూడి రెక్క విచ్చే టప్పుడు ఉత్సాహంగా రాస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి అప్పట్లో సరస్వతీ నిలయం. శంకర మంచి సత్యం, ఉషశ్రీ, జీవీ కృష్ణారావ్, బుచ్చి బాబు లాంటి విశిష్టులు తమ ప్రజ్ఞా పాటవాలతో వెలుగుతున్నారు. ఈ వనంలో తనూ ఒక మల్లె పొదలా ఎదిగి గుబా ళించారు గొల్లపూడి. పరిమళాలు గాలివాటున చెన్నపట్నందాకా వెళ్లాయి. అన్నపూర్ణ సంస్థ ‘చక్ర భ్రమణం’ ఆధా రంగా తీస్తున్న ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకి మాటల రచయితగా మారుతీరావుకి పిలుపు వచ్చింది. ఆయనకు సహజంగా ఉన్న మాటకారితనం సిని మాల్లో బాగా పనిచేసింది. 80 సినిమాలకు కథలు, మాటలు ఇచ్చారు. నటుడిగా 200 పైగా చిత్రాల్లో కనిపించి మెప్పించారు. నటుడు, రచయిత, వ్యాఖ్యాత, వ్యాసకర్త, విశ్లేషకుడు– అన్నిటా రాణిం చారు. నటుడుగా విలనీ, కామెడీ ఇంకా అనేక షేడ్స్ చూపించారు. ‘వందేళ్ల తెలుగు కథకి వందనాలు’ పేరిట కె. రామచంద్రమూర్తి పూనికతో గొల్లపూడి రూపొందించిన టీవీ కార్యక్రమం ఆయన మాత్రమే చేయగలడు. 14వ ఏట నించి సృజనాత్మకంగా ఆయన జీవితం సాగింది. అన్నీ ఒక ఎల్తైతే పాతి కేళ్లపాటు అవిచ్ఛిన్నంగా నడిచిన ఆయన ‘జీవన కాలమ్’ మరో ఎత్తు. బ్రాడ్వే నాటకాలను స్వయంగా వెళ్లి, చూసి వచ్చి ఆయన అందించిన విపుల సమీ క్షలు మనకి విజ్ఞానదాయకాలు. గొల్లపూడికి అక్షర నివాళి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వరంగల్ అల్లుడు.. గొల్లపూడి
సాక్షి, హన్మకొండ : కవి, నాటక, నవలా రచయిత, నటుడు, జర్నలిస్టు ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి మారుతీరావు ఇక లేరన్న విషయం తెలిసి ఓరుగల్లు సాహితీవేత్తలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయనకు వరంగల్లో ఎనలేని అనుబంధం ఉండడం.. పలు కార్యక్రమాలకు హాజరైన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతిరావు అత్తగారి ఊరు వరంగల్ కావడం విశేషం. ఇక్కడ విద్యాశాఖాధికారిగా పనిచేసిన శ్రీపాద రామకిషన్రావు కుమార్తె సుందరిని ఆయన వివాహం చేసుకున్నారు. ఈవిధంగా మారుతీరావు వరంగల్ అల్లుడయ్యాడు. అలాగే కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వరరావుతో గొల్లపూడి మారుతీరావుకు అనుబంధం ఉండేది. 1966లో తిలక్, అద్దెపల్లి రాంమోహన్రావు, ఆవత్స సోమసుందర్, కుందుర్తితో కలిసి మిత్రమండలి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు చెందిన సహృదయ సాహితీ సంస్థ ఏటా ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంగా అందించే సాహితీపురస్కారానికి గొల్లపూడి మారుతీరావు రాసిన ‘సాయంకాలం అయింది’ నవలను ఎంపికైంది. ఈ మేరకు 2001లో జరిగిన పురస్కార ప్రదానంలో గొల్లపూడి పాల్గొని చేసిన ఆత్మీయ ప్రసంగం అందరికీ గుర్తుండి పోతుంది. ఆదేవిధంగా 21 జనవరి 2012న హన్మకొండలోని నందనా గార్డెన్స్లో జరిగిన గిరిజా మనోహర్బాబు షష్టిపూర్తి అభినందనసభలోనూ ఆయన పాల్గొన్నారు. కాగా, గొల్లపూడి గురువారం కన్నుమూసినట్లు తెలియడంతో ఓరుగల్లు సాహితీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తరచూ ఫోన్లో మాట్లాడేవాళ్లం.. గొల్లపూడి మారుతిరావు ఇకలేరని తెలిసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మారుతీరావు భార్య సుందరి ఆర్ట్స్ కళాశాలలో తమతో పాటు కలిసి చదువుకున్నారని.. ఆయన తనకు మంచి మిత్రుడని తెలిపారు. తరుచూ ఫోన్లో మాట్లాడుకునేవారమని, తన కథలు, నవలలు చదివి అభిప్రాయాలు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి మాట్లాడుతూ గొల్లపూడి మారుతీరావు వందేళ్ల తెలుగు కథ కార్యక్రమంలో భాగంగా కాళోజీ కథను చదవడానికి తనను పిలిచారని చెప్పారు. ప్రముఖ సాహితీవేత్త గిరిజామనోహర్బాబు మాట్లాడుతూ పదేళ్లుగా గొల్లపూడితో తనకు అనుబంధం ఉందని.. 2008లో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు కన్నీటిపర్యంతమయ్యారని గుర్తు చేశారు. 2012లో తన షష్టిపూర్తి అభినందన సభ నిర్వహించినప్పుడు హాజరయ్యారని చెప్పారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గొల్లపూడి 80 ఏళ్ల ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు. అలాగే, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్వీఎన్.చారి, వనం లక్ష్మీకాంతారావు, శేషాచారి, డాక్టర్ కేఎల్వీ.ప్రసాద్, కుందావజ్జుల కృష్ణమూర్తి, లయన్స్క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పొట్లపల్లి శ్రీనివాస్రావు, డాక్టర్ వి.వీరాచారి, డాక్టర్ కందాళ శోభారాణి తదితరులు కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. -
గొల్లపూడి లేని లోటు తీర్చలేనిది
సాక్షి, విజయవాడ: ప్రముఖ నటుడు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్డీసీ) చైర్మన్ టిఎస్ విజయ్ చందర్ సంతాపం తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిది అని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ, సాహిత్య, నాటక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొల్లపూడి గొప్ప వ్యక్తిత్వం గల మనిషని ఆయనను కొనియాడారు. విజయనరంలో జన్మించి, విశాఖపట్నంలో వృత్తిని ప్రారంభించి కళామతల్లి సేవలో పునీతులైన గొల్లపూడి బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. ఆయన మొదటిసారిగా స్క్రీన్ప్లే అందించిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రంతో తొలి నంది పురస్కారాన్ని గెలుచుకున్నారని వెల్లడించారు. తన సినీ జీవితంలో ఆరు నంది పురస్కారాలు అందుకున్నారన్నారు. దాదాపు 80 చిత్రాలకు రచయితగా, 290 చిత్రాలకు నటుడిగా గొల్లపూడి సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకమని విజయ్ చందర్ తెలిపారు. -
నట మారుతం
-
సాహితీ శిఖరం.. కళల కెరటం..
పెదవాల్తేరు/మద్దిలపాలెం(విశాఖతూర్పు): అవధుల్లేని మహా ప్రవాహం ఆయన జీవన పయనం. అనంతమైన మహా సముద్రం ఆయన అనుభవ సారం. అనేక అధ్యాయాల.. అసంఖ్యాక ప్రకరణాల ఉద్గ్రంథం ఆయన ప్రతిభాసామర్థ్యం. సామాన్య కుటుంబాన జన్మించి.. అక్షర సేద్యంలో రాణించి.. ఆపై అనేక రంగాల్లో అసమాన నైపుణ్యం చూపించి.. తుదిశ్వాస వరకు సృజనాత్మకతనే శ్వాసించి.. తెలుగు సాహితీ కళారంగాల్లో అనితర సాధ్యమైన స్థానం సంపాదించి దూరతీరాలకు తరలిపోయిన గొల్లపూడి మారుతీరావు అచ్చంగా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. చిన్ననాట ఇక్కడ ఓనమాలు దిద్దినా.. తర్వాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నీడలో విద్యాభ్యాసం చేస్తూనే రంగస్థలంపై సృజన కిరణాలు ప్రసరింపజేసినా.. నాటక రంగంలో మహనీయులతో కలసి నైపుణ్యానికి సానపెట్టుకుని తళుకులీనినా.. తర్వాత జీవన సంధ్యాకాలంలో విశాఖను శాశ్వత నివాసంగా చేసుకున్నా.. ఆయన జీవితంలో వైశాఖి కీలకపాత్ర పోషించింది. ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడే హాయిగా ఉంటుందన్న భావన కలిగించింది. విశాఖ నుంచి అనివార్యంగా తరలివెళ్లిన తర్వాత చెన్నపట్నంలో ఆయన తుదిశ్వాస వీడినా.. ఆయన దివ్యాత్మ విశాఖ ఒడిలోకే చేరి ఉంటుంది. విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావు కుటుంబసభ్యులతో విశాఖలో దాదాపుగా 15 సంవత్సరాలపాటు నివసించారు. ఆయన పిఠాపురం కాలనీ జనశిక్షణ సంస్థాన్ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లోనివసించారు. ఏడాది క్రితమే ఈ ఫ్లాట్ విక్రయించేసి చెన్నై వెళ్లిపోయారు. ఏయూలో పాఠ్యపుస్తకం గొల్లపూడి రచనలను భారతదేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా ప్రాచుర్యంలో వున్నాయి. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాలను ఆంధ్రాయూనివర్శిటీ లో గల థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా వుంది. గొల్లపూడి రచనలపై ఎంతోమంది విద్యార్థులు పరిశోధనలు చేసి ఎంఫిల్, డాక్టరేట్లు పొందారు. ప్రముఖ సినిమా నటుడు వంకాయల సత్యనారాయణ కుమార్తె లావణ్య గొల్లపూడి రచనలపై పరిశోధనలు చేసి ఏయూ నుంచి డాక్టరేట్ పొందారు. మానసిక పాఠశాలలో... పెదవాల్తేరులో గల హిడెన్స్ప్రౌట్స్ పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొనేవారని పాఠశాల వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. తరచూ పాఠశాల నిర్వాహకులతో సమావేశమయి మానసిక దివ్యాంగుల యోగక్షేమాలు విచారించేవారు. ఎన్నో స్మృతులు ఆయన విశాఖలో జరిగిన పలుసాంస్కృతిక కార్యక్రమాలలో విశిష్ట అతిథిగా పాల్గొనేవారు. పిఠాపురం కాలనీ కళాభారతి, ప్రేమసమాజం తదితర వేదికలపై జరిగిన సినిమా సంగీత విభావరి, ఇతర కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన వన్టౌన్లోని కురుపాం మార్కెట్ , టౌన్హాలు, హిందూ రీడింగ్రూమ్ లతో గొల్లపూడికి ఎంతో అనుబంధం వుంది. నాటకరంగంలో వున్నపుడు ఆయన ఇక్కడ సహచరులతో సంతోషంగా గడిపేవారని, నగర వీధుల్లో తిరిగేవారని రచయిత, వ్యాఖ్యాత భీశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. ఓనమాలు ఇక్కడే.. ఆయన సీబీఎం పాఠశాలలోను, ఏవిఎన్ కళాశాలలోను, ఆంధ్రాయూనివరి్సటీలోను విద్యాభ్యాసం చేశారు. గొల్లపూడి విద్యార్థి దశలో వుండగానే శ్రీవాత్సవ రచించిన స్నానాలగది నాటకానికి కెవి గోపాలస్వామి దర్శకత్వం వహించారు. ఈ నాటకంతోపాటుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోను నటించారు. కాగా, మనస్తత్వాలు నాటకాన్ని కొత్తఢిల్లీలో జరిగిన ఐదో అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలలో భాగంగా ప్రదర్శించడం విశేషం. గొల్లపూడి రచన అనంతం ఉత్తమ రేడియో నాటకంగా అవార్డు పొందింది. చైనా ఆక్రమణపై తెలుగులో మొదటి నాటకం రచించి చిత్తూరు, మదనపల్లి , నగరి ప్రాంతాలలో ప్రదర్శించి వచ్చిన రూ.50వేల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. అమ్మ చెప్పిన పురాణాలే తొలి పాఠాలు మారుతీరావు పూర్తి పేరు వెంకట సూర్య మారుతి లక్ష్మీ నారాయణ. అమ్మ అన్నపూర్ణమ్మ చదవే పూరాణాలు వింటూ, వాటి సారాన్ని ఔపోసన పడుతూ.. ఆపై కొత్త ఆలోచనలు పేర్చుకుంటూ పెరిగారు. విన్న పురణాల గాథలను నాన్న సుబ్బారావుగారి షార్ట్హేండ్ పుస్తకాలపై రాసేవారు. ఇలా భాషపై పట్టుసాధించారు. తాను చూసిన తాజ్మహల్ వంటి అద్భుత కట్టడాల గురించి అనుభూతులను ఆవిష్కరించారు. యవ్వనంలోకి అడుగుపెట్టక ముందే “రేనాడు ‘అనే వీక్లీలో ఆయన తొలి నవల ‘ఆశాజీవి’ అచ్చయింది. మహాకవి శ్రీశ్రీ కొన్నాళ్లు కంపోజింగ్ సెక్షన్లో పనిచేయడంతో కొత్త రచయితలకు అలాంటి స్థానిక పత్రికపై మక్కువ ఉండేదని.. తమ రచనలు వాటిలో ముద్రితమైతే చూడాలనే ఆరాటం ఉండేదని తర్వాత ఆయన చెప్పేవారు. పర్యావరణ ప్రేమికుడు.. సీతంపేట: గొల్లపూడి మారుతీరావు సినీనటుడు, జర్నలిస్టు మాత్రమే కాదు పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణ మార్గదర్శి నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అంతర్జాతీయంగా పర్యావరణ పరిస్థితులను గురించి అవలీలగా మాట్లాడేవారు. పర్యావరణ మార్గదర్శి సభ్యులతో ఎప్పుడు కలిసినా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణతాపం పెరిగిపోతోందని.. మంచు కొండలు కరిగిపోతున్నాయని, వాయుకాలుష్యం పెరుగుతోందని చెప్పారు. ఆహార పదార్థాల్లో విషతుల్య రసాయనాలు చేరుతున్నాయని వివరించేవారు. ఆయన మృతి పర్యావరణ మార్గదర్శి సభ్యులకు దిగ్భ్రాంతి కలిగించింది. – ఎస్.విజయ్కుమార్, అధ్యక్షుడు, పర్యావరణ మార్గదర్శి వైశాఖి నడిచే విజ్ఞాన సర్వస్వం గొల్లపూడి నడిచే విజ్ఞాన సర్వస్వం. బహుముఖ ప్రజ్ఞానిధి. రచన, పత్రిక, నాటకం, సినిమా ఈ నాలుగు రంగాలలో ఆంధ్ర రాష్ట్రంలో సాధికారికంగా మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి గొల్లపూడి. సినిమా రంగంలో ఆయన ప్రతిభ అందరికీ తెలిసిందే, సాహిత్య రంగంలో ఏ విషయం మీద అయినా చాలా వేగంగా అద్భుతంగా రచనలు చేయగలిగే నిష్ణాతుడు. వందేళ్ల కధకు వందనాలని టీవీలో ప్రోగ్రామ్ చేశారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ నుంచి ఇప్పటి మా తరం వరకు మాబోటి వారితో.. మొత్తం మీద నాలుగు తరాల వారితో గొల్లపూడికి అనుబంధం ఉంది. – డి.వి.సూర్యారావు, రచయిత గొల్లపూడికి గీతం డాక్టరేట్ ఆరిలోవ(విశాఖతూర్పు): సినీ నటుడు గొల్లపూడి మారుతిరావుకు గీతం వర్సిటీతో మెరుగైన సంబంధాలు ఉండేవి. ఆయన నటన శైలి, రచనలను గీతం డీమ్డ్ వర్సిటీ గుర్తించింది. ఇందులో భాగంగా 2017లో గీతం 8వ స్నాతకోత్సవం సందర్భంగా డాక్టరేట్ ప్రకటించింది. అప్పటి స్నాతకోత్సవంలో గీతం చాన్సలర్ కోనేరు రామకృష్ణారావు గొల్లపూడి మారుతీరావుకు డాక్టరేట్ను అందజేసి గౌరవించారు. నవ్వుతూ, నవ్విస్తూ ఉండే స్నేహశీలి మహారాణిపేట(విశాఖ దక్షిణం): తెలుగు సాహిత్యంలో సాటిలేని సంతకం గొల్లపూడి మారుతీరావుది. నాటక, సినీ రంగాల్లో ఆయనది అందె వేసిన చెయ్యి. ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, వర్తమాన అంశాలను స్పృశిస్తూ వాస్తవాలను ఎలుగెత్తి చెప్పేవి. వివిధ పత్రికల్లో ప్రచురితమైన రచనలు పాఠకులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీటన్నిటికీ మించి మంచి స్నేహశీలి. ఎప్పడు తన మాటలతో ఎదుటివాడి నోటికి తాళం వేసేటట్టు.. ఛలోక్తులు విసురుతూ మాటాడేవారు. మాటకారితనంతో మురిపించేవారు. అందరిని నవ్విసూ్త,నవ్వుతూ ఉండేవారు. ఆయన మృతి సాహితీరంగానికి తీరని లోటు. నేను మంచి మిత్రుడిని కోల్పోయాను. -వంగపండు ప్రసాదరావు, కళాకారుడు -
‘గొల్లపూడి’ ఇకలేరు
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి అమరావతి, హైదరాబాద్ : ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు (81) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉ.11.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శివగామి సుందరి, కుమారులు సుబ్బారావు, రామకృష్ణ ఉన్నారు. ఒక కుమారుడు శ్రీనివాస్ గతంలోనే ప్రమాదానికి గురై మరణించారు. సాహిత్యాభిలాషిగా, రచయితగా అన్ని రంగాలకు చెందిన అంశాలపై విశ్లేషకునిగా, విప్లవాత్మకమైన విమర్శకునిగా పేరొందిన గొల్లపూడి.. తెలుగు భాషాభిమానులకు, సినీ ప్రేమికులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరంలేని వ్యక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. చెన్నైలో జరిగే తెలుగు సంఘాల కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న గొల్లపూడి.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై గత నెల 5న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. అయితే, మళ్లీ అస్వస్థతకు గురై ఇటీవల ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య కారణాలవల్ల శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (పూర్వపు మద్రాసు ప్రావిన్స్) విజయ నగరంలో జన్మించారు. విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలోనే పూర్తిచేశారు. ఈ కారణంతోనే ఆయన చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఉంటూనే నెలలో కొన్నిరోజులు విశాఖలో గడుపుతూ సాహితీ ప్రియులకు అందుబాటులో ఉండేవారు. 15న చెన్నైలో అంత్యక్రియలు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఈనెల 15న చెన్నైలో జరపనున్నట్లు ఆయన చిన్న కుమారుడు రామకృష్ణ తెలిపారు. తండ్రి భౌతికకాయాన్ని శనివారం ఉదయం ఆస్పత్రి నుంచి స్వగృహానికి తీసుకొచ్చి ఆదివారం ఉదయం వరకు బంధుమిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని చెప్పారు. జర్మనీలో ఉంటున్న కుమారుడు సుబ్బారావు పెద్ద కుమార్తె, అమెరికాలో చదువుకుంటున్న మూడో కుమార్తె.. మారుతీరావు రెండో కుమారుడు రామకృష్ణ కుమారుడు శ్రీనివాస్ జర్మనీ నుంచి రావాల్సి ఉన్నందున అంత్యక్రియలను ఆదివారం నిర్వహించేందుకు నిర్ణయించారు. ప్రముఖుల దిగ్బ్రాంతి.. గొల్లపూడి మారుతీరావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలక్షణ రచయిత, విమర్శకుడు, జాతీయ భావాలు కలిగిన మానవతావాది, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు ఇక లేరనే వార్త తీవ్రమైన బాధ కలిగించిందని వెంకయ్య అన్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని కేసీఆర్ కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి.. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారని వైఎస్ జగన్ అన్నారు. గొల్లపూడి మరణంపై సంతాపం వ్యక్తం చేసినవారిలో హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
గొల్లపూడి గుడ్బై
గొల్లపూడి మారుతీరావు అనే ఒక్క పేరే అనేక రకాలుగా సాక్షాత్కరిస్తుంది. బుద్ధిజీవులకు ఓ మహా రచయిత దర్శనమిస్తాడు. సినీ జీవులకు ఆ పేరు వినగానే నాగభూషణం లాంటి విలన్ గుర్తొస్తాడు. పత్రికా ప్రపంచంలో జీవనయానం ప్రారంభించి రంగస్థల, సినీ రచయితగా అనేక పాత్రలు పోషించిన ఆయన వేదిక దిగేశారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి విద్యార్థిగా ఉన్నప్పుడే రచనా వ్యాసంగంలోకి దూకేశారు. తొలి దశలో కథలు రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కలాన్ని నమ్ముకునే జీవించాలనుకున్నారు. ఆంధ్రప్రభలో చేరారు. అట్నుంచి రేడియోకి విస్తరించారు. నాటక రచయితగా కళ్లు లాంటి ప్రయోగాత్మక రచనతో అవార్టులతో పాటు ప్రేక్షక హృదయాలనూ గెల్చుకున్నారు. రచనా రంగంలో విజయపతాకం ఎగరేసిన గొల్లపూడి సహజంగానే దుక్కిపాటి మధుసూదనరావు దృష్టిని ఆకర్షించారు. అరెకపూడి కౌసల్యా దేవి రాసిన చక్రభ్రమణం నవల ఆధారంగా తెరకెక్కిన డాక్టర్ చక్రవర్తి సినిమాకు స్క్రీన్ ప్లే రచయి తగా గొల్లపూడిని ఆహ్వానించారు దుక్కిపాటి. ఆ స్క్రీన్ ప్లే రచనకు నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మగౌరవం స్క్రిప్ట్కు మరోసారి నంది గొల్లపూడిని వరించింది. అనేక సూపర్ హిట్ చిత్రాలకు డైలాగ్ రైటర్గా పనిచేశారు గొల్లపూడి. ఎస్.డి. లాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అనేక సూపర్ హిట్ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. అన్నదమ్ముల అనుబంధం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు డైలాగ్స్ రాసి తన కలానికి మాస్ పల్స్ కూడా తెల్సుననిపించారు మారుతీరావు. కోడి రామకృష్ణ దర్శకుడుగా అరంగేట్రం చేయడానికి ముందుగా అనుకున్న కథ తరంగిణి. అయితే చిత్ర కథానాయకుడు చిరంజీవి అని నిర్మాత కన్ఫర్మ్ చేయడంతో కథ మారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అయ్యింది. అందులో ఓ పాలిష్డ్ విలన్ రోల్ ఉంటుంది. దాన్ని ఎవరితో చేయించినా పండదనిపించింది కోడి రామకృష్ణకు. ఫైనల్గా మీరే చేసేయండని గొల్లపూడిని బల వంత పెట్టేశారు. ఆయనా సరే అనేశారు. అలా నటుడుగా తెర ముందుకు వచ్చి సక్సెస్ కొట్టారు. ఆ తర్వాత అనేక పాత్రలు గొల్లపూడిని వెతుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన వాటిలో అద్భుతంగా పేలినవి అనేకం ఉన్నాయి. అభిలాషలో ఉత్తరాంధ్ర మాండలికంలో ఓ శాడిస్ట్ విలన్ రోల్ చేశారు గొల్లపూడి. బామ్మర్ది అనే ఊతపదంతో ప్రవేశించే ఆ పాత్ర అభిలాష సెకండాఫ్ను నిల బెట్టింది. అలా సినిమా సక్సెస్కు ఊతంగా నిల్చిన అనేక పాత్రలకు గొల్లపూడి ప్రాణం పోశారు. సుమారు 87 చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన గొల్లపూడి నటుడుగా 230 చిత్రాలు చేశారు. క్యారెక్టర్ రోల్స్తో పాటు హాస్యనటుడిగానూ మెప్పించారు. ముఖ్యంగా గుంటనక్క తరహా విలనిజం చేయాలంటే.. గొల్లపూడిదే అగ్రతాంబూలం. గొల్లపూడి నటనలో ఓ నిండుదనం ఉంటుంది. డైలాగ్ మీద పట్టు ఉంటుంది. అద్భుతమైన మాడ్యులేషన్ ఉంటుంది. ఫైటింగులు చేసే విలనీ కాదు... జస్ట్ అలా కూల్గా మాట్లాడుతూ అపారమైన దుర్మార్గం గుప్పించే పాత్రలు పోషించాలంటే చాలా టాలెంట్ కావాలి. అధికారం కావాలి. నాగభూషణం చేయగలిగేవాడు. పాత్రకు న్యాయం చేయడానికి ఒక్కోసారి స్వతంత్రించేవారు కూడా. గొల్లపూడిలో మళ్లీ ఆ స్థాయి నటుడు కనిపిస్తాడు. చిరంజీవి ఛాలెంజ్ మూవీలో స్మిత భర్త పాత్రలో గొల్లపూడి ఆ తరహా విలనీ అద్భుతంగా పండించారు. విస్తృతమైన తన అనుభవాల సారాన్ని అమ్మ కడుపు చల్లగా పేరుతో ప్రచురించారు గొల్లపూడి. ఆయన బాగా ఔట్ స్పోకెన్. ఎటువంటి దాపరికాలూ ఉండవు. తన మనసులో అనిపించింది రాసేస్తారు. అందుకే ఆయన అంత విస్తృతంగా రాసేస్తారు. ఇంటర్ నెట్లో కూడా అంత విస్తారంగా రాసిన రచయితలు అరుదు. అదీ మారుతీయం. వయసు పెరిగిన తర్వాత అడపాదడపా గౌరవప్రదమైన పాత్రల్లో కనిపిస్తూ... అచ్చతెనుగు నుడికారాన్ని వినిపిస్తూ... కనిపించిన నటుడు గొల్లపూడి. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన గొల్ల పూడి కలం ఆయన కన్నుమూసే వరకు అలసట చెందక సాహితీ వ్యవసాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు స్మృతిగా మిగిలిపోయింది. భరద్వాజ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
వారం రోజుల్లో సినిమా షూటింగ్లకు పర్మిషన్
సాక్షి, హైదరాబాద్: నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా వారం రోజుల్లో సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్లకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సినిమా షూటింగ్ల అనుమతుల కోసం వివిధ శాఖల అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, దీంతో ఎంతో సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు. గురువారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో చలనచిత్ర రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. షూటింగ్ల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని కొన్ని శాఖలు అందజేశాయని, మరికొన్ని శాఖలు ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఆయా శాఖల సమాచారం కూడా సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 600 థియేటర్లు ఉన్నాయని, వీటిలో ఎఫ్డీసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హోంశాఖ ఇన్చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎఫ్డీసీ సీఐవో కిషోర్బాబు,పలువురు నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయిత, వ్యాఖ్యాత గా కూడా గొల్లపూడి రాణించారని గుర్తు చేశారు. సుమారు 250 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన ఆ నంది అవార్డులు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మృతి తో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
గొల్లపూడి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందన
-
గొల్లపూడి మారుతీరావు చెన్నైలో అంత్యక్రియలు
-
గొల్లపూడి నాకు క్లాస్లు తీసుకున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని ఆయన అన్నారు. 'ఆ మధ్య తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం. నేను 1979లో ‘ఐలవ్యూ’ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతిరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతిరావుగారు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాస్లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టీ.నగర్లో వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి, గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. చదవండి: సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత నాకు కూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఈ పాత్రని గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి చాయిస్ అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్బుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. ఆ విధంగా నా సహ నటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి నాకు. ఆ తర్వాత నుంచి ‘ఆలయ శిఖరం‘ , ‘అభిలాష’, ’ఛాలెంజ్‘ లాంటి వరుసగా ఎన్నో సినిమాలు ఇద్దరం కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాల ా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చిరంజీవి అన్నారు. -
ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో జరుగుతాయని ఆయన రెండో కుమారుడు రామకృష్ణ తెలిపారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని లైఫ్లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల నుంచి వచ్చే వరకూ గొల్లపూడి భౌతికకాయాన్ని ఆస్పత్రిలోనే ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని గొల్లపూడి నివాసానికి తరలించి ఆదివారం మధ్యాహ్నం వరకూ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మారుతీరావుకు ముగ్గురు మగ సంతానం సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. అయితే గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్ 1992లో ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదు బహుమతి అందిస్తున్నారు. కాగా గొల్లపూడి మారుతీరావు రచయితగా, నటుడుగా, సంపాదకుడుగా, వ్యాఖ్యాతగా, విలేఖరిగా తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగా, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉప సంపాదకుడిగా పనిచేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో గొల్లపూడి చిత్రరంగ ప్రవేశం చేశారు. చదవండి: సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత కుమారుని మరణం కుంగదీసింది -
గొల్లపూడి మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వినూత్నమైన డైలాగ్ డెలివరీతోపాటు, రచనల్లో, నాటకాల్లో తనదైన శైలితో ఆయన అందరిని ఆకట్టుకున్నారని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారని తెలిపారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. రచయితగా, నటుడుగా, సంపాదకుడిగా, వ్యాఖ్యతగా గొల్లపూడి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. చదవండి : సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత -
నటుడు గొల్లపూడి కన్నుమూత
-
సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత
చెన్నై : ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
నామాల గుండు
ఆమధ్య అక్కర్లేని ఆపరేషన్కి అవసరంలేని టెస్టులు చేయించమన్నారు డాక్టర్లు. అందులో ఎక్స్రే, గుండె చప్పుళ్ల ప్రణాళిక(డీసీఎం) ఉన్నాయి. వీటన్నింటికీ చికాకు పడుతూవుండగానే డాక్టరు రావడం ఆలస్యం అవడం వలన నన్ను గుండె చప్పుళ్ల టేబుల్ ఎక్కించారు. ఈలోగా వచ్చారు డాక్టరు. మలయాళీ.. సరసమైన మనిషి. వెంటనే పరీక్ష ప్రారంభించాడు. ఎక్కడా తను ఊహించిన శబ్దాలు వినిపించకపోవడంతో మారు మారు వెతుకుతున్నాడు. ఏమిటండీ వెతుకుతున్నారు? అన్నాను. మీ గుండెకాయలో గుండెకి సంబంధించిన చప్పుళ్లేవీ వినిపించడం లేదు అన్నారు. ఆశ్చర్యం!! నేను నవ్వుకున్నాను. మొదటినించీ ఏ శబ్దాలు వింటున్నారో చెప్పండి? ఇది డాక్టరుకు సమాధానం: పదహారు, పదిహేడేళ్లనాటి సంఘటన–ఆ వయసులో కుర్రాళ్లం వేదికలెక్కి నాటకాలు ఆడాలన్న తాపత్రయం. కానీ ఇవి ఏమిటి? మరికాస్త వయసులోనే యువకులకు నాటక పాఠాలు చెప్పే పరిస్థితి. అప్పటికి నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యాను. అది ఒక వెర్రిగోల. కొంతదూరం వెతికాడు. డాక్టరు చక్రవర్తి సైన్ బోర్డు మా అబ్బాయిని ఎత్తుకుని గేటు దగ్గర రోజూ మేము. మా పేర్లు చూసుకునేవాళ్లం. నవ్వి ఇది 53 సంవత్సరాల క్రిందట ప్రారంభమైన సినిమా కథ. పసివారి ఒంటరితనం నాకు తెలియదు. ఉన్నట్టుండి ఇంట్లోరామయ్యన్నారు. స్టార్ అన్నారు. డజన్లకొద్దీ సినిమాలు మీద పడ్డాయి. అది పలుకుబారిన దశ. హఠాత్తుగా డాక్టరు ఆగిపోయాడు. నేనూ ఆగిపోయాను. ఏమిటి ఈ నిశ్శబ్దం అన్నాడు డాక్టరు. 80 సంవత్సరాలపైన నన్ను పెంచి పెద్ద చేసిన పెద్ద దిక్కు నాన్నగారు వెళ్లిపోయారు. గతం స్వగతం చెప్పుకునే విషాదకరమైన క్షణాలు ఇంకా సందిగ్ధం నడుస్తూనే వుంది. మళ్లీ ఏమిటి ఇది? నాకు 40 ఏళ్ల జీవితాన్నివ్వవలసిన కొడుకు శవం ముందుంది. ఇంకా వెతుకుతున్నారు. 30 ఏళ్లు మీరిన భార్య వృద్ధురాలైంది. మరికాస్త దూరం ప్రయాణం. ఇంకా నిశ్శబ్దమే. జీవితం పరుగులు పెడు తోంది. ఉన్నట్టుండి శబ్దాలు ఆగిపోయాయి. తడబడుతున్న గొంతుతో అన్నాను. నా ప్రాణం మా అమ్మ ఇప్పుడే వెళ్లిపోయింది–నా ఒడిలో తలపెట్టుకుని. వెళ్లిపోతున్న మా అమ్మ ఆఖరి ఊపిరిని నా ఊపిరి తరిమి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది. గొంతు గాద్గదికమైంది. మళ్లీ నా నవ్వే తోసుకొచ్చింది. యాభై తొమ్మిది ఏళ్ల కిందట చదువుకుని సాహితీప్రపంచంలో అంతో ఇంతో సాధించిన నన్ను ఆంధ్రాయూనివర్సిటీ విస్మరించగా 39 ఏళ్లకిందట స్థాపించిన గీతమ్ కాలేజ్ డాక్టరేట్ ఇచ్చింది. జీవితం పల్టీలు కొడుతోంది. కళ్లకి కాటరాక్టు, చేతికి కర్ర వచ్చింది. చేతిరాత వంకర్లు తిరిగింది. వయసు పలకరిస్తోంది. ఈ దశలో జీవనకాలమ్ కుంటినడక నడుస్తోంది. నా కళ్లు గతంలో ఉన్నాయి. ఎదురుగా వున్న గుండె చప్పుళ్ల ధోరణి నిశ్శబ్దంగా వుంది. ఏమిటీ కథల సమూహానికి పేరు? అన్నాడు సరదా అయిన డాక్టరు. ఈ ప్రణాళికకి ఒక పేరుంది. అది నాకు తెలుసు. ఏమిటది? నేను. గొల్లపూడి మారుతీరావు -
శరదశ్శతమ్
కొన్ని రోజుల్లో చచ్చి పోతున్నావని డాక్టర్లు తేల్చారు. నిన్ను చూడా లని ఉందిరా అని సమా చారం పంపాడు కాళీ, దాసుకి. దాసుది సామర్ల కోటలో సగ్గుబియ్యం హోల్సేల్ వ్యాపారం. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తండ్రి వ్యాపారం దాసు వారసత్వంగా పుచ్చుకున్నాడు. పై చదువులు చదివి రైల్వేలో ఉద్యోగం సంపా దించుకున్నాడు. ఇద్దరూ కలిసి దశాబ్దాలు గడి చింది. అందుకే ఈ సమాచారం దాసుకి ఆశ్చ ర్యాన్ని కలిగించింది. అయినా కానీ పనికట్టుకుని చిన్ననాటి స్నేహితుడిని చూడటానికి బయలు దేరాడు దాసు. కాళీ 77, దాసు 75. కాళీకి ఇన్నేళ్లలో ఉన్న జుత్తు ఊడిపోయింది. దాసుకి వారసత్వంగా తల్లిదండ్రుల పొట్ట వచ్చింది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుని కావలించుకుని, గెంతులేసి పొంగిపోయారు. విచిత్రం, స్నేహితుడిని బాధిస్తానని దాసు కాళీ జబ్బు గురించి అడగలేదు. రాకరాక వచ్చిన స్నేహితుడిని ఇబ్బంది పెడతానని కాళీ చెప్పలేదు. బయటికి ఇద్దరూ ఆనందంగా, డాబుగా, అన్నిటినీ మించి తృప్తిగా ఉన్నారు. ఆమాటా, ఈమాటా మాట్లాడుతూ చిన్నతనంలో తమ అక్కలు ఆడే ‘ఆడ ఆటలు’ ఆడారు. చెమ్మాచెక్కా ఆడినందుకే పగలబడి నవ్వుకున్నారు. చింతపిక్కలతో ఆడవాళ్లు ఆడే తొక్కుడుబిళ్ల ఆట ఆడారు. వెనక వరండాలో 75 సంవత్సరాల బొజ్జ దాసు, కాళీ 77 సంవత్సరాల జబ్బు శరీరం గెంతు లాట చూసి ఇంటిల్లిపాదీ ముక్కుమీద వేలేసు కున్నారు. ఆ రాత్రి డాక్టరు కాళీకి రెండు మాత్రలు తక్కువ చేశాడు. రానురానూ మిత్రులిద్దరూ పసిపిల్లలయి పోయారు. కాళీ చిన్నతనంలో బొమ్మలు వేసే వాడు. ఒకరోజు రెండు అట్టలమీద పులి ముఖాలు వేశాడు. ఇది మిత్రులు ఇద్దరూ శ్రీరామనవమి సంబరాల్లో రోజూ ఆడే ఆట. ఎప్పుడు? 25 సంవత్సరాల కిందట. అయినా ఇద్దరూ బొమ్మలు పెట్టుకుని పులిగెంతులు గెంతారు. ఇదే ఆట. ఇంటిల్లిపాదీ నిర్ఘాంత పోయారు. ఆ రోజుల్లో దాసు బొజ్జకి డాక్టరు ఇంజక్షన్ ఇచ్చాడు. ఇద్దరూ ఇంటర్మీడియట్ చేసే రోజుల్లో కాకినాడలో అద్దెకి ఉండేవారు. ఇద్దరూ భయం కరమైన గొంతు కలవారు. ‘పాతాళభైరవి’ చూసి వచ్చి– పాటల పుస్తకం కొని పాటలన్నీ భయం కరంగా పాడారు. ఇంటివారు మొత్తుకుంటే మరింత విజృంభించారు. ఇప్పుడా ఇల్లు లేదు. ఇంటాయన లేడు. 65 సంవత్సరాల కిందటిమాట. 75 సంవత్సరాల దాసు విజృంభించాడు. 77 సంవత్సరాల కాళీ అందుకున్నాడు. ఇప్పుడు తమ ఇంట్లో కాదనే వారెవరు? వాళ్ల గొంతుల్ని, అల్లరిని బాలక్రిష్ట త్వాన్ని భరించారు. భరిస్తున్నారని తెలిసి ఇద్దరు మిత్రులూ రెచ్చిపోయారు. దాసు వెళ్తానంటే కాళీ, దాసు బొజ్జమీద దరువువేశాడు. చిన్నతనం ఆటలు, ఆ చవకబారు ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. స్కూలుకి వస్తే, రైలు పట్టాలు దాటుతున్న చంటిబాబు చావు తలుచు కుని ఇద్దరూ ఏడ్చారు. అతని ‘మాజిక్’ విన్యా సాలు ఒక రోజంతా చెప్పుకున్నారు. ఏతావాతా 15 రోజుల్లో ఉద్యోగి కాళీ, వ్యాపారి దాసూ మారిపోయారు. 65 సంవ త్సరాలు వెనక్కిపోయారు. మనస్సుల ముసు గులు మళ్లీ అతుక్కున్నాయి. వాస్తవం అటకెక్కింది. ‘ఏమిటి తాత ధోరణి’ కాళీ మనుమడు డాక్టరు దగ్గర ఆశ్చర్యపడ్డాడు. డాక్టరు కంగారు పడటానికి బదులు నవ్వాడు. ‘ఎప్పుడు వస్తారు’ అని సామర్లకోట నించి ఫోన్ చేసిన దాసు మేనల్లుడికి– దాసు చేతుల్లో ఫోన్ లాక్కుని సమాధానం చెప్పాడు కాళీ ‘ మీ మామ ఇప్పుడు రాడురా’ అని. ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు.18 రోజులు గడిచిపోయాయి. ఇద్దరు మిత్రులూ వర్తమానాన్ని మర్చిపోయారు. జీవితాన్ని తిరగేసి మళ్లీ గడపటం ప్రారంభిం చారు. 25 రోజులు అయింది. దాసు లేచేసరికి కాళీ సూర్యో దయం చూస్తూ కనిపించాడు. ‘ఏంట్రా ఆలోచిస్తున్నావు?’ అన్నాడు దాసు. కాళీ ధైర్యంగా ఇటుతిరిగి ‘నేను చావనురా– నువ్వు సామర్లకోట పో’ అన్నాడు కాళీ. జ్ఞాపకాలు బంగారు తాకిడీలు, ఆలోచనలు ఆత్మబంధువులు. (నన్ను మళ్లీ ‘జీవనకాలమ్’ రాయమని పోరి రాయించిన మా తమ్ముడు శివకి అంకితం) గొల్లపూడి మారుతీరావు -
చట్టం చలివేంద్రం
కశ్మీర్ సన్నివేశం టీవీలో చూసినప్పుడల్లా ఆశ్చర్యం గానూ, ఎబ్బెట్టుగా ఉండేది. తమ మూతులు కనిపించకుండా గుడ్డలు కట్టుకున్న పాతిక ముప్ఫై మంది యువకులు, పిల్లలు బహిరంగంగా రోడ్లమీద ఎదురుతిరిగి పోలీసులను కొట్టడం, వాళ్లు చేతుల్లో లాఠీలు, తుపాకులు ఉన్నా నిస్సహాయంగా ఆ రాళ్లను ఎదుర్కోవడం, దురదృష్టవశాత్తు వారిలో కొందరు గాయపడటం, ఒకరిద్దరు చనిపోవడం.. ఇది విడ్డూరంగా ఉండేది. కారణాలు ఏవైనా క్షణంలో పోలీసులు ఆ యువకులను తరిమికొట్టవచ్చు. ఒక పోలీసు గాయపడితే ఎవరూ పట్టించుకోరు. కానీ, ఒక యువకుడు గాయపడితే, పసివాడు గాయపడితే సరే సరి. నాయకులు రెచ్చిపోతారు. పసివారిని ప్రభుత్వం చంపేస్తోందని విరుచుకుపడతారు. ఇది విచిత్రమైన పరిస్థితి. ఇలా సాగాల్సిందేనా? అని అప్పుడప్పుడూ ఆవేశం కూడా వచ్చేది. ఈమధ్య ఉన్నట్టుండి రాళ్ల వర్షం ఆగిపోయింది. కాకపోతే ఈ వర్షంలో ఈ మధ్య ఒక లారీ డ్రైవర్ చనిపోయినట్టు వార్త కనిపించింది. ఏమిటీ రాజకీయ యుద్ధం. కారణం ఎవరు? ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది. ఆ కుర్రాళ్లందరూ పాకిస్తాన్ భక్తులు కారు. రోజుకూలీ సంపాదించుకునే కూలీలు. రాళ్లు విసిరినందుకు ప్రతిరోజూ డబ్బు ముడుతుందట. ఎవరిస్తారు? ఇండియా వ్యతిరేకులు ఇస్తారు. వాళ్లని సంవత్సరాల తరబడి వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆర్థికంగా మేపుతున్నాయి. సకల సౌభాగ్యాలూ ఇస్తున్నాయి. పోలీసులకు తుపాకీ పేల్చడం సులువు. కుర్రాళ్లు గాయపడటం గ్యారంటీ. పిల్లలకి ఏమైనా అయితే కశ్మీర్ వ్యతిరేక నాయకులు విజృంభిస్తారు. వీళ్లకు ఎవరో ఎలాగో డబ్బు చేరుస్తారు. రాళ్ల సంపాదన వారి సొత్తు. ఈమధ్య ఉన్నట్టుండి రాళ్ల వర్షం ఆగిపోయింది. కారణం మధ్యవర్తులుగా కశ్మీర్ వ్యతిరేక వాదులంతా జైళ్లలో ఉన్నారు. వారికి చేరవలసిన కశ్మీర్ పైకం చేరడం లేదు. రాళ్లు విరివిగా ఉన్నాయి. విసిరేవారు తగ్గిపోయారు.ఇది ఒకే వాక్యం–ప్రచ్ఛన్నయుద్ధం. తెలిసి తెలిసి ఈ యుద్ధాన్ని గమనిస్తున్న నాయకులు కూడా నిర్బంధంలో ఉన్నారు. ఫరూఖ్ అబ్దుల్లా ఈమధ్య తన స్వాతంత్య్రం గురించి వాపోయారు. పదిసార్లు ఈ దేశం నాది, ఈ జీవితం వివాదరహితంగా సాగాలని పదిసార్లు చెప్పి చెప్పి, ఒక్కసారి మాత్రమే రాళ్లేసే పిల్లల గురించి, దౌర్జన్యకారుల గురించి మాట్లాడతారు. అప్పుడు ఆయన పెదాలు ఆవేశంగా బిగుసుకుంటాయి. ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. గవర్నమెంటు చర్యలను విమర్శించేవారు నిర్బంధంలో ఉన్నారు. ఇదొక విచిత్రమైన రాజకీయ పోరాటం. ఇందులో ముఖ్యమైన పాత్ర పత్రికలదే. ఇంకొన్ని నిశ్శబ్ద పాత్రల గురించి నిన్ననే దేశ సంరక్షణాధికారి అజిత్ దోవల్ చెప్పారు. వాటిలో ఒకటి న్యాయస్థానం. జరుగుతున్నది అరాచకమని తెలిసినా, చేసిన వ్యక్తి తప్పనిసరిగా చేశారన్నా–దౌర్జన్యకారుల పట్ల–తమ మెత్తని విచక్షణ ద్వారా పరోక్షంగా రక్షణ కల్పిస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎవరైనా దౌర్జన్యకారుల ఆచూకీ తెలిపారా? తెలిపి న్యాయస్థానం ముందో, లేకుంటే దౌర్జన్యకారులముందో నిలవగలిగారా? వీరంతా పరోక్షంగా అన్యాయాన్ని, అరాచకాన్ని సమర్థిస్తున్నట్లు జాతీయ రక్షణ సలహాదారు నిన్న కుండబద్దలు కొట్టారు. పిల్లల్ని శిక్షించడం సాధ్యం కాదు. దౌర్జన్యకారులు ఒకింతకుకానీ లొంగరు. చచ్చిపోయినవారు సాక్ష్యం చెప్పరు. దోవల్గానీ, నేనుగానీ 370 గురించి మాట్లాడింది లేదు. రాజకీయమయమైన ప్రారబ్ధానికి ‘పత్రిక’లు ఆజ్యం పోయరాదన్న ఆయన వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. గొల్లపూడి మారుతీరావు -
ప్రచారంలో పదనిసలు
ఈమధ్య రాజకీయ నాయకులు తమ ప్రచారంలో ఓ ప్రమాదకరమైన విషయంలో కాలుమోపుతున్నారని నాకనిపిస్తుంది . అసదుద్దీన్ ఒవైసీగారు నరేంద్రమోదీ మీద కాలు దువ్వుతూ ఒకానొక సభలో ‘‘గో మాంసంతో చేసిన బిరియానీ సేవించి తమరు నిద్రపోయారు ? ’’ అని విమర్శించాడు. ఇందులో ప్రత్యేకమైన ఎత్తుపొడుపు– గోవుల్ని ఆరాధించే పార్టీనాయకులు అలాంటి బిర్యానీని తినడం. వీరే 2018 తెలంగాణా ఎన్నికలలో ‘‘నేను ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుని ఒక ప్యాకెట్ ‘కళ్యాణి’ బిర్యానీ అడుగుతా’’ అన్నారు. బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ఉత్తరప్రదేశ్ మొరా దాబాద్ ఎన్నికల సభలో ‘‘ఇంతకాలం కాంగ్రెస్ దౌర్జన్యకారుల చేత బిర్యానీని తినిపించింది’’అని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు కార్యదర్మి ప్రియాంకా గాంధీ ‘‘మోదీగారు పాకిస్తాన్ బిర్యానీని సేవించడానికి పాకిస్తాన్ వెళ్లారు’’ అని వెక్కిరించారు. తెలుగులో ఓ సామెత∙ఉంది. ప్రత్యర్థిని దెబ్బతీస్తున్నప్పుడు ఒకమాట చెప్తారు. ‘‘ఏమైనా చెయ్యండి కానీ అతని కడుపు మీద కొట్టకండి’’ అని. కారణం ఉపాధికి మూల స్థానం– కడుపు. దానికి సంబంధించినది దేన్ని కదిపినా మనిషి కదులుతాడు అయినా ఈమధ్య రాజకీయ నాయకులు ‘కడుపు’ మీద కొడుతున్నారు. అది చాలా ప్రమాదకరమైన చర్య అని ముందుగా అందరినీ హెచ్చరిస్తున్నాను. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రుచి ఉంటుంది. దానిని ఎత్తి చూపి ఆ ప్రాంతాలవారిని వెక్కిరించడం కద్దు. దక్షిణాదివారిని ‘ఇడ్లీ సాంబారు వాలా’ అంటారు. ఒకప్పుడు ఇది తమిళుల సొత్తు ఇప్పుడు ఇడ్లీ విశ్వరూపం దాల్చింది. వాషింగ్టన్ , దుబాయ్, మలేషియా– ఎక్కడయినా ఇడ్లీ దర్శనమిస్తుంది. తెలుగువారికి – దోశ, పెసరట్టు. నేను విజయవాడలో పనిచేసే రోజుల్లో రాత్రంతా రచన చేసి ఏ తెల్లవారు జామునో కడుపు తేలిక కాగా ఏలూరు రోడ్డుకి వచ్చేవాడిని. ఆ సెంటర్లో ‘మాతా కేఫ్’ ఉండేది. మాలాంటి వాళ్ల కోసం వేడి వేడి ఇడ్లీలు చేసేవాడు. ఓపట్టు ఎక్కువ పట్టాలంటే మినప దోసె. వీటిని తినడానికే ఓ రాత్రి వరకూ రచన సాగించేవారం. కాలిఫోర్నియాలో సాగర్ అనే తెలుగు మిత్రులు ఒక ఆంధ్రా హోటల్ తెరిచారు. పేరు? ‘‘దోసె ప్యాలెస్’’. అక్కడి దోసెలు తినడానికి 60–70 మైళ్ల దూరం నుంచి తెలుగువారు రావడం నాకు తెలుసు. మరి కేరళవారికి? పుట్టు కడలె చాలా అభిమాన వంటకం. సంవత్సరాల కిందట ప్రముఖ దర్శకులు భీమ్సింగ్ గారి సతీమణి సుకుమారి ఇంట్లో తిన్న జ్ఞాపకం ఇప్పటికీ చెదిరిపోదు. ఇక కర్ణాటకలో– ఆ మాటకు వస్తే మన రాయలసీమ పొలిమేరల నుంచి ‘రాగి ముద్ద’ చాలా ఫేమస్. నిజాం ప్రాంతంలో, కొన్ని ఉత్తరాది ప్రాంతాలలో చాలా పాపులర్ వంటకం– బిర్యానీ. నాకో దురభిప్రాయం ఉండేది. ఇది బొత్తిగా ఉత్తర భారతీయుల ‘రుచి’ అని. నేను పొరపాటు బడ్డానని ఈ మధ్యనే గ్రహించాను. ఇవాళ ఎక్కడ చూసినా చెన్నైలో బిర్యానీ విశ్వరూపం కనిపిస్తోంది. బిర్యానీ హోటళ్ల వివరాల కోసం కంప్యూటర్ తెరిచాను. నాకు శోష వచ్చినంత పనైంది. ఒక్క చెన్నైలోనే దాదాపు 249 హోటళ్లున్నాయి. అదీ రకరకాల బిర్యానీ రుచులతో. మచ్చుకి కొన్ని మాత్రం – ఆసీష్ బిర్యానీ, తాళపుకట్టె బిర్యానీ, మలబార్ బిర్యానీ, అబ్దుల్లా బిర్యానీ, అంబాళ్ బిర్యానీ, తంగమ్ బిర్యానీ, స్టార్ చికెన్ బిర్యానీ, ముఘల్ బిర్యానీ, కరీం బిర్యానీ, ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ, బిలాల్ బిర్యానీ, చార్మినార్ బిర్యానీ, పారామౌంట్ బిర్యానీ, ది రాయల్స్ బిర్యానీ, సేలం ఆర్ఆర్ బిర్యానీ, తారిఖ్ బిర్యానీ, నయీం బిర్యానీ, సంజయ్ బిర్యానీ– ఇక్కడ ఆగుతాను. మొఘలుల కాలంలో ఇండియాకు దిగుమతి అయిన ఈ వంటకం – పేరు, రుచి మార్చుకుని ఇప్పుడు అంతటా దర్శనమిస్తోంది. అవధ్, హైదరాబాద్, పంజాబీ, కలకత్తా, దిండిగల్లు ఇలా మీ యిష్టం. విజయ్ మరూర్ అనే వంటగాడు– లక్షలాది మందికి అనుదినమూ ఆనందాన్నీ, ఉపాధినీ ఇచ్చే ఈ ‘గొప్ప’ దినుసుని రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం చేయడం అన్యాయమని వాపోయారు. మనూ విశ్వవిద్యాలయం చరిత్ర ప్రొఫెసర్ సల్మా ఫరూఖీగారు తమ రాజకీయ వెక్కిరింతలకు నిక్షేపంలాంటి, కడుపుల్ని నింపే వంటకాన్ని వీధిన పెట్టడం దుర్మార్గం అన్నారు. ఏమయినా ఈ రాజకీయ నాయకులందరూ పప్పులో కాలేశారని నాకనిపిస్తుంది. పొరపాటు. ఈ మాట అన్నదెవరో పప్పుని దుర్వినియోగం చేశాడనీ, అతనికి బొత్తిగా పప్పు రుచి తెలియదని నా ఉద్దేశం. ఇప్పుడు – ఈ కామెంట్ను తిరగరాస్తున్నాను. ఈ రాజకీయ నాయకులందరూ నిర్ధారణగా ‘బిర్యానీ’లో కాలేశారు. వారందరికీ అర్థంకాని విషయం ఏమిటంటే మన దేశంలో బిర్యానీ రుచి కొత్త రాష్ట్రాలకూ, ప్రాంతాలకూ పాకుతోంది. రోజురోజుకీ దేశ ప్రజలు బిర్యానీ రుచిని మరిగి విర్రవీగిపోతున్నారు. కనుక బిర్యానీని అడ్డం పెట్టుకుని ఎద్దేవా చేసే నాయకులు వారికి తెలియకుండానే కొన్ని లక్షల ఓట్లు నష్టపోతున్నారని నాకనిపిస్తోంది. -గొల్లపూడి మారుతీరావు -
బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి
సాక్షి, విశాఖపట్నం/పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, జర్నలిజం, నాటకం, నవల, టీవీ, సినిమా, అన్నిటికీ మించి రేడియో ఇన్ని ప్లాట్పారాల మీద రాణించడం గొప్ప విషయమని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి కొనియాడారు. మారుతీరావు 80 జన్మదినం సందర్భంగా విశాఖలో విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘గొల్లపూడి.. అశీతిపర్వం’కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘వందేళ్ల కథకు వందనం’పై ఆయన మాట్లాడారు. మారుతీరావు అనేక రంగాల్లో రాణిస్తూ, నిష్ణాతులతో కలిసి పనిచేశారన్నారు. గొప్పవారితో పనిచేసిన అనుభవం, ప్రావీణ్యం ఆయనను చాలా ఉన్నత స్థాయికి చేర్చాయన్నారు. అమెరికా, లండన్ వంటి దేశాల నుంచేగాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారూ ఆయన వద్దకు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నారన్నారు. గొల్లపూడి గొప్ప మేధావి అని, ఆయన ప్రతిమాట సందర్భోచితంగా ఉంటుందని పేర్కొన్నారు. కథా సాహిత్యంలో తనకు చిన్న స్థానం కల్పించినందుకు గొల్లపూడికి రుణపడి ఉంటానని చెప్పారుగొల్లపూడి రచనలు సమాజానికి అవసరంగొల్లపూడి మారుతీరావు రచనలు నేటి సమాజానికి చాలా అవసరమని విశాఖ రసజ్ఞ వేదిక అధ్యక్షుడు డాక్టర్ గండికోట రఘురామారావు అన్నారు. గొల్లపూడి 80వ జన్మదిన వేడుకలను నిర్వహించడం సంస్థ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఉదయం జరిగిన సాహితీ గోష్టిని డాక్టర్ బి.వి.సూర్యారావు నిర్వహించగా.. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి హాజరై గొల్లపూడి సంపాదకత్వంలో వెలువడిన వందేళ్ల కథకు వందనాలు గురించి మాట్లాడారు. గొల్లపూడి కంటే ముందు ఆయన రచనలు తనకు పరిచయమయ్యాయని చెప్పారు. జర్నలిజమే తమను ఇన్నేళ్ల పాటు కలిపి ఉంచిందన్నారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ గొల్లపూడి తెరంగేట్రం ముందు, తర్వాత జరిగిన సినిమారంగ విశేషాలను వివరించారు. టీవీలు లేని కాలంలో గొల్లపూడి రేడియో నాటికలు వినడానికి లక్షలాది మంది శ్రోతలు ఆదివారం, గురువారం ఎదురు చూసేవారని గుర్తు చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ వంటి పలువురు రచయితలుగా మారడానికి గొల్లపూడి మారుతీరావే స్ఫూర్తి అని తెలిపారు. డాక్టర్ పేరి రవికుమార్ మాట్లాడుతూ స్వాతి వీక్లీలో సీరియల్గా వచ్చిన ‘రుణం’నవల ఎందుకు ప్రజాదరణ పొందిందో వివరించారు. సినీ రచయిత డాక్టర్ వెన్నెలకంటి.. గొల్లపూడి జీవనకాలమ్ గురించి మాట్లాడారు. 40 ఏళ్లుగా ఈ కాలమ్ వారం వారం చదువుతున్న తెలుగు పాఠకుల్ని మళ్లీవారం కోసం ఎదురు చూసేలా రాయడం గొల్లపూడికే దక్కిందన్నారు. ప్రముఖ రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు మాట్లాడుతూ గొల్లపూడిలా బతకడం ఒక కళ, ఒక అదృష్టం, డబ్బుతో కొలవలేని ఐశ్వర్యమని కొనియాడారు. బులుసు ప్రభాకరశర్మ మాట్లాడుతూ చలం తెలుగు మ్యూజింగ్స్ తరువాత గొల్లపూడి ఆంగ్ల మ్యూజింగ్స్కు ప్రాచుర్యం ఎందుకొచ్చిందో వివరించారు. మధ్యాహ్నం సభలో చివరిగా మాట్లాడిన డాక్టర్ గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి గొల్లపూడి ఆత్మకథ అమ్మకడుపు చల్లగా ఎంత గొప్ప రచనకాకపోతే 9వ ప్రచురణకు నోచుకుంటుందని వివరించారు. ఈ సభా కార్యక్రమానికి ముందు శ్రీరామనవమి సందర్భంగా హిడెన్ స్ప్రౌట్స్ సంస్థకు చెందిన ప్రత్యేక అవసరాల పిల్లలు దశావతారాలు నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. నా బర్త్డేని చిరస్మరణీయం చేశారు.. తనకు జరిగిన సన్మానం అనంతరం గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ తన 80వ పుట్టిన రోజును విశాఖ రసజ్ఞ వేదిక చిరస్మరణీయం చేసిందన్నారు. కొద్దిరోజులుగా అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్న తనకు ఏప్రిల్ 14 అంటేనే భయంగా ఉండేదని, ఆ రోజు తాను విశాఖ వెళ్తానోలేదో ఆందోళన చెందేవాడినని చెప్పారు. ‘ఒక దశలో ఆ రోజు తలచుకుంటే పానిక్ అయ్యే వాడిని. నిద్రపట్టేది కాదు.. ఆరోజు హాజరు కాగలనా? అని అనిపించేది. నిన్న మధ్యాహ్నం వరకు అపోలోలోనే ఉన్నాను. రెండు రోజులపాటు ఆరోగ్యం బాగు పడాలని కాకుండా 14కి విశాఖ వెళ్లేలా చూడండని వైద్యులను కోరేవాడిని. ఇప్పుడు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించినందుకు ఆనందంగాను, గర్వంగాను ఉంది’అని వివరించారు. తన జీవితంలో కన్నీళ్లు లేవని, అయితే తన కుమారుడు శ్రీనివాస్ మరణం తనను కలచివేసిందని చెప్పారు. సినిమాల్లో తన భార్యగా ఎక్కువసార్లు నటించిన అన్నపూర్ణ ఎలా ఏడవొచ్చో గ్లిజరిన్ రాసుకోవడం ద్వారా చెప్పేదన్నారు. 80 ఏళ్లలో 67 సంవత్సరాలు రాస్తున్నానని, కొన్ని గొప్పగా రాశానని తెలిపారు. ‘సాయంకాలమైంది’ సాయంత్రం ప్రారంభమైన ‘సాయంకాలమైంది’సభను డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఫైర్ సర్వీసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కె.సత్యనారాయణ.. గొల్లపూడి..అశీతి పర్వం (జన్మదిన ప్రత్యేక సంచిక)ను ఆవిష్కరించారు. తన రచనలతో కరుడుగట్టిన ఖైదీల మనసులను మార్చగలిగిన మారుతీరావు జన్మదిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించడంతో తన జన్మ ధన్యమైందన్నారు. ప్రత్యేక సంచిక తొలి ప్రతిని మావూరి వెంకటరమణ స్వీకరించారు. గౌరవ అతిథులు డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణ రేడియో నాటిక మొదటి భాగాన్ని, డాక్టర్ ఎస్.విజయకుమార్ రేడియో నాటిక రెండో భాగాన్ని ఆవిష్కరించగా.. తొలి ప్రతులను వి.హర్షవర్థన్ స్వీకరించారు. డాక్టర్ ఆదినారాయణ గొల్లపూడిని ప్రశంసించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య గొల్లపూడి మారుతీరావును అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం గొల్లపూడి రచించిన సాయంకాలమైంది నవలపై డాక్టర్ ప్రయాగ సుబ్రహ్మణ్యం చేసిన ప్రసంగం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. గొల్లపూడి సినిమాలపై రాంభట్ల నృసింహశర్మ తనదైన హాస్య ధోరణిలో మాట్లాడారు. ప్రముఖ రచయిత, నటుడు రావి కొండలరావు.. గొల్లపూడితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. తామిద్దరూ నటించిన కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర వేసిన గొల్లపూడి నటనను వివరించారు. సభ ముగిసిన అనంతరం గొల్లపూడి రచించిన ‘కళ్లు’నాటికను బాదంగీర్ సాయి ఆధ్వర్యంలో మాతృశ్రీ కళానికేతన్ వారు వి.సంగమేశ్వరరావు దర్శకత్వంలో ప్రదర్శించారు. జీవీఆర్ఎం గోపాల్ వందన సమర్పణలో విచ్చేసిన సాహితీ ప్రియులకు, నాటక ప్రియులకు, గొల్లపూడి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
‘దాటుడు’ గుర్రాలు
జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మన అభిప్రాయాలు మారుతాయి. ఈ మధ్య రిటైరయిపోయిన ఓ ‘పాత’ రాజకీయ నాయకుడిని కలిశాను. ఆయన తొలి రోజుల్లో గాంధీగారి ఉద్యమంలో పాల్గొని, ఖద్దరు కట్టి, కొన్నాళ్లు సబర్మతి ఆశ్రమంలో ఉండి వచ్చినవాడు. ‘‘ఇప్పుడేం చేస్తున్నారు?’’ అన్నాను. ‘‘ఏమీ లేదండీ. అబ్బాయి షాపులో కూర్చుంటున్నాను’’ అన్నాడు. ‘‘మరి మీరు మొన్నటి దాకా పని చేసిన గాంధీగారి సాహచర్యం?’’ ‘‘ఆ పోకడ నాకు నచ్చలేదండీ’’ అంటూ ఆ విషయం మీద చర్చించడానికి విముఖత చాపాడు. గట్టిగా వత్తిడి చేస్తే అప్పుడు చెప్పాడు. గాంధీగారి జాతీయ భావాలకు ఒక దశలో ఊగిన మాట నిజమే. కానీ ఆయన దరిమిలాను ‘స్వాతంత్య్ర’ ఉద్యమాన్ని ‘మతం’తో కలపడం ఈయనకి నచ్చలేదు. ఒక పార్టీ విశ్వాసాల మీద నిజమైన ‘కమిట్ మెంట్’ ఉన్న ఓ వ్యక్తి స్పందన ఇది. న్యాయం. కానీ తమ వ్యక్తిగత ప్రయోజనాలకు పదేపదే పాత పార్టీని అటకెక్కించేసి కొత్త పార్టీలో దూకే ‘అవకాశవాదులు’ కోకొల్లలు. వీరి దర్శన భాగ్యం ప్రతి రోజూ కలిగే అపూర్వమైన దినాలివి. మరి పార్టీ సిద్ధాంతాలు? విశ్వాసాలు? నాన్సెన్స్! ఎవడిక్కావాలి? పదవులో, డబ్బో.. లేక రెండూనో సంపాదించుకునే అవకాశం కావాలి. అందుకు తన వృత్తి లాయకీ కావాలి. అవును. ఇది ‘సేవ’ కాదు. ‘వృత్తి’. గట్టిగా మాట్లాడితే వ్యాపారం.ఉన్నట్టుండి మన రాష్ట్రంలో కాంగ్రెసు మూలబడ్డాక.. పార్టీలో ఉన్నవారూ, పదవుల్లో ఉన్నవారూ ఎలా చొక్కాలు మార్చారో ప్రజలకు తెలుసు. వీరిప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ పాత చొక్కాల ‘కంపు’ గుర్తుకొస్తుంది. ఇప్పుడు? ఉన్నట్టుండి జయప్రద పార్టీ మార్చారు. తనకి టిక్కెట్టు ఇవ్వలేదని శతృఘ్న సిన్హా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మూలమూలల్లో ఉన్న సినీ తారల్ని ఏరి మరీ పార్టీ టిక్కెట్లు యిస్తున్నారు.. వీరిలో మిగిలిన ఏ మాత్రం ‘పాపులారిటీ’ గుజ్జునయినా రాబట్టుకోడానికి. ఉత్తరప్రదేశ్లో శ్యాం వరణ్ గుప్తా ఎస్.పి. నుంచి బీజేపీకి మారారు. చత్తీస్గఢ్లో గిరిరాజ్ సింగ్ బీజేపీలో చేరారు. రాకేష్ జీ సచిన్ కాంగ్రెసులోకి మారారు. అలాగే ఎస్.పి. హరీష్ ద్వివేదీ బీజేపీకి వచ్చారు. రెయిస్ జహాన్ బీఎస్పీ నుంచి కాంగ్రెసుకి దూకారు. బీఎస్పీ నుంచి ముకుల్ ఉపాధ్యాయ బీజేపీకి వచ్చారు. ఈ ‘దూకుడు’ ఎంత అర్జంటుగా, హాస్యాస్పదంగా ఉన్నదంటే ఆంధ్రాలో టీడీపీ నామా నాగేశ్వరరావుగారు టీఆర్ఎస్లోకి దూకారు. తీరా మరునాడు ఎన్నికల మీటింగులో దూకిన పార్టీ సింబ ల్కి బహిరంగంగా మారిపోయారు. ఇది కేవలం నమూనా ఉదాహరణలు. వీటికి కోట్ల పెట్టుబడి ఉంటుందని, అదవా చేరిన పార్టీ టిక్కెట్లు దక్కే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇలాంటి దుర్గంధ వాతావరణంలో కూడా కాస్త ‘ఆక్సిజన్’ని వ్యాపింపజేసే వ్యక్తులుంటారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న సుష్మా స్వరాజ్, ఉమా భారతి పోటీ నుంచి స్వచ్ఛందంగా శలవు తీసుకున్నారు. ఈ దేశంలో బీజేపీలో 75 సంవత్సరాలు పైబడిన వారిని పోటీలో నిలపరాదని నిర్ణయిం చింది. అందుకు ఆ పెద్దలు అంగీకరించారు. ఈసారి పోటీలో ఎల్.కె.అద్వానీ, కల్ రాజ్ మిశ్రా, ఎమ్.ఎమ్.జోషీ, శాంతకుమార్, బి.సి.ఖండూరీ పోటీ చెయ్యడం లేదు. ఒకాయన చేయాలనుకున్నారు–మురళీ మనోహర్ జోషీ, ఎంత పెద్దవాడు! పోటీలో నిలిస్తే ఓటర్ హారతినిచ్చి ఆహ్వానిస్తాడు కదా? ఆ విషయం తెలిసిన పార్టీ గడుసుగా ఒక సీటుని గెలుచుకోవచ్చు కదా? కానీ పార్టీ ఆయన పోటీ చెయ్యడం లేదని చెప్పింది. ఆయన ఆ విషయాన్ని చెప్పి మానుకున్నారు. ఇదేమిటి? న్యాయంగా ఇప్పటి లెక్కల ప్రకారం ఈయన మరో పార్టీ తలుపు తట్టాలికదా? వీరంతా అన్నారు కదా –తమ పార్టీ ముందు కాలంలో పెద్దల అనుభవాన్ని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకుంటుందని. ఈ మధ్యలో ఎక్కడ చూశాం ఇలాంటి పెద్దరికాన్ని! ఇలాంటి ఉదాత్తత రాజకీయాల్లో ఎక్కడిది? ఆ మధ్య కర్ణాటకలో ఒక సీనియర్ నాయకులు అనంత్ కుమార్ కన్నుమూశారు. న్యాయంగా వారు కన్నుమూసిన విషాదానికి వారి సతీమణిని ఆ స్థానంలో నిలిపి వోటర్ సానుభూతిని పార్టీ రాబట్టుకోవడం సబబు. కానీ పార్టీ తేజస్వీ సూర్య అనే యువకుడిని ఎంపిక చేసింది. న్యాయంగా అనంత్ కుమార్ భార్య తేజస్విని ఎదురు తిరగాలి కదా? అర్జంటుగా మరొక పార్టీలో చేరాలి కదా? పార్టీ పెద్దల్ని దుయ్యపట్టాలి కదా? కానీ ఆవిడ అపూర్వమయిన సంయమనంతో ‘‘నాకు పార్టీ శ్రేయస్సు ముఖ్యం. సమాజ శ్రేయస్సు ముఖ్యం. ఏం చేయాలో, ఎలా చేయాలో పెద్దలు నిర్ణయిస్తారు’’ అన్నారు. ఈ మురుగు నీటి చెలమలకు దగ్గరగా.. యింకా మంచినీటి సెలలున్నాయని నిరూపించే ఓ పార్టీకి పెద్దరికాన్నీ, ఉద్ధతినీ, గాంభీర్యాన్నీ, Objectivityనీ సంతరించే యిలాంటి కొందరు నిజమైన ‘కార్యకర్తల’ ఉనికి దేశానికీ, ప్రజలకీ–ఈ సమాజానికీ కాస్త ‘ఊపిరి’ని ఇవ్వగలదని నాలాంటివారి ఆశ. గొల్లపూడి మారుతీరావు -
సింహావలోకనం
మార్గదర్శకమైన మార్గాన్ని కనిపెట్టే వైతాళికు నికి తను నమ్మిన నిజాల మీద నిర్దుష్టమైన విశ్వాసం ఉండాలి. మూర్ఖమైన పట్టు దల ఉండాలి. ఓ గుడ్డి లక్ష్యం ఉండాలి. ఓ రకమైన పెళుసుదనం ఉండాలి. ఇన్ని లేకపోతే ఏదో ఒక సంద ర్భంలో తన విశ్వాసం సడలుతుంది. సడలిందా? అతను పోయే అధఃపాతాళానికి మరెవ్వరూ పోలేరు. అలాంటి మార్గాన్ని ఎంచుకుని తన జీవితకాలంలో అఖండ విజయాన్ని సాధించిన అద్భుత పరిశోధ కుడు స్టీవ్జాబ్స్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పరప తిని సాధించిన ఐఫోన్ ప్రారంభదశకి ఆద్యుడు. ఈ దశలోనే ఇలాంటి మరొక మూర్ఖపు పట్టు దలతో విజయాన్ని సాధించిన ఇద్దరి పేర్లు ఏనాడూ కెమెరా ముందు నిలబడని నన్ను ‘వద్దు బాబోయ్!’ అంటున్నా వినిపించుకోకుండా 5 పాటలూ, 42 సీన్లూ ఉన్న ఓ సినీమాలో టైటిల్ రోల్ వేయించి నాకు 39 సంవత్సరాల, 300 సినీమాల కెరీర్ని ఇచ్చిన వ్యక్తి నిర్మాత రాఘవ. చాలా సందర్భాలలో నా కారణంగా రాఘవగారు భయంకరమైన ఫెయి ల్యూర్ చవి చూస్తారని భయపడి ఆయనతో అనేవా డిని. ఆయన కేవలం నవ్వి ఊరుకునేవారు. మరొక వ్యక్తి– ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త ఎస్. భావనారాయణగారు. ఊహించని ఉష్ణోగ్ర తల్లో లోహాల్ని కరిగించే మూసలు– ఆ ఉష్ణోగ్రతను తట్టుకునే ఏ మిశ్రమ లోహంతో తయారుకావాలి? సంవత్సరాల తరబడి తపస్సు చేసి– ఫలితాన్ని కనుగొని ఆ వ్యాపారానికి ‘కింగ్’గా నిలవడం నాకు తెలుసు. ఆ రోజుల్లోనే చిరంజీవి హీరోగా ఆయనకి నేను ‘ఐ లవ్ యూ’ రాశాను. ఆయనది విపరీతమైన instinct తొలి రోజుల్లోని ఒక చిత్రాన్ని చూసి ‘మారుతీరావుగారూ! ఈ కుర్రాడు చిదక్కొట్టేస్తాడు– అలా చూస్తూండండి’ అన్నారు. అలా చెప్పిన మరొక కన్నడ హీరో ‘ఒందానొందు కాలదల్లి’ చూశాక శంక రనాగ్ని. ఇద్దరూ దరిమిలాను అక్షరాలా ఆ పని చేశారు. తర్వాత రెండు చిత్రాలు తీసి, ఫెయిలయి ‘లాభం లేదు మారుతీరావుగారూ! నా ‘గురి’ తప్పింది. ఇంక సినీమాలు తీయను’ అని సన్య సించారు. ఏతావాతా స్టీవ్జాబ్స్ తన పరిధిలోకి వచ్చి తనని ప్రభావితం చేసేవారిపట్ల అతి క్రూరుడు. తను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని నమ్మి, ప్రపం చాన్ని నమ్మించిన వ్యాపారి. తన ధోరణి సాగకపోతే పసివాడిలాగా ఏడ్చేవాడు. ఆ ఏడుపు నిస్సహాయత కాదు. తన అహంకారానికి ఆటవిడుపు. స్టీవ్ జాబ్స్కి భారతీయ తత్వ సిద్ధాంతమన్నా, సంస్కృతి అన్నా మక్కువ. భారతదేశం వచ్చి ఎన్నో దేవాలయాలు, సంస్థలను చూశాడు. ఆయన నమ్మ కాల పునాదుల్లో కనీసం రెండయినా భారతీయ ఆలో చనా వ్యవస్థ ఇటుకలు ఉన్నాయేమో! స్టీవ్జాబ్స్ ఏ కాలేజీకి వెళ్లలేదు. వెళ్లిన ఒక్క కాలేజీ చదువుని అర్ధంతరంగా వదిలి వచ్చేశాడు. తన మామగారి కారు గరాజ్లో పరిశోధనలు ప్రారం భించి మొట్టమొదటి ‘మెకంతోష్’కి రూపకల్పన చేశాడు. వ్యాపార రంగం దిగ్భ్రాంతమయింది. తర్వాత అతని జీవితం చరిత్ర. చివరికి కేన్సర్తో కన్నుమూశాడు. మరణ శయ్యమీద స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలు ఏ శ్రీశ్రీ రవిశంకరో, ఏ సద్గురు జగ్గీ వాసుదేవో చెప్పిన సూక్తులలాగ వినిపిస్తాయి. ‘అవసానం కొందరికి అవలోకన. కొందరికి కేవలం యాతన. చాలామందికి నా జీవితం పెద్ద విజయానికి నిదర్శనం. కానీ అందులో చాలా కొద్ది ఆనందమే ఉంది. ఐశ్వర్యం నాకు వ్యసనం. జీవిత మంతా నన్ను ఏమార్చిన మాఫియా. ఇప్పుడు ఆఖరి క్షణాలలో మృత్యువు సమక్షంలో ఈ ఐశ్వర్యం అర్థం లేనిదని అర్థమయింది. నీ కారుని నడపటానికి ఓ మనిషిని జీతానికి కుదుర్చుకోవచ్చు. కానీ– నీ అనారోగ్యాన్ని పంచుకోడానికి నువ్వు ఎప్పుడూ ఒంటరివి’. మిత్రుడు, ప్రముఖ హాస్య రచయిత డాక్టర్ తంబు కేన్సర్తో వెళ్లిపోయాడు. చివరి రోజుల్లో ఆయన ఆత్మీయ మిత్రుడు కళ్లనీళ్లు పెట్టుకుంటూ ‘చెప్పరా, నీ కోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను’ అన్నాడు రుద్ధ కంఠంతో. ‘అయితే నా మూత్రాన్ని నా తరఫున నువ్వు పొయ్యి’ అన్నాడట తంబు అనే డాక్టర్. ఎంత భయంకరమైన నిస్సహాయత. మళ్లీ స్టీవ్జాబ్స్: ‘నీ తెలివితేటలు పెరిగి, విజ్ఞత పుంజుకున్నకొద్దీ నీకొకటి అర్థమవుతుంది. 30 రూపాయల వాచీ, 30 వేల రూపాయల వాచీ అదే కాలాన్ని సూచిస్తుంది. వాచీ కాలం విలువని పెంచదు. అర్థంలేని నీ ‘వానిటీ’కి రంగులు దిద్దు తుంది. చివరికి నీ జీవితంలో ఆరుగురే ఉత్తమమైన వైద్యులున్నారు: సూర్యరశ్మి, విశ్రాంతి, వ్యాయామం, ఆహారం, ఆత్మవిశ్వాసం, స్నేహితులు. దేవుడిచ్చిన మనుషుల్ని కాపాడుకో. ఒకరోజు వాళ్ల అవసరం నీకుంటుంది. ‘తొందరగా వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లు. ఎక్కువ దూరం వెళ్లాలనుకుంటే నలుగురైదుగురుతో నడువు. ఎందుకు? ఆలోచించని జీవన ప్రయాణం ఏమారుస్తుంది. ‘ఆలోచన’ అడుగుల్ని అంచనా వేయిస్తుంది’. ఈ మాట ‘నడక’ గురించి కాదు. ‘జీవన ప్రయాణం’ గురించి. వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు -
ఉల్కలు– ఉరుములు
ప్రజాభిమానాన్ని చూరగొనడానికి సుదీర్ఘ పరిశ్రమ, ప్రతిభ, కొండొకచో చిన్న అదృష్టం కలిసి రావాలంటారు. అయితే ఇవేవీ అక్కరలేని అడ్డుతోవ ఒకటుంది. నిర్భయ దుర్ఘటన, బాబ్రీ మసీద్ కూల్చివేత, అణు పరీక్ష ఇలాంటివి. అయితే కొన్ని ప్రచారాలు ఎప్పుడు, ఎందుకు వస్తాయో తెలియదు. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆశ్చర్యమూ, షాకూ కలుగుతుంది. ఈ మధ్య సినీరంగంలో ఈ అడ్డుతోవల సంఘటనలు, ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవి అనూహ్యం, ఆశ్చర్యకరం, ఇంకా చెప్పాలంటే విచిత్రం, విలక్షణం. ఈ మధ్య ఒమార్ లులు అనే దర్శకుడు ‘‘ఒరు ఆధార్ లవ్’’ అనే మలయాళ సినిమాను నిర్మించాడు. ఇది పామర భాషలో ‘విరగదీసే’ చిత్రం కాదు. అయితే అందులో ప్రియా వారియర్ అనే కొత్త అమ్మాయి నటించింది. ఒకానొక సీన్లో ఆ పిల్ల సరదాగా దూరపు క్లాసు బెంచీలో కూర్చున్న కుర్రాడిని చూసి కన్నుకొట్టింది. కుర్రాడు నవ్వాడు. రెండు వేళ్లు బిగించి రివాల్వర్లాగా కాల్చింది. కుర్రాడు గాయపడినట్టు తలవొంచాడు. అంతే, మిన్నువిరిగి మీద పడింది. ఇదేం కొత్త విన్యాసం కాదు. కానీ ఈమె కన్నుకొట్టడాన్ని దేశం ఉర్రూతలూగి అందుకుంది. ప్రచార సాధనాలన్నీ ఒళ్లు విరుచుకుని ఈ దృశ్యాన్ని ప్రచారం చేశాయి. దేశం పిచ్చెక్కిపోయింది. ఈ పాపులారిటీ ఎంతవరకూ పోయిందంటే – దేశంలోని ఇస్లాం వర్గాలు అలా ఓ ఆడపిల్ల బరితెగించడం సంప్రదాయ విరుద్ధమని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి! ఎక్కడ చిన్న మలయాళ సినిమా? ఎక్కడ ఊసుపోని సంఘటన. సుప్రీంకోర్టు ఆశ్చర్య పోయింది. చివరకు ‘‘పోవయ్యా. ఇదేదో చిన్నపిల్లల ఆట’’ అని కేసుని కొట్టి వేసింది. కొన్నేళ్ల కిందట– కొందరు కుర్రాళ్లు కలిసి ఓ సినిమా తీశారు. ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఇందులో హీరో. సినిమా పెద్ద ఊడబొడిచింది కాదు. కానీ ఆడుతూ పాడుతూ కుర్రాళ్లందరూ కలిసి – అనురుద్ రవి శంకర్ అనే కుర్రాడి ‘‘కొలవరి డీ’’ అనే పాటను రికార్డు చేశారు. అంతే, ఆ పాట కార్చిచ్చులాగా– భాషలకతీతంగా దేశంలో గంగవెర్రులెత్తించింది. ఎంత వెర్రి! బహుశా ఈ ‘కొలవరి’ నిర్మాతలే ఆశ్చర్యపోయి ఉంటారు. ఈమధ్య మా పెద్దబ్బాయి నన్ను లాక్కెళ్లి ధియేటర్లో కూర్చోపెట్టాడు. సినిమా పేరు ‘‘96’’. 1996లో కొందరు ఓ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇందులో ఆడా మగా–రకరకాల మనస్తత్వాల పిల్లలు. ఓ పదేళ్ల తర్వాత ఈ గుంపు మళ్లీ కలుసుకోవాలనుకున్నారు. కలుసుకోవడమే సినిమా. ఇందులో ఓ అమ్మాయిపట్ల మక్కువ ఉన్నా మనసిప్పలేని మొహమాటస్తుడు హీరో. ఆ పిల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుని, ఓ కూతుర్ని కని సింగపూర్లో భర్తతో కాపురం చేస్తోంది. అందరూ కలిశారు. ఇందులో ఓ అమ్మాయి గర్భవతి. నలుగురూ రకరకాలుగా జీవితాల్లో సెటిల్ అయినవారు. ఈ సింగపూర్ అమ్మాయి వచ్చింది. మొహమాటస్తుడయిన కుర్రాడూ వచ్చాడు. తెల్లవారితే మళ్లీ అందరూ విడిపోతారు. ఈ కుర్రాడికీ, ఆ అమ్మాయికీ ఇప్పుడు తమతమ మనస్సులు తెలిశాయి. నిజానికి రాత్రంతా ఏకాంతంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నారు. కలిసి జీవించలేక పోయిన అసంతృప్తి ఇద్దరిలో–ప్రేక్షకులకీ తెలుస్తోంది. అదొక nostalgic pain. అయితే ఏకాంతంలో కూడా వారిద్దరూ సభ్యతను పాటించారు. తమ తమ దూరాల్ని ఎరిగి ప్రవర్తించారు. ఒక్కసారయినా ఏకాంతంలో తొందరపడతారా? అయినా ఒకరినొకరు కనీసం ముట్టుకోలేదు. తెల్లవారింది. ఆమెకు వీడ్కోలు చెప్పాడు హీరో. ఇద్దరి మనస్సుల్లోనూ – వాస్తవం కాని ‘కల’ అలాగే ఉండి పోయింది! ఇంతే కథ. ఇదిపెద్ద పెద్ద చిత్రాల్ని తలదన్నేసింది. హీరో కర్మాగారంలో ‘కళాసీ’లాగ ఉంటాడు. అమ్మాయి ఒప్పులకుప్ప. స్టార్. హీరో ఈసినిమాతో పెద్ద స్టార్ అయిపోయాడు. మొన్న ఒక సభలో ప్రేక్షకులు గింగుర్లెత్తి –‘మీరెలాగూ సినీమాలో ఒకరి నొకరు ఆలింగనం చేసుకోలేదు. ఇప్పుడు మా కళ్ల ముందు చేసుకోం ‘‘అని కేకలేశారు! ఆ దృశ్యానికి ప్రేక్షకుల గగ్గోలు! ప్రజా సందోహంలో ‘పాపులారిటీ’కి అర్థాలు మారిపోయాయి. అయితే – చాప్లిన్ పాపులారిటీకి కన్నుకొట్టిన కుర్రదాని పాపులారిటీకి, కొలవరికీ ‘కొల బద్దలు’ మారాయి. ఉరకలెత్తించే ఉత్తేజాలు కనిపించని ఆధునిక జీవితంలో ఈ చిన్న చిన్న ‘మెరు పుల్ని’ జనసందోహం ఏరుకుంటోందా? లక్షలాది ప్రజల సమష్టి ఆనందానికి ఇది విచిత్రమయిన కుదింపా? సినిమా హృదయాల్ని కదిలించే ఆనందానికి విడాకులిచ్చి– ఇప్పుడిప్పుడు పాపులారిటీకి నరాల్ని నమ్ముకుంటోంది. - గొల్లపూడి మారుతీరావు -
కోడి–సినీమా జీవనాడి
కోడి రామకృష్ణతో నా జ్ఞాపకాలు బహుశా అనితర సాధ్యమైనవి. కోడి నా దగ్గరికి వచ్చేనాటికి (1981) హైస్కూలు ఎగ్గొట్టి వచ్చిన కుర్రాడిలాగ ఉండేవాడు (ఫొటో). ‘ఇతనా కొత్త దర్శకుడు!’ అని మనసు కాస్సేపు శంకించిన మాట వాస్తవం. చాలా మొహ మాటస్తుడు. ఎప్పుడూ ఎవరినీ నొప్పించని మన స్తత్వం. అలాంటి ఆలోచన వస్తే తనే అక్కడి నుంచి తొలగిపోతాడు. ఆ రోజుల్లో నాకు బోలెడంత తీరిక. కొన్ని నెలలపాటు పొద్దున్నే వచ్చి రాత్రి నేను అమృతం సేవించి భోజనం చేసేదాకా కూర్చునేవాడు. ఏం చేసేవాడు? ఏదో చేసేవాడు– పిల్లలతో కబుర్లు చెప్తూనో, మరేదో. నా పనిపాటల్లో నవ్వుతూ పాలు పంచుకునేవాడు. నాకు కడప బదిలీ అయితే ఎన్నోసార్లు నాతో వచ్చాడు. నేను రేడియోలో ఆఫీసర్ని. ప్రతీ ఆదివారం చెన్నైలో బొంబాయి మైలు ఎక్కి సెకెండు క్లాసు కంపార్టుమెంటులో ఇద్దరం గుమ్మందగ్గర బయటికి కాళ్లు జాపుకు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నాతో అప్పుడప్పుడు కథా చర్చ. జరపకపోతే అడిగేవాడు కాదు. నన్ను ఇబ్బంది పెట్టని ఒక్క కారణంగానే– సరదాగా– అలవోకగా– ఆడుతూ పాడుతూ రెండు కథలు రెడీ చేశాం. కథ ఎవరివో ఒప్పించాలని కాదు. మేం ఒప్పుకోవాలని. (ఆ రెండు కథలూ చరిత్ర. రెండో కథ– ‘ఇంట్లో రామయ్య– వీధిలో కృష్ణయ్య’ 500 రోజులు నడిస్తే– ‘తరంగిణి’ తేలికగా సంవత్సరం నడిచింది) రెండో కథ, మొదటి కథ కావడానికి కారణం– ‘తరంగిణి’ చేయడానికి దర్శకుడి వెన్ను ముదరాలని భావించాం కనుక. రామకృష్ణ మెదడు పాదరసం. అతని గురువు గారి దగ్గర పుణికి పుచ్చుకున్న గొప్ప లక్షణం– నటుడికి ప్రత్యేకతనివ్వగల పాత్రీకరణ పుష్టి. ఇది చాలామంది దర్శకులకి లేదు. ప్రయత్నించినా రాదు. ఇందులో నిష్ణాతుల పేర్లు రెండు చాలు– సత్యజిత్ రే, మణిరత్నం. మొదటి చిత్రం రిలీజు నాటికే అతను స్టార్ డైరెక్టర్. నేను స్టార్ని. మరెందరో కొత్త నటు లకి– టైలర్ కృష్ణ, అశోక్ కుమార్ లాంటి వారికి ప్రాణం పోశాడు. కొత్త ఆలోచన వస్తే చుట్టూ అమోఘంగా అల్లు కునే అందమైన సాలెగూడు అతని మెదడు. కెమెరా ముందు నటుడి దమ్ముని గుర్తుపడితే– రామకృష్ణ గోమతేశ్వరుడయిపోతాడు. పూచిక పుల్లని పవిత్ర మైన దర్బని చేస్తాడు. కాగా, వ్యక్తిగా రామకృష్ణ బ్రతక నేర్చినవాడు. చాలామందికి తెలియదు. అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. లేకపోతే అతని ప్రతిభకీ, తొలి నాళ్లలో అతనికి వచ్చిన అవకాశాలకీ ఆకాశంలో ఉండవలసినవాడు. తన పరిధిలో ‘తను’ ముఖ్యం. దానిని సంపాదించుకోడు. ఆ ‘పరిధి’ని తన హక్కుగా చేసుకుంటాడు. అదీ అతని Creative Volcano. అతను దర్శకుడిగా స్థిరపడటానికి బేషరతుగా నా వాటాని పుంజుకుంటూనే నేను నటుడిగా స్థిరపడ టానికి అతని వాటాని బంగారు పళ్లెంలో పెట్టి సమ ర్పిస్తాను. తన చుట్టూ ఎప్పుడూ ముసురుకునే నా కొడుకుల్లో శ్రీనివాస్ని దర్శకత్వ విభాగంలోకి లాగి నవాడు కోడి. మొదటి రోజుల్లో ‘వాసూ గారూ’ అనే వాడు ఆ కుర్రాడిని. నేను కోప్పడితే పద్ధతి మార్చు కున్నాడు. అతని శిష్యుడు గురువుగారికంటే పాతికేళ్లు ముందే వెళ్లిపోయాడు. అందమైన ఆలోచనకి వెండితెరమీద రేంజ్ని ఇవ్వగల పనివాడు. నేను రాసిన డైలాగుల్ని నాకంటే బాగా అలంకరించుకున్న దర్శకుడు. కానీ ప్రతిభని ఏనాడూ తలకెత్తుకోడు. నేనూ, మా ఆవిడన్నా భక్తి. ‘ఇంట్లో రామయ్య...’కి 30 పైగా సెన్సార్ కట్స్ వస్తే జ్వరంతో తేనాంపేటలో చిన్న గదిలో దుప్పటి కప్పుకు పడుకున్న అతన్ని నేనూ మా ఆవిడా వెళ్లి లేపి ధైర్యం చెప్పాం. ఏం సినీమా అది! అప్పటికి పది సినీమాలు తీసినంతగా దర్శకుడిలో ‘పదును’ సంధించిన ఇట్ఛ్చ్టజీఠ్ఛి Vౌ ఛ్చిnౌ అది. అందులో లేచిన పెద్ద లావా సెల– ‘దటీజ్ సుబ్బారావ్!’ రాత్రిళ్లు షూటింగులూ, అకాల భోజనాలతో ఆరోగ్యాన్ని ఎక్కువగా దుబారా చేసుకున్నవాడు. మరికొంతకాలం ఉంటే తెలుగు చలన చిత్ర రంగంలో సమగ్రమైన దర్శకత్వ ప్రతిభకి, తనదైన బాణీకి విలాసంగా నిలిచేవాడు. చిన్నవాడు. అతనికి నేను నివాళి అర్పించేరోజు వస్తుందని అనుకోలేదు. పదికాలాలపాటు ఉండవల సినవాడు. పదికాలాలు నిలిచే మౌలిక కృషికి తోట మాలి. మృత్యువుకి ఓ దుర్మార్గం ఉంది. మన్నికయిన ప్రతిభకి అర్ధంతరంగా ముగింపురాసి చేతులు దులు పుకుంటుంది. మృత్యువుకి లొంగకపోతే రామకృష్ణ తెలుగు సినీమాకి కొండంత ఉపకారం చేయగల దక్షత, దమ్ము ఉన్నవాడు. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
ఓ సినీమాలాంటి కథ
ఇలాంటి కథని రాస్తే చాలామంది నవ్వుతారు. అలాంటి కథలు రాసి ఒప్పించిన ఇద్దరు మహాను భావులు నాకు గుర్తొస్తారు –థామస్ హార్డీ (ది మేయర్ ఆఫ్ కాస్టర్ బ్రిడ్జ్), ఆంటన్ చెఖోవ్. అయినా ఇది విచిత్రమైన, అనూహ్యమైన కథ. నిజానికి కన్నూరు ప్రాంతంలో జరిగిన ఈ కథని వాళ్ల మేనకోడలు శాంతా కావుంబాయి నవలని రాసింది. అది 1946 ప్రాంతం. బ్రిటిష్ పాలనలో కేరళలో కన్నూరు ప్రాంతంలో భూస్వాముల ఆగడా లను వ్యతిరేకిస్తూ ముమ్మరంగా తిరుగుబాటు జరు గుతున్న సామాజిక–రాజకీయ నేపథ్య విప్లవాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ కథని అతని మేనకోడలు శ్రీమతి శాంత నవలని రాసింది. ఆ తిరుగుబాటు నేపథ్యంలో జరిగిన ఓ ఉపకథ ఇది. నారాయణన్ పెద్ద విప్లకారుడేం కాదు. కనీసం తన తండ్రిలాగా శాశ్వతమైన కీర్తిని ఆర్జించిన అమ రవీరుడూ కాదు. ఇ.కె. నారాయణన్ నంబియార్ 30 ఏళ్ల వాడు. తండ్రితో పాటు ఈ తిరుగుబాటు ఉద్య మంలోకి దూకాడు ఆవేశంగా. అప్పుడే అతనికి పెళ్ల యింది. భార్య శారద దూరపుబంధువుల అమ్మాయి. అప్పటికి భార్య శారద 13 ఏళ్ల పిల్ల. నిజానికి వాళ్లి ద్దరూ ఆనాటికి నోరిప్పి కబుర్లు చెప్పుకోలేదు– చెప్పుకోవడం తెలీదు కనుక. పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరూ విడిపోయారు. అక్కడి రైతులు బ్రిటిష్ యాజమాన్యం, భూకామందులను ఎదిరిస్తూ జరిగే ఈ తిరుగుబాటులో చేతులు కలిపారు. డిసెంబర్ 29న నంబియార్ తన తండ్రి రామన్ నంబియార్తో కలిసి తాలియన్కి వెళ్లాడు. దూరపు కొండల సమీ పంలో ఉన్న కారాకట్టిడం నాయనార్ అనే భూస్వామి మీద తిరుగుబాటుకి బయలుదేరిన వందలాది మందితో వీరూ ఉన్నారు. భూస్వామి ఆగడాలను తుదముట్టించి, అతని ఆట కట్టించాలని వారి ప్లాను. కానీ వీళ్ల ప్రయత్నం కార్యరూపం దాల్చే లోగా బ్రిటి ష్వారి మలబార్ స్పెషల్ పోలీసు బలగం వీరిని చుట్టుముట్టింది. ఆ తిరుగుబాటుదారుల గుంపుమీద బుల్లెట్ల వర్షం కురిపించింది. అయిదుగురు అక్కడిక క్కడే చనిపోయారు. ఎందరో గాయపడ్డారు. నంబి యార్ తండ్రితో తప్పించుకుని అజ్ఞాతంలోకి మాయ మయ్యాడు.కానీ, పోలీసులు అతని ఇంటిమీద దాడిచేసి, స్త్రీలను హింసించి వారి ఉనికి కూపీ లాగారు. శారద అభం శుభం తెలియని పిల్ల కనుక ఆమెని వదిలి పెట్టారు. ఈ సంఘటన తర్వాత కుటుంబం ఆమెని పుట్టింటికి పంపించేసింది. రెండు నెలలు పోలీసు ఆ కుటుంబాన్ని రాసి రంపానబెట్టి, ఈ యజమానుల ఆచూకీ పట్టుకుని ఇద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. సంవత్సరాలు గడిచాక ఈ ఖైదీలను అధికారులు కన్నూరు సెంట్రల్ జైలు నుంచి వియ్యూరు అటు తర్వాత సేలం జైళ్లకు బదిలీ చేశారు.1950 ఫిబ్రవరి 11న రామా నంబియార్ జైల్లోనే జరిగిన కాల్పుల్లో తుపాకీ గుండుకి మరణించాడు. కొడుకు 16 సార్లు ఈ కాల్పులకు గురి అయ్యాడు. అయినా బతికాడు. చచ్చిపోయాడని అంతా నిర్ధారిం చుకున్నారు. కానీ శారదకేమో అతను బతికే ఉంటా డని ఓ నమ్మకం. సంవత్సరాలు తిరిగిపోతున్నాయి. బంధువులు ఆమెకి బలవంతంగా మరో పెళ్లి చేశారు. మరో ఎనిమిదేళ్లకు నారాయణన్ని విడుదల చేశారు. ఎక్కడా పెళ్లాం ఆచూకీ లేదు. అతనూ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే శారద ఎక్కడో ఒకచోట బతికే ఉన్నదని అతని ఊహ. సంవత్సరాల తర్వాత శారదకు కొడుకు పుట్టాడు. పేరు భగవాన్ పరాస్సినిక్కడవు. ఈ కుర్రాడు తన తల్లి ఎప్పుడో తన చిన్నతనంలో జరి గిన సంఘటనల గురించి తల్చుకోవడం విన్నాడు. ఈ మేనకోడలు– అంటే నవలా రచయిత్రి శాంత ఈ కుర్రాడిని కలిసింది. నారాయణన్ గురించి చెప్పింది. వాళ్లిద్దరినీ ఒకసారి కలపాలని భగవాన్ అనుకు న్నాడు. (‘లవకుశ’లాగ ఉన్నదా) ఎన్నాళ్ల తర్వాత? 72 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నారాయణన్ తొంభయ్యో పడిలో ఉన్నాడు. శారద దాదాపు డెబ్బ య్యోపడి. భగవాన్ ఇంట్లో వారిద్దరూ కలిశారు. తమ స్వాధీనంలో లేని కారణాలకి వారిద్దరూ జీవి తాల్లో దూరమయ్యారు. వైవాహిక జీవితాలూ అలాగే సాగాయి. అతని నిస్సహాయత ఆమెకి తెలుసు. ఆమె గురించి అతను జైల్లో అప్పుడప్పుడూ తలచుకుని ఆమెకి జరిగిన అన్యాయానికి బాధపడ్డాడేమో తెలీదు. అయితే ఒకరిమీద ఒకరికి దురభిప్రాయాలు లేవు. ఇద్దరూ జీవితం చేతుల్లో పావులు. వారి సమా గమం మొన్న డిసెంబర్ 26న. 72 సంవత్సరాల తర్వాత దూరమైన ఇద్దరు– ఆనాటి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పటి ఆమె కొడుకుకి నారాయణన్ ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకుంటాడు? మేనకోడలు శాంత ఇప్పుడు మరో కొత్త నవలని రాయాలేమో?! గొల్లపూడి మారుతీరావు -
ఓ అజ్ఞాత విజ్ఞాని
చెన్నైలో లజ్ సెంటర్ నుంచి ఎల్డామ్స్ రోడ్డు వేవు నడుస్తున్నప్పుడు దారిలో చాలా ప్రసిద్ధ్దమైన అడ్రసులు. ఇంగ్లీషువారికాలంలోనే కోర్టుల్లో వారినే తన ఆంగ్లభాషా వైశిష్ట్యంతో అబ్బుర పరిచిన రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి హాలు తగుల్తుంది. అది దాటగానే అమృతాంజనం ఆఫీసు, పక్కన ఆంధ్రదేశ చరిత్రలో భాగమయిన శ్రీభాగ్ ఒడంబడిక జరిగిన శ్రీ భాగ్ బంగళా, తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి పార్కు. అయితే అటు వెళ్లేటప్పుడు ఇవేవీ గుర్తుకురావు. శాస్త్రిహాలుకి ముందుగా రోడ్డు పక్క రోడ్డుమీదే గుట్టగా పోసిన కొన్ని లక్షల పాతపుస్తకాల దుకాణం కనిపిస్తుంది. దీనికి గది, తాళాలు, పుస్తకాలకి రక్షణా ఏమీలేదు. ఆరుబయట– రోడ్డుమీదే పరిచిన దుకాణం. ఎండా, వానా, తుఫాన్, గాలి దుమారం ఏది వచ్చినా తట్టుకుంటూ గత అయిదు దశాబ్దాలుగా నడుస్తున్న సెకండ్ హ్యాండ్ దుకాణం. పుస్తకాలమీద పెద్ద టార్పాలిన్ కప్పి ఉంటుంది. ఆ గుట్ట ముందు – తపస్సు చేస్తున్నట్టు ఓ ముసలాయన కూర్చుంటాడు. అతని పేరు ఆళ్వార్. వొంటిమీద షర్టు లేదు. ఆయన పెరియార్ రామస్వామి నాయకర్ భక్తుడు. అందుకని తర్వాతి రోజుల్లో ఆయనలాగ గెడ్డం పెంచాలి. నగరంలో వేలాది మేధావులకు, విద్యార్థులకు, రచయితలకు ఆ గుట్ట ఆటపట్టు. ఎప్పుడూ ఆ గుట్ట చుట్టూ ఖరీదయిన దుస్తులు వేసుకున్న వారూ, మే«ధావులూ పుస్తకాలు తిరగేస్తూ కనిపిస్తారు. రోజర్స్ థెసారెస్ , పాపిలియాన్, షేక్సి ్పయర్ సమగ్ర రచన సర్వస్వం, థామస్ హార్డీ రచనలు –ఇలా వేటి గురించయినా చెప్పగలడు. ఇంకా వైద్యం, ఇంజనీరింగ్, అకౌంటెన్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – ఈ విభాగాలలో ఎన్నో అరుదయిన పుస్తకాలు దొరుకు తాయి .ముద్రణలో లేని పుస్తకమా? ఇదొక్కటే అడ్రసు. కస్టమర్లు తప్పిపోయిన పాతమిత్రుడిని కలిసినట్టు పుస్తకాలను కరుచుకువెళ్లడం అక్కడ తరచుగా కనిపించే దృశ్యం. విశేషమేమిటంటే ఐయ్యేయస్ çపరీక్షలకి వెళ్ళే గ్రాడ్యుయేట్లు మధుర, తిరుచ్చి వంటి సుదూరమయిన ప్రాంతాలనుంచి అరుదయిన పుస్తకాలకి ఇక్కడికి వస్తారు. ఈ 50 సంవత్సరాలలో ఆ పుస్తకాల గుట్టకి తరచు వచ్చే కొందరు మహానుభావుల పేర్లు – సుప్రసిద్ధులైన భారతీ దాసన్ ఆయన కస్టమర్. పుళమై పిత్తన్, ముత్తులింగం వంటి కవులు వతనుగా వచ్చే వారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచీ సెంథిల్, గౌండర్ మణి, ఎస్. వి. శేఖర్, చో రామస్వామి ఆయన సోదరుడు అంబి తరచు వచ్చేవారు. హీరో జయశంకర్ ఇక్కడ కూర్చుని టీ తాగి వెళ్లేవాడు కొన్ని రోజులు –ఇతను మైసూరు మహారాజా సామరాజ వొడయార్కీ, అప్పటి ముఖ్యమంత్రులు రామస్వామి రెడ్డియార్, అన్నాదురైకి పుస్తకాలు ఇచ్చి వచ్చేవాడు. ఇతని అసలు పేరు ఆర్. కె. నమ్మాళ్వార్. కాని అందరికీ అతను ఆళ్వార్. ఆళ్వార్ షాపు లజ్ దగ్గర పెద్ద బండగుర్తు. ఎప్పుడో 60 ఏళ్ల కిందట కడుపు పట్టుకుని విల్లుపురం దగ్గర వానియం పాలయం నుంచి చెన్నైలో దిగాడు ఆళ్వారు. 1950లో ఇక్కడ ఈ దుకాణానికి ప్రారంభోత్సవం చేశాడు. అప్పటి ముఖ్యమంత్రి –‘‘ఇక్కడ వ్యాపారం చేసుకోవయ్యా’’ అని అనుమతి ఇచ్చారు. ఆ మాట ఇనుపకవచంలాగా సంవత్సరాల తరబడి పోలీసుల బారిన పడకుండా కాపాడింది. రోడ్డుపక్క ఈ పుస్తకాల గుట్ట పోలీçసులకి కన్నెర్రే, ఈ మధ్య ఎవరో పోలీసులమంటూ వచ్చి కొన్ని వేల పుస్తకాలే పట్టుకుపోయారు. మళ్ళీ తిరిగి ఇస్తే ఒట్టు. ఈ పుస్తకాల వ్యాపారానికి ముందు ఆళ్వార్ నెప్ట్యూన్ స్టూడియోలో లైట్ బోయ్గా పనిచేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు – మనోహర, స్వర్గవాసల్, తిలివిషం మొదలైనవి. మరి ఈ లక్షల పుస్తకాలు ఆళ్వార్కి ఎలా చేరుతా యి? కనీసం 10 మంది ఇంటింటికీ తిరిగి పుస్తకాలను కొని తీసుకు వస్తారు. రమణన్ అనే అతను 17 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాడు. అతనికిప్పుడు 73 సంవత్సరాలు. ధనరాజ్ అనే కుర్రాడు పాతికేళ్లుగా ఈ పని చేస్తున్నాడు. ఇతని వ్యక్తిగత జీవితం ఇంకా ఆçసక్తికరం. వెనుక ఇంట్లో పని చేసే పనిమనిషి– ‘మేరీ’ని ఆళ్వార్ పెళ్లి చేసుకున్నాడు. ప్రేమా? అని మేరీని అడిగితే సిగ్గుపడింది. విచిత్రమేమిటంటే ఈ మతాతీత వివాహం పెద్దలు చేసినది! మేరీకి ఎప్పుడు పెళ్లయిందో గుర్తు లేదు. ఆ మాటకు వస్తే తన వయస్సు ఎంతో తెలీదు! వాళ్లకి నలుగురమ్మాయిలు. ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ‘‘నేను విజ్ఞానాన్ని పంచుతానని అందరూ అంటారు. ఆ మాట ప్రభుత్వం అనుకుని నా వ్యాపారం సాగనిస్తే మేలు’’ అంటాడు ఆళ్వార్. ఈ మధ్య చాలాసార్లు అటువేపు వెళ్లాను. ఇప్పుడక్కడ పుస్తకాల గుట్టలేదు. ఆళ్వార్ లేడు. ఏమయింది? వారం రోజుల కిందట – తన 95వ యేట – ఆళ్వార్ కన్నుమూశాడు. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
హనుమంత్ ఖాన్ సాహెబ్
ఆ మధ్య యోగి ఆదిత్యనాథ్ గారు హనుమంతుడు దళితుడని వాక్రుచ్చారు. ఈ దేశంలో కులాల మధ్య తారతమ్యాలను ఆ విధంగా నిర్మూలించే ప్రయ త్నం వారు చేశారు. వారి మంత్రి మండలిలోని లక్ష్మీనారాయణ చౌదరిగారు శాసనసభలో హను మంతుడు జాట్ అని సెలవి చ్చారు. వారి దూరదృష్టి అనన్యసామాన్యం. ఈ విధంగా రాజస్తాన్లో ఒక వర్గం నిస్పృహను, నినాదాలను ఆయన ఒక్క వేటుతో నేలమట్టం చేసేశారు. ఈ లోగా మరొక బీజేపీ నాయకుడు బుక్కాల్ నవాబ్ గారు మరొక అపూర్వమైన సృష్టి రహస్యానికి తెర లేవ దీశారు. హనుమంతుడు ముస్లిం అని బల్లగుద్దారు. ఇది చరిత్రను తిరగరాసే, సమాజహితానికి తెరలేపే అపూర్వ మైన పరిశీలన. ఈ లెక్కన కిష్కింధలో వానర సైన్య మంతా ముస్లింలేనా– సుగ్రీవ్ అహమ్మద్, వాలి అహమ్మ ద్ల మధ్య వైషమ్యానికి కేవలం తారా బేగం మాత్రమే కాక మతపరమైన కారణాలేమైనా ఉన్నాయా అన్న విష యాలను వివరిస్తూ మరో వాల్మీకి ఖాన్ కనీసం కిష్కింధ కాండనుంచీ రామాయణాన్ని తిరిగి రాయాలని నాకని పిస్తుంది. నన్నడిగితే ఈ బుక్కాల్ నవాబు గారిని హిందు వులు పూలదండలు వేసి దేశమంతా ఊరేగించాలి. హను మంత్ ఖాన్ సాహెబ్ ముస్లిం కనుక, వారికి తన స్వామి శ్రీరాముని పట్ల అపారమైన భక్తి కనుక– ఈ దేశంలో తర తరాలుగా మురిగిపోతున్న అయోధ్య రామ మందిర సమస్య తేలికగా పరిష్కారం కాగలదు. అది ఈ లెక్కన ముస్లింలకూ ప్రార్థనా స్థలం కనుక. నా దగ్గర ఒక మహా అపురూపమైన నాణెం ఉంది. అది 210 సంవత్సరాల కిందటిది. మన దేశానికి స్వాతం త్య్రం రావడానికి 139 సంవత్సరాల ముందుది. ఆనాటికీ ఈ దేశంలో దేశ స్వాతంత్య్రానికి ఆలోచనలే లేవు. ముస్లింలకు వేరే దేశం, ప్రతిపత్తి అన్న ఆలోచనలే లేవు. నిజానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పాలించడం లేదు. ఏమిటి ఈ నాణెం ప్రత్యేకత? ఈ దేశంలో 565 జమీందారీలు, రాజపాలిత సంస్థానాలూ ఉండగా మన దేశానికి కేవలం వ్యాపారానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వెలువరించిన నాణెమిది. అర్దణా నాణెం. అంటే రూపాయిలో 32వ వంతు. ఈ నాణెం మీద హను మంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువెళ్తున్న దృశ్యాన్ని ముద్రించారు. ఇది అపూర్వమైన విషయం (210 సంవ త్సరాల కిందటిమాట అని మరిచిపోవద్దు) ఇంకా నయం హనుమంతుడు లంక్షైర్లోనో, బర్మింగ్హామ్లోనో పుట్టిన హనుమంత్ హెన్రీ అనో, వయస్సొచ్చాక ఎగిరి కిష్కింధ చేరాడనో అనలేదు. అయినా నిమ్మకాయలమ్ము కునే వ్యాపారికి యజమాని విశ్వాసాలను పరిరక్షించే ప్రయత్నం ఎందుకు? సమాధానం– అది వారి సంస్కృతి కనుక. ఆ సంస్కృతిలోంచే బ్రౌన్, కాటన్, మెకంజీ వంటి మహనీయులు వచ్చారు. ప్రజల సొమ్మును తినే నీచ వ్యాపారుల సంస్కృతి మనది. ఉదాహరణకి– విజయ్ మాల్యా, నీరవ్ మోదీ. ఏదీ? మతాతీత దేశమైన ఈ దేశంలో దమ్ముంటే ఇలాంటి నాణేన్ని విడుదల చేయమనండి. వేలంకన్ని చర్చి బొమ్మతో నాణేన్ని ముద్రించమనండి. జుమ్మా మసీదు బొమ్మతో నాణేన్ని ముద్రించమనండి. మతాతీత వ్యవస్థ అంటే మతాన్ని అటకెక్కించాల్సిన పనిలేదు. మనకి మతం అడ్డువస్తుంది. మతం సామరస్యానికి పట్టుగొ మ్మగా నిలవాల్సిందిపోయి– పక్కవాడి మతాన్ని దుయ్య పట్టేదిగా తయారయింది. కాగా, ఒక వర్గానికి జరిపే ఉపకారం, క్రమంగా షరతై, ఓట్లయి, హక్కై– మైనారిటీల పేరిట పునాదుల్ని పెంచుకున్నాయి. ఇవాళ మనది స్వాతంత్య్ర దేశం. ఎంతో పురోగతిని సాధించిన దేశం. కానీ మతాల మధ్య అంతరాలను ఆ కారణానికే పరిష్క రించుకునే పెద్ద మనస్సు లేని దేశం. ఈ నేపథ్యంలో మన బుక్కాల్ నవాబుగారి ప్రతి పాదన అమోఘం. అన్నట్టు సత్యపాల్ చౌదరి అనే కేంద్ర మంత్రి హనుంతుడు ఒక ‘ఆర్యుడు’ అన్నారు. నంద కిషోర్ అనే రాష్ట్ర గిరిజన సంస్థ అధ్యక్షులు హనుమంతుడు ఒక గిరిజనుడన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులు దీపక్ సింగ్ గారు మొదట హనుమంతుడు ఎవరో ప్రభుత్వం తేల్చవ లసిన అవసరం ఉన్నదని సభా హక్కుల తీర్మానాన్ని లేవదీశారు. ఏతావాతా మనకి అర్థం అవుతున్న విషయం ఏమి టంటే– ఈ దేశంలో మత విశ్వాసాల ఉద్దీపనకిగానీ, తమ వర్గానికో, మతానికో ప్రాతినిధ్యం వహించే ముఖ్య లక్ష్యా నికిగానీ రామాయణంలో ‘హనుమంతుడి’ పాత్ర ఒక్కటే పెట్టుబడి కావటం– అదిన్నీ 210 సంవత్సరాలకు పైగా నిరూపణ అవుతున్నందుకు హిందువులు గర్వపడవచ్చు. ఈ ప్రతిపాదనలు చేసినవారు కేవలం పార్టీ సభ్యులు కారు. శాసనసభల్లో ప్రతినిధులు. సమాజానికి సేవ చెయ్యడానికి ప్రజల మద్దతుని కూడగట్టుకున్న రాజకీయ నాయకుల ‘వెర్రితలల’ విశృంఖలత్వానికి ఇది శిఖరాగ్రం. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
హిందూమతం–హిందుత్వం
తాటిచెట్టుకీ తాతపిలకకీ ముడివేసినట్టు– ఈ దేశంలో ప్రతీవ్యక్తీ హిందూమతాన్నీ, హిందుత్వాన్నీ కలిపి రాజకీయ ప్రయోజనానికి వాడటం రోజూ పేపరు తెరిస్తే కనిపించే అసంబద్ధత. రెండింటికీ ఆకాశానికీ భూమికీ ఉన్నంత దూరం ఉంది. అయితే దగ్గర బంధుత్వమూ ఉంది. స్థూలంగా చెప్పాలంటే హిందుత్వం సిమెంట్. హిందూమతం కట్టడం. కట్టడం దేవాలయమా? పాఠశాలా? మరొకటా మరొకటా– మనిష్టం. దేవాలయాన్ని సిమెంట్ అనం. ‘ఆ పెద్ద సిమెంట్ ఉన్నదే!’ అని పాఠశాలని చూపించం. సిమెంట్తో రూపుదిద్దుకున్నాక ‘అది పాఠశాల’. దానికి వేరే రూపు, ప్రయోజనం, ప్రత్యేకత, అస్తికత సమకూరింది. హిందుత్వం ఒక జాతి ప్రాథమిక విశ్వాసాలకు ప్రతీక. ఒక ‘ప్రత్యేకమైన’ ఆలోచనా వ్యవస్థకి రూపు. రామాయణం మతం, రాముడు మతానికి ప్రతీక. కానీ ‘సత్యం’, ధర్మం, పర స్త్రీని కన్నెత్తి చూడని నిష్ఠ– హిందుత్వం. భాగవతం మతం. శ్రీకృష్ణుడు మతానికి ప్రతీక. కానీ– చిలిపితనంతో జీవితాన్ని ప్రారంభించినా చివరలో జాతికి ఆచార్యత్వాన్ని సాధించడం హిందుత్వం. సావిత్రి సత్యవంతుల కథ మతం. కానీ ఓ స్త్రీ మూర్తి అచంచలమైన ఆత్మవిశ్వాసం హిందుత్వం. అందుకే అరవిందులకు మరో స్థాయిలో ‘సావిత్రి’ లొంగింది. అంటే– ఓ జాతి నమ్మిన విలువ– ఆ జాతికి ప్రతీక. ఆ విలువకు ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలు– ఆయా కాలాలకు అనుగుణంగా ఇచ్చిన ‘రూపు’ మతం. వేంకటేశ్వరుడు మతం. కానీ వేంకటేశ్వరత్వం హిందుత్వం. మత సామరస్యానికి రామానుజులు అనే ప్రవక్త ‘తీర్చిన’ రూపు మతం. కారుణ్యం ఓ జాతి ప్రాథమిక విలువ. దానికి జీసస్ ప్రవక్త ఇచ్చిన అపూర్వమయిన ‘రూపు’ క్రైస్తవం. సర్వమానవ సౌభ్రాతృత్వం విలువ. దానికి మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన ‘రూపు’ ఇస్లాం. ప్రాథమిక విలువల విస్తృతి ఆ జాతి‘త్వం’ని వికసింపజేస్తుంది. ఆ గుణం Plasticity ప్రపంచంలో అధికంగా ఉన్నది ‘హిందుత్వం’. అందుకనే శతాబ్దాలుగా ఎన్ని మతాలకయినా– అంటే ప్రాథమిక విలువలు పెట్టుబడులుగా, ఆయా ప్రవక్తలు రూపు దిద్దిన అపూర్వ ‘మతా’లకు స్వాగతం పలకగలిగింది. క్రైస్తవం కారుణ్యమా? ‘రండి. మాకు బుద్ధుడు ఉన్నాడు’. ఇస్లాం సర్వమానవ సౌభ్రాతృత్వమా? ‘రండి. మాకు ప్రహ్లాదుడున్నాడు’. అవన్నీ ఒక జాతిని ప్రభావితం చేసిన ఆయా ప్రవక్తలు తీర్చిన మహాద్భుత మేరుశృంగాలు. రామాయణంలో రాముడి పాత్రీకరణలో అభిప్రాయభేదం ఉన్నదా? ఉండవచ్చు. కానీ అది ‘హిందుత్వా’నికి అంటదు. ఏనాడయినా మనం తాజ్మహల్ సౌందర్యానికి మురిసిపోయాం. కానీ ‘అందులో వాడిన చెక్క సున్నం ఎంత బాగుందో!’ అనుకున్నామా? సత్యమును ఆచరించుము– హిందుత్వం. రాముడు సత్యమునే ఆచరించెను– మతం. Hindutva is a way of life. Religion is a way of choice. కాలగతి, మానవ స్వభావాల వికసనం, కొండొకచో పతనం, ఆనాటి సమాజ హితం, ఆ సమాజానికి మార్గదర్శకం కాగలిగిన ఓ ‘ప్రవక్త’ అపూర్వ సిద్ధాంత నిర్దేశన– మతం. దానికి కవులు, రచయితలు, ప్రవచనకారులు– సమాజ చైతన్యానికిగాను రూపుదిద్దిన ‘చిలవలు–పలవలు’ – మతం. మరొక్కసారి– రామమందిర పునర్నిర్మాణం హిందుత్వానికి పెట్టుబడి కాదు. రాముడిలోని ‘రామత్వం’ మాత్రమే హిందుత్వం. Hindutva is a definition. Religion is a denami- nation. గోడ కట్టడంలో ‘గోడ’ స్థాయిలో ఆర్కిటెక్టు అవసరం లేదు. కానీ ఆ గోడ పెట్టుబడిగా నిలిచే కట్టడానికి ఆర్కిటెక్టు అవసరం. కాలగతిలో మన జీవన విధానాన్ని వైభవోపేతం చేసిన ఎందరో ఆర్కిటెక్టులు. శంకరాచార్య, రామానుజాచార్య, మహమ్మద్, జీసస్, మహావీర్, గురునానక్, వీరు ఈ ‘త్వం’కి కాలానుగుణంగా, సమాజానుగుణంగా అద్భుతమైన శిల్పాలను నిర్మించిన కారణజన్ములు. మరొక్కసారి– రామాయణం మతం. రామత్వం హిందుత్వం. దీనికి వాల్మీకి దిద్దిన రూపు రామాయణం. మరికొన్ని వందలమంది దిద్దిన రూపు మతం. రామారావులూ, రామనాథాలు, రామ్సింగులూ, రామశాస్త్రులూ, రామ్ యాదవ్లూ– అందరూ ఈ మతాన్ని నెత్తిన పెట్టుకున్నవారు. విలువ శాశ్వతం. అది హిందుత్వం. విలువకు ఆ జాతి దిద్దుకున్న ‘రూపం’ మతం. కొండొకచో మతానికి కాలదోషం పట్టవచ్చు. రూపం మారవచ్చు. అన్వయం మారవచ్చు. కానీ ‘త్వం’ మారదు. ఒక్కమాటలో చెప్పాలంటే సూర్యరశ్మి హిందుత్వం. ఆ రశ్మిలో వికసించిన పుష్పం మతం. గొల్లపూడి మారుతీరావు -
కన్నీటి విలువెంత?
ఇవాళ పేపరు తెరవగానే ఒక ఫొటో నా దృష్టిని నిలిపేసింది. ఆదివారం జమ్మూకశ్మీర్లోని షోపియన్ గ్రామంలో పాకిస్తాన్ దుండగులతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి సహచరుడు సోమవారం చెక్ అష్ముజీ అనే గ్రామంలో ఉంటున్న 75 సంవత్సరాలు పైబడిన ఆ మిత్రుడి తండ్రి దగ్గరికి వచ్చాడు. తన కళ్లముందే కన్నుమూసిన మిత్రుడి మరణాన్ని గురించి చెప్పాడు. దుఃఖంతో నీరుకారిపోయిన ఆ వృద్ధుడిని పొదివి పట్టుకున్న చిత్రమది. ఇది మానవత్వానికి ఆవలి గట్టు. దేశానికి సేవ చేస్తూ ప్రాణాలర్పించిన ‘నిశ్శబ్ద’ దేశభక్తుడు కొడుకు. ఆ వృద్ధుడి శరీరంలో ప్రతీ అణువూ కించిత్తు ‘గర్వం’తో పులకించి ఉంటుంది. ఈ కథని చాలామంది విని ఉండవచ్చు. కానీ మరోసారి వింటే తప్పులేదు. యుద్ధరంగంలో శత్రువుతో పోరాడుతున్న ఇద్దరు మిత్రులు– రాముడు, రంగడు. రంగడు గాయపడ్డాడు. శత్రు స్థావరంలో ఉండిపోయాడు. రాముడు సాహసం చేసి ముందుకు వెళ్లి ప్రాణాలతో ఉన్న రంగడిని వెనక్కు తెచ్చాడు. తెస్తూండగా తాను గాయపడ్డాడు. రంగడి చేతుల్లో ప్రాణాలు వదులుతూ ‘తన మరణాన్ని స్వయంగా తన తల్లిదండ్రులకు తెలియజెయ్యమ’ని కోరి కన్నుమూశాడు. రంగడికి భయంకరమైన దుఃఖమది. తనని రక్షించి తన మిత్రుడు కన్నుమూశాడు. అతని ఇంటికి వెళ్లడానికి ధైర్యం చాలలేదు. కొన్నాళ్లకి సాహసం చేశాడు– మిత్రుడికిచ్చిన మాట కోసం. తల్లిదండ్రులు వృద్ధులు. ముట్టుకుంటే కూలి పోయేటట్టు ఉన్నారు. ఇతడిని హార్దికంగా ఆహ్వానించారు. తల్లి ఆప్యాయంగా వండిపెట్టింది. వారి ఆదరణ చూసి నోరిప్పి కొడుకు మరణాన్ని తెలియజేయలేకపోయాడు. ఒక రోజు కాదు– పది రోజులు. చివరికి నిస్సహాయంగా తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. ముసలివాళ్లు గుమ్మందాకా వచ్చారు. తన మిత్రుడికిచ్చిన మాట! చెప్పలేక చెప్పలేక వారి కొడుకు మరణాన్ని వెల్లడించాడు. తల్లిదండ్రులు ఓ క్షణం నిశ్శబ్దమయిపోయారు. తల్లి ఈ రంగడి బుగ్గలు నిమిరి ‘మాకు తెలుసు బాబూ. సమాచారం అందింది. కానీ ఈ పది రోజులూ ఆ విషయం గురించి కదిపి నిన్ను బాధపెడతామని ఎత్తలేదు’ అన్నది. ఈ మధ్య రాజీవ్గాంధీ హత్యకు కారణమయినవారిని విడుదల చేయాలని.. ‘మానవీయమైన’ ఉదాత్తతని చూపే కొందరు మహానుభావులు వాపోతున్నారు. మంచిదే. కానీ తాము చేయని నేరానికి ఆయనతోపాటు ప్రాణాలు పోగొట్టుకున్న 15 మంది అజ్ఞాత వ్యక్తుల దయనీయమైన కథనాలు వీరికి తెలియవేమో. రెండు నమూనాలు. 1991 మే 21. ధర్మన్ అతని పేరు. కాంచీపురంలో స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్. ఆయన పిల్లలు ఆ రాత్రి రెడ్ హిల్స్లో ఓ బంధువు ఇంట్లో సరదాగా వేసవి శెలవులు గడుపుతున్నారు. ఒక పోలీసు అర్ధరాత్రి వచ్చి– ఓ మారణకాండలో మీ నాన్న చనిపోయాడని చెప్పారు. అప్పుడు కొడుకు ఎనిమిదో క్లాసు చదువుతున్నాడు. చెల్లెలికి పదేళ్లు. మరో తమ్ముడికి 5. భార్యకి 23 ఏళ్లు. ఈ కొడుకు రాజశేఖరన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. మరొక్క కథ. ఆమె పేరు సంతానీ బేగం. కాంగ్రెస్ మహిళా కార్యకర్త. ఈవిడ మారణహోమంలో చచ్చిపోయింది. అప్పుడు ఈవిడ కొడుకు రెండో క్లాసు చదువుతున్నాడు. తండ్రి చిన్నప్పుడే పోయాడు. వీళ్లన్నయ్య ఈ సభకి వెళ్లొద్దన్నాడు. ‘మా నాయకుడు. వెళ్లకపోతే ఎలా?’ అని తల్లి వెళ్లింది. కుర్రాడు అబ్బాస్ మాటలు: ‘మా అమ్మ పోయాక మేం వీధిన పడ్డాం. సంవత్సరాల తర్వాత నేను రాజీవ్గాంధీ కుటుంబానికి ఉత్తరం రాశాను. ఏమీకాలేదు’. ఇప్పుడు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడు? సెల్ఫోన్ల సామాన్లు అమ్ముకుంటున్నాడు. ఇలాంటివి ఇంకా 13 కథలున్నాయి. రాజకీయాల్లోకి రావడం మనస్కరించని 46 ఏళ్ల కుర్రాడిని–రాజీవ్గాంధీని– ఆనాడు నెహ్రూ కుటుం బం అయిన కారణానికి ప్రధానిని చేశారు. ఫలితం– ఒక అనర్థం. తర్వాత వారి సతీమణి అయిన కారణానికి ఒకావిడని అందలం ఎక్కించారు. ఆవిడ 58 వేల కోట్ల కుంభకోణాలతో, ఓటరు అసహ్యించుకోగా బయటికి నడిచారు. ఇప్పుడు బొత్తిగా బొడ్డూడని ఓ కుర్రాడు– కేవలం నెహ్రూ కుటుంబం అయిన కారణానికి ఆ పార్టీని వెలగబెడుతున్నాడు. జమ్మూకశ్మీర్లో 75 ఏళ్ల వృద్ధుడి గర్భశోకం, ఆనాటి 12 ఏళ్ల కుర్రాడు పితృశోకం ఈ దేశపు వైభవానికి అజ్ఞాతమైన పెట్టుబడులు. కన్నీటిలో గాంభీర్యం ప్రపంచాన్ని జయిస్తుంది. వ్యక్తుల్ని వ్యవస్థలుగా మలిచి ఆకాశాన్ని నిలుపుతుంది. ఉదాత్తతకి దుఃఖం అనుపానం. వీరి స్థానం పత్రికల్లో మారుమూల కావచ్చు. కానీ ఏభై అంతస్థుల భవనంలో పునాదిలోని సిమెంట్ రాయికీ తనదైన పాత్ర ఉంది. గొల్లపూడి మారుతీరావు -
పేరు జబ్బు
తెలుగునాట తరచుగా విని పించే మాట ఒకటుంది: ‘ఆ పనిని నేను సాధించలేక పోతే నా పేరు మార్చు కుంటాను’ అని. ఇది నిజంగా పేరున్నవాడికి చెల్లే మాట. పేరు మార్చుకో వడం నామోషీ, చిన్నతనం. ఓటమి. పరువు తక్కువ– అని నానుడి. మరొక్కరే ‘పేరు’తో కసరత్తు చేయగలరు– రాజకీయ నాయకులు. ‘మమ్మల్ని పదవిలో నిల పండి. పేరు మార్చకపోతే...’ ఇది రాజకీయం. వాళ్ల పేర్లు ఎలాగూ వచ్చే ఎన్నికలదాకా నిలవవు కనుక. ఇప్పుడు పదవిలో ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి ఒకాయన ఎడాపెడా పేర్లు మార్చే స్తున్నారు. ఆయన చెప్పే కారణం– అలనాడు మొగ లాయీ పాలకులు, ముస్లిం పాలకులు వాళ్లకి లాయకీ అయిన పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం మనకి ఇష్టమయిన పేర్లు పెట్టుకుంటున్నాం– అని. మొదట గురుగాం మీద పడ్డారు. అది ‘గురుగ్రామం’ అయింది. ఇంతకీ ఈ గురువు ఎవరు? ద్రోణాచా ర్యులట! 62 సంవత్సరాల కిందట ‘వారణాశి’ అయినా ఇంకా ‘బెనారస్’ అనేవారూ, ‘కాశీ’ అనే వారూ ఉన్నారు. అలనాడు మేడమ్ మాయావతిగారు వారి హయాంలో కాన్షీరామ్ నగర్. మహామాయా నగర్ వెలిశాయి. మొగల్సరాయ్ని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ నగర్ చేశారు. ఇప్పుడు వరసపెట్టి ఆగ్రాని ‘ఆగ్రా వన్’గా, ముజాఫర్ నగర్ని ‘లక్ష్మీనగర్’గా, సిమ్లాని ‘శ్యామల’గా, అహమ్మదాబాద్ని ‘కర్ణావతి’గా, ఔరం గాబాద్ని ‘శంభాజీ నగర్’గా మార్చేస్తున్నారు. ఈ లెక్కన ఫైజాబాద్ ‘అయోధ్య’ అవుతుందట. బిజ్నోర్ మహాత్మా విదుర్ నగర్ అవుతుందట. ఈ మధ్య పేపర్లలో ఈ పేర్ల మార్పు గురించి కోకొల్లలుగా వ్యాసాలు వచ్చాయి. ఇలాంటి మార్పులు ఈ దేశం మీద ‘హిందూమతం’ పులమడమేనని చాలామంది వాపోయారు. దానికి వారందరూ వారి వారి కార ణాలు చెప్పారు. వారి మతాతీత దృక్పథానికి జోహార్లు. అయితే నాకు అర్థం కాని విషయం ఒకటుంది. గత 60 సంవత్సరాల పైచిలుకు– మన అభిమాన కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉండగా కేవలం 450 సంస్థలకు మాత్రమే మన ‘అభిమాన’ కుటుంబం– నెహ్రూ కుటుంబం– వారి పేర్లను పెట్టారు. ఇందులో 12 కేంద్ర, రాష్ట్ర పథకాలు, 28 క్రీడా టోర్నమెంట్లు, 19 స్టేడియంలూ, 5 ఎయిర్పోర్టులూ, పోర్టులూ, 98 విద్యా సంస్థలు, 51 అవార్డులూ, 15 ఫెలోషిప్లూ, 15 జంతు పరిరక్షణ శాలలూ, 39 ఆసుపత్రులూ, వైద్య సంస్థలూ, పరిశోధనా సంస్థలూ, 37 ఇతర రకాల సంస్థలూ, విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పీఠాలూ, ఉత్సవాలూ, 74 రోడ్లూ, భవంతులూ ఉన్నాయి. మన అదృష్టం బాగుండి కొద్దిలో తప్పిపోయిం దిగానీ అచిర కాలంలో మనకి ‘మౌరీన్ నగర్’ ‘మౌరీన్ శిశు సంక్షేమ కేంద్రం’ వెలిసేది. ఏమంటారు? మౌరీన్ ఎవరా? తమరికి కారాగార శిక్ష విధించాలి. మేడమ్ మౌరీన్ సోనియా గాంధీగారికి స్వయానా వియ్యపు రాలు. రాబర్ట్ వాద్రాకి జన్మ నిచ్చిన తల్లి. ప్రియతమ ప్రియాంకా గాంధీ అత్తగారు. మరి నాటి నుంచి మేధావులు, రాజకీయ విశ్లేష కులూ నోరెత్తలేదేం? నెహ్రూ కుటుంబం మీద భక్తా Perhaps they have the sycophancy of giv- ing in to the vageries of one family to the collective ethos of one political thinking. ఈ దేశంలో చెలరేగిన విమర్శల్లో పాక్షికమైన ‘అస హిష్ణుత’ ‘ఆత్మవంచన’ 'Intellectual hypocra- cy' స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో ‘తైతక్కలు’ ఇంకా హాస్యా స్పదం. బోగ్ రోడ్కి పద్మభూషణ్ బి.ఎన్.రెడ్డిగారి పేరు పెట్టారు. భేష్! ఆ మధ్య రోడ్ల పేర్లలో కులాల ప్రసక్తి రాకూడదని ఓ ద్రవిడ నాయకుడు భావిం చినట్టుంది. కనుక ‘డాక్టర్ బి.ఎన్.రెడ్డి వీధి’ కేవలం ‘డాక్టర్ బీఎన్ వీధి’ అయింది. ఈ కత్తిరింపులో తలలేదని ఎవరో ముక్కుమీద వేలేసుకుని ఉంటారు. కనుక ‘బీఎన్ వీధి’ ఏకంగా ‘నరసింహన్ వీధి’ అయింది. ఎవరీ నరసింహన్. ఇది ఎవరిని గౌరవిం చడానికి. ఈ లెక్కన ‘మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ’ పేరు కేవలం ‘కరమ్చంద్’ అయి కూచుం టుంది కదా? మరి ఇప్పుడే అన్నాశాలై పక్కనే ‘ముత్తు రామలింగ తేవర్ నగర్’ ఉన్నదే. ‘తేవర్’ వర్గం నోరు పెద్దదా? టీనగర్లో వ్యాసారావు స్ట్రీట్ ఉండేది. అది న్యాయంగా ‘వ్యాసా స్ట్రీట్’ కావాలి కదా? కానీ ‘వ్యాసార్ స్ట్రీట్’ అయింది. ‘వ్యాసార్’ ఎవరు? అజ్ఞానానికి పరాకాష్ట. బోర్డుమీద ‘వియా సార్ స్ట్రీట్’ అని రాశారు. మరో టర్మ్ ఉంటే రాయ పేట ‘ఎడ్డిపాడి పేట’ అయితే ఆశ్చర్యం లేదు... ఏమి ఈ సంకరం? మహానుభావుల స్మరణకి కావలసింది ఊరి పేర్లుకావు. నిశ్శబ్దంగా వెలుగునిచ్చే ఆల్వా ఎడిసన్, లూయీ పాశ్చర్, భారతీయ సంస్కృతికి ప్రాణం పోసిన ఆదిశంకరులు, కరుణకి శాశ్వతత్వాన్ని కల్పిం చిన జీసస్ వీరి పేర వీధులు, సందులూ, గొందులూ అక్కరలేదు. మహానుభావుల చిరంజీవత్వానికి లౌకి కమయిన గుర్తులు ఆయా పార్టీల ‘ప్రాథమిక’ స్థాయిని తెలుపుతాయి. మహానుభావుడు జీవించేది సైనుబోర్డుల్లో కాదు. జాతి జీవన సరళిని ఉద్బుద్ధం చేయడంలో. -గొల్లపూడి మారుతీరావు -
‘నేను కూడా..’ ఉద్యమం
సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ప్రాథ మికం. సాధారణంగా పాశ వికం. సెక్స్ ప్రాథమిక శక్తి. మళ్లీ పాశవికం. కొలం బియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మార్గరెట్ మీడ్ అనే ఆవిడ దక్షిణాఫ్రికాలో ఆటవిక నీగ్రో జాతుల లైంగిక ఆచారాల గురించి ఒక పుస్తకం రాసింది. అతి ప్రాథమికమైన, అనూహ్యమైన పద్ధతులవి. నా వాక్యాలకు కూడా లొంగవు. మన వివాహ వ్యవస్థ ప్రాథమిక వికారానికి సంస్కారపు టంకం. వెంకయ్యకి సీతమ్మనిచ్చి పెళ్లి చేశారు. ఆ ఘట్టానికి బంధువులెందుకు? ఊరి పెద్ద లెందుకు? వాళ్లిద్దరి ఊరేగింపు ఎందుకు? అది ఆనాటి సంప్రదాయ పరిపక్వతకి నిదర్శనం. ఓ అబ్బాయీ అమ్మాయీ భార్యాభర్తలయితే చాలదు. వారి కట్టుబాటు సమాజానికి తెలియాలి. సీతమ్మ ఎక్కడ తారసపడినా ఆవిడ ఫలానా వెంకయ్య భార్య అనే గౌరవానికి నోచుకోవాలి. సమాజానికంతటికీ తెలియాలి. ఫలానా ఇంటి కోడలని తెలియాలి. ఇవన్నీ– ప్రాథమిక ‘పాశవిక’ ప్రవృత్తికి సమాజం ఏర్పరచిన ఎల్లలు. ఆనాటి సంప్రదాయం– వివా హం పేరిట సమాజానికి నిర్దేశించిన, మహిళ రక్షణకి ఉద్దేశించిన కట్టుబాటు. ఇప్పటి పెళ్లిళ్లకి సాక్ష్యాలు అక్కర్లేదు. ఊరేగిం పులు లేవు. అవసరం లేదు. ‘హేతువు’ సంస్కా రాన్ని అటకెక్కించిన కాలమిది. ఇప్పుడిప్పుడు– ఏకాంతంగానో, ఒంటరిగానో, పెళ్లిళ్లు అక్కర లేకుం డానో కలిసి బతికే ‘లాజిక్’ చోటు చేసుకుంది. న్యాయంగా ఇది సంస్కారానికి ఆవలి గట్టు కావాలి. కాలేదు. కాగా, దశాబ్దాలుగా స్త్రీ పురుషాధిక్యతకో, అతని ప్రాథమిక శక్తి పైత్యానికో గురి అవుతోంది. నేడు మహిళ ఆకాశానికి ఎగురుతోంది. దేశాల్ని పాలి స్తోంది. బ్యాంకుల్ని నిర్వహిస్తోంది. ఇదొక పార్శ్వం. భర్తకి ఇంత వండిపెట్టి, బిడ్డల్ని స్కూళ్లకి సాగనంపి, తానూ ఉద్యోగానికి బయలుదేరుతోంది. అయితే స్త్రీ ఉద్యోగం చేసే పరిస్థితులు, దగ్గరితనం, చొరవ, ఏకాంతం, సహజీవనం, వెసులుబాటు– ఇవన్నీ పురుషులచేత వెర్రితలలు వేయిస్తున్నాయి. అకాలీ ఉద్యమంలో దౌర్జన్యకారుల ఆట కట్టించి చరిత్రని సృష్టించిన ‘సింహస్వప్నం’ కేపీఎస్ గిల్ 1988లో ఒకానొక పార్టీలో మద్యాన్ని సేవించి– చెలియలికట్టని దాటాడు. ఐఏఎస్ ఆఫీసర్ రూపన్ దేవల్ బజాజ్ పిర్రమీద కొట్టాడు. 18 సంవత్సరాలు కేసు నడిచింది. గిల్ నేరస్తుడని సుప్రీంకోర్టు సమర్థిం చింది. రాజకీయ రంగంలో అవినీతిని ఎండగట్టిన ‘తెహల్కా’ పత్రిక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ 2013లో తన సహోద్యోగి మీద చొరవ చేశాడు. దేశం ఆ దృశ్యాన్ని చూసింది. కేసు నడుస్తోంది. ఇప్పుడిప్పుడు మహిళ ధైర్యంగా గొంతు విప్పు తోంది. మొట్టమొదట హాలీవుడ్ ప్రముఖుడు హార్వీ ఐన్స్టీన్ శృంగార లీలలు వీధికెక్కాయి. మహిళల వెన్నులో ధైర్యం వచ్చింది. తమకు జరిగిన అప ఖ్యాతిని బయటపెట్టడానికి జంకనక్కర లేదని గ్రహించారు. ఎందరో పెద్దల గోత్రాలు రోడ్డున పడు తున్నాయి. ప్రఖ్యాత గాయని చిన్మయి– పద్మశ్రీ వైర ముత్తు చాపల్యాన్ని బట్టబయలు చేసింది. మహా నటుడు నానా పటేకర్ తనుశ్రీ దత్తా అనే నటీమ ణితో లైంగికమైన చొరవ తీసుకున్నారట. ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ తనని ముద్దు పెట్టుకున్నా డని ఒక నటీమణి చెప్పింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎమ్జే అక్బర్గారి లీలలు ప్రియా రమణి అనే మహిళ బయట పెట్టింది. నిర్మాత సాజిద్ ఖాన్ వేధింపులు బయటపడ్డాయి. ఆయన తను దర్శ కత్వం వహిస్తున్న ‘హౌస్ఫుల్ 4’ సినిమా నుంచి తొలగాడు. నేరస్తుల్ని శిక్షిస్తే తప్ప నేను నటించన న్నారు హీరో అక్షయ్ కుమార్. సమాజంలో అపఖ్యాతికో, కుటుంబంలో కల్లో లానికో, ఉపాధి చెడిపోయే ప్రమాదానికో– అవమా నాన్ని భరించి, కన్నీరు దాచుకుని నోరు కట్టుకున్న మహిళలు ఇప్పుడిప్పుడు నోరు విప్పుతున్నారు. ఏమైనా సమాజ సంస్కారాన్ని అటకెక్కించి, మారిన వ్యవస్థలో ‘వ్యక్తి సంస్కారాన్ని’ నమ్ముకోవలసిన రోజులొచ్చాయి. ఉద్యోగ కార్యాలయాలలో స్థిరమైన సామీప్యం, సహచర్యం, తప్పనిసరైన ఏకాంతం, సమాజంలో నిలదొక్కుకున్న ‘మగ పుంగవుల’ పర పతి కొంత సాహసాన్ని ఇస్తుంది. అయితే ఈ కథల్లో నిజమైన అవినీతి పాలెంత? కొందరి ‘అక్కసు’ మాత్రమే ఉన్నదా? వీధినపడ్డ మహానుభావులు– ‘వీర నిజాయితీ’ పరులుగా బోర విరుచుకోవడం ఎంత నిజం? ప్రతీ కథకీ 18 ఏళ్ల కోర్టు కేసులు కావాలా? ఇదీ తేలాల్సిన విషయం. ఈనాడు సీతమ్మకి పెళ్లి ఊరేగింపు లేకపో వచ్చు. కానీ వ్యక్తి అవినీతిని ‘ఊరేగించే’ మాధ్యమం మరింత పదునైంది. ఆ ఊరేగింపు విజ్ఞప్తి. ఈ ఊరే గింపు హెచ్చరిక. ఆనాటి సంప్రదాయం ఊతం. నియతి. ఈనాడు– మారిన వ్యవస్థలో అది చాలదు. ‘పరపతి’ అనే ముసుగును ఛేదించే ‘మాధ్యమం’ అనే ఆయుధం, దాని గొంతును గుర్తించి, కొరడా ఝళిపించే వ్యవస్థ కావాలి. నేటి ‘‘నేను కూడా...’’ ఉద్యమం కాదు. ఉప్పెన. గొల్లపూడి మారుతీరావు -
కింగ్ మేకర్
తన వ్యక్తిత్వంతో– చిత్తశు ద్ధితో, నిరంతర కృషితో, నిజాయితీతో– ఎన్ని సోపా నాలను అధిగమించవ చ్చునో–తను జీవించి నిరూ పించిన యోధుడు చలన చిత్ర నిర్మాత కె. రాఘవ. ఆయన ఎక్కడ పుట్టాడో తెలీదు. ఎక్కడ పెరిగాడో అంతగా తెలీదు. తమిళుడు. చిన్నతనం నుంచీ సినీరంగంలోనే ఉంటూ బీఆర్ పంతులు, మీర్జాపురం రాజాగారి కంపెనీలలో ఆఫీసు బోయ్, ప్రొడక్షన్ మేనేజరు, అటెండర్, ఎక్స్ట్రా స్టంటు విభాగంలో పనులు చేసి– కాలు పెట్టిన ప్రతీచోటా తనదైన ప్రత్యేకతను నిలుపుకుని– నిర్మాత అయి– తెలుగు చలన చిత్ర రంగంలో ఎవరూ చెయ్యలేని, చెయ్యని సాహసాలను అధిగమించిన కార్యదక్షుడు రాఘవ. నాకు ఆయన 1968 నుంచీ తెలుసు. అప్పుడు విజయవాడ రేడియోలో పని చేస్తున్నాను. ‘జగత్ కిలాడీలు’ రిలీజుకి వచ్చి వెల్కం హోటల్లో ఉన్నారు ఆయన, ఆయన పార్టనర్ ఏకామ్రే శ్వరరావుగారు. జగత్ కిలాడీలు పెద్ద హిట్. అది ఇంగ్లిష్ నవల Crimson Circle స్ఫూర్తి. మధ్య మధ్య ఆయన్ని చూస్తున్నా– నా అవ తారాలు మారి సినిమా రచన చేయడం ఆయనకి తెలుసు. 1981లో నాకాలూ చెయ్యీ విరిగి రాయ పేట ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఓ సినిమా రచనకు ఏకామ్రేశ్వరరావుగారి ద్వారా కబురు పంపారు. పారి తోషికం ఎంత? 4 వేలు! ఆరునెలలు మంచానికి పరి మితమైన స్థితి. ఒప్పుకున్నాను. అప్పుడే కోడి రామ కృష్ణ పరిచయం. రాఘవ బొత్తిగా చదువుకోలేదు. కానీ ఏ చదువూ ఇవ్వని అరుదైన instinct ఆయన సొత్తు. ఒక ఇతివృత్తం మంచి చెడ్డలను బేరీజు వేసు కోవడం ఒక ఎత్తు అయితే ఒక కళాకారుడు, దర్శకుని ప్రతిభను– ఏ నేపథ్యం లేకుండా గుర్తుపట్టి– వారికి కూడా చాలని విశ్వాసాన్ని వారిపట్ల పెంచుకునే వేది కను కల్పించడం ఆయన చరిత్ర. బాగా చదువుకుని, మాధ్యమాన్ని ఆకళించుకున్న మాలాంటి వారినే నిర్ఘాంతపోయేటట్టు చెయ్యగల ఆత్మవిశ్వాసం ఆయన పెట్టుబడి. సినిమా షూటింగు మధ్యలో నేను జారిపోతున్నా– రాఘవ నవ్వి ‘మీరు సినిమా రంగంలో నలుగురిని కొట్టేస్తారు మారుతీరావు గారూ’ అనేవారు. నాకు సిగ్గుగా ఉండేది. లేకపోతే 42 సంవత్సరాల వయస్సున్న నన్ను, ఏనాడూ కెమెరా ముందు నిలబడని నన్ను, పొరపా టునయినా నటన గురించి ఆలోచించని నన్ను– ఓ సినిమా టైటిల్ పాత్రకి– 5 పాటలూ, దాదాపు 40 సీన్లూ ఉన్న పాత్రకి ఎంపిక చేసి, పట్టుబట్టి నాచేత వేయించడం రాఘవగారికే చెల్లును. అది ఆయన నిర్దుష్టమైన conviction, ఒక మూర్ఖపు పట్టుదలకీ నిదర్శనం. పైగా దర్శకుడు కోడికి అది మొదటి చిత్రం. అయితే అప్పటికే ‘తాత–మనుమడు’ అనే హిట్ ద్వారా దాసరిని పరిచయం చేసిన ఘనత ఆయనది. గేయ రచయిత రాజశ్రీని ఒక చిత్రం ద్వారా దర్శకుని చేసిన గుండె ధైర్యం ఆయనది. రావుగోపాలరావు, మాధవి వంటి నటీనటులను తెరకు పరిచయం చేసిన ‘దమ్ము’ ఆయనది. చాలా ఇబ్బందిగా, సగం మనస్సుతోనే పాలకొల్లు చేరాను. తన నిర్దుష్టమైన నిర్ణయంతో– నా రచనా వ్యాసం గాన్ని అటకెక్కించి, 38 సంవత్సరాల, 300 చిత్రాల నట జీవితానికి ఆరోజు నాందీ పలికారు. హ్యాట్సాఫ్. ఆయన తన నిర్ణయాలను ఏ మాత్రమూ సడ లించేవారు కాదు. ఓ గొప్ప ఉదాహరణ. నేను నటిం చిన ‘ఇంట్లో రామయ్య...’కి చాలా కట్స్ ఇచ్చారు సెన్సారువారు. కొన్ని మళ్లీ షూటింగు చేశాం. ఒక షాట్ పది పన్నెండుసార్లు రిహార్సల్స్ చేయిస్తున్నాడు కోడి. విసుక్కున్నాను. దగ్గరికి వచ్చి చెవిలో చెప్పాడు: ‘మన దగ్గర 20 అడుగుల నెగిటివే ఉంది గురు వుగారూ’ అని. 500 రోజులు పోయిన ఆ చిత్రంలో ఇప్పటికీ ఒక షాట్ అలికినట్టు (ఫాగ్తో) ఉంటుంది. రెండో చిత్రం ‘తరంగిణి’ విజయవంతమై–ఒక సంవ త్సరం నడిచింది. జీవితంలో– ముఖ్యంగా సినీ రంగంలో విజ యాన్ని వెంటపడి పట్టుకోవాలనే చాలామంది యావ. కానీ ఓ కొత్త దర్శకునికిచ్చే అవకాశానికి– 42 ఏళ్ల నటుడిని జతచేసి– భారతదేశంలో అన్ని భాష లలో ‘ఇంట్లో రామయ్య– వీధిలో కృష్ణయ్య’ చిత్రాన్ని ఆమోద యోగ్యం చేసిన ఘనుడు రాఘవ. ఆనాడు నా ‘సందేహాలను’ ఖాతరు చెయ్యక, విముఖత నుంచి నన్ను బయటికి లాగి మరో రంగానికి రాఘవ మళ్లించకపోతే– నా జీవితం వేరుగా ఉండేది. ఆ మాటకి వస్తే చాలామంది జీవితాలు మరోలా ఉండేవి. ఆనాడు రాఘవ లేకపోతే ఇప్పటి నా జీవితం ఇలా ఉండేది కాదు. మంచి నిర్మాత విజయవంతమైన సినిమా తీస్తాడు. అభిరుచిగల నిర్మాత పదికాలాలపాటు నిలిచే చిత్రాన్ని నిర్మిస్తాడు. దమ్ము ఉన్న నిర్మాత మాధ్యమానికి కొత్త పుంతల్ని వేసి– కొత్తదనానికి ఊపిరి పోస్తాడు. తెలుగు సినీ పరిశ్రమ ఎందరో నిర్మాతలను దాటి వచ్చింది. కానీ ఎందరి జీవితా లనో మలుపు తిప్పగల ‘కొత్త’దనాన్ని పరిశ్రమకు పంచిన అరుదైన నిర్మాత రాఘవ. గొల్లపూడి మారుతీరావు -
ముప్పై ఏళ్ల వెలుగు
గొల్లపూడి మారుతీరావు రచించిన కథ ఆధారంగా ఎం.వి. రఘు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కళ్లు’. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రానికి ఎం.వి.రఘు ఛాయాగ్రాహకుడిగా, సీతారామశాస్త్రి గీతరచయితగా పనిచేశారు. అప్పటి నుంచి సీతారామశాస్త్రితో ఎం. వి. రఘు స్నేహం పల్లవించి, సౌరభాలు వెదజల్లింది. ‘కళ్లు’ నాటకాన్ని చిత్రంగా మలచాలనుకున్న ఆలోచన మనసులో మెదలగానే, ఆ చిత్రంలో పాటలను సీతారామశాస్త్రి చేత రాయించాలనుకున్నారు రఘు. ఆగస్టు 12కు ‘కళ్లు’ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రంలో సీతారామశాస్త్రి రచించి, గానం చేసిన ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో’ పాటకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు చిత్ర దర్శకుడు ఎం.వి. రఘు. ఒక కన్ను ఎస్.డి. బర్మన్ ‘‘కాలేజీలో చదువుకునే రోజుల్లో హిందీ చలన చిత్ర సంగీత దర్శకుడు ఎస్. డి.బర్మన్ పాటలు వింటుండేవాడిని. ఆయన చేసిన పాటలలో ఆయనే స్వయంగా పాడిన పాటలలో ఏదో ఒక అనుభూతి కలిగేది నాకు. ఇటువంటి పాటలను ఫిలసాఫికల్గా, మనసు పెట్టి వినాలి, అనుభూతి చెందాలి. అదే అనుభవం సీతారామశాస్త్రి అప్పుడప్పుడు వాడుకలో ఉన్న పల్లెపదాలను బల్ల మీద డప్పులా వాయిస్తూ పాడుతున్నప్పుడు కలిగేది. ఆయన పాట పాడే విధానంలో వినిపించిన వేదాంతం, నా మనసులో చిత్తరువులా నిలిచిపోయింది. ఇంకో కన్ను సీతారామశాస్త్రి ‘కళ్లు’ చిత్రం తీయాలనుకున్నప్పుడు, అటువంటి పాటను రాయించి, పాడించాలని మనసులో అనుకున్నాను. ఈ చిత్రానికి ఎస్.పి. బాలు సంగీతం సమకూర్చారు. ఈ పాటను సీతారామశాస్త్రితో పాడించాలనుకుంటున్న నా ఆలోచనను బాలుతో చెప్పగానే, తన మనసులో మాట కూడా అదేనని ఆయన అనడంతో ఆ పాటను సీతారామశాస్త్రితో పాడించాం. ఈ పాట ఉద్దేశం.. ‘కళ్లు వచ్చిన తరవాత కళ్లతో కాకుండా మనసుతో చూడండి’ అని ఒక వేదాంతం చెప్పడం. ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో.. మంచాలింక దిగండోయ్ కొక్కొరోకో.. ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట సెట్టు ఇడిచింది.. మూసుకున్న రెప్పలిడిసి సూపులెగరనీయండి..’ అంటూ సాగుతుంది ఈ పాట. కళ్ల నిండా జ్ఞాపకాల తడి ఈ చిత్రం షూటింగ్ 1988 జనవరి ఎనిమిదో తేదీన విశాఖపట్టణంలో పూర్తయింది. యూనిట్లో అందరినీ వెనక్కి పంపడానికి చేతిలో ఒక్క పైసా లేదు. మేం దిగిన హోటల్ యజమానితో అప్పటికే స్నేహం ఏర్పడింది. ఆయన దగ్గరకు వెళ్లి, ‘మా దగ్గర ఉన్న ఈ సామాను మీ దగ్గర ఉంచుకుని, పది వేలు ఇవ్వండి’ అని అడిగి తీసుకుని, అందరినీ రైలు ఎక్కించాను. నాటి సంఘటన నేటికీ నా మనసులో ఇంకా తడి జ్ఞాపకంగానే ఉంది. నా మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఆ రోజున అత్తారింటికి కూతురిని పంపిస్తున్న తండ్రిలా నేను ఏడుస్తుంటే, తండ్రిని విడిచి వెళ్తున్న పిల్లల్లా వారంతా బాధపడ్డారు. కంటికి కనిపించిన పాట అందరూ వెళ్లాక... నేను, నా కెమెరా, సత్యానంద్, నా కో–డైరెక్టర్గా పనిచేసిన ఇవివి సత్యనారాయణ మిగిలాం. మేమంతా ఒక వ్యానులో బయలుదేరి, దారిలో చిన్న కుక్కపిల్ల, గట్ల వెంట ఆడపిల్లలు, గోతులలో లీకైన కుళాయిలు... ఇలా దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేలా కనపడినవన్నీ నా కెమెరాతో బంధించాను. దారిలో పనిచేస్తున్న కార్మికులను చూడగానే ‘చెమట బొట్టు సమురుగా సూరీణ్ని ఎలిగిద్దాం / వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం’ అనే వాక్యానికి తగిన సన్నివేశం కనిపించిందని సంతోషపడ్డాను. ఆ వాక్యాలకు అనుకూలంగా అక్కడ పనిచేస్తున్న పనివారూ, ఆ సంధ్య ఎరుపు.. నూనె చారలాగ వచ్చింది. కంటిని నడిపించిన పాట మద్రాసులో ఉండే అనిల్ మల్నాడ్తో ఎడిటింగ్ చేయించేవరకు అసలు సినిమాలో ఏ సన్నివేశాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. సినిమా పూర్తయ్యాక థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పెద్దగా ప్రేక్షక ఆదరణ రాలేదు. అదేం చిత్రమో కాని, ఈ పాట ప్రారంభం కాగానే, ఆపరేటర్ సహా బయట ఉన్నవారంతా లోపలకు వచ్చేవారు. థియేటర్ ఫుల్ అయిపోయేది. పాట అయిపోగానే క్లాప్స్ కొట్టి వెళ్లిపోయేవారు. ఇంతకాలం తర్వాత ఇటీవల ఈ పాటను యూ ట్యూబ్లో పెట్టాలనిపించింది. అలా పెట్టిన వారానికే ఐదు లక్షల హిట్స్ దాటాయి. ఈ చిత్రం విడుదలయిన 30 సంవత్సరాల తరవాత మళ్లీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్రంలో నటించిన చిదంబరం ‘కళ్లు చిదంబరం’గా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచితుడయ్యాడు. (‘కళ్లు’ చిత్రంలోని ఓ దృశ్యం) – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఎకాఎకీ - ముఖాముఖీ
నాకెప్పుడూ మన ఎన్నికలలో తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. ఆయా నాయకులు– ప్రత్యర్థులు– వేర్వేరు వేదికలమీద ఒకరినొకరిని విమర్శించుకుంటారుగానీ– చక్కగా అమెరికాలోలాగ– హిల్లరీ క్లింటన్, ట్రంప్ దొరగారిని– ఒకే వేదిక ఎక్కించి– ప్రపంచమంతా చోద్యం చూస్తుండగా భవిష్యత్తులో ఆ దేశాన్ని పాలించే నాయకుని ఘనతను గ్రహిం చడం ఎంత ముచ్చటగా ఉంటుంది? అది ఈ మధ్య కర్ణాటకలో కొంతలో కొంత ప్రారంభమయిందని నాకనిపిస్తుంది. ఆ మధ్య ఒక సభలో ప్రధాని మోదీ ఓ మాట అన్నారు: 15 నిమిషాలు చేతిలో ఏ కాగితం లేకుండా రాహుల్ గాంధీ కర్ణాటక, ముఖ్యంగా విశ్వేశ్వరయ్య గొప్పతనాన్ని గురించి చెప్పగలరా? అంటూ. ఇది చాలా కత్తిలాంటి సవాలు. మరి మన రాహుల్ తక్కువ తినలేదు. ‘‘ఏదీ? కేవలం 5 నిమిషాలు– తాము ఈ ఎన్నికలలో నిలిపిన అభ్యర్థులు– ముఖ్యంగా యడ్యూరప్పమీద అవినీతి, క్రిమినల్ కేసులను సమర్థించమనండి. అలాగే టికెట్లు పొందిన జనార్ధనరెడ్డి హితులు 8 మంది ఘనతని ఉటంకించమనండి’’– అని రాహుల్ సవాలు విసిరారు. అయితే ఇది మరో వేదికమీద– బాగా ఆలోచించాక చెప్పిన మాటలు. కానీ వీటిని వెంట వెంటనే చెప్పగలిగితే ఎంత బాగుంటుందని నాకు ముచ్చట. ఈ విధంగా రెండు గొప్ప సవాళ్లు– రెండు విభిన్నమయిన వేదికలమీద వృథా అయిపోయాయని నా బాధ. ఇదేగానీ అమెరికాలో లాగా ఇద్దరు ప్రత్యర్థులనూ ఒకే వేదిక మీద నిలిపి– ఒకరినొకరు ప్రశ్నిం చుకుంటే– కథ ఎంత రమ్యంగా ఉంటుంది? ఏతా వాతా అలాంటి పోటీ జరిగితే రాహుల్ తేలికగా పది మార్కులు ఎక్కువ కొట్టేస్తారు. చక్కటి ముఖ వర్చస్సు, గీసిన గెడ్డం, సొట్టలుపడే బుగ్గలు– ఇవన్నీ ప్రత్యేకమైన ఆకర్షణలు. మాసిన గెడ్డం, తెల్లటి జుత్తు, ఖరీదైన వాచీ– ఇలాంటివి మోదీ ఆకర్షణ. బొత్తిగా ముసిలి రూపు. నాకేమో– చూడగానే మొదటి రౌండు విజయం రాహల్ది. ఈ తర్వాత విన్యాసాలలో రాహుల్ కొన్ని ప్రయత్నాలు చెయ్యాలి. అవసరమయితే– అటు మోదీ వెనుక యడ్యూరప్ప, మన రాహుల్ వెనుక సిద్ధరామయ్య ఉండవచ్చు. ఉదా‘‘కి కర్ణాటకలో ఓడిపోతే కాంగ్రెస్ ‘పంజాబు, పుదుచ్చేరీ, పరివార్’ పార్టీగా మిగిలిపోతుందని ఒక విసురు మోదీ విసిరారు. వెంటనే సిద్ధరామయ్య ‘అయ్యా, మాది సరే. రేపు మీరు రాష్ట్రంలో గెలవకపోతే మొదట ఇంగ్లిష్లో చెప్తాను. ‘ప్రిజన్, ప్రైస్ రైజ్, పకోడా’ పార్టీగా మిగిలి పోతుంది అని వాక్రుచ్చారు. నాకేమో ‘పకోడా’ కంటే ‘పరోటా’, ‘పాలకోవా’, ‘పరవాన్నం’ వంటివి వాడవచ్చుననిపించింది. ఇంకా ఇలాంటివి మరిన్ని. ఉన్నట్టుండి రాహుల్ ఒక దొంగ ప్రశ్న అడగొచ్చు: ‘‘ఒడయార్ మేనత్త ముక్కు నత్తు బరువు ఎంత? మీకు 4 నిమిషాలు టైము’’ అనవచ్చు. తప్పనిసరిగా మోదీ తెల్లమొహం వేస్తారు. అప్పుడు రాహుల్ చిరునవ్వు నవ్వి ‘అసలు ఒడయార్కి మేనత్తే లేదని’ ఉటంకించవచ్చు. తద్వారా 3,479 జనానా ఓట్లు కాంగ్రెస్కి పడిపోతాయి. తరువాత కొన్ని జీకే ప్రశ్నలు అడగవచ్చు. ‘తమిళనాడు సరి హద్దు దాటగానే– అంటే హోసూరు దాటగానే– వచ్చే మొదటి గ్రామం పేరేమిటి?’ అని రాహుల్ అడిగారనుకోండి. మోదీ తక్కువ తిన్నారా? ‘తుంకూర్లోకి ప్రవేశించగానే కుడివేపు కనిపించే మొదటి సైన్ బోర్డు ఏమిటి?’ అని అడగవచ్చు. ఇక లెక్కలవేపు వెళ్తే– గాలి జనార్ధనరెడ్డిని మనస్సులో పెట్టుకుని ‘35 వేల కోట్లలోంచి– ప్రస్తుతం ఎన్నికలకి 1,800 కోట్లు తీసేయగా ఎంత మిగులును?’ అని అడగవచ్చు. ‘ఖత్రోచీ ఇటలీ చేర్చిన సొమ్ములో 50 మిలియన్ల కోట్లకు ఎన్ని యూరోలు?’ అని మోదీ ప్రశ్నించవచ్చు. 2011లో గోవా కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు సోనియా ఎన్నికల ఉపన్యాసాలు చేస్తూ ‘అక్కడి మహాదయీ నది నీరు అచ్చంగా వారిదేనని హామీ ఇచ్చారు. ఇప్పుడు గోవా చెయ్యి జారిపోయింది కనుక మహాదయీ నది ప్రసక్తి లేదు’ అంటూ దీన్ని కాంగ్రెస్ ‘అట్కానా, భట్కానా, లట్కానా’ అన్నారు. ఇలాంటి మాటలు మన రాహుల్కి దొరక్కపోవచ్చు, అయితే వారు అప్పుడప్పుడూ వారి మాతృభాష అయిన ‘ఇటలీ’ని వాడే అవకాశాన్ని కల్పించుకోవచ్చు. ఏమైనా మోదీ, రాహుల్ సవాల్ చేసినందుకే సగం ఆనందిస్తూ– అలాంటి అమెరికా పోటీల రోజులు మనకీ త్వరలో వస్తాయని ఆశిద్దాం. గొల్లపూడి మారుతీరావు -
ఏమిటి ఈయన ప్రత్యేకత?
జీవన కాలమ్ రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీ కాంతరావు. రేడియో సంగీతానికి ఆయన ఒక శయ్యను రూపుదిద్దారు. నేను ఆలిండియా రేడి యోలో చేరే నాటికి నాకు 23 సంవత్సరాలు. రజనీగారికి 43. నా ముందు మహాను భావులైన ఆఫీసర్లు– బాలాంత్రపు రజనీకాంతరావు, యండమూరి సత్యనారాయ ణరావు, దాశరథి, బుచ్చి బాబు– ఇలా. ఇక పండిత ప్రకాండుల బృందం ఆ తరానికే మకుటాయమానం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్థానం నరసింహారావు, ముని మాణిక్యం నరసింహారావు, నాయని సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, డాక్టర్ జీవీ కృష్ణారావు – ఈ జాబితా అపూర్వం. వీరందరూ తేలికగా మాకంటే 30–35 సంవత్సరాలు పెద్దవారు. ఓ తరాన్ని జాగృతం చేసిన అద్భుతమైన ప్రక్రియలకు ఆద్యులు. భారతదేశంలోని అన్ని ప్రక్రియలకు తగిన ప్రాధా న్యం కల్పించాలనే దురాశతో– ఆయా రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వృద్ధులందరినీ రేడియోలోకి ఆహ్వానిం చారు పెద్దలు. వీరెవరికీ మాధ్యమంమీద ఒడుపుగానీ, అవగాహనగానీ, తర్ఫీదుగానీ లేనివారు. రిటైరై పెన్షన్ పుచ్చుకుంటున్న బాపతు మహానుబావులు. ఆ మాట కొస్తే మాకే ఇంకా తర్ఫీదు లేదు. ఉద్యోగంలో చేరిన ఒక్కొక్క బ్యాచ్ని ఢిల్లీ పంపుతున్నారు. ఇదొక రకమైన అవ్యవస్థ. అయితే ‘అసమర్థత’ తెలుస్తోంది. మార్గం తెలియడం లేదు. ఈ దశలో మాకంటే కేవలం 12 సంవత్సరాల ముందు –ఒక కార్యశూరుడు– మాధ్యమం అదృష్టవ శాత్తూ దక్షిణాది ప్రసార మాధ్యమంలో అడుగు పెట్టారు. ఆయన పేరు బాలాంత్రపు రజనీకాంత రావు. ఆ రోజుల్లో మద్రాసు రేడియో స్టేషన్ అంటే తెలు గువారి పుట్ట. 1941లో చేరిన రజనీకాంతరావుగారు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అటు పార్లమెంటులో నెహ్రూ ఈ దేశ స్వాతంత్య్రాన్ని గురించి ఉపన్యాసం ఇస్తూంటే ఇక్కడ– మద్రాసులో కేవలం 26 ఏళ్ల యువ కుడు 1947 ఆగస్టు 15 తెల్లవారుజామున ఎలుగెత్తి ‘మ్రోయింపు జయభేరి’ అని నగారా మ్రోయించారు. ఎందరికి దొరుకుతుంది ఈ అదృష్టం. ‘మాదీ స్వతం త్ర దేశం’ అని టంగుటూరి సూర్యకుమారి మైకుల ముందు ఉరిమింది. ఆ రోజు కమాండర్–ఇన్చీఫ్ రోడ్డులో ఉన్న రేడియో స్టేషన్లో లేనిదెవరు? కొత్తగా పెళ్లయిన బుచ్చిబాబు తన భార్యతో సహా స్డుడియోలో ఉన్నారు. అదొక ఆవేశం. మరో 40 ఏళ్ల తర్వాత టంగు టూరి సూర్యకుమారిని ఇంగ్లండు కెంట్లో ఒక పార్టీలో ఈ విషయం చెప్పి పులకించాను. రేడియో స్టేషన్ అంటే– ఆ రోజుల్లో దాదాపు సగం సంగీతం. ఏం సంగీతం? మరిచిపోవద్దు. మద్రా సులో సంగీతం అంటే వర్ణం, కీర్తన, జావళి వగైరా. మామూలు పాటలంటే సినీమా తైతక్కలు. కానీ రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీకాంత రావు. దీన్ని ఇంకా చాలా రేడియో కేంద్రాలు ఇప్పటికీ పట్టుకోలేదంటే తమరు నన్ను క్షమించాలి– బాణీ. ‘ఊపరె ఊపరె ఉయ్యాల... చిన్నారి పొన్నారి ఉయ్యాల’ వంటి రజని పాటలు (ఎస్. వరలక్ష్మిగారు పాడారు) నాకు బహిఃప్రాణం. మరో 35 సంవత్సరాల తర్వాత– జీవితం నాకు అవకాశమిచ్చి వరలక్ష్మమ్మ గారూ (నాకంటే 12 ఏళ్లు పెద్ద) నేనూ భార్యాభర్తలుగా నటించినప్పుడు ఆమెకి ఈ పాటని ఆమె చెవిలో గుర్తు చేసి పాడించుకుని పులకించాను. అలాగే పాకాల సావిత్రీదేవి, శాంతకుమారి, టంగుటూరి సూర్యకుమారి, ఏ.పీ. కోమల– ఇలా ఎందరో. వీరంతా నేను రేడియోలో చేరడానికి పెట్టు బడులు. ఆయనతో ‘బావొచ్చాడు’ ‘అతిథిశాల’ వంటి ఎన్నో సంగీత రూపకాలలో తలదూర్చిన అనుభవం ఉంది. ఇక నా కథకు వస్తాను. రజనీకాంతరావుగారు అప్పుడే స్టేషన్ డైరెక్టర్గా వచ్చారు. నాకు పిడుగు లాంటి వార్త. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ ఇచ్చి నన్ను శంబల్పూరు (ఒరిస్సా) బదిలీ చేశారని. ముమ్మ రంగా సినీ రచన సాగుతున్న సమయం. రజనీగారి గదిలోకి నా రాజీనామా కాగితంతో వెళ్లాను. రజనీ గారు తీరి కగా నా రాజీనామా పత్రం చదివారు. చదివి అడ్డంగా చించేశారు. ‘తప్పనిసరిగా వెళ్లండి. ఉద్యోగం మానేయవద్దు. అవసరమైతే ముందు ముందు చూద్దు రుగానీ’ అన్నారు. బయటికి నడిచాను. ఆ తర్వాత మరో 12 సంవత్సరాలు పనిచేసి– మరో ప్రొమోషన్ కడపలో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరునై, అనుకోకుండా నటుడినై రాజీనామా చేశాను. ఇప్పటికీ– ఆయన ఏ 40 ఏళ్ల కిందటో– ఇంకా వెనుకనో– రచించి, బాణీ కూర్చి, పాడించిన (బాల మురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం) ‘మన ప్రేమ’ పాట ఒక్కటీ కేవలం 70 సంవత్సరాలు రేడియో నడ కనీ, వయ్యారాన్ని రజనీ రచనా పాటవాన్నీ, రేడియో తనాన్నీ తెలియజేస్తూ జెండా ఊపుతున్నట్టుంటుంది. రజనీకాంతరావు గారు రేడియో సంగీతానికి ఒక శయ్యను రూపుదిద్దారు. రేడియోకి ఒక రజనీ చాలడు. ప్రతీ కేంద్రానికీ కావాలి. ఈ మాధ్యమానికి కావాలి. ఇప్పటికీ కావాలి. - గొల్లపూడి మారుతీరావు -
భజరంగీ భాయీజాన్ చూసి కంటతడి పెట్టుకున్నా..
జీవన కాలమ్ మహా పురుషుల పాద రేణువులతో పవిత్రమైన ఈ దేశంలో జైళ్ల వైభవం– సల్మాన్ఖాన్ వంటి సినీ నటుల 650 కోట్ల పెట్టుబడుల వ్యాపార కాంట్రాక్టు లతో, అభిమానుల వీర స్పందనలతో ఏనాడూ తన ‘పవిత్రత’ను కోల్పోదు. ఈ దేశం అట్టు ఉడికినట్టు ఉడికిపోయింది. కొందరు గుండెలు బాదుకున్నారు. గుండె ధైర్యం చాలని కొందరు చచ్చిపోయారు. ప్రతీ ఊరులోనూ హాహా కారాలు చేశారు. కొన్ని వేల మంది ఆయన ఇంటి చుట్టూ, మరి కొన్ని వేలమంది జోద్ పూర్ జైలు గోడల్ని పట్టుకుని రోదిస్తూ ఆ మహానటుడి దీన వదనాన్ని దర్శించడానికి గుంజాటన పడ్డారు. కారణం– సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక రాత్రి జైల్లో గడపాలి– 20 సంవత్సరాల కిందట నల్లజింకని చంపి నందుకు.. నన్ను క్షమించాలి. నేనెప్పుడూ నా అంతట నేనుగా సల్మాన్ ఖాన్ చిత్రాన్ని చూడలేదు– ఒకసారి మా అబ్బాయి ఒత్తిడి మీద ‘భజరంగీ భాయీజాన్’ చిత్రాన్ని చూసి కంటతడి పెట్టుకున్నాను. అయితే ఆయన కంట తడిని పెట్టించే నటుడు కాదని తర్వాత తెలిసింది. జోద్పూర్ జైలు ఆవరణలోకి ఈ నటుడు నడిచి రావడాన్ని మా అబ్బాయి చూపించాడు– టీవీలో, సల్మాన్ ఖాన్ గారి నడకను తమరు ఈ పాటికే గ్రహించి ఉండాలి. పెదాలు బిగించి, రెండు భుజ బాహువుల్లోంచీ రెండు ఈత చెట్లను నిలిపేంత ఠీవిగా నడిచి వచ్చారు. తెల్లారితే రాహుల్, మోదీ లతో మొహం మొత్తే పత్రికలు, చానల్స్ జో«ద్పూర్ జైలు ఆవరణ ఆఫీసు గదిలో వారు కాళ్లు దాదాపు జైలర్ మీదికి జాపి కూర్చున్న ఫొటోని ప్రచురిస్తూ– ‘ఈ ఫొటో మొదటిసారి వేస్తున్నది మేమే’ అని గర్వంగా చెప్పుకున్నారు. మరి 20 ఏళ్ల క్రితం ఈ సుంద రాంగుడు నలుగురు అందమైన అమ్మాయిల్ని తోడు తీసుకుని అడవికి వెళ్లి, అరుదైన అడవి జంతువు నల్ల జింకను చంపిన వైనం ఈ దేశం మరచిపోయింది. న్యాయస్థానాలు వెనక్కి నెట్టాయి. మరి ఇంత చిన్న నేరానికి శిక్ష విధించడానికి 20 సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఏ పత్రికా తమ పత్రికల్లో రాయలేదు. ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది. డబ్బు, పరపతి, న్యాయ స్థానాలకి సినిమా రంగం మీద ఉన్న భయం (ప్రియం కాదు– గమనించాలి). మన దేశంలో జైలుకెళ్లిన మహానుభావుల్ని ఒకసారి స్మరించుకుని తరిద్దాం. లాలూప్రసాద్ యాదవ్ (వెంటనే వీరినే ఎందుకు స్మరించాలి?). ఒక రిపోర్టు ప్రకారం, వీరి హయాంలో ఒక్క 8 సంవత్సరాలలో మాత్రమే 32 వేల మందిని ఎత్తుకు పోయి, వారిలో చాలామంది డబ్బు చెల్లించాక హత్యలు జరిపించారట. వీరు కాక ఈ మహానుభావుల జాబితాల్లో ఆసా రామ్ బాపూ, గురు మీత్ సింగ్ రామ్ రహీం ఉన్నారు, వారి ఉంపుడుకత్తె హనీ ప్రీత్ కౌర్ ఉంది. మధుకోడా ఉన్నారు. శిబూ సొరేన్, పండిత్ సుఖ్రామ్ ఉన్నారు, ఓం ప్రకాశ్ చౌతాలా, ఎ. రాజా, కనిమొళి ఉంది. వీళ్ల జైలు జీవితం మాటేమోకానీ, ఈ రాత్రి సల్మాన్ ఖాన్ సుఖంగా ఉండటానికి నాలుగు బొంత లిస్తారట. జైలరుగారి అనుంగు పుత్రుడు అవసరమ యితే వాళ్ల నాన్న తల పగులగొట్టి రెండు పరుపులు, నాలుగు దుప్పట్లూ సల్మాన్ గదికి తరలించి, రాత్రంతా ఆయనకి సేవ చేసి, తను చచ్చిపోయేదాకా ఆ అనుభూ తిని పెళ్లాం పిల్లలతో చెప్పుకుని గర్వపడతాడని నా నమ్మకం. మన దేశంలో బొత్తిగా పనికిరాని, అరెస్టైన కొందరు నేరస్థులను కూడా తలచుకోవడం న్యాయం. జయ ప్రకాశ్ నారాయణ్, క్లుప్తత కోసం కొన్ని పేర్లు– సర్దార్ వల్లభాయి పటేల్, రాజాజీ, పట్టాభి సీతా రామయ్య, మౌలానా అజాద్, లాల్ బహదూర్ శాస్త్రి. వీరందరూ అజరామరమైన కీర్తి శేషులు. మరో మాట లేదు. కావా లనే నెహ్రూ గురించి వ్రాయడం లేదు. కారణం ఆయన ఆ వైభవాన్నీ అనుభవించారు. అంత గొప్పగానూ నిష్క్రమించారు. మరో మూడు పేర్లే రాసి ఈ కాలమ్ ముగిస్తాను. మహాత్మా గాంధీ 2,500 సంవత్సరాల దక్షిణాయతన పీఠాధిపతి జయేంద్ర సరస్వతీ మహా స్వామి, వినోభా భావే. మహాత్ముడు సగం జీవి తాన్ని జైళ్లో గడిపాడు. తుండు గుడ్డ, పంచె ఆయన ఆభర ణాలు. జయేంద్ర సరస్వతి మహాస్వామి 61 రోజులు జైల్లో ఉన్నారు. శిరస్సుపైన ఉన్న దివ్య వస్త్రమే (‘శాటి’) వారు ఉప యోగించుకున్నవి. మరొక మహా పురుషుడు వినోభా భావే. మహాత్ముడు నిరాహార దీక్షలలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య మూలాలను పెకలించి, ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టి మార్టిన్ లూథర్ కింగ్, బాద్షా గాంధీ, నెల్సన్ మండేలా వంటి వారికి గురువై– ఎన్నో దేశాల స్వాతంత్య్రానికి కారణమ య్యాడు. మరొక మహాస్వామి ఈ జాతి ఆధ్యాత్మిక సంప దను సుసంపన్నం చేశారు. మరొకాయన వినోభా భావే. ఆయన శరీరంలో భాగాలు మందులకు ఎదురు తిరిగితే– ‘ఈ శరీరం ఇక చాలునంటోంది’ అని స్వచ్ఛం దంగా మృత్యువుని ఆశ్రయించిన అపర బీష్ములు. ఇలాంటి మహా పురుషుల పాద రేణువులతో పవి త్రమైన ఈ దేశంలో జైళ్ల వైభవం– ఇలాంటి సినీ నటుల 650 కోట్ల పెట్టుబడుల వ్యాపార కాంట్రాక్టులతో, అభిమానుల వీర స్పందనలతో ఏనాడూ తన ‘పవి త్రత’ను కోల్పోదు. గొల్లపూడి మారుతీరావు -
అబద్ధం చెప్పడం
జీవన కాలమ్ అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు. మనం చేసే పనుల్లోకెల్లా అబద్ధం చెప్పడం చాలా కష్టతరమైన పని. అబద్ధానికి ముందు కావలసినంత పరి శ్రమ కావాలి. ఫలానా అబద్ధం వల్ల కథ అడ్డం తిరిగితే తప్పిం చుకునే దారులో, సమర్థిం చుకునే మార్గాలో అప్పటికప్పుడు కరతలామలకంగా సిద్ధంగా ఉండాలి. అబద్ధం చెప్పడంలో సూపర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రముఖ నటుడు, నా అనుంగు మిత్రుడు, మహానటుడు కె. వేంకటేశ్వరరావుకి ఇస్తాను. ‘‘ఏరా! మొన్న నాకోసం లీలా మహల్ జంక్షన్ దగ్గర కలుస్తాను అన్నావు? రాలేదేం?’’ అన్నామనుకోండి. రాలేకపోవడానికి వెయ్యి కారణాలు చెప్పవచ్చు. కానీ చెప్పడు. ‘లీలా మహల్ జంక్షన్ దగ్గర ఏ వేపు నిలబడ్డావు?’ ‘సోడా కొట్టు దగ్గర’ అంటే ‘అదీ.. నేను లేడీస్ గేటు దగ్గర ఒక్క అరగంట పైగా నిలబడి వెళ్లిపోయా’ నంటాడు. వాడిని ఏడిపించాలని ‘అవునవును. ఈ చారల చొక్కాతో ఓ మనిషిని చూశాను. నువ్వనుకోలేదు’ అన్నామనుకోండి. తను అబద్ధం ఆడి దొరికిపోనందుకు సిగ్గుపడాలి కదా? పడడు. ‘మరి నన్ను పలుకరించలేదేం’ అని ఎదుటి ప్రశ్న వేస్తాడు. రెండు అబద్ధాల మధ్య నిజం ఎక్కడో చచ్చిపోయి, నిజాన్ని పెట్టుబడిగా పెట్టిన మన ఆవేశం నీరు కారిపోతుంది. అబద్ధానికి చాలా ఒరిజినాలిటీ కావాలి. గొప్ప సమయస్ఫూర్తి కావాలి. తను చెప్తున్నది అబద్ధమని ఎదుటివాడికి అర్థమవుతుందని తెలిసినా ‘సిగ్గులేని తనం’ కావాలి. ఒక్క ఉదాహరణ. ‘నిన్న పొద్దుట ఎక్కడరా? ఎంత వెతికినా దొరకలేదు?’ ‘ఎక్కడ బ్రదర్ ఏకామ్రేశ్వరరావుగారు చంపేశారు’ ‘ఎవరు? ఉపముఖ్యమంత్రిగారే! ఏమిటి విశేషాలు?’ ‘వచ్చే కేబినెట్లో విద్యామంత్రిని ఎవరిని పెట్టాలని నా సలహా కోసం కబురు పంపించాడు’.. ‘అదేమిట్రా? ఆయన మొన్న టంగుటూరు ఫ్లై ఓవర్ దగ్గర యాక్సిడెంట్లో పోయారు కదా? వెంటనే సమాధానం వస్తుంది. ‘అదే నీతో చిక్కు. నేను చెప్పేది 1997 మంత్రి గురించి...’ ‘ఆయనెప్పుడూ మంత్రి కాలేదు కదా?’ ‘అందుకే రాజకీయాలు తెలీని వారితో మాట్లాడటం కష్టం. ఆయనే విద్యామంత్రని కనీసం 20 రోజులు మా సర్కిల్సులో అనుకునేవాళ్లం. అతను మీ అందరికీ ఏకామ్రేశ్వరరావు. మాకు మాత్రం విద్యేశ్వరరావు’. అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా మూలుగుతూ, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు. నిజం నీరసమయినది. అది వన్ వే ట్రాఫిక్. నిజాయితీపరుడిని నిద్రలో లేపినా ఒక్కటే చెప్పగలడు– దిక్కుమాలిన నిజం. అబద్ధం అక్షయపాత్ర. సత్య హరి శ్చంద్రుడిలాంటి వెర్రిబాగులవారు ఈ దేశంలో బొత్తిగా కనిపించరు. నా జీవితంలో అబద్ధం బాధపెట్టినట్టు, తలుచుకున్నప్పుడల్లా, డబ్బు కంటే సులువుగా మోసపోయినందుకూ ఇప్పటికీ విలవిలలాడతాను. రేడియోలో పనిచేస్తున్న రోజులు. సినీమా ధర్మమాంటూ కొన్ని వేలు అదనంగా దాచుకున్నాను. ఎందుకు? వెస్పా కొనుక్కోవాలని. మా ఆఫీసుకి ఓ తమిళ ఆఫీసరులాంటి వ్యక్తి వచ్చేవాడు. ఎప్పుడూ పెద్ద కబుర్లు చెప్పేవాడు. అతని వెస్పా పచ్చగా నిగనిగలాడుతూ కనిపించేది. అది నా కల. తెలిసి ‘ఓస్! అదెంతపని ఆరు నెలలు తిరగకుండా– చవకలో కొనిపిస్తాను’ అన్నాడు. అతని మాటలు, చెప్పే ధోరణీ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్నట్టుగా ఉండేవి. ఒకసారి కన్సైన్మెంట్ వచ్చింది. దాన్ని చూపించడానికీ నాకిష్టపడలేదు. ‘చూడగానే నవనవలాడే అమ్మాయిని మీకు అప్పజెప్తాను’ అన్నాడు. ఎట్టకేలకు మరో కన్సైన్మెంట్ వచ్చింది. తనే ఎగిరి గంతేశాడు. మా ఆవిడకీ నాకూ కరచరణాలు ఆడలేదు.. అన్నీ గోడౌన్లోకి వచ్చాక మిమ్మల్నిద్దరినీ తీసికెళ్తానన్నాడు. ఒక మధ్యాహ్నం ఉన్నట్టుండి ఫోన్ చేశాడు. ‘ఈసారి రెండు రకాల ఆకుపచ్చలు కలిపాడు సార్! బాడీ చిలక పచ్చ. హాండిల్బార్లో చిన్న రంగు కలిపాడు’ అన్నాడు. ఫోన్లో వెనుక వెస్పాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ‘చూడ్డానికి వచ్చేదా?’ అన్నాను. నవ్వాడు. ‘వద్దు సార్ రాతకోతలన్నీ పూర్తి చేయించేశాను. రేప్పొద్దుట మీ ఇంటి ముందుం టుంది. సంతకాలు అక్కడే. నేను రాలేను. ఓ మనిషిని పంపుతున్నాను. నుదుటిమీద కాల్చిన మచ్చ. పేరు రామానుజం. అతనికి 4,220 ఇవ్వండి. రూపాయి ఎక్కువ వద్దు. వెంటనే పంపండి. ఎవరీ రామానుజం? ఆలోచన కూడా రాలేదు. అరగంటలో రామానుజం రావడం, డబ్బు ఇవ్వడం జరిగిపోయింది. ఆ రాత్రి మా ఇద్దరికీ నిద్దుర లేదు. ఆ ఉదయమే కాదు. ఆరు నెలలైనా వెస్పా ఛాయ లేదు కదా.. ఈ ఆర్ముగం అయిపు లేదు. అసలు ఎవరు ఈ రామానుజం? ఏం కంపెనీలో ఉద్యోగి? డబ్బు పుచ్చుకున్నది ఎవరు? రుజువేమిటి? ఆకర్షణని అద్భుతంగా మలచిన గొప్ప సంఘటన ఇది. తర్వాత 4,220 రూపాయలు చూడలేదు. ఆకుపచ్చ వెస్పా చూడలేదు. అబద్ధం అద్భుతమైన ఆభరణం. అది రాణించినట్టు నిజం రాణించదు. ప్రతీ రోజూ ఎన్ని అద్భుతాలు మన మధ్య రాణిస్తున్నాయో పేపరు తెరిస్తే చాలు. అబద్ధం నీడ. నిజం గొడుగు. అబద్ధం అలంకరణ. నిజం నిస్తేజమైన వాస్తవం. అబద్ధం కల. నిజం నిద్ర. - గొల్లపూడి మారుతీరావు -
పేదరికం మీద సవాలు
జీవన కాలమ్ పక్కవాడి రూపాయి దోచుకోవాలనే ఆలోచన కలుపుమొక్క– మహావృక్షమై నిన్ను కబళించేస్తుంది. మామిడిచెట్టు మొండి మొక్క. కానీ దోసెడు నీరు ముందు వేరును తడుపుతుంది. భూమిని చీల్చుకుని వెలుగుని చూపుతుంది. సద్గురువులు శివానంద మూర్తిగారు ‘‘పేదరికం అంటే విదేశాలలో కేవలం దరిద్రం అన్నారు. కానీ ఒక్క భారతదేశంలో పేదరికం సంపద, వైభవం. ఒకే ఒక్క ఉదాహరణ: భగవాన్ రమణ మహర్షి. కౌపీనం కేవలం పశువుకీ మనిషి సంస్కారానికీ చెలియలికట్ట. అదే, అంతే కౌపీనం ఆవశ్యకత’’. మన దేశంలో కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని చట్టం వలలోంచి జారిపోయినవారు– లలిత్మోదీలు, విజయ్ మాల్యాలు, నీరవ్ మోదీలు, నేహుల్ చోక్సీ– మరెందరో ఉన్నారు. తెల్లారి లేస్తే ఈ పనులు చేసే మంత్రులు, వారి తనయులు, రిజిస్ట్రార్లు, ఇంజనీర్లు, దేవుని ఆస్తులు పరిరక్షించాల్సిన అతి ‘నీచ’ అధికారులు– వీరిని సాధించలేదని సాధించే మేధావులూ, పార్టీలూ ఉన్నాయి. ఈ సంస్కృతిలో ఏనుగు తలల దేవుళ్లు, గుర్రపు తలల దేవుళ్లు, సింహపు తలల దేవుళ్లు, సగం మగా సగం ఆడా దేవుళ్లూ చాలామంది ఉన్నారు. వీటిని నెత్తిన పెట్టుకుని కిసుక్కున నవ్వుకునే తెలివైన మేధావులూ ఉన్నారు. అది వారి అదృష్టం. వారివల్ల ఈ జాతికి నష్టం లేదు. అలనాడూ ఈ ప్రబుద్ధులు ఉన్నారు. ‘నేనే దేవుణ్ణి’ అన్న నేటి తరం నాయకుల ప్రాక్సీలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వారి మెజారిటీ పెరిగింది. పెరిగినప్పుడల్లా ‘నేనున్నాన’ని దేవుడు వస్తాడని కథ. ఇది పుక్కిట పురాణం కావచ్చు. మనమూ కాస్సేపు నవ్వుకుందాం. కాలడి (కేరళ)లో ఓ చిన్న కుర్రాడు శంకరుడు. పుట్టుకతోనే ‘విద్య’ని దర్శించుకున్న– మన చీభాషలో ‘ప్రాడిజీ’. శాస్త్రాల ప్రకారం– ప్రజ్ఞ కలవానికి మూడవ యేటనే ఉపనయనం చేయవచ్చు. తండ్రి చేయాలని సంకల్పించారు. కానీ కాలం చేశాడు. ఐదవయేట గురువు విద్యారణ్యులు గాయత్రిని ఉపదేశించారు. ఏడవ యేట ఉంఛవృత్తికి బయలుదేరాడు. ఓ ఇంటిముందు నిలిచాడు జోలెతో. ఆ పేదరాలికి తినడానికి తిండిలేని స్థితి. కానీ ఏదో వటువుకి ఇవ్వాలనే తపన. ఇల్లంతా వెదికింది. ఓ మూల సగం కుళ్లిన ఉసిరికాయ దొరికింది. కంటతడితోనే, సిగ్గుగానే, నిస్సహాయంగా శంకరుని జోలెలోనే ఉంచింది. ఇక్కడ ఇద్దరు పేదలు. పేదరికాన్ని స్వచ్ఛందంగా వరించిన ప్రతిభామూర్తి. అటుపక్క నిస్సహాయమైన పేదరాలు. ఇదీ భారతీయ ‘పేదరికానికి’ బంగారు ఉదాహరణ. అటు పేదరాలు నిస్సహాయతతో చలించిపోయింది. ఇటు ఓ ‘ప్రజ్ఞా బిందువు’ ప్రజ్ఞాసింధువైపోయాడు. ఏడేళ్ల వటువు నోటివెంట ఆర్ద్రత అమృతమైంది. ‘కనకధారా స్తోత్రం’ వర్షించింది. ‘‘అమ్మా, ఈ తల్లి ఎన్ని జన్మల్లోనో ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ జన్మలో ‘ఇవ్వాలన్న’ ఒక్క సంస్కారాన్ని మిగుల్చుకున్నందుకు ఆమెని కరుణించు’’ అన్లేదు శంకరులు. కోరికలే లేని మహా పురుషుడాయన. కేవలం ఈ మాటలే అన్నారు: ‘‘బంగారువంటి నీ కరచరణాలతో, పద్మాలవంటి నీ నేత్ర ద్వయంతో కరుణించు తల్లీ. నా హృదయమంతా పేదరికంతో భయకంపిత మౌతోంది. నీ సమక్షంలో నేను శరణాగతిని కోరుకుంటున్నాను. ప్రతి దినం నన్ను దాటి నీ కరుణా కటాక్షాలను ప్రసరించు’’. ఈ ఏడేళ్ల మహా పురుషుడు తనని కాదు– తనని దాటి అనునిత్య పేదరికాన్ని అనుభవించే కోటానుకోట్ల దీనులని కరుణించ మంటున్నారు. వెనువెంటనే మరొక తల్లి ఆర్ద్రమై కనకధారను వర్షించింది. నాకు తెలుసు– కొందరు మిత్రులు కిసుక్కుమంటున్నారు. ఈ జాతి కొన్ని యుగాలుగా వారినీ ఉద్ధరిస్తోంది. పరమ స్త్రీ లోలుడు అజామీలుడిని తరింపజేసింది. పరమ జారుడు నిగమ శర్మ తరిం చాడు. ఇలాంటి కథలెన్నో ఉన్నాయి. ఏ చిన్న సత్కార్యమైనా ఒక జీవితకాలపు పాపానికి ప్రాయశ్చిత్తం కాగలదని– దారి తప్పిన వారిని చేరదీసి అక్కున చేర్చుకునే అరుదైన సంస్కృతీ వైభవమిది. ఈ దేశంలో భక్తికి కాదు పెద్ద పీట. తపస్సుకి కాదు. గెడ్డాలకి కాదు. రుద్రాక్షలకి కాదు. విభూతికి కాదు. మీరు క్షమిస్తే వేంకటేశ్వర స్వామికి కాదు. బాబాకి కాదు. మాతకి కాదు. పీతకి కాదు. సంస్కారానికి పెద్ద పీట. ఇష్టం లేకపోతే గుడికి వెళ్లకు. గోపురాలు కట్టించకు. భజనలు చేయకు. బంగారు పాదుకలు వేంకటేశ్వరస్వామికిచ్చి ఇంగ్లండులో మాయమవకు. పక్కవాడికి నిలవున్న ఉసిరికాయని ఇవ్వాలన్న మనసుని పెంచుకో. కళ్లు లేని గుడ్డివాడిని రోడ్డు దాటించు. పక్కవాడి రూపాయి దోచుకోవాలనే ఆలోచన కలుపుమొక్క–మహా వృక్షమయి నిన్ను కబళించేస్తుంది. మామిడిచెట్టు మొండి మొక్క. కానీ దోసెడు నీరు ముందు వేరును తడుపుతుంది. కొన్నాళ్లకి భూమిని చీల్చుకుని వెలుగుని నీకు చూపుతుంది. పెరిగి నువ్వు బతికినన్నాళ్లూ నిన్ను పోషిస్తుంది. తరతరాలూ నీ వారసులకి పెద్ద దిక్కవుతుంది. ‘మా తాత చేసిన పుణ్యం’ అని నువ్వు చచ్చిపోయినా నీ మంచితనానికి సదా ‘చెమ్మ’ని ఇస్తూనే ఉంటుంది. ‘వీడెవడయ్యా దేవుడు!’ అని ఇప్పుడే అతడిని అటకెక్కించెయ్. చెడిపోయిన ఉసిరికాయని ఇచ్చే మనస్సుని పెంచుకో. అమ్మ వచ్చి నీ తలుపు తడుతుంది. - గొల్లపూడి మారుతీరావు -
మృత్యువు
జీవన కాలమ్ కారుణ్య మరణాన్ని అంగీకరించడం ద్వారా మనం నైతిక, చట్టపరమైన ‘మానవీయత’కు మరింత మెరుగయిన స్థానాన్ని ఇస్తున్నాం. ఇది మానవాళి కర్తవ్యంగా తలవంచి, ‘జీవా’న్ని సృష్టించిన శక్తికి క్షమాపణ చెప్పుకుంటున్నాం. 1981 ప్రాంతంలో హాలీవుడ్లో ఓ విభిన్నమయిన చిత్రం వచ్చింది. ‘హూజ్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీవే?’ గొప్ప చిత్రం. ఆలోచింపజేసే చిత్రం. ఓ గొప్ప పెయింటరు లారీ యాక్సిడెంటులో దెబ్బతింటాడు. మెడ దగ్గర్నుంచి కాలి వరకు స్పర్శ పోయింది. ఇది భయంకరమైన శాపం. మెదడు ఆలోచించగల అన్ని ఆలోచనలూ స్పష్టంగా చేయగల అమూల్యమైన సాధనం య«థాతథంగా పోయింది. కాలిమీద వాలిన ఈగని తోలుకునే ఆస్కారం లేదు. మనిషి సంపూర్ణంగా జీవించడానికి ఏది గుర్తు? మంచి బతుక్కి ఆలోచనా మంచి ఆచరణా? అతను కేవలం ఒక అప్రయోజనమైన జీవితాన్ని గడుపుతున్నానని, తనకి స్వచ్ఛందంగా చచ్చిపోయే హక్కుని ప్రసాదించాలని న్యాయవాదుల బృందం ముందు వాదిస్తాడు. చివరికి వారు అతని కోరికని అంగీకరించక తప్పలేదు. డాక్టరు నిస్సహాయంగా అతని ప్రాణాన్ని నిలిపే ద్రావకాన్ని ఆపేస్తూ ‘‘మూడు నిమిషాలలో నీ కోరిక తీరుతుంది. ఈ లోగా నీ మనసు మార్చుకుంటే నేను సహకరించగలను’’ అంటాడు. సజావుగా జీవించలేని వ్యక్తి తన నిస్సహాయతను సహేతుకంగా నిరూపించి చచ్చిపోయే హక్కు ఉన్నదని రుజువుచేసి, మృత్యువుని ఆహ్వానించే కథ ఇది. ఇది ఎథునీసియా (కారుణ్య మరణం). దీనిని ఎవరు అంగీకరించాలి? న్యాయస్థానం. మృత్యువు వ్యక్తికున్న పవిత్రమైన హక్కు. మనం ప్రతీ రోజూ హత్యలూ, మారణహోమాలూ వింటుం టాం కానీ, నీతిపరంగా, న్యాయపరంగా మరొకరి ప్రాణం తీసే హక్కు, ధైర్యం ఎవరికుంది? కొన్ని వందల దేశాలు, కొన్ని వందలసార్లు ఈ ‘పవిత్రమైన’ చెలియకట్టను దాటే ధైర్యం చేయలేక మ«థనపడి మ«థ నపడి ఆ పనిని మానుకున్నాయి. ఒక రోగి, సంవత్సరాలుగా మంచం పట్టాడు. బాగుపడే ఆస్కారం ఏ మాత్రం లేదని వైద్య రంగం చెయ్యి ఎత్తేసింది. అతని ప్రాణాన్ని నిలపాలంటే ఆ కుటుంబానికి ఖర్చు. వారికి రోగి బాగుపడడన్న ముగింపు తెలుసు. ఇప్పుడతనికి చచ్చిపోయే హక్కు ఉందా? న్యాయస్థానం ‘మృత్యువు’కి అంగీకరిస్తుం దా? నిర్ణయం తీసుకోవడానికి న్యాయవ్యవస్థ వణికిపోయింది. తను ఇవ్వలేని ప్రాణాన్ని ఏ కారణంగానయినా తుంచేసే హక్కు తనకేం ఉన్నది? 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ రోగి ఊపిరి సజావుగా పీల్చగలిగితే? మానవతా విలువలు అతి క్రూరమైనవి. ‘రేపు’ మానవతా విలువలకి అందని అమూల్యమైనది. మనమెవరం మనిషి ప్రాణాన్ని హఠాత్తుగా తుంచెయ్యడానికి? నువ్వు ప్రాణాన్ని పోయగలవా? మరో క్షణం పొడిగించగలవా? ఒక్క క్షణం ఆపగలవా? నైతిక, మానవీయ, చట్టపరమైన పరిధుల్లో ఎన్నో సంవత్సరాలు న్యాయమూర్తులు ఈ ఆలోచనకే వణికిపోయారు. నిజంగా ‘స్వచ్ఛంద మరణం’ ఇచ్చే అర్హతలున్న ఎన్నో కేసులు చూసి. అర్థం చేసుకునే న్యాయమూర్తులు మూగగా ఉండిపోయారు. పాసివ్ ఎథునీసియా అంటే స్థూలంగా వైద్య సహాయానికి లొంగక, లొంగదని నిర్ధారణ అయ్యాక, ఎన్నాళ్లయినా రోగి పరిస్థితి ఇంతేనని తేల్చిన వారు తెలిసి తెలిసీ హుందాగా మరణాన్ని ఆహ్వానించడం. మానవీయ విలువలను దృష్టిలో పెట్టుకుని, వాస్తవాన్ని ఎరిగి, నైతిక బాధ్యతని వహించి న్యాయస్థానం అట్లాంటి వ్యక్తులు క్రమంగా ప్రాణాన్ని కోల్పోవడానికి అనుమతిని ఇస్తుంది. ఏ విధంగానూ జీవించే అవకాశం లేని రోగిని నానాటికీ పురోగమిస్తున్న వైద్య విధానాల దృష్ట్యా జీవితాన్ని ఒక విధంగా ఆ రోగి హుందాగా మరణించే అవకాశాన్ని దోచుకోవడం అవుతుందనే నిర్ణయానికి వచ్చింది. ఇదంతా రోగికి వైద్యం చేసే డాక్టర్లు రోగి మానసిక స్థితి, ఆరోగ్య స్థితి, రోగం స్థితి ఇన్నిటిని నిర్ణయించి– ముఖ్యంగా రోగి ఇష్టాయిష్టాలను ఎరిగి అప్పుడు రికమెండు చేస్తుంది. ఈ చర్యని చట్టాన్ని చెయ్యడంలో ఎక్కడ ‘మరణయాతన’ చచ్చిపోయే వ్యక్తి డిగ్నిటీని దోచుకొంటోందో వివరించింది. ప్రధాన న్యాయమూర్తి ఒక మాట అన్నారు. పాసివ్ ఇథునీసియాని అంగీకరించడం ద్వారా మనం మన చేతులోలేని, నిస్సహాయమైన, నిస్సందేహంగా పరిష్కారాన్ని– నైతిక, చట్టపరమైన ‘మానవీయత’కు మరింత మెరుగయిన స్థానాన్ని ఇస్తున్నాం. అంతే. అదీ వణుకుతూనే. ఇది మానవాళి కర్తవ్యంగా తలవంచి భగవంతునికి– పోనీ ఆయన లేకపోతే ‘జీవా’న్ని సృష్టించిన శక్తికి సవినయంగా క్షమాపణని చెప్పుకుంటున్నాం. ఈ వ్యక్తికి బకుకుతాడన్న ఆశలేదు. చచ్చిపోతాడన్న రూఢి లేదు. ఎంతకాలం బతుకుతాడో, ఎలా బతుకుతాడో, అసలు బతుకుతాడో బతకడో చెప్పే మార్గం లేదు– వైద్యం చేతులెత్తేసింది కనుక. తరాలు, దశాబ్దాల తరబడి మేధావులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు, న్యాయనిపుణులు చర్చించి తనకి శక్తి లేని, సృష్టించడానికి శక్తి చాలని– ఆ నిస్సహాయుడికి బతికే క్రూరత్వం కంటే కన్నుమూసిన సౌలభ్యం ఒక ‘విముక్తి’ అనే భావనకి వచ్చారు. అదీ పాసివ్ ఇథునీసియా (కారుణ్య మరణం). - గొల్లపూడి మారుతీరావు -
ఎవరి వెర్రి వారికి..
జీవన కాలమ్ ఎన్నికైన రాజకీయ పార్టీలే తప్పుడు ప్రతిష్ట కోసం అనవసరమైన ‘రంగుల వల’లో తమ ప్రత్యేకతల్ని చాటుతుండగా–అంబేడ్కర్కీ, వివేకానందకీ రంగులు నిర్ణయించే నా దేశంలో ఈ మాత్రం ‘వెకిలితనా’నికి నాకు హక్కు లేదా? నాకు తెలిసి– ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏ రాజ కీయ పార్టీ, నాయకులు ‘రంగు’ గురించి మాట్లాడిన సందర్భం తెలీదు. ఎవరైనా తోవ తప్పినప్పుడు మనకో నానుడి ఉంది: ‘ఇన్నాళ్లకి అతని అసలు రంగు బయట పడింది’ అనడం. ఇప్పుడు అక్షరాలా మన రాజకీయ నాయకుల రంగు బజారు కెక్కింది. అహంకారం, అధికారం, తప్పుడు ప్రాథ మ్యాలు తమ తమ అసలు రంగుల్ని భూతద్దంలో చూపు తున్నాయి. మా ఆవిడకి ఓ అలవాటు ఉంది. ఏదైనా ఆమెకి నచ్చనిది జరిగిందనుకోండి: ఆవిడ సమీక్ష ఆ నచ్చక పోవడం మీద ఉండదు. ‘మొన్న మీరు ఎర్రట్ట పుస్తకం ఒళ్లో పెట్టుకుని గంటలకొద్దీ చదివారు కదా? అందుకూ కడుపునొప్పి’ అంటుంది. దీనికి ఒక వివరణ ఉంది. జరిగే ప్రతీ అనర్థానికీ తనకి ‘నచ్చని’ అంశాన్ని జొర బెట్టడం ఆవిడ ప్రత్యేకత. ఇది సరిగ్గా ప్రస్తుత రాజకీయ వర్గాలకు వర్తిస్తుంది. కాంగ్రెస్ హయాంలో– దాదాపు 65 సంవత్సరాలలో ఏనాడూ– కాంగ్రెస్ చేసిన ఏ అన ర్థాన్నీ.. వారి పార్టీ– చిహ్నం కాంగ్రెస్ జెండాలోని కాషా యం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్ని ఎత్తిచూపుతూ మన మేధావులు, పాత్రికేయ మిత్రులు తప్పుపట్టలేదు. మరి ఇవాళ మంత్రిగారు తుమ్మారనుకోండి. అందులో ‘కాషాయ’ ఛాయలు కనిపిస్తాయి. రంగు పదవిలోకి వచ్చి నాలుగేళ్లయింది. కర్ణాటకలో బస్సు యాక్సిడెంట్ జరిగితే ‘ఫలానా చోట జరిగింది’ అంటారు. ఉత్తరప్రదేశ్లో జరిగితే ‘యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఇప్పటికి 165వ యాక్సిడెంట్’ అంటారు. ఇప్పుడు ‘రంగు’ విజృంభించింది. పశ్చిమ బెంగాల్ దీదీ మమతా బెనర్జీ రెచ్చిపోయి రాష్ట్రంలో ఉన్న ప్రతీ స్కూలుకీ తెలుపు, నీలిరంగు పులమాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ఖర్చు కేవలం రూ. 500 కోట్లు. ‘ఇంత కంటే ఆ రూ. 500 కోట్లతో పిల్లల చదువులకు ఉపయోగపడే ఏ ప్రణాళికనయినా పూనుకోరాదా? అని కలర్ బ్లైండ్నెస్ ఉన్న ఒకాయన అన్నారు. అయ్యా! ఇది ముఖ్యమంత్రిగారి దూరదృష్టికి ఉదాహరణ కాదు. కాషాయం మీద వారికున్న ఏహ్యతని ప్రదర్శించుకునే అవకాశం. దానికి ఇంత ఖర్చా అని మరొక ప్రశ్న. దాని దేముంది. తమరు కోపంతో చెప్పుతో కొట్టారు. మరొ కాయన కోపంతో రత్నాల హారంతో కొట్టారు. దీదీకి వివేకానంద అంటే విముఖత ఉన్నదనీ, తత్కారణంగానే ప్రపంచ ప్రఖ్యాతిని గడించి ఎందరికో విద్యా దానం చేస్తున్న రామకృష్ణ మిషన్ రంగును కూడా మారుస్తున్నారని కొందరి విమర్శ. ఈ రంగు మార్పిడిని రామకృష్ణ మిషన్ సంస్థ వ్యతిరేకించింది. ఇప్పుడు దీదీకి నాదొక సలహా ‘అమ్మా! తమరు రామకృష్ణ మిషన్ సంస్థల రంగు మార్చకుండా ఏకంగా స్వామి వివేకా నంద ‘రంగు’నే మారిస్తే తమ అంతర్జాతీయ కీర్తి ద్విగు ణీకృతమౌతుంది. ఒక ఆర్డినెన్స్ ద్వారా స్వామి కాషాయ బట్టల రంగుని ఊదారంగుగా మార్చండి. వారి తల పాగాకు తెల్లరంగు వేయించండి. అప్పుడు చచ్చినట్టు రామకృష్ణ మిషన్ తన రంగుని మార్చుకుంటుంది. లేదా రాష్ట్రంలో ఏకంగా కాషాయ రంగుని బహిష్కరించండి’. అలాగే కేరళ ప్రభుత్వం వారిచే నెహ్రూకి ఎర్ర రంగు దుస్తుల్ని నిర్దేశించండి. రాష్ట్రంలో గవర్నమెంటు కార్యాలయాలన్నింటికీ ఎర్ర రంగును పూయించమ నండి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశం రంగులు మార్చుకుంటూ ఉంటుంది.ఈ మధ్యలో ఒకాయన అంబేడ్కర్ రంగు నీలి రంగుగా వక్కాణించారు. ఆ లెక్కన దేశ పిత గాంధీకి నీలిరంగు ధోవతి, గులాబీ రంగు చేతికర్రనూ నిర్దేశిం చవచ్చు. ఈ దేశంలో కళ్లముందు కనిపించే రంగు అప్పటి పాలక వ్యవస్థ అసలు రంగుని ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా బీజేపీ నాయకుల ‘రంగు’ ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్ రంగూ కాషా యం కావడం. మోదీ పదవిలోకి వచ్చిన కారణానికి ఈ దేశంలో ప్రతి టీ కొట్టువాడికీ కొత్త ప్రాధాన్యం వచ్చి నట్టు– బీజేపీ ఛాయలు తమ మాతృసంస్థల రంగు అయిన కారణానికి ‘కాషాయం’ కషాయంలాగ తయా రైంది. మోదీ పదవిలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో సమూలమైన మార్పులు చేసినట్టు– కరెన్సీ రద్దులాగ రాత్రికి రాత్రి గవర్నమెంటు రంగుని మార్చేస్తే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది. చక్కగా కాకి నలుపు రంగుని వాడమనండి. లేదా పచ్చరంగుని వాడ మనండి. ఎవరు బాబూ! తమరు ఏదో అంటున్నట్టున్నారు? ‘ఏమిటి ఈ అర్థంలేని ప్రేలాపన అనా? బాబూ! ఈ దేశంలో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, మేధా వులైన పాత్రికేయులు ప్రణాళికలను వదిలి ‘రంగు’ బాధలు పడుతుండగా, ఎన్నికైన గొప్ప రాజకీయ పార్టీలే నేల విడిచి తప్పుడు ప్రతిష్ట కోసం అర్థంలేని, అనవసరమైన ‘రంగుల వల’లో తమ ప్రత్యేకతల్ని చాటుతుండగా– అంబేడ్కర్కీ, వివేకానందకీ రంగులు నిర్ణయించే నా దేశంలో ఈ మాత్రం ‘వెకిలితనా’నికి నాకు హక్కు లేదా? తమరు చిత్తగించండి. వ్యాసకర్త గొల్లపూడి మారుతీరావు సినీ విశ్లేషకులు, నటులు -
అతిలోకసుందరి అంతర్ధానం
జీవన కాలమ్ ఎబ్బెట్టుతనం లేని ఠీవయిన సౌందర్యం శ్రీదేవిది. నాటకాన్ని పండించడంలో ఏ గొప్ప నటుడితోనయినా దీటుగా నిలబడగల టైమింగ్. బాలనటి నుంచి ప్రౌఢ నటిగా సజావయిన పరిణామాన్ని దేశంలో చూపించిన ఒకే ఒక్క తార –శ్రీదేవి. సినిమాల్లో పాత్ర ఇమేజ్ని మార్చుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు అసాధ్యం కూడా. ‘షోలే’ సినిమాలో గబ్బర్ సింగ్ పాత్రను ధరించి కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన గొప్ప నటుడు అంజాద్ ఖాన్ తన జీవితకాలంలో ఆ ఇమేజ్నుంచి బయటపడలేకపోయాడు. ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి పాత్ర ద్వారా దేశస్థాయిలో ప్రాముఖ్యాన్ని సాధించిన జె.వి. సోమయాజులు గారు ఇక మరే పాత్రలోను వేరేగా రాణించలేకపోయారు. కృష్ణగారి ‘అల్లూరి సీతారామ రాజు’ని చూశాక చక్రపాణి గారు.‘ఇంక ఓ సంవత్సరం పాటు నీ చిత్రాలన్నీ ప్లాఫ్ అవుతాయి’ అన్నారట. తర్వాత 20 సినిమాలు వరసగా లేచి పోయాయని కృష్టగారే మాకు చెప్పేవారు. ఇది శ్రుతి మించిన గొప్ప ప్రాచుర్యానికి పట్టే అనర్ధం. పాత్ర ఇమేజ్ ఏనాడు తలకు మించిపోరాదు. నాకూ అలాంటి గతి పట్టేదే. ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’ 500 రోజులు నడిచి సుబ్బారావు పాత్ర దుమ్ము దులిపింది. అదే ప్రమాదం. శ్రీదేవి బాలనటిగా ముద్దుగా , అమాయకంగా, అయినా చిలిపిగా ఊలుపిల్లిలాగ ఉండేది. ఆమె మీద ఆమె నటన మీద నిర్మాతల ‘విశ్వాసం’ ఎంతటిదంటే ‘బడిపంతులు’లో ఆమె మీద పూర్తి పాటనే తీశారు. ఏ పాత్రలోనయినా ఆమె పసితనం ఆమె నటనకి పెద్ద ఇన్సులేషన్. తీరా ప్రౌఢ వయస్సు వచ్చాక ఆమె కేరీర్ ఏమిటీ? సెక్స్, చిన్న వగలు, మురిపించే యవ్వనం– ఇవన్నీ హీరోయిన్ల పెట్టుబడి. హఠాత్తుగా ఈ మూసలోకి శ్రీదేవి రాగలదా? ఆ సంధి కాలంలో ఆమె మొదటిసారిగా హీరోయిన్గా చేసిన సినిమాని నేను రాశాను. శక్తి సామంత ‘అనురాగ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. మౌసమీ చటర్జీ హీరోయిన్. ఆమెకి అది మొదటి సినిమా. ఆ పాత్రని తెలుగులో శ్రీదేవి చేసింది. సినిమా పేరు ‘అనురాగాలు’. మిత్రుడు పి.యస్.రామిరెడ్డి దర్శకుడు. శ్రీదేవి తన శరీరంలో, వయస్సులో పరిణామాన్ని ప్రదర్శించాలని ప్రయత్నం చేసింది. ఆమె ప్రతిభ. కథలో పాత్ర ఆమెని కాపాడాయి. అయినా చిత్రం బాగా పోలేదు. పాత ఇమేజ్ని ఆమె మరిపించగలదా? నిన్నటి పసిపిల్ల నేటి ప్రౌఢ అని ఒప్పించగలదా? విచిత్రం! ఒప్పించింది. ఎబ్బెట్టుతనం లేని ఠీవయిన సౌందర్యం శ్రీదేవిది. నాటకాన్ని పండించడంలో ఏ గొప్ప నటుడితోనయినా దీటుగా నిలబడగల టైమింగ్. బాలనటి నుంచి ప్రౌఢనటిగా సజావయిన పరిణామాన్ని భారత దేశంలో చూపించిన ఒకే ఒక్క తార –నాకు తెలిసి –శ్రీదేవి. అలాంటి పని మరొక్కరే– అంతే ప్రొఫెషనల్గా చేశారు. ‘కళత్తూర్ కన్నమ్మ’తో కెరీర్ ప్రారంభించి ‘ విశ్వరూపం’ దాకా తనదైన జీనియస్ని చూపిన నటుడు కమల్హాసన్. మరి వీరిద్దరూ ఒకే సినిమాలో కలిస్తే? ఆ వైభవాన్ని చరితార్ధం చేసిన సందర్భం బాలూ మహేంద్ర ‘‘మూండ్రాం పిరై’’. అపూర్వం. అద్భుతం. నేను మిత్రులు కమల్తో ఒకసారి అన్నాను: ‘‘మీరు ఆ సినిమాలో చూపిన వైదుష్యం ఏ సినిమాలో ఏ పాత్రలోనయినా అవలీలగా చూపగలరు. ఇది హీరో ప్రాధాన్య ప్రపంచం కనుక. కాని హీరోయిన్కి అంత రేంజ్ ఉన్న పాత్ర దొరకదు. ఆమె నటన నభూతో నభవిష్యతి. నేనయితే మీకు జాతీయ ఉత్తమ నటుడి బహుమతి ఇవ్వను. ఆమెకి జాతీయ బహుమతి – రెండు సార్లు ఇస్తానని.’’ మేమిద్దరం తక్కువ సినిమాల్లో కలిసి నటించాం. కాని మంచి జ్ఞాపకం– ‘త్రిశూలం’లో నా కూతురు. ఎదురెదురుగా నిలిచి counter shot చేస్తున్నప్పుడు – ‘మీరు బాగున్నారా?’ అనే వాక్యాన్ని పదిమంది నటీమణులు పది రకాలుగా చెప్తారు. ఆమె తప్పనిసరిగా పదకొండో రకంగా చెబుతుంది. ఇంతకంటే రాతలో ఈ విషయాన్ని నిరూపించలేను. ‘త్రిశూలం’లో ఒక సీను గొప్పది. ఈ సీనుని కోరి రాఘవేంద్రరావు నాచేత రాయించారు. రాధిక మా యింట్లో పనిమనిషి. అవసరానికి డబ్బుకోసం వస్తుంది. ధాన్యం గోదాంకి రమ్మన్నాడు హిట్లర్ రాఘవయ్య. తను వచ్చాడు. ఆమెను పట్టుకోబోగా తప్పించుకుని గోదాంలోకి పారిపోయింది. ఇచ్చకాలు చెప్పి పైకి రమ్మని చెయ్యి జాచాడు. ఆడపిల్ల చెయ్యి అందింది. లాగాడు. తన ముందుకు కూతురు శ్రీదేవి వచ్చింది. బిక్కచచ్చిపోయాడు. అప్పుడు డైలాగు– శ్రీదేవిది–:‘‘ఏం నాన్నా! నేనూ యాదీ (రాధిక) చిన్నప్పట్నుంచి నీ కళ్ల ముందే పెరిగాం. యాదిలో నువ్వు కేవలం ఆడదాన్ని చూడగలిగితే నేనూ ఆడదాన్నే కద నాన్నా?’’ ఆ డైలాగు అనితరసాధ్యంగా చెప్పింది శ్రీదేవి. రాఘవేంద్రరావు, విన్సెంట్వంటి మంత్రగాళ్లుండగా ఎవరయినా అలవోకగా ‘ అతిలోక సుందరి’ పాత్రని చెయ్యగలరు. కాని ‘మూండ్రా పిరై’ శ్రీదేవి ఒక్కరే చెయ్యగలరు. ఇక డాన్స్ టైమింగ్. పరాకాష్ట ‘మిష్టర్ ఇండియాలో’ ‘హవా హవాయీ’ పాట. దయచేసి ఈ దృష్టితో మరొ కసారి చూడండి. మంచి వంకాయకూర అతిథిగా తినడం వేరు. వంటవాడుగా తినడం వేరు. ఒక్కసారి వంటవాడు కాండి. శ్రీదేవి ఈ తరం ప్రతిభకు పరాకాష్ట. "last word. she is the ultimate complete artist'' గొల్లపూడి మారుతిరావు -
ఆనందానికి ఆవలి గట్టు
ఆనందం ఒక దృక్పథం. అది సంస్కృతి, సంస్కారమూ, స్వభా వమూ కలిసి ప్రసాదించే వారసత్వం. చదువుకుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, పవిత్రమైన నేలలో కన్ను విప్పే పుష్పం. మా ఇంట్లో ఓ వంట మనిషి పని చేస్తోంది. 50 సంవత్సరాలు. లోగడ ప్రముఖ సంగీత దర్శకులు కేవీ మహదేవన్ ఇంట్లో పని చేసేది. ఆమె భర్తకి అనారోగ్యం. పని చెయ్యలేడు. ఇద్దరు ఆడపిల్లలు. మా ఇంటి దగ్గర్నుంచి లోకల్ ట్రైన్లో నాలుగు స్టేషన్లు ప్రయాణం చేసి, పార్కు స్టేషన్ నుంచి 14 స్టేషన్లు దాటి ఇల్లు చేరుతుంది. ఇది గత 14 సంవత్సరాలుగా ఆమె దైనందిన జీవితం. ఎప్పుడైనా అడుగుతాను ‘ఇంత శ్రమ ఇబ్బంది కాదా?’ అని. ఆమె సమాధానం ‘అనుకుంటే ఎలాగ సార్! ఇల్లు గడవాలి. పిల్లల్ని పెంచాలి’. ఆమె జీవితం ఆనందంగానే ఉంది. కారణం. ఆమె తన జీవిత లక్ష్యాన్ని తన పరి స్థితులకు కుదించుకుంది. 25 ఏళ్ల అమ్మాయి. పుట్టు గుడ్డి. పేరు వినూ. చిన్నప్పటినుంచీ జీవితంలో ఏనాటికయినా సివిల్ సర్వీసు చెయ్యాలని కలలుగన్నది. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి అంధురాలిగా ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసరుగా సెలెక్టయింది. గుడ్డి, మూగ, చెముడు ఉన్న ఒక మహాద్భుతం– హెలెన్ కెల్లర్ని ఆమె ఉదహరించింది. ‘జీవితంలో నేను అన్నీ చేయలేకపోవచ్చు. కానీ కొన్నయినా చెయ్య గలను’. వీరందరూ జీవితాన్ని మెడబట్టుకు లొంగదీసి విజయాన్ని పరమావధిగా చేసుకుని ఆనం దంగా ఉన్న జీవులు. వీరి జీవన రహస్యం స్వధర్మాన్ని గర్వంగా, చిత్తశుద్ధితో నిర్వహించడం. ఈ దేశంలో చాలామందికి ‘స్వధర్మం’ అంటే బూతు మాట. ఇందులో మతం ఉందా? దేవుడు ఉన్నాడా? బీజేపీ ఉందా? ఆర్.ఎస్.ఎస్. ఉందా? ‘స్వధర్మం’ అంటే నీ విధిని నీ ఆశయం మేరకి, శ్రద్ధగా నిర్వహించడం. అదీ– అదే– అంతే– ఆనందానికి దగ్గర తోవ. అమెరికాలో యేల్ విశ్వవిద్యాలయంలో ఆనందంగా జీవించడానికి కొత్త కోర్సుని ప్రారంభించారు. దాదాపు అన్ని డిపార్టుమెంటుల విద్యార్థులూ అటువేపు దూకారు. ప్రస్తుతం 1,182 మంది మేధావులయిన విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఈ కోర్సు ఏం నేర్పుతుంది?మనిషి సంతోషంగా ఉండటం ఎలాగో నేర్పుతుంది. మనకి నవ్వొస్తుంది– ‘ఇది ఒకరు నేర్పాల్సిన విషయమా?’ అని. హైందవ జీవన విధానంలోనే ఈ ‘అర’ ఉంది. మన ఖర్మ. మనం మనకి అక్కరలేని వేలంటైన్ డేలను దిగుమతి చేసుకుంటున్నాం. జనవరి 1న బారుల్లో తాగి తందనాలాడడాన్ని గొప్ప వినోదంగా నెత్తిన వేసు కుంటున్నాం. తల్లిదండ్రుల్ని అనాధ శరణాలయాలకి అప్పగించి మరిచిపోవడాన్ని అలవాటు చేసుకుంటున్నాం. మనం ఉగాదులు మరిచిపోయాం. సంక్రాంతి సంబరా లంటే చాలామందికి తెలీదు. మా తరంలో ఏ కుర్రాడూ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వినలేదు. గురువుని సాక్షాత్తూ దేవుడన్నాం. ఇప్పుడు ఓ కుర్రాడు తనని అది లించిన కారణానికి టీచర్నే కాల్చి చంపాడు. ఆత్మహత్యలు చేసుకునే అమ్మాయిలూ, చదువుకొని అటకెక్కించి రాజ కీయాలలో రొమ్ము విరుచుకునే ప్రబుద్ధులూ. ఇవి విదేశీ యుల దరిద్రాలు. మనం కనీవినీ ఎరుగని అరాచకాలు. మనలో ఇప్పటికీ సత్య నాదెళ్లలూ, పుట్టుగుడ్డి వినూలు ఉన్నారు. సరైన దృక్పథాన్ని ఏర్పరచుకుంటే మనకి యేల్ విశ్వవిద్యాలయం కోర్సులు అక్కరలేదు. ప్రపంచంలో ఏ సంస్కృతీ ‘సర్వేజనా స్సుఖినోభవంతు’ అనలేదు. ఓ మామూలు నేలబారు మనిషి ఆ మాట అని ఏం సాధిస్తాడు? బాబూ! అతను జనులందరినీ ఉద్ధరించలేకపోవచ్చు. కానీ అందరూ సుఖంగా ఉండాలన్న పాజిటివ్ ఆలోచన మొదట అతన్ని సుఖంగా ఉంచుతుంది. ఈ ఆశంస సమాజానికి కానక్కరలేదు. అది తన సంకల్పాన్ని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచే Subjective తావీజు. భగవద్గీతని మనం తప్ప చాలా దేశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయి. అది దేవుడి పుస్తకం కాదు. ఆ రోజుల్లో దేవుడి రేపరు చుట్టి మన ‘జీవన విధానాన్ని’ సూచించే వాచకం. ఇందులో సూచించినవన్నీ చేయగలవాడు మహాత్ముడు. ఏ ఒక్కటయినా చేయగలిగినవాడు నిత్య సంతోషి. ఏమిటా పనులు? అందరిపట్లా స్నేహ భావన, మిత్రత్వం, కరుణ, దేనిమీదా మమకారం లేకపోవడం, అహం కారాన్ని విడిచిపెట్టడం, సుఖాన్నీ, దుఃఖాన్నీ ఒకేలాగ చూడటం, ఓర్పు, సంతుష్టి కలవాడు (ఉదా: మా వంట మనిషి), దృఢ నిశ్చయం కలవాడు (వినూ అనే పుట్టు గుడ్డి)– ఇది నమూనా జాబితా (భగ. 12 అ.శ్లో. 13–14). ఇందులో మతమూ, శ్రీకృష్ణుడూ, హిందుత్వం లేదు. యేల్ విశ్వవిద్యాలయం కోర్సు వారి దురదృష్టం. కనీసం వారు పోగొట్టుకున్నదేమిటో సంపాదించుకోవాలని తంటాలు పడుతున్నారు. వాళ్లు వదులుకోలేక ఇబ్బంది పడుతున్న వికా రాల్ని దిగుమతి చేసుకుని మన విలువైన ఆస్తుల్ని చంపుకుంటున్నాం. ఆనందం ఒక దృక్పథం. Happiness is an attitude ఒక మానసిక స్థితి. అది బయటినుంచి రాదు. సంస్కృతి, సంస్కారమూ, స్వభావమూ కలిసి ప్రసాదించే వారసత్వం. అది చదువుకుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, పవిత్రమైన నేలలో కన్ను విప్పే పుష్పం. అదీ ఆనందం. - గొల్లపూడి మారుతీరావు -
ఒక అద్భుత చరిత్ర
వయసు మీద పడుతున్న చాంపియన్లో ‘వాడితనం’ మందగించింది. కానీ వేడితనం ఇంకా తిరగబడుతోంది. పోటీల పద్ధతులు మారి, చేతిలో రాకెట్లు మారి, కాలం మారినా మనసులో ఉద్ధతి మారలేదు. ఉన్నట్టుండి రాత్రి 11 గంట లకి తుళ్లిపడి లేచాడు. ఇక నిద్ర పట్టలేదు. మర్నాడు సాయంకాలం ఫైనల్ మ్యాచ్. ఇది తన జీవితంలో 30వ పోటీ. ఏం జరుగుతుంది? ఇదీ ఫెదరర్ మనస్సుని ఆవరించుకున్న ఆలోచన. గెలిస్తే చరిత్ర. ఓడి పోతే? అది మరొక రకమైన చరిత్ర. అయినా మనసు ఓటమిని అంగీకరించడం లేదు. ఇప్పటికే పోటీ నుంచి నాదల్, జకోవిచ్, ఆండీ ముర్రే (అందరూ ముప్పయ్యో పడిలోనున్న ఆటగాళ్లు) వైదొలిగారు. ఫెదరర్ వారసుడనిపించదగ్గ అలెగ్జాండర్ జ్వరేవ్ (20 ఏళ్లవాడు) ఓడిపోయినప్పుడు ఫెదరర్ ఓ మాట అన్నాడు. ‘‘ప్రపంచ కప్పుమీదే దృష్టి పెట్టుకోవడం ఆటలో ఏకాగ్రతని బలి తీసుకుంటుంది’’ అని. ఇప్పుడు తను అదే చేస్తున్నాడా? ఒకరికి హితవు చెప్పడం సులువు. మర్నాటి సాయంకాలం ఒక జీవిత కాలం దూరంగా ఉన్నట్టనిపించింది. ఉదయం అయితే లేచినప్పటినుంచీ ఆటకి సిద్ధమయ్యే వ్యాపకం ఉంటుంది. ఇప్పుడు రోజంతా ఏం చేయాలి? ఎప్పుడో తెల్లవారుఝామున 3 గంటలకి చిన్న కునుకు పట్టింది. ఇలాంటి సందర్భాలు ఫెదరర్ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఇది మరీ ప్రముఖమైనది. కారణం ఇరవయ్యో చాంపియన్షిప్పే ప్రపంచ చరిత్ర. ఫెదరర్ వయస్సు 36 సంవత్సరాల 173 రోజులు. ఇప్పుడు ఎదురు నిలిచిన ప్రత్యర్థి చిలిచ్ వయస్సు 29. 2003 నుంచి 2008 మధ్య ఫెదరర్ 13 చాంపియన్షిప్పులు గెలుచుకున్నాడు. తర్వాతి ఏడేళ్లలో కేవలం నాలుగే, వయసు లుప్తమవుతున్న శక్తిని గుర్తుచేస్తోంది. 2004 నుంచీ తనతో పోటీ చేసినవారు దాదాపు అందరూ రిటైరయిపోయారు. ఇప్పుడు గెలిస్తే ఫెదరర్ ఒక తరానికి మకుటంలేని మహారాజవుతాడు. ఈ విచికిత్సని 16 గంటలు భరించాడు. ఆ సాయంకాలం టెన్నిస్ కోర్టులో జరిగిన ఆట మహాకావ్యం. గెలవాలన్న ముందుతరంతో ఓటమిని ఎదిరించే పాత తరం పోటీ పడుతోంది. కానీ వయసు శరీరానిది కాదు. ఆ స్థాయిలో ఆలోచనది. నాలుగో సెట్లో ఫెదరర్ బ్యాక్ హ్యాండ్ వాలీలు కేవలం చిత్ర కారుడి ఆయిల్ పెయింటింగ్లు. గెలిచిన క్షణంలో ప్రతీ చాంపియన్ కన్నీటి పర్యంతం అవుతాడు. కానీ ఫెదరర్ ‘ప్రతీ’ చాంపియన్ కాడు. ఈ తరంలో 20వ సారి చాంపియన్ షిప్ గెలుచు కున్న ఒకే ఒక పురుష క్రీడాకారుడు. 36 సంవత్సరాల వయసున్న ఆటగాళ్లలో రెండవవాడు. 1972లో ఆస్ట్రే లియా ఓపెన్ గెలుచుకున్న కెన్ రోజ్వాల్కి 36 సంవ త్సరాల 93 రోజులు. మా అబ్బాయి నన్ను వెక్కిరించాడు. ‘ఎందుకీ కాలమ్?’ అని. తెలుగుదేశంలో ఎంతమందికి టెన్నిస్ ఆట మీద ఆసక్తి ఉంటుంది? అంటాడు. 2004 నుంచీ– అంటే తన 23వ ఏటినుంచీ ప్రపంచంలో జయించడాన్ని వ్యసనం చేసుకున్న ఆటగాడు ఫెదరర్. అడ్డమయిన కారణాలకీ బస్సులు తగలెట్టి, స్కూళ్లలో టీచర్లనే కాల్చి చంపే కుర్రకారుకి, మొహాలకి ముసుగులు వేసుకుని సైనికులను కాల్చే యువతరం పెచ్చు రేగుతున్న తరానికి ఫెదరర్ ఏ మాత్రమయినా స్ఫూర్తిని ఇవ్వగలి గితే– ఒక వ్యక్తిలో చిత్తశుద్ధి, ఏకాగ్రత, అకుంఠిత దీక్ష ఏ స్థాయిలో మనిషిని నిలపగలవో ఎవరయినా గుర్తించగ లిగితే, ఫెదరర్ ఎవరో, అతను ఆడే ఆట గొప్పతనం ఏమిటో తెలియకపోయినా ఫరవాలేదు. గొప్పతనానికి చిరునామా లేదు. తెంపరితనానికి ఉంది. ఆచరణ ఆవ గింజ, ఆదర్శం ఆకాశం. ప్రపంచకప్పు 20వ సారి పట్టుకుని ఆవేశంతో ఏడ్చాడు ఫెదరర్. ‘నేనే నమ్మలేకపోతున్నాను. బొత్తిగా ఇది కాశీమజిలీ కథ’ అన్నాడు. చూస్తున్న లక్షలాది ప్రజా నీకమూ, ఆ మాటకి వస్తే ప్రపంచమంతా అదే అను కున్నారు. ‘ఇది అపూర్వకమైన కాశీమజిలీ కథ’. వయసు మీద పడుతున్న చాంపియన్లో ‘వాడి తనం’ మందగించింది. కానీ వేడితనం ఇంకా తిరగబడు తోంది. పోటీల పద్ధతులు మారి, చేతిలో రాకెట్లు మారి, కాలం మారినా మనసులో ఉద్ధతి మారలేదు. గెలవా లన్న ‘నిప్పు’ రగులుతూనే ఉంది. అంతే. ఆ క్షణంలో కాలం ఘనీభవించింది. తన ఆలోచనల్లోంచి వయసుని అతి క్రూరంగా గెంటేశాడు. ప్రీతీ రామమూర్తి అనే పాత్రికేయురాలు తన్మయ త్వంతో కేవలం కవిత్వాన్ని చెప్పింది. ‘‘ఇవాళ ప్రేక్షకుల ముందు ఫెదరర్ ప్రదర్శన లక్ష సందర్భాలలో ఒకటి కావచ్చు. కానీ It represents a sense of life. ఈ విజ యం అతనికి అవసరం లేకపోవచ్చు. కానీ ఇందులో అమలిన తన్మయత్వం ఉంది. తొందరపాటు లేదు. ఓ స్థితప్రజ్ఞుడి విన్యాసం ఉంది. ఫెదరర్ తనని తాను నిలదొక్కుకుని కాలాన్ని మెడబట్టుకుని లొంగదీసుకుని తనతో కూచిపూడి నృత్యం చేయించే విలాసం ఉంది’’. రెండు వాక్యాలయినా ఇంగ్లీషులో చెప్పాలని నా కక్కుర్తి. It is no longer a cliched religious experien ce... Of late, it appears that Federer has managed to take control, grabbing TIME by its shoulder and making it dance a slow waltz with him. - గొల్లపూడి మారుతీరావు -
రచ్చకెక్కిన ‘రచ్చబండ’
జీవన కాలమ్ చీఫ్ జస్టిస్ స్థాయిలో పరిపాలనా సరళిలో కొన్ని మర్యాదలు పాటించలేదని అనుకున్నప్పటికీ... దేశమంతా నెత్తిన పెట్టుకునే, గౌరవించే, ఒకే ఒక్క గొప్ప వ్యవస్థని ‘బజారు’న పెట్టవలసిన అగత్యం లేదని చాలామంది పెద్దల భావన. బీచిలో ఓ అమ్మాయి ఎప్పుడూ కనిపిస్తూంటుంది. బాగా చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి లక్ష్యం చక్కగా పెళ్లి చేసుకుని భర్తకి వండిపెడుతూ సుఖంగా గడపాలని. తర్వాత ఆ అమ్మాయికి పెళ్లయింది. లక్షణంగా తాళిబొట్టుతో, పసుపుతాడుతో, భర్తతో కనిపించింది. ఆమె కల సాకా రమౌతున్నందుకు ఆనందం కలిగింది. కొన్ని నెలలు గడిచాయి. భార్యాభర్తల మధ్య పొర పొచ్చాలు ప్రారంభమయ్యాయి. భర్తమీద కారాలూ, మిరియాలూ నూరింది. నేను ఆమె పాత కలని గుర్తు చేసి, కాస్త సంయమనాన్ని పాటించమని హితవు చెప్ప బోయాను. భర్త అనుచిత ప్రవర్తనను ఏకరువుపెట్టి– హితవు చెప్పిన నామీదే కోపం తెచ్చుకుని వెళ్లి పోయింది. దరిమిలాను భార్యాభర్తల మధ్య ‘వార’ పెరి గింది. ఇప్పుడు పోలీసు డిపా ర్టుమెంటులో పనిచేస్తున్న ఆమె తండ్రి అల్లుడిని రెండు రోజులు జైల్లో పెట్టించాడు. ముందు ముందు సామరస్యం కుదిరే అవకాశాన్ని ఆ విధంగా శాశ్వ తంగా మూసేశాడు. ఆమె కలలు గన్న వ్యవస్థ– ఆమె తండ్రి సహాయంతో పూర్తిగా కూలి పోయింది. కాళ్లు కడిగి కన్యా దానం చేసిన మామ తన అల్లు డిని జైలుకి పంపితే ఆ అల్లుడు ఇక ఏ విధంగానూ జైలు శిక్షని మరిచిపోయి– ఆమెని జీవితంలోకి ఆహ్వానిస్తాడనుకోను. వ్యవస్థను గౌరవించే గాంభీర్యం, పెద్ద రికాన్ని పెద్దలే వదులుకున్నప్పుడు– ఆ వ్యవస్థ ‘పెద్ద రికానికి’ మాలిన్యం అంటుతుంది. ఈ కథకీ మొన్న నలుగురు మేధావులయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు– పత్రికల ముందుకు రావడానికీ పోలికలున్నాయని నాకనిపిస్తుంది. ఈ దేశంలో గత 70 సంవత్సరాలుగా అత్యున్నత న్యాయ వ్యవస్థగా నిలిచిన ప్రధాన న్యాయస్థానంలోని ‘అభి ప్రాయ భేదాలు’ ఒక్కసారి ప్రజల మధ్యకి రావడం దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దేశంలో న్యాయాధిపతులే అరిగించుకోలేకపోతున్నారు. ‘‘సుప్రీంకోర్టు పరిపాలనా సరళిని ఏ విధంగా పత్రికా సమావేశం సంస్కరిస్తుంది? ప్రజాభిప్రాయ సేకరణ చేసి– సుప్రీంకోర్టు నిర్వహణ సరిౖయెనదో కాదో ప్రజలు నిర్ణయించాలని ఈ సమావేశం ఉద్దేశమా?’’ అని జస్టిస్ శోధీ అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే ‘‘ఈ నలుగురి పెద్దల ఉద్దేశం ఏమిటి? ప్రజల్ని ఈ అవ్య వస్థలో జోక్యం చేసుకుని తీర్పు చెప్పాలనా? సవరణ జరపాలనా? సలహాలివ్వాలనా? ప్రధాన న్యాయ మూర్తిని బోనులో నిలబెట్టాలనా?’’ సోలీ సొరాబ్జీ, కె.టి.ఎస్. తులసి, జస్టిస్ ముకుల్ ముద్గల్ వంటివారు షాక్ అవడమే కాకుండా చాలా బాధపడ్డారు. ఒక ప్రముఖ పత్రిక– ఈ పత్రికా సమావేశం భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం అని పేర్కొంది. విచిత్రం ఏమిటంటే గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలోని అత్యంత ప్రముఖమైన కేసులన్నీ యాదృ చ్ఛికంగానో, కాకతాళీయంగానో జూనియర్ బెంచిలకే వెళ్లాయని ఇదే పత్రిక పతాక శీర్షికలో మరునాడు పూర్తి వివరాలతో పేర్కొంది. మరి ఇన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో తమ విధులను నిర్వహిస్తున్న ఈ గౌరవ న్యాయమూర్తులకు పత్రికలకు తెలిసేపాటి నిజానిజాలు తెలియవా? తెలిస్తే రచ్చకెక్కడానికి ఇప్పు డెందుకు ముహూర్తం పెట్టినట్టు? ఇందులో వృత్తిప రమైన, రాజకీయ పరమైన కోణాలేమైనా ఉన్నాయా? ఒకానొక రాజకీయ నాయకుడు ఒకానొక న్యాయ మూర్తి తలుపు తట్టడం వెనుక ఈ ఛాయలు తెలు స్తున్నాయా? ఇవీ ప్రశ్నలు. లేని తీగెని లాగి ఓ గొప్ప వ్యవస్థని ‘డొంక’గా రూప కల్పన చేసిన దయనీయమైన పరిస్థితిగా దీనిని భావించాలా? అని మేధావి వర్గాలు బుగ్గలు నొక్కుకుంటు న్నాయి. అయితే– ప్రధాన న్యాయ మూర్తి స్థాయిలో పరిపాలనా సరళిలో కొన్ని మర్యాదలు పాటించనప్పుడు, జరుగుతు న్నది సబబు కాదని మేధావులైన న్యాయమూర్తులు భావిస్తున్నప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేసినా చేయ లేకపోయినా దేశమంతా నెత్తిన పెట్టుకునే, గౌరవించే, నిర్ణయాలకు భేషరతుగా తలవొంచే, మార్గదర్శకత్వా నికి ఎదురుచూసే– ఒకే ఒక్క గొప్ప వ్యవస్థని ‘బజా రు’న పెట్టవలసిన అగత్యం లేదని చాలామంది పెద్దల భావన. ఇలా రచ్చకెక్కడంవల్ల దేశంలో అడ్డమైనవారూ (వారిలో నేనూ ఉన్నాను)– రాజకీయ పార్టీలు సరేసరి – నోరు పారేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు అవు తుందని సంతోష్ హెగ్డే అన్నారు. ప్రతీ దిన పత్రికలోనూ సంపాదకునికి లేఖలు కోకొల్లలు. ఈ సంక్షోభాన్ని ఎవరి అవసరాలకు వారు అన్వయించు కుంటున్నారు. సంయమనం, మేధస్సు, విచక్షణ, అపూర్వమైన గాంభీర్యమూ చూపే వ్యవస్థ– అలక, కించిత్తు అస హనమూ, కోపమూ– చూపనక్కరలేని, చూపినా ఉప యోగం లేని, చూపకూడని స్థితిలో రచ్చకెక్కడం– తొందరపాటుతో ఒకటి రెండు మెట్లు దిగి వచ్చిందని, ఆ మేరకు ‘వ్యవస్థ’ పరపతి– దిగజారిందని భావిం చడంలో ఆశ్చర్యం లేదు. -గొల్లపూడి మారుతీరావు -
‘ఇచ్చాపురపు’ జ్ఞాపకాలు
జీవన కాలమ్ ఆయనలో గర్వంగా రాణించే ‘తృప్తి’ గొప్ప లక్షణం. ‘ఈ పని చేస్తే మీకు కోటి రూపా యలు వస్తుంది రావుగారూ!’ అంటే ‘వద్దు మారుతీరావుగారూ. సుఖంగా ఉన్నాను. మనకి రెండు సిగరెట్లూ, పగలు ఒక భోజనం, రాత్రి ఒక ఫలహారం చాలు’ అంటారు. ఒక వయసు దాటాక మనిషి చిరాయువుగా ఉండటానికి కారణం శరీర ఆరోగ్యం కాదు. మానసిక ఆరోగ్యం. దానిని పుష్కలంగా పెంచుకుని జీవి తాన్ని కళగా జీవించిన అరు దైన మిత్రులు ఇచ్చాపురపు జగన్నాథరావు. కొందరు ఉన్న చోట ఉత్తుంగ తరంగంలాగ లేచి పడుతూంటారు. మరికొందరు ప్రశాంతమైన సరో వరంలాగ హాయిగా, గర్వంగా, తృప్తిగా, హుందాగా జీవిస్తారు. అలా ఆఖరి క్షణం వరకూ జీవించిన గొప్ప కళాత్మకమైన దృష్టి, దృక్పథమూ కలవారు జగన్నాథ రావు. ఆయన నోటి వెంట ఏనాడూ ‘నెగటివ్’ ఆలోచన రావడం ఎరుగను. జీవించడంలో నిర్దిష్టమైన స్పష్టత, ఆలోచనలో అతి నిలకడైన దృక్పథమూ కల ఆఫీసరు రావుగారు. ‘ఆఫీసరు’ని ముందు నిలపడానికి కారణం శషబిషలు లేని ఆలోచనా సరళి. ఒకసారి నాతో అన్నారు: ‘‘మారుతీరావుగారూ! మనం పోయాక మన పిల్లలు పది రోజులు బాధపడతారు. మన మీద ప్రేమ ఉంటే పది నెలలు బాధపడతారు. ఎల్లకాలం బాధ పడాలని మనం కోరుకోకూడదు. అది వారికే మంచిది కాదు. జీవితం సాగాలి. అలా సాగుతూనే ఉండాలి’’. నాకు అతి తరచుగా జోకులు, అందమైన, ఆలోచ నాత్మకమైన కథలు కంప్యూటర్లో పంపే వ్యక్తి రావు గారు. ఎప్పుడూ ‘హాస్యం’ వాటి ప్రధాన అంశం. సరిగ్గా ఆయన వెళ్లిపోవడానికి మూడు రోజుల కిందట జోక్ పంపారు. మొదటి వాక్యం చెప్పాలి: ‘‘నువ్వు రోజూ వ్యాయామం చెయ్యడంవల్ల లాభం– ఆరోగ్యంగా వెళ్లి పోవడానికి దగ్గర తోవ’’. తెల్లబట్టలు వేసుకుని, సూర్యోదయాన్ని చూస్తూ, వేడి కాఫీ తాగుతున్నంత హాయిగా ఉంటాయి ఆయన రచనలు. దేశ అభ్యుదయం, విప్లవం, తిరుగుబాటు– ఇలాంటి మాటలు తెలుగులో ఉన్నాయని కూడా ఆయ నకి తెలీదేమో. దాదాపు 28 సంవత్సరాల కిందట ఆయన చెన్నైలో కస్టమ్స్ కలెక్టరు. ఆయన చేత చాలా నాటికలు రాయించిన తృప్తి నాది. ఓసారి కథ రాయమని ఫోన్ చేశాను. ‘ఈ ఉద్యోగ రద్దీలో ఇతివృత్తం మనసులో లేదండీ’ అన్నారు. ‘మీ ముందు టేబిలు మీద ఏమేం ఉన్నాయి?’ అని అడిగాను. ఫైళ్లు, టెలిఫోన్, పిన్ కుషన్– ఇలా చెప్పారు. ‘గుండుసూది’ మీద కథ రాయ మన్నాను. ఆ కథ చాలా గొప్పది. ఏళ్ల తర్వాత విహారి ఆ కథని మెచ్చుకున్నారట. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈమెయిల్ పంపారు. ఆఖరి వాక్యాలివి. I recall your inspiration which resulted in a story which was bigger than me. If someone raves about a story a quarter of a century later, there must be something in it. Ego? No. I feel humbled.కృతజ్ఞత చాలా అరుదైన లక్షణం. స్వామిభక్తి, కృతజ్ఞతని– సగం మనిషి, సగం జంతువు ద్వారా మనకి నేర్పాడు వాల్మీకి– రామాయణంలో. (క్షమించాలి. నేను హనుమంతుడనే పాత్ర గురించి మాట్లాడుతున్నాను. పురాణాన్ని కించపరచడం లేదు. తీరా నా పేరూ అదే!) ఒక్క సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచు రించిన ‘సురభి’ మాస పత్రికలో నా ఒత్తిడి మేరకి ‘తగిన మందు’ అనే కథ రాశారు. తర్వాత ఏదైనా రాశారేమో నాకు తెలీదు. నా అభిమాన రచన వారి నవలిక ‘గులా బిముళ్లు’. దాన్ని ‘చేదు నిజం’ అనే పేరిట గంట నాట కంగా రేడియోలో ప్రసారం చేశాను. ఏదైనా సభల్లో మాట్లాడే విషయం కుదరనప్పుడు ఆ కథని అనర్గళంగా చెప్పి, ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసి, కొసమెరుపుగా ‘ఇది ఇచ్చాపురపు జగన్నాథరావుగారి రచన’ అని చెప్పడం రివాజు. ఆయనలో గర్వంగా రాణించే ‘తృప్తి’ గొప్ప లక్షణం. ‘ఈ పని చేస్తే మీకు కోటి రూపాయలు వస్తుంది రావుగారూ!’ అంటే ‘వద్దు మారుతీరావు గారూ. సుఖంగా ఉన్నాను. మనకి రెండు సిగరెట్లూ, పగలు ఒక భోజనం, రాత్రి ఒక ఫలహారం చాలు’ అంటారు. రావుగారు ఆయన షరతుల మీదే హాయిగా జీవిం చారు. ఆయన షరతులమీదే రచనలు చేశారు. 13వ తేదీ సాయంకాలం ఏడున్నరకి ఓ మంచి జోక్ని మా అంద రికీ పంపడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నారు. 7.45కి తల వెనక్కు వేలాడిపోయింది. గుండెపోటు. తన షరతుల మీదే నిష్క్రమించారు. రావుగారు నిగర్వి. కానీ జీవించడంలో తన పరిధుల్ని ఎరిగి, ఆ చట్రం మధ్య అందమైన ముగ్గులాగ జీవితాన్ని పరుచుకుని ప్రశాం తంగా జీవించిన వ్యక్తి. ఆగస్టు 8న ఆ దంపతులని చూడటానికి వెళ్లాను. వృద్ధాప్యం ముసురుకున్న జీవితాల్ని డిగ్నిఫైడ్గా అలం కరించుకోవడం చూశాను. బయలుదేరుతూంటే దంప తులు గుమ్మందాకా వచ్చారు. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి నట్టు– ‘మీ ఇద్దరి ఫొటో తీసుకుంటాను’ అన్నాను. ఇద్దరూ ఏక కంఠంతో అన్నారు. ‘ఈమాటు వచ్చిన ప్పుడు తీసుకుందాం’ అని. మరో అవకాశం లేదని ఆనాడు తెలియదు. ఆనాడు తీసుకోని ఫొటో ఒక జీవితకాలం ఆలశ్యం అయి పోయింది. వ్యాసకర్త ప్రముఖ సినీ రచయత గొల్లపూడి మారుతీరావు -
పద్మావతి
దేవుడిని మనలో ఒకడిగా చేసుకుని ఆయనా మనలాంటి ఇబ్బందులు పడుతుంటే ఆనందించటం మనకి అలవాటు. దేవుడు మనకి సఖుడు, నెచ్చెలి, భర్త– ఇలా ఎన్నో విధాలుగా మనం సినిమాల్లో పురాణాలను మన స్థాయికి లాక్కొచ్చాం. ఇటీవల ‘పద్మావతి’ చిత్రం మీద చెలరేగిన వివాదం విచిత్రమైనది, విభిన్నమైనది, విలక్షణమైనది, వికారమైనది. పాపం, దర్శక నిర్మాత సంజయ్లీలా భన్సాలీగారు 1540లో–అంటే దాదాపు 500 సంవత్సరాల కిందట సూఫీ కవి మాలిక్ మహ్మద్ జయసీ అనే ఆయన రాసిన ఒక పద్యాన్ని ఆధారం చేసుకుని క«థని అల్లుకున్నానని ఇల్లెక్కి కేకలు వేస్తున్నాడు. అయితే పాత్రలు చరిత్రకు సంబంధించినవి. కథనం– కల్పితం. మన సినీమాల్లో ఇలాంటి కల్పితాలు కోకొల్లలు. మాయాబజారు, గయోపాఖ్యానం, కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం, నారద నారది– ఇలాగ. అయితే ‘పద్మావతి’ పాత్ర గౌరవాన్ని మంటగలిపితే రాజపుత్రుల గౌరవ మర్యాదలు మంట గలుస్తాయని కర్ణీసేన అనే ఒక ప్రైవేటు రాజపుత్ర సేన కత్తిగట్టింది. అల్లావుద్దిన్ ఖిల్జీ అనే ఢిల్లీ చక్రవర్తి – మహర్వాల్ రతన్ సింగ్ అనే రాజుగారి భార్య గొప్ప అందగత్తె అని విని ఆమెను చూడాలని పట్టుబట్టాడు. పరాయి పురు షుని ముందు నిలవడం రాజపుత్ర స్త్రీలకు నిషిద్ధం. కాని బలవంతుడయిన ఖిల్జీ కోరికకు ఎదురు చెప్పలేక రతన్ సింగ్ ఒక మార్గాంతరాన్ని ఆశ్రయించారు. అంతఃపు రంలో ఆమె ముఖాన్ని ఒక అద్దంలో ఖిల్జీ చూసేటట్టు చేశారని కథ. చిత్తూరు దుర్గంలో ఈ కథకు బాసటగా ఏర్పాటు చేసిన అద్దాలను 50 ఏళ్ల కిందట ఉద్యమకా రులు బద్దలుకొట్టారు. ఇప్పుడు–అంటే జనవరి 2017లో ‘పద్మావతి’ సెట్టుని కర్ణీ సేన ధ్వంసం చేసి, దర్శకుడు భన్సాలీని చావగొట్టింది. ఆ పాత్రలో నటించిన దీపిక పదుకునే ముక్కునే కోసేస్తా మని హెచ్చరిక చేసింది. ఒకాయన సంజయ్లీలా భన్సాలీ తలని తెస్తే 10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. రాజ పుత్రుల పరువు మర్యాదలు మంటగలవడం ఇష్టంలేని ఒకాయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన శవాన్ని ఈ సేన నెత్తిన పెట్టుకుని ఊరేగించింది. తీరా సుప్రీంకోర్టుకి ఈ చిత్రాన్ని బహిష్కరించ మని అర్జీ పెట్టగా–చిత్రం మంచి చెడ్డల్ని సెన్సారు వారు నిర్ణయిస్తారని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ లోగా చిత్రాన్ని లండన్లో ప్రదర్శనకి లండన్ సెన్సారు వారికి దరఖాస్తు చెయ్యగా ‘మాదేశంలో య«థాతథంగా ప్రద ర్శించడానికి ఎట్టి అభ్యంతరము లేద’ని ఇంగ్లండ్ సెన్సారు వారు సర్టిఫికెట్ ఇచ్చారు. కొన్ని బీజేపీ ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలలో ఈ చిత్ర ప్రదర్శనను బహిష్కరించాయి. ఇంతకీ అసలు విషయం– ఈ కర్ణీ సేన కానీ, ఈ ప్రభుత్వ నాయకులు కానీ ఈ చిత్రాన్ని చూడలేదు. ప్రభుత్వాల భయమల్లా తమ రాష్ట్రంలో ఈ చిత్రం కారణంగా అల్లర్లు జరగకూడదని. సబబైన న్యాయానికి నిలబడవల్సిన ప్రభుత్వాలు చేయవలసిన పని ఇది కాదు కదా. ఇందులో చిత్ర నిర్మాణ స్వాతంత్య్రం, ‘బాజీరావు మస్తానీ’ వంటి ముందు చిత్రాలలో భన్సాలీ వేసిన కుప్పి గంతులు గురించి పత్రికలలో పుంఖానుపుంఖా లుగా కథనాలు వస్తున్నాయి. ఎల్కే అద్వానీ, రాజ్ జబ్బర్, అనురాగ్ ఠాకూర్లతో ఏర్పడిన 30 మంది సభ్యుల పార్లమెంటరీ బృందంతో ‘‘అయ్యా, నా ఉద్దేశం ఎవరి మనస్సునీ నొప్పించడం కాదు’’ అని భన్సాలీ గారు మొరపెట్టుకున్నారట. ఏమైనా కర్ణీ సేన ముక్కులు కోసి, పీకలు కోసే పనికి పూనుకుంది కానీ మనం అలాంటి పనులు చెయ్యం. మనం మన సినీమాల్లో బ్రాహ్మణులు వేదం వర సల్లో అడ్డమైన మాటలు మాట్లాడుతూ, పేడ తింటుంటే కడుపారా నవ్వుకున్నాం కానీ ఏమైనా అభ్యంతరం చెప్పగలిగామా? యముడూ, చిత్రగుప్తుడూ నడిరోడ్డు మీద ఐస్ క్రీం తింటూ మనల్ని కడుపారా నవ్విస్తూ ఉంటే చీమ కుట్టినట్టయినా బాధపడ్డామా? దేవుడిని మనలో ఒకడిగా చేసుకుని ఆయనా మనలాంటి ఇబ్బందులో, ఇక్కట్లో పడుతూంటే ఆనం దించడం మనకి అలవాటు. దేవుడు మనకి సఖుడు, సేవకుడు, నెచ్చెలి, ప్రియుడు, భర్త– ఎన్నో విధాలుగా మనం పురాణాలను మన స్థాయికి లాక్కొచ్చాం. ఏసు ప్రభువుని, అల్లానీ ఎప్పుడైనా చిత్రాల్లో, నాటకాల్లో చూశామా? చూపడం జరిగిందా? ఏమైనా చిత్రాన్ని చూడకుండా తిరగబడటం, ఎదురు తిరగడం ఈ దేశంలో కొత్త కాదు. ప్రకాష్ ఝా ‘అరక్షణ్’ (2011) వెనుకబడినవారి ఆత్మగౌరవాన్ని, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందనుకొని– చిత్రాన్ని చూడకుండానే ఎదురు తిరిగారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రా, పంజాబ్ ప్రభుత్వాలు బహిష్కరించాయి. తీరా వారిని చిత్రం సమర్థించిందని చిత్రాన్ని చూశాక అర్థమయింది. కమల్హాసన్ ‘విశ్వరూపం’ (2013)లో ముస్లింలను ‘దౌర్జన్యకారులు’గా చిత్రంలో చూపుతున్నా రని భావించి తమిళనాడులో ముస్లింలు వ్యతిరేకించారు. ఎవరూ చిత్రాన్ని చూడలేదు. తీరా ముస్లిం మతస్థుడు దౌర్జన్యకారులను వ్యతిరేకించడం కథ అని చూశాక తెలిసింది. ఏతావాతా, చిత్రాన్ని చూడకుండా వీధిన పడే సంప్రదాయాన్ని కర్ణీ సేన నిలబెడుతున్నదని మనం గర్వపడవచ్చు. - గొల్లపూడి మారుతీరావు -
బురదలోంచి వెలుగులోకి
ఐశ్వర్యంలో కేవలం మత్తు ఉంది. కానీ ఆముష్మిక జీవనంలో అంతులేని తృప్తి ఉంది. తండ్రిది దోచుకున్న వైభవం. కొడుకుది తనకు తానుగా సంపాదించు కున్న ఆధ్యాత్మిక సంపద. రెంటికీ పొంతనలేదు. ప్రయత్నించినా దొరకదు. మొదట దావూద్ ఇబ్రహీం గురించి. ఆయనది పెద్ద సామ్రాజ్యం. చాలా దేశాలలో ఆయ నకి పాలెస్లు ఉన్నాయి. ప్రతీ పాలెస్ పేరూ ‘వైట్ హౌస్’. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక పాకిస్తాన్లో మోయిన్ పాలెస్ నిర్మించారు. దాని చుట్టూ అనునిత్యం పహారా కాసే తుపాకీ వీరులు. ఆ పాలెస్ గదుల్లో స్వరోస్కి క్రిస్టల్ చాండ లీర్స్, ఒక చిన్న జలపాతం, ఎప్పుడు పడితే అప్పుడు ఉష్ణోగ్రతని నిర్ణయించగల స్విమ్మింగ్ పూల్, ఒక టెన్నిస్ కోర్టు, ఒక బిలియర్డ్స్ కోర్టు, ఉదయం జాగింగ్ చెయ్యడానికి ప్రత్యేకమైన ట్రాక్ ఉన్నాయి. ఆయన స్పెషల్ అతిథులు మోయిన్ పాలెస్లోనే ఉంటారు. మరికాస్త మామూలు అతిథులు పక్కనే ఉన్న బంగ ళాలో ఉంటారు. ఆయనది ఒక మహా చక్రవర్తి జీవితం. ఆయన సూట్లు లండన్ ‘సెవైల్ రో’లో తయారవుతాయి. ఆయనకి ఖరీద యిన గడియారాలు సేకరించడం సరదా. ఆయనెప్పుడూ పాటక్ ఫిలిప్ రిస్టువాచీలనే వాడుతాడు. ఆ వాచీలు అరుదైన వజ్రాలతో పొదగబడినవి– ఖరీదు లక్షల్లో ఉంటుంది. నల్ల కళ్లద్దాలు మాసె రాటీ బ్రాండువి. ఆయన వజ్రాలు పొదిగిన పెన్ను తోనే సంతకాలు చేస్తాడు. ఆ పెన్ను ఖరీదు కనీసం ఐదు లక్షలు. ఆయనకి చాలా కార్లు న్నాయి. కానీ బాంబులు పడినా చెక్కుచెదరని నల్లటి మెర్సిడిస్లోనే ప్రయాణం చేస్తారు. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన రక్షణను చూసే పాకిస్తాన్ రేంజర్ల కట్టుదిట్టాలు– బహుశా పాకిస్తాన్ అధ్యక్షుడి రక్షణ కవచాన్ని కూడా వెక్కిరిస్తున్నట్టుంటాయి. అయితే ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యమంతా ఇవ్వ లేనిది ఒకటుంది. కంటి నిండా నిద్ర. నిద్ర దావూద్కి దూరం. పగలు ఏ కాస్తో నిద్రపోయి, రాత్రి వేళల్లో తన ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఎందరో మంత్రులు, బ్యూరోక్రాట్లు, మహానుభావులు ఆయన్తో ఇంట ర్వ్యూకి తహతహలాడుతుంటారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన వెయిటింగ్ గదిలో అల్లా డుతుంటారు ఆయన దర్శనానికి. ఇదీ దావూద్ ఇబ్రహీం అనే హంతకుడి జీవన శైలి. డి–కంపెనీ అధినేత, కుట్రదారుడు, హవాలా చక్రవర్తి– ఇవన్నీ ఆయన బయట ప్రపంచం ఆయనకి పెట్టిన పేర్లు. ప్రపంచంలో ఉన్న పదిమంది గొప్ప నేరస్తుల జాబితాలో ఆయనది మూడవ స్థానం. ఆయన్ని పట్టుకున్నవారికి అమెరికా 250 లక్షల బహు మతిని ప్రకటించింది. ఆయనకి నాకూ చిన్న బంధుత్వం ఉంది. భారత దేశాన్ని తన అందంతో ఉర్రూతలూగించిన మందాకిని (‘రామ్ తెరీ గంగా మైలీ’ తార) ఆయన గర్లఫ్రెండ్. ‘భార్గవ రాముడు’ చిత్రంలో నా గర్ల్ఫ్రెండుగా నటించి క్లైమాక్స్లో నన్ను హత్య చేసింది. దావూద్ ఇబ్రహీం ఒక నిజాయితీపరుడైన పోలీసు కానిస్టేబుల్ కొడుకు. మొదటినుంచీ నేర ప్రపంచంతో సంబంధాలున్న దావూద్ ఒకానొక దొమ్మీలో తన సోదరుడిని ఒక ముఠా దారుణంగా హత్య చేయగా– వాళ్లని వెంటాడి ఒంటి చేతిమీద వారిని అంతే దారుణంగా హత్య చేసి– నేర ప్రపం చంలో వ్యక్తుల నరాల్లో వణుకు పుట్టించి– రాత్రికి రాత్రి ‘డాన్’గా అవతరించాడు. ఇది ‘దోంగ్రీ టు దుబాయ్’ పుస్తకంలో హుస్సేన్ జైదీ కథనం. ప్రతీ క్షణం హత్య, నేరం, పగ, తిరుగుబాటు, లొంగుబాటు, రివాల్వర్లు, తుపాకులు, దొమ్మీలతో సతమతమయ్యే జీవితం అతనిది. నిద్రకి అవకాశం లేని, ఆస్కారమూ లేని– అశ్విన్ నాయక్, ఛోటా షకీల్, అబూ సలీం, ఛోటా రాజన్, అరుణ్ గావ్లీ వంటి పేర్లతో ప్రతిధ్వనించే పాలెస్ జీవితం అతనిది. ఈయనకి ఒక్క గానొక్క కొడుకు– మోయిన్ నవాజ్ డి. కాస్కర్. వయస్సు 31. ఇంత గొప్ప, అనూహ్యమైన నేర సామ్రా జ్యానికి అతనొక్కడే వారసుడు. వైభవానికి ఆఖరి మెట్టుగా నిలిచిన ఈ పాలెస్లో అతని జీవితం గడిచి ఉంటుంది. హత్యలూ, గూడుపుఠా ణీలు, గూండాలు, అవధుల్లేని ధనం, అధికారం మధ్య అతని జీవితం గడిచి ఉంటుంది. కానీ ఇదేమిటి! మోయిన్ నవాజ్కి తండ్రి జీవితం పట్ల ఏవగింపు కలిగింది. కొన్ని సంవత్సరాలుగా తండ్రి వైభవానికి దూరమయ్యాడు. అల్లా పిలుపుని గ్రహించి– ఒక మసీదులో మౌల్వీగా, మత గురువుగా మారిపోయాడు. తండ్రి వైభవానికి దూరమై– పవిత్ర ఖురాన్లో 6236 సూక్తులనూ కంఠస్థం చేసి మత గురువుగా మారిపోయాడు. తండ్రి నిర్మించిన పాలెస్కి దూరంగా ఒక మసీదు పక్కన చిన్న ఇంట్లో ఉంటు న్నాడట. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక దావూద్ ఇబ్ర హీం చాలా మనస్తాపానికి గురి అవుతున్నట్టు వార్త. ఆశ్చర్యం లేదు. అంతులేని సంపదా, అనూహ్య మైన ‘అవినీతి’ జీవనం ఏదో ఒకనాటికి వెగటు పుట్టిస్తుంది. ముఖం మొత్తుతుంది. It is a natural metamorphosis of the progeny from evil to righteousness ఐశ్వర్యంలో కేవలం మత్తు ఉంది. కానీ ఆముష్మిక జీవనంలో అంతులేని తృప్తి ఉంది. తండ్రిది దోచుకున్న వైభవం. కొడుకుది తనకు తానుగా సంపా దించుకున్న ఆధ్యాత్మిక సంపద. రెంటికీ పొంతనలేదు. ప్రయత్నించినా దొరకదు. - గొల్లపూడి మారుతీరావు -
సౌందర్యం సంస్కారం
ఛిల్లర్ పేరుని చిల్లరగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులు శశి థరూర్ గారిది. ఈ చమత్కారానికి తెలుగులో ఒక పేరుంది– అభిరుచి దారిద్య్రం. ఛిల్లర్ సమాధానానికి కాకపోతే ఈ కాలమ్లో ఆమెకి ప్రవేశం లభించేది కాదు. ‘మీరు జీవితంలో సాధించి నదేమిటి?’ అని కొందరు నన్ను అడుగుతూ ఉంటారు. ‘రచన ద్వారా నా గొంతు పదిమందికి వినిపిం చడం’అంటాను. ఒక జీవితకాలం కృషికి, పడిన శ్రమకి ఇది చాలా గొప్ప బహుమతి. ‘నన్ను కొడితే వెయ్యిమందిని కొట్టినట్టు’ అనేవారు అల్లు రామలింగయ్య. అది ఆయన సంపాదించుకున్న పరపతి. నేను చెప్తే వెయ్యి మంది వింటారు. కొన్ని వందలమంది స్పందిస్తారు. అది అక్షరం ఇచ్చిన శక్తి. మరి మేరీ కోం మాట్లాడితే? సచిన్ తెందూల్కర్ మాట్లాడితే? నరేంద్ర మోదీ మాట్లాడితే? డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే? మొన్న చైనాలో సాన్యా పట్టణంలో జరిగిన ప్రపంచ సుందరి పోటీలలో– 118 దేశాలు పాల్గొన్న పోటీలో 17 సంవత్సరాల తర్వాత భారతదేశపు అమ్మాయి మానుషీ ఛిల్లర్ కిరీటాన్ని గెలుచుకుంది. ఇంతకు ముందు ప్రియాంకా చోప్రా, యుక్తా ముఖీ, డయానా హేడెన్, ఐశ్వర్యారాయ్, రీటా ఫారియాలకు ఈ కిరీటం దక్కింది. ఈ అందాల పోటీలకు కొందరు మహిళలే అడ్డం పడుతున్నారు. అంగ సౌష్టవాన్ని బజారున పెట్టి ‘నా గొప్పతనం చూడండి’ అని బోర విరుచుకోవడం భారతీయ సంస్కారం కాదని వీరి వాదన. చాలామట్టుకు వాళ్లు రైటే కాని దీనిలో చిన్న పాఠాంతరం ఉంది. ఇది కేవలం శరీరాన్ని విరుచుకుని విరగబడే పోటీ మాత్రమే కాదు. ఒక దేశపు సౌందర్యరాశి– ఆ దేశపు సంస్కారానికి ఎంతగా అద్దం పడుతున్నది? అన్నది ఈ పోటీలో మరొక ముఖ్యమైన ఘట్టం. ఈ సౌందర్యరాశి వర్చస్సులో చాలామందిని జయించాక–మానసిక సౌందర్యానికి కూడా పరీక్ష పెడతారు. ‘ప్రపంచంలోకెల్లా ఏది ఎక్కువ జీతాన్ని పొందగలిగే వృత్తి, ఎందుకు?’ ఇదీ పరీక్షకులు అడిగిన ప్రశ్న. అనుమానం లేదు. లౌకిక జీవనంలో తలమునకలయిన పాశ్చాత్యుల ఆలోచనా సరళికి ఈ ప్రశ్న అద్దం పడుతుంది. దీనికి మానుషీ ఛిల్లర్ సమాధానాన్ని మరో స్థాయికి తీసుకుపోయి నిలిపింది. ‘గొప్ప గౌరవం దక్కాల్సిన వ్యక్తి అమ్మ. అది కేవలం ఉద్యోగం కాదు– ప్రేమా, గౌరవాలతో, ఆత్మీయతతో ఆ స్థానాన్ని గుర్తించాలి’ అంది. ఇది భారతీయ స్త్రీత్వానికి పట్టాభిషేకం. ఛిల్లర్ సౌందర్యానికి పోటీలో కిరీటం పెట్టారు. ఆమె మాతృత్వానికి కిరీటం పెట్టింది. ‘ఈ దేశంలో ప్రతీ వ్యక్తికి నా సమాధానంతో బంధుత్వం ఉంటుంది’ అంది ఛిల్లర్ గర్వంగా. అవునమ్మా అవును. అమ్మ వైభవాన్ని విస్మరించిన మూర్ఖుడు ఇంకా ఈ దేశంలో పుట్టి ఉండడు. అమ్మని ఆదిశంకరులు స్తుతిస్తూ, ‘త్వదీయం సౌందర్యం తుహిన గిరి కన్యే తులయితుం కవీంద్రా’ అంటూ, ‘అమ్మా! నువ్వు సౌందర్యానికి ఆవలిగట్టువి’ అంటారు. 1987లో ఇలాంటి పోటీలో పాల్గొన్న జెస్సినా న్యూటన్ (పెరూ) ‘మా దేశంలో మహిళల మీద జరుగుతున్న హింసకు ప్రతిఘటనగా ఈ కిరీటాన్ని ఆయుధంగా చేసుకుని నా గొంతు వినిపించాలని నా ఉద్దేశం’ అంది వేదననీ క్రోధాన్నీ ఉదాసీనతనీ సమీకరిస్తూ. అంతే. కిరీటం ఆమె తల మీద వాలింది. ఏతావాతా, మానుషీ ఛిల్లర్ ‘అందంతో ఆదర్శం’ ప్రాజెక్టుకి కృషి చేస్తూ – హరియాణాలో మెడిసిన్ చదువుకుంటున్న ఈ అమ్మాయి–స్త్రీల రుతుస్రావ సమయంలో ఆరోగ్యం పట్ల అవగాహనను కల్పించడానికి 20 గ్రామాలలో పర్యటించి , 5000 మంది మహిళలకు ఉపకారం చేసింది. 20 ఏళ్ల ఛిల్లర్ చేపట్టని క్రీడ లేదు. సంప్రదాయ నృత్యం నేర్చుకుంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో తరిఫీదు పొందింది. పారా గ్లైడింగ్, బంగీ జంప్, స్నార్కలింగ్, స్కూబా డైవింగ్ చేస్తుంది. తండ్రి సైంటిస్ట్. తల్లి న్యూరోకెమిస్ట్. ప్రపంచమంతా అబ్బురంగా చూసే స్థానంలో నిలిచి ఆమె గొంతుని వినే ‘శక్తి’ని ఛిల్లర్ సంపాదించుకుంది. ఇవీ ఆమె మాటలు, ‘నువ్వు కలలు కనడం మరిచిపోతే జీవించడాన్ని నష్టపోతావు. నీ కలలకి రెక్కలు తొడిగి, నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకుంటే ఈ జీవితం జీవన యోగ్యం అవుతుంది.’ ఇంతవరకూ ఎన్నో దేశాల అందమయిన శరీరాలు ఈ కిరీటాన్ని వరించాయి. మానసికమయిన ఉదాత్తత, మన దేశపు విలువలను ఎత్తి చూపే సంస్కారానికి ఇప్పుడు కిరీటం దక్కింది. ఛిల్లర్ సమాధానానికి కాకపోతే ఈ కాలమ్లో ఆమెకి ప్రవేశం లభించేది కాదు. దీనికి చిన్న గ్రహణం. మన రాజకీయ నాయకులు ఎటువంటి విజయాన్నయినా భ్రష్టు పట్టించగలరు. ఛిల్లర్ విజయాన్ని అభినందించడానికి బదులు కాంగ్రెస్ నాయకులు శశి థరూర్గారు ఛిల్లర్ పేరుని రాజకీయ రొంపిలోకి లాగి ‘బీజేపీ నోట్ల రద్దు ఎంత పెద్ద పొరపాటు! మనదేశపు ‘చిల్లర’కు కూడా మిస్ వరల్డ్ కిరీటం దక్కింది’ అని చమత్కరించారు. ఛిల్లర్ పేరుని చిల్లరగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులు శశి థరూర్ గారిది. ఈ చమత్కారానికి తెలుగులో ఒక పేరుంది– అభిరుచి దారిద్య్రం. - గొల్లపూడి మారుతీరావు -
చిత్రం! భళారే విచిత్రం!!
పశు ప్రవృత్తితో కూడిన సెక్స్కి జాతి పరిణతితో, సంస్కారంతో అద్భుతమైన విలువల్ని మన పెద్దలు సంతరించి పెట్టారు. పరాయి స్త్రీని ‘అమ్మా’ అనడానికి కొన్ని శతాబ్దాల మానసిక విప్లవాన్ని ఈ జాతి కొనసాగించింది. మనకి సెక్స్ చాలా పవిత్ర మైనది –ఇప్పుడు కాకపో యినా– కనీసం ముందు తరం వరకు. మనకి సెక్స్ వంశోద్ధరణకి, బీజోత్పత్తికి, బలమైన వారసత్వానికీ ముడి. అందుకనే పెళ్లిలోనే గర్భదానానికి ముహూర్తం పెట్టారు – పెద్దలు. చక్కటి ముహూర్తంలో, చక్కని మనస్తిమితంతో, జీవితంలో మొదటిసారిగా సెక్స్కి ఉపక్రమించే భార్యాభర్తలు– ఆరోగ్యకరమైన, పాజిటివ్ దృక్పథంతో బిడ్డని ఈ జాతికి అందిస్తారని వారి ఆలోచన. ఇప్పుడివన్నీ బూతు మాటలు. మన సంస్కృతిలో వివాహాన్ని ‘రేప్’తో ముడిపెట్టారని ఆ రోజుల్లోనే దుయ్యబట్టారు చలం. విదేశీయులకి ఇంత గొడవలేదు. వారికి సెక్స్ ఓ ఆట విడుపు. విసుగుదల నుంచి అప్పటికి విముక్తి, నరాల ఆకలి, ఆకర్షణ, బలహీనత, ఆయుధం, అవ కాశం, అవసరం– ఏదయినా. సెక్స్తో ఎంగిలి పడినందుకు అక్కడెవరూ జుత్తు పీక్కోరు. పక్కవాడి జుత్తు పీకరు. ఏతావాతా మనకి జరిగిన నష్టం ఏమిటి? ఓ 50 సంవత్సరాల ‘తెలుగు సినీమా’ కథ అటకెక్కిపో యింది. ఇప్పుడు ఇద్దరు ప్రేమికులు, రెండు పెళ్లిళ్లు, మగాడితో పెళ్లి, పెళ్లి కాకుండా కాపురాలు వంటి కొత్త కథలు వచ్చాయి. వీటికి విదేశీ వాసన ఉందా? మన జీవితాలకే విదేశీ ‘కంపు’ పట్టేసింది. కథలకి ఏమొచ్చింది? కెవిన్ స్పేసీ చాలా చక్కని హాలీవుడ్ నటుడు. అందగాడు. ఆయన నాలుగు కోట్ల డాలర్ల సినీమా ‘ఆల్ ది మనీ ఇన్ ది వరల్డ్’లో నటించాడు. సినీమా పూర్తయిపోయింది. ఇందులో 800 మంది నటులు, రచయితలు, కళాకారులు, నిపుణులు పనిచేశారు. డిసెంబర్ 22న రిలీజు తేదీని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఉన్నట్టుండి కనీసం ఓ డజనుమంది మగా ళ్లతో ఈ నటుడి లీలలు బయటపడ్డాయి. 2016లో తన 18 ఏళ్ల కొడుకుతో ఈ స్పేసీ సెక్స్ నడిపారని ఓ బోస్టన్ టెలివిజన్ జర్నలిస్టు కథ బయటపెట్టింది. 9 కోట్ల సినీమాకి ఇది పెద్ద దెబ్బ కదా? మరి ఏంచేయాలి? రిడ్లీ స్కాట్ అనే ప్రఖ్యాత దర్శకుడు–నిర్మాణం పూర్త యిన ఈ చిత్రంలోంచి స్పేసీ సీన్లన్నీ తీసేయడానికి సిద్ధపడ్డాడు. ఈ పాత్రని లోగడ చరిత్రని సృష్టించిన ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ హీరో క్రిస్టొఫర్ ప్లమ్మర్ని పెట్టి మళ్లీ షూటింగు చేస్తారు. అపకీర్తి నుంచి సినీమాని కాపాడి ఇంతవరకెన్నడూ జరగని పని చేసి–దాన్ని చరిత్రగా మార్చడం ఒక్క హాలీవుడ్కే చెల్లును. అయితే ఇలాంటి చరిత్రలు హాలీవుడ్కి కొత్త కాదు. రొమాన్ పొలాన్స్కీ అనే పోలెండు దర్శకుడిని నేను బెంగళూరు చిత్రోత్సవంలో చూశాను. చాలా అందగాడు. కొన్ని సినీమాల్లో నటించాడు. ఆయన పత్రికా సమావేశంలో నేనున్నాను. ‘‘మా దేశపు ఫిలిం టెక్నిక్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఆయన్ని ఎవరో అడిగారు. సమాధానంగా ఆయన ఎవరో కార్యకర్తని పిలిచి ‘‘వెనుక వెలుగుతున్న స్పాట్ని ఆపుతారా? నా జుత్తు కాలుతోంది’’ అన్నారు. అప్పటికే విదేశాల్లో back light ధోరణి వెనుకపడుతోంది. 1978లో ఈ అందగాడు 13 ఏళ్ల అమ్మాయితో – ఒక పార్టీలో స్విమ్మింగ్ ఫూల్ పక్కన రొమాన్స్ జరిపి– పట్టుబడకుండా, చట్టాన్ని తప్పించుకుని స్విట్జర్లాండు పారిపోయాడు. తరువాత చాలా ఏళ్లకి ‘ది పియానిస్ట్’ (2002) అనే అద్భుతమైన చిత్రానికి ఆయనకి ఆస్కార్ బహుమతి వచ్చింది. అయితే చట్టానికి భయపడి ఈయన అమెరికా రాలేదు. అంతకు ఆరేళ్ల ముందు ఈయన ఓ 15 సంవత్సరాల జర్మన్ తార రెనేట్ లాంగ ర్ని రేప్ చేశాడట. ఈవిడ ఈ మధ్యనే బయట పెట్టింది. ఇంతకాలం ఎందుకు ఆగింది? ఈ మధ్యనే మరొక మహిళ – తన తల్లిదండ్రులు పోయినందున –ఇక ఇబ్బంది లేదనుకొని తనపై జరిగిన అత్యాచా రాన్ని బయటపెట్టింది కనుక. మరో నలుగురు కన్నె వయసు పిల్లలపై ఈ దర్శకుడు అత్యాచారం జరి పాడట. 1978లో ఈయన జరిపిన అమెరికా నేరానికి 2009లో స్విట్జర్లాండు అధికారులు ఈయన్ని అరెస్టు చేశారు. అయితే ఇప్పుడీయన వయస్సు 84. బొత్తిగా ముసలివాడయిపోయాడని ప్రాసిక్యూషన్ తమ అభియోగాన్ని ఉపసంహరించుకుంది. సరే. హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్స్టీన్ రుచి కరమైన లీలల్ని ఈ మధ్య విరివిగా చదువుకుంటున్నాం. డీ లా హురితా అనే తారని ఈయన 2010 లో రెండుసార్లు రేప్ చేశాడట. ఇలా హాలీవుడ్లో కేవలం 80 మంది మాత్రమే ఈయన సెక్స్ విన్యాసాల గురించి బయటపెట్టారు. సెక్స్ ప్రాథమికంగా పశు ప్రవృత్తి. ఆ క్షణంలో పశువుకీ, మనిషికీ పెద్ద వ్యత్యాసం లేదు. దానికి జాతి పరిణతితో, సంప్రదాయ వైభవంతో, సంస్కారంతో అద్భుతమైన విలువల్ని మన పెద్దలు సంతరించి పెట్టారు. పరాయి స్త్రీని ‘అమ్మా’ అనడానికి కొన్ని శతా బ్దాల మానసిక విప్లవాన్ని ఈ జాతి కొనసాగించింది. మొన్నటిదాకా కొనసాగిస్తోంది. అక్కడ–మేధస్సు ఆకా శంలో విహరిస్తున్నా–సంస్కారాన్ని అధఃపాతాళంలో మరిచిపోయిన ముగ్గురు చిత్ర ప్రముఖుల కథలివి. - గొల్లపూడి మారుతీరావు -
‘కిచిడీ’ రాజకీయాలు
కిచిడీని అందలం ఎక్కిస్తే నా డిమాండ్ ఒకటుంది– తెలుగువాడిగా గురజాడ కాలం నుంచీ అనాదిగా వస్తున్న నికార్సయిన తెలుగు వంటకం– నాకు అత్యంత ప్రియమైనది– దిబ్బరొట్టె. నాకు రాజకీయాలలో అపా రమైన అనుభవం ఉంది. 2019 ఎన్నికలకు ముందు గానే బీజేపీ, కాంగ్రెస్, హిందూ, ముస్లిం, సిక్కులు, కశ్మీర్–భారతదేశం– ఇలా రకరకాల వర్గాల మధ్య భయంకరమైన రాజకీయ సంక్షోభం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయని బల్లగుద్ది చెప్పగలను. దీనికి ఒకే ఒక కారణం– కిచిడీ. అదిగో, తమరి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. కానీ ఇది నవ్వి మరిచిపోయే విషయం కాదనీ, ముందు ముందు ముదిరి కొంపలు ముంచ గలదని నిరూపించడానికే ఈ కాలమ్. ముందుగా కిచిడీ తయారీకి మా వంటావిడ చెప్పిన విధి విధానమిది: మొదట– బంగాళాదుంప, క్యారెట్, ఆకుపచ్చ బఠాణీలు, బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి, వేరే చిప్పలో ఉల్లిపాయ, పచ్చిమిరప కాయ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర తరిగి పెట్టుకోండి. ఈ ముక్కల్ని జీలకర్ర, జీడిపప్పు, వేరుశనగ పప్పుతో కలిపి– నూనె, నెయ్యి – ఇదీ రహస్యం – రెండింటితో కలిపి వేయించాలి. ఇప్పుడు కుక్కర్లో బియ్యం, పెసరపప్పు, ఈ వేగిన ముక్కల్ని వేయాలి. ఒకటికి రెండు న్నర గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు, చిటికెడు పసుపు వేసి– స్టౌ వెలి గించాలి. రెండు విజిల్స్ వచ్చాక ఆపి, తయారైన పదార్థం మీద అరచెంచా నెయ్యి చిలకరించి– ప్లేట్లో ఉంచుకుని తినాలి. ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో చలామణికి వచ్చిన ‘జాతీయ కిచిడీ’ జన్మ రహస్యం. ఒక్క విషయం మరిచిపోకూడదు. ఇది భారతదేశపు ‘జాతీయ కిచిడీ’ కాదు. ప్రపంచ ఆహార జాబితాలో భారతదేశానికి ప్రాధాన్యం వహించే వంటకంగా దీనిని ఎంపిక చేశారు. నవంబర్ 4న ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆహార దినోత్సవంలో దేశ ప్రఖ్యాత వంటగాడు సంజీవ్ కపూర్ కిచిడీని తయారు చేశారు. 7 అడుగుల విస్తీర్ణం గల వెయ్యి లీటర్ల నీరు పట్టే గుండిగలో 918 కేజీల కిచిడీని తయారుచేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. దీనిని 60 వేలమంది అనాధ పిల్లలకు పెట్టారు. వీరు కాక ఈ ఉత్సవాలకు వచ్చిన అతిథులకి, మన దేశంలో ఉన్న వివిధ విదేశీ కార్యాలయాలకు పంపారు. అయితే ఇది జాతీయ వంటకం కాదు. ఆహార ప్రొసెసింగ్ శాఖ మంత్రి హర్శిమ్రాట్ కౌర్ బాదల్ మాటల్లో ‘‘ఈ కిచిడీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వా’’నికి ప్రతీకగా నిలుస్తుందని ఈ వంటకాన్ని ఈ ఉత్సవంలో చేర్చామని పేర్కొన్నారు. వెంటనే జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒంటికాలుమీద లేచారు. ‘‘ఈ కిచిడీ తినడం చూసినప్పుడల్లా మనం లేచి నిలబడాలా? ప్రతీ సినీమా చూడటానికి ముందు కిచిడీ తినడం విధాయకమా? దీనిని నచ్చకపోవడం జాతీయ వ్యతిరేక చర్య అవుతుందా?’’ ఇవీ వారి మాటలు. వారి మనసులో ఇంకా జాతీయ గీతం ప్రతిధ్వనిస్తోంది. వందేమాతరానికీ, కిచిడీకీ తేడా వారి మనస్సుదాకా రాలేదు. వారి చెవుల్లో ‘కిచిడీ’ అంటే ‘వందే...’ అని ప్రతిధ్వనిస్తోంది. వారు అర్జంటుగా చెవి, ముక్కు, నాలుక నిపుణుడిని సంప్రదించాలి. ఇక కిరణ్ మన్రాల్ అనే రచయిత ‘‘నేను తీవ్రంగా దీనిని ప్రతిఘటిస్తున్నాను. బొత్తిగా జబ్బు చేశాక పత్యం పెట్టే వంటకాన్ని జాతీయ వంటకం అంటారేమిటి?’’ అని కోపం తెచ్చుకున్నారు. ఆ వరు సలోనే వారు ‘పులావ్’ని గుర్తు చేశారు. మరొకరు ఒక పాయింట్ లేవదీశారు: ‘‘అసలు యునెస్కో దీనిని జాతీయ వంటకంగా అనుమతించిందా?’’ అన్నారు. రన్వీర్ బ్రార్ అనే దేశ ప్రఖ్యాత వంటగాడు: ‘‘కిచిడీ అంటే నాకు ఇష్టమే. కానీ జాతీయ వంటకంగా ఆ ఒక్క వంట కాన్నే ఎంపిక చేయడం అన్యాయం. మన దేçశంలో ఎన్నో ప్రాంతాలున్నాయి. ఎన్నో రుచులున్నాయి. ఎన్నో వంటకా లున్నాయి. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందుకి ఒక్క కిచిడీతో చావ మంటే ఎలాగ?’’ అని వాపోయాడు. తమరు ఈ స్పందనలో రాజ కీయ దుమారాన్ని గుర్తుపట్టాలి. ఇందులో సిక్కులు, ముస్లింలు, కశ్మీరీలు, పులావ్లూ, యునెస్కోలూ– ఇన్ని చోటు చేసుకున్నాయని గ్రహించాలి. ముందు ముందు తమిళనాడు ఎడపాడి పళని స్వామి ‘కారపు పొంగల్’ని ప్రతిపాదిస్తారు. కర్ణాటక సిద్దరామయ్య– కాంగ్రెస్ కనుక – తప్పనిసరిగా ‘బిసి బెళ బాత్’ని ప్రతిపాదిస్తారు. మహారాష్ట్ర నుంచి రాజ్థాకరేగారు ‘పాఠోళీ’ అంటారు. పంజాబీ మిత్రులు– ‘సార్సోంకా సాగ్’ అనవచ్చు. బెంగాలీ సోదరులు ‘చిత్తర్ మశ్చేర్ ముయితా’ అనవచ్చు. గుజరాతీ సోదరులు డొక్లా అని కానీ తెప్లా అని కానీ అనవచ్చు. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ, డోక్లాం తలనొప్పు లతోపాటు ‘కిచిడీ’ సమస్య పెంచుకోవడం– రాజకీయ మేధావుల లక్షణం కాదు. ఏతావాతా– కిచిడీని అందలం ఎక్కిస్తే నా డిమాండ్ ఒకటుంది– తెలుగు వాడిగా అలనాడు – అంటే 129 సంవత్సరాల కిందటి నుంచీ – అంటే గురజాడ కాలం నుంచీ అనాదిగా వస్తున్న నికార్సయిన తెలుగు వంటకం– నాకు అత్యంత ప్రియమైనది– దిబ్బరొట్టె. - గొల్లపూడి మారుతీరావు -
‘పై’ – పైపై కథ కాదు
జీవన కాలమ్ సత్యాల నిరూపణకు ఇంగ్లిష్లో మంచి మాట ఉంది. అది ‘సెర్చి’ కాదట. ‘రీసెర్చి’. కానీ మనవాళ్లకి మొదటి ‘సెర్చే’ విడ్డూరం. రెండో సెర్చికి వ్యవధి చాలదు. అదృష్టవంతులకి అజ్ఞానం శ్రీరామరక్ష. ప్రస్తుతం బొంబాయి ఐఐ టీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కె.రామసుబ్రమణ్యన్ ఈ కథ చెప్పారు. లెక్కల్లో ‘పై’ అన్నది వృత్తం చుట్టుకొలతని నిర్ణ యించే సాధన. దీని అవ సరం ఏమిటి? యజ్ఞకుం డాల్ని తయారు చేయడానికి. వేలాది సంవత్సరాల కిందట ప్రతీ ఇంటిలో మూడు కుండాలు ఉండేవట. ఒకటి పూర్తి వర్తులం, రెండోది అర్ధ చంద్రాకారం, మూడోది చతురస్త్రం. ఇలా ఎందుకు? ఆ గొడవలోకి మనం వెళ్లొద్దు. ఈ మూడూ ఒకే కొలతలతో ఉండాలని నియమం. ఈ కొలతల్ని నిర్ణయించేది– పై. ఈ పేరు మనది కాదు. కానీ ఇంగ్లిష్ పేరు చెప్తే కానీ మనకి అర్థం కాదు గనుక ప్రస్తుతానికి ‘పై’ అనే చెప్పుకుందాం. ఈ కుండాలలో అగ్నిని త్రేతాగ్ని అనేవారు– ఇంకా స్పష్టంగా చెప్పాలంటే– ఆహవనీయ, దక్షిణ, గార్హపత్య. వీటి వివరణ శుల్బ సూత్రాలలో– 800 బీసీలో వివరించారు. తర్వాతి కాలంలో ఆర్యభట్ట ఒక శ్లోకంలో దీన్ని వివరించాడు. ఆ శ్లోకాన్ని ఈ శాస్త్రజ్ఞుడు వివరించాడు. ఇది 17వ శతాబ్దంలో గ్రిగరీ–లీవినిజ్ పేరిట చెల్లుతోంది. కానీ దీనిని మాధవ అనే ఒక గణాంకవేత్త 14వ శతాబ్ది లోనే ఒక శ్లోకంలో వివరించాడు. అంటే న్యాయంగా ఈ సూత్రం ‘మాధవ’ పేరుతో చెల్లుబాటు కావాలి. ఈ 'పై'ని transcendental number అన్నారు. అన్నట్టు– చాలా వేల సంవ త్సరాలపాటు చాలా దేశాలు ఆరు నుంచి, మరేవో అంకెలనుంచీ తమ గణాంకాలను లెక్కపెట్టుకునే వారు. గణితంలో ‘సున్నా’ని కనిపెట్టిన ఘనత భారతదేశానిది. ఈశావాశ్య ఉపనిషత్తు ‘‘పూర్ణమద పూర్ణమిదం...’’ అంటోంది– కొన్ని వేల సంవత్సరాల కిందటి మాట ఇది. ఇటీవలి కథ ఒకటి చెప్పాలని ఉంది. ఇది కూడా 61 సంవత్సరాల నాటిది. పశ్చిమ గోదావరిలోని ఒక గ్రామంలో 1896లో ఒకాయన పుట్టాడు. ఆయన పేరు భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు. నరసాపురం టేలర్ హైస్కూలులో చదువుకున్నాడు. వీరి నాన్నగారికి వేదాలు, తద్విజ్ఞానం అంటే ఇష్టం. 20వ యేట రాజు గారికి పెళ్లయింది. దరిమిలాను గౌతమ బుద్ధుడి ప్రభావంతో సర్వసంగ పరిత్యాగం చేసి హిమాలయా లకు వెళ్లిపోయాడు. 10 ఏళ్లు ఉన్నాడు. వేద శాస్త్రాలు, యోగ శాస్త్రాన్ని అక్కడ నేర్చుకున్నారు. అప్పుడు జర్మనీ వెళ్లి భౌతిక శాస్త్రాన్ని అభ్యసించారు. మనలాగ ఎస్సెల్సీ, ఇంటర్మీడియెట్లు చదవలేదు. ప్రాగ్ విశ్వ విద్యాలయంలో ఎక్స్రే భౌతిక శాస్త్రం మీద పరి శోధనలు చేశారు. తర్వాత స్వామి జ్ఞానానందగా మారి 1927లో జర్మనీ వెళ్లి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలలో లోతైన శాస్త్రీయ విజ్ఞానం డ్రెస్డన్ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ డెంబర్ని ఆకర్షించింది. ఈయ నని ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఆకర్షించింది. డ్రెస్డన్ విశ్వవిద్యాలయంలో యోగా మీద 150 ప్రసంగాలు చేశారు. కథని కుదిస్తే– 1936 ప్రాంతంలో అణు శాస్త్రం మీదా, బీటా రేడియేషన్ మీదా పరిశోధన చేసి డిగ్రీ పుచ్చుకున్నారు. 1947లో భారతదేశంలో నేషనల్ ఫిజికల్ లేబరేటరీలో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసరుగా పనిచేశారు. 1954లో గాయపడి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసు పత్రిలో చేరారు. ఆయన్ని చూడడానికి వచ్చిన అప్పటి ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ వీఎస్ కృష్ణ గారు వారిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. నేనప్పుడు ఆనర్స్ చదువుకుంటున్నాను. తెల్లని పైజామా, కాషాయ రంగు లాల్చీతో ఉన్న స్వామీజీని ప్రత్యేకంగా అణు శాస్త్ర విభాగాన్ని (న్యూక్లియర్ ఫిజిక్స్) ప్రారంభించడానికి ఆహ్వానించడం మా అందరికీ ఆశ్చర్యకరం, చర్చనీ యాంశం. ఇప్పటి న్యూక్లియర్ ఫిజిక్స్ భవనాన్ని– (షష్టిపూర్తి మహల్ దాటాక) నిర్మించడం మా అందరికీ తెలుసు. 1965 వరకు స్వామీజీ ఉన్నారు. ఆ భవనానికి ‘స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్’ అని పేరు పెట్టారు. విద్యార్థుల కోసం ఆయన చేసిన ప్రసంగాలు విన్న 84 ఏళ్ల ప్రొఫెసర్ పెమ్మరాజు సీతారామారా వుగారి జ్ఞాపకాలు: ఇంగ్లిష్ కాస్త తడుముకుంటూ మాట్లాడేవారట. కానీ అణు శాస్త్రాన్నీ, సౌరశక్తినీ సమ న్వయిస్తూ వారు చేసే ప్రసంగాలు– అపూర్వం, అని తరసాధ్యం. ఆయన విజ్ఞానం కాలేజీల్లో నేర్చు కున్నది కాదు. అబ్బినది. ఒకనాటి ఆర్ష సంప్రదాయపు వైభవానికి ఈనాటి ఆధునిక శాస్త్ర పరిశోధనలకూ దగ్గర తోవ ఉందని– హిమాలయాలలో సర్వసంగ పరిత్యాగం చేసి బతికిన ఒక స్వామీజీ– విశ్వవిద్యాలయంలో అణుశాస్త్రాన్ని బోధించి నిరూపించారు. కొన్ని వేల సంవత్సరాల నాటి మనవారి పరిశో ధనలు– 17వ శతాబ్దంలో విదేశీయులకు పట్టుబడిన ‘పై’ గణితం, సౌర శక్తికీ, అణు శాస్త్రానికీ సశాస్త్రీయ మైన దగ్గర తోవని స్వానుభవంతో నిర్దేశించిన ఒక స్వామీజీ కథ ఇది. అందుకే ఈ సత్యాల నిరూపణకు ఇంగ్లిష్లో మంచి మాట ఉంది. అది ‘సెర్చి’ కాదట. ‘రీసెర్చి’. కానీ మనవాళ్లకి మొదటి ‘సెర్చే’ విడ్డూరం. రెండో సెర్చికి వ్యవధి చాలదు. అదృష్టవంతులకి అజ్ఞానం శ్రీరామరక్ష. గొల్లపూడి మారుతీరావు వ్యాసకర్త, ప్రముఖ సినీ నటుడు -
తెలివి మీరిన నేరాలు
జీవన కాలమ్ చదువు మాత్రమే మనిషిని మార్చదు. కాగా తరతరాలు అణిగిమణిగి ఉన్న వ్యక్తి కోపాన్నో, భయాన్నో రెచ్చగొట్టడానికి ఆ చదువు కేవలం పనిముట్టు అవుతుంది. చదువును సజావైన మార్గంలో నిలిపేది– సాంగత్యం. వాతావరణం. మొన్న విశాఖపట్నం బీచి దగ్గర మా కారు ఆగింది– రోజూలాగే. పార్కింగులో పది మోటారు సైకిళ్లు ఉన్నాయి. రామకృష్ణా బీచిలో రోడ్డుకి ఎడమపక్క కార్లు, కుడిపక్క మోటారు సైకిళ్లు ఆపాలని రూలు. కాని కొన్ని డజన్ల మోటారు సైకిళ్లు ఎడమపక్కనే ఆపుతారు. కారణం – పక్కనే కూర్చునే వసతి. మా డ్రైవరు ఒకాయన్ని మోటారు సైకిలు కాస్త వెనక్కి పెట్టమన్నాడు. ఆ మోటారు సైకిలు ఓనరు ఇతని మీద విరుచుకుపడ్డాడు. ‘నా బండి తీయమనడానికి నువ్వెవడివి? ఇక్కడ కార్లే ఆపాలని రాసి ఉందా? ఇది నీ బాబు గాడి సొమ్మా? నా బండీ పెడితే ఆపేవాడెవడు? ఇక్కడే పెడతాను. నీ దిక్కున్నవాడితో చెప్పుకో–పో. నేను తియ్యను‘ ఇలా అరుపులతో సాగింది. ఇంతలో ఎవరో ఆ కేకలు వేసే మనిషికి పలానా కారు గొల్లపూడిదని చెప్పారు. అతని తడబాటు వర్ణనాతీతం. ఇతణ్ని ఆపే శక్తి పోలీసు వ్యవస్థకి లేదు. కారణాలు మన దేశంలో చెప్పనక్కరలేదు. లేదన్న అవగాహన ఇతను బోర విరుచుకోవడానికి దన్ను. ఈ కాలమ్ కొందరయినా పోలీసు అధికారులు చదువుతారని ఆశి స్తాను. ఇది చదువుకున్న నేలబారు మనిషి – తన ఆ క్రమశిక్షణకు తాను సమకూర్చుకున్న లాజిక్. అతను చదువు రానివాడు కాదు. స్పష్టంగా తెలుస్తోంది. కాని చదువువల్ల రావలసిన సంస్కారం రానివాడు. ఇలాంటి చదువుల వెర్రితలలు మనదేశంలో కోకొల్లలుగా ప్రస్తు తం చూస్తున్నాం. ఈ చదువుకున్న మూర్ఖుడి మూర్ఖత్వానికి రెండు చికిత్సలు. దమ్మున్న అధికారం. చదువుకు సరైన తోవని మప్పే వ్యవస్థ. నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక పరిశీలనకు జువెనైల్ జస్టిస్ బోర్డు (పరిపక్వతకు రాని వయసున్న నేరస్థుల నేరాలను పరిశీలించే సంస్థ) తరఫు న్యాయవాది అబ్దుల్ రఖీబ్ అనే ఆయన ప్రొఫెసర్ సంపత్ కుమార్ పర్యవేక్షణలో.. విశాఖపట్నంలో చట్టానికి అడ్డం పడే ఈ జువెనైల్ నేరస్థుల కథనాలను– 100 నమూనాలను రెండేళ్లు పరిశీలించి పరిశోధన చేశారు. తేలిన నిజాలు విచిత్రం. ఇక్కడ జరిగే నేరాలు– చదువులేక, రోడ్డుమీద పడిన అలగా జనం చేసేవి కావు! నేరస్థులలో 40 శాతం ఇంటర్మీడియెట్ చదువుకున్నవారు. పదిశాతం పట్టభద్రులు! ఇంకా 67 శాతం కింది మధ్యతరగతినుంచి వచ్చినవారు. వీరిలో మళ్లీ గంజాయి రవాణా, అమ్మాయిల వేట, మానభంగాలు, గొలుసుల దొంగతనాలు, మా బీచి మిత్రుడిలాగ చట్టాన్ని ఎదిరించి రొమ్ము విరుచుకునే కేసులు– 58 శాతం. వీరిలో వెనుకబడిన కుటుంబాల నుంచి 56 శాతం, జూనియర్ కాలేజీల్లో చదువుకునేవారు– 30 శాతం ఉన్నారు. ఇది చాలా విచిత్రమైన నిజాలను ఆవిష్కరించే పరిశోధన. ఇదేమిటి? చదువు వీరిని మార్చలేదేం? బాబూ, చదువు మాత్రమే మనిషిని మార్చదు. గమనించాలి. కాగా తరతరాలు అణిగిమణిగి ఉన్న వ్యక్తి కోపాన్నో, భయాన్నో రెచ్చగొట్టడానికి ఆ చదువు కేవలం పనిముట్టు అవుతుంది. చిల్లర దొంగతనాలు చేసి బతికే తండ్రి కొడుకు– అదృష్టవశాత్తూ చదువుకోగలిగితే– ఆ దొంగతనాల్ని మరింత పకడ్బందీగా, దొరక్కుండా, మెరుగైన స్థాయిలో ఎలా చేయాలో– ఆ వృత్తికి మెరుగుపెడతాడు. వెనుకబడినవాడు– తన వెనుకబడినతనానికి తరతరాలు కారణమైన వాడిమీద కత్తికడతాడు. ఆ కత్తిని పదునుపెట్టడం చదువు నేర్పుతుంది. చదువు దానికి మన్నికయిన కారణాన్ని జత చేస్తుంది. వ్యవస్థ తప్పిదం వ్యక్తిది కాదన్న అవగాహన చదువుది కాదు. సంస్కారానిది. సంస్కారం పుష్పం. పురుగులు పట్టిన, కుళ్లిన గెత్తంలోంచే కళ్లు విప్పి, విత్తనమనే ప్రత్యేక అస్థిత్వాన్ని ఒడిసి పట్టుకుని– వికసించి పుష్పమవుతుంది. చదువు– ఏతావాతా– ప్రజ్ఞనిస్తుంది. ఉపజ్ఞని ఇవ్వదు. చట్టాన్ని ఎలా ఎదిరించాలో నేర్పగలదు. ఎందుకు ఎదిరిం చాలో ఒప్పించగలదు. మప్పగలదు. దానికి ఒరిపిడి– సంస్కారం. నిజానికి దీనికీ, చదువుకీ– న్యాయంగా సంబంధం ఉండనక్కరలేదు. కానీ ఉంటుంది. చదువుతో వచ్చే ‘వికసనం’ ఆ వాతావరణం ఇస్తుంది. సాంగత్యం ఇస్తుంది. ఆదిశంకరులు సజ్జన సాంగత్యానికి– జీవన్ముక్తిదాకా మజిలీలు ఉన్నాయని సూచించడంలో అర్థం ఇదే. చదువును సజావైన మార్గంలో నిలిపేది– సాంగత్యం. వాతావరణం. తెల్లవారిలేస్తే– మన డబ్బుని తినేసే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇంట్లో 50 కోట్ల ఆస్తి బట్టబయలు, కొల్లగొట్టిన డబ్బుతో పట్టుబడిన ఎమ్మార్వోల కథనాలు, రిజిస్ట్రార్ ఆఫీసులో లక్షల లంచాలు, చట్టాన్ని ఎదిరించి చెల్లుబడి చేసుకున్న డబ్బున్న నాయకుడి విర్రవీగుడు– ఇవన్నీ పైన చెప్పిన 62 శాతం చదువుకున్న కుర్రాడి మెదడులో పెట్టుబడులు. కుళ్లు చూపే వ్యవస్థలో తన ఒక్కడి సత్ప్రవర్తన జవాబుదారీ కాదన్న ‘నిరసన’ని అతని చదువు నేర్పుతోంది. ఇదీ చదువుకున్న 90 శాతం కుర్ర నేరస్థుల కథ. గొల్లపూడి మారుతీరావు -
పేరులోననే యున్నది
జీవన కాలమ్ ఈ జాతిని సుసంపన్నం చేసిన చారిత్రక పురుషుల్ని ప్రతిదినం స్మరించుకోవడం జాతి సంస్కారానికి బంగారు మలామా చేయడం. చరిత్రను పునర్నిర్మించుకోవడం అంటే ఇదే. ఈ మధ్య రైల్వే మంత్రి సురేష్ ప్రభుగారికి ఓ చక్కటి ఆలోచన వచ్చింది. మన దేశంలో రైల్వే ప్రజ లందరికీ మత ప్రమేయం లేకుండా వినియోగపడే ప్రయాణ సాధనం కనుక, విభిన్నమైన సాంస్కృతిక చైతన్యాలను ప్రతిఫలించే దిగా ఉంటే బాగుంటుందని భావించారు. అందు వల్ల ఏం చేయాలి? ఆయా రైళ్లకి వివిధ భాషలలో ప్రముఖ రచయితల రచనల పేర్లను పెడితే– ఆ రైళ్లను తల్చుకున్నప్పుడల్లా ఆయా సంస్కృతుల వైభవం మనసులో కదులుతుందని వారు అభిప్రా యపడ్డారు. ఈ మధ్య రోజుకో రైలు ప్రమాదం జరిగాక– వారు రైల్వే శాఖను వదులుకోవాలని నిర్ణ యించుకున్నాక ఈ ఆలోచన వచ్చిందో లేక ముందే వచ్చిందో మనకు తెలీదు. ఏమైనా సురేష్ ప్రభు గారికి ఆయా భాషల రచనల అవగాహన తక్కువని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మొన్నటి దురంతో ఎక్స్ప్రెస్కి ప్రముఖ రచన ‘స్మశానవా టిక’ పేరు ఉంచి– ‘స్మశాన వాటిక ఎక్స్ప్రెస్’ అన్నారను కోండి– ఆ పేరు సార్థకమయి పోయినట్టే లెక్క. అలాగే తెలుగు వారంతా గర్వించే ‘చివరకు మిగిలేది’ నవల పేరు అటు మొన్న యాక్సి డెంటైన కాలిఫియాత్ ఎక్స్ ప్రెస్కు– ‘చివరకు మిగిలేది ఎక్స్ప్రెస్’ అని ఉంచితే సార్థ కమయ్యేది. మన తెలుగు వారు గర్వించే మరో గొప్ప రచన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’. అటు మొన్నటి ఉత్కల్ ఎక్స్ప్రె స్ని ‘మహాప్రస్థానం ఎక్స్ప్రెస్’ అని ఉంటే? గత 5 ఏళ్లలో 586 రైలు యాక్సిడెంట్లు జరిగాయ న్నారు. ఎన్ని రైళ్లకు ఏయే కళాఖండాల పేర్లు పెట్టి మనం సమర్థించగలం? పలానా ఎక్స్ప్రెస్ని ‘అరి కాళ్లకింద మంటల ఎక్స్ప్రెస్’ అందామా? ‘కర్రా చెప్పులు ఎక్స్ప్రెస్’ అందామా? గోదావరి ఎక్స్ ప్రెస్ని ‘అయ్యో పాపం ఎక్స్ప్రెస్’ అందామా? కళాఖండాల పేర్లు ముట్టుకుంటే గొడవల్లో పడ తామని నాకనిపిస్తుంది. ఏమైనా ఇన్నాళ్లకి ఇలాంటి ఆలోచన చేసే మంత్రిగారు రావడం మన అదృష్టం. ఈ దేశంలో జంతు ప్రదర్శన శాలలకు, విమానా శ్రయాలకి, ట్రస్టులకి, అడ్డమైన పథకాలకీ ఇంది రాగాంధీ, రాజీవ్గాంధీ పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీని ఎవడు అడిగాడు? మన రోజులు బాగుండి కాంగ్రెస్ పదవిలో లేదు కనుక మనం బతికి పోయాం కానీ ఈ పాటికి ‘రాహుల్ గాంధీ’ సంస్థలు పాతికా, ప్రియాంకా గాంధీ సంస్థలు మరో 30 వెలిసి ఉండేవి. మళ్లీ మాట్లాడితే ‘మౌరీన్ వాద్రా’ పేరుతో మనకు డజను సంస్థలు వచ్చేవి. ఎవరీ మౌరీన్? మన ప్రియాంకాగారి అత్తగారు. మన దేశంలో స్వామి భక్తి పట్టిన, మేధావులు 70 సంవ త్సరాలుగా మన నెత్తిన పెట్టిన దరిద్రమిది. ఇప్పుడు కొన్ని వైభవాలు చూద్దాం. మన హైద రాబాద్ విమానాశ్రయం– రాజీవ్గాంధీ విమానా శ్రయం. చెన్నై విమానాశ్రయం– కామరాజ్ విమానా శ్రయం. కానీ ఇటలీలో ఒక విమానాశ్రయం పేరు గెలీలియో విమానాశ్రయం. గెలీలియో అనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుని పేరుని అజరామరం చేసుకున్న చిన్న దేశమది. మరొక విమానాశ్రయం ‘మైకెలాం జిలో విమానాశ్రయం’. మైకెలాంజిలో గొప్ప శిల్పకా రుడని గుర్తు చెయ్యనక్కరలేదు. మరొకటి ‘లియో నార్డో డివించీ ఎయిర్పోర్ట్. తను సృష్టించిన పాత్రను చిరంజీవిని చేసిన ఓ మహా రచయిత ఆర్ధర్ కోనన్ డాయిల్. ఆయన సృష్టించిన పాత్ర షెర్లాక్ హోమ్స్. లండన్ బేకర్ స్ట్రీట్లో ఇల్లు ఆ పాత్రది. ఇప్పటికీ బేకర్ స్ట్రీట్లో రైలు ఆగగానే గోడనిండా గొప్పగా షెర్లాక్ హోమ్స్ బొమ్మ కనిపిస్తుంది. విజ య నగరం స్టేషన్లో 125 సంవ త్సరాల చరిత్ర ఉన్న మహా కళాఖండాన్ని సృష్టించిన గుర జాడ ‘గిరీశం’ కనిపిస్తాడా? మన రాజకీయ నాయకుల్ని అడగండి. ‘ఎవరు బాబూ ఈ గిరీశం?’ అంటారు. ఏతావాతా, నేను సురే ష్ప్రభు గారిని అభినందిస్తు న్నాను. మన నెత్తిన ‘రాబర్ట్ వాద్రా విశ్వవిద్యాలయం’, ‘మిరయా విశ్వవిద్యాలయం’ (అన్నట్టు మీకీ పేరు తెలియదు కదూ? గత మూడేళ్లు ‘10 జనపథ్’ మేడమ్ ఈ దేశాన్ని పాలించి ఉంటే ఈపాటికి తమరు ఈ పేరుని గాయత్రిలాగా జపం చేసేవారు. ఇది ప్రియాంకా కూతురు పేరు) అనే ఆలోచనా పరిధి నుంచి బయటికి వచ్చి ఆలో చించే మంత్రులు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ నాదొక విన్నపం. ఆయా మహా రచయి తల రచనలు కాక– వారి పేర్లనే చిరస్మరణీయం చేయండి. చక్కగా దురంతో ఎక్స్ప్రెస్ని ‘శ్రీశ్రీ ఎక్స్ ప్రెస్’ అనండి లేదా ‘గోపీచంద్ ఎక్స్ప్రెస్’ అనండి. పాలక కుటుంబాల అడుగులకు మడుగులొత్తే సంస్కృతి నుంచి బయటపడాలన్న ఆలోచన ఈ దేశానికి మంచి శకునం. ఈ జాతిని సుసంపన్నం చేసిన చారిత్రక పురుషుల్ని ప్రతిదినం స్మరించు కోవడం జాతి సంస్కారానికి బంగారు మలామా చేయడం. చరిత్రను పునర్నిర్మించుకోవడం అంటే ఇదే. గొల్లపూడి మారుతీరావు -
రాబందు రెక్కల చప్పుడు
జీవన కాలమ్ కోట్లమంది విశ్వాసం పెట్టుబడితో విర్రవీగితే ఏమవుతుంది? డేరా సచ్చా సౌదా అవుతుంది. కోట్లమంది ఓట్లను దండుకునే రాజకీయ పార్టీల కక్కుర్తికి ఆధారమౌతుంది. ఈ మధ్యలో ‘దేవుడు’ అటకెక్కిపోతాడు. పాపం, దేవుడు నిస్సహాయుడు. అడ్డమయిన వాళ్లకీ కొంగు బంగారమవుతాడు. అయితే, హేతువాదులు కొంగుల్ని మరిచిపోయి బంగారాన్ని తప్పు పడతారు. నిజమైన విశ్వాసం నికార్సయిన సౌందర్యం. పబ్బం గడవడానికి పెట్టుబడిగా ఉపయోగించే విశ్వాసం– భయంకరమైన వికృతం. అందువల్లనే విశ్వాసం పెట్టుబడిగా ఉన్న, ప్రతీదీ వీధిన పడుతోంది. ఇలాంటి విశ్వాసానికి వికటమైన రూపం– డేరా సచ్చా సౌదా గుర్మిత్ రామ్ రహీమ్. చానళ్ల పేర్లు అనవసరం. ఒకాయన పెద్ద బొట్టుతో, దుశ్శాలువాతో టీవీ తెర అంతా ఆక్రమించి కూచుంటాడు. విశ్వాసాన్ని నమ్ముకున్న ఒక తల్లి ‘రెంట చింతల’నుంచి అడుగుతుంది– మా రెండో అబ్బాయికి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలి బాబూ– అని. ఈయన చెప్తాడు– ‘‘ప్రతీ బుధవారం మర్రి ఆకు నెత్తిన పెట్టుకుని, దాని మీద చింతగింజని ఉంచి స్నానం చెయ్యమనండి. ఆరువారాలు చేశాక– కావిరంగు పంచె కట్టుకుని మీ ఊళ్లో ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఆ చింతగింజని పాతిపెట్టమనండి. ఆరో రోజుకి ఉద్యోగం రాకపోతే నాదగ్గరికి రండి 1,500 రూపాయల తావీజు కడతాను’’అంటాడు. ఇది విన్నాక–దిక్కుమాలిన జ్యోతిషం మీదా, దేవుడిమీదా నమ్మకం మంటగలవకుండా ఎందుకుంటుంది? విశాఖపట్నం బీచిలో తెన్నేటి పార్కు ఎదురుగా పేవ్మెంట్ మీద చిలక జ్యోతిష్కులు ఉంటారు. తోక తెగిన చిలక బోనుల నిస్సహాయంగా బయటికి వస్తుం ది. దానికి రెండే అలవాట్లు– బొత్తిలో కార్డు లాగితే బియ్యం గింజలు వస్తాయి. లాగుతుంది. ఆ కార్డు ఈ ‘మనిషి’ భవిష్యత్తు. ‘‘నీ కూతురి పెళ్లి ఈ సెప్టెంబరులో అవుతుంది’’ అంటాడు చిలకయ్య. అది అయిదు రూపాయల సంతోషం– పల్లెటూరి మనిషికి ఇక్కడ పెట్టుబడి ఏమిటి?– విశ్వాసం. మనిషి ఆశకి ఊతం కావాలి. దాన్ని ఎదుటి వ్యక్తి కలిగిస్తున్నాడన్న నమ్మకం రావాలి. అందుకూ చెల్లింపు. దానికి చిలక స్థాయి చాలు రైతుకి. దేవుడిని చంకన ఎత్తుకుని తాను దేవుడి ప్రతినిధినంటూ– వెనుకబడిన వర్గాల తరఫున ముందుపడిన ‘రాబందు’ జిగ జిగా మెరిసే కళ్లజోళ్లతో, అమెరికా మార్కు బనీన్లతో, అందంగా దువ్విన గెడ్డంతో, స్ఫురద్రూపంతో, పాప్ పాటలతో, సినిమా నిర్మాణ సంరంభంతో, మెర్సిడిస్ కార్ల హంగులతో, కోట్లమంది విశ్వాసం పెట్టుబడితో విర్రవీగితే ఏమవుతుంది? డేరా సచ్చా సౌదా అవుతుంది. కోట్లమంది ఓట్లను దండుకునే రాజకీయ పార్టీల కక్కుర్తికి ఆధారమౌతుంది. ఈ మధ్యలో ‘దేవుడు’ అటకెక్కిపోతాడు. ఇప్పుడు చిలక స్థానంలో రాబందు ఉంది. ఇక ‘రాబందు’కి కొదవేముంది? విశ్వాసాన్ని ఆధారం చేసుకున్న ఎందరు బాబా లు? విశ్వాసానికి కొలబద్ధలు లేవు. ప్రజల ఎగబాటే వారి శక్తి. హర్యానా సత్యలోక్ ఆశ్రమాధిపతి రామ్పాల్ బాబా లీలలు, స్వాధీన్ భారత్ సుభాష్ సేన రామ్ వృక్ష యాదవ్, బెంగళూరులో ధ్యాన్ పీఠానికి చెందిన నిత్యానంద లీలలు, ఇంకా ఒక కొలిక్కిరాని ఆశారామ్ లీలలు, సనాతన్ ధన్ హుగ్లీ బాలక్ బ్రహ్మచారి– ఇలా ఎందరు? తనని నమ్మ వచ్చిన ఇద్దరు మహిళల్ని మానభంగం చేసి, గర్వంగా 15 సంవత్సరాలు కేసు నడిపి, తన చుట్టూ ఉన్న ‘దన్ను’ కారణంగా తనకేమీ జరగదని గర్వంగా రొమ్ము విరిచి, మొన్నటి తీర్పుకి 300 కార్లతో విహారంగా వచ్చిన ‘గ్లామరు’బాబా 20 ఏళ్లు జైలుశిక్ష పడ్డాక కోర్టులో ‘‘నన్ను క్షమించండి మొర్రో’’అని నిస్సహాయంగా కూలబడి ఏడవడం ఎందుకు? ఇంతకాలం లక్షల మందిని నమ్మించి, చంకన ఎత్తుకున్న దేవుడు ఏమయ్యాడు? మతాన్ని, దేవుడిని ఎరచూపి– కింద మధ్యతరగతి ప్రజానీకం ‘విశ్వాసా’లను సమీకరించి వ్యవస్థల్ని ఏర్పరచుకున్న ఇలాంటి బాబాలు– ఇంకా మతంలోనూ, సంప్రదాయంలోనూ తమ మాలాలు ఉన్న ‘నిస్సహాయమైన’ వ్యవస్థకి పట్టే చీడపురుగులు. పాపం, తెన్నేటి పార్కుకి ఎదురుగా పేవ్మెంట్ మీద చిలక అతి చిన్న నమూనా. ప్రాథమికమైన విశ్వాసం అతని కొంగుబంగారం. ఉపాధి మాత్రమే అతని లక్ష్యం. కాని ఈదేశంలో దేవుడు, మతాన్ని పొగరుగా వ్యాపారం చెయ్యగల–దుర్మార్గమయిన స్వార్థానికి విశ్వరూపం గుర్మీత్ రామ్ రహీమ్. పంజాబు కట్టలు తెంచుకునే ఆవేశానికీ, పరిమితి లేని విశ్వాసానికి ప్రతీక. తాము నమ్మిన విలువలకి ప్రాణం ఇచ్చే స్వభావం ఆ జాతిది. ఇక్కడే జైన బౌద్ధ, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, సిక్కు మతాలు విస్తరించాయి, వేళ్లు నిలదొక్కుకున్నాయి. అయితే మధ్య మధ్య కుళ్లు చూపిన ఓ భయంకరమైన ‘వేరు’ కథ ఈ గుర్మీత్ రామ్ రహీమ్ది. మరో 20 ఏళ్లు– వెర్రి తలలు వేయించిన విశ్వాసానికి గమ్యాన్ని ఈ ‘రాబందు’ గుర్తు చేస్తూనే ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు -
మామా అల్లుళ్ల సవాల్
♦ జీవన కాలమ్ కాలం మారుతోంది. ట్రంప్ వంటి నాయకుల నుంచి ‘హెచ్1–బి’ వీసాల కరువునుంచి వాణిజ్యాన్ని కాపాడవలసిన అగత్యం ఈ తరానికి ఎంతయినా ఉంది. అందుకు విశాల్ సిక్కాల అవసరం ఎంతయినా ఉంది. మామ చక్కటి కూతుర్ని కన్నాడు. అల్లారుముద్దుగా 21 ఏళ్లు పెంచాడు. మొట్టమొదటిసారిగా పై ఇంటివాడిని అల్లుడిగా తెచ్చుకుని పిల్లని అతని చేతుల్లో ఉంచాడు. అక్కడితో ఊరుకోకుండా కూతురు కాపురాన్ని మేడమీదే పెట్టించి కింద కాపురం ఉన్నాడు. క్రమంగా అల్లుడిగారి ధోరణి మామగారికి నచ్చలేదు. ఆ దశలో నచ్చవలసింది తన కూతురికీ, అతని చుట్టూ ఉన్న మనుషులకీ కానీ తనకి కాదని మరచిపోయాడు మామ. ఎంతైనా కన్న కడుపు. కూతుర్ని ఎలా చూసుకోవాలో, అలా ఎందుకు చూసుకోకూడదో అల్లుడి చెవిలో ఇల్లు కట్టుకుని పోరడం ప్రారంభించాడు. అల్లుడు యోగ్యుడు. మామగారిమీద అమితమైన గౌరవం ఉన్నవాడు. పరోక్షమైన ఈ స్వారీని తట్టుకోలేక ఓ రోజు అల్లుడు లేచి చక్కాపోయాడు. స్థూలంగా ఇదీ ఇన్ఫోసిస్ కథ. నారాయణ మూర్తిగారు సజ్జనుడు. మహామేధావి. పదిమందిని కలుపుకునే స్వభావం కలవాడు. 1981లో ఇన్ఫోసిస్ని పూనాలో ప్రారంభించి, బెంగళూరులో నిలదొక్కుకుని 21 సంవత్సరాల ఆధిపత్యంలో దేశంలోకల్లా గొప్ప స్థాయిలో నిలిపి, గద్దెదిగి మరో పదేళ్లు చైర్మన్గా వ్యవహరించి, మొదటిసారి ప్రారంభకులను దాటి పైవాడిని తెచ్చి ఆధిపత్యం ఇచ్చారు. ఇచ్చారన్నమాటేగానీ, మరీ బాధ్యతా రహితంగా ఖర్చులు పెంచడం, ఉద్యోగం మానిపిం చిన రాజీవ్ బన్సల్కు 23.02 కోట్లను ముట్టజెప్పడం, ప్రైవేటు విమానాల్లో తిరగడం వంటివి మామగారికి నచ్చడం లేదు. నచ్చడం లేదని చెప్పే హక్కు లేని స్థితి నారాయణ మూర్తి గారిది. కారణం ఆయన కంపెనీలో కేవలం 3.44 శాతం వాటాదారుడు. కానయితే ఆయన నారాయణమూర్తి. ఇది బోర్డు మెంబర్లకు మింగుడుపడని ఇబ్బంది. వంటగదిలో జరిగే ప్రతీ వంటా– కింద కాపురం ఉంటున్న మామగారికి నచ్చ చెప్పాలి. తినేది అల్లుడు. అతను యోగ్యుడు. ఈ పితలాటకం నుంచి– నారాయణ మూర్తి మీద పూర్తిగా గౌరవం ఉన్న అల్లుడు ఏం చెయ్యాలి? ఓ మంచి రోజు చూసుకుని మూటా ముల్లె సర్దుకుని వాళ్ల ఊరెళ్లిపోయాడు. ఇదీ స్థూలంగా ఇన్ఫోసిస్ కథ. ఈ కథలో నీతి కాపురానికి పంపాక– కూతురుమీద ప్రేమ ఉండవచ్చు కానీ ‘అధికారాలు’ చెల్లవు. తీరా కల్పించుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఈ దేశంలో టాటా గ్రూపు తర్వాత అంత పెద్ద సంస్థ ఇన్ఫోసిస్. 2 లక్షల సిబ్బందితో 122 దేశాలతో సత్సంబంధాలు గల గొప్ప పేరున్న సంస్థ. నారాయణ మూర్తి దక్షతలో, నిజాయితీలో, నీతిలో పేరున్న మనిషి. కానీ పెళ్లయిన కూతురిమీద చెల్లనంత వ్యామోహం పెంచుకున్న మామగారు. అదీ చిక్కు. దాదాపు ఇలాంటి గొడవే ఆ మధ్య టాటా సంస్థలో జరిగింది. తమ కుటుంబానికి చేరువగా ఉన్న మనిషికి సైరస్ మిస్త్రీకి– కుటుంబంలోని ఆఖరి పెద్ద రతన్ టాటా ఆధిపత్యాన్ని ఇచ్చారు. కానీ కూతురు కాపురం మాట అలా ఉండగా ఇల్లు చెడిపోతోందని గ్రహించి అడ్డం పడ్డారు. ఇది చాలా ఇబ్బం దికరమైన పరిస్థితి. రతన్ టాటా పెద్దరికాన్ని ఎరి గిన వారికి ఇది విడ్డూరంగా కనిపించినా, ఆక్షేపణీ యం అనిపించలేదు. కాగా సైరస్ అల్లుడు కాదు. వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పెంపుడు కొడుకు. శృతి మించితే పెంపకాన్ని వదులుకునే హక్కు పెద్దాయనకి ఉంది. ఈ మధ్య ఇలాంటిదే మరో గొడవ. ఈ దేశం క్రికెట్ సంస్థ పాలనను సరిచేయడానికి ముగ్గురు పెద్దల్ని సుప్రీం కోర్టు నియమించింది. తగని ఖర్చులు పెడుతూ, కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉద్యోగులు– సీకే ఖన్నా, అమితాబ్ చౌదరీ, అనిరుధ్ చౌదరీలను తక్షణం బర్తరఫ్ చెయ్యాలని వీరు కోరారు.గమనించాలి. ఈ మూడూ మూడు రకాలైన వేర్వేరు కథలు. పిల్లనిచ్చిన మామగారు అల్లుడుగారు చేస్తున్న అనవసరమైన ఖర్చులు గురించి వాపోయారు– మొదటి కథలో. అసలు వారసుడి వ్యవహారమే బొత్తిగా నచ్చలేదు రెండో కథలో. తీరా మూడో కథ అల్లుళ్ల కథ కాదు. సుప్రీం కోర్టు మామని కాదు– కొత్త ‘మొగుళ్ల’ని తీసుకొచ్చి నిలిపింది. కనుక వారి డిమాండ్కి ప్రత్యామ్నాయం లేదు. ఏతావాతా ఇన్ఫోసిస్ దేశంలో పేరూ, ప్రతిష్టా ఉన్న సంస్థ. నారాయణ మూర్తి పేరూ, ప్రతిష్టని ఆర్జించిన వ్యక్తి. అయితే– తను పదవిలోకి వచ్చిన మూడేళ్లలో విశాల్ సిక్కా అనే యోగ్యుడైన మేధావి– ఇంతకాలం డాలరు–రూపాయిల వ్యత్యాసంతో లాభాలను సంపాదించుకునే సంస్థగానే మిగిలిపోకుండా దశ నుంచి cost-based నుంచి Innovation-based స్థాయికి పెరగనివ్వాలని ప్రయత్నించాడు. దీనిని మామలు గ్రహించాలి. కాలం మారుతోంది. వ్యాపారం రూపురేఖలు మారుతున్నాయి. ట్రంప్ వంటి నాయకుల నుంచి ‘హెచ్1–బి’ వీసాల కరువునుంచి వాణిజ్యాన్ని కాపాడవలసిన అగత్యం ఈ తరానికి ఎంతయినా ఉంది. అందుకు విశాల్ సిక్కాల అవసరం ఎంతయినా ఉంది. గొల్లపూడి మారుతీరావు -
చాపకింద నీరు
విశ్లేషణ జీవన కాలమ్ మానవాళి ప్రకృతిపై చేస్తున్న జులుంకి ప్రకృతి చాలా క్రూరంగా సమాధానం చెప్పబోతోంది. దానికి సూచనే ఈ మంచు శకలం విడివడటం. ఇది మానవుడు తెలిసి తెలిసి– తనకు తానే తవ్వుకుంటున్న భయంకరమైన గొయ్యి. మన చాపకిందకి నీరు వస్తేగాని మనం చెమ్మని గుర్తుపట్టం. ఈ దేశం మీద పరాయిదేశం దండయాత్ర చేసినా దక్షిణాదివారికి అది కేవలం వార్తే. కశ్మీర్ పొలిమేరల్లో పాకిస్తాన్ కాల్పులు జరుపుతూంటే– తమ జీవితాల్ని ప్రశాంతంగా గడిపే ఎన్నో సరిహద్దు కుటుంబాలను సైనిక దళాలు అప్పటికప్పుడు కదుపుతూంటాయి. పాక్ కాల్పులు మనకి వార్త. వారికి ప్రాణ సంకటం. అలాగే డోక్లాంలో చైనా దళాల మోహరింపు మనకు కేవలం వార్త. సరిహద్దు పల్లెలకు జీవన్మరణ సమస్య. యుద్ధం పంజాబ్లో ఎన్నో కుటుంబాలను పునాదులతో కదుపుతుంది. యుద్ధం కారణంగా సరిహద్దులో పుట్టిన తెలివైన కుర్రాడు చదువుకోలేక కేవలం కారు మెకానిక్ కావచ్చు. కాని అమలాపురంలో, త్రివేండ్రంలో యుద్ధం కేవలం పేపరు చెప్పిన సంఘటన. నా చిన్నతనంలో ఇప్పటి విశాఖపట్నం పోర్టు ఉన్న చోట రెండు ఫర్లాంగుల దూరంలో సముద్రపు నీరు ఉండేది. ఇప్పుడు రోడ్డుదాకా వచ్చేసింది. ఇటీవల రామకృష్ణా బీచ్ దగ్గర సముద్రం దాదాపు రోడ్డుని కొట్టేసింది. ఎందుకని? ఏమో. అది మన చాపకాదు. మరో ముపై్ఫ ఏళ్లకు ఇప్పటి జలాంతర్గామి మునిగిపోవచ్చు. కొత్తగా పెడుతున్న విమానం నీటిలోకి పోవచ్చు. ఈ విషయం ఏ కలెక్టరూ చెప్పలేడు. కొన్ని లక్షల సంవత్సరాల కింద దక్షిణ ధ్రువం నుంచి విడిపోయిన గోండ్వానా భూమి ఖండాలయింది. దేశ పటాలను చూస్తే పశ్చిమ భారతం సరిగ్గా తూర్పు ఆఫ్రికా తీరానికి అతుక్కుపోతుంది. కొన్ని లక్షల సంవత్సరాలలో రెండు వేర్వేరు సంస్కృతులు ఆయా దేశాలలో నిలదొక్కుకున్నాయి. ఇప్పటికీ తూర్పు ఆఫ్రికా దేశాలలో గోపాలురు ఉన్నారు. వారి అష్ట భార్యలున్నారు. నేను చూశాను. అందరూ కలసి ఒకచోటే జీవిస్తారు. వారు నల్లనివారు. పద్మనయనమ్ములవారు. సింహబలురు. ఆఫ్రికాలో సింహాలు ఒక్క ఈ గోపాలురను చూస్తేనే పారిపోతాయి! ఏమయినా ఇది ఆంత్రోపాలజిస్టులు తేల్చవలసిన కథ. ఇప్పుడీ కథకు పెట్టుబడి– ఇటీవల అంటార్కిటిక్ ధ్రువంలో మంచు గడ్డ నుంచి 12 ట్రిలియన్ టన్నుల ముక్క విడిపోయి భూమి వేపు ప్రయాణం చేస్తోంది అని చదివాం. ఇది బొత్తిగా పొరుగువాడి చాప. ట్రిలియన్ అంటే? ఒకటి తరువాత 12 సున్నాలు. ఇలా చెప్పినా మన మనస్సుల్లో ఒక దృశ్యం రాదు. దాదాపు మన హర్యానా రాష్ట్రం కన్నా పెద్దది– కది లింది. ఇప్పుడేమవుతుంది? ఈ గ్రహం మీద మూడు వంతులు నీరు. ఒక వంతే నేల. నీరు కొన్ని కోట్ల మైళ్ల మేరకు అంటార్కిటిక్ ప్రాంతంలో ఘనీభవించి ఉండ డం వల్ల– మన దేశాలను అంటిపెట్టుకుని ఉన్న సముద్ర మట్టాలు ఇలా స్థిరంగా ఉన్నాయి. మరి రామకృష్ణా బీచ్ దగ్గర సముద్రం వెర్రితలలు వేయడానికీ, ఈ హరియాణా పరిమాణంలో మంచు తెగిపడడానికీ సంబంధం ఉందా? ఉంది బాబూ ఉంది. భూమి ఉపరితలం నానాటికీ వేడెక్కి– మంచు కరిగి– ఈ గ్రహం మీద మిగిలిన ఆ కాస్త భూమినీ ఆక్రమించుకుం టోంది. నేను ఆ మధ్య నార్వేలో ‘‘అరోరా బోరియాలిస్’ అనే ప్రకృతి వైభవాన్ని చూడడానికి వెళ్లాను. ట్రోమ్సో అనే ఊరు భూమికి కొన. అక్కడికి 2,500 మైళ్ల వరకూ సముద్రమూ, మంచూ ఉంది. అంటే ‘‘కరగని’ మంచు ఈ భూమిని ఎంత కాపాడుతోందో ఊహించవచ్చు. మరి ఈ నీరు తిరగబడితే? కరిగితే? అదిన్నీ– ఓ హరియాణా అంత మంచు ముక్క విరిగి భూమిని ఆక్రమించుకుంటే? ఇంత పెద్ద విషయాన్ని పామర జనానికి–అంటే మీకూ నాకూ అర్థమయ్యేటట్టు చెప్పడానికి తంటాలు పడుతున్నాను. మొన్న పారిస్ పర్యావరణ సమావేశంనుంచి ట్రంపు దొరగారు– ఈ పర్యావరణ కాలుష్యానికి మా ప్రమేయం లేదు అని సెలవు తీసుకున్నారు కానీ– రేపు తడిసే చాపల్లో వారి చాప పెద్దది. వాతావరణ నిపుణుల మాటల్ని వీలయినంత చిన్న పదాలలో చెప్పడానికి ప్రయత్నిస్తాను: మానవాళి ప్రకృతిపై చేస్తున్న జులుంకి ప్రకృతి చాలా క్రూరంగా సమాధానం చెప్పబోతోంది. దానికి సూచనే ఈ మంచు శకలం విడివడటం. మానవుడు చేస్తున్న అనర్థాన్ని సామూహిక చర్య ద్వారా సవరించవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. పర్యావరణం వేడెక్కడం ఒక నమూనా అనర్థం. ఈ అనర్థానికి పెద్ద వాటా అమెరికాది. కళ్లుమూసుకుని ‘‘నన్ను ముట్టుకోకు’’ అని పెదవి విరిస్తే మన చేతల్తో మనమే మన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు. ఇందులో తిలాపాపం తలా ఒక్కరిదీ ఉంది. రాబోయే దశాబ్దాలలో ఉత్తర హిందూదేశం, దక్షిణ పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని 1.5 బిలియన్ల ప్రజలు భరించలేని వడగాడ్పులకు లోనవుతారని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. అప్పుడు జనాభా 70 శాతం పెరుగుతుంది. కనీసం రెండు శాతం ఈ వేడికి ఆహుతయిపోతారు. అయితే మన అదృష్టం – మనం అప్పటికి ఉండం. కాకపోతే– మనం మన పిల్లల సంక్షేమాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నిష్క్రమిస్తాం. అంటార్కిటిక్ ప్రాంతంలో ఈ మంచు శకలం విరిగిపడడం– మానవుడు తెలిసి తెలిసి– తనకు తానే తవ్వుకుంటున్న భయంకరమైన గొయ్యి. సర్వనాశనానికి సూచన. ‘‘ప్రళయం’’ వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయంటారు. గొల్లపూడి మారుతీరావు -
ఖాండవ దహనం
విశ్లేషణ కాలిపోయిన ఆయా కీలక విభాగాల ఫైళ్లలో ఎంతమంది మహానుభావుల గోత్రాలు శాశ్వతంగా నేలమట్టమయ్యాయో మనకి తెలీదు. అవినీతికి అవకాశాలెక్కువ. నీతికి విస్తృతి తక్కువ. చాలా సంవత్సరాల కిందట చెన్నై హైకోర్టులో ఒక కేసు నడిచింది. కేసు ఓడిపోతే గవర్నమెంటుకి మేం 30 లక్షలు కట్టాలి. చేతిలో అంత సొమ్ము లేదు. కేసు త్వరగా పరి ష్కారం అయిపోయే సూచనలు కనిపించాయి. నేను కంగారు పడడాన్ని మా న్యాయవాది గ్రహించాడు. కారణం చెప్పాను. ‘‘మరేం ఫర్వాలేదు సార్. కేసుని ఎంతకాలం వాయిదా వేయాలో చెప్పండి’’అన్నాడు. నేను తెల్లబోయాను. ‘‘అదెలా సాధ్యం?’’ అన్నాను. నవ్వాడు న్యాయవాది. ‘‘ఈ దేశంలో కావలసినన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. కేసు ఆరు నెలలు వాయిదా పడాలా? రెండేళ్లు వాయిదా పడాలా? లేక శాశ్వతంగా నిలిచిపోవాలా? ప్రతి పనికీ రేట్లున్నాయి’’ అన్నాడు. ‘‘ఎలా?’’ అని తెల్లబోయాను. ‘‘రెండు నెలలు వాయిదా పడాలంటే – కరెక్టుగా డిపార్టుమెంటులో మీ కేసు ఫైలు మాయమయిపోతుంది. మళ్లీ కావలసినప్పుడు కనిపిస్తుంది. మంచి ధర చెల్లిస్తే శాశ్వతంగానూ మాయమయిపోగలదు’’ అన్నాడు. మరో సరదా అయిన కథ. అలనాటి మద్రాసులో 1985 వరకు రచయితలకు, పరిశోధకులకు, జిజ్ఞాసువులకు ఆటపట్టయిన ఒక మార్కెట్ ఉండేది– ఇప్పటి సెంట్రల్ స్టేషన్ని ఆనుకుని. దాని పేరు మూర్ మార్కెట్. అక్కడ పుస్తకాల షాపుల్లో – ఆరోజుల్లో దొరకని పుస్తకం లేదు. ఆ షాపుల వాళ్లు తమిళులు. అయినా సంవత్సరాల తరబడి – అనుభవం వల్ల– చాలా విజ్ఞతనార్జించినవారు. వారికి ముద్దుపళని ‘రాధికా సాంత్వనము’ తెలుసు. ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ తెలుసు. నార్ల వెంకటేశ్వరరావు గారిని తెలుసు. ఆరుద్రని తెలుసు. డి. ఆంజనేయులు గారిని తెలుసు. బులుసు వెంకట రమణయ్య గారిని తెలుసు. వీరందరికీ ఆ మార్కెట్ విజ్ఞాన భాండాగారం. అలాగే సైన్స్, ఖగోళ ఇతర విభాగాల ప్రముఖులూ అక్కడ ప్రతిదినం కనిపించేవారు. అదొక విజ్ఞాన కూడలి. దరిమిలాను సెంట్రల్ స్టేషన్లో రద్దీ పెరిగి, దాని విస్తృతి చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ మూర్ మార్కెట్ని తొలగించాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది. మేధావులు హాహాకారాలు చేశారు. సంపాదకుని లేఖలు రాశారు. మేయర్కి హెచ్చరికలు చేశారు. గవర్నమెంటుకి వారి కిటుకులు వారికి ఉన్నాయి. అప్పటికి కిమ్మనకుండా నోరు మూసుకుంది. 1985 మే 30వ తేదీ అర్థరాత్రి – నగరం నిద్రిస్తున్నప్పుడు మూర్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. కోట్ల విలువయిన పుస్తకాలు, షాపులు నేలమట్టమయ్యాయి. అందరూ నిశ్చేష్టులయ్యారు. తెల్లవారే సరికి మూర్ మార్కెట్ లేదు. ఆ మధ్య హుద్హుద్ జల ప్రళయం పెట్టుబడిగా ఎంత మంది రెవెన్యూ అధికారులు ఎన్ని ఫైళ్లను నీటిపాలు చేశారో, తత్కారణంగా ఎంతమంది భూబకాసురులకు కలసి వచ్చిందో ఇప్పుడిప్పుడే కథలు బయటికి వస్తున్నాయి. చాలామంది రెవెన్యూ అధికారుల గోత్రాలు రోజూ పత్రికల్లో వెల్లివిరుస్తున్నాయి. ఎంతోమంది తాసీల్దారుల లీలలు చదువుకుంటున్నాం. దేశంలో ఒక పక్క నితీశ్ కుమార్గారి హఠాత్ మానసిక పరివర్తన, నవాజ్ షరీఫ్ సాహెబ్గారి హఠాత్ పదవీ చ్యుతి వంటి ‘రుచి’కరమయిన వార్తలు చదువుకుంటున్న నేపథ్యంలో – వార్తాపత్రికల్లో ఆరవ పేజీలో అంగుళం మేర ఒక వార్త ప్రచురితమయింది. చాలామంది చూసి ఉండరు. చూసినా పట్టించుకుని ఉండరు. అది– ఢిల్లీ ఖాన్ మార్కెట్లోని లోక్నాయక్ భవన్లో ఘోర అగ్నిప్రమాదం. 26 అగ్ని మాపక దళాలు ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించాయి. అంటే ఆ అగ్నిప్రమాదం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. ఏమిటి ఈ అగ్నిప్రమాదంలో విశేషం? ఆ లోక్నాయక్ భవన్లో మన సీబీఐ, ఎన్ఫోర్సుమెంట్ విభాగం (అంటే రాబడి పన్ను నిఘా విభాగం), రాబడి పన్ను విభాగం ఉన్నాయి. ఇవన్నీ ఈ దేశపు అవినీతి నిరోధానికి కీలక విభాగాలు. ఈ అగ్ని ప్రమాదంలో ఎన్ని ముఖ్యమయిన ఫైళ్లు నాశనమయిపోయాయి?ఎన్ని దొంగ లెక్కల ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి? ఎంతమందికి ఈ ‘ప్రమాదం’ ప్రమోదాన్ని ఇవ్వగలదు? మనకు తెలియదు. ఏ పెద్ద మనుషులు ఈ చక్కని ప్రమాదాన్ని ఎంత ఖర్చుతో నిర్వహించారు? మనదాకా రాదు. పోనీ, నిజంగా ఎవరి ప్రమేయం లేకుండానే ఈ ప్రమాదం జరిగిందనుకుందాం! రేపు–అతి నిజాయితీపరుడయిన ఏ ఖేమ్కా గారో పెద్ద కుర్చీలో కూర్చుని ‘‘ఫలానా మాల్యాగారి ఫైలు పట్రావయ్యా!’’ అంటే, గుమాస్తా చిరునవ్వు నవ్వి, ‘‘అది ఆ మధ్య జూలైలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది సార్!’’ అని సెలవివ్వగలడు. ఇచ్చినందుకు ఆయన ఇంటికి ఆ రాత్రి ఓ పెద్ద పార్సిలు మాల్యా గారి శుభాకాంక్షలతో చేరగలదు. ఇది కేవలం నమూనా ఊహ. కాలిపోయిన ఆయా కీలక విభాగాల ఫైళ్లలో ఎంతమంది మహానుభావుల గోత్రాలు శాశ్వతంగా నేలమట్టమయ్యాయో మనకి తెలీదు. అవినీతికి అవకాశాలెక్కువ. నీతికి విస్తృతి తక్కువ. అందుకనే హిట్లర్ కనిపించినంతగా శిబి చక్రవర్తి వదాన్యత కనిపించదు. గొల్లపూడి మారుతీరావు -
జైలు వైభవం
విశ్లేషణ ఆవిడ ఆనందంగా ఉన్నందుకు కాదు, 2 కోట్లు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిందని చెప్పిన పోలీసు డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ డి. రూపని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగారు బదిలీ చేశారు. ఇది కాంగ్రెసు ఘనత. జైళ్లు మనకు దేవాలయాలు. మన దేవుడు జైల్లో పుట్టాడు. ఆనాటి మహానుభావులంతా జైళ్లలో ఉన్నారు. ఒక్క పూనా యెరవాడ జైలులోనే మహాత్మా గాంధీ, నెహ్రూ, తిలక్, సుభాశ్చంద్ర బోస్, సావర్కర్ ప్రభృతులు ఉన్నారు. ఇప్పుడూ ఆ వైభవం కొనసాగుతోంది. ప్రస్తుతం ఓం ప్రకాశ్చౌతాలా గారు, పండిత్ సుఖ్రాంగారు జైల్లో ఉన్నారు. మొన్నటిదాకా లాలూగారు, అంతకు ముందు కనిమొళిగారు, ఏ. రాజా గారు ఉండి వచ్చారు. అది నిజంగా శిక్షా? లేక విశ్రాంతా? లేక భోగమా? మనకి తెలీదు. అదే ఆయా పెద్దమనుషులకు పెట్టుబడి. అవినీతి ఆఫీసర్లకు రాబడి. ఇలాంటి సౌకర్యాలు లోగడ అనుభవించినవారున్నారు. జెస్సికా లాల్ని కాల్చి చంపిన మనూశర్మకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాని వారు చుట్టపు చూపుగానే జైలుకి వెళ్లి, మిగతా సమయాల్లో బయటే ఉన్నారు. వారి తల్లికి ఆరోగ్యం బాగాలేదనే మిషతో బయటికి వచ్చారు. కాని వారి తల్లిగారు చండీగఢ్లో మహిళా క్రికెట్ జట్టుతో గడుపుతూండగా, మనూశర్మగారు ఢిల్లీలో నైట్క్లబ్బుల్లో గడుపుతూ, పోలీసు కమిషనర్గారి కొడుకుతో తగాదా పెట్టుకున్న సంగతి వెలుగులోకొచ్చింది. అనుమతి ఇచ్చినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్గారి మీద విమర్శలు వచ్చాయి. జైలు శిక్ష పడగానే ఎటువంటివారికయినా హఠాత్తుగా గుండె నొప్పి వస్తుంది. లేదా కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్లు తప్పనిసరిగా ఆసుపత్రికి తరలించాలంటారు. అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో, చలువ గదుల్లో, ఇద్దరు ముగ్గురు అందమయిన నర్సులు సేవలు చేస్తూండగా వారు సేదదీర్చుకుంటారు. ఇందుకు గొప్ప ఉదాహరణ– నితీశ్ కటారాను చంపిన వికాస్ యాదవ్, విశాల్ యాదవ్. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాల్సిన వీరిద్దరూ ఇలాంటి సుఖాల్నే అనుభవించారు. వికాస్ యాదవ్ 98 సార్లు మాత్రమే విడిది చేశారు. విశాల్ యాదవ్ గారి అనారోగ్యం ఇంకా బలమైనది. వారు కేవలం 105 సార్లు మాత్రమే విడిది చేశారు. నిక్షేపం లాంటి కొడుకుని పోగొట్టుకున్న నీలం కటారా ఈసారి కోర్టుని–శిక్ష వేయాలని కాదు, వేసిన శిక్షని అమలు జరపాలని ఆశ్రయించారు. ఆ తల్లి ఆర్తిని గ్రహించిన సుప్రీం కోర్టు ఈసారి మన ఖరీదయిన ‘రోగులకు’ 30 ఏళ్లుగా శిక్షను పెంచింది. ఇవన్నీ మన జైలు ఆఫీసర్ల అవినీతిని ఆకాశంలో నిలిపే కథలు. ప్రస్తుతం జైళ్లలో ఇలాంటి వైభవం కొనసాగుతోందనడానికి నిదర్శనం శశికళగారు రాజభోగాలతో కర్ణాటక జైల్లో ఉండడం. అందుకు వారు కేవలం 2 కోట్లు ఖర్చు చేశారని మనకు తెలిసింది. వారు నలుగురిలాగా సాదాసీదా ఖైదీ. అయినా ఆవిడకి 5 వరస గదుల వసతిని జైలు పెద్దలు కల్పించారు. మధ్య గదిలో ఉంటూ మిగతా గదుల్లో ఆమె సరంజామా పెట్టుకుంటారు. ప్రత్యేకమైన వంటలు అమెకి చేయిస్తారు. హాయిగా నైటీలు వేసుకుంటారు. ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు సిల్కు దుస్తులు– చుడీ దార్లు వేస్తారు. టేపుల దుకాణం నడుపుకునే ఆవిడకు ఇంత డబ్బు ఎక్కడిది? జయలలిత డబ్బు ఆవిడ ఖాతాలోకి ఎంత చేరింది? పదవుల కోసం కొట్టుకుంటున్న ప్రస్తుత పార్టీ నాయకులకు ఇది పిడకల వేట. ఏతావాతా–ఆవిడ ఆనందంగా ఉన్నందుకు కాదు, 2 కోట్లు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిందని చెప్పిన పోలీసు డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ డి. రూపని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగారు బదిలీ చేశారు. ఇది కాంగ్రెసు ఘనత. ఎన్నోసారి? గత 17 సంవత్సరాలలో 26వ సారి. అంటే ప్రతీ ఏడెనిమిది నెలలకి ఒక్కో ట్రాన్స్ ఫర్ జరిగింది. లోగడ ఇలాంటి అడ్డదిడ్డమయిన ‘నీతి’ని పట్టుకు వేలాడినందుకు ఒకానొక ఐయ్యేయస్ ఆఫీసరు–ఖేమ్కాగారిని కాంగ్రెసు నాయకత్వమే బదిలీలు చేసి చేతులు కడుక్కుంది. ఎన్నిసార్లు? 27 సంవత్సరాలలో 47 సార్లు. ఆ మధ్య దుర్గా నాగ్పాల్ అనే సరికొత్త ఐయ్యేయస్కి ఉత్తరప్రదేశ్లో అఖిలేశ్ ప్రభుత్వం అధికారం ‘రుచి’ని చూపి నోరు మూయించిన కథ మనం చదువుకున్నాం. ఈ దిక్కుమాలిన నీతిపరులు మరీ శ్రుతి మించితే? ఏం జరుగుతుందో లోగడ ధనంజయ్ మహాపాత్రా గారి ద్వారా అవినీతిపరులు నిరూపించారు. చివరిగా డి. రూప అన్నమాట: ‘అవినీతి జరిగినప్పుడు–నోరు విప్పకపోతే–ఆ అవినీతికి పరోక్షంగా మనం మద్దతు ఇచ్చినట్టే.’ వ్యవస్థని ఎదిరించడానికి దమ్ము కావాలి. చిత్తశుద్ధి కావాలి. అకళంకమైన శీల సంపద కావాలి. అడ్డదారిన డబ్బో, పదవో దక్కించుకోవాలనే దేబ రింపు గల అవకాశవాదులకు ఇవన్నీ గగన కుసుమాలు. ఖేమ్కాలు, రూపలు, ధనంజయ్లూ అరుదుగా కనిపిస్తారు. దుర్గా నాగ్పాల్లు తొలిరోజుల్లోనే మూగపోతారు. ప్రతీ తరానికీ మహాత్ముడు పుట్టడు. నీతి నిప్పు. పాటించిన వారికి అది వెలుగు. తేజస్సునిస్తుంది. పాటించని వారిని కాలుస్తుంది. - గొల్లపూడి మారుతీరావు -
నిశ్శబ్ద పథికుడు
జీవన కాలమ్ ‘విజయం’ అనేది ఎవరిని వరిస్తుందో తెలియదు. తను నమ్మిన ఆదర్శాలకు రూపకల్పన చేసే మాధ్యమంలో విజయం కలిసి వస్తే ప్రకాశరావుగారు చాలామంది చెయ్యడానికి సాహసించని చిత్రాలు తీయగలిగేవారు. కొందరు జీవితం నుంచి నిశ్శ బ్దంగా శెలవు తీసుకుంటారు. కొందరు దాశరథి మాటల్లో ‘నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగ’ లాగ ఝంకారం చేస్తూ నిష్క్రమిస్తారు. కొందరు విస్తృతమైన పరిధులకు చేతులు సాచి, తమదైన పోరాటాన్ని జరిపి నిశ్శ బ్దంగా వెళ్లిపోతారు. అలాంటి సాహితీ బంధువు పి. సూర్యప్రకాశరావు. అలా చెప్తే చాలామందికి తెలీదు. నవభారత్ ప్రకాశరావుగారు. ఈనాటికీ వైభవోపేతంగా విజయవాడలో సాగే పుస్తక ప్రదర్శనోత్సవాలను ప్రారంభించిన వారిలో ప్రకాశరావుగారు ఒకరు. యుద్ధనపూడి సులోచనారాణి, కొమ్మూరి వేణుగోపాలరావు, మాదిరెడ్డి సులోచన రచనల్ని పాపులర్ చేసిన ఘనత ప్రకాశరావుగారిది. పుస్తక ప్రచురణలో చక్కని సంప్రదాయాన్ని నిలిపిన ప్రచురణకర్త. మొదట్లో ప్రకాశరావుగారు నవోదయా నిర్వహించేవారు. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే (1959) నా మొట్టమొదటి పుస్తకం– ‘అనంతం’ నాటికని అచ్చువేసిన ప్రచురణకర్త ప్రకాశరావుగారు. ఆ ఆనందం వర్ణనాతీతం. అప్పటికి ప్రకాశరావుగారితో కేవలం ఉత్తరాల పరిచయమే. తర్వాత మా సాన్నిహిత్యం విచిత్రమైనది. నన్ను మొట్టమొదటి నవలకు పురికొల్పింది ఆయనే. ఆ నవల ‘చీకటిలో చీలికలు’. ఆనర్స్ అవుతూనే ఢిల్లీ వెళ్లి– విజయవాడలో ఆంధ్రప్రభ ఉద్యోగానికి నార్ల, కపిల కాశీపతి వంటి వారి ఉత్తరాల్ని పట్టుకుని విజయవాడలో పూర్ణానంద సత్రంలో రసన సమాఖ్యలో దిగాను. అప్పటికి వారికి ‘రాగరాగిణి’ రాశాను. వచ్చిన రోజు సాయంకాలమే నా జేబులో ఉన్న 15 రూపాయలు ఎవరో కొట్టేశారు. ప్రకాశరావుగారికి చెప్పాను. గల్లాపెట్టె తెరిచి 13 రూపాయలిచ్చి శాంతి కేఫ్లో నెలవారీ భోజనం టికెట్ల పుస్తకం తెప్పించారు. జైహింద్ రోడ్డులో ఆయనకి తెలిసిన ఓ టైర్ల దుకాణం వెనుక గదిని ఏర్పాటు చేశారు. 8 రూపాయలకి మడత కుర్చీ కొన్నారు. అది నాతో పెళ్లయి, పిల్లలు పుట్టేదాకా ఉంది. ఎప్పుడు డబ్బు అయిపోయినా స్వయంగా నవోదయా గల్లాపెట్టె తెరిచి 5 రూపాయలు తీసుకునేవాడిని. రోజూ షాపు మూశాక– ఆ రోజు నేను రాసిన ‘చీకటిలో చీలికలు’ నవల భాగాలు విని ఇంటికి వెళ్లేవారు. మరో ఆరు నెలలకి ఆంధ్రప్రభలో ఉద్యోగం వచ్చింది. మరో నెలలో చిత్తూరు బదిలీ. అప్పటికి నవోదయా నుంచి బయటికి వచ్చి నవభారత్ బుక్ హౌస్ని ప్రారంభించారు. 56 సంవత్సరాల కిందట– హన్మకొండలో ఓ తెల్లవారుఝామున మూడున్నరకి జరిగిన నా పెళ్లికి నా మిత్రులు ఇద్దరే హాజరయ్యారు– నవభారత్ ప్రకాశ రావు, నవోదయా రామమోహనరావు. అప్పటికి ప్రచురితమయిన నా రచనల్ని వెల్వెట్ బైండు చేయించి మా ఆవిడకి బహూకరించారు. ఓసారి రాత్రి 11 గంటలకి హైదరాబాదులో తలుపుతట్టి– సరాసరి మద్రాసు తీసుకుపోయి– దర్శకుడు చాణక్యముందు కూర్చోపెట్టారు–కొత్త సినీమా చర్చలకి. ఆయన ఆలోచనలు విప్పి చెప్పగలిగింది ఒక్క నాకే. నేను ఆయన మౌత్ పీస్ని. నవభారత్ మూవీస్ పేరిట అక్కినేనితో తీసిన ‘రైతు కుటుంబం’ సినీమాకి నేను కథ, మాటల రచయితని. తాతినేని దర్శకుడు. పూర్ణచంద్రరావు, మేనేజరు (పీఏపీ) సుబ్బారావుగారు పార్ట్నర్స్. మంచి హిట్. ఆయన వామపక్ష భావాలున్న మనిషి. వాటిని ప్రతిఫలించే ‘ముగ్గురమ్మాయిలు’ చిత్రాన్ని ప్రత్యగాత్మతో ప్రారంభించారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మగారిచేత విజయవాడలో కూర్చుని సంభాషణలు రాయించారు. శర్మగారికి ఆ పనిలో అనుభవం లేదు. స్క్రిప్ట్ తిరగరాయాల్సిన పరిస్థితి. నేను రోజుకి 18 గంటలు పనిచేసే రోజులు. నా ఉద్యోగం, కథా చర్చలు– అన్నీ ముగించుకుని ఏ రాత్రి పదికో వచ్చేవాడిని. అప్పుడు ఆ సీన్ల రచన. ఓ మిత్రుడి కోసం భయంకరమైన ఒత్తిడి పడిన రోజులవి. తీరా సినీమాలో నా పేరు వేస్తానన్నారు. నేను సుతరామూ ఒప్పుకోలేదు. అది పద్ధతి కాదన్నాను. నెలల తర్వాత తమ్ముడు బోసుకిచ్చి నాకు నవరత్నాల ఉంగరం పంపారు. ఆ ఉంగరం నా చేతికి 45 సంవత్సరాల నుంచీ ఉంది– ఇప్పటికీ. ఏడు సంవత్సరాల కిందట అనారోగ్యంతో మంచం పట్టారు. తరచూ వెళ్లి చూసేవాడిని. ఆఖరుసారి వెళ్లింది– జనవరి 2. మాటలో బొత్తిగా సమన్వయం పోయింది. విచిత్రంగా ‘మీరొచ్చాకే ఈ మాత్రం మాట్లాడారు’ అన్నారు ఆయన భార్య. నిన్న వారమ్మాయి ఫోన్. కొన్నాళ్ల కిందట మంచం మీద నుంచి లేవబోయి కిందపడ్డారు. తుంటి ఎముక విరిగింది. అది ముగింపుకి నాంది. ‘విజయం’ అనేది ఎవరిని వరిస్తుందో తెలియదు. తను నమ్మిన ఆదర్శాలకు రూపకల్పన చేసే మాధ్యమంలో విజయం కలిసి వస్తే ప్రకాశరావుగారు చాలామంది చెయ్యడానికి సాహసించని చిత్రాలు తీయగలిగేవారు. ఆయన అపజయాన్ని అంగీకరించని యోధుడు. అరుదైన మిత్రుడు. - గొల్లపూడి మారుతీరావు -
అవినీతీ! నీవెక్కడ?
♦ జీవన కాలమ్ సమాధానాలు చాలామందికి తెలుసు. అవినీతికి పెట్టుబడి అవసరం మాత్రమే కాదు, చెల్లుబాటు అవుతుందన్న ధైర్యం. అవినీతి వ్యవస్థ బలహీనతకి నిదర్శనం. నాయకత్వ శీలానికి ప్రతిబింబం. ఒకానొక అధికార సంస్థ 20 రాష్ట్రాలలో జరిపిన సర్వేలో దేశంలో అవినీతి నిలదొక్కుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి రెండవ స్థానం లభించింది. మొదటి స్థానం కర్ణాటకకి దక్కింది. అలనాడు రాజగోపాలాచారి సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఒకమాటన్నారు. ‘‘అవినీతిలో తమిళ ఇంజనీర్లకీ, తెలుగు ఇంజనీర్లకీ తేడా ఉంది. తమిళ ఇంజనీర్లు పనిచేసి లాభాలలో వాటాల్ని తింటారు. తెలుగు ఇంజనీర్లు కంకరనే తినేస్తారు’’అని. ఆయన అత్యంత కుశాగ్రబుద్ధి కలవారు. డిపార్టుమెంటు పేరు, పని చెప్పకుండా ఒక తెలుగు ఉదాహరణ. ఒక రిటైరయిన యూనివర్సిటీ ప్రొఫెసరు గారు– ఆయన వయసు 84 సంవత్సరా లు–ఒకానొక డిపార్టుమెంటులో పనికావలసి ఉంది. రెండ్రోజులలో కొడుకు అమెరికా వెళ్లిపోతున్నాడు. ఈలోగా జరగాలి. స్వయంగా ఫలానా ఆఫీసుకి వెళ్లారు– తన హోదాకీ, వయసుకీ మర్యాద దక్కుతుందనే దురభిప్రాయంతో. అతి సాదా ఉద్యోగి ముందు కూర్చున్నారు. అరగంట సేపు ఆ ఉద్యోగి కాగితాలు సవరించుకుంటూ కూర్చున్నారు– ఈయన్ని గమనించక. ఎట్టకేలకు ఆయన కరుణా వీక్షణం ప్రసరించింది. పని చెప్పారు. సదరు ఉద్యోగి టేబిలు మీద ఉన్న కాగితాలను పరామర్శించారు. ‘మీ కాగితం ఇక్కడ లేదండి’అన్నారు. ‘మర్కెడ ఉంటుంది?’ ‘అదిగో, ఆ నల్లచొక్కా ఆయన టేబిలు మీద’ నల్లచొక్కా కూడా ఇలాగే పనిలో మునిగిపోయాడు. తీరా వీరి కథ విని ఆయన కాగితాలు కూడా కదపలేదు. ‘నా దగ్గర ఏ కాగితమూ ఉండదండి’అని తేల్చారు. ‘మర్కెడ ఉంటుంది?’ ‘అదిగో, ఆ ఎర్రచొక్కా దగ్గర’ అక్కడా మరో 40 నిమిషాలు గడిచాక ఇదే పరిస్థితి. ఈలోగా దూరం నుంచి చూస్తున్న మరో ఉద్యోగి వచ్చాడు. పక్కకి పిలిచాడు. ‘‘అయ్యా, గంటన్నర నుంచి చూస్తున్నాను. తమరు పెద్దవారు. ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతోంది. నేనో ఉపాయం చెబుతాను. రెండువేలు ఇవ్వండి. రేపు మీ ఇంటికి కాగితాన్ని నేను తెచ్చి ఇస్తాను’’ అన్నాడు. ఈయన డబ్బిచ్చాడు. కాగితం ఇంటికి ఫలానా ఎర్రచొక్కా దగ్గర్నుంచి వచ్చింది. ఉండబట్టలేక వెళ్లిపోతున్న ‘నిజాయితీ’పరుడైన ‘అవినీతి’పరుడిని ఈ వెర్రి ప్రొఫెసరు అడిగారు, ‘‘ఈ డబ్బులో తమకూ వాటా ఉందా బాబూ!’’అని. చదువుకున్న వెర్రిబాగుల వాడిని చూసి ఆయన నవ్వాడు. ‘‘తమరు పెద్దవారు. అలాంటివి అడక్కూడదు’’ అనేసి వెళ్లిపోయాడు. ఇదీ కథ. అవినీతిలో మన తర్వాతి స్థానంలో ఉంది తమిళనాడు. తమిళ ఉద్యోగి ‘అవినీతి’లో అతి నిజాయితీపరుడు. మీరు డబ్బు ఇచ్చేదాకా మీ మొహం చూడడు. తీరా ఇచ్చాక– అంత నిజాయితీపరుడైన సేవకుడు మరొకడు ఉండడు. ‘‘తమరు ఇంటికి వెళ్లండి యజమానీ (‘యజమానీ’అన్నమాటను గుర్తించాలి). నేనెందుకు ఉన్నాను యజమానీ! నా ప్రాణం పోయినా తెల్లవారేసరికి మీ కాగితం మీ చేతుల్లో ఉంటుంది’’ అని కళ్లనీళ్ల పర్యంతం అవుతాడు. తమిళ ‘అవినీతిపరుడి’కి ‘లంచం’ఒక అవకాశం. తెలుగు ‘అవినీతిపరుడి’కి ‘లంచం’ ఒక హక్కు. ‘‘డబ్బు ఇచ్చాను కదండీ!’’అన్నారనుకోండి– ‘‘ఇస్తే? నీ కాగితం నీ దగ్గరికి నడిచి వస్తుందా? నీలాంటి వాళ్లు బోలెడుమంది ఉన్నారు. ముష్టి మూడువందలు ఇచ్చాడట. వెళ్లు. మధ్యాహ్నం కనబడు’’– ఇదీ తెలుగు నమూనా. ‘‘యజమానీ! నీకు సేవ చేయడానికి కాక నేనెందుకు ఉన్నాను, యజమానీ!’’ ఇది తమిళ నమూనా. సమాధానాలు చాలామందికి తెలుసు. అవి నీతికి పెట్టుబడి అవసరం మాత్రమే కాదు, చెల్లుబాటు అవుతుందన్న ధైర్యం. అవినీతి వ్యవస్థ బలహీనతకి నిదర్శనం. నాయకత్వ శీలానికి ప్రతి బింబం. మరొక అడుగు ముందుకు వేస్తే – పాలకవర్గం చేతులకి గాజులు తళతళా మెరుస్తున్నప్పుడు – సర్వే సర్వత్రా– చెప్పులు గాలిలోకి లేస్తాయి. చివరిగా– ఒక కొసమెరుపు. విశాఖపట్నం కళాభారతిలో నెలకి 20 రోజులు మంత్రులు, గవర్నర్లు, నాయకులు వచ్చే సభలు జరుగుతాయి. నగరంలో ప్రముఖమయిన ఆడిటోరియం అది. ప్రతీ సోమవారం కొన్ని వందలమంది ఆ వీధిని కమ్మేస్తారు. కారణం– సంత. ప్రతి అంగుళం రోడ్ల మీద వ్యాపారాలు పరుచుకుంటాయి. కార్లు, మనుషులు నడిచే దిక్కులేదు. రాత్రి 10 వరకూ భయంకరమైన గోల, ముమ్మరం. ఇదేమిటి? నగరంలో, ఇంత ప్రముఖమయిన వీధిలో సంతా? అధికారులకి తెలియదా? కార్పొరేషన్ అధికారులు గుర్తించలేదా? పోలీసులు గమనించలేదా? నేను ఎందరికో చెప్పాను. ఉత్తరాలు రాశాను. ఫలితం సున్నా. దక్షిణ భారతంలో స్వచ్ఛ నగరంగా, తలమానికంగా నిలిచిన విశాఖ పట్నానికి కళాభారతి ‘సంత’ మినహాయింపేమో! అవినీతి పెట్టుబడి. అధికారులకి రాయితీ. అధికారానికి తాయిలం. మన అదృష్టం– అవినీతిలో మనది రెండో స్థానం. అంటే– ‘అవినీతి’ అభివృద్ధికి ఇంకా మరో మెట్టు ఎక్కే ఆస్కారముంది! (వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు ) -
సినారె జ్ఞాపకాలు
సినారె గొప్ప వక్త. అనితర సాధ్యంగా సభా నిర్వహణ చేసేవారు. ఆయన ప్రసంగం కవితాపఠనంలాగ సాగేది. చివరి రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింది. కాని ప్రతి సాయంకాలం–సాహితీ ప్రసంగాల రుచిని వదులుకోలేకపోయేవారు. దాదాపు 47 సంవత్సరాల కిందటి మాట. మద్రాసు టి.నగర్లో సుధారా హోటల్లో సినారెది 12వ నెంబర్ గది. నాది పదకొండు. రోజంతా నేను కథా చర్చలు, సంభాషణల రచనా చూసుకుని గదికి చేరేవాడిని. ఆయనది పాటల పరిశ్రమ. నా గది తలుపు చప్పుడు కాగానే వచ్చేవారు. ఇద్దరం ఆనాటి కార్యకలాపాలను పంచుకుంటూ రాత్రి పన్నెండున్నర దాకా కాలక్షేపం చేసేవాళ్లం. ఆ రోజుల్లోనే –నేను రేడియోకు శలవు పెట్టి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలని రెచ్చగొట్టే మిత్రులలో సినారె ఒకరు–ఆయనా అటు విద్యారంగంలో ఉంటూ అలాంటి పని చేస్తున్నారు కనుక. కరీంనగర్ రోజుల్లో –అంటే ఆయన చిన్నతనంలో మా మామగారు ఆయనకి ఇంగ్లిష్ గ్రామరు నేర్పేవారు. మా ఆవిడని ’గురుపుత్రి’ అనే పిలిచేవారు ఎప్పుడు కలిసినా. చిన్నతనంలో మా రెండో అబ్బాయి రామకృష్ణ (మా మామగారి పేరు) ఆయనకి నమస్కారం పెట్టేవాడు కాడు– మా ఆవిడ ఎంత చెప్పినా. ఆయన నవ్వి: ఎందుకు పెడతాడు? నా గురువు కదా? అనేవారాయన. ఒకసారి కరీంనగర్ కాలేజీలో సాంస్కృతిక సభకి నాకూ ఆయనకీ ఆహ్వానం వచ్చింది. మూడు కారణాలకి అది నాకు ముచ్చట. మా ఆవిడ చదువుకున్న ఊరు. విశ్వనాథ ప్రిన్సిపాల్గా పనిచేసిన కాలేజీ. మా మామగారూ అక్కడ హైస్కూలు హెడ్ మాస్టరుగా చేశారు. ఇద్దరం వెళ్లాం. రాత్రి పదిగంటలకి భోజనం చేసి ఇద్దరం కారులో కూర్చున్నాం. డ్రైవరు ఈడిగిలపడుతూ కారు నడుపుతున్నాడు. కారణం అడిగాం. అది ఎన్నికల టైము. చెన్నారెడ్డిగారూ, వందేమాతరం రామచంద్రరావుగారూ పోటీ చేస్తున్న ఆ నియోజక వర్గంలో గత నాలుగు రోజులుగా నిద్ర లేకుండా కారు నడుపుతున్నాడట. మేమిద్దరం గతుక్కుమన్నాం. అక్కడి నుంచి హైదరాబాద్కి నాలుగు గంటల ప్రయాణం. డ్రైవర్ నిద్రని ఆపేదెలా? ఇద్దరం పాటలూ, పద్యాలూ లంకించుకు న్నాం. నోటికి వచ్చిన పాటలు, పద్యాలు–కేకల స్థాయి లో. హైదరాబాద్ 2 గంటలకు చేరాం. ఇద్దరం అలసటతో కూలిపోయాం. అదొక మరుపురాని సంఘటన. మా ఇద్దరి జీవితాలు ఆసాంతమూ పడుగు పేకల్లా సాగాయి. నేను రాసిన ఎన్నో చిత్రాలకు ఆయన పాటలు రాశారు. నేను నటుడినయ్యాక ఆయన రాసిన ఎన్నో పాటల్ని నటించాను. నా రెండో రోజు షూటింగులోనే ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో ‘స్వామి శరణం అయ్యప్పా’ పాట! నేను ఎప్పుడూ అనేవాడిని. ‘నేను పది సీన్లలో చెప్పిన విషయాన్ని మీరు పదిమాటల్లో లేపుకుపోతారు’ అని. అది పాటకి ఉన్న ఒడుపు. కర్నాటకలో హంపీ దగ్గర కమలాపురం గెస్టు హౌస్లో ఉంటూ పుండరీకాక్షయ్య గారి ‘మావారి మంచి తనం’ సినీమాకి ఆయన పాటలూ, నేను మాటలూ పూర్తి చేశాం. రోజూ ఉదయమే సినారె నిద్రలేపేవారు. అలాగే మారిషస్ ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లినప్పుడు. మా ఉదయపు నడకల్లో ఎన్నో పాటలు రూపుదిద్దుకోవడం నాకు తెలుసు. హేరంబ చిత్ర మందిర్ ‘మాంగల్యానికి మరోముడి’ పాటల కంపోజింగు. విశ్వనాథ్, సినారె నేనూ కూర్చున్నాం. ఉన్నట్టుండి సినారె అన్నారు: ‘వచ్చేసిం దయ్యా పల్లవి’ అని. ఇదీ ఆయన చెప్పిన పల్లవి: గొల్లపూడి చిన్నవాడి అల్లరి నవ్వు పట్టపగలు విరబూసే పున్నమి పువ్వు జీవితంలో ఎన్ని జ్ఞాపకాలు! ఆయన జ్ఞానపీఠ పురస్కారానికి అభినందన సభ మద్రాసు సవేరాలో. దేవులపల్లి, ఇచ్చాపురపు జగన్నాధరావు ప్రభృతులంతా ఉన్నారు. నేను వక్తని. 1988లో రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కార సభకి నేను ప్రధాన వక్తని. నా షష్టిపూర్తికి వచ్చిన నలుగురు ఆత్మీయులు– సినారె, అక్కినేని, గుమ్మడి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. అదొక మధురానుభూతి. ఆయన చేతుల మీదుగా వంగూరి ఫౌండేషన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాను. ఇలా రాస్తూ పోతే పెద్ద జాబితా. ఆయన ముందునుంచీ నా రచనలకు అభిమాని. 1969లో ఎమెస్కోవారు ప్రచురించిన నా ‘పిడికెడు ఆకాశం’ నవల చదివి ఉత్తరం రాశారు. ‘నవల పోను పోను గంభీరంగా ఉంది. గమకం ఆద్యంతమూ ఉందనుకోండి. ముగింపు అద్భుతం. వస్తువును స్వీకరించడంలో మీకున్న దమ్ము రుజువయింది’. ఆయన గొప్ప వక్త. అనితర సాధ్యంగా సభా నిర్వహణ చేసేవారు. ఆయన ప్రసంగం కవితాపఠనంలాగ సాగేది. చివరి రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింది. కాని ప్రతి సాయంకాలం– సాహితీ ప్రసంగాల రుచిని వదులుకోలేకపోయేవారు. ఇద్దరు మనుషులు, ఒక తలగడ, క్లుప్తంగా రెండు మాటలూ– ఒక మహావక్త గతాన్ని తలుచుకుని మనస్సులో కలతగా ఉండేది. అయితే ఆ కాస్త participation ఏ ఆయనకు ఆటవిడుపు. వయస్సు, ఆరోగ్యం ఎదురుతిరుగుతున్నా– కవితలు మానలేదు. ఎప్పడూ ఏవో పత్రికల్లో కనిపిస్తూండేవి. అది సినారె ‘ప్రాణవాయువు’గా అస్మదాదులం గుర్తుపట్టేవాళ్లం. సినారె ఒక ప్రభంజనం. ఈ తరం సంతకం. - గొల్లపూడి మారుతీరావు -
చెవిలో పువ్వులు
రాబోయేకాలంలో దూడగడ్డికి తాడిచెట్లని వెతకాల్సిన పనిలేదు. కారణం– హార్వర్డ్ మేధావుల కొడుకుల కాలం చెల్లింది. ఎందుకంటే చెవులకీ, పువ్వులకీ గల సంబంధం రాను రాను తగ్గబోతోంది కనుక. వెనకటికి–ఎవడో తాడిచెట్టు మీద కనిపించాడట– సీజన్ కాని సీజన్ లో. ‘ఏమయ్యా! ఇప్పుడు తాటిచెట్టు ఎందుకు ఎక్కావయ్యా?’ అని దారిన పోయేవాడు అడిగాడట.‘‘దూడ గడ్డికి గురువుగారూ!’’అన్నాడట ఈయన. మనదేశంలో బోలెడన్ని తాడిచెట్లు– దూడగడ్డికోసం వాటిని నిరంతరం ఎక్కే హార్వర్డ్ చదువుల మంత్రులు బోలెడంత మంది ఉన్నారు. మాయావతిగారికి ఏ అన్యాయం జరిగినా– ఆమె సమాధానం ఒకటుంది– అది ప్రతిపక్షాలు తన మీద జరిపిన కుట్ర– అని. కేజ్రీవాల్ బాత్రూంలో కాలుజారి పడినా– అతనికో ఒడుపు ఉంది. నరేంద్ర మోదీగారు ప్రతిపక్ష నాయకులను వారి బాత్రూంలలోనయినా క్షేమంగా ఉండనీయడంలేదని. ఇవి ప్రతి పక్షాల ఆలోచనా సరళికి నమూనాలు. ఆయన పార్టీలోనే ఆయన ఎంపిక చేయగా శాసనసభ్యుడయి, మంత్రి కూడా అయిన కపిల్ మిశ్రా ఏవో రాజకీయ కారణాలకి కేజ్రీవాల్ మీద కాలుదువ్వుతున్నారు. ఎన్నో రకరకాల అవినీతుల చిట్టా విప్పారు. కేజ్రీవాల్ వాటికేమీ సమాధానం చెప్పకపోగా బీజేపీ కపిల్ మిశ్రాతో ఈ కుట్ర జరుపుతోందన్నారు. ఇంతకన్నా సరదా అయిన విషయం. ఒకప్పటి ఆర్థికమంత్రి చిదంబరంగారి అబ్బాయి కార్తీ చిదంబరం– తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల వ్యాపారం చేసినట్టు నేర పరిశోధక శాఖ రుజువులతో సహా చిట్టా విప్పింది. హార్వర్డ్లో చదువుకుని, ఈ దేశానికే ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరంగారు ఏమన్నారు? తను పత్రికలలో పాలకవర్గం మీద రాసే వ్యాసాలకు భయపడి, తనని రాయకుండా చేయడానికి పాలకవర్గం తన మీద కుట్ర సాధిస్తోందన్నారు. ఇది ఓ గొప్ప మేధావి మాత్రమే గ్రహించగల రాజకీయ కుట్ర. కార్తీ చిదంబరం అవినీతికీ–అందుకు కావలసిన సాక్ష్యాధారాలు దొరకడానికీ–చిదంబరంగారి పత్రికా వ్యాసాలకీ ఏం సంబంధం? గత 13 సంవత్సరాలుగా సోనియాగాంధీ వియ్యపురాలికి– అనగా రాబర్ట్ వాద్రా తల్లిగారి రక్షణకు ప్రభుత్వం ఖర్చు చేసిన కోట్ల ధనానికీ, ప్రస్తుత పాలకులకూ ఏమిటి సంబంధం? ఉంది బాబూ ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పదవిలో ఉంటే సోనియా గాంధీ వియ్యపురాలి మీద ఈగ వాలనిచ్చేవారా? మళ్లీ మాట్లాడితే ఆమె పక్కింటివారికి కూడా రక్షణ కల్పించేవారు. కారణం– వారి ఇంటి గోడలు పొట్టిగా ఉన్నాయి కనుక. పాక్ దౌర్జన్యకారులు పక్కింటి ద్వారా వీరి ఇంట్లో జొరబడి వియ్యపురాలిని ఎత్తుకుపోతే దేశానికి ఎంత ప్రమాదం? కనుక ఇందులో బీజేపీ కుట్ర బోలెడంత ఉంది. ఇంతకీ ఓటరు చెవుల్లో పెట్టడానికి నాయకుల దగ్గర బోలెడన్ని పువ్వులున్నాయి కాని–దురదృష్టవశాత్తు చెవులు ఖాళీ లేవు. అవినీతికి సాక్ష్యాలు గట్టిగా దొరికినప్పుడు తప్పించుకునే దారులు అన్నీ మూతపడతాయి. అప్పుడు ఇలాంటి అడ్డదారులు అవసరమౌతాయి. ఓటరుకి నిజంగా అర్థమౌతోందనీ, అయితే అతను నోరు విప్పడానికి ఎన్నికల దాకా అవకాశం రాదనీ ఈ నాయకులు గమనించరు. తీరా మాడు పగిలేటట్టు ఓటరు ఛీకొట్టాక అపజయానికి దొంగ కారణాలు వెతుకుతారు. ఒకనాడు ప్రతిపక్షాల మాడు పగులగొట్టి బేషరతుగా ఆమ్ ఆద్మీ పార్టీని ఓటరు అందలం ఎక్కించినప్పుడు ఓటింగ్ మెషీన్లు బాగా పనిచేశాయి. ఇప్పుడు తమ పార్టీని తిరస్కరించినప్పుడు మిషన్లలో తేడాలొచ్చాయి. ఇదివరకు ఓటరు తన చెవుల్ని తడువుకుంటూ పువ్వుల్ని లెక్కపెట్టేవాడు. కానీ ఇప్పుడిప్పుడే వ్యవస్థ కళ్లు తెరిచింది. రోజు రోజుకీ ఆయా సిద్ధాంతాల ముసుగులు కప్పుకుని ‘పత్రికా స్వేచ్ఛ’ అని ఊదరగొట్టే ‘కొంగు’ పత్రికల చాకచక్యాన్నీ, జరిగే ప్రతిదానికి మతం, కులం రంగు పూసే కుహనా మేధావుల భాషణల్నీ దాటి కులాలు, మతాలకు అతీతంగా తన శ్రేయస్సుని కాపాడే నాయకత్వానికి ఓటరు బేషరతుగా నిర్దుష్టంగా పట్టం కడుతున్నాడు. నిన్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుపుకి అర్థం కేవలం ఆ పార్టీ పరపతి మాత్రమే కాదు. ఇన్నాళ్లూ నాయకులు నమ్మించిన ‘సంకుచిత’ పరిధుల్ని దాటి తన మంచిచెడ్డల్ని ఆయా నాయకుల ‘మూస’లకి దూరంగా, భిన్నంగా, గంభీరంగా ఓటరు నిలవగలుగుతున్నాడనడానికి నిదర్శనం. ఆత్మవంచన చేసుకునే ప్రతిపక్షాల కుట్రల సాకు వెనుక – ఓటింగు మిషన్ల లోపం వెనుక – దాగొనే నాయకులకి ఈ హెచ్చరిక మనస్సుల్లోనయినా అంది ఉండాలి. వెన్నెముకల్లో చలి పుట్టించే ఉంటుంది. రేపు బీజేపీ తోక జాడించినా ఆ సమాధానం చెప్పగలడు. ఆ సంగతి ఆ పార్టీ పెద్దలకి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇంతవరకూ ఎన్నికల్లో గెలిచాక ఆయా పార్టీలు తమ ఇళ్లు చక్కబెట్టుకున్నాయి. ఇప్పుడు అది కుదరదని తెలిసొచ్చే రోజులొచ్చాయి. రాబోయేకాలంలో దూడగడ్డికి తాడిచెట్లని వెతకాల్సిన పనిలేదు. కారణం–హార్వర్డ్ మేధావుల కొడుకుల కాలం చెల్లింది. ఎందుకంటే చెవులకీ, పువ్వులకీ గల సంబంధం రాను రాను తగ్గబోతోంది కనుక. - గొల్లపూడి మారుతీరావు -
జ్ఞాన భాండాగారాలు
జీవన కాలమ్ ఈ దేశం ఎంతటి అజ్ఞానాన్నయినా తట్టుకుని భరించగలదు. కానీ ‘జ్ఞానం’ ఎక్కడో జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తుంటుంది. చౌతాలాని మార్గదర్శకంగా గ్రహించండి. మీ చదువులు మీ కోసం జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తున్నాయని మరవకండి. ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉందని తను వెళ్లి నిరూపించిన సీని యర్ నాయకులు ఓంప్రకాష్ చౌతాలా. ఆయన ఉపాధ్యాయుల నియామకం విషయంలో పెద్ద కుంభకోణాన్ని జరిపి, జైలుకి వెళ్లి బుద్ధిగా చదువుకుని తన 82వ ఏట ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియెట్ పరీక్ష పాసయ్యారు. వారు తీహార్ జైల్లో గత నాలుగున్నర ఏళ్లుగా ఉంటున్నారు. ఇది ఈ దేశ చరిత్రలో మార్గదర్శకమైన పరిణామంగా నేను భావిస్తున్నాను. ఈ వార్తను ముఖ్యంగా లల్లూ ప్రసాద్ యాదవ్ వంటి వారు శ్రద్ధగా గమనించాలి. వారు గడ్డి కుంభకోణంలో ఆ మధ్య జైలుకి వెళ్లి వచ్చారు. ఆ సమయాన్ని ఆయన వృధా చేసుకున్నారని చౌతాలాని చూస్తే అర్థమౌతుంది. ఆ సమయంలో కనీసం రెండో ఫారం చదివినా రేపు ప్రభుత్వం ఫైళ్లు చదువుకోడానికి ఉపయోగపడేది. అలాగే లల్లూ ఇద్దరు కొడుకులు–తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ బిహార్లో మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒకాయన ఉప ముఖ్యమంత్రి. అర్హతలు ఏమిటీ అనేది అర్థం పర్థం లేని ప్రశ్న. క్లాసయినా పాసయే సదవకాశాన్ని కల్పించాలి. ‘మిష’ అంటారా? తమ తండ్రిగారి లాగ ఏదో గడ్డి తిని ఆ సరాసరి ముఖ్యమంత్రి పదవికి వచ్చే అవకాశముంది. కనుక వారిని వెంటనే జైలుకి పంపి రెండో తరగతికయినా తర్ఫీదు ఇప్పిస్తారని మనం ఆశించవచ్చు. ఈ దేశంలో జైళ్లకు ఎంతో అపకీర్తి ఉంది. అలనాడు తిలక్ మహాశయులు జైల్లో ఉంటూ భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. రాజాజీ పిల్లలకు అర్థమయ్యే సరళమైన ఇంగ్లీషులో రామాయణ, భారతాలను వ్రాశారు. నెహ్రూగారు ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రాశారు. ఇవన్నీ ఆ పెద్దల వికారాలుగా మనం సరిపెట్టుకోవచ్చు. చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడయినా ఇంటర్ పరీక్ష పాసయ్యేవారా? వారికి చిన్నతనంలో చదువు సరిగ్గా సాగలేదు. తర్వాత సాగించాలనుకుంటే తండ్రి దేవీలాల్తో పాటు రాజకీయాలలో ఉండడంవల్ల చదువుకునే అవకాశం రాలేదని ప్రస్తుత హర్యానా ప్రతిపక్ష నేత–అభయ్ సింగ్ చౌతాలా తన తాత గురించి చెప్పారు. ఈ మధ్య ఒక నానుడి ఏర్పడింది. ‘నువ్వేం చదువుకోలేదా? మరేం పర్వాలేదు. సరాసరి పార్లమెంటుకి వెళ్లే అర్హతలున్నట్టే. లేదూ? చదువుకోవాలని ఉందా? నిక్షేపంగా జైలుకి వెళ్లు’. ఈ దేశంలో ఏ అర్హతా అక్కరలేని వ్యాపకం ఒక్కటే–రాజకీయ రంగం. చదువుకుంటే గుమస్తావి అవుతావు. చదువు లేకపోతే మంత్రివి అవొచ్చు. రేపట్నుంచి జస్టిస్ కర్ణన్ వంటివారు జైల్లో ఉంటారు. మన జైళ్లలో ఉన్న కొందరు మహనీయులైన నాయకుల పేర్లు– జయలలిత, కనిమొళి, శశికళ, సురేష్ కల్మాడీ, అక్బరుద్దీన్ ఒవైసీ, పప్పు యాదవ్, ఎ. రాజా, యడ్యూరప్ప, అమర్ సింగ్, పండిత సుఖ్రాం, మధుకోడా. అయితే వీరంతా జైళ్లను సద్వినియోగం చేసుకోలేదని చెప్పాలి. తను హత్యకు గురవడానికి చాలాకాలం ముందు చెర్లపల్లి జైలు నుంచి – జూలకంటి శ్రీనివాస్ అనే మొద్దు శీను నా నవల ‘సాయంకాలమైంది’ చదివి నాలుగు పేజీల ఉత్తరం రాశాడు. ఆ నవల చదివి ఉత్తరం రాసిన మరొకాయన ఉన్నారు. ఈ దేశపు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారు. ఆ రెండు ఉత్తరాలూ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అయితే మొద్దు శీను ఉత్తరం కొట్టొచ్చినట్టు గుర్తుకు వస్తూంటుంది. కారణం– అతడు జైల్లో లేకపోతే కలలో కూడా నవల చదివి ఉండడు. ఏకాంతం అంతర్ముఖుడిని చేస్తుంది. ఆ నిశ్శబ్దం– తనకు లేనిదీ, తను కోల్పోయినదీ–గుర్తుకు తెస్తుంది. తీరిక, నిస్సహాయమైన ఏకాంతం–దాన్ని భర్తీ చేసుకునే వెసులుబాటుని కల్పిస్తుంది. అందుకు కనీసం – ఒక నేరమైనా చేయాలి. జైలుకి వెళ్లే అర్హతని సంపాదించుకోవాలి. అప్పుడు – కనీసం ఇంటర్మీడియెట్ చదువయినా అబ్బుతుంది. లేకపోతే ఏమవుతుంది? మీరు రాష్ట్రానికయినా ముఖ్యమంత్రులయిపోతారు. లేదా జైలుకి వెళ్లే తండ్రులుంటే పార్లమెంటు సభ్యులయినా అయిపోతారు. ఈ దేశం ఎంతటి అజ్ఞానాన్నయినా తట్టుకుని భరించగలదు. ఈ సంస్కృతికి ఉన్న మన్నిక అది. కానీ ‘జ్ఞానం’ ఎక్కడో జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తుంటుంది. కనుక నాయకులకిదే పిలుపు. చౌతాలాని మార్గదర్శకంగా గ్రహించండి. సత్వరంగా ఏ ఉపాధ్యాయుల కొంపలో ముంచండి. లేదా గడ్డి తినండి. మీ చదువులు మీ కోసం జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తున్నాయని మరిచిపోకండి. గొల్లపూడి మారుతీరావు -
సంసారం ఒక చదరంగం...
నాటి సినిమా ప్రతి సంసారంలో సుఖాలు అనే తెల్లగడులు, కష్టాలు అనే నల్లగడులు ఉంటాయి. రాజు అనే కుటుంబ పెద్ద అయిన తండ్రి, మంత్రి అనే సలహాలిచ్చే తల్లి, ఏనుగులు అనే కొడుకులు, గుర్రాలు అనే కోడళ్లు, ఇంకా కూతుళ్లు అల్లుళ్లు మనమలు మనమరాండ్రు అనే బంట్లు... వీళ్లంతా ఒక్కోసారి తెల్లపావులుగా మరోసారి నల్లపావులుగా ఈ కష్టసుఖాలు తెచ్చే ఆనందాలను, అవరోధాలను చాకచక్యంగా పరిగ్రహిస్తూ ఆటను రక్తి కట్టించాల్సి ఉంటుంది. ఎక్కడ తప్పటడుగు పడినా ఎక్కడ తప్పుడు ఎత్తు వేసినా అసలుకే ఎసరు వస్తుంది. ప్రపంచంలో ఎందరో గ్రాండ్ మాస్టర్లు ఉండొచ్చు. కాని ఈ సంసారం అనే చదరంగాన్ని ఈ దేశంలో అనునిత్యం ఆచి తూచి ఆడే సగటు తల్లిదండ్రులను మించి గ్రాండ్ మాస్టర్లు ఉండరు. అలాంటి ఒక తల్లిదండ్రుల కథే ‘సంసారం ఒక చదరంగం’. పెద్దకొడుకు కోరే లెక్కా జమ.... విశాఖలోని అప్పల నరసయ్య (గొల్లపూడి మారుతీరావు) ఒక సగటు ఉద్యోగి. ఇతనికి ముగ్గురు కొడుకులు. ప్రకాష్ (శరత్బాబు), రాఘవ (రాజేంద్రప్రసాద్), కాళిదాసు (హాజా షరీఫ్). వీళ్ళు కాకుండా ఒక కూతురు (కల్పన). ఇంట్లో తల్లి గోదావరి (అన్నపూర్ణ), కోడలు ఉమ (సుహాసిని) ఈ కుటుంబానికి రెండు కళ్లై సంసారాన్ని సమన్వయంతో నడుపుకుంటూ వస్తుంటారు. పెద్ద కొడుకు ప్రకాష్ జీతం నెలకు 1725 రూపాయలు. అతను తన జీతంలో నుంచి 800 రూపాయలు ఇంటి ఖర్చులకు ఇస్తుంటాడు. రెండో కొడుకు రాఘవ జీతం 550. అతను తన జీతం నుంచి నాలుగొందల రూపాయలు ఇస్తుంటాడు. పెద్దాయన నరసయ్య తన జీతం ఈ డబ్బుతో కలిసి ఇంటి బడ్జెట్ను మేనేజ్ చేస్తుంటాడు. కాని పెద్ద కొడుకు ప్రకాష్కు ఇది ఇబ్బందిగా ఉంటుంది. చీటికి మాటికి తననే డబ్బు అడుగుతున్నారని ఇంటి బడ్జెట్లో ఎక్కువ వాటా తనే వేయాల్సి వస్తోందని అతని ఇబ్బంది. మనిషి పిసినారి. ఆటో మీద రెండు రూపాయలు ఇవ్వడం కూడా ఇష్టపడనివాడు చెల్లెలి పెళ్లి చూపులకు మిఠాయి ఖర్చులు ఇమ్మంటే ఇవ్వగలడా? కాని అయిష్టంతోనే ఆ పనులన్నీ చేయాల్సి వస్తుంటుంది. మూడో కొడుకు కాళిదాసు చిన్న పిల్లవాడు. పదో క్లాసు మీద దండయాత్రలు చేసేవాడు కాబట్టి వాడి ప్రమేయం ఏమీ లేదు. పైకి అంతా సజావుగా ఉన్న ఇల్లు నివురు గప్పిన నిప్పులా ఉంది. అగ్గి రాజుకునేలా ఉంది. రాజును నేలకూల్చే సందర్భం ఏదో వెయిట్ చేస్తూ ఉంది. చివరకు అది రానే వచ్చింది. మాటల తుఫాను... పెద్ద కోడలు ఉమ పురిటికని పుట్టింటికి వెళ్లింది. పెద్ద కొడుక్కి ఇది మంచి అవకాశంగా అనిపించింది. ఆ నెలలో ఇంటి ఖర్చులకు కేవలం నాలుగు వందలే ఇస్తాడు. ‘ఇదేంట్రా’ అని తల్లి ఆశ్చర్యపోతుంది. ‘ఇన్ని రోజులు ఇద్దరం ఉన్నాం. ఎనిమిది వందలు ఇచ్చాం. ఇప్పుడు ఉమ పుట్టింటికి వెళ్లింది. నేను ఒక్కణ్ణే. కనుక నాలుగు వందలు ఇస్తున్నాను’ అంటాడు పెద్దకొడుకు. తండ్రి ఇది విని వ్యంగ్యంగా చురకలు వేస్తాడు. పెద్ద కొడుక్కి రోషం ముంచుకు వస్తుంది. ‘రేపు నాకు బిడ్డ పుడుతుంది. నా సంసారాన్ని కూడా నేను చూసుకోవాలి. ఈ దుబారా ఖర్చు నేను పెట్టలేను’ అంటాడు. ‘కన్న తల్లిదండ్రులను తోడబుట్టినవాళ్లను చూసుకోవడం దుబారా అవుతుందా?’ అని తండ్రి ప్రశ్నిస్తాడు. ‘అంత రోషపడేవాళ్లు నా దగ్గర 18 వేలు తీసుకుంటే తప్ప కూతురు పెళ్లి చేయలేకపోయారే. అప్పుడేమైంది రోషం’ అంటాడు కొడుకు. ‘లెక్కా పత్రాలు చూస్తున్నావా? నీ చదువుకు పెట్టిన ఖర్చు నీ ఉద్యోగం కోసం పెట్టిన ఖర్చు నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేయడానికి చేసిన ఖర్చు నీకు యాక్సిడెంట్ అయితే నా రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకున్న ఖర్చు... ఇవన్నీ కూడా లెక్క చూడాలా’ అని తండ్రి అంటాడు. ‘అవును. చూడాల్సిందే. మీరు చూసిన దానికి చేసిన దానికి సరిపోయింది. మర్యాదగా చెల్లెలి పెళ్లి కోసం నా దగ్గర తీసుకున్న పద్దెనిమిది వేలు కక్కండి’ అంటాడు కొడుకు. ఒక తండ్రి మీద అంతకు మించి అసహ్యమైన ఎత్తు ఉండదు. ఆ తండ్రి లోలోపల కూలిపోతాడు. కునారిల్లిపోతాడు. ఆత్మాభిమానం పొడుచుకుని వచ్చి ‘నీ డబ్బులు నీ అణాపైసలతో ముఖాన కొడతాను. అందాక ఈ ఇంట్లో నుంచి బయటకు పోరా కుక్కా’ అంటాడు. ఘోరం జరిగిపోతుంది. నిండుగా ఉండే ఇల్లు రెండు ముక్కలవుతుంది. ఇంటి మధ్యన ఒక పెద్ద గీత గీయబడుతుంది. అటువైపు కొడుకు కోడలు. ఇటువైపు మిగిలిన కుటుంబ సభ్యులు. అటువాళ్లు ఇటు రావడానికి కాని ఇటువాళ్లు అటు వెళ్లడానికి వీల్లేదు. ఒకరికి మరొకరు చచ్చినవాళ్లతోనే సమానం. ఆ సంసారం రిపేరు చేయలేని విధంగా అల్లరిపాలైంది. దీనికి విరుగుడు ఏమిటి? కోడలి అవస్థ కూతురి పొగరు... ఈ కథలోనే ఇంకో రెండు ఉపకథలున్నాయి. ఇంటి కూతురికి కాస్తంత పొగరు. ఎవరినీ లెక్క చేయదు. అన్యమతస్తుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పోయినామె పోయినట్టుగా ఉండగా అక్కడ మొగుణ్ణి, మామగారిని అలక్ష్యం చేసి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఇంటి నుంచి వచ్చేసి పుట్టింట్లో తిష్ట వేస్తుంది. రెండో కొడుకు రాఘవ చేసుకున్న అమ్మాయి (ముచ్చర్ల అరుణ)ది ఇంకో కష్టం. కొత్త కోడలిగా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెకు ప్రైవసీ లేదు. మూడో కొడుకు కాళిదాసు చదువు భారం ఆమె నెత్తిన పడుతుంది. ఆ పిల్లవాడు అర్ధరాత్రి వరకూ ఆమెనే అంటి పెట్టుకుని ఉంటే భర్తతో గడిపే సమయం చిక్కక అతనితో గొడవ పడి పుట్టింటికి వెళ్లి అక్కడ తండ్రి చేత చివాట్లు తిని తిరిగి అత్తింటికి చేరి అసంతృప్తితో రగిలిపోతూ ఉంటుంది. ఈ ఉపకథలు కూడా ఇంటి మధ్య గీతకు కారణమయ్యి ఆ సంసారాన్ని బజారున పడేశాయి. కోడలమ్మ... చిలకమ్మ... ఇప్పుడు ఈ ఇంటిని కాపాడగలిగింది ఇద్దరే ఇద్దరు. ఒకరు పుట్టింటి నుంచి తిరిగి వచ్చిన కోడలు ఉమ. ఇంకొకామె ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పని మనిషిగా ఉన్న చిలకమ్మ (షావుకారు జానకి). పండండి బిడ్డను ఎత్తుకొని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఇంటికి వచ్చిన ఉమ ఇంటి నడిమధ్యన గీసిన గీతను చూసి హతాశురాలవుతుంది. ఇంట్లో ఉన్న పరిస్థితులకు అవాక్కవుతుంది. పరిస్థితులు చక్కదిద్దడానికి నడుం బిగిస్తుంది. ఈలోపు పిసినారి ప్రకాష్కు ఒక్కొక్క సంగతే తెలిసి వస్తాయి. తాను ఇచ్చే ఎనిమిది వందలు ఇంటి ఖర్చులో ఏ మూలకూ సరిపోవనీ ఆ డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఇన్నాళ్లు ఒక్క తన సంసారానికే ఖర్చయ్యిందని తెలిసొస్తుంది. లాండ్రీ బిల్లు, వెచ్చాల బిల్లు, ఒకవేళ తాను ఉంటున్న పోర్షన్కు అద్దె కట్టాల్సి వస్తే చాలా ఖర్చు తన నెత్తిన పడుతుందని గ్రహిస్తాడు. ఉమ్మడి సంసారం వల్లే తాను సౌకర్యంగా ఉన్నానని విడి కాపురం పెడితే అన్నీ ఖర్చులే అని తెలిసి లోలోన గింజుకుంటాడు. తండ్రిని క్షమాపణ కోరే పరిస్థితికి వస్తాడు. చిలకమ్మ, ఉమ కలిసి కూతురి మామగారితో నాటకం ఆడి కూతురి కళ్లు తెరిపించి ఆమెను అత్తగారింటికి పంపుతారు. భార్యను తీసుకొని విహారానికి వెళ్లమని మరిది రాఘవకు సలహా ఇచ్చి వాళ్లకు ప్రైవసీ కల్పించి ఆ మేరకు ఆ కాపురాన్ని చక్కదిద్దుతుంది ఉమ. కథ క్లయిమాక్స్కి వచ్చింది. చర్చ రేపిన సినిమా... 1987లో వచ్చిన ‘సంసారం ఒక చదరంగం’ సినిమా సమాజంలో ఒకస్థాయి చర్చను రేపగలిగింది. ఉమ్మడి కుటుంబాల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న ఆ తరుణంలో పెళ్లయిన కొడుకుల విడికాపురాల జోరు పెరుగుతున్న ఆ రోజుల్లో ఈ సినిమా ఒక తరుణోపాయాన్ని సూచించగలిగింది. ‘విడిగా వెళ్లినా పర్వాలేదు కలిసి ఉండటమే ముఖ్యం’ అని చెప్పగలిగింది. సినిమా అంతా ఒకెత్తయితే క్లయిమాక్స్ ఒక్కటీ ఒకెత్తు. ఇందులో కోడలి నిర్ణయం ప్రేక్షకులకు నచ్చపోయినా ఆ ‘ఎత్తు’ విఫలమైనా సినిమా కుదేలయ్యేది. కాని ప్రేక్షకులు ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. ఆదరించారు. అందుకే సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ప్రభావంతో కలిసిన ఉమ్మడి కుటుంబాలున్నాయి. ఆరోగ్యకరంగా విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. తమను తాము తరచి చూసుకొని చక్కదిద్దుకున్న కుటుంబాలు ఉన్నాయి. ఒక సినిమా ప్రేక్షకుల మీద ప్రభావం చూపగలదు అనడానికి ‘సంసారం ఒక చదరంగం’ ఒక మంచి ఉదాహరణ. మానవ జీవితానికి ‘కుటుంబమే’ ఆయువుపట్టు. ఆ కుటుంబం మెరుగ్గా ఉండటానికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు మనిషి. అలాంటి ఒక ఆలోచన సినిమా ద్వారా అందుకోవడమే ఇక్కడి విశేషం. ఇవాళ పెళ్లికి ముందే ‘మా అబ్బాయికి వేరే ఇల్లు చూశాను. పెళ్లయిన వెంటే విడి కాపురం పెట్టిస్తాను’ అనే తండ్రులు ఎందరో ఉండటం మనం చూస్తున్నాం. పెళ్ళిళ్లయ్యాక విడిపోవడానికి మన సమాజం మానసికంగా సిద్ధమైంది. విడిపోయినా కలిసి ఉండటం నేర్చుకుంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పాపులర్గా చెప్పి అందుకు కావలసిన భూమికకు మొదటి మెట్టుగా నిలిచిన మంచి సినిమా శక్తివంతమైన సినిమా ‘సంసారం ఒక చదరంగం’. కోడలి నిర్ణయం... కలతలు సమసిపోయాయి. కొడుకు క్షమాపణ అడిగాడు. తండ్రి క్షమించాడు. ముక్కలైన సంసారం ఒక్కటైంది. గీత చెరిపి అందరూ కలిసిపోయే సమయం వచ్చింది. కాని హటాత్తుగా పెద్ద కోడలు ఉమ దీనిని వ్యతిరేకిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ‘ఏం?’ అని అడుగుతారు. ‘మళ్లీ గొడవలు జరగవని గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నిస్తుంది. ‘ఇలా విడిపోవడం వల్ల ఎంత క్షోభ పడ్డామో అందరికీ తెలిసొచ్చిందిగా... మళ్లీ అలాంటి క్షోభ ఎదురైతే తట్టుకునే శక్తి మనకు ఉందా’ అని అడుగుతుంది. ‘వద్దు... కలిసి ఉండి రోజూ కొట్టుకుని చావడం కన్నా... విడిపోయి కలిసి ఉందాం. మేము వేరు కాపురం పెడతాం. అలాగని విడిపోం. ప్రతి ఆదివారం వచ్చి కలిసి వెళతాం. మీరు వచ్చిపోతూ ఉండండి. కాస్త ఎడంగా ఉంటేనే అభిమానాలు సజీవంగా ఉంటాయి. అలా సంతోషంగా ఉందాం’ అని నిర్ణయం చెబుతుంది. కథ ముగుస్తుంది. ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చిపోతూ సంతోషంగా ఉంటారు. – కె -
ఓ ‘సన్యాసి’ పాలన
జీవన కాలమ్ నాయకులు అందలాలు ఎక్కడానికి ఇంతకాలం మైనారిటీల మైండ్సెట్ని ధ్వంసం చేశారు. సర్వమత సహజీవనానికి మతం ప్రాతిపదిక కానక్కర లేదని–ఓ మతానికి చెందిన సన్యాసి నిరూపించగలిగితే? ఈ మధ్యకాలంలో దేశీ యులనే కాక, న్యూయార్క్ టైమ్స్ వంటి విదేశీ మాధ్యమాలను కూడా నివ్వెరపోయేటట్టు చేసిన పరిణామం– ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక ‘సన్యాసి’ని నియమించడం. అలనాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ని భారతీయ జనతాపార్టీ కొల్లగొట్టడం కేవలం ఒక ‘వేవ్’లో జరిగిపోయిన ‘చిలక్కొట్టుడు’ అని రాజకీయ మేధావులు చాలామంది పెదవి విరిచారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లో 324 సీట్లు గెలిచి, జార్ఖండ్లో ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ని బీజేపీ తుడిచిపెట్టిన తర్వాత–మేధావులు వినాయకుడి బొడ్డులో వేలు పెట్టినట్టు–ఉలిక్కి పడి–ఆ విజయాన్ని అటకెక్కించి పంజాబ్, మణిపూర్ మాటేమిటని కళ్లెగరేశారు. అంతవరకూ బాగుంది. కానీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నియామకం– అందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. ఎందరికో ఈ నియామకం కొరుకుడు పడలేదు. ఏమయింది ఈ ప్రభుత్వానికి? బీజేపీ అధిష్టానానికి మతి పోయిందా? ‘గెలుపు’ అహంకారాన్ని రెచ్చగొట్టిందా? తామేం చేసినా చెల్లుతుందన్న ధీమాని ఇచ్చిందా? ఎవరేమన్నా– ‘మేం పసుపు జెండా ఎగరేసి తీరుతాం’ అన్న నిర్లక్ష్యానికి ఇది గుర్తా? ఇంతవరకూ అజ్ఞాతంగా ఉన్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు రంగప్రవేశం చేసి పంజా విప్పిందా? రాష్ట్రంలో 18 శాతం ముస్లింలను కలుపుకోవడానికి వందమందికి టికెట్లు ఇచ్చి ఒక నాయకురాలు బరిలోకి దిగగా, ఒక్కరికీ టికెట్టు ఇవ్వకుండా తమ గెలుపుకి– ఆయా వర్గాలకి సంబంధం లేదని దేశానికి సూచించాలని ప్రయత్నమా?–ఎన్నో ప్రశ్నలు. ఈ యోగికి నా అన్నవాళ్లు లేరు. సన్యాసి. అప్పుడెప్పుడో–2006లో–ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తనమీద కక్ష సాధిస్తోందని–పార్లమెంటులో అంతా నిర్ఘాంతపోయేలాగ కంటతడి పెట్టుకున్నారు. అర్థంలేని కారణాలకి పాతిక చెప్పుదెబ్బలు కొట్టి గర్వంగా చెప్పుకున్న పార్లమెంటు సభ్యులు రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఈ ‘సన్యాసి’ పార్లమెంటులో కంటతడి పెట్టుకుంటాడేమిటి? అని కొందరు నవ్వుకున్నారు. కొందరు విస్తుపోయారు. తీరా షాక్ నుంచి తేరుకున్నాక– చాలామంది నాయకులు– ఆయా వర్గాలను బుజ్జగించడానికి చేసే ‘ఇచ్చకాల’ మీద ఈ ‘సన్యాసి’ ఇనుప పాదం మోపడాన్ని– మొదట మతానికీ, తర్వాత అధిష్టానం కుట్రకీ, తదుపరి మైనారిటీల అణచివేతకీ కారణమని కొందరు రాజకీయ మేధావులు పంజాలు విప్పారు. కాలేజీల ముందు రోమియోల విహారాలు, అనుమతిలేని కబేళాల తొలగింపు లాంటి పనులకు తప్పుడు అర్థాలు తీశారు. ఏమయినా–కాస్త లోతుకి వెళ్లి చూడగా ఈ చర్యలో అపూర్వమైన రాజకీయ దురంధరత కనిపిస్తుంది. ప్రతీక్షణం ‘మైనారిటీలు మా ప్రాణం’ అని ఊదరగొట్టే నాయకులు పదవిలోకి వచ్చిన తర్వాత తన బాబునీ, మామనీ, తండ్రినీ, తాతనీ పదవుల్లో నిలిపి– ముఖం తుడవడానికి ఒక మైనారిటీ చెంచాని చేరదీసి–పబ్బం గడుపుకున్న 70 ఏళ్ల చరిత్ర నేపథ్యంలో–100 మందికి టికెట్లిచ్చి–తన శిలా విగ్రహాల్ని పెట్టుకున్న నాయకురాలి ‘ఆత్మ వంచన’ని చూసిన ఈ ప్రజలు–తమ శ్రేయస్సుకి అనుక్షణం ఓ కాషాయ సన్యాసి పట్ల దృష్టిని నిలపడం విచిత్రమైన మలుపు. ఒకవేళ ఈ కాషాయ సన్యాసి వారికి నిజ మైన మేలు చేస్తే– పాలనలో సుపరిణామానికి నూటి కి నూట యాభై మార్కులు దక్కుతాయి. కాగా– ఒక ‘యోగి’, ఒక ‘సన్యాసి’ కట్టుకుపోయేదేమీ లేదు. అతనికి బలిసిన ఏనుగుల పార్కులక్కరలేదు. తన కుటుంబాల వారికి పదవుల పంపకం అక్కరలేదు. నాయకులు అందలాలు ఎక్కడానికి ఇంతకాలం మైనారిటీల మైండ్సెట్ని ధ్వంసం చేశారు. ఆయా సామాజిక వర్గాల సామరస్య సహజీవనం కాక ఆయా వర్గాలకి ‘హక్కు’ల రుచిని మప్పి–తీరా వాటిని కాలరాశారు. సర్వమత సహజీవనానికి మతం ప్రాతిపదిక కానక్కరలేదని– ఓ మతానికి చెందిన సన్యాసి నిరూపించగలిగితే? మైనారిటీలను దువ్వి పబ్బం గడుపుకునే ్టౌజ్ఛుnజీటఝకి అత్యంత సాహసంతో స్వస్తి చెప్పి– ఫలితాల మీదా, సజావైన పరిపాలన మీదా ‘గురి’ పెట్టగల నాయకత్వాన్ని ఇవ్వగల గుండె ధైర్యం ఉన్న వ్యవస్థ– ప్రారంభంలో పదిమందినీ ఒప్పించే ప్రయత్నం చెయ్యలేదు. మెప్పించే ప్రయత్నమూ చెయ్యలేదు. కాగా సాహసించి పదిమంది ‘షాక్’కీ సిద్ధపడింది. నిజాయితీ, గుండె ధైర్యం ఎప్పుడూ ఒప్పించాలని ప్రయత్నించదు. ఎందుకంటే అది ప్రదర్శన కాదు. ఇంతవరకూ మనం నాయకత్వం వేషాల్ని చూశాం. ఇచ్చకాల్ని చూశాం. ‘ఆకర్షణ’ల్ని చూశాం. తాయిలాల సంస్కృతిని చూశాం. ఇప్పుడు కేవలం సత్పాలన లక్ష్యంగా–మనల్ని ఒప్పించాల్సిన పని చెయ్యనక్కరలేని నాయకత్వం–ఒప్పుకునే పాలనని కాక–అవసరమైన పాలనని చెయ్యగల ‘దమ్ము’, ‘ఆత్మవిశ్వాసం’–ఇంకా చెప్పాలంటే–‘సవాలు’ ఈ ‘సన్యాసి’ పాలనకి గుర్తు–అని నాకనిపిస్తుంది. గొల్లపూడి మారుతీరావు -
మరో గూండా కథ
జీవన కాలమ్ ఈ దేశానికి హఫీద్ సయీద్, మసూద్ అజర్ల కంటే ఇలాంటి గూండాల వల్ల జరిగే హాని భయంకరమైనది. దౌర్జన్యకారుల శత్రుత్వం–మన చొక్కాకు పట్టే చెదలాంటిది. ఇలాంటి నాయకమ్మన్యులు–శరీరంలో క్యాన్సర్ లాంటివారు. ఒక సంఘటన. 1990లో జరిగింది. ఒక మహిళ మాటల్లో చెప్తాను: రైల్వే సర్వీసు ప్రొబేషనర్స్గా లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో నేనూ, నా మిత్రురాలూ ఎక్కాం. ఇద్దరు పార్లమెంట్ సభ్యులూ, మరో 12 మంది వారి సహ చరులూ ఎక్కారు. వాళ్లకి రిజ ర్వేషన్లు లేవు. మా బెర్తులు ఖాళీ చేయించి, మా సామాన్ల మీద కూర్చుని, అసభ్యంగా మాటలూ, అల్లరీ ప్రారం భించారు. కోపం వచ్చినా భరిస్తూ నిస్సహాయంగా రాత్రంతా గడిపాం. మర్నాటి ఉదయం ఢిల్లీ చేరాం, బతుకు జీవుడా అనుకుంటూ. మా స్నేహితురాలు ఎంత భయపడిపోయిందంటే–తర్వాత మేం ట్రైనింగ్కి వెళ్లా ల్సిన అహమ్మదాబాద్ ప్రయాణం మానుకుని ఢిల్లీలో ఆగిపోయింది. నేను మాత్రం రైల్వే సర్వీసులో ఉన్న మరో సహచరురాలితో రైలెక్కాను. ఢిల్లీ నుంచి అహమ్మ దాబాద్కి ఒక రాత్రి ప్రయాణం. మా రిజర్వేషన్లు వెయి ట్లిస్ట్లో ఉన్నాయి. టికెట్ కలెక్టరు మమ్మల్ని మొదటి తరగతి కూపేలో కూర్చోపెట్టాడు–రైలంతా రద్దీగా ఉందంటూ. అక్కడ మళ్లీ ఇద్దరు రాజకీయ నాయకులున్నారు. ఒకాయన ఎంపీ. మరొకాయన కేవలం సహచరుడు. మళ్లీ మేం బెదిరిపోయాం. మరేం ఫరవాలేదని టీటీయీ ధైర్యం చెప్పారు. వాళ్లు మాకు చోటిచ్చి ఒక మూలకి ఒదిగి కూర్చున్నారు. భోజనం వచ్చింది. నలుగురికీ శాకాహార భోజనమే ఆర్డరిచ్చి– వారిలో చిన్నాయన డబ్బు చెల్లించాడు అంద రికీ. ఈలోగా టీటీయీ వచ్చి ట్రైన్లో బొత్తిగా ఖాళీలేద న్నాడు. ఇద్దరు లేచి నిలబడ్డారు, ‘మరేం ఫర్వాలే ద’ంటూ. రెండు బెర్తులకీ మధ్యన ఒక గుడ్డ పరుచుకుని నిద్రపోయారు. మర్నాటి ఉదయం అహమ్మదాబాద్ దగ్గరికి వస్తుండగా ‘పట్నంలో ఏమైనా సమస్య ఉంటే మా ఇంటికి నిస్సందేహంగా రావచ్చు’నని పెద్దాయన ఆహ్వానించారు. చిన్నతను సిగ్గుపడుతూ ‘నేనొక ద్రిమ్మ రిని. ఇబ్బంది ఉంటే వీరి ఆతిథ్యం పుచ్చుకోండి’ అన్నారు. అవసరం లేదంటూ థాంక్స్ చెప్పాం. రాజకీయ నాయకుల మీద నా దురభిప్రాయాన్ని పోగొట్టిన వీరి పేర్లు మరచిపోకూడదనుకున్నాను. అహమ్మదాబాద్ రాగానే ఇద్దరి పేర్లూ హడావుడిగా రాసుకున్నాను– శంకర్సింగ్ వాఘేలా, నరేంద్ర మోదీ. ఈ సంఘటనని వ్రాసిన వ్యక్తి–లీనా శర్మ. భార తీయ రైల్వే సమాచార సంస్థ జనరల్ మేనేజర్ అయ్యారు. ఆనాటి ఆమె సహచరురాలు–ఉత్పలపర్ణ హజారికా. రైల్వే బోర్డ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. ఇక ఇప్పటి కథ. రవీంద్ర గైక్వాడ్ మహారాష్ట్ర శివసేన పార్లమెంట్ సభ్యులు. మామూలు టీచరు. ఢిల్లీ వెళ్లడానికి బిజినెస్ క్లాసు టిక్కెట్ ఉంది. మరచిపోవద్దు –అది ప్రజల సొమ్ముతో కొన్నదే. కానీ ఆనాటి విమానం బిజినెస్ క్లాసు లేని చిన్న విమానం. ఆయన ఎక్కారు–ఆ విమానంలో బిజినెస్ క్లాసు ఏర్పాటు లేదని తెలిసీ. విమానం ఆగాక గొళ్లెం పెట్టుకున్నాడు. ఎయిర్లైన్స్ ఆఫీసర్, 60 ఏళ్ల సుకుమార్ వచ్చి ఆయన్ని విమానం దిగమని కోరారు. ఆయన ఫలానా గైక్వాడ్ని తిట్టాడట. దురుసుగా ప్రవర్తించాడట. కోపంతో గైక్వాడ్ అనే ఎంపీ తన కాలి శాండల్ తీసి సుకుమార్ని 25సార్లు కొట్టాడు. కెమెరా ముందు గర్వంగా తను కొట్టిన విషయాన్ని వివరిస్తూ–‘‘నేను కొట్టింది చెప్పుతో కాదు, శాండల్తో’’ అంటూ పత్రికా విలేకరుల కథనాన్ని సవరించారు ఈ నాయకులు. మళ్లీ లెక్క తప్పుతుందేమోనని ‘25సార్లు కొట్టాను’ అని చెప్పారు. ప్రజలకు సేవ చేస్తానని వేదికలెక్కి హామీలిచ్చి ఎన్నికైన ఇలాంటి ‘గూండాలు’ విచక్షణా రహితంగా ఒక ప్రభుత్వోద్యోగిని బహిరంగంగా కొట్టి, గర్వపడడం– ఈ జాతికి పట్టిన చీడ. నిజంగా సుకుమార్ అనే ఆఫీసరు ఒక ఎంపీతో దురుసుగా మాట్లాడి, తిట్టి ఉంటే ఈయన ఫిర్యాదు చాలు అతన్ని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయ డానికి. ఇద్దరు మహిళలను–23 సంవత్సరాల కిందట గౌరవించిన ఆనాటి అనామకులైన నాయకులు– ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. ఒకాయన ప్రధాని అయ్యారు. ఈ కుసంస్కారిని నెత్తిన పెట్టుకున్నది–గూండా సంస్కృ తికి ఆలవాలమైన పార్టీ. ఈ దేశానికి హఫీద్ సయీద్, మసూద్ అజర్ల కంటే ఇలాంటి గూండాల వల్ల జరిగే హాని భయంకర మైనది. దౌర్జన్యకారుల శత్రుత్వం–మనం తొడుక్కున్న చొక్కాకు పట్టే చెదలాంటిది. కానీ మన వ్యవస్థలో మనల్ని నాశనం చేసే ఇలాంటి నాయకమ్మన్యులు– శరీ రంలో క్యాన్సర్ లాంటివారు. ఇలాంటి గూండాలని జైలుకి పంపించడానికి, కోర్టులో బోను ఎక్కించడానికి ఈ దేశంలో ఉద్యమాలు జరగాలి. ‘నిర్భయ’ విషయంలో జరిగినంత ఉధృతంగా ప్రదర్శనలు జరగాలి. వ్యవస్థలో సంస్కార పతనం, సంక్షేమ పతనం కంటే అనర్థదాయకం. హానికరం. అరిష్టం. - గొల్లపూడి మారుతీరావు -
నిలువుటద్దం
జీవన కాలమ్ చివరగా– జెరూసలేమ్ నుంచి జాన్ ముల్లర్ నాకు సందేశం పంపారు. ‘‘తమ ఉనికిని అంగీకరించమని భారతీయులు అమెరికాని ‘అడుక్కునే’ బదులు– మీ భారతీయులు ఇండియాలో ఒక ‘అమెరికా’ను తయారు చేసుకోలేరా? పైవారం కాలమ్ (‘భూత’ ద్దం) చదివి చాలామంది స్పందించారు. ముఖ్యంగా మిత్రులు, అతి తరచుగా అమె రికా వెళ్లివచ్చే మిత్రులు– తన కొడుకూ, కూతురూ సంవత్స రాల తరబడి అక్కడ ఉన్న మిత్రులు– పేరు చెప్పినా పర వాలేదు– యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్గారు ఫోన్ చేశారు. ఆయన నిర్మొహమాటి. వాస్తవాన్ని కుండ బద్దలుకొట్టి చెప్పే మనిషి. ‘ఈనాటి అమెరికా అనర్థంలో మనవారి వాటా కూడా ఉంది మారుతీరావుగారూ’ అన్నారు. భారతీయులు– అందునా తెలుగువారు ఎక్కడికి వెళ్లినా తమ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తారు. సామ ర్థ్యంలో, క్రమశిక్షణలో ఒక్కొక్కరూ అరడజను అమెరికన్ల పెట్టు. అలనాడు అమెరికాలో వైద్య రంగానికీ, ఇప్పు డిప్పుడు సాఫ్ట్వేర్ రంగానికి వారు చేస్తున్న సేవలు అనితర సాధ్యం. అపూర్వం. ఒక్క సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చయ్ పేరు ప్రపంచంలో మన సామర్థ్యాన్ని పతాక స్థాయిలో నిలిపారనడానికి ఉదాహరణలు. అయితే– తాము మాతృదేశానికి దూరంగా ఉంటూ నష్టపోయినదేదో ఎరిగిన వీరు– తమ సంపా దనతో, కృషితో అక్కడ నిలుపుకుంటున్నారు. అది అభిలషణీయమే. కాలిఫోర్నియాలో, చికాగోలో, పిట్స్ బర్గ్లో, హూస్టన్లో– ఇలా ప్రతీచోటా మన దేవాల యాలు వెలిశాయి. ఉత్సవాలు, సంబరాలు, కోకొల్లలు. ఏటేటా ఆటా, తానా, నాటా, పాటా– మీ ఇష్టం. తెలుగు తేజం వెల్లివిరుస్తుంది. ‘పాడుతా తీయగా’లు పల్లవి స్తాయి. క్లీవ్లాండ్లో ఏటేటా జరిగే కర్ణాటక సంగీ తోత్సవాలు చెన్నై సంగీత సభలకి తీసిపోవు. అమెరి కాలో బాలమురళీకృష్ణ, సంజయ్ సుబ్రహ్మణ్యం, టీఎం కృష్ణ, సుధా రఘునాథన్, కూచిపూడి పరపతి భారత దేశంలో స్థాయికి ఏ విధంగానూ తీసిపోదు. ఇక మరో పార్శ్వం. మనవారు కులాల పేరుతో కోర్టులకు ఎక్కి అమెరికా కోర్టుల్లో నవ్వులపాలయ్యారు. ఇంకా తెలుగు సినిమాల రిలీజుకి అమెరికాలో కార్లలో ర్యాలీలు, తమ కులం కాని హీరోల పోస్టర్లు చింపే అల్లర్లు– ఇవన్నీ మన దేశంలోని వెర్రితలలను అమెరి కాకి దిగుమతి చేసిన వికారాలు. ఈ మధ్య తాజాగా చేరిన మరో రగడ– తెలంగాణ, ఆంధ్ర సోదరుల మధ్య ప్రాంతీయ అసహనం. ఇవన్నీ కడుపునిండినవారి విన్యా సాలు. అందరూ ఉపాధి కోసం మరో దేశానికి వచ్చిన వారే. భారతీయుల సామర్థ్యానికీ, క్రమశిక్షణకీ వచ్చిన ప్రాచుర్యం ఈ ‘అరాచకం’ ముందు నిలవలేదు. నిల వదు. ఉపాధి కోసం తాపత్రయం తలవంచుతుంది. అవసరానికి మించిన ఆదాయం, కుల, ప్రాంత, మత దురభిమానం వీధిన పడేస్తుంది. ఈ పని చైనావారు కానీ, పాకిస్తాన్వారు కానీ, బంగ్లాదేశ్వారు, ఫ్రెంచ్వారు గానీ చేయలేదు. ఏతావాతా మన భారతీయ సోదరులు మరచి పోయినది ఏమిటంటే– మనమున్నది పరాయిదేశం. మన దేశంలో ఉన్న హక్కులు, వెసులుబాట్లు ఇక్కడ లేవు. ఉండవు. మనకి అంత రక్షణ లేదు. మనవాళ్ల కొందరి జేబుల్లోనయినా పౌరహక్కులున్నాయి. కానీ వారందరి జేబుల్లోనూ తుపాకులున్నాయని మరచి పో కూడదు. పైగా ఇక్కడ ఇప్పుడు చేస్తున్న పనులు భారత దేశంలోనూ నిషిద్ధాలు. మత సమైక్యత, ప్రాంతీయ సమైక్యత, కుల సమైక్యత వీటికి ఎల్లలు లేవు. మనకి పరాయి దేశంలో అన్యాయం జరిగినప్పుడు– భారతీ యులం. అంతా సవ్యంగా ఉన్నప్పుడు తమిళులం, ఫలానా కులం వారం, ఫలానా ప్రాంతం వారం. మన కోసం పొలాలు అమ్మి, పొట్టకట్టుకుని పనిచేసినవారు ఇంకా మనదేశంలో వృద్ధాశ్రమాలలో ఏకాకులుగా ఉన్నారు– అని మరచిపోతున్నాం. మనలాగే పరాయి దేశాల నుంచి వచ్చిన వారికి బాధ్యతారాహిత్యమైన ఈ విశృంఖలత్వం– వెగటుగా కనిపిస్తుంది. ఫలితం ఏమిటి? అక్కడివారిలో వీరి వికారాలపట్ల విసుగు. ఆత్మన్యూనతా భావం. మత్సరం. ఏతావాతా– అమెరికాలో ఉన్న భారతీయులు అమె రికా వారితో ఏకోన్ముఖం కాక, తమదైన సంస్కృతినీ, ఐడెంటిటీని తమ వెర్రితలలతోనూ పెంచుకోవాలని చూస్తున్నారు. గొంతులు చించుకుంటున్నారు. బహు శా– ఇదే ట్రంప్గారి ఆలోచనా ధోరణికీ, తత్కారణంగా రెచ్చిన దుష్ప్రభావానికీ పెట్టుబడి కావచ్చు. చివరగా– నాకు ఎవరో ఈ సందేశాన్ని పంపారు. ఇది జెరూసలేమ్ నుంచి జాన్ ముల్లర్ అనే ఆయన ప్రకటించినది. ‘‘తమ ఉనికిని అంగీకరించమని భారతీ యులు అమెరికాని ‘అడుక్కునే’ బదులు– మీ భారతీ యులు ఇండియాలో ఒక ‘అమెరికా’ను తయారు చేసు కోలేరా? ఇజ్రేల్ దేశస్థుడుగా నేను చాలాసార్లు ఇండియా వచ్చాను. ఇండియాలో ఉన్న అపూర్వమైన శక్తి సామర్థ్యా లను గమనించాను. నిజం చెప్పాలంటే మీ భారతీ యులు తమ స్వదేశం నుంచి పారిపోవడానికి ఉర్రూత లూగుతుంటారు. కారణం–అటువైపు జీవితం ‘పచ్చగా’ ‘గొప్పగా’ కనిపిస్తుంటుంది. భారతదేశాన్ని ఆకాశంలో నిలిపే కృషి నిజంగా భారతీయులు చేయగలి గితే ఈ శతాబ్దం భారతదేశానిది. భారతీయులు ఇప్ప టికైనా ఈ సవాలును తీసుకుంటారా?’’ - గొల్లపూడి మారుతీరావు -
అమెరికా.. భూతాల స్వర్గం
జీవన కాలమ్ ట్రంప్ మాటల్లో ఆయన తన జాతిపట్ల అభిమానాన్నే చాటుకున్నాననుకున్నారు. కానీ కొందరు ఇతర జాతులపట్ల తమ దురభిమానంగా దాన్ని తర్జుమా చేసు కున్నారు. ఇందుకు భారతీయులే ‘ఎర’ కావడం ఇంకా దురదృష్టకరం. వైష్ణవ స్వాముల ప్రవచనాలు జరిగినప్పుడు–ప్రత్యేకంగా కార్యకర్తలు అందరూ నామాలు పెట్టుకుని కనిపి స్తారు–పవిత్రంగా. అంతే కాదు. ప్రవచనానికి వచ్చేవా రందరికీ నామాలు పెడుతుం టారు. ఈ ప్రవచనానికి ముందూ ఆ తర్వాతా వీరు నామాలతో కనిపించరు. కానీ ఆ ప్రవచనాలు జరిగే నాలుగు రోజులూ వైష్ణవ భక్తులైపోతారు. ఎందుకని? ప్రవచనం చెప్పే స్వామి మార్గదర్శకత్వం అది. ఆ నాలుగు రోజులూ ‘వైష్ణవ తత్వం’ వారిలో విరా జిల్లుతుంది. ఇది ఓ ప్రముఖ వ్యక్తి సమాజం మీద చెయ్యగల ప్రభావం. ఆ నాలుగు రోజులూ ఆ స్వామి సమక్షం భూతద్దం. వారి సముఖంలో ఓ సదాచారం సుసంపన్నమవుతుంది. అప్పుడప్పుడు ఈ ప్రవచన కర్తలు–‘రేపు శ్రీరామ నవమి. భక్తులకు వడపప్పు ప్రసాదంగా ఇవ్వడానికి తలో పావుసేరు పెసరపప్పు తెమ్మంటార’నుకోండి. మర్నాడు తేలికగా 100 కిలోల పెసరపప్పు పోగవు తుంది. ఒక ప్రముఖుని సత్సంకల్పం భూతద్దం. ఆ సత్యార్యం వారి ఉద్దేశాన్ని సంపన్నం చేస్తుంది. సామూ హికమైన విశ్వాసానికీ, సామూహికమైన వితరణకీ ఓ పెద్దరికం పెట్టుబడి. మరో విధంగా చెప్పాలంటే– వ్యక్తి గత స్వభావాన్ని ఒక ‘ప్రముఖ వ్యక్తి’ భూతద్దంలో నిలు పుతాడు. ఆ వితరణ విశ్వరూపం దాలుస్తుంది. ముస్లింలలో ఎందరో మహానుభావులున్నారు. అద్భుతమైన గాయకులున్నారు. కవులున్నారు. కళాకారు లున్నారు, ప్రవక్తలున్నారు, సౌందర్యవంతులైన నటులు న్నారు, నటీమణులున్నారు. ఇది ఒక పార్శ్వం. కానీ కొందరినయినా తప్పుదారి పట్టించే ఛాందసులైన మత పెద్దలున్నారు. ప్రపంచమంతటా ఉగ్రవాదాన్ని రెచ్చ గొట్టే ఐసిస్ సంస్థ అధినేతక అల్ బాగ్దాదీ ఇరాక్లో చేయగలిగినంత విధ్వంసాన్ని సృష్టించి ఎట్టకేలకు చేతు లెత్తేసి ‘‘ఇరాక్లో మనం పతనమయ్యాం. ఘోర పరా జయం తప్పదు. పారిపోండి లేదా పేల్చుకుని చచ్చి పోండి’’ అని నిన్ననే పిలుపునిచ్చారు. వ్యవస్థని నడి పించే నాయకత్వంలో ఇలాంటి ‘నెగటివ్’ ధోరణి ఎంత భయంకరమో చెప్పడానికి ఇది నిదర్శనం. ఒక నాయకుని వాచాలత్వం, బాధ్యతారహితమైన ధోరణి, అకారణమైన అసహిష్ణుత, ఆలోచనారహిత మైన ఆవేశం ఎంతటి దుష్పరిణామాలకు దారితీయగ లదో గత 43 రోజులుగా అమెరికాలో మనం చూస్తు న్నాం. నాయకుడు మాట తూలితే–అంతగా ఆలోచించ లేని సామాన్యపౌరుడు–దాన్ని ‘ఊతం’ చేసుకుంటాడు. ‘‘నాకు నావాళ్లే ముఖ్యం. మిగతావాళ్ల సంగతి నాకనవసరం’’ అనడం బాగానే ఉంటుంది. అది తన దేశీయులపట్ల ‘అభిమానం’ అనిపించవచ్చు. కానీ నాయకుడు ఈ మాట అంటున్నప్పుడు–ఎక్కువమంది పార్శా్వన్ని చూస్తారని ట్రంప్ వంటివారు గుర్తించక పోవటం దురదృష్టమేకాదు–అనర్థదాయకం. ట్రంప్ గారు ‘‘నాకు నావాళ్లే ముఖ్యం’’ అన్నాడు. రెచ్చిన కొందరు ‘‘మాకు మిగతావాళ్లు ముఖ్యం కాదు’’ అని అనడం లేదు. అని ఊరుకోవడం లేదు. ‘‘వాళ్లని దుర్మార్గంగా ఎదిరించే పని చేస్తున్నారు. ఇది–ఆలోచనని సరిగ్గా నియంత్రించుకోలేని నాయకుడు–ఆలోచన ప్రమేయం లేని ఆవేశపరులకు ‘చురకత్తి’ని చేతికి ఇచ్చి నట్టు. గత వారం రోజుల్లో అతి దారుణంగా కాన్సాస్లో కూచిభొట్ల శ్రీనివాస్ను ‘‘నా దేశాన్ని వదిలిపో’’ అంటూ ఒకరు కాల్చి చంపారు. దక్షిణ కెరొలినాలో హర్నీష్ పటేల్ అనే వ్యాపారిని కాల్చారు. తాజాగా వాషింగ్టన్ (కెంట్)లో దీప్రాయ్ అనే వ్యక్తిమీద మొహానికి గుడ్డ కట్టుకున్న అమెరికన్ కాల్చాడు. నిన్ననే సియాటిల్లో జస్మిత్ సింగ్ని కాల్చారు. ఏక్తాదేశాయ్ అనే అమ్మాయిని న్యూయార్క్ సమీపంలో ఒక అమెరికన్ ఆఫ్రికన్ అవమానించాడు–అందరిముందూ. ఇది విచక్షణ తెలి యని పెద్దల మాటకు– పెద్దరికం చాలని వ్యక్తులు పట్టిన ‘భూతద్దం’. చాలా ప్రమాదకరమైన భూతద్దం. కొత్త వారిని రానివ్వని చట్టాలు కొంతవరకూ బాధపెట్టేవే. కానీ ఉన్నవారిని దారుణంగా హత్యలు చేసే ఆలోచనా ధోరణికి అమెరికా అధ్యక్షుడు కారణం కావడం చాలా చాలా ప్రమాదకరమైన పరిణామం. భూతద్దానికి ఒక దుర్మార్గం ఉంది. దానికింద ఉంచిన ఏ వస్తువునయినా ప్రస్ఫుటంగా చూపిస్తుంది– అది మంచయినా, చెడయినా. బాధ్యతగల అధికారంలో ఉన్న పెద్దల మాట విచక్షణ లేని భూతద్దం లాంటిది. ట్రంప్ మాటల్లో ఆయన తన జాతిపట్ల అభిమానాన్నే చాటుకున్నాననుకున్నారు. కానీ కొందరు ఇతర జాతు లపట్ల తమ దురభిమానంగా దాన్ని తర్జుమా చేసుకు న్నారు. ప్రమాదకరంగా చాటుకున్నారు. ప్రాణాలు తీస్తు న్నారు. ఇందుకు భారతీయులే ‘ఎర’ కావడం ఇంకా దురదృష్టకరం. డల్లస్ నుంచి మా మిత్రుడు ఒక సందేశం పంపాడు: ‘‘ఇకముందు అమెరికాలో జీవనం ‘భూతల స్వర్గం’ కాదు. ‘భూతాల’ స్వర్గం అని. - గొల్లపూడి మారుతీరావు -
‘బొత్తిగా చంటోడు’
జీవన కాలమ్ ఆయన 10, జన్పథ్ రోడ్డులో కూర్చుని ‘అక్షరాలు’ వల్లిస్తే మనకేం అభ్యం తరం లేదు. బోలెడంత టైము తీసుకునే హక్కు వారికుంది. మరో పాతికేళ్లు తీసుకోమనండి. కాకపోతే వారిప్పుడు కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షులు. ఇన్నాళ్లకి కాంగ్రెస్ పెద్దమ్మ షీలా దీక్షిత్ ఓ గొప్ప నిజాన్ని ఒప్పుకున్నారు– రాహుల్ గాంధీ ఇంకా ‘పెద్దమనిషి’ కాలేదని, అందుకు కొంచెం టైం కావాలని. ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదిం చడంలో – మహానుభావు లతో ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిన ఒకనాటి కాంగ్రెసు, ఆ రోజుల్లోనే ‘‘నాకు రాజకీయాలలోకి రావడం ఇష్టంలేదు’’ అని పత్రికల ముందు ఒప్పు కున్న రాజీవ్ గాంధీగారి చేతుల్లోకి వచ్చింది. రాజీవ్ గాంధీ భార్య అయిన ఒక్క కారణానికే సోనియా గాంధీ పదవిలోకి వచ్చారు. ఆవిడ నిర్వాకం ఏమిటో– 35 కుంభకోణాల ద్వారా ఈ దేశం చూసింది. చూస్తోంది. అటు తర్వాత వారి సుపు త్రుడు రాహుల్ గాంధీ. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థంకాదు. న్యాయంగా కాంగ్రెసు వారికీ అర్థం కాకూడదు. కాని వారు కాంగ్రెసు వారు కదా! రాహుల్గారు ‘సీజర్ పెళ్లాం’ లాంటివారు. ఇప్పుడు మొదటిసారి పెద్దమ్మ షీలా దీక్షిత్ నోరిప్పారు. ‘‘రాహుల్ వయసు అతను పరిణతిని సంపాదించడా నికి చాలదు. ఆయన పాపం, ఇప్పుడిప్పుడే విష యాలు తెలుసుకుంటున్నాడు. తన మనసులోని విష యాలు స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడిప్పుడే తరం మారుతోంది. కొంచెం టైమివ్వండి!’’ అని బల్లగు ద్దారు. మాటలు రాని కుర్రాడు జీవితంలో మొదటి సారి నోరిప్పి ‘‘అ..మ్మ, అ..మ్మ’’ అన్నప్పుడు పడే సంతోషం లాంటిది మూర్తీభవించిన మాతృమూర్తి అయిన షీలా దీక్షిత్ గారి గొంతులో ధ్వనించింది. ఆయన 10, జన్పథ్ రోడ్డులో కూర్చుని ‘అక్షరాలు’ వల్లిస్తే మనకేం అభ్యంతరం లేదు. ఇంట్లో బోలెడంత టైము తీసుకునే హక్కు వారికుంది. మనకేం కష్టం? మరో పాతిక సంవత్సరాలు తీసుకోమనండి. కాకపోతే వారిప్పుడు కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షులు. ప్రస్తుతం రాహుల్ గారిలో లోకజ్ఞానం ఉండ వలసినంతగా లేదు కనుక–షీలా దీక్షిత్ వంటి సీని యర్ నాయకులు తొడపాశం పెట్టో, చెవి నులిమో– ‘రాజకీయాలలో కొన్ని విలువలున్నాయి కుర్రవాడా! నువ్వు దేశాన్ని పాలించాలో లేదో రేపు ఓటరు చెప్తాడు. ఈలోగా నీ మాటలు సబబుగా ఉన్నాయో లేదో నువ్వు చూసుకోవాలి’ అంటూ మొదటి పాఠం చెప్పాలి. అక్కరలేని రంగంలోకి–రాజకీయ రంగం లోకి వచ్చిన ఇద్దరు ‘గాంధీ’ ప్రముఖుల ధర్మమా అని ఇప్పటికే దేశం నానా గడ్డీ కరుస్తోంది. ప్రస్తుతం దేశం మరో గాంధీని భరించగలదా అన్నది ధర్మ సందేహం. షీలా దీక్షిత్ మాట వినీవినగానే బీజేపీ నాయ కులు అమిత్షా గారు స్పందించారు. ‘‘నేను నూటికి నూరుపాళ్లూ షీలా దీక్షిత్గారితో ఏకీభవిస్తాను. పాపం, రాహుల్ గారికి పరిణతి లేదు. అది సంపా దించడానికి వారికి చాలా టైం పడుతుంది. అలాంట ప్పుడు ఈ మహానుభావుడిని ఉత్తరప్రదేశ్ మీద రుద్ద డంలో అంతరార్థం ఏమిటో? దేశానికి తలమాని కంగా నిలవగల ఉత్తరప్రదేశ్ బొత్తిగా లోకజ్ఞానం లేని నాయకుల తర్ఫీదుకు ప్రయోగశాలా?’’ అన్నారు. నేను బీజేపీ కార్యకర్తను కాను. కాని అవసరమై నప్పుడు–దేవేంద్ర ఫడ్నవిస్, ఆనందీబెన్ లాంటి వారు దక్షతతో పదవుల్లోకి వస్తూండగా (ఆనందీబెన్ తన వయసు కారణంగా స్వచ్ఛందంగా పదవీ విర మణ చేశారు) 70,80 ఏళ్ల వయస్సు దాటినా పద వుల్ని పట్టుకు వేలాడే ఎన్.డి. తివారీల్ని తయారు చేసిన పార్టీ కాంగ్రెసు. కాగా, గాంధీ కుటుంబం తప్ప మరో ప్రత్యామ్నాయం ఎరుగని–తాజా మూడు తరాల అవ్యవస్థకి తార్కాణం కాంగ్రెసు. ఏమయినా కాంగ్రెసు ‘చంటివాడు’ రాహుల్ని కాంగ్రెసు పెద్దమ్మ భుజానికి ఎత్తుకోవడం ఆమె వాత్సల్యానికి నిదర్శనం. అంతేకాక పార్టీ ‘బుకా యింపు’కీ నిదర్శనం. చివరగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు– ఈ చంటివాడి గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకోవడం సరదాగా ఉంటుంది: ‘‘రాహుల్ గాంధీ ఎప్పుడు దేశం వదిలి వెళ్లినా మనకి బెంగగా ఉంటుంది. ఆయన వెంటనే తిరిగి రావాలని మనమంతా ఎదురు చూస్తాం. ఆయన గొంతు విప్పి మాట్లాడినప్పుడల్లా ప్రస్తుత పాలకులకు ప్రత్యామ్నా యమేమిటో ఆయన గుర్తు చేస్తున్నట్టుంటుంది’’ నా తృప్తికోసం చివరి వాక్యాన్ని ఇంగ్లిష్లో వ్రాయాలని తాపత్రయం. The people of this country can see the alternative that awaits this gov-ernment. చివరగా పెద్దమ్మ షీలా దీక్షిత్ గారికి ఒక విన్నపం: ‘‘అమ్మా! రాహుల్ గాంధీగారి పట్ల మీ అభి ప్రాయంతో మాకు ఏ విధమయిన విభేదమూ లేదు. ఆయన పరిణతికి కావలసినంత టైం ఇవ్వాలన్న విషయంలోనూ మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. కానీ వారి లోకజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఈ దేశాన్ని ‘బలిపశువు’ను చెయ్యవద్దని మా మనవి. ‘గాంధీ’ అయిన ఒక్క కారణానికే రెండు తరాల అవ్యవస్థను భరించిన కారణానికయినా తమరు ఈ దేశాన్ని రాహుల్ అనే చంటివాడికి ‘పాఠశాల’ను చెయ్య కుండా మమ్మల్ని కాపాడమని మా ప్రార్థన!’’ - గొల్లపూడి మారుతీరావు -
నేరమూ - శిక్ష
జీవన కాలమ్ ఇకముందు మనదేశంలో పరిపాలన జైళ్లనుంచీ, వంటిళ్లనుంచీ జరగనుంది కనుక, కర్ణాటక ప్రభుత్వం అగ్రహారం జైలులో తమిళనాడు సీఎం తరచూ తమ నాయకురాలిని కలుసుకోడానికి ఒక ఆఫీసుని కడితే బాగుంటుంది. బెంగళూరు పారప్పన్న అగ్రహారం జైలులో శశి కళకు అన్యాయం జరుగు తోందని నా గట్టి నమ్మకం. అలవాటుగా రెండోసారి అదే నేరానికి అదే జైలుకి వెళ్తున్న వ్యక్తిగా శశికళ కొన్ని సౌకర్యాలను కోర డం అనౌచిత్యం కాదు. లోగడ అక్కడ ఉన్నప్పుడు తన ‘అక్క’ జయలలితతో సమానంగా కొన్ని సౌకర్యాలను అనుభవించారు. కాగా కిందటిసారి ఆవిడ ఒక నేరస్తురాలికి సహాయకు రాలు. ఇవాళ ఒక మెజారిటీ పార్టీ ఎన్నుకున్న నాయ కురాలు. నిన్ననే ఆమె పార్టీ పదవిని చేపట్టింది. చక్కెర జబ్బు ఉన్నది కనుక–ఇంటినుంచి భోజనం, 24 గంటలూ వేడినీళ్లు, ‘బిస్లెరీ’ తాగే నీరు, పరి చర్యకు ఓ పనిమనిషిని కోరుకున్నారు. ముందు ముందు ఆ పార్టీ–ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తమ నాయకురాలికి అలాంటి సౌకర్యాలను డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఆమెది అవినీతి పాలన అని డీఎంకే వాపోయింది. ఒకవేళ వారు ప్రశ్నించాలనుకుంటే రాజ్యాంగాన్ని ప్రశ్నించాలి. ఏ విధంగా చూసినా ఆమె ప్రస్తుత నిర్ణయాలు చట్ట విరుద్ధం కాదు. మెజారిటీ పార్టీ నాయకురాలు, తనకిష్టమయిన నాయకుడిని– పార్టీని ఒప్పించే నిర్ణయించారు. ఆ పని కేంద్రంలో అల నాడు సోనియాగాంధీ కూడా చేశారు. ఇది సబబా అంటారా? రాజ్యాంగంమీద ప్రమాణం చేసిన ఏ మహానుభావులు ఆ ఆలోచనన యినా మనసులోకి రానిస్తున్నారు? ఇలాంటి పరిస్థి తిలో లాలూ గారు వంటింట్లోంచి తన భార్యని తీసు కొచ్చి కుర్చీలో కూర్చోపెట్టారు–తన్నుకు చావండని. మన అదృష్టం– ఈవిడ తోటపని చేసే మాలీని, అట్ల పిండి రుబ్బే ‘తమిళరసి’ని గద్దెమీద కూర్చోపెట్ట లేదు. తేలికగా నాలుగు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉంటున్న నాయకుడిని తన స్థానంలో నిలి పారు. జయలలితకు పన్నీర్సెల్వం ఎంతో, శశికళకు పళనిస్వామి అంత. ఇకముందు మనదేశంలో పరిపాలన జైళ్లనుంచీ, వంటిళ్లనుంచీ జరగబోతోంది కనుక, కర్ణాటక ప్రభు త్వం సత్వరమే అగ్రహారం జైలులో తమిళనాడు సీఎం తరచూ తమ నాయకురాలిని కలుసుకోడానికి ఒక ఆఫీసుని నిర్మింపజేయాలని నా ఉద్దేశం. అలాగే శశికళకి ముందు ముందు–పాండీ బజారు మెదువడ, అడయార్ ఊతప్పం, దిండివనం రసం వండిపెట్టే చిన్న వంటగదిని జైలులో ఏర్పాటు చేయాలని, చేస్తారని నా నమ్మకం. రోజుకి 50 రూపా యల కూలీ సంపాదించే పని– 30 సంవత్సరాలలో 3వేల కోట్లు సంపాదించిన ‘యోగ్యురాలి’ చేత చేయించడం హాస్యాస్పదం. 30 ఏళ్లపాటు ఒక నాయకురాలి విశ్వాసాన్ని సంపాదించుకుని కోట్ల ఆస్తితోపాటు, రాష్ట్ర సీఎం కాగలిగిన ఒక వీడియో టేపుల వ్యాపారిని జైలు దుర్వినియోగం చేసుకుంటోందని నాకనిపిస్తోంది. న్యాయస్థానం న్యాయాన్ని ఎత్తి నిలుపుతుంది. చట్టం గుడ్డిగా శిక్షను అమలు జరుపుతుంది. ఈ రెంటికీ మధ్య– మారుతున్న పరిస్థితులూ, రాజకీయ వ్యవస్థని తమ వినియోగానికి మలచుకుంటున్న నాయకులూ– వీటన్నిటి దృష్ట్యా– శాసనసభలో చొక్కాలు చింపుకుని, మైకులు విరగ్గొట్టిన తెలివైన ప్రజా ప్రతినిధుల మనస్సుల్లో ‘గూండా’ మనస్త త్వాన్ని మేలుకొలిపి–అపశృతి ప్రస్తుతం రాజ్యమేలు తోంది. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తోంది. ప్రజాస్వామ్యానికి ఇంత కంటే మరో మార్గాంతరం లేదా అని–ఒక రబ్రీ దేవి, పది కోట్ల జరిమానాతో పదేళ్ల బహి ష్కరణను అనుభవిస్తూనే ఒక రాష్ట్ర పరిపాలనను తన గుప్పిట్లో పెట్టుకున్న నేరస్థు రాలు–ఈ వ్యవస్థను ప్రశ్ని స్తోంది. జయలలిత ఇవాళ బతి కుంటే పన్నీర్ సెల్వం మరొ కసారి పదవిలో కూర్చునే వారు. బిహారులో ఏ చదువు రాని ఇద్దరు లాలూ ప్రసాద్ కొడుకులు– ఆయన కొడుకుల యిన కారణానికే ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఒక పత్రికలో ఒక పాఠకుడు వెల్లడించిన అభి ప్రాయాలివి: 18 సంవత్సరాల కిందట కేవలం పదవి కారణంగా 86 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్విని యోగం చేసిన ఒక నాయకురాలు–కోర్టు తీర్పు ఆలస్యం అయిన కారణానికి ఈ రెండు దశాబ్దాలూ సమాజాన్ని నడిపించే స్థానంలో నిలిచి, కేవలం ‘మృత్యువు’ కారణంగా తీర్పును తప్పించుకున్న విలక్షణమైన స్థితికి ఎవరు కారణం? ఈ 18 సంవత్సరాలూ ఆమెతో కలిసి ఉంటూ– ఆమె కార్యక్రమాలలో జోక్యం ఉందన్న ఒక్క కారణానికే ‘చిన్నమ్మ’ అవతారం ఎత్తిన మరొక నేరస్తురాలు పరిపాలనను తన చేతుల్లోకి తీసుకోగలగడానికి బాధ్యత ఎవరిది? ఇది బొత్తిగా లోకజ్ఞానం లేని పాఠకుడి మదన. ఏమైనా చేసిన నేరాలకు 20 సంవత్సరాల వ్యవధిని అతి సుళువుగా ఈ వ్యవస్థ ఇవ్వగలదనే ‘దమ్ము’ నేరస్తుడి మొండి ధైర్యానికీ, వ్యవస్థ బలహీనతకీ నిదర్శనం–అని ఈ అమాయకుడైన పాఠకుడు గింజు కున్నాడు. ఆయన్ని మనం తేలికగా క్షమించవచ్చు. - గొల్లపూడి మారుతీరావు -
ట్రంపయ్య విన్యాసాలు
జీవన కాలమ్ మంచికో చెడుకో, ఒబామా మీద కసితోనో, పదవిమీద వ్యామోహంతోనో ఆయన ప్రపంచంలో కల్లా అతి బలమైన పదవిలో కూర్చున్నారు. ఇది ప్రతాపరుద్రుడి సింహాసనం మీద రజకుడి పాత్ర కాదు. రాజకీయ నాయకుడు రెండు రెళ్లు తప్పనిసరిగా ఆరు అవుతుందని ప్రజల్ని మర్యాదగా నమ్మించాలని చూస్తాడు. రెండు రెళ్లు మూడంటే ‘ఇది ప్రతి పక్షాలు నామీద చేస్తున్న కుట్ర’ అంటాడు. రెండు రెళ్లు నాలుగు అంటే ‘నేను ముందే చెప్పాను కదా?’ అంటాడు. కోపం రాజకీయ నాయకుని శత్రువు. చిరునవ్వు పనిముట్టు. లౌక్యం ఆయుధం. ఒబామా నిఖార్సయిన రాజకీయ నాయకుడు. పాకిస్తాన్ ఎన్నిసార్లు ఎన్నిరకాలైన దౌర్జన్యాలు చేసినా అమెరికా వారిని సిద్ధాంతపరంగా హెచ్చరిస్తూనే ఉంది. మరొకపక్క బిలియన్ల ఆర్థిక సహాయం చేస్తూనే వచ్చింది. ‘మొదట మీ పెరట్లో దౌర్జన్యాన్ని అరికట్టండి’ అన్న హిల్లరీ క్లింటన్ మాటని మనం చాలాకాలం నెత్తిమీద పెట్టుకుని ఊరేగాం. ఊరేగుతా మని అమెరికాకి తెలుసు. దౌర్జన్యాలు చేస్తున్న పాకి స్తాన్కి తెలుసు. ఇది చిన్న ఉదాహరణ. మరి ట్రంప్ గర్జించగానే ‘హఫీద్ సయీద్’ని పాకిస్తాన్ నిర్బం ధంలో ఎందుకుంచింది? వారికర్థమయ్యే ‘భాష’ ట్రంప్ దొర మాట్లాడాడు కనుక. డొనాల్డ్ ట్రంప్ రాజకీయ నాయకుడు కాదు. వ్యాపారి. వ్యాపారికి ఈ రాజకీయపరమైన శషభి షలు లేవు. వ్యాపారికి నిక్కచ్చితనం లాయకీ. 2011 మే 1వ తేదీన ఒబామా పాత్రికేయులకి వార్షిక విందుని ఇచ్చాడు. అంతకుముందు ట్రంప్గారు ఒబామా పుట్టిన తేదీని, స్థలాన్నీ ప్రశ్నించారు. ఈ విందుకి ట్రంప్నీ ఆహ్వానించారు. ఆ విందులో ఒబామా ట్రంప్ని అతిథులందరిముందూ చెడా మడా కడిగేశారు. ‘డొనాల్డ్ నా పుట్టుక తేదీని ప్రశ్నిం చారు. ఇప్పుడు ఏకంగా నేను పుట్టిన వీడియోనే చూపించబోతున్నాను’ అంటూ వాల్ట్ డిస్నీ ‘‘ది లైన్ కింగ్’’ కార్టూన్ వేసి చూపించాడు. అతిథులు నవ్వు లతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ రోజున తన 70వ ఏట మొదటిసారిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చెయ్యాలని ట్రంప్ నిర్ణయించుకున్నాడని వార్త. మొదటినుంచీ ఎవరూ ట్రంప్ని సీరియస్గా తీసు కోలేదు. అందరికీ అతను ఓడిపోతాడనే దృఢమైన నమ్మకం ఉండేది. పాపులర్ ఓటు హిల్లరీ క్లింటన్కే దక్కింది. కానీ అమెరికా ఓటరు ట్రంప్ని అధ్యక్షు డిగా ఎన్నుకున్నాడు. అది మరచిపోకూడదు. మరొక్కసారి– ట్రంప్కి రాజకీయమైన ‘సన్నాయి నొక్కులు’ తెలీవు. పదవిలో కూర్చోగానే ఎనిమిదేళ్లలో ఒబామా చేసిన సంస్కరణలన్నీ– సమూలంగా అటకెక్కించే ప్రయత్నం చేశాడు– ఆయన మీద ‘గుర్రు’ ఉంది కనుక. ఉందన్న విష యాన్ని ముందునుంచీ చెప్తూనే ఉన్నారు. చెప్పిందే చేశారు. పెదవడ్లపూడి రైతు స్థానిక రచ్చబండ దగ్గర కూర్చుని భావించే ధోరణిలోనే ట్రంప్గారు బల్లగుద్ది కొన్ని నిజాలని వక్కాణించారు. అవి నిజాలని మనం మరిచిపోకూడదు. ఇన్నేళ్లలో ఐక్యరాజ్యసమితికి అమె రికా బిలియన్లు ఖర్చు చేసింది. ఆ సంస్థ ఏం ఒరగ బెట్టింది? ఇరాక్æ యుద్ధం, ఇరాన్ వ్యవహారం, పాకి స్తాన్ దౌర్జన్యం–వేటికి పరిష్కారమో, స్పందనో ఆయా దేశాలు వినేటట్టు చూపగలిగిందా? మరెం దుకూ ఈ దిక్కుమాలిన సంస్థ? పాకిస్తాన్ ఒకపక్క దౌర్జన్యం జరుపుతుండగా బిలియన్ల సహాయం ఎందుకు చెయ్యాలి? ఇటుపక్క అమెరికన్ యువతకి ఉద్యోగాలు లేక అల్లాడుతుండగా విదేశాల నుంచి ఆయా నిపుణుల్ని ఎందుకు రానివ్వాలి? ఒక్క క్షణం ట్రంప్ చర్య వల్ల మనవారు అమెరికా వెళ్లగల అవకాశాలు తగ్గిపోతాయన్న విషయాన్ని పక్కన పెడితే– ఆ దేశం ఎన్నుకున్న– ఆ దేశానికి జరగవల సిన ఉపకారం గురించి కుండబద్దలు కొట్టి చెప్తున్న మాటలివి. ఈ వ్యాపారి ‘బుకాయింపు’ చూడండి. మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి కాందిశీ కులు వస్తున్నారు. అందువల్ల నష్టం అమెరికాకి. కనుక వారు రాకుండా ఒక గోడ కట్టాలి. ఎవరు కట్టాలి? నష్టం ఎవరికి జరుగుతోందో వారు కట్టు కోవాలి. కానీ ఈ ‘వ్యాపారి’ ఆ గోడకి అయ్యే ఖర్చు మెక్సికో భరించాలన్నారు. అలాగే హింసని ప్రోత్సహిస్తున్న ఏడు దేశాల నుంచి ఆయా పౌరులు రావడాన్ని నిషేధించారు. ఆ చట్టాన్ని అమెరికా ప్రధాన న్యాయస్థానం కొట్టి పారే సింది. ట్రంప్ మళ్లీ చట్టాన్ని చేస్తానంటున్నారు. చేసినా ఆశ్చర్యం లేదు. ఆయన వ్యాపారి. తెగేవరకూ లాగడు. తెగేలాగ లాగుతాడు. మంచికో చెడుకో, ఒబామా మీద కసితోనో, పదవిమీద వ్యామోహంతోనో ఆయన ప్రపంచంలో కల్లా అతి బలమైన పదవిలో కూర్చున్నారు. ఇది ప్రతాపరుద్రుడి సింహాసనం మీద రజకుడి పాత్ర కాదు. నాలుగు దశాబ్దాలు–వ్యాపార కీలకాలు ఎరి గిన వ్యాపారి చేతిలోకి వచ్చిన ప్రపంచంలోకల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం పగ్గాలు. అప్పుడేమవుతుంది? ప్రస్తుతం ‘అమెరికా’ అవుతుంది. పరిపాలన రోడ్డుమీద పడదు. కానీ– రాజకీయాలలో అలవాటైన ‘సన్నాయి నొక్కులతో’కాక– చాలా సందర్భా లలో కుండబద్దలుకొట్టే ‘పాలన’ సాగుతుంది. ఆ ‘సాగుడు’ అప్పుడే ప్రారంభమైంది. - గొల్లపూడి మారుతీరావు -
ఓటమి వైభవం
జీవన కాలమ్ ఓటమికి ఉదాత్తత కావాలి. విజయానికి వినయం కావాలి. ఆ రెంటినీ పుష్కలంగా ప్రదర్శించిన టెన్నిస్ దిగ్గజాలు వారిద్దరూ. ప్రపంచమంతా ఏకమయి ముందు నాడాల్కీ, తర్వాత ఫెడరర్కీ జేజేలు పలికింది. కవి కవిత్వం చెప్తాడు. కాని వాల్మీకి ఋషి. శ్రీరాముడు అలవోకగా, క్రీడ లాగా బాణాలు సంధిస్తే శత్రువులు పిట్టల్లాగ కూలిపోయేవారని రాస్తే కవి కనుక, చెప్పింది శ్రీరాముడి గురించి కనుక అలా వ్రాసి ఉంటాడనిపించేది. లేకపోతే అయన క్రీడ లాగా బాణాలు వేయడమేమిటి? శత్రువులు పిట్టల్లాగ కూలిపోవడమేమిటి? కాని ఒక క్రీడాకారుడిని చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. అయన పేరు రోజర్ ఫెడరర్. వింబుల్డన్ రోజుల్లో రోలెక్స్ వాచీ కోసం వచ్చే ప్రకటన నాకు చాలా ఇష్టం. అతి లాఘవంగా, హుందాగా, ఒక కళలాగ తను కదులుతూ, ముఖంలో ఏమాత్రం ఆవేశం లేకుండా బంతిని కొట్టే ఫెడరర్ నైపుణ్యం, తన ప్రతిభ మీద తనకు గల అధికారాన్ని ప్రతీ అవయవంలోనూ ప్రతిఫలించగా ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం వాల్మీకిని గుర్తు చేస్తుంది నాకు. ఆ వ్యాపార ప్రకటన రోలెక్స్కి ఫెడరర్ చేస్తున్నట్టుకాక, ఫెడరర్ జీనియస్కి రోలెక్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాగా ఫెడరర్ ఒక మాట అన్నాడు, ‘నేను నాడాల్కి నంబరు వన్ ఫ్యాన్ని’’ అని. ఇద్దరూ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గొప్ప ఆటగాళ్లు. కాగా నాడాల్ ఆట ఒక ప్రభంజనం. ఒక హుద్ హుద్. ఫెడరర్ ఆట కళ. ఒక విన్యాసం. రెండూ ప్రత్యర్థిని మట్టికరిపించే ఆటలే. ఫెడరర్, నాడాల్ ఇంతవరకూ 35 సార్లు ఆడగా నాడాల్ ఫెడరర్ మీద 23 సార్లు గెలిచాడు. కాని ఇటీవలి ఆస్ట్రేలియా ఓపెన్లో ఫెడరర్ నాడాల్ల ఆట అద్భుతం. రూఢిగా జయించగల నాడాల్ని అయిదు సెట్లలో ఫెడరర్ జయించడం కాదు, నాడాల్ ఓటమిని అంగీకరించక తప్పనట్టు చేసిన పోరాటం అపూర్వం. అయితే ఆ అద్భుతం అక్కడితో ముగియలేదు. నాడాల్ అన్నాడు, ‘‘ఇలాంటి సందర్భాలలో నేను చాలాసార్లు ఫెడరర్ని ఓడించాను. కాని ఇవాళ నన్ను జయించడానికి ఆతను చేసిన కృషి స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ నాకంటే బాగా ఆడాడు. ఈసారికి కప్పుని ఆయన దగ్గర ఉంచుకోనిస్తాను. నేను మళ్లీ వస్తాను’’ అన్నాడు. ఫెడరర్ అన్నాడు, ‘‘ఓటమి, విజయాలను పక్కన పెట్టి ఇద్దరినీ సరిసమానంగా తూకం వేస్తే ఇవాళ ఈ కప్పుని మేం ఇద్దరం పంచుకోవాలి’’ అంటూ నాడాల్ వైపు తిరిగి ‘‘ఆటమానకు రాఫా, ప్లీజ్. టెన్నిస్ ఆటకి నీ అవసరం చాలా ఉంది’’ అంటూ ‘‘‘రాఫా ప్రతిసారీ నాఆటని మెరుగు దిద్దుతున్నాడు’’ అన్నాడు. ఓటమికి ఉదాత్తత కావాలి. విజయానికి వినయం కావాలి. ఆ రెంటినీ పుష్కలంగా ప్రదర్శిం చిన టెన్నిస్ దిగ్గజాలు వారిద్దరూ. ప్రపంచమంతా ఏకమయి ముందు నాడాల్కీ, తర్వాత ఫెడరర్కీ జేజేలు పలికింది. ఎన్నో కారణాలకి ఈ ఫైనల్స్ ఒక చరిత్ర. ఈ ఆటగాళ్లిద్దరినీ దాటి టెన్నిస్ అప్పుడే చాలా దూరం ప్రయాణం చేసింది. ఆండీ ముర్రే, డోకోవిచ్ ఇప్పుడు బరిలో ఉన్న యోధులు. కాగా ఫెడరర్ ఆరు నెలల కింద ఆటలో గాయపడి చికిత్స తీసుకుంటున్నాడు. అతని వయస్సు 35. నాడాల్ వయస్సు 30. గాయం, ఆట నుంచి విశ్రాంతి కారణంగా ఫెడరర్ ‘‘అలసిన’ యోధుడు కింద లెక్క. కాని నిన్నటి ఆట బరిలో వయస్సుని జయించి ఇద్దరు ఆటగాళ్లు ఏడేళ్ల కిందటి వారి ఆటని గుర్తు చేశారు. ప్రతిభకీ, జీనియస్కీ వయస్సు లేదని మరోసారి నిరూపించారు. ఆటలో ఆఖరి బంతితో విజయాన్ని సాధించిన ఫెడరర్ గురించి ఒక పాత్రికేయుడు కేవలం కవిత్వమే రాశాడు, ‘‘ఆనందమూ, ఆవేశమూ కట్టలు తెంచుకోగా ఆర్టూ, హార్టూ ఊదారంగు బూట్లమీదికి జారిన ఫెడరర్ 18వ గ్రాండ్ స్లామ్ విజయాన్ని పొదివి పట్టుకుని అయిదేళ్ల పసిబిడ్డలాగ భోరుమన్నాడు.’’ ఇది ఇంగ్లిష్ వాక్యానికి భయంకరమైన అనువాదం. క్షమించాలి. శ్రీరాముడు అవలీలగా, క్రీడగా బాణాలు వర్షించడం నాకిప్పుడు అర్థమవుతోంది. అపూర్వమ యిన ప్రతిభ, సామర్ధ్యం పట్ల చెరిగిపోని అత్మ విశ్వాసం, పట్టుదల, తన కళ పట్ల ఆరాధనాభావం ఉన్న ప్రతిభావంతుడు చెలరేగితే విరుచుకుపడే ఉప్పెన అయినా అవుతాడు, విప్పారే కలువపువ్వ యినా అవుతాడు. ఇందుకు నిదర్శనం మొన్న మెల్బోర్న్ రాడ్ లీవర్ స్టేడియంలో అవిష్కృతమైన మహా దృశ్య కావ్యం. - గొల్లపూడి మారుతీరావు -
అనువుగాని చోట్లు
జీవన కాలమ్ ఆ మధ్య పుణేలో ప్రసిద్ధ గాయకుడు సోనూ నిగమ్ తుప్పతల, పిల్లిగెడ్డం పెట్టుకుని వీధిలో ఒక చెట్టు కింద హార్మోనియం పట్టుకుని పాటలు పాడారట. ఒక్కడు కూడా ఆయన సంగీతాన్ని పట్టించుకోలేదట. నాకు బాగా గుర్తు. ఎన్.టి. రామారావు నటించిన పుండరీకాక్షయ్యగారి చిత్రం ‘ఆరాధన’ రజతోత్సవ సభ హైదరాబాద్లో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్లో జరిగింది. ఉత్సవానికి లోపలికి వెళుతుండగా గేటు దగ్గర ఎవరో నన్ను ఆపేశారు. నా వెనుకనే వస్తున్న ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చిన్న సత్యంగారు ముందుకు దూకారు. ‘‘ఆయన ఈ చిత్ర రచయిత బాబూ!’’ అని వివరించారు. అప్పటికి నేను నటుడిని కాదు. నా రచయిత పరపతి థియేటర్ గేటు కీపర్ దాకా ప్రయాణం చెయ్యలేదు. 1975 ఏప్రిల్లో హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి. మండలి వెంకట కృష్ణారావు విద్యామంత్రి. స్టేజీ మీద టంగుటూరి సూర్యకుమారి ‘మా తెలుగుతల్లికి’ గీతం పాడు తోంది. మాసిన బట్టలతో ఒకాయన గేటు దగ్గరికి వచ్చాడు. గేటు కీపర్లు ఆయన్ని ఆపారు. ‘ఆ పాట రాసింది నేనే’ అన్నాడాయన. అయినా వారు వద ల్లేదు. ఈలోగా ఎవరో ఆయన్ని గుర్తుపట్టి అధికారు లకి చెప్పారు. కార్యకర్తలు పరుగున వచ్చి ఆయన్ని సాదరంగా లోపలికి తీసుకెళ్లారు. ఆయన శంకరం బాడి సుందరాచారి. మర్నాడు విశ్వనాథ సత్యనారా యణ అధ్యక్షత వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మనకి సామెతలు ఊరికే రాలేదు– ‘వెండి పళ్లానికైనా గోడ చేర్పు కావాలి’. ప్రతీ గొప్ప తనానికీ ‘అనువుగాని చోటు’ ఒకటుంటుంది–అని. దీనిని సోదాహరణంగా నిరూపించిన విచిత్ర మైన, కానీ అపురూపమైన ప్రయోగం జరిగింది. 2007లో వాషింగ్టన్ లెఫెంట్ ప్లాజా మెట్రో స్టేషన్లో ప్రపంచ ప్రఖ్యాత వయొలినిస్ట్, గ్రామీ అవార్డు గ్రహీత జోషువా బెల్ బేస్బాల్ ఆటగాడి టోపీ పెట్టుకుని–వీధిలో తిరిగే వాద్యగాడిలాగా కూర్చుని వయొలిన్ వాయించాడట. ఆయన వయొలిన్ ఖరీదు 30 లక్షల డాలర్లు. ప్రపంచ ప్రఖ్యాత మెండల్సన్, బాఖ్ సంగీతాన్ని వాయించాడు. అది నూరు సంవత్స రాలుగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన అపురూపమైన సంగీతం. అయితే ఆనాడు యూనియన్ స్టేషన్లో 1,070 మంది ఆయన సంగీతాన్ని పట్టించుకోకుండా హడావుడిగా తమ తమ గమ్యాలకి పరుగులు తీశారు. కేవలం 27 మంది ఒక్కక్షణం ఆగి ముందుకు తరలి పోయారు. ఆయన బాఖ్ వాయిస్తూ ఉంటే హాలులో ఒక గుండుసూది కిందపడినా శబ్దం మారుమోగుతుందట. ఈ కథ విని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నవ్వుతూ అన్నాడట: ‘‘నాకు తెలిస్తే నేను అక్క డికి వచ్చేవాడిని’’ అని. బెల్ నవ్వి–నిజంగా ఆయన వచ్చి ఉంటే మరో కారణానికి–అంటే అమెరికా మాజీ అధ్యక్షుడిని మెట్రో రైలు స్టేషన్లో చూస్తున్నందుకు తెల్లబోయినవారు–అప్పుడు నా సంగీతాన్ని పట్టించు కునేవారు కాదు–అన్నాడట. ఈ కథని విన్న చాలా మంది నవ్వుతూ తమ ట్వీటర్లలో చమత్కరించారట. ‘‘ఇది ఏసుప్రభువుని మరచిపోయిన క్రిస్టమస్ లాంటిది’’ అని. ఈ ప్రయోగాన్ని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక నిర్వహించింది. దీన్ని చిన్నపిల్లలకు నీతికథగా వ్రాస్తే ఆ పుస్తకానికి పులిట్జర్ బహుమతి లభించింది. ఆయన ప్రముఖ నటీమణి మెరిల్ స్ట్రీప్తో ‘సీసేమ్ స్ట్రీట్’లో నటించారు. అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ మహారాణి సమక్షంలో జోషువా బెల్ ప్రత్యేక ప్రదర్శ నలిచ్చారు. ఆ మధ్య పుణేలో ప్రసిద్ధ గాయకుడు సోనూ నిగమ్ తుప్పతల, పిల్లిగెడ్డం పెట్టుకుని వీధిలో ఒక చెట్టు కింద హార్మోనియం పట్టుకుని పాటలు పాడా రట. ఒక్కడు కూడా ఆయన సంగీతాన్ని పట్టించు కోలేదట. ప్రపంచంలో ప్రతి గొప్ప కళకీ చక్కని ఫ్రేమ్ కావాలి. ఆలంబన కావాలి. ఫోకస్ కావాలి. చిన్న ఉపో ద్ఘాతం కావాలి. మన తెలుగు సినిమాల్లో యముడూ, చిత్రగుప్తుడూ కిరీటం, గదతో మన రోడ్ల మీదకు వచ్చి ‘నేను యముండ’ అంటే, ‘మనది ఏ నాటక కంపెనీ బాబూ!’ అని పలకరించడం చూశాం. ఆలయంలో అడుగు పెట్టిన క్షణం నుంచీ మంచి గంధం పరిమళం, గర్భగుడిలో మోగే గంటల రవళి, కర్పూర హారతి, అష్టోత్తర నామావళి–ఇవన్నీ ఒక పవిత్రమైన ఆలోచనా సరళిని ఒక ‘మూడ్’ని ్చఝbజ్చీ nఛ్ఛిని కల్పిస్తాయి. ఊరేగింపుకి స్వామి ఊరికేరాడు. ముందు మేళతాళాలు వస్తాయి. వెనుక భక్త బృందం నడుస్తుంది. తర్వాత ఏనుగులు నడుస్తాయి. తర్వాత పల్లకీ కనిపిస్తుంది–అప్పుడూ స్వామి దర్శనం. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు జోషువా బెల్ని రద్దీగా ఉన్న యూనియన్ స్టేషన్లో కూర్చోబెట్టిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ప్రయోగం ఓ గొప్ప సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రతీక. ఈ వాస్తవం విపర్యాయా నికీ–అంటే ‘అనువుగాని చోట’ ఎంత గొప్ప కళయినా వీగిపోతుందనడానికీ ఈ ప్రయోగం తార్కాణం. గొల్లపూడి మారుతీరావు -
ఓ ‘‘చౌకీదారు’’ కథ
జీవన కాలమ్ నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. కొంతకాలం కిందట నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కాలమ్ రాశాను. నా ఆభిమాని దగ్గర్నుంచి సుదీర్ఘమైన ఈ మెయిల్ వచ్చింది.‘‘నరేంద్రమోదీని పొగడకండి సార్! అతను దుర్మార్గుడు. కర్కశుడు’’ ఆంటూ రాశాడు. నాకూ మా మిత్రుడితో ఏకీభవించాలని ఉంది. ఒక్క క్షణం నరేంద్రమోదీ అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రిని మరిచిపోదాం. కేవలం ముగ్గురు నాయకుల నమూనా కథలు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యేనాటికి కొడుకు హరిశాస్త్రి అశోక్ లేలాండ్ కంపెనీ ఉద్యోగి. తీరా ఈయన ప్రధాని అయ్యాక హరిశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజరుగా కంపెనీ ప్రమోషన్ ఇచ్చిందట. ‘‘వారెందుకిచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోడానికి. నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. లేదా నేను చేస్తాను’’ అని ఉద్యోగం మాన్పించారు. ఒక ముఖ్య మంత్రి చొక్కా తొడుక్కున్నాక బొత్తాం తెగిపోతే నౌఖరు అ బొత్తాన్ని నిలబెట్టే కుట్టిన కథ చదు వుకున్నాం. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఒకాయన–ఎమ్మెల్యే. సభ అయ్యాక చేతిలో ఖద్దరు సంచీతో–రూటు బస్సు ఎక్కడం నాకు తెలుసు. ఆయన పేరు వావిలాల గోపాల కృష్ణయ్య. ఒకావిడ.. పదవిలోకి రాకముందు కేవలం ఒక స్కూలు టీచరు. అవిడ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు మాయావతి. ఆమె సోదరుడు అనందకుమార్. 2007లో ఆ మహానుభావుడి ఆదాయం 7 కోట్లు. 7 సంవత్సరాలలో 1,316 కోట్లు అయింది. అంటే 26 వేల శాతం పెరిగింది! అయన ముఖ్యమంత్రి సోదరుడు అన్న కారణానికి ఒకానొక బ్యాంకు సున్నా వడ్డీతో 67 కోట్లు అప్పు ఇచ్చింది. ఇక ములాయంగారి బంధుజనం వందల లెక్కలో ఉన్నారు. వారిని మీరు వెదకనక్కరలేదు. ఉత్తరప్రదేశ్ ప్రతీ పదవిలోనూ, వ్యాపారంలోనూ తమరు దర్శించవచ్చు. ఇక నరేంద్ర మోదీ కథ. ఆయన బంధువులెవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మొన్న ఇండియా టుడేలో వచ్చిన వ్యాసంలో వివరాలు చూద్దాం. ఒక బాబాయి కొడుకు–అరవింద్ భాయ్–నూనె డబ్బాలు కొనుక్కుని, అక్కర్లేని పాత ఇంటి సామాన్లను కొనుక్కుని–వాటిని అమ్మి నెలకు 9 వేలు సంపాదించుకుంటాడు. అతని కొడుకు గాలిపటాలు, పటాసులు, చిన్న చిరుతిళ్లను తయారు చేసి అమ్మి వాద్నగర్లో చిన్న గదిలో ఉంటాడు. జయంతిలాల్ అనే మరో సోదరుడు టీచరుగా పనిచేసి రిటైరయ్యాడు. అతని కూతురు లీనాను ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్లి చేశాడు. వాద్ నగర్లో ఎవరికీ వీళ్లు నరేంద్రమోదీ అనే ప్రధాని బంధువులని కూడా తెలీదు. మోదీ అన్నయ్య–సోంభాయ్ (వయస్సు 75) పుణేలో ఒక వృద్ధాశ్రమం నడుపుతాడు. ఒకా నొక సభలో కార్యక్రమాన్ని నిర్వహించే అమ్మాయి ‘‘ఈయన నరేంద్రమోదీ అన్నగార’’ని నోరు జారింది. ఆయన మైకు అందుకున్నాడు. ‘‘నాకూ ప్రధాని మోదీకి మధ్య పెద్ద తెర ఉంది. మీకది కని పించదు. అవును. నేను నరేంద్రమోదీ అన్నయ్యని. ప్రధానికి కాను. ప్రధాని మోదీకి నేనూ 1.25 కోట్ల భారతీయుల వంటి సోదరుడిని’’ అన్నారు. మోదీ అన్నయ్య అమృతాభాయ్(72) చెప్పాడు: 1969లో అహమ్మదాబాద్ గీతామందిర్ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్లో టీ దుకాణం నడిపే రోజుల్లో–ఆ దుకాణం నిజానికి వారి మేన మామది–మోదీ రోజంతా పనిచేసి–ఆర్.ఎస్.ఎస్. ఆఫీసుకి వెళ్లి వృదులైన ప్రచారక్లకు సేవ చేసి–ఏ రాత్రికో కొట్టుకే వచ్చి క్యాంటీన్ బల్లమీదే నిద్రపోయేవాడట–ఇల్లు ఒకే గది ఉన్న వసతి కనుక. 2003లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబంతో ఒకసారి మోదీ గడిపారట. మరి 2012లో ఎందుకు మళ్లీ గడపలేదు? ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నాడుకదా: అధికారంతో వారి బంధుత్వం వారి అమాయకమైన జీవనశైలిని కల్మషం చేస్తుందని. ఆనందకుమార్కీ, రాబర్ట్ వాద్రాకీ ఈ మాట చెప్పి చూడండి. నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. నేను ప్రధాని గురించి మాట్లాడడం లేదు. సోంభాయ్ చెప్పిన ప్రధాన చౌకీదారు గురించి చెప్తున్నాను. నా అభిమాని నన్ను మరొక్కసారి క్షమించాలి. మోదీకి జోహార్! (వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు ) -
కోళ్లూ–కుంపట్లూ
జీవన కాలమ్ పదవిలో ఉండే అర్హత తనకి లేకపోతే వంటగదిలోంచి భార్యల్ని ముఖ్యమంత్రి పదవికి బదిలీ చేసిన ఘనులున్న దేశం మనది. తన చెప్పుచేతల్లో ఉన్న ‘చెంచా’ని పదవిలో ఉంచి–ఇంటి నుంచే పాలన చేసే నాయకులున్న రోజులివి. ప్రపంచంలో కల్లా బాగా డబ్బున్న క్రికెట్ సంస్థ ఇండియా క్రికెట్ బోర్డు. కేవలం ఆదాయం కారణంగా ప్రపంచంలోని క్రికెట్ దేశాల న్నింటినీ శాసించే స్థితిలో ఉంది భారతదేశం. ఇది ఊహించనంత తియ్యని బెల్లం. బెల్లం ఉన్నచోట చీమలు చేరడం సహజం. కానీ ఈ ‘బెల్లం’ చుట్టూ చీమలే కాదు, పాములూ, జలగలూ చేరి కొన్ని దశా బ్దాలుగా పీల్చుకు తింటున్నాయి. ఆ మధ్య ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త–కేవలం అధికారం కారణంగానే పద విని చేజిక్కించుకుని, తన వారినీ రంగంలోకి దింపి– క్రికెట్ని జూదం చేసిన ఘనతని సాధించారు. సుప్రీం కోర్టు ఈ సంస్థ అవకతవకల్ని పరిశీలించి సూచనలు ఇవ్వడానికి లోధా కమిటీని నియమించింది. లోగడ బోర్డు సంపద కోసం, పదవుల కోసం–ఆటకి సంబం« దంలేని వ్యాపారులూ, రాజకీయ నాయకులూ– కుర్చీల్లో స్థిరపడి–వయసు మీద పడినా ఎవరినీ దగ్గరకి రానివ్వకుండా అధికారాన్ని వెలగబెడుతూ వచ్చారు. శరద్ పవార్, బిహార్ బోర్డును పాలించిన లాలూప్రసాద్ యాదవ్, ఎన్కెపి సాల్వే, మాధవరావ్ సింధియా, అరుణ్ జైట్లీ–నమూనా ఉదాహరణలు. ‘‘కొందరు మహానుభావులు క్రికెట్ని తమ వ్యక్తిగతమైన ఆస్తిగా మలుచుకున్నారు’’ అన్నారు ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులు బిషన్సింగ్ బేడీ. తమ కుటుంబ వార సత్వంలాగా ఈ సంస్థని పాలించారు. ఇకముందు ఈ పప్పులు ఉడకవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ చాలాకాలం దబాయించి ఎదిరించే ప్రయత్నం ప్రస్తుతం పదవిలో ఉన్న పార్లమెంటు సభ్యులు, బోర్డు అధ్యక్షులు అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ అజయ్ షిర్కేలు చేశారు. నిన్ననే సుప్రీంకోర్టు వారి కొమ్ముల్ని కత్తిరించింది. పదవుల్లోంచి తొలగించింది. ప్రస్తుతం లోధాగారి సూచనల ప్రకారం–ఏళ్ల తరబడి పాతుకుపోయి, 70 ఏళ్లు పైబడిన మహానుభావులు– దాదాపు తొంభై శాతం మంది వైదొలగక తప్పదని తెలుస్తోంది. ఇకముందు బోర్డు చేసే ఖర్చులను ఒక దారిన పెట్ట డానికి ఆడిటర్ జనరల్ ఆఫీసరు కమిటీలో ఉంటారు. అయితే పదవిలో ఉండే అర్హత తనకి లేకపోతే వంటగది లోంచి భార్యల్ని ముఖ్యమంత్రి పదవికి బదిలీ చేసిన ఘనులున్న దేశం మనది. తన చెప్పుచేతల్లో ఉన్న ‘చెంచా’ని పదవిలో ఉంచి– ఇంటి నుంచే పాలన చేసే దొంగ దారులు మరిగిన నాయకులున్న రోజులివి. పైన చెప్పిన పారిశ్రా మికవేత్తకి బంధువున్నాడు. లాలూ గారికి శ్రీమతి ఉంది. వీరు పక్కకి తప్పు కోవలసి వస్తే తమ తమ్ముళ్లనీ, చెల్లెళ్లనీ, కొడుకుల్నీ, కూతుళ్లనీ కుర్చీల్లో కూర్చోపెట్టగల దిక్కుమాలిన తెలివితేటలు వీరికు న్నాయి. ఇవన్నీ లోధాగారికి తెలుసు. తెలిసే ఆ ద్వారా లన్నీ పకడ్బందీగా మూసేశారు. లోధాగారు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. సుప్రీంకోర్టు ఆ దెబ్బ తగిలే లాగ తీర్పు నిచ్చింది. ఈ దేశంలో సుప్రీంకోర్టు పెద్ద అత్త. అక్కడ మొట్టికాయలు పడితేగాని ఎవరికీ తృప్తి ఉండదు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం జరగాలన్నా, విడిపోయిన పార్టీలు గుర్తులు పంచుకోవాలన్నా, అవినీతిని నిర్ధారిం చాలన్నా, పదవుల్లోంచి తొలగించాలన్నా, జనగణ మనæపాట పాడాలన్నా ఈ దేశంలో విచక్షణకీ, సామ రస్యానికీ, సౌజన్యానికీ స్థానభ్రంశం కలిగి చాలా రోజుల యింది. ఎవరూ ఎవరి మాటా వినరు. దేనికయినా పెద్దత్తగారిదే ఆఖరిమాట. లేకపోతే స్పష్టమైన అవినీతి ఛాయలు కనబడుతుండగా–ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతి సహేతుకంగా ఇచ్చిన రిపోర్టుని అమలు చెయ్యకుండా తిరగబడే ఘనత–బెల్లం రుచి మరిగిన వారికి ఉండకుండా ఎలా ఉంటుంది? ఏమయినా ఈ తీర్పు పట్ల ఠాకూర్గారి స్పందన చాలా ముచ్చటగా ఉంది. ‘‘నేను న్యాయస్థానం తీర్పుని శిరసావహిస్తాను. అయితే క్రికెట్ సంస్థని రిటైర్డ్ కోర్టు న్యాయమూర్తులు నడుపుతారంటే వారికి నా శుభాకాంక్షలు’’ అని వాక్రుచ్చారు. ఇందులో ఠాకూర్ గారి అక్కసు, అనవసర విష యాలలో కోర్టు తల దూరు స్తోందన్న కినుక తెలుస్తోంది. ‘‘తన కోడీ, తన కుంపటీ ఉంటేకానీ ఇలాంటి సంస్థ నడవదనే చిన్న ‘అహంకారం’ వారి మాటల్లో «ధ్వని స్తోంది. ఈ దేశంలో ‘బెల్లం’ రుచి మరగని సమర్థులు చాలామంది ఉన్నారు. ఉంటారు. చీమలు దూర మయి నంత మాత్రన బెల్లం రుచి తరగదు. వాళ్ల క్రీడల మంచిచెడ్డలు వారే చూసుకునే సత్సంప్రదాయా నికి ఇన్ని దశాబ్దాల తర్వాత– సుప్రీం కోర్టు జోక్యం కావలసి రావడం క్రికెట్కు జరిగిన పెద్ద ఉపకారం. ఏమైనా భారతదేశపు క్రికెట్ ప్రస్తుతం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. తమ ఇంటిని తాము చక్కబెట్టుకునే అవకాశం క్రీడకి మరింత శోభనీ, ‘బెల్లం’ చుట్టూ ఈగలు ముసరకుండా సుప్రీంకోర్టు ధర్మమా అని ‘స్వేచ్ఛ’నీ ఇస్తుందని ఆశిద్దాం. ( గొల్లపూడి మారుతీరావు ) -
‘పిచ్చి’ వృత్తి
వెర్రి వెయ్యి విధాలని సామెత. ఎవడి వెర్రి వాడికి ఆనందం. కానీ దేశం పిచ్చిని తన పిచ్చిని చేసుకున్న ఒక క్రికెట్ అభిమాని ఉన్నాడు. అతని పేరు సుధీర్ గౌతమ్. మీరు అతన్ని ప్రతీ క్రికెట్ ఆటలోనూ చూడకుండా ఉండరు. ఒంటినిండా జాతీయ జెండా రంగు రాసుకుని, చేతిలో పెద్ద జెండాతో –ప్రతీ భారత జట్టు పరుగులకీ జెండా ఎగరేస్తాడు. ‘జై భారత్!’ అని అరుస్తాడు. క్రికెట్ స్టేడియం అంతా మార్మోగుతుంది. ఆరోయేటి నుంచీ సచిన్ టెండూల్కర్కి వీరభక్తుడు. 2002లో సచిన్ పిచ్చి ప్రారంభమైంది. 2003లో ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో మూడు దేశాల కప్పు కోసం ఆడుతున్నప్పుడు 3 వారాలపాటు బిహార్లో ముజాఫర్పూర్ నుంచి బొంబాయికి 1,700 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ కేవలం సచిన్ని కలుసుకోడానికి వెళ్లాడు. ట్రైడెంట్ హోటల్లో సచిన్ పత్రికా సమావేశం జరుగుతోందని తెలిసి వెళ్లాడు. సచిన్ అతన్ని ఇంటికి భోజనానికి తీసుకెళ్లాడు. తర్వాతి మ్యాచ్కి సచిన్ టికెట్ ఇచ్చాడు. కటక్ ఆటలో సచిన్ కాళ్లమీద పడడానికి గ్రౌండ్ మధ్యకి పరిగెత్తాడు. పోలీసులు పట్టుకున్నారు. బయటికి తగిలేశారు. హైదరాబాద్లో ఆస్ట్రేలియా మ్యాచ్లో సచిన్ సెంచరీ చేసినప్పుడు గ్రౌండులోకి పరిగెత్తి సచిన్ కాళ్లమీద పడ్డాడు. ఈసారి పోలీసులు తన్ని జైల్లో పడేశారు. ప్రతియేడూ తన ఊరిలో పండే లిచీపళ్లు తెచ్చి సచిన్కి ఇస్తాడు. సచిన్ ఇతనికి క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనిపెడతాడు. తన ఊళ్లో సుధా డెయిరీలో పనిచేసి విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్కి కావలసిన డబ్బు సమకూడగానే ఉద్యోగం మానేశాడు. 2004లో పాకిస్తాన్లో మ్యాచ్ చూడడానికి సైకిలుమీద పాకిస్తాన్ వెళ్లిపోయాడు. 2009లో కాన్పూర్లో మ్యాచ్ చూడడానికి గేట్లు దూకే ఇతన్ని పోలీసులు చావగొట్టారు. సచిన్ అడ్డుపడ్డాడు. 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు సచిన్ ఇతన్ని ఆటగాళ్ల గదిలోకి పిలిచి ప్రపంచకప్ని పట్టుకోనిచ్చాడు. అది గౌతమ్ జీవితంలో గొప్ప క్షణం. సచిన్ ఆట ఆడే వరకూ అతని ఒంటిమీద జాతీయ జెండాతో పాటు ‘టెండూల్కర్’ అనే అక్షరాలు రాసుకునేవాడు. సచిన్ ఆట విరమించాక ‘మిస్ యూ సచిన్’ అని రాసుకుంటాడు. ఆస్ట్రేలియా వెళ్లడానికి ఒక రేడియో చానెల్ ఇతని ఖర్చులు భరించింది. అయితే మ్యాచ్నాడు ఆస్ట్రేలియా చేరడానికి వీసా దొరకలేదు. గౌతమ్ వెంటనే సచిన్కి ఫోన్ చేశాడు. సచిన్ ఢిల్లీలో ఆస్ట్రేలియా రాయబార ఉద్యోగులతో మాట్లాడాడు. ఒక్క రోజులో వీసా వచ్చేసింది. ఒంటినిండా రంగు వేసుకోడానికి రంగు డబ్బాలు తనతో తీసుకువెళ్తాడు. ఒకసారి న్యూజిలాండ్ అధికా రులు–విమానంలో రంగులు తీసుకువెళ్లినందుకు 65 వేల జరిమానా వేశారు. మళ్లీ సచిన్ రాయబార కార్యాలయానికి ఉత్తరం రాశాడు. జరిమానా రద్దయింది. 33 ఏళ్లొచ్చినా గౌతమ్ పెళ్లి చేసుకోలేదు. ‘నా పిచ్చితో మరో అమ్మాయి జీవితాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి’ అన్నది అతని సమాధానం. ఈ పిచ్చి మొదలయ్యాక తన తండ్రికి ఇష్టం లేదని తెలిసి ఆయనతో మాటలు మానుకున్నాడు. తల్లీ, చెల్లితో మాట్లాడడు. ‘నేను ఈ భూమిమీద ఉన్నంతకాలం భారత టీమ్ నా ప్రాణం. అయితే సచిన్ సార్ పేరే నా శరీరంమీద ఉంటుంది. కాళ్లలో శక్తి ఉండి నడవగలిగే వరకూ సచిన్ పేరే నాకు మంత్రం’ అన్నాడు గౌతమ్. ఇటీవల బంగ్లాదేశ్లో భారతదేశం ఆడుతుండగా సెహ్వాగ్ బంగ్లాదేశ్ బౌలర్ని నాలుగు ఆర్లు కొట్టాడు. గౌతమ్ జెండా రెపరెపలాడింది. స్టేడియం ‘జై భారత్!’ అంటూ ప్రతిధ్వనించింది. బంగ్లాదేశ్ అభిమానులు గౌతమ్ని చావగొట్టారు. జెండాని చింపేశారు. అభిరుచి అభిమానమై, అభిమానం భక్తి అయి, భక్తి అంచులు తెంచుకుని పిచ్చిగా స్థిరపడి– ఆ పిచ్చిని వృత్తిని చేసుకున్న విచిత్రమైన వ్యక్తులు వీరు. ఆట ఆడేవారికి తృప్తి ఉంది. ఆదాయం ఉంది. కీర్తి ఉంది. భార్యలున్నారు. ప్రియురాళ్లున్నారు. రిటైరయ్యే వయస్సుంది. కానీ గౌతమ్కి తల్లినీ, తండ్రినీ, చెల్లినీ, ఉద్యోగాన్నీ, చదువునీ, భవిష్యత్తునీ, రేపునీ వదులుకున్న ‘పిచ్చి’ మాత్రమే ఉంది. ఆ పిచ్చి వృత్తిగా మారి వ్యాపకమైంది. మంచి ఆటని చూసి ఆనందంగా చప్పట్లు కొడతాం. చప్పట్లకి అస్తిత్వం లేదు. ఆనందానికి ఉంది. గ్రౌండులో ఆట ఆడే ప్రతి ఆటగాడికీ ‘రేపు’ ఉంది. ఈ పిచ్చికి ఆ క్షణాన్ని పూరించే ‘మైకం’ మాత్రమే ఉంది. మైకానికి అస్తిత్వం లేదు. కానీ మైకానికి కారణానికి ఉంది. కొన్ని వందలమంది విశాఖ స్టేడియంలో నాతో ఫొటోకి వెంటబడ్డారు. గౌతమ్తో ఫొటో తీయించుకోడానికి నేను ఆహ్వానించాను. ఆనందంగా వచ్చాడు. నేనెవర్నో చెప్పాను. అతని ముఖంలో స్పందన లేదు. ఒకటే ఆవేశం. ఆటకి ఆనందించే మైకం. ‘విక్టరీ’ గుర్తు పెట్టి నిలబడ్డాడు సుధీర్ గౌతమ్ త్యాగి. నాకు జాలేసింది. ఏ కాస్తో అతనికంటే నేను చిన్నవాడిననిపించింది. - గొల్లపూడి మారుతీరావు -
ఆమె ఒక ద్వీపం
జీవన కాలమ్ జయలలితను గురించి కాలమ్ రాయాలనుకోలేదు. నిజానికి ఆమెని నేనెప్పుడూ కలుసుకోలేదు. ఎదురుపడి మాట్లాడలేదు. కానీ ఆమె కన్నుమూసిన దగ్గర్నుంచీ-సమాధివరకూ విజృంభించిన జన ప్రళయం చూశాక-రాత్రి పదిన్నరకి ఆమె గురించి రాయవలసినది చాలా ఉందనిపించింది. ఆవిడ మానాన ఆవిడని వదిలేస్తే-హాయి గా తన ఇంట్లో పెంపుడు జంతువులతో, పుస్తకాలు చదువుకుంటూ గడపాలనే ఏకాంతాన్ని కోరుకునే వ్యక్తి. పదిమందిని కలవడం ఇష్టం లేదు. పదిమందిలో కుంచించుకుపోయే సిగ్గు, బిడియం. మానసికంగా She is a private person. Great introvert. బయటకు వెళ్లగక్కే మనస్తత్వం కాదు. 1965లో సారథీ స్టుడియోలో ‘మను షులు-మమతలు’ షూటింగు జరుగు తున్న సమయం. జయలలితకి అప్పుడు 17 ఏళ్లు. తెలుగులో ఆమె మొదటి సినిమా. దూరంగా కుర్చీలో కూర్చుని జెఫ్రీ ఆర్చర్ బండ నవల చేతపట్టుకుని చదువుకుంటూ ఉండేది. రామారావు చెప్పేవాడు. ఏకసంథాగ్రాహి. ఒక్కసారి డైలాగు చెప్తే అప్పగించేసేది. కానీ ఆమె గొప్ప నటి కాదు. వయస్సులో స్వచ్ఛత, నాజూకుతనం కలిసి ఇచ్చిన అవకాశమది. ఎవరితోనూ కల్పించుకునేది కాదు. కోపమూ, తాపమూ ఏనాడూ ప్రకటించేది కాదు. ఎంత ప్రయత్నించినా ఆమె మనసులోని ఆలోచనని బ్రహ్మ దేవుడు కూడా పెకలించలేడు. ఇవన్నీ రాజకీయ ప్రపంచానికి పెట్టుబడులు. కానీ ఆమెకి ఇష్టంలేని విషయాలు. ఈ సంగతిని అతి స్పష్టంగా సిమి గారేవాల్ (రెండెవో)లో, జెన్నిఫర్ అరుల్తో ఇంటర్వ్యూలలో చెప్పింది. తనకి నచ్చని, తన స్వభావానికి భిన్నమైన వాతావరణంలో జీవితాన్ని గడిపింది. నిన్న ఆమె కన్నుమూశాక-రాష్ట్రపతి, ప్రధాని, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ పరిశ్రమ, కోట్లాది ప్రజలూ ఏకమై నివాళులర్పించారు. ఎంత విపర్యయం! చిన్న మాటకు కూడా స్పందించే స్వభావంగల ఒక వ్యక్తి-దూషణలకూ, అవమా నాలకూ, శత్రుత్వాలకూ ఎదురీది-తనది కాని ప్రపంచంలో తనదైన ‘ఉనికి’కి పట్టం కట్టిన చరిత్ర జయలలితది. వందేళ్ల కాలంలో కనీ వినీ ఎరుగని జలప్రళయంలో ఆమె పేద ప్రజల గుడిసెల దగ్గరికి వెళ్లలేదు. వేదికల మీద వారి అవసరాలను తీర్చినప్పుడు తప్ప- ఎన్నడూ వారిని కలవలేదు. పేద ప్రజల్ని గుండెలకి హత్తుకోలేదు. కానీ పేద ప్రజలు సముద్రమై ఆమెకోసం విలపించారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం-వ్యక్తి సహజమైన ఆమె ఔదార్యం, ఆర్ద్రత వారి జీవితాలను స్పృశించింది. ఆమె ఎన్నడూ పత్రికల ముందు ప్రవ చనాలు చేయలేదు. విమర్శలకు ఆవేశంతో సమాధానాలు చెప్పలేదు. ‘నేను బహిరంగంగా నా కోపాన్ని ఎన్నడూ ప్రదర్శించలేదు. పదిమందిలో ఎన్నడూ కన్నీరు పెట్టలేదు’ అని గర్వంగా చెప్పుకున్నారు. తను కోరుకోని, ఎదురుచూడని-సినీ జీవితంలో, రాజకీయ జీవితంలో ఆటు పోటుల్ని తన termsతోనే ఎదిరించారు. మొన్న సెప్టెంబరు 27న కర్ణాటకలో ఆమెమీద అవినీతి కేసులో తీర్పుని ప్రకటించి నప్పుడు ఆమె న్యాయస్థానంలో ఒక మాట అన్నారు: ‘నేనప్పుడు చిన్నదాన్ని’ అని. ఈ మాటని ఏ రాజకీయ నాయకుడూ కలలో కూడా అనడు. ఆరోజు నేను నవ్వుకున్నాను. కానీ ఆనాడూ జయలలిత అనే రాజకీయ నాయకురాలు ఆమాట అనలేదు. తనదికాని ప్రపం చంలో, తన ధోరణిని అప్పట్లో వెదుక్కుంటున్న ఒక ‘దారి తప్పిన’ నాయకురాలు ఆక్రో శించింది. కానీ అనవగాహనకి న్యాయ స్థానంలో ఓదార్పు లేదు. ఆమె కర్ణాటక జైలులో ఉన్నప్పటినుంచే ఆమె నిర్యాణం ప్రారంభమయిందని ఎవరో రాశారు. అది నిజం. ఆమె dignityకి తగిలిన గాయమది. దాని నుంచి ఆమె కోలుకోలేదు. కానీ తన ఏకాంతాన్ని నిష్కర్షగా చివరికంటా కాపాడుకున్న ‘వ్యక్తి’ జయలలిత. 74 రోజులు తీవ్ర రుగ్మతతో ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా-తన నాయకులుగానీ, గవ ర్నర్లుగానీ, కేంద్ర మంత్రులుగానీ ‘నిస్సహాయంగా మంచం పట్టిన’ ఆమెని చూడలేక పోయారు. ఆమె కన్నుమూశాక-ఆమె ప్రమేయంలేని ఆమె శరీరాన్ని మాత్రమే చూడ గలిగారు. ఇదొక విచిత్రమైన ప్రస్థానం. అనూహ్యమైన ముగింపు. విపర్యయాలను, స్వభావ వ్యతి రేకమైన జీవితాన్ని తన ధోరణిలోనే జీవించి, జయించి, నిష్ర్కమించిన ఓ ఏకాంత జీవి జీవన ప్రస్థానం. ఒక్క మాటలో చెప్పాలంటే-ఆమె ఒక ద్వీపం. - గొల్లపూడి మారుతీరావు -
తులసి మొక్కలు
జీవన కాలమ్ నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గొప్ప విషయమే. నిజమే... 70 ఏళ్ల అవినీతిని పెళ్లగించడానికి భయంకరమైన ఆయుధాలు కావాలి. కానీ కలుపుమొక్కలతో పాటు తులసి మొక్కల పునాదులు కదిలిపోకుండా కాపాడాలి. భారతదేశంలో నోట్ల రద్దు చాలా విధాలుగా చరిత్ర. ఆర్థిక వ్యవస్థ దుస్థితిలో ఉన్నప్పుడు ఆయా సంస్కరణలు రష్యా, జర్మనీ, నైజీరియా, ఘనా, పాకిస్తాన్ వంటి దేశాలలో జరిగాయి. ప్రపంచంలోకెల్లా విస్తృతమైన దేశంలో - ఇంకా రోజుకి రెండుపూటలా అన్నం కరువైన ప్రజలున్న దేశంలో-బ్యాంకు, కరెన్సీ అంటే ఏమిటో, అదెక్కడుంటుందో తెలియనివారున్న దేశంలో -70 సంవత్సరాలు పేదవాడి నోటి కూడు దోపిడీ జరుగుతున్న నేపథ్యంలో-గుండె ధైర్యం ఉన్న ఒక వ్యవ స్థను మేలుకొలపడానికి-అనూహ్యమైన పని చేశాడు. అసలు దీని పరమార్థం ఏమిటో కూడా తలకెక్కని- రోజువారీ జీవితాన్ని గడిపే కోట్లాదిమంది జీవితాలు అతలాకుత లమయ్యాయి. ఒక పక్క డబ్బున్న జాగిలాలు వినా యకుడి బొడ్డులో వేలుకి తేలుకుట్టినట్టు వేళ్లను కొరు క్కుంటున్నారు. లక్షల కోట్లు గంటల్లో బ్యాంకుల్లో జమ అయ్యాయి. అవుతున్నాయి. విశాఖపట్నంలో ఓ చిన్న తరహా హోటళ్లను నడిపే ఒకాయన నవంబర్ 9 ఉదయం-తన హోటళ్ల ముందు బోర్డులు పెట్టాడు. ‘పాత నోట్లు పట్టుకుని రండి. సుష్టుగా భోజనం పెట్టి చిల్లర ఇస్తాను’ అంటూ నరేంద్రమోదీ బొమ్మవేసి ‘మగాడురా బుజ్జీ!’ అని రాశాడు. చాపకింద జారుడికి అలవాటుపడ్డ ‘గుళ్లను మింగేవాళ్లు’ పంజా విప్పారు. నవంబర్ 8న ప్రధాని ప్రకటన. 9 బ్యాంకు లకు సెలవు. 10 ఉదయం ఒకాయన దగ్గర 40 లక్షల పాతనోట్లను తరలించి కొత్త నోట్లను నొక్కేశాడు. మోదీ యుద్ధం ఈ మహానుభావులతో. వచ్చిన చిక్కల్లా-70 సంవత్సరాలు ఈ దోపిడీని ఎరిగి, అందులో పాల్గొని-పూర్తిగా ఇల్లు చక్కపెట్టు కున్న రాజకీయ నాయకులు-ఈ పథకం వల్ల దేశానికి కలిగే లాభం కాక, ఇందువల్ల నేలబారు మనిషికి జరిగే ‘ఇబ్బంది’ని నెత్తికి ఎత్తుకుని ‘భారత్ బంద్’ వరకూ వెళ్లారు. అయితే ఆలోచన ఉన్న ప్రజలు ఇబ్బందుల్ని అంగీకరిస్తున్నారు. కొందరు నాయకులు హర్షిస్తున్నారు. కానీ ప్రతి పక్షాల పోరాటం పేద ప్రజల మీద అర్ధం తరంగా పుట్టు కొచ్చిన జాలితో కాదు. ఈ కారణంగా పెరిగిపోయే మోదీ పాపులారిటీ మీద. ఈలోగా విశాఖపట్నంలో బోర్డుకట్టి, తొడ చరిచి, అన్నంపెట్టి పాత నోట్లను తీసుకుంటున్న చిన్నతరహా యజమాని నా దగ్గరికి వచ్చాడు. ‘అయ్యా, మోదీగారి యుద్ధం అపూర్వం. మాకిష్టమే. పాత సొమ్ము జమ చేయించి, దాచిన వారిని పట్టుకోవడం సబబే. కానీ కాల్మనీ, కాలా మనీ, లెక్కల్లోకి రాని లక్షలు బాకీలు పడ్డ వారి మాటేమిటి? అప్పులు తీర్చడానికి ఇక నల్ల ధనం లేదు. పాత నోట్లు ఇస్తే పుచ్చుకోరు. వారి గోడు ఏమిటి? నల్లధనం బట్టబయలుకి ‘రక్షణ’ ఇచ్చినట్టు- ఈ లావాదేవీలు చెల్లవని చెప్పమనండి. సుఖంగా నిద్రపోతాం. కాల్మనీ ‘నల్ల’ అప్పుల భూతం నుంచి కూడా ఆయన కాపాడాలి-అన్నారు. ఒక సరసమైన వ్యక్తి-ప్రభుత్వానికి ఒక సూచన చేశాడు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి వచ్చినవారే మళ్లీ మళ్లీ రావడాన్ని అరికట్టడానికి ఎన్నికలలో లాగా వేలి మీద ఇంకు చుక్క పెడుతున్నారట. కానీ ఈయన సలహా... రెండోసారి వచ్చినవాడిని కూర్చోపెట్టి గుండు చేయించండి. గుండుతో నెలరోజులపాటు బ్యాంకులకి తిరిగి రాలేడు. మళ్లీ జుత్తు పెరిగేలోపున కొత్త నోట్లు వచ్చేస్తాయి. దొరికిపోతామని భయపడ్డవాళ్లు వెంటనే తిరుపతికి వెళ్తారు-గుండు చేయించుకోడానికి. ఎలాగూ - చెల్లని నోట్లు హుండీలలో వేస్తున్నారు. అలాగే పరువు దక్కించుకోడానికి స్వామివారికి తలనీలాలు సమర్పి స్తారు. ఆఖరున ముక్తాయింపు. పాతనోట్లు విరివిగా, క్షేమంగా చెల్లే చోటు మరొకటి ఉంది. వ్యభిచార గృహాలలో. ఇది విశ్వసనీయ పోలీసు వర్గాల వార్త. అయ్యా పాత నోటిచ్చి సుఖాన్ని ఖరీదు చేసుకునేపాటి వెసులుబాటు-ఆరోజు తిండికి, గుడ్డకి ఖర్చు పెట్టుకునే -నిజాయితీగా సంపాదించుకున్న బీదా బిక్కీ, కర్షక కార్మికులకు ఎందుకు ఇవ్వకూడదు? నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గొప్ప విషయమే. కానీ పాడేరులో, రంపచోడవరంలో, పూడిపల్లిలో, నందికమ్మ అడవుల్లో 2 రూపాయలిచ్చి నూనె కొనుక్కునే- నిరక్షర ఆటవికునికి-ఈ వ్యవస్థ అందని మాని పండు. 70 ఏళ్ల అవినీతిని పెళ్లగించడానికి భయంకరమైన ఆయుధాలు కావాలి. కానీ కలుపుమొక్కలతో పాటు తులసి మొక్కల పునాదులు కదిలిపోకుండా కాపాడాలి. గొల్లపూడి మారుతీరావు -
‘‘నందిగ్రామ రాజ్యము’’
జీవన కాలమ్ ఇటీవల ప్రభుత్వం పెద్ద నోట్ల విశృంఖల వినిమయాన్ని నియంత్రించింది. ఈ నోట్లు 2017 మార్చి వరకూ చెల్లుతాయి. అయితే వలలో పడాల్సిన పెద్ద చేపలకు ముందుగానే ఉప్పు అందిందన్న వార్తలు వస్తున్నాయి. కవి కాలం కంటే ముందు చూసేవాడు. ద్రష్ట. విశ్వనాథ సత్యనారాయణగారు వెళ్లిపోయిన సంవత్సరంలో – అంటే జూలై 1976లో ఆయన ఆఖరి నవల రాశారు. అది అముద్రితం. 40 సంవత్సరాల కిందటే ఇప్పటి పరిస్థితులను వివరించే వ్యంగ్య నవల అది. 54 పేజీలు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు నందిగ్రామం వచ్చాడు. సాకేత రాజ్యంలో కొందరు – భరతుడు నందిగ్రామం నుంచి పరిపాలన సాగిస్తున్న కారణాన – తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించి తమ పాలనను సాగిస్తున్నారు. వర్తమాన వ్యవస్థలో ఉన్న దుర్లక్షణాలన్నీ ఆ పాలనలో ఉన్నాయి. రాముడితోపాటు అనేకమంది రాక్షసులూ, కోతులూ వచ్చారు. వీరి దర్శనానికి ప్రజలూ విరగబడ్డారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. రాముడి పట్టా భిషేకం వ్యవహారాలూ, ఖర్చులూ అన్నీ చూసుకోడానికి సుగ్రీవుడిని ఆ శాఖ మంత్రిని చేశారు. సుగ్రీ వుడు తన వానర ప్రతినిధు లతో కలసి – ఈ రాజులవద్ద కోటి బంగారు నాణాలు వసూలు చెయ్యడం కార్యక్రమం. పాలకులూ, ఉద్యోగులూ ఈ కార్యక్రమానికి తలా గుమ్మడికాయంత బంగారం ఇవ్వాలన్నారు. గుమ్మ డికాయ మీద స్థూల రూపంతో హనుమంతుడు కూర్చున్నాడట. వసూళ్లు పెరిగాయి. అక్రమార్జన అంతా ఖజానాకు చేరింది. పట్టాభిషేకం జరిగి పోయింది. అదీ నవల. మరచిపోవద్దు. ఈ అరా చకం రామరాజ్యంలో కాదు. ఆయన పరిపాలనకి ముందు. ఇది వ్యంగ్య నవల. (విమర్శిని, పేజీ 269) ఇటీవల ప్రభుత్వం 500, 1000 రూపాయి నోట్ల విశృంఖల వినిమయాన్ని నియంత్రించింది. ఇందులో గమనించాల్సిన విషయం – ఈ నోట్లు 2017 మార్చి వరకూ చెల్లుతాయి – సందేహం లేదు. అయితే 8వ తేదీ రాత్రి నుంచి – చెల్లే ప్రతీ నోటూ లెక్కల్లోకి రావాలి. అంతే నియమం. అయితే ఇందులో పెద్ద తిరకాసు ఉంది. వలలో పడాల్సిన పెద్ద చేపలకు ముందుగానే ఉప్పు అందిందన్న వార్తలు వస్తున్నాయి. కిలో 250 రూపాయలకి కందిపప్పు కొనుక్కోవలసిన రోజుల్లో కనీసం 500 జేబులో ఉంచుకోని నేలబారు మనిషి ఎవరుంటారు? మొక్కజొన్న కండెలు కాల్చే మనిషి ఎంతలేదన్నా సాయంకాలానికి 500 సంపాదిస్తుంది. ముందు రోజు సంపాదనని ఇంట్లో పిడతలో దాచుకుని ఉంటుంది. ఆ నోటు వెంటనే అక్కరకు రాదనీ, దాన్ని బ్యాంకులో కట్టి సొమ్ము చేసుకోవాలనీ వారికి తెలీదు. తెలిసినా చేసుకోవడం తెలీదు. వినియోగించుకోలేని నేలబారు మనిషికి నోటు తాత్కాలికంగానైనా చిత్తుకాగితమే. ఇది ఈ సమస్యకి ఒక పార్శ్వం. రెండు సరదా కథలు. ఢిల్లీ చత్తర్పూర్లో కోటీ శ్వరుడు. బుధవారం ఉదయం లేచేసరికి తనదగ్గరున్న డబ్బు చిత్తు కాగితాలని తేలింది. బెంగళూరులో ఒక ఫ్యాక్టరీని శుక్రవారంలోగా రిపేర్లు చేయించి ఒక కంపెనీకి అప్పగించాలి. 90 వేలు ఖర్చు. బ్యాంకుల్లో కోట్లు ఉన్నాయి. కానీ చేతిలో చెల్లని నోట్లున్నాయి. బిజినెస్ క్లాసులో బెంగళూరు వచ్చాడు. ట్యాక్సీ వాడు కరెన్సీ పుచ్చుకోలేదు. ఫ్యాక్టరీ నుంచి ఇంటికి 10 కిలో మీటర్లు నడిచి వెళ్లాడు. చిల్లర డబ్బు కావాలి. ఎలా? తన మిత్రులు జోక్గా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. బిచ్చగాళ్లు ఈ సమయంలో కోటీశ్వరులు. ఒక పోలీసు అధికారి ద్వారా బిచ్చగాళ్ల ముఠా అడ్రసు పట్టుకున్నాడు. బెంగళూరు రైల్వేస్టేషను, మెజెస్టిక్ బస్టాండ్ సమీపంలో ఒక కుళ్లు గూడానికి వచ్చాడు. భరించలేని కంపు. బిచ్చగాళ్ల రాజుగారు చిరునవ్వు నవ్వారు. ఈ కోటీశ్వరుడు బేరం చెయ్యగా రెండున్నర లక్షలకి 90 వేలు కంపు కొట్టే నోట్లు మారకం చేసుకున్నాడు. మరో సరదా కథ – కాదు సరదాల కథ. మమతా బెనర్జీ సామ్రాజ్యంలో లక్షమంది రిజిస్టరయిన సెక్స్ వర్కర్లున్నారట. వారు నిరభ్యంతరంగా పెద్ద నోట్లు తీసుకుంటున్నారని, తీసుకుంటారని దర్బార్ మహిళా సమాఖ్య కమిటీ మెంబరు భారతి వాక్రుచ్చారు. సోనాగచీలో ఉషా మల్టీపర్పస్ కోపరేటివ్ బ్యాంకులో మొదటి రెండు రోజుల్లో కేవలం 55 లక్షలు నమోదయింది. ఏతావాతా – మొదటి రెండు రోజుల్లో కనీసం 4 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నమోదయిందని తెలిసింది. గంటల కొద్దీ బ్యాంకుల ముందు నిలబడిన చిన్న చిల్లర కావాల్సిన మనుషులు బేషరతుగా ప్రభుత్వ చర్యని హర్షిస్తూ, తమ పాట్లకు ఎవరినీ నిందించలేదు. ప్రభాకర్ ముంద్కూర్ అనే ఆర్థిక నిపుణుడు ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. ఆఖరి వాక్యాలు: ‘.... I know that I am speaking on behalf of millions of honest Indians. I am proud of you. గొల్లపూడి మారుతీరావు -
‘భూత’భక్తులు
జీవన కాలమ్ మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండువేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. పశ్చిమామ్నాయ ద్వారక శంకర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సాయిబాబాని పూజించడం భూతాన్ని పూజించడం అన్నారు. నాకు ఓ సంఘటన ప్రముఖంగా జ్ఞాపకం వస్తుంది. 1991లో మా ఇద్దరి అబ్బాయిల పెళ్లిళ్లు 8 రోజుల తేడాలో జరిగాయి. పెద్ద ఎత్తున జరిగిన ఘట్టాలు. మాజీ ముఖ్యమంత్రులూ, ప్రధాని కొడుకులూ, సినీ ప్రముఖులూ, పద్మభూష ణ్లూ, రామోజీరావుగారూ, శోభన్బాబు, నాగేష్, బెజ వాడ గోపాలరెడ్డి, జగ్గయ్య, జానకి, కేఎస్ ప్రకాశరావు, అల్లు రామలింగయ్య– ఇత్యాది ఎందరో పెద్దలు హాజర యిన ఖరీదైన పండుగలు. విచిత్రంగా ఆ దశలో నా చేతిలో రొక్కం లేదు. ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అప్పు చేయడం ఎప్పుడూ అలవాటు లేనివాడిని. ఏం చెయ్యాలి? అనే బెంగ మనసులో నిలదొక్కుకుని ఉంది. మద్రాసులో మా ఇంటి ముందు లాన్లో కూర్చుని ఉన్నాను. ఫోన్ వచ్చింది. ఆ రోజుల్లో మొబైళ్లు లేవు. ఎవరో పేరు తెలీని వ్యక్తి. ‘‘మీ ఇంటి వాస్తుని చూస్తాను మారుతీరావుగారూ– మీకభ్యంతరం లేకపోతే’’ అన్నారు. పోయేదేముంది? సరేనన్నాను. వచ్చాడు. ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. ముఖం ఇప్పటికీ గుర్తు లేదు. ఇల్లంతా కలయ దిరిగాడు. నేను లాన్లో కూర్చునే ఉన్నాను. నా దగ్గరికి వచ్చాడు. ‘‘ఇల్లు బాగుంది. చిన్న ఇబ్బందుల్లో ఉన్నారు. పరవాలేదు. బయటపడతారు’’ అంటూ సాయిబాబా బొమ్మని నా చేతిలో పెట్టి వెళ్లాడు. నేను సాయిబాబా భక్తుడిని కాను. పైగా ఆయన అభిప్రాయం నేను కోరలేదు. వెళ్లిపోయాడు. ఆ విషయాన్ని దాదాపు అప్పుడే మరచిపోయాను. నాకు బోగ్రోడ్డులో ఒక ఫ్లాట్ ఉంది. రెండుమూడు రోజుల తర్వాత ప్రముఖ దర్శకులు రాంగోపాలవర్మ కంపెనీ మేనేజరు మా అబ్బాయిని కలిశారు. ఆ ఫ్లాట్ని ఆఫీసుకి అద్దెకి తీసుకున్నారు. అడ్వాన్సుగా 40 వేలు ఇచ్చారు (ఇది పాతికేళ్ల కిందటి మాట). దరిమిలాను రెండు పెళ్లిళ్లు జరిగి– ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసే రోజు దాకా ఆ డబ్బు సరిపోయింది. ఇది చేతిలో రొక్కం మాట. వ్రతం నాడు ఎందరో కొత్త బంధు వులూ, హితులూ ఉన్నారు. ఇల్లంతా హడావుడిగా ఉంది. అంతా ఆనందంగా ఉన్నారు. నేను ఏదో సంద ర్భంలో గేటు దాకా వచ్చాను. ఒకాయన– ముందు వచ్చి నాయన కాదు– చెయ్యి జాచాడు. ఈ సమయంలో ఈ మనిషి ఏమిటి? అనుకుంటూ జేబులో చెయ్యి పెట్టాను. ఒక్క రూపాయి ఉంది. తీసి ఆయనకిచ్చి లోపలికి నడిచాను–అసంకల్పితంగా. మరోగంట గడిచాక మళ్లీ గేటు దాకా వస్తే ఇంకా అతను అక్కడే ఉన్నాడు. మళ్లీ చెయ్యి జాచాడు. ఈసారి కాస్త విసుగూ, కోపం వచ్చాయి. ఒకసారి ఇస్తే మళ్లీ అడుగుతాడేమిటి? అయినా ఇది శుభ తరుణం. జేబులో చెయ్యి పెట్టాను. మరో రూపాయి చేతికి తగిలింది. తీసి ఇచ్చాను. పెళ్లికి ముందు నా చేతికి వచ్చిన 40 వేల రొక్కంలో ఆఖరి చిల్లర అది–రెండు రూపాయలు. తర్వాత ఎవరో చెప్పారు–బాబాగారికి రెండు రూపాయల దానం అత్యంత ప్రీతికరమైనదట. చేతికందిన రొక్కం అక్క డితో సంపన్నమయింది. రొక్కమూ అయిపోయింది. ‘‘నేను మీ కంటే ముందు మీ ఇంట్లో ఉంటాను’’ అన్నారట బాబా. అంతకు ముందు మా ఇంట్లో బాబా ఫొటో లేదు. తర్వాత లేకుండా లేదు. చాలా ఏళ్ల కిందట విశాఖపట్నంలో ఓ సాయం కాలం నార్త్ షిర్డీ గుడికి వెళ్లాను. విపరీతంగా ఆకలి వేస్తోంది. దర్శనం అయాక ప్రసాదం చేతిలో పెట్టారు. చాలా రుచిగా ఉంది. ఇంకా తినాలనిపించే ఆకలి. మెట్ల పక్కన అరుగు మీద కూర్చున్నాను. అర్చకుడు పెద్ద ఆకులో ప్రసాదం తెచ్చి నా ముందు నిలబడ్డాడు. చేయి జాచి నా చేతిలో పెట్టాడు. తర్వాత కొన్ని వందలసార్లు ఆ గుడికి వెళ్లాను. ఎప్పుడూ అంత ఆకలి అనిపించలేదు. ఎప్పుడూ అలా ప్రసాదాన్ని కోరుకోలేదు. ఎవరూ అలా ప్రసాదాన్ని ఇవ్వలేదు.SSympathetic Vibration దేవుడా ? మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండు వేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. కొన్ని శతాబ్దాల ‘విశ్వాసం’లో ఎన్నో చేరాయి– రాళ్లూ, రప్పలూ, ఆలోచనలూ, నమ్మ కాలూ. హేతువాదులకి ఇది వెర్రి. కాని బయట కని పించే దృశ్యం కాక, అతని మనసులోని ‘ఆలోచన’ది ఆ శక్తి. ఒక మనస్తత్వ పరిశీలకుడు అన్నాడు కదా, వెంకటే శ్వరస్వామి – గుడిలో ఉన్న శిలలో లేకపోయినా కొన్ని కోట్ల మంది, కొన్ని వందల తరాలుగా తమ కోరికల కోసం, ఆర్తితో అనునిత్యం కేంద్రీకృతం చేసే ఆ ‘బిందువు’ మీద వారి దృష్టి, వారి అపారమైన anticipation, magnetic power కారణంగా ఆ శిల దేవుడ వుతుందని. విశ్వాసానికి మరో రకమైన వివరణ ఇది. దేవుడు వ్యక్తి యొక్క కొంగు బంగారం. విశ్వా సానికి మతం లేదు. రాయికి పేరుంది కాని, మనసు లోని ఆలోచనకి పేరు లేదు. నేను సాయిబాబా భక్తుడిని. (వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు) -
వాట్సాప్లో దేవులపల్లిపై దుష్ప్రచారం
కృష్ణశాస్త్రి నన్ను అప్పు అడగడం ఎంతమాత్రం వాస్తవం కాదు వివరణ ఇచ్చిన రచయిత గొల్లపూడి మారుతీరావు విశాఖ: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత దివంగత దేవులపల్లి కృష్ణశాస్త్రిపై వాట్సాప్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, పాఠకులు, ఆయన అభిమానులు ఇది నమ్మవద్దని ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు తెలిపారు. దేవులపల్లి తన ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి, కళ్లనీళ్లు పెట్టుకొని కారు కొనుక్కునేందుకు అప్పు అడిగారని, ఆయనకు తాను ఇచ్చానని.. కట్టుకథలా రాసి వాట్సాప్లో పోస్టు చేయడం విచారకరమన్నారు. ఈ సందేశాన్ని చాలామంది తనకు పంపించారని.. దీనిని చదివి, తాను ‘సాక్షి’ ద్వారా వివరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చానన్నారు. సంపన్నుడైన కృష్ణశాస్త్రి తనను అప్పు అడగడం నిజం కాదని మారుతీరావు అన్నారు. వాట్సాప్ సందేశంలో చాలా తప్పులున్నాయని, దేవులపల్లి ఎప్పుడూ ఫియట్ కారులో పయనించలేదని, ఆయన అంబాసిడర్ కారు వాడేవారని చెప్పారు. గొంతు మూగబోయిన తర్వాత పలక మీద సుద్ద, బలపంతో రాసేవారని ప్రచారం చేస్తున్నారని, కృష్ణశాస్త్రి ఎప్పుడూ పుస్తకాల మీద రాసే వారని వివరణ ఇచ్చారు. ఇప్పటికీ ఆ పుస్తకాలు వారి కుమారుడు బుజ్జాయి దగ్గర ఉన్నాయని తెలిపారు. తనకంటే 45 ఏళ్లు పెద్దవాడైన శాస్త్రిగారితో కలసి పనిచేయడం తనలాంటి వారికి ఎంతో అదృష్టమని చెప్పారు. దేవులపల్లి ఏనాడూ తన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదని, ఆయన తన ఇంటికే ఎన్నడూ రాలేదన్నారు. వాట్సాప్ ప్రచారంలో ఎనిమిదేళ్ల కింద ఆత్మకథలో తాను రాసుకున్న కొన్ని విషయాలను వక్రీకరించారన్నారు. తాను దేవులపల్లి గురించి పేర్కొన్నది 246వ పేజీలో స్పష్టంగా ఉందన్నారు. మద్రాసు ఆలిండియా రేడియోకు వచ్చి, తిరిగి వెళుతున్నప్పుడు ఆయనను సాగనంపడానికి వెళ్లిన తనకు.. ‘డబ్బులేదు.. కారు అమ్మేయాలనుకుంటున్నాను’ అని రాసి చూపించారన్నారు. ‘అదేం వద్దు. పాటలు రాయండ’ని తాను సూచించానని, ‘ఎవరూ రావడం లేద’ని ఆయన పేర్కొనడంతో.. ‘మీరు రాస్తానంటే నేను తీసుకువస్తాన’ని చెప్పానన్నారు. అలా అమెరికా అమ్మాయి సినిమా తీస్తున్న నవత కృష్ణంరాజు గారికి పరిచయం చేశానని.. ఆ సినిమాకు శాస్త్రి గారు రాసిన ‘పాడనా తెలుగుపాట.. పరవశనై నీ ఎదుట నా పాట’ మకుటాయమానంగా నిలిచిందన్నారు. -
రొట్టెకొద్దీ పిండి
జీవన కాలమ్ దీపా కర్మాకర్కి, సింధుకి ఇచ్చినట్టు ఇల్లు ఇస్తే మంచిదే కదా! కానీ అందరూ ఇళ్లే ఇస్తే ఎలా? కొందరు ఫర్నిచర్ ఇవ్వండి. మరికొందరు వంట సామగ్రి ఇవ్వండి. ఎయిర్ కండిషన్ మిషన్లను బహూకరించండి. డోర్ కర్టెన్లు ఇవ్వండి. మొన్నటి రియో ఒలిం పిక్స్లో ప్రపంచాన్ని ఆశ్చర్య చకితుల్ని చేసిన కళాకారిణి దీపా కర్మాకర్. మృత్యువుని కూడా లెక్క చేయని ప్రొడు నోవా విన్యాసం ఒక విస్ఫో టనం. కొద్ది సెకన్లలో బహు మతిని కర్మాకర్ నష్ట పోయినా, దేశ ప్రజల మన్న నలను నష్టపోలేదు. ఎక్కడో అగర్తలాలో అతి మామూలు కుటుంబంలో పుట్టిన ఈ 23 ఏళ్ల పిల్ల– తన లక్ష్యంలో నిప్పునీ, సాధనలో మృత్యువునీ జయిం చి– ప్రపంచాన్ని దిగ్భ్రాంతుల్ని చేసింది. ఆమె విజయానికి మెచ్చి సచిన్ తెందూల్కర్ అనే భారతరత్న ఆమెకు ఒక బీఎం డబ్ల్యూ కారుని బహూకరించాడు. దీని ఖరీదు– కనీసం కోటి రూపా యలు. నా ఉద్దేశం ఇలాంటివి భారతదేశంలో vulgar display of affluence అని. దీపా కర్మాకర్కి ఇది కొత్త సమస్య. పాపం, వాళ్ల ఊర్లో ఇంత పెద్ద, గొప్ప కారు తిరగడానికి రోడ్లు లేవు. కనుక త్రిపుర ప్రభుత్వం నిస్సహాయంగా ఆ ఊర్లో ఫలానా కారు తిరిగే రోడ్లను వేసే కార్యక్రమాన్ని చేప ట్టింది. అయితే పాపం, దీపా ఈ బహు మతిని అందుకున్నప్పుడే ఆమె తండ్రి ఓ మాట చెప్పారు. ‘‘బాబూ! ఈ కారుని నడపడానికి, తట్టుకో వడానికి మాకు శక్తి చాలదు. ఆ కారుకి అయిన డబ్బు ఇవ్వండి. మాకు ఉపయోగపడుతుంది’’ అని. బీఎండబ్ల్యూ సచిన్ వితరణని, స్థాయిని చెప్తోంది కాని– దీపా కర్మాకర్ స్థాయిని అర్థం చేసుకోని ‘లోపాన్ని’ కూడా చెప్తోంది. ఆ కారు తాళం చెవుల్ని అందుకుంటూ– ఈ దిక్కుమాలిన ‘మొగ్గ’ వేసి గొప్ప ఇబ్బందిని తెచ్చి పెట్టుకున్నానే! అని దీప ఒక్క సారయినా మనసులో అనుకుని ఉంటుందని నాకని పిస్తుంది. ఆ బాధ నాకు తెలుసు. నా జీవితంలో దాదాపు 17వ యేట నుంచీ ఏవో బహుమతులూ, చిన్న చిన్న జ్ఞాపికలూ, షీల్డులూ అందుతూనే ఉన్నాయి. రాను రాను వాటి ఉధృతం పెరిగి– ప్రతీ సభలో ఏ కొత్త ఉధృతం మీద పడుతుందోనన్న భయం ఎక్కువవు తోంది. సీనా రేకు, ప్లైవుడ్ చెక్కలతో అందంగా బొమ్మ లంటించిన వందలాది షీల్డులను నా జీవితంలో పుచ్చుకున్నాను. పుచ్చుకుంటూనే ఉన్నాను. వాటినేం చెయ్యాలి? ఎక్కడ ఉంచాలి? ఇచ్చేవారి మర్యాద, ఔదార్యం గొప్పవే. కానీ ఉంచుకోవాల్సిన నా ఇల్లు చిన్నది. ఇది 62 సంవత్సరాలుగా జరుగుతున్న ఉత్పాతం. మా ఇంట్లో షెల్ఫులన్నీ, కిటికీలన్నీ, గోడ లన్నీ, ఖాళీ స్థలమంతా వీటికి చాలవు. నాకప్పుడ ప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ కార్యకర్తలు– దూర దృష్టితో ఉపయోగపడే వస్తువులేమన్నా ఇవ్వరాదా? అని. కానీ అందరూ తెందూల్కర్లే. పెద్ద మనసు కలవారే. ఈ మధ్య టోపీలు వచ్చాయి. ఇక శాలువాలు కొల్లలు. ఒకసారి ఒక సంస్థవారు చక్కటి బ్రీఫ్ కేసు ఇచ్చారు. ఇప్పటికీ దాన్ని వాడతాను. మరొకరు గొడుగు ఇచ్చారు. వర్షం ఛాయలు కనిపించగానే, ‘ఫ్రెండ్స్ క్లబ్బు గొడుగు కారులో పెట్టారా?’ అని గుర్తు చేసుకుంటాను. శాలువాకి బదులు– చక్కగా పార్సిలు చేసి పది నాప్కిన్స్ ఇవ్వరాదా అనుకుంటాను. రోజూ చెయ్యి తుడుచుకుంటూ ఆ సంస్థని జ్ఞాపకం చేసు కోవచ్చు. చక్కటి షేవింగ్ కిట్ ఇవ్వరాదా? రోజూ గెడ్డం చేసుకుంటూ వారిని తలుచుకుంటాం. నాలుగు తువాళ్లివ్వండి. ఒక పడక కుర్చీ ఇవ్వండి. రెండు బెడ్ షీట్లు ఇవ్వండి. రెండు తలగడాలివ్వండి. పది పాకెట్ల సబ్బులివ్వండి. ఆడవాళ్లకి పైట పిన్నులు ఇవ్వండి. జడ కుచ్చులివ్వండి. పోనీ ఇప్పుడు జడలు వేసు కోవడం మానేశారు కనుక– పది నైటీలు ఇవ్వండి. మగాళ్లకు డజను లుంగీలివ్వండి. కందిపప్పు ధరలు మండిపోతు న్నాయి. పది కిలోల కందిపప్పు ఇవ్వండి. 5 కిలోల మినప గుళ్లి వ్వండి. సైకిలు మార్కు ఇంగువ డబ్బాలను ఇవ్వండి. భార్యలు సన్మానం ఎప్పుడా అని ఎదురుచూడకపోతే నన్న డగండి. ఇది నవ్వుతూ అన్నా, నవ్వులాటకి అన్నమాట కాదు. ఎవరినీ చిన్న బుచ్చడం ఎంతమాత్రం కాదు. ఆ మధ్య కువాయిత్లో ఒక సీడీ ప్లేయర్ ఇచ్చారు. ఒక సెల్ఫోన్ ఇవ్వండి. ఐపాడ్ ఇవ్వండి. సంగీతం కాసెట్లు ఇవ్వండి. పోనీ, కొత్త సినీమా టికెట్లు ఇవ్వండి. దీపా కర్మాకర్కి, సింధుకి ఇచ్చినట్టు ఇల్లు ఇస్తే మంచిదే కదా! కానీ అందరూ ఇళ్లే ఇస్తే ఎలా? కొందరు ఫర్నిచర్ ఇవ్వండి. మరికొందరు వంట సామగ్రి ఇవ్వండి. ఎయిర్ కండిషన్ మిషన్లను బహూ కరించండి. డోర్ కర్టెన్లు ఇవ్వండి. దీపకి ఒక సంవ త్సరానికి సరిపోయే బంగాళాదుంపల్ని సరఫరా చెయ్యమనండి. ఒక లారీతో గోధుమ పిండిని బహూ కరించమనండి. అయ్యా, రొట్టె కొద్దీ పిండిని ఎంపిక చేయాలి. భరించలేనివారికి అక్కరలేని సత్కారం– ఇబ్బంది పెట్టే ఇరకాటం అవుతుంది. ఇది ఇచ్చేవారి పెద్ద మన సుని శంకించడం ఎంతమాత్రం కాదు. పుచ్చుకునే అర్హత ఇచ్చుకునే వితరణకు ఉదాత్తతని ఇస్తుంది. అందుకే బలి చక్రవర్తి వితరణ చరిత్ర అయింది. పురాణమయింది–పుచ్చుకున్నవాడు సాక్షాత్తు దేవుడు కనుక. అది అర్హతకి పట్టాభిషేకం. వితరణకు నివాళి. గొల్లపూడి మారుతీరావు -
వీర దేశభక్తులు
జీవన కాలమ్ ఈ మధ్య దేశభక్తుల జాబితా బొత్తిగా క్రిక్కిరిసి పోయింది. రోజుకో దేశ భక్తుడు బయటపడుతున్నాడు మన దేశంలో. దశా బ్దాలుగా దౌర్జన్యకారులను మన దేశంలోకి పంపుతున్న పాకిస్తాన్ దౌర్జన్యకారుల స్థావరాల మీద ఎట్టకేలకు భారతదేశం పంజా విప్పింది. సర్జికల్ దాడి అన్నారు. అంటే ఎక్కడ నొప్పెడుతుందో అక్కడ దెబ్బ కొట్టడం. పోలీసోడి దెబ్బలాగ. పాకిస్తాన్ ‘కుంయ్యి’మనలేదు. కారణం.. దాడి జరిగిందంటే దౌర్జన్యకారుల స్థావ రాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టు. లేదంటే - దాడి దెబ్బ ఏమయినట్టు! లారీలతో శవాలను తీసుకెళ్లడం తెలిసిందని గూఢచారి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా - మన దేశంలో చాలామంది వీర దేశభక్తులు తలలెత్తారు. పాకిస్తాన్ దాడులు జరగ లేదంటోంది. భారతదేశం జరిపాం అంటోంది. నిజంగా దాడులు జరిగాయా? జరిగితే రుజువులు ఏవి? పాకిస్తాన్ మాటా అదే. కానీ నిన్నటిదాకా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్న చిదంబరం అనే దేశ భక్తుడు - భారతదేశం జరిపిన దాడుల రుజువుల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ప్రకటించినప్పుడు- సగం చచ్చి, మరో గత్యంతరం లేక, ప్రజలు ముఖంమీద పేడ జల్లుతారనే భయంతో - కేవలం నిస్సహాయంగానే ప్రభుత్వ చర్యకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. తమ ఇంట్లో పిల్లి పరిగెత్తితే - మోడీ పంపిన గూఢ చారిగా గొంతు చించుకునే మరో భారతరత్న కేజ్రీ వాల్ అంతే నిస్సహాయంగా ప్రభుత్వాన్ని సమర్థిం చారు. ఇప్పుడు కేజ్రీవాల్గారు ‘జూలియస్ సీజర్’లో ఆంటోనీ ఉపన్యాసాన్ని తలపించే ప్రసంగాన్ని పత్రికా సమావేశంలో చేశారు. ‘మేం బేషరతుగా మోదీగారిని సమర్థిస్తున్నాం. వారికి నా జోహార్. కానీ పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికయినా, ఆ దాడుల సాక్ష్యాలను బయ టపెట్టండి. నా కోసం కాదు. ఈ దేశం గొప్పతనాన్ని నిరూపించడానికి. మరొక్కసారి మోదీకి నా జోహార్’. పాపం, సంజయ్ నిరుపమ్ అనే దేశ భక్తుడికి ఇవన్నీ తెలియవు. ఆయన నిన్నకాక మొన్న బొడ్డూడని వీర దేశభక్తుడు. వారు ‘ఈ దాడులు ఉత్త హుళక్కి’ అన్నారు. యువరాజు ఈ ప్రభుత్వం సైనికుల రక్తంతో వ్యాపారం చేస్తున్నదన్నారు. ఏదయినా చిన్న సాకు దొరికితే తమ అక్కసు ప్రకటించాలనుకున్న పార్టీలు గళాలు విప్పాయి. సీతారాం ఏచూరి నోరిప్పారు. శరద్ పవార్ నోరిప్పారు. యుద్ధం మాట దేవుడెరుగు- ఇందుమూలంగా రాబోయే ఎన్నికల్లో పాలకవర్గానికి కిరీటం దక్కితే! ప్రపంచ దేశాలన్నీ ఏకమయి భారతదేశానికి మద్దతు పలుకుతుండగా, ఏ ఒక్క దేశమూ - ‘రుజు వులు చూపండి’ అని అడగకపోగా, సార్క్ దేశాల పెద్దలు బేషరతుగా దేశానికి దీటుగా నిలబడగా - వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఓ గొప్ప పార్టీ నాయకులు - వారం తిరక్కుండానే వీధిన పడటం - వారి ‘అసలు రంగు’కి నిదర్శనం. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యాలు ఎదు ర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాజ్పేయీ - సైన్యానికి పచ్చజెండా ఊపుతూ ఒకేమాట చెప్పారట. ‘ఏం చేసినా దేశ సరిహద్దు రేఖని దాటవద్ద’ని. మొన్న భారత సైన్యాలు ఒకప్పటి భారత భూభాగం - ఇప్పటికీ వివాదంలో ఉన్న ‘భారత’ భూభాగంలోకే జొరబడి - కేవలం దౌర్జన్యకారుల స్థావరాలను దెబ్బ తీసి వచ్చాయి. ఇది దౌత్యపరంగా అతి కుశాగ్ర బుద్ధితో, అతి సునిశితమైన ఆలోచనా సరళితో తీసు కున్న నిర్ణయమని మనం గర్వపడాలి. ఈ మధ్య నేను నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ రాసిన నా కాలమ్ చదివి ‘ఇంకాస్త ముందుకు పోయి మీరు మోదీని రాముడు, శ్రీకృష్ణుడు అంటారేమో!’ అని ఈమెయిల్ పంపారు. ‘అయ్యా, నాకంత అభి రుచి దారిద్య్రం లేదు. కాని నేను మోదీ అభిమానిని. అయితే నేను బీజేపీ కార్యకర్తను కాను. తమ హయాంలో 5 లక్షల 57వేల కోట్లు దోచుకున్న (నా లెక్కలు తప్పయితే క్షమించండి) దేశంలో కనీసం 200 పైచి లుకు సంస్థలకు గత 70 సంవత్సరాలలో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ పేర్లు పెట్టి మనల్ని తరింపజేసిన, ఇంకా కొన్నాళ్లుంటే - రాహుల్ గాంధీ, ప్రియాంక, వాద్రా సంస్థలతో మన జన్మల్ని తరింప జేయగలిగిన ఇటలీ భక్తుల (ఉదా: ఖత్రోచీ, ఎంబ్రి యార్ కుంభకోణాలు) అభిమానిని కాను. మరొక్క మాట. పాకిస్తాన్ని రెండుసార్లు ఎదిరించి బుద్ధి చెప్పింది బీజేపీ హయాంలోనే అని మరచి పోకూడదు. పాపం, కాంగ్రెసుకి అంత టైమెక్కడిది - తమ ఇల్లు చక్కపెట్టుకునే వ్యవధే చాలకపోయె! దేశభద్రత.. పత్రికల్లో ప్రకటించే కరపత్రం కాదు! కాదు! కాదు! దేశభక్తి ఫేస్పౌడరు కాదు-అవసరం తీరగానే చెరిపేసుకోడానికి. ‘చలికోటు’ కాదు- యుద్ధాలు వచ్చినప్పుడు తొడుక్కుని ఆపై విప్పి పారే యడానికి. పసివాడు ముఖంమీద పెట్టుకునే ‘పులి బొమ్మ’ కాదు. ఆటల్లో చిరిగిపోయేదాకా కలసి రావడానికి. గొల్లపూడి మారుతీరావు -
ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం
సీతంపేట : తెలుగు టాకీ సినిమా 85 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజాగ్ ఫిల్మ్ సొసైటీ నిర్వహిస్తున్న మూడు రోజుల ఫిల్మ్ ఫెస్టివల్ పౌరగ్రంథాలయంలో బుధవారం ప్రారంభమయింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాకు ప్రాణం పోసి, సినిమా అభివృద్ధికి త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులను గుర్తుపెట్టుకోవడంలో మనం విఫలమయ్యామన్నారు. భక్తప్రహ్లాద తొలి తెలుగుటాకీ సినిమాగా సెప్టెంబర్ 15, 1931లో విడుదలైనపుడు సినిమాకు దర్శకత్వం వహించి, నిర్మించిన హెచ్.ఎం.రెడ్డిని అందరూ ఎంతో అభినందించారన్నారు. నేడు అలాంటి మహనీయులను మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగం అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా 1939లో నిర్మించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాను ప్రదర్శించారు. కార్యక్రమంలో విశాఖ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు, సహాయ కార్యదర్శి పి.వి.రమణ, రచయిత డి.వి.సూర్యారావు పాల్గొన్నారు. -
సినీమా నోరిప్పిన రోజు
జీవన కాలమ్ అపూర్వమైన కారణంగా, పాట భారతీయ సినీమాలో తిష్ట వేసుకు కూర్చోగా - నాటకానికి విడాకులిచ్చి తెలుగు సినీమా సొంత గొంతుని అందుకునే ప్రయత్నా లకు గొప్ప శకునాలు ఇప్పుడిప్పుడు కనిపిస్తున్నాయి. ఉదాహరణ.. బాహుబలి. సినీమా నోరు విప్పి 85 సంవ త్సరాలయింది. మరోమాట చెప్పాలంటే సినీమాలోకి నాటకం, పాట దొడ్డితోవన ప్రవేశించి 85 ఏళ్లయింది. ఏవో కొన్ని చిత్రాలని మిన హాయిస్తే - ఇప్పటికీ ఈ రెండు ప్రక్రియలనూ ప్రేక్ష కులు గుండెకు హత్తుకుంటు న్నారు. నాటకానికి దూరంగా వెళ్లాలన్న అవసరాన్ని గుర్తుపట్టి చాలా యేళ్లయింది. కాని ‘ప్రయత్నం’ ప్రారం భమై కొన్ని సంవత్సరాలే అయింది. ఒకాయన ఈ పరిస్థితిని ఇలా వివరించాడు - Indian cinema is an accident on screen. . 1931లో హెచ్.ఎం. రెడ్డిగారు కలకత్తాలో కెమెరా ముందు ‘భక్త ప్రహ్లాద’ నాటకాన్ని ప్రదర్శింపజేశారు. ఎవరికీ ఏమీ ఇబ్బందిలేని పని అది. కెమెరా నడిచింది. బొమ్మ సెల్యులాయిడ్ మీదకి ఎక్కింది. డెరైక్టరుగారు ఎడిటింగ్ టేబుల్ ముందు కూర్చుని పాట తర్వాత పద్యం, పద్యం తర్వాత డైలాగు చేర్చుకుంటూ పోయారు. ప్రేక్షకులు తమకు తెలిసిన వినోదాన్ని తెలి యని ప్రక్రియలో చూసి - అబ్బురపడి, ఆనందించారు. ఇది కొత్త ప్లేట్లలో వడ్డించిన పాత భోజనం. ప్రేక్షకులకి అలవాటయిన, తృప్తినిచ్చే భోజనం. తరువాత సి. పుల్లయ్యగారు ‘పాదుక’ తీశారు. ముందు సినీమా దీనికి వరవడి. చిత్రం విజయం సాధిం చింది. సాధించకుండా ఉండే మార్గం లేదు. దరిమిలాను తెలుగుదేశంలో ఉన్న అన్ని పౌరాణికాలూ తెరకెక్కాయి. లవకుశ, సీతా కళ్యాణం, ద్రౌపదీ వస్త్రాపహరణం, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, గయోపాఖ్యానం, ధృవ, అనసూయ - ఇలాగ గమనించాలి. వీటితోపాటు సూత్ర దారుడు, కంచుకి, బృందగానం, కందార్థాలు, ద్విప దలు, స్రగ్ధరలు, కళ్యాణి, భీంపలాస్, భాగేశ్రీ, కానడ, కాపీ - అన్నీ వచ్చాయి. క్రమంగా కొత్త ప్లేటుకి అల వాటుపడ్డ ప్రేక్షకుడు - వడ్డించే భోజనంలో తప్పని సరిగా ఆకర్షించే ‘పాత’ రుచికీ అలవాటుపడ్డాడు. ఎందరో మహానుభావులు - పాట లేకపోతే ఎలా? అనిపించే అపూర్వమైన కృషి చేశారు. నౌషద్, సి. రామచంద్ర, సాలూరు రాజేశ్వరరావు, షకీల్ బదా యునీ, ఘంటశాల, కేవీ మహాదేవన్, మల్లాది రామ కృష్ణ శాస్త్రి, ఆచార్య ఆత్రేయ, వేటూరి, సముద్రాల.. వంటివారు సినీమాలో ‘పాట’ని అజరామరమూ, నిర్వివాదాంశమూ చేశారు. మరోదేశం ప్రేక్షకుడు మన సినీమా చూసి - ఏమిటయ్యా, మీ హీరో మేఘాల్ని చూస్తూ నా ప్రేయసికి కబురు చెప్పమంటాడు -అని నవ్వుకోవచ్చుగాని-1951లో-అంటే సినీమా మాటని మరిగిన 20 సంవత్సరాలకు ‘మల్లీశ్వరి’ చూస్తూ మనం అదే పని చేశాం. ఒక చిన్న ఉదాహరణ. ఈ దేశం గర్వించదగ్గ గొప్ప స్క్రీన్ప్లే రచయితలు సలీం-జావేద్ రాసిన ‘జంజీర్’ సినీమాని తెలుగులో ఎన్టీ రామారావుగారి ‘నిప్పులాంటి మనిషి’గా రాశాను. నాటకం పాలు ఎక్కువగా ఉన్నా కొద్దిలో కొద్దిగా సినీమా ప్రక్రియని పట్టుకున్న రచయితలు వీరు. అటు సమృద్ధిగా మెలోడ్రామాను, ఇటు సినీమా ప్రక్రియను సంధించిన అఖండులు వీరు. ఇందులో ఒక సీను. హీరోది dialectical పాత్ర. దుండ గుల లారీ కిందపడి చాలామంది పిల్లలు చచ్చిపో యారు. దుండగుడు దొరికాడు. పగ తీర్చుకోడాని కన్నట్టు హీరో అతన్ని చావబాదాడు. ఆఫీసరు ఆపాడు. హీరో గదిలోకి వచ్చి - ఆవేశాన్ని చల్లార్చుకుంటూ గ్లాసుతో నీళ్లు తాగాడు. ఇప్పుడు హీరోయిన్ వచ్చింది. చూశాడు హీరో. ‘సాబ్.. పైసా’ అంది నోట్ల కట్ట చూపిస్తూ. అతని ముఖంలో ఆశ్చర్యం. ‘వాళ్లు ఇచ్చారు సార్! కాని.. వద్దుసార్’ అంది. హీరో దగ్గరకు వచ్చాడు. డబ్బు కట్టని చూశాడు. ఆమె గుండె ధైర్యాన్ని ప్రశం సించాలి? ‘నీలాంటి నిజాయితీపరులు పదిమంది ఉంటే ఈ దేశం ముందుకు పోతుందమ్మా’ అనాలా ‘నీ ధైర్యాన్ని మెచ్చుకోడానికి మాటలు లేవనాలా?’ ఇది మెలోడ్రామా. సన్నివేశాన్ని సాగదీసి చిలకడం. కాని గొప్ప స్క్రీన్ప్లే బెసకదు. ‘థాంక్స్’ అన్నాడు హీరో. ఆమె వెళ్లిపోయింది. దర్శకుడు ఎస్.డి. లాల్ని పిలిచి ‘ఇలాగే రాస్తాను. తీస్తావయ్యా’ అనడిగాను. ‘ఎందుకు తియ్యను గురువుగారూ’ అన్నాడు. మూల రచన ఉంది కదా? హీరోగారూ చేశారు. Silence is the most powerful statement in a film. The visual is its strength. while the verbal is the backbone of theatre and weak ness of a film. ఏ విదేశీ సినీమా అయినా చూడండి. సంభాషణల రచయిత పేరు ఉండదు. స్క్రీన్ప్లే మాత్రమే ఉంటుంది. మన దేశంలోనే కాదు. మన భాషలోనే కాదు- 85 సంవత్సరాలపాటు ఈ రెండు ధోరణుల మధ్యా కొట్టు మిట్టాడుతున్న మాధ్యమం - సినీమా. అపూర్వై మెన కారణంగా - పాట - by default - భారతీయ సినీమాలో తిష్ట వేసుకు కూర్చోగా - నాటకానికి విడాకు లిచ్చి - తెలుగు సినీమా సొంత గొంతుని అందుకునే ప్రయత్నాలకు గొప్ప శకునాలు ఇప్పుడిప్పుడు కనిపిస్తు న్నాయి. ఉదాహరణ - బాహుబలి. -
‘నేను’ అనే వైరస్
‘‘చరిత్రలో నేను కాదు ఉండాల్సింది - ఈ దేశం. ఈ దేశపు వైభవం. 1.20 బిలియన్ల భారతీయ ప్రజల మధ్య మోదీ కూడా ఒక మామూలు మనిషే’’ అన్న ఒక ప్రధాని గురించి ఈ కాలమ్. ఇది రాజకీయాలకు సంబం ధించిన కాలమ్ కాదు. రాజ కీయ నాయకులకు సంబం ధించిన కాలమ్ అంతకంటే కాదు. అయితే ఇది నరేంద్ర మోదీ గురించి చెప్పబోయే కాలమ్. కనుకనే ఈ రెండు వాక్యాలూ ముందు చెప్పవ లసి వచ్చింది. మొన్న ఒక ఇంగ్లిష్ చానల్ ఇంటర్వ్యూలో మోదీని ఒక ప్రశ్న వేశారు: రాబోయే కాలంలో చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? అని. ఇది మనం తరచూ వినే ప్రశ్న. రాజకీయ నాయకుల సమాధా నాలూ మనకి వినడం అలవాటయిపోయింది. కాని నరేంద్ర మోదీ సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మించి - దిగ్భ్రాంతుణ్ణి చేసింది. సారాంశం ఇది. ‘‘చరిత్ర నన్ను ఎందుకు గుర్తుంచుకోవాలి? మోదీ ఈ దేశంలోని 1.20 బిలి యన్ల భారతీయులలో ఒకడు. నన్ను కాదు-చరిత్ర ఈ దేశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ దేశానికి జరిగిన మేలుని గుర్తుంచుకో వాలి’’- స్థూలంగా ఇదీ సమా ధానం. మన ముఖ్యమంత్రి గారు- ‘‘మీరంతా గర్వపడే స్థాయిలో మీ నగరాన్ని వద్ధి చేస్తాను. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి రైతులకు లక్షా ఏభైవేల ఎకరాలకు నీళ్లు ఇప్పిస్తాను. చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తాను’’ అనడం మనం తరచూ వింటున్నాం. అది తప్పుకాదు. ఒక mindsetకి నిదర్శనం. అంతే. కానీ దక్షిణాఫ్రికాలో తనలాంటి బడుగు వర్గాలకు జరిగే వివక్షను ఎదిరించిన ఓ న్యాయవాది అలనాడు - చరిత్ర గురించి ఆలోచిస్తే - చరిత్ర ఆయన్ని ‘మహా త్ముడు’గా గుర్తుంచుకునేది కాదు. గొంతు విప్పే స్థాయిలో కేవలం ఒక తపస్సుగా ఒక జీవితకాలం తన సంగీత సాధనని కొనసాగించకపోతే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అనే భారతరత్నని దేశం గౌరవించి ఉండేదికాదు. ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తున్న క్షణంలో సింధు అనే 21 సంవత్సరాల పిల్ల ఒలింపిక్స్లో ‘నేను’ ఈ దేశానికి కీర్తిని తీసుకు రాబోతున్నాను- అని ఒక్క క్షణం అనుకున్నా పాతాళానికి కుంగిపోయేది. ఈ వారమే ఒక మహోన్నతమైన ‘శక్తి’ని - మదర్ థెరిసాని- దేవదూతగా రోమ్ వాటికన్లో సెయింట్ పీటర్స్ బిసిల్కాలో పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. బడు గువర్గాల పట్ల, పేదల పట్ల ఆమె చూపిన నిరవధికమైన ప్రేమాభిమానాలు ప్రపంచాన్ని- సామాజిక, ఆధ్యాత్మిక రంగాలను పులకితం చేశాయి. ‘నేను’ అనే మాట ఆమె టిప్పణిలో లేదు. ఆమె రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ పుర స్కారాన్ని పుచ్చుకోవడాన్ని నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ వివరించారు. మదర్ పద్మశ్రీ పురస్కారాన్ని ఒక రోగిష్టి బిడ్డని పొదివి పట్టుకున్నట్టు, ఆఖరిక్షణాలలో ఉన్న దీనుడిని భుజానికి ఎత్తుకున్నట్టు అందుకున్నా రట. ఇస్తున్న రాష్ట్రపతి కన్నుల్లో, చూస్తున్న ప్రేక్షకుల కన్నుల్లో నీళ్లు నిండాయి. తర్వాత కారులో నెహ్రూని ఆమె అడిగారట - నీకెలా అనిపించింది? అని. ‘నువ్వెలా భావించావో కానీ - కంటినీళ్లు ఆపుకోవడం నాకు చాలా కష్టమయింది’ అన్నారట నెహ్రూ. ‘నేను’ అనే భావనని పూర్తిగా తన మనసులో నుంచి ఖాళీ చేసుకుని ఒక పరిపూర్ణమయిన ‘శూన్యం’గా మారిన అరుదయిన, అసామాన్యమయిన వ్యక్తిత్వం మదర్ థెరిసా అన్నాడొక పాత్రికేయుడు. ఇప్పుడు మళ్లీ నరేంద్ర మోదీ దగ్గరికి. There is no greater joy than to be lost in the history- అన్నారాయన. నేను ప్రధాన మంత్రి గురించి రాయడం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకుని గురించి రాయడం లేదు. మళ్లీ- ఇది రాజకీయ కాలమ్ కాదు. కాని తను చేసే కషిలో, సేవలో, సాధనలో, లక్ష్యంలో, దక్ప థంలో, ఆదర్శంలో, దష్టిలో ‘నేను’ - ‘చరిత్ర’ అనే రెండు దురాశలు- ఏమాత్రం దొంగ తోవన ప్రవేశించినా- వారు ఆ చరిత్రకు దగ్గరికి కూడా రాలేనంత దూరంగా నిలిచి పోతారు. ఈ దేశంలో కుష్టురోగిని తన ఒళ్లో పెట్టుకుని ‘చావులో ఇంత ఆనందం ఉందా!’ అనిపించేలాగ ప్రేమని పంచిన ఒక దేవదూత గురించి, ఒక జీవితకాలం తన సాధనతో లక్షలాది హదయాలని తాకిన ఒక భారతరత్న గురించి, ‘‘చరిత్రలో నేను కాదు ఉండాల్సింది - ఈ దేశం. ఈ దేశపు వైభవం. 1.20 బిలియన్ల భారతీయ ప్రజల మధ్య మోదీ కూడా ఒక మామూలు మనిషే’’ అన్న ఒక ప్రధాని గురించి ఈ కాలమ్. రాజకీయ నాయకులు, పార్టీల వారికి ఈ కాలమ్ వెక్కిరింతగానూ, భజన చేసే ప్రయత్నంగానూ కని పించవచ్చు. కానీ దక్షిణాఫ్రికాలో ఓ అర్ధరాత్రి పీటర్ మారిట్స్బర్గ్లో ఫ్లాట్ఫారం మీదకు తెల్ల అధికారి మెడ పట్టుకు గెంటిన క్షణంలో ఓ నల్ల లాయరు చరిత్ర గురించి ఆలోచించలేదు. తన జాతికి జరుగుతున్న ‘అవమానం’ గురించే ఆలోచించాడు. కనుకనే చరిత్ర అయ్యాడు. చరిత్ర మానవ ప్రయత్నానికి అతి కర్కశమయిన వడపోత. ‘నేను’ అన్న ఆలోచన వచ్చిన మరుక్షణంలో అది నిర్దాక్షిణ్యంగా సెలవు తీసుకుంటుంది. -
జైలు యాత్ర
ఈ జాతిని ఉద్ధరించి ఈ దేశాన్ని ఆకాశంలో నిలిపిన తరం ఆ రోజుల్లో జైళ్ల నుంచి బయటకు వచ్చింది. ఈ దేశాన్ని గబ్బు పట్టిస్తున్న నేటి తరం జైళ్ల వైపు ప్రయాణం చేస్తోంది. తెలంగాణ జైళ్ల శాఖ ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నది. ఒకరోజు జైలు గదిని యాత్రికులకు అద్దెకి ఇస్తుంది. ఎవరైనా డబ్బు చెల్లించి వెళ్లిరావచ్చు. 219 సంవత్సరాల చరిత్ర గల సంగారెడ్డి జైలు, మ్యూజియంని ప్రజలు చూడడానికి ప్రారంభిస్తూ జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ గారు ఈ విషయాన్ని తెలియచేశారు. ఉద్దేశం? జైళ్లలో మగ్గడం ఎంత బాధాకరమో ప్రజలు స్వయంగా తెలుసుకుని జైలుకు వెళ్లే పనులు మానుకుంటారని. అక్కడ ఖైదీలు తినే బొచ్చెలోనే అన్నం పెడతారు. వారిలాగే నేల మీద నిద్రపోవాలి. ‘జైలు రుచి చూడండి!’ అనే పథకాన్ని వారు అమలు జరపబోతున్నారు. నాకేమో సింగ్ గారు బొత్తిగా అమాయకులుగా, పెద్దమనిషిగా కనిపిస్తున్నారు. అయ్యా, ఈ రోజుల్లో ఎవరూ జైళ్లలో మగ్గడం లేదు. హాయిగా, నక్షత్రాల హోటళ్లలో ఉన్నట్టు సుఖంగా ఉన్నారు. ముఖ్య మంత్రులూ, కేంద్ర మంత్రులూ, ముఖ్యమంత్రుల ముద్దుల కూతుళ్లూ తరచు వెళ్లి వచ్చే జైళ్లు మగ్గే ధోరణిలో ఎందుకుంటాయి సార్? కావాలంటే సుబ్రతోరాయ్ని అడగండి. మొన్నే తాజాగా వెళ్లివచ్చిన మేడమ్ జయలలితని అడగండి. త్వరలో వెళ్లబోతున్న విజయ్ మాల్యా గారి కోసం జైళ్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగు తున్నాయని వినికిడి. అక్కడ సరసమైన ధరలకు మత్తు పదార్థాలు దొరుకుతాయనీ, మొబైల్ ఫోన్లు మనకి సరిగ్గా పనిచేయకపోవచ్చు గానీ మొబైల్ కంపెనీలు జైళ్లలో ఉన్న పెద్దల విషయంలో అలాంటి రిస్కులు తీసుకోరనీ వినికిడి. చక్కని భోజనం, వ్యాపార చర్చలు జరుపుకోవడానికి సుబ్రతోరాయ్గారికి అన్ని సౌకర్యాలు జైల్లో కల్పించవల సిందిగా సుప్రీంకోర్టు ఆ మధ్య తాఖీదులు ఇచ్చింది. నేను బ్రిటిష్వారి పాలనలో పుట్టాను. నా తరంలో జైలుకి వెళ్లి రావడం ఒక ఘనతగా, త్యాగానికి ప్రతీకగా చెప్పుకునేవారు. ‘‘ఆయన జైలుకు వెళ్లివచ్చారు’’ అంటే గొప్పగా, గర్వంగా చెప్పుకునేవారు. స్వాతంత్య్రం వచ్చాక జైలుకి వెళ్లి వచ్చిన యోధులకు ప్రత్యేకమయిన గుర్తింపులను ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఆనాటి వైభవం. ఇప్పుడు జైలుకు వెళ్లివచ్చినవారూ, వెళ్లవలసిన వారూ మనకి పార్లమెంటులో, శాసనసభలలో దర్శనమిస్తున్నారు. మన దేవుడు జైల్లోనే పుట్టాడు. మధురలో శ్రీకృష్ణుడు అవతరించిన జైలు గదిని చూశాను. అండమాన్ దీవులలో సెల్యులార్ జైలును చూశాను. ఆ త్యాగధనుల్ని తలుచుకుని కంటతడి పెట్టాను. ముఖ్యంగా వీర సావర్కర్ జైలు గది. ఇక- దక్షిణా ఫ్రికాలో జోహెన్స్న్బర్గ్లో రాబిన్ ద్వీపంలో నెల్సన్ మండేలా దాదాపు పాతిక సంవ త్సరాలు ఉన్న జైలుని చూసి తరించాను. ఓ సరదా అయిన కథ. 1931లో రాయవెల్లూరు సెంట్రల్ జైలుకి సన్నగా రివటలాగ నల్లకళ్లద్దాలతో ఉన్న కొత్త ఖైదీని తీసుకొచ్చారు. ‘ఎవరీయన?’ అనడిగాడు ఓ ఖైదీ. ప్రొఫెసర్ ఎన్. జి. రంగా అనే ఖైదీ సమాధానం ఇచ్చారు. ‘ఆయన రాజగోపాలాచారి. ఈ దేశానికి గవర్నర్ జనరల్ కాగలిగిన సామర్థ్యం ఉన్నవాడు’. మరొక 17 సంవత్సరాలకి రాజాజీ గవర్నర్ జనరల్ అయ్యారు. నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ జైల్లో రాశారు. అదీ ఆనాటి ఖైదీల వైభవం. తన జీవితకాలంలో గాంధీ మహాత్ముడు 13సార్లు జైలుకి వెళ్లారు. ఏ నేరమూ చెయ్యని మరొక వ్యక్తి కూడా జైలులో ఉన్నారు. ఆవిడ పేరు కస్తూరిబా గాంధీ. మరో కథ. 1908లో ప్రఫుల్ల చకీ, ఖుదీరాం బోస్ అనే ఇద్దరు విప్లవకారులు అప్పటి ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ఫోర్డ్ని చంపడానికి బాంబు వేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్టు చేసింది. బాలగంగాధర తిలక్ వారి తరఫున వాదించడానికి సిద్ధపడి దేశద్రోహ నేరం కింద అరెస్టయ్యారు. ఆయన్ని మాండలే జైలులో పెట్టారు. తిలక్ జైల్లో భగవద్గీతా రహస్యం అనే గీతా భాష్యాన్ని రాసి - ఆ పుస్తకం ముద్రితమయ్యాక - దాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముని స్వతంత్ర పోరాట నిధికి జమ చేశారు. ఇవి ఆనాటి కొన్ని నమూనా జైలు కథలు. మహాకవి దాశరథి నిజాం కాలంలో ఇందూరు జైల్లో వట్టికోట ఆళ్వారుస్వామి వంటి సహచరులతో ఉంటూ తన ప్రముఖ కావ్యం ‘అగ్నిధార’ రాశారు. అక్కడ నుంచే ‘నా తెలంగాణ-కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తారు. ఈ జాతిని ఉద్ధరించి ఈ దేశాన్ని ఆకాశంలో నిలిపిన తరం ఆ రోజుల్లో జైళ్ల నుంచి బయటకు వచ్చింది. ఈ దేశాన్ని గబ్బు పట్టిస్తున్న తరం ప్రస్తుతం జైళ్ల వైపు ప్రయాణం చేస్తోంది. సింగ్గారూ! క్షమించండి. మీరు ఒక తరం ఆలస్యంగా కొత్త ఆలోచన చేశారు. ప్రస్తుతం మేము ఉన్న జైలు మాకు చాలు. రచయిత: గొల్లపూడి మారుతీరావు -
రేపటి వ్యాపారం
జీవన కాలమ్ రాబోయే కాలంలో అందమైన, చూడముచ్చటయిన, నాజూకు అమ్మాయిలూ మోసుకు తిరగగల ఆక్సిజన్ సిలెండర్లు మార్కెట్లోకి వస్తాయి. అంతేకాదు. వీటితో పాటు అవినీతి కూడా వెల్లివిరుస్తుంది. కల్తీ ఆక్సిజన్ కూడా వస్తుంది. తెల్లారి లేస్తే మనం పేపర్లలో సల్మాన్ఖాన్ జింకని చంపిన కేసులో నిర్దోషిగా బయట పడిన కథలూ, ఆమీర్ఖాన్ భార్య ఈ దేశంలో ఉండడం భయంగా ఉందన్న కథలూ చదివి ఆనందిస్తాం. కాని అందరూ చదవాల్సిన, తెలు సుకొనవలసిన, తెలిసినా ముఖం చాటేసే నాయకులకు ఈ పాటికే తెలిసిన సత్యాలను తెలుసుకోము. మొన్న పేపర్లో 11వ పేజీలో ఓ చిన్న వార్తని ఓ మూల ప్రకటించారు. ఇది మానవాళి వణికిపోతూ పట్టించుకోవలసిన సంగతి. ‘‘రాబోయే కాలంలో మనుషులు పరిశుభ్రమైన గాలిని పీల్చడానికి తమ తమ ఆక్సిజన్ సిలెండర్లను మోసుకు తిరగాల్సిన రోజులు వస్తాయి’’అని జాతీయ హరిత ట్రిబ్యునల్ అధ్యక్షులు స్వతంతర్ కుమార్గారు సిమ్లాలో అన్నారు. మన దేశంలో - మన తాతలకాలంలో -గ్రామా లలో మండించే ఎండల్లో ఏ ఇంటి ముందునిలిచినా ‘చల్ల’ని హర్ధికంగా ఇవ్వడాన్ని విన్నాం. ఇప్పుడు ‘చల్ల’మాట దేవుడెరుగు పరిశుభ్రమైన మంచినీటికే దిక్కులేదు. ఇప్పుడిప్పుడు దాదాపు ప్రతీ వ్యక్తి తమ తమ మంచినీటి సీసాల్తో కనిపించడం మనకి అలవాటైన దృశ్యం. తాగే నీటిని పట్టుకు తిరిగే రోజు వస్తుందని నా చిన్నతనంలో నేను అనుకోలేదు. మరి 60 ఏళ్లలో అంటే మన పిల్లల తరంలోనే స్నానం చేయడానికి సరిపోయే నీరు కరువౌతుందని ఆ మధ్య ఒకాయన చెప్పారు. ఏవో రసాయన పదార్ధాలతో ఒంటిని తుడుచుకోవడం ఫ్యాషన్గా మారుతుందట. ఇది గ్లామర్ కోసం కాదు. గతిలేక అన్నాడీయన. పారిశ్రామిక ప్రగతిని సాధించిన ఈ రెండు శతాబ్దాలలోనే లక్షల సంవత్సరాలు ఈ భూమిని జీవనయోగ్యంగా ఉంచిన వనరులు, వాతావరణం క్రమంగా భయంకరంగా భయంకరమైన వేగంతో కలుషితమైపోతున్నాయి. మానవులు ఈ భూమిని వాడుకునే లేదా దుర్వినియోగం చేసే వేగంతో భూమి తనని తాను పునరుద్ధరించుకునే వేగం పుంజుకోలేకపోతోంది. ఈ భూమి వయసుతో పోలిస్తే మానవుని వయసు హాస్యాస్పదమైనంత అల్పం. ఇటు కన్ను తెరిచి అటు మాయమయేటంత ప్రిదిలిపోయే సరుకు, ఈ స్వల్ప వ్యవధిలోనే కొన్ని లక్షల తరాల సంక్షేమాన్ని, కొన్ని కోట్ల సంవత్సరాలుగా కాపాడే ఈ భూమిని ఎంత అనా లోచితంగా, స్వార్ధపూరితంగా, ముందు చూపులే కుండా దుర్వినియోగం చేస్తున్నాడో తలుచుకుంటే - ఇది నేనన్న మాట కాదు- మానవునికీ చెద పురుగుకీ తేడా లేదు. ఇది క్రూరమయిన ఉపమానం కావచ్చు. కాని ఇదే నిజం. అయితే ఇవన్ని మాటల్లో స్వతంతర్ కుమార్ చెప్పలేదు. ఇక వ్యాపారులు, రాజకీయ నాయకులు, స్వార్థ పరులు ఆక్సిజన్ సిలెండర్లు వ్యాపారంలోకి దిగితే? బజార్లో అమ్మకానికి పెట్టే ఈ సిలెండర్లలో ఉండవల సినంత సరుకు లేకుండా అమ్మితే? ఆక్సిజన్ని కలుషితం చేస్తే? నిద్రపోయే పక్క ప్రయాణికుడి సిలెండర్ను దొంగ ఎత్తుకుపోతే? అల్లుడుగారికి కట్నంగా 60 స్వచ్ఛమైన ఆక్సిజన్ సిలెండర్లను మామగారు పిల్లతో సహ బహూకరిస్తే? మంత్రులకు, వారి చెంచాలకు ఉచితంగా లెక్కలేనన్ని సిలెండర్ల పంపిణీని చట్టబద్ధం చేస్తే? సిలెండర్ల గొడౌన్లలోనే కుంభకోణం జరిగితే? తెలుగు భాషకీ కొత్త నుడికారం వస్తుందని నా నమ్మకం. ఎవరైనా సహాయం చేస్తే, ‘‘ఆహా! సమ యానికి రామారావు ఆక్సిజన్ సిలెండర్లాగ తారసపడ్డా డయ్యా’’. ఎవరైనా నిష్టూరంగా ప్రవర్తిస్తే: ‘‘ఒరేయ్! చేతనయితే ఆక్సిజన్ సిలెండర్వికా. అంతేకాని ఖాళీ సిలెండర్లా వీపుమీద స్వారీ చెయ్యకు’’, ‘‘ఈ గోవింద రావు చిల్లులు పడిన సిలెండరు లాంటివాడు. బయటికి కనిపిస్తాడు. కాని లోపల ఉత్త డొల్ల.’’ ఇన్ని విషయాల్ని ఇంతగా వివరించి చెప్పలేని ఆ కాలపు పెద్దలు, ఇంతగా చెప్పవలసిన రోజులు వస్తాయని తెలీక ‘‘ఈ భూమి దేవత. దాన్ని గౌరవిం చండి. కూల్చిన ప్రతీ చెట్టుకీ ప్రాయశ్చిత్తం చేసి ప్రత్యా మ్నాయాన్ని కల్పించండి’’ అని మొరపెట్టుకున్నారు. ఇప్పుడు మన నాయకులు లక్షల, కోట్ల మొక్కల్ని నాటించడమే పనిగా రంగంలోకి దూకారు. కెమెరాలు పోటీలు పడి చూపుతున్నాయి. నాటడం వరకూ బాగానే ఉంది. కాని అవి బతకడానికి నీరు? బతికించే నాథుడు? గడిచే ప్రతీ నిమిషం ఈ భూమి మీద మానవుడు సజావుగా బ్రతికే ఒక తరం వనరుల్ని ధ్వంసం చేస్తోం దట. రాబోయే కాలంలో లాభసాటి వ్యాపారం అంద మైన, చూడముచ్చటయిన, నాజూకు అమ్మాయిలూ మోసుకు తిరగగల, మంచి డిజైన్లలో ఆక్సిజన్ సిలెం డర్లు మార్కెట్లోకి వస్తాయి. అంతేకాదు. వీటితో పాటు అవినీతి కూడా వెల్లివిరుస్తుంది. కల్తీచేసే ఆక్సిజన్, చిల్లు సిలెండర్లు, టోకు వ్యాపారం, సిలెండర్ పేలుళ్లు, కాంట్రాక్టుల్లో కుంభకోణాలు. 2జి కుంభ కోణం వీరుడు ఏ.రాజాగారి అబ్బాయి ఇప్పటినుంచే ఆ ప్రయత్నంలో ఉంటారని నా నమ్మకం. (వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు) -
అమ్మ... అమ్మో!
మేధావి అయిన రాజకీయ నాయకుడు ప్రజల ‘రేపు’ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తాడు. బతకనేర్చిన తెలివైన నాయకుడు ఆ రోజు ప్రజల అవసరాల్ని తీర్చడానికి సిద్ధపడతాడు. మొన్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితా లను విశ్లేషిస్తూ చాలా మంది మేధావులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. కాని వారంతా పప్పులో కాలే శారని సవినయంగా మనవి చేస్తున్నాను. అస లయిన విశ్లేషణ చిత్తగించండి. లోకంలో ఏ విప్లవమయినా వంటగదిలోంచే ప్రారంభం కావాలి. ఎప్పుడూ అన్నం కంచానిదే విజయం. ఎలాంటి అభ్యుదయమైనా ఆకలి దగ్గర పర్యవసిస్తుంది. కనుక- అన్ని రంగాలలోనూ అమ్మదే పై చెయ్యి. ఈ విషయంలో నరేంద్రమోదీ గారినీ వెనుక సీటులో నిలుపుతాను నేను. పదవిలోకి వచ్చినప్పట్నుంచీ మోదీగారు మాట్లాడని రోజు లేదు. మాట్లాడని విషయం లేదు. వెళ్లని దేశం లేదు. గత అయిదేళ్లలో పట్టుమని పది నిమిషాలు జయలలిత అమ్మగారు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఆవిడ ముక్తసరిగా మూడేముక్కలు మాట్లాడతారు. ఏం చెయ్యాలో చేసి చూపిస్తారు. చెప్పరు. నేను 45 సంవత్సరాలుగా చెన్నైలో ఉంటున్నాను. 32 సంవత్సరాలు రెండు ద్రవిడ పార్టీలూ ప్రతి ఎన్నికలలో ఆడిన దోబూచుల్లో నేనూ ఓటు వేసి పాల్గొంటున్నాను. 32 సంవత్సరాల తర్వాత పదవిలో ఉన్న పార్టీ గెలిచే గొప్ప విజయాన్ని అమ్మ సాధించారు. అందుకు కారణం నాకు తెలుసు. మీరు క్షమిస్తే నాకే తెలుసు. రహస్యం ఇది. మోదీగారు స్వచ్ఛ భారత్ అని కేకలు వేస్తారు. అమ్మ పది చీపుళ్లు పంచుతారు. మోదీగారు ధరల అదుపు అంటూ ఉపన్యాసం దంచుతారు. అమ్మ దంపుడు బియ్యాన్ని- కాదు- వండిన అన్నాన్ని పంచుతారు. మోదీగారు ‘మేడిన్ ఇండియా’ అంటారు. అమ్మ ‘మేడిన్ వంటగది’ అంటుంది. తమరు గమనించారో లేదో- అన్నాడీఎంకే విజయాన్ని రోడ్డు మీదికి వచ్చి హాహాకారాలతో పండుగ చేసుకున్నవారు ఎవరు? కాలేజీ ప్రొఫెసర్ కాదు. కంపెనీ ఉద్యోగి కాదు. ఆఫీసులో గుమస్తా కాదు. వీరిలో ఒక్కరయినా- మచ్చుకు- ఒక్కర యినా రోడ్డుమీద కనిపించారా? అలాగని రిక్షా కూలీ కాదు. ఫ్యాక్టరీ కార్మికుడు కాదు. రైతు కాదు. బైతు కాదు. అందరూ ఆడవారు- 40-70 వయ సున్న ఆడవారు. కెమెరాల ముందు ఆనంద తాండవం చేశారు. డ్యాన్సులు చేశారు. కారణం- చేతుల్లోనే కంచం ఉంది. వారి చేతుల్లోనే లక్షలాది వోట్లున్నాయి. అమ్మ పొద్దుట లేస్తే పదిరూపాయలకి రెండు ఇడ్లీ పెడతారు. పొంగళ్, ఉప్మా తినిపిస్తారు. వంటకి బియ్యం ఇస్తారు. సరసంగా బజార్లో అమ్ముకుని డబ్బు చేసుకోడానికి కలర్ టీవీలు, సైకిళ్లు ఇస్తారు. అమ్మ కాంటీన్లు ఉన్నాయి. అమ్మ తాగునీరు ఉంది. అమ్మ మందులు, అమ్మ బస్సులు, అమ్మ సిమెంట్, అమ్మ గ్రైండర్లు, ఉచిత మేకలు, ఆవులు. చాలామంది నాయకులు అభి వృద్ధిని ఆకాశంలో చూపిస్తారు. అమ్మ ఆదర్శాల్ని వంటగదికి, ఇంటి వసారాలోకి దింపి మిమ్మల్ని పలకరిస్తుంది. దిగ్విజయ్ సింగ్గారు కాంగ్రెసు అడుక్కు తినడానికి కారణాలు వివరించారు. కళ్ల ముందు తమ సంస్థ కూలిపోతున్నా- గాంధీ కుటుంబానికి పెద్ద పీట వేస్తూ ఆత్మవంచన చేసుకునే ప్రముఖ నాయకుడు దిగ్విజయ్ సింగ్గారు ఏదో ‘సర్జరీ’ గురించి మాట్లాడి, అంతలో నాలిక కొరుక్కుని ‘నేను సర్జరీ అన్నది పైవాళ్లని- సర్జన్లని కాదు’ అన్నారు. నా సలహా ఒక్కటే. రాహుల్ గాంధీ గారికి వెంటనే తమిళనాడులో మెట్టుపాళియం అరులాంబాళ్కో, తమిళరిసికో ఇచ్చి పెళ్లి చేయండి. సోనియాగాంధీ గారి అరవ కోడల్ని ‘అమ్మ’ దగ్గర అయిదేళ్లు తర్ఫీదుకు ఉంచండి. 2019లో ‘ఇళవరసి రాహుల్’ తన బావగారు రాబర్ట్ వాద్రా సహాయంతో బీజేపీ ఆదర్శాలకు దీటుగా -ప్రజలకి- ముఖ్యంగా మహిళలకు- బెనారస్ హల్వా, 5 కిలోల గోధుమపిండి, 10 కిలోల బంగాళాదుంపలు, బస్తా ఉల్లిపాయలు, రొట్టెలు కాల్చుకునే పెనం, మురుగన్ విబూది, పాన్పరాగ్ డబ్బా, చిన్న చిన్న స్కూటర్లు, మొబైల్ ఫోన్లు- ఇలాంటివి పంచి దేశాన్ని ఒక తాటిమీద నిలప గలదని నా హామీ. మేధావి అయిన రాజకీయ నాయకుడు ప్రజల ‘రేపు’ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తాడు. బతకనేర్చిన తెలివైన నాయకుడు- ఆ రోజు ప్రజల అవసరాల్ని తీర్చడానికి సిద్ధపడతాడు. ఆదర్శం ఆకాశం. అది ఆలోచనల్లో- సుదీర్ఘమైన కృషితో పదికాలాలపాటు కలిసి వచ్చే బంగారు భవిష్యత్తు. అది ఎవడిక్కావాలి? ఆకలిని తీర్చడానికి వేసే పథకం కంటే ఎదురుగా కనిపించే మేక రుచికర మైన పరిష్కారం. ఈ దేశంలో మరొక చోట మరో ‘అమ్మ’ అదే పనిచేసిందని మరిచిపోవద్దు. ఆ అమ్మ మమతా బెనర్జీ. ఏతావాతా కాంగ్రెస్ పతనానికి సత్వర పరిష్కారం నాకు తెలుసు. దిగ్విజయ్ సింగ్ గారూ, తమ ‘సర్జరీ’ కత్తుల్ని సొరుగులో పెట్టి మంచి అరవ పిల్లని రాహుల్ గాంధీగారి కోసం వెదికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి. గొల్లపూడి మారుతీరావు జీవన్ కాలమ్ -
ఒక మధురమైన జ్ఞాపకం
జీవన కాలమ్ 1985లో మే 30 అర్ధరాత్రి మూర్ మార్కెట్లో నిప్పు చెలరేగింది. విద్యుచ్చక్తి వైర్లు కారణమన్నారు. 800 పుస్తకాల షాపులు, కొన్ని వందల పురావస్తువులు, విలువ కట్టలేని గ్రామఫోన్ రికార్డులు దగ్ధమయిపోయాయి. మద్రాసుకి నా జీవితంలో చాలా ఆలస్యంగా వెళ్లాను. నాకు పాతికేళ్లు దాటిన తర్వాత - గూడూరు సంస్కృతీ సమ్మేళనంలో కలసిన ‘మహతి’ అనే దర్శకుడి ఆహ్వానంతో మొదటిసారి. అప్పుడాయన జేవీ రమణ మూర్తి హీరోగా నటిస్తున్న ‘జన్మహక్కు’ అనే సినీమాని తీస్తున్న గుర్తు. చిన్నప్ప ట్నుంచీ మద్రాసు సినీమా కారణంగా చాలా ఆసక్తిని కలిగించినా - నా మట్టుకు మద్రాసులో చూడాల్సిన స్థలాలలో ‘మూర్ మార్కెట్’ ఒకటి. సాహిత్యం, సైన్సు, హిస్టరీ, ఆర్కియాలజీ- మీ ఇష్టం- అక్కడ దొరకని సెకండ్హ్యాండ్ పుస్తకం లేదు. ఒక్క విశేషమేమంటే అక్కడ పుస్తకాల దుకాణాలను నడిపేవారంతా దాదాపు తమిళులు. వారు తెలుగు మాత్రమే కాక, తెలుగులో అపురూపమయిన గ్రంథాలను, వాటి వివరాలను ఒడిసి పట్టుకునేవారు కావడం. ఎన్నడో ప్రభుత్వం నిషేధించిన ముద్దుపళని ‘రాధికా స్వాంతనము’ షాపుకి వచ్చిందని ఆ తమిళుడు మీకు చెవిలో చెప్తాడు. అంద రికీ చెప్పడు. ఎవరు దాని గురించి వెదుకుతారో అతనికి తెలుసు. ఆ పుస్తకాల షాపుల్లో అతి తరుచుగా నార్ల వెంకటేశ్వరరావుగారు, ఆరుద్ర, డి. ఆంజనేయులు, బులుసు వెంకటరమణయ్య, వేదం వెంకటరాయశాస్త్రి (మనుమడు) వంటి వారెందరో తారసపడేవారు. అక్కడి వ్యాపారులకు వీరు తెలిసిన ముఖాలు. మించి- వారికేం కావాలో తెలుసు. వారి వారి అవసరాలను బట్టి, ఆ పుస్తకాల అరుదయిన విలువలను బట్టి షాపు వ్యాపారి వాటి ధరల్ని నిర్ణయించేవాడు. ముద్దుపళని ముద్రణ అయిన రోజుల్లో ఆరు అణాలు ఉండవచ్చు. ఇప్పుడు తేలికగా 60 రూపాయలు వసూలు చేస్తాడు. కొనే సాహితీప్రియుడు కృతజ్ఞతతో ఆ ధరని చెల్లిస్తాడు. కొన్ని అరుదయిన పుస్తకాలను ఇస్తే-అప్పుడప్పుడు బక్షీసు దక్కిన సంద ర్భాలూ ఉన్నాయి. ఇది ప్రపంచం లోనే అరుదయిన సెకెండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణం. అంత గొప్ప స్థలం ప్రపంచంలో - నాకు తెలిసి- మరొ కటి ఉంది. అది వేల్స్ (బ్రిటన్)లో హై-ఆన్వై అనే చిన్నగ్రామం. ఆంగ్లభాషలో అక్కడ దొరకని పుస్తకం ఉండదు. ఆ గ్రామమంతా పుస్తకాల దుకాణమే. పేవ్మెంట్ల మీదా, కిటికీల మీదా, చిన్నచిన్న గొందుల్లో వేలవేల పుస్తకాలు, పత్రికలు. అక్కడి షాపు కీపరు షేక్స్పియర్ ‘సింబర్లిన్’ ఎప్పుడు రాశాడో వివరంగా చెప్తాడు. 1920లో ప్రచురితమయిన మొదటి కాలికో బైండ్ కాపీని- 20 డాలర్లకు అమ్ముతాడు. 1914లో ‘టైమ్స్’ ఫలానా రోజు దినపత్రిక కావాలా? షాపు కీపరు నవ్వి, ‘మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్న పింపర్నల్ కథని వెతుకుతున్నారా సార్! ’ అని ఆ మధ్య వచ్చిన మరో గ్రంథాన్ని చూపిస్తాడు. అక్కడ మీకు కనిపించే ముఖాలు అరుంధతీరాయ్, సాల్మన్ రష్దీ వంటివారు. సరే, మళ్లీ మూర్ మార్కెట్కి వస్తే-1890-1893 మధ్య మద్రాసు కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉన్న కల్నల్ సర్ జార్జ్ మాంట్గోమరీ జాన్ మూర్ ఈ భవనాన్ని - ఒక వ్యాపార సముదాయంగా నిర్మింపచేశాడు. ఇంతకు ముందు బ్రాడ్వేలో పూఫమ్ మార్కెట్ ఉండేది. తర్వాత వచ్చిన ఈ మార్కెట్ పాత గ్రామఫోన్ రికార్డులకు, పాత పుస్తకాలకు, అలనాటి పురావస్తువులకి, బట్టల దుకాణాలకి ప్రసిద్ధి. నేను ‘వందేమాతరం’ అనే నాటికని 1962లో రాసినప్పుడు - అలనాటి లతామంగే ష్కర్ ‘ఆనందమఠ్’లో పాడిన వందేమాతరం పాట దొరికింది ఇక్కడే. ఇంతేకాదు - ప్రత్యేకమైన రకర కాల పెంపుడు జంతువులను అక్కడ అమ్మేవారు- కుక్క పిల్లలు, చిలకలు, పిచ్చుకలు, తాబేళ్లు, ప్రేమ పక్షులు, చిన్నసైజు నక్కలు- ఇలా. అదొక సుందర దృశ్యం. 1902లో ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ వేసిన మూర్ దొరగారి నిలువెత్తు పెయింటింగ్ ఇప్ప టికీ మద్రాసు కార్పొరేషన్ కార్యాలయంలో ఉంది. దానికి రవివర్మగారికి ఇచ్చిన పారితోషికం 3 వేల రూపాయలు. 1902లో ఈ పైకం ఇప్పటి 30 లక్షలు అనుకోవచ్చు. 1985 ప్రాంతంలో రాజకీయ ప్రలోభాలు, చరిత్ర మీద ఖాతరు లేని నాయకమ్మన్యుల పాలన వచ్చింది. పక్కనున్న సెంట్రల్ స్టేషన్కి కారు పార్కింగు సౌకర్యం కోసం మూర్ మార్కెట్టుని అక్కడినుంచి లేపేసే ప్రయత్నాలు సాగాయి. కళాప్రియులు హాహా కారాలు చేశారు. చరిత్రకారులు ముక్కు మీద వేలేసు కున్నారు. పత్రికలకు ఎక్కారు. ప్రభుత్వం ఒక్క క్షణం వెనుకంజ వేసింది. కాని వారి కిటుకులు వారికి ఉన్నాయి. 1985లో మే 30 అర్ధరాత్రి మూర్ మార్కెట్లో నిప్పు చెలరేగింది. విద్యుచ్చక్తి వైర్లు కారణమన్నారు. 800 పుస్తకాల షాపులు, కొన్ని వందల పురావస్తువులు, విలువ కట్టలేని గ్రామఫోన్ రికార్డులు దగ్ధమయిపోయాయి. ఒక చరిత్ర నేలమట్టమయి పోయింది. - గొల్లపూడి మారుతీరావు -
ఓ గొప్ప చరిత్ర
ఓప్రా విన్ఫ్రేకి ఒక ఉత్తరం రాస్తూ, ‘75 ఏళ్ల తర్వాత ప్రజలు లాప్టాపులూ, సెల్ఫోన్లూ, ఐపాడ్లలో మునిగి తేలుతున్నారు - తమ మెదడుల్ని ఖాళీగదుల్ని చేసుకుని. కానీ నేనింకా పుస్తకాల మధ్యనే ఉన్నాను’ అన్నారు. కాలం మానవ మనోఫలకం మీద చేసిన సంతకం చరిత్ర. ఈ సంతకాలు అనేకం. అపూర్వం. అనూహ్యం. విచిత్రం. విడ్డూరం. మరొకప్పుడు అసంబద్ధమైన విపర్యయం. కొందరు రచయితలు జీవితమంతా పుంఖానుపుంఖాలుగా రచనలు చేస్తారు. చేస్తూనే ఉంటారు. వాళ్లతో పాటే వారి జ్ఞాపకాలూ కాల గర్భంలో కలసి పోతాయి. కొందరు ఇబ్బందిగా, ముక్తసరిగా, క్లుప్తంగా తమ మనసుని పేజీల్లో విప్పుతారు. చరిత్ర వారిని గుండెల్లో పొదువుకుంటుంది. రాసికాదు, వాసి- అన్నది పాత నానుడి. ఒకావిడ 89 సంవత్సరాల కింద పుట్టింది. 35 సంవత్సరాలు ఏమీ రాయాలనుకోలేదు. రాసినా ఏవేవో రాసింది. తన 35వ యేట - తన అనుభవాలు, జ్ఞాప కాలలో నుంచి - ఇద్దరు పసివారి మనసుల్లో ఆలోచనల రూపంగా ఒక నవల పుట్టింది. ఆ నవల ఆమెకే కాదు, ఆమె దేశానికీ, నవలా సాహిత్యానికీ, ఈ దశాబ్దపు రచనలకీ మకుటాయమానమైంది. ఆ రచయిత్రి పేరు హార్పర్ లీ. ఆమె ఇటీవలే కన్నుమూసింది. నల్లవారి పట్ల వివక్ష ఎక్కువగా ఉన్న ఆనాటి అలబామాలో మన్రోవిల్లీ ప్రాంతంలో ఒక నల్లజాతీయుడు తెల్ల జాతి అమ్మాయిని మానభంగం చేశాడన్న తప్పుడు కేసును నల్లవాని తరఫున వాదించిన తెల్ల లాయరు కథ ఇతివృత్తం. అసలు లీ నవలే రాయాలనుకోలేదు. ఎలా రాయాలో తెలీదు. తన 31వ యేట మొదట ఒక నమూనా ప్రతిని రాసింది. ఆమె అదృష్టవశాత్తు ఆ స్క్రిప్ట్ హోహోఫ్ టోర్నీ అనే ఆవిడ చేతిలో పడింది. ఆ రచనలో మంచి నవల లేదు. కాని మంచి నవలకి ప్రాతిపదికను గుర్తు పట్టింది. తర్వాత కేవలం రెండు సంవత్సరాలు లీతో చర్చలు జరిపి సంఘటనలను కుదించి, కత్తిరించి, కుట్టి, సవరణలు చేసి, మళ్లీ మళ్లీ తిప్పి రాయడం సాగుతూ వచ్చింది. ఓసారి విసుగెత్తి తన రచన మీద తనకే తృప్తి లేక ఓ శీతాకాలం రాత్రి చేతిలోని రచనని కిటికీలోంచి బయటకు మంచులో పారేసింది. ఇది తెలిసిన హోహోఫ్ నచ్చ చెప్పి వెంటనే ఆ కాగితాలను వెనక్కు తీసుకురమ్మని ఒత్తిడి చేసింది. ఎట్టకేలకు ఒక నవల రూపుదిద్దుకుంది. ఆ నవల పేరు ‘టు కిల్ ఎ మాకింగ్బర్డ్’. ఆ పుస్తకం కేవలం 4 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. అమెరికాలో 74 శాతం స్కూళ్లలో పాఠ్య పుస్తకమయింది. పులిట్జర్ బహుమతిని దక్కించుకుంది. 1999లో లైబ్రరీ జర్నల్ ఈ నవలని ఈ శతాబ్దపు గొప్ప నవలగా అభివర్ణించింది. తర్వాత 54 సంవత్స రాలు ఏమీ రాయలేదు. హార్పర్ లీ న్యూయార్క్లో ఈస్టర్న్ ఎయిర్లైన్స్లో రిజర్వేషన్ గుమాస్తాగా పనిచేసింది. అప్పటి ఆమె పాప్యులారిటీకి ఒక్క ఉదాహరణ- 1956లో ఒక అభిమాని ఆమెకి ఒక సంవత్సరం పాటు జీతం కలసి వచ్చే పైకం చెక్కు పంపుతూ, ‘మీరు సంవత్సరం పాటు ఉద్యోగాన్ని వదిలి రచనలు చెయ్యండి. క్రిస్టమస్ శుభాకాంక్షలు’ అన్నాడు. 1962లో అప్పటి ప్రముఖ నటుడు గ్రిగరీ పెక్ లాయరుగా నటించిన చిత్రం అమెరికా సినీరంగంలో మరొక చరిత్రను సృష్టించింది. ఆ చిత్రానికి మూడు ఆస్కార్ బహుమతులు, ఉత్తమ నటనకు గ్రిగరీ పెక్కు ఆస్కార్ బహుమతి లభించాయి. విచిత్రం ఏమిటంటే ఆమెకి కీర్తి అన్నా, పరపతి అన్నా, పదిమందిలోకి రావడమన్నా ఇష్టం లేదు. సభల్లో పాల్గొనడం, అవార్డులు, గౌరవాలను స్వీకరించడం ఆమెకి నచ్చదు. ఆమె పెళ్లి చేసుకోలేదు. 2011లో ఒక ఆస్ట్రేలియా పత్రికా సంపాదకుడితో మాట్లాడుతూ, ‘‘ఇక నేనెప్పుడూ రచన చెయ్యను. అందుకు రెండు కారణాలు. 1. ఎంత డబ్బిచ్చినా నా నవల కారణంగా నా మీద వచ్చిన ఒత్తిడి, ప్రచారాన్ని నేను తట్టుకోలేను. 2. నేనేం చెప్పాలనుకున్నానో చెప్పేశాను. దాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం నాకిష్టం లేదు’ అన్నారు. 2006 మే 7న ప్రపంచ ప్రఖ్యాత ప్రదర్శకురాలు ఓప్రా విన్ఫ్రేకి ఒక ఉత్తరం రాస్తూ, ‘75 ఏళ్ల తర్వాత ప్రజలు లాప్టాపులూ, సెల్ఫోన్లూ, ఐపాడ్లలో మునిగి తేలుతున్నారు - తమ మెదడుల్ని ఖాళీగదుల్ని చేసుకుని. కానీ నేనింకా పుస్త కాల మధ్యనే ఉన్నాను’ అన్నారు. ముగ్గురు అమెరికా అధ్యక్షులు ఆమెకి తమ దేశపు అత్యున్నత గౌరవంతో సత్కరించారు. చివరి రోజుల్లో చూపు తగ్గి, బొత్తిగా కనిపించక, వినిపించక, జ్ఞాపకాలను మరచిపోతూ, వృద్ధాప్యం మీద పడగా వీల్చైర్లో తిరుగుతూ ఒక శరణాలయంలో, తను పుట్టిన ఊరు మన్రోవిలీలో నిద్రలో కన్నుమూసింది. కిందటి సంవత్సరమే ‘గో సెట్ ఏ వాచ్మేన్’ అనే ఆమె నవల ప్రతి బయటపడింది. కానీ అది మొదటి నవలకి మొదటి రూపమని చాలామంది తేల్చేశారు. అయినా మొదటి రోజుల్లోనే ఆ నవల 2 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. కొందరు చరిత్రను సృష్టిస్తారు. కొందరు తెర వెనుకనే జీవించి, ఏకాకిగా గడిపి, ఒంటరి జీవితాన్నే చరిత్రగా చేసుకుంటారు. కాలం మనోఫలకం మీద చెక్కిన విపర్యయం కూడా చరిత్రే. - గొల్లపూడి మారుతీరావు -
జాతీయ చెత్తబుట్ట
జీవన కాలమ్ ఫెయిలవడం, ఎందుకూ పనికిరాకుండా పోవడం ఈ దేశంలో ఘనత, అవకాశం. రాజకీయాలకు దగ్గర తోవ. మనదేశంలో ఆయా రంగాలలో కాలదోషం పట్టినా కలిసి వచ్చే వ్యాపార రంగం-రాజకీయం. సినీమా రంగంలో ఒక జోక్ ఉంది. వెనకటికి ఒక నిరు ద్యోగి ఉద్యోగం కోసం ఒక నిర్మాతగారి దగ్గరికి వచ్చా డట. ‘‘నువ్వు ఏం చేస్తా వయ్యా? రచనలేమైనా చేస్తావా?’’ అన్నాడట నిర్మాత. ‘‘అయ్యో, నాకు రాదండీ!’’ అన్నాడట ఈ నిరుద్యోగి. ‘‘పోనీ, నటనలో అనుభవం ఉందా?’’ అనడిగాడట. లేదన్నాడు ఇతను. ‘‘పోనీ సంగీతంలో ప్రావీణ్యం ఉందా?’’ నిస్సహాయంగా తల అడ్డంగా తిప్పాడు. ‘‘మేకప్లో?’’ లేదు. ‘‘కెమేరా పనిలో?’’ లేదు. నిర్మాత ఆగి, ‘‘ఎందులోనూ ప్రవేశం లేదం టున్నావు కనుక- ఇక ఒకే ఉద్యోగం ఖాళీగా ఉందయ్యా. ఈ చిత్రానికి డెరైక్టర్గా ఉండు’’ అన్నాడట. ఇది కేవలం జోక్. డెరైక్టర్ మీద కడుపు రగిలిన వారెవరో కల్పించినది. ఏమీ కల్పన లేని నిజం ఈ దేశంలో మరొకటి ఉంది. ఆయా రంగాలలో ఇక రాణించే అవకాశం లేదని నిర్ధారణ అయ్యాక, ఎందుకూ పనికిరాని దశకి వచ్చిన వ్యక్తికి ఒకే ఒక్క చోటు-రాజకీయ రంగం. పాపులారిటీ - అదెంత నీచమయినదయినా, ఎంత నికృష్టమయినా ప్రజాస్వామ్యంలో కొంగుబంగారం. మొన్ననే 33 ఏళ్ల బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ అవినీతికి 2013లో అరెస్టయి, ఆట నుంచి బర్తరఫ్ అయ్యాక ప్రస్తుతం ఒకానొక రాజకీయ పార్టీ తీర్థం పుచ్చు కున్నారు. రేపు వారు కేరళ అసెంబ్లీలో మనకి దర్శనం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. లోగడ అలాంటి నేరానికే శాశ్వతంగా క్రికెట్ నుంచి తొలగిన మన దేశపు కెప్టెన్ అజారుద్దీన్గారు గత పార్లమెంట్లో మన నాయ కులు. సినీరంగంలో కాలం చెల్లిన హేమమాలిని, శత్రుఘ్నసిన్హా గారలు ప్రస్తుతం పార్లమెంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకైతే హేమమాలిని పార్లమెంట్ సభ్యురాలు కావడం వల్ల సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ - ఈ దేశానికి ఏం ఉప యోగం జరిగిందో బోధపడదు. సంవత్సరాల కిందట-బందిపోటుగా మనుషుల్ని ఊచకోత కోసిన ఫూలన్దేవి ప్రజాప్రతినిధిగా పార్లమెంటులో మనకి దర్శనమిచ్చారు. అర్ధాంతరంగా చచ్చిపోయాడుగాని ఈ లెక్కన వీరప్పన్ ఏ రాష్ట్రానికో ముఖ్యమంత్రి అయ్యే ఆర్హతలున్నవాడు. అజారుద్దీన్ మీద ఎవరో సినీమా తీస్తున్నారని విన్నాం. ఆయన అవినీతితో అన్యాయం అయ్యాక ఈ దేశం, ఆ మాటకి వస్తే ప్రపంచం నెత్తిన పెట్టుకున్న ఈ పెద్దమనిషి ‘‘నేను మైనారిటీ వర్గం వాడిని కనుక నన్ను ఇలాచేశారు’’ అని వాగాడు. సినీమాలో ఈ ఉవాచ ఉంటుందని ఆశిద్దాం. అయితే ఒట్టిపోయిన సినీ తారల గురించి చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పకపోతే అన్యా యమవుతుంది. 1998లో మేం గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ మొదటి సభకి ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి సునీల్దత్గారి దగ్గరికి బొంబాయి వెళ్లాను. ఆయన ఆఫీసు చుట్టూ బారులు తీర్చి అతి సాదాసీదా మనుషులున్నారు. సాహెబ్ ద్వారా మాకు మేలు జరుగుతుంది అని వారు తృప్తిగా చెప్పడం నాకు గుర్తుంది. తీరా ఆగస్టు 12కి రెండు రోజుల ముందు ఆయన అమెరికాలో ఉండి పోయారు. సభని రెండు రోజులు వాయిదా వేయ వచ్చా అని సునీల్దత్ సెక్రటరీ నాకు ఫోన్ చేశారు. నేను చెప్పాను. అది మా అబ్బాయి కన్నుమూసిన రోజు. రెండు రోజులు దేవుడు వాయిదా వెయ్యగ లిగితే నేను అదృష్టవంతుడినయ్యేవాడిని అన్నాను. 12న సభకి వచ్చారు. అయిదు నక్షత్రాల హోటల్లో సూట్ ఏర్పాటు చేశాను. రాత్రి ఒక గ్లాసు వైన్ పుచ్చుకుని ఆ వైన్కి తాను బిల్లు చెల్లించారు. రాజకీయ రంగం ఈ దేశానికి అక్కర్లేని చెత్తబుట్ట. కుల, వర్గ, విద్య, ప్రమేయం లేకుండా ఎవరైనా ప్రజాసేవ చేయవచ్చునన్న వెసులుబాటుని నూటికి నూరు పాళ్లూ దుర్వినియోగం చేసిన వ్యవస్థ రాజకీయం రంగం. రామ్ మనోహర్ లోహియా, కృపలానీ, పుచ్చలపల్లి సుందరయ్యవంటి మహామహులు ఆ వ్యవస్థని సుసంపన్నం చేయగా శ్రీశాంత్లకూ, అజారుద్దీన్, హేమమాలిని వంటివారికీ ఆటవిడు పుగా ప్రస్తుతం వినియోగపడుతోంది. ఫెయిలవడం, ఎందుకూ పనికిరాకుండా పోవడం ఈ దేశంలో ఘనత, అవకాశం. రాజకీయాలకు దగ్గర తోవ. మనదేశంలో ఆయా రంగాలలో కాలదోషం పట్టినా కలిసి వచ్చే వ్యాపార రంగం- రాజకీయం. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
ఆట బాబోయ్!
జీవన కాలమ్ మొన్నంటే మొన్న కలకత్తా ఈడెన్గార్డెన్లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఆట చాలా విషయాలను నేర్పింది. శనివారం ఉదయం నుంచీ అన్ని చానెళ్లు రకరకాల ఊహాగానాలనూ, ఇంటర్వ్యూలనూ ప్రసారం చేస్తున్నాయి. అందరి దృష్టీ ఆట మీదే ఉంది. అయితే చాలా కారణాలతో ఈ ఆటలో పాకిస్తాన్ విజయం సాధించడానికి ఎన్నో రకాల సూచనలు మొదటినుంచీ కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచ కప్పులోనే మొన్న బంగ్లాదేశ్తో ఆడుతూ పాకిస్తాన్ అద్భుతమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం ఒక కారణం. కాగా- ఈడెన్గార్డెన్ చరిత్రలో ఎప్పుడూ ఇండియా - పాకిస్తాన్ని ఎదిరించి గెలవలేదు. ఎప్పుడూ పాకిస్తాన్ ఓడిపోలేదు. కనుక, ఏ విధంగా చూసినా అన్ని శకునాలూ పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నాయి. టీవీ సెట్ల ముందు కూర్చున్న కోట్లాదిమంది మనస్సుల్లో ఈ నిజాలు కదలకపోవు. మొన్నటి కలకత్తాలో రెండు జట్లనూ క్రికెట్ యంత్రాంగం, ప్రభుత్వం పలకరించిన తీరు అమోఘం. ప్రపంచ కప్పు ఫైనల్స్ ఆటకు జరిపిన ఉత్సవాన్ని తలపించింది. అయితే ఎప్పుడు ఈ రెండు జట్లు తలపడినా ఇంత ముమ్మరాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ నేను గమనించిన, చాలామంది గుర్తించని ముఖ్యమైన ‘తేడా’ ఈ రెండు దేశాల ఆటల్లో పాకిస్తాన్ది ఆవేశం. ఇండియాది కేవలం ఆనందం. గెలవాలనే ఆశ రెండు దేశాలకీ, రెండు పక్షాలకీ ఉన్నా- ఆ ప్రయత్నంలో అతి ప్రముఖమైన తేడా ఉంది. ఉదాహ రణలు బోలెడు (రెండోసారి ఆట హైలైట్స్ చూశాక చెప్తున్నాను). ఉమర్ అఖ్మల్ బ్యాట్కి బంతి తగిలి ధోనీ కేచ్ పట్టుకున్నాక, ఔట్ అయ్యాక జడేజా, ధోనీ పిచ్ మధ్యకు వచ్చి పలకరించు కున్నారు, మాట్లాడుకున్నారు. ఇద్దరి ముఖాలలో స్పష్టమైన ఆనందం తొణికిసలాడింది. ఏ విధమైన ఆవేశమూ ఆ ఆనందానికి లేదు. పాకిస్తాన్ ఆటలో మహమ్మద్ సమీ బంతికి శిఖర్ ధావన్ ఔట్ అయి నప్పుడు సమీ ముఖాన్ని చూడాలి. ‘పిచ్చికూనల్లారా! మీకిదే తగిన శాస్తి - ఇంకా ముందుంది ముసళ్ల పండుగ’ అన్న ఆవేశం స్పష్టంగా కనిపించింది. ‘మీ రోగం కుదిరిందా!’ అన్న ఎకసెక్కం మిగతా ఆటగాళ్ల విసుర్లలో కనిపించింది. 45 పరుగుల తర్వాత మాలిక్ బంతికి కోహ్లి ఫోర్ కొట్టాక - పిచ్ మధ్యకి వచ్చి ధోనీ, కోహ్లి ఆనందించిన దృశ్యం ఆటగాళ్ల ఆరోగ్యకరమైన స్పందనకు నిదర్శనం. పడిపోయే ప్రతీ వికెట్ దగ్గరా అఫ్రీది వీరావేశం కొట్టవచ్చినట్టు కనిపించింది. ఇదే రెండు జట్ల దృక్పథాలలో పెద్ద తేడా. ఇదే ఎప్పుడూ ఇండియా విజయం సాధించడానికీ, పాకిస్తాన్ ఎప్పుడూ ఓడిపోవడానికీ ముఖ్యమైన కారణం. ఇండియా ‘ఆట’ని ఆడి ఆనందిస్తోంది. పాకిస్తాన్ విజయం కోసం ‘కసి’ని పెంచుకుంటోంది. ఇండియాలో ప్రేక్షకులు ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. షార్జాలో క్రికెట్ ఆట గుర్తుంటే-పాకిస్తాన్ ఓడుతున్నప్పుడల్లా ఆట విజ యానికి దేవుడినీ, మతాన్నీ ప్రేక్షకులు అప్పటికప్పుడే గేలరీలో ఆశ్రయించడం ఇందుకు పెద్ద నిదర్శనం. ఆటలోనే కాదు, ఏ ప్రయత్నంలో అయినా నిజమైన, నికార్సయిన ‘ప్రయత్నం’ ఆ కృషికి బలాన్నిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ‘వినియోగించుకోవాల’నే లక్ష్యం దాన్ని బలహీనం చేస్తుంది. ప్రతీసారీ ఇండియాకు క్రికెట్ మరొక ఆట. పాకిస్తాన్ని గెలవాలన్న పట్టుదల. అంతవరకే. కానీ పాకిస్తాన్కి అది యుద్ధం. తమ సత్తా చాటాలన్న ఆవేశం. An unfettered happiness at an achievement makes it rewarding. A motive cripples it, kill it, even makes it lopsided. నాకు పాకిస్తాన్ ఆటగాళ్ల మీద అపారమైన గౌరవం. అలనాటి ఇమ్రాన్ఖాన్, అబ్దుల్ఖాదిర్, జహీర్ అబ్బాస్ లాంటి ఆటగాళ్లంటే నాకు పిచ్చి. వారి మనస్సులోకి దూరి ఏమనుకుంటున్నారో చెప్పలేం కాని- వారు క్రికెట్ పరపతినీ, ప్రతిష్టనీ పెంచారు. మొన్న ‘‘ఇండియాలో మాకు మాతృదేశం కంటే ఆదరణ లభిస్తోంది’’ అన్న అఫ్రీది మీద ఒకాయన కేసు పెట్టడం, జావీద్ మియన్దాద్ వంటి ఆటగాడు విరుచుకుపడడం ఇందుకు దురదృష్టకరమైన నిదర్శనాలు. అఫ్రీదిని కెప్టెన్గా తొలగిస్తారన్న వార్తలు అప్పుడే వస్తున్నాయి. ఆ మధ్య మోదీగారు అకస్మాత్తుగా పాకిస్తాన్ వెళ్లి శాంతియుతమైన సుహృద్భావం కోసం అక్కడి నాయకత్వంతో చేతులు కలపడం ద్వారా మనస్ఫూర్తిగా చేసిన ప్రయత్నంలో కేవలం రాజకీయ కోణాన్ని మాత్రమే చూసిన మన నాయకులు - ప్రస్తుతం మహమ్మద్ సమీ ధోరణిలో స్పందిస్తున్నారని నాకు అనిపిస్తుంది. - గొల్లపూడి మారుతీరావు -
కీలెరిగిన మాంత్రికుడు
జీవన కాలమ్ ఈ మధ్య విజయ్ మాల్యా ఆర్థికమయిన అవినీతి మీద ఛానళ్లు, పత్రికలు హోరు పెడుతున్నాయి. కోట్ల రూపాయలు బ్యాంకులకూ, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సిబ్బందికీ ఎగవేసిన కథలు పుంఖానుపుంఖాలుగా వెలుగులోకి వస్తున్నాయి. తీరా విజయ్ మాల్యాను ఈ దేశం విడిచిపోవడానికి చక్కగా అవకాశం కల్పించాక- దొంగలు పడిన ఆరు నెలలకి ఈ బ్యాంకులు సుప్రీం కోర్టుకెక్కాయని చానళ్లు చెబుతున్నాయి. ‘అవినీతి’కి అంతులేని గ్లామర్ ఉంది. ఈ దేశం వీరప్పన్ గురించి మాట్లాడుకున్నంత రుచిగా పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి గురించి మాట్టాడుకుని ఉండదు. ఇన్ని రోజులు చానళ్లలో మాట్లాడుతున్నవారూ, ప్రభుత్వ ప్రతినిధులూ - సర్వే సర్వత్రా విజయ్ మాల్యాకు అధికార, బ్యాంకు యంత్రాంగం నుంచి అమోఘమైన సహకారం లభించిందనేవారే కానీ ఏ ఒక్కరూ కారణం చెప్పలేదు. నిజానికి చెప్పలేరు. ఆయా కీలక స్థానాలలో ఉన్న అధికారులు, బ్యాంకు ఆఫీసర్లను కూడగట్టుకోవడానికి శృంగారరాయుడు మాల్యాగారి దగ్గర ఎన్నో దగ్గర తోవలున్నాయి. 9000 కోట్ల పై చిలుకు మాల్యా అరాచకానికి పరోక్షంగా తోడ్పడిన- షరతుల్నీ, పద్ధతుల్నీ, రూల్సునీ తుంగలోకి తొక్కి - నిన్న మొన్నటిదాకా షష్టిపూర్తిని కూడా కోట్ల ఖర్చుతో జరుపుకున్న మాల్యాకు సహాయ పడడానికి వెనుక గల రహస్యం ఏమిటి? మాల్యాగారి చుట్టూ డజన్ల సీతాకోకచిలుకల్ని చూస్తూ ఉంటాం. మాల్యాగారెప్పుడు కనీసం ఒక్కరు లేదా ఇద్దరు అందమయిన అమ్మాయిల భుజాల మీద చెయ్యి వేసుకుని దర్శనమిస్తూంటారు. వారు ఆయనకి పబ్లిగ్గా ముద్దులు కురిపిస్తూంటారు - చూపరులకి ఈర్ష్య కలిగేటట్టుగా. అతి తరచుగా వారు ఇచ్చే విందుల్లో ఎన్ని సుఖాలు దాగి ఉన్నాయో ఈ దేశంలో పెద్దలందరికీ - కనీసం మనస్సుల్లోనయినా తెలుసు. బ్యాంకులు రూల్సు మరిచిపోయినా, అధికారులు కోట్ల రుణాలకి సంతకాలు చేసినా - ఏ రాత్రి, ఏ సుఖం నీడలో జరిగిందో ఆ భగవంతుడికెరుక. అవినీతి వీధిన పడ్డాక అందరూ ‘మడి’ కట్టుకుని మాట్లాడుతున్నారు కానీ - మన యంత్రాంగంలో తేలుకుట్టిన దొంగలు చాలామంది ఉన్నారు. సుఖానికీ, డబ్బుకీ ఆ దుర్మార్గం ఉంది. 28వ ఏట కోట్లు విలువ చేసే వ్యాపారానికి వారుసుడైన శృంగార పురుషుడు - వ్యాపారానికి బలమైన దగ్గర తోవలు కనిపెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఇది చానళ్లలో చెప్పుకునే, ఒప్పుకునే విషయం కాదు. ‘అవినీతి’ని చట్టం పొలిమేరల్లో నిలపగలిగే తెలివైన వాటాదారులూ ఈ గూడుపుఠాణీలో భాగం కావడం ఆశ్చర్యం కాదు. చాలాయేళ్ల కిందట - తమిళనాడులో ఓ జాతీయ బ్యాంకు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ గారికి సినీమావారంటే మోజు ఉండేది. సినీమా సభల్లో తారల సరసన తరచూ కనిపించేవారు - పదిమందికీ తెలిసింది అంతమట్టుకే. అధికారాన్ని అతి ఉదారంగా దుర్వినియోగం చేసి - చీకటి ఒప్పందాలకు - సుఖం పెట్టుబడిగా దన్నుగా నిలిచి, వీధిన పడి జైలుకు వెళ్లారు. 1996 ప్రాంతాలలో అరెస్టయ్యారు. రెండు నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. సీబీఐ కోర్టు వారికి దరిమిలాను పదేళ్లు జైలు శిక్షని విధించింది. మనదేశంలో న్యాయ వ్యవస్థ ధర్మమా అంటూ తన 78వ ఏట వరకూ ఈ కోర్టు కేసులు సాగుతూనే ఉన్నాయి. ఆ రోజుల్లోనే కట్టడం ప్రారంభమైన పది అంతస్తుల భవనం ఇప్పటికీ అదే స్థితిలో, చెన్నై జెమిని సెంటర్లో దర్శనమిస్తుంది. అయితే ఇది కేవలం చిన్న చీమ కథ. మాల్యా గారిది జాతీయ స్థాయి గోమఠేశ్వరుడి కథ. మొదటి నుంచీ ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’గా రొమాంటిక్ జీవనాన్ని కెమేరాల ముందు ఆవిష్కరించే శృంగార వ్యాపారి - ఆ శృంగారాన్ని ‘ఎర’గా చేయగలిగితే వ్యాపారానికి ఎల్లలు చెరిగిపోతాయని ఎరిగి, చెరిపేసిన కథని కాస్త ఆలస్యంగా దేశం వింటోంది. ఆయా దశలలో పెద్దల చీకటి కథల్లో అసలు రహస్యం ఉంది. కాని అక్కడంతా చీకటి. కన్నుపొడుచుకున్నా వినిపించడమే కానీ ఏమీ కనిపించదు. నా మట్టుకు విజయ్ మాల్యా కీలెరిగిన మాంత్రికుడు. ఈ దేశానికి విస్కీ మత్తునీ, గుర్రాల పందాలనీ, కారు రేసుల్నీ , క్రికెట్ ఆటల జూదాన్నీ పంచిన తెలివైన వ్యాపారి - కీలక స్థానాలలో ఉన్న వ్యక్తుల బలహీనతలని - ఏ మనిషినయినా తల్లకిందులు చేయగల ‘ఆకర్షణ’ని పంచడాన్ని ప్రారంభిస్తే దేవుడు కూడా ఆ ఉచ్చు నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే దేవుడు సాక్షాత్తు మోహినీ అవతారంలో ఆ పని చేశాడు కనుక. అయితే ఆనాడు ఆకర్షితులని రాక్షసులన్నాం. ఇప్పుడు చట్టాన్ని అటకెక్కించిన ‘అధికార, బ్యాంకింగు యంత్రాంగం’ అనుకుంటే మర్యాదగా ఉంటుంది. - గొల్లపూడి మారుతీరావు -
లక్ష భిక్ష
జీవన కాలమ్ కన్యాశుల్కంలో గిరీశం బండీవాడికి నేషనల్ కాంగ్రెసు విషయమై రెండు ఘంటలు లెక్చెరిచ్చాక గిరీశం మాటల్లోనే, ‘‘ఆ గాడిదకొడుకు వాళ్ల ఊరు హెడ్కానిస్టేబుల్ని కాంగ్రెస్వారు ఎప్పుడు బదిలీ చేస్తారు’’ అని అడిగాడు. బడ్జెట్ విషయంలో నాకూ మా ఊరు బండీవాడికీ పెద్ద తేడా లేదు. బడ్జెట్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాక- పన్ను రాయితీకి తలసరి సంవత్సర ఆదాయ పరిమితిని పెంచారా లేదా అని చూసుకోవడం, జర్దా వేసే రోజుల్లో జర్దా మీద పన్ను పెంచారో లేదో చూడడమే అలవాటు. బడ్జెట్ మీద ఆర్థికవేత్తలు అద్భుతంగా చేసే విశ్లేషణని- వాళ్ల అవగాహనకీ, విజ్ఞతకీ మురిసిపోతూ వినడం తప్ప-నాకు ఏమీ బోధపడి చావదు- ఇప్పటికీ. కాపిటలైజేషన్ ఆఫ్ పీబీఎస్, వెల్ఫేర్ సెస్, ఫిస్కల్ డిసిప్లీన్ వంటి మాటలు వింటున్నప్పుడు ముచ్చటగా ఉంటాయి కాని చెవుల్ని దాటి మీదకి ప్రయాణం చెయ్యవు- నా మట్టుకు. కాగా, కొందరు ఆర్థికశాఖ మంత్రులు- నాలాంటివారికి కితకితలు పెట్టడానికి మధ్య మధ్య చిన్న చిన్న జోక్లు జతచేస్తారు. ఇందులో ప్రముఖులు ఆనాటి టి.టి. కృష్ణమాచారి, మొరార్జీ దేశాయ్ వంటివారు. అయితే వీరికి ప్రస్తుత మంత్రి అరుణ్ జైట్లీ ఏమాత్రం తీసిపోరని బల్లగుద్ది చెప్పగలను. అలాంటి సరదా అయిన జోక్ విశాఖపట్నం మెట్రో రైలుకి వారు కేటాయించిన మొత్తం. మెట్రో రైలుకి లక్ష రూపాయలు కేటాయించారు. టీవీ చానల్ పొరపాటు పడుతోందేమోనని పదిసార్లు చూశాను. సందేహం లేదు. అక్షరాలా లక్ష సమర్పించారు. వెంటనే ఒక సీనియర్ పాత్రికేయుడికి ఫోన్ చేశాను. ఆయనకీ, 1959 నుంచి పత్రికల్లో పని చేసిన నాకూ లోగడ ఏ కేంద్ర బడ్జెట్లోనూ, ఏ పద్దుకీ లక్ష రూపాయలు కేటాయించిన సందర్భం లేదు. ఇది కొత్త రికార్డు. విశాఖపట్నం ఈ మధ్య అంతర్జాతీయంగా పేరుని సంపాదించుకుంది. ఏభై దేశాల నావికా దళాలు పాల్గొనగా ఈ దేశపు రాష్ర్టపతి, ప్రధాని నాలుగు రోజులు నౌకా శాఖ విన్యాసాలని కన్నుల పండువగా దర్శించారు. ఈ మధ్య విడిపోయిన రాష్ట్రంలో ఇప్పటికీ ఒకే ఒక పెద్ద నగరం విశాఖ. ఇక్కడ మెట్రోకి కేవలం 13,488 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకి ప్రాథమిక ప్రణాళిక సిద్ధం చేయడానికి కనీసం 10 కోట్లు ఖర్చవుతుంది. అయితే ఇలా కాగితాల ఖర్చుకీ, ప్రారంభోత్సవ సమయంలో కొబ్బరికాయలు, కర్పూరం, పప్పుబెల్లాలకీ మన ఆర్థికమంత్రి ఒక లక్షని విదిలించారు. ‘‘అయ్యా! మా ఎరికలో ఈ ప్రాజెక్టు ఉంది సుమా!’’ అని చెప్పడానికి ఇది లాంఛనం- అని ఈ సీనియర్ పాత్రికేయులు చెప్పారు. ఇందుకు మనం కేంద్రానికి ఎంతయినా కృతజ్ఞతలు తెలపాలి. మరి మొన్ననే మాడు పగిలి, బొత్తిగా ఆర్థిక వనరులు లేక, ఉండడానికి రాజధాని కూడా లేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఘనత వహించిన ప్రధాని గారి చేత ఆ మధ్య అమరావతిలో భూమిపూజ చేయించింది కదా! మరి లాంఛనంగా దానిని ఎందుకు గుర్తుంచుకోలేదు? ఈ బడ్జెట్కి అనుబంధ బడ్జెట్ రావడం ఒక ఆనవాయితీ ఉంది. ఆర్థికమంత్రిగారు ఆ అనుబంధ బడ్జెట్లో అమరావతికి కనీసం 5 వేలు కేటాయించాలని నా వినతి. అలాగే ఓ గొప్ప అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో రాబోతోందని మన ఆర్థికమంత్రిగారికి గుర్తుండకపోదు. దానికి కనీసం ఓ 2 వేలు కేటాయించాలి. రాజాపులోవ ప్రాంతంలో ట్రిపుల్ ఐటీని ఏర్పరుస్తామని వాక్రుచ్చారు. దానికి ఎంత లేదన్నా ఓ 5 వందలు కేటాయిస్తే ఆంధ్రులకు కేంద్రం తమను మరిచిపోలేదని ధైర్యం కలుగుతుంది. తొంభైవేల కోట్లు, పందొమ్మిది వేల కోట్ల కేటాయింపుల మధ్య మనని మరిచిపోకుండా ఈ దేశానికే తలమానికమని మొన్ననే రాష్ట్రపతి, ప్రధాని అభివర్ణించిన విశాఖపట్నానికి లక్ష రూపాయలు కేటాయింపు దక్కడం అపూర్వం. ఒక ప్రభుత్వం మన ఏడుపు మనని ఏడవమని ఈ రాష్ట్రాన్ని రెండు చెక్కలు చేసి చేతులు కడుక్కుంది. మరో ప్రభుత్వం మిమ్మల్ని మరిచిపోలేదు బాబూ -అంటూ బుగ్గలు నిమిరి‘మురియిలు’ తినిపిస్తోంది. వెనుకటికి ఓ బందిపోటు దొంగ దారి కాసి అటు పోయేవాళ్లని బెదిరించేవాడట- హుంకరిస్తూ, ‘‘నేను లేస్తే మనిషిని కాను’’ అంటూ. యాత్రీకులు భయపడి ముడుపులు చెల్లించేవారట. తీరా అతన్ని ఒకాయన ఎదిరించి ‘‘ఏదీ లేచి నిలబడు చూద్దాం!’’ అన్నాడట. అప్పుడు తెలిసింది- ఆ దొంగకి కాళ్లు లేవని, నిలబడే అవకాశం లేదని. నిలబడకుండా నిలదీసే దొంగవీరుడు. తీరా గుట్టు విడిపోయాక- అంతా జారుడు. మన ఆర్థికమంత్రిగారు లక్ష ఇవ్వకుండా ‘‘విశాఖపట్నంలో మెట్రో, అమరావతి మా మనస్సులో ఉంది. ఏదో చేస్తాం’’ అంటే- ఏం చేస్తారోనన్న ఆశయినా మిగిలేది. ప్రస్తుతం ఇచ్చిన లక్ష భిక్ష- ఇకముందు ఏమీ ఇవ్వరన్న విషయాన్ని గుట్టు విప్పేసింది. మాడు పగలగొట్టింది. గొల్లపూడి మారుతీరావు -
వెనకయ్య సంతతి
జీవన కాలమ్ మనది ముందుకు పోతున్న దేశం. కాని మన దేశంలో దాదాపు అన్ని కులాల వారూ, వర్గాలవారూ వెనుకపడాలని ఉబలాటపడతారు. ఎవరు ముందుగా వెనుకపడతారో వారికి తాయిలాలు లభిస్తాయి. కొత్తగా వెనుకపడినవారిని అప్పుడే వెనుకబడినవారు వెనుకపడనివ్వరు. వాళ్లు మాలాగా వెనుకపడితే- వారు వెనుకపడడంలో ముందుంటారని -లోగడ వెనుకబడినవారి వాదం. దేశం ముందుకుపోతోంది. కులాల వెనుకపడాలని తోసుకువస్తున్నారు. హరియానాలో జాట్ సోదరులను నేను మనసారా అభినందిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడి, తాము వెనుకపడ్డామని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రభుత్వం వెనుకపడి- ఆ బాధలు పడలేక -ఎన్నోసార్లు తమ వెనుకబడినతనాన్ని రోడ్ల మీద నిరూపించారు. ప్రస్తుతం 34 వేల కోట్ల విధ్వంసం జరిగింది. 16 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఢిల్లీకి పాల సరఫరా నిలిచిపోయింది. నీటి సరఫరా దెబ్బతింది. ఆస్తులు తగలపడ్డాయి. అప్పుడుకాని ప్రభుత్వం కళ్లు తెరవలేదు. వెనుకబడినవారు ఇలా ముందుపడకపోతే తొక్క దళసరిగా ఉన్న పాలకవర్గం దిగిరాదని, వారిని దింపి నిరూపించిన ఘనత జాట్ సోదరులది. మొన్న కాపు సోదరులూ తాము వెనుకబడి ఉన్నామని చెప్పి చెప్పి విసిగి- ఆఖరికి కొన్ని రైల్వే బోగీలు, కొన్ని కార్లు, పోలీస్స్టేషన్లు తగలబడితే తప్ప పాలకవర్గం కళ్లు తెరవదని గుర్తించి - ఎట్టకేలకు తాము వెనుకబడి ఉన్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగారు. అయితే ఇదివరకే వెనుకబడిన వారు కాపు వర్గాల వారు వెనుకబడ రాదని అంటున్నారు. వారు వెనుక బడితే - ఇప్పటికే వెనుకబడిన తమ రాయితీలలో కోతలు వస్తాయని వారి భావన. పాలక వర్గానికి సమస్య అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం చేయాలో రెండు సందర్భాలు ప్రస్తుతం చూశాం. అడగనిదే అమ్మయినా పెట్టదని సామెత. ప్రభుత్వాన్ని అడిగే పద్ధతి ఏమిటో ఈ మధ్య కొత్తగా వెనుకబడినవారు నిరూపించారు. ఈ దేశంలో ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. మన నాయకులూ, ఆయా వర్గాల వారూ ఆ నాయకుడికి నివాళులర్పిస్తారు. అంబేడ్కర్ వైతాళికుడు. visionary. ఈ దేశంలో తరతరాలుగా, శతాబ్దాలుగా అభివృద్ధి అవకాశాలు లేక కుంగిపోయిన వర్గాలకు మేలు జరగాలంటూనే ఆ నాయకుడు ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. వెనుకబడిన వారికి చేయూతనిస్తూనే ఒక విడత గడిచాక - సామర్థ్యంలో, ఉద్ధతిలో- అందరితోపాటు పోటీపడే అవకాశాన్ని కల్పించమన్నారు. నిస్సహాయత పరిస్థితులది. వ్యక్తులది కాదు. కులానిది కాదు. సామర్థ్యంలో ఎవరూ ఎవరికీ తీసిపోని విధంగా ఈ సమాజ పురోగతికి చెయ్యి కలపాలన్నదే ఆయన ఆశయం. ఇంతకీ వీరంతా వెనుకబడడానికి అగ్రవర్గాలే కారణం. పేదరికంలో, బొత్తిగా అభివృద్ధికి అవకాశం లేదంటూ ఈ మధ్య ‘మేమూ వెనకబడ్డాం’ అని బ్రాహ్మణులు నోరిప్పారు! ప్రభుత్వం వారి సంక్షేమానికి ఐ.వై.ఆర్.కృష్ణారావుగారితో ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ఎంత చెట్టుకి అంతగాలి. రకరకాల అవినీతుల్లో కూరుకుపోయిన ప్రభుత్వాలు కళ్లు తెరవాలంటే - కాళ్ల బేరానికి రావాలంటే - ఈ దేశంలో బోలెడన్ని రైల్వే బోగీలు, కార్లు, పోలీస్స్టేషన్లు, పాల సరఫరా కేంద్రాలు, జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు, చచ్చిపోవడానికి మనుషులు - ఇన్ని ఉన్నాయని మరిచిపోకూడదు. దేశం ముందుకుపోతోందని ఈ ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. కాని వెనుకపడాలనుకుంటున్న వారు - ‘మేము వెనుకపడ్డాం బాబోయ్!’ అని ఎంత వెనుకపడినా పట్టించుకోవడంలేదు. ఇంతకు ముందు వెనుకపడినవారు కాళ్లకు అడ్డం పడుతున్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ప్రజలకి, పేపర్లు చదివేవారికి - జరిగిన విధ్వంసమే కనిపిస్తుంది కాని, వీరు ఎంత నిస్సహాయంగా వెనుకపడ్డారో కనిపించదు. కనుక- తప్పనిసరిగా కనిపించేలాగ చెయ్యాల్సిన రోజులొచ్చాయి. ఒకరి బాధలు మరొకరికి తెలియవు. తెలిసినా అర్థం చేసుకోరు. అప్పుడే వెనుకబడినవారికి వీరు వెనుకబడడం నచ్చలేదా? పీత కష్టాలు పీతవి. నాయకులకు తరతరాలుగా నష్టాలలో, కష్టాలలో ఇరుక్కున్న వెనుకబడినవారి ఇక్కట్లు అర్థంకావు. ఇందుకు రెండు రాష్ట్రాల్లో మార్గాలు చూపారు. ముఖ్యంగా జాట్ సోదరులకు నా అభినందనలు. ఇంతకీ విఘ్నేశ్వరుడికి ‘వెనకయ్య’ అనే పేరుంది. మనమంతా ఆయన సంతతి. గొల్లపూడి మారుతీరావు -
ఎన్నో చెవులు-కొన్నే పువ్వులు
చిత్తూరులో 1963లో ఆంధ్రప్రభ ఉద్యోగం నుంచి ఆకాశవాణి ఉద్యోగానికి హైదరాబాదు వెళ్తున్నప్పుడు ఈ దేశపు రెండో లోక్ సభ స్పీకరు అనంత శయనం అయ్యంగార్ అల్లుడు, నాకు అత్యంత ఆత్మీయులు కె.రామస్వామి అయ్యంగార్ ఒకే హితవు చెప్పారు. ‘‘మారుతీరావ్! ఎప్పుడూ నీ భార్యని నీ పక్కన ఉంచుకో. ఈ సమాజంలో ఏ కీడు జరిగినా నీకు గౌరవం, మర్యాద, స్థాయి పెరగాలంటే అది ముఖ్య సూత్రం’’ అని హితవు చెప్పారు. చిత్తూరులో ఉండగానే నాకు పెళ్లయింది. అప్పుడు చిత్తూరు కలెక్టరు బి.కె.రావుగారు. తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు సరిగ్గా అదే సలహాని ఆయనకి అనంతశయనం అయ్యంగార్ చెప్పారని రావుగారు చెప్పారు. జీవన ప్రయాణంలో భార్య, ధైర్యాన్నీ, హుందాతనాన్నీ, చేయూతనీ-ముఖ్యంగా పెద్దరికాన్నీ ఇస్తుంది. మన పురాణాల్లో మన్మదుడు శివుడిమీద పూలబాణం వేసినప్పడు కోపగించుకున్న శివుడు అతడిని భస్మం చేశాడు. నాకంత పరిజ్ఞానం లేదు కాని మల్లాది రామకృష్ణశాస్త్రి గారి భక్తుడినయిన నేను ఆయన రాసిన అపూర్వమైన యక్షగానంలో ‘ఈసుని దాసుగా సేతువా, అపసర అపచారము కాదా’ అన్న మాటల్ని మరిచిపోలేను. ఏతావాతా, ఆయన భార్య రతీదేవి ప్రార్థన మేరకు మన్మధుడు చావు తప్పి కన్నులొట్టపోయి బయట పడ్డాడు. కనుక ఏ విధంగా చూసినా భార్యల వల్ల భర్తలకు మేలు జరుగుతుందన్నది నిర్వివాదాంశం. అయితే ఇవన్నీ ఒక యెత్తు. పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు యాసిర్ షాకి-భార్య కారణంగా-జరిగిన మేలు అపూర్వం. అతను మత్తు పదార్థాలను తీసుకున్న అభియోగం మీద పడింది. ఆటనుంచి బర్తరఫ్ అయాడు. మంచి స్పిన్నర్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం చాలామందిని బాధపెట్టింది. కాని యాసిర్ షా బాధపడలేదు. కారణం-ఎక్కడ ఈ పొరపాటు జరిగిందో ఆయనకు కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ, ఆయనకి భార్య ఉపయోగపడింది. విచారణ జరిపినవారికి ఆయన నిజాన్ని వివరించాడు. ‘‘అయ్యా, నేను మత్తుగా కనిపించిన మాట నిజమే. కాని అందుకు కారణం నా భార్యకి రక్తపు పోటు ఉంది. ఆమె మాత్రలు వేసుకుంటుంది. నేను పొరపాటున ఆ మాత్రలు వేసేసుకున్నాను. కనుక నాకు లేని రక్తపు పోటు ఎక్కువయింది. మత్తులో ఊగిపోతున్న నన్ను చాలామంది అపార్థం చేసుకున్నారు’’ అని వక్కాణించాడు. ఇప్పుడు పాకిస్థాన్ ఐసీసీని ఒప్పించగలిగింది. దశాబ్దాలుగా తమ అబద్ధాలతో ప్రపంచాన్ని ఒప్పించబోతున్న పాకిస్థాన్కి ఈ చిన్న సాకుతో ఐసీసీ అధికారుల్ని ఒప్పించడం కష్టంకాదు. ఇలాంటి విషయాలు చెప్పడంలో పాకిస్థాన్వారు ఉదారులు. మిలటరీ స్థావరాలకు దగ్గరగా సంవత్సరాల తరబడి నివసించి పిల్లల్ని కంటున్న ఒసామా బిన్ లాడెన్ వారి దేశంలో లేడని బల్ల గుద్దారు. పాకిస్థాన్లో స్పష్టంగా మూడు అడ్రసులు ఉండి, వారి గొప్ప ఆటగాడు జావీద్ మియందాద్తో వియ్యం అందుకున్నా దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని మనసా వాచా వారు వక్కాణిస్తున్నారు. పది తప్పులు ఒక ఒప్పు అయినట్టుగా లేని రక్తపు పోటుకి రక్తపు పోటు ఉన్న భార్య మాత్రలు వేస్తే మత్తు పదార్థాలు సేవించినంత మత్తు వస్తుందని వారు నమ్మించగలిగారు. తత్ఫలితంగా యాసిర్ షా కేవలం మూడునెలలు మాత్రమే ఆటనుంచి బహిష్కృతుడయ్యాడు. ఈ శుభతరుణంలో నాకు మహమ్మద్ అజారుద్దీన్ జ్ఞాపకం వస్తున్నాడు. అంత గొప్ప ఆటగాడు-పాకిస్థాన్లో ఉండి ఉంటే, పొరపాటున ఆయన భార్య సంగీతా బిజిలానీ రక్తపు పోటు మాత్రలను ఆయన మింగి ఉంటే-తత్కారణంగా ఆయన మనస్సు కకావికలమయి-క్రికెట్లో జూదం ఆడాలనే చాపల్యం కలిగి ఉంటే-ఉదారులయిన పాకిస్థాన్ అధికారులు ఆయన్ని క్షమించి ఉంటే, మూడు నెలలే ఆయన్ని ఆటనుంచి బర్తరఫ్ చేసివుంటే-ఒక గొప్ప ఆటని జీవితమంతా చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు కలిసివచ్చేది. ప్రస్తుత తరానికి నా హితవు ఒకటుంది. రామస్వామి అయ్యంగార్, అనంత శయనం అయ్యంగార్ల హితవు మరిచిపోకండి. ఎన్నడూ భార్యల ప్రాధాన్యాన్ని శంకించకండి. ముఖ్యంగా వారికి రక్తపు పోటు ఉంటే అది మీ అదృష్టంగా భావించండి. వీలయినంత వరకు భార్యల అనారోగ్యానికి సంబంధించిన మందులను మీ పక్కనే ఉంచుకోండి. మీరు పదివేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడినా, ప్రజల ఆస్తుల్ని అన్యాయంగా దోచుకున్నా, వ్యాపారంలో తప్పుడు లెక్కల్ని సూచించినా- మీ మీ భార్యల రక్తపు పోటు మాత్రలు మీకు శ్రీరామరక్ష కాగలవని గుర్తుంచుకోండి. ఉన్న ఒకే చిక్కల్లా-పాకిస్థాన్లోలాగా భారతదేశంలో చెవిలో పువ్వులున్నవారెవరూలేరు. కారణం ఉన్న పువ్వులన్నీ పాకిస్థాన్ పెద్దల చెవులకే చాలడం లేదు. - గొల్లపూడి మారుతీరావు -
శ్రీరామ అంటేనే నేరం!
జీవన కాలమ్ శతాబ్దాల విశ్వాసాలను, నేటి హేతువాద స్ఫూర్తిగల మేధావులు ప్రశ్నించడం ప్రారంభిస్తే- ఈ జాతికి గొప్ప భవిష్యత్తు ఉన్నదని నాకు గర్వపడాలని ఉంది... అవకాశం దొరికితే సింగు గారి పాదాలకు నమస్కరించి తరించాలని నా కోరిక. అతి విచిత్రమైన, అతి సహేతుకమైన కేసు ఈ మధ్య బిహారులో సీతామర్హీ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేటు వారి కోర్టులో నమోదయింది. ఠాకూర్ చందన్ కుమార్ సింగ్ అనే లాయరుగారు ఈ కేసుని నమోదు చేశారు. మెజోర్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న దూమ్రికాలా వాసి ఈ సింగు గారు. కేసు శ్రీరామచంద్రుని మీద. అవును, రామా యణంలో హీరో భారతీయుల ఆరాధ్యదైవం శ్రీరాముడి మీదే. అయోధ్యలో ఒక రజకుడు సీత శీలాన్ని శంకించాడన్న వార్త విని భార్య శీలాన్ని శంకించి మహా పతివ్రత అయి, భర్త అడుగుజాడలలో నడిచిన ఉత్తమ ఇల్లాలిని క్రూరుడైన రాముడు. ఒంటరిగా బతకమని అడవులకు పంపడం నేరమని శిక్షాస్మృతి 367/34, మరికొన్ని సెక్షన్ల కింద సీతకి న్యాయం జరగాలని ఈ కేసు. కష్టాల్లో సుఖాల్లో సీత భర్తకి అండగా నిలిచింది. భక్తితో సపర్యలు చేసింది. అలాంటి స్త్రీని ఒంటరిగా బతకమని అడవులకు ఎలా పంపాడు? - ఇదీ సింగు గారి దరఖాస్తు సారాంశం. దీనికి ప్రతికూలంగా వాదించాల్సిన గవర్నమెంటు న్యాయవాదికి ఒక విషయం అర్థం కాలేదు. సరేనయ్యా, రాముడు శిక్షార్హుడే. చేసిన పని తప్పే. కాని ఎప్పుడో పురాతన కాలంలో జరిగిన కేసు రుజువయినా ఇప్పుడు ఎవరిని శిక్షిస్తావయ్యా అని. న్యాయమూర్తిగారికి మరొక విష యం అర్థం కాలేదు. ‘‘ఈ చర్యకి సాక్షులు ఎవరయ్యా?’’ అని. రాముడు సీతని ఏ తేదీనాడు అడవులకు పంపాడు? - ఇవీ జడ్జిగారికి అంతు పట్టని సందేహాలు. ఈ కేసులో మరో ముద్దాయి పేరుని జతచేశారు. ఈ నేరస్థుడికి సహాయకుడిగా నిలబడి(abettor) శ్రీరాముడి క్రూరత్వాన్ని అమలు జరిపిన సోదరుడు లక్ష్మణుడు. ఈ కేసులో సాక్షులుగా ఇలాంటి దిక్కుమాలిన కథలు రాసిన వాల్మీకినీ, వ్యాసుడినీ, రామకథను గానం చేసిన లవకుశులనీ, దీక్షితార్నీ, శ్యామాశాస్త్రినీ, రామదా నునీ, అన్నమాచార్యనీ, తులసీదాసునీ, నారాయణ తీర్థులనీ సాక్షులుగా పిలిపించాలని నా సూచన. ఏమయినా సింగు గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. ఏతావాతా ఈ కేసులో ఆయన విజయాన్ని సాధించగలిగితే ఇంకా బోలెడన్న కేసులున్నాయని మనవి. హరిశ్చంద్రునికి దిక్కుమాలిన వాగ్దానాలు చేసి నడివీధిలో పెళ్లాన్నీ, కొడుకునీ అమ్మే హక్కు ఎవరిచ్చారు? పరశురాముడు కొన్ని వేల మంది క్షత్రియులను చంపితే, ఇలాంటి సీరియల్ కిల్లర్ని అవతార పురుషుడని ఏ మొహం పెట్టుకుని అంటున్నాం? అలనాడు కేవలం మూడు అడుగులు అడిగిన కుర్రాడు-వామనుడు-మూడు లోకాలను ఆక్రమించుకోవడం breach of trust కాదా? ద్రౌపది అయిదుగురు భర్తలతో కాపురం చేయడం బహుభర్తృత్వ నేరం కాదా? శ్రీకృష్ణుడు పదహారు వేలమంది గోపికలతో శృంగారాన్ని నడపడం బహు భార్యత్వం అనిపించుకోదా? ప్రేమించబోయిన ఒక అమ్మాయి (శూర్పణఖ)ని దుర్మార్గంగా ముక్కూ చెవులూ కోయడం ‘నిర్భయ’ కేసు కంటే దారుణమయిన నేరం కాదా? శ్రీకృష్ణుడు చిన్నతనం నుంచీ అడ్డమయిన వాళ్లనీ చంపుతూంటే ఆయన మీద జువెనైల్ కేసులు ఎందుకు పెట్టలేదు? ఈ నేరాల్లో నందవ్రజంలో ప్రజలు, ఆనాటి న్యాయస్థానం, నందుడు, యశోధలకు వాటా ఉన్నదాలేదా? శివుడుగారు నెత్తిమీద ఒక పెళ్లాన్ని, పక్కనో పెళ్లాన్ని పెట్టుకోవడం bigamy కాదా? తన కొడుకు ప్రహ్లాదుడికి సరైన చదువు చెప్పించుకోలేక వాళ్ల నాన్న హిరణ్యకశిపుడు అల్లల్లాడుతుంటే మధ్యలో దూరి ఆయన్ని చంపడం culpable homicide కాదా? సింగు గారివంటి జిజ్ఞాసువులకు తవ్విన కొద్దీ రామాయణ విషవృక్షాలే కాదు, భారత విషవృక్షాలు బయటపడతాయి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఆయనతో నేనూ ఏకీభవిస్తున్నాను. ఈ దేశంలో రాముడి ఆలయం లేని పల్లె లేదు. రాముడి పేరు పెట్టుకోని కుటుంబం లేదు. ఆఖరికి నాస్తికత్వాన్ని ప్రతిపాదించిన రామస్వామి నాయకర్, గోపరాజు రామచంద్రరావుగారి పేర్లలో కూడా రాముడున్నాడు. వారందరికీ కోర్టు నోటీసులు పంపాలి. ఈ సంస్కృతిలో దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, జాతిలో వెరసి-సంస్కృతి(civilization)లో 32 దేశాలలో నిలదొక్కుకున్న రామాయణం ఎన్ని కోట్లమంది మనస్సులను కలుషితం చేసిందో చెప్పనలవి కాదు. ఏమయినా శతాబ్దాల విశ్వాసాలను, నేటి హేతువాద స్ఫూర్తిగల మేధావులు ప్రశ్నించడం ప్రారంభిస్తే- ఈ జాతికి గొప్ప భవిష్యత్తు ఉన్నదని నాకు గర్వపడాలని ఉంది. సింగుగారు నాకు అందనంత దూరంలో ఉండిపోయారుకాని, అవకాశం దొరికితే వారి పాదాలకు నమస్కారం చేసి తరించాలని నా కోరిక. -గొల్లపూడి మారుతీరావు -
రిక్షాలో దర్జాగా తిరిగేవాళ్లం..
జ్ఞాపకం గొల్లపూడి మారుతీరావు.. పరిచయం అక్కరలేని ప్రముఖ రచయిత, గొప్ప నటుడు. కాలమిస్టు. భాగ్యనగరంతో ఆయనది 64 ఏళ్ల బంధం. ఇక్కడ జరిగిన ప్రతి మార్పును దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఆ జ్ఞాపకాల దొంతరలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో ‘విసిరేసినట్లు జనం..! విపరీత చలి.. సాయంత్రమైతే నక్కల అరుపులు.. దాదాపు 40 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ ఓ పల్లె వాతావరణాన్ని తలపించేది. ఇప్పుడు మహానగరంగా మారిపోయింది. 1952లో నాకు 12 ఏళ్ల వయసులో తొలిసారి హైదరాబాద్ వచ్చాను. పంజగుట్టలో నా బాల్య స్నేహితుల ఇళ్లు ఉండేది. అక్కడకు వచ్చేవాడిని. అప్పుడు బిక్కు బిక్కు మనేలాంటి పరిస్థితి. అక్కడక్కడ విసిరేసినట్టుగా జనం కన్పించేవారు. మడతలో కూర్చొని ప్రయాణించే రిక్షాలు రవాణా సాధనాలు. అప్పుడు లక్డీకాపూల్ చిన్న సెంటర్లా ఉండేది. తర్వాత ఖైరతాబాద్ ఉన్నట్టు లేనట్టు కన్పించేది. ఖైరతాబాద్కు ఎడమవైపు పెద్ద పెద్ద గుట్టలు దర్శనమిచ్చేవి. పంజగుట్ట ఎత్తు భాగంలోని ప్రస్తుత శ్రీనగర్ కాలనీ రోడ్డులో మా మిత్రుని ఇల్లు చివరగా ఉండేది. ఆ తర్వాత ఎటు చూసినా ఖాళీ ప్రదేశమే. అమీర్పేట, మైత్రీవనం, భరత్ నగర్ ఇవేమీ అప్పటికి లేవు. అక్కడక్కడ చిన్నచిన్న పల్లెలు మాత్రమే ఉండేవి. సాయంత్రం 4 దాటిందంటే నక్కల అరుపులు విపరీతంగా వినిపించేవి. కొత్తవాళ్లు జడుసుకునే వారు. ఇప్పటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు లేవు. ఆ ప్రాంతమంతా కొండలే. పక్షుల కిలకిల రావాలు వినసొంపుగా వినిపించేవి. పిచ్చుకలు, గువ్వల సవ్వడులు ప్రతిధ్వనించేవి. 40 ఏళ్ల తర్వాత.. సుమారు 40 ఏళ్ల క్రితం మద్రాసు నుంచి అక్కినేని నాగేశ్వరరావు వచ్చి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. అప్పటికి బంజారాహిల్స్కు కొంత రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం విపరీతమైన చలి ఉండేది. పంజగుట్ట నుంచి ఇప్పటి బంజారాహిల్స్, అమీర్పేట, హుస్సేన్సాగర్ వైపు చూస్తే పచ్చని పొలాలతో చూడచక్కని నిర్మానుష్య ప్రాంతం. కార్లు ఎక్కడా కనిపించేవి కావు. దూరప్రాంతాలకు రిక్షాలే దిక్కు. వాటిలో దర్జాగా కాలుమీద కాలు వేసుకొని కూర్చొని ప్రయాణించే అమరిక ఉండేది. రిక్షాలు చాలా పొడవుగా ఉండేవి. పబ్లిక్గార్డెన్ ఒక ఆకు పచ్చని మహావనం. ఇప్పటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలను తలపించే వాతావరణం హైదరాబాద్ సొంతం. చల్లటి, సుందర, ప్రశాంత నగరం మన హైదరాబాద్. ఎంత మధురంగా ఉండేదో వర్ణించలేను. ఆ వాతావరణాన్ని మళ్లీమళ్లీ ఆస్వాదిద్దామా! అన్నట్టు మనసు పులకించేది. ఆ చల్లటి వాతావరణం గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా మనసు పులకిస్తుంది. ఇప్పుడు ఆ పచ్చదనం పోయి జనం మహావృక్షంలా పెరిగిపోయారు. నగరం మెట్రో స్థాయికి చేరింది’. -
సంస్కారం వారసత్వం
జీవన కాలమ్ ముత్తయ్య చెప్పిన మరొకమాట. గేల్ పెంకితనానికి పెద్దలూ, సీనియర్లూ సరిదిద్దకపోవడం మరొక కారణమని. అస్తు. కానీ మనకి ‘పెద్దరికం’ ఎక్కడ చచ్చింది? కాల్మనీ రాకెట్లు నడుపుతున్న పెద్దవారా? ప్రపంచ ప్రఖ్యాత శ్రీలంక క్రికెట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ని ఒక పాత్రికేయుడు అడిగాడు, ‘‘ఆటలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పెంకిగా ప్రవర్తించడం మీద మీ అభి ప్రాయమేమిటి?’’ అని. సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడం కారణం’ అన్నది మురళీధరన్ సమాధానం. ఈయన ఈతరం ఆటగాడు. బొత్తిగా కిందటి శతాబ్దపు దిక్కుమాలిన కారణం చెప్పాడేమిటి! మరో కారణం- తన కంటే సీనియర్స్ (పెద్దలు) అతన్ని సరిదిద్దకపోవడం. ఇదీ ఆశ్చర్యకరమైన సమాధానమే. నేను విజయవాడలో ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఓసారి నీలంరాజు వేంకటశేషయ్య గారింట్లో విందుకి వెళ్లాను. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు, కాటూరి, రావూరి వెంకటసత్యనారాయణరావు గారూ- ఇలాంటి పెద్దలు ఉన్నారు. మాలాంటి కుర్రాళ్లం ఉన్నాం. మమ్మల్నందరినీ పేరు పేరునా పలకరించారు పింగళి. ‘పేరు?’ మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ‘ఎవర బ్బాయి తమరు!’ ‘ఫలానా పురాణం వెంకయ్యగారి కొడుకుని’ ‘అంటే రామయ్య మీకేమవుతారయ్యా?’ ‘తాతగారండి!’ వెంటనే ఆయన కళ్లలో మెరుపు. ‘నువ్వు మా రామయ్య మనవడివిరా!’ ఆనందం. అందరినీ ఇలా పేరుపేరునా పలకరించి, ‘ఏమండీ!’ అని ప్రారంభించి, ‘ఏమోయ్!’ దాకా ప్రయాణించి, ‘నువ్వుట్రా!’ అని ఆత్మీయంగా గుండెలకు హత్తుకునే దాకా ప్రశ్నలు సాగేవి. నేను చదువుకున్న చదువు, సాధించిన విజయాలూ కాదు, తెచ్చుకున్న వారసత్వం నా బ్యాంకు ఎకౌంట్. మరి నా ప్రతిభ? నా పరపతి? - నా ముందు తరానికి. ఆ కాలంలో కొత్త మనిషిని చూస్తే అడిగే మొదటి ప్రశ్న, ‘ఎవరబ్బాయివి బాబూ!’ అని. నా పరపతి నా తల్లిదండ్రులు నాకిచ్చిన వైభవం. దాదాపు 66 ఏళ్ల కిందట- మా పెత్తండ్రి కొడుకు- నాకు అన్నయ్య- పెళ్లి సంబంధం చూడడానికి మా అమ్మ, పిన్నితో వెళ్లాను. నాకప్పుడు పదేళ్లు. పెళ్లి కూతురుని కూర్చోపెట్టారు. పక్కనే ఎవరో అమ్మలక్కలు, తల్లి వగైరాలున్నారు. మా అమ్మ, పిన్ని పెళ్లికూతురుని చూశారు. తర్వాత ప్రశ్న, ‘తల్లి ఎవరు?’ ఆవిడ చిరునవ్వు నవ్వింది. ‘మీకెంత మంది పిల్లలు?’ పురుళ్లు ఎక్కడ పోసుకున్నారు? ఆరోగ్యం బాగుందా? చక్కెర, రక్తపోటు ఏమైనా ఉన్నాయా? మీ నాన్నగారేం చేసేవారు? - ఇవీ ప్రశ్నలు. ఇదేమిటి? ఎదురుగా పెళ్లి కూతురు కూర్చుంటే ముసలా విడతో పలకరింతలేమిటి? అని నాకు విచికిత్స. కాని పలకరించాల్సింది ఆవిడనే అని పాతికేళ్ల తర్వాత తెలిసివచ్చింది. వయసు గడిచి, పిల్లలు పుట్టాక- ఈ అమ్మాయి అక్షరాలా తల్లి రూపునీ, ఆరోగ్యాన్నీ, స్వభా వాన్నీ పుణికి పుచ్చుకుంటుంది. ఆవిడకి రక్తపోటు ఉందా? కీళ్ల నొప్పులు ఉన్నాయా? పురుళ్లు అయ్యాక ఒళ్లు వచ్చిందా? అక్షరాలా యథాతథంగా పిల్లకీ ఉంటుంది. అది జెనిటిక్ వారసత్వం. ఇది ఒక పార్శ్వం. వాళ్ల నాన్నగారు, ఆమె పుట్టింటినుంచి తెచ్చిన వారస త్వం. సామాజిక వారసత్వం. ఇవి ఎదురుగా కూర్చున్న పిల్లకి భవిష్యత్తులో పెట్టుబడులు. ఇది శాస్త్రీయమైన పరిణామం. హిరణ్యకశిపుడుకి ప్రహ్లాదుడు పుట్టడం, లీలావతి గర్భంతో ఉన్నప్పుడు చేసుకున్న పుణ్యం. అది మినహాయింపు. తర్వాత పెళ్లి జరిగింది. ఇద్దరూ 54 ఏళ్లు కాపురం చేశారు. మా అన్నయ్య వెళ్లిపోయాడు. ఇప్పటికీ 85 ఏళ్ల వదినెగారు పిల్లలతో, మనుమలతో, మునిమ నుమలతో నిక్షేపంగా ఉంది. పార్కుల్లో ప్రేమించి, ప్రేమ తమ హక్కని భావించి, ఆఫీసులలో కలసి పనిచేయడానికి ప్రేమని గుర్తు పెట్టుకున్న నేటి తరం యువత చాలా సందర్భా లలో పప్పులో కాలేయడం- సంవత్సరం తిరగకుండానే విడిపోవడం మనం చూస్తున్నాం. పెళ్లిలో ఇది ఒక పార్శ్వం. అమ్మాయి అందం, స్వభావం, దృక్పథం - ఇవన్నీ ఇద్దరూ ఒకటైతే మార్చుకోవచ్చు. కానీ సంప్రదా యం - అనుభవంతో రంగరించిన, తరతరాలు అందిం చిన వారసత్వానికి ప్రత్యామ్నాయం లేదు. దగ్గరతోవ లేదు. అదే క్రిస్ గేల్కీ, ముత్తయ్య మురళీధరన్కీ తేడా. ఆ విలువలే ఇవాళ ఏ కాస్తో వివాహ వ్యవస్థకి గొడుగు పడుతున్నాయి. ముత్తయ్య చెప్పిన మరొకమాట. గేల్ పెంకితనానికి పెద్దలూ, సీనియర్లూ సరిదిద్దకపోవడం మరొక కారణమని. అస్తు. కానీ మనకి ‘పెద్దరికం’ ఎక్కడ చచ్చింది? కాల్మనీ రాకెట్లు నడుపుతున్న పెద్దవారా? ఆస్తుల్ని దోచుకుంటున్న నాయకులా? మతాన్నీ, కులాన్నీ పణంగా పెట్టి రాజకీయ పబ్బాన్ని గడుపుకొంటున్న అవకాశవాదులా? ఇవాళ యువతరంలోని ‘అవ్యవస్థ’కి పెద్ద లోపం- భ్రష్టుపట్టిన పెద్దల వారసత్వం. ఇంతకీ ముత్తయ్య మురళీధరన్ చేసిన అపకారం నా కాలమ్కి పెట్టుబడి. - గొల్లపూడి మారుతీరావు -
అందరూ అందరే!
జీవన కాలమ్ నేను విశాఖపట్నం ఏవీయన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో- లైబ్రరీలో ఒక మంచి పుస్తకం కనిపించింది. దాని చివరి అట్ట మీద ఓ కుర్రాడు రెండు వాక్యాలు రాశాడు. ‘పుస్తకం మంచిది. అందరూ చదివి తీరాలి’ అని. దాని కింద మరో కుర్రాడు రాశాడు, ‘ఇది మంచి పుస్తకం కావచ్చు, కానీ ఇలా దిక్కుమాలిన కామెంట్స్ రాసి పుస్తకాన్ని పాడుచెయ్యొద్దు’ అని. మూడో కుర్రాడు ఇంకా తెలివైనవాడు. చాలా క్లుప్తంగా రెండే మాటలు రాశాడు, ‘అతనికి చెప్పి నువ్వు చేసిందేమిటి ఫూల్!’ అని. నాలుగో కుర్రాడు మరింత తెలివైనవాడు, అతి క్లుప్తంగా రెండే మాటలు రాశాడు, ‘ముగ్గురూ ఫూల్స్’ అని. మన ప్రజాస్వామ్యం అధ్వానంగా తయారైందనీ, నాయకులు పైన చెప్పిన నలుగురు కుర్రాళ్లకి భిన్నంగా లేరనీ చెప్పడానికి పార్లమెంటును చూసినా, మరే శాసనసభను చూసినా అర్థమవుతుంది. తమ ప్రతినిధులుగా ప్రజలు నాయకుల్ని ఎన్నుకోవడంలో ఉద్దేశం- ‘సుపరిపాలన’. ప్రతిపక్షంలో ఉన్న సభ్యుని కర్తవ్యం కూడా సుపరిపాలనే. పాలకవర్గం తప్పటడుగుల్ని ఎత్తి చూపుతూనే వ్యవస్థ పురోగతికి తప్పనిసరిగా, బేషరతుగా, బాధ్యతగా, విధిగా అడుగులు వెయ్యాల్సిందే. శాసనసభ ఆయా నాయకుల అవినీతి మీద తీర్పునిచ్చే వేదిక కాదు. తమ తమ అక్కసుల్ని వెళ్లగక్కే రణరంగం కాదు. పాలక వర్గాలను నిలదీయడం వారి బాధ్యతలో ఒక భాగం మాత్రమే. ‘పాలన’ ముఖ్య బాధ్యత- పాలక వర్గానికైనా, ప్రతిపక్షానికైనా. తప్పు పట్టేవాడికి ఎప్పుడూ ఎదుటి వ్యక్తిలో తప్పు దొరుకుతుంది. చెడగొట్టేవాడికి ఎప్పుడూ కారణం దొరుకుతుంది. పాలకవర్గం నాయకులు ప్రతిపక్షానికి శత్రువులు కారు. కానక్కరలేదు. వారు అవినీతిపరులైతే - తీర్పునిచ్చేది- ప్రతిపక్షం కాదు. కాదు కాదు. ఓటరు. లోక్సభలో ఒక విడత (సీజన్)లో సభ నడవడానికి 260 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కరోజుకి ఒక్కో సభ్యునికి రెండున్నర లక్షలు ఖర్చవుతుంది. ఎవడి బాబు సొమ్ము? వారి కక్షల కోసం (వారూ ఒకప్పుడు అవినీతికి గొడుగు పట్టినవారేనని గుర్తుంచుకుంటే) ప్రజల సొమ్మును దుబారా చేసే హక్కు ఎవరిచ్చారు? ఈ నిర్వాకానికి పార్లమెంటు సభ్యులు తమకు తామే తమ ఆదాయాన్ని పదిరెట్లు పెంచుకున్నారు. కేవలం లాండ్రీ ఖర్చులకి 50 వేలు. సంవత్సరంలో ఉచితంగా 34 సార్లు విమానాల్లో తిరగవచ్చు. 75 వేల రూపాయలతో ఫర్నిచర్ కొనుక్కోవచ్చు. ఇంకా అనూహ్యమైన రాయితీలు, అలవెన్సులు ఉన్నాయి. ఈ పార్టీల పట్ల, వీళ్ల నిర్వాకం పట్ల ప్రజల అసహ్యానికీ, విముఖతకీ పెద్ద, గొప్ప అనూహ్యమైన రుజువు- నిన్నగాక మొన్న అన్ని పార్టీల్ని ముఖం మీద గుద్ది 70 సీట్లలో 67 సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయం. ఏ చరిత్రా లేని పార్టీని దశాబ్దాలుగా పదవులు వెలగబెడుతున్న ఆయా పార్టీలను కాదని ఓటరు ఎన్నుకున్నాడు. మరొక గొప్ప ఉదాహరణ. నాయకుని దక్షతని ఏ కాస్తో పరిణతినిచ్చే చదువు పెంచుతుందని భావించడంలో తప్పులేదు. ఈ మధ్య గొప్ప పోరులో చరిత్రని సృష్టించిన బిహార్ మంత్రివర్గం విద్యార్హతల్ని ఒక నమూనాగా చూద్దాం. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. మిగతా 28 మంది మంత్రుల చరిత్ర... ఉపముఖ్యమంత్రి- 9వ తరగతి ఫెయిల్. రవాణా, నీటి పారుదల మంత్రి-12 ఫెయిల్. ఆరోగ్యమంత్రి -12వ తరగతి ఫెయిల్. విద్యుచ్ఛక్తిమంత్రి -10 ఫెయిల్. మంచినీటి సరఫరా మంత్రి- 8వ తరగతి, సాంఘిక సంక్షేమ మంత్రి -12వ తరగతి, భూవసతి మంత్రి- 7వ తరగతి, ఎరువుల మంత్రి-10వ తరగతి; విద్య, ఐటీ శాఖ మంత్రి-10 వ తరగతి, కార్మిక మంత్రి -5వ తరగతి, పంచాయతీరాజ్ మంత్రి-3వ తరగతి, ఎస్సీఎస్టీ వ్యవహారాల మంత్రి-12వ తరగతి, పథకాల నిర్వహణ మంత్రి-8వ తరగతి, మైనారిటీ సంక్షేమ మంత్రి-10వ తరగతి, పట్టణాభివృద్ధి మంత్రి-12వ తరగతి, పరిశ్రమలు, శాస్త్రసాంకేతిక రంగ మంత్రి 10 వ తరగతి, టూరిజం మంత్రి-12వ తరగతి, పశు సంవర్థక శాఖ మంత్రి-5వ తరగతి, చెరుకు పరిశ్రమ మంత్రి 5వ తరగతి, గ్రామీణాభివృద్ధి మంత్రి- 2వ తరగతి, సహకారశాఖ మంత్రి-3వ తరగతి, కళలు, సాంస్కృతికశాఖ మంత్రి-బొత్తిగా చదువులేదు. ప్రజాస్వామ్యంలో చట్టసభల వికాసానికి ఈ మంత్రివర్గాన్ని తలమానికంగా తీసుకుని గర్వపడవచ్చు. అలనాడు చట్టసభల కార్యక్రమాల్ని టీవీల్లో ప్రసారం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని కొందరు దురభిప్రాయపడ్డారు. కానీ టీవీల ముందు తమ వీరంగాన్ని దేశం చూస్తోందన్న ఆలోచనతో నాయకులు నటులవుతున్నారు. వీరులవుతున్నారు. గొంతు చించుకుంటున్నారు. హాహాకారాలు చేస్తున్నారు. టీవీలలో ఈ ప్రసారాలు ఆపుచేయడం ద్వారా ప్రజలకు కనీసం నిర్వేదం, రక్తపోటును తగ్గించవచ్చునని నా ఉద్దేశం. ఇప్పుడున్న పార్లమెంట్ ఇంత అధ్వానస్థితిలో ఉండగా, కొత్త పార్లమెంట్ భవనాన్ని ఇండియా గేట్ ప్రాంతంలో నిర్మించి రెండింటినీ సొరంగ మార్గం ద్వారా కలపాలని సూచన. ఇది తుగ్లక్ వ్యవహారమని ఓ చానల్ వెక్కిరించింది. (వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు) -
ఒక మిత్రుడు - ఒక మీమాంస
జీవన కాలమ్ రాత్రి 8 గంటలకి ఫోన్ మోగింది, ఏదో చానల్ నుంచి. అవతలి గొంతు అడిగింది, ‘‘హీరో రంగనాథ్ గారి గురించి మీ స్పందన కావాలి’’ అని. నాకర్థంకాలేదు. ‘‘ఎందుకు?’’ అన్నాను. ‘‘సాయంకాలం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.’’ షాక్ నుంచి తేరుకునేలోగా చానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నాను. అనౌన్సర్ చెబుతున్నది, ‘‘ఇప్పుడు గొల్లపూడి ....’’ నిశ్చేష్టుడనయ్యాను. ఏ విధంగా చూసినా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, హుందాగా, తృప్తిగా, గొప్పగా, గర్వంగా కనిపించే రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడంలో అర్థం లేదు. చానల్ ప్రసారంలోనే నిర్ఘాంతుడినై, నిర్విణ్ణుడినై ఆయన జ్ఞాపకాలు మెల్లమెల్లగా పోగు చేసుకున్నాను. ఎంత నిండైన మనిషి! వ్యక్తిగా, పాత్రగా, మిత్రుడిగా- గొప్ప నమ్మకాన్నీ, పూర్తి జీవలక్షణాన్నీ ప్రతిబింబించే మనిషి. అయిదు నెలల కిందట ఈటీవీ 20 ఏళ్ల పండుగలో ఇద్దరం కనీసం రెండున్నర గంటలు పక్క పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. నన్నెప్పుడూ ‘గురువుగారూ’ అని సంబోధించేవారు. ‘ఆ మధ్య బాగా లావెక్కారు’ అంటే, ‘ఇరవై పౌన్లు తగ్గాను గురువుగారూ!’ అన్నారు తృప్తిగా. గొంతులో, మాటలో, చెప్పిన విషయాల్లో ఎక్కడా నిస్త్రాణ, నిర్వేదం కనిపించలేదు. నిజానికి ఇవన్నీ ఉండగల జీవితం అతనిది. 46వ ఏట 40 ఏళ్ల జీవిత భాగస్వామినికి వెన్నుపూస విరిగితే, 14 ఏళ్లు తాను వెన్నుపూసగా నిలిచి, మూత్రపురీషాలు తీసి సేవ చేసిన మహావ్యక్తి. ‘భర్త’ పాత్రకి జీవితకాలంలో నిండైన సమాధానం రంగనాథ్. ఎప్పుడు కలసినా ఆ విషయం కదపకుండా జాగ్రత్త పడేవాడిని. కారణం- ఒక దుఃఖ భాండాన్ని ఒలకపోస్తానో, ఒక వ్యక్తి గాంభీర్యాన్ని చెదరగొడతానో అని భయం. ఆరేళ్ల కిందట ఆవిడ వెళ్లిపోతే- హఠాత్తుగా అతని జీవితం ఖాళీ అయిపోయింది. జీవితంలో ఒంటరి. 66 ఏళ్ల జీవితంలో 60 పాత్రల హీరో, 340 పాత్రల ప్రజాభిమానం ఒక పక్క ఉండగా, 14 ఏళ్లుగా ధరించిన భార్యకి ‘తల్లి’అయిన పాత్రను మించింది ఆయన జీవితంలో మరొకటిలేదు. ప్రపంచంలో అన్ని రుగ్మతల్లోనూ భయంకరమై నది - ఒంటరితనం. ఒక ఇంట్లో - కేవలం ఒంటరిగా - తనని హీరోని చేసిన తరం మాయ మయిపోగా - కేరెక్టర్ పాత్రలు అక్కరలేని ఈనాటి తరం సినీ ధోరణిలో- వృత్తిలోనూ ఒంటరి అయిపోయాడు రంగనాథ్. అది ఇంకా భయంకరమైన ఒంటరితనం. దాన్ని దగ్గరకు రానివ్వకూడదు. 62 సంవత్సరాల కిందట ఒక తమిళ మిత్రుడు నాతో అనేవాడు. ‘‘మారుతీ రావ్! ఈ జీవితంలో మానవుడు ఒంటరి. అదొక్కటే మనం అలవాటు పడాల్సిన రోగం’’ అని. గొప్ప కవితలు రాసి, లక్షలాది ప్రేక్షకులకు సంపూర్ణమైన పాత్రల గుబాళింపుని పంచిన రంగనాథ్ ‘ఒంటరితనానికి’ లొంగిపోయాడు. అంతకన్న కారణం కనిపించదు. ‘ఆలయ శిఖరం’లో రంగనాథ్ నా పెద్దకొడుకు. ‘మెరుపుదాడి’లో నేనూ, రంగనాథ్, సుమన్, జయమాలిని, గిరిబాబు సినీమా అంతా గుర్రాల మీదే గడిపాం. ఆ ముఠాకి పెద్ద దిక్కు పాత్ర. నేను రచన చేసిన ‘అమెరికా అమ్మాయి’లో అచ్చమైన పాత్ర చేశాడు. నటుడిగా పాత్రకు నిండుతనాన్నీ, ఒక డిగ్నిటీనీ, పరిపూర్ణతనీ ఇచ్చే నటుడు రంగనాథ్. గుండె నిండా గాలిని పూరించి మనస్ఫూర్తిగా మాట్లాడే గొంతు. అంతకు మించి రంగనాథ్ మంచి కవి. బండరాయి-దేవుని విగ్రహంగా, చాకిబండగా మారే కవిత ఎంతబాగా రాశాడో! అంతబాగానూ చదివేవాడు. ఇన్నిటికీ మించి సినీ రంగానికి రాకముందు నా నాటికలని ప్రదర్శించిన నటుడు. నేను నటుడినయ్యాక ఇద్దరం కలసి నటించిన మొదటి చిత్రం ‘ఆలయ శిఖరం’. 1983, డిసెంబర్ 31 అర్థరాత్రి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రోడ్ల మీద నా పెద్ద కొడుకు రంగనాథ్నీ, అతని భార్యనీ (సినీపాత్ర) సైకిల్ రిక్షా మీద నేను లాగుతుండగా కొత్త సంవత్సరం తోసుకువచ్చింది. నా సినీ జీవితంలో నేను చేసిన గొప్ప సీనుల్లో తేలికగా అదొకటి. కృతఘు్నడైన కొడుకుకి తన తండ్రి రిక్షా లాగుతున్నాడని తెలుసు. ప్రేక్షకులకీ తెలుసు. డబ్బున్న పెళ్లానికి తెలీదు. గొప్ప సీన్ తీశాడు కోడి రామకృష్ణ. సీన్ అయిపోగానే రిక్షా దిగి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు రంగనాథ్. అనర్థాలు చాలాసార్లు జరుగుతాయి. కానీ భరించలేని దుఃఖాన్ని ఆపోశన పట్టడం ఎరిగిన కవి, భరించలేని విషాదాన్ని అవలీలగా నటించడం ఎరిగిన నటుడు- అన్నిటినీ దాటి- ఒంటరితనానికి లొంగిపోవడం- దాన్ని డెస్టినీ (విధి) అని గోడ మీద రాసి, గుర్తు పెట్టి వెళ్లిపోవడం- జీవితంలో గొప్ప విపర్యం. రంగనాథ్ మృతి- అన్నిటినీ త్యజించిన మహాపురుషుడు అడుసు తొక్కడం లాంటిది. నన్ను తెలుగు భాష అప్పుడప్పుడు మోసం చేస్తుంది. అప్పుడు ఇంగ్లిష్ని ఆశ్రయిస్తాను. His death is an enigma. -
యాత్ర ముగింపు
జీవన కాలమ్ గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు కుటుంబ సభ్యులు వైద్యుడిని పిలిపించారట. అప్పారావు గారు వైద్యుడిని చూసి ‘‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట. వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు. మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య ఈ విషయాన్ని చెప్పారు. ప్రముఖ రచయిత కుష్వంత్సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్సింగ్ తల్లిని అడిగారట- ఏం కావాలని. ఓ పెగ్గు స్కాచ్ కావాలన్నారట ఆమె. ఒంగోలులో మా మిత్రుడి తండ్రిని చివరి రోజుల్లో నేను చూశాను. చాలా నెలల తర్వాత మా మిత్రుడు ఫోన్ చేశాడు - నాన్న వెళ్లిపోయాడని. చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి - ఓ గ్లాసుతో బ్రాందీ కావాలన్నారట. తాగి, ఒక సిగరెట్టు కాల్చి హాయిగా కన్నుమూశాడు. మృత్యువుని మజిలీగా గుర్తు పట్టడం గొప్ప సంస్కారం. మృత్యువుని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా గొప్ప సంస్కారం. దుఃఖం ఒక దృక్పథం. నిర్వేదం ఒక బలహీనత. భారతీయ సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచీ ఒక ఆలోచనకు మనల్ని తరిఫీదు చేస్తుంది - ఏదో ఒకనాడు వెళ్లిపోక తప్పదని. కొందరు ఆ క్షణాన్ని గంభీరంగా ఆహ్వానిస్తారు. కొందరు బెంబేలు పడతారు. కొందరు బేల అవుతారు. ప్రఖ్యాత అమెరికన్ టెన్నిస్ ఆటగాడు ఆర్దర్ ఆష్కి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. 1983లో గుండెకి శస్త్రచికిత్స జరిగినప్పుడు శరీరంలోకి ఎక్కించిన రక్తం ద్వారా ఈ వ్యాధి సంక్రమించింది. చావు తప్పదని అర్థమవుతోంది. అభిమానులు దుఃఖంతో గుండె పట్టుకున్నారు. ఎందరో ఉత్తరాలు రాశారు. ఒక అభిమాని అన్నాడు: ‘‘ఇంత దారుణమైన రోగానికి దేవుడు మిమ్మల్నే ఎందుకు గురిచేయాలి?’’ అని. దీనికి ఆర్దర్ ఆష్ ఇలా సమాధానం రాశాడు: ఈ ప్రపంచంలో 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడుతున్నారు. 50 లక్షల మందికి టెన్నిస్ వంటబట్టింది. 5 లక్షల మంది ప్రొఫెషనల్గా టెన్నిస్ని ఆడగలుగుతున్నారు. 50 వేల మంది టెన్నిస్ పోటీ టోర్నమెంట్లలో ఆడుతున్నారు. 50 మంది మాత్రమే వింబుల్డన్ స్థాయికి వచ్చారు. నలుగురే సెమీ ఫైనల్స్కి వచ్చారు. ఇద్దరే ఫైనల్స్కి వచ్చారు. నేను చాంపియన్షిప్ని సాధించి, వింబుల్డన్ కప్పుని గెలిచి, చేత్తో పట్టుకున్నప్పుడు - నేను దేవుడిని అడగలేదు ‘ఎందుకయ్యా నన్నొక్కడినీ ఎంపిక చేశావు?’ అని. ఇప్పుడు కష్టంలో ఉండి ‘నాకే ఎందుకు ఈ అనర్థాన్ని ఇచ్చావు? అని దేవుడిని అడిగే హక్కు నాకేముంది?’’ ఆకెళ్ల అచ్యుతరామమ్ గారు రైల్వేలో పెద్ద ఆఫీసరుగా చేశారు. రామాయణాన్ని ‘రగడ’ వృత్తంలో రాశారు. ఆదిశంకరుల రచనల్ని, త్యాగరాజ భక్తి తత్వాన్ని రచనల ద్వారా నిరూపించారు. 1984 ఫిబ్రవరి 12 ఉదయం సికింద్రాబాద్లో వారి అమ్మాయి కొత్త ఇంటికి శంకుస్థాపన. శుభకార్యానికి తెల్లవారుఝామున ఒక బాచ్ని దింపి ఇంటికి వస్తున్నారు. దారిలో గుండెపోటు వచ్చింది. సికింద్రాబాద్ తాడ్బండ్ దగ్గర ఉన్న పురాతన ఆంజనేయస్వామి గుడి ముందు కారుని పక్కకి ఆపి, పార్కింగు దీపాలు వెలిగించి, కారు తాళం చెవులు జేబులో వేసుకుని. స్టీరింగు మీద తల ఆనించి వెళ్లిపోయారు. రామభక్తుడికి మృత్యువు ఆంజనేయుడి సమక్షంలో ఒక యాత్ర. ఒక విచిత్రమైన సంఘటన. మా వియ్యపురాలి తండ్రిగారు దాదాపు 69 ఏళ్ల కిందట - విజయవాడలో పీడబ్ల్యూడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. విజయవాడ రేడియో స్టేషన్ పాత బంగళాలో ఉండేవారు. చల్లా వెంకటరత్నంగారు వారి తండ్రిగారు. రామభక్తుడు. శ్రీరామనవమి నవరాత్రులలో ఆయన పూజలు చేసి, ప్రవచనాలు చెప్పించేవారు. ఆ సంవత్సరం మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు (అప్పట్లో వారు ఇరవయ్యవ పడిలో ఉండి ఉంటారు) రామాయణం చెప్తున్నారు. ఉదయం కల్యాణం జరిగింది. సాయంకాలం ప్రవచనం. జటాయువు నిర్యాణం గురించి చెప్తున్నారు శాస్త్రిగారు. వెంకటరత్నం గారు స్తంభానికి చేరబడి కూర్చుని వింటున్నారు. జటాయువు ‘రామా! రామా!’’ అంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు - అన్నారు శాస్త్రిగారు. ‘‘జటా యువు వెళ్లిపోయాడా?’’ అన్నారు వెంకటరత్నంగారు. అవునన్నారు శాస్త్రిగారు. అంతే. స్తంభానికి ఆనుకున్న వెంకటరత్నంగారి తల వాలిపోయింది. వెళ్లిపోయారు. దాదాపు 21 ఏళ్ల కిందట మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో మహాభారత ప్రవచనం చెప్తూ ఈ ఉదంతాన్ని చెప్పారు. వెంకటరత్నం గారికి మృత్యువు ఒక ముహూర్తం. చాలా మందికి మృత్యువు ఒక మజిలీ. కొందరికి ఆటవిడుపు. మహాయోగులకి నిర్యాణం. కొందరికి ఐహికమైన ‘మోజు’లకు విడాకులు ఇచ్చే ఆఖరి క్షణం. కొందరు అదృష్టవంతులకు మరో గమ్యానికి దాటే వంతెన. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
స్వయంకృతం
జీవన కాలమ్ బాధ్యతారాహిత్యంగా తనని దోచుకునే మానవాళిని ప్రకృతి ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవల దోపిడీ ఎక్కువయింది కనుక, హెచ్చరికలు తరుచుగా వినవస్తున్నాయి. మనకి ధర్మం అంటే బూతు మాట. మన నైమిత్తిక జీవ నంలో ఒకరు చెప్ప కుండానే మనం పాటిం చాల్సిన విధి ధర్మం. మతం అంటే మరో పెద్ద బూతు. మానవుని జీవన సరళి సజావుగా సాగడానికి మానవుడే ఏర్పరచుకున్న ప్రణాళిక మతం. మనకు 33 కోట్ల మంది దేవతలు. ఎలుక, కుక్క, పాము, భూమి, చెట్టు, నీరు, వర్షం- అన్నీ మనకు దేవతలే. నేటి ఇంగ్లిష్ చదువులు చదువుకుంటున్న మీ అబ్బాయే ఈ మాట చెప్తే మిమ్మల్ని వెక్కిరిస్తాడు- మా నాన్న తరం మరీ ఇంత ఆటవిక సంస్కృతిలో జీవించారని. మనకి ఉపకారం చేసే ప్రతి ప్రాణినీ, శక్తినీ దేవతగా భావించడం ఆనాటి తరాల సంస్కారమని ఆ కుర్రాడికి ఎవరూ నేర్పలేదు. ఇవాళ తమిళనాడులో గత శతాబ్దంలో ఎన్నడూ కురవనంత వర్షం కురిసింది. మరి శతాబ్దం కిందట ఇంత అనర్థం ఎందుకు జరగలేదు? 125 సంవత్సరాల కిందట ఉత్తరాంధ్రలో హుద్హుద్ వంటి తుపాను వచ్చిందన్నారు చదువుకున్న పెద్దలు. అప్పుడు ఇంత అనర్థం ఎందుకు జరగలేదు? ఇప్పుడు వేల మంది చెన్నైలోనే చచ్చిపోయారు. మృతదేహాలను ఇంట్లో పెట్టుకుని, వాటికి సంస్కారం ఎలా చెయ్యాలో తెలీక గిజగిజలాడారు. కొన్ని వేల ఇళ్లు మునిగిపోయాయి. నదులు పొంగి వీధుల్లోకి, ఇళ్లల్లోకి దూకాయి. సమాచార సాధనాలు దెబ్బతిన్నాయి. ఆ మధ్య హైదరాబాద్లో, ఇటీవల ముంబైలో, మొన్ననే కేదార్నాథ్లో జరిగిన అనర్థాల గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు టీవీలలో, చదువుకున్న చాలా గొప్పగొప్ప వారు- పర్యావర ణాన్ని గురించీ, మరి కొందరు నగరంలో అక్రమకట్టడాల గురించీ చాలా ఆవేశంగా ప్రసంగించారు. ఇవి కాలిన చేతులకి చాలనన్ని ఆకులు. ఆ రోజుల్లోనే- కేదార్ విలయం జరిగినప్పుడు ఒక చానల్ శివుడు మూడో కన్ను తెరిచాడని చాలా హృదయ విదారకమైన పాటను వేసి ఆ దృశ్యాల్ని రక్తి కట్టించింది. శివుడు మూడో కన్ను, ముప్పయ్యవ కన్ను తెరిచేంత మూర్ఖుడు కాదు- ఆయన దేవుడని కొందరయినా నమ్మితే. శివుడు లాలూప్రసాద్ యాదవ్ కాదు. సోనియాగాంధీ కాదు. ములాయంసింగ్ కాదు. సంవత్సరాల తరబడి- తెలివైన స్వార్థపరులు- చెయ్యకూడని పనులు చేస్తూ, అక్రమంగా కట్టడాలను కట్టి డబ్బు చేసుకుంటూంటే- ధర్మానికీ, బాధ్యతకీ అర్థం తెలీని- నేలబారు ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వ్యాపారులూ గడ్డికరుస్తూ ఉంటే- మానవాళిని కాపాడటానికి నీటి గమనానికి ఉద్దేశించిన ఆ స్థలాలలో భవనాలు లేస్తే- నూరేళ్ల తర్వాత మునిగిపోయాయని ఏడిస్తే ఏం లాభం? అడిగే నాథుడూ, సంజాయిషీ చెప్పే నాయకుడూ ఎక్కడ? ఎవరి హయాంలో ఎవరు గడ్డి తిన్నారు? మీనంబాక్కం విమానాశ్రయం, చెంబురు బాక్కం నదీ పరీవాహక ప్రాంతమట. ఇది నూరు సంవత్సరాలు మనకి తెలియని విషయం. చెన్నైలో కురిసిన 100 సెంటిమీటర్ల కనీవినీ ఎరుగని వర్షపు నీటిని అలవోకగా సముద్రానికి చేర్చగలిగిన కొన్ని వేల (కనీసం 2 వేలు!) నీటి మార్గాలలో ప్రస్తుతం భవనాలున్నాయని పెద్దలు నిన్న టీవీల్లో చెప్పారు. ఈ తిలాపాపం ఎవరిది? ప్రకృతికి నోరులేదు. చెప్పదు. చేసి చూపుతుంది. హెచ్చరించదు. తిరగబడుతుంది. తలవొంచు కోదు. తలవొంచుతుంది - అది ప్రాథమిక శక్తి కనుక.18 సంవత్సరాల కిందట- నేను చెన్నైలో కొనాలనుకున్న స్థలంలో ఒక నుయ్యి ఉండేది. అది మూసివేస్తే కాని కుదరని పరిస్థితి. పెద్దలు నా చేత శాంతి చేయించి, నష్టపోతున్న నీటి వనరుకి ప్రత్యామ్నాయాన్ని నిర్దేశింపజేసి- అప్పుడు మూయనిచ్చారు. ఒక చిన్న నుయ్యి అవసరాన్ని గుర్తుపట్టి హెచ్చరించిన సంస్కృతి మనది. దీనికి మరో పేరుంది - ధర్మం. ఈ సృష్టిలో భూమి మీద తిరిగే వానపాముకీ, పిచ్చుకకీ, పక్షికీ, సీతాకోకచిలకకీ, చెట్టుకీ, పుట్టకీ ఒక ప్రయోజనం ఉంది. మానవుడు నిస్వార్థంగా వాటిని కాపాడుతూ సహజీవనం చేశాడు. ఈ ప్రకృతిని దేవతలాగ భావించి, గౌరవించి, పూజించాడు. ఆ కారణానికే మానవుల శ్రేయస్సుని శతాబ్దాలుగా కాపాడింది ప్రకృతి. దీనికి మరో పేరుంది- మతం. బాధ్యతారాహిత్యంగా తనని దోచుకునే మాన వాళిని ప్రకృతి ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా హెచ్చరిస్తూనే ఉంది. ఇటీవల దోపిడీ ఎక్కువయింది కనుక, హెచ్చ రికలు తరుచుగా వినవస్తున్నాయి. ప్రకృతిది మౌనశక్తి. మహా ప్రళయం. దానికి శివుడూ, కాకరకాయా అని పేరు పెట్టి ‘మెలోడ్రామా’ని చానళ్లు అమ్ముకుంటే- అది మరో ఆత్మవంచన అవుతుంది. సృష్టి ప్రాథమిక శక్తి. ఏ వంచనకూ లొంగదు. నిన్నటి చెన్నై అందుకు పెద్ద ఉదాహరణ. - గొల్లపూడి మారుతిరావు -
కాలం
జీవన కాలమ్ ఇప్పుడిప్పుడు 90 నుంచి 100 సంవత్సరాలు బతుకు తున్నవారిని చూస్తున్నాం. మొన్న మా మిత్రుడు అంటు న్నాడు- ఈ తరంలో పుట్టిన పిల్లలు తేలికగా 110 సంవత్స రాలు జీవిస్తారని. విత్తనాల కల్తీ, కులాంతర, దేశాంతర వివాహాల కారణంగా జీవక ణాల ఆరోగ్యం-ఏదైనా కావచ్చు. జానీ ట్రువాంట్ అనే రచయిత తన పుస్తకానికి ఒక బూతు శీర్షికని ఉంచాడు. ఆయన చెప్పాడూ- ఈ విశ్వాంతరాళంలో-భూమి వయసు కొన్ని కోట్ల సంవత్స రాలు అనుకుంటే- మానవుని జీవన పరిమాణం ఒక నానో సెకను. అంటే ఒక సెకనులో నూరుకోట్ల వం తుట! ఈ వ్యవధిలోనే మన మతాలు, పదవులు, సుఖా లు, భవిష్యత్తు- ఆ పరిధిలో ఆలోచిస్తే ఇవన్నీ హాస్యా స్పదంగా కనిపిస్తాయి. అయితే సృష్టిలో అత్యంత సుని శితమైన ఆలోచనా సరళి గల ప్రాణి- మానవుడయితే, అత్యంత క్రమశిక్షణ, అనూహ్యమైన సామాజిక స్పృహ, సామాజిక జీవనాన్ని గడిపే ప్రాణి- చీమ. చీమ నుంచి ఇప్పటికీ-ఈ మాట పొరపాటు- ఎప్పటికీ నేర్చుకోవల సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అయితే చీమ ఆయుః ప్రమాణమెంత? ఎంత సులువుగా, ఎంత ప్రయత్న రహితంగా చచ్చిపోతుంది? కొన్ని వేల చీమలు, కొన్ని గంటలు, రోజుల పాటు సామూహికంగా కృషి చేసి ఒక పాముని చంపెయ్య గలవు. మనం? రెండు కులాలు, రెండు రాష్ట్రాలు, రెండు వర్గాలు, రెండు మనుషులు కలసి జీవించలేం. కలిస్తే మానభంగమయినా, పక్క వాడి బతుకుని నాశనం చేయడమయినా జరుగుతుంది. మన దృక్పథంలోనే ఏదో లోపం చచ్చింది. కాలం గురించి మాట్లాడుతున్నాను కనుక- దాదా పు 45 సంవత్సరాల కిందట చూసిన ఒక సినీమా ఇప్ప టికీ నా మనసులో గిరికీలు కొడుతూనే ఉంటుంది. హైద రాబాద్లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చిక్కడపల్లిలో ఉన్న ఏదో థియేటర్లో చూశాను. నా పక్కన అన్నపూర్ణా సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూ దనరావుగారున్నారు. ఇప్పటికీ ఆ సినీమా పేరు, దేశం పేరూ, వివ రాలూ గుర్తు పెట్టుకోలేకపోయినం దుకు ఎంతగానో కుంగిపోతుం టాను. దురదృష్టం. రెండవ ప్రపంచయుద్ధం, తత్కారణంగా జర్మన్ నియంత హిట్లర్ చేసిన దారుణ మారణకాం డని గురించిన కథలు, నవలలు, చిత్రాలు కోకొల్లలు. సెల్యూలాయిడ్ మీద ఎన్నో మహాకావ్యాలు అవత రించాయి. ఒక మనిషిని హింసిం చడానికి మార్గాలేవీ? శారీరకమైన హింస, తన ఆత్మీయులను తన ముందే హింసించడం, ప్రాణం తీయడం, జైల్లో మగ్గే టట్టు చూడడం, ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. కానీ ఈ చిత్రం పైన ఉటంకించిన వేటి జోలికీ పోలేదు. మరేమిటి మానవుడిని హింసించేది? ఏది మానవుని జీవన సర ళిని, చైతన్యాన్ని పూర్తిగా అణగదొక్కి-అతని చేతనని స్తబ్దం చేయగలుగుతుంది? ఏది భయంకరమైన హింస? మనిషిలో ‘కాల’గమన చైతన్యాన్ని ఆపగలిగితే అది భయం కరమైన హింస-అంటాడు కథకుడు. అద్భుతం. బహుశా కారాగారాల్లో బంధించి, చీకటికోణాల్లో నేర గాళ్లని మగ్గేటట్టు చేసి, బయట ప్రపంచంలో ఏం జరు గుతుందో తెలియకుండా వారి‘కాల’ం స్పృహని ఘనీ భవింపచేయడమే శిక్షగా మనం నిర్దేశిస్తున్నాం. ఇదీ చిత్రం. ఇరవై ముప్పయ్ మందిని జైల్లో పెట్టారు. అందరూ కలసే ఉన్నారు. బయట కాలం స్పృహ వారికి చేరకుండా చేశారు. కానీ జైల్లో ఖైదీలు కాలాన్ని తమకు తామే పునరుద్ధరించుకున్నారు. కాలం స్పృహ జారిపోకుండా నిలుపుకున్నారు. ఎలా? నిరంత రాయంగా ఇద్దరు సెకన్లు లెక్కపెడుతు న్నారు. ‘‘ఒకటి- రెండు, ఒకటి-రెండు, ఒకటి - రెండు(వన్, టూ; వన్, టూ; వన్, టూ) ఇలాగ. మరొకరు నిమిషాలని లెక్కవే స్తున్నారు. అందరూ కలసి- సామూహికంగా ఉద యాన్ని గుర్తుపట్టారు. సాయంకాలాన్ని గుర్తు పట్టారు. రాత్రిని గుర్తుపట్టారు. రోజులు తెలుస్తున్నాయి. కాలం గడుస్తోంది. నిలిచిపోలేదు. వారి మనస్సుల్లో ‘కాల చైతన్యం' నశించలేదు. వారి జీవితాలు చలనవంతంగా ఉన్నాయి. ఇప్పుడు శత్రువు- వాళ్ల లెక్కని- అంటే కాలాన్ని గుర్తించడానికి వారు చేసే ప్రయత్నాన్ని చెడగొట్టాలని ప్రయ త్నించాడు. కాలచైతన్యం- వారి ఆక లినీ, ఒంటరితనాన్నీ, స్తబ్దతనీ జయించింది. శత్రువు- వాళ్లని ఒకా నొక ప్లేన్లో శిక్షించాలనుకున్నాడు. ఖైదీ తెలివిగా ఆ ప్లేన్ని అధిగమించి ‘‘కాలం’’ కాన్సెప్ట్ని నష్టపోకుండా పట్టుకున్నాడు. కేవలం శారీరకమైన, లౌకికమైన స్థాయిని దాటి మరొక ప్లేన్లో హింసని నిలిపిన చిత్రం. రోటీన్ మారణహోమాన్ని గురించిన ఇన్ని చిత్రాల మధ్య ఇది నాకు తల మానికంగా తోస్తుంది. మానవ జీవన సరళికి- కాలం పెద్ద ఊతం. ఒక సెకనులో 10 కోట్ల వంతు జీవిత ప్రమాణం ఉన్న మాన వుడు- అయిదేళ్ల పదవిని, పాతికేళ్ల కీర్తిని, 50 ఏళ్ల ఆనం దాన్ని మరొక కోణంలో చూడగలిగితే- దృక్పథం ఎంత సాంద్రమో, ఎంత ఉదారమూ, ఎంత గంభీరమూ అవుతుందో! చీమల్లో ఐన్స్టీన్, రమణ మహర్షి ఉండి ఉండరు. కానీ అదే తన జీవన పరమార్థం, అదే ఆఖరిక్షణం అన్నట్టు చీమ శ్రద్ధగా, సామూహికంగా, కమిటెడ్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది తీసే పరుగు సైన్యం మీద ఒక్క నీటి చుక్క పడితే చెల్లాచెదురై, మళ్లీ అంతలో తన ఐకమత్యాన్ని ప్రోది చేసుకుంటుంది. ఆలోచనని అనితర సాధ్యంగా సాధించిన మాన వుడు- ఈ ఒక్క గుణాన్ని గుర్తు పట్టగలిగితే ఈ ప్రపం చం ఎంత హృద్యంగా ఉంటుంది? ఒక హిరోషిమా, ఒక బాబ్రీ మసీదు, ఒక బొంబాయి మారణహోమం- ఎంత అర్థరహితంగా కనిపిస్తాయి? వరస తప్పక నడిచే చీమల దండులో ఒక చీమ మరొక చీమను చంపడం ఏనాడ యినా చూశామా? కాలం స్పృహ సంస్కారాన్ని పెంచుతుంది. మానవ స్వభావానికి ఉదాత్తతని మప్పుతుంది. అన్ని టికీ మించి జీవితానికి ఒక విలువనీ, పరమార్థాన్నీ సం తరిస్తుంది. అది హాస్యాస్పదమైనంత బుద్బుదప్రాయం కనుక. - గొల్లపూడి మారుతీరావు -
మేధావులక్కోపం వచ్చింది
జీవన కాలమ్ ఇది చాలా సబబు. సమాజ చింతనలో జల్లెడ పట్టిన చాలా ఆలోచనలకు ఆయా కళల ద్వారా మన్నికయిన చట్రాన్ని ఏర్పరచగ లిగిన వ్యక్తులు వీరు. ముఖ్యంగా ఆనాటి ప్రభుత్వం గుర్తింపు, బహుమతులూ పొందినవారు. కనుక వీరి ఆలోచనలలాగే, వీరి ఆవేశాలనూ సమాజం గుర్తించవ లసిన అవసరం ఉంది. న్యాయమే.అయితే సమాజంలో గుర్తింపు పొందిన మేధావులు 5 శాతం అనుకొంటే, ప్రభుత్వం గుర్తింపు పొందని వారూ ఇంకా ఎక్కువ మంది ఉండి ఉంటారు. బహుమతులో, గుర్తింపో రానంత మాత్రాన వారి కృషినీ, సమాజ గతి పట్ల వారి స్పందనల్నీ తక్కువ చెయ్యలేం. కాగా, బహుమతులు పుచ్చుకున్న వారు- పురుషులందు పుణ్య పురుషులు. గత 15 నెలలుగా పదవిలో ఉన్న కొత్త ప్రభుత్వం ధోరణీ, మతానికి సంబంధించిన - వారి దూకుడూ నచ్చని ఈ మేధావులు చరిత్రలో మొదటిసారి నోరు విప్పారు. కనీ వినీ ఎరగని రీతిలో తమ తమ పురస్కా రాలను వాపసు ఇస్తూ - ప్రస్తుత పాలక వ్యవస్థ ధోరణి మీద తమ అసహనాన్ని ప్రకటించారు. ఇది మంచి పరిణామం. మన పెద్దలు- మనం చెప్పినా వినిపిం చని, వినిపించలేని మన ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించడం- మనకు ధైర్యాన్నిస్తుంది. అయితే ఇది అందరి అభిప్రాయ మా? అదే అయితే మరి ఈ పాలక వ్యవస్థ పదవిలోకి రావడమే మెజారిటీ మద్దతుతో కదా? అప్పుడు ఈ మేధావుల ఆలోచన మైనారిటీ కదా? వ్యవస్థ మీద ఎక్కువ మంది నమ్మకాన్ని ప్రక టించారు. అందులో ఈ మేధావులు లేక పోవచ్చు. సబబే. మరికొన్ని సంవత్సరాలుగా గుర్తిం పుని ఆహ్వానిస్తూ, బహుమతులు గ్రహిస్తున్న వీరు లోగడ జరిగిన- ఇంతకంటే భయంకరమైన దురాగతాలకు ఎం దుకు స్పందించలేదు? కనీసం- ఇంతగా ఎందుకు స్పందిం చలేదు? కనీసం ఇలా ఎందుకు స్పందించలేదు? ఒకరిద్దరు సమాధానాలు చెప్పారు. 'అప్పుడూ మేం స్పందించాం బాబూ. మీరు వినిపించుకోలేదు' - అన్నారు కొందరు. 'అప్పట్లో మాధ్యమాల ముమ్మరం ఇంతగా లేదు కనుక, అప్పటి వారి నిరసనలు ఎక్కువగా వినిపించలేదు'- అన్నారు మహేష్ భట్ సోదరుడు ముఖేష్ భట్. 'మా అసహనాన్ని ఎలా, ఎప్పుడు ప్రకటించాలో మా ఇష్టం. మాకా స్వేచ్ఛ ఉంది' అన్నారొక మేధావి.అయితే ఇంతకంటే భయంకరమైన పరిస్థితులలో నీర సంగా స్పందించి, అసలు నోరిప్పకుండా, ఇప్పుడు వీధిన పడటంవల్ల ఒకటి అర్థమౌతోందని ఒక చానల్ వాపోయిం ది. 'ఆ ఘటన మీద కాక ఆ వ్యవస్థ మీదే నమ్మకం లేదని'- అంది. 'అవును. మోదీకి మేం వ్యతిరేకం' అని ఒకరిద్దరు మేధావులు బల్లగుద్దేశారు. సజావయిన కారణాలకి లోగడ స్పందించని, స్పందిం చినా మనకు తెలిసేటట్టు స్పందించని, మాధ్యమాల ఫోకస్ లేనంతగా స్పందించిన, మోదీ అంటే స్పష్టంగా ఇష్టం లేని, తమ ఇష్టం వచ్చినట్టు స్పందించిన మేధావుల స్పందన ఆ కారణాలకే బలహీనం అవుతోంది. మరొక కళాకారుడు, రచయిత, దర్శకుడు కమల్ హాసన్ మరొక మాట అన్నారు: బహుమతులు పుచ్చుకున్న వారు తమ తమ నిరసనలనో అసహనాన్నో ప్రకటించడం సబబే. కాని ఒక గుర్తింపు - వారి కృషిని ప్రశంసిస్తూ - ప్రజాభిప్రాయాన్ని సమర్థిస్తూ ఇచ్చిన కితాబుని నిరసించ డం తప్పు. అది ప్రజాభిమానాన్ని అవమానించినట్టు. నా ప్రజల మీద నాకు కోపం వస్తే - నా జీవితంలో సినీమాల ద్వారా సంపాదించుకున్నదంతా వాపసు ఇస్తున్నానా?' 'మేమెప్పుడూ మా అసహనాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం. ప్రతీ ప్రభుత్వం అసహనంతోనే ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ముస్లింలీగ్ లాగే కాంగ్రెసూ అసహనాన్ని ప్రకటించింది. నా 'విశ్వరూపం'ను ఎవరు వ్యతిరేకించారు? 'హేరామ్'ని ఎవరు విమర్శించారు?' ఈ దేశంలో మేధావులు రాజకీయ నాయకుల్లాగ వీధిన పడటం కాకుండా ఒక అపూర్వమైన 'నియతి'తో సమాజాన్ని ముందుకు తీసుకుపోయే సూచనలు చేయాలే కానీ ‘‘చేతులు కడుక్కోకూడదు’’ అని ఒక పాఠకుడు ఒక పత్రి కలో ఉత్తరం రాశాడు. ఇలాంటి మాటని కమల్ హాసన్ కూడా అన్నాడు. మరొక సినీనటుడు అనుపమ్ ఖేర్ ఈ అవార్డు- వాప్సీ వ్యతిరేక రాయబా రాన్ని రాష్ట్రపతి భవన్కు నిర్వహిం చారు. ఆయన అన్నారు: 'సాహిత్య అకాడమీ అవార్డులు, జాతీయ ఫిలిం అవార్డులు, పద్మ పురస్కారాలను వాపసు ఇవ్వడం - భారతదేశం పరప తిని భ్రష్టుపట్టించడానికి ఉద్దేశిం చినవి' దేశంలోని ఒక వర్గం మేధావులు పాలక వ్యవస్థ మీద వారి కక్ష తీర్చుకు నేందుకు కత్తి కట్టారని 36 మంది మేధా వులు సర్కారుకి మద్దతు తెలుపుతూ ఒక ప్రకటన చేశారు. ఇందులో సరదా అయిన పిట్టకథ ఒకటుంది. చండీగఢ్లో ‘‘నాన్సెన్స్ క్లబ్’’ కళాకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయ్యా, మేం కళాకారులం. 30 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. మాకు తక్షణమే ప్రభుత్వం ఏవో కొన్ని అవార్డులు ఇవ్వాలి. అప్పుడు మాకూ అవార్డులు తిప్పి ఇచ్చే అవకాశం ఉంటుంది. అందరూ అన్నీ తిరిగి ఇస్తున్నారు. మాకూ ఇవ్వాలని ఉంది. కాని మా దగ్గర ఏమీలేవు’’ ఇదీ వీరి డిమాండ్! చండీగఢ్ 17వ సెక్టార్లో వీరు ధర్నా చేశారు. ఈ రాద్ధాంతం అంతటిలో చాలా సుఖంగా ఉన్న వాడిని నేనేననుకుంటాను. ఎందుకంటే - నేనే అవార్డునీ వాపసు ఇవ్వనక్కరలేదు. నాకేమీ రాలేదు కనుక. ఒక స్పందన వెనుక- ఆ వ్యవస్థ మీద ప్రాథమికమ యిన నిరాదరణో, నిరసనో, ఏహ్యతో ఉన్నప్పుడు - ఆ అభిప్రాయం పలచబడుతుంది. అతనంటే నాకు ఇష్టం లేదు. అతను చేసే ఏ పనీ నాకు నచ్చదు. ఈ తీర్పుకి బలం లేదు. న్యాయపీఠం మీద కూర్చున్న న్యాయమూర్తి ముద్దా యితో ఏ చిన్న ప్రమేయం ఉన్నా అతని తీర్పు చెల్లదు. అతను తప్పుకుంటాడు.Your dislike pre-judges your opinion. ఏనాడయినా మేధావి అభిప్రాయం బెసుగుతుంది. అతని పెట్టుబడి - ఆలోచన కనుక. అతి సామాన్య వ్యక్తి అభిప్రాయం కుండబద్దలు కొడుతుంది - అతని పెట్టుబడి - విశ్వాసం కనుక. విశ్వాసం విప్లవానికి పుట్టిల్లు. -
పీత కష్టాలు పీతవి
జీవన కాలమ్: అమరావతి అంటే నామట్టుకు మొన్నమొన్నటి వరకూ మిత్రుడు శంకరమంచి సత్యం ఊరు. సత్యం అర్చకుల కుటుంబానికి చెందినవాడు. అతని రచనల ద్వారానే అమరే శ్వరుడి క్షేత్రం పరిచయం. సత్యం 'అమరావతి కథలు' రాసే రోజుల్లో ఇద్దరం రేడియోలో ఉద్యోగం చేస్తున్నాం. ఓసారి ఏదో పని మీద మద్రాసు వచ్చి నన్ను కాగితాలు అడిగి నా ముందే కూర్చుని అమరావతి కథ రాశాడు. సత్యం కన్నుమూ శాక ఓ సంవత్సరం సాహిత్య అకాడమీ కథల బహు మతికి నేను న్యాయనిర్ణేతని. ‘అమరావతి కథల’ సరసన మరే కథల పుస్తకం ఉన్నా కొన్ని ఆమడల దూరంలో ఉంటుంది అని రాసిన గుర్తు. ఇవాళ సత్యం ఉంటే రాజ ధాని తన ఊరుకి వచ్చినందుకు గర్వపడేవాడు. ఒక తరంలో కొత్త రాజధాని నిర్మాణాన్ని చూడటం అపూర్వమైన అనుభూతి. రాజధానిలో ఏమేం ఉండాలో చాలా మంది పెద్దలు గుంజాటన పడడాన్ని మనం వింటున్నాం. ఒక తెలుగు కళాకారుడి కలల గురించి ఈ ప్రభుత్వానికి ఎవరయినా చెప్పారో లేదో. నాకు కనీసం 52 సంవత్సరాలుగా హైదరాబాద్ తెలుసు. నా కళ్ల ముందే రవీంద్రభారతి నిర్మాణం జరిగింది. లెక్కలేనన్ని ప్రదర్శనలు, సభలు, కచ్చేరీలను చూశాను. బడేగులాం ఆలీఖాన్ కచ్చేరీ, టి.ఆర్.మహాలింగం కచ్చేరీ, నా 'మహానటుడు' నాటకాన్ని కె. వెంకటేశ్వరరావు ప్రదర్శన, గోవిందరాజుల సుబ్బారావు వృద్ధాప్యంలో 'కన్యా శుల్కం'ప్రదర్శన, అద్దంకి శ్రీరామమూర్తి దశరథుడి వేషం- కొన్ని మధురమైన జ్ఞాపకాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోవడం నాకు తెలుసు. అక్కడ రోశయ్యగారి చేతుల మీదుగా నా 'సాయంకాలమైంది' నవలకి సాహిత్య అకాడమీ పుర స్కారాన్ని అందుకోవడం మంచి జ్ఞాపకం. కొత్త తెలుగు రాజధానిలో రవీంద్రభారతి వంటి నాలుగయిదు థియేటర్ల కాంప్లెక్స్ అవసరం. ప్రతి సాయంకాలం రాజధాని వచ్చే వారికి అది 'కళాకారుల కూడలి'కావాలి. ఈ మధ్య అకాడమీల పునరుద్ధరణ జరగాలన్న ఆలోచన వినిపిస్తోంది. ఆ ఆలోచనకి నా వోటు. ఇప్పుడు హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయం ఏమవుతుంది? రెండుసార్లు రాష్ట్రం విడి- చాలా విలువయిన గ్రంథాలు అటు తంజావూరు 'సరస్వతీ గ్రంథాలయం'లో, మద్రాసు విశ్వవిద్యాలయాలలో ఉండి పోయాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉండిపోతాయి. అయితే అదీ తెలుగు రాష్ట్రమే కదా? ఆ సంపద మళ్లీ ఏకీకృతం కావాలి. తమ తమ కళలకు సంబంధిం చిన పనులకు రాజధాని వచ్చే కళాకా రులకు సబ్సిడీ ధరలతో వసతిని - ఒక భవనాన్ని (దాన్ని 'కళాభవన్' అంటారా?) ఏర్పరచాలి. అలాగే ఆహార సదుపాయాలు కూడా. ఒక ఫ్లోర్లో చాట్ల శ్రీరాములు, మరో ఫ్లోర్లో బాలమురళీకృష్ణ, ఇంకో ఫ్లోర్లో రాధారెడ్డి, రాజారెడ్డి, మరొక ఫ్లోర్లో కాళీ పట్నం రామారావుగారు విడిదిచేసి ఉంటే ఎంత హృద్యంగా ఉంటుంది? తెలుగుదనం ఎంత పరి పుష్టంగా దర్శనమిస్తుంది! తెలుగుదేశంలో దాదాపు ప్రతీ రచయితా తన రచనల్ని తానే ప్రచురించుకోవాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి. సాధకబాధకాలు అలా ఉండగా పంపిణీ పెద్ద సమస్య. ప్రభుత్వం కనీస బాధ్యత - ఒక కోపరేటివ్ అయినా ప్రారంభించి ప్రచురణ, పంపిణీకి ఆదుకో వాలి. అంతకన్నా ముఖ్యమయిన సౌకర్యం తెలుగు దేశంలో ఎక్కడ పుస్తకం ప్రచురితమయినా - అమ్మ కానికి ఒక స్టాల్ అవసరం. కొత్త పుస్తకం అమ్మకానికీ, సమాచారానికీ అక్కడ చేరాలి. ఈ సంవత్సరం తెలుగు విశ్వవిద్యాలయం కపిలవాయి లింగమూర్తి అనే 90 ఏళ్ల వృద్ధునికి డాక్టరేటు ఇచ్చింది. ఆయన చాలా చక్కని పుస్త కాలు రాశారు. వాటిని వారి కొడుకులు, మనుమలు ప్రచురిస్తారు. ఎప్పుడూ ఆ పుస్తకాల్ని నాకు పంపుతారు. ‘అయ్యో. చాలా మంది చేతికి ఈ పుస్తకాలు వెళ్తే బాగుం టుంది’ అని నాకనిపిస్తుంది. అలాగే చాలా మంది ప్రచు రించుకున్న రచనలు. వాటి అమ్మకానికి ప్రభుత్వ సహ కారం కావాలి. ఈ కాంప్లెక్స్లోనే పుస్తక విక్రయశాల - సమగ్రంగా ఏర్పడాలి. ఆ రోజుల్లో కాశీనాథుని నాగేశ్వర రావు, పండిత డి.గోపాలాచార్యుల వంటి వదాన్యులు పుస్తక ప్రచురణకి చేయూతనిచ్చేవారని శ్రీపాద సుబ్ర హ్మణ్యశాస్త్రిగారు తమ ‘అనుభ వాలూ- జ్ఞాపకాలూను’లో పేర్కొ న్నారు. ఇది ప్రభుత్వం చెయ్యాలి. ఆర్థికపరంగా ఇది ప్రభుత్వానికి పెద్ద బరువు కాదు. కాని రచయితకి కొండంత ఉపకారం. అలాగే చక్కని ప్రదర్శనలిచ్చే నాటక సంస్థలకి రాయితీలు కల్పించి ప్రతిరోజూ ఏదో ఒక ప్రదర్శన ఈ కేంద్రంలో ఉండే ఏర్పాటు కష్టం కాదు. ఏతావాతా రాజధానిలో కళాకారుడికి తనదైన అడ్రసు ఏర్పడాలి. ఫలానా నటుడి వివరం, రచయిత రచన, సంస్థ చిరునామా - పిలిస్తే పలకాలి. రాజధాని తెలుగు కళా కేంద్రంలోకి వస్తే మంచి కచ్చేరీ, మంచి నాటకం, మంచి పుస్తకం, మంచి గోష్టి - యిన్నిటికి ఆస్కారం కల్పించాలి. ఇదొక ఆర్ట్ విలేజ్. ఇక్కడ అందరికీ స్థానం ఉండాలి. రాజధాని నిర్మాణంలో ఈ సూచనలు 'పిడకల వేట'గా కొందరికయినా అనిపించవచ్చునేమో. కాని పీత కష్టాలు పీతవి. కొత్త రాజధానిలో శాసనసభా భవ నాలు, సెక్రటేరియట్లూ, సిబ్బంది కాలనీలు, ఆకాశ హర్మ్యాలూ, వాటర్ ఫ్రంటులూ- అన్నీ తెలుస్తున్నాయి. కాని ఎక్కడా కళాభవనం ప్రసక్తిలేదు. నాయకులు పాలన చేస్తారు, శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తారు. కాని తరతరాల జాతి ఆలోచనా సరళికీ, సంస్కృతీ వైభవానికీ అద్దం పట్టేది కళ. ఒక జాతి ప్రత్యేకతనూ, వికాసాన్ని ప్రతిఫలించేది కళ. ‘కళ’ ఉనికిని గర్వంగా చెప్పుకునే అడ్రసు రాజధానిలో ఉండాలి. సర్వాంగసుందరంగా, సర్వజనామోదంగా నిర్మిస్తున్న ఈ చరిత్రాత్మకమయిన కృషిలో- సమగ్రమైన మృష్టాన్న భోజనాన్ని సమకూరు స్తున్న వేళ ఆ విస్తరిలో 'తెలుగు'రుచి ప్రత్యేకంగా కనిపించాలని కోరిక. కళాకారుడికి, రచయితకి ప్రత్యేకమైన ఉపకారం జరగాలని ఆశించడం అనౌచిత్యం కాదు. ఇది తెలుగు కళాకారుడి కల. తెలుగు రాజధానిలో తెలుగు కల. -
నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవను!
పి.ఆర్.జె.పంతులు 9866039733 కన్యాశుల్కం షేక్స్పియర్ నాటకాలలా బతుకుతుందో లేదో ‘కాలం’ చెప్తుంది. చిత్రంగా షేక్స్పియర్ నాటకాలతో అక్కడివాడే అయిన చార్లీ చాప్లిన్ ఏ మాత్రం ఐడెంటిఫై కాలేదు. ఈ ‘నిజాన్ని పోలిన అబద్ధం’ ఇవాళ అన్ని రంగాలలో రాజ్యమేలుతోంది, మానవ సంబంధాలతో సహా! ఈ మధ్య గొల్లపూడి మారుతిరావు సమగ్ర సాహిత్యం సంపుటాలు చదివేను. అందులో ఒకటి రెండు చోట్ల ‘కన్యాశుల్కం’ సర్వకాలికం, సర్వజనీనం కాదని సెలవిచ్చేరు. ‘కన్యాశుల్కం గొప్ప నాటకం. కానీ అది సర్వకాలీనమైన నాటకం కాదు. ఎందుకంటే ఆ సమస్య యిప్పుడు లేదు. కన్యాశుల్కం ఓ గొప్ప మైలురాయి మాత్రమే. గొప్పమార్గం కాదు. ఇలా 36 ఏళ్ల క్రితం మాట్లాడితే కాళోజీవారు నన్ను వ్యతిరేకించినట్లు గుర్తు’ అన్నారు. దీనిమీద నా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికే ఈ వ్యాసం. ‘ఎందుకంటే ఆ సమస్య యిప్పుడు లేదు’ అన్నారాయన. ఆ సమస్యను గురజాడ మొట్టమొదటిగా, నాటకంలో ఎలా ప్రస్తావించేరో గమనించండి: కరటకశాస్త్రి: అగ్నిహోత్రావధాన్లూ! కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి యింత ముందూ వెనకా చూస్తున్నావ్! బుచ్చెమ్మ నమ్మిన పదిహేను వొందల రూపాయ లేంజేశావ్? గిరీశం: సెల్లింగ్గర్ల్స్! డామిట్! అదండీ అసలు సమస్య. సెల్లింగ్ గర్ల్స్. ఆడపిల్లల్ని అమ్మడం! అది కన్యాశుల్కం కావచ్చు, మరొకటి కావచ్చు. బేసిక్ సమస్య ‘ఆడపిల్లల్ని అమ్మడం’. అగ్నిహోత్రావధాన్లు పిల్లని అమ్ముకోవడం తప్పనుకోడు. అందరూ అనుసరిస్తున్న శిష్టాచారంగానే భావిస్తాడు. అగ్నిహోత్రావధాన్లు: మా మేనత్తల్ని అందర్నీ కూడా అమ్మేరండీ! వాళ్లంతా పునిస్త్రీ చావే చచ్చారు. మాతండ్రి మేనత్తల్ని కూడా అమ్మడవే జరిగిందండి. యిప్పుడు ఈ వెధవ యింగిలీషు చదువునుంచి, ఆ పకీరు వెధవ దాన్ని లేవదీసుకు పోయినాడు గాని, వైధవ్యం అనుభవించిన వాళ్లంతా పూర్వకాలంలో యెంత ప్రతిష్టగా బ్రతికేరు కారు? ఆ రోజుల్లో వాళ్ల పిల్లల్ని వాళ్లు అమ్ముకున్నారు. మరి ఇవాళ ఆడపిల్లల్ని మాయచేసి, మభ్యపెట్టి, తీసుకెళ్లి వ్యభిచార గృహాలకూ, అరబ్ షేకులకూ, సంపన్న గృహస్థులకూ పనిమనుషులుగా అమ్మేస్తున్నారు. ఆడపిల్లల్ని అంగట్లో వస్తువుల్లాగా అమ్మడం ఏమిటి? అదే గురజాడ ఆవేదన అని నేను తలుస్తాను. నాటకం సర్వకాలికం అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకో ఈ సమస్యల్ని కొన్నిటిని చూడండి: సౌజన్యారావు: సాధారణంగా వకాల్తీలో దురాచారాలు చాలా ఉన్నాయి. ఆంటీనాచ్లాగే ఆంటీ వకీల్ అని ఒక మూవ్మెంటు మనదేశంలో స్టార్టు చెయ్యడము ఆవశ్యకత కలిగేట్లు కనబడుతోంది. కొత్తమనిషి (మగ వేషంలో మధురవాణి): ...వకీళ్లు గనక వేశ్య పెట్టిన చిక్కు విప్పజాలక పోతారా అని మనవి చేశేను. సౌజన్యారావు: వేశ్యలకు వకీళ్లు సమదంతా అనా! ఆనాడు జాగ్రత్త పడలేకపోయాం. రుజువులు, సాక్ష్యాలు నేరం జరిగినట్లు స్పష్టంగా కనపడుతున్న కేసుల్ని గూడా, తమ మేధావితనంతో, 18 ఏళ్లు, 20 ఏళ్లు సాగదీయగల ప్రబుద్ధుల్ని ఇవాళ చూస్తున్నాం. రామప్పంతులు: కొంచెం బెదిరిస్తేనే నౌఖరీ పోతుందా అన్నా? పోలీసు డ్యూటీ అంటే బెదిరింపే కదా! ఈ విషయంలోనూ మనం జాగ్రత్త పడలేదు. యింగ్లీషువాడు భారతీయుల్ని అణగదొక్కి ఉంచడానికి ఏర్పరిచిన పోలీసు వ్యవస్థ స్వతంత్రం వచ్చేక ఎవరి పక్షాన ఎవరిని అణగదొక్కి ఉంచడానికి, ఎవరి నోళ్లు నొక్కడానికి ఉపయోగపడుతుందో మనందరికి తెలుసు. మధురవాణి: యేమ్మోసం? రామప్పంతులు: లౌక్యం, లౌక్యవను. మధురవాణి: రెండింటికీ యేవిటో భేదం? రామప్పంతులు: నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవను. మధురవాణి: తాను చేస్తే లౌక్యం! మరోడు చేస్తే మోసం అనరాదా! అబద్ధానికి అర్థవేవిటి? రామప్పంతులు: యావన్నావూ? అబద్ధవనా? ఉద్యోగధర్మం లౌక్యవృత్తీ అని, అది వక వృత్తి భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్యవృత్తి యెటువంటిదీ? నిజాన్ని పోలిన అబద్ధవాడి ద్రవ్యాకర్షణ చేసేది. యీ ధర్మసూకా్ష్మలు నీకెలా తెలుస్తాయి. ఈ ‘నిజాన్ని పోలిన అబద్ధం’ ఇవాళ అన్ని రంగాలలో రాజ్యమేలుతోంది, మానవ సంబంధాలతో సహా! నెల రోజుల్లో నల్లధనం వెనక్కి, రైతుల రుణ మాఫీ, నవ్యాంధ్రకి స్పెషల్ స్టేటస్, నెల రోజుల్లో ముఖ సౌందర్యం... ఇలా ఎన్నైనా. ఇవాళ ఎవడు అత్యంత చాకచక్యంగా ‘నిజాన్ని పోలిన అబద్ధం’ ఆడి నెగ్గుకు రాగలడో - వోహి సికందర్! జాగ్రత్త పడ్డాం కాదు. ‘సార్యజనీనత అదీ ముఖ్యం. అందువల్లనే షేక్స్పియర్ హేమ్లెట్, ఒథెల్లో నాటకాలు బ్రతికినట్లు- బహుశా ఏ కన్యాశుల్కం బతకదేమో’ అని కూడా అన్నారు గొల్లపూడి. ‘నాటకాలకు సార్వజనీనత కావాలంటే ఆ నాటకం భవిష్యత్తును చూపేది మాత్రమే కాకుండా, అప్పటి సాంఘిక పరిస్థితులను దాటి, వ్యక్తి సహజమైన మానసిక దౌర్బల్యాలనూ, హృదయవేదననూ, వింతపోకడలనూ నిర్భయంగా చెప్పగలిగేది కావాలి’. కన్యాశుల్కం షేక్స్పియర్ నాటకాలలా బతుకుతుందో లేదో ‘కాలం’ చెప్తుంది. మనమెవరం ‘బతకదేమో’ అనడానికి! చిత్రంగా షేక్స్పియర్ నాటకాలతో అక్కడివాడే అయిన చార్లీ చాప్లిన్ ఏ మాత్రం ఐడెంటిఫై కాలేదు. తన ఆత్మకథలో ఇలా రాశారు: I cannot pretend to enjoy Shakespeare in the theatre. In my pursuit of bread and cheese, honour was seldom trafficked in. I cannot identify myself with a prince's problems. Hamlet's mother could have slept with everyone at court and I would still feel indifferent to the hurt it would have inflicted on Hamlet. ‘కన్యాశుల్కం ఓ గొప్ప మైలురాయి మాత్రమే, గొప్ప మార్గం కాదు’ అనీ మారుతిరావు అన్నారు. కన్యాశుల్కం మొదటి కూర్పు(1897) పీఠికలో గురజాడ ఇలా సెలవిచ్చేరు: ‘యిటువంటి ఘోరమైన పరిస్థితి సమాజానికి సిగ్గుచేటు. యిటువంటి దురాచారాన్ని ఎండగట్టి ఉన్నతమైన నైతిక ప్రమాణాలు వ్యాపింపచేయడానికి మించిన కర్తవ్యం సాహిత్యానికి మరొకటిలేదు. అలాటి ఆరోగ్యకర ప్రభావ వ్యాప్తికై నాటకరంగాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. కన్యాశుల్కం నాటక రచనకు నన్ను ప్రేరేపించింది యిదే! నేను ఈ నాటకాన్ని వాడుక భాషలో రాశాను. ఎందువల్లనంటే - యిది గ్రాంథిక భాషకన్నా, నాటకాన్ని చూసే ప్రజలకు బాగా అర్థం అవుతుందనే కాక - ఇది హాస్యరసానికి తగినదని నా అభిప్రాయం’. రెండో కూర్పు(1909) పీఠికలో- ‘సమాజ సంస్కరణోద్యమానికి తోడ్పడేందుకు తెలుగుభాష నాటకాలకు తగింది కాదని ప్రజల్లో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించేందుకూ రాశేను. కేవలం ప్రసహన ప్రదర్శన కోసం తప్ప, నాటక కర్తలు సమకాలీన జీవితంలోని సంక్లిష్ట పరిస్థితుల్ని పట్టించుకోవడం లేదు’ అన్నారు. భాషా సాహిత్యాల ప్రగతి చింతన, సామాజికాభ్యుదయ చింతన దీపస్తంభాలుగా, ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ఏర్పరచి, ముందు వారు నడిచి, విజ్ఞులను అనుసరించమని గురజాడ అభ్యర్థించేరని నేను తలుస్తాను. మెరికల్లాంటి యువతరం వారు ఎందరో ఆ మార్గంలో పయనిస్తున్నారని నాకు తెలుసు. అందుకే శ్రీశ్రీ ‘అడుగుజాడ గురజాడది. అది భావికి బాట’ అన్నాడు. సార్వజనీనత అంటే యింకా వేరే ఏమైనా ఉంటుందా అని నా సందేహం. (వ్యాసకర్త పుట్రేవు రామ జోగారావు పంతులు రంగస్థల నటులు. ‘కన్యాశుల్కం’లో గిరీశం, రామప్పంతులు పాత్రలు పోషించారు.) -
పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు
జీవన కాలమ్: పెళ్లికి నాలుగు లక్ష్యాలను పెద్దలు చెప్పారు - ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ. సమాజ హితం - ఇప్పుడు రోజులు మారాయి. పెళ్లికి కారణాలు తిరగబడ్డాయి. కామేచ, అర్థేచ- మూడోది ఎవడిక్కావాలి? ఒక జోక్. ఒక భారతీ యుడు, అమెరికన్ కలిశారట. భారతీయుడు మొరబెట్టుకున్నాడట. అయ్యా, మా దేశంలో పెళ్లిళ్లు మా ప్రమేయం లేకుండా పెద్దలు నిర్ణ యిస్తారు. జాతకాలు, ముహూర్తాలు, మంగళ సూత్రాలు, తంతు- గొడవ. నేను చూడని, ప్రేమించని పిల్ల మెడలో తాళి కట్టమంటారు. ఎలా చచ్చేది? - అన్నాడట. అమెరికన్ అన్నాడు: మీ పని బాగానే ఉంది బాబూ. నా సంగతి చూడు. నేను మూడేళ్లు ప్రేమించి మొగుడు పోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. రెండేళ్ల తర్వాత మా నాన్న నా పెళ్లాం మొదటి భర్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మా నాన్న నాకు అల్లుడయ్యాడు. నేను ఆయనకి మామనయ్యాను. చట్టం ప్రకారం నా కూతురు నాకు తల్లయింది. నా పెళ్లాం నా అమ్మ మ్మ అయింది. నా కొడుకు పుట్టాక సమస్యలు మిన్ను ముట్టాయి. నా కొడుకు మా నాన్నకి తమ్ముడ య్యాడు. కనుక నాకు మేనల్లుడ య్యాడు. ఇప్పుడు మా నాన్నకి కొడుకు పుట్టాడు. నాకు తమ్ముడు కావలసిన ఆ కుర్రాడికి నేను తాతన య్యాను. మొత్తానికి నేను నాకే తాతని, నాకే మనుమడిని అయ్యాను. మరి మా సంగతేమిటి? భారతీయుడు స్పృహతప్పి పడిపోయాడట! ఇది షీనా బోరా హత్య గురించిన కాలమ్ కాదు. ఇప్పుడు ఇండియా మార్కు అమెరికా కథ. ఇంద్రాణి ముఖర్జీకి ముగ్గురు భర్తలు. మొదటి భర్తకాని భర్త దాస్కి ఇద్దరు పిల్లలు - మిఖయిల్, షీనా. రెండో భర్త సంజీవ్ ఖన్నాకి ఒక కూతురు. వృద్ధి. మూడో భర్త పీటర్ ముఖర్జీకి మొదటి భార్య ద్వారా ఒక కొడుకు. రాహుల్. ఇంద్రాణి తన మొదటి భర్త పిల్లల్ని తన తల్లిదండ్రులకి అప్పగించింది. వారిద్దరూ తనకి తమ్ముడు, చెల్లె ళ్లని చెప్పింది. కాని ఆమె తండ్రి 'బాబోయ్, నేను వారి తండ్రిని కాదు. తాతని' అన్నాడు. ఇప్పుడు మూడో భర్త కొడుకు (తనకి పుట్ట నివాడు) తన చెల్లెలని చెప్పిన కూతురు ప్రేమలో పడ్డాడు. ఇది ఇంద్రాణికి నచ్చలేదు. ఈలోగా రెండో భర్తని పిలిచింది. ఆయన కూతురు 'వృద్ధి' ని ఆయనకి చూపిస్తానని మాటిచ్చింది. చెల్లెలని చెప్పిన కూతుర్ని హత్య చేసింది. తననీ హత్య చేయబోయిందని కొడుకు అంటున్నాడు. అంటే- మూడో భర్త యొక్క రెండో పెళ్లాం రెండో భర్త సాయంతో మొదటి భర్త యొక్క చెల్లె లని చెప్పే కూతురుని- మూడో భర్త యొక్క మొదటి పెళ్లాం కొడుకుతో ప్రేమ వ్యవహారం నడిపిన కారణంగా చంపింది. ఇది వార్త. ఓ పోలీసు ఆఫీసరు అడిగాడు: ఎందుకమ్మా నీ కూతుర్ని నువ్వే చంపుకున్నావు? ఇంద్రాణి సమాధానం: నా మూడో భర్త నా చెల్లెలని భావిస్తున్న నా కూతుర్ని నేను చంపించ కపోతే నా సవతి కొడుకు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నా కూతురు నా కోడలవుతుంది. అంటే తన మరదలని నమ్మే నా మూడో భర్త కళ్ల ముం దే నా కూతురు తన కోడలిగా కాపురం చేస్తుంది. పోలీసు ఆఫీసరు మూర్ఛపోయాడు. ఇంత ముదరకపోయినా కొంత ముదిరిన కథ మనం ఈ మధ్య విన్నాం. కేంద్ర మంత్రి అం దాల శశి థరూర్గారు సునందా పుష్కర్ అనే ఆవి డని రెండో పెళ్లి చేసుకున్నారు. అమెకీ అది రెండో పెళ్లి. ఆమెకి పెళ్లీడు వచ్చిన కొడుకున్నాడు. తీరా ఆమె హత్యా (ఆత్మహత్యా?)కి గురయింది. మన దేశం కూడా పెళ్లిళ్ల విషయంలో అమెరి కాకి ఏవిధంగానూ తీసిపోదని నిరూపిస్తున్నం దుకు నాకు గర్వంగా ఉంది. మనకి నచ్చినా నచ్చకపోయినా ఈ దేశంలో వివాహ వ్యవస్థ శతాబ్దాల నాటిది. పెళ్లికి నాలుగు లక్ష్యాలను ఆ వరసలో పెద్దలు చెప్పారు - ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ. సమాజ హితం -భార్యాభర్తలు తమ విధుల్ని నిర్వర్తించుకోవ డంలో, పది మందికి అండగా నిలవడంలో బాధ్యత వహిస్తారు. వహించాలి. అది ధర్మం. తర్వాత ఆర్థికంగా ఈ వ్యవస్థ ఆరోగ్యానికి, తమ జీవనానికి దోహదకారులవుతారు. అవాలి. అది అర్థం. అప్పుడు మూడో కారణం- కోరిక. ఆ కోరి క లక్ష్యం ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకోగలిగిన సంతా నాన్ని పొందుతారు. పొందాలి. చీకటి గదిలో కేవలం కోరికని దులుపుకోవడం కాదు. ఇప్పుడు రోజులు మారాయి. పెళ్లికి కార ణాలు తిరగబడ్డాయి. కామేచ, అర్థేచ- మూడోది ఎవడిక్కావాలి? ధర్మం అంటే ఎందరికి తెలుసు? దమ్ముంటే ఇంద్రాణిని అడగండి. పార్కుల్లో ప్రేమించి, ఆఫీసుల్లో కలిసి దాన్ని ప్రేమనుకొని పెళ్లిళ్లు చేసుకుని నెలలు తిరగకుం డా విడాకులు పుచ్చుకున్న ప్రేమికుల కథలు వం దలున్నాయి. వారంతా 'కామేచ, అర్థేచ' పెళ్లిళ్లు చేసుకున్న వారే కనుక. మరి 'ధర్మం?' పోవ య్యా, తాటిచెట్టుకీ తాత పిలకకీ ముడివేస్తారు - ధర్మం ఎవడిక్కావాలి? -
అశ్లీలపు స్వేచ్ఛ
18 ఏళ్లు దాటిన ఎవరయినా, ఏ సైటయినా చూడవచ్చునని చట్టం చెప్తూండగా పోర్న్ వీడియోలు చూడటంలో మీ అభ్యంతరం ఏమిటి? మీరు బీజేపీ సభ్యు లట. నిజమేనా? - మరెన్నో మరెన్నో. ఆ మధ్య కోయంబత్తూరులో పది కాలేజీలలో చదువుకుం టున్న 400 మంది విద్యార్థుల తో ఆరు నెలలపాటు ఒక సర్వే ని నిర్వహించారు. నిర్వహించి నది లండన్లో లెక్చరర్గా ఉం టున్న అభిషేక్ క్లిఫోర్డ్ అనే వ్యక్తి. ఆయన ‘రెస్క్యూ’ అనే సంస్థకి అధిపతిగా ఉంటు న్నారు. ఒకప్పుడు సంప్రదాయానికి ఆటపట్టుగా ఉన్న కోయంబత్తూరులో 31 శాతం కాలేజీ కుర్రాళ్లు తమ తమ మొబైల్ ఫోన్లు, మిగతా ఎలక్ట్రానిక్ సాధనాల మీద ప్రతిరోజూ అత్యంత దౌర్జన్యకరమైన రేప్లూ, అశ్లీలపు వీడియోలు చూస్తున్నారట. ఈ అశ్లీలపు దృశ్యాలు (పోర్న్ చిత్రాలు) చూడటానికి అలవాటు పడిపోయిన వీరు రోజుకి కనీసం 2,700 రేప్లను చూస్తున్నారట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రేప్ వీడియోలు చూసే కుర్రాళ్లలో సగం మంది రేప్లు చేయాలనే కోరికను పెంపొందించుకుంటున్నారట. వీరి లో కనీసం 86 శాతం కుర్రాళ్లు - ఈ అశ్లీలపు వీడియో లను చూడటం వల్ల పెళ్లితో ప్రమేయం లేని సెక్స్కి కుతూహలాన్నీ, ఉబలాటాన్నీ పెంచుకుంటున్నారు. వీరిలో మళ్లీ 45 శాతం యువతీయువకుల పోర్న్, పసి వారి పోర్న్ చిత్రాలు చూస్తున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే వీరిలో 18 శాతం పిల్లలు కనీసం నెలకి ఒక్కసారయినా వ్యభి చార గృహాలకు వెళ్తున్నారట. నేర పరిశోధక సంస్థ లెక్కల ప్రకారం ఈ విపరీతపు కోరిక కారణంగా ఒక్క కోయంబత్తూరులోనే 360 మంది హైస్కూలు అమ్మాయి లను దొంగతనంగా ఎత్తుకుపోయారట. సరిగ్గా 14 రోజుల కిందట చెన్నై దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తకు కేవలం అనువాదమిది. ఇది ఉత్త భ్రమ అని పెదవి విరిచే స్వేచ్ఛాజీవుల కను విప్పు కోసం ఈ వివరాన్ని కూడా ఉదహరిస్తున్నాను. ఇంకా అనుమానం ఉంటే నా దగ్గర ఆ దినపత్రిక ఉంది. ఇంకా విచిత్రమైన విషయం ఈ దేశంలో ఈ అశ్లీలపు వీడియోలను చూసే ప్రతీ ముగ్గురిలో ఒకరు స్త్రీ(ట)! ఈ మధ్య మన దేశంలో 857 అశ్లీలపు వీడియోలు చూపించే సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇంట ర్నెట్ సెక్యూరిటీ చట్టం కింద ఈ బహిష్కరణ జరిగినట్టు పేర్కొంది. మన దేశంలో 4 కోట్ల వెబ్సైట్లు ఉంటే ఎక్కు వగా, తరచుగా - వయస్సు, లింగ భేదం లేకుండా విరి విగా చూసే సైట్లు ఈ పోర్న్ వీడియోలట. 2012 డిసెం బర్ రేప్ తర్వాత భయకంపితుడైన ఒక ఇండోర్ లాయ రుగారు కమలేష్ వాస్వానీ అనే ఆయన రేప్ నేరగాళ్లను శిక్షించడమే కాదు, ఈ నేరగాళ్లకు దోహదపడే ఈ దౌర్భా గ్యపు పోర్న్ సైట్లను బహిష్కరించాలని కోర్టుకెక్కారు. ప్రభుత్వం చర్య తీసుకుంది. ఓ కాలేజీ అమ్మాయి పోర్న్ వీడియోలు చూడటం తమ హక్కు అనీ, వాటిని బహి ష్కరించడం వ్యక్తి స్వేచ్ఛను భంగపరచడమేననీ స్పష్టం గా కెమెరా ముందు విన్నవించింది. ఇప్పుడిక మానవతావాదులు, స్వేచ్ఛాజీవులు రం గంలోకి దూకారు. వారి ప్రశ్నలు: అశ్లీలపు వీడియోలను బహిష్కరించేకంటే స్త్రీల పట్ల సామాజిక ఆలోచనా ధోర ణిలో మార్పు రావడం ముఖ్యం కదా? దేశంలో పోర్న్ సైట్లను బహిష్కరిస్తే రేప్లు జరగవంటారా? ఖజురహో వంటి చోట్ల మన పురాతన సాంస్కృతిక వారసత్వంగానే సెక్స్ కనబడుతూండగా పోర్న్కు ఎందుకు అభ్యంత రం? 18 ఏళ్లు దాటిన ఎవరయినా, ఏ సైటయినా చూడ వచ్చునని చట్టం చెప్తూండగా పోర్న్ వీడియోలు చూడ టంలో మీ అభ్యంతరం ఏమిటి? మీరు బీజేపీ సభ్యు లట. నిజమేనా? - మరెన్నో మరెన్నో. వీరందరికీ సవినయంగా నమస్కారం చెయ్యడా నికే ఈ కాలమ్. నిజానికి ఇక్కడితో ఈ చర్చ ముగియవచ్చు. చట్టం సామాజికమయిన హితవుని దృష్టిలో పెట్టు కుని మనం ఏర్పరచుకున్నది. కొన్ని చర్యల వల్ల మనకు జరిగే అపకారం జరిగాక మనం తెలుసుకున్నది. జరిగే అనర్థం దృష్ట్యా మనకి మనమే నియమాల్ని సవరించు కుంటాం. అశ్లీలపు వీడియోలు చూడటం ద్వారా చిన్న పిల్లలకు జరిగే అనర్థాన్ని కళ్లకు కట్టినట్టు నిరూపించిన నేపథ్యంలో పోర్న్ వీడియోలను చూడటం మన స్వేచ్ఛ అని మైకు ముందు చెప్పే స్థాయిని సాధించిన మన అభి వృద్ధి అత్యంత అభినందనీయం. జాతి మానసిక ఆరో గ్యాన్నీ, ముఖ్యంగా పసివారి ఆలోచనా ధోరణినీ నియం త్రించే లేదా వక్రీకరించే ఒక ప్రభావాన్ని తమ స్వేచ్ఛగా భావించే పరిణామం, అది రాజకీయం కావడం ఆలో చించవలసిన విషయం అని నాకనిపిస్తుంది. ఒక దుశ్చ ర్య కారణంగా విషం సమాజంలో ప్రబలితే నష్టపోవడా నికి బీజేపీ పిల్లలు, కాంగ్రెసు పిల్లలు, తృణమూల్ పిల్లలు అంటూ వేరే ఉండరు. (వ్యాసకర్త: గొల్లపూడి మారుతతీరావు) -
కొత్త వేదం
ఆయుష్, ప్రార్థన ఇప్పుడు జహీర్ ఆలనలో ఉన్నారు. ‘‘వాళ్ల మతానికి నేను అడ్డురాను. వాళ్లు హిందువులుగానే పెరుగుతారు. దేవాలయానికి వెళతారు’’ అన్నారు జహీర్. చాలా సంవత్సరాల కిందట భారతీరాజా దర్శకత్వంలో ‘జమదగ్ని’ అనే చిత్రంలో నటించాను. ఆ సందర్భంలో ఆయన తీసిన ఒక సినీమాని నాకు ప్రత్యేకంగా ప్రదర్శనని ఏర్పాటు చేశారు. చిత్రం పేరు ‘వేదం పుదిదు’ (వేదం కొత్తది). స్థూలంగా కథ ఇది. ఊరి పెద్ద తక్కువ కులస్తుడు. అతని కారణంగా ఓ బ్రాహ్మణుడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అతని కొడుకు 9 ఏళ్ల పసివాడు. ఊరి పెద్ద, భార్య ఆ కుర్రాడిని చేరదీసి సాకారు. అతన్ని బ్రాహ్మణుడిగానే పెంచారు. విద్యాబుద్ధులకి గురువుల దగ్గరికి తీసుకెళ్లారు. గురువు గారి వీధి అరుగు మీద కుర్రాడు వేదం చెప్పుకుంటూంటే దూరాన చెట్టుకింద గొంతికిలా కూర్చుని ఉండేవాడు ఊరి పెద్ద. ఊరి పెద్ద అంటే అందరికీ సింహస్వప్నం. కాని కుర్రాడికి తన అజ్ఞానం కారణంగా, కులం కారణంగా నష్టం కలగకుండా అప్రమత్తంగా పెంచే పెద్ద దిక్కు. కుర్రాడు వేదపండితుడయ్యాడు. తనని పెంచిన దంపతుల మీద ఆత్మీయతని పెంచుకున్నాడు. ఊరి పెద్ద కన్నుమూశాడు. కుర్రాడు శాస్త్రోక్తంగా తండ్రికి చేసినట్టు అంత్యక్రియలు జరిపాడు. విద్య సంస్కారాన్ని నేర్పింది. బాంధవ్యం రుణం తీర్చుకుంది. ఇది కొత్త వేదం అన్నా రు రచయిత, దర్శకుడు భారతీరాజా. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక - బెంగాలులో మతకల్లోలం పెచ్చురేగింది. మహాత్ముడు నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఒక హిందువు వచ్చి ‘‘నేను ఓ ముస్లిం కుర్రా డిని తల గోడకి కొట్టి చంపాను బాపూ’’ అని నిస్సహా యంగా చెప్పుకున్నాడు. బాపూజీ అతన్ని చూసి ‘‘దానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఓ చిన్న కుర్రాడిని చేరదీసి పెంచు. అయితే అతను ముస్లిం కుర్రాడయి ఉండాలి. అతన్ని ముస్లింగానే పెంచాలి’’ అన్నాడు. మానవత్వానికి మతం లేదు. కులం లేదు. వివక్ష లేదు. ఇప్పుడు ఇటీవలి కథ. మహ్మద్ షానవాజ్ జహీర్, ప్రవీణ్ దయాళ్ - ఇద్దరూ పైలట్లు. కలసి పనిచేస్తారు. ఆత్మీయ మిత్రులయ్యారు. ప్రవీణ్ ఒక ఎయిర్ హోస్టెస్ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు - ఆయుష్, ప్రార్థన, 2012లో ఆమె కన్నుమూసింది. ఇతనూ అనారోగ్యంలో పడ్డాడు. ‘‘నాకేమయినా అయితే నా పిల్లల్ని చూసుకోండి’’ అని ప్రవీణ్ మిత్రుడు జహీర్ దగ్గర మాట తీసుకున్నాడు. తర్వాత ఆ సంవత్సరమే అతనూ కన్నుమూశాడు. జహీర్ వెంటనే చొరవ తీసు కోని కారణాన పిల్లల్ని కారు డ్రైవర్ సాకుతున్నాడు. తన ఉద్యోగం రద్దీలో మిత్రుడికిచ్చిన మాటని మరిచిపోయా డు జహీర్. ఒక రోజు పిల్లలిద్దరూ అతనికి ఫోన్ చేశారు, కంటతడి పెట్టుకుంటూ. జహీర్ గతుక్కుమన్నాడు. వెం టనే రంగంలోకి దూకాడు. ప్రవీణ్ పోయాక ఇండియన్ పైలట్ల అసోసియేషన్ ఒక కోటి రూపాయలు సమీకరిం చి - పిల్లల పేరిట బ్యాంకులో వేసింది. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులూ, పిల్లల బాధ్యతా తనకి అప్పగించాలని కోర్టుని ఆశ్రయించాడు. అయితే ఈ అనుమతికి కొన్ని పరిధులున్నాయి. తను ముస్లిం. పిల్లలు హిందువులు. భారత దేశ చరి త్రలో ఇంతవరకూ మతాంతర ఒప్పందానికి ఏ కోర్టూ అనుమతిని ఇవ్వలేదు. అయినా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజ్మీ వజీరీ (గమనించాలి- ఇతను ముస్లిం) ఈ పిల్లల పోషణా భారాన్ని జహీర్కి అప్పగించారు. ఆయన తీర్పులో మాటలు: ‘‘వివిధ సాహిత్యాలలో కవులూ, రచ యితలూ మానవ సంబంధాలు మతాతీతమైనవని పేర్కొన్నారు. మానవ శ్రేయస్సుకి మూలసూత్రం పసి జీవితా లను కాపాడడమే’’. నీదా ఫజ్లీ, జావేద్ అఖ్తర్ మాటల్ని ఉదహరిస్తూ ‘‘అనాథపిల్లలను సంరక్షించి, సాకడం అపూర్వమైన మానవధర్మాలలో ఒకటి’’ అన్నారు. పక్కింటి వ్యక్తి అరుణ్ సాయనీకి ఆ పిల్లలిద్దర్నీ జహీర్ హిందూ సాంప్రదాయ రీతుల్లో పెంచుతున్నట్టు పర్య వేక్షించే పనిని అప్పగించారు న్యాయమూర్తి. యోగేష్ జోగియా అనే న్యాయవాది ఈ కేసుని ఉచితంగా నిర్వ హించారు. భారతదేశంలో మతాతీతమైన గొప్ప తీర్పు గా దీనిని అభివర్ణించారు. ఆయుష్, ప్రార్ధన ఇప్పుడు జహీర్ ఆలనలో ఉన్నా రు. ‘‘వాళ్ల మతానికి నేను అడ్డురాను. వాళ్లు హిందు వులుగానే పెరుగుతారు. దేవాలయానికి వెళతారు’’ అన్నారు జహీర్. ఆయుష్ పబ్లిక్ స్కూలులో చదువు తున్నాడు. పెద్దయాక ఏమవుతాడు? పైలట్ని అవుతా నన్నాడు. ప్రార్ధన డిజైనర్ అవుతానంది. కాలం మారుతోంది. మానవ సంబంధాలకు ఉదా త్తమయిన విలువలు జత అవుతున్నాయి. ‘కొత్త వేదం’ కొత్తగా, గొప్పగా నిలదొక్కుకుంటోంది. ఆనాడు మహాత్ముడు చెప్పింది నీతి. ఈనాడు జహీ ర్ పాటించింది. నియతి. వెరసి - మానవ సమాజానికి కరదీపిక కాగలిగిన - నిఖార్సయిన మానవత్వం. - గొల్లపూడి మారుతీరావు -
ఓ కానిస్టేబుల్ కేంద్రమంత్రిని ఆపడమా?
ఒక్కటి మాత్రం తెలుసు. లార్కా వంటి పది మంది ధైర్యశాలురు- జీవితంలో మనం ఎంత రాజీపడి సరిపెట్టుకుంటున్నామో హెచ్చరిస్తుంటారు. ఈ దేశంలో బోలెడంత అవినీతి ఉంది. అధికార దుర్విని యోగం ఉంది. అంతకుమిం చి తనేంచేసినా చెల్లిపోతుంద నే అహంకారం నాయకత్వంలో ఉంది. ఇదంతా ఈ దేశాని కి పట్టిన చీడ. కాని మరీ ప్రమాదకరమైనది ప్రజల అలసత్వం. ‘‘మనకెందుకులే!’’ అనే మనస్తత్వం. ‘‘వాళ్లేం చేసినా చెల్లిపోతుంది. అధికారం వారి చేతుల్లో ఉంది’’ అనుకునే, అనే నిస్త్రాణ. ఇది లేని కారణానికే ఈ జాతి ఒకరిని మహాత్ముడన్నది. మరొకరిని లోకమాన్యుడన్నది. ఒక విలువకు కట్టుబడే నియతి అది. రెండు ఉదాహరణలు. మొన్న పాట్నా జయప్రకాష్ నారాయణ్ విమానాశ్రయం నిష్ర్కమణ ద్వారం దగ్గర ఇరవయ్యో పడిలో ఉన్న పారిశ్రామిక రక్షణశాఖ కాని స్టేబుల్ నిలబడి ఉంది. ఈ అమ్మాయి జార్ఖండ్కి చెందిన హవల్దార్ శశి లార్కా. ఆ రోజు ఢిల్లీ నుంచి వస్తున్న బండారు దత్తాత్రేయ గారికి స్వాగతం చెప్పడానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ తన వందిమాగధులతో నిష్ర్కమణ ద్వారం గుండా హడావుడిగా వెళ్లబోయాడు. లార్కా ఆయన్ని ఆపింది. ఇది బయటికి వెళ్లే మార్గమని చెప్పింది. కాస్సేపు మాటా మాటా పెరిగింది. ఒక కానిస్టేబుల్ కేంద్రమంత్రిని ఆపడమా? లార్కా తన సీనియర్లతో మాట్లాడింది. ఏమయినా మంత్రిగారిని, పరివారాన్ని విడిచిపెట్టలేదు. తెలివైన మంత్రి వెనక్కు వెళ్లి - ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్లాడు. ఇంతే కథ. మరొక కథ. 1959లో నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున ఢిల్లీ యూత్ ఫెస్టివల్కి వెళ్లాను. 39 విశ్వ విద్యాలయాలు పాల్గొన్నాయి. టలక్టొరా గార్డెన్స్లో ఉత్సవాలు. ఉత్సవాలను ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. ప్రవేశ ద్వారం దగ్గర ఎన్సీసీ కేడెట్లు నిలబడి, పాస్లు ఉన్న వారిని మాత్రమే ఆవరణలోకి వదిలేవారు. ఒక సాయంకాలం అప్పటి విద్యామంత్రి, నెహ్రూ గారికి అత్యంత సన్నిహితుడు డాక్టర్ వి.కె.ఆర్.వి.రావు గారొచ్చారు. కారుని ఆపి యథాప్రకారంగా పాస్ అడిగాడు ఎన్సీసీ కుర్రాడు. రావుగారికి తిక్కరేగింది. ‘‘నేనెవరో తెలీదా?’’ అని కేకలేశారు. కుర్రాడు అటెన్షన్ లోకి వచ్చి సెల్యూట్ చేశాడు. ‘‘తెలుసు సార్. కాని పాస్ లేనిదే వదలకూడదని నాకిచ్చిన ఆర్డర్’’ అన్నాడు. ఇది సున్నితమైన సమస్య. మాలాంటి కుర్రాళ్లంతా చేరిపోయి వినోదాన్ని చూస్తున్నాం. ఎన్సీసీ కమాండర్ - మరేదో యూనివర్సిటీ ప్రొఫెసర్ - పరిగెత్తుకు వచ్చాడు. రావుగారికి పాస్ లేదు. నిజమే. కాని ఆయన్ని వెళ్లని వ్వాలా వద్దా? కమాండర్కి చెమటలు పట్టాయి. ‘‘మీరిచ్చిన ఆర్డరే నేను పాటిస్తున్నాను. వారిని లోనికి వదలాలంటే మీ ఆర్డర్ని ఉపసంహరించుకోండి సార్! లేకపోతే నేను తప్పుకుంటాను. మీరు తప్పుచేయండి’’ అన్నాడు కుర్రాడు. కమాండర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎదురుగా రావుగారి కారు. చుట్టూ స్టూడెంట్లు. ఎటూ పాలుపోలేదు. చివరికి రావుగారే అగ్గిమీద గుగ్గిలమయి - ‘‘నేను పండిట్జీతో మాట్లాడుతాను’’ అని కారు వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. ఆ సాయంకాలం కుర్రాళ్లందరూ ఆ కేడెట్ని పెద్ద వీరుడిలాగ గార్డెన్ అంతా ఊరేగించారు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి నడవడానికి బోలెడంత చిత్తశుద్ధి కావాలి. రాం కృపాల్ యాదవ్ తన అధికా రాన్ని ఉపయోగించి ఎదురు తిరగాలనుకుంటే అల్లర యేది. తరువాత లార్కా కథ దుర్గాశక్తి నాగ్పాల్ కథ అయేదా, భేమ్కా కథ అయేదా అన్నది వేరే విషయం. ఉద్యోగాన్ని మాత్రమే కాపాడుకునేవాడు నీతికి తిలో దకాలిస్తాడు. నీతిని కాపాడేవాడు అవకాశవాదానికి తిలోదకాలిస్తాడు. వి.కె.ఆర్.వి.రావు గారూ అక్కడే నిలవ దలిస్తే గొడవ జరిగేది. కాని రెండు సందర్భాలలోనూ 20 ఏళ్ల లార్కా, ఆనాటి కేడెట్ చేసిన పని సబబైనది. వారు విధికి కట్టుబడి చేసినది. బస్సులో 85 పైసలు టిక్కెట్టిచ్చి 15 పైసలు మిగుల్చుకునే బస్సు కండక్టరుని ఎంతమంది నిలదీస్తున్నారు? గ్యాస్ సిలెండర్ ఇచ్చే కుర్రాడు 630 రూపాయలు పుచ్చు కుంటాడు. 4 రూపాయలు వాపసు ఇవ్వడు. నిజాయితీకి, కర్తవ్య నిర్వహణకి చిన్నా పెద్దా లేదు. ఈనాటి లార్కా సంఘటన చదివినప్పుడు 55 సంవ త్సరాల కిందటి కుర్రాడి నిజాయితీ, దాని విజయం గుర్తుకొచ్చింది. ఇప్పుడా కుర్రాడూ నా వయస్సు వాడే అయివుం టాడు. ఏ విశ్వవిద్యాలయం నుంచి వచ్చాడో? పేరేమిటో? ఇప్పుడేం చేస్తు న్నాడో? 20 ఏళ్ల వయస్సులో నిలదొక్కు కున్న నిజాయితీ, ధైర్యం జీవితంలో అతన్ని ఏ మార్గం లో నడిపించిందో! ఒక్కటి మాత్రం తెలుసు. లార్కా వంటి పది మంది ధైర్యశాలురు- జీవితంలో మనం ఎంత రాజీపడి సరిపెట్టుకుంటున్నామో హెచ్చరిస్తుంటారు. - గొల్లపూడి మారుతీరావు -
గొంతులేం ఖర్మ... చొక్కాలూ చించుకుంటాం...!
మరణశిక్ష పడిన ఖైదీ ఇంటర్వ్యూకి ఆమెకు అనుమతి ఎవరిచ్చారో మీకు తెలియ దన్నారు. మీకు తెలీకపోవడం ఆవిడ చేసిన నంబర్వన్ నేరమని తీర్పిచ్చారు. మీ ఇగ్నోరెన్స్ మీకే బ్లిస్ గానీ ఉడ్విన్కీ, మాలాంటి పాఠకులకీ ప్లస్ ఎలాగవుతుంది? గొల్లపూడి మారుతీరావు గారూ! నిర్భయ గురించి నిర్భీతిగా మీరు రాసింది చూశాం. భారతదేశం గొప్పదనీ, ఆదర్శ ప్రాయమైనదనీ ప్రపంచమం తటా చాటాలన్న మీ తపన మాకెంతో ఆనందంకలిగించిం ది. అచ్చు మాలాంటి అభిప్రా యాలే మీకూ ఉన్నందుకు ముచ్చటేసింది. పైగా మనది గొప్పదేశం కాదనీ ఏ వలసవాది కానీ తప్పుడు ప్రచారం చేస్తే వాడి గుడ్లు పీకి వాడి చేతుల్లోనే పెట్టాలనేంత కోపం మాతోపాటే మీగ్గూడా నూటా యాభై ఏడు శాతం ఉండ టంతో హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవించేశాం.పైగా మీ నటనకే కాదు సాహిత్యంలో, సినీ చరిత్ర అధ్యయనంలో మీకున్న ప్రతిభను చూసి అప్రతిభులవుతున్నవాళ్లమే. సినిమా ఫీల్డ్లో కూడా చదువుకున్న వాళ్లుంటారా అని ముందుగా మిమ్మల్నీ, మీలాంటి మరి అతి కొద్ది మంది నీ చూసి విస్తుపోయాం. మీ కాలమ్ ఏ పత్రికలో వచ్చినా ముందుగా దాన్నే చదివి అభిమానులమయ్యాం. మనల్ని బానిసత్వంలో మగ్గించిన ఒక దుష్టదేశం లో పుట్టిన దెష్ట మహిళ తప్పుడు మాటలు ఎవ్వరూ ఎప్పుడూ వినరాదనీ, కనరాదనీ మీరనుకున్నట్టే మేము అనుకున్నాం. మీకూ మాకూ జమిలిగా గల దేశభక్తి అలాంటిది. ఎవడో ఒక రేపిస్టూ ప్లస్ ఇద్దరు లా రేపిస్టు లూ చెప్పిన ముష్టిమాటలు... సకల భారతీయ మగ పురుషుల అభిప్రాయాలు కాదనీ గొంతుచించుకుని అర వాలనుకున్నాం. కానీ ఖర్మ కొద్దీ మీరు కాలమ్ రాయక ముందే మీరు చూడని డాక్యుమెంటరీ చూశాం. మీరు లెక్క చేయని కొన్ని డైలీలూ, మేగజైన్లూ చదివాం. పైగా మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నట్టుగా ఈ జర్నలిజంలో నల భై ఐదేళ్లుగా ఉన్నవాళ్లం. ‘నిర్భయ’ ముందూ, ఆ తర్వా తా మన దేశంలో ప్రతి రోజూ సెలవుల్లేకుండా ఎడ తెరపి లేకుండా జరుగుతున్న రేప్లూ, మర్డర్లను ఈ పాపిష్టి చేతుల్తోనే రాస్తున్నాం. అందుకే ఆ డాక్యుమెంటరీ చూసి నప్పుడు మీరు చెప్పిన మానవమృగం ముఖేష్సింగ్ ఒంటరివాడు కాదనిపించింది. అతని డిఫెన్స్ లాయర్లి ద్దరూ కూడా బొత్తిగా ఒంటరివాళ్లు కానేకాదనిపించింది. ఆడదాని తిక్క కుదర్చడానికి గ్యాంగ్రేప్ శిక్షలు సాధికా రికంగా విధించే వందలు, వేల ఖాప్ పంచాయతీలు గుర్తొచ్చాయి. పెదరాయుళ్లు చినరాయుళ్లూ కలిసి ఆడ దాని ప్లేస్ ఎక్కడో చెప్పే ప్రబోధాలు వినిపించాయి. మగమహారాజులు లాగి తంతేనే జన్మధన్యమైనట్టుగా థ్రిల్లయి ‘అబ్బనీ తీయనీ దెబ్బ’ అని పాడే బంగారు కోడిపెట్టలు కెవ్వున కేకేస్తూంటే, అది జాతినుద్దేశించిన సందేశంలా చక్కగా, సిగ్గు లేకుండా 70 ఎం.ఎం స్క్రీన్ మీద పరచుకుంటుంటే తమరి ధర్మాగ్రహం, సత్యా గ్రహం యాడబోయాయి. ‘ఈమెనే సర్వదావాడం డి’ అంటూ బోర్డుపెట్టి అసభ్యంగా చూపిన పచ్చి ఫ్యూడల్ దురహంకారాన్ని, పిచ్చి మేల్ షావనిస్టు పిగ్గరీ ని ఇంత కాలం మౌనంగా చూసిన, చేసిన మీకు ఇంత లోనే అంత కోపమెందుకో! పైగా ఆ సింగూ, ఈ సింగూ మరొకడూ తప్ప దేశమంతటా పురుగులెవరూ లేరనీ అంతా మహాపురుషులేనననీ మీరు జరిపించిన అఖిల భారత సర్వేలో తేలిందంటున్నారు. అది నిఖార్సైన, పదహారణాల పచ్చి అబద్ధం. అందుకే, ఈస్టిండియా కంపెనీ పెట్టిన ఆ దేశంలో పుట్టిన దెష్ట మహిళ చెప్పిందే నిజం, చూపిందే సత్యం అని జావేద్ అఖ్తరూ, షబనా అజ్మీ, బృందాకారత్, ఎన్.రామ్, నేనూ మావాళ్లూ ఇంకా అనేక మంది బుర్రా బుద్ధీ లేని మూర్ఖులం అందరం కూడబలుక్కుని గొంతులు చించుకుందామనుకున్నాం. అవసరమైతే చొక్కాలూ, గుండీలూ చించుకోవాలనీ, గుండెలు బాదుకోవాలని కూడా నిశ్చయించుకున్నాం. ఈ రేపిస్టులూ, వారిష్టులూ అయిన లాయర్ల మాటలు ప్రపంచంలో మన పవిత్ర భారతదేశం పరువు తీస్తున్నా యని మీరు బెంగపడడం బ్లాక్ అండ్ వైట్ అచ్చులో కనిపించింది. మీ ముక్కుల్లోంచీ, చెవుల్లోంచీ ఆగ్రహం పొగలుమియడం మల్టీకలర్లో చూశాం. మన పరువు కొత్తగా పోయేదేం లేదు. మన దేశం లో వరకట్న దహనాల్లో కాలి చచ్చిన అమ్మాయిల లిస్టు మన పత్రికల్లోనే కాదు, ఐరాసలో కూడా ఉంది. యాసిడ్ దాడుల్లో ముక్కులూ మొహాలూ కరిగిపోయిన అంద గత్తెల లెక్కలూ ఉన్నాయి. రోజువారీ రేప్లూ, హత్యల జాబితాలూ దొరుకుతాయి. ఇది మనందరం ఎంతో శ్రమించి ప్రేమించి కట్టుకున్న దుర్మార్గపు సమాజం. ఇందులో అంతర్భాగంగా ఉన్న ‘స్ట్రక్చరల్ వయొలెన్స్’ ఇదెవ్వరూ చూడకూడదనీ ఎవ్వరికీ కనిపించకూడదని మీ కాళ్లూ చేతులతో కప్పెట్టినా, చివరికి మీ నొటోరియస్ డబుల్ చిన్ అడ్డం వేసినా ఆగేది కాదు. ప్రపంచపుటద్దం ఉంది. ఎదురుగా మన దేశం మొహముంది. ‘ఇండియాస్ డాటర్’అని శ్వేతజాతి మహిళ ఉడ్విన్ డాక్యుఫిలిం తీయడమంటే మనల్ని భ్రష్టుపట్టించడానికే ననుకుందాం. మరి ‘గాంధీ’ సినిమా తెల్లతోలువాడైన అటెంబరో తీసినప్పుడు తమకు కోపమెందుకు రాలేదో. బ్రిటన్లో రేప్లు లేవని ఆవిడేం అనలేదు. పైగా ‘నేను రేప్విక్టమ్’నని చెప్పింది. ఆమెకి బ్రిటన్ మీద ప్రేమా లేదు ఇండియా మీద ద్వేషమూ లేదు. జర్నలిస్టు, ఆర్టిస్టు అంతే. ఇంతకాలం జర్నలిజంలో ఉన్నందుకు ఆ విదేశీ దెష్ట మహిళ చెప్పిన తప్పుడు మాటల్లాంటి వాటితో ఒక న్యూస్ స్టోరీ రాయగలిగి ఉంటే జన్మధన్యమై నట్టే ఫీలవుతాం. అలాంటి డాక్యుమెంటరీ చేయగలిగుంటే గొప్ప కర్తవ్యం ముగించి నట్టు సంతృప్తి పొందేవాళ్లం. ఇక ఉడ్విన్ నేరాలూ ఘోరాలను మీరు ఏకరువు పెట్టిన తీరు భలే ఫన్నీగా ఉంది. మరణశిక్ష పడిన ఖైదీ ఇంటర్వ్యూకు అను మతి ఎవరిచ్చారో మీకు తెలియదన్నారు. మీకు తెలీకపోవడం ఆవిడ చేసిన నంబర్ వన్ నేరమని ఢంకా బజాయించారు. మీ ఇగ్నోరెన్స్ మీకే బ్లిస్ గానీ ఉడ్విన్కీ, మాలాంటి పాఠకులకీ ప్లస్ ఎలాగవుతుంది. కాలమ్ రాసే ముందు కనీసం మూడు నాలుగు రోజులనాటి న్యూస్ పేపర్లూ తిరగేస్తే పోయేదే ముంది. నిర్భయ పేరునీ, ఫొటోనీ ప్రకటించిందట అంటూ టకారంతములేల. ఇంటర్నేషనల్ రిలీజ్లో అలా చేసుకోవచ్చని ఆమె అమ్మా, నాన్నలే అనుమతినిచ్చారు. ఈ పుకార్ల శృతపాండిత్యమెందుకు? డాక్యుమెంటరీని అధికారులకి చూపి సమ్మతిని తీసుకోలేదని మీకెలా తెలిసింది? అడుగడుగునా సకల అనుమతులూ తీసు కుందావిడ. కావాలంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపి స్తాం. ‘హిందూ’ పత్రిక ఎన్.రామ్ను అడిగితే సకల పత్రాలూ, సాక్ష్యాలూ చూపిస్తాడు. మరి ముఖేష్తో40 వేలకు బేరం కుదిరిందని తేలిన మీ ఇన్వెస్టిగేటివ్ రిపో ర్టింగ్కు ఆధారంగా ఓ చిత్తుకాయితం ముక్కయినా చూపించగలరా? పురపురా రాసేయడం కాదు. కాస్తంత వెనకా ముందూ చూసుకోవాలి. నరాలు ఉప్పొంగినప్పు డు నిజాలెందుకొస్తాయి. అవి టపామని తెగినప్పుడు రీజన్ చస్తుంది. ప్యూర్ ఫిక్షన్ వస్తుంది. ఆవిడ డబ్బు చేసుకోడానికే ఇంతటి పాతకానికి ఒడిగట్టిందంటు న్నారు. లక్షా ఇరవైవేల పౌండ్లు అప్పులో పడి మరీ ఎన్.డి.టి.వి.కి ఉచితంగా పైసా తీసుకోకుండా ప్రసారానికిచ్చింది! అన్నట్టు మీకు తెలుగుసరిగ్గా రాదని కొన్ని ఇంగ్లీషు పదాలు రాశారు. మేమందరం అంతే. అచ్చు మీలాగే బ్రిటీష్ బానిసలుగా పుట్టాం. అయినా ఒక సృజనాత్మక జర్నలిస్టును ‘షటప్’ అన్నా సరే మిమ్మల్ని మెకాలే వింగ్లిష్లో ‘గెటౌట్’ అనలేం. కారణం మీకున్న సమా చారం, నాలెడ్జి తెలుసు. ఇంత తెలిసివుండీ ఈ గుణమేం టోననుకుంటాం. ఇలాంటి బోలు వాదనలు చేసినా, మూర్ఖపు రాతలు రాసినా గౌరవం చావట్లేదు. కనికరమే గాని కసి కలుగుట లేదు. ఎడ్మిరేషన్తో... (అప్పుడు మీ నవలకి ముఖచిత్రం గీసిచ్చి, మీ ముచ్చట చూసి సరదా పడ్డ వెర్రి ఆర్టిస్టును, జర్నలిస్టును) - వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు మొబైల్ : 7702841384 - మోహన్ -
అపశ్రుతి అవసరమా?
నోబెల్ బహుమతిని పుచ్చుకున్నప్పుడు మదర్ థెరిస్సాని అడిగారట: ప్రపంచ శాంతి కోసం ఏం చెయ్యాలి? ఆమె సమాధానం: ‘‘మీ యింటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి!!’’ ప్రేమ మీ పక్కన ఉన్న వ్యక్తితో పంచుకోవడంతో ప్రారంభంకావాలి. నేను నూటికి నూరుపాళ్లూ హిందువును. సరిగ్గా 67 సంవ త్సరాల కిందట కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ స్కూలు (సీబీ ఎం హైస్కూలు, విశాఖప ట్నం)లో చదువుకున్నాను. మాకు బైబిలు చెప్పే టీచరు పేరు ఇప్పటికీ గుర్తుంది - దైవాదీనం మేష్టారు. రోజూ ప్రార్థనలు చేసేవాళ్లం. ‘ఏసు హల్లెలూయ, హోసన్న రాజు గెల్చిలేచివచ్చెన్’ పాడిన గుర్తు. ఒక యాత్రికుడుగా వాటికన్కి వెళ్లాను. వారణాశికి ఇద్దరిని చూడటానికే వెళ్లాను. కాశీవిశ్వేశ్వరుడు. బిస్మిల్లాఖాన్. ఆయన ఇంటికి వెదుక్కుని వెళ్లి నేనూ మావిడా పాదాభివందనం చేశాం. మా కుటుంబ పురోహితుడు గోరంట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మాకు ఫొటోలు తీశారు. నాకు మతమౌఢ్యం లేదని నిరూపించుకోడానికే ఈ సాక్ష్యాలు. ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్గారు మదర్ థెరిస్సా లక్ష్యం మత మార్పిడిని ప్రోత్సహించడమేన న్నారు ఈ మధ్య. ఇది బొత్తిగా అనౌచిత్యం. అనావ శ్యకం. కొందరు మహానుభావుల సేవల్ని ‘మతం’ స్థాయికి దిగజార్చడం అన్యాయం. తనది కాని దేశంలో తను ఎరగని కుష్టురోగుల కురుపుల్ని శుభ్రం చేసి, కట్లు కట్టి, హెచ్ఐవీ రోగుల అవసానానికి ఉపశమనాన్ని కల్పించి, గుడ్డివాళ్లకి, నిరా శ్రయులకి, వృద్ధులకి, తాగుబోతులకి, పేదలకి, వర దల్లో, కరువుల్లో నిరాశ్రయులయిన వారికి, అభం శుభం తెలియని పుట్టురోగులకీ-ప్రేమనీ, ఆదరణనీ పంచిన ‘అమ్మ’-450 దేశాలకు ఈ సేవలను విస్తరించింది. రాజకీయ సిద్ధాంతాలు, కులాలకు అతీతంగా అమ్మని ప్రపంచం అక్కున చేర్చుకుంది. కలకత్తాలో కమ్యూనిస్టుల ఊరేగింపు జరుగుతున్నప్పుడు, అమ్మ అటునుంచి వెళ్తూంటే కమ్యూనిస్టు కార్యకర్తలు ఊరేగిం పులోంచి బయటకి వచ్చి ఆమె పాదాలకు నమస్కరించి మళ్లీ ఊరేగింపులో చేరడం సామాన్యమైన దృశ్యం. మానవత్వానికి సిద్ధాంతపరమైన ఎల్లలు లేవని నిరూ పణ అయిన అరుదయిన సందర్భమది. ఒకరోజు మదర్కు రోడ్డు మీద ఒక ముష్టివాడు తారసపడ్డాడు. ‘‘ప్రతీవారూ నీకేదో యిస్తారమ్మా. ఇవా ళ నేనూ యిస్తాను. నాకున్నదంతా యిస్తాను’’ అన్నా డు. ఏమిటది? ఆ రోజు అతని చేతిలో ఓ చిన్న నాణెం పడింది. ‘‘పేదలకు ఇవ్వండి మదర్’’ అంటూ ఆమె చేతిలో పెట్టాడు. మదర్ చలించిపోయింది. పక్కన ఉన్న సిస్టర్తో అంది. ‘‘ఈ రోజు ఈ ముష్టివాడు నాకు నోబెల్ బహుమతికన్న గొప్ప బహుమతిని యిచ్చాడు. ఎందు కంటే తనకున్నదంతా సమర్పించుకున్నాడు. ఈ రాత్రి అతనికి ఈ నాణెం తప్ప మరేదీ ఎవరూ యిచ్చి వుం డరు. ఆకలితో నిద్రపోయి ఉంటాడు. సాటి పేదవాడి ఆకలిని తీర్చడానికి తను ఆకలిని ఆహ్వానించడం ఈ లోకంలో గొప్ప త్యాగం’’. ఓసారి పన్నెండుమంది అంగవైకల్యం ఉన్న -స్పాస్టిక్ పసివారిని ఆమె దత్తత తీసుకున్నారు. తామే మిటో, తమ లోపమేమిటో తెలియని నిస్సహాయులు ఆ బిడ్డలు. వరసగా కూర్చున్న అందర్నీ బుగ్గలు నిమిరి అక్కున చేర్చుకున్న ఆ తల్లిని టీవీలో చూస్తూ నేను ఏడ్చేశాను. ఓ ప్రేమమూర్తి ఆదరణ వారికి దక్కిందని ఆ పసివారికి తెలియదు. ఈ ప్రపంచంలో తాము సేద దీర్చుకోగల స్థలం మరొకటి లేదని వారికి తెలీదు. ప్రేమ ఎదుటి వారికి ఎరుక పరిచి పంచే ఆనందం కాదు. ఎదుటి వ్యక్తి ప్రమేయం లేకుండా ఆవరించే ఆర్ద్రత. ఇంకా అపూర్వమైన అనూహ్యమైన సంఘటన. 1982లో ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా గెరిల్లాలు ఒకరి నొకరు మారణహోమం చేసుకుంటూంటే అమ్మ రెండు పక్షాల మధ్య ధైర్యంగా నిలిచి బాంబులతో కుప్పకూలిన ఓ ఆసుపత్రిలో యిరుక్కున్న 37 మంది పసివారిని కాపా డి బయటకు తెచ్చారు. మత మౌఢ్యంతో నిప్పులు కక్కి, ఒకరినొకరు చంపుకునే రెండు దేశాల శక్తులు ఓ మాన వత్వపు మధ్యవర్తిత్వానికి తలవంచిన అపూర్వమైన క్షణమది. నోబెల్ బహుమతిని పుచ్చుకున్నప్పుడు ఆవిడని అడిగారట: ప్రపంచ శాంతిని వర్ధిల్లజేయాలంటే ఏం చెయ్యాలి? ఆమె సమాధానం: ‘‘మీ యింటికి వెళ్లి మీ కుటుం బాన్ని ప్రేమించండి!!’’ ప్రేమ మీ సమక్షంలో మీ పక్కన ఉన్న వ్యక్తితో పంచుకోవడంతో ప్రారంభం కావాలి. ఓ గొప్ప సత్యాన్ని జీవితమంతా ఆచరించి నిరూపించిన తల్లి ఆమె. భారతరత్న. నోబెల్ బహుమతి గ్రహీత. ప్రపంచంలో ప్రతీ దేశం తమ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి తన కృతజ్ఞతను తెలుపుకుంది. కన్నీరు అంతర్జాతీయ భాష. మతం దాన్ని అన్వ యించే ప్రాంతీయమైన వైద్యం. ప్రపంచంలో సర్వాంత ర్యామియైన దుఃఖానికి అంతే విస్తృతమైన చికిత్సను చేసిన ఒకే ఒక దేవదూత మదర్. కాగా, మానవత్వానికి మతం లేదు. మానవ సేవకు మతం లేదు. మహనీ యతకు మతం లేదు. - గొల్లపూడి మారుతీరావు -
ఇక రాహుల్కి సెలవు
కనీసం ఆరేళ్ల సెలవుని వారి అమ్మ మంజూరు చేయాలని, వారు ఈ ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకుని- మంచి ప్రణాళికలని ఇటలీలో రూపుదిద్ది మళ్లీ ఇండియా వచ్చి ఉద్యోగంలో చేరాలని మనవి చేస్తున్నాను. ఈ మధ్య ఢిల్లీలోను, అంత కు ముందు ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలలో సోదికి లేకుండా పో యిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఎట్టకే లకు ఒక గొప్ప నిర్ణ యాన్ని తీసుకున్నా రు. అసలు పార్టీకి ఈ గతి ఎందుకు పట్టింది అనే విషయం మీద వారు దీర్ఘాలోచన జరిపి, ఏం చేస్తే మళ్లీ పార్టీ పునరుద్ధరింపబడుతుందో కొన్ని వారాల పాటు ఏకాంతంగా ఆలోచించి ఒక సమగ్రమైన పథకాన్ని రూపొందించుకోద లుచుకున్నారు. వేసవికాలంలో ఢిల్లీలో ఎండలు మండిస్తాయి కనుక, వారు ఏ స్విట్జర్లాండ్కో, ఇటలీకో వెళ్లి ఈ ఆలోచనలు చేస్తారు. అందుకు వారు కాంగ్రెస్ అధ్యక్షురాలు - అంటే వాళ్ల అమ్మ దగ్గర కొన్ని వారాలు సెలవు కోరారు. అయితే ఈ సెలవు వెనుక గొప్ప ఉద్దేశం ఉంది. రేపు బ్యాంకాక్లో వారు స్వేచ్ఛా విహారం చేస్తూండగా ఎవరైనా పాత్రికేయుడు తారసపడి ‘ఏం సార్! ఢిల్లీలో మీ పార్టీ తుడిచి పెట్టుకుపోవడానికి కారణాలేమిటి?’ అని ప్రశ్నిస్తే రాహుల్ గారు ‘క్షమించండి! నేను ప్రస్తుతం లీవులో ఉన్నాను’ అని ధైర్యంగా చెప్పగలరు- వారి లీవ్ లెటర్ మీద వారి అమ్మ అంగీకార ముద్ర ఉంది కనుక. నేను 56 సంవత్సరాలుగా పాత్రికేయుడిగా ఉన్నాను. నాకు తెలిసి ఓ పార్టీ నాయకుడు ఆ పార్టీ పూర్తిగా నేల మట్టమయిపోయిన తర్వాత ఇలా సెలవు తీసుకోవడం ప్రపంచ చరిత్రలో ఎన్నడూ వినలేదు. ఢిల్లీలో పళ్లూడినప్పటి నుంచీ ఇదే విషయాన్ని తల చుకుంటూ - ఉదయం పళ్లు తోముకుంటున్నప్పుడో (పళ్లూడిన విషయం అప్పుడే కదా గుర్తుకొచ్చేది!), డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నప్పుడో అమ్మ గారికి విషయం చెప్పి ఉంటారు. ఇదీ తల్లీకొడుకుల దేశ భక్తికి నిదర్శనం. ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో మహాత్మాగాంధీ ఆరు నెలలు ఆరోగ్య కారణాలకి సెలవు తీసుకోలేదు. వారి ముత్తాతగారు, తాతగారు, నాయనమ్మగారూ ఇలా సెలవు తీసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే వారికి ‘సమాజ సేవ’ పార్ట్ టైం ఉద్యోగం కాదు కనుక. ఇప్పుడ యితే మన నాయకులకు రాజకీయాలు కోట్లు పెట్టుబడి పెట్టే వ్యాపారమయిపోయిందికాని, ఆ తరం నాయ కులు రాజకీయాలని ఉద్యోగాలుగా చేసుకోలేదు. నిజానికి ఈ మధ్య ఏడెనిమిది నెలలుగా రాహుల్ గారు అనధికారికంగా సెలవుల్లోనే ఉన్నారు. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, కశ్మీర్, ఢిల్లీ ఎన్నికలలో వారు గెస్టు పాత్రనే ధరించారు. ప్రధాని మన్మోహన్సింగ్కి ఇచ్చిన వీడ్కోలు సభకి గైర్హాజరయ్యారు. ఆఖరికి 130 సంవత్సరాల కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవానికి పార్టీ ఉపాధ్యక్షులు కనిపించలేదు. భూసేకరణ చట్టాన్ని బలంగా ఎదుర్కొంటానని సభలో జబ్బలు చరుచుకున్న రాహుల్గారు పార్లమెంట్ సమావేశానికే రాక సెలవులో తెలియని దేశానికి నిష్ర్కమించారు. ఇది అమేథి ఓటర్లు తమ నాయకుడిని చూసి గర్వపడే సందర్భం. తమ పార్టీని ఓటరు ఎందుకు గద్దెదించాడో తెలు సుకోవడానికి రాహుల్ హిమాలయాలకు వెళ్లనక్కర లేదు. స్విట్జర్లాండ్ వసతిగృహాల్లో తపస్సు చేయనక్కర లేదు. బోధివృక్షం కింద సమాధిలో కూర్చోన క్కరలేదు. చాందినీ చౌక్లో చెనా బఠోరా అమ్ముకునే సాదాసీదా మనిషితో ఒక్కసారి మాట్లాడితే మొహం వాచేలా చెప్పగలడు. అమ లాపురంలో, అనకాపల్లిలో, ఆమదాలవలస లో, చిత్తూరులో, చీపురుపల్లిలో వారికి రోడ్డు మీద తారసపడ్డ మొదటి వ్యక్తి పూసగుచ్చినట్టు సమాధానం చెప్పగలడు. వారు అడగాల్సింది ఒకే ఒక్క ప్రశ్న. ‘ఎందుకు బాబూ మమ్మల్ని గద్దె దించారు?’ అని. భారతదేశంలో వారికి ఇష్టం వచ్చిన రాష్ట్రంలో కనిపించిన ఏ మని షైనా చెప్పగలడు. లేదా ఈ ఒక్క ప్రశ్నని పత్రి కల్లో ప్రకటిస్తే కొన్ని కోట్ల సమాధానాలు అందుతాయి. నాది మరొక చిన్న ప్రతిపాదన. దేశంలో జరిగిన రాజకీయ పరిణామాలకి కారణాలను వెదకడానికి, కనీసం ఆరేళ్ల సెలవుని వారి అమ్మ మంజూరు చేయా లని, వారు ఈ ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకుని- మంచి ప్రణాళికలని ఇటలీలో రూపుదిద్ది మళ్లీ ఇండియా వచ్చి ఉద్యోగంలో చేరాలని మనవి చేస్తున్నాను. రాహుల్గాంధీగారి సెలవు ఈ దేశానికి శుభసూచకం. కొందరు తాము ఉన్నచోట ఆనందాన్ని కలిగిస్తారు. కొందరు తాము లేని చోట ఆనందాన్ని కలిగిస్తారు. ఆ రెండో కేటగిరీకి చెందిన నేటితరం మహానాయకులు రాహుల్గాంధీగారు. 44 ఏళ్ల యువకుడు-అయిదోతరం నాయకత్వానికి - కాళ్లు చల్లబడగా- ప్రజా సంక్షేమం అనే ఉద్యోగానికి కొన్ని వారాల సెలవు తీసుకోవడం ఈ తరం రాజకీయ రంగంలో పెద్ద జోక్. -
'బాస రసాబాస’
‘సాక్షి’ వ్యాసాలను అజరామరం చేసిన పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ఆరోజుల్లోనే తమ పిల్లలకు తెలుగు రాదని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రుల వ్యవస్థను ఊహించారు. దాదాపు యాభై సంవత్స రాల కిందట నవ్య సాహితీ సమితి వ్యవస్థాపకులు, ప్రము ఖ కవి తల్లావఝుల శివశం కరస్వామిని ఒకే ఒక్కసారి అనకాపల్లిలో కలిశాను. నన్ను పరిచయం చేయగానే ఆయన ‘‘మీ పేరులోనే వ్యాకరణ దోషం ఉందేమిటి? ‘మారుతీ రావు’ అంటారెందుకని?’’ అన్నారు. నేను నవ్వి ‘‘అభి మానులు నా పేరును అలా సాగదీశారు’’ అన్నాను - కేవలం చమత్కారానికే. ‘మారుతీరావు’ తప్పు. ‘మారు తిరావు’ అని ఉండాలి. ఏ తరానికాతరం భాష తగలడిపోతోందనుకోవ డం రివాజు. తగలడిపోవడమూ రివాజే. అప్పుడెప్పుడో విశ్వనాథ సత్యనారాయణగారు ‘‘నా మాతృభాష నానా దుష్ట భాషల యౌద్ధత్యమును దలనవధరించి...’’ అని వాపోతూ ‘ఏమి మిగిలినదీనాటికిట్లు పొంగులొలయు వర్షానదీగభీరోదకముల దైన్య గర్భ చారిత్రముల్ దక్క!’ (ఆంధ్రప్రశస్తి) అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మరో మహాకవి కాళోజీ ‘‘అన్య భాషలు నేర్చి ఆంధ్రం బు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!’’ అని హూంకరించారు. ఈ మధ్య లోక్నాయక్ ఫౌండేషన్ సభలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ప్రసంగిస్తూ, ‘‘ఏ రోజు దినపత్రిక తీసినా 50 శాతం సంకరభాష కనిపి స్తుంద’’న్నారు. రాష్ట్రాలు విడిపోయి ‘‘ప్రాంతీయ భాష మా హక్కు, దాన్ని మెరుగు పరచి ప్రామాణిక వ్యాకరణాన్ని ఏర్పరచాలి’’ అని ఈ మధ్య గొంతులు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ భాషా సౌందర్యం ఆ భాష పలుకుబడిలో దశాబ్దాలు ప్రజల నోళ్లలో నలిగి నలిగి సంతరించుకు న్నది. గండశిల సాలగ్రామమయినప్పటి సౌందర్యమది. మిత్రుడు కోట, తనికెళ్ల భరణి తెలంగాణ మాండలికం మాట్లాడితే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. రావిశాస్త్రి, పతంజలి కథలు ఉత్తరాంధ్ర భాషలో బలాన్నీ, జవాన్నీ పుణికి పుచ్చుకున్నాయి. కృష్ణాజిల్లా భాష సౌందర్యాన్ని గుర్తుపట్టాలంటే - నా మట్టుకు 50 సంవత్సరాల కిం దటి మాధవపెద్ది గోఖలే ‘మూగజీవాలు’ చదవాల్సిందే. భాష పరిణామానికీ, నిగ్గు తేలిన నిసర్గ సౌందర్యానికీ ఇవి ఉదాహరణలు. మళ్లీ దీనికి వ్యాకరణమేమిటి? ప్రామాణిక భాషకు వ్యాకరణం కాని, వ్యావహారిక భాషకు కాదుగదా! ఈ ప్రశ్న వెంటే మనసులో మెరిసే మెరుపు ఒక టుంది. లిపిలేని ఒక గిరిజన సవర భాషకు 1931లోనే రూపాన్నీ, వ్యాకరణాన్నీ సృష్టించి; సమగ్రమైన నిఘం టువును రూపొందించిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తిగారిని ఎలా మరిచిపోగలం? అయితే పలుకు బడిలో నలిగి రూపు దిద్దుకున్న సౌందర్యానికీ, అజ్ఞా నంతో మిడి మిడి జ్ఞానంతో గబ్బు పట్టించే ప్రయ త్నానికీ చాలా తేడా ఉంది. విశ్వనాథ వారు, కాళోజీ, చలమేశ్వర్ గారు వాపోయినదదే. భాష సంకరానికి ప్రథమ తాంబూలం- టీవీ చానళ్లు. ఇప్పుడిప్పుడే టీవీ ధర్మమా అని సినీమా రెండో స్థానానికి వెళ్లింది. ‘పెల్లి’, ‘మల్లి’, ‘వెల్లారు’ ‘చేసారు’- ఇలాంటివన్నీ కోకొల్లలు. ఇక - బాధ్యతగల చానళ్లలోనే ‘తెలుగేతర’, ‘తెప్పోత్సవం’, ‘హృదయనొప్పి’, ‘అశ్రు తాంజలి’ వంటి బూతుమాటలు సమృద్ధిగానే వినిపి స్తున్నాయి. ‘అశ్రువు’ అంటే కన్నీరు. ‘అశ్రుత’ అంటే ‘విననిది’ అని అర్థం. బొత్తిగా అర్థం లేని మాట. ‘తెలి యకపోవడం’ లోపం. ‘తెలుసుకొనే’ ప్రయత్నం చేయ కపోవడం -నేరం. 1913లో - అంటే వంద సంవత్సరాల క్రిందట ఒక ప్రక్రియ - ‘సాక్షి’ వ్యాసాలను అజరామరం చేసిన పాను గంటి లక్ష్మీనరసింహారావుగారు ఆరోజుల్లోనే తమ పిల్ల లకు తెలుగు రాదని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రుల వ్యవస్థను ఊహించారు. ఈరోజుల్లో ‘‘మా వాడికి తెలుగుభాష రాద’’ని చెప్పుకోవడం ఫ్యాషన్. మనకీ రాకపోవడం అభివృద్ధి. ఒక్క తెలుగు పద్యమయినా చదవలేక పోవడం - దురదృష్టమని కూడా అనుకోని దశలో మనం ఉన్నాం. తెలుగు కథ, వ్యాసం, నాటకం పనికిరాని వ్యాసంగమని ‘‘కూడూ గుడ్డా పెట్టవని’’ సాధించే తరంలో ప్రతిఘట నను తట్టుకుని నేను తెలుగు రచయితనయ్యాను. ఇవాళ బోలెడన్ని చానల్స్, పత్రికలు, వ్యాసంగాలు ఉన్న నేపథ్యంలో భాషకి మరింత ఉపకారం జరగాలి. ఇవాళ భాష చాలామందికి ఉపాధిని ఇస్తోంది. కాని భాషకి ఉపకారం జరుగుతోందా? తెలుగు వాక్యం ఎలా మాట్లాడాలో తెలియని వారికి మైకులు అంది, తెలుగులో ప్రాథమికమయిన అవగాహన కూడా లేనివారికి పత్రికల్లో స్థానం లభించి, తెలుగు మాట్లాడడం కూడా రాని షోకిల్లా ఆడపిల్లలు - కేవలం మొహాల కారణంగా మనకి అపభ్రంశాన్ని అను నిత్యం డ్రాయింగ్ రూముల్లోకి పంచుతున్న నేపథ్యం లో- తెలిసి తెలిసి జరిగే ఈ అరాచకాన్ని ఎవరు ఆపు తారు? ఈ పిల్లి మెడలో ఎవరు గంట కడతారు? జీవన కాలమ్: గొల్లపూడి మారుతీరావు -
'ఏమయ్యా! ఇవాళ టిఫిన్ ఎక్కువయిందా?'
జగపతి గెస్ట్హౌస్లో షూటింగ్. మేనేజర్ హుస్సేన్ వచ్చి ‘లంచ్కి ఏం కావాలి?’ అని అడిగారు. నేను మేకప్ చేసుకుంటున్నాను. నవ్వి, ‘నేను ఈ సినీమాకి హీరోని. హోటల్ చోళా నుంచి ఫలానా ఐటమ్స్ తెప్పించండి!’ అన్నాను. ఆ రోజుల్లో ‘జగపతి’ సంస్థ అంటే మాకందరికీ పెద్ద గ్లామరు. కారణం.. మంచి జనాదరణ పొందిన చిత్రాలను నిర్మించడం. అంతకుమించి నిర్మాత రాజేంద్రప్రసాద్ గారి పెద్ద మనస్సు, ఆదరణ, ఔదార్యాన్ని గురించి కథలుగా చెప్పుకునే వారు. ఆయన గురించి పొల్లుగా మాట్లాడిన ఒక్కరినీ నేను చూడలేదు. నేను ముమ్మరంగా సినీమాలు చేస్తున్న రోజుల్లో రాజేంద్రప్రసాద్ గారు పిలిపించారు. ఆయన మాట లివి: ‘నేను బాగా చితికిపోయాను. ఏం ఇమ్మంటారు?’ అని. నా సమాధానం గుర్తుంది. ‘మీ నోటి వెంట ఆ మాట రాకూడదు. మీ సంస్థలో చేయడం మంచి అవకా శం. మీరేమనుకుంటే అది చెయ్యండి’’ అన్నాను. ఏదో అంకె చెప్పారు. ‘ఎస్.పి. భయంకర్’ చిత్రం. నా ఆడ వేషానికీ, ‘ఆజా దేఖో మజా’ అనే ఖవ్వాలీ (నేనూ, అక్కి నేని చేసిన డ్యాన్స్)కీ ఆయన తీసుకున్న శ్రద్ధ ఆశ్చర్య కరం. వేషంలో నన్ను చూసి అక్కినేని, ‘మీరు నా కెరీ ర్లో 53వ హీరోయిన్’ అన్నారు. సినీమా అయిపోయింది. రేపు రిలీజనగా మేనేజర్ హుస్సేన్ మా ఇంటికి వచ్చి ‘ప్రొడ్యూసర్గారు ఇమ్మన్నారు’ అంటూ ఒక కవరు కిటికీ దగ్గర పెట్టి వెళ్లిపోయారు. అది అప్పుడు నేను తీసుకుంటున్న, నేను చెప్పని పైకం బ్యాలన్స్. అదీ ఆయన వితరణ. రాజేంద్రప్రసాద్గారు సినీమాల్లో నటించడానికి వచ్చారు మొదట్లో. కాని అనుకోని రెండు గొప్ప ప్రక్రియ లను చేపట్టారు - నిర్మాణం, దర్శకత్వం. ఆయన అక్కి నేని వీరాభిమాని. అంతకు ముందే ఆ కుటుంబాలకు సాన్నిహిత్యం ఉంది. నిర్మాత అయ్యాక అక్కినేనిని మొదటి సినీమా చేయమంటే ‘నేను నటించి నిన్ను చెడగొట్టను’ అన్నారట. జగ్గయ్య ప్రధాన పాత్రగా ‘అన్న పూర్ణ’ తీశారు. తర్వాత అన్ని చిత్రాలకు అక్కినేని హీరో. ఆయనంటే ఎంత అభిమానమంటే- ఏదయినా రిస్క్ తీసుకునే షాట్ చేయాలంటే- ముందు తను చేసి ఆయన్ని పిలిచేవారు. ఆయన అజాతశత్రువు. ఎవరినయినా కోపగించగా ఎవరూ చూసి ఉండరు. ఓసారి సెట్ మీద ఏదో విసుగు దలతో ‘ఏమయ్యా! ఇవాళ టిఫిన్ ఎక్కువయిందా?’ అని ఎవరితోనో అన్నారు. నా పక్కన ఉన్న అక్కినేని నవ్వి, ‘బహుశా బాబు జీవితంలో కోపంగా అన్నమాట ఇదేనేమో!’ అన్నారు. తనతో పనిచేసిన సిబ్బంది సంక్షే మానికి ప్రత్యేకంగా ఒక సినీమా తీసిన ఒకే ఒక్క నిర్మాత రాజేంద్రప్రసాద్గారు. ఆయన చిత్రాలలో పాటలు చాలా పాపులర్. పాట లన్నీ కలిపి గొలుసు చిత్రంగా తయారుచేశారు. దాని పేరు ‘చిటపట చినుకులు’. పాటలని అతికించే చిన్న సన్నివేశాలకి నటులు కావాలి. నన్నూ, రమాప్రభనీ ఎంపిక చేశారు. అంటే ఆ చిత్రానికి నేను హీరో. జగపతి గెస్ట్హౌస్లో షూటింగ్. మేనేజర్ హుస్సేన్ వచ్చి ‘లం చ్కి ఏం కావాలి?’ అని అడిగారు. నేను మేకప్ చేసుకుం టున్నాను. నవ్వి, ‘నేను ఈ సినీమాకి హీరోని. హోటల్ చోళా నుంచి ఫలానా ఐటమ్స్ తెప్పించండి!’ అన్నాను. నా పక్కన మేకప్ చేసుకుంటున్న రమాప్రభ నన్ను చేత్తో పొడిచింది కళ్లెగరేస్తూ. తీరా వెనక్కి చూస్తే రాజేంద్ర ప్రసాద్గారు కనిపించారు. సిగ్గుపడిపోయాను. ఆ రోజు లంచ్కి చోళా నుంచి నాకూ, రమాప్రభకీ పెద్ద పెద్ద పార్శిళ్లు వచ్చాయి. జగపతిబాబు నటించిన మొదటి చిత్రానికి (సింహ స్వప్నం) నేను విలన్ని. వి. మధుసూదనరావుగారు దర్శకులు. ఆయన తీసిన ‘భార్యాభర్తల అనుబంధం’ సినీమాలో నేను నటిస్తే, మా అబ్బాయి శ్రీనివాస్ ఆయన దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్గా పనిచేశాడు. మా గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండేషన్ కార్యక్రమానికి శివాజీ గణేశన్గారిని పిలవాలని కోరిక. శివాజీగారు జగపతిలో పనిచేశారు. ఆయనకి ఫోన్ చేశాను. నన్ను స్వయంగా వెంటబెట్టుకుని శివాజీ గారింటికి తీసుకెళ్లారు. అదే నేను శివాజీగారిని కలవడం, ఇంటికెళ్లడం. ‘ఏమాత్రం వీలున్నా వస్తాను రాజా’ అన్నారు శివాజీ. ‘రాజా’ అన్న పిలుపులో శివాజీకి ఆయన పట్ల ఉన్న అభిమానం, ఆత్మీయతా పెల్లుబికింది. ఈమధ్య బి. నాగిరెడ్డిగారి స్మారక పురస్కార సభకి ప్రధాన అతిథిగా వచ్చారు. ఆయాసపడుతున్నారు. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ‘ఎలా ఉన్నారు?’ అని పలకరించాను. ‘బాగులేను. నా ఆస్త్మా తెలుసుకదా! ఇంక పైకి వెళ్లిపోవడమే’ అన్నారు. చివరి రోజుల్లో పూర్తిగా అంతర్ముఖులై ఫిలిం నగర్లో ఆలయ సముదాయాన్ని ఉద్ధరించే పనిలో నిమగ్నమయిపోయారు. మనస్సులో ఉన్న ఉదాత్తత పండి పరిపక్వతకు వచ్చిన దశ అది. తెలుగు సినీమా రంగంలో జగపతి ఓ చరిత్ర. రాజేంద్రప్రసాద్గారు అభిరుచికీ, అభినివేశానికీ, ఆదర ణకీ, ఔదార్యానికీ అరుదయిన ప్రతీక. -
అంతులేని ‘కథకుడు’
కొందరికి వృత్తి ఉపాధి. కొందరికి ఊపిరి. మరికొందరికి అంతఃచేతన. ఆఖరి రోజుల్లో అపస్మారకంలో ఉండిపోయారు. స్పృహలేదు. అయినా మధ్యలో ఆయన పెదాలు ‘లైట్స్’,‘కెమెరా’, ‘స్టార్ట్ ’ అన్నాయట. బాలచందర్ ఒడుపు కథ. నాటకం పెట్టుబడి. వ్యూహం కథనం. వాటిలో అంతర్భాగమయిన ప్రతి ఒక్కరూ మణిపూసలయ్యారు. సినీమా బలహీనత నాటకం. కాని ఆనాటి ఫాల్కే ‘హరిశ్చంద్ర’ నుంచి, తొలినాటి పుల్ల య్యగారి ‘భక్త ప్రహ్లాద’ దగ్గర్నుంచి నేటి వరకు ఆ బలహీనత సామాన్యగుణంగా భార తీయ సినీమాలో రాజ్య మేలు తూవచ్చింది. కాని ఐదు దశా బ్దాల పాటు ‘నాటకీయత’నే సినీమాకి బలమూ, అలంకారమూ, ఆకర్షణా చేసి - వెండితెర మీద అపూర్వమైన నాటకాలను రచించిన వెండితెర మేస్త్రి కె. బాలచందర్. 76 సంవత్సరాల కిందట తంజావూరు జిల్లా నల్లమాంగుడి అనే గ్రామంలో 8 ఏళ్ల కుర్రాడికి నాటకం ఊపిరి. ఊరి మధ్య అరుగు మీద నాటకం వేస్తూంటే వాళ్ల నాన్నకి తెలిసి, నాటకం మధ్యలో స్టేజీ మీదకి వచ్చి కొడుకుని చెవి పట్టుకు తీసుకుపోయి ఇంట్లో చావ గొట్టాడు. అయితే ఆ వ్యసనం కారణంగానే ఆ కుర్రాడు తర్వాతి జీవితంలో 9 జాతీయ బహుమతులూ, 13 ఫిలింఫేర్ అవార్డులు, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, కళైమామణి, ఏఎన్నార్ అవార్డు పుచ్చుకుని భారతదేశంలో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదిం చుకుంటాడని ఆయనకి తెలీదు. 19 ఏళ్లకి ఆయన ఊళ్లో బడిపంతులయ్యాడు. తర్వాత ఎకౌటెంట్ జనరల్ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం. అప్పుడే ఒక నాటక సమాజాన్ని ఏర్పరు చుకుని మొట్టమొదటి నాటకం ‘మేజర్ చంద్రకాంత్’, రచన, ప్రదర్శన. దరిమిలాను సుందరరాజన్ అనే నటుడు సినీమాలో ఆ పాత్ర వేసి ‘మేజర్’ని ఇంటిపేరు చేసుకున్నాడు. ఓ పేరులేని దర్శకుడు ‘ధాయ్ పిరందాళ్ వళి పిరుక్కుం’ (ఆషాఢమాసం వస్తే దారి అదే దొరు కుతుంది) అనే సినీమా తీసి, అనుకోకుండా బోలెడు డబ్బు సంపాదించి, బాలచందర్ ‘నీర్ కుమిళి’ అనే నాటకాన్ని చూసి, దాన్ని సినీమాగా తీయా లనుకున్నాడు. బాలచందర్నే దర్శకత్వం వహిం చమన్నాడు. నాకు చాతకాదని వచ్చేశాడు బాలచందర్. తోటి నటులు తిట్టి అతనికి నమ్మకం లేని వ్యాసంగం లోకి అతన్ని తోశారు. అలా మొదటి సినీమాకి దర్శకుడయ్యారు. నా ‘కళ్లు’ నాటిక మీద ఇండియన్ ఎక్స్ప్రెస్లో చిన్న సమీక్ష చదివి దర్శకుడు ఎస్.డి. లాల్ ద్వారా నాకు కబురు పంపారు. నేను కథ చెప్తే పొంగిపోయి నాటిక హక్కులు కొని చిత్ర నిర్మాణానికి ఉపక్రమించారు. పేరు ‘ఊమై విళిగళ్’ (మూగకళ్లు). జయసుధ, జయశంకర్ నటీనటులు. తీరా నాలుగు రీళ్లు తీశాక నిర్మాణం నిలిచి పోయింది. సంవత్సరం తర్వాత ఇద్దరం పామ్గ్రోవ్ హోటల్లో కలిశాం. ‘ఆపేశారేం సార్?’ అనడిగాను. ‘నాటికలో మీరు సూచించిన సింబల్ తెర మీద విస్తృతిలో పల్చబడుతోంది. నచ్చక ఆపేశాను’ అన్నారు. ఒక గొప్ప దర్శకుడి కళాత్మకమయిన నిజాయితీకి ఇది నిదర్శనం. మా వాసూ పేరిట స్థాపించిన గొల్లపూడి శ్రీనివాస్ స్మారక సంస్థ ప్రారంభోత్సవ సభలో అక్కినేని, సునీల్ దత్, అపర్ణాసేన్, ఆదూర్ గోపాలకృష్ణన్తో పాటు బాలచందర్ ముఖ్య అతిథి. మాట్లాడుతూ, ‘‘విశాఖ సముద్రతీరంలో శ్రీనివాస్ మృతికి నా చేతులకూ రక్తం అంటిందేమో! సముద్రాన్ని ఆకర్షణీయంగా అలంకరిం చిన నేరం నాది’’ అంటూ ‘డ్యూయెట్’ సినీమా షూటింగ్ అక్కడ మొదలెట్టి వాసూ జ్ఞాపకంతో తీయలేక ఒకరోజు విరమించుకున్నారట. కారణాన్ని మీనాక్షీ శేషాద్రికి చెప్పారట. మరో పదేళ్ల తర్వాత హిందీ హీరో ఆమీర్ఖాన్ బహుమతినందుకుంటున్న సభకి వచ్చి ఆయన సినీమా ‘తారే జమీన్ పర్’లో కృషిని ప్రశంసిస్తే, ఆమీర్ఖాన్ పసివాడిలాగ కంటతడి పెట్టుకున్నాడు. వేదిక మీదే బాలచందర్ చేతిలో ప్రసంగ పాఠాన్ని లాక్కొని ‘‘నేను ముసలివాడినయ్యాక నా మనవలకి ఈ ప్రసంగం చదివి వినిపిస్తాను’’అంటూ, ‘‘మా అమ్మ ఈ సభలో ఉంటే ఎంతో సంతోషించేది’’ అన్నారు. కొందరికి వృత్తి ఉపాధి. కొందరికి ఊపిరి. మరికొం దరికి అంతఃచేతన. ఆఖరిరోజుల్లో అపస్మారకంలో ఉండి పోయారు. స్పృహలేదు. అయినా మధ్యలో ఆయన పెదాలు ‘లైట్స్’,‘కెమెరా’, ‘స్టార్ట్ ’ అన్నాయట. ఓ జీవితకాలం వెండితెరకి నాటకం రుచిని మప్పిన రుషి బాలచందర్. కథనీ, పాత్రలనీ, చిక్కగా కాచి వడపోసి అందులో పాత్రలయిన ప్రతి నటుడినీ ‘చరిత్ర’ ను చేసిన సృష్టికర్త. కమల్హాసన్, రజనీకాంత్, సరిత, మమ్ముట్టి, ప్రకాష్రాజ్, ఏఆర్ రెహమాన్- ఉదాహరణలు చాలు. బాలచందర్ ఒడుపు కథ. నాటకం పెట్టుబడి. వ్యూహం కథనం. వాటిలో అంతర్భాగమయిన ప్రతి ఒక్కరూ మణిపూసలయ్యారు. ఒక జీవితకాలంలో పట్టిందంతా బంగారం చేసి, తన సంతకాన్ని ప్రతి సృష్టి లోనూ నిలుపుకున్న దర్శక నిర్మాత- మరొక్కరే గుర్తు కొస్తారు నాకు- ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. అయితే వారి ధోర ణులు వేరు. భాషలు వేరు. ప్రేక్షకులు వేరు. కాని ఇద్దరూ ఆక్రమించుకున్న ఆకాశం ఒక్కటే. -
నాదయోగి జ్ఞాపకాలు
‘‘రేవతిరాగంలో ‘నానాటి బతుకు నాటకము’ కీర్తన బాణీని కూర్చిన ఒక్క అద్భుతానికే మీకు సంగీత కళానిధి ఇవ్వాల’’ని మురిసిపోతూ ఆయన దగ్గర ఆ పాట నేర్చుకున్నారు విదుషీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. కొందరు గొప్పతనాన్ని భుజకీర్తుల్లాగ అలంకరిం చుకుని ఊరేగుతుంటా రు. మరికొందరు మంచి నీళ్ల సెలలాగ వ్యాపించి, పలకరించిన వారికి దప్పి క తీరుస్తూ, హృదయంలో ‘చెమ్మ’ని ఆర్ద్రంగా పంచు తూ ప్రయాణం చేస్తూం టారు. అలాంటి రెండో కోవకు చెందిన మనుషుల్లో మొదటిస్థానంలో నిలిచేవారు నేదునూరి కృష్ణ మూర్తిగారు. ఆయన శ్రీపాద పినాకపాణిగారి వద్ద శిష్య రికం చేసేనాటికి (1951) నేను శ్రీపాద వారి అల్లుణ్ణి కాలేదు. పినాకపాణి గారి దగ్గర ఆయన 11 సంవ త్సరాలు గురుకులవాసం చేశారు. నిజానికి పినా కపాణి గారి ఇంట్లో, జీవితంలో ఆయన ఒక భాగమై పోయారు. ఇద్దరూ పాట పాడుకుంటూ విశాఖలో సైకిలు రిక్షా మీద బయలుదేరి, బాలాం బగారు (పినాకపాణిగారి సతీమణి) చెప్పిన ఆరు పనుల్లో తేలికగా రెండు మరచిపోయేవారట. ఏ ‘బెహాగో’, ‘కల్యాణో’ వారి జ్ఞాపకాలకు అడ్డు పడేది. పాణి గారు ఆయనకి కారు డ్రైవింగు కూడా నేర్పారు. పాణి కర్నూలులో పనిచేసే రోజుల్లో రాత్రి వేళల్లో ఇద్దరూ రెండు మంచాల మీద పడుకుని రాగాలలో రవ్వ సంగతులు, కొత్త మలుపులు, సంచారాలు చర్చించుకుంటూంటే టైము తెలిసేది కాదు. రైలు కట్ట దగ్గర పాణిగారి ఇల్లు. తెల్లవారు జామున 3 గంటలకి హైదరాబాదు-బెంగళూరు ఎక్స్ప్రెస్ తుంగభద్ర వంతెన మీద వెళ్తూ పెద్ద శబ్దం చేస్తే ఇద్దరూ తుళ్లిపడేవారు. ‘‘అబ్బో! మూడయిపోయిం దండీ!’’ అనుకుని నిద్రలోకి జారేవారు. పాణిగారికి క్రికెట్ అంటే ఇష్టం. 1958లో ఇండియా-వెస్ట్ ఇండీస్ క్రికెట్ మ్యాచ్కి కారులో హైదరాబాదు వెళ్తూ ‘‘ఈ ఐదు రోజులూ కర్నూలులో ఏం చేస్తారు? మాతో రండి!’’ అంటూ నేదునూరిగారినీ కారెక్కించుకున్నారు (స్టాండర్ట్ 555. ఆ కారు ఇప్పటికీ కర్నూలులో పిల్లల దగ్గర ఉంది). దారి పొడుగునా హైదరాబాదు వరకు సంగీత సాధన. క్రికెట్ గ్రౌండ్లో ఒక పక్క క్రికెట్ ఆట. మరొక పక్క క్రికెట్ స్టాండులోనే సంగీత సాధన. పాణిగారి జీవితంలో నేదునూరిగారు ఒక భాగం. నేదునూరి గారి జీవితమే పినాకపాణిగారు. ఆయన పెద్దబ్బా యికి గురువుగారి పేరే పెట్టుకున్నారు. గురువు గారిని తలుచుకుంటే ఆయనకి పరవశం. మనోధర్మానికి పెద్ద పీట వేసి, సంప్రదా యాన్ని అటూ ఇటూ బెసగనివ్వక అచ్చమయిన మేలిమి బంగారంగా నిలిపిన గొప్పతరం సైనికుడు నేదునూరి. సేనాధిపతి పినాకపాణిగారు. అయితే నేదునూరి ప్రత్యేకత ఏమిటంటే ఆయన ‘నాది గొప్ప సంప్రదాయం’ అనరు. ‘గొప్ప సంప్రదా యం అంటే ఇలా ఉండాలి’ అనిపిస్తారు. నేనంటే ఆయనకి అమితమైన గౌరవం, అభిమానం. రాజాలక్ష్మీ ఫౌండేషన్ ప్రత్యేక పురస్కా రాన్ని వారితో పాటే ఆ సంవత్సరం పుచ్చుకు న్నాను. గీతం విశ్వవిద్యాలయం ఆయనకి డాక్టరేట్ ఇచ్చి గౌరవించినప్పుడు కృతజ్ఞతాపూర్వక ప్రసం గం కోసం నా దగ్గరకి వచ్చారు. ఆలోచనలో, అభిప్రాయంలో, నిర్దుష్టమైన నిర్ణయంలో ఆయన ఎంత నిక్కచ్చి మనిషో ఆనాడు చూశాను. వాక్యం లో ఏ అందమైన మాటకీ లొంగరు - అది తన అభిప్రాయమైతే తప్ప. భాష తనదికాని ఆలోచనని అలంకరించకూడదు. ఈ ధోరణి ఆయన సంగీతా నికీ వర్తిస్తుంది. ‘‘రేవతిరాగంలో ‘నానాటి బతుకు నాటకము’ కీర్తన బాణీని కూర్చిన ఒక్క అద్భుతానికే మీకు సంగీత కళానిధి ఇవ్వాల’’ని మురిసిపోతూ ఆయన దగ్గర ఆ పాట నేర్చుకున్నారు విదుషీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. 55 సంవత్సరాలు వరస తప్పకుండా చెన్నైలో జరిగే డిసెంబరు సంగీతోత్సవాలలో మ్యూజిక్ అకాడమీ పిలుపున కచ్చేరీలు చేసి తమిళ రసికులను మెప్పించడం ఒక రికార్డు. ఆరోగ్యం బాగులేదని తెలిసి ఈ మధ్య వెళ్తే - అంత అనారోగ్యంలోనూ నన్ను గుమ్మందాకా వచ్చి సాగనంపారు, వద్దంటున్నా. నెల రోజుల కిందట వెళ్లినప్పుడు మరీ డీలాపడ్డారు. మాట సరిగా రావడం లేదు. నెమ్మదిగా మంచం మీద కూర్చుంటూ. ‘‘బాధపడుతూ బతకకూడదండీ!’’ అంటూ మంచం మీద వాలారు. నేను చూస్తుండగానే చిన్న నిద్ర పట్టింది. శరీరం ఆయన సంస్కారాన్ని లొంగదీసుకుంటున్న అరుదైన క్షణాలవి. మామూలు కుటుంబంలో పుట్టి, ఏమీ భేషజం లేని అపూర్వమైన విద్వత్తును ఆపోశన పట్టి, ఒక తరానికి మకుటాయమానంగా నిలిచి, సంగీతానికి తనదైన విలాసాన్నీ నిండుదనాన్నీ కల్తీలేని పవిత్రతనూ మప్పిన పెద్ద కన్సర్వేటివ్ నేదునూరి. - ఆయన జీవన్ముక్తుడు. గొల్లపూడి మారుతీరావు -
మృత్యుహేల
ఫాస్ట్ బౌలర్ 150 కి.మీ వేగంతో విసిరే బంతి సెకనులోపే 22 గజాలు ప్రయాణం చేస్తుంది. బంతి వేగానికి, మనిషి నిశిత దృష్టికి మధ్య క్షణంలో ఏర్పడిన తేడాయే హ్యూస్ని ఆటకూ, జీవితానికీ దూరం చేసింది. మృత్యువు ఆట. లేదా ఆటలో మృత్యువు. దాదాపు 300 ఏళ్ల కిందట ప్రముఖ బ్రిటిష్ రచయిత డేనియల్ డెఫో ‘‘మాన్ ఫ్రైడే’’ అనే నవల రాశాడు. సరిగ్గా 254 సంవత్స రాల తర్వాత ఆడ్రియన్ మిచల్ అనే నాటక రచయిత దీన్ని నాటకంగా రాశాడు. 39 ఏళ్ల కిందట ఇది సినిమా అయింది. ఒక ద్వీపంలో నౌక ఇరుక్కుని ఏళ్ల తరబడి ఏకాకిగా ఉండిపోయిన నావికుడు రాబిన్సన్ క్రూసో. అతని దగ్గర బంగారం, డబ్బు, తుపాకులు ఉన్నాయి. కాని లేనిది-సాంగత్యం. ఎట్టకేలకు ఓ నల్లనివాడు- ఆ ద్వీపానికి కొట్టుకువచ్చాడు ఒక డింగీలో. అతను శుక్రవారం దొరికాడు కనుక అతనికి ‘‘మాన్ ఫ్రైడే’’ అని నామకరణం చేశాడు క్రూ సో. గొప్ప నవల. గొప్ప నాటకం. గొప్ప సినిమా. అందులో ఫ్రైడే నావికుడిని అడుగుతాడు- ‘‘క్రీడ అంటే ఏమిటి?’’ అని. తలగోక్కుని ‘‘ఎదుటివాడి వినోదానికి ఒకరినొ కరు హింసించుకోవడం’’ అంటాడు క్రూసో. ఆ హింస పరాకాష్ట మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన అతి హృదయ విదారకమైన సంఘటన. ఇటీవల అక్కడ జరిగిన లీగ్ క్రికెట్ ఆటలో న్యూ సౌత్వేల్స్ బౌలర్ షాన్ అబోట్ వేసిన బంతి ఫిలిప్ హ్యూస్ అనే బ్యాట్స్మన్ చెవి వెనకభాగంలో తగి లి, మెదడుకు రక్తప్రసారాన్ని అందించే రక్తనాళం తెగి, రెండు రోజులు కోమాలో ఉండి మరణించాడు. అతనికి కేవలం 25 ఏళ్లు. ఆ విపత్తుకి క్రికెట్ ప్రపం చం యావత్తూ దిగ్భ్రాంతి చెందింది. తోటి ఆటగాళ్లు శోక సముద్రంలో మునిగిపోయారు. అందరూ మరో కుర్రాడిని మరిచిపోయారు. కేవలం ఆటలో భాగంగానే తాను విసిరిన బంతి కారణంగా ప్రాణా లు కోల్పోయిన సాటి ఆటగాడు - అబోట్ దుఃఖం తో కరిగి నీరయ్యాడు. ఆట స్వరూపం గత 10 సంవత్సరాల్లో బొత్తిగా మారిపోయింది. 1971-87 మధ్య 16 ఏళ్లు క్రికెట్ ఆడిన సునీల్ గావస్కర్ రోజుల్లో ఈ ఉక్కు శిరస్త్రా ణాలు లేవు. గావస్కర్ ఏనాడూ తలకి ఉక్కు టోపీ పెట్టుకుని ఆడలేదు. అయినా ఒక్కసారీ గాయపడ లేదు. ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు డాన్ బ్రాడ్మన్ ఇంగ్లండులో కసిగా జరిగిన డగ్లస్ జార్డిన్ ‘బాడీలైన్’ సిరీస్లో ఆడారు. అయినా గాయపడలేదు. ఫాస్ట్ బౌలర్ 150 కిలోమీటర్ల వేగంతో విసిరే బంతి 22 గజాలు- దాదాపు ఒక సెకను కంటే తక్కు వ వ్యవధిలో ప్రయాణం చేస్తుంది. ఈ వ్యవధిలో ఆటగాడు తను ఎదుర్కొనే బంతి ఆడే పద్ధతినీ, తన శరీరాన్ని తాకకుండా తప్పించుకునే ఒడుపునీ నిర్ణ యించుకోవాలి. బౌలర్ చేతి నుంచి బంతి విడుదల య్యాక దక్షిణాఫ్రికా ఆటగాడు బారీ రిచర్డ్స్ బ్యాట్కి తాకే సెకను కన్న తక్కువ వ్యవధిలో ఆ బంతిని కొట్ట డానికి కనీసం అయిదు వ్యూహాలను అతని మెదడు సిద్ధం చేస్తుందట! అదీ గొప్ప ఆటగాడి reflexes. ఓసారి బ్రిటిష్ ఆటగాడు జెఫ్ బోయ్కాట్ మరో గొప్ప బ్యాట్స్మన్ లెన్ హట్టన్ని అడిగాడట. రే విండ్వాల్ గానీ కీత్మిల్లర్ గానీ వేసే బంతిని ఎప్పుడైనా గాలిలో ‘హుక్’ చేశావా? అని. సమా ధానం- ‘‘ఓవల్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు చెయ్యాలని పించింది కాని, బంతి బయలుదేరిన క్షణంలో కంటి కొనలో ఆసుపత్రి దృశ్యం కనిపించి మానుకున్నాను’’ అన్నాడట. సచిన్ తేండూల్కర్ తన ఆత్మకథలో రాసిన ఒక సంఘటన అత్యంత ఆశ్చర్యకరం. ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తున్నప్పుడు ఒకసారి ఇండియా కోచ్ గారీ కిర్స్టన్ తేండూల్కర్కి బంతి వేస్తున్నాడట. ఆరు బంతులు ఆడాక తేండూల్కర్ అడిగాడట- ‘‘నేనేం చేశానో గమనించారా?’’ అని. లేదన్నాడు కిర్స్టన్. బంతి కిర్స్టన్ చేతి నుంచి విడుదలయ్యాక- అతని బంతి నెట్ మీద వేలేసి పట్టుకున్నాడా, ఎర్ర తోలువేపు పట్టుకున్నాడా అన్నది గుర్తించాక- బంతి వదిలిన క్షణంలో తేండూల్కర్ కళ్లు మూసుకుని బంతిని కొట్టాడట. ఆ తర్వాత బంతి ఎటు, ఎలా, ఎంత వేగంతో వస్తుందో అతని అనుభవం నేర్పిన నైపు ణ్యం. నిర్ఘాంతపోయాడట కిర్స్టన్. ఏతావాతా, ఫిలిప్ హ్యూస్ మరణం అత్యంత విషాదకరం. క్రీడల్లో ఇలాంటి దుర్మరణాలు పది సార్లు జరిగాయి. బాగా గుర్తున్న సంఘటనలు- 1998 ఢాకాలో క్రికెట్ ఆటగాడు రమణ్ లంబా- ఆనాటి ఆట కేవలం మూడు బంతుల్లో ముగియ బోతోంది కదా అని అలసత్వంతో ఉక్కు టోపీ లేకుం డా షార్ట్ లెగ్ దగ్గర నిలబడ్డాడు. బంతి కణతకి కొట్టు కుంది. మూడు రోజుల తరువాత కన్నుమూశాడు. 2008లో వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ అల్లుడు సయ్యద్ అబిద్ అలీ (34) బ్యాటింగ్ చేస్తూ అలసి పోయి తనకు రన్నర్ కావాలన్నాడు. ఆ వెంటనే మైదానంలో కుప్పకూలి 15 నిమిషాలలో గుండె పోటుతో మరణించాడు. ఆట నిరంతరం సాగేది. ఆపద అరుదుగా జరి గినా హృదయాన్ని పట్టుకుని పీడించేది. ఫిలిప్ హ్యూస్ ఆత్మ శాంతించాలని, క్రికెట్ ఆట హింసా రహితంగా సాగాలని ఆశిద్దాం.! - గొల్లపూడి మారుతీరావు -
సంస్కృతికి వారసులుగా పిల్లల్ని పెంచండి
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు రాజమండ్రి: పిల్లలను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా పెంచాలని ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు తల్లిదండ్రులకు సూచిం చారు. రాజమండ్రిలోని శ్రీ షిర్డీసాయి విద్యానికేతన్, డ్యాఫ్నీ ఏసియాటిక్ పాఠశాలల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్వీ ఫంక్షన్ హాలులో జరిగిన తల్లుల సదస్సులో ఆయన మాట్లాడారు. విదేశీ విద్యను బలవంతంగా అంటగడుతూ పిల్లలను సంస్కృతికి దూరం చేస్తున్నారని గొల్లపూడి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ విష్ణుప్రియ, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు దారపు నాగిరెడ్డి, స్కూలు కరస్పాండెంట్ తంబాబత్తుల శ్రీధర్, ప్రిన్సిపాల్ శ్రీవిద్య పాల్గొన్నారు. -
ఒంగిన ఆకాశం
జీవన కాలమ్: ఒక నాయకుడు- అందునా ముఖ్యమంత్రి ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, కేవలం ఓ పసిపిల్ల ఉత్సాహానికి ఊతం ఇవ్వడానికి తన కార్యక్రమాన్ని సడలించుకుని ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ దేశంలో చర్మం ముదిరిన నాయకులు చేయడం మనం వినలేదు. ఓ పదకొండేళ్ల అమ్మాయి మొన్న మహారాష్ట్రలో ముఖ్య మంత్రి పదవీ స్వీకారాన్ని చూసింది. ఆ సంఘటన ఆ అమ్మాయిని ఆకర్షించింది. ఎం దుకు? మహారాష్ట్ర చరిత్రలో జరగని విధంగా కేవలం ఉద్ధతి, నిజాయితీ, సేవాతత్పరత పెట్టు బడులుగా 44 ఏళ్ల వ్యక్తి - మొద టిసారిగా మహారాష్ట్ర చరిత్రలో, భారతీయ జనతా పార్టీ నాయకుడు పదవీ స్వీకారం చేయడాన్ని చూసింది. ఇవన్నీ నా మాటలు. బహుశా ఆ అమ్మాయికి ఇన్ని తెలియక పోవచ్చు. 27వ యేటే ఈ కుర్రాడు నాగపూర్ మేయరు కావడం కూడా ఆమెకి తెలియకపోవచ్చు. రాజకీయ రంగంలో పదవుల్లోకి రావడమే లక్ష్యంగా నాయకుల సాముగరిడీలు ఆ పిల్ల దృష్టికి వచ్చి ఉండవచ్చు. ఈ సంఘటన- ముఖ్యంగా ‘అనుభవం తప్ప పదవికి ఏ పెట్టు బడీలేని’ ఒక నాయకుడి చిరునవ్వు ఆమెను ఆకర్షించి ఉండవచ్చు. మళ్లీ ఇవన్నీ నా మాటలు. ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయాలని అనిపించిందా అమ్మాయికి. 44 ఏళ్ల వ్యక్తి మొదటిసారిగా ముఖ్యమంత్రి అవడం సాధ్యమ యితే, తాను ఇంటర్వ్యూ చేయగలగడం ఎందుకు సాధ్యం కాదు? అరమరికలు లేని స్వచ్ఛమైన మనస్సే ఇంత సూటిగా ఆలోచించగలదు. మొన్న ఆదివారం దృష్టి హర్చంద్రాయ్ అనే ఈ పిల్ల ముఖ్యమంత్రి ఇంటికి - సహ్యాద్రికి- వచ్చేసింది, తన పిన్నమ్మను వెంటబెట్టుకుని. వాచ్మన్లు లోనికి రానివ్వ లేదు. న్యాయంగా అక్కడితో కథ ముగియవచ్చు. కాని ఈ పిల్ల ముఖ్యమంత్రికి ఓ ఉత్త రం పంపింది- గేటు దగ్గర నుంచి. న్యాయంగా వాచ్ మెన్లు ఆ ఉత్తరాన్ని బుట్టదాఖలు చెయ్యవచ్చు. కాని వాళ్లు ముఖ్యమంత్రికి ఈ ఉత్తరాన్ని అందజేశారు. ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ ఉత్తరాన్ని చూశారు. ఆయన నాగపూర్ వెళ్లే హడావుడిలో ఉన్నారు. ఇంకా తన ప్రభు త్వానికి రాజకీయమైన గండం గడవలేదు. ఆయన ఆ కాగితాన్ని బుట్టలో పారే స్తే న్యాయంగా ఈ కథ ఇక్కడా ముగియవచ్చు. కానీ ఫడ్నవీస్ ప్రయాణాన్ని కాస్త నిలు పుకుని ఆ అమ్మాయిని లోపలికి పిలిపించారు. 20 నిమి షాలు ఇంటర్వ్యూ ఇచ్చారు. చివరి ప్రశ్న ముఖ్యమంత్రిది. ‘‘చదువయ్యాక జర్నలిస్టువి అవుతావా?’’ అన్నారు పద కొండేళ్ల వయసులోనే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ సాధిం చిన అమ్మాయిని. దృష్టి నవ్వి, ‘‘నేను డాక్టర్ని అవుతాను’’ అంది. ఒక నాయకుడు- అందునా ముఖ్యమంత్రి ఏ ప్రయో జనాన్ని ఆశించకుండా, కేవలం ఓ పసిపిల్ల ఉత్సాహానికి ఊతం ఇవ్వడానికి తన కార్యక్రమాన్ని సడలించుకుని ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ దేశంలో చర్మం ముదిరిన నాయ కులు చేయడం మనం వినలేదు. అందుకూ ఈ వార్త నేల బారు హృదయాన్ని తాకే గెశ్చర్ (సంకేతం). మరో సంఘటన. చాలాయేళ్ల కిందటిమాట. తిరువ నంతపురంలో తుంబా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఓ సైంటిస్ట్ పనిచేస్తున్నాడు. తెల్లవారి లేస్తే చీకటి పడే దాకా ప్రయోగశాలలో ఊపిరాడని పని. ఏ రాత్రికో ఇంటికి వచ్చే వాడు. ఒక రోజు భార్య చెప్పలేక చెప్పలేక భర్తకి చెప్పింది. ‘‘పిల్లలు ఎన్నాళ్లుగానో సినిమాకి తీసుకెళ్లమని అడుగుతు న్నారు’’ అని. సైంటిస్ట్ బాధపడిపోయాడు. మర్నాడు పిల్లల్ని సాయంకాలం సిద్ధంగా ఉంచమన్నాడు- సినిమాకి. ఆఫీసుకి వస్తూనే బాస్తో చెప్పాడు- పిల్లలు సిని మాకి వెళ్లాలంటున్నారు, ఆ సాయంకాలం కాస్త త్వరగా ఇంటికి వెళ్తానని. బాస్ తప్పనిసరిగా వెళ్లమన్నాడు. తీరా పనిలో పడి ఒక దశలో వాచీ చూసుకుంటే రాత్రి ఎనిమి దిన్నర అయింది. పిల్లలు జ్ఞాపకం వచ్చారు. బాధపడి పోయాడు. సిగ్గుపడుతూ భార్యకీ, పిల్లలకీ సంజాయిషీ చెప్పడానికి సిద్ధపడుతూ ఇంటికి వచ్చాడు. భార్య ఆనందంగా ఎదురొచ్చింది. పిల్లలు కనిపించలేదు. ‘‘పిల్ల లేరీ?’’ అనడిగాడు. ‘‘మీ బాస్అట. ఆయన వచ్చి పిల్లల్ని సినిమాకి తీసుకెళ్లారు’’ అంది భార్య. సైంటిస్ట్ బిత్తర పోయాడు. ఆ బాస్ పేరు అబ్దుల్ కలామ్. ఈ దేశంలో మొదటి అణ్వస్త్ర పరీక్ష జరిపించిన శాస్త్రవేత్త. ఈ దేశానికి రాష్ర్టపతి. అంతేకాదు- భారతరత్న. అన్నిటికన్నా గుర్తుంచుకోవల సిన మరో విషయం ఉంది. అతి సామాన్యమైన మత్స్య కారుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఔదార్యం, ఉదాత్తత ఏదైనా ఆకాశంలో ఉండదు. నేలని ఆకాశం ఎత్తుకి నిలుపుతుంది. హృదయంలో ‘చెమ్మ’ ఉన్న వ్యక్తి దృష్టి ఆకాశంలో ఉండదు. నేల మీద నిలబడే వ్యక్తిలో ఉంటుంది. అతను ఆకాశంలోంచి దిగడు. మన మధ్య నుంచే వస్తాడు. ఇవాళ టీ అమ్ముకునే మనిషి దేశంలో కల్లా పెద్ద కుర్చీ లో కూర్చోవడానికి, మొన్న దుబాయ్లో వె ల్డర్గా పని చేసిన ఒకాయన మంత్రి కావడానికి, 44 ఏళ్ల నాయకుడు పదకొండేళ్ల అమ్మాయి మనసును ఆకట్టుకోవడానికి మూలాధారాలు వెదికితే కనిపిస్తాయి. వాటిని ఓ పద కొండేళ్ల అమ్మాయి ఈ దేశంలో గుర్తుపట్టడం ఈ దేశానికి శుభసూచకం. - గొల్లపూడి మారుతీరావు (వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత, నటుడు) -
చట్టానికి చక్కని కళ్లు
నేరంపట్ల కర్కశంగా ఉన్నా, నేరస్తునిపట్ల ‘దయ’కూడా ‘న్యాయం’లో భాగమే. న్యాయంకంటే గొప్పది ఉదాత్తత. నిష్కర్ష కంటే గొప్పది దయ. అవినీతిని శిక్షించడమంటే నేరస్తుడిని దండించడమే కానక్కరలేదు. ఆ నేరానికి కారణమైన వ్యవస్థని నిలదీయడమూ శిక్షే. వ్యక్తి వ్యవస్థలో ఒక భాగం. వ్యక్తి పట్ల వ్యవస్థ నిర్దాక్షిణ్యం కూడా భయంకరమైన అవినీతే. సరిగ్గా 57 సంవత్సరాల కిందట ‘మాయాబజార్’ సినీమాలో పింగళి నాగేంద్రరావుగారు ఓ డైలాగ్ రాశారు. ‘‘శాస్త్రం ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానూ చెపుతుంది. మనం సౌమ్యంగా, సారాంశమే తీసుకోవా లె!’’ ఈ మాటని హాస్య పాత్ర వంగర చెప్పినా, అందులోని సత్యం మాత్రం తెగేసి చెప్పిందే. రెండు ఉదాహరణలు చూద్దాం. మద్రాసు హైకోర్టు ఆవరణలో ఇప్పటికీ ఓ విగ్రహం ఉంది. అది మనునీతి చోళన్ది. ‘మనునీతి’ చోళన్ ఇంటి పేరు కాదు. నీతికి నిలబడిన లేదా నీతిని నిలబెట్టిన రాజు కథ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే పాలకుడు రాజు. అంతేకాదు. తన రాజ్యంలో ఎవరి కయినా, ఎప్పుడయినా, ఏ కారణానికయినా తనని సంప్రదించి న్యాయ పరిష్కారాన్ని పొందవచ్చునని కోట ప్రాంగణంలో ఒక గంటని ఏర్పాటు చేయిం చాడు. ఎవరయినా న్యాయాన్ని కోరుకున్నవారు- లేదా అన్యాయానికి లోనయినవారు ఆ గంటని మోగించవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా ఏ ఒక్కరూ ఆ గంటని ఆశ్రయించలేదు. కారణం ఎవరికీ అన్యా యం జరగని పాలనని సాగిస్తున్నాడు రాజు. ఒకరోజు రాజు కొడుకు నగరంలో వాహ్యాళికి బయలుదేరాడు తన రథంలో. యువరాజుని చూసి ప్రజలు ఆనందంతో భేరీలు మోగించారు. జయ జయ ధ్వానాలు చేశారు. డప్పులు వాయించారు. ఆ చప్పుళ్లకి ఓ ఆవుదూడ బెదిరి, అటూ ఇటూ పరు గులు తీసి యువరాజు రథ చక్రాల కింద పడి చచ్చి పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన తల్లి ఆవు గొల్లు మంది. కోట ప్రాంగణానికి వచ్చి తనకి జరిగిన అన్యాయానికి పరిష్కారం చూపమంటూ ఆవు గం టని మోగించింది (అదీ హైకోర్టులో విగ్రహం). జరి గిన అన్యాయం రాజుకు తెలిసింది. చాలాసేపు గుం జాటన పడ్డాడు. చివరికి తీర్పు చెప్పాడు. ఆవుదూడ ఎలా చచ్చిపోయిందో తన కొడుకునీ అలాగే అతని మీద నుంచి రథాన్ని నడిపి చంపించాడు. ఆవు లోన యిన పుత్రశోకాన్ని తనూ పంచుకున్నాడు. ఇది శాస్త్రం నిష్కర్షగా, కర్కశంగా ప్రవర్తించిన కథ. ఇండోనేసియాలో ఒకాయనకి కర్రపెండలం తోటలున్నాయి. ఓ ముసలావిడ- రెండు కర్ర పెండ లం దుంపల్ని దొంగతనం చేసింది, యజమాని కేసు పెట్టాడు. కేసు విచారణకు ఓ మహిళా న్యాయమూర్తి దగ్గరకి వచ్చింది (ఆ న్యాయమూర్తి పేరు మార్జుకీ). ‘‘ఏమ్మా, దొంగతనం చేశావా?’’ అనడిగింది న్యాయమూర్తి. ముసలావిడ కంటతడి పెట్టుకుంటూ నేరాన్ని ఒప్పుకుంది. ‘‘ఎందుకు చేశావు?’’ ఆమె పేదరాలు. కొడుకు జబ్బుపడ్డాడు. మన వడు ఆకలితో ఏడుస్తున్నాడు. చూడలేక-రెండు దుంపలు తీసుకుంది. ‘‘ఆమె మీద దయతలచండి!’’ అన్నది న్యాయమూర్తి, ఫిర్యాదితో. యజమాని ఒప్పుకోలేదు. శిక్ష వెయ్యా ల్సిందేనని పట్టుబట్టాడు. న్యాయమూర్తి కాగితాలు చూసింది. నిస్సహాయంగా ముద్దాయితో అంది: ‘‘నువ్వు చేసింది నేరం. నేనేం చెయ్యలేను. నీకు శిక్ష వెయ్యాల్సిందే’’ అంటూ లక్ష రుపియాలు జరి మానా విధించింది. జరిమానా చెల్లించకపోతే రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష. ముసలావిడ ఏడ్చింది. తన దగ్గర డబ్బు లేదంది. న్యాయమూర్తి కోర్టులో అందరినీ ఉద్దేశించి అంది: ‘‘ఈ నగరంలో నివసిస్తున్న సాటి పౌరులుగా ఒక పసివాడు ఆకలితో అలమటిస్తూ ముసలి అవ్వ దొంగతనం చేయాల్సిన పరిస్థితి రావడానికి మనం దరి పాత్రా ఉంది. అందుకని ఈ కోర్టు హాలులో ఉన్న ప్రతీ వ్యక్తికి 50 వేల రుపియాల జరిమానా విధిస్తున్నాను’’అంటూ తన టోపీ తీసి, అందులో తన పర్సులోంచి 50 వేలు తీసి వేసి, కోర్టు రిజి స్ట్రార్ను డబ్బు వసూలు చేయమంది. కర్రపెండలం యజమాని కూడా 50 వేల రుపి యాలు చెల్లించాడు. మూడున్నర లక్షల రుపియాలు వసూలయినాయి. కోర్టుకి జరిమానా చెల్లించగా మిగతా సొమ్ముని ముసలావిడకిచ్చారు. ఇది వాస్త వంగా జరిగిన సంఘటన. పింగళివారు చెప్పిన-శాస్త్రాన్ని సౌమ్యంగా, సా రాంశాన్ని గ్రహించిన అద్భుతమైన సందర్భమిది. నేరం పట్ల కర్కశంగా ఉన్నా, నేరస్తుని పట్ల ‘దయ’ కూడా ‘న్యాయం’లో భాగమే. న్యాయం కంటే గొప్పది ఉదాత్తత. నిష్కర్ష కంటే గొప్పది దయ. అవినీతిని శిక్షించడమంటే నేరస్తుడిని దండిం చడమే కానక్కరలేదు. ఆ నేరానికి కారణమైన వ్యవస్థని నిలదీయడమూ శిక్షే. వ్యక్తి వ్యవస్థలో ఒక భాగం. వ్యక్తి పట్ల వ్యవస్థ నిర్దాక్షిణ్యం కూడా భయం కరమైన అవినీతే. (వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత, నటుడు) గొల్లపూడి మారుతీరావు -
మరో గాంధీగిరి
జీవన కాలమ్ కొన్ని రూపాయల లాభం కోసం విలువల్ని తాకట్టు పెట్టిన కథల్ని - మొన్న హుద్హుద్ తుపానులో నేను చూశాను. తుపాను మర్నాడు నిస్సహాయంగా లేచిన వినిమయదారులకు పెట్రోలు లీటరు 200కి అమ్మి కొందరు సొమ్ము చేసుకున్నారు. లారీ నుంచి పంచుతూండగా అట్టపెట్టెలతో పాలపాకెట్లను దోచుకున్న వారిని స్వయంగా చూశాను. కన్యాశుల్కంలో అగ్నిహో త్రావధాన్లు భార్య వెంక మ్మ సెలవులకి తన కొడు కుతో వచ్చిన గిరీశాన్ని ‘‘మీరిద్దరూ ఇంగ్లీషులో మాట్లాడుకోండిబాబూ!’’ అని అడుగుతుంది. వారి మాటల్లో ఓ ఆంగ్ల కవిత - రెండు లైన్లు, దొర్లాయి: A boy stood on the burning deck whence all but he had fled ఈ కవిత వయస్సు 188 సంవత్సరాలు. బ్రిటిష్ కవయిత్రి ఫెరీసియా డరోతియా హేమర్స్ రాశారు. ఇది కాస్బియాంకా అనే కుర్రాడి కథ. ఈ రెండు శతాబ్దాల్లో ఈ కవితని చదవని ఇంగ్లీషు కుర్రాడు లేడు. 1798లో నైలు యుద్ధంలో వాస్తవం గా జరిగిన సంఘటన ఈ కవితకి మూలం. యుద్ధంలో వాళ్ల నాన్న ఓ షిప్పుకి కమాండర్గా ఉన్నాడు. యుద్ధం జరుగుతోంది. ఈ కుర్రాడిని తండ్రి తను వచ్చేదాకా షిప్పుపై డెక్ మీద నిలబడ మని చెప్పి వెళ్లాడు. షిప్పుకి నిప్పంటుకుంది. ముని గిపోతోంది. మంటలు లేచాయి. తండ్రి చచ్చిపో యాడు. సిబ్బంది అంతా నీటిలోకి దూకేశారు. కాని పదేళ్ల కుర్రాడు తండ్రి చెప్పిన మాటకు కట్టుబడి డెక్కు మీదే నిలబడ్డాడు. మంటల్లో కాలిపోయాడు. ఈ కవిత ఇన్ని శతాబ్దాలు పిల్లలకి పాఠ్య గ్రంథం ఎందుకయింది? ఒక విలువ కోసం పదేళ్ల కుర్రాడు తన ప్రాణాన్నే వదులుకున్నాడు కనుక. చావు భయంకరమైన మూల్యం. కాని ఒక విలువకి పట్టాభిషేకం. అందుకే ఒక జాతికి 188 సంవ త్సరాలు తలమానికంగా నిలిచింది, ‘కాస్బియాంకా ఆన్ ది బర్నింగ్ డెక్’. దురదృష్టం ఏమిటంటే- కొన్ని రూపాయల లాభం కోసం విలువల్ని తాకట్టు పెట్టిన కథల్ని - మొన్న హుద్హుద్ తుపానులో నేను చూశాను. తుపాను మర్నాడు నిస్సహాయంగా లేచిన వినిమ యదారులకు పెట్రోలు లీటరు 200కి అమ్మి కొం దరు సొమ్ము చేసుకున్నారు. ఉచితంగా పాల పాకె ట్లను జోడుగుళ్లపాలెంలో లారీ నుంచి పంచుతూం డగా అట్టపెట్టెలతో పాలపాకెట్లను దోచుకున్న వారిని స్వయంగా చూశాను. నేను రాసిన ఈ అవినీతిని చదివిన ఓ మిత్రు డు నాగేంద్రరావు టోక్యో నుంచి నాకో ఈమెయిల్ పంపారు. విషయం ఇది: తుపాన్ పరిస్థితులు చక్కబడ్డాక వినిమయదారులందరూ కలసి 200కి లీటరు పెట్రోలు అమ్మిన వ్యాపారిని ఎందుకు నిలదీ యరు? ‘‘ఇతను నేరస్థుడు. మన అవసరాలతో వ్యాపారం చేసి మనల్ని దోచుకున్నాడు’’ అని ఆ పెట్రోలు బంకు ముందు ఓ పోస్టరు పెట్టండి. అతని దగ్గర సరుకు కొనకండి. ‘‘నువ్వు దొంగ’’ అని వేలెత్తి చూపండి. అందరికి తెలిసేలాగ చేయండి. ఏనాడయినా కొన్ని వేలమంది వినియోగదారుల శక్తి ముందు పదిమంది వ్యాపారుల అవినీతి వీగి పోతుంది. వ్యాపారి తలవొంచకమానడు. ఇదే 150 సంవత్సరాల కిందట ఒకాయన చేసి చూపించాడు. ఆయన పేరు గాంధీ. బ్రిటిష్ ప్రభు త్వాన్ని భారత ప్రజలు గద్దెదించారు. అది చరిత్ర. కాని ఎవరు పూనుకుంటారు? మధ్య తరగతి మనిషి అవినీతితో ప్రతిరోజూ రాజీ పడుతున్నాడు. శక్తి లేక కాదు. గతి లేక. వ్యవధి లేక. ఓపిక లేక. ‘నాకెందుకులే!’ అని నెగిటివ్ ఆలోచనతో. అవినీ తికి తలవొంచే మనిషే వ్యాపారికి అవకాశం. వ్యక్తి గతమయిన ప్రయోజనం బలహీనత. వ్యవస్థా గతమైన ప్రయోజనం ఉద్యమం. ‘వ్యక్తికి బహు వచనం శక్తి’ అన్నాడు శ్రీశ్రీ. పెట్రోలు ఖరీదు చేసిన వ్యక్తి బలహీనుడు కావచ్చు. కాని నలుగురూ కలిస్తే ఉద్యమం అవుతుంది. వ్యాపారికి హెచ్చరిక అవు తుంది. మా మిత్రుడు చెప్పింది - దేశ స్వాతంత్య్ర ఉద్యమం కాదు. మీ పేటలో, మీ వాడలో- మీ అవసరాన్ని అవకాశం చేసుకున్న వ్యాపారి పట్ల నిరసన. ఒక్కసారి- ఒక్కరు- ఒక్కచోట చేస్తే ఇది కార్చిచ్చు అవుతుంది. దేశంలో దావానలంలాగా వ్యాపిస్తుంది. ఈ ప్రయత్నానికి వ్యక్తిగతమయిన నిజాయితీ పెట్టుబడి. వ్యక్తి కోపాన్ని సామూహికంగా ప్రదర్శిం చడం ఆయుధం. ఆ సామూహిక శక్తి అణ్వస్త్రం. దీన్ని ఆచరణలో సాధించిన ఓ పదేళ్ల కుర్రాడి పేరు కాస్బియాంకా. ఓ పెద్ద ప్రజాస్వామ్యం పేరు- భార తదేశం. ఈ 67 సంవత్సరాలలో మనకేమయింది? వ్యవస్థని తాకట్టు పెట్టే పాల పాకెట్ అయింది మన జీవితం. ఎవరికి దక్కింది వారు దోచుకునే కుక్కలు చింపిన విస్తరి అయింది మన దేశం. అన్యాయంగా నీకు దొరికిన - లేదా దక్కించుకున్న పాల పాకెట్ ఏనాడయినా నీ అవసరానికి, నీ ప్రయోజనానికి బాసటగా నిలిచే, నిలవగల వ్యవస్థ ఔదార్యాన్ని ఫణంగా పెడుతోంది. ఇది నేలబారు మనిషికి తెలి యాలి. అతని రక్తంలోకి ఎక్కాలి. ఆ పని ఓ చిన్న దేశం - జపాన్ - చేసి అణ్వస్త్ర దాడితో విశీర్ణమైన దేశాన్ని పునర్నిర్మించుకుని ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇది వ్యక్తి శీలాన్ని మలిచిన ఒక వ్యవస్థకి కిరీటం. (వ్యాసకర్త, సుప్రసిద్ధ రచయిత, నటుడు) గొల్లపూడి మారుతీరావు -
ఒకే ఒక్క భారతీయ విదుషీమణి
- గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత, నటుడు నేను నా జీవితంలో ప్రత్యక్షంగా చూసిన మొదటి సినీ నటి - భానుమతి గారు. అది సరిగ్గా ఇప్పటికి 62 ఏళ్ళ క్రితం సంగతి. నాకు అప్పుడు పన్నెండేళ్ళు. విశాఖపట్నంలోని చిన్నం వారి వీధిలో ‘పూర్ణా పిక్చర్స్’ అధిపతి గ్రంథి మంగరాజు గారి ఇంటికి ఆమె వచ్చారు. మంగరాజు గారు ప్రసిద్ధ సినీ పంపిణీదారులు. విశాఖపట్నంలోని ‘పూర్ణా టాకీస్’ కట్టింది ఆయనే. అప్పుడే భానుమతి గారి ‘ప్రేమ’ (1952) చిత్రం విడుదలైంది. కారు దిగి, ఇంట్లోకి వెళుతున్న ఆమెను చూస్తే, ఒక మెరుపు తీగలా కనిపించింది. ఆ తరువాత నా జీవితంలో చాలామంది సినీ తారల్ని చూశాను. ఆ పైన నేనూ వాళ్ళలో ఒకణ్ణయ్యాను కానీ, అంత అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటీమణిని నేనెన్నడూ చూడలేదు. ముగ్ధుల్ని చేసే...ఆ ‘మల్లీశ్వరి’ దృశ్యం: భానుమతి గారి సినిమాలంటే, నాకు ఇప్పటికీ ఠక్కున గుర్తొచ్చేది - ‘మల్లీశ్వరి’ (1951). ఆ సినిమా నాటికి ఆవిడ ఓ 8 - 9 చిత్రాలు చేసి ఉంటారేమో! అందులో నాగరాజు పాత్ర పోషించిన (ఎన్టీ) రామారావు గారికి అది తొలి ఆరేడు చిత్రాల్లో ఒకటనుకుంటా! అప్పటికి రామారావు గారు తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ను ఇంకా పట్టుకోని రోజులవి. ఆ సినిమా చూస్తుంటే, ఆవిడ బాడీ లాంగ్వేజ్కు ఏ మాత్రం దగ్గరగా రామారావు గారు కనిపించరు. అయితేనేం, అటు మల్లీశ్వరిగా భానుమతి గారు, ఇటు నాగరాజుగా రామారావు గారి జంట ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. నా జీవితంలో నేను ముగ్ధుణ్ణయిన ఒక్క షాట్ను చెప్పమంటే - ‘మల్లీశ్వరి’లోని ఒక ఘట్టం చెబుతాను. తిరునాళ్ళకు వెళ్ళి, నాగరాజు, మల్లీశ్వరి తిరిగి వస్తూ, వర్షం వల్ల ఒక మందిరంలో తలదాచుకున్నప్పుడు, రాయల వారు - తిమ్మరుసు మారువేషాల్లో చూస్తారు. మల్లికి రాణివాసం పల్లకీ పంపమని వాళ్ళతో నాగరాజు అంటాడు. అలా చెప్పినప్పుడు, అతణ్ణి వెక్కిరిస్తూ మల్లి ‘పంపించండి సామీ! రాణివాస ప్పల్లకీ!’ అని గమ్మత్తై కంఠంతో, హావభావాలతో చెబుతుంది. ఈ ఒక్క షాట్ కోసం - ‘మల్లీశ్వరి’ని చూడండి. ఇప్పటికే ‘మల్లీశ్వరి’ని చూసేసిన వాళ్ళు కూడా ఈ షాట్ కోసం మళ్ళీ ‘మల్లీశ్వరి’ని చూస్తే, నా అంత ముగ్ధులవుతారని ఆ సినిమా విడుదలైన ఇన్నేళ్ళ తరువాత ఈ 2014లో కూడా నేను ఢంకా బజాయించి చెప్పగలను. అదీ భానుమతి గారి ప్రతిభ. నటుడిగా నేను ఆమెకు లొంగిన క్షణం: అయితే, ఈ ఇమేజ్కు ఒక నెగటివ్ పార్శ్వం కూడా ఉంది. ఆవిడ ఎంత ఇండివిడ్యువలిస్టిక్ ఆర్టిస్ట్ అంటే, ఒక్క ‘మల్లీశ్వరి’ తప్ప, లేదా ‘మల్లీశ్వరి’కి ముందు వచ్చిన ఏ ‘స్వర్గసీమ’ (1945) లాంటి పిక్చర్లోనో తప్ప, మిగతా అన్ని సినిమాల్లోనూ, అన్ని పాత్రల్లోనూ ఒక్క భానుమతే కనిపిస్తుంది. భానుమతి అనే ఒక వ్యక్తిత్వం ఆమె చేసిన ఏ పాత్రకూ ఒదగలేదు. అందుకే, ఆవిడ భౌతికంగా వెళ్ళిపోయినప్పుడు నేను ‘కీ.శే. మల్లీశ్వరి అస్తమయం’ అని రాశాను. ఆవిడ ఏ పాత్రనూ, ఎదుట నటించే ఏ నటుడినీ తన కన్నా ఒక అడుగు ఎక్కువ ఎత్తున నిలబడనివ్వలేదు. దానికి ఉదాహరణ నా అనుభవమే. పన్నెండేళ్ళప్పుడు చూసినందుకే తన్మయుడినైన నేను, అలాంటి భానుమతి గారితో కలసి నటించే అవకాశం ఒకే ఒక్కసారి వచ్చింది - ‘మంగమ్మ గారి మనవడు’ (1984)లో! నేను స్వతహాగా రచయితను గనక, ఆమె డైలాగ్కు కౌంటర్గా నేను నా డైలాగ్ను మలుచుకొని చెప్పబోయాను. అంతే! ఆమె నవ్వుతూనే, ‘గొల్లపూడి గారూ! మీరు ఆ మాట అంటే, నేను మరో మాట అంటాను’ అని సున్నితంగా అన్నారు. నేను అభిమానించే నా సీనియర్ గనక, నా పాత్ర ద్వారా ఆమెకు లొంగిపోయాను. రచయితగా ఆమె చిత్రాలకు వేటికీ పని చేసే అవకాశం నాకు కలగలేదు. కానీ, వ్యక్తిగతంగా నేనంటే ఆమెకు ఎంతో గౌరవం ఉండేది. ఒకసారి మద్రాసులో శాస్త్రి హాలులో ఏదో సభ జరుగుతోంది. అందులో ఆమె ప్రసంగిస్తున్నారు. ఆమె మాట్లాడుతుండగా, నేను హాలులోకి వెళ్ళాను. భానుమతి గారు తన ప్రసంగం ముగిస్తూ, ‘నా తరువాత గొల్లపూడి మారుతీరావు గారు మాట్లాడతారు... నా కన్నా చాలా గొప్పగా’ అంటూ మైకు వదిలి వచ్చి, కూర్చున్నారు. అంత గౌరవం, అభిమానం, మాటలో చమక్కు చూపేవారు ఆవిడ. స్వాభిమానం మాటున మంచుముద్ద: ఒక వ్యక్తిగా చెప్పాలంటే, భానుమతి గారు ఎప్పుడూ తన ఒంటి మీద ‘స్వాభిమానం’ అనే అంగీని తొడుక్కొని ఉండేవారు. అది దాటి చూడగలిగితే, ఆమె ఆర్ద్రతతో, మంచు ముద్ద కాగలిగిన మంచి తల్లి. ఇది నాకు వారి అబ్బాయి డాక్టర్ భరణి కళ్ళ నిండా నీళ్ళతో స్వయంగా చెప్పిన విషయం. భానుమతి గారి లాంటి పెద్దావిడ ఒక వ్యక్తి సామర్థ్యానికి వాత్సల్యంతో లొంగిపోయిన సందర్భం నాకు తెలిసి - ఒకే ఒక్కటి! ఒకే ఒక్కరి విషయంలో! అది మా వాసు (చిన్నవయసులోనే కన్నుమూసిన యువ దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్). ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రానికి మా వాసు అసిస్టెంట్ డెరైక్టర్గా పనిచేశాడు. ఆ కుర్రాడంటే విపరీతమైన అభిమానం ఆవిడకి! వాడి ఉత్సాహం, చురుకుదనం, ప్రతిభ చూసి ఆమె ఎంత ముచ్చటపడేవారో! ఆశ్చర్యం ఏమిటంటే, ఆవిడ మా ఇంటికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ, వాణ్ణి తన దగ్గరకు పిలిపించుకొనేవారు. వాసు ఆకస్మిక మరణం తరువాత ‘గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశాక, ఒక ఏడాది అవార్డు కార్యక్రమానికి భానుమతి గారిని పిలవడానికి వెళ్ళాను. అప్పటికే, ఆమె వార్ధక్యంలో ఉన్నారు. వయసు మీద పడ్డ సింహపు రాణిలా ఉన్నారు. ‘ఆ కుర్రాడంటే నాకు చాలా ఇష్టం. కానీ, నేను అంతసేపు కూర్చోలేను మారుతీరావు గారూ!’ అన్నారు. చిన్నప్పుడు నా కళ్ళ ముందు మెరిసిన మెరుపుతీగను అలా చూసేసరికి కళ్ళు చెమర్చగా, వెనక్కి తిరిగి వచ్చేశాను. సంప్రదాయాలు విడవని సినీ నటి: చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అంత గొప్ప సినీ నటి అయినప్పటికీ, భానుమతి గారు సంప్రదాయానికి ఎప్పుడూ విడాకులు ఇవ్వలేదు. ఆవిడ పూజ గదిలో కుంకుమబొట్లు పెట్టిన వాళ్ళ అమ్మా నాన్న గార్ల ఫోటో నేను చూశాను. ఆమె భర్త - సినీ దర్శకుడు పి. రామకృష్ణారావు గారి ఫోటో నేను చూశాను. అంత పెద్ద నటి, తాను సినిమాల్లో నటించే రోజుల్లో కూడా శ్రావణ శుక్రవారాలకు కాళ్ళకూ, ముఖానికీ పసుపు రాసుకొనేవారని నిర్మాత బి. నాగిరెడ్డి గారి పెద్ద కూతురు నాతో స్వయంగా చెప్పారు. సినీ రంగానికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారికి ఆమె ఒక మాట ఇచ్చిందట - ప్రతి సినిమాలోనూ తప్పనిసరిగా ఒక త్యాగరాయ కీర్తన పాడతానని! కర్ణాటక సంగీతం పట్ల, త్యాగరాజ స్వామి పట్ల, తన సంగీతం మీద ఎన్నో ఆశలు పెట్టుకొన్న తండ్రి గారి పట్ల ఆమెకున్న భక్తిప్రపత్తులకు ఇది నిదర్శనం. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో భానుమతిది ఓ చరిత్ర. నటన, రచన, సంగీతం, గానం, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, స్టూడియో నిర్వహణ - అలా ఏకంగా 9 అంశాల్లో తనదైన ప్రతిభతో జాతీయ స్థాయిలో బహుమతులందుకొన్న ఒకే ఒక్క భారతీయ విదుషీమణి - పాలువాయి భానుమతి!